SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

It’s Inspiring To Work With Ram: Bhagyashri Borse

Ram Pothineni starrer unique entertainer Andhra King Taluka made grand impression with its teaser, trailer and songs. Bhagyashri Borse who played the role of Ram’s love interest as Mahalaxmi also won appreciation for her looks and performance. Bhagyashri appears as a college-going girl who is deeply in love with Ram’s character. “The love story is […] The post It’s Inspiring To Work With Ram: Bhagyashri Borse appeared first on Telugu360 .

తెలుగు 360 21 Nov 2025 11:30 am

Telangana |రెండు కార్లు ఢీకొని…

Telangana | రెండు కార్లు ఢీకొని… ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

ప్రభ న్యూస్ 21 Nov 2025 11:25 am

GOLD|‘గోల్డు’ గోల్ మాల్‌..!

GOLD| ‘గోల్డు’ గోల్ మాల్‌..! GOLD| తణుకు, ఆంధ్రప్రభ : పేద, మధ్య

ప్రభ న్యూస్ 21 Nov 2025 11:24 am

వరం శాపంగా మారడంతో...ఇప్పటికి పారిపోతున్నాను: ధనుష్

హైదరాబాద్: కోలీవుడ్‌లో అగ్రహీరోల సినిమాలు తెలుగులో విడుదల చేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో సూర్య, విజయ్, దనుష్, రజనీకాంత్ సినిమాలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతున్నాయి. తమిళంలో విడుదల చేసిన ప్రతి సినిమాను టాలీవుడ్‌లో సదరు హీరోల సినిమాలను రిలీజ్ చేస్తూ బాక్సాపీసు వద్ద వసూళ్లు రాబడుతున్నారు. వెంక్లీ అట్లూరి దర్వకత్వంలో ధనుష్ నటించిన ‘సార్’ అనే మూవీ హిట్ కావడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో వంద కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టడంతో దర్శక, నిర్మాతలు సంతోషంతో మురిసిపోతున్నారు. ధనుష్ పాడిన పాట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో 'వై దీస్ కొలవరి డీ' పాటపై ధనుష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తమిళనాడు నుంచి వచ్చానని, తమిళ భాష అనేది పురాతన లాంగ్వేజ్ అని, ఆ పాట తమిళంలో లేదని, తంగ్లీష్‌లో ఉందని తెలియజేశారు. ఆ పాట నుంచి ఇప్పటివరకు పారిపోతూనే ఉన్నానని ధనుష్ జవాబిచ్చాడు. తాను ఇప్పటికీ ఓడిపోతున్నానని, వైరల్ మార్కెట్‌కు నిర్వచనంలా మారిందని ప్రశంసించారు. ఒక రోజు పాటను పాడి పక్కన పెట్టేశామని, కొన్ని రోజుల తరువాత వింటే మాకు చాలా జోక్‌గా అనిపించిందని, జోక్స్ ఎల్లప్పుడూ పని చేస్తాయని మ్యూజిక్ డైరెక్టర్ చెప్పడంతో ఒకసారి చూద్దామని చెప్పానన్నారు. ఆ పాటను విడుదల చేసిన కొన్ని రోజులలో యూట్యూబ్‌లో రికార్డులో స్థాయిలో వ్యూస్ వచ్చాయన్నారు. తనకు చాలా గర్వంగా ఉందని, వరం వలే ఇది మాకు శాపంగా మారిందన్నారు. ప్రస్తుతం ధనుష్ డి-54, డి-55 వంటి భారీ ప్రాజెక్టులలో పని చేస్తున్నారు. 

మన తెలంగాణ 21 Nov 2025 11:19 am

AP |ప్రజల కోసం..

AP | ప్రజల కోసం.. AP, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ నియోజకవర్గంలోని

ప్రభ న్యూస్ 21 Nov 2025 11:18 am

Andhra Pradesh : సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లోని సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడాలనుకుంటున్న యువతకు గుడ్ న్యూస్

తెలుగు పోస్ట్ 21 Nov 2025 11:18 am

ఫ్యాక్ట్ చెక్: బిరియానీ తయారీలో మురుగు నీటిని వాడుతున్నారంటూ వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు

భారతీయులు ఎక్కువగా తినే వంటకాల్లో బిరియానీ ఒకటి. అయితే ఈ బిరియానీలు తయారు చేసే విధానాలు, తయారు చేసే వ్యక్తులకు

తెలుగు పోస్ట్ 21 Nov 2025 11:02 am

నిశ్శబ్దంగా రాలిపోతున్నారు

మన భారతదేశానికి ఊహించని ప్రమాద ఘంటికలు మున్ముందు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఏ దేశానికైనా ప్రధాన ఆర్థిక వనరు మానవ వనరు. అందులోనూ యువతే దేశానికి ప్రధాన ఆర్థిక వనరు. దేశంలో యువత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంతవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ కారణం చేతనే తన దేశంలో యువత సంఖ్యను గణనీయంగా పెంచేందుకు చైనా అధిక సంతానం దేశంగా అక్కడి ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఇలా ప్రతి దేశం యువత సంఖ్య పెంచేందుకు నానాపాట్లు పడుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా మన దేశంలోని వాతావరణం కనిపిస్తోంది. దేశానికి నేడు యువత సంఖ్య బలంగా ఉంది. ఇది సంతోషించదగ్గ పరిణామమైతే ఈ వనరు ఆ కారణంగా చేజారుతోందన్న ఆందోళనకరమైన పరిస్థితి మరోవైపు కనిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. భారత యువతలో ఆత్మహత్యలు పెరుగుదల. భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతున్న ఈ తరుణంలో, ఆ విజయాల వెను దాగిఉన్న ఒక చీకటి సత్యాన్ని మనం తప్పక గుర్తించాలి. అదే భారత యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల సంఖ్య. సాంకేతిక ప్రగతి, ఆర్థికాభివృద్ధి గురించి మనం ప్రతిరోజూ మాట్లాడుతున్నా మన యువతరం ఎదుర్కొంటున్న భావోద్వేగ పోరాటాల గురించి మాట్లాడటానికి మాత్రం చాలా అరుదుగా సిద్ధమవుతున్నాం. ఈ నిశ్శబ్దం ఇప్పుడు ప్రాణాలను బలిగొంటోంది. భారత ప్రజా ఆరోగ్య ఫౌండేషన్ (పిహెచ్‌ఎఫ్‌ఐ) తాజా నివేదిక అందించిన గణాంకాలు మనల్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. 15 39 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయుల్లో ఆత్మహత్యలు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారుతోంది. ఇది కేవలం ఒక గణాంకం కాదు. ఇది మన సామాజిక వ్యవస్థలోని లోపాలను, కౌన్సిలింగ్ సేవల్లోని అంతరాలను, మానసిక ఆరోగ్యానికి మనం ఇస్తున్న ప్రాధాన్యత లేమిని ఎత్తిచూపుతోంది. మన యువతరం అనేక వైపులనుండి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలు, కొద్దిపాటి ఉద్యోగాలకోసం తీవ్రమైన పోటీ. ఇవన్నీ యువతపై అపారమైన మానసిక భారాన్ని మోపుతున్నాయి. వైఫల్యంపై ఉన్న సామాజిక తీర్పు, భయం వారిని మరింత కృంగదీస్తోంది. తమ పిల్లలు డాక్టర్లు లేదా ఇంజినీర్లు కావాలన్న తల్లిదండ్రుల అంచనాలు, వాటిని చేరుకోలేకపోతున్నామన్న భావన యువతలో ఆందోళనను పెంచుతోంది. సోషల్ మీడియాలో ఇతరుల ‘పరిపూర్ణమైన’ జీవితాలు, విజయాలు చూసి, తమ జీవితాలు అంత గొప్పగా లేవని భావించడం, నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వంటివి యువతలో తీవ్ర నిరాశ, ఒంటరితనాన్ని పెంచిపోషిస్తున్నాయి. దురదృష్టవశాత్తు సమాజంలో మానసిక సమస్యలు అంటే ‘బలహీనత’ అనే అపోహ ఉంది. ‘మనసు బాగోలేదని’ చెబితే సమాజం చిన్నచూపు చూస్తుందనే భయంతో చాలామంది యువకులు సహాయం అడగడానికి సంకోచిస్తున్నారు. ఈ ఆలస్యమే ప్రాణాలను తీస్తోంది. కేవలం అవగాహన ప్రచారాలు సరిపోవు. మనకు ఇప్పుడు అత్యవసరం వ్యవస్థాత్మక మార్పులు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అకడమిక్ విజయాలకే కాకుండా, భావోద్వేగ ఎదుగుదలకు, ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పడానికి ప్రత్యేకమైన తరగతులు, సెమినార్లు నిర్వహించాలి. ప్రతి విద్యా సంస్థలో అనుభవజ్ఞులైన, సులభంగా అందుబాటులో ఉండే కౌన్సిలర్‌లు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి వుంది. ఉద్యోగ స్థలాల్లో మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెరుగైన పని వాతావరణాన్ని సృష్టించాలి. ఉద్యోగులకు గోప్యతతో కూడిన కౌన్సిలింగ్ సేవలు అందించాలి. ఉద్యోగులు విరామం తీసుకోవడానికి, వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడానికి ప్రోత్సహించాలి. కౌన్సిలింగ్, థెరపీ వంటి సేవలు శారీరక చికిత్సల మాదిరిగానే సాధారణంగా, ఆర్థికంగా అందుబాటులో ఉండాలి. గ్రామీణ ప్రాంతాలకు కూడా మానసిక ఆరోగ్య నిపుణుల సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వారి భారాన్ని పంచుకోవాలి, వారికి అవసరమైన మద్దతును అందించాలి. మానసిక ఆరోగ్యం ఐచ్ఛికం కాదు, అత్యవసరం. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మనం అందరం ఒక్కటిగా నిలవాలి. - సయ్యద్ నిసార్ అహ్మద్ - 7801019343

మన తెలంగాణ 21 Nov 2025 10:56 am

Notices Issued to Annapurna and Ramanaidu Studios

Annapurna Studios and Ramanaidu Studios are the most renowned, oldest film studios serving Telugu cinema since the past few decades. After Telugu cinema shifted from Chennai to Hyderabad, Annapurna and Ramanaidu Studios were established and they have hosted thousands of film shoots for decades. They are also run by Akkineni and Daggubati families respectively. The […] The post Notices Issued to Annapurna and Ramanaidu Studios appeared first on Telugu360 .

తెలుగు 360 21 Nov 2025 10:55 am

ഫാക്ട് ചെക്ക്: അതിദരിദ്ര മുക്ത കേരളത്തിൻ്റെ നേർചിത്രം? പ്രചരിക്കുന്ന ഫോട്ടോ 2020ലേത്

അതിദാരിദ്ര മുക്ത സംസ്ഥാനമായി പ്രഖ്യാപിച്ച പശ്ചാത്തലത്തിലാണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 21 Nov 2025 10:48 am

గ్రంథాలు జ్ఞాన సుగంధాలు

ఒక్క అడుగు ఎన్నో అడుగులకు ప్రేరణ ఇచ్చి గమ్యానికి చేరుస్తుంది. ఒక్క అక్షరం జ్ఞాన సౌధానికి పునాది వేసి, ప్రపంచాన్ని మారుస్తుంది. మేధస్సుకు పదును పెట్టి, మనసును స్పృశింప చేస్తే అక్షరం ఆయుధమవుతుంది. అక్షరంతో మొదలైన ప్రయత్నం పుస్తకంగా పరివర్తన చెందుతుంది. గొంతు నుండి ధ్వనించే ప్రతీ పదం మదిని స్పృశించి, మస్థకాన్ని కదిలించే, అక్షరాల అమ్ముల పొదినుండి జారిపడిన పదునైన శరం పుస్తకం. అక్షరం భగభగ మండే అగ్నిగోళం. నిన్న మరచిన నేటికి విలువ లేదు. నేడు లేనిదే రేపన్నది అబద్ధం. కోయిల కమ్మని పాటను మరచి బిత్తర చూపులు చూస్తుంటే, పక్షులు కిలకిల రావాలను మరచి మౌనముద్రలో దాగుంటే, గలగల పారే సెలయేరు ప్రహహించనని భీష్మించుకు కూర్చుంటే తారలు తేజస్సును విడిచి, ఆకసంలో మబ్బుల చాటున దాగుంటే, అక్షరం నిదురబోతే చైతన్యం సమాధికే అంకితమవుతుంది. అక్షరం గర్జించాలి. పుస్తకంగా మారాలి. అవనిపై అన్యాయాన్ని ప్రశ్నించాలి. విద్య అజ్ఞానంపై సంధించిన వజ్రాయుధమైతే, అజ్ఞాన గాఢాంధకారాన్ని తొలగించే అక్షర హారం పుస్తకం. అక్షరజ్ఞానం, పుస్తక జ్ఞానం లేని మానవ జన్మ నిరర్థకం. దైవం కొలువున్న ప్రదేశం దేవాలయమైతే, జ్ఞాన జ్యోతిని వెలిగించే గ్రంథాలకు ఇలలో నెలవైన నిజమైన దేవాలయం. దేశ స్వాతంత్య్రోద్యమంలోను, సాంఘిక దురాచారాల నుండి మేల్కొలపడం లోను, తెలంగాణలో ఒకప్పటి నిజాం నిరంకుశ పాలన వలన నెలకొన్న అస్థవ్యస్థ పరిస్థితులనుండి కాపాడి, ప్రజలను జాగృత పరచడంలోను గ్రంథాలయోద్యమం పాత్ర అనిర్వచనీయం. ఎంతో మంది అభ్యుదయవాదులు, సంఘసంస్కర్తలు గ్రంథాలయోద్యమంలో పాల్గొని గ్రంథాలయాల స్థాపనకు విశేష కృషి చేసారు. అయ్యంకి వెంకట రమణయ్య తెలుగు వారికి సుపరిచితం. గ్రంథాలయాల ద్వారా ప్రజల్లో సామాజిక స్పృహ కలిగించాలనే ఉద్దేశంతో అవిశ్రాంత కృషి చేసి, గ్రంథాలయోద్యమ పితామహుడిగా పేరొంది, ఆచంద్రతారార్కమైన ఖ్యాతి నార్జించిన ‘అయ్యంకి’ జనహృదయాల్లో పెల్లుబికిన చైతన్య స్రవంతి. ఆంధ్రప్రదేశ్‌లో 1886వ సంవత్సరంలో విశాఖ పట్టణంలో స్థాపించిన పౌర గ్రంథాలయం తొలి గ్రంథాలయంగా పిలవబడుతున్నది. అయితే అంతకు ముందు కూడా అనేక గ్రంథాలయాలు స్థాపించబడినట్టు గ్రంథాలయ చరిత్ర విశదీకరిస్తున్నది. గ్రంథాలయం అయ్యంకి మానస పుత్రిక. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ 1914 లో ఏర్పడింది. వేటపాలెంలో ఏర్పడిన సారస్వత నికేతనం గ్రంథాలయం ప్రాచీన గ్రంథాలయాల్లో ఒకటి. కేరళలోని ‘త్రివేండ్రం పబ్లిక్ లైబ్రరీ’ ని ఇండియాలో మొదటి లైబ్రరీగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో 1872లో సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రంథాలయం ప్రాచీన గ్రంథాలయంగా పేరుగాంచింది. కొమర్రాజు లక్ష్మణరావు కూడా గ్రంథాలయ ఉద్యమానికి విశేషమైన కృషి చేసాడు. తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి, తెలంగాణ గొంతు ‘కాళోజీ’ గ్రంథాలయోద్యమంలో ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించాడు. అనేక ఉద్యమాల ప్రభావంతో అప్పటి నల్గొండలో ఆంధ్ర సరస్వతీ గ్రంథ నిలయం, వరంగల్‌లో ఆంధ్ర భాషా నిలయం ఏర్పడ్డాయి. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం ఆలస్యంగా ప్రారంభమైనా తర్వాత క్రమంలో అత్యంత క్రియాశీలకంగా మారింది. హైదరాబాద్‌లోని కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఒక పురాతన గ్రంథాలయం. గ్రంథాలలోనే నిజమైన విజ్ఞానం నిగూఢమై ఉన్నది. మన ఆలోచనా సామర్థ్యం పెరగడానికి పుస్తకపఠనమే నిజమైన మిత్రుడు. వర్తమానంలో జరుగుతున్న ప్రాపంచిక సంఘటనలు, గతంలో జరిగిన వాస్తవ సంఘటనలను గ్రంథస్థం చేసి, రాబోయే తరాలకు అందించడమే చరిత్ర. చరిత్ర అనేది బ్రహ్మపదార్ధమేమీ కాదు. చరిత్ర అంటే వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా విశదీకరిస్తూ అక్షర రూపమిస్తూ గ్రంథస్థం చేయడమే. గతంలో చాలామంది కవులు తమ మస్థిష్కంలో మెదిలే ఆలోచనలకు, కల్పనలకు అలంకారాలను జోడిస్తూ హృదయానికి హత్తుకునేటట్టు వివిధ రూపాల్లో తమకున్న ప్రతిభావ్యుత్పత్తులతో జన రంజకమైన రచనలు చేసేవారు. తమ మేధస్సుకు పదును పెట్టి ఆణిముత్యాల వంటి కథాకథనంతో పద్య, గద్య, శిల్ప, చిత్ర, కావ్యరూపాల్లో నాటి సృజనాత్మక శిల్పకారులు, చిత్రకారులు, కవులు విజ్ఙానాన్ని నిక్షిప్తం చేసేవారు. నాటి రచనలు, పద్య, గద్య రచనలు, కావ్యాలు ఎన్ని తరాలకైనా తరగని ఆస్తి. అందుకే మన ప్రాచీనకాలానికి చెందిన గ్రంథాలు ఈనాటీకీ పండిత పామరుల చేత కొనియాడబడుతూ, విశేష జనాదరణ పొందుతున్నాయి. బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. కాలాను గుణంగా మార్పులు రావడం సహజం. మారిన పరిస్థితులకనుగుణంగా సమాజం కూడా అదే నిష్పత్తిలో పరివర్తన చెందుతున్నది. కాలానుగుణంగా వస్తున్న మార్పుల ఫలితంగా పుస్తకాల స్థానాన్ని కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు ఆక్రమిస్తున్నాయి. చదువుకోకుండా ఆటపాటలతో అల్లరి చేసే విద్యార్థులను ఉద్దేశించి మన పెద్దలు ‘పుస్తకం హస్తభూషణం’ కారాదు అనేవారు. ఇది గతకాలపు మాట. చరవాణి నేటి తరానికి హస్తభూషణమై వర్ధిల్లుతున్నది. అసలు పుస్తకమే కనుమరుగైపోయే రోజులు దాపురించాయి. సాంకేతిక విజ్ఞానం కొత్తపుంతలు తొక్కిన నేపథ్యంలో గ్రంథపఠనం ప్రాధాన్యత కోల్పోయింది. ప్రతీ ఒక్కరూ పుస్తకాలను చదవాలని, విజ్ఞాన సముపార్జన ద్వారానే మానసిక వికాసం కలుగుతుందని, సమాజ పురోభివృద్ధి పుస్తకపఠనం ద్వారానే సాధ్యమవుతుందని ఎంతో మంది విజ్ఞులు ఒక అవగాహనకు వచ్చి, అందరికీ పుస్తకాలు అందుబాటులో ఉండాలని, అందుకోసం స్వాతం త్య్ర పోరాటం తరహాలో ఉద్యమించారు. వారి పోరాట ఫలితమే గ్రంథాలయాల ఆవిర్భావం. గ్రంథాలయాల ఆవిర్భావం కోసం గ్రంథాలయోద్యమం జరిగింది. నాటి గ్రంథాలయోద్యమం తీవ్రస్థాయిలో జరిగింది. అయ్యంకి వెంకట రమణయ్యను భారతీయ గ్రంథాలయోద్యమ రూపశిల్పిగా చరిత్ర పేర్కొంటున్నది. ఇండియన్ లైబ్రరీ అసోషియేషన్ ఆవిర్భవించడానికి, జాతీయస్థాయి సమావేశాలకు అది వేదిక కావడానికి ఆద్యుడు అయ్యంకి వెంకట రమణయ్య, కొమర్రాజు లక్ష్మణరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, వెలగా వెంకటప్పయ్య, పాతూరి నాగభూషణం, బెల్లంకొండ నాగేశ్వరరావు వంటి మహనీయులెందరో గ్రంథాలయోద్యమానికి నాయకత్వం వహించారు. దేశం నలుమూలలా అనేక గ్రంథాలయాలను స్థాపించి సామాన్యులందరికీ విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశమే గ్రంథాలయ వారోత్సవాలకు నాంది పలికింది. అయితే విజ్ఞాన భాండాగారాలుగా విలసిల్లిన గ్రంథాలయాల్లో పాఠకుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతున్నది. మరో గ్రంథాలయోద్యమం ప్రారంభం కావలసిన అవసరం ఏర్పడింది. చరవాణి పుస్తక స్థానాన్ని ఆక్రమించింది. మన ఆలోచనలకు పదునుపెట్టి, మానసిక వికాసం కలిగించిన గ్రంథాలయాలు వెలవెలబోతున్నాయి. మన మేధస్సును హరించి, మన ఆలోచనలకు తావులేని మరబొమ్మలుగా తయారు చేస్తున్న సాంకేతిక పరికరాలకు కొంతవరకు విశ్రాంతినిచ్చి, పుస్తక పఠనానికి గవాక్షాలు తెరవాలి. గ్రంథాలయాలు మన పురాతనమైన వెలకట్టలేని ఆస్తిపాస్తులు. వాటిని కాపాడుకోవాలి. పుస్తక పఠనంపై నేటి విద్యార్థికి ఆసక్తిని కలిగించాలి.మనోవికాసానికి గ్రంథాలయాలే ఆలవాలం. పుస్తక పఠనమే మన ఆలోచనా నేత్రాల సక్రమ వీక్షణకు సవ్యమైన మార్గం. అజ్ఞానానికి నిజమైన ఔషధం విలువైన పుస్తకం. గ్రంథాలయ వారోత్సవాల స్ఫూర్తి గ్రంథాలయాల ఆవశ్యకతకు దోహదం చేయాలి. ప్రతీ గ్రామంలో ప్రతీ పాఠశాలలో గ్రంథాలయాలుండాలి. ప్రభుత్వాలు గ్రంథాలయాలకు విలువైన పుస్తకాలను, అన్ని దిన, వార, పక్ష, మాస పత్రికలను అందుబాటులో ఉంచాలి. పుస్తకమే సమస్త విజ్ఞాన సంపదగా పాఠకులు భావించాలి.

మన తెలంగాణ 21 Nov 2025 10:43 am

స్వగ్రామానికి చేరుకున్న టెక్ శంకర్ మృతదేహం

అమరావతి: మారేడుపల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మేటూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు టెక్ శంకర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి పోలీసులు టెక్ శంకర్ మృతదేహంతో చేరుకున్నారు. మేటూరు జోగారావు మృతదేహం చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రజాసంఘాలు, సానుభూతిపరులు టెక్ శంకర్ కు తుది నివాళులర్పిస్తున్నారు. మారేడుపల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన శంకర్ మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగాడు. ఆంధ్రా-ఒడిశా బార్డర్ మావోయిస్టు పార్టీ ఇంచార్జిగా వ్యవహరించాడు. ఆయుధాలు తయారు చేయడంతో పాటు వాటి ఐఇడి నిపుణులుగా పేరొందాడు. మావోయిస్టు ఉద్యమంలో దశాబ్దాల నుంచి ఉండడంతో పోలీసుల రికార్డుల్లో మాత్రం శంకర్, బాబు, శివగా మారు పేర్లతో ఉన్నాడు.  అల్లూరి సీతారామారాజు జిల్లా రంపచోడవరం మండలం మారేడుమిల్లి ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో టైగర్ జోన్ పుల్లగండి అడవుల్లోని నల్లూరు జలపాతం వద్ద మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన సతీమణి రాజే, టెక్ శంకర్ తోసహా ఆరుగురు మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో హతమైన విషయం విధితమే. 

మన తెలంగాణ 21 Nov 2025 10:33 am

తెలుగులో గలగలా మాట్లాడుతోంది!

జాన్వీ కపూర్ చూస్తుండగానే తెలుగు నేర్చేసుకొంది. దేవర షూటింగ్ పూర్తి చేసేటప్పటికే కొంత నేర్చుకొంది. కానీ ఇప్పుడు పూర్తిగా గలాగలా మాట్లాడేస్తోంది. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. మూఢు భాషల్లో తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. అందుకే ఆమె ఆలిండియా స్టార్ అనిపించుకున్నారు. ఇక జాన్వీకి హిందీ, తమిళం ముందు నుంచే వచ్చు. ఇంగ్లీష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా తెలుగు కూడా బాగా నేర్చుకొని మాట్లాడుతోంది. పెద్ది సినిమా వల్ల ఆమెకి తెలుగు మీద మంచి పట్టు వచ్చిందట. దేవర సినిమా టైంలోనే ఆమె తెలుగు బాగా నేర్చుకొని మాట్లాడుతాను అని తన తెలుగు అభిమానులకు మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఇప్పుడు తెలుగులో మాట్లాడుతోంది. మరి భవిష్యత్ లో తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకుంటుందా అనేది చూడాలి. పెద్ది సినిమాలో ఈ భామ రామ్ చరణ్‌కి చికిరిగా నటించింది. ఆ పాట ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

మన తెలంగాణ 21 Nov 2025 10:26 am

Goutham Gambhir : ఈయన ఉన్నాడే.. ఓటములకు ఈయనే పెద్ద కారణం

టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగు పోస్ట్ 21 Nov 2025 10:04 am

Andhra Pradesh : కుప్పంలో నారా భువనేశ్వరి

కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి మూడో రోజు పర్యటన కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 21 Nov 2025 10:00 am

Varanasi బడ్జెట్ ఎంత..? టార్గెట్ ఎంత..?

Varanasi బడ్జెట్ ఎంత..? టార్గెట్ ఎంత..? ఆంధ్ర‌ప్ర‌భ : సూపర్ స్టార్ మహేష్

ప్రభ న్యూస్ 21 Nov 2025 9:58 am

GHMC |అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు షాక్..

GHMC | అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు షాక్.. GHMC, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్

ప్రభ న్యూస్ 21 Nov 2025 9:52 am

Andhra Pradesh : నేటి నుంచి సచివాలయ సిబ్బంది బదిలీల ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.

తెలుగు పోస్ట్ 21 Nov 2025 9:52 am

Hyderabad : అన్నపూర్ణ, రామానాయుడు స్డూడియోస్ లకు జీహెచ్ఎంసీ ఝలక్

అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు

తెలుగు పోస్ట్ 21 Nov 2025 9:43 am

Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇంతగా ధరలు ఎన్నడూ తగ్గలేదుగా

ఈరోజు దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి

తెలుగు పోస్ట్ 21 Nov 2025 9:30 am

వేధింపులు తట్టుకోలేక పెళ్లి కుమారుడు ఆత్మహత్య

రంగారెడ్డి: అప్పలు వాళ్లు వేధించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాహెబ్‌నగర్‌లో పారంద శ్రీకాంత్(32) అనే యువకుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. నలుగురు అతడు రెండు లక్షల రూపాయల వరకు అప్పులు చేసేవాడు. శ్రీకాంత్ ఈ నెల 23న పెళ్లి చేసుకోనున్నాడు. ఈ క్రమంలో పెళ్లికి ముందు ఒత్తిడి చేస్తేనే డబ్బులు వస్తాయని అప్పులిచ్చిన అతడిని వేధించడం మొదలు పెట్టారు. అప్పుల వాళ్ల వేధింపులు తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లేటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఐతగోని శేఖర్, సుబ్బారావు, అప్పం శేఖర్, సత్యనారాయణ అని సూసైడ్ లేటర్‌లో తెలిపాడు. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేశాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు వెతకగా హరిహరపురం చెరువు కట్టపై అతడి మృతదేహం కనిపించింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 21 Nov 2025 9:26 am

హృషికేశ్ అజేయ శతకం

మన తెలంగాణ/ హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే హైదరాబాద్ జట్టు ఎంపిక కోసం హెచ్‌సిఎ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాబబుల్స్ పోటీల్లో యువ బ్యాటర్ హృషికేశ్ సింహా అద్భుత బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఎన్‌ఎఫ్‌సి గ్రౌండ్‌లో హెచ్‌సిఎ గ్రీన్‌తో జరిగిన ప్రాబబుల్స్ మ్యాచ్‌లో హృషికేశ్ 52 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో హృషికేశ్ పది ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. హృషికేశ్ విధ్వంసక శతకం సాధించడంతో హెచ్‌సిఎ బ్లూ టీమ్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్రీన్ టీమ్ 6 వికెట్లకు 208 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అంతకుముందు ఎన్‌ఎఫ్‌సి గ్రౌండ్‌లోనే హెచ్‌సిఎ రెడ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో హృషికేశ్ 41 బంతుల్లోనే అజేయంగా 83 పరుగులు సాధించాడు.

మన తెలంగాణ 21 Nov 2025 9:23 am

Narendra Modi : నేటి నుంచి మోదీ దక్షిణాఫ్రికా పర్యటన

ప్రధాని నరేంద్రమోదీ నేటి నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 21 Nov 2025 9:16 am

టీమిండియా ముమ్మర సాధన

గౌహతి: రెండో టెస్టు కోసం ఆతిథ్య టీమిండియా గురువారం ముమ్మర సాధన చేసింది. గౌహతి వేదికగా శనివారం నుంచి భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టు కఠోర సాధనలో నిమగ్నమైంది. గురువారం కీలక ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. రిషబ్ పంత్, జడేజా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ తదితరులు కఠోర సాధన చేశారు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు రెండో, చివరి టెస్టు సవాల్‌గా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. దీంతో భారత ఆటగాళ్లు మ్యాచ్ కోసం తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. కాగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం సాధనకు దూరంగా ఉన్నాడు. మెడ నొప్పి గాయంతో గిల్ తొలి టెస్టు మ్యాచ్‌లో అర్ధాంతరంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. రెండో టెస్టులో అతను ఆడడం అనుమానంగా మారింది.

మన తెలంగాణ 21 Nov 2025 9:14 am

Tirumala: తిరుమలలో రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

తెలుగు పోస్ట్ 21 Nov 2025 9:07 am

మెయినాబాద్ లో రెండు కార్లు ఢీ: ఒకరు మృతి

మెయినాబాద్: రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలంలో జరిగింది. కనకమామిడి వద్ద బీజాపూర్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. 

మన తెలంగాణ 21 Nov 2025 8:53 am

Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

తెలుగు పోస్ట్ 21 Nov 2025 8:51 am

Pawan Kalyan |పవర్ స్టార్.. నెక్ట్స్ ఏంటి..?

Pawan Kalyan | పవర్ స్టార్.. నెక్ట్స్ ఏంటి..? ఆంధ్ర‌ప్ర‌భ, సినిమా స్పెషల్

ప్రభ న్యూస్ 21 Nov 2025 8:49 am

Tirumala : తిరుమలకు నేడు వెళ్లేవారికి గుడ్ న్యూస్..వెంటనే దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు.

తెలుగు పోస్ట్ 21 Nov 2025 8:44 am

Bus accident |తప్పిన పెను ప్రమాదం..

Bus accident | తప్పిన పెను ప్రమాదం.. Bus accident, పెళ్లకూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Nov 2025 8:41 am

Rajamouli decides not to Respond to Trolls and Controversies

SS Rajamouli is the country’s top director and he is the pride of the nation. His comments on Lord Hanuman did not go well with many and cases are registered against him demanding an apology. Yesterday some of the BJP leaders decided to take the protests to the next level and warned Rajamouli. But the […] The post Rajamouli decides not to Respond to Trolls and Controversies appeared first on Telugu360 .

తెలుగు 360 21 Nov 2025 8:40 am

ప్రేమపెళ్లి... రీల్స్ చేయవద్దని చెప్పినందుకు భర్తను చంపిన భార్య

చెన్నై: ప్రేమించి పెళ్లి చేసుకుంది... పక్కింటి కుర్రాడితో రీల్స్ చేస్తున్నావని ప్రశ్నించినందుకు భర్యను భార్య చంపి ఉరేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం సేతపట్టు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇడయాన్‌కొళత్తూరు గ్రామంలో విజయ్(27), షర్మిళ అనే యువతి ప్రేమించి ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూతురు(4), కుమారుడు(3) ఉన్నాడు. విజయ్ డ్రైవర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పది, పదిహేను రోజులకొకసారి ఇంటికి వచ్చేవాడు. ఇంటి పక్కన ఉండే యువకుడితో షర్మిలకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి రీల్స్ చేశారు. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. మళ్లీ షర్మిళ తన ప్రియుడితో రీల్స్ చేయడంతో భర్త ప్రశ్నించాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భర్త తలపై కర్రతో భార్య బాదింది. షర్మిళ తన తల్లి ఫాతిమా సాయంతో విజయ్ మృతదేహాన్ని కిటీకికి వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తలపై బలమైన గాయాలతో చనిపోయినట్టు శవ పరీక్షలో తేలడంతో భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేసినట్టు ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మన తెలంగాణ 21 Nov 2025 8:39 am

Hyderabad : గుడ్ న్యూస్... హైదరాబాద్ లో టీసీఎస్ భారీ పెట్టుబడులు

హైదరాబాద్ లో టీసీఎస్ భారీ పెట్టుడులకు సిద్ధమయింది

తెలుగు పోస్ట్ 21 Nov 2025 8:29 am

ప్రజలతో పోలీసులు

ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా ఉండాలి. — సౌత్ జోన్ డిఎస్పి భవ్య కిషోర్. విశాలాంధ్ర – కడియం : ప్రజలతో పోలీసులు స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా సౌత్ జోన్ డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ భవ్య కిషోర్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా కడియం పోలీస్ స్టేషన్ కు విచ్చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ నమోదు చేసిన కేసుల్లో ముద్దాయిలను అరెస్టు చేసి తొందరగా చార్జ్ […] The post ప్రజలతో పోలీసులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 8:29 am

అసెంబ్లీ కి విద్యార్థిని సంధ్య

మాక్ అసెంబ్లీ సమావేశానికి ఎంపికైన వీరవరం విద్యార్థిని సంధ్య. విశాలాంధ్ర – కడియం : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరగబోయే మాక్ అసెంబ్లీ సమావేశానికి కడియం మండలం, వీరవరం గ్రామానికి చెందిన విద్యార్థిని ఎంపికైనట్లు ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎబి రజని తెలిపారు. వీరవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కందుకూరి సంధ్య, నవంబర్ 26 వ తేదీన అమరావతిలో జరగనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. […] The post అసెంబ్లీ కి విద్యార్థిని సంధ్య appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 8:23 am

ట్రంప్ జూనియర్

ట్రంప్ జూనియర్ కు ఘన స్వాగతం పలికిన ఎంఆర్ పాలెం యువకుడు. విశాలాంధ్ర – కడియం : భారతదేశ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ తొలిసారిగా భారత్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ జూనియర్ కు తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, మాధవరాయుడు పాలెం గ్రామ సర్పంచ్ అన్నందేవుల చంటి తనయుడు, ఇంటర్నేషనల్ చార్టెడ్ ఫ్లైట్స్ అసోసియేషన్ సీఈవో అన్నందేవుల మణీంద్ర ఘనస్వాగతం పలికారు. ట్రంప్ జూనియర్ మూడు రోజుల […] The post ట్రంప్ జూనియర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 8:19 am

కంబాల విరాళం

విద్యార్థుల మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కంబాల 20,000 రూపాయలు విరాళం.._ _వైద్య ఖర్చులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం…_ విశాలాంధ్ర– గోకవరం:గోకవరం మండలం గుమ్మళ్ళ దొడ్డి గ్రామంలో మండల పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు బుధవారం రాత్రి 20,000 రూపాయలు విరాళం అందజేశారు. పాఠశాలలో 70 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు త్రాగునీటి సమస్య ఉందని, వాటర్ […] The post కంబాల విరాళం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 8:14 am

కలెక్టర్ సమగ్ర సమీక్ష

వివిధ శాఖల పనితీరు మెరుగుదలకు కలెక్టర్ సమగ్ర సమీక్ష గ్రామీణ సానిటేషన్ – ఆరోగ్య సేవలు – వ్యవసాయ మార్కెట్లు – శాఖల గ్రేడింగ్‌పై దృష్టి — జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పుగోదావరి :ప్రతి శాఖ పనితీరును రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతోందని, శాఖల వారీగా గ్రేడింగ్‌లో ర్యాంకు పెంచుకోవడం పై దృష్టి సారించాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. కలెక్టరేట్ లో గురువారం సాయంత్రం ప్రభుత్వ శాఖల పనితీరు, సేవల […] The post కలెక్టర్ సమగ్ర సమీక్ష appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 8:07 am

BB Telugu 9: Family Week Continues as Kalyan, Ritu & Bharani Receive Strong Guidance

Family Week in Bigg Boss Telugu 9 continued with emotionally impactful reunions. Each visit brought not only warmth but also constructive criticism and strategic clarity, influencing the direction of the contestants’ game. Kalyan’s Emotional Reunion and Maternal Guidance Kalyan’s mother entered the house, leading to an emotional exchange. She expressed concern over his physical appearance, […] The post BB Telugu 9: Family Week Continues as Kalyan, Ritu & Bharani Receive Strong Guidance appeared first on Telugu360 .

తెలుగు 360 21 Nov 2025 8:03 am

Telangana : నేడు ఆదిలబాద్ లో ఛలో భోరాజ్

ఆదిలాబాద్ జిల్లాలో నేడు రైతులు జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపు నిచ్చారు.

తెలుగు పోస్ట్ 21 Nov 2025 8:03 am

ACB |వస్తుందనే.. ఇలా చేశారా..?

ACB | వస్తుందనే.. ఇలా చేశారా..? ACB, మంచిర్యాల జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Nov 2025 8:01 am

అదిరిపోయే లవ్ మెలోడీ

జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్‌లో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో... క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న మూవీ ‘జిఒఎటి’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం చివరి దశకి చేరుకుంది. గురువారం మేకర్స్ ఫస్ట్ సింగిల్ ఒడియమ్మ సాంగ్ ని రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ ఈ పాటని అదిరిపోయే లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ వాయిస్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ సాంగ్ లో సుధీర్, దివ్యభారతి కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

మన తెలంగాణ 21 Nov 2025 7:48 am

రేపు పుట్టపర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 22, 23 తేదీల్లో పుట్టపర్తిలో పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 21 Nov 2025 7:46 am

ప్రేమ కథ చాలా స్వచ్ఛంగా ఉంటుంది

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది, ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను మహాలక్ష్మి క్యారెక్టర్‌లో కనిపిస్తాను. తను కాలేజ్ అమ్మాయిగా సాగర్‌తో ప్రేమలో ఉంటుంది. ఇందులో ఉపేంద్రతో -ఒక కాంబినేషన్ సీన్ ఉంది. ఆయనతో వర్క్ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. -ఇందులో ప్రేమ కథ చాలా స్వచ్ఛంగా ఉండబోతుంది. నువ్వుంటే చాలు, చిన్ని గుండెలో పాటలు మీరు చూసే ఉంటారు. ప్రేమలో ఉన్న గొప్ప ఎమోషన్ వీటిలో ఉంటాయి. రామ్‌తో నటించడం అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేశానని అనుకుంటున్నాను. లవ్ స్టొరీ, డైలాగ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇది 2000లో జరిగే కథ. డైరెక్టర్ కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ అన్నింటి పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవి, నవీన్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది”అని అన్నారు. 

మన తెలంగాణ 21 Nov 2025 7:45 am

నేడు జ్ఞాననిధి పాఠశాలలో ఉచిత ఆధార్ క్యాంప్

విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో రఘుదేవపురం గ్రామ పంచాయితీ పరిధిలో గలజ్ఞాననిధి ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలలో నవంబర్ 21 నుంచి 23 తేది వరకూ ఉచిత ఆధార్ క్యాంపు జరగనుంది అని ఎంపిడిఓ ఎమ్ భారతి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ భారతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 17 నుంచి 26 వరకూ వివిధ గ్రామాల్లో ఉచిత ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా నవంబర్ 21వ తేదీన జ్ఞాననిధి […] The post నేడు జ్ఞాననిధి పాఠశాలలో ఉచిత ఆధార్ క్యాంప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 7:39 am

Road Accident : సూళ్లూరిపేట వద్ద ప్రయివేటు బస్సు ప్రమాదం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

తెలుగు పోస్ట్ 21 Nov 2025 7:28 am

Andhra Pradesh : ఏపీలో రైతన్నా మీకోసం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి రైతులకోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది.

తెలుగు పోస్ట్ 21 Nov 2025 7:10 am

AP |మళ్లీ వర్ష సూచన..

AP | మళ్లీ వర్ష సూచన.. AP, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 21 Nov 2025 7:09 am

KTR |కేటీఆర్ కు బీజేపీ అండదండలు..

KTR | కేటీఆర్ కు బీజేపీ అండదండలు.. KTR, హైదరాబాద్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Nov 2025 6:56 am

Yadadri |రేపటి నుంచి బడికి వచ్చేయ్..

Yadadri | రేపటి నుంచి బడికి వచ్చేయ్.. Yadadri, యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి

ప్రభ న్యూస్ 21 Nov 2025 6:38 am

Bandi Vs Etela |బీజేపీలో జూబ్లీ ఉప ఎన్నిక చిచ్చు..

Bandi Vs Etela | బీజేపీలో జూబ్లీ ఉప ఎన్నిక చిచ్చు.. Bandi

ప్రభ న్యూస్ 21 Nov 2025 6:19 am

నిఖత్‌ జరీన్‌కు స్వర్ణం

` వరల్డ్‌ బాక్సింగ్‌ కప్‌లో గోల్డ్‌ మెడల్‌ కైవసం ` ఫైనల్లో చైనీస్‌ తైపీకి చెందిన జువాన్‌ యి గువోపై గెలుపు న్యూఢల్లీి(జనంసాక్షి):భారత బాక్సింగ్‌ స్టార్‌, తెలంగాణ …

జనం సాక్షి 21 Nov 2025 6:14 am

గవర్నర్‌,రాష్ట్రపతులకు గడువు విధించలేం

` పెండిరగ్‌ బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో నిర్ధిష్ట కాలపరిమితి విధించటం తగదు ` బిల్లును నిరవధికంగా నిలిపివేసే అధికారం గవర్నర్‌కు కూడా లేదు ` సుప్రీంకోర్టు …

జనం సాక్షి 21 Nov 2025 6:13 am

కీలక ఖనిజ రంగంలో తెలంగాణ చొరవకు నీతి ఆయోగ్‌ గుర్తింపు

` సింగరేణి సంస్థకు నీతి ఆయోగ్‌ జాతీయ కమిటీలో చోటు ` రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్కమల్లు ` 2300 మెగావాట్ల థర్మల్‌, సోలార్‌ …

జనం సాక్షి 21 Nov 2025 6:10 am

స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయండి

` ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం హైదరాబాద్‌్‌(జనంసాక్షి):జూనియర్‌ కళాశాలు, డిగ్రీ కళాశాలలు మరియు పాలిటెక్నిక్‌ కళాశాలలకు సంబంధించి పెండిరగ్‌ లో ఉన్న స్కాలర్షిప్‌ బకాయిలను …

జనం సాక్షి 21 Nov 2025 6:08 am

కొలువుదీరిన నితీష్‌ సర్కారు

` ముఖ్యమంత్రిగా నితీశ్‌ ప్రమాణం ` 27మంది మంత్రులు కూడా.. ` ప్రమాణం చేయించిన గవర్నర్‌ ` హాజరైన మోడీ, అమిత్‌ షా, చంద్రబాబు పాట్న్‌ా(జనంసాక్షి): బిహార్‌ …

జనం సాక్షి 21 Nov 2025 6:06 am

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక

` సమర్పించిన డెడికేటెడ్‌ కమిషన్‌ హైదరాబాద్‌్‌(జనంసాక్షి):పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్‌ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు …

జనం సాక్షి 21 Nov 2025 6:05 am

దానం, కడియంలకు మరోసారి నోటీసులు

` పోచారం, అరికెపూడిలను విచారించిన స్పీకర్‌ హైదరాబాద్‌్‌(జనంసాక్షి): సుప్రీం మరో నాలుగు వారాల గడువు ఇవ్వడంతో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ …

జనం సాక్షి 21 Nov 2025 6:04 am

త్వరలో భారత్‌కు అధునాతన జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ

` అమెరికాతో కుదిరిన 93 మిలియన్‌ డాలర్ల ఆయుధ ఒప్పందం వాషింగ్టన్‌(జనంసాక్షి): భారత్‌`అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. దీంతో అధునాతన జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ …

జనం సాక్షి 21 Nov 2025 6:02 am

భార్య, పిల్లల్ని హత్య కేసులో.. నిందితుడికి ఉరిశిక్ష

` సంచలన తీర్పు వెలువరించిన వికారాబాద్‌ జిల్లా కోర్టు వికారాబాద్‌(జనంసాక్షి): భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో వికారాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి …

జనం సాక్షి 21 Nov 2025 6:00 am

రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేం

న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం తెలిపేందుకు ఎటువంటి గడువులు విధించలేమని సుప్రీంకోర్టు గురువారంనాడు స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడం పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలకు సుప్రీంకోర్టు వివరాణాత్మక సమాధా నం ఇచ్చింది. సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తన ఏకగ్రీవ తీర్పులో, గవర్నర్లు ఆర్టికల్ 200 కింద వారికి ఇచ్చి న అధికారాల పరిధిని మించి బిల్లులపై సుదీర్ఘకాలం పాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండలేరని కూడా తీర్పుని చ్చింది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసే అధికారం గవర్నర్ల కు ఉందని కూడా తాము భావించడం లే దని ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవా య్, నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్‌నాథ్, పి.ఎస్. నరసింహ, ఎఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో గవర్నర్లకు సమయపాలన నిర్ణయించడం రాజ్యాంగం అందించిన అధికారాలకు విరుద్ధమని కూడా ధర్మాసనం పేర్కొంది. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 200 కింద గవర్నర్లకు మూడు ఆప్షన్లు ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ అన్నారు.అవి 1.అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలుపడం, 2. బిల్లులను రాష్ట్రపతికి సూచించడం 3. అనుమతిని నిలిపివేసి వాటికి తన వ్యాఖ్యలతో అసెంబ్లీకి తిరిగి పంపడం అని పేర్కొన్నారు. ఈ మూడు ఆఫ్షన్లలో దేనినైనా ఎన్నుకునేందుకు గవర్నర్ కు విచక్షణాధికారం ఉందని, అందుకు న్యాయస్థానాలు గడువు విధించడం సబబు కాదని పేర్కొన్నారు. రాజ్యాంగపరంగా నిర్దేశించిన కాలపరిమితులు, గవర్నర్ అధికారాన్ని వినియోగించే విధానం లేనప్పుడు ఆర్టికల్ 200కింద అధికారాలను వినియోగించాలని ఈ కోర్టు న్యాయపరంగా సూచించడం సముచితం కాదని ధర్మాసనం పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని విచారించిన జస్టిస్ జె.బి. పార్ధివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఏప్రిల్ లో గవర్నర్లు, రాష్ట్రపతి రాష్ట్ర అసెంబ్లీ లు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు మూడు నెలల వ్యవధిని నిర్ణయించింది. ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేవనెత్తిన 14 కీలకమైన ప్రశ్నలపై చర్చించడానికి సుప్రీం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం అంగీకరించింది. అరుదుగా ఉపయోగించే ఆర్టికల్ 132(1)కింద తన అధికారాలను వినియోగించుకుంటూ, ప్రజా ప్రాముఖ్యత గల అంశాల విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయం పొందడం సముచితమని భావించినట్లు రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. రాజ్యాంగ అధికారాల వినియోగం, రాష్ట్రపతి లేదా గవర్నర్ ల ఆదేశాలను ఆర్టికల్ 143 కింద ఏ విధంగానూ కాదనలేమని గురువారం ధర్మాసనం వివరించింది. ఏ కేసులోనైనా పూర్తి న్యాయం చేయడానికి ఏదైనా ఆదేశాన్ని జారీ చేయడానికి ఆర్టికల్ 142 అత్యున్నత న్యాయస్థానానికి అపారమైన అధికారాన్ని ఇస్తుందని పేర్కొంది. గవర్నర్ల విధుల నిర్వహణలో కోర్టులు జోక్యం చేసుకోబోవు. కానీ, కారణం లేకుండా దీర్ఘకాలం బిల్లులను పెండింగ్ లో ఉంచిన సందర్భాల్లో కోర్టులు పరిమిత వివక్షతతో వ్యవహించవచ్చు నని, రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, ఆర్టికల్ 361ని ప్రస్తావిస్తూ, గవర్నర్ ను వ్యక్తిగతంగా న్యాయపరమైన చర్యలకు గురిచేయడానికి సంబంధించి, న్యాయ సమీక్షపై సంపూర్ణ నిషేధం ఉందని కోర్టు పేర్కొంది.

మన తెలంగాణ 21 Nov 2025 6:00 am

వారంలో పంచాయతీ నగారా?

మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సం స్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) సిద్ధమవుతోంది. ఈనెల 26 లేదా 27వ తేదీన పంచాయతీ ఎన్నికల నగారా మోగనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మూడు దశల్లో గ్రామ పం చాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. గ్రామ పంచాయతీల్లో 50 శాతానికి లోబడి ఎస్‌సి,ఎస్‌టి, బిసి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ నివేదికకు అనుగుణంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలు వెంటనే జిల్లాల్లో ఆ యా పంచాయతీల వారీగా జనాభా ఆధారంగా రిజర్వేషన్ల ఖరారుకు చేయనుంది. ఒ కటి రెండు రోజుల్లోనే జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు పంచాయతీల వా రీగా రిజర్వేషన్లను సిద్ధం చేస్తారు. ఈ నెల 24న హైకోర్టులో రిజర్వేషన్ల అమలుపై వి చారణ ఉన్న నేపథ్యంలో ఆలోపే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి,  హైకోర్టుకు నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. పంచాయతీల్లో 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు అమలు చేస్తే ఎన్నికలు నిర్వహించుకునేందుకు గతంలో హైకో ర్టు అనుమతించిన విషయం తెలిసిందే. కా గా, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నిక లు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. పంచాయతీల్లో ఓటరు జాబితా మ రోసారి సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) షెడ్యూల్ ప్రకటించిన సంగతి తె లిసిందే. ఈ నెల 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ, వార్డుల మ్యాపింగ్‌లో తప్పుల సవరణ (అడ్రస్‌లో మార్పు లేకుండా కేవలం వార్డు మార్పులు మాత్రమే) అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ/వార్డు/పోలింగ్‌స్టేషన్ వారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాల్లో మిస్ మ్యాపింగ్‌పై ఓటర్ల నుంచి దరఖాస్తు స్వీకరణ, వాటి పరిశీలన 22వ తేదీన అందిన ఫిర్యాదులు, అభ్యర్థనలు, అభ్యంతరాలను సంబంధిత డిపిఒల ద్వారా పరిష్కారించనున్నారు. 23వ తేదీన సంబంధిత గ్రామపంచాయతీల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు తిరిగి ప్రచురించాలి. అందులో ఓటర్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడం, మ్యాపింగ్‌లో తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుతారు. పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రకారం.. ఓటర్ల జాబితాను పరిశీలించి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మళ్లీ ప్రచురిస్తారు. ఓటర్ల జాబితా సవరణ పూర్తవ్వగానే.. ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. 31 జిల్లాల్లో 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించి, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా.. గత సెప్టెంబర్ 2న వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదాను ప్రకటించారు. సమర్ధవంతంగా ఎన్నికలు నిర్వహించాలి: కమిషనర్ రాణి కుముదిని రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. ఈ ఎన్నికల నిర్వహణపై గురువారం జిల్లా కలెక్టర్లు,ఎస్‌పిలు, ఉన్నతాధికారులతో కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్‌ఇసి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర డి.జి.పి. శివధర్ రెడ్డి,ఇతర ఎన్నికల సంఘం అధికారులతో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు.

మన తెలంగాణ 21 Nov 2025 5:00 am

సిబిఐ కోర్టుకు జగన్ హాజరు

మన తెలంగాణ/హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువా రం సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణ నిమిత్తం హా జరయ్యారు. ముందుగా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన నేరుగా అక్కడి నుంచి నాం పల్లిలోని సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసు లో 2013 సెప్టెంబరు నుంచి జగన్ మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ మోహన్‌రెడ్డి చేసిన అభ్యర్థనను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరేళ్లుగా జగన్ కోర్టు కు ప్రత్యక్షంగాహాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ స్పష్టం చేసింది. ఈ పరిణామం నేపథ్యంలోనే శుక్రవారం లోపు వ్యక్తిగతంగా హాజరవ్వాలని జగన్ను కోర్టు ఆదేశించడంతో ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత జగన్ తొలుత వెయిటింగ్ గదిలోకి వెళ్లారు. విచారణ ప్రారంభం కాగానే, కోర్టు సిబ్బంది ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిచిన వెంటనే ఆయన కోర్టు హాల్లోకి ప్రవేశించి న్యాయమూర్తికి నమస్కరించారు. అనంతరం, న్యాయమూర్తి సూచన మేరకు హాజరు పట్టికలో సంతకం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్‌ను కోర్టు నుంచి వెళ్లేందుకు జడ్జి అనుమతించారు. విచారణ సందర్భంగా జగన్ ను జడ్జి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కేవలం ఆయన హాజరును మాత్రమే జడ్జి పరిగణనలోకి తీసుకుని, సంతకం చేయించుకుని పంపించి వేశారు. రాబోయే రోజుల్లో పిటిషన్లపై విచారణ జరగనుంది. అనంతరం ఆయన లోటస్‌పాండ్ లోని తన నివాసానికి చేరుకున్న కాసేపు ఉన్న అనంతరం తిరిగి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగుళూరు బయలుదేరి వెళ్లారు. తరలి వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద, నాంపల్లి సీబీఐ కోర్టు సమీపంలో హల్ చల్ చేశారు. వైసీపీ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ జగన్ మోహన్‌రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. ‘2029లో రప్ప రప్పా’ అంటూ జగన్ అభిమానులు నినాదాలు చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు వద్దకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు రావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే నాంపల్లి కోర్టు సమీపంలో కేసు విచారణకు వచ్చిన జగన్ కోసం వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నాంపల్లి సీబీఐ కోర్టు వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. ‘2029లో రప్పా రప్పా’ అంటూ రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

మన తెలంగాణ 21 Nov 2025 4:30 am

రాష్ట్రంలో ‘సన్నబియ్యం’ సక్సెస్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అమ లు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పేర్కొన్నారు. దే శంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేష న్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సిఎం వివరించారు. దీంతో పిడిఎస్ బియ్యం రీ సైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని ఆయన చెప్పారు. ప్రజలు తినే బియ్యాన్ని పంపిణీ చేయటంతో ఈ పథకం ఆశించిన లక్ష్యం నెరవేరిందన్నారు. తెలంగాణలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని సిఎం సూచించారు. దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన ఈ సమావేశంలో సిఎంతో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, సిఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సివిల్ సప్లయిస్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్రతో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలి ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 202425 రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలని ఆయన కోరారు. పిడిఎస్ కింద సరఫరా చేసిన లెవీ రైసుకు సంబంధించిన రూ.1,468 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలన్నారు. పిఎంజీకేఏవై అయిదో దశకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 343.27 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలని సిఎం కోరారు. 2024-25 ఖరీఫ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవధి పొడిగించాలని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌సిఐ గోదాంల్లో నిల్వ ఇబ్బందులను అధిగమించేందుకు అదనపు బాయిల్ రైస్ ర్యాకులను కేటాయించాలని, రాష్ట్రంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్రం సాయం అందిం చాలని సిఎం రేవంత్ కోరారు. 2025-26 ఖరీఫ్‌లో అత్యధికంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులన్నీ సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ అవసరం తగ్గిందని, అందువల్ల మిల్లింగ్‌కు అనువైన ముడిబియ్యం రకాల సాగును ప్రోత్సహించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో మిగులు ధాన్యం నిల్వలను సమర్థంగా నిర్వహించేందుకు ఎగుమతి అవకాశాలను పరిశీలించాలని సిఎం రేవంత్‌రెడ్డి సలహా ఇచ్చారు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని, బాయిల్డ్ రైస్ అదనపు కోటాను కేటాయించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. రా రైస్‌కు అనువైన రకాల వరిసాగును ప్రోత్సహించేందుకు రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.

మన తెలంగాణ 21 Nov 2025 4:00 am

బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం

మన తెలంగాణ/హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 22న ఆగ్నే య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప డే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తదుపరి 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయు వ్య దిశలో కదులుతూ మరింత బలపడి ఈనెల 24 నాటికి వాయుగుండంగా మా రే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 48 గంటల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాగల 2రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుండి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రం మొత్తం చలితో గజగజ : కొద్దిరోజులుగా సాయంత్రం 5 గంటలు అయ్యిందంటే చాలు రాష్ట్రం మొత్తం చలితో గజగజా వణికిపోతోంది. ఉదయం 9 గంటలైనా ఆ ప్రభావం కొనసాగుతూనే ఉంది. రాత్రి నుంచి ఉదయం వరకు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 7 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి 7.1, ఆదిలాబాద్ 7.7, వికారాబాద్ 8.1, రంగారెడ్డి 8.2, కామారెడ్డి 8.5, సిద్దిపేట 8.6, నిజామాబాద్ 8.9, జగిత్యాల 9, మెదక్ 9.3, నిర్మల్ 9.4, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 9.9 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఈదురుగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత పది రోజులుగా చలి తీవ్రత ఉధృతంగా కొనసాగుతుండగా మరింత అధికమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల సెల్సియస్‌కు చేరగా మిగిలిన జిల్లాల్లో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు కూడా 27.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గటంతో పొద్దంతా కాస్తా చలితో కూడిన వాతావరణం ఉంటోంది. ఉష్ణోగ్రతల తగ్గుదలకు తోడుగా ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలు చలి ప్రభావానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో పెరిగిన తేమ శాతం అధిక వర్షాలతో నేలలు చిత్తడిగా మారి గాలిలోని తేమశాతం పెరగటం, ఉత్తర భారతదేశం నుంచి చలి గాలులు వీస్తుండటం, వాతావరణ మార్పుల ప్రభావంతో నవంబరు మాసంలో సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సాధారణంగా డిసెంబరు నెలలో చలి అధికంగా ఉంటుంది. కానీ ఈ సీజన్‌లో మాత్రం నవంబరు నెల నుంచే చలి పంజా విసరుతోంది. తెలంగాణలో శీతల గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది తెలంగాణకు ఉన్న ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితి. ఏపీతో పోలిస్తే తెలంగాణ ఉత్తర, మధ్య భారతదేశానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇటీవల ఆ ప్రాంతాల్లో అధిక పీడనం ఏర్పడింది. దాని వల్ల అక్కడి నుంచి చల్లని, పొడి గాలులు దక్కన్ పీఠభూమిపై ఉన్న తెలంగాణ రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది.

మన తెలంగాణ 21 Nov 2025 3:30 am

కడియం, దానంకు మరోసారి స్పీకర్ నోటీసులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ గురువారం నోటీసులు జారీ చేశారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ కొనసాగింది. దానం, కడియం మాత్రం సమాధానం ఇచ్చేందు కు మరికొంత సమయం కావాలని కోరారు. గురువారం 8 మంది ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లపై విచారణ పూర్తయిన నేపథ్యంలో స్పీకర్ వారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణ పూర్తయిన ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయ సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సభాపతి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

మన తెలంగాణ 21 Nov 2025 3:20 am

తెలంగాణ రైజింగ్ కు అండదండ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్‌కు నాబార్డ్ సహకరించాలని డిప్యూటీ సిఎం భ ట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి నాయకత్వంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభు త్వం ధృఢ సంకల్పంతో ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు. గురువారం మాదాపూర్‌లోని హై టెక్స్‌లో ఏర్పాటు చేసిన నాబార్డ్ మొదటి ఎర్త్ స మ్మిట్‌లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలోనే అతిపెద్ద రుణమాఫీల్లో ఒకదాన్ని అమ లు చేసి దాదాపు 22 లక్షల కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల ఉపశమనం అందించామన్నారు. కొనుగోలు వ్యవస్థను విస్తరించి పారదర్శకంగా మార్చామని, రైతులకు నేరుగా, సమయానుసారం మద్దతు అందుకునేలా రైతు భరోసా అ మలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. సాగునీరు, డిజిటల్ పంట రికార్డులు, కోత తర్వా త మౌలిక వసతులలో పెట్టుబడులతో గ్రామీణ కు టుంబాల్లో బలమైన నమ్మకాన్ని పునరుద్ధరించామని తెలిపారు. సంక్షోభ సమయాల్లోనే కాదు, రై తుల ప్రతి రోజూ అభివృద్ధి పయనంలో ప్రజా ప్ర భుత్వం తోడుగా ఉంటుందని, ఇది తమ నిబద్ధత అన్నారు. నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రథమ ఎర్త్ సమ్మిట్‌లో పాల్గొనడం తనకు లభించిన గొప్ప గౌరవం అన్నారు. వ్యవసాయం గురిం చి మనం మాట్లాడినప్పుడు సంస్థాగత విప్లవం లేకుండా ఏ గ్రీన్ రేవల్యూషన్ కూడా సాధ్యం కా దని గుర్తు చేసుకోవాలని, ఈ సత్యాన్ని అర్థం చే సుకున్న నాయకులు మన దేశానికి లభించటం ఒ క వరం అని వివరించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మిగతా అన్నీ ఆగవచ్చని, వ్యవసాయం ఆగకూడదనే నమ్మకంతో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సాగునీటి సంఘాలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు వంటి వ్యవస్థాగత నిర్మాణాన్ని సృ ష్టించారని తెలిపారు. ఇందిరా గాంధీ ముఖ్యంగా గ్రీన్ రేవల్యూషన్ కాలంలో ఆమె చూపిన ధైర్యం రైతుకు భారత ప్రభుత్వ సంపూర్ణ అండ లభించేలా చేసిందన్నారు.పిఏసీల ఆధునికీకరణ, సహకార సంస్థల బలోపేతం, వ్యవసాయ డిజిటలైజేషన్, ఎఫ్‌పిఓలకు సుస్థిర శక్తి ఇవ్వడం, గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక ఉన్న నిశ్శబ్ద శక్తి నాబార్డ్ అని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. సమ గ్ర గ్రామీణ దృష్టికోణం విషయానికి వస్తే తెలంగాణలో మనం నిర్మిస్తున్న ప్రతిదీ డిజిటల్ మౌలిక వసతులు, అగ్రిటెక్, ఫిన్‌టెక్, పునరుత్పాదక శక్తి, ఇంక్యుబేషన్ ఇవన్నీ ఒకే దృష్టి వైపు సాగుతున్నాయన్నారు.నాబార్డ్ గ్రామీణ భారతానికి ఎప్పుడూ భాగస్వామి, మార్గదర్శి అని తెలిపారు. 

మన తెలంగాణ 21 Nov 2025 3:00 am

శుక్రవారం రాశి ఫలాలు (21-11-2025)

మేషం మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృషభం చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మిధునం వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. కర్కాటకం_ వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విభేదాలు మానసికంగా చికాకుగా వస్తాయి. సింహం చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్య పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. స్థిరస్తి వివాదాలలో శిరో బాధలు తప్పవు. తుల వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వృశ్చికం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు . ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. మకరం ఉద్యోగులకు పనిఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పనుల్లో ఆటంకాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కుంభం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.  

మన తెలంగాణ 21 Nov 2025 12:10 am

فیکٹ چیک: بیشتر میڈیا اداروں نے کیرلہ کے ہم نام کارڈِیالوجسٹ کی تصویر دہلی دھماکہ کیس کے مشتبہ ڈاکٹرعارف کے گمراہ کن دعوے کے ساتھ کی وائرل

کیرلہ کے کارڈیالوجسٹ ڈاکٹر عارف محمد کی تصویر غلطی سے دہلی دھماکے میں گرفتار میڈیکل طالب علم سے جوڑ کر شیئر کی گئی، جس کے باعث سوشل میڈیا پر گمراہ کن معلومات پھیلتی چلی گئی

తెలుగు పోస్ట్ 21 Nov 2025 12:09 am

Nikhat Zareen |లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా !

Nikhat Zareen | లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా !

ప్రభ న్యూస్ 20 Nov 2025 11:32 pm

TG |పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పణ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తన పూర్తి నివేదికను రాష్ట్ర

ప్రభ న్యూస్ 20 Nov 2025 11:21 pm

రాష్ట్రపతి, గవర్నర్లకు గడువుపై సుప్రీం యూటర్న్‌

న్యూదిల్లీ: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే అంశంలో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నల (ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌)పై అత్యున్నత న్యాయస్థానం సమాధానమిచ్చింది. పెండిరగ్‌ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదని సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే, కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులు […] The post రాష్ట్రపతి, గవర్నర్లకు గడువుపై సుప్రీం యూటర్న్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 11:20 pm

రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలి: ఎంఎల్ఎ రాజాసింగ్

హిందూ ధర్మంపై ఏ మాత్రం అభిమానం లేని రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యల కారణంగా రాజమౌళిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయనపై హిందువులు అంతా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. దేవుడిపై నమ్మకం లేకపోతే వారి పేరుతో సినిమాలు ఎందుకు తీస్తున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘ బాహుబలి’లో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు, వారి పేరుతో సినిమాలు తీసి కోట్లాది రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నారని రాజమౌళిని నిలదీశారు. ‘వారణాసి’ సినిమా ప్రచారం కోసమే ఇలా మాట్లాడారా, లేక నిజంగానే నాస్తికులా అనే విషయంపై రాజమౌళి స్పష్టత ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రాజమౌళి హిందూ దేవుళ్లను కించపరచడం ఇది మొదటిసారి కాదని, గతంలో రాముడు, కృష్ణుడిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని రాజాసింగ్ ఆ వీడియో సందేశంలో గుర్తు చేశారు.

మన తెలంగాణ 20 Nov 2025 11:20 pm

బీహార్‌లో కొలువైన ఎన్డీయే సర్కార్‌

10వ సారి సీఎంగా నితీశ్‌ . మంత్రులుగా 26 మంది ప్రమాణస్వీకారం. బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు. ప్రధాని మోదీ సహా హాజరైన ప్రముఖులు పట్నా: జనతాదళ్‌ (యునైటెడ్‌) అధినేత నితీశ్‌ కుమార్‌ బీహార్‌ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పట్నాలోని గాంధీ మైదా నంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు […] The post బీహార్‌లో కొలువైన ఎన్డీయే సర్కార్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 11:17 pm

WGL |హాస్పిటల్‌లో రోగి బంగారం మాయం..

వరంగల్, (ఆంధ్రప్రభ సిటీబ్యూరో): వరంగల్‌లోని ఆరేపల్లి సమీప రిలీఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న

ప్రభ న్యూస్ 20 Nov 2025 11:16 pm

24 నుంచి రైతన్నా… మీకోసం

పంచసూత్రాలపై వారం రోజుల కార్యక్రమాలు: చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: వ్యవసాయ రంగంలో పెనుమార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసేలా ఈ నెల 24 నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది. 24వ తేదీ నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు. డిసెంబర్‌ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్‌ షాపులు చేపట్టనున్నారు. […] The post 24 నుంచి రైతన్నా… మీకోసం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 11:14 pm

కొనేదెలా… తినేదెలా?

కేక పుట్టిస్తున్న కూరగాయ ధరలు . చికెన్‌ కంటే చిక్కుళ్లే ప్రియం. ఆర్థికభారంతో సామాన్యుల బెంబేలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు పేద, మధ్య తరగతి వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొద్ది రోజులుగా కాయగూరల రేట్లు ఆకాశాన్నంటుతుం డటంతో ఆర్థిక భారం పడుతోంది. ధరలు చూసి మహిళలు బెంబేలెత్తు తున్నారు. రూ.200తో మార్కెట్‌కు వెళితే మూడు రోజులకు సరిపడా కూరగాయలు రావడం లేదని వాపోతున్నారు. వారానికి సరిపడా కూరగాయలు కొనుగోలు చేయాలంటే […] The post కొనేదెలా… తినేదెలా? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 11:13 pm

‘రాజాసాబ్’ తొలి పాట వచ్చేస్తోంది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాజాసాబ్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈ పోస్టర్‌లో స్టైల్, స్వాగ్‌తో ఎంట్రీ ఇచ్చేందుకు రెబల్ సాబ్ సిద్ధమయ్యాడు అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ స్పెషల్ పోస్టర్‌తో చిత్రబృందం ఫస్ట్ సింగిల్ వివరాలను తెలియజేసింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తొలి పాటకు సంబంధించిన అప్‌డేట్ రానున్నట్టు పేర్కొన్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ట్రైలర్‌లో రెండు డిఫరెంట్ షేడ్స్ లో ప్రభాస్ కనిపించిన తీరు రెబల్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్ని మైమరపించింది. టెర్రఫిక్ రాజా సాబ్ క్యారెక్టర్‌తో పాటు వింటేజ్ లుక్ లో ప్రభాస్ వర్సటైల్ గా కనిపించి ఆకట్టుకున్నారు.

మన తెలంగాణ 20 Nov 2025 11:00 pm

రైతుల ప్లాట్లకు సరిహద్దు రాళ్లు

. మూడు నెలల్లో పూర్తి. 15 నుంచి పెగ్‌ మార్కింగ్‌. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు. ప్రభుత్వం కీలక నిర్ణయం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర రాజధాని అమరావతి రైతులు కొంతకాలంగా తమ సమ స్యలు తీరడం లేదని ఆందోళనలు చేస్తున్నారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటే ఏడాదిన్నర అవుతున్నా ఫలితం లేదని ఆవేదన చెందుతు న్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు అధికారులకు మున్సిపల్‌ మంత్రి నారాయణ కీలక […] The post రైతుల ప్లాట్లకు సరిహద్దు రాళ్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 10:55 pm

పెట్టుబడికి సానుకూల వాతావరణం వైపు ముందడుగు!

టి. లక్ష్మీనారాయణ పారిశ్రామిక – ఆర్థిక – ఆధునిక నగరం, రాప్ట్రానికి తలమానికమైన విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025 ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడికి సానుకూల వాతావరణం సృష్టించింది. సదస్సుకు ‘‘హై-వోల్టేజ్‌’’ ప్రచారం లభించింది. తద్వారా, గత ప్రభుత్వ కాలంలో, పారిశ్రామిక రంగంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం నుంచి రాష్ట్రం బయటపడిరదన్న భావన కలుగుతున్నది. ఇది అతి ముఖ్యమైన సానుకూల అంశం. రు.13,25,716 కోట్ల విలువైన 613 అవగాహన ఒప్పందాలు జరిగాయని, వాటి ద్వారా 16,31,188 ఉపాధి […] The post పెట్టుబడికి సానుకూల వాతావరణం వైపు ముందడుగు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 10:52 pm

నితీశ్‌కు పాలన నల్లేరుపై నడకేనా!

పతకమూరు దామోదర్‌ప్రసాద్‌ బీహార్‌ 18 వ శాసనసభ 243 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ప్రధాని మోదీ సారధ్యంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) అంచనాలకు మించి విజయం సాధించింది. ప్రతిపక్ష మహాఘట్బంధన్‌ నేతగా బరిలో నిలిచి హోరాహోరీగా తలపడి ఈసారైనా ముఖ్యమంత్రి కావాలని ఉధృతంగా ప్రచారం సాగించిన రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడి) యువనేత తేజస్వి యాదవ్‌ ఆశలు ఆడియాసలయ్యాయి. ఎన్డీయేను దీటుగా ఢీ కొట్టడానికి కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం, ప్రతి మహిళ ఖాతాలో […] The post నితీశ్‌కు పాలన నల్లేరుపై నడకేనా! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 10:51 pm

బ్యాంకుల ప్రైవేటీకరణ వైపేకేంద్రం మొగ్గు

గోపాలుని రాధాకృష్ణ కేంద్రంలో ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ప్రభుత్వరంగ బ్యాంకులను ఒక పథకం ప్రకారం ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పచెప్పే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉన్నత పదవిలో ఉన్న వారి నియామకాల్లో ప్రైవేటు రంగం నుంచి తీసుకునేలా ఇటీవల ఆదేశాలు జారీ చేయడం కూడా తెలిసిందే. మరోవైపు విలీనాలంటూ ఆర్థికశాఖ మంత్రి భారతీయ రిజర్వుబ్యాంకుతో, సంబంధిత బ్యాంకు అధికారులతో చర్చలు జరపటం చూస్తుంటే త్వరలో బ్యాంకింగ్‌ రంగంలో తీవ్ర […] The post బ్యాంకుల ప్రైవేటీకరణ వైపేకేంద్రం మొగ్గు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 10:50 pm

నోరు జారి నిజం చెప్పిన దోవల్‌

ఎవరైనా నోరు జారొచ్చు. అలా నోరు జారినప్పుడు అసంకల్పితంగానే నిజాలు బయట పెట్టొచ్చు. ఆ నిజం ఇబ్బందికరమైంది అయినప్పుడు ఆ నిజం చెప్పిన వారే తాను ఆ మాట అనలేదని వితండవాదానికి దిగొచ్చు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఇప్పుడు ఇదే సంకట స్థితిలో పడిపోయారు. ఆయన ఎవరి అధీనంలో అయితే జాతీయ భద్రతా సలహాదారుగా పని చేస్తున్నారో వారి నడవడిక ప్రభావం ఆయన మీద కూడా అమితంగానే ఉండొచ్చు. మోదీ ప్రభుత్వానికి దోవల్‌ సలహాదారుగా […] The post నోరు జారి నిజం చెప్పిన దోవల్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 10:49 pm

ప్రపంచ బాక్సింగ్‌లో భారత్‌కు స్వర్ణాల పంట

ఇక్కడ జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, తెలుగుతేజం నిఖత్ జరీన్ పసిడి పతకం సాధించింది. ఈ వరల్డ్‌కప్‌లో నిఖత్‌తో సహా మరో నలుగురు బాక్సర్లు స్వర్ణ పతకాలు సొతం చేసుకున్నారు. గురువారం జరిగిన 51 కిలోల విభాగం ఫైనల్లో నిఖత్ 50 తేడాతో చైనీస్ తైపీకి చెందిన జువాన్ యు గువోను ఓడించింది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన నిఖత్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. కళ్లు చెదిరే పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిఖత్ ధాటికి జువాన్ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది. మరోవైపు చిరస్మరణీయ ఆటతో అలరించిన నిఖత్ తన ఖాతాలో మూడో ప్రపంచకప్ స్వర్ణం జత చేసుకుంది. ఇంతకు ముందు కూడా నిఖత్ రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే స్వర్ణం సాధించి నిఖత్ సత్తా చాటింది. భుజం గాయంతో నిఖత్ ఏడాది పాటు ఆటకు దూరంగా ఉంది. ఈ టోర్నీతోనే మళ్లీ ఆటను ప్రారంభించింది. ఒలింపిక్స్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన నిఖత్ మళ్లీ వరల్డ్‌కప్ టైటిల్‌తో పూర్వవైభవం సాధించడం భారత బాక్సింగ్‌కు శుభపరిణామంగా చెప్పొచ్చు.

మన తెలంగాణ 20 Nov 2025 10:40 pm

HYD |తెలంగాణ ప్రజలు బాగుండాలే..

HYD | తెలంగాణ ప్రజలు బాగుండాలే కొత్తూరు, (ఆంధ్రప్రభ): జహంగీర్ పీర్ దర్గా

ప్రభ న్యూస్ 20 Nov 2025 10:40 pm

మళ్లీ ఆందోళనలతో భగ్గుమన్న నేపాల్

 రెండు నెలల క్రితం చెలరేగిన జెన్‌జడ్ ఆందోళనలు చివరకు అప్పటి ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రుల రాజీనామాకు దారి తీసి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ జెన్‌జడ్ ఆందోళనలు చెలరేగాయి. మాజీ ప్రధాని కేపీ శర్మ మద్దతుదారులు, యువ నిరసన కారుల మధ్య సిమారా పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాల వారు ర్యాలీలు నిర్వహించారు.సాధారణ పరిస్థితులు లేకపోవడంతో గురువారం రాత్రివరకు అధికారులు కర్ఫూ విధించారు. ఈ సందర్భంగా నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కార్కీ ప్రజలంతా రాజకీయంగా రెచ్చగొట్టే సమాచారానికి దూరంగా ఉండాలని , ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం ఉంచాలని పిలుపునిచ్చారు. 

మన తెలంగాణ 20 Nov 2025 10:28 pm

ఐదు కూనలకు జన్మనిచ్చిన చీతా

 భారత సంతతికి చెందిన చీతా ముఖి ఐదు కూనలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో చీతా పిల్లల్ని కనడం ప్రాజెక్టు చీతాకు మైలు రాయివంటిదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం అభివర్ణించారు. భారత్‌లో మొదటగా జన్మించిన స్వదేశీ చీతా ఇప్పుడు తిరిగి పిల్లలను కనే మొదటి భారత చీతాగా రికార్డుకెక్కింది. దేశంలో చీతాల సంతతి క్షీణించుకుపోవడంతో 2022 సెప్టెంబరు 17న భారత్‌లో చీతాలను తిరిగి ప్రవేశ పెట్టారు. 

మన తెలంగాణ 20 Nov 2025 10:26 pm

NZB |మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

బాల్కొండ (ఆంధ్రప్రభ): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో

ప్రభ న్యూస్ 20 Nov 2025 10:13 pm

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଖେସାରି ଲାଲଙ୍କ ବକ୍ତବ୍ୟକୁ ଭୁଲ ଦାବିସହ ସେୟାର କରାଯାଉଛି

ବିହାର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଭାବରେ ଶପଥ ଗ୍ରହଣ କରିଛନ୍ତି ନୀତିଶ କୁମାର । 10 ଥର ପାଇଁ ବିହାରର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଭାବରେ ଶପଥ ଗ୍ରହଣ କରି ରେକର୍ଡ କରିଛନ୍ତି ନୀତିଶ । ଏହା ସହ ସେ ବିହାରର ସବୁଠାରୁ ଦୀର୍ଘକାଳୀନ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ହୋଇଛନ୍ତି । ରାଜ୍ୟପାଳ ଆରିଫ୍ ମହମ୍ମଦ ଖାନ ତାଙ୍କୁ ପଦ ଏବଂ ଗୋପନୀୟତାର ଶପଥ ପାଠ କରାଇଛନ୍ତି । ବିହାର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଭାବରେ ଶପଥ ଗ୍ରହଣ କରିଛନ୍ତି ନୀତିଶ କୁମାର । 10 ଥର ପାଇଁ ବିହାରର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଭାବରେ ଶପଥ ଗ୍ରହଣ କରି ରେକର୍ଡ କରିଛନ୍ତି ନୀତିଶ । ଏହା ସହ ସେ ବିହାରର ସବୁଠାରୁ ଦୀର୍ଘକାଳୀନ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ହୋଇଛନ୍ତି । ରାଜ୍ୟପାଳ ଆରିଫ୍ ମହମ୍ମଦ ଖାନ ତାଙ୍କୁ ପଦ ଏବଂ ଗୋପନୀୟତାର ଶପଥ ପାଠ କରାଇଛନ୍ତି । ସେହପରି ବିଜୟ କୁମାର ଚୌଧୁରୀ, ମଙ୍ଗଲ ପାଣ୍ଡେ, ଦିଲୀପ ଜୟସ୍ବାଲ, ଅଶୋକ ଚୌଧୁରୀ, ଶ୍ରବଣ କୁମାର ଓ ବିଜେନ୍ଦ୍ର ପ୍ରସାଦ ଯାଦବ ବିହାର କ୍ୟାବିନେଟରେ ମନ୍ତ୍ରୀ ପଦ ପାଇଁ ଶପଥ ଗ୍ରହଣ କରିଛନ୍ତି । ପରେ ଲେଶୀ ସିଂ, ମଦନ ସିହ୍ନା, ନୀତିନ ନବୀନ, ରାମ କୃପାଲ ଯାଦବ, ସନ୍ତୋଷ କୁମାର ସୁମନ ଓ ସୁନିଲ କୁମାର, ବିହାର କ୍ୟାବିନେଟରେ ରାଜ୍ୟ ମନ୍ତ୍ରୀ ଭାବେ ଶପଥ ନେଇଛନ୍ତି । ତେବେ HAM(S)କୁ ଗୋଟିଏ ମନ୍ତ୍ରୀପଦ ମଳିବ ବୋଲି ଆଶା କରାଯାଉଥିଲା । HAM(S) ସନ୍ତୋଷ କୁମାର ସୁମନ ବିହାର ମନ୍ତ୍ରୀମଣ୍ଡଳରେ ସାମିଲ ହୋଇଛନ୍ତି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଆରଜେଡି ନେତାଙ୍କୁ ଅହଙ୍କାରୀ ବୋଲି ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ବ୍ରହ୍ମାଙ୍କ ଲେଖନିକୁ ମଧ୍ୟ ନିଜେ ବଦଳାଇ ଦେଇପାରିବ ବୋଲି ଦାବି କରୁଥିବା ବ୍ୟକ୍ତି ଆଜି ନିଜେ ନିର୍ବାଚନ ହାରିଯାଇଛି ବୋଲି ଲେଖିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଆରଜେଡି ନେତା ଖେସାରି ଲାଲ ବ୍ରହ୍ମାଙ୍କ ଲେଖନିକୁ ମଧ୍ୟ ବଦଳାଇଲାରିବେ ବୋଲି କହୁଥିବାଇ ଶୁଣିବାକୁ ମିଳିଛି । ଯାହାର ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି ।  ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ବ୍ରହ୍ମାଙ୍କ ଲେଖନି ବଦଳାଇ ପାରିବେ ବୋଲି ଖେସାରି ଯାଦବ ନିଜପାଇଁ ନୁହେଁ, ଦିନେସ ଲାଲ ଯାଦବଙ୍କୁ ଆକ୍ଷେପ କରି କହିଥିଲେ । ଭାଇରାଲ ଭିଡିଓର ତଦନ୍ତ କରିବାକୁଯାଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଖେସାରି ଲାଲ ଏଭଳି କହିଥିବା କୌଣସି ସୂଚନା ପାଇନଥିଲୁ । ଯଦି ଖେସାରି ନିଜକୁ ଏଭଳି କହିଥାନ୍ତେ ତେବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମ ନିଶ୍ଚିତ ପ୍ରକାଶ କିମ୍ବା ପ୍ରସାରିତ କରିଥାନ୍ତେ । ନଚେତ ପ୍ରତିପକ୍ଷ ପ୍ରତିଦ୍ବନ୍ଦି ତାଙ୍କୁ ନିଶ୍ଚିତ କଟାକ୍ଷ କରିଥାନ୍ତେ । ତେବେ ଉକ୍ତ ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବାର କିଛି ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ରୋହିତ ବାବୁ ନାମକ ଜଣେ ଇନଷ୍ଟାଗ୍ରାମ ୟୁଜର୍ସ ଏକ ଭିଡିଓ ନିଜ ଆକାଉଣ୍ଟ ଅପଲୋଡ କରିଥିବା ବେଳେ ଉକ୍ତ ଭିଡିଓଟିରେ ଭାଇରାଲ ଭିଡିଓର ଅଂଶ ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ଚଳିତ ବର୍ଷ ବିହାର ବିଧାନସଭା ନିର୍ବାଚନ ନିର୍ବାଚନ ର ହୋଇଥିବା ବେଳେ ଏହା ହରିସିଦ୍ଧି ନିର୍ବାଚନ ମଣ୍ଡଳୀର ଘଟଣା ବୋଲି ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । View this post on Instagram A post shared by Rohit_babu_ahir (@rohit_babu_ahir) ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁମାତ୍ରାରେ ମେଳ ଖାଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ କିୱାର୍ଡ ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ଫେସବୁକ ଭିଡିଓ ଅପଲୋଡ଼ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଦବଙ୍ଗ ଷ୍ଟେଜ ସୋ ନାମକ ଏକ ଫେସବୁକ ପେଜ୍ ଉକ୍ତ ଭିଡିଓଟିକୁ ଅପଲୋଡ଼ କରିଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓରେ ଖେସାରିଲାଲ ଭାଷଣ ଦେଇ କହିଛନ୍ତି, ନିର୍ବାଚନ ସମୟରେ ଆମ ଦିନେସ ଭାଇ କହିଥିଲେ: ମତେ ହରାଇ ପାରିବା ଭଳି କୌଣସି ବ୍ୟକ୍ତି ଏପର୍ଯ୍ୟନ୍ତ ଜନ୍ମହିଁ ହୋଇନାହିଁ । ଦିନେସ ଏହା ମଧ୍ୟ କହିଥିଲେ ଯେ, ସିଏ ବ୍ରହ୍ମା ଲେଖିଥିବା ଲେଖନିକୁ ମଧ୍ୟ ଲିଭାଇ ଦେଇପାରିବେ । ଆଉ ଏକ ନାରାବାଜି ହେଉଥିଲା ଯିଏ ରାମଙ୍କୁ ଆଣିବ ଆମେ ତାଙ୍କୁ ଆଣିବୁ । ଆରେ ଭାଇ ତୁମ ଔକାଦ କଣଯେ ତୁମେ ରାମଙ୍କୁ ଆଣିବ । ଉକ୍ତ ଭିଡିଓ ଦେଖି ଏହା ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଭାଇରାଲ ହେଉଥିବା ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ବ୍ରହ୍ମାଙ୍କ ଲେଖନି କୁ ମଧ୍ୟ ବଦଳାଇପାରିବେ ବୋଲି ଖେସାରି ଲାଲ ନିଜ ପାଇଁ ନୁହେଁ ଦିନେସଙ୍କୁ ଆକ୍ଷେପ କରି କହିଥିଲେ । ପ୍ରକୃତରେ, ୨୦୧୯ ଲୋକସଭା ନିର୍ବାଚନ ସମୟରେ ନିରୁଆରେ ଏହି ବକ୍ତବ୍ୟ ପାଇଁ ବହୁଳ ଭାବରେ ଚର୍ଚ୍ଚାରେ ଥିଲେ । ସେସମୟରେ ଏକ ଟିଭି ଚ୍ୟାନେଲ ସହିତ ଏକ ସାକ୍ଷାତକାରରେ ସିଏ କହିଥିଲେ, ମୁଁ ଜଣେ ସ୍ୱାଧୀନ ବ୍ୟକ୍ତି ହୋଇଥିବାରୁ ମୋତେ ପରାସ୍ତ କରିପାରିବା ଭଳି କେହି ଜନ୍ମ ହୋଇନାହାଁନ୍ତି। ମୋର ବିଚାରଧାରା ସ୍ୱାଧୀନ, ମୁଁ କାହାର ଦାସ ନୁହେଁ। ପରେପରେ ରାମଧାରୀ ସିଂହ ଦିନକରଙ୍କ ଏକ କବିତା ପାଠ କରି କହିଥିଲେ, ଯଦି ମୋର ନିଜସ୍ୱ ଚିନ୍ତାଧାରା ଳ ଥାଏ, ତେବେ ମୁଁ ପରମେଶ୍ୱର ଯାହା ଲେଖିଛନ୍ତି ତାହା ମଧ୍ୟ ଲିଭାଇ ପାରିବି। ଖେସାରି ଲାଲ ତାଙ୍କ ଭାଷଣରେ ଏହି ସମାନ ବକ୍ତବ୍ୟକୁ ପୁନରାବୃତ୍ତି କରି ନିରୁଆରେ ଦିନେଶଙ୍କୁ ତାଚ୍ଛଲ୍ୟ କରିଥିଲେ, କିନ୍ତୁ ତାଙ୍କର ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭିଡିଓକୁ ଏଡିଟ କରି ବିଭ୍ରାନ୍ତିକର ଦାବି ସହ ସେୟାର କରାଯାଇଛି । 

తెలుగు పోస్ట్ 20 Nov 2025 10:11 pm