SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
...

బుధవారం రాశి ఫలాలు (18-02-2026)

మేషం ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి. వృషభం ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతాయి. మిధునం ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కర్కాటకం వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. సింహం స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తుల నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. వృశ్చికం గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధన సంబంధ వ్యవహారాలు కలిసివస్తాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు రెట్టించిన ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమౌతాయి. అన్ని వైపుల నుండి అదాయం అందుతుంది. మకరం పాత రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. కుంభం చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వ్యాపారములు మందకొడిగా సాగుతాయి. మీనం ఆప్తులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. గృహమున శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలలో ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.  

మన తెలంగాణ 18 Feb 2026 12:00 am

మెదక్ కలెక్టర్‌కు ఆరునెలల జైలు

కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు జైలుశిక్ష పడింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంటూ హైకోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అనంతరం తీర్పు అమలుకు నాలుగు వారాల పాటు నిలిపివేసింది. అప్పీలు చేసుకునేందుకు కలెక్టర్‌కు నాలుగు వారాల గడువు ఇచ్చింది. 

మన తెలంగాణ 17 Feb 2026 11:46 pm

ఎన్టీఆర్, రుక్మిణి వసంత్ రొమాంటిక్ సాంగ్..

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, స్టార్ హీరో ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్) పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే వచ్చే వారం హీరో హీరోయిన్లు ఎన్టీఆర్, రుక్మిణి వసంత్ కాంబినేషన్‌లో ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణకు మూవీ యూనిట్ ప్లాన్ చేసిందట. జోర్డాన్ లో ఈ సాంగ్ ఘాట్ చేయనున్నారు. భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోర్డాన్‌లో చేస్తున్నారు మేకర్స్. అక్కడ మూడు షెడ్యూల్స్ చిత్రీకరిస్తారట. ఇందులోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ జోర్డాన్ షూటింగ్‌తో ఈ చిత్రానికి సంబంధించిన ఔట్ డోర్ షూటింగ్ పూర్తవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అవుట్‌డోర్‌లో చిత్రీకరించే ఈ జోర్డాన్ షెడ్యూల్ ఆఖరిదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మిగిలిన షూటింగ్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్‌లో చిత్రీకరించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది. 

మన తెలంగాణ 17 Feb 2026 11:39 pm

నూతన ఆవిష్కరణలకు ఎఐ నిబంధనలు చాలు: కేంద్ర మంత్రి జితిన్

న్యూఢిల్లీ: దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ ముఖ్య ఉద్దేశం అతిగా నియంత్రించడం కాదని, బాధ్యతాయుతమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడమేనని, ప్రస్తుతానికి ఉన్న నియంత్రణలు దేశంలో ఆవిష్కరణల మద్దతుకు సరిపోతాయని కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద మంగళవారం వెల్లడించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ న్యూఢిల్లీ సింపోజియం 2026 వద్ద ఆయన ప్రసంగిస్తూ సాంకేతిక రూపాంతర ప్రయోజనాలను ప్రతివారూ పొందాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌అని వివిధ సాంకేతిక ఆవిష్కషరణల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోసహా అనేక అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. జితిన్ ప్రసాద ఎలెక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక , వాణిజ్య, పారిశ్రామిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఎఐకి సంబంధించి విధానపరమైన నిబంధనలను అతిగా నియంత్రించడం కాదని,బాధ్యతాయుతంగా ఆవిష్కరణలకు ప్రోత్సహించడానికి ప్రస్తుత నియంత్రణలు సరిపోతాయన్నారు. 2027 నాటికి ఎఐ, అండ్ క్లౌడ్‌లో 2,50,000 మందికి నైపుణ్యం కల్పించాలన్న లక్షంతో వ్యూహాత్మక సమన్వయంలో ప్రవేశిస్తున్నట్టు ఎడబ్లుఎస్ అండ్ ఇండస్ట్రీ బాడీ నాసాకామ్ వెల్లడించింది. 

మన తెలంగాణ 17 Feb 2026 11:32 pm

‘లైఫ్ సైన్సెస్’ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు

ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌ను ‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి.. కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకే ‘తెలంగాణ నెక్ట్- జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026- 2030) రూపొందించామని మంగళవారం హెచ్‌ఐఐసీలో నిర్వహించిన ‘బయో ఏషియా 2026’ సదస్సులో మంత్రి వివరించారు. ఇప్పటివరకు లైఫ్ సైన్సెస్ రంగంలో సప్లై కోసం మాత్రమే మన వైపు చూసిన ప్రపంచం ప్రస్తుతం ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాల కోసం చూస్తోందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా తెలంగాణను అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఎంఆర్‌ఎన్‌ఏ, జీన్ ఎడిటింగ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో రెడీ టూ వర్క్ ఫోర్స్‌గా ఇక్కడి యువతను తయారు చేస్తున్నామని వివరించారు. సిబిఆర్‌ఇ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ (2025) ప్రకారం, బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, బీజింగ్, టోక్యో లాంటి గ్లోబల్ హబ్‌ల సరసన నిలిచిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అని తెలిపారు. అందుకే... కేవలం ఉత్పత్తి చేయడమే కాకుండా, నేటి అవసరాలకు అనుగుణంగా కొత్త ఔషధాలను కనుగొనే కేంద్రంగానూ హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని అన్నారు. అలాగే.. గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్‌గానూ మార్చేందుకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామని వెల్లడించారు. ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, ఆటోమేషన్ ఇన్ బయోలాజిక్స్ మాన్యుఫాక్చరింగ్, డేటా ఆధారిత ప్రెసిషన్ మెడిసిన్, కంప్యూషనల్ బయాలజీ, బయో మాన్యుఫాక్చరింగ్ 4.o తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.

మన తెలంగాణ 17 Feb 2026 11:31 pm

మోదీపై పోరుకు తరుణమిదే!

. రూపాయితోపాటు మోదీ గ్రాఫ్ పతనం. ఈయూ, అమెరికాతో ఒప్పందాలు భారత్‌కే నష్టం. ఎన్‌డీఏ పాలనలో అప్ప్పులపాలైన దేశం. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో రామకృష్ణ. ఎలాంటి పోరాటానికైనా రైతులు సిద్ధం: వెంకయ్య. సమస్యను గాలికొదిలేసి లడ్డూ రాజకీయం. మత విభజన రాజకీయాలపై పోరాడతాం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – కాకినాడ : ఆరఎసఎస్, బీజేపీ, ప్రాని మోదీకి వ్యతిరేకంగా పోరాడటానికి సరైన తరుణమిదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. దేశంలో […] The post మోదీపై పోరుకు తరుణమిదే! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 11:00 pm

ఇందాపూర్ నెయ్యిపై రగడ

మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం . చైర్మన్ తిరస్కరణ… పోడియం ఎక్కి నినాదాలు. అడుగడుగునా వాయిదాలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నెయ్యి సరఫరా అంశంపై శాసనమండలి మంగళవారం దద్దరిల్లింది. దీనిపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కల్తీ నెయ్యిపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం […] The post ఇందాపూర్ నెయ్యిపై రగడ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 10:52 pm

పని చేయని వారికిజీతాలెందుకు?

శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు విశాలాంధ్ర-సచివాలయం: వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఆఫీసుకు వెళ్లకుండా జీతం అడిగితే ఎలా ఉంటుందో, ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడం కూడా అలాగే ఉంటుందని, ఇలాంటి వారిని వెనక్కి పిలిపించే ‘రైట్ టు రీకాల’ విధానం మన దేశంలో రావాలని అభిప్రా యం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో మీడియా చిట్ చాట్‌లో […] The post పని చేయని వారికిజీతాలెందుకు? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 10:50 pm

సిద్ధార్థరెడ్డి… లొంగిపో

నటి ప్రత్యూష మృతి కేసుపై సుప్రీం తీర్పు న్యూదిల్లీ : రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం… నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది. […] The post సిద్ధార్థరెడ్డి… లొంగిపో appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 10:49 pm

కీలక రంగాల్లో భాగస్వామ్యం

. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ప్రధాని మోదీ చర్చలు. రఫేల్ డీల్ సహా 20 ఒప్పందాలపై సంతకాలు. రక్షణరంగం , ఏఐ టెక్నాలజీ , స్పేస్ టెక్నాలజీ రంగంలో కలిసి పనిచేయాలని నిర్ణయం. కర్నాటకలో హెచ్-125 హెలికాప్టర్ల తయారీ ప్రారంభం ముంబై: భారత్-ఫ్రాన్స్‌ల మధ్య బలమైన స్నేహబంధం ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఎంతో అనిశ్చితి ఉందని, భారత్-ఫ్రాన్స్‌లు దీనికి పరిష్కారం చూపిస్తున్నాయన్నారు. ప్రపంచ శాంతికి కృషి చేస్తామని ప్రధాని మోదీ […] The post కీలక రంగాల్లో భాగస్వామ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 10:47 pm

గజాకు ఐదు బిలియన్ డాలర్ల సాయం

ట్రంప్ వాషింగ్టన్: గజాలో మానవతావాద, పునర్నిర్మాణ యత్నాల కోసం ఐదు బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయం అందించేందుకు ‘శాంతి బోర్డు’లోని సభ్యదేశాలు హామీ ఇచ్చాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. బోర్డు సభ్యులు మొట్టమొదటిసారి గురువారం వాషింగ్టన్‌లో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రకటన చేశారు. ఆ సమావేశంలో సాయంపై ప్రకటన ఉంటుందని ‘ట్రూత’లో పోస్ట్ చేశారు. గజాలో భద్రత, శాంతి కోసం ఏర్పాటు చేసే అంతర్జాతీయ స్థిరీకరణ దళం, స్థానిక పోలీసింగ్ వ్యవస్థ […] The post గజాకు ఐదు బిలియన్ డాలర్ల సాయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 10:44 pm

ప్రపంచ దేశాల అభ్యున్నతికిభారత్ అందిస్తున్న సాయం మాకు కీలకం

ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరెస్న్యూయార్క్: ప్రపంచ శాంతిభద్రతలు, వికాసం సహా అన్ని ఐక్యరాజ్యసమితి విభాగాల్లో భారత్ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తోందని… అంతర్జాతీయ సమాజం అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సహాయం తమకెంతో ముఖ్యమైందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్రను పోషించే అత్యంత సానుకూల ట్రెండ్ నడుస్తోందని ఆయన చెప్పారు. భారత్ నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ – 2026 […] The post ప్రపంచ దేశాల అభ్యున్నతికిభారత్ అందిస్తున్న సాయం మాకు కీలకం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 10:43 pm

పోతూ…పోతూ అగ్గి రాజేసిన యూనస్భారత్ ‘ఏడు రాష్ట్రాల’ ప్రస్తావన

ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేసిన ఆయన తన ప్రభుత్వం మంగళవారం నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తుందని ప్రకటించారు. అయితే, ఈ ప్రసంగంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా భారత్‌ను ఉద్దేశించి చేసినవి ఇప్పుడు దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన ప్రసంగంలో యూనస్ “బంగ్లాదేశ్ ఇకపై విధేయతతో కూడిన విదేశాంగ విధానాన్ని అనుసరించే దేశం కాదు. […] The post పోతూ…పోతూ అగ్గి రాజేసిన యూనస్భారత్ ‘ఏడు రాష్ట్రాల’ ప్రస్తావన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 10:42 pm

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్

న్యూదిల్లీ: టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న ఆయన, అతి త్వరలోనే ‘తొలి ట్రిలియనీర’ హోదాను దక్కించుకోను న్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ముగిసేలోపే మస్క్ ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మస్క్ నికర ఆస్తుల విలువ 850 బిలియన్ డాలర్లకు చేరింది. ఫిబ్రవరి నాటికి 800 బిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి వ్యక్తిగా […] The post ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 10:41 pm

జోర్డాన్‌లో ఎన్టీఆర్`రుక్మిణిపైపాట చిత్రీకరణ

హైదరాబాద్: ప్రశాంత్ నీల్`ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్) పై తాజా కబురు వినిపిస్తోంది. వచ్చే వారం ఎన్టీఆర్, రుక్మిణి వసంత్ మధ్య ఓ పాట చిత్రీకరణకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. జోర్డాన్‌లో ఈ పాట ఘాట్ చేయనున్నారు. భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా ఉంటాయంటున్నారు. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం […] The post జోర్డాన్‌లో ఎన్టీఆర్`రుక్మిణిపైపాట చిత్రీకరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 10:29 pm

నాని పుట్టినరోజు కానుకగా... 'ఆయా షేర్‌' వచ్చేస్తోంది

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన పాన్ వరల్డ్ సినిమా ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ కాన్వాస్ పై నిర్మిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి. తాజాగా మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వేడుకలకు టీమ్ సిద్ధమవుతోంది. అదే రోజున చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ఆయా షేర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గూస్‌బంప్స్ తెప్పించే ఈ ఇంట్రడక్షన్ ట్రాక్‌తో సినిమా ప్రమోషన్స్‌కు ఘనమైన ఆరంభం ఇవ్వబోతున్నారు మేకర్స్. ఈ పాటను వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో చిత్రీకరించారు. నాని మాసీ అవతార్‌లో కనిపించే ఈ సాంగ్ కోసం రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పవర్‌ఫుల్ మాస్ ట్యూన్ అందించారు. సుధన్ మాస్టర్ డైనమిక్ కొరియోగ్రఫీలో ఈ ట్రాక్ విజువల్ వండర్‌గా అలరించబోతోంది. అభిమానులకు ఇది బర్త్‌డే ట్రీట్‌గా మారనుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ది ప్యారడైజ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాల్, స్పానిష్, ఇంగ్లీష్ భాషలలో పాన్-వరల్డ్ మూవీగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

మన తెలంగాణ 17 Feb 2026 10:28 pm

134 సినిమాల పాటలపై ఇళయరాజాకు హక్కులేదు

స్పష్టం చేసిన దిల్లీ హైకోర్టున్యూదిల్లీ: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా `సరిగవ ఆడియో సంస్థతో కొనసాగుతున్న హక్కుల వివాదంపై కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతో ఈ అంశం సినీ, సంగీత వర్గాల్లో చర్చకు దారి తీసింది. తుది తీర్పు వెలువడే వరకు 134 సినిమాలకు చెందిన పాటలను ఇళయరాజా వినియోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. గత సంవత్సరం ‘అగత్యా’ సినిమాలోని ఓ పాట విషయంలో ఇళయరాజా-సరిగమ మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి ఈ వివాదం […] The post 134 సినిమాల పాటలపై ఇళయరాజాకు హక్కులేదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 10:22 pm

కివీస్‌కు ‘సూపర్-8’ బెర్త్ ఖరారు

కెనడాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం చెన్నై: టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్డి నుంచి న్యూజిలాండ్ సూపర్-8 దశలోకి ప్రవేశించింది. మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సూపర్8 బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కివీస్ సునాయాసంగా గెలుపొందింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెనడా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యువరాజ్ […] The post కివీస్‌కు ‘సూపర్-8’ బెర్త్ ఖరారు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 10:18 pm

ప్రజాభవన్ ఎదుట జాగృతి నాయకుల ధర్నా

మహిళలు, వృద్ధులు, వికలాంగులు సహా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు మంగళవారం ప్రజా భవన్ ముట్టడించారు. బేగంపేటలోని ప్రజాభవన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్రజాభవన్‌లో ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్‌కు వినితి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ మహిళలకు రూ.2,500, తులం బంగారం, పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవి ఇచ్చే విధంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చొరవ తీసుకోవాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తుకు ఈ ఎన్నికల్లో సహకారమే తొలిమెట్టని అన్నారు. మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్‌లో హామీలకు నిధులు కేటాయించాలని, లేకుండా సెక్రటేరియేట్, అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో మేము చెప్పినట్లుగానే బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని తెలిపారు. నారాయణ్ పేట్ లో తమకు వైస్ ఛైర్మన్ పదవి రావాల్సి ఉండేదని, కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు దిగి వైస్ చైర్మన్ పదవి రాకుండా చేశారని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, వాటిని అడిగేందుకే ప్రజావాణికి వచ్చామని తెలిపారు. తమ కార్యకర్తలు, విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నెల 26వ తేదీ వరకు వేచి చూస్తామని, తర్వాత అన్ని జిల్లాల్లో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మహిళలను కోటిశ్వరులను చేస్తామని చెప్పి కనీసం వారికి రూ. 2,500 కూడా ఇవ్వడం లేదని అన్నారు.

మన తెలంగాణ 17 Feb 2026 10:16 pm

తొలిబంతికే భారీషాట్ అవసరమా?… ఓ సింగిల్ తీసిచూడు

అభిషేక్‌శర్మకు గవాస్కర్ సలహాన్యూదిల్లీ : టీమిండియా టీ20 ఓపెన్ అభిషేక్ శర్మ బ్యాటింగ్‌లో తడబడుతుండటంపై భారత క్రికెట్ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. అతడికి ఓ విలువైన సూచన చేశాడు. తాను ఎదుర్కొంటున్న తొలి బంతినే బౌండరీ దాటించాలని భారీ షాట్‌కు ప్రయత్నిం చకుండా సింపుల్ షాట్‌తో ఓ సింగిల్ తీయాలని సూచించాడు. అప్పుడు అతడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుం దన్నాడు. ‘అభిషేక్ శర్మకు నేనిచ్చే సలహా ఏంటంటే.. అతడు మొదట సింగిల్ తీయాలి అంతే. అప్పుడు […] The post తొలిబంతికే భారీషాట్ అవసరమా?… ఓ సింగిల్ తీసిచూడు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 10:16 pm

శివుడికి గంజాయి ప్రసాదం..పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు

శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడికి గంజాయిని ప్రసాదంగా సమర్పించినట్లు రీల్స్ చేసిన ముగ్గురు యువకులను చార్మినార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శంషాబాద్‌లోని, ధర్మగిరి దేవాలయంలో శివుడికి గంజాయి సమర్పించినట్లు రీల్స్ చేసిన యువకులు సోషల్ మీడియాలో వీడియోను అప్‌లోడ్ చేశారు. దానిని చూసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ యువకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. సిపి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఫలక్‌నూమా, జంగంమెట్‌కు చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. రీల్స్ చూసిన పోలీసులు చరణ్‌తోపాటు అతడి స్నేహితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు.

మన తెలంగాణ 17 Feb 2026 10:09 pm

బాన్సువాడ లో కారు అద్దాలు పగలగొట్టి..రూ.8 లక్షలు చోరీ

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం ఒక వ్యక్తి కారులో ఉంచిన రూ. 8 లక్షల నగదు చోరీకి గురైంది.మాధవరావు అనే వ్యక్తి నగదును కారులో ఉంచి బాన్సువాడలోని రిలయన్స్ మార్కెట్ వద్ద కారును పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. బాధితుడు షాపింగ్‌కు వెళ్లిన తక్కువ సమయంలోనే దొంగలు సినీ ఫక్కీలో కారు అద్దాలు పగులగొట్టి లోపల ఉన్న నగదు సంచిని ఎత్తుకెళ్లారు. షాపింగ్ ముగించుకుని తిరిగి వచ్చిన మాధవరావు కారు అద్దం పగిలి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా..పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సిసిటివి పుటేజిలో ఓ వ్యక్తి కారు అద్దాలు పగలగొట్టి నగదు బ్యాగ్ ను ఎత్తుకెళ్లడం రికార్డు అయ్యింది. మాధవరావు  ఎస్‌బిఐ (SBI) బ్యాంకు నుండి రూ. 8 లక్షలు విత్ డ్రా చేశాడు. దొంగలు బ్యాంకు నుండి బాధితుడిని వెంబడించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతకటం ప్రారంభించారు.

మన తెలంగాణ 17 Feb 2026 10:03 pm

నేటి నుంచి ఏపీ లో శనగల కొనుగోళ్లు షురూ

15 రోజుల లోపు రైతులకు నగదు చెల్లింపులు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు

ప్రభ న్యూస్ 17 Feb 2026 9:40 pm

ଫ୍ୟାକ ଚେକ୍: ପାକିସ୍ତାନ କ୍ରିକେଟ ବୋର୍ଡ କୁ ପ୍ରଶଂସା କରୁଥିବା ଶଶୀ ଥରୁରଙ୍କ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ଅଟେ

ଟି-୨୦ ବିଶ୍ବକପରେ ପାକିସ୍ତାନକୁ ହରାଇ ଟିମ୍ ଇଣ୍ଡିଆର ବଡ଼ ବିଜୟ । ୬୧ ରନରେ ମ୍ୟାଚ୍ ଜିତିଲା ଟିମ୍ ଇଣ୍ଡିଆ, ୧୭୬ ରନକୁ ପିଛା କରି ୧୧୪ ରନରେ ପାକିସ୍ତାନ ଅଲଆଉଟ୍ । ସବୁ ଆଡ଼େ ଛୁଟିଛି ଟିମ ଇଣ୍ଡିଆକୁ ଶୁଭେଚ୍ଛାର ସୁଅ । କ୍ରିକେଟିୟର ହୁଅନ୍ତୁ କି ରାଜନେତା ସମସ୍ତଙ୍କ ମୁହଁରେ ଟିମ ଇଣ୍ଡିଆର ପ୍ରଶଂସା । ତେବେ ଇତିମଧ୍ୟରେ କଂଗ୍ରେସ ନେତା ତଥା ଏବଂ ତିରୁବନ୍ତପୁରମର ସାଂସଦ ଶଶି ଥରୁରଙ୍କ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଶଶି, ପାକିସ୍ତାନ କ୍ରିକେଟ୍ ବୋର୍ଡର ପ୍ରଶଂସା କରୁଥିବାର ଶୁଣିବାକୁ ମିଳିଛି । । ମୁଁ ଭାବୁଛି ଯେ, ପାକିସ୍ତାନ କିପରି ଖେଳିଲା ତାହା ପ୍ରକୃତରେ ଚମତ୍କାର । ମୁଁ ଜାଣିନାହିଁ ଯେ ସେମାନେ ପଡ଼ିଆରେ କ'ଣ କରିବେ । କିନ୍ତୁ ସେମାନେ କୂଟନୈତିକ ଭାବରେ ଯାହା କଲେ ତାହା ସମ୍ପୂର୍ଣ୍ଣ ଚମତ୍କାର । ଭାରତୀୟ କ୍ରିକେଟ୍ ବୋର୍ଡ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ହାତ ମୁଠାଏ ହୋଇଯାଇଥିଲା । ପାକିସ୍ତାନ ଯାହା କରିଛି, ମୁଁ ଏଥିପାଇଁ ସେମାନଙ୍କୁ ପ୍ରଶଂସା କରିବାକୁ ଚାହୁଁଛି, ଏହା କଳ୍ପନା କରାଯାଇ ପାରିବ ନାହିଁ। ବୋଲି ଶଶି କହୁଥିବାର ଶୁଣିବାକୁ ମିଳୁଛି । ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇ ନାହାଁନ୍ତି ଶଶି ଥରୁର । ଭାଇରାଲ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ହୋଇଥାଇ ପାରେ । ଶଶି ଥରୁରଙ୍କ ମୁହଁରୁ ପାକିସ୍ତାନ କ୍ରିକେଟ ବୋର୍ଡ ପାଇଁ ପ୍ରଶଂସା ଲେଖି ଆମେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ହେଲେ କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମରେ ଏନେଇ କୌଣସି ଖବର ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଶଶି ଦେଖିଥାନ୍ତେ ନିଶ୍ଚିତଭାବେ ଏହା କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଭାଇରାଲ ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ସୋସିଆଲ ମିଡିଆ ଏକ୍ସରେ ପୋଷ୍ଟ ହୋଇଥିବାର ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୧୦ ଫେବୃଆରୀ ୨୦୨୫ରେ ନ୍ୟୁଜ ଏଜେନ୍ସି ଏଏନଆଇ ଉକ୍ତ ଭିଡିଓକୁ ପୋଷ୍ଟ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଭିଡିଓରେ ଶଶି କହିଛନ୍ତି, ମୁଁ ଜଣେ ରାଜନେତା, କିନ୍ତୁ ମୁଁ କ୍ରିକେଟ ଏବଂ କ୍ରୀଡାରେ ରାଜନୀତି ପସନ୍ଦ କରେ ନାହିଁ । ମୁଁ ଭାବୁଛି କ୍ରୀଡା ଏକ ଭିନ୍ନ କ୍ଷେତ୍ର, ଏକ ଭିନ୍ନ ଖେଳ। ରାଜନେତା ମାନେ ତାଙ୍କ ସ୍ଥାନରେ ରହି ରାଜନୀତି କରନ୍ତୁ, କୂଟନୀତିଜ୍ଞମାନେ ତାଙ୍କ ସ୍ଥାନରେ ରହି ତାଙ୍କ କାମ କରନ୍ତୁ ଏବଂ କ୍ରିକେଟ ଖେଳାଳିମାନେ ସେମାନଙ୍କର ଖେଳ ଖେଳନ୍ତୁ। ମୁଁ ଖୁସି ଯେ ଏହି ମ୍ୟାଚ୍ ସହିତ ଅତି କମରେ କ୍ରିକେଟ୍ ଆଗକୁ ବଢ଼ିବ। କିଏ ଜିତିବ, କିଏ ହାରିବ, ତାହା ଅନ୍ୟ କଥା... ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ପରି ପରିଲକ୍ଷିତ ହେଉଥିବାରୁ ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ବ୍ୟକ୍ତିର ଗୋଟିଏ ସମୟର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ହେଲେ ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ଉକ୍ତ ଭିଡିଓର ଅଡିଓ ସମାନ ନଥିଲାକି ଶଶିଙ୍କ ବାର୍ତ୍ତା ଶୈଳୀ ସହ ତାଙ୍କ ଅଡିଓ ମଧ୍ୟ କୌଣସି ତାଳମେଳ ରହୁନଥିଲା । ପରେପରେ ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ଓ ମିଟରରେ ପରୀକ୍ଷା କରିଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓଟି ବହୁମାତ୍ରାରେ ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ରିପୋର୍ଟ ପ୍ରକାଶ ପାଇଥିଲା । ଭାଇରାଲ ଭିଡିଓ ନେଇ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ଶଶି ଥରୁର ଲେଖିଛନ୍ତି, ଏହା ଏକ ଫେକ୍ ଭିଡିଓ ଯାହାକି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ । ଏହା ମୋ ସ୍ୱର ନୁହେଁ କି ମୋ ଭାଷା ମଧ୍ୟ ନୁହେଁ । ସେହିପରି ରେଡ଼ଲିଫ ନାମକ ଏକ ଡିଜିଟାଲ ଗଣମାଧ୍ୟମ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ଭିଡିଓକୁ ସେୟାର କରି ଏହା ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ସୂଚନା ରଖିଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ହୋଇଥାଇପାରେ । ପ୍ରକୃତ ଭିଡିଓରେ ପାକିସ୍ତାନ କ୍ରିକେଟ ବୋର୍ଡକୁ ପ୍ରଶଂସା କରି ନାହାଁନ୍ତି କଂଗ୍ରେସ ନେତା ଶଶି ଥରୁର ।

తెలుగు పోస్ట్ 17 Feb 2026 9:32 pm

‘మరకతమణి 2’ వచ్చేస్తోంది.. ఈసారి డబుల్ కామోడీ, థ్రిల్లర్ గా..

2017లో విడుదలై తన మ్యాజికల్ కాన్సెప్ట్, కామెడీతో ఫాంటసీ కామెడీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం మరకతమణి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ ‘మరకతమణి 2’ అధికారికంగా ప్రారంభమైంది. శివరాత్రి శుభ సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. హీరో కార్తీ క్లాప్ కొట్టగా, హీరో ఆర్య, దర్శకుడు వెంకట్ ప్రభు కెమెరా రోలింగ్, యాక్షన్ అంటూ షూటింగ్ ప్రారంభించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో అనుబంధం వున్న అనేక మంది ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్యాషన్ స్టూడియోస్, దంగల్ టీవీ, ఆర్‌డిసి మీడియా, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, గుడ్ షో బ్యానర్‌లపై సుధన్ సుందరం, మనీష్ సింఘాల్, దుర్గారం చౌదరి, దేవ్, కెవి దురై నిర్మిస్తున్న ఈ చిత్రానికి గత బ్లాక్ బస్టర్ ‘మరకతమణి’కి దర్శకత్వం వహించిన ఎఆర్‌కె శరవణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరకతమణి 2లో ఆది పినిశెట్టి, సత్యరాజ్, ప్రియా భవాని శంకర్, నిక్కీ గల్రానీ పినిశెట్టి, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ, అరుణ్‌రాజా కామరాజ్, మురుగానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరకతమణి 2 మరింత వినోదం, మ్యాజిక్, థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. 

మన తెలంగాణ 17 Feb 2026 9:20 pm

మున్సిపల్ వైస్ చైర్మెన్ వెంకన్న గుప్తా కు ఆత్మీయ సన్మానం

మున్సిపల్ వైస్ చైర్మెన్ వెంకన్న గుప్తా కు ఆత్మీయ సన్మానం మోత్కూరు, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 17 Feb 2026 9:18 pm

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మోత్కూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ తొలి

ప్రభ న్యూస్ 17 Feb 2026 9:16 pm

ఎమ్మెల్యే సామెల్ కి కృతజ్ఞతలు తెల్పిన మున్సిపల్ చైర్మన్

ఎమ్మెల్యే సామెల్ కి కృతజ్ఞతలు తెల్పిన మున్సిపల్ చైర్మన్ మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్

ప్రభ న్యూస్ 17 Feb 2026 9:14 pm

భారత్‌-ఫ్రాన్స్ బంధానికి సరిహద్దుల్లేవు: ప్రధాని మోడీ

ఇరుదేశాల స్నేహం ప్రపంచ స్థిరత్వానికి శక్తి ఇయుతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలక మలుపు ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు భారత్ మా విశ్వసనీయ భాగస్వామి రాఫెల్ టు జలాంతర్గాముల వరకు బంధాన్ని విస్తరిస్తున్నాం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వెల్లడి వివిధ రంగాల్లో 21 ఒప్పందాలపై సంతకాలు కర్నాటకలో ఎయిర్‌బస్ హెచ్125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైన్‌కు వర్చువల్‌గా ప్రారంభం న్యూఢిల్లీ/ముంబయి : ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి తీసుకెళ్లాలని భారత్, ఫ్రాన్స్ నిర్ణయించుకున్నాయి. కీలక రంగాలైన రక్షణ, వాణిజ్యం, క్లిష్టతర ఖనిజాలు సహా తదితర రంగాల్లో మరింత సహకారం అందజేసుకోవాలని అవగాహనకు వచ్చాయి. మంగళవారంనాడు భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ముంబయిలోని లోక్‌భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రోజురోజుకు పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ఫ్రాన్స్ సంబంధాలను ‘ప్రపంచ స్థిరత్వానికి శక్తి’ గా మోడీ, మేక్రాన్ అభివర్ణించారు. ఇరువురు నాయకులు ద్వైపాక్షిక చర్చల అనంతరం కర్నాటకలోని వేమాగల్‌లో ఎయిర్‌బస్ హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. కీలకమైన ఖనిజాలు, రక్షణ, విస్తృత సాంకేతిక పరిజ్ఞానం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్యం వంటి రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు మొత్తం 21 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలలో ఒకటి రక్షణ సహకారంపై, మరొకటి భారతదేశంలో హామర్ క్షిపణులను ఉత్పత్తి చేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఫ్రెంచ్ రక్షణ దిగ్గజం సఫ్రాన్ మధ్య జాయింట్ వెంచర్‌గా ఉన్నాయి. భారత సైన్యం మరియు ఫ్రెంచ్ ల్యాండ్ ఫోర్సెస్ సంస్థలలో అధికారులను పరస్పరం మోహరించడానికి ప్రత్యేక ఒప్పందం కుదిరింది. అనిశ్చితిలో ఈ బంధం ప్రపంచానికి శక్తినిస్తుంది: మోడీ ‘ప్రపంచం అనిశ్చితిని ఎదుర్కొంటోంది. అటువంటి వాతావరణంలో భారతదేశం- ఫ్రాన్స్ భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి ఒక శక్తినిస్తుంది. మేము ఫ్రాన్స్ యొక్క నైపుణ్యం మరియు భారతదేశం యొక్క స్థాయిని మిళితం చేస్తున్నాము’ అని మోడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు దేశాలు ‘చాలా ప్రత్యేకమైన సంబంధాన్ని‘ పంచుకుంటున్నాయని, భారతదేశానికి అత్యంత పురాతన వ్యూహాత్మక భాగస్వాములలో ఫ్రాన్స్ ఒకటి అని ప్రధాని కితాబునిచ్చారు. హెచ్-125 హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ గురించి కూడా మోడీ ప్రస్తావించారు. ఇది ఇరుదేశాల నడము పరస్పర విశ్వాసానికి ఇది మరో అద్భుతమైన ఉదాహరణ అన్నారు. ఎవరెస్ట్ పర్వతం యొక్క ఎత్తులకు ఎగరగలిగే సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని ఏకైక హెలికాప్టర్‌ను భారతదేశం మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా తయారు చేస్తాయని చెప్పడానికి గర్విస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. వాటిని ఇక్కడి నుంచే ప్రపంచం మొత్తానికి కూడా ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. తద్వారా భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి సరిహద్దులు లేవని, అది లోతైన మహాసముద్రాల నుండి అత్యంత ఎత్తయిన పర్వత పంక్తుల వరకు చేరుకోగలదని మోడీ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి పరిణామాలు, ఉగ్రవాదంపై ప్రతిన... రష్యా-ఉక్రెయిన్ వివాదం, పశ్చిమ ఆసియా, ఇండో-పసిఫిక్ పరిస్థితులను ప్రస్తావిస్తూ... భారత్, ఫ్రాన్స్ రెండూ ప్రజాస్వామ్య విలువలను, చట్ట పాలనను, బహుళ ధ్రువ ప్రపంచాన్ని విశ్వసిస్తాయని ప్రధాని అన్నారు. ప్రపంచ స్థాయి సంస్థల్లో సంస్కరణలతోనే సవాళ్లకు పరిష్కారాలను కనుగొనగలమని తాము భావిస్తున్నట్లు పరోక్షంగా ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి మోడీ చెప్పారు. ఉక్రెయిన్, పశ్చిమ ఆసియా సహా అన్ని ప్రాంతంలో శాంతి కోసం చేసే ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తూనే ఉంటామన్నారు. భారతదేశం-ఇయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఒక ‘మలుపు’గా అభివర్ణించారు. పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఇరు దేశాల ప్రజలు. కంపెనీలు రెట్టింపు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉండటానికి ఒప్పందంపై సంతకం చేశామని, ఈ కార్యక్రమాలన్నీ పరస్పర వాణిజ్యం, పెట్టుబడులు మరియు చలనశీలతకు కొత్త ప్రేరణను ఇస్తాయని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది భారత్, ఫ్రాన్స్ దేశాల సంక్షేమానికి రోడ్ మ్యాప్ అని అన్నారు. ఈ సందర్భంగా ‘ఇండియాఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’ను కూడా ప్రారంభించారు. భారత్ మా విశ్వసనీయ భాగస్వామి: మేక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ.. భారత్ తమ అత్యంత విశ్వసనీయ భాగస్వాములలో ఒకటి అని అన్నారు. ‘రాఫెల్ జెట్ల నుండి జలాంతర్గాముల వరకు రక్షణ సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాలు చట్టబద్ధమైన పాలనను గట్టిగా విశ్వసిస్తాయని, ఇది గత కొన్ని సంవత్సరాలుగా నిరూపించబడిందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, ఫ్రాన్స్ సహకారాన్ని కొనసాగిస్తాయని మేక్రాన్ అన్నారు. విమానం దిగగానే జాగింగ్.. 26/11 మృతులకు నివాళి.. మంగళవారం ఉదయాన్నే ముంబై విమానాశ్రయంలో దిగిన మేక్రాన్ దంపతులు ఇక్కడి ప్రఖ్యాత మెరైన్ డ్రైవ్‌లోని తీరప్రాంత రోడ్డు జాగింగ్ చేశారు. అంనతరం అక్కడి నుంచి తాజ్ ప్యాలెస్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ ముంబై ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముంబై పోసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు విమానాశ్రయంలో మేక్రాన్‌కు మహారాష్ట్ర గవర్నర్ దేవవ్రత్, సిఎం ఫడ్నవీస్ ఆహ్వానం పలికారు.

మన తెలంగాణ 17 Feb 2026 9:13 pm

Councillor |కడియం శ్రీహరి ఆశీస్సులతో ముందుకు..

Councillor | కడియం శ్రీహరి ఆశీస్సులతో ముందుకు.. ఎమ్మెల్యేను కలిసిన 18వ వార్డు

ప్రభ న్యూస్ 17 Feb 2026 9:02 pm

ఎప్‌స్టీన్‌తో హర్‌దీప్ పూరికి 62 ఈమెయిళ్లు, 14 సమావేశాలు

న్యూఢిల్లీ: అమెరికా లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌తో కేంద్రమంత్రి హర్‌దీప్ పూరీకి మధ్య 2014-2017 మధ్య కాలంలో 62 ఈమెయిళ్లుతో సంప్రదింపులు, అలాగే 14 సమావేశాలు జరిగాయని, కాంగ్రెస్ ఆరోపించింది. దీని నుంచి బీజేపీ నేత స్వచ్ఛతతో బయట పడాలని కాంగ్రెస్ మంగళవారం డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంలో ఇరుక్కున్న హర్‌దీప్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే ఇప్పటికే పూరీ విపక్షం లేవదీసిన ఆరోపణలను కొట్టి పారేసిన సంగతి తెలిసిందే .20142017 మధ్యకాలంలో పూరీకి, ఎప్‌స్టీన్‌కు మధ్య 62 ఈమెయిళ్లు సాగాయని, ఇదిలా ఉండగా, 2014లో జూన్ 5,6,8,9 , సెప్టెంబర్ 19, 23, 24 , అక్టోబర్ 9,10 తేదీల్లో జరిగిన సమావేశాల్లో ఏం చర్చించారని కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ విభాగం అధినేత పవన్ ఖేరా ప్రశ్నించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు 2014లో స్వీకరించాక 2017 వరకు ఉన్న కాలంలో ఎప్‌స్టీన్ పూరికి 30 ఈమెయిళ్లు పంపగా,పూరీ ఎప్‌స్టీన్‌కు 32 ఈమెయిళ్లు పంపారని ఆరోపించారు. 2014 జూన్‌లో హర్‌దీప్ పూరి ఏ హోదాలో ఉన్నారు ? ఏ సామర్థంతో ఎప్‌స్టీన్‌ను పూరీ కలుసుకున్నారని ప్రశ్నించారు. ఇటీవల ఒక ఇంటర్వూలో పూరీ అనేక అబద్దాలు చెప్పారని ఉదహరించారు. సామాన్య పౌరునిగా హర్‌దీప్ పూరీ ఎందుకు ప్రభుత్వ విధానాలను ఎప్‌స్టీన్‌తో ఎందుకు పంచుకున్నారని పవన్‌ఖేరా ప్రశ్నించారు. ఏఐ సమ్మిట్‌లో బిల్‌గేట్స్ పాల్గొనే విషయం సందిగ్ధంలో ఉండడంపై కూడా పవన్ ఖేరా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

మన తెలంగాణ 17 Feb 2026 8:59 pm

Brs |మళ్ళీ కారే రావాలి.. కెసిఆర్ సారే రావాలి..

Brs | మళ్ళీ కారే రావాలి.. కెసిఆర్ సారే రావాలి.. ఘనంగా బిఆర్

ప్రభ న్యూస్ 17 Feb 2026 8:59 pm

Celebrations |సాయి అనాధాశ్రమంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు..

Celebrations |సాయి అనాధాశ్రమంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు.. Celebrations | భీమారం, ఆంధ్ర

ప్రభ న్యూస్ 17 Feb 2026 8:55 pm

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై స్టే

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడమే ఈ ఎన్నిక వాయిదా కు కారణంగా తెలుస్తోంది. తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేశారని యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటి షన్ దాఖలు చేశారు. యాదగిరిని గురువారం తమ ముందు హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే ఇబ్రహీంపట్నం కౌన్సిల్‌లో ఆసక్తిక ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. బిఆర్‌ఎస్‌కి చెందిన టేకుల సుదర్శన్ రెడ్డిని 15 మంది కౌన్సిలర్లు చైర్మన్‌గా ఎన్నుకున్నా రు. వైస్ చైర్మన్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. ఈ క్రమంలో కిడ్నాప్ అయ్యారని భావించిన కౌన్సిలర్ యాదగిరి ఎన్నిక ప్రక్రియ ముగిసిన వెంటనే అనూహ్యం గా కౌన్సిల్ హాల్లో ప్రత్యక్షమయ్యారు. సరిగ్గా చైర్మన్ పేరును అధికారికంగా ప్రకటించాల్సిన సమయంలో హైకోర్టు స్టే ఉత్తర్వులు అందడంతో అధి కారులు ఇబ్రహీంపట్నం ఎన్నికను నిలిపివేశారు. స్టే కారణంగా బిఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు.

మన తెలంగాణ 17 Feb 2026 8:53 pm

Distribution |లార్డ్ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ

Distribution | లార్డ్ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ Distribution | భీమారం, ,ఆంధ్ర

ప్రభ న్యూస్ 17 Feb 2026 8:50 pm

స్మిమ్మింగ్ పూల్ లో పడి వైద్య విద్యార్థి మృతి

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్మిమ్మింగ్ పూల్ లో పడి వైద్య విద్యార్థి మృతి చెందాడు. మరణించిన విద్యార్థి పేరు మోహన్ (20). ఇతను ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందినవాడు. మోహన్ అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. మోహన్ తన మరో నలుగురు స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టడానికి గార్లదిన్నెలోని ఒక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్‌కు వెళ్ళాడు. ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పూల్‌లో లోతు ఎక్కువగా ఉన్న చోటికి వెళ్లి నీట మునిగిపోయాడు. తోటి స్నేహితులు గమనించి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజనాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి స్విమ్మింగ్ పూల్ వద్ద భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 17 Feb 2026 8:50 pm

donor |అల్పాహారం కొరకు నగదు అందజేత

donor | అల్పాహారం కొరకు నగదు అందజేత donor | వేంసూరు,ఆంధ్రప్రభ: పది

ప్రభ న్యూస్ 17 Feb 2026 8:41 pm

Birthday |ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Birthday | ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీపేదల

ప్రభ న్యూస్ 17 Feb 2026 8:34 pm

డ్రగ్స్‌పై దండయాత్ర

150 హాట్‌స్పాట్ ప్రాంతాలపై నిరంతర నిఘా నిరంతరం అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్ 1972 The post డ్రగ్స్‌పై దండయాత్ర appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 8:33 pm

సిఎం రేవంత్ కుట్ర పన్ని బీఆర్‌ఎస్‌ని అవమానపరిచారు: ఎంపి వద్దిరాజు రవిచంద్ర

సిఎం రేవంత్ కుట్ర పన్ని ఒక దుర్బుద్ధితో బీఆర్‌ఎస్ పార్టీని అవమానపరిచారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మంగళవారం దేవరుప్పుల మండలకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితతో కలిసి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తొర్రురు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడుగురు అభ్యర్థులు గెలిస్తే బీఆర్‌ఎస్ తొమ్మిది మంది అభ్యర్థులు గెలిచారని, ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని దుర్మార్గమైన ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు బయటపడ్డాయని, ఎక్స్‌ఆఫీషియో ఓటు ఎమ్మెల్యేకు ఉన్నా ఎంపీ కడియం కావ్యకు లేదని, వరంగల్ లో ఓటు నమోదు చేసుకుందని, కానీ సిఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా తొర్రురు మున్సిపాలిటీ ఎలాగైనా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని కడియం కావ్యను ఇక్కడికి రప్పించారన్నారు. ఒక దుర్బుద్ధితో బీఆర్‌ఎస్ పార్టీని అవమాన పరచిందని, కానీ వాస్తవంగా గెలిచింది బీఆర్‌ఎస్ పార్టీనేనని, ఎందుకంటే ఒక్కరూ కూడా దయాకర్ రావు మాటకు కట్టుబడి ఉండి బీఆర్‌ఎస్ పార్టీని వీడకుండా కార్యకర్తలందరూ పోరాడారన్నారు. కడియం కావ్య వరంగల్ లో ఆమెకు ఉన్న ఓటు తొర్రూలో ఎలా చెల్లుతుందో కోర్టు ద్వారానే తెలుసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకుని డ్రా చేసి గెలుచుకున్నారు. కడియం కావ్య గెలిచిన తరువాత జీడబ్లూఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరయ్యారని, ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరులో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం అన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. తొర్రూరులో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నిక్కచ్చిగా ఉండడం మన మొదటి విజయం అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితం బుద్ధి చెప్తామన్నారు. తొర్రూరులో నిజంగా పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్‌ఎస్ పార్టీ గెలిచిందని, తొర్రూరులో గెలవాలని రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి కుట్రలు జరిపారాన్నరు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బీఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, మాజీ జీసీసీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయక్, పాలకుర్తి మాజీ జెడ్పిటిసి శ్రీనివాసరావు, మండల బీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు తీగల దయాకర్, చింత రవి, మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాంసింగ్, యూత్ అధ్యక్షుడు నవీన్, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మన తెలంగాణ 17 Feb 2026 8:30 pm

Collector |ఆర్గాన్ మిర్చి ఆరోగ్యానికి మంచిది…

Collector | ఆర్గాన్ మిర్చి ఆరోగ్యానికి మంచిది… Collector | బూర్గంపాడు,ఆంధ్రప్రభ: ఆరోగ్యానికి

ప్రభ న్యూస్ 17 Feb 2026 8:29 pm

NTR Varsity :   త్వరలో పబ్లిక్​ హైల్త్​ కోర్స్ Andhra Prabha News​

NTR Varsity : త్వరలో పబ్లిక్​ హైల్త్​ కోర్స్ Andhra Prabha News​

ప్రభ న్యూస్ 17 Feb 2026 8:27 pm

Anger |విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం

Anger | విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం ప్రధానోపాధ్యాయుడికి

ప్రభ న్యూస్ 17 Feb 2026 8:24 pm

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల ఆలయం

ఏడుపాయల వన దుర్గాభవాని ఆలయం మహాశివరాత్రి జాతర వేడుకల సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. మెదక్ జిల్లా నాగుసానిపల్లిలో వెలసిన ఈ చారిత్రక, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మూడవ రోజు మంగళవారం లక్షలాది మంది భక్తుల రాకతో జనసంద్రంగా మారింది. జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తి నినాదాలతో మార్మోగిపోయాయి. వేకువజామున ప్రత్యేక పూజలు : మూడవ రోజు మంగళవారం వేడుకలు వేకువజామునే ప్రారంభమయ్యాయి. అర్చకులు అమ్మవారికి మహాభిషేకాలు, అర్చనలు నిర్వహించి పూలు, పండ్లతో విశేషంగా అలంకరించారు. దివ్యరూపంలో దర్శనమిచ్చిన వన దుర్గ భవాని అమ్మవారిని చూసేందుకు భక్తులు బారులు తీరారు. దర్శనాన్ని సక్రమంగా నిర్వహించేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మంజీరా తీరం పుణ్యస్నానాలు : మంజీరా నది తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి వన దుర్గ భవాని అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. సంతానం కోసం దంపతులు ఆలయం సమీపంలోని సంతాన గుండంలో పవిత్ర స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓడిబియ్యం సమర్పణలు, కుంకుమార్చనలు భక్తి వాతావరణాన్ని మరింత గంభీరంగా మార్చాయి. డప్పుల మోత తో బోనాల సందడి : డప్పుచప్పుళ్ల మోతల మధ్య బోనాల ఉత్సాహం జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు నెత్తిమీద బోనాలు ఎత్తుకుని శివసత్తుల పునకాలు, పోతరాజుల నృత్యాల మధ్య అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం డప్పుల శబ్దాలతో మార్మోగిపోయింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేవాదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత బస్సులు నడిపించి భక్తులను సురక్షితంగా జాతర ప్రాంగణానికి చేర్చారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, జాతర ప్రత్యేక అధికారి చంద్రశేఖర్, ఈఓ వీరేశం తదితర అధికారులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నాయి.

మన తెలంగాణ 17 Feb 2026 8:24 pm

టోలిచౌకిలో 23 విదేశీయుల అరెస్టు

హైదరాబాద్: టోలిచౌకి గోల్కొండ డివిజన్ పోలీసులు సోమవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పారమౌంట్ కాలనీ, హకీంపేట కుంట ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేశారు. గోల్కొండ డిసిపి చంద్రమోహన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వీసా గడువు ముగిసినా నగరంలో ఉంటున్న 23మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 250 మంది పోలీసు సిబ్బందితో కాలనీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో 10 సెర్చ్ పార్టీలు, 7 కట్ ఆఫ్ పార్టీలు, 5 లిఫ్టింగ్ పార్టీలు , రెండు హోల్డింగ్ పాయింట్లు పాల్గొన్నాయి. ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ హైదరాబాద్ సహాయంతో నిర్వహించిన ఈ తనిఖీల్లో, వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న వివిధ దేశాలకు చెందిన 23 మంది విదేశీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న 9 గ్యాస్ సిలిండర్లు, 53 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నగర శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని డిసిపి చంద్రమోహన్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మన తెలంగాణ 17 Feb 2026 8:21 pm

Clofast |బయో ఏషియా 2026లో క్వాడ్రిక్ సంస్థ సంచలనం

Clofast | బయో ఏషియా 2026లో క్వాడ్రిక్ సంస్థ సంచలనం Clofast |

ప్రభ న్యూస్ 17 Feb 2026 8:18 pm

మంత్రి కారుపై రాళ్లతో దాడి

 ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలను నిర్వహించి, ఎన్నికల ఫలితాలను ప్రకటించగా గెలుపును స్వీకరించాల్సిన నేతలు అధికారం కొరకు అప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహారించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగబద్దంగా ప్రజాస్వామ్య విలువలతో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోగా, అధికారం కోసం ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా నేతలు వ్యవహారించడం పట్ల ఆగ్రహాం వ్యక్తమవుతోంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికల నిర్వహాణలో మంగళవారం క్యాతనపల్లి మున్సిపాలిటి అధికారం చేజిక్కుంచుకునే ప్రయత్నంలో క్యాతన్‌పల్లి ప్రాంతంలో మంగళవారం యుద్దభూమిని తలపించింది. క్యాతన్‌పల్లి మున్సిపాలిటిలో 22 వార్డులు ఉండగా బిఆర్‌ఎస్ 10, సిపిఐ 4, కాంగ్రెస్ 7 వార్డులు, ఒక్కరు స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. ఇక్కడ చైర్మన్ కావాలంటే 12 వార్డు సభ్యులు ఉన్న చైర్మెన్ పదవి దక్కుతుంది. కాగా ఇక్కడ బిఆర్‌ఎస్, సిపిఐ పొత్తు ఉండడంతో ఇరువురికి కలిపి 14 వార్డులు ఉన్నాయి. దీంతో బిఆర్‌ఎస్ కు చైర్మెన్ పదవి అనివార్యం అనుకున్న నేపధ్య ంలో ఇక్కడ రెండు రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ చైర్మెన్ పదవి కొరకు అనేక ప్రయత్నాలు చేపట్టినట్లు తెలుస్తుండగా బిఆర్‌ఎస్, సిపిఐ మాత్రం ఒక్కతాటిపై ఉండడంతో ఇక్కడ సామ, దాన, దండోపాయ విధానాలకు తెరతీశారనే వాదనలు వినవస్తున్నాయి. సోమవారం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక ఉన్నప్పటికీ కోరం లేక పోవడంతో వాయిదా వేసి మంగళవారం నిర్వహించారు. వందలాది మంది పోలీసుల బందోబస్తు మద్య ఎవరికి అనుమతులు ఇవ్వకుండా పకడ్బందీగా అధికారులు ప్రణాళిక చేపట్టారు. ఈ నేపద్యంలో బిఆర్‌ఎస్, సిపిఐ లకు చెందిన వార్డు సభ్యులను కార్యాలయం వరకు తీసుకుని వెళ్లేందుకు ఇతరులకు అనుమతులు ఇవ్వక పోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు సిపి ఆదేశాల మేరకు వాహనాల డ్రైవర్ల తో వార్డు సభ్యులను కార్యాలయానికి పంపించారు. ఎన్నికల నిబంధనల మేరకు రెండు వందల మీటర్ల దూరంలోను అందరిని ఆపి వేయడంతో అక్కడే కాంగ్రేస్, బిఆర్‌ఎస్, సిపిఐ శ్రేణులు ఉండి పోయారు. ఈ నేపద్యంలో ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా అక్కడ యుద్దభూమిని తలపించింది. పోలీసులు లాఠీచార్జీ చేయడంతో బిఆర్‌ఎస్ శ్రేణులు సైతం ఎదురు దాడికి దిగారు. దీంతో పోలీసుల లాఠీ చార్జిలో పలువురు గాయపడ్డారు. అలాగే కానిస్టేబుల్ రాకేష్, కాంగ్రేస్ నాయకులు జావేద్ కూడా ఘర్షణ వాతావరణంలో తీవ్రంగా గాయపడ్డారు, కానిస్టేబుల్ రాకేష్, జావేద్ లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి వివేకానంద, పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ కార్యాలయానికి ఓటు వేసేందుకు చేరుకున్నారు. అధికారులు, 22 మంది వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక విషయమై లోపల ఇరు వర్గాల మధ్య జరిగిన వాదోపవాదాలతో ఘర్షణ వాతావరణం తలెత్తడంతో చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు మందమర్రి తహాసిల్దార్ సతీష్ ప్రకటించడంతో కాంగ్రెస్ సభ్యులు, మంత్రి వెళ్తున్న సమయంలో మంత్రి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో కారు స్వల్పంగా ధ్వసంమైంది. మెజారీటీ ఉన్నప్పటికీ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికలను నిర్వహించకుండా అధికారులు కాంగ్రెస్ పార్టీకి వత్తసు పలుకుతున్నారని బిఆర్‌ఎస్, సిపిఐ వార్డు సభ్యులు కార్యాలయం బయటకు రాకుండా ఆందోళనకు దిగారు. సిపిఐ కి చెందిన వార్డు సభ్యులు తమను కావాలని రెచ్చగొట్టి బయటకు వస్తే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, దానిని వదిలి వేసి కోరం ఉండి మెజారిటీ ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికలను వాయిదా వేయడం ఎంత వరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 17 Feb 2026 8:18 pm

ఎఐ సమ్మిట్‌కు బిల్‌గేట్స్ హాజరుపై సందిగ్ధత..

న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ ఢిల్లీలో జరుగుతున్న ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు హాజరవుతారో లేదో సందిగ్ధత నెలకొంది. ఆయన సదస్సుకు హాజరు కారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా,ఆయన ఫౌండేషన్ అధికార ప్రతినిధి మాత్రం దీనిని ఖండిస్తున్నారు. ఆయన సదస్సులో ప్రసంగిస్తారని చెబుతున్నారు. ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రసంగించే టెక్ దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు, విధాన రూపకర్తలు, సంస్థాపకులు,సాంకేతిక నిపుణులు జాబితాలోంచి బిల్‌గేట్స్ పేరు మొదట్లో కనిపించగా, మంగళవారం సమ్మిట్ వెబ్‌సైట్ లో ఆయన పేరు కనిపించలేదు. బిల్‌గేట్స్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి మాత్రం షెడ్యూల్ ప్రకారం సమ్మిట్‌లో ఫిబ్రవరి 19న 11.50 గంటలకు బిల్‌గేట్స్ ప్రసంగిస్తారని వెల్లడించారు. ఈ సందిగ్ధానికి ప్రధాన కారణం ఒకటి తెలుస్తోంది. అమెరికా కోర్టు ఇటీవల విడుదల చేసిన జెఫ్రీ ఎప్సీన్ పత్రాలల్లో బిల్‌గేట్స్ పేరు ఉండటం అంతర్జాతీయంగా దుమారం రేపింది. లైంగిక నేరగాడైన ఎప్సీన్‌తో గేట్స్‌కు ఉన్న పాత సంబంధాల నేపథ్యంలలో భారత్ ఆయనకు అధికారిక వేదికను కల్పించడంపై విమర్శలు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలు అసంగతమని గేట్స్ అధికార ప్రతినిధి చెబుతున్నారు. 

మన తెలంగాణ 17 Feb 2026 8:15 pm

suicide |సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగిన వెంకన్న..

suicide | సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగిన వెంకన్న.. suicide

ప్రభ న్యూస్ 17 Feb 2026 8:14 pm

మావోయిస్టు కమిటీ సభ్యుడు లొంగుబాటు

 నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు జిల్లా ఎస్పీ ఎదుట మంగళవారం లొంగిపోయాడు. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన తాటి ముఖ అలియాస్ చూట్తే లొంగిపోయినట్లు ఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలుసుకుని జనజీవన స్రవంతిలో తాను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని లొంగిపోయాడని తెలిపారు. జనవరి నుండి ఇప్పటివరకు 359 మంది మావోయిస్టు సభ్యులు వివిధ హోదాలలో జనజీవన స్రవంతిలో కలిసి తమ జీవితాలను పున ప్రారంభించి పునరావాస సౌకర్యాలను పొందారని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసు శాఖ ప్రకటించిన సరెండర్ పాలసీ అనుకూలంగా ఆపరేషన్ చేయూత ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, దీనిలో భాగంగా ఇతను జిల్లా పోలీసుల ముందు లొంగిపోయాడని తెలిపారు. మిగిలిన మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోవాలని, శాంతియుత జీవనం గడపాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.మంగళవారం లొంగిపోయిన తాటి ముఖకు ప్రస్తుత సాయంగా 25 వేల రూ ఇవ్వడం జరిగిందని, మిగతా నగదు ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతాలో చెక్కు రూపంలో జమ చేస్తామని ఎస్పీ తెలిపారు.

మన తెలంగాణ 17 Feb 2026 8:13 pm

గుర్తు తెలియని వాహనం ఢీ…

గుర్తు తెలియని వాహనం ఢీ… వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా

ప్రభ న్యూస్ 17 Feb 2026 8:11 pm

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటన

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఎన్నికల సంఘం మార్చి నెల మధ్యలో షెడ్యూల్ విడుదల చేయనుంది. ఏప్రిల్ మాసంలో ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుందని ఎన్నికల సంఘం అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో ఆయా రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి ముగియనుంది. ఎన్నికల నిర్వహణ సన్నాహాల కోసం ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. ఎన్నిల సంసిద్ధతను పరిశీలించారు. పశ్చిమ బెంగాల్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు 8 దశల్లో నిర్వహించారు. అస్సాంలో రెండు దశలు, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేశారు. 

మన తెలంగాణ 17 Feb 2026 8:10 pm

Festivals |ఘనంగా శ్రీభవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

Festivals | ఘనంగా శ్రీభవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు Festivals | మర్రిగూడ,ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 17 Feb 2026 8:08 pm

బంగ్లాదేశ్ ప్రధానిగా రెహమాన్ ప్రమాణ స్వీకారం

 బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా తారిఖ్ రెహమాన్(60) ప్రమాణ స్వీకారం చేశారు. 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇక్కడ తాత్కాలిక ప్రభుత్వ పాలనకు తెరపడినట్లయింది. సాంప్రదాయానికి భిన్నంగా బంగభవన్‌కు బదులు జతియా సంసద్ సౌత్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెహమాన్ చేత అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ప్రమాణం చేయించారు. రెహమాన్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా, దివంగత అధ్యక్షుడు జియాఉర్ రెహమాన్‌ల కుమారుడు. ప్రమాణ స్వీకారానికి ముందు రెహమాన్‌ను బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బిఎన్‌పి) ఎంపిలు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత కూడా అధ్యక్షుడు షాబుద్దీన్ ప్రమాణం చేయించారు. రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పొరుగు దేశాలైన శ్రీలంక, భారత్‌తో పాటు పాక్ నుంచి పలువురు అతిథులుగా హాజరయ్యారు. భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరయ్యారు. మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 2024లో కుప్పకూలిన తర్వాత ఈ నెల 12న తిరిగి ఎన్నికలు నిర్వహించారు. 297 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిఎన్‌పి 209 స్థానాలు గెలుచుకుని తిరుగులేని మెజారిటీ సాధించింది. ఒకప్పటి దాని మిత్రపక్షంమైన జమాతే ఇస్లామీ 68 సీట్లు దక్కించుకుని తర్వాత స్థానంలో నిలిచింది. హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీని దేశం నుంచి బహిష్కరించారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రెహమాన్‌కు వివిధ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు వెల్లడించారు. ఇదిలావుండగా 35 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్‌కు పురుషుడు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కాలం మొత్తం ఖలీదా జియా, హసీనాలే ప్రధాని పదవిలో ఉన్నారు. యూనస్ నోట మళ్లీ అదే మాట... బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడిగా పదవి నుంచి దిగిపోయే క్రమంలో మహ్మద్ యూనస్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. సోమవారంనాడు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో భారత ఈశాన్య రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్‌ను గురించి మరోసారి ప్రస్తావించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం అయ్యేందుకు బంగ్లాదేశ్‌కు విశాల సముద్రంతో భౌగోళిక సరిహద్దుగా ఉండడమే కాకుండా నేపాల్, భూటాన్ సహా సెవెనె సిస్టర్స్‌తో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామార్థాన్ని కలిగి ఉందని వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 17 Feb 2026 8:06 pm

వాష్‌రూమ్‌లో సీక్రెట్ వీడియో తీసి బ్లాక్‌మెయిల్.. నటి ఫిర్యాదు

బెంగళూరు: మహిళా క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా కోరమంగళ ఇండోర్ స్టేడియంలో ఈవెంట్‌కు వెళ్లిన తనకు వాష్‌రూమ్‌లో కొందరు సీక్రెట్ వీడియో తీసి బెదిరిస్తున్నారని కన్నడ టీవీ నటి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు డిమాండ్ చేసిన డబ్బు చెల్లించకపోతే ఆన్‌లైన్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది. కోరమంగళ ఇండోర్‌స్టేడియంలో మూడు రోజుల ఈవెంట్‌కు ఆమె వెళ్లింది. ఫిబ్రవరి 7న ఈవెంట్ రెండోరోజు స్టేడియం లోని మహిళల రెస్ట్‌రూమ్‌ను తాను వినియోగించుకోగా, తనకు తెలియకుండా ఎవరో సీక్రెట్‌గా అశ్లీల , అసభ్యకర వీడియో చిత్రీకరించారనని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన స్నేహితుని ఇన్‌స్టాగ్రామ్‌కు పంపించి డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోల ఆధారాలతో పెన్‌డ్రైవ్‌లో ఫిర్యాదు పంపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 13న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఉపయోగించి వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

మన తెలంగాణ 17 Feb 2026 8:04 pm

పేట చైర్ పర్సన్ దంపతులను సన్మానించిన సర్పంచ్…

పేట చైర్ పర్సన్ దంపతులను సన్మానించిన సర్పంచ్… ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట

ప్రభ న్యూస్ 17 Feb 2026 8:04 pm

గ్రామ పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదల

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు పంచాయతీలకు రూ.256 కోట్ల నిధులు విడుదల చేశారు. పంచాయతీలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు విడతలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 17 Feb 2026 8:02 pm

ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం

రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నాం 3 గంటలకు మంత్రిమండలి సమావేశమై కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రులు చర్చించనున్నట్టుగా తెలిసింది. అలాగే, జీహెచ్‌ఎంసి, ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

మన తెలంగాణ 17 Feb 2026 8:00 pm

సహజ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో మొదటి స్థానం

ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌లో అత్యధిక నమోదు4.07 లక్షల రైతులు నమోదు… 2.72 లక్షల హెక్టార్లలో సాగు

తెలుగు పోస్ట్ 17 Feb 2026 7:20 pm

ఉత్తరాంధ్ర ఇలవేల్పు జాతరకు ఘన ఏర్పాట్లు

అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ విశాలాంధ్ర – రాజాం : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో జరుగనున్న 100వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను రాజాం ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ శ్రద్ధగా పరిశీలించారు.జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాలు, రహదారులు, తాగునీటి సదుపాయం, పారిశుధ్య ఏర్పాట్లు, విద్యుత్ వెలుగులు తదితర అంశాలను ఆయన సమీక్షించారు. అదేవిధంగా వినోద కార్యక్రమాల […] The post ఉత్తరాంధ్ర ఇలవేల్పు జాతరకు ఘన ఏర్పాట్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Feb 2026 7:15 pm

POCSO COURT |మూడేళ్ల కఠిన కారాగార శిక్ష..

POCSO COURT | మూడేళ్ల కఠిన కారాగార శిక్ష.. POCSO COURT |

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:56 pm

Birthday |ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

Birthday | ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు Birthday | పరకాల,ఆంధ్రప్రభ: తెలంగాణ

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:56 pm

iBomma Ravi granted Bail with Conditions

iBomma Ravi has been accused in piracy issues of Telugu cinema and multiple cases have been registered against him. The Hyderabad cops nabbed him after a long hunt and he has been in jail from the past few weeks. The court asked to handover the passport of iBomma Ravi and he was asked not to […] The post iBomma Ravi granted Bail with Conditions appeared first on Telugu360 .

తెలుగు 360 17 Feb 2026 6:56 pm

Paddy prohibited వరికి ఆకస్మిక ఉరి Andhra Prabha SPL Story

Paddy prohibited వరికి ఆకస్మిక ఉరి Andhra Prabha SPL Story అర్థంతర

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:46 pm

Tools |రాయితీ పై రోటవేటర్లు, ట్రాక్టర్ పనిముట్లు

Tools | రాయితీ పై రోటవేటర్లు, ట్రాక్టర్ పనిముట్లు Tools | వేంసూరు,ఆంధ్రప్రభ;

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:42 pm

sportsmen |ప్రతిభ చూపారు.. హాట్స్ ఆఫ్..

sportsmen | ప్రతిభ చూపారు.. హాట్స్ ఆఫ్.. sportsmen | గుంటూరు, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:40 pm

Honor |మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన మాజీ చైర్మన్ దంపతులు

Honor | మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన మాజీ చైర్మన్ దంపతులు Honor

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:37 pm

Albendazole |విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

Albendazole | విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ Albendazole | శావల్యాపురం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:37 pm

Dr. A. Siri |జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం.

Dr. A. Siri | జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. Dr. A.

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:33 pm

voltage |పాల రంగంలో నూతన దిశ…

voltage | పాల రంగంలో నూతన దిశ… voltage | ఓబుల దేవర

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:30 pm

Anemia |ఆరోగ్య ప‌థంలో ప‌య‌నించాలి..

Anemia | ఆరోగ్య ప‌థంలో ప‌య‌నించాలి.. Anemia | పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:25 pm

ఏఐ సమ్మిట్.. సందర్శకులకు మంత్రి క్షమాపణలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతో సరైన సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. భారీ క్యూలైన్లు, జనం రద్దీతో సదస్సు లోపలికి వెళ్లడం చాలా ఆలస్యం కావడంతో సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కేంద్ర ఐటీ అండ్‌ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం అతిధులకు క్షమాపణలు చెప్పారు. సదస్సు సజావుగా సాగేందుకు నిరంతరం నిర్వహణ బృందం పనిచేస్తోందని మంత్రి తెలియజేశారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు వార్‌రూమ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. “ప్రపంచం లోనే ఇది భారీ సదస్సు. దీనికి స్పందన అసాధారణం. ఈమేరకు ఉత్తేజం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు నిర్వహణ సానుకూలంగా ఉండేలా చూస్తున్నాం. నిన్న ఎవరైనా ఎలాంటి సమస్యలు ఎదురై ఉన్నా తాము క్షమాపణలు చెబుతున్నాం”అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.ఈ సమ్మిట్‌పై ఆసక్తితో ఈరోజు 70,000 మంది హాజరయ్యారు. సందర్శకులు, గౌరవ అతిధులు, ప్రదర్శకులు వీరందరిలో ఉత్తేజం కనిపిస్తోందని మంత్రి పేర్కొన్నారు.ఎవరైనా తమ అభిప్రాయాలను తమతో పంచుకోవచ్చని, ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగాఉందన్నారు. సదస్సులో పాల్గొనడం వ్యక్తిగత ఎంపిక ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో కొంతమంది సాంకేతిక దిగ్గజాలు పాల్గొనకపోవడంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ పాల్గొనడం లేదా పాల్గొనకపోవడం అనేది వారి వ్యక్తిగత ఎంపికపై ఆధారపడి ఉంటుందని వివరించారు.ఎన్‌విడియా సిఇఒ జెన్సెన్ హుయాంగ్ వంటి ప్రముఖులు సదస్సుకు హాజరు కాలేదు. అవాంఛనీయ కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నానని హుయాంగ్ తెలియజేశారని,తనకు బదులు సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను పంపించారని మంత్రి వివరించారు. భారత కంపెనీలతో ఎన్‌విడియా కూడా కలిసి పనిచేస్తోందని ఎఐ మౌలిక సౌకర్యాల కోసం కొంతవరకు భారీ పెట్టుబడులు పెట్టిందని చెప్పారు.

మన తెలంగాణ 17 Feb 2026 6:24 pm

T20 World Cup : టోర్నీ నుంచి ఆస్ట్రేలియా అవుట్

ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజీకి చేరకుండానే టోర్నీ నుంచితప్పుకుంది

తెలుగు పోస్ట్ 17 Feb 2026 6:23 pm

Jai Kisan |క్షేత్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ అధికారి…

Jai Kisan | క్షేత్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ అధికారి… Jai Kisan |

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:20 pm

WindPower |కరువు నేలల్లో ‘వెలుగుల పంట’కు శ్రీకారం

WindPower | కరువు నేలల్లో ‘వెలుగుల పంట’కు శ్రీకారం WindPower | రాయలసీమలో

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:19 pm

Chocolates |పాలల్లో గంజాయి చాక్లెట్లు …

Chocolates | పాలల్లో గంజాయి చాక్లెట్లు … Chocolates | హైదరాబాద్,ఆంధ్ర ప్రభ:

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:17 pm

సూపర్‌ 8కి దూసుకెళ్లిన జింబాబ్వే.. ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్

టీ20 వరల్డ్ కప్‌: టీ20 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా జట్టు ఇంటిదారి పట్టింది. పసికూన బింబాబ్వే జట్టు దెబ్బ కొట్టడంతో.. ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఆసీస్ ఒక విజయాన్ని మాత్రమే సాధించింది. మరోవైపు, రెండు మ్యాచ్ లు గెలిచిన జింబాబ్వే జట్టు నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం తన మూడో మ్యాచ్ లో ఐర్లాండ్‌ తో తలపడాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేశారు. ఇరుజట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో 5 పాయింట్లకు చేరుకున్న జింబాబ్వే సూపర్‌ 8కి క్వాలిఫై అయింది. ఇప్పటికే మూడు విజయాలతో శ్రీలంక జట్టు సూపర్‌ 8కి చేరుకుంది. దీంతో లీగ్ దశలోనే ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

మన తెలంగాణ 17 Feb 2026 6:11 pm

Congress : జీవన్ రెడ్డికి బాసటగా ఎవరూ నిలవరా? పెదవి విప్పరా?

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే సమయం ఎంతో దగ్గరగా లేదు

తెలుగు పోస్ట్ 17 Feb 2026 6:07 pm

150 Hotspot |డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు క‌నిపిస్తే కాల్ 1972..

150 Hotspot | డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు క‌నిపిస్తే కాల్ 1972.. 150 Hotspot

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:04 pm

Amaravathi RRR   అవుట‌ర్‌…టెర్రర్‌  AndhraPrabha SPL  Story

Amaravathi RRR అవుట‌ర్‌…టెర్రర్‌ AndhraPrabha SPL Story ఓఆర్ఆర్ భూ పేచీ 250

ప్రభ న్యూస్ 17 Feb 2026 6:00 pm

3175cr |రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వలే..

3175cr | రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వలే.. మక్తల్ , ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Feb 2026 5:59 pm

ఐబొమ్మ రవికి బెయిల్‌..

హైదరాబాద్‌: సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. మంగళవారం రవికి పలు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది రాష్ట్ర హైకోర్టు. ప్రతిరోజూ సీసీఎస్‌ ఎదుట హాజరుకావాలని, దేశం విడిచి వెళ్లొద్దని.. పాస్‌పోర్ట్‌ను కోర్టులో సరెండర్‌ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే,ఇంటర్నెట్‌ను వాడాలనుకుంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. కాగా, సినిమాల పైరసీ కేసులో హైదరాబాద్ పోలీసులు..2025 నవంబరులో ఐబొమ్మ రవిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చి కస్టడీలోకి తీసుకుని విచారించారు. తర్వాత ఐబొమ్మ వెబ్ సైట్ ను డిలీట్ చేయించారు. ప్రస్తుతం జైలులో రవికి బెయిల్ రావడంతో బయటకు రానున్నారు.

మన తెలంగాణ 17 Feb 2026 5:58 pm

Bail |ఐ బొమ్మ రవికి కోర్టు బెయిల్ …

Bail | ఐ బొమ్మ రవికి కోర్టు బెయిల్ … Bail |

ప్రభ న్యూస్ 17 Feb 2026 5:56 pm

30 years |చంద్రబాబు చరిష్మ‌తోనే బిల్ గేట్స్ రాక..

30 years | చంద్రబాబు చరిష్మ‌తోనే బిల్ గేట్స్ రాక.. 30 years

ప్రభ న్యూస్ 17 Feb 2026 5:56 pm

Nagabandham: Virat Karnna Becomes Talk Of Industry

Virat Karrna, who made his debut with Peddhakapu in a rugged, rustic avatar, is set to surprise with a strikingly different role in his second outing, Nagabandham. Directed by Abhishek Nama, the film has turned into a defining opportunity for the young actor, and he appears to have seized it with complete conviction. Virat delivers […] The post Nagabandham: Virat Karnna Becomes Talk Of Industry appeared first on Telugu360 .

తెలుగు 360 17 Feb 2026 5:47 pm

పెన్షనర్ కార్డ్ మోసం… రిటైర్డ్ బ్యాంకర్‌కు ₹20 లక్షల దెబ్బ

నకిలీ క్రెడిట్ కార్డ్ ఆఫర్‌తో వలనాలుగు ఖాతాల నుంచి ఏడు లావాదేవీలు

తెలుగు పోస్ట్ 17 Feb 2026 5:41 pm

Revanth Reddy : రోడ్డుపై చెత్త కనిపిస్తే సస్పెండ్ చేస్తా : రేవంత్ వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖపై సమీక్ష చేశారు

తెలుగు పోస్ట్ 17 Feb 2026 5:37 pm