మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
` భారీగా దాఖలు చేసిన అభ్యర్థులు సాయంత్రం క్యూలో ఉన్న వారికి అనుమతి హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆఖరి రోజు పెద్ద …
` కౌశిక్ రెడ్డి పిటిషన్ ఆధారంగా క్రాస్ ఎగ్జామిన్ ` సమయం కోరిన బీజేపీ నేత మహేశ్వరెడ్డి ` 18న విచారణకు హాజరు కావాలని గడువు హైదరాబాద్(జనంసాక్షి): …
వనదేవతల సన్నిధిలో డీజీపీ ప్రత్యేక పూజలు
` మేడారం జాతరలో మొక్కులు చెల్లించుకున్న శివధర్రెరడ్డి హైదారాబాద్(జనంసాక్షి): మేడారంలోని అడవి తల్లులు సమ్మక్క`సారలమ్మల మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కతమైంది. భక్తజనసందోహం పోటెత్తిన వేళ.. క్షేత్రస్థాయిలో …
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం
` కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది ` దేశంలో భూసంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకష్ణారావు ` ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య ఉండాలని …
పోలీసులకు కౌశిక్రెడ్డి క్షమాపణలు
` ఉద్దేశపూర్వకంగా అనలేదని వెల్లడి కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క`సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులపై భారత రాష్ట్రసమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. …
హార్వర్డ్ వర్సిటీలో సీఎం రేవంత్ వారం రోజుల సర్టిఫికెట్ కోర్సు పూర్తి
` సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని పొందిన ముఖ్యమంత్రి హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లోఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ …
తెలంగాణ నీళ్లను ఏపీకి తీసుకువెళ్లే కుట్ర
` పథకం ప్రకారమే నల్లమలసాగర్కు సీఎం రేవంత్రెడ్డి సహకరిస్తున్నారు: హరీశ్రావు హైదరాబాద్(జనంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం రేవంత్రెడ్డి దోస్తీ కట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నడని బీఆరఎస్ …
` పోలవరం`నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించాం ` తెలంగాణ నీటి ప్రయోజనాలపై రాజీపడబోం ` హరీష్రావు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి ` పదేళ్లలో సాగునీటి రంగాన్ని …
నందినగర్లోనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తాజాగా నోటీసులు జారీ చేసిన సిట్ ఆదివారం మ. 3గంటలకు అందుబాటులో ఉండాలని ఆదేశం ఎర్రవల్లి ఫాంహౌస్లో విచారించాలని గతంలో కోరిన బిఆర్ఎస్ అధినేత ఎలక్ట్రానిక్ వస్తువుల సాయంతో విచారించాల్సి ఉన్నందున ఎర్రవల్లిలో సాధ్యం కాదని తేల్చిన సిట్ నందినగర్ ఇంటి గోడకు నోటీసులు అతికించిన అధికారులు కెసిఆర్ సిబ్బందికి సమాచారం మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ను ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నాం మూడు గంటలకు హైదరాబాద్లోని నందినగర్(ఆయన నివాసం)లోనే విచారిస్తామని సిట్ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మరోసారి నోటీసులు అందించేందుకు నందినగర్లో ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు వాటిని అంటించారు. వారింట్లో పనిచేసే సిబ్బందికి నోటీసుల సమాచారం తెలియజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని సిట్(ప్రత్యేక దర్యాప్తు) బృందం విచారణ అధికారి ఏసిపి వెంటగిరి కెసిఆర్కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది. ఈ క్రమంలో విచారణకు శుక్రవారం రాలేనని, తాను మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో పార్టీ పరంగా బిజీగా ఉన్నానంటూ సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే తనను హైదరాబాద్లోని తన నివాసంతో కాకుండా ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్లో విచారించాలని కోరారు. అయితే కెసిఆర్ విజ్ఞప్తిని సిట్ బృందం శుక్రవారం న్యాయ సలహా తీసుకున్న అనంతరం తిరస్కరించింది. దీంతో న్యాయవాదులతో చర్చించిన సిట్ అధికారులు సిఆర్పిసి 160 ప్రకారం కెసిఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చారు. కెసిఆర్ రిప్లైని పరిగణలోకి తీసుకుని కెసిఆర్ వయస్సు తోపాటు చట్టం నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్లోని నందినగర్లో విచారణ చేయనున్నట్లు తాజా ఇచ్చిన నోటీసుల్లో తెలిపారు. దీంతో పాటు విచారణలో భాగమయిన పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎర్రవెల్లిలో విచారించేందుకు వీలుపడదని అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు. విచారణ స్థలాన్ని మార్చాలని కోరిన కెసిఆర్ విజ్ఞప్తి మేరకు ఆయన వయస్సు, కేసు చట్టపరిధిని పరిగణలోకి తీసుకుని హైదరాబాద్లోని నివాసంలో విచారిస్తామని సిట్ అధికారులు నోటీసుల్లో తేల్చిచెప్పారు. ఈ మేరకు ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో మధ్యాహ్నాం మూడు గంటలకు విచారణకు సిద్దంగా ఉండాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
చివరి పంచ్ ఎవరిదో?.. నేడు భారత్, కివీస్ ఐదో టి20
తిరువనంతపురం: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం ఐదో, చివరి టి20 మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరిగే ఈ ఆఖరి పోరులో విజయం సాధించాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. టీమిండియా ఇప్పటికే 31తో సిరీస్ను సొంతం చేసుకుంది. ఇక కిందటి మ్యాచ్లో గెలిచిన న్యూజిలాండ్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉంది. భారత్ మాత్రం కిందటిసారి ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని తహతహలాడుతోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం. సంజు ఈసారైనా.. వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తున్న స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ కనీసం చివరి మ్యాచ్లోనైనా తన బ్యాట్కు పనిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో కలిపి మొత్తం 50 పరుగులు కూడా సాధించలేక పోయాడు. దీన్ని బట్టి సంజు బ్యాటింగ్ వైఫల్యం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈసారి విఫలమైతే అతనికి రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు సంపాదించడం చాలా కష్టమనేచెప్పాలి. ఇక కిందటి మ్యాచ్లో జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ఈసారి ఆడతాడా లేదా అనేది తేలలేదు. అతను బరిలోకి దిగితే భారత బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారుతోంది. విశాఖలో ఇషాన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మరోవైపు యువ సంచలనం అభిషేక్ శర్మ విశాఖలో డకౌట్ కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ సిరీస్లో అభిషేక్ ఇలా ఔట్ కావడం రెండోసారి కావడం గమనార్హం. ఆఖరి మ్యాచ్లో అతను తన బ్యాట్కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ చెలరేగితే కివీస్ బౌలర్లకు మరోసారి కష్టాలు ఖాయం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుగైన బ్యాటింగ్ను కనబరచక తప్పదు. కిందటి మ్యాచ్లో సూర్యకుమార్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. ఈసారి అతను జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. శివమ్ దూబె ఫామ్లో ఉండడం భారత్కు సానుకూల అంశంగా చెప్పొచ్చు. విశాఖలో దూబె విధ్వంసక బ్యాటింగ్తో అలరించాడు. ఈసారి కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. హార్దిక్ పాండ్య రూపంలో మరో అగ్రశ్రేణి ఆల్రౌండర్ ఉండనే ఉన్నాడు. అర్ష్దీప్, బుమ్రా, వరుణ్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్లో భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఆత్మవిశ్వాసంతో కివీస్ కిందటి మ్యాచ్లో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ చివరి టి20కి ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి సిరీస్ను ముగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ సమతూకంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో గెలుపు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.
నెలసరి పరిశుభ్రత ప్రాథమిక హక్కు
విద్యా సంస్థల్లో శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఇవ్వాలి టాయిలెట్లు, ఇతర సౌకర్యాల కల్పనలో నిర్లక్షం వద్దు తల్లిదండ్రులు, టీచర్ల మౌనం వల్ల విద్యకు దూరమవుతున్న విద్యార్థినులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ : పాఠశాలల్లో విద్యార్థినులకు ప్రత్యేక టాయిలెట్లు, నెలసరి పరిశుభ్రత ఉత్పత్తుల వంటి మౌలిక ఉత్పత్తులు కల్పించకపోవడంతో వారికి విద్యను దూరం చేస్తున్నారని, వాటిని పొందడం వారి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం విద్యార్థినుల ప్రాథమిక హక్కులైన విద్య, సమానత్వం, ఆరోగ్యం, గౌరవం, గోప్యత, జీవించే హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని అత్యున్నత న్యాయస్థానం దుయ్యబట్టింది. ఈ విషయంలో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై జస్టిస్ జెబి పార్దివాలా తీర్పు వెల్లడించారు. విద్యాహక్కు కీలకమైనదని, ఇది ఇతర మానవహక్కులు వినియోగించుకునే వీలు కల్పిస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం గౌరవంగా జీవించే హక్కు, విసృ్తత చట్రంలో భాగం అని గమనించాలన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఆక్సో- బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్ కిన్ లను అన్ని పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా అందించేలా చూసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్నిపాఠశాలలు స్పేర్ ఇన్నర్ వేర్, స్పేర్ యూనిఫాంలు, డిస్పోజబుల్ బ్యాగ్ లు వంటి ముఖ్యమైన వస్తువులతో కూడిన కిట్ లను నిల్వచేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అంతే కాదు, నెలసరి పరిశుభ్రత, ఆ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై బాలికలకు అవగాహన కార్యక్రమాలను కూడా కల్పించాలని కోర్టు ఆదేశించింది. నెలసరి పరిశుభ్రత సౌకర్యాలు లేకపోవడం వల్ల స్కూళ్లకు వచ్చే విద్యార్థినుల సంఖ్య పై ప్రభావం పడుతోందని, గౌరవం, గోప్యతకు సంబంధించిన ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తమ ఆదేశాలను పాటించాలని ఆదేశించారు. నెలసరి పరిశుభ్రత హక్కును దయాదాక్షిణ్యంగా చూడవద్దని సూచించింది. దివ్యాంగులకు కూడా ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ విషయంలో మౌనం వహించడం వల్ల బాలికలలో చాలామంది విద్యకు దూరమవుతున్నారని ధర్మాసనం పేర్కొంది. తప్పని సరి పరిస్థితుల్లో స్కూల్ కు గైర్హాజర్ అవుతున్న ప్రతి బాలికకు మేము చెప్పేది ఒకటే... అది మీ తప్పుకాదు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారిస్తూ, ప్రతిబాలికకు సురక్షితమైన, గౌరవ ప్రదమైన, విద్యా వాతావరణం కల్పించడం రాష్ట్రాల రాజ్యాంగ బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది.
దానం ‘ఫిరాయింపు’పై హోరాహోరీ వాదన
అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించిన స్పీకర్ దానం పార్టీ మారలేదని గట్టిగా వాదించిన ఆయన తరపు న్యాయవాదులు కాంగ్రెస్ టిక్కెట్టుపై లోక్సభకు పోటీచేశారని వివరించిన పాడికౌశిక్ లాయర్లు విచారణ వచ్చేనెల 18కి వాయిదా మన తెలంగాణ/హైదరాబాద్ః బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్న ఆరోపణలతో దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట పిటిషనర్, కౌంటర్ పిటిషనర్ల న్యాయవాదులు హోరా-హోరిగా వాదనలు వినిపించారు. కేసును స్పీకర్ ప్రసాద్ కుమార్ వచ్చే నెల 18కి వాయిదా వేశారు. శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే దానం నాగందర్పై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణ చేపట్టారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాదులు దానం నాగేందర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. తాను పార్టీ ఫిరాయించలేదని, బిఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని దానం సమాధానమిచ్చారు. పార్టీ మారినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను, ఇంకా తాను కాంగ్రెలో ఉన్నానంటూ బహిరంగంగా చెప్పిన పత్రికల వార్తలను, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ను న్యాయవాదులు చూపించారు. పార్టీ ఫిరాయించినట్లు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తను పార్టీ మారినట్లు బిఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నదని దానం చెప్పారు. పాడిపై ప్రశ్నల పరంపర. . పిటిషనర్, బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని దానం నాగేందర్ తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించినట్లు ఎవరు చెప్పారు?, కేసు ఎందుకు వేశారు.?, మీ క్లయింట్కు సంబంధించిన పార్టీ శాసనసభాపక్షం అకౌంట్లోకి ప్రతి నెలా తన జీతం నుంచి డబ్బులు పడుతున్నాయి కదా అని ప్రశ్నించారు. 2023 సంవత్సరంలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం, ఆ తర్వాత 2024లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి లోక్సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని ఆరోపించారు. పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన ‘బి-ఫామ్’ను, ఇంకా ఎన్ని ఓట్లు లభించాయో వంటి పక్కా ఆధారాలను సమర్పిస్తానని కౌశిక్ రెడ్డి సమాధానంగా అన్నారు. ఇదిలాఉండగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్ శాసనసభ్యత్వం రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున న్యాయవాది హాజరయ్యారు. తన క్లయింట్ మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున స్వయంగా హాజరుకాలేకపోయారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం వచ్చే నెల 20వ తేదీలోగా విచారణకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దానం పార్టీ ఫిరాయించారనడానికి తమ వద్ద ఉన్న ఆధారాల ప్రతులను న్యాయవాది స్పీకర్ ప్రసాద్ కుమార్కు అందజేశారు. దీంతో స్పీకర్ కేసును వచ్చే నెల 18కి వాయిదా వేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ రోజున విచారణకు హాజరవుతారు.
ఎప్సెట్లో ఇన్స్టంట్ రిజల్ట్
పరీక్ష పూర్తయిన వెంటనే మార్కులు డిస్ప్లే తుది ‘కీ’ అనంతరం వాస్తవ మార్కుల వెల్లడి ఎప్సెట్, పిజిఇసెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం ప్రయోగాత్మకంగా అమలు ఫిబ్రవరి 19 నుంచి ఎప్సెట్ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 4వ తేదీ తుది గడువు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజిఎప్సెట్(ఎప్సెట్)లో ఈసారి నూతన విధానం ప్రవేశపెట్టనున్నారు. కంప్యూటర్ బేస్ట్ టెస్ట్(సిబిటి) విధానంలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షలో పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థుల మార్కులు తెలుసుకునే విధానం అమలు చేయాలని ఇఎపిసెట్, పిజిఇసెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే అప్పటికప్పుడే తాత్కాలిక ర్యాంకులు వెల్లడికానున్నాయి. టిజిఎప్సెట్, టిజిపిజిఇసెట్లో ప్రయోగాత్మక అమలుకు నిర్ణయించారు. ఈ విధానం వల్ల ప్రశ్నలకు ప్రాథమిక కీ ఆధారంగా సబ్జెక్టుల వారీగా విద్యార్థులు తమ మార్కులు తెలుసుకుని తమ ర్యాంకుపై ఓ అంచనాకు వస్తారు. తర్వాత ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించి తుది కీ ఖరారు చేసిన అనంతరం వాస్తవ మార్కులు ఇస్తారు.అలాగే రూ.10 వేల ఆలస్య రుసుంతో పరీక్షకు రెండు రోజుల ముందు వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మొబైల్ ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇఎపిసెట్, పిజిఇసెట్ నిర్వహణకు సంబంధించి జెఎన్టియుహెచ్లో శుక్రవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్, సెట్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయా సెట్ల షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి వేరువేరుగా ప్రకటించింది. ఈ సమావేశంలో జెఎన్టియుహెచ్ వైస్ ఛాన్స్లర్ కిషన్రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఎస్కె మహమూద్, ఇ.పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఎప్సెట్ కన్వీనర్ విజయ్కుమార్రెడ్డి, పిజిఇసెట్ కన్వీనర్ రాజేష్కుమార్ సహా పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 4న ఎప్సెట్ నోటిఫికేషన్ ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజిఎప్సెట్(ఎప్సెట్)కు ఫిబ్రవరి 4వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి 19వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఏప్రిల్ 4 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు. గతంలో నిర్వహించిన మాదిరిగానే ఈసారి కూడా అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలతో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఎప్సెట్లో భాగంగా తొలి రెండు రోజులు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తారు, మే 9వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులపాటు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలను నిర్వహించనున్నారు. మే 4,5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇఎపిసెట్కు ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల నుంచి 100 శాతం సిలబస్ తీసుకోవాలని సెట్ కమిటీ నిర్ణయించింది. షుగర్ ఉన్న విద్యార్థులకు సెంటర్లో తినుబండారాలు ఎప్సెట్ పరీక్షలో ఈసారి షుగర్ ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. మధుమేహం(షుగర్) ఉన్నవారు పరీక్షా కేంద్రాల్లో ఇబ్బంది పడకుండా ముందుగానే తాము షుగర్ బాధితులం తెలియజేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు హెల్ప్లైన్కు తమకు షుగర్ ఉన్నట్లు సమాచారం అందజేయాలి. వారికి పండ్లు, బిస్కట్లు, చాక్లెట్లు పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. వీరితోపాటు ఎక్కువ సమయం చదువుకుని సరిగ్గా తినకుండా పరీక్షకు వచ్చే సాధారణ విద్యార్థులు కూడా ఇబ్బంది పడకుండా వారి కోసం సెంటర్లోనే తినుబండారాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈసారి సెట్ల దరఖాస్తు ఫీజుల్లో ఎటువంటి మార్పు లేదు. జోసా షెడ్యూల్ తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని వీలైనంత మేరకు త్వరగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహించేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆయా పరీక్షలకు సంబంధించి కన్వీనర్లను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ని ప్రకటించింది. మార్చి 2 నుంచి పిజిఇసెట్ దరఖాస్తులు రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ పిజి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిజి పిజి ఇసెట్ పరీక్ష జెఎన్టియుహెచ్ -హైదరాబాద్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ పరీక్షకు ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ విడుదల -చేసి, మార్చి 2 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 5 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 31 నుంచి జూన్ 3 వరకు టిజిఇసెట్ పరీక్ష జరుగనున్నది. టిజిఇఎపిసెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ తేదీ : ఫిబ్రవరి 14 అన్లైన్ దరఖాస్తులు : ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 4 వరకు(ఆలస్య రుసుం లేకుండా) అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్షలు : మే 4,5 తేదీలలో ఇంజనీరింగ్ విభాగం పరీక్ష : మే 9 నుంచి 11 వరకు పిజిఇసెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల -: ఫిబ్రవరి 25 ఆన్లైన్ దరఖాస్తులు: మార్చి 3 నుంచి మే 5 వరకు (ఆలస్య రుసుం లేకుండా) పరీక్ష తేదీ : మే 31 నుంచి జూన్ 3 వరకు .......................................................................
31th jan 2026 | నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు
ఉన్నతస్థాయి కమిటీలో తీవ్రంగా వ్యతిరేకించాం ఈ లింకు ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేవని సిడబ్లూసి ఛైర్మన్ గతంలోనే లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు తెలంగాణ నీటి హక్కులపై రాజీలేదు రాజకీయ దురుద్దేశంతో బిఆర్ఎస్ నేతల దుష్ప్రచారం ఢిల్లీ నుంచి జూమ్ మీటింగ్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-, బనకచర్ల లేదా నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేవని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి అటు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్, ఇటు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్లూసి) చైర్మన్ కూడా తమకు రాతపూర్వక వివరణ ఇచ్చారని ఆయన వెల్లడించారు. డిపిఆర్ కాదు కదా, కనీసం ప్రీ-ఫీజబిలిటీ రిపోర్ట్ కూడా అనుమతి ఇవ్వలేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందని ఆయన పేర్కొన్నారు. మన నది జలాలను కాపాడుకోవడానికి ఎవరితోనైనా చర్చలకు సిద్ధమని, ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆయన పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ మొదటి సమావేశం ఢిల్లీలో శుక్రవారం జరగ్గా ఆ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి జూమ్ మీటింగ్లో మాట్లాడారు. ఇరిగేషన్ రంగాన్ని బిఆర్ఎస్ నాశనం చేసింది ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ అధికారులు నల్లమల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టడానికి ఒప్పుకోమని స్పష్టం చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను అజెండాలో పెట్టాలని కేంద్రానికి తెలంగాణ అధికారులు చెప్పారన్నారు. పోలవరం, నల్లమల సాగర్కు అనుమతి లేదని కేంద్ర మంత్రి తనకు గురువారం లేఖ రాశారని ఆయన తెలిపారు. శుక్రవారం జరిగిన సమావేశంలోనూ సీడబ్ల్యూసీ కూడా ఇదే విషయాన్ని చెప్పిందని ఆయన తెలిపారు. పదేళ్లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కట్టిన ప్రాజెక్టు కూలిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇరురాష్ట్రాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశం గురించి హరీష్ రావు తెలుసుకొని మాట్లాడాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే బిఆర్ఎస్ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేశారని మంత్రి విమర్శించారు. బిఆర్ఎస్ నాయకులు సిగ్గుపడాలని, పదేళ్లలో ఎస్ఎల్బిసిని పూర్తి చేయలేదని, డిండి ప్రాజెక్టును సైతం పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకులు పదే పదే అబద్ధాలు చెప్పి నిజం చేయాలని అనుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అప్పులు చేసి రూ.1.8 లక్షల కోట్లు ఖర్చు చేసినా, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టుల ద్వారా కనీసం ఒక్క ఎకరాకు కూడా కొత్తగా నీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అప్పులు చేసి, చివరకు మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయే పరిస్థితికి తెచ్చారని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బిసి టన్నెల్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కేవలం దోపిడీ వ్యవస్థగా మార్చారని ఆయన విమర్శించారు. పార్లమెంట్లో వెల్లడించిన ఆర్థిక సర్వే గణాంకాలను మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రస్తావిస్తూ, కాళేశ్వరం ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టు కూడా కొత్తగా రాలేదని ఆయన వాదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే కృష్ణా, గోదావరి బేసిన్లలో గత పదేళ్ల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని, రికార్డు స్థాయిలో వరి సాగు జరిగిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణను భారతదేశంలోనే నంబర్వన్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్గా నిలిపింది తమ ప్రభుత్వమేనని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖలో గత పదేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు, బదిలీలు, నియామకాలను పూర్తి చేసి శాఖను ప్రక్షాళన చేశామని ఆయన పేర్కొన్నారు. ఆదిత్యానాథ్ దాస్ వంటి సమర్థవంతమైన అధికారుల సలహాలతో తెలంగాణ నీటి హక్కులను కాపాడటానికి తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.
నేడు పరిశీలన పురపోరుకు భారీగా నామినేషన్లు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సా.5గంటల తర్వాత కార్యాలయాల్లో ఉన్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. శనివారం(జనవరి 31) నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3వర కు గడువు ఉంది. ఫిబ్రవరి 11న పోలిం గ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రం లో 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు, ఏడు కార్పోరేషన్లలోని 414 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.
శనివారం రాశి ఫలాలు (31-01-2026)
మేషం దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృషభం సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిధునం ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కర్కాటకం వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. సింహం ఉద్యోగమున అధికారులతో సమస్యలు తప్పవు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కన్య వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తుల బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృశ్చికం వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. ధనస్సు _కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. _ మకరం సమాజంలో ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితుల సహాయంతో కొన్ని వివాదాలు పరిష్కారమౌతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుంభం నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు గంధరగోళంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. బంధు మిత్రుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ముక్యమైనా పనులలో శ్రమతో గాని పనులు పూర్తి కావు. మీనం చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.
మనతెంలగాణ/హైదరాబాద్ : టిజి టెట్ 2026(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ప్రాథమిక కీ విడుదలైంది. టిజి టెట్ కీ తోపాటు రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ప్రాథమిక కీపై ఫిబ్రవరి 1 సాయంత్రం 5 గంటల వ రకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు న వీన్ నికోలస్ పేర్కొన్నారు. ఈ నెల 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, టెట్ పరీక్షలకు 2,37,754 మంది దరఖాస్తు చేసుకోగా, 1,95,181 మంది(82.09 శాతం) హాజరయ్యారు. 42,573 మంది అ భ్యర్థులు టెట్ పరీక్షలకు గైర్హాజయ్యారు. టెట్కు 1,65,081 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకోగా, 65,605 మంది(90.27 శాతం) హాజరయ్యారు
సీబీఐ చార్జిషీట్తో వెలుగుచూసిన వాస్తవాలు
సజ్జల రామకృష్ణారెడ్డివిశాలాంధ్ర బ్యూరో – అమరావతి : తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు పచ్చ అబద్ధాలని, సీబీఐ ఛార్జిషీట్ ద్వారా ఈ విషయం వెల్లడయిందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన లేబొరేటరీల సాక్షిగా ఈ విషయం తేట తెల్లమైందని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సజ్జల విలేకరుల సమావేశం నిర్వహించారు. […] The post సీబీఐ చార్జిషీట్తో వెలుగుచూసిన వాస్తవాలు appeared first on Visalaandhra .
ఫిబ్రవరిలో ఎన్సీపీ వర్గాల విలీనం?
ముంబై : మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆకస్మిక మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీకి చెందిన రెండు వర్గాలు విలీనమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రెండు వర్గాలను విలీనం చేసే ఉద్దేశంతో కొంత కాలంగా అజిత్ పవార్ తన బాబా య్ శరద్ పవార్తో అనేకమార్లు భేటీ అయ్యారు. ఆ […] The post ఫిబ్రవరిలో ఎన్సీపీ వర్గాల విలీనం? appeared first on Visalaandhra .
రిజర్వ్ బ్యాంకు వద్ద నిజాం నగలు
న్యూదిల్లీ: నిజాం నగలు రిజర్వ్ బ్యాంక్ వద్ద సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ నగల చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ ప్రాముఖ్యతను గుర్తించి, అధిక భద్రత మధ్య వాటిని ఉంచామని పేర్కొంది. ఈ వివరాలను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభకు రాతపూర్వకంగా వెల్లడించారు. నిజాం నగలను హైదరాబాద్లో ప్రజల సందర్శనకు ఉంచే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని షెకావత్ చెప్పారు. నిజాం పాలకులకు చెందిన 173 అద్భుతమైన ఆభరణాలు […] The post రిజర్వ్ బ్యాంకు వద్ద నిజాం నగలు appeared first on Visalaandhra .
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
న్యూదిల్లీ: కువైట్ నుంచి దిల్లీ బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీంతో విమానాన్ని అహ్మదాబాద్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ నుంచి దిల్లీ బయల్దేరిన ఇండిగో విమానం గాల్లో ఉన్న సమయంలో టాయిలెట్లోని ఓ టిష్యూ పేపర్పై విమానంలో బాంబు పెట్టినట్లు రాసి ఉన్న బెదిరింపు నోట్ని ఓ ప్రయాణికుడు గుర్తించి… సిబ్బందిని అప్రమత్తం చేశాడు. వెంటనే స్పందించిన పైలట్లు అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి […] The post ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు appeared first on Visalaandhra .
నినాదాలతో దద్దరిల్లిన ధర్నాచౌక్అడ్డుకున్న పోలీసులు… తోపులాటలు…నిరసనలు . అసెంబ్లీ సమావేశాల్లోనే నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. ఏఐవైఎఫ్ అల్టిమేటం. ఇది దగాకోరు ప్రభుత్వం: గుజ్జుల ఈశ్వరయ్య. మోదీ పాలనలో నిరుద్యోగభారతం: సుఖ్జిందర్ మహేశ్వరి. హామీలు అమలు చేయకుంటే సీఎం కార్యాలయం ముట్టడి యుగంధర్, రాజేంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కొలువుల కోసం కొట్లాడిన యువజన శక్తి…నిరుద్యోగ సమస్యల పరిష్కారంపై చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. అడ్డుకోజూసిన పోలీసులు సైతం యువశక్తి ప్రతిఘటన ముందు తలవంచక […] The post ‘నిరుద్యోగ రణభేరి’ ఉద్రిక్తం appeared first on Visalaandhra .
గంటల్లోనే రూ.36 లక్షల కోట్ల ఆవిరి న్యూదిల్లీ: ప్రముఖ టెక్దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్లో కొన్ని గంటల్లోనే భారీగా నష్టాన్ని చవిచూసింది. కంపెనీ షేరు విలువ ఒక దశలో 12 శాతం కుంగింది. దాంతో ఆ సంస్థ విలువలో 400 బిలియన్ డాలర్ల మదుపర్ల సంపద ఆవిరైంది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ.36 లక్షల కోట్లు. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇది రెండోది. గతేడాది జనవరిలో చైనాకు […] The post మైక్రోసాఫ్ట్కు ఏఐ దెబ్బ appeared first on Visalaandhra .
. సంపాదనలో కొంత భాగం సమాజానికి ఇవ్వాలి. జన్మభూమికి ప్రవాసాంధ్రుల సేవలు స్ఫూర్తిదాయకం. ముఖ్యమంత్రి చంద్రబాబు. గుంటూరులో మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం విశాలాంధ్ర -గుంటూరుసిటీ:డబ్బు ఉంటే సంతృప్తి రాదు…చాలామంది సంపాదించినది మొత్తం పిల్లలకే ఇవ్వాలనుకుంటారు… ఇవ్వాలి… కానీ అదే సమయంలో కొంత భాగం సమాజానికి ఇవ్వాలి. అందులో ఉండే తృప్తి మాటల్లో చెప్పలేదనిది. పేదలు డబ్బు సంపాదించుకునే అవకాశాలు వస్తేనే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు […] The post ఆర్థిక అసమానతలు తగ్గాలి appeared first on Visalaandhra .
. కొలిక్కిరాని కష్ణా, గోదావరి నదీ జలాల సమస్య. రెండు గంటలు సాగిన కేంద్ర జలశక్తి సమావేశం. నల్లమలసాగర్ ప్రాజెక్టు అంశం అజెండాలో వద్దన్న తెలంగాణ. గత ఒప్పందం ప్రకారం నీటివాటా నిర్ధారించాలన్న ఏపీ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల నిర్వహణ, వినియోగం విషయంలో కొనసాగుతున్న వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం శుక్రవారం దిల్లీలో ప్రారంభమైంది. సీడబ్ల్యూసీ చైర్మన్ […] The post ఎవరి వాదనలు వారివే appeared first on Visalaandhra .
ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. ’విత్ లవ్’ ట్రైలర్ రిలీజ్
అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ’విత్ లవ్’. మదన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ ఎంఆర్పి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సంయుక్తంగా నిర్మించారు. ’విత్ లవ్’ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోంది. మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. “ట్రైలర్ చూసిన అందరూ కూడా చాలా కనెక్ట్ అయ్యారు. సౌందర్య తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను”అని తెలియజేశారు. ప్రొడ్యూసర్ సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ “అభిషన్ని హీరోగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తను డైరెక్ట్ గా మంచి సక్సెస్ ఇచ్చాడు. ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో అభిషన్ జీవింత్, హీరోయిన్ అనస్వర రాజన్, దర్శకుడు మదన్, ప్రొడ్యూసర్ మహేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్ అమరవీరులకు ఘనంగా నివాళులు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంకారపు నరసింహులు విశాలాంధ్ర – ధర్మవరం : భారతదేశంలో కోవిడ్ అనే వ్యాధి దేశ ప్రజలను దిగ్భ్రాంతులను చేసే సమయంలో, వైద్యులుగా వారి ప్రాణాలను అడ్డుపెట్టి ఎంతోమంది ప్రజలను దేశంలోని వైద్యులు కాపాడి తమ ప్రాణాలను అర్పించడం జరిగిందని, అందుకే వారికి ధర్మవరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ తరపున ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు సంకారపు నరసింహులు తెలిపారు. వారు మాట్లాడుతూ తమ వృత్తిని పణంగా పెట్టి ప్రాణాలు కోల్పోవడం గర్వించదగ్గ విషయమని […] The post కోవిడ్ అమరవీరులకు ఘనంగా నివాళులు appeared first on Visalaandhra .
మనతెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు, మున్సిపల్ ఎన్నికలతో పాటు అంశాలపై బిఆర్ఎస్ అధినేత కెసిఆర్తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చర్చించారు. ఈ మేరకు శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కెసిఆర్తో కెటిఆర్ సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు అడిగే ప్రశ్నలు, సమాధాలు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. కెసిఆర్కు సిట్ ఇచ్చే నోటీసులను ఎలా ఎదుర్కోవాలి, ఈ విషయాన్ని పార్టీకి నష్టం కలగకుండా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి..? అనే అంశంపై గురువారం బిఆర్ఎస్ ముఖ్యనేత హరీష్రావుతో చర్చించగా, శుక్రవారం కెటిఆర్తో చర్చించినట్లు తెలిసింది. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి చేపట్టే కార్యక్రమాలు, ఎలాంటి ప్రజా ఉద్యమాలను నిర్మించాలనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే అంశంపై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.
తిరుమల కల్తీ లడ్డూ వివాదం.. ఎపి ప్రభుత్వానికి సిట్ లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎపిప్రభుత్వానికి నివేదిక రూపంలో ఒక లేఖను సమర్పించింది. ఈ లేఖలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, దర్యాప్తులో తేలిన అంశాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలను సిట్ వివరించినట్టు సమాచారం. సుమారు వంద పేజీలకు పైగా ఉన్న ఈ నివేదికలో, 2019-2024 మధ్యకాలంలో తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో చోటుచేసుకున్న అనేక తప్పిదాలను సిట్ ప్రస్తావించినట్టు తెలిసింది. లడ్డూలో కల్తీ జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన అంశాలను కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. కేవలం తప్పిదాలనే కాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన సరిదిద్దే చర్యలు, పర్యవేక్షణా విధానాలపై కూడా సిట్ సూచనలు చేసింది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సిట్ పంపిన లేఖను పూర్తి గా అధ్యయనం చేసిన తర్వాతే అధికారికంగా స్పందించాలనే నిర్ణయానికి ప్రభుత్వ వర్గాలు వచ్చినట్లు సమాచారం. ఈ నివేదిక అత్యంత సున్నిత మైన అంశానికి సంబంధించినదైనందున, తొందరపాటు వ్యాఖ్యలు చేయకుండా అన్ని కోణాల్లో పరిశీలన జరుపుతున్నట్లు తెలిసింది. అయితే, సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలపై ప్రభుత్వం తీవ్రంగా స్పంది స్తోంది. ఈ తరహా తప్పుడు ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టడంతో పాటు, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలు స్తోంది. భక్తుల విశ్వాసం, టిటిడి సంస్థ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తిరుమల లడ్డూ అంశం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తామ ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సిట్ నివేదికపై పూర్తి స్థాయి అధ్యయనం అనంతరం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రకటించే చర్యలు రాజకీయంగా, పరిపాలనపరంగా కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నెయ్యిలో నూటికి నూరు శాతం కల్తీ: టిటిడి చైర్మన్ గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూల తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలు వాడారనీ, కల్టీ నెయ్యితో రూ.20 కోట్ల లడ్డూలు తయారు చేశారని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. నెయ్యిలో నూటికి నూరు శాతం కల్తీ జరిగిందన్నారు. నివేదికలో జంతువుల కొవ్వులు లేవని ఎక్కడా నిర్ధారణ కాలేదని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి భోలే బాబా డెయిరీకి టెండర్లు ఇచ్చారని, గత టిటిడి చైర్మన్, పెద్దల సహకారం లేకుండా ఇవన్నీ చేయగలరా? అని ప్రశ్నించారు. ‘సుబ్బారెడ్డి పిఎ చిన్నప్ప ఖాతాలోకి కోట్లు వచ్చాయి. ఈ ఖాతా నుంచి ఎక్కడికి వెళ్లాయో సిబిఐ వెల్లడించాలి. ఈ అక్రమాల వెనుక ఉన్న వారి పేర్లు బయటపెట్టాలని సిబిఐని కోరుతు న్నాం. కూటమి ప్రభుత్వం రాకుంటే ఈ కల్తీ నెయ్యి ఇంకా కొనసాగేది. దుర్మార్గుల నుంచి టిటిడిని మనమంతా కాపాడుకోవాల’ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు.
భారత్ నుంచి అమెరికా నేతలకు అందిన బహుమతులు ఇవే..
న్యూయార్క్: విదేశీ పర్యటనలకు భారత నేతలు వెళ్లినప్పుడు అక్కడి నేతలకు గౌరవ పూర్వకంగా బహుమతులు తీసుకుని వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. 2024 క్యాలెండర్ సంవత్సరం ప్రకారం ప్రధాని మోడీతో సహా భారత్కు చెందిన నేతలు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఇతర నేతలకు ఏయే బహుమతులను అందించారో ఆ జాబితాను ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేసింది. 2024లో బైడెన్కు మోడీ బహూకరించిన “స్టెర్లింగ్ సిల్వర్ మెటల్ ట్రైన్ సెట్, మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్కు బహూకరించిన కశ్మీర్ పాష్మినా షాల్, యూఎస్ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు ప్రధాని మోడీ అందజేసిన“ లార్డ్ కృష్ణ రాస్ లీలా సిల్వర్ బాక్స్లు ఈ జాబితాలో ఉన్నాయి. 480.00 అమెరికా డాలర్ల విలువ గలిగిన వీటన్నిటినీ నేషనల్ ఆర్కైవ్స్లో భద్రపరిచినట్టు తెలుస్తోంది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా మాజీ రక్షణ కార్యదర్శి లాయిడ్ జస్టిన్కు బహూకరించిన నటరాజ కాంస్య విగ్రహం, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అప్పటి అమెరికా జాతీయ భద్రతా వ్యవహారాల అధ్యక్షుడి సహాయకుడు జాకబ్కు ఇచ్చిన బహుమతులు వివరాలు ఈ జాబితాలో ఉన్నాయి. 2023 లో ప్రధాని మోడీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్కు ఇచ్చిన గంధపు చెక్కతో చేసిన ఒక పెట్టె, స్కార్ఫ్, కుంకుమ పువ్వు, టీపొడి ఉన్న చెక్కపెట్టె, ది టెన్ ప్రిన్సిపల్ ఉపనిషద్స్ అనువాద పుస్తకం వివరాలు కూడా ఇందులో ఉన్నాయని యూఎస్ విదేశాంగ శాఖ వెల్లడించింది. వీటిలో గంధపు చెక్క పెట్టె, స్కార్ఫ్ , మరో చెక్క పెట్టె ఇవన్నీ యూఎస్ నేషనల్ ఆర్కైవ్స్లో భద్ర పర్చినట్టు వివరించింది.
When Controversy Becomes a Habit: Padi Kaushik Reddy Pattern
The latest controversy at the Sammakka–Saralamma Jatara in Veenavanka feels less like an accident and more like a familiar script. Once again, Padi Kaushik Reddy found himself at the centre of a storm, this time at a place meant for devotion and faith. After his sharp remarks against police officials triggered outrage, Kaushik Reddy took […] The post When Controversy Becomes a Habit: Padi Kaushik Reddy Pattern appeared first on Telugu360 .
The Paradise Disrupts Nani’s Planning
Natural Star Nani is one actor who doesn’t love to take many breaks. He also works on a faster note and prefers to complete the shoots in quick schedules and ensure a prompt release as per the plan. But his upcoming movie ‘The Paradise’ has shattered all his plans. The actor had to sit idle […] The post The Paradise Disrupts Nani’s Planning appeared first on Telugu360 .
AP Budget Session: Andhra Pradesh Sets the Stage for Crucial Financial Deliberations
The Government of Andhra Pradesh has officially issued the notification for the 2026 Budget Session, marking the beginning of an important phase in the state’s legislative and financial calendar. The Budget Session of the Legislative Assembly will commence on February 11. On the opening day, the Governor will address both Houses, outlining the government’s vision, […] The post AP Budget Session: Andhra Pradesh Sets the Stage for Crucial Financial Deliberations appeared first on Telugu360 .
రిజర్వుబ్యాంకు వద్ద భద్రంగా నిజాం నగలు: కేంద్రం
న్యూఢిల్లీ : నిజాం నగలు రిజర్వ్ బ్యాంక్ వద్ద సురక్షితంగా ఉన్నాయని, వాటి చారిత్రక , సాంస్కృతిక, వారసత్వ ప్రాముఖ్యతను గుర్తించి, అత్యధిక భద్రత మధ్య వాటిని ఉంచామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ వివరాలను లిఖిత పూర్వకంగా రాజ్యసభకు వెల్లడించారు. నిజాం నగలను హైదరాబాద్లో ప్రజల సందర్శనకు ఉండే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నిజాం పాలకులకు చెందిన 173 అద్భుతమైన ఆభరణాలు 1995 నుంచి ఆర్బిఐ వాల్ట్ లోనే భద్రంగా ఉన్నాయని ప్రభుత్వానికి తెలుసా? అని కొందరు సభ్యులు ప్రశ్నించగా, ఆయన తెలుసునని బదులిచ్చారు. నిజాం పాలనలో ఉండే హైదరాబాద్ భూభాగం స్వాతంత్య్రం తరువాత భారత్లో విలీనమైంది.
శబరిమల బంగారం చోరీ కేసు.. నటుడు జయరామ్పై విచారణ
కొచ్చి: శబరిమల బంగారం చోరీ కేసులో సీనియర్ నటుడు జయరామ్ని సిట్ శుక్రవారం విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో కలిసి జయరామ్ పలు పూజల్లో పాల్గొన్నారు. బంగారం పూత కోసం ఆలయం నుంచి తీసుకొచ్చిన తాపడాలతో 2019లో ఉన్నికృష్ణన్ నిర్వహించిన పూజల్లో జయరామ్ పాల్గొన్న వీడియోలు ఇటీవలనే బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏవైనా జరిగాయా అని సిట్ ఆరా తీసినట్టు సమాచారం. శుక్రవారం చెన్నై లోని జయ్రామ్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉన్నికృష్ణన్ పొట్టితో సంబంధం ఏంటి? ఎలా పరిచయం? ఇద్దరి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? అని ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. మలయాళంలో సీనియర్ నటుడు అయిన జయరామ్, తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల ప్రేక్షకులకు సుపరిచితుడే. అలవైకుంఠపురంలో, హాయ్ నాన్న, గుంటూరు కారం, మిరాయ్, కాంతార, చాప్టర్1 వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. శబరిమల ప్రధాన ఆలయం ద్వారపాలక(కాపలాదారు) విగ్రహాలు, మరియు శ్రీకోవిల్ (గర్భగృహం) తలుపు ఫ్రేమ్ల నుండి బంగారం పోయినట్టు ఆరోపణలు రావడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అయితే పొట్టితో కలిసి నటుడు జయరామ్ పలు పూజల్లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు, నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పూజలు బంగారం పూత మాయం అయిన తరువాతే జరిగాయని నిర్ధారించుకున్న సిట్, ఇద్దరి మధ్య సంబంధాలపై ఆరా తీసినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటిదాకా ఈ కేసులో మొత్తం 12 మందిని సిట్ అరెస్టు చేసింది. ఇక ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు పాలక మండలి మాజీ సభ్యులు, మురారిబాబు, శ్రీకుమార్లు బెయిల్ మీద విడుదలయ్యారు. నిర్ణీత కాల వ్యవధిలో (90 రోజుల ) సిట్ వీళ్లపై అభియోగాలకు చార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరైంది. మరోవైపు ప్రధాన నిందితుడు పొట్టికి కూడా బెయిల్ లభించినప్పటికీ మిగతా కేసుల కారణంగా ఇంకా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పిటీ ఉష భర్త శ్రీనివాసన్ కన్నుమూత
చెన్నై: రాజ్యసభ సభ్యురాలు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష భర్త వెంగలిల్ శ్రీనివాసన్ (67)తుదిశ్వాస విడిచారు. ఇంట్లో ఉండగా శుక్రవారం తెల్లవారు జామున 12.30 గంటల ప్రాంతంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు పెరుమాల్పురం లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీనివాసన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఇన్స్పెక్టరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. కబడ్డీ ప్లేయర్ అయిన శ్రీనివాసన్ 1991లో పిటీ ఉషను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి విఘ్నేష్ ఉజ్వల్ అనే కుమారుడు ఉన్నారు. క్రీడా జీవితంలో ఆమె నడుపుతున్న ‘ ఉష్ స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్’ అభివృద్ధిలో శ్రీనివాసన్ కీలక పాత్ర పోషించారు. శ్రీనివాసన్ ఆకస్మిక మృతిపై పలువురు క్రీడాకారులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ పీటీ ఉషతో ఫోన్లో మాట్లాడి సంతాపం తెలిపారని అధికారులు వెల్లడించారు . కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సైతం శ్రీనివాసన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
కర్ణాటకలోని మైసూరులో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. ఎన్సిబి అధికారులు ఈ ముఠా ల్యాబ్లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో తనిఖీలు నిర్వహించి రూ.10 కోట్లు విలువ చేసే డ్రగ్స్, రూ.25.6 లక్షల నగదు, ఓ కారును సీజ్ చేశారు. అంతేకాక.. ల్యాబ్లో 500 కిలోల రసాయనాలను ఎన్సిబి అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జీవిత ఖైదీలను తక్షణమే విడుదల చేయాలి: మానవ హక్కుల వేదిక డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న అర్హత గల జీవిత ఖైదీలను తక్షణమే ముందస్తు విడుదల చేయాలని మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మానవ హక్కుల వేదిక కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఎస్. జీవన్ కుమార్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి డా. ఎస్. తిరుపతయ్యలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవిత ఖైదీలు సహా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు రెమిషన్, ముందస్తు విడుదల విధానంపై స్పష్టమైన పాలసీ రూపొందించాలంటూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 18, 2025 నాడు స్వయం స్వీకరణ రిట్ పిటిషన్ క్రిమినల్ నం. 4/2021 తో పాటు ఎస్ఎల్పి (క్రిమినల్) నం. 529/2021లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోం శాఖ ద్వారా జీవిత ఖైదీలకు ప్రత్యేక రెమిషన్ మంజూరు చేయడానికి సంబంధించి శాశ్వత మార్గదర్శకాలను నిర్ధారిస్తూ అక్టోబర్ 27, 2025 తేదీన జి.వొ.ఎంఎస్.నెం.126 ను జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వులో అర్హత గల జీవిత ఖైదీలను గుర్తించడం, వారి కేసులను ముందస్తు విడుదలకు పరిశీలించడం కోసం అనుసరించాల్సిన విధివిధానాలు, ప్రమాణాలు స్పష్టంగా పేర్కొనబడ్డాయన్నారు.సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసి దాదా పు ఒక సంవత్సరం పూర్తవుతుండగా, తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసి దాదాపు మూడు నెలలు గడిచాయి. అయినప్పటికీ ఈ ముందస్తు విడుదల విధానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదన్నారు. జీవిత ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనతో, ఆందోళనతో జీవిస్తున్నారని వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శిక్ష అనుభవిస్తున్న, అర్హులైన తమ వారిని విడుదల చేస్తారని ఆశించారన్నారు. కానీ అది జరగలేదని తెలిపారు పైన పేర్కొన్న జి.వొ. .ప్రకారం, జైళ్ల శాఖ, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అర్హులైన జీవిత ఖైదీల జాబితాను సిద్ధం చేసి, స్టాండింగ్ కమిటీ ముందు ఉంచాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రభుత్వం అర్హులైన ఖైదీలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించిందా? లేదా? అన్న విషయంపై ఇప్పటివరకు ఖైదీలకు గానీ, వాళ్ళ బందు వులకు గానీ సమాచారం లేదన్నారు. ఈ విధమైన నిర్లక్ష్యం సుప్రీంకోర్టు గుర్తించిన రెమిషన్, సంస్కరణ ,రాజ్యాంగ బద్ధమైన స్వేచ్ఛ, మౌలిక స్ఫూర్తికే విరుద్ధమన్నారు. న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ ప్రక్రియను వేగ వంతం చేయాలన్నారు. జి.వొ.ఎంఎస్.నెం.126 ను సుప్రీం కోర్టు సూచించిన మార్గదర్శకాల వెలుగులో యధాత దం గా అమలు చేసి, అర్హత గల జీవిత ఖైదీలను ముందస్తుగా విడుదల చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని మానవ హక్కుల వేదిక ప్రభుత్వాన్ని కోరిందన్నారు.
విశాలాంధ్ర- డుంబ్రిగుడ (అల్లూరి జిల్లా): మండలంలోని అరమ పంచాయతీ కేంద్రంలో శుక్రవారం స్థానిక పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మూగజీవులైన పశువులు, 237 మేకలు, గొర్రెలకు 79కి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారిని రాజశ్రీ మాట్లాడుతూ గ్రామాల్లో మూగజీవులకు ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందిన తక్షణమే స్థానిక పశువైద్య సిబ్బందికి సమాచారం అందిస్తే వెంటనే వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల […] The post అరమలో పశువైద్య శిబిరం appeared first on Visalaandhra .
టి-20 ప్రపంచకప్.. జట్టును ప్రకటించిన యుఎస్ఎ
మరికొన్ని రోజుల్లో టి-20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈసారి భారత్, శ్రీలంక వేదికలుగా ఈ మెగా టోర్నీ జరుగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో పాల్గొనే దేశాలు ఒక్కొక్కటిగా తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా యుఎస్ఎ కూడా తమ జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్లో మోనాంక్ పటేల్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. 2024 ఎడిషన్లో పాల్గొన్న జట్టు నుంచి 10 మంది ఆటగాళ్లు ఈ ఎడిషన్కి కూడా ఎంపికయ్యారు. కొత్తగా శుభమ్ రంజనే, మహ్మద్ మొహ్సిన్, షేహాన్ జయసూర్య జట్టులోకి వచ్చారు. గత ఎడిషన్లో పాకిస్థాన్ను ఓడించి యుఎస్ఎ సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్లో సూపర్ ఓవర్లో విజయం సాధించి సూపర్-8కి కూడా అర్హత సాధించింది. ఇది యుఎస్ఎకి రెండు టి-20 ప్రపంచకప్. ఈ సారి కూడా యుఎస్ఎ జట్టు పలు సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఈసారి గ్రూప్-ఎలో ఉన్న యుఎస్ఎ.. భారత్, పాకిస్థాన్ లాంటి జట్లతో పోటీ పడాల్సి ఉంది. ఇదే గ్రూప్లో నమీబియా, నెదర్లాండ్స్పై విజయం సాధించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 7న టిం ఇండియాతో జరిగే మ్యాచ్తో యుఎస్ఎ తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. టి-20 ప్రపంచకప్ కోసం యూఎస్ఎ జట్టు.. మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షేహాన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కమల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెన్జిగే, షాడ్లీ వాన్ స్కాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభమ్ రంజనే.
సిఎం రేవంత్.. తెలంగాణ జలాలను ఎపికి దోచిపెడుతున్నారు: హరీష్ రావు
పథకం ప్రకారమే నల్లమలసాగర్కు సిఎం రేవంత్రెడ్డి సహకరిస్తున్నారు రేవంత్రెడ్డి చంద్రబాబుకి గురుదక్షిణ చెల్లిస్తున్నారు బిఆర్ఎస్ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జలాలను ఆంధ్రకు దోచిపెడుతున్నారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు తీవ్ర విమర్శలు చేశారు. పథకం ప్రకారమే పోలవరం- నల్లమలసాగర్కు తెలంగాణ సిఎం రేవంత్రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెల్లని పిటిషన్ వేసి రిట్ను ఉపసంహరించుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శుక్రవారం బిఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. తొలి నుంచి కూడా గోదావరి నదీ జలాల అక్రమ తరలింపుపై బిఆర్ఎస్ అప్రమత్తం చేస్తూనే ఉందని...అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు. ముల్లు కర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్నా... కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పులు చేస్తూనే ఉందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న రేవంత్ ను తెలంగాణ సమాజం క్షమించదని అన్నారు. రేవంత్ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, రాష్ట్ర నీటి హక్కుల కోసం మరో పోరాటం చేస్తామని ప్రకటించారు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు ద్రోహం ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నది పేరుకే జలవివాదాల కమిటీ సమావేశం అని, పోలవరం -నల్లమలసాగర్కు పరిష్కారం కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని హరీష్రావు అన్నారు. 200 టిఎంసిల గోదావరి జలాలను ఎపి తరలించుకుపోయే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.తాను ప్రశ్నించిన తర్వాత వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రానికి లేఖ రాశారని విమర్శించారు. గతంలో కేంద్ర జల్శక్తిశాఖ నిర్వహించిన సమావేశంలో ఎపి ఈ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముందుపెట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఎపి నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ చేస్తున్నారని చెప్పారు. రెండు షరతులు పెట్టి ఢిల్లీలో సమావేశానికి వెళ్లారని, ఎపి ప్రభుత్వం నల్లమలసాగర్కు డిపిఆర్ ఆపాలని, ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వొద్దని రెండు షరతులు విధించిందని పేర్కొన్నారు. వీటికి కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వకుండానే సమావేశానికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. నల్లమలసాగర్కు అంగీకరించి తెలంగాణకు మరణశాసనం రాయాలని అనుకుంటున్నారా..? అని నిలదీశారు. ఈ సమావేశానికి కూడా ఆదిత్యనాథ్దాసునే పంపించారని, ఆయన గతంలో ఎపి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారని చెప్పారు ఈ సమావేశానికి ఆయన ఎలా నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు. నికార్సయిన తెలంగాణ ఇంజనీర్ దొరకలేదా అంటూ ధ్వజమెత్తారు. మన ప్రాజెక్టులకు అడ్డుపడిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్రం తరఫున వాదనలకు వెళ్లారని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం గోదావరిపై 7 ప్రాజెక్టులకు డిపిఆర్లను పంపించిందని తెలిపారు. బిఆర్ఎస్కు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అని, అవసరమైతే కెసిఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఒత్తిడితో ఢిల్లీలో జరుగుతున్న సమావేశాన్ని రాష్ట్రం బహిష్కరించాలని, కాదని పాల్గొంటే మరో పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. తెలంగాణ నీళ్లు ఎపికి ధారాదత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సీడబ్ల్యూసీ సమావేశాన్ని బహిష్కరించాలి సీడబ్ల్యూసీ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గోదావరి బనకచర్లను ఆపితేనే ఢిల్లీ మీటింగ్కు వెళ్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారని.. మరి ఇప్పుడెందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని, ఢిల్లీలో తెలంగాణ నీటి హక్కులను అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు ద్రోహం జరగబోతోందని ఆరోపించారు. కెసిఆర్ పాలన గురించి ఎకనామిక్ సర్వే రిపోర్టే స్పష్టం చేసింది కెసిఆర్ పాలన గురించి ఎకనామిక్ సర్వే రిపోర్టే స్పష్టం చేసిందని హరీస్రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ అద్బుతమైన ప్రగతి సాధించిందని, రెండు కోట్ల 20 లక్షల ఎకరాల మాగాణిగా మారిందని తెలిపారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా అద్బుతమైన ఆయకట్టు వచ్చిందని, కాళేశ్వరం ద్వారా 17 లక్షల 823 ఎకరాల స్థిరీకరణ, మిషన్ కాకతీయ ద్వారా పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమైందని, 32 లక్షల ఎకరాల ఆయకట్టు బిఆర్ఎస్ సాధించిందని వివరించారు. తెలంగాణకు జరుగుతున్న దోపిడీపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పటికైనా నోరు విప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే తెలంగాణ ప్రగతి పథాన్ని వివరిచిందని, వాళ్లు కళ్లు తెరవండి అనవసరంగా బిఆర్ఎస్ మీద నోళ్లు పారేసుకోవద్దని సూచించారు.తాము తెలంగాణకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే, రేవంత్రెడ్డి ఎపికి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. నీటిని ఒడిసి పట్టింది కెసిఆర్ విడిచి పెట్టింది రేవంత్ అని, బిఆర్ఎస్ సేద్యంపై దృష్టి సారిస్తే, రేవంత్ చోద్యం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి ఢిల్లీకి, దావోస్కు తిరగడమే తప్ప పాలన మీద దృష్టి లేదని హరీష్రావు విమర్శించారు.
2021ITRules |ఎన్టీఆర్ హక్కులకు రక్షణ కల్పించిన ఢిల్లీ హైకోర్టు..
2021ITRules | ఎన్టీఆర్ హక్కులకు రక్షణ కల్పించిన ఢిల్లీ హైకోర్టు.. 2021ITRules |
సిఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం
‘లీడర్ షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేసిన ముఖ్యమంత్రి సర్టిఫికెట్ను ప్రదానం చేసిన హార్వర్డ్ అధ్యాపకులు మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దిక్కింది. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో అంతర్జాతీయ స్థాయి నాయకత్వ శిక్షణకు ప్రతీకగా నిలిచే ‘లీడర్ షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను సిఎం రేవంత్రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. శిక్షణను పూర్తి చేసిన సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు సిఎం రేవంత్ రెడ్డికి సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. ఫ్యాకల్టీయే స్వయంగా సర్టిఫికెట్లు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారంలో ఉండగానే ఐవీ లీగ్ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్ పొందిన మొదటి భారతీయ సిఎంగా ఆయన రికార్డు సృష్టించారు. నాయకత్వం అంటే మాటల్లో కాదు, పనిలో చూపించాలన్న దృక్పథంతో ప్రతి సెషన్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. గడ్డకట్టే చలిలోనూ అభ్యాసం.. ఈ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డితో పాటు ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి వచ్చిన 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జనవరి 25న ప్రారంభమైన ఈ శిక్షణలో సిఎం ఒక సామాన్య విద్యార్థిలా గడిపారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా తరగతులు జరిగాయి. మసాచుసెట్స్లో ప్రస్తుతం వీస్తున్న మంచు తుఫాను కారణంగా ఉష్ణోగ్రతలు -15 డిగ్రీల నుంచి -24కు పడిపోయాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సిఎం రేవంత్ ఏమాత్రం విరామం తీసుకోకుండా తరగతులకు హాజరయ్యారు. 21వ శతాబ్దంలో ఎదురయ్యే క్లిష్ట సవాళ్లు, అధికార విశ్లేషణ, నాయకత్వ మెళకువలు, సంక్షోభ పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కొవాలన్న అంశాలపై కేస్ స్టడీలు, గ్రూప్ ప్రాజెక్టుల ద్వారా ఆయన ఈ శిక్షణ పొందారు. ప్రపంచవేదికపై తెలంగాణ పేరు మరింత ఎత్తుకు తీసుకెళ్లే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, పాలనలో కొత్త ఆలోచనలు, అంతర్జాతీయ అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడిగా రేవంత్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య..
విశాలాంధ్ర-అమడగూరు: మండల పరిధిలోని చీకిరేవులపల్లి గ్రామానికి చెందిన పీట్ల రమేష్, అనిత దంపతుల కుమార్తె ఝాన్సీ (14) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది.పోలీసులు, గ్రామస్తులు, తెలిపిన వివరాల మేరకు విద్యార్థిని తల్లిదండ్రులు గురువారం ఝాన్సీని సరిగా చదవలేదని మందలించడంతో మనస్థాపంతో ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.శుక్రవారం ఉదయం మృతురాలు విద్యార్థి తల్లిదండ్రులు రమేష్ తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్ కి ఉదయం వెళ్లారు. దీంతో ఝాన్సీ తల్లితండ్రులు లేని […] The post తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య.. appeared first on Visalaandhra .
ప్రమాద బాధితులకు తక్షణ సహాయం.. మానవత్వం చాటుకున్న రఘువీరారెడ్డి
విశాలాంధ్ర–గుడిబండ: మహాత్మా గాంధీ సందేశ పాదయాత్రను పూర్తి చేసుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ఉన్న సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులకు తక్షణ సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మధుగిరి–మడకశిర జాతీయ రహదారిపై వెటర్నరీ కాలేజీ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన రఘువీరారెడ్డి తన కాన్వాయ్ను వెంటనే ఆపించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. గాయపడిన […] The post ప్రమాద బాధితులకు తక్షణ సహాయం.. మానవత్వం చాటుకున్న రఘువీరారెడ్డి appeared first on Visalaandhra .
. తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకే దక్కింది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి విశాలాంధ్ర – విజయనగరం టౌన్ – దేవుని పేరుతో రాజకీయం చేయడం ఆయనకే చెందిందని, తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకే దక్కిందని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో గల […] The post దేవుని పేరుతో రాజకీయమా appeared first on Visalaandhra .
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే టేబుల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్స్కి దూసుకెళ్లింది. నేడు (జనవరి 30) ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్కి అర్హత సాధించే అవకాశం ఉంది. గుజరాత్ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ముంబై జట్టు ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కానీ నెట్ రన్ రేటులో గుజరాత్ కంటే ముంబై మెరుగ్గా ఉంది. ముంబై నెట్ రన్రేట్ +0.146గా ఉండగా.. గుజరాత్ -0.271గా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది. తుది జట్లు: గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ (కీపర్), సోఫి డివైన్, అసుష్క శర్మ, ఆష్లీ గార్డెనర్(కెప్టెన్), జార్జియా వేర్హామ్, భారతీ ఫుల్మాలి, కనికా అహుజా, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, రేణుకా సింగ్ ఠాకూర్, రాజేశ్వరి గయక్వాడ్. ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, సజీవన్ సజన, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), అమంజోత్ కౌర్, అమేలియా కెర్, రహిలా ఫిర్దౌస్(కీపర్), సంస్కృతి గుప్తా, వైష్ణవి శర్మ, షబ్నిమ్ ఇస్మాయిల్, పూనమ్ ఖేమ్నార్.
IRIA 2026 |నివారణ ఆరోగ్య సంరక్షణకు బలంగా ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు
IRIA 2026 | నివారణ ఆరోగ్య సంరక్షణకు బలంగా ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త
ఉపాధి హామీ పథకానికి తూట్లు..మహాత్మా పేరు తొలగింపు సరికాదు..
విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం సిపిఐ, ఏపీ మహిళా సమాఖ్య ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీవర్ధంతిని పురస్కరించుకొని సామూహిక సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య మాట్లాడుతూ దేశంలో గ్రామీణ పేదల వలసల నివారణ, ఆర్థిక భరోసా కల్పించడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. […] The post ఉపాధి హామీ పథకానికి తూట్లు..మహాత్మా పేరు తొలగింపు సరికాదు.. appeared first on Visalaandhra .
సీతం కళాశాలలో సమగ్ర ఉద్యమశీలతపై కార్యశాల
విశాలాంధ్ర – విజయనగరం టౌన్ : స్థానిక సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో మెకానికల్ విభాగం , ఎంటర్ప్రెన్యూర్ సెల్ ఆధ్వర్యంలో యువతకు పారిశ్రామిక రంగాలలో నైపుణ్యాలు ఎంపిక దిశగా సమగ్ర అవగాహనలపై కార్యశాల ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ డా. రీతూ మైతీ ( సీనియర్ ఇంజినీర్, సి టి టి సి,భువనేశ్వర్) హాజరై ,విద్యార్థులకు ఉద్యమశీలత (ఎంటర్ప్రన్యూర్షిప్) పై సమగ్ర అవగాహన కల్పించారు.ఇంజనీరింగ్లో ప్రతీ విభాగానికి […] The post సీతం కళాశాలలో సమగ్ర ఉద్యమశీలతపై కార్యశాల appeared first on Visalaandhra .
వివాదాస్పద వ్యాఖ్యలు.. పోలీసులకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులపై భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వీణవంక గ్రామానికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో కౌశిక్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంతేకాక.. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో కౌశిక్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఐపిఎస్ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు క్షమాపణలు చెబుతున్నట్లు కౌశిక్ రెడ్డి తెలిపారు. తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, పోలీసుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని అన్నారు. సిఎం ప్రోద్బలంతో తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని తెలిపారు. పోలీసులు, అధికారులంటే తనకు ఎంతో గౌరవమన్నారు. సమ్మక్క జాతరకు వెళ్తుండగా.. అడ్డుకుని తీవ్ర ఒత్తిడి చేశారని.. ఆ సమయంలో నోరు జారానని, ఉద్దేశపూర్వక మాటలు కావని పేర్కొన్నారు.
ఇనార్బిట్ మాల్ లో బెర్రీ ల్యాండ్ కార్నివాల్ తో స్ట్రాబెర్రీ మ్యాజిక్!
సైబరాబాద్: స్ట్రాబెర్రీ సీజన్ ను వేడుక చేస్తూ సైబరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ లో బెర్రీ ల్యాండ్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకతో మాల్ గులాబీ రంగులోకి మారనుంది. జనవరి 30 నుండి ఫిబ్రవరి 1, 2026 వరకు జరిగే ఈ కార్నివాల్ ఆహారం, సృజనాత్మకత, షాపింగ్ మరియు వినోదాన్ని మిళితం చేస్తూ లీనమయ్యే అనుభవాన్ని అందిస్తుంది. ఇనార్బిట్ మాల్ యొక్క సెంట్రల్ ఆట్రియం (L2) వద్ద నిర్వహించబడే బెర్రీ ల్యాండ్ కార్నివాల్ కోసం మాల్ ను స్ట్రాబెర్రీ-నేపథ్యం తో తీర్చిదిద్దారు. ఇక్కడ ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయి. ఈ సీజన్లో మాల్ యొక్క అత్యంత ఆకర్షణీయమైన అనుభవ కార్యక్రమాలలో ఒకటిగా ఉండేలా ఈ ఉత్సవం తీర్చిదిద్దబడింది. ఫోన్ చార్మ్ మేకింగ్, ఫ్రిజ్ మాగ్నెట్ మేకింగ్, రాక్ పెయింటింగ్ , టోట్ బ్యాగ్ పెయింటింగ్ వంటి సృజనాత్మక వర్క్షాప్ల నుండి ఫ్లీ మార్కెట్ షాపింగ్, ఇంటరాక్టివ్ ఆర్ట్ జోన్లతో ఈ కార్నివాల్ అన్ని వయసుల వారికి ఏదో ఒకటి అందిస్తుంది. సందర్శకులు వివిధ రకాల స్ట్రాబెర్రీ-ప్రేరేపిత ట్రీట్లను కూడా ఆస్వాదించవచ్చు. జనవరి 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు నిర్వహించబడతాయి, అన్ని సృజనాత్మక వర్క్షాప్లు , ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు సంబంధిత రోజులలో సాయంత్రం 6:00 నుండి రాత్రి 9:00 గంటల మధ్య జరుగుతాయి. బెర్రీ ల్యాండ్ కార్నివాల్కు ప్రవేశం ఉచితం , అందరికీ తెరిచి ఉంటుంది. సందర్శకులు BookMyShow లేదా డిస్ట్రిక్ట్ ద్వారా ముందుగా నమోదు చేసుకోవచ్చు. ఈవెంట్ వివరాలు క్లుప్తంగా: · ఈవెంట్: బెర్రీ ల్యాండ్ కార్నివాల్ (స్ట్రాబెర్రీ ఫెస్ట్) · వేదిక: సెంట్రల్ అట్రియం (L2), ఇనార్బిట్ మాల్, హైదరాబాద్ · తేదీలు: జనవరి 30 & 31, మరియు ఫిబ్రవరి 1, 2026
మరో 15 నగరాలకు షావోమీ ప్రీమియం సర్వీస్ సెంటర్లు
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం షావోమీ (Xiaomi), భారతదేశంలో తమ ప్రీమియం సర్వీస్ సెంటర్ల నెట్వర్క్ను వ్యూహాత్మకంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మరో 15 కొత్త నగరాల్లో కేంద్రాలను ప్రారంభిస్తోంది. దేశవ్యాప్తంగా 100 ప్రీమియం సర్వీస్ సెంటర్లను స్థాపించాలనే షావోమీ ప్రణాళికలో ఇది రెండవ దశ. వినియోగదారులకు అమ్మకాల తర్వాత సేవలను మరింత అందుబాటులో ఉంచడం, విశ్వసనీయతను పెంచడం మరియు అనుభవాన్ని మెరుగుపరచడంపై స్పష్టమైన దృష్టితో ఈ విస్తరణ జరుగుతోంది. ఈ రోజు, విశాఖపట్నం, సూరత్, మరియు లక్నోలలో కొత్త కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయి. లూధియానా మరియు ఇండోర్లలో మరో రెండు స్టోర్లు జనవరి 29న ప్రారంభించబడ్డాయి. 2026 మొదటి త్రైమాసికం (Q1) నాటికి, మొత్తం 15 నగరాల్లో ఈ ప్రీమియం సర్వీస్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త తరం ప్రీమియం సర్వీస్ సెంటర్లు సాంప్రదాయ మరమ్మతులకు మించి, మరింత సమగ్రమైన, ఉన్నత స్థాయి సేవా అనుభవాన్ని అందించేలా రూపొందించబడ్డాయి. కస్టమర్లు వేగవంతమైన టర్న్అరౌండ్ టైమ్, అంకితమైన సాంకేతిక నైపుణ్యం, ప్రొడక్ట్ ఇంటరాక్షన్ జోన్లు మరియు మెరుగైన సౌకర్యాలను ఇక్కడ పొందవచ్చు. సేవా అనుభవాన్ని సరళంగా, పారదర్శకంగా మరియు భరోసా ఇచ్చేలా తీర్చిదిద్దారు. ఇవి కేవలం సర్వీస్ పాయింట్లు మాత్రమే కాదు, సమగ్ర అనుభవ కేంద్రాలుగా పనిచేస్తాయి. వినియోగదారులు ఇక్కడ షావోమీ ఉత్పత్తులను అన్వేషించవచ్చు మరియు కొనుగోలు చేయవచ్చు. బ్రాండ్ యొక్క సుస్థిరత లక్ష్యాలకు అనుగుణంగా పేపర్లెస్ కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. అలాగే, ప్రతి బుధవారం జరిగే 'షావోమీ డేస్' వంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సందర్భంగా షావోమీ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీన్ మాథుర్ మాట్లాడుతూ, మా మొదటి 10 ప్రీమియం సర్వీస్ సెంటర్లకు లభించిన అనూహ్య స్పందన... వినియోగదారులు వేగవంతమైన, నమ్మదగిన మరియు అనుభవ-ఆధారిత ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్కు ఎంత విలువ ఇస్తున్నారో నిరూపించింది. 2026 కోసం షావోమీ యొక్క 'వాల్యూ-ఫర్-ఎక్స్పీరియన్స్' వ్యూహంలో భాగంగా, అదనంగా 15 నగరాలకు విస్తరించడం తదుపరి సహజమైన అడుగు. వినియోగదారులు తమ పరికరాలను ఎక్కువ కాలం వాడుతున్నందున, నమ్మదగిన సేవ అవసరం. మా ప్రీమియం సర్వీస్ సెంటర్ల ద్వారా, కస్టమర్లు తమ పరికరాలను మెయింటైన్ చేసుకోవడానికి మరియు కాలక్రమేణా ఎక్కువ విలువను పొందడానికి మేము సహాయపడుతున్నాము, అని అన్నారు. కొత్త కేంద్రాలు ప్రీమియం ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ను మరింత కలుపుకొనిపోయేలా మరియు లాభదాయకంగా మార్చడానికి అనేక ప్రయోజనాలను ప్రవేశపెట్టాయి. మహిళా వినియోగదారులకు 30 రోజుల పాటు ప్రత్యేక సర్వీస్ డిస్కౌంట్లు ఉంటాయి. రక్షణ సిబ్బంది మరియు విభిన్న ప్రతిభావంతులు జీవితకాలం పాటు సర్వీస్ ఛార్జీలపై మినహాయింపు పొందవచ్చు. ఎంపిక చేసిన స్పేర్ పార్ట్స్పై 50% వరకు డిస్కౌంట్, ఎంపిక చేసిన పరికరాలకు కాంప్లిమెంటరీ స్క్రీన్ ప్రొటెక్టర్లు వంటి పరిమిత కాల ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ చొరవలో షావోమీ ప్రధానంగా వేగం, నాణ్యత మరియు విశ్వసనీయతపై దృష్టి పెడుతోంది. ప్రీమియం సర్వీస్ సెంటర్లు 24 గంటల్లోపు ప్రయారిటీ రిపేర్లను అందిస్తాయి. ఒకవేళ మరమ్మతుకు రెండు గంటల కంటే ఎక్కువ సమయం పట్టేలా ఉంటే, కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా 'స్టాండ్బై హ్యాండ్సెట్'ను అందిస్తారు. ప్రతి కేంద్రంలో షావోమీ-సర్టిఫైడ్ నిపుణులు ఉంటారు. స్మార్ట్ఫోన్లను ఎక్కువ కాలం పాటు వాడుతున్న ప్రస్తుత తరుణంలో, నమ్మదగిన ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ అనేది వినియోగదారుల అనుభవంలో అంతర్భాగంగా మారుతోంది. షావోమీ పరికరాలు మన్నిక కోసం ఇంజనీరింగ్ చేయబడ్డాయి మరియు వీటికి సంవత్సరాల తరబడి సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్ల మద్దతు ఉంటుంది. విస్తరిస్తున్న తన ప్రీమియం సర్వీస్ నెట్వర్క్ ద్వారా, షావోమీ ఒక దీర్ఘకాలిక భాగస్వామిగా తన పాత్రను మరింత బలపరుచుకుంటోంది. వినియోగదారులు తమ పరికరాలను మెయింటైన్ చేసుకోవడానికి, రక్షించుకోవడానికి మరియు వాటి నుండి ఎక్కువ విలువను పొందేలా చేయడానికి ఇది సహాయపడుతుంది. ఇది మరింత సుస్థిరమైన మరియు బాధ్యతాయుతమైన యాజమాన్య ప్రయాణంలో భాగం. 2025లో ప్రారంభించిన మొదటి 10 ప్రీమియం సర్వీస్ సెంటర్లకు వినియోగదారుల నుండి బలమైన మరియు ప్రోత్సాహకరమైన స్పందన లభించిందని, తమ సేవా నిబద్ధతలను నిలకడగా అందజేస్తున్నామని షావోమీ తెలిపింది. దాదాపు 95% పరికరాలు 24 గంటల్లోపు మరమ్మతు చేయబడి డెలివరీ చేయబడ్డాయి. రిపీట్ విజిట్స్ 1% కంటే తక్కువగా ఉన్నాయి. కస్టమర్ ఫిర్యాదులు 0.5% కంటే తక్కువగా నమోదయ్యాయి. ఇది అధిక సేవా సామర్థ్యాన్ని, నాణ్యమైన పరిష్కారాన్ని మరియు ప్రీమియం సర్వీస్ మోడల్పై వినియోగదారులకు ఉన్న బలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. అదనంగా, షావోమీ యొక్క 'వెన్స్డే సర్వీస్ డేస్’ నుండి 5,000 మందికి పైగా కస్టమర్లు ప్రయోజనం పొందారు. ఈ కార్యక్రమంలో వారంటీ లేని మరమ్మతులపై ఉచిత సర్వీస్ ఛార్జీలు, కాంప్లిమెంటరీ డివైస్ హెల్త్ చెక్-అప్లు, ప్రొఫెషనల్ క్లీనింగ్ మరియు ఉచిత సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లను అందిస్తారు. ఈ చొరవలో షావోమీ ప్రధానంగా వేగం, నాణ్యత మరియు విశ్వసనీయతపై దృష్టి పెడుతోంది. ప్రీమియం సర్వీస్ సెంటర్లు 24 గంటల్లోపు ప్రయారిటీ రిపేర్లను అందిస్తాయి. దీనికి మద్దతుగా అధునాతన డయాగ్నోస్టిక్స్, కఠినమైన నాణ్యత తనిఖీలు మరియు స్పేర్ పార్ట్స్ లభ్యత ఉంటాయి. కస్టమర్లకు అంతరాయం కలగకుండా చూసేందుకు, మరమ్మతుకు రెండు గంటల కంటే ఎక్కువ సమయం పట్టేలా ఉంటే 'స్టాండ్బై హ్యాండ్సెట్'ను అందిస్తారు. ప్రతి కేంద్రంలో షావోమీ-సర్టిఫైడ్ నిపుణులు ఉంటారు. అన్ని టచ్పాయింట్ల వద్ద స్థిరమైన అత్యున్నత సేవా ప్రమాణాలను నిర్ధారించడానికి వీరికి క్రమం తప్పకుండా శిక్షణ ఇస్తారు.
‘వారణాసి’ రిలీజ్ అప్పుడే.. ప్రకటించిన రాజమౌళి
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘వారణాసి’. ఈ గ్లోబ్ట్రాటర్ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. సాధారణంగా రాజమౌళి సినిమాలు అంటేనే ఆ సినిమా విడుదల ఆలస్యంగా జరుగుతుంది. కానీ, ఈ సినిమాను అనుకున్న సమయానికే తీసుకువచ్చేలా జక్కన ఏర్పాటు చేస్తున్నారు. 2027 ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల అవుతుందని రాజమౌళి స్పష్టం చేశారు. ఏప్రిల్ 7, 2027న ఈ సినిమా విడుదల అవుతుందని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీంతో అభిమానులు ఖుషీ అయ్యారు. ఉగాది, గుడిపడ్వాని పురస్కరించుకొని 2027 ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేయనుండటం గమనార్హం. ఆ తర్వాత వేసవి సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి, 15న శ్రీరామ నవమి. తమిళ సంవత్సరాదినీ అదే సమయంలో జరుపుకోనున్నారు. ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక.. అంటార్కిటికాలో మరో షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అక్కడ షూటింగ్ జరిపిన తొలి భారత చిత్రంగా ‘వారణాసి’ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా.. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. April 7th, 2027… #VARANASI . pic.twitter.com/9i5j1TZg5b — rajamouli ss (@ssrajamouli) January 30, 2026
Fire Accident |కన్నీరు పెట్టిస్తున్న చివరి కాల్ రికార్డింగ్…
Fire Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఇటీవలే హైదరాబాద్ లోని
ఒటిటిలోకి శర్వా రీసెంట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ విభిన్నమైన కథలు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు శర్వానంద్. భారీ బడ్జెట్, యాక్షన్ సన్నివేశాలు.. తదితర అంశాలు లేకపోయినా.. శర్వా సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఎంటర్టైనర్ అనే అభిప్రాయం ప్రతీ తెలుగు సినీ అభిమానిలో ఉంది. అదే ఫార్ములాతో ముందుకు దూసుకుపోతున్నాడు శర్వా. కాగా, ఈ సంక్రాంతికి కూడా శర్వా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘నారీ నారీ నడుమ మురారీ’. సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే వ్యక్తిగా శర్వా ఈ సినిమాలో కలిపించాడు. పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ.. ఈ సినిమా వాటికి పోటీ ఇస్తూ.. మంచి హిట్ టాక్ని తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని సదరు ఒటిటి సంస్థ సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. మరి వెండితెరపై బుల్లితెరపై ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Why Early Digital Streaming for Nari Nari Naduma Murari?
Young actor Sharwanand has finally made his comeback with Nari Nari Naduma Murari, a hilarious entertainer packed with family emotions. The film collected decent money amid huge competition during the Sankranthi holiday season. After the Sankranthi holiday season, the film’s collections came down and Nari Nari Naduma Murari had a decent second weekend. Amazon Prime […] The post Why Early Digital Streaming for Nari Nari Naduma Murari? appeared first on Telugu360 .
తెలంగాణ ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది
Mass Maharaj Ravi Teja is struggling to deliver a decent hit. His recent offering Bhartha Mahasayulaku Wignyapthi released during Sankranthi and the response has been decent. But the film failed to post decent numbers during the holiday season. Ravi Teja’s fans are eager about his comeback and they are urging him to do a decent […] The post Ravi Teja in a Dual Role? appeared first on Telugu360 .
కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ గా భాను ప్రకాష్ రెడ్డి
కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ గా నెల్లూరు జిల్లాకు చెందిన భానుప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు
ఆలయ భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు #telugupost #latestnews #viralvideo #ganja
విజయ దుందుభి మోగించిన నిరుద్యోగి రణభేరి..
శ్రీ సత్య సాయి జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజావిశాలాంధ్ర ధర్మవరం;; విజయవాడలో అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో నిరుద్యోగి రణభేరి కార్యక్రమం విజయదుంది మోగించింది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా తో పాటు పదుల సంఖ్యలో విజయవాడలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన నిరసన కార్యక్రమానికి, ర్యాలీకి పాల్గొని, పోరాటాలు కొనసాగించారు. నిరసన కార్యక్రమంలో పోలీసులను కూడా లెక్కచేయకుండా పోరాటమే తన ఊపిరిగా కార్యక్రమాన్ని విజయవంతం […] The post విజయ దుందుభి మోగించిన నిరుద్యోగి రణభేరి.. appeared first on Visalaandhra .
ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ పోటీలకు కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం;;ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ పోటీలకు ధర్మవరం పట్టణంలోని కే.హెచ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు చెందిన కే. ధనుష్ ( బి.కాం) తృతీయ సంవత్సరం ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ బి.ఆనంద్, ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్2025 లో ఎస్కే యూనివర్సిటీ నిర్వహించినటువంటి ఎంపికలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఎంపిక కావడం జరిగిందన్నారు . ఎంపికైన ఈ విద్యార్థి మహారాష్ట్ర లోని సెయింట్ గాడ్జ్ బాబా అమరావతి […] The post ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ పోటీలకు కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక appeared first on Visalaandhra .
Nominations |ముగిసిన నామినేషన్ల గడువు
Nominations | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు
రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాం..
కోకో పంటకు ఆయిల్ పామ్ పంట రీతిలో గిట్టుబాటు ధర కల్పించేందుకు కొత్త చట్టాన్ని తీసుకువస్తాం… నాణ్యమైన కోకో ఉత్పత్తిపై రైతులకు అవగాహన కలిగిస్తున్నాం… త్వరలో విజయవాడలో అంతర్జాతీయ హార్టికల్చర్ కాంక్లేవ్ సదస్సు నిర్వహిస్తాం… ఉద్యానవన పంటల అభివృద్ధి దిశగా రాష్ట్రం… ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ప్రారంభించిన వ్యవసాయ శాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు…. విశాలాంధ్ర ఏలూరు: రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ […] The post రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాం.. appeared first on Visalaandhra .
పెద్ద శేష గరుడ వాహనంలో దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నవదశ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ, శ్రీ గణపతి సచ్చిదానంద దత్త జాన బోధ సభా ట్రస్ట్ కమిటీ సభ్యులు మేటికలకులయప్ప, దత్త శివ, బిల్లే నాగప్ప ,సాగసురేష్, శంకర సంజీవులు, రంగా ,శీనా, గుద్దటి రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండవ రోజున రోజున […] The post పెద్ద శేష గరుడ వాహనంలో దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి appeared first on Visalaandhra .
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ #telugupost #foodpoison #schoolstudents #news
Meet |కేసీఆర్తో కేటీఆర్ భేటీ..
Meet | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఎర్రవెల్లి ఫామ్హౌజ్ లో మాజీ
క్షమాపణ చెప్పిన ఆలయ కమిటీవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందరగల అతి పెద్ద చెట్లను ఆలయ కమిటీ లో గల శంకర సంజీవులు పూర్తిగా తొలగించాడు. ఈ సందర్భంగా అక్కడ పాత్రికేయులు, ప్రజలు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాన్ని చెప్పారు. దీంతో అటవీశాఖ అధికారికి సమాచారం ఇవ్వగా, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఇది చట్టరీత్యా నేరమని తెలిపారు. ఒక చెట్టు పెంచడం ఎంత కష్టమో, పెద్ద […] The post గుడి ముందర చెట్లు నరికివేత.. appeared first on Visalaandhra .
Food poisoning |విద్యార్థులకు అస్వస్థత
Food poisoning | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని ఖమ్మం జిల్లా
కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి: ఐపిఎస్ సంఘం
హైదరాబాద్: పోలీసు అధికారులపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు నిరాధారం అని ఐపిఎస్ అధికారుల సంఘం ఆరోపించారు. కౌశిక్ రెడ్డి తీరును తెలంగాణ ఐపిఎస్ లు ఖండించారు. మనోభావాలను దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని, ఇది సివిల్ సర్వీసెస్ అధికారుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటమేనని విమర్శించారు. గురువారం నిబంధనలకు అనుగుణంగానే స్థానిక పోలీసులు నడుచుకున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని తెలంగాణ ఐపిఎస్ అధికారుల సంఘం సూచించారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఉపాధ్యాయుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం మండల తహసీల్దార్ గీతా ప్రియదర్శినికి ఎస్టీయు రాష్ట్ర పూర్వపు ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, వీరేష్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ పి ఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచినా 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర […] The post ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి appeared first on Visalaandhra .
ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
–ఎస్టియు జిల్లా అసోసియేటివ్ ప్రెసిడెంట్ పి.నాగేంద్రప్ప విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎస్టియు జిల్లా అసోసియేటివ్ ప్రెసిడెంట్ పి.నాగేంద్రప్ప మండల అధ్యక్ష కార్యదర్శులు ఉరుకుందు, రామాంజిని లు డిమాండ్ చేశారు. ఎస్టియు దశల వారి ఉద్యమంలో భాగంగా శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. పీఆర్సీ […] The post ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి appeared first on Visalaandhra .
అభిషేక్, సూర్యలు కాదు.. నా తర్వాత ఆ ఫీట్ సాధించేది అతడే: రైనా
టి-20 ప్రపంచకప్లో సెంచరీ సాధించిన ఏకైక భారత క్రికెటర్ సురేష్ రైనా. 2010 టి-20 ప్రపంచకప్లో వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో రైనా 85 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 101 పరుగులు చేశాడు. అయితే తన తర్వాత టి-20 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసే ఆటగాడు ఎవరో రైనా వెల్లడించాడు. అయితే అది విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాదు.. టీం ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్. ఈసారి ప్రపంచకప్లో సెంచరీ సాధించే సత్తా సంజూ శాంసన్కి మాత్రమే ఉందని రైనా అభిప్రాయపడ్డాడు. ‘‘సంజూ ఓపెనింగ్ బ్యాటర్. సెంచరీ చేయగలిగే సత్తా అతడికి ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ టి-20ల్లో అతడి పేరిట రెండు శతకాలు ఉన్నాయి. సౌతాఫ్రికా మీద సంజూ రెండు సెంచరీలు చేశాడు. ఇక సంజూతో పాటు ఈసారి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లు ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నా ఓటు సంజూకే’’ అని రైనా వివరించాడు. అయితే సంజూ విషయానికొస్తే.. ప్రస్తుతం అతడు పేలవమైన ప్రదర్శన చేస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న టి-20 సిరీస్లో నాలుగు మ్యాచుల్లో 10, 6, 0, 24 పరుగులు చేశాడు. ఈ తరుణంలో రైనా, సంజూకి మద్దతుగా నిలవడం విశేషం.
Governor visits |అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్
Governor visits | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రాష్ట్ర గవర్నర్ జిష్ణు
sam2026 |సమంత పేరు మారబోతుందా? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్ ఇదే!
sam2026 | సమంత పేరు మారబోతుందా? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్ ఇదే!
Mood of the Nation: DMK Alliance Dominates Tamil Nadu, Vijay Alters the Game
The latest Mood of the Nation survey conducted by India Today in association with C-Voter offers a clear snapshot of Tamil Nadu’s shifting political landscape. The findings suggest that if Lok Sabha elections were held now, the DMK-led INDIA alliance under Chief Minister M K Stalin would once again dominate the state with a near […] The post Mood of the Nation: DMK Alliance Dominates Tamil Nadu, Vijay Alters the Game appeared first on Telugu360 .
Death | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా
Video : Om Shanti Shanti Shantihi Movie Review
The post Video : Om Shanti Shanti Shantihi Movie Review appeared first on Telugu360 .
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేయాలి : కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : జిల్లాలోని రెవెన్యూ రికార్డుల్లో దొర్లిన తప్పులన్నిటినీ సరిదిద్ది, భూ వివాదాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజాంలో జరిగిన చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రీ-సర్వేలో జరిగిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.వీఆర్వోలు, సర్వేయర్లు క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు పరిశీలించాలని, తప్పుల్లేని పాస్ పుస్తకాలను మాత్రమే ముద్రణకు పంపాలని సూచించారు. పెండింగ్లో ఉన్న […] The post రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేయాలి : కలెక్టర్ రాంసుందర్ రెడ్డి appeared first on Visalaandhra .
మజ్జి గౌరీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్
విశాలాంధ్ర- రాజాం ( విజయనగరం జిల్లా): ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవంగా భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీ శ్రీ మజ్జి గౌరీ అమ్మవారి 47వ జాతర మహోత్సవాలు రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. జాతర ప్రారంభోత్సవంలో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… జాతరకు విచ్చేసే భక్తులకు ఎటువంటి […] The post మజ్జి గౌరీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ appeared first on Visalaandhra .
Ramakrishna Mission |యువతలో మార్పునకు..
Ramakrishna Mission | యువతలో మార్పునకు.. Ramakrishna Mission | ఆంధ్రప్రభ, విజయవాడ
Bhawanipuram |అభివృద్ధి పనులకు శ్రీకారం..
Bhawanipuram | భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని సర్కిల్ 1
Rx100 Director |ఘట్టమనేని వారసుడు జయకృష్ణకు సక్సెస్ అందించేనా?
Rx100 Director | ఘట్టమనేని వారసుడు జయకృష్ణకు సక్సెస్ అందించేనా? Rx100 Director
Tributes |గాంధీజీకి ఘన నివాళి
Tributes | భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ గాంధీ హిల్ ఫౌండేషన్ కమిటీ
MP | శ్రీవారి సేవలో.. MP | విజయవాడ, ఆంధ్రప్రభ : తిరుమల
Minister |విద్యాభివృద్ధికి ముందడుగు
Minister | విద్యాభివృద్ధికి ముందడుగు Minister | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :
Bapuji | అందరికీ ఆదర్శం Bapuji | పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : అహింస,
suspended |మగ్గిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెన్షన్
suspended | మగ్గిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెన్షన్ suspended | ధర్మపురి,

18 C