pledge |జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ
pledge | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయం విశ్వవిద్యాలయం వారి
ఐటీ మంత్రిగా డిజిటలైజేషన్ ప్రధాన బాధ్యత: లోకేష్
అమరావతి: ఎలక్ట్రానిక్స్ క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కు.. ఎపి నమ్మకమైన గమ్యస్థానం అని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. డిజిటల్ వ్యవస్థలు పాలనకు కేంద్ర బిందువుగా మారాయని అన్నారు. దావోస్ రెన్యూ పవర్ ఆధ్వర్యంలో సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎపికి..160 గిగావాట్ల పునరుత్పాదన శక్తి సామర్థ్యం ఉందని, భారత్ లోనే తొలి గ్రీన్ అమ్మోనియా టెర్మినల్ ఎపిలో ఉందని తెలియజేశారు. ప్రస్తుత ప్రపంచంలో మూడు ‘డి’ లు ప్రాముఖ్యత సంతరించుకున్నాయని, ఒక చారిత్రక దశలో ఉన్నామని అన్నారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, డీ- గ్లోబలైజేషన్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయని, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిగా డిజిటలైజేషన్ తన ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. డిజిటల్ వృద్ధికి భారీ ఇంధన అవసరం ఉంటుందని, డేటా సెంటర్లు, ఎఐ కంప్యూట్.. స్వచ్ఛమైన, నమ్మదగిన విద్యుత్ లేకుండా విస్తరించలేవని లోకేష్ స్పష్టం చేశారు.
రూ.80 వేల చిలుక కనిపించడంలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
అమరావతి: మూడేళ్ల నుంచి పెంచుకున్న చిలుక ఎగిరిపోవడంతో ఓ పక్షి ప్రేమికుడు శోకసంద్రంలో మునిగిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల కొత్తపాలేనికి చెందిన బండారు దొరబాబు అనే యువకుడు బట్టలషాపు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్లో రూ.80 వేల రూపాయలకు చిలుకను కొనుగోలు చేసి గత మూడు సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నాడు. అది మనుషుల మాటలను అనుకరించడంతో దానికి చార్లి అనే పేరు పెట్టి కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా చిలుకను పంజరంలోని బయటకు తీశాడు. అది తుర్రుమని ఎగిరిపోయి మళ్లీ ఇంటికి రాలేదు. కొత్తపాలేం గ్రామ శివారులో ఎక్కడ వెతికినా అది కనిపించకపోవడంతో దాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అది కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
రిషి విద్యాలయాకి అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక ఐఎస్ఓ సర్టిఫికేషన్
-పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని రిషి విద్యాలయం పాఠశాలకు నాణ్యతా ప్రమాణాల పరంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 9001:2015(క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టం) ధృవీకరణ పత్రం లభించింది. కె.వి క్యూఏ సర్టిఫికేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్వహించిన సమగ్ర తనిఖీల అనంతరం, కిండర్ గార్డెన్ నుంచి 7వ తరగతి వరకు అందిస్తున్న విద్యా సేవలు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు గుర్తించి ఈ ధృవీకరణను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలడీన్ భాస్కర్ రెడ్డి […] The post రిషి విద్యాలయాకి అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక ఐఎస్ఓ సర్టిఫికేషన్ appeared first on Visalaandhra .
స్పెల్ బి పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపికైన బిఎస్ఆర్ బాలికల పాఠశాల విద్యార్థులు
-హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల ప్రభుత్వ బిఎస్సార్ మునిసిపల్ బాలికల ఉన్నత పాఠశాల ఇద్దరు విద్యార్థులు స్పెల్ బి ( పదమునకు అక్షరాలు పలుకుట- ఉచ్చారణ లో స్పష్టత)కాంపిటీషన్లో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్పెల్ బి కాంపిటీషన్లో పాఠశాలకు చెందిన […] The post స్పెల్ బి పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపికైన బిఎస్ఆర్ బాలికల పాఠశాల విద్యార్థులు appeared first on Visalaandhra .
Prabhu Deva’s Son to make his Acting Debut
Prabhu Deva made his debut as Choreographer, he soon turned an actor and he went on to direct super hit films in India. He is balancing his career as an actor, director and choreographer from the past few decades. Prabhu Deva is all set to launch his son Rishii Ragvenar Deva as an actor in […] The post Prabhu Deva’s Son to make his Acting Debut appeared first on Telugu360 .
మహిళల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూదాన్ పోచంపల్లి, జనవరి 23 (జనం సాక్షి): మహిళలలు అన్ని రంగాల్లో …
రాష్ట్ర శకటానికి దక్కని చాన్స్ RepublicDay #Telangana#KartavyaPath #Tableau
యాప్ లో యూరియా కొనలేక రైతుల ఇబ్బందులు
రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం రైతుబంధు సమితి మాజీ మండల కన్వీనర్ బచ్చు రామకృష్ణ మర్రిగూడ, జనవరి 23 (జనం సాక్షి)ప్రభుత్వం …
–పంచాయితీ అధికారిని గౌతమి విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): పరిసరాలు పరిశుభ్రతతోనే ఆరోగ్యమని పోతంగి పంచాయితీ కార్యదర్శి గౌతమి అన్నారు. మండల కేంద్రం డుంబ్రిగుడ లొ డ్రైనేజీలు తోపాటు పరిసరాలు చుట్టూ ఉన్నఇతర చెత్తచెదారాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఎటువంటి జబ్బు జ్వరాలు రావని చెప్పారు. గ్రామంలో ఎటువంటి జబ్బు జ్వరాలు రాకుండా ఉండేందుకు నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా చేయించడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో గ్రామస్తులుకూడా […] The post పరిసరాలు పరిశుభ్రతతో ఆరోగ్యం appeared first on Visalaandhra .
అతివేగంతో చెట్టును కారు ఢీకొని.. ఇద్దరు మృతి
అమరావతి: కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో చెట్టును కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఆదోని నుంచి ఎమ్మిగనూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Megastar |పవర్ స్టార్ అభినందనలు..
Megastar | పవర్ స్టార్ అభినందనలు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నాలుగు
Telangana | ఎంపీడీవోకు వినతి.. Telangana, చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని
రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: కెటిఆర్
హైదరాబాద్: ఎన్ని కేసులు పెట్టినా.. భయపడకుండా రాష్ట్రం కోసం పోరాడిన నాయకత్వం తమ పార్టీది అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొనియాడారు. అనుక్షణం ప్రజలు, రాష్ట్రం కోసమే పనిచేశామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో జూబ్లీహిల్స్ లో సిట్ విచారణకు వెళ్తున్న నేపథ్యంలో ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు రాష్ట్రం కోసమే పనిచేశామని, తాము ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదని తెలియజేశారు. రెండేళ్లు టైమ్ పాస్ చేసుకుంటూ వచ్చారని, తాము ఎప్పుడూ టైమ్ పాస్ కార్యక్రమాలు చేయలేదని అన్నారు. ప్రతిపక్షాలను ఎప్పుడూ వేధించలేదని, ఎంక్వైరీలకు భయపడేది లేదని కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. అప్పుడు దొరికిన ఆ దొంగ.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. రోజుకో అంశంలో డ్రామా చేస్తున్నారని, పుట్టిన భూమి సాక్షిగా తాను ఎప్పుడూ అక్రమ, అనైతిక పనులు చేయలేదని అన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని వ్యక్తిత్వహననం చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో డైలీ సీరియల్ లా లీకులు ఇచ్చి తమ వ్యక్తిత్వహననం చేస్తున్నారని.. తన పరువు, ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవరు బాధ్యులు అని కెటిఆర్ ప్రశ్నించారు.
మూడు నెలల విరామం తర్వాత శుక్రవారం సిమ్లాలో ఈ సీజన్కు తొలి మంచు కురిసింది.
ప్రముఖ వ్యవసాయ శ్రాస్తవేత్త సిద్దిఖీ ఇకలేరు
హైదరాబాద్: మేధావి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఈబ్రహీం అలీ అబూబకర్ సిద్ధిఖీ (89) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. దేశంలో వరి వంగడాల పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. హైబ్రిడ్ వరి సాగును ప్రోత్సహించడంతో పాటు ఎక్కువ మొత్తంలో ఉత్పతి చేయడంతో ఆయన 'భారత హైబ్రిడ్ వరి పితామహుడు' అని పిలుస్తారు. ఇవాళ భారత దేశం బియ్యం ఎగుమతుల్లో తొలి స్థానంలో ఉండటానికి ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని రైతుల, మేధావులు ప్రశంసిస్తున్నారు. ప్రపంచంలో అధిక దిగుబడినచ్చే పొట్టి రకం బాస్మతి వంగడం 'పూసా బాస్మతీ-1'ని అభివృద్ధి చేశారు. వరి ఉత్పత్తిలో విశేషమైన కృషి చేయడంతో ఆయన భారత ప్రభుత్వం పద్మశ్రీతో పురస్కరించింది. ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ పేరు మీద ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు కూడా ఆయనను వరించింది. ఇండియన్ కౌన్సిల్ ఆప్ అగ్రికల్చరల్ రీసెర్చ్, హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆప్ రైస్ రీసెర్చ్లో డైరెక్టర్గా సేవలందించారు. తమిళనాడుకు చెందిన సిద్ధిఖీ రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు.
పి.వి.సింధు సత్తా 500 విజయాల ఘనత #Sports #PVSindhu #Badminton #IndonesiaMasters
Telangana : రెండేళ్లుగా నన్ను వ్యక్తిత్వ హననం చేస్తున్నారు
రాజకీయ ఆరోపణల డైవర్షన్ నేపథ్యంలోనే ఈ సిట్ నోటీసులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
Police |అందరూ సేఫ్టీ రూల్స్ పాటించాలి..
Police | అందరూ సేఫ్టీ రూల్స్ పాటించాలి.. Police, చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
Telangana : ఉప్పల్ వెళ్లే వారికి అలెర్ట్. ఈ మార్గంలో వెళితే అంతే
ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే వారు ఈ నెల రోజుల పాటు ఇబ్బందులు పడాల్సిందే.
TG |కలెక్టర్ కార్యాలయంలో.. కాలుష్యం బాధితులు..
TG | కలెక్టర్ కార్యాలయంలో.. కాలుష్యం బాధితులు.. TG, చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
ప్రపంచంలో రెండో రద్దీ నగరంగా బెంగళూరు #News #TeluguNews #Traffic #Bengaluru #TomTom #hyderabad
ప్రేక్షకుల చిరునవ్వే నాకు ఎనర్జీ
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడిల ఇండస్ట్రీ బ్లాక్బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. అర్చ న సమర్పించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్తో హౌస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “పవన్ కళ్యా ణ్ మా చిత్రాన్ని అభినందించడం చాలా ఆనందాన్నిచ్చింది. అలాగే ఇండస్ట్రీలో డైరెక్టర్లు, హీరోలు చాలామంది ఫోన్ చేశారు, మెసేజ్లు పెట్టారు. ఈ సక్సెస్ని మాతో పా టు ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. -ఈ సినిమా కోసం చిరంజీవి ఫస్ట్ ఫోటో షూట్ చేయగానే లుక్ చూసి అద్భుతంగా అనిపించింది. చాలా గ్లామర్ గా ఉన్నారు. సన్నబడిపోయారు. ఈ లుక్ సినిమా అంతా ఉంటే ఆడియన్స్ ఈ లుక్కి ఫిదా అయిపోతారు అనిపించింది. ఆయన లుక్, స్క్రిప్ట్, టైమింగ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కుదిరాయి. వింటేజ్ చిరంజీవిని చూసి అందరూ మైమరచిపోయారు. -చిరంజీవి, వెంకటేష్ కలిసి కనిపించబోతున్నారంటే కచ్చితంగా చాలా అంచనాలు ఉంటాయి. అందరికీ నచ్చేలా చూపించడం కూడా పెద్ద టాస్క్. అయితే చిరంజీవి, వెంకటేష్ మధ్య ఉన్న స్నేహం వల్ల నా పని సులభమైంది. థియేటర్స్ లో చిరంజీవి, వెంకటేష్ సీన్స్ను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో శంకర్ వరప్రసాద్ క్యారెక్టర్ జర్నీ చూపిద్దాం అనుకున్నాను. అయితే శశిరేఖ లవ్ ట్రాక్ మాత్రం ముందు స్క్రిప్ట్లో మధ్యలో వస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ స్క్రీన్ ప్లే ప్రకారం అది ప్రారంభంలోనే వస్తేనే ఇంకా కనెక్టింగ్గా ఉంటుందని దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అది ఇంకా అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. మందు సీన్స్లో చిరంజీవి చేసే మ్యానరిజమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ సీక్వెన్స్ వెంకటేష్, ఆయనకి మధ్య ఉండే కనెక్షన్ని కూడా బయటపెడుతుంది. అది థియేటర్లో అద్భుతంగా పేలింది. -అభిమానుల స్పందన మాటల్లో చెప్పలేను. నన్ను చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవిని ఇలా చూడాలని వాళ్లు కోరుకున్నారు. ఈ సక్సెస్ ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. థియేటర్స్లో ఆడియన్స్ని చూస్తున్నప్పుడు ఒక జాతర లాగా అనిపించింది. అన్ని వయసుల ప్రేక్షకులు ఈ సినిమాని సెలెబ్రేట్ చేసుకున్నారు. -థియేటర్స్లో ఆడియన్స్ నవ్వుతున్నంత సేపు వాళ్ళ చిరునవ్వే నాకు ఎనర్జీ. రాజమౌళి తర్వాత వరుసగా తొమ్మిది విజయాలు అందుకున్న దర్శకుడిగా రికార్డు సృష్టించడం ఆనందంగా ఉంది. నా పదో సినిమాకి ఒక ఐడియా వచ్చింది. ఈసారి టైటిల్ ప్రకటన నుంచి ఒక విచిత్రమైన జర్నీ ప్రారంభం కాబోతోంది. స్టోరీ లైన్ ఫిక్స్ అయ్యాను. ఇంకా నటులు ఫిక్స్ కాలేదు. జూన్, జూలైలో సినిమా ప్రారంభించాలి. అది కూడా మంచి ఎంటర్టైనర్. ఇక దర్శకుడిగా రాజమౌళి చేసే సినిమాలు వేరు. నేను చేసే సినిమాలు వేరు. డైరెక్టర్గా ఆయన ఎంతో ఎత్తున ఉన్నారు. ఆయన నాకు ఇష్టమైన దర్శకుడు. నేను ఇప్పుడే ప్రయాణాన్ని మొదలు పెట్టాను. ఇంకా ఎంతో దూరం ప్రయాణించాలి. భీమ్స్తో మ్యూజిక్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. తను సినిమా కోసం ఎన్ని వర్షన్స్ అయినా చేస్తాడు. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడి పని చేశాడు”అని అన్నారు.
2026 is a Crucial year for UV Creations
UV Creations emerged as one of the top production houses in no time in Telugu cinema. They are closely associated with Prabhas and produced films with him. Later, Prabhas has done several projects outside UV Creations due to his professional commitments. The top banner delivered a series of duds and is in struggling mode. They […] The post 2026 is a Crucial year for UV Creations appeared first on Telugu360 .
Weather Report : చలి నుంచి వేడి వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యంతో అలెర్ట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చలి తీవ్రత కొంత మేర కొనసాగుతుంది.
హరీశ్ రావు కోసం ఆరుగురి ఫోన్లపై అక్రమ నిఘా! #SIT #PhoneTapping #HarishRao #EtelaRajender
Telangana : నేడు సూర్యాపేట జిల్లాకు గవర్నర్
తెలంగాణ గవర్నర్ జిష్టుదేవ్ వర్మ నేడు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. మాజీ ఎంఎల్ఎ, వైసిపి నేత కేతిరెడ్డి, టిడిపి నేత జెసి ప్రభాకర్రెడ్డి మధ్య సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు కేతిరెడ్డి సవాల్ విసిరారు. కేతిరెడ్డి ఇంటి ముట్టడికి జెసి వర్గీయుల పిలుపునిచ్చారు. శుక్రవారం కేతిరెడ్డి ఇంటి దగ్గర చర్చకు రెడీ అని జెసి వర్గం తెలిపింది. జెసి వర్గీయులు రాళ్లు డంప్ చేశారని కేతిరెడ్డి ఆరోపణలు చేశారు. తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు.
Gold Price Today : గుడ్ న్యూస్.. భారీగా పతనమయిన బంగారం.. వెండి కూడా
నేడు బంగారం ధరలు భరీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
తెలుగువారి గుండెల్లో నిలిచిపోయే ‘గొల్ల రామవ్వ’
తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించిన ‘గొల్ల రామవ్వ’ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని... ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ముఖ్య అతిధులు పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంఛిత వీరగాథను... సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడక్షన్ - వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై... రామ్ విశ్వాస్ హనూర్కర్ - రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించడంతోపాటు... సాహిత్యం సమకూర్చడం విశేషం. ‘గొల్ల రామవ్వ’ ఈనెల 25 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకలో పి.వి.నరసింహారావు తనయులు పి.వి.ప్రభాకరరావు, తనయ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్, రాజీవ్ కనకాల, యాటా సత్యనారాయణ, ఉదయభాస్కర్ పాల్గొని... చిత్ర దర్శకుడు ముళ్ళపూడి వరా, నిర్మాతలు రామ్ విశ్వాస్ హనూర్కార్, రాఘవేంద్రవర్మలను అభినందించారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సమీక్ష సమావేశంలో జివిఎంసి ఇంజినీర్ గుండెపోటుతో మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా గాజువాక జోనల్ ఆఫీస్లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభి రామ్ సమీక్ష సమావేశంలో జివిఎంసి ఇంజినీర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సమావేశంలో జివిఎంసి సూపరింటెండింగ్ ఇంజనీర్ జి. గోవిందరావుకు ఛాతీలో నొప్పి వస్తుందని ఊపిరి ఆడడం లేదని చెప్పి కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గోవిందరావు మృతి చెందినట్టు పరీక్షించిన వైద్యులు తెలిపారు.
Tirumala : నేడు తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్
తిరుమలకు భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
నేడు వసంత పంచమి.. కిటకిటలాడుతున్న బాసర
నేడు వసంత పంచమి సందర్భంగా పెద్దయెత్తున భక్తులు సరస్వతి క్షేత్రాలకు తరలి వచ్చారు
Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ నేడు విడుదల అయింది
Amaravathi : నేడు అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగనుంది
Jana Nayagan Release: Focus shifts towards TVK
Tamil actor Vijay is making his full time debut into Tamil Nadu politics and he completed his last film Jana Nayagan and the film was slated for Sankranthi 2026 release. But with the censor hurdles uncleared, the film missed the holiday season. Vijay’s fans were left frustrated because of the continuous delays and they kept […] The post Jana Nayagan Release: Focus shifts towards TVK appeared first on Telugu360 .
Chandrababu : నేడు దావోస్ నుంచి అమరావతికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు దావోస్ నుంచి రానున్నారు
తిరుపతిలో శ్రీవారి భక్తుడు అదృశ్యం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో శ్రీవారి భక్తుడు అదృశ్యమయ్యాడు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. బిహార్ రాష్ట్రం దర్బంగ్ జిల్లాకు చెందిన 469 మంది ప్రత్యేక రైలులో తిరుపతికి వచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి చేరుకున్న భక్తులు వేరు వేరు చోట్ల పలు లాడ్జిలలో బస చేశారు. దేవి, షాబుకుమార్ దంపతులు శ్రీనివాసం ఎదురుగానున్న శ్రీహరి లాడ్జ్ రూమ్ నెంబర్ 303లో బస చేశారు. రూమ్ నుండి బయటకు వచ్చిన షాబుకుమార్ ఎంతసేపటికి రాకపోవడంతో స్నేహితులను భార్య దేవి ఆశ్రయించింది. ఎంత వెతికినా షాబు కుమార్ (72) జాడ కనపడకపోవడంతో ఈస్ట్ పోలీసులకు భార్య సమాచారం ఇచ్చింది. క్రైమ్ నెంబర్ 57/2026 కేసు నమోదు చేసి ఈస్ట్ ఎస్ఐ ప్రసాద్ విచారిస్తున్నారు.
23rd Jan Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
23rd Jan Cartoon సినిమాల ప్రభావం రాజకీయాల్లోనూ? విజిల్ – విజయ్కు ప్రత్యేక
India vs New Zealand : నేడు భారత్ - న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
భారత్ - న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు రాయ్ పూర్ లో జరగనుంది.
అన్నమయ్య జిల్లాలో సిఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
అమరావతి: సిఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో జరిగింది. పుంగనూరులో కానిస్టేబుల్ చెన్నారెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్కు వై ప్లస్ కేటగిరి గన్మెన్గా చెన్నారెడ్డి (28) పనిచేస్తున్నాడు. మృతుడు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వాసి అని పోలీసులు తెలిపారు.
Video: Anil Ravipudi Exclusive Interview
The post Video: Anil Ravipudi Exclusive Interview appeared first on Telugu360 .
KTR : నేడు సిట్ విచారణకు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కానున్నారు
Telangana : దావోస్ లో తెలంగాణకు కుదిరిన ఒప్పందాలివే.. ఏర్పాటు కానున్న సంస్థలివే
దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో తెలంగాణ కీలక ఒప్పందాలను చేసుకుంది.
సమరోత్సాహంతో భారత్.. నేడు కివీస్ తో రెండో టి20
రాయ్పూర్: న్యూజిలాండ్తో శుక్రవారం రాయ్పూర్ వేదికగా జరిగే రెండో టి20 మ్యాచ్కు ఆతిథ్య భారత జట్టు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్పై మరింత పట్టు సాధించాలనే లక్షంతో బరిలోకి దిగుతోంది. తొలి టి20లో ఓడిన న్యూజిలాండ్కు ఈ మ్యాచ్ సవాల్గా మారింది. ఇందులో గెలిచి తిరిగి గాడిలో పడాలనే పట్టుదలతో కివీస్ కనిపిస్తోంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగడం ఖాయం. నాగ్పూర్ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఈసారి కూడా బ్యాటింగ్పైనే రెండు జట్లు ఆశలు పెట్టుకున్నాయి. తొలి టి20లో భారత యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడి చేసిన అభిషేక్ భారత్కు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే తొలి మ్యాచ్లో సంజు శాంసన్, ఇషాన్ కిషన్లు విఫలం కావడం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈసారైనా వీరు తమ బ్యాట్లకు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ మరింత బాధ్యతతో ఆడక తప్పదు. రింకు సింగ్, హార్దిక్ పాండ్యలు ఫామ్లో ఉండడం భారత్కు ఊరట కలిగించే అంశం. కిందటి మ్యాచ్లో రింకు మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. నాగ్పూర్లో భారీ స్కోరు సాధించినా బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఫీల్డింగ్ చాలా పేలవంగా సాగింది. ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దు కోక తప్పదు. బౌలర్లు కూడా మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ప్రతీకారం కోసం.. మరోవైపు తొలి టి20లో ఓడిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో గెలిచి తిరిగి గాడిలో పడాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగానే ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో కివీస్ కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది.
బెంగళూరులో కొరియా మహిళకు లైంగిక వేధింపులు
బెంగళూరు : దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళకు బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేసే మహమ్మద్ అఫాన్ అహమద్ ఈ మహిళను భద్రతా తనిఖీల పేరిట లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. రెండు మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఈ నిందితుడిని అరెస్టు చేశారు. స్వదేశానికి వెళ్లేందుకు టర్మినల్ 2లో ఇమిగ్రేషన్ నిబంధనలు పాటిస్తున్నప్పుడు ఈ మహిళను లైంగికంగా వేధించారు. తనిఖీలు సోదాల పేరిట అసహ్యంగా ప్రవర్తించారని వెల్లడైంది. లగేజీలో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని చెప్పి సిబ్బందిలో ఓ వ్యక్తి తనను ఎవరూ లేని చోటికి మగవారి వాష్రూం వద్దకు తీసుకువెళ్లేందుకు యత్నించాడని మహిళ తెలిపింది. తనను హత్తుకోవడం, శరీరం తడమడం వంటి పనులకు దిగాడని తెలిపింది. తాను ప్రతిఘటించడంతో ఈ వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడని పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొంది. అక్కడి కెమెరాల పరిశీలన తరువాత కేసు నమోదు చేశారు. వ్యక్తిని విచారిస్తున్నారు.
మనతెలంగాణ/హైదరాబాద్:‘తెలంగాణ రైజిం గ్’ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులోనూ తెలంగాణ ఆశించిన లక్ష్యాన్ని సాధించింది. వర ల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో పెట్టుబడులకు మించి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ప్రభు త్వ సంకల్పం నెరవేరింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో ప్రతినిధుల బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడుల ను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కా ర్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒ ప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర ల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగం హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫాలో అప్ ఫోరం నిర్వహించాలనే ప్రతిపాదన కు సానుకూల స్పందన లభించింది. మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రము ఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలు కీలక సమావేశాలు, ప్ర త్యేక సెషన్ల అనంతరం మూడు రోజు ల తెలంగాణ ప్రతినిధి బృందం దావోస్ ప ర్యటన గురువారం సాయంత్రం ముగిసింది. దా వోస్లో కార్యక్రమాలు ముగించుకొని సిఎం రేవంత్ రెడ్డి జూరిచ్ బయల్దేరారు. అక్కడి నుంచి సిఎం అమెరికా పర్యటనకు వెళుతున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దావోస్ నుంచి ఇండియాకు తిరుగు పయనమయ్యారు.
కులరాక్షసత్వంపై మోగిన ‘దండోరా’
కులం పునాదుల మీద జాతిని, నీతిని నిర్మించలేమని బాబాసాహేబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పారు. ఈ భారతదేశం అంటేనే కులాలు... కుల ఆధిపత్యాలు. అటువంటి కులరక్కసి వందేళ్లకు దగ్గరకు కావొస్తున్నా.. ప్రపంచం అంతా ఆధునికంగా దూసుకుపోతున్న కులం మన దేశంలో అవకాశాలనే కాదు.. మనుషుల ప్రాణాలను తీసేంత కారణం అవుతోంది. కులం కట్టుబాట్ల పేరుతో ఇంకా వేధింపులు భరించలేక భయంతో తలవంచుకు బతుకుతున్న పరిస్థితులు. కులం మాటను ధిక్కరిస్తే... కాటికి మోయడానికి శవాన్ని తీసుకెళ్లడమే కాదు.. ఆ కులానికి సంబంధించిన శ్మశానంలో దహన సంస్కారాలు చేయడానికి వీలు లేదని కర్కషత్వంగా ప్రవర్తించే కులరాక్షసత్వంపై.. కులం పేరిట జరుగుతున్న దాడులు, హత్యలపై దండోరా మోగించారు సినీ దర్శకుడు మురళీకాంత్. ఆయన చేసిన ప్రయోగం నిజంగా చాలా గొప్పది. సాహసంతో కూడినదని చెప్పొచ్చు. కులం... ఇది రెండు అక్షరాలే కానీ దాని వెనుక అంతులేని ఆవేదనలు ఉంటాయి. అయితే ఆ ఆవేదనలు బయటకు కన్పించకుండా ఎలా కనుమరుగు చేస్తున్నారో.. పల్లె మనుషుల్లో కులం ఎంత చిచ్చురేపుతోందో దండోరా సినిమాలో దర్శకుడు చూపగలిగారు. నిజంగా ఈ దేశంలో ప్రతిభ ఎంత గొప్పగా ఉన్నా చివరికి దానికి కొలమానం కులం అవుతుందే. ఎంత గొప్ప మనసు ఉన్నా .. గొప్ప చదువు ఉన్నా కులం రాక్షసత్వంపై అవేమీ పనిచేయవు. పల్లెల్లో నిత్యం జరిగే సంఘటనలనే అతి సాధారణంగా సినిమాలో చూపారు. కానీ ఆ దండోరా దగా పడ్డ గుండెల ఆవేదనలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ప్రతీ మనిషి జీవితంలో పుట్టుక, మరణం సాధారణం. అయితే తక్కువ కులంలో పుట్టినంత మాత్రాన తరతరాలుగా చీదరించుకునే పరిస్థితి. తక్కువ కులంలో పుట్టి గొప్ప కొలువు, గౌరవం ఉన్నా.. ఆ మనిషికి గౌరవించబడకపోవడానికి కారణం చూపగలిగారు. తరతరాల ఆచారాలే తప్ప.. కింది కులం వారి ఆలోచనలకు విలువనీయని పరిస్థితిని చక్కగా వివరించారు. మనిషి పుట్టుక ఎటువంటి అవకాశాలకు దగ్గర చేస్తుందో.. కింది వర్గాలను ఎలా దూరం చేస్తుందో తెలిపే ప్రయత్నం గొప్పగా చేశారు. ఓ కింది కులం వారికి తమ శ్మశానంలో దహనం చేసే అవకాశం లేకపోగా.. గుడి మైలపడిపోతదని భావించి అవతలి వైపు నుంచి తిప్పి పంపడమో.. ఊరి అవతలి నుంచి పంపడమో చేస్తుంటారు.. అటువంటి సన్నివేశం గుండెలను గాయం చేస్నిట్లు చేస్తుంది. అటువంటి అనేక సంఘటనలు, యదార్థ ఘటనలు ప్రస్తుతం సమాజంలో ఇంకా చీకటిలో ఉన్నట్లుగా బయటపడనివి ఎన్నో ఉన్నాయి. రెండు స్వచ్ఛమైన మనసులు కలిసి.. కులాలకు అతీతంగా కలిసిన ఆ మనసులను మూర్ఖత్వంగా విడగొట్టే ప్రయత్నంలో మనుషులను పొట్టన పెట్టుకోవడానికి వెనుకాడడం లేదు. కులం తక్కువోడికి తమ బిడ్డను ఇస్తే నలుగురిలో ఎలా తిరగగలను అని మనుషులను ద్వేషింవడమే కాదు.. హత్య చేయడమే మంచిది అన్నట్లుగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను కళ్లకు చూపించారు. మీరు ఎంత గొప్ప చదువులు చదివినా.. ఎంత ఆస్తి ఉన్నా.. పుట్టిన పుట్టుక మారదంటూ తాతల నాటి బానిసత్వాన్ని చూస్తున్నారే తప్ప కింది కులాల్లోని గొప్ప మనసులను అర్థం చేసుకునే స్థితిలో లేరు. రెండు కులాలు కలిస్తేనే పెళ్లి తప్ప.. పెళ్లికి రెండు మనసులు కలిస్తే సరిపోదు.. రెండు కులాలు కూడా కలవాలి లేకుంటే ఎంతకైనా తెగించేందుకు సిద్ధం అవుతున్నారు. కులం బలం అవ్వాలి అంతే గానీ పెనుభూతంలా మారకూడదు. అటువంటి కులరాక్షత్వంపై తెలంగాణ యాసభాషలో దండోరా ఆవేదనల గుండెలను ఆవిష్కరించింది. కులం పేరుతో జరిగే గాయాలు... కులం ఆధిపత్యం దాడిలో బలయ్యే జీవితాల యెథలను కళ్లారా చూపగలిగారు. కుల వివక్ష తీవ్రంగా ఉన్న రోజులను, కుల కట్టుబాట్ల వల్ల విచ్ఛిన్నం అవుతున్న కుటుంబాలను, పల్లెలను వీడి పట్టణాలకే పరిమితమయ్యేలా కుల రాక్షసత్వాన్ని వివరించగలిగారు. కులం కేవలం కింది వర్గాలనే కాదు ఉన్నత వర్గాల్లోనూ కట్టుబాట్ల పేరిట ఎంత భయపెట్టిందో అర్థం అవుతుంది. కులానికి ఎదురు తిరిగితే.. కులం మాట వినకపోతే ఆఖరి ప్రయాణం అంత్యక్రియలకు కూడా షరతులు విధిస్తూ రాక్షస ఆనందాన్ని పొందిన విధానం.. చైతన్యం కలిగిన, సమాజాన్ని ప్రశ్నించే సత్తా కలిగిన వారుంటే కుల కట్టుబాట్ల పేరుతో వారిని వెలేయడం నాటి అనాగరిక కుల రక్కసి కన్పిస్తుంది. కులం అనే గర్వం ఆ మనిషి.. ఆ కుటుంబాన్ని ఎంత ఛిన్నాభిన్నం చేస్తుందో అద్భుతంగా చూపగలిగారు. ఎక్కువ కులం అమ్మాయిని ప్రేమించినందుకు తక్కువ కులం వాడంటూ హత్య చేసి తమ కులం గొప్ప కులం అని ఆధిపత్యాన్ని చాటుకోవడం గొప్ప అయింది. కులం సమాజంలో బలం అవ్వాలి.. అంతేగానీ ఆవేదనలకు కారణం కాకూడదు. అటువంటి అనేక ఆవేదనలకు దండోరా సాక్ష్యంగా నిలిచింది. కుల ఆధిపత్యం వల్ల కన్నతల్లి లాంటి పల్లెలనే ద్వేషించేలా కుల రాక్షసత్వం ఏవిధంగా ఉంటుందో చూపగలిగారు. అందుకే పల్లెలకు దూరంగా చదువుకున్న వారంతా వెళ్లిపోయి ఊళ్లంటేనే అయిష్టతగా మార్చివేసింది. అటువంటి సమయంలో కుల వివక్షపై అవగాహన సమావేశాల్లోనూ అంబేద్కర్, పెరియర్, జ్యోతిరావు ఫూలే వంటి సామాజిక శక్తుల పేర్లు తీసుకొని సమసమాజం కోసం ఎలా కొట్లాడాలో నేర్పే ప్రసంగం ఆసక్తిని కలిగిస్తుంది. దర్శకుడు ఈ విషయంలో పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. మహనీయుల పేర్లను సినిమాలో చాలా అరుదుగా వాడుకునే సందర్భం నుంచే వారి మాటలను విద్యార్థులకు ప్రసంగాల పేరిట విన్పించి నేటి తరానికి ఓ సందేశాన్ని ఇచ్చినట్లు చేశారు. చదవండి పిచ్చిపట్టినట్లు చదవండి.. ఏది తప్పనిపిస్తే దానిని నిలదీయండి అంటూ.. బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటేనే రాజకీయం తెలుస్తది. రాజకీయం తెలిస్తేనే బతుకులు బాగుపడతాయంటూ ప్రస్తుత తరానికి సైతం ఓ మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇదిలా ఉంటే కింది కులాల వారికి గుడిలోకి ప్రవేశానికి వందేళ్లు పట్టిందనే సత్యాన్ని చెప్పారు. కులాల కుంపటిలో తల్లి లాంటి బిడ్డను కోల్పోయిన తండ్రి.. ఆవేదన. తండ్రి ఆవేశం వల్ల చెల్లిని కోల్పోయాననే ఆవేశంతో కన్న కొడుకు తండ్రిని అసహ్యించుకునే సందర్భం... ఆవేశం, ఆవేదనలకు అంతులేని దుఃఖానికి దండోరా సాక్ష్యంగా కన్పించింది. చివరగా ఏ ఆధిపత్య కులం అని గర్వంగా విర్రవీగాడో.. ఆ కులమే ఆయన అంత్యక్రియలనే ఆఖరి మర్యాదకు అడ్డుపడింది. భూమిని సంఘానికి రాసి ఇస్తేనే అంత్యక్రియలకు శ్మశాన వాటికలో అవకాశం ఇస్తామనే షరతు కుల రాక్షసత్వం ఎంత ప్రమాదమో తెలిసివచ్చేలా చేసింది. ఆ భూమి ఏదో కులానికి కాదు.. అది చచ్చిన మనిషికి ఇచ్చే అఖరి మర్యాద కోసం అని పెంచుకున్న బిడ్డ ఊరి ప్రజల కోసం ఇచ్చి కుల రాక్షసత్వంపై.. కులం పెనుభూతాన్ని తరిమికొట్టినంత పనిచేసి కుల కట్టుబాట్లను ఎదురించగలిగింది.. కులం బలం అవ్వాలి.. కానీ భయం కాకూడదు. అనే గొప్ప సందేశాన్ని దర్శకుడు ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. దండోరా నిజంగా కుల రాక్షసత్వాన్ని చూపింది. ప్రేమ, చావు, అంత్యక్రియలు అనే మూడు అంశాలను పట్టుకొని ఆనాటి పరిస్థితులను కళ్లకు అద్దారు. అంతటి గొప్ప సినిమా దండోరా.. అందుకే జూనియర్ ఎన్టిఆర్ సైతం ‘దండోరా సినిమాపై ట్వీట్ చేసి మెచ్చుకున్నారు. నిజంగా అది ఆయన మంచి మనసుకు సాక్ష్యం. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని తీసిన సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా.. మిగతా ఇండస్ట్రీలోని పెద్ద వారు మాట్లాడకపోయినా ‘దండోరా’ నుంచి నేటి తరం నేర్చుకుంటుంది. సమాజమనే కుటుంబం పట్ల బాధ్యతగా మెదిలేలా దర్శకుడు మురళీకాంత్ గొప్ప ప్రయత్నం.. రేపటి రోజుల్లో కులహత్యలు, పరువు హత్యలు తగ్గడానికి కారణం అయ్యేలా సినిమాను ఆవిష్కరించారు.. ఇటువంటి సామాజిక, సందేశాత్మక చిత్రాలు మరెన్నో రావాల్సిన అవసరం ఉంది. సంపత్ గడ్డం 78933 03516
23rd jan 2026 | నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు
నాకు రక్తాన్ని ఇవ్వండి స్వేచ్ఛను మీకు ఇస్తానన్న సుభాష్ చంద్ర బోస్ గొప్ప యోధులు. స్వేచ్చ ఎవరికీ ఇవ్వబడదు మనకు మనమే తీసుకోవాలి. మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అన్యాయంతో రాజీపడడం అంటే అతి పెద్ద నేరం చేసినట్టే. ఇవన్నీ నేతాజీ చెప్పిన మాటలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు. ‘ఢిల్లీ చలో’, ‘జై హింద్’, ‘నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను’ అనేవి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసిద్ధ నినాదం. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టినవాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. బోసుకి రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్య్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఆల్ ఇండియా యూత్ లీగ్) అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. ఈయనను ఆంగ్లేయులు దాదాపు 11 సార్లు కారాగారంలో నిర్బంధించారు. 939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి బోసు దీన్ని ఒక సువర్ణవకాశంగా భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరుతోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్యసహకారాలతో సింగపూర్లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పరచాడు. బోసు మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని అధిక సంఖ్యాకుల అభిప్రాయం. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న భారతదేశంలోని ఒడిషాలోని కటక్ పట్టణంలో జన్మించాడు. తండ్రి జానకినాథ్ బోస్ గొప్ప లాయరు. గొప్ప జాతీయవాది. బెంగాల్ శాసనమండలికి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభాబతి బోస్. బోస్ విద్యాభ్యాసం కటక్లోని రావెన్షా కాలేజీయేట్ స్కూలులోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీలోను, ఫిట్జ్ విలియమ్ కాలేజీలోను సాగింది. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై అందులో నాలుగవ స్థానంలో నిలిచాడు. ఇంగ్లీషులో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొననారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించసాగాడు. సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్తో కలసి బోస్ బెంగాల్లో ఉద్యమం నిర్వహించాడు. ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలలో కొత్త భావాలు చోటుచేసుకొన్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికీ, మనడానికీ భారత దేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబరు 26న బోస్ ఎమిలీ షెంకెల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకొన్నాడు. ఈమె ఆస్ట్రియాలో జన్మించింది. వారికి 1942 లో పుట్టిన కూతురు పేరు అనిత. బోస్ తన భార్యకు రాసిన అనేక ఉత్తరాలను తరువాత లెటర్స్ అనే సంకలన పుస్తకంగా శిశిర్ కుమార్ బోస్, సుగాతా బోస్ ప్రచురించారు. బోస్ 1939 లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి 1938లో, గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా, బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్ నుండి వైదొలిగాడు. వేరు మార్గం లేని బోస్ ‘అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్’ పార్టీని స్థాపించాడు. 1938లో ‘జాతీయ ప్రణాళికా కమిటీ’ అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు. స్వాతంత్య్రానికి బోస్ ప్రణాళిక జర్మనీలో భారత జాతీయ సైన్యం అదృశ్యం, అనుమానాస్పద మరణమును రెంకోజీ ఆలయం (జపాన్) అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం దొరకలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది. 1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్కు వెళ్ళింది. అప్పట్లో భారత్కు తైవాన్తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999- 2005 లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్కు లేఖను పంపడం జరిగింది. ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. చరిత్ర ఉన్నంత కాలం బోస్ భారత ప్రజల గుండెల్లో ఉంటారు. నేటి యువతరం నేతాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి. వారి చరిత్రను అధ్యయనం చేయాలి. కామిడి సతీష్ రెడ్డి 9848445134
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈ దేశాన్ని ‘Union of States’గా అభివర్ణించినప్పుడు, కేంద్రం, రాష్ట్రాలు ఒకదానికొకటి లోబడి ఉండకుండా, తమ పరిధుల్లో స్వయంప్రతిపత్తి కలిగిన సమాంతర శక్తులని భావించారు. కానీ నేడు ఢిల్లీ పీఠంపై ఉన్న పాలకులు ఈ ఫెడరల్ ఆత్మను క్రమంగా ఖాళీ చేస్తున్నారు. ఇది కేవలం పరిపాలనాపరమైన వైఫల్యం కాదు, ఇది రాష్ట్రాల ఉనికిని ప్రశ్నార్థకం చేసే ఒక పకడ్బందీ రాజకీయ వ్యూహం. రాష్ట్రాలను రాజ్యాంగబద్ధమైన భాగస్వాములుగా కాకుండా, కేంద్రానికి లోబడి ఉండాల్సిన ‘ఉపయూనిట్లు’గా మార్చే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నిధుల విషయంలో కేంద్రం ప్రదర్శిస్తున్న సంపూర్ణ ఆధిపత్యం భారత ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పుగా మారింది.రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధులు ‘దయ’ లేదా ‘ఉపకారం’ కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటు చేయబడిన ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధుల పంపిణీ జరగాలి. ప్రజలనుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సంపదలో రాష్ట్రాలకు న్యాయబద్ధమైన వాటా ఉండాలి. అయితే, కేంద్రం ఈ పంపిణీని ఒక రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. కేంద్రం తెలివిగా పన్నులపై సెస్లు, సర్ఛార్జీలను విధిస్తోంది. రాజ్యాంగం ప్రకారం ఈ సెస్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచాల్సిన అవసరం లేదు. గత దశాబ్ద కాలంలో కేంద్రం మొత్తం ఆదాయంలో సెస్ల వాటా 10% నుండి 25% పైగా పెరిగిపోయింది. దీనివల్ల కేంద్రం ఆదాయం విపరీతంగా పెరుగుతుంటే, రాష్ట్రాలకు పంచాల్సిన ‘డివిజిబుల్ పూల్’ తగ్గిపోతోంది. ఇది రాష్ట్రాల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ‘ఆర్ధిక విచ్ఛిన్నత’. దక్షిణాది రాష్ట్రాల ‘పనితీరుకు శిక్ష’ ఫెడరల్ వ్యవస్థలో నేడు అత్యంత ఆందోళనకరమైన అంశం దక్షిణాది రాష్ట్రాలపట్ల చూపుతున్న వివక్ష. అభివృద్ధి చెందుతున్న, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను కేంద్రం ఆర్థికంగా శిక్షిస్తోంది. 15వ ఫైనాన్స్కమిషన్ నిధుల పంపిణీకి 1971 జనాభాకు బదులు 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి. జనాభాను అదుపులో ఉంచి, తలసరి ఆదాయాన్ని పెంచినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందిపోయి, వాటి నిధులను ఉత్తరాదికి మళ్లించడం ‘సహకార ఫెడరలిజం’ కాదు, అది ‘ఆర్ధిక వలసవాదం’. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి పన్నుల రూపంలో ఒక రూపాయి ఇస్తే, తిరిగి వస్తున్న వాటా అత్యల్పంగా ఉంది. రాష్ట్రం కేంద్రానికి ఇచ్చే ప్రతి రూ. 1 కి తిరిగి రాష్ట్రానికి వచ్చేది. బీహార్ రూ. 7.06, ఉత్తరప్రదేశ్ రూ. 2.73, కర్ణాటక రూ. 0.15, తమిళనాడు రూ. 0.29, తెలంగాణ రూ. 0.43, ఆంధ్రప్రదేశ్ రూ. 0.49. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చిన జిఎస్టి, రాష్ట్రాల ఆర్థిక సార్వభౌమత్వంపై వేసిన అతిపెద్ద గొలుసు. ఒకప్పుడు రాష్ట్రాలకు తమ అవసరాల మేరకు పన్నులు విధించే స్వయంప్రతిపత్తి ఉండేది. ఇప్పుడు రాష్ట్రాలు ఒక్క రూపాయి పన్ను మార్చాలన్నా కేంద్రం ఆధ్వర్యంలోని జిఎస్టి కౌన్సిల్ వైపు చూడాల్సి వస్తోంది. జిఎస్టివల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేస్తామని రాజ్యాంగబద్ధమైన హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ పరిహారం విషయంలో కేంద్రం దోబూచులాడుతోంది. విపక్ష రాష్ట్రాలకు నిధులు విడుదల చేయకుండా జాప్యం చేయడం ద్వారా, అక్కడ అభివృద్ధిని కుంటుపరిచి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం ‘ఆర్థిక ఉగ్రవాదం’ కిందికే వస్తుంది. మరోవైపు, గవర్నర్ వ్యవస్థ నేడు ఒక ‘రాజకీయ ఏజెంట్’ వ్యవస్థగా మారిపోయింది. ఆర్టికల్ 200 దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను నెలల తరబడి తొక్కిపెట్టడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్రం అణచివేస్తోంది. దేశరక్షణ, విదేశాంగం కేంద్రం బాధ్యత కావచ్చు. కానీ విద్య, ఆరోగ్యం, వ్యవసాయం రాష్ట్రాల పరిధి. ఈ పరిధిలో కేంద్రం జోక్యం చేసుకుంటూ, నిధులు అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను లొంగదీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేయడమే. ఇది కేవలం రాష్ట్రాల సమస్య మాత్రమే కాదు, ఇది దేశ భవిష్యత్తు సమస్య. రాష్ట్రాలను ఆర్థికంగా అశక్తులను చేస్తే, ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది. ముఖ్యంగా దేశాభివృద్ధికి ఇంజిన్లుగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూడటం దేశసమగ్రతకే ప్రమాదం. కేంద్రం తన ఆధిపత్య రాజకీయాన్ని ఆపకపోతే, భారతదేశం ఫెడరల్ ప్రజాస్వామ్య దేశంగా కాకుండా, కేంద్రీకృత అధికారవాద రాజ్యంగా మారిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం కేంద్ర దయ కాదు - అది ప్రజల హక్కు. ఆ హక్కును లాక్కోవడం రాజ్యాంగ ద్రోహం. సిహెచ్ వి ప్రభాకర్ రావు 93915 33339
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణకు చెందిన 16 మంది రెవెన్యూ అధికారులకు కేంద్రం ఐఏఎస్లుగా హోదా కల్పించడం వివాదాస్పదంగా మా రింది. వీటి వెనుక పెద్ద మొత్తంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. హోదా దక్కిన వారిలో కొందరిపై ఈడి, విజిలెన్స్, ఎసిబి, ఫోర్జరీ కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల సీనియర్ ఐఏఎస్ అధికారులు విస్తుపోతున్నారు. ఐఏఎస్ హోదాకు సిఫార్సునకు 56 సంవత్సరాల వయసు దాటకూడదన్న ప్రాథమిక నిబంధనను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంపై సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. యూపిఎస్సీ నిబంధనలను పాటించకుండా పలువురికి ఐఏఎస్ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాద న పంపించినప్పటి నుంచి డిఓపిటి, యూపిఎస్సి వరకు అన్ని చోట్ల అతిక్రమణలు జరగడం వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు అధికార వర్గా ల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు వారికి ఐఏఎస్ హోదా కల్పించే అంశంలో తమకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అర్హులు కొందరు హైకోర్టుసు ఆశ్రయిం చగా ప్రస్తుతం ఆ కేసు పెండింగ్లో ఉంది. ఇ లా ఉండగా, రాష్ర్ట ప్రభుత్వం పంపించిన జాబితాకు నిబంధనలను పరిగణనలోకి తీసుకోలేదని దానిని ఆమోదించవద్దని సుప్రీంకోర్టు న్యాయవాది మనీ ష్ తివారీ ఆధారాలతో సహా యూపిఎస్సీ లేఖ రాశారు. అయినప్పటికీ ఆ లేఖ ను యూపిఎస్సీ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చే సే అవకాశం ఉన్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఐఏఎస్ హోదాకు ఎంపికైన వారిలో కొందరిపై హైకోర్టుల్లో కేసులు, మరికొందరిపై ఈడి, విజిలెన్స్, ఎసిబి కేసులు,అవినీతి ఆరోపణలు ఉండగా వారికి ఎలా హోదా కట్టబెడుతారని, పెండింగ్ కేసులు తేలకుండానే డిఓపిటి ఏ విధంగా ఆమోదించిందని ప్ర శ్నిస్తున్నారు. ఇవే కాకుండా ఉద్యోగంలో చేరినప్పటి (జాయినింగ్ రిపోర్టు) రి కార్డులో ఒకరకంగా యూపిఎస్సీకి చేసుకున్న దరఖాస్తులో మరోరకంగా ట్యాంపరింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కనీసం వాటిపై ఆధారాలతో స హా వచ్చిన ఫిర్యాదు కూడా యూపిఎస్సీ పరిశీలించకుండానే వారికి హోదా ఎ లా కట్టబెట్టారో అర్థం కావడం లేదని రిటైర్టు ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారుల్లో 16 మంది అధికారుల కు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బం ది, శిక్షణ శాఖ (డిఓపిటి) బుధవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్పై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ అధికారుల కేసుల డేటాను కొందరు బయటకు తీస్తున్నారు. మరి కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అంశం చర్చనీ యాంశంగా, వివాదాస్పదంగా మారింది. 56 సంవత్సరాలు దాటినప్పటికీ జాబితాలో పేరు& ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఈ ఐఏఎస్ల హోదాపై రిట్ పిటిషన్ (డబ్లూపి నెంబర్ 32415/2023) కేసు పెండింగ్లో ఉంది. దీంతోపాటు 2022 నుంచి 2024 వరకు ఐఏఎస్ల పదోన్నతలకు సంబంధించి డిప్యూటీ కలెక్టర్లుగా ఉన్న సమయంలో యూపిఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున జాబితాను పంపించారని, ఆ సమయంలో డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ జాబితా ఫైనల్ కాలేదని, ఫైనల్ సీనియార్టీ జాబితాను సిసిఎల్ఏ ప్రకటించకుండానే యూపిఎస్సీకి ఆ జాబితా చేరిందని, ఈ విషయమై తాము చేసిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని దీనిపై పూర్తి విచారణ జరపాలని యూపిఎస్సీకి రాసిన లేఖలో అడ్వకేట్ మనీష్తివారీ కోరారు. అయితే, 2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి యూపిఎస్సీకి పంపించిన జాబితాలో 56 సంవత్సరాలు దాటిన డిప్యూటీ కలెక్టర్ల పేర్లు కూడా ఉన్నాయని అది యూపిఎస్సీ నిబంధనలను విరుద్ధమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై క్యాట్లో కొందరు ఫిర్యాదు చేయడం విశేషం. డిప్యూటీ తహసీల్దార్గా నియామకం అయిన వారికే.... 2011 తరువాత గ్రూప్ 1 నియామకాలను అప్పటి ప్రభుత్వాలు నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024, 25లో గ్రూప్ 1 పరీక్షను నిర్వహించి 563 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది. అయితే, గ్రూప్ 1 అభ్యర్థులతో పాటు రెవెన్యూ శాఖకు చెందిన అధికారులకు ఐఏఎస్గా పదోన్నతి లభిస్తోంది. (ఉదా...రాష్ట్రానికి సంబంధించి మూడు పోస్టులు ఐఏఎస్లు ఖాళీగా ఉంటే 2 పోస్టులు రెవెన్యూ 1 పోస్టు గ్రూప్1కు కేటాయిస్తారు). అయితే, ప్రస్తుతం రెవెన్యూ కోటాలో 20 పైచిలుకు ఐఏఎస్లు ఖాళీ ఉండగా, అందులో ఈ సారి 16 మందికి ఐఏఎస్లుగా పదోన్నతి కల్పించారు. ఈ 16 మందిలో 1995 సంవత్స రానికి సంబంధించి గ్రూప్ 2 ఏ కింద 14 మంది డిప్యూటీ తహసీల్దార్లుగా ఉద్యోగంలో చేరగా, ఒకరు డిప్యూటీ కలెక్టర్గా, మరొకరు గ్రూప్ 2 బి సర్వీసు కింద ఉద్యోగంలో చేరారు. ఈ 16 మంది 2011లో డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందారు. 2022, 2023, 2024 సంవత్సరంలో ఏర్పడిన ఖాళీల ఆధారంగా తాజాగా 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఏర్పడిన ఖాళీలకు అనుగుణంగా 16 మందికి ఐఏఎస్లు పదోన్నతిని కల్పించారు. రాష్ట్రం నుంచి ఒకేసారి 16 మందికి ఐఏఎస్లుగా పదోన్నతి లభించడం ఇదే మొదటిసారి. 2019 నుంచి 2021 వరకు రెవెన్యూ కోటా పదోన్నతులకు ఖాళీలు భర్తీ కాలేదు. దీంతోపాటు 2022లో 11 ఖాళీలు, 2023లో మూడు ఖాళీలు, 2024లో రెండు ఖాళీలు ఏర్పడడంతో మొత్తం 16 మందికి పదోన్నతులను డిఓపిటి కల్పించింది.
23rd jan Vasantha Panchami |వాగ్దేవి ఉపాసనలో అంతరార్థం –వైదిక విశ్లేషణ
23rd jan Vasantha Panchami | వసంత పంచమి ప్రాముఖ్యత:ఋతువులలో వసంతుడిగా జ్ఞాన
ఫోన్ట్యాపింగ్ కేసులో కెటిఆర్కు నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కే సు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చో టుచేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం నోటీసులు జారీ చేసింది. శుక్రవారం (జనవరి 23) ఉదయం 11 గంటలకు జూ బ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కా వాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. సిఆర్పిసి 160 కింద నందినగర్లోని కెటిఆర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులను అందజేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ అధికారులు 2024 మార్చి నుంచి దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఈ నెల 20వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. హరీష్ రావు విచారణ ముగిసిన రెండు రోజులకే కెటిఆర్కు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీశ్ ఫైర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వే దికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే రేవంత్ నోటీసుల డ్రామా అంటూ ఘాటు విమర్శలు చేశా రు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు అం టూ ఆరోపణలు చేశారు. రేవంత్రెడ్డి బామ్మర్ది బొ గ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.‘రాజకీయకక్ష సాధింపు చర్యలో భాగమే నిన్న నాకు, నేడు కెటిఆర్కు ఇచ్చిన నోటీసులు’ అని పేర్కొన్నారు. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం..దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే అని వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి బలహీనులు కాబట్టే పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటున్నారని, తాము ధైర్యవంతులం కాబట్టే ప్రజల మధ్య నిటారుగా నిలబడి సిఎంను నిలదీస్తున్నామని అన్నారు. సిట్ నోటీసులకు సమాధానం చెప్పడానికి బిఆర్ఎస్ నాయకులం ఎప్పుడూ సిద్ధమే అని తేల్చిచెప్పారు. కానీ, రేపు ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి రేవంత్రెడ్డి సిద్దంగా ఉండాలంటూ సవాల్ విసిరారు. రేవంత్రెడ్డి ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత మంది బిఆర్ఎస్ నాయకులను విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేసినా.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా ఆయనను, ఆయన పార్టీని వదిలిపెట్టం అని హెచ్చరించారు. అంతే కాదు, కాంగ్రెస్ సర్కార్ కుంభకోణాలను, వాటాల పంచాయతీలను బట్టబయలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బిఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారు..జై తెలంగాణ..జై కెసిఆర్ అంటూ ట్వీట్ చేశారు. ప్రశ్నిస్తున్న పార్టీ లక్ష్యంగానే నోటీసులు : సోమభరత్ ప్రతిపక్షాల నోరు మూయించేందుకే సిట్ ద్వారా నోటీసులు ఇప్పిస్తున్నారని బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమభరత్ విమర్శించారు. కోర్టులు, చట్టంపై నమ్మకం ఉన్నందున చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. హామీలు అమలు చేయకపోవడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, ప్రజల దృష్టి మళ్లించేందుకు సిట్ వేశారని ఆరోపించారు. నోటీసు ఇచ్చి .. విచారణకు వచ్చేందుకు కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రెండు రోజుల క్రితం తమ పార్టీ సీనియర్నేత హరీష్రావుకు నోటీసులు ఇచ్చి, 7 గంటలకు పైగా విచారణ చేశారని మండిపడ్డారు. కేవలం ప్రశ్నిస్తున్న పార్టీ లక్ష్యంగానే నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. ఒక పద్ధతి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ టార్గెట్గా నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చట్టం అమలు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విచారణకు కెటిఆర్తో పాటు న్యాయవాదిని అనుమతించాలని కోరామని, సాక్షిగా విచారణ చేసినప్పుడు న్యాయవాదిని అనుమతించబోమని ఎసిపి చెప్పారని తెలిపారు. న్యాయస్థానాలు చెప్పినా సీరియల్లా చేస్తున్నారు : నిరంజన్రెడ్డి కెటిఆర్కు సిట్ నోటీసుల పేరుతో కాంగ్రెస్ సర్కారు నాటకం ఆడుతుందని మాజీ మంత్రి,బిఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పాలన గాలికి వదిలి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చేస్తున్నారని ఆక్షేపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని అత్యున్నత న్యాయస్థానాలు తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం మొగలి రేకులు సీరియల్లగా దర్యాప్తు నడిపిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజల కర్మానికి వదిలేసి దావోస్ అటు నుండి అమెరికా పర్యటన పెట్టుకున్నారని మండిపడ్డారు. సర్కారు సొమ్ముతో రేవంత్ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి విదేశాల్లో విహరిస్తూ అక్కడి నుండి వచ్చే వరకు ఈ సీరియల్ నడిచేలా ప్లాన్ చేసినట్లు అనిపిస్తోందని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్కు పరాకాష్ట : వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక, తన అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో సిఎం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు, డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే రెండు రోజుల క్రితం హరీష్ రావుకు నోటీసులని డ్రామా ఆడి, ఇప్పుడు కెటిఆర్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఇది రేవంత్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరిందనడానికి నిదర్శనం అని ఘాటు విమర్శలు చేశారు.
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు పాటించిన మిల్లర్లకు సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని, తప్పిదాలకు పాల్పడితే మాత్రం చర్యలు కఠినాత్మకంగా ఉంటాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాజకీయ వత్తిళ్లకు లొంగకుండా నిబంధనల అమలులో సిబ్బంది కఠినం గా ఉండాలని ఆయన ఉద్బోధించారు. అదే సమయంలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ధాన్యం కేటాయింపు ప్రసక్తే లేదని ,పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనున్నారు. పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి కనుగుణంగా ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో మిల్లుల పరిశ్రమను ప్రోత్సహించేలా విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రం ధాన్యం దిగుబడిలోనే కాకుండా ఖరీఫ్ సీజన్ లో కొనుగోలు చెందిన ధాన్యం దేశచరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ నమోదు చేసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన 25 సంవత్సరాల వ్యవధిలో ఇదే అత్యధిక రికార్డ్ అని ఆయన చెప్పారు. 2025- 26 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం పౌర సరఫరాల శాఖా రూపొందించిన ప్రణాళికలపై గురువారం బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల వ్యవధిలో అనుసరించిన విధానాల ఫలితమే ధాన్యం దిగుబడి, కొనుగోలులోనూ సంచలనాత్మక రికార్డ్ నమోదు చేసుకుందని చెప్పారు. పౌరసరఫరాల శాఖా,నీటిపారుదల, వ్యవసాయ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకోవడంతో పాటు తెలంగాణా రైతాంగం భాగస్వామ్యంతోనే ఇంతటి విజయం సాధించామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల చరిత్రలోనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ఘనత తెలంగాణా రాష్ట్రానికి దక్కిందన్నారు. 70.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు : దేశ చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో లేవని అన్నారు. 2020- 21 లో నమోదు అయిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రికార్డును అధిగమించి తాజాగా జరిగిన ఖరీఫ్ సీజన్ లో71.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించిందన్నారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు మొట్టమొదటి సారిగా తెలంగాణా ప్రభుత్వం అందిస్తున్న బోనస్ తో కలిపి మొత్తం 18,532.98 కోట్ల రూపాయలను 14.20 లక్షల మంది రైతులకు చెల్లించామన్నారు.
కోజీకోడ్లో కొలువుదీరిన సాహితీ నక్షత్రాలు
ఆసియాలోనే అతి పెద్దదైన కేరళ లిటరరీ ఫెస్టివల్ (కేఎల్ఎఫ్ )కోజికోడ్ సముద్ర తీరాన గురువారం నాడు ప్రారంభం అయింది . 25 వ తేదీ వరకు నా లుగు రోజుల పాటు జరిగే ఈ సాహిత్య ఉత్సవాలను వ్యోమ గామి సునీత విలియమ్స్, స్ప్రింటర్ బెన్ జాన్సన్ , ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్ , నటి భావన తదితరులు ప్రారంభించారు. తొలి రోజు ఉదయం నుండే వివిధ అంశా ల మీద సదస్సులు కొనసాగుతున్నప్పటికీ, అధికారిక ప్రారంభోత్సవం సాయంత్రం 6 గంటలకు జ రిగింది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సు నీతా విలియమ్స్ ప్రారంభోత్సవం లో మాట్లాడు తూ ఈ సాహిత్యోత్సవానికి హాజరయిన సాహిత్యకారులను, సాహిత్యాభిమానులను చూ స్తూ ఉంటే అంతరిక్షంలో నక్షత్రాలను చూసిన సంతోషం కలుగుతుందన్నారు. ప్రకాష్ రాజ్ మా ట్లాడుతూ ఆ కాశంలో చుక్కల మధ్య విహరించిన అంతరిక్షం లో ల్యాండ్ అయిన సునీతా విలియ మ్స్ను చూడ టం ఎంతో స్పూర్తి కలిగిస్తూ ఉంది. అక్కడ లాండ్ అయిన ఆమె ఇక్కడ ఈ కెఎల్ఎఫ్ లో లాండ్ అవుతుందని నేను ఊహించలేదు. ఇక్కడకు ఆమె రావడం అద్భుతం. ఈ ఫెస్టివల్ కి వచ్చి న నటి భావన మనందరికీ స్ఫూర్తి ఫైటర్ అన్నారు . ప్రముఖ స్ప్రింటర్ బెన్ జాన్సన్ ఈ సాహిత్య సభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కోజికోడు మేయర్ సదాశివన్, ఫెస్టివల్ డైరెక్టర్ కె. సచ్చితానందన్, ప్రముఖ అంతరిక్ష యాత్రికురాలు సునీత విలియమ్స్, సినీ నటులు భావన, ప్రకాష్ రాజ్ , సన్నాహక కమిటీ చైర్మన్ ఎ. ప్రదీప్ కుమార్, మంత్రులు మొహమ్మద్ రియాస్, పలనివర్ తంగ రాజన్ , గోధే జంత్రం దక్షిణాసియా డైరెక్టర్ డాక్టర్. మార్లా స్టుకెన్ బెర్గ్ తదితరులు పాల్గొన్నారు. హెరిటేజ్ ప్రాంతంగా యునెస్కో భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా గుర్తించిన పోర్ట్ సిటీ, కోజికోడులోని అరేబియా సముద్ర తీరపు ఇసుకతిన్నెల వద్ద జరుగుతున్న ఈ సాహిత్య పండుగకు, దేశ విదేశాల నుండి సుమారు ఐదు లక్షల మంది సాహిత్యం పట్ల అభిలాష ఉన్న ప్రతినిధులు హాజరవుతారని ఒక అంచనా. ఈ కెఎల్ఎఫ్. 8వ ఎడిషన్ భారీ సాహిత్య ఫెస్టివల్ కు ప్రముఖ కవి సాహితీ విమర్శకులు గతంలో కేంద్ర సాహిత్య అకాడమీకి , ప్రస్తుతం కేరళ సాహిత్య అకాడమీకి డైరెక్టర్ గా వున్న ప్రొఫెసర్ కె . సచ్చిదానందన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.రచయితలు, కళాకారులు, ఫిలిం మేకర్స్,చిత్రకారులు, మేధావులు, సైంటిస్ట్ లు, సినీ నటులు ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులు, ప్రముఖులు ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు.మూడు వందల సెషన్లు సమాంతరంగా ఈ నాలుగు రోజులపాటు జరుగుతాయి. దేశ విదేశాల నుండి వచ్చిన 500 మంది వక్తలు వివిధ అంశాలపై మాట్లాడుతున్నారు.డిసెంబర్, జనవరి మాసాలు దేశవ్యాప్తంగా సృజన కారుల పండుగ రోజులు. నాట్యం, సంగీతం, చిత్రకళ, శిల్పకళ, సాహిత్యం వంటి అనేక సృజన రంగాల లో నిష్ణాతులైన వారు భాగస్వాములయ్యే అనేక ఫెస్టివల్స్ తో దేశం అంతా కళకళలాడుతూ ఉంటుంది. పూణే, కలకత్తాల్లో అలాగే ఇటీవలే చెన్నైలో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన, హిందూ లిటరరీ ఫెస్టివల్స్ జరిగాయి. ప్రసిద్ధి చెందిన జైపూర్ లిటరి ఫెస్టివల్ కూడా ఇటీవలే ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాదులో జనవరి 22 నుంచి 25 వరకు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ (హెచ్ఎల్ఎఫ్) జరుగుతున్నది. ఆసియాలోనే అతి పెద్దదైన కె ఎల్ ఎఫ్ .పండుగకు జర్మనీని అతిథి దేశంగా ఆహ్వానించారు. కేఎల్ఎఫ్ ప్రాంగణంలోనే జర్మనీ పెవీలియన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లల కోసం ప్రత్యేకంగా సికెఎల్ఎఫ్ పేరుతో కె ఎల్ ఎఫ్ ప్రాంగణంలోనే ప్రత్యెక ఏర్పాటు చేశారు. రచయితలతో సంభాషణలు, సమావేశాలు, సాంసృ్కతిక ప్రదర్శనలు, థియేటర్, సంగీతం, పుస్తక ప్రదర్శనలు, వంటి వాటి కోసం కూడా ప్రత్యేక హాల్స్ ఏర్పాటు చేశారు. 8 ప్రధానమైన ప్రాంగణాలలో సమావేశాలు జరుగుతున్నాయి. అనేక వర్క్ షాప్స్ కూడా జరుగుతున్నా యి.18 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు సాహిత్యము, అస్తిత్వం ,అనువాదాలు, పర్యావరణ, మానవ హక్కులు ,ఆర్కిటెక్చర్, సినిమా, ఆటలు, సైబర్ సెక్యూరిటీ ,పబ్లిక్ పాలసీ వంటి అనేక విషయాల పైన ప్రసంగించనున్నారు. సునీత విలియమ్స్, కిరణ్ దేశాయ్ , అబ్దుల్ రజాక్, అభిజిత్ బెనర్జీ, గుర్నాహ్, పీకో అయ్యర్, బెన్ జాన్సన్, జిమ్మీ వాల్స్ , కిరణ్ దేశాయ్, రొమిల్లా థాపర్ వంటి ప్రముఖులు ఈ నాలుగు రోజుల సాహిత్యోత్సవం లో పాల్గొంటున్నారు. ప్రతినిధులతో కిక్కిరిసిన ప్రధాన హాల్లో మొదటి రోజు ఉదయం ప్రముఖ నటుడు, ఆలోచనపరుడు ప్రకాష్ రాజ్ అసమ్మతి ని నేరం గా పరిగణించడం (Criminalising Dissent! Who Gets LOCKED Up for Speaking Out ?) అనే అంశంపై కాన్ఫ్లూయెన్స్ మీడియా సిఈవో జొసీ జోసెఫ్ తో సంభాషించారు.ప్రజాస్వామిక హక్కులపై, భిన్నాభిప్రాయ పై, బహుళత్వంపై జరుగుతున్న దాడులు, నిర్బంధం గురించి, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసహనం గురించి వారు మాట్లాడారు. చివరగా పౌరసత్వ ఆందోళనలో ఎంతో ప్రాచుర్యం పొందిన హమ్ యాద్ రఖేంగే కవితతో ఆయన ప్రసంగాన్ని ముగించారు.కె . సచ్చిదానందన్,గీతా హరిహరన్ లు సంపాదకత్వం వహించిన సంకలనం The View from Hear: Storia And Poems OF Many Indiyans పుస్తకం పై సబితా సచ్చి ( కవి, సచ్చితానందన్ కూతురు) సంపాదకులు ఇద్దరితోనూ ఆసక్తికరమైన సంభాషణను నిర్వహించారు.వివిధ భాషలు, మతాలు, అస్తిత్వాలు,సంసృ్కతులలో జీవిస్తూ రాసిన రచనలను ఒక దగ్గరకు తెచ్చే ప్రయత్నం ఈసంకలనం చేసిందని వారు అన్నారు. దేశం ఒక క్లిష్టమైన పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటుందని, మాట్లాడుతున్న వాళ్ళని ఇతరులు, బయటివారుగా పరిగణిస్తూ విమర్శిస్తున్నారని ,దేశాన్ని, ప్రజలని ప్రేమించడం వేరు నేషనలిజం పేట్రియాటిజం అనే పేరుతో జాతీయతను ఏకశిలా సదృశ్యకం చేయడం వేరని ఆయన అన్నారు. ఇండియా ఒకటే కానీ ఇండియన్స్ లో అనేక రకాల ఇండియన్లు ఉన్నారు అని గీతా హరిహరన్ చెప్పారు.దక్షిణాది భాషల పై కూడా ఒక సెషన్ జరిగింది. అనేక పుస్తకాలపై రచయితలతో విశ్లేషణాత్మక చర్చలు జరిగాయి.ముఖ్య అతిథి దేశంగా జర్మన్ పెవిలియన్ లో కూడా అనేక అంశాలపై సమావేశాలు జరుగుతున్నాయి.డిప్లమసీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఎఐ, రింబరింగ్ యాజ్ రెసిస్టెన్స్: హౌవ్ జర్మనీ తదితర అంశాలపై సమావేశాలతో పాటు, జర్మనీ థియేటర్ లో నాటికలు, అనేక వర్క్ షాప్స్ కూడా జరుగుతున్నాయి.కన్నడ, మలయాళ, తమిళ దక్షిణాది రచయితలు , బెంగాలీ, అస్సామీ, ఒరియా, కాశ్మీరీ, హిందీ, వంటి అనేక భాషల రచయితను కనపడుతున్నారు తప్ప మచ్చుకి ఒక్క తెలుగు రచయిత కూడా కనపడక పోవడం బాధాకరం. తెలుగు భాషకు కనీస ప్రాధాన్యత కూడా లేకపోవడం కొట్టోచ్చినట్టు కనిపిస్తున్న అంశం. ఈ సాహిత్య ,సాంసృ్కతిక సమ్మేళనం ఎల్లలను చెరిపివేసి, సాహిత్యకారులను కళాకారులను ఏకం చేస్తూ ఉంది.
‘వీబీ`జీరాంజీ’కి పాతపేరే కొనసాగించాలి ` రాహుల్గాంధీ
న్యూఢిల్లీ(జనంసాక్షి):జాతీయ ఉపాధి హావి పథకంలో గాంధీ పేరు తొలగించి ‘వీబీ`జీరాంజీ’పేరుతో కొత్త చట్టం తేవడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. పేదల పని హక్కులను హరించడమే …
` బిల్లులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది ` డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హామీ కొమురం భీం(జనంసాక్షి): ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం …
` ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ` నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. …
దిగుబడేకాదు.. కొనుగోళ్లలోనూ రికార్డు
` 25 సంవత్సరాలలో అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ` తెలంగాణా రైతాంగం భాగస్వామ్యంతోటే ఇంతటి విజయం ` బోనస్తో కలిపి చెల్లించిన మద్దతు …
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీతో సీఎం రేవంత్ ముఖాముఖీ
` తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను వివరించిన ముఖ్యమంత్రి ` 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ రోడ్మ్యాప్పై వివరణ ` హైదరాబాద్లో ఫాలోఅప్ సదస్సు నిర్వహణకు విజ్ఞప్తి …
శుక్రవారం రాశి ఫలాలు (23-01-2026)
మేషం సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున ఊహించని మార్పులు ఉంటాయి. వృషభం ధన వ్యవహారాలు కలసివస్తాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. మిధునం అవసరానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహం ఉద్యోగులు చేయని పనికి నిందలు పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. కన్య నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. తుల ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. స్ధిరాస్తి సంబంధిత వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృశ్చికం కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ధనస్సు వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. అనుకున్న సమయానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. మకరం కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక ఋణ సమస్యలు నుండి బయట పడతారు. స్థిరస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. కుంభం నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. మీనం ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటా.
దక్షిణ కొరియా మహిళకు బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం
దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళకు బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేసే మహమ్మద్ అఫాన్ అహమద్ ఈ మహిళను భద్రతా తనిఖీల పేరిట లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. రెండు మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఈ నిందితుడిని అరెస్టు చేశారు. స్వదేశానికి వెళ్లేందుకు టర్మినల్ 2లో ఇమిగ్రేషన్ నిబంధనలు పాటిస్తున్నప్పుడు ఈ మహిళను లైంగికంగా వేధించారు. తనిఖీలు సోదాల పేరిట అసహ్యంగా ప్రవర్తించారని వెల్లడైంది. లగేజీలో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని చెప్పి సిబ్బందిలో ఓ వ్యక్తి తనను ఎవరూ లేని చోటికి మగవారి వాష్రూం వద్దకు తీసుకువెళ్లేందుకు యత్నించాడని మహిళ తెలిపింది. తనను హత్తుకోవడం, శరీరం తడమడం వంటి పనులకు దిగాడని తెలిపింది. తాను ప్రతిఘటించడంతో ఈ వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడని పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొంది. అక్కడి కెమెరాల పరిశీలన తరువాత కేసు నమోదు చేశారు. వ్యక్తిని విచారిస్తున్నారు.
రైతులకు ద్రోహం.. కూలీలకు అన్యాయం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : ఇంతకు ముందు రైతులను మోసం చేసినట్లే, ఇప్పుడు కూలీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామి పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎ)ను ఎత్తివేయడం వెనుక భారీ స్థాయి అన్యాయం ఉందని తెలిపారు. దేశంలో మూడు అక్రమ వ్యవసాయ చట్టాలను తీసుకురావడానికి కేంద్రం దొడ్డిదారిన యత్నిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తీసుకువస్తున్న లోపభూయిష్ట విబి జి రామ్జి చట్టానికి వ్యతిరేకంగా పేదలు అంతా కలిసికట్టుగా ముందుకు రావల్సి ఉందని పిలుపు నిచ్చారు. రచనాత్మక్కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ రోజ్గార్ ఉపాధి హామీ పథకం వర్కర్ల సదస్సులో ఖర్గే ఇతరులతో కలిసి రాహుల్ గురువారం మాట్లాడారు. పేదల మేలుకోసం ఇంతకు ముందు రోజ్గార్ యోజనను తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు దీనిని మార్చివేశారని విమర్శించారు. ఇంతకు ముందు తీసుకువచ్చిన నల్ల సాగు చట్టాలను రైతుల సంఘటిత పోరుతో వెనకకు తీసుకున్నారు. ఇప్పుడు ఏదో విధంగా వాటిని తిరిగి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఉపాధి పథకంతో కేంద్రమే నిధులను ఖరారు చేస్తుంది. రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఇందులో అత్యధిక భాగం ఎప్పుడూ బిజెపి పాలిత రాష్ట్రాలకే చెందుతాయని విమర్శించారు. ప్రతిదీ రాజు వంటి ప్రధాని ద్వారానే జరగాలినేదే బిజెపి పాలనలో పావు అని రాహుల్ విమర్శించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ గ్రామీణ ఉపాధి పథకం విషయాన్ని ప్రస్తావిస్తుందని పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. మహాత్మా గాంధీ పేరు లేకుండా చేశారు. పేదలకు అన్యాయం చేస్తారని హెచ్చరించారు.
Photos : Constable Kanakam Movie Success Meet
The post Photos : Constable Kanakam Movie Success Meet appeared first on Telugu360 .
Coalition Politics or Collapse: Vijayasai Reddy’s Sharp Message to YSRCP
Former MP Vijayasai Reddy has sent a blunt message to YSR Congress Party chief Y. S. Jagan Mohan Reddy. He stated that Jagan has no chance of returning to power unless the present political alliance in Andhra Pradesh is weakened. According to him, padayatras and public campaigns will not deliver results. He said, electoral success […] The post Coalition Politics or Collapse: Vijayasai Reddy’s Sharp Message to YSRCP appeared first on Telugu360 .
అమరావతిలో శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్
డబ్ల్యూఈఎఫ్ సదస్సులో మంత్రి నారా లోకేశ్విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. నైపుణ్యాలు, కొలాబరేషన్ ద్వారా క్వాంటం ఆవిష్కరణలను వేగవంతం చేయడం అనే అంశంపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా జరిగిన సదస్సులో మంత్రి లోకేశ్ ప్రసంగిస్తూ… క్వాంటం ఇండెక్స్ 2025 ప్రకారం 2018 నుంచి క్వాంటం నైపుణ్య అవసరాలు దాదాపు మూడు రెట్లు […] The post అమరావతిలో శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ appeared first on Visalaandhra .
పరస్పర సహకారంతోనే… రేవంత్, లోకేశ్ మాటా మంతి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కలిశారు. ఈ సందర్భంగా సీఎంను మంగళగిరి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. మంత్రి లోకేశ్ను సీఎం రేవంత్ రెడ్డి కూడా సత్కరించారు. ఏపీ విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు, ఐటీ ప్రగతి గురించి […] The post పరస్పర సహకారంతోనే… రేవంత్, లోకేశ్ మాటా మంతి appeared first on Visalaandhra .
మోదీ పాలనలో పేట్రేగుతున్న మతోన్మాదం
. రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం. మహిళా రక్షణ కేవలం నినాదమే. ప్రజాద్రోహ పాలనపై సమరశీల ఉద్యమాలు. సైదా సయుద్దిన్ హమీద్, నిషా సిద్ధూ. ఎనఎఫఐడబ్ల్యూ జాతీయ సమితి సమావేశాలు ప్రారంభం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మోదీ సర్కారు అవలంబిస్తున్న మతోన్మాద, రాజ్యాంగ విరుద్ధ, ప్రజాద్రోహక పాలనకు వ్యతిరేకంగా మరిన్ని సమరశీల ఉద్యమాలు అవశ్యమని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎనఎఫఐడబ్ల్యూ) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సైదా సయుద్దిన్ హమీదు, నిషా సిద్ధూ చెప్పారు. […] The post మోదీ పాలనలో పేట్రేగుతున్న మతోన్మాదం appeared first on Visalaandhra .
Bollywood Superstar Aamir Khan and Gauri Spratt have been dating each other for a while. Aamir confirmed about his relationship publicly last year. Now, they are poised to progress in their relationship. Allegedly, Aamir and Gauri have settled into a new place together in Mumbai. In an interview, Aamir expressed, “In my heart, I’m already […] The post Is Aamir Khan Married Again? appeared first on Telugu360 .
జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ – 16 మంది మావోయిస్టుల మృతి
మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడువిశాలాంధ్ర-చింతూరు: జార్ఖండ్ అడవుల్లో తుపాకుల మోత మోగింది. ఎన్కౌంటర్ పేరుతో మరో 16 మందిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. రాష్ట్రంలోని చోటా నాగపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కుంభాది సమీపంలోని సారండా అడవుల్లో గురువారం భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకార్పులు జరిగాయి. మోస్ట్ వాంటెడ్ కేంద్ర కమిటీ సభ్యుడు, పతిరామ్ మాంజి అలియాస్ అనల్ దాదాతో పాటు 16 మంది ఎన్కౌంటర్లో మృతి చెందారు. సీఆర్పీఎఫ్ డీఐజీ అనురంజన్ కిస్పోట్టా, […] The post జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ – 16 మంది మావోయిస్టుల మృతి appeared first on Visalaandhra .
. కర్నాటక గవర్నరు తీరూ అదే. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: సిద్ధరామయ్య బెంగళూరు: కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాత్ రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి చేసిన రెండు లైన్ల ప్రసంగం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. గురువారం గెహ్లాత్ రాష్ట్ర శాసనసభ ఉమ్మడి సమావేశంలో తన సంప్రదాయ ప్రసంగాన్ని రెండు ప్రారంభ పంక్తులు మాత్రమే చదివి ముగించారు. సభ్యులను పలకరించిన తర్వాత గవర్నర్… ‘ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక, […] The post రెండు లైన్ల ప్రసంగం… వాకౌట్ appeared first on Visalaandhra .
మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపైదేశవ్యాప్త ప్రచారోద్యమం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మరో వంద సంవత్సరాలకు స్ఫూర్తినిచ్చేలా సీపీఐ శతవార్షికోత్సవాల ముగింపు వేడుకలు ఖమ్మంలో జరిగాయని పార్టీ జాతీయ కార్యదర్శి కే రామకష్ణ పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరిభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముగింపు వేడుకలపై ఆయన మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గసభ్యులు రావుల వెంకయ్య, ఏపీ కంట్రోల్ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పాల్గొన్న ఈ సమావేశంలో రామకష్ణ మాట్లాడుతూ […] The post మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపైదేశవ్యాప్త ప్రచారోద్యమం appeared first on Visalaandhra .
కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ గ్లింప్స్ విడుదల
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్ కి వచ్చిన రెండు సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ సినిమాగా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే రెండు సీజన్స్ కలిపి థియేటర్స్ లో సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినిదత్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ “కోవెలమూడి సత్య సాయిబాబా తన అనుభవాన్ని అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అనే సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశారు. ప్రశాంత్ కుమార్ అద్భుతంగా తెరకెక్కిస్తున్న కానిస్టేబుల్ కనకం ప్రతి సీజను బాహుబలి లాగా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.
ట్రంప్ శాంతి మండలికిభారత్, చైనా, ఫ్రాన్స్ దూరం
నిర్ణయం తీసుకోని ఇటలీ, రష్యా, టర్కీ, ఉక్రెయిన్సభ్యులుగా చేరిన పాక్, యూఏఈ సహా 35 దేశాలు దావోస్/న్యూదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి మండలి అధికారికమైంది. దావోస్లో ప్రపంచా ఆర్థిక ఫోరం సందర్భంగా ట్రంప్ సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. పాకిస్థాన్, అజర్బైజన్, యూఏఈ సహా 35 దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి. భారత్, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్, జర్మనీ వంటి కీలక దేశాలు ఈ మండలిలో చేర లేదు. సంతకాలకు దూరంగా ఉన్నాయి. ఇటలీ, […] The post ట్రంప్ శాంతి మండలికిభారత్, చైనా, ఫ్రాన్స్ దూరం appeared first on Visalaandhra .
పారిశ్రామిక ప్రగతి వేదిక దావోస్
. ఆయా రంగాల్లో మార్పులు, ఆలోచనలు పంచుకునే అవకాశం. చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ. ముగిసిన 4 రోజుల పర్యటన`నేడు హైదరాబాద్ రాక విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ప్రపంచ పారిశ్రామిక రంగంలో వస్తోన్న మార్పులు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు దావోస్ వేదిక ఎంతో ఉపయోగకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీని గ్లోబల్ బ్రాండ్గా నిలిపేందుకు, కొత్త పాలసీలపై మార్కెట్ స్పందన అంచనా వేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. 2025 […] The post పారిశ్రామిక ప్రగతి వేదిక దావోస్ appeared first on Visalaandhra .
Sharwanand | 4 సినిమాలు రిలీజ్ చేయనున్నాడా..?
Sharwanand | 4 సినిమాలు రిలీజ్ చేయనున్నాడా..? ఆంధ్ర్రప్రభ వెబ్ డెస్క్ :
ఆస్ట్రేలియా టౌన్ కాల్పుల్లో ముగ్గురు మృతి
ఆస్ట్రేలియాలోని లేక్ కార్గిలిగో పట్టణంలో గురువారం కాల్పుల ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారని పోలీసు అధికారులు తెలిపారు. న్యూ సౌత్ వేల్స్లో దాదాపు 1500 మంది జనాభాతో ఉండే చిన్నపట్టణంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు. కేవలం రెండు వీథులతో ఉండే ఈ టౌన్లో ఇప్పుడు భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మొహరించుకుని ఉన్నాయి. ఇక్కడ జరిగిన ఆస్ట్రేలియా జాతీయ సంతాప దినం నాడే కాల్పుల ఘటన జరిగింది. ఆస్ట్రేలియాలో అప్పుడప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. సిడ్నీలో డిసెంబర్ 14వ తేదీన సాయుధులు జరిపిన కాల్పుల్లో కనీసం 15 మంది చనిపోయారు.
జార్ఖండ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రక్కును ఢీకొని దూసుకెళ్లిన రైలు
జార్ఖండ్ లో నవాదిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద గురువారం నాడు గోండా - అసన్సోల్ ఎక్స్ ప్రెస్ ఓ ట్రక్కును ఢీకొట్టింది. రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రాణనష్టం జరగలేదు. కానీ, జసిదిహ్ -అసన్సోల్ ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారి తెలిపారు. తూర్పు రైల్వే జోన్ పరిధిలోని అసన్సోల్ రైల్వే డివిజన్ లోని జాసిదిహ్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ట్రక్కు కాస్త దెబ్బతిన్నా, ఆ ప్రాంతంలో ఉన్న రెండు మోటర్ సైకిళ్లు మాత్రం దెబ్బతిన్నాయి.
భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు
గురువారం వెండి ధర కిలోకు సుమారు రూ.19,000 తగ్గి రూ.2.99 లక్షలకు చేరింది. బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.3,099 తగ్గి రూ.1.51 లక్షలకు వచ్చింది. ఇటీవల భారీ పెరుగుదల తర్వాత లాభాల బుకింగ్, స్టాక్ మార్కెట్ ర్యాలీ, భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. కొత్త పెట్టుబడిదారులు కొంతకాలం వేచి చూడాలని సూచిస్తున్నారు. 2025లో బంగారం 75 శాతం, వెండి 167 శాతం పెరిగాయి.
గీతం యూనివర్శిటీకి హైకోర్టు షాక్
రాష్ట్ర హైకోర్టు సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీకి షాక్ ఇచ్చింది. విద్యుత్ బకాయిల్లో రూ. 59.65 కోట్లు మూడు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది. గీతం యునివర్శిటిపై ఎస్పిడిసిఎల్ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించింది. యూనివర్శిటీ చెల్లించాల్సిన మొత్తం బకాయిల్లో సగం చెల్లించాలని కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, గీతం యునివర్శిటీకి చెందిన విద్యుత్ బకాయిలు రూ. 118.13 కోట్ల రూపాయలు చెల్లించడంలేదంటూ గత ఏడాది సెప్టెంబర్లో ఎస్పిడిసిఎల్ నోటీసులు జారీ చేసింది. దీనిపై యునివర్శిటీ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ మాదవి దేవి గీతం యూనివర్శిటీకి విద్యుత్ కనెక్షన్ పునరుద్దరించాలని ఎస్పిడిసిఎల్ను ఆదేశించింది. దీనిపై ఎస్పిడిసిఎల్ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ విద్యుత్ కనెక్షన్ను పునరుద్ధరించడానికి ముందస్తు షరతుగా మూడు వారాల్లోగా మొత్తం విద్యుత్ బకాయిలలో సగం విద్యుత్ సంస్థకు చెల్లించాలని స్పష్టం చేసింది.
జకార్తా: భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నయా చరిత్ర సృష్టించింది. ఇండోనేసియా సూపర్ 500 మాస్టర్స్ టోర్నమెంట్లో సింధు క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ఈ క్రమంలో తన కెరీర్లో రికార్డు స్థాయిలో 500వ విజయాన్ని అందుకుంది. ఓ భారత షట్లర్ 500 విజయాల మైలురాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్గా సింధు చరిత్ర సృష్టించింది. ఓవరాల్గా 500వ విజయం సాధించిన ఆరో షట్లర్గా సింధు నిలిచింది. కాగా, గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో సింధు 2119, 2118తో డెన్మార్క్కు చెందిన హోజ్మార్క్ను ఓడించింది. పురుషుల సింగిల్స్లో లక్షసేన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. ప్రీక్వార్టర్ ఫైనల్లో సేన్ 2110, 2111తో హాంకాంగ్ ఆటగాడు జాసన్ను ఓడించాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేశాడు.
మనీ లాండరింగ్ కేసులో రవి ప్రకాష్కు కోర్టు షాక్
ఓ చానెల్ మాజీ సిఇఓ రవి ప్రకాష్కు మనీలాండరింగ్ కేసులో నాంపల్లి సెషన్స్కోర్టు షాక్ ఇచ్చింది. విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఇడి నమోదు చేసిన కేసులో ముద్దాయిగా గుర్తిస్తూ రవి ప్రకాష్కు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. రవి ప్రకాష్ ఓ చానెల్కు సిఇఓగా ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలకు చెందిన రూ. 18 కోట్లకు పైగా డబ్బులను కంపెనీ ఖాతా నుండి విత్ డ్రా చేశారని, వాటికి లెక్కలు చూపలేదని ఆరోపిస్తూ ఇడి కేసు నమోదు చేసింది. అయితే తనపై నమోదైన కేసులో ఇడి విచారణకు హాజరుకాకుండా రవి ప్రకాష్ తప్పించుకుని తిరుగుతున్నాడనే కారణంతో మరో కేసు ఇడి నమోదు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి సెషన్స్ కోర్టు రవి ప్రకాష్కు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో వారం రోజుల పాటు జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేసింది.
ఇండియా-పాక్ వార్ నేపథ్యంలో ’బార్డర్ 2’.. ఆ దేశాల్లో విడుదలకు నో
సన్నీడియోల్ హీరోగా నటించిన ‘బార్డర్ 2’ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 23న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ వార్ డ్రామాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. అయితే ’బార్డర్ 2’ మూవీ గల్ఫ్ దేశాల్లో నిషేధం ఎదుర్కొంటుందని తెలుస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రేన్ వంటి దేశాల్లో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా పలు సన్నివేశాలు ఉన్న కారణంగా అక్కడి ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 1971లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ’బార్డర్ 2’ సినిమా మొదటి భాగంతో పోలిస్తే విస్తృతమైన కథాంశంతో వస్తోంది.
Chiranjeevi |విశ్వంభర తెర వెనుక ఏం జరుగుతోంది..?
Chiranjeevi | విశ్వంభర తెర వెనుక ఏం జరుగుతోంది..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
ట్రక్కును ఢీకొన్న రైలు.. తప్పిన పెను ప్రమాదం #Deoghar #Jharkhand #RailwayCrossing #Train
ట్రంప్పై నిరసనలు.. సరుకులకు ఉరుకులు
న్యూక్: గ్రీన్లాండ్ అమెరికాకు కావల్సిందేనని ట్రంప్ ప్రకటించడంతో గ్రీన్లాండ్లో కలవరం చెలరేగింది. అక్కడి ప్రభుత్వం పౌరులకు అత్యవసర జాగ్రత్త చర్యలకు సమాయత్తం చేసింది. పౌరులు చాలినంతగా ఆహారం, మంచి నీరు, ఇంధనం వంటి నిత్యావసరాలతో సిద్ధంగా ఉండాలని ఇంగ్లీషు, స్థానిక గ్రీన్ల్యాండిక్ భాషలో కరపత్రం వెలువరించారు. తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలిపారు. సంక్షోభం ఏర్పడుతుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో పౌరులు దుకాణాలకు వెళ్లి తమకు అవసరం అయిన వస్తువులు కొనుకుంటున్నారు. గ్రీన్లాండ్ను ఏదో విధంగా స్వాధీన పర్చుకోవడమే ట్రంప్ తంతు అన్పిస్తోందని స్దానిక పౌరుడు జాకోబ్సెన్ మండిపడ్డారు. ప్రపంచ స్థాయి సదస్సు నుంచి ట్రంప్ ప్రేలాపనలు తమక సహించలేని విధంగా ఉన్నాయని నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్వి బెదిరింపులే కావచ్చు. అయితే మనం అంతా సిద్ధంగా ఉండకుండా వ్యవహరించడం కన్నా సిద్ధంగా ఉండటం మంచిదని తెలిపారు.
సిసి కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్పై మరింత కట్టుదిట్టమైన నిఘా పెట్టనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరంతోపాటు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. రెండు రోజుల్లో ఇంటర్ పరీక్షల హాల్టికెట్ల జారీ చేయనున్నారు.- ఈ పరీక్షలకు సుమారు 4 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. సిసి కెమెరాలు ఉన్న కాలేజీ ల్యాబ్లకే ఈసారి ప్రాక్టికల్ పరీక్షలకు సెంటర్లు కేటాయించనున్నారు. కార్పోరేట్, ప్రైవేట్ కాలేజీలు స్వతహాగా సిసి కెమెరాలు అమర్చుకున్నారు. ప్రభుత్వ కాలేజీలలో అమర్చిన సిసి కెమెరాలతో పాటు ప్రైవేట్ కాలేజీలలో ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయించే ల్యాబ్ను కూడా ఇంటర్ బోర్డ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేస్తున్నారు.ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం అయినందున వాటిల్లోనే ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే కేంద్రాలలో ఇన్విజిలేటర్ల పర్యవేక్షణతో పాటు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తారు. దాంతోపాటు కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు కూడా ప్రాక్టికల్ పరీక్షలను పర్యవేక్షిస్తారు. పారదర్శకంగా ప్రాక్టికల్ పరీక్షలు రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ఎక్కువగా థీయరీపైనే దృష్టి సారించి, ప్రాక్టికల్స్ను విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో అవసరమైనా సామాగ్రి లేకపోవడం, మరికొన్నింటిలో నేర్పించే సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్కు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కొన్ని కాలేజీలు ప్రాక్టికల్ పరీక్షలో తమ విద్యార్థులు పూర్తి మార్కులు కేటాయిస్తుందన్న ఆరోపణల నేసథ్యంలో పారదర్శకంగా ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ర్యాంకుల పందేరంలో ప్రాక్టికల్స్ మార్కులే కీలకం. ఇంటర్ ప్రాక్టికల్స్లో ఎంపిసి వారికి 60 మార్కులు, బైపిసి వారికి 120 మార్కులు ఉన్నాయి. ఒక్క మార్కు తేడాతో కూడా ర్యాంకులు తారుమరవుతుంటాయి. దాంతో ర్యాంకుల పోటీలో ప్రతి మార్కూ కీలకంగానే మారుతుంది.
మేడారంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన మంత్రి సీతక్క
మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ మంత్రి దనసరి అనసూయ పిలుపునిచ్చారు. గతంలో కాలినడక నుండి కార్ల మీద వచ్చిన భక్తులు.. ప్రస్తుతం ఎడ్ల బండ్లను వదిలి హెలికాప్టర్పై రావడానికి సిద్ధమవుతున్నారన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థ నిర్వహించనున్న హెలికాప్టర్ సేవలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవార్లను సత్వరమే దర్శనం చేసుకోవడానికి సమయం వృధాకాకుండా హెలికాప్టర్ సేవలను రాష్ట్ర పర్యాటక శాఖ చేపట్టిందని, హనుమకొండ జిల్లా కేంద్రం నుండి మేడారం వరకు, మేడారం నుండి హనుమకొండ కు వెళ్లేందుకు అతి తక్కువ ధరలలో ఒక్కొక్కరికి 31 వేల రూపాయల టికెట్ నిర్ణయించిందన్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ద్వారా పర్యటించడానికి 4 వేల 8 వందల రూపాయల టికెట్ను ఖరారు చేశారని వివరించారు. గతంలో మహా జాతర సందర్భంగా అప్పటి పాలకులు నామమాత్రంగా నిధులు కేటాయించగా ప్రజాప్రభుత్వం గద్దెల పునరుద్ధరణ పనులతోపాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 251 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. గురువారం నుండి ఈ నెల 31 వరకు వీరి సేవలు కొనసాగుతాయని తెలిపారు. థంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సర్వీస్ నిర్వహిస్తుంది. బుకింగ్ కొరకు మొబైల్ నెంబర్ 9676320139, 8530004309, 7660939509 వెబ్సైట్ డబ్లుడబ్లుడబ్లు . హెలితాక్సియ్.కామ్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈద్గా ఫ్లాట్ఫామ్ను ప్రారంభించిన మంత్రి సీతక్క.... జిల్లా కేంద్రంలోని ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి సుమారు రూ.15 లక్షలతో నిర్మించిన ఈద్గా ప్లాట్ ఫామ్ మంత్రి సీతక్క ప్రారంభించారు. ముస్లిం మైనారిటీల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మైనారిటీల కోసం మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ప్రజా ప్రతినిధులు, మైనార్టీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
పాన్ -ఇండియా బ్లాక్బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్ ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ’స్వయంభు’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగా ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. భారతదేశపు వైభవమైన చరిత్రను, మహోన్నతను సెలబ్రేట్ చేస్తూ రూపొందుతున్న ‘స్వయంభు’ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుందని ఇంతకు ముందు ప్రకటించారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా వాయిదా పడినట్టుగా తెలిసింది. స్వయంభూ సినిమాలో గ్రాఫికల్, వీఎఫ్ఎక్స్ షాట్స్ ఎక్కువగా ఉన్నాయట. వాటి కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారట మేకర్స్. దీంతో ఈ సినిమా వాయిదా పడిందని సమాచారం. అయితే మార్చి చివరన లేదా ఏప్రిల్ ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట.

23 C