SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

18    C
... ...View News by News Source

సంజయ్ పార్టీ మారలేదు

మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎమ్మెల్యే కె. సంజయ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని, ఆయన బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు చెప్పారు. సంజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో ఆయనకు ఊరట లభించింది. పార్టీ ఫిరాయించరనడానికి పిటిషనర్ సాక్షాధారాలు ఏవీ చూపించకపోవడంతతో ఆయన బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారని స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు. జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పార్టీ ఫిరాయించారని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను స్పీకర్ కొట్టి వేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎన్నికైన పది మంది ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని బిఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ జరిపి ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు టి. ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారలేదని, వారు బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారని తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్‌నూ స్పీకర్  కొట్టివేయడంతో మొత్తం ఎనిమిది మందికి క్లీన్ చీట్ లభించింది. ఇదిలాఉండగా ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ తీర్పుపై స్పందిస్తూ తాను పార్టీ మారలేదని, బిఆర్‌ఎస్‌లోనే ఉన్నానని అన్నారు. బిఆర్‌ఎస్ శాసనసభాపక్షం కార్యాలయం నిర్వహణకు ప్రతి నెలా తన జీతం నుంచి ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నానని చెబుతూ ఇంతకంటే పెద్ద సాక్షం ఏమి కావాలన్నారు. తాను బిఆర్‌ఎస్‌లో ఉన్నానంటూ పలు సాక్షాలతో ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ వద్ద అఫిడవిట్ దాఖలు చేశారు. స్పీకర్ తీర్పుపై బిఆర్‌ఎస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరితే స్పీకర్ పార్టీ లేదని తీర్పు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దీనిపై తాము న్యాయ నిపుణులతో చర్చించి కోర్టులో సవాల్ చేస్తామన్నారు. కడియం, దానంపై కేసుల విచారణ ఇదిలాఉండగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్‌పై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణకు చేపట్టారు. పిటిషనర్, కుద్బుల్లాపూర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానందను రెస్పాండెంట్ తరపు న్యాయవాది పలు ప్రశ్నలు వేశారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసునూ స్పీకర్ 19వ తేదీకి వాయిదా వేశారు. తాము పార్టీ మారలేదని, బిఆర్‌ఎస్‌లోనే ఉన్నామని ఎమ్మెల్యేలు కడియం, దానం ఇదివరకే అఫిడవిట్ దాఖలు చేశారు.

మన తెలంగాణ 5 Feb 2026 4:00 am

విద్యుత్ కనెక్షన్ల జారీల్లో భారీ మార్పులు

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా విద్యుత్ వినయోగదారులకు కేంద్ర విద్యుత్ శాఖ తీపికబురు చెప్పింది. విద్యుత్ కనెక్షన్ కొరకు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా తాజాగా విద్యుత్ సవరణ నిబంధనలు- 2024 ప్రకారం విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కనెక్షన్లలో పారదర్శకతను పెంచుతూ ఎక్కడా ఆలస్యం కాకుండా రూపొందించిన కొత్త నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇక నుంచి మెట్రో నగరాల్లో వినియోగదారుడు దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే కనెక్షన్ ఇవ్వాలనే నిబంధన పెట్టారు. అలాగే మున్సిపాలిటీల్లో గరిష్టంగా 7 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తు చేసిన తర్వాత గరిష్టంగా 15 రోజుల్లో కొత్త కనెక్షన్ ఇవ్వాల్సిందే. కొండ ప్రాంతాలు లేదా భౌగోళిక ఇబ్బందులు ఉన్నచోట మాత్రం 30 రోజుల గడువు పెట్టారు. స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటివి ఏర్పాటు చేయాల్సి వస్తే కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల మేరకు గరిష్టంగా 90 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలి. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం : విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీలో మార్పులు చోటుచేసుకున్న తరుణంలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఇందుకోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. స్తంభాలు, లైన్స్ కోసం వినియోగదారుల నుంచి దూరాన్ని బట్టి ఒక్కో రీతిలో డబ్బు వసూలు చేసేవారు. కానీ, ఇక నుంచి ఫిక్స్‌డ్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. 1 కిలో వాట్ కనెక్షన్‌కు రూ.500 కడితే సరిపోతుంది. 1 కిలోవాట్ నుంచి 5 కిలో వాట్ల వరకు రూ.3,500 వరకు ఛార్జ్ చేస్తారు. పూర్తిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు : కొత్త కనెక్షన్ కావాలనుకునే వారు ఇకపై భౌతిక పత్రాలతో అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. సంబంధిత డిస్కంల అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, ఆస్థి పత్రాలు వంటి అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. అలాగే వినియోగదారుడి దరఖాస్తు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు. అధికారుల నిర్లక్ష్యం వల్ల జాప్యం జరిగితే ఆటోమేటిక్‌గా ఉన్నతాధికారులకు సమాచారం ఎస్కలేట్ అవుతుంది. అపార్ట్‌మెంట్లకు వెసులుబాటు : హై రైజ్ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు తమకు నచ్చిన విధంగా వ్యక్తిగత కనెక్షన్లు పూర్తి సొసైటీకి కలిపి సింగిల్-పాయింట్ కనెక్షన్‌ను ఎంచుకోవచ్చు. దీనిపై సొసైటీ సభ్యులు ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకునేలా అవకాశం కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే ప్రతి కొత్త కనెక్షన్‌కు స్మార్ట్ మీటర్లను తప్పనిసరి చేశారు. దీంతో రీడింగ్ తీసుకోవడంలో అక్రమాలకు తావుండదు. 10 కిలోవాట్ల వరకు రూఫ్-టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వారికి టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ ఇక నుంచి అవసరం లేకుండా చేశారు. ఈ నిబంధనతో సోలార్ విద్యుత్ వాడేవారికి ప్రోత్సాహకరంగా ఉండనుంది. విద్యుత్ శాఖ ప్రవేశపెట్టిన తాజా సంస్కరణల ద్వారా డిస్కంల పనితీరులో పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

మన తెలంగాణ 5 Feb 2026 3:30 am

ఇదిగో నరవణె పుస్తకం

2020లో జరిగిన భారత్ - చైనా ఘర్ష ణ సమయంలో ప్రధాని నరేంద్రమోదీ తన బాధ్యతలను విస్మరించారని, ఆ బాధ్యతను జనరల్ నరవణేకు అప్పగించారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే రాసిన విడుదలకాని జ్ఞాపకాలను ఉదహరిస్తూ ఈ ఆరోపణ చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ, మాజీ ఆర్మీ చీఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన జ్ఞాపకాలులోని అంశాలను ప్రస్తావించి, ప్రభుత్వం మరో విధంగా చెబుతు న్నా, ఈ పుస్తకంలోని విషయాలను దేశంలోని యువకులు తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ కానీ, రక్షణమంత్రి రాజ్ నాథ్‌సింగ్ కానీ ఈ పుస్తకం చదవలేదని, ప్రభుత ్వం మాత్రం నరవణే వాదనకు భిన్నంగా ఆలాంటిది ఏమీ లేదని చెప్పిందని రాహుల్ అన్నారు. లడఖ్‌లో ఏమి జరిగిందో నరవణే పూర్తి కథనాన్ని రాశారని, దీనిని అంతా చదవాలని ఆయన అన్నారు. లోక్‌సభలో మాత్రం తాను ఈ జ్ఞాపకాలు నుంచి అంశాలను ప్రస్తావించ రాదని తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. చైనా ట్యాంక్‌లు మన భూభాగంలోకి చొచ్చుకవస్తే.. ఏంచేయాలని జనరల్ ప్రశ్నించినప్పుడు ప్రధాని ఏది ఉచితమో అదే చేయండి అన్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కానీ, ఎస్, జైశంకర్, కానీ, ఎన్ ఎస్ ఏ అజిత్ డోవల్ కానీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని నరవణే పేర్కొన్న విషయాన్ని జ్ఞాపకాల నుంచి రాహుల్ ఉటంకించారు. చైనా దళాలు చొచ్చుకు వస్తే తమను అడగకుండా వారిపై కాల్పులు జరపవద్దు అని సైన్యానికి పై నుంచి స్టాండింగ్ ఆర్డర్ ఉందని నరవణే తెలిపారు. మన భూభాగంలోకి చొచ్చుకువచ్చిన, చైనా ట్యాంకులపై తాను కాల్పులు జరపాలను కున్నట్లు మాజీ జనరల్ పేర్కొన్న విషయాన్ని ఉదహరించారు. ఆర్మీ చీఫ్ ఆ విపత్కర పరిస్థితిలో తాను ఒంటరిగా ఉన్నానని, బాధ్యతగల ప్రభుత్వం విడిచివేసిందని రాశారని పేర్కొంటూ, పార్లమెంటులో ఈ విషయం చెప్పేందుకు తాను సిద్ధపడినా, ఈవాస్తవాలు అంగీకరించేందుకు వారు భయపడుతున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధాని పార్లమెంటుకు వస్తే .. తాను ఈ పుస్తకాన్ని ఆయనకు బహూకరిస్తానని, ఈ పుస్తకం ప్రతిపక్షనాయకుడు రాసింది కాదని, బాధ్యతాయుతమైన మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం అని లోక్ సభలో ప్రతిపక్షనేత అన్నారు. చైనా సైన్యం మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు, ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్మీ చీఫ్ పై ఉత్తర్వుల కోసం వేచి చూడాల్సివచ్చింది. నిర్ణయం తీసుకోవల్సిన ప్రధాని బాధ్యత నుంచి తప్పించుకున్నారని ఆయన ఆరోపించారు . దేశం ఈ విషయాన్ని ప్రశ్నిస్తుంటే... ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా పారిపోతోందని ఆయన విమర్శించారు. ఈ విషయంపై ఆందోళన జరిపిన ప్రతిపక్షంలోని 8 మంది సభ్యులను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 5 Feb 2026 3:10 am

న్యాయం విలపిస్తోంది

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నాడు న్యాయవాదిగా సుప్రీంకోర్టుకు హాజరై తమ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) నేపథ్యంలో తలెత్తిన సమస్యలను విన్నవించారు. మూడు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన వేళ.. తమ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్దేశ్యపూర్వకంగానే ... హడావుడిగా సర్ చేపట్టారని మమతా బెనర్జీ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. తక్కువ వ్యవధిలో చేపట్టిన ఈ ప్రక్రియ కారణంగా ఒత్తిడికి లోనైన దాదాపు 150 మందికి పైగా మరణించారని, వారిలో బూత్ లెవెల్ అధికారులు (బిఎల్‌ఓ)లు కూడా ఉన్నారని ఆమె కోర్టుకు విన్నవించారు. దయచేసి ప్రజల హక్కులను కాపాడండి ...సార్ అని మమతా బెనర్జీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు చేతులు జోడించి విజ్ఞప్తి చేయడం నాటకీయతను తలపించింది. ఒక దశలో న్యాయం మూసిన తలుపుల వెనుక ఏడుస్తోంది.. అని ఆమె సుప్రీంకోర్టులో గొ గ్గోలు పెట్టడం న్యాయమూర్తులనే విస్మ యం పరచింది. భారత ఎన్నికల కమిషన్ తో తాను సాగిస్తున్న పోరాటంలో తన వాదనను స్వయంగా వినిపించేందుకు మూడురోజులక్రితం దేశరాజధానికి వచ్చిన మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో సర్ ప్రక్రియ నుసవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సుర్యకాంత్ ఆధ్వర్యంలో ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపించారు. ధర్మాసనంలో జస్టిస్ , జోయ్ మల్యబాగ్చి, విపుల్ పంచోలీ కూడా ఉన్నారు. సర్ విషయంలో తన అభ్యంతరాలను ఎన్నికలకమిషన్ పూర్తిగా పట్టించుకోలేదని ఆరోపిస్తూ, హెచ్చిన స్వరంతో ఈసీ మీద పలు ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్ర జలను అణచివేయడానికే ఎన్నికల కమిషన్ బెంగాల్ ను టార్గెట్ చేసిందని ఆమె పేర్కొన్నారు. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడడానికి కోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఒకటొకటిగా పే ర్కొం టూ, సర్ మొదటి దశ ఫలితంగా దాదాపు 58 లక్షల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయని, చాలా మంది ఓటర్లకు ఫారమ్ 6 కింద అపీలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ తొలగింపులను బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చిన మైక్రో అబ్జర్వర్లు చేశారని, ఈ ప్రక్రియలో స్థానిక సిబ్బందిని పక్కన పెట్టారని , నివాస ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వం జారీ చేసిన రుజువులు వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలను తిరస్కరిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. భాషా సమస్యలు, స్పెల్లింగ్ సరిపోలలేదనే కారణంగా ఓటర్ల జాబితా నుంచి ప్రజల పేర్లు తొలగించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఉదాహరణకు ఒక మహిళ తన అత్తమామల ఇంటి పేరును ఉపయోగించినందున ఆమె పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారని వివరించారు. వివాహం త ర్వాత ఒక మహిళ తన నివాసాన్ని మారినప్పుడు ఈసీ ఆమెను అనుమానితుల లిస్ట్ లో ఉంచుతుందని ఆమె పేర్కొన్నారు. ఆధార్‌ను అంగీకరించడానికి నిరాకరించడం ద్వారా ఈసిఐ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నదన్నారు.మరి కొద్ది నెలల్లో నాలుగు రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్తుండగా, ఎన్నికలకు ముందు బెంగాల్ నే లక్ష్యంగా చేసుకున్నారని మమతా ఆరోపించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా సమీక్ష చేపట్టారు.మరి మూడు నెల్లల్లోనే, హడావుడిగా ఇలా చేసేందుకు ఎందుకు తొందరపడ్డారను ఆమె ప్రశ్నించారు. సర్ నోటీసులు పంపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోర్టు భారత ఎన్నికల కమిషన్ కు నోటీసు జారీ చేసింది. నోబెల్ బహుమ తి గ్రహీత అమర్త్య సేన్, ప్రఖ్యాత బెంగాలీ కవి జాయ్ గోస్వామీ, తృణమూల్ ఎంపీ దీపక్ అధికారి వంటి ప్రముఖులకు కూ డా సర్ నోటీసులు పంపబడ్డాయని తెలిసింది. ఈ కేసును వాయిదా వేస్తూ, మమతా విజ్ఞప్తికి ప్రతిస్పందనగా ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. 10లోగా ఇసి తమ స మాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.

మన తెలంగాణ 5 Feb 2026 3:00 am

గురువారం రాశి ఫలాలు (05-02-2026)

మేషం ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వాహన సంభందిత వ్యాపారాలు లాభాలుబాట పడతాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృషభం ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది. భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిధునం వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. బంధు మిత్రుల ఆదరణ పొందుతారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కర్కాటకం వృత్తి వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సింహం వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కన్య దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నవి. తుల సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపార మందకొడిగా సాగుతాయి. వృశ్చికం చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగమున విధులు సమర్ధవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ధనస్సు దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకరం ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. నూతన వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలుంటాయి. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుంభం కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీనం ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు అందుతాయి. మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి.  

మన తెలంగాణ 5 Feb 2026 12:10 am

మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’

హైదరాబాద్: పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ చిత్రం మార్చి 26న ఈ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ‘గబ్బర్ సింగ’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ […] The post మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 11:45 pm

‘వారణాసి’ ఒక భాగమేదర్శకుడు రాజమౌళి

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ రెండు భాగాలుగా వస్తోందనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారానికి రాజమౌళి చెక్ పెట్టారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… రెండు భాగాలుగా సినిమాను నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ చివరకు ఒక పార్ట్ గానే విడుదల చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటల 20 నిమిషాలు ఉండవచ్చని […] The post ‘వారణాసి’ ఒక భాగమేదర్శకుడు రాజమౌళి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 11:34 pm

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర హాస్యనటుడు బాబీ మృతి

హైదరాబాద్: తెలుగు బుల్లితెరపై ‘జబర్దస్త’, ‘సుమ అడ్డా’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు లక్ష్మీనారాయణ (బాబీ) రోడ్డు ప్రమాదంలో మతి చెందారు. రాజమండ్రిలోని రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై సోమ వారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతివేగంగా వచ్చిన రెండు బైక్‌లు బలంగా ఢీకొనడంతో ఈ అనర్థం జరిగింది. ఈ ప్రమా దంలో బాబీతో పాటు అక్షయ్ కుమార్, సత్యకుమార్ అనే మరో ఇద్దరు యువకులు కూడా […] The post రోడ్డు ప్రమాదంలో బుల్లితెర హాస్యనటుడు బాబీ మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 11:33 pm

టీమిండియాకు అభిషేక్ కీలకం

. 2018లోనే అతడి ప్రతిభను గుర్తించాం. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్`2026లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్రేకఅవుట్ స్టార్‌గా మారతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. ఈ యువ బ్యాటర్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించే ఆటగాడిగా, అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకునే సత్తా అతడికి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 2018 ఐపీఎల్ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున అభిషేక్‌కు […] The post టీమిండియాకు అభిషేక్ కీలకం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 11:29 pm

ఈసారి అన్ని జట్లూ ప్రమాదకరమే

టీ20 ప్రపంచకప్ పై ధోనీన్యూదిల్లీ: భారత్, శ్రీలంక వేదికగా ఈ నెల7 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలవబోయే జట్టు ఏదనే దానిపై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ధోనీ మాట్లాడుతూ భారత జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవేనని చెప్పారు. అయితే, అన్ని జట్లలోకి భారత్ […] The post ఈసారి అన్ని జట్లూ ప్రమాదకరమే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 11:28 pm

ఐసిసి టి20 ర్యాంకింగ్స్.. టాప్‌లోనే అభిషేక్, వరుణ్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజాగా టి20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు అభిషేక్ శర్మ (బ్యాటింగ్), వరుణ్ చక్రవర్తి (బౌలింగ్) తమ టాప్ ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టి20 సిరీస్‌లో అభిషేక్ అసాధారణ బ్యాటింగ్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతంఅభిషేక్ 917 రేటింగ్ పా యింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ 834 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. అయితే భారత బ్యాటర్ తిలక్ వర్మ ఒక ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. గాయం వల్ల తిలక్ కివీస్‌కు దూరంగా ఉన్నాడు. దీని ప్రభావం అతని ర్యాంకింగ్‌పై బడింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ ఒక స్థానం ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. పాథుమ్ నిసాంకా (శ్రీలంక) ఒక ర్యాంక్ మెరు గు పడి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక ర్యాంక్ మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం సూ ర్యకుమార్ ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. ఫర్హాన్ (పాకిస్థాన్) ఏడో, ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ 8వ ర్యాంక్‌లో నిలిచారు. టిమ్ సిఫర్ట్ (కివీస్), మిఛెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) టాప్10లో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి776 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన పాకిస్థాన్ బౌలర్‌అబ్రార్ అహ్మద్ రెండో ర్యాం క్‌కు దూసుకొచ్చాడు. రషీద్ ఖాన్ (అఫ్గాన్) మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) రెండు ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు.జాకబ్ డఫీ (కివీస్) ఐదో, వనిందు హసరంగ (శ్రీలంక), ఆరో, నవాజ్ (పాకిస్థాన్) ఏడో, ముస్తఫిజుర్ (బంగ్లా) 8వ, ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) తొమ్మిదో, ముజీబ్ (అఫ్గాన్) పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.

మన తెలంగాణ 4 Feb 2026 11:26 pm

‘ఎప్‌స్టీన’ విచారణకు క్లింటన్ అంగీకారం

వాషింగ్టన్/లండన్: అమెరికా రాజకీయాలను కుదిపివేసిన ఎప్‌స్టీన్ వ్యవహారంలో విచారణకు హాజరవుతామని మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య హిల్లరీ క్లింగన్ తెలిపారు. అమెరికా కాంగ్రెస్ ఓవర్‌సైట్ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని వారి న్యాయవాదులు తెలిపారు. క్లింటన్ దంపతులు గతంలో వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో వారిపై చర్యలు తీసుకుంటామని రిపబ్లికన్ పార్టీకి చెందిన జేమ్స్ కోమర్ కాంగ్రెస్ హౌస్ ఓవర్‌సైట్ కమిటీకి చైర్మన్ హోదాలో హెచ్చరించారు. ధిక్కార నేరం రుజువైతే […] The post ‘ఎప్‌స్టీన’ విచారణకు క్లింటన్ అంగీకారం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 11:25 pm

గద్దాఫీ కుమారుడి దారుణ హత్య

ఇంట్లోకి చొరబడి కాల్చిచంపిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులున్యాయ విచారణకు సైఫ్ రాజకీయ బృందం డిమాండ్ ట్రిపోలీ: లిబియా మాజీ అధినేత గద్దాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం (53) హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని నలుగురు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. జింటాన్‌లోని గద్దాఫీ ఇంటిలోకి చొరబడి ఆయనను కాల్చి చంపినట్లు సైఫ్ సలహదారుడు వెల్లడించారు. ఈ దాడి సూత్రధారి ఎవరో తేలాల్సి ఉన్నట్లు చెప్పారు. హత్యకు ముందు తన భద్రత విషయంలో సైఫ్ మిత్రుడి వద్ద ఆందోళన వ్యక్తం […] The post గద్దాఫీ కుమారుడి దారుణ హత్య appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 11:20 pm

పాక్‌కు భౌగోళిక సవాళ్లు

బలూచిస్థాన్‌లో సైన్యంపై రెబల్స్ దాడులు: రక్షణ మంత్రి ఆసిఫ్ ఇస్లామాబాద్: బలూచిస్థాన్‌లో భద్రతా బలగాలు భౌగోళికపరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ వెల్లడించారు. 12 చోట్ల రెబెల్స్ దాడులు చేశారని, ఇది తీవ్రమైన భద్రతా పరిస్థితిని నెలకొల్పిందని చెప్పారు. బలూచిస్థాన్‌లో వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారని, సైన్యంపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. బలూచ్ ప్రావిన్సులోని పట్టణాలపై ఏకకాలంలో రెబల్స్ మెరుపు దాడులు చేసినట్లు తెలిపారు. దీంతో 80 మంది భద్రతా సిబ్బంది చనిపోగా, 30కిపైగా ప్రభుత్వ […] The post పాక్‌కు భౌగోళిక సవాళ్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 11:17 pm

ఇందిరమ్మ ఇళ్లు పేదలఆత్మగౌరవానికి ప్రతీక

. ‘మున్సిపల’ తొలి సమరం మిర్యాలగూడ నుంచే…. రెండేళ్లలో ఎసఎల్‌బీసీ పూర్తి చేస్తాం: రేవంత్ విశాలాంధ్ర – నల్లగొండ బ్యూరో: త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌లో మరోసారి లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు పేదలకు మంజూరు చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ మండలం గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో యంగ్ […] The post ఇందిరమ్మ ఇళ్లు పేదలఆత్మగౌరవానికి ప్రతీక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 11:08 pm

అనుకున్నదొకటి…అయిందొకటి!

తలకిందులైన పొత్తులుమున్సి‘పోరు’లో అంతా గజిబిజిఖమ్మం జిల్లాలో వింత సమీకరణలు విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ అధిష్టానం తనకే ఖచ్చితంగా టికెట్ ఇస్తుందని అనుకున్న వారిలో కొందరికి టికెట్లు దక్కలేదు. డిప్యూటీ సీఎం భట్టికి అత్యంత సన్నిహితులు మల్లాది వాసుదేవ్ దంపతులకు టికెట్లు లభించలేదు. కాంగ్రెస్‌తో ఎంత మాత్రం పొత్తుకు అవకాశం లేదని చెప్పిన సీపీఎం… ఏకంగా తమ్మినేని సొంత గ్రామం లోనే చేతులు కలిపి కాంగ్రెసును ఏకగ్రీవం చేస్తూ […] The post అనుకున్నదొకటి…అయిందొకటి! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 11:07 pm

‘సర్’ తీరుపై కమల్‌హాసన్ ఆందోళన

న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం తమిళనాడు రాష్ట్ర ఓటర్ల హక్కులను తనిఖీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, ప్రముఖ నటుడు కమల్‌హాసన్ రాజ్యసభలో బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన తమిళనాడులో కొనసాగుతోన్న ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రకియపై మాట్లాడారు. “ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల గురించే నా ఆందోళన. దాన్ని అక్షరదోషాలు తనిఖీ చేసే ప్రక్రియగా భావిస్తున్న. ఓటు ప్రాథమిక హక్కు. ఎన్నికల కమిషన్ మాత్రం మా హక్కును తనిఖీ చేస్తోంది. జాబితా పరిశీలనల్లో అనేక తప్పిదాలు జరుగుతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు కోటి మంది అర్హులైన ఓటర్లు చనిపోయినవారి జాబితాలో ఉండవచ్చని ఆందోళన చెందుతున్నాం. బీహార్‌లో బతికున్న వారిని చనిపోయిన వారి ఓటర్ల జాబితాలో చేర్చారు. అటువంటి పరిస్థితి దేశమంతటా వ్యాప్తి చేయొద్దని కోరుకుంటున్నాం ” అని అన్నారు. భాష గురించి మాట్లాడుతూ తనకు తమిళ ఉపాధ్యాయులు భాషను పరిచయం చేశారని, తమ భాష, సంస్కృతిపై జరిగే ఎటువంటి దాడినైనా ఎదుర్కోవాలని సీఎన్ అన్నాదురై తదితర నేతల నుంచి నేర్చుకున్నానని అన్నారు. హైస్కూలు మధ్యలో చదువు మానేసిన తాను ఆర్థిక శాస్త్రంపై మాట్లాడేందుకు అర్హుడని కాదని ఎవరనుకున్నా అభ్యంతరం లేదని, తాను మాత్రం మాట్లాడుతానని స్పష్టం చేశారు. తమిళుడిగా తనకు ఓ స్పష్టమైన అభిప్రాయం ఉందన్నారు. ప్రస్తుత రాజకీయాలను నేటి యువత నిశితంగా గమనిస్తోందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపుతూ భవిష్యత్తు తమదేనన్న వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 

మన తెలంగాణ 4 Feb 2026 11:04 pm

కే ఎల్ ఎస్ ఆర్ సీఎం బినామీ కంపెనీ

. దివాలా సంస్థ ఆర్థిక లావాదేవీలపై నిగ్గు తేల్చాలి. సిట్ విచారణ పేరుతో డ్రామాలు. కిషన్‌రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: కేటీఆర్ విశాలాంధ్ర-హైదరాబాద్: తన బినామీ కంపెనీకి సీఎం రేవంత్‌రెడ్డి రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేఎలఎసఆర్ కంపెనీ… సీఎంకు ఏ విధంగా బినామీ కంపెనీగా పనిచేస్తుందో బుధవారం మీడియా సమావేశంలో ఆధారాలతో సహా బయటపెట్టారు. తన అక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే దావోస్‌లో ఉన్న రేవంత్ […] The post కే ఎల్ ఎస్ ఆర్ సీఎం బినామీ కంపెనీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 11:02 pm

తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యం

. సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గద్దర్. ప్రతిభ, పారదర్శకతే ప్రమాణంగా అవార్డుల ఎంపిక. ఫిలిం అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో భట్టి విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్‌ను కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అంబేద్కర్ సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… […] The post తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 10:57 pm

ఎస్ ఐ ఆర్ పై స్వయంగా సుప్రీంలో వాదించిన మమత

న్యూదిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎసఐర్) ప్రక్రియను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. ధర్మాసనం అనుమతితో మమత ఎసఐఆర్‌పై తన వాదనలు వినిపించారు. తాను బెంగాల్ మట్టి నుంచే వచ్చానని, అక్కడ నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆమె కోర్టుకు […] The post ఎస్ ఐ ఆర్ పై స్వయంగా సుప్రీంలో వాదించిన మమత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 10:28 pm

వైసీపీ కుట్రలు తిప్పికొడదాం

. కూటమి బలోపేతానికి ఐక్య కార్యక్రమాలు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సుదీర్ఘ చర్చ. రాజ్యసభ, నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా మంతనాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం సీఎం నివాసంలో భేటీ అయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు, పవన్ మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. కుల రాజకీయాలను […] The post వైసీపీ కుట్రలు తిప్పికొడదాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 10:24 pm

ఆగని నిరసనలు

. గాంధీ కుటుంబంపై బీజేపీ ఎంపీ దూబే వ్యాఖ్యల దుమారం. కాంగ్రెస్ సభ్యుల ప్రతిఘటన. లోక్‌సభలో గందరగోళం న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తోందని, ప్రతిపక్ష నాయకుడిని సభలో కీలకాంశాలపై మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో పార్లమెంటు బుధవారం రసాభాస అయింది. ఉభయ సభల్లో గందరగోళం కొనసాగింది. అధికార`విపక్షాల నినాదాలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తాయి. పదేపదే వాయిదా పడ్డాయి. చివరకు నిరసన హోరులోనే సభాపతులు […] The post ఆగని నిరసనలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 10:21 pm

ఘాటెక్కిన మిర్చి

. ఎగుమతిదారుల పోటీతో పెరిగిన ధరలు. క్వింటా మిర్చి గరిష్టంగా రూ.24 వేలు. తాలుకాయలకూ గిరాకీ!. నష్టాల్లో ఉన్న రైతులకు ఉపశమనం విశాలాంధ్ర -సచివాలయం: ఆకాశమే హద్దుగా మిర్చి ధరలు దూసుకుపోతున్నాయి. ఇన్నాళ్లూ ‘ధరల లేమితో’ కుదేలైన మిర్చి రైతుకు ఈ సీజన్ ఎర్ర బంగారం అందించింది. మిర్చి రైతులకు ఈ ఏడాది సంక్రాంతి తర్వాత అదృష్టం తలుపు తట్టింది. గత ఏడాది ధరలు లేక కుదేలైన రైతాంగానికి, ఈ ఏడాది మార్కెట్ పరిస్థితులు భారీ ఊరటనిస్తున్నాయి. […] The post ఘాటెక్కిన మిర్చి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 10:17 pm

ప్రధాని సీటును ముట్టడించిన మహిళా ఎంపీలు

న్యూదిల్లీ: ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో లోక్‌సభ దద్దరిల్లింది. దీంతో ప్రధాని ప్రసంగించలేదు. మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణె ఆత్మకథలోని కొన్ని అంశలను సభలో ప్రస్తావించేందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో ప్రతిపక్ష సభ్యుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. వారి నినాదాలతో సభ అనేకసార్లు వాయిదా పడింది. ప్రధాని మోదీ ప్రసంగించేందుకు కొద్ది సమయం ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు మహిళా ఎంపీలు ఒక్కసారిగా ప్రధాని సీటు వద్దకు దూసుకెళ్లారు. వర్షా […] The post ప్రధాని సీటును ముట్టడించిన మహిళా ఎంపీలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 10:14 pm

పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే

విశాలాంధ్ర` తొర్రూర్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల అభివృద్ధి సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి లు అన్నారు. బుధవారం తొర్రూర్ మున్సిపాలిటీలోని 14వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి సోమ రజనీ రాజశేఖర్ గెలుపు కొరకు ఎమ్మెల్యే ప్రతి ఇంటిని సందర్శించి చేతి గుర్తుకు ఓటు వేసి సోమ రజనీ రాజశేఖర్‌లను గెలిపించాలని కోరారు. అనంతరం కార్నర్ మీటింగులో ఎమ్మెల్యే యశస్విరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి […] The post పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 10:11 pm

ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

విశాలాంధ్ర ప్రతినిధి మంచిర్యాల జిల్లా: 2వ సాధారణ మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరుగనున్న పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పి.ఓ., ఎ.పి.ఓ. లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ […] The post ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 10:08 pm

నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాలు సాధించాలి

విశాలాంధ్ర, హైదరాబాద్ : నిర్దేశిత లక్ష్యాల సాధనతో పాటు ముఖ్యంగా నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యత గల బొగ్గును మాత్రమే వినియోగదారులు కోరుతున్నారని, ఈ దిశగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ డి.కృష్ణ భాస్కర్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన బొగ్గు ఉత్పత్తి, రవాణా, నాణ్యత తదితర అంశాలపై సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో […] The post నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాలు సాధించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 10:07 pm

ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడాలి : మంత్రి

విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్ నియోజకవర్గం పరిధి అలియాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్-మల్కాజ్‌గిరి పార్లమెంటరీ ఇంచార్జి,రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారనికి హాజరై సందర్బంగా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రశ్ యాదవ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి కలిసి ఘన స్వాగతం పలికారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన […] The post ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడాలి : మంత్రి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 10:06 pm

మేడారం జాతరలో బాలికపై అత్యాచారం..

రాష్ట్రంలోని మేడారంలో ఇటీవల ముగిసిన సమ్మక్క-సారలమ్మ జాతరలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లూ) స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్లు కమిషన్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు ఈ గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయని వెల్లడించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్, విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా ఖోంగ్‌దుప్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్ సభ్యురాలిగా ఉంటారు. ఫిబ్రవరి 5 నుంచి ఈ కమిటీ విచారణ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అవసరమైతే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నుంచి ఒక న్యాయవాది సహాయం కూడా తీసుకుంటారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, స్థానిక అధికారుల చర్యలు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ కార్యక్రమం జనవరి 28 నుంచి 31 వరకు జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. జాతర ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలంగాణ అధికారులు అప్పట్లో ప్రకటించడం గమనార్హం. మహిళలు, బాలికల భద్రతకు కట్టుబడి ఉన్నామని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ స్పష్టం చేసింది.

మన తెలంగాణ 4 Feb 2026 10:03 pm

మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా వై. ఖేమ్ చంద్ సింగ్ ప్రమాణం

మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన యుమ్నాం ఖేమ్ చంద్ సింగ్ బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు.గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. కుకి వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నమ్చా కిఫ్గెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసన సభ్యుడు ఎల్ దిఖో మణిపూర్ డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఖేమ్ చంద్ సింగ్ బీజేపీ శాసన సభాపక్షనేతగా ఎన్నికయ్యారు. బీజేపీకి చెందిన గోవిందాస్ కోంథోజామ్ , ఎన్ పిపికి చెందిన కె. లోకెన్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నమ్చా కిఫ్గెన్ న్యూఢిల్లీలోని మణిపూర్ భవన్ నుంచి వర్చువల్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన రద్దు చేసిన కొద్ది గంటల తర్వాత ఇంఫాల్ లోని లోక్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది.

మన తెలంగాణ 4 Feb 2026 9:52 pm

అహంకారానికి అభిమానానికి మధ్య పోటీ కాదు : పిల్లోడి భవాని విశ్వనాథం

సదాశివపేట ఫిబ్రవరి 4 (జనం సాక్షి) : వార్డును సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నానని పిల్లోడి భవాని విశ్వనాథం …

జనం సాక్షి 4 Feb 2026 9:42 pm

జనగామ మండలంలో పెద్దపులి కలకలం...

 జనగామ మండల పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. గత రాత్రి ఆలేరు మండలం టంగుటూరు నుండి జనగామ మండలం పెంబర్తికి వెళ్లే మార్గంలో పులి సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. ముఖ్యంగా పెంబర్తి గ్రామానికి చెందిన ఇట్టబోయిన రమేష్‌కు చెందిన పొలంలో పులి అడుగుజాడలు స్పష్టంగా కనిపించాయి. అలాగే ఇక్కిరి రాజు వ్యవసాయ బావి, నిమ్మల సుధాకర్ రెడ్డి తోటల వద్ద కూడా పులి సంచరించినట్లు గుర్తులు లభ్యమయ్యాయి. మరోవైపు, జనగామ మండలం శామిర్‌పేట గ్రామంలోని కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమం ఆవరణలో మంగళవారం రాత్రి 11:00 గంటల సమయంలో పులి తిరుగుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పులి సంచార వార్తతో పెంబర్తి, శామిర్‌పేట మరియు చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి అడుగుజాడలను పరిశీలిస్తున్నారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లే రైతులు, ఒంటరిగా బయట తిరిగే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, పులి కదలికలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని స్థానిక పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిరుత దాడితో లేగ దూడ మృతి తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాల్లో గత రెండు నెలలో నుండి, చిరుత దాడుల్లో మేకలు, గొర్లు, పాడి పశువులు,లేగ దూడలపై చిరుతపులి దాడి చేసి చంపడంతో, రైతన్నలు వ్యవసాయ క్షేత్రాలు పనులు చేసుకోవాలంటే భయంతో ఎక్కడి నుండి చిరుత ఎప్పుడు దాడి చేస్తుందో అని భయాభ్రాంతులకు గురవుతున్న సమయంలో నందివాడ గ్రామంలో మంగళవారం, సంకు రామవ్వ వ్యవసాయ క్షేత్రంలో రైతు సంకు రాజు మంగళవారం పాడి పశువులను రోజువారీగా తన కోట్టం పందిరిలో కట్టి వేయగా బుధవారం వ్యవసాయ క్షేత్రం వెళ్లి చూడగా ఏదో అడవి వన్యమృగం చంపి తిన్నదని గమనించి తన గ్రామ సర్పంచ్ అధికారులకు తెలుపగా వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారంతో వ్యవసాయ క్షేత్రం పరిశీలించి , చిరుత పులి లేగ దూడపై దాడి చేసి చంపిందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ తెలియజేశారు. రైతులు ఎవరు వ్యవసాయ క్షేత్రాలలో పాడి పశువులు మేకలు గొర్రెలను కట్టి వేయవద్దని , రైతులు జాగ్రత్తగా ఉండాలని, చిరుత పులిని బంధించడానికి బోనులను, కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటివరకు చిరుత పులి దాడిలోమృతి చెందిన పశువులు, రైతు బాధితులకు ప్రభుత్వ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి బాధిత రైతుల బ్యాంకు ఖాతాలోకి పరిహారం అందిందని, వివరాలను అయన తెలియజేశారు. ఎర్రపహడ్ గ్రామ రైతుకు 9,000 , గాంధీ నగర్ లో 15000 ,దేమోకలన్ రైతుకు 2500 మోతే గ్రామ బాధిత రైతుకు 22,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అయినట్టు ఆయన తెలియజేశారు. నందివాడ గ్రామంలో మంగళవారం జరిగిన చిరుత దాడిలో మృతిచెందిన లేగ దూడ 15 నుంచి 20వేల వరకు ఉంటుందని తాడ్వాయి మండల పశు వైద్యాధికారికి పంచనామా చేసినట్లు ఆయన తెలియజేశారు.

మన తెలంగాణ 4 Feb 2026 9:33 pm

ఏనుమాముల మార్కెట్‌లో క్వింటా రూ. 37, 100 ధర పలికిన ఎర్ర బంగారం

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం (మిర్చి) ధర రోజు రోజుకు పెరుగుతుంది. బుధవారం వండర్ హాట్ మిర్చి ధర అల్ టైమ్ రికార్డ్ ధర నమోదు చేసుకుంది. క్వింటాల్ మిర్చి రూ. 37,100 పలకడం విశేషం. గత నాలుగు సంవత్సరాల నుండి ఇంత పెద్ద మొత్తంలో ధర పలుకలేదని మార్కెట్ అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమేల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన ఆర్. వినోద్ అనే రైతు 80 వండర్ హాట్ మిర్చి మార్కెట్ కు తీసుకొచ్చారు. కీర్తన అనే అడితి ద్వారా దీనికి ధర రూ. 37,100 గా నిర్ణయించారు.

మన తెలంగాణ 4 Feb 2026 9:30 pm

బోర్ కొట్టనివ్వకుండా 'వారణాసి'ని తెరకెక్కిస్తున్నాం: రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వారణాసి చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి.. వారణాసి సినిమాను అవతార్ తో పోల్చడంపై మాట్లాడుతూ.. “జేమ్స్ కామెరూన్ లాంటి వ్యక్తితో నన్ను పోల్చడం నాకు చాలా గౌరవంగా ఉంది. కానీ ఆయన ఒక శిఖరం లాంటివారు. నేను ఇంకా నేర్చుకుంటున్న విద్యార్థిని. ఇక వారణాసి నిడివి 3 గంటల 20 నిముషాలు ఉంటుంది. అంతసేపు ప్రేక్షకుడిని థియేటర్ లో కూర్చోబెట్టాలి. 3 నిముషాలు బోర్ కొట్టించినా ప్రేక్షకుడు ఫోన్ పట్టుకుంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా తెరకెక్కిస్తున్నాం. ప్రతి సీన్ కొత్త అనుభూతినిస్తుంది’ అని చెప్పారు. 

మన తెలంగాణ 4 Feb 2026 9:23 pm

మీ ఆడ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి..

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంగడి రజిత క్రిష్ణ మీ ఆడ బిడ్డగా నన్ను

ప్రభ న్యూస్ 4 Feb 2026 9:10 pm

కౌంటర్.. కౌంటర్ అటాక్

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మంది ఫోన్లు వినే మీలాంటి వాళ్లు జతిపితలు

ప్రభ న్యూస్ 4 Feb 2026 9:02 pm

ఎప్‌స్టీన్ ఫైల్స్ వల్లనే బిల్‌గేట్స్‌తో బంధం ముగిసింది : మిలిందా

వాషింగ్టన్ : ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు ఇతర మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నట్టు బయటపడడం వల్లనే తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పినట్టు బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా వెల్లడించారు. ఈ వివరాలు తెలియడంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని తెలిపారు. వైవాహిక బంధం విలువలు ఆయన నిలబెట్టుకోకపోవడం వల్లనే విడాకులు తీసుకున్నట్టు చెప్పారు. దర్యాప్తులో బయటపడిన విషయాలపై ఆయనే సమాధానం చెప్పుకోవాలని, తాను కాదని వ్యాఖ్యానించారు. ఎపిస్టీన్‌ఫైల్స్‌లో బాధితులుగా ఉన్న మహిళలకు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ బిల్‌గేట్స్‌మిలిందా దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. వీరికి 20 ఏళ్లకు పైబడిన ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఎప్‌స్టీన్‌తో గేట్స్‌కు సంబంధాలు ఉండడంతో ఏమాత్రం ఇష్టపడని మిలిందా ఆయన నుంచి విడాకులు తీసుకున్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. అమెరికా న్యాయశాఖ ఇటీవల ఎప్‌స్టీన్‌ఫైల్స్‌ను విడుదల చేసింది. గేట్స్ రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు సాగించాడని , సుఖవ్యాధుల రోగి అయ్యాడని ఎప్‌స్టీన్ ఆరోపించాడు. ఈ అక్రమ లైంగిక సంబంధాలు బయటపడకుండా ఉండేందుకు బిల్‌గేట్స్ తన భార్య మిలిందాకు రహస్యంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి తనను అడిగారని తెలియజేశాడు. అయితే ఈ ఆరోపణలను గేట్స్ బృందంతీవ్రంగా ఖండించింది. 

మన తెలంగాణ 4 Feb 2026 8:52 pm

ఎక్స్‌ప్రెస్ వే పై గ్యాస్ ట్యాంకర్ బోల్తా...18 గంటలు ట్రాఫిక్‌ జామ్

ముంబై : ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే పై రాయ్‌ఘడ్ జిల్లా లోని ఖండాలా ఘాట్ అదోషిటన్నెల్ వద్ద మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడడంతో 18 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు 12 కిమీ మేర వాహనాలు ఆగిపోయాయి. ట్యాంకర్ లోని ప్రమాదకరమైన ప్రొపైలెన్‌గ్యాస్ లీక్ అవుతుండడంతో ఆ రోడ్డుకు కొంత దూరంలో వాహనాలను నిలిపివేశారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు 18 గంటలకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకు పోయారు. సాయంత్రం ట్యాంకర్ బోల్తా పడగా, అర్ధరాత్రికి సంఘటన స్థలానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం చేరుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ఆహారం, వాష్‌రూమ్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రయాణికులు ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ట్యాంకర్ నుంచి 50 శాతం గ్యాస్ మాత్రమే విడుదలయ్యిందని, మిగిలిన గ్యాస్‌ను తొలగించడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రద్దీ పెరగడంతో వాహనాలను పాత ముంబై పుణె హైవే వైపు మళ్లించినట్టు తెలిపారు. 

మన తెలంగాణ 4 Feb 2026 8:41 pm

రాహుల్‌ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్..

న్యూఢిల్లీ: కేంద్రం బడ్జెట్ సమగ్రంగా లేదని విపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సవాల్ విసిరారు. లోపాలు ఉన్నాయన్న ఆరోపణలను కాంగ్రెస్ తనముందు నిలబడి చెప్పగలదా ? అని సవాల్ విసిరారు. యువత నైపుణ్యం, వ్యవస్థాపకత, కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై బడ్జెట్‌లో తమ ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించిందని సీతారామన్ చెప్పారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న కార్మిక మార్కెట్ అవసరాలను తీర్చడానికి, వ్యవసాయం , గ్రామీణ ఉపాధి, యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాలు వంటి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాహుల్ గాంధీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తీరుపై విమర్శలు చేశారు. దేశంలో నెలకొన్న వాస్తవ సంక్షోభాలపై దృష్టి పెట్టలేదని, యువతకు ఉద్యోగాలు లేవని, తయారీ రంగం పతనమవుతోందని ఆరోపించారు. పెట్టుబడిదారులు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని చెప్పారు. రైతుల ఇబ్బందులతోపాటు ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతున్న అనేక చిక్కులు వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

మన తెలంగాణ 4 Feb 2026 8:34 pm

స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి శిక్షణ

 రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డిడియుజికెవై) సహకారంతో స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన యువతీ, యువకులకు మూడు నెలల కాలపరిమితితో డాట ఎంట్రీ ఆపరేటర్ (డిజిటల్ మిత్ర). ఎకౌంట్స్ అసిసెంట్‌ట్యాలీలో ఉపాధి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్.కిషోర్‌రెడ్డి బుధవారం నాడొక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని, అడ్మిషన్లకు చివరి తేదీగా ఫిబ్రవరి 16 (సోమవారం)గా నిర్ణయించామన్నారు. శిక్షణా కార్యక్రమాల్లో చేరాలనుకునే అర్హత కలిగిన యువతీ, యువకులు అడ్మిషన్ల కోసం ఫోన్ నెంబర్లు : 9133908000, 9133908111, 9133908222. 9948466111లో సంప్రదించాలని కోరారు. అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్స్, ఆధార్, క్యాస్ట్, ఫోటోలు తీసుకురావాల్సి ఉందన్నారు. దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్ నుండి బస్ నెంబర్:524 ద్వారా సంస్థకు చేరుకోవచ్చని, అదే విధంగా సమీప రైల్వేస్టేషన్లు బీబీనగర్, భువనగిరి, సికింద్రాబాద్‌ల నుంచి సంస్థకు చేరుకోవచ్చని వెల్లడించారు. డాట ఎంట్రీ ఆపరేటర్ (డిజిటల్ మిత్ర)కు ఇంటర్ పాస్, ఎకౌంట్స్ అసిస్టెంట్‌ట్యాలీకి బి.కామ్ విద్యార్హతను విద్యార్థులు కలిగి ఉండాలన్నారు.

మన తెలంగాణ 4 Feb 2026 8:32 pm

Tollywood |నాగవంశీ నిర్ణయం వెనుక కారణం ఇదేనా..?

Tollywood | నాగవంశీ నిర్ణయం వెనుక కారణం ఇదేనా..? Tollywood | ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Feb 2026 8:30 pm

Urea |రైతులు యూరియా యాప్ ను వినియోగించుకోవాలి…

Urea | రైతులు యూరియా యాప్ ను వినియోగించుకోవాలి… Urea | శంకరపట్నం,

ప్రభ న్యూస్ 4 Feb 2026 8:16 pm

ఆరోన్ జార్జి సెంచరీ.. ఫైనల్స్‌కి దూసుకెళ్లిన యువ భారత్

హరారే: అండర్‌-19 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. అఫ్గానిస్థాన్‌ని చిత్తుగా ఓడించి ఫైనల్స్‌కి భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఈ లక్ష్య చేధనలో భారత ప్లేయర్లు ఏ మాత్రం తడబడకుండా దంచికొట్టారు. ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 68 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే 59 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 62 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ ఆరోన్ జార్జి మాత్రం అప్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 95 బంతుల్లో సెంచరీ సాధించాడు. 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సులతో 115 చేసి ఆరోన్ ఔట్ అయ్యాడు. మొత్తానికి భారత్ 41.1 ఓవర్లలో 311 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్స్‌తో భారత్, ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో తలపడనుంది.

మన తెలంగాణ 4 Feb 2026 8:16 pm

Belt shop |ప్రాణం తీసిన బెల్టు షాపు..

Belt shop | ప్రాణం తీసిన బెల్టు షాపు.. Belt shop |

ప్రభ న్యూస్ 4 Feb 2026 8:11 pm

టిజి ఈసెట్- 2026 షెడ్యూల్ విడుదల

రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో లాటరల్ ఎంట్రీ నేరుగా సెకండియర్ ప్రవేశం కోసం నిర్వహించే టీజీ ఈసెట్ - 2026 షెడ్యూల్‌ను బుధవారం ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్లొమా, బీ.ఎస్సీ విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఈ ఏడాది కూడా ఈసెట్ పరీక్ష బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు. ఈ మేరకు విద్యార్థుల నుంచి ఫిబ్రవరి 9 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 18 గా నిర్ణయించారు. ఇక ప్రవేశ పరీక్షను మే 15న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500 గా, ఇతర అభ్యర్థులకు రూ.900 గా ఫీజును నిర్ణయించారు. మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. నిర్ణీత గడువు తర్వాత కూడా ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని విద్యామండలి కల్పించనుంది. అర్హత గల విద్యార్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ecet.tgche.ac.in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

మన తెలంగాణ 4 Feb 2026 8:08 pm

Gita worker |గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు

Gita worker | గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు Gita worker |

ప్రభ న్యూస్ 4 Feb 2026 8:03 pm

Megastar has to Rush for Vishwambara

Mega Heroes Pawan Kalyan and Ram Charan have announced the release dates of their respective films Ustaad Bhagat Singh and Peddi. They have cleared the confusion and made it clear about the healthy gap between the releases. Megastar Chiranjeevi’s film Vishwambara too is slated for release soon. Megastar has to rush and announce the release […] The post Megastar has to Rush for Vishwambara appeared first on Telugu360 .

తెలుగు 360 4 Feb 2026 7:58 pm

9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అమ్మాయిలు బలవన్మరణం

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ముగ్గురు అక్కచెల్లెళ్లు తొమ్మిదో అంతస్తునుంచి దుమికి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం కల్గించింది. వీరు 12,14,16 ఏళ్ల చిన్నారులు. సారీ.. నాన్నా.. నేను ఒంటరి తనంతో బాధపడుతున్నా.. అని లేఖ రాసి వారు బుధవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. టీనేజ్ పిల్లలు మరణించడంతో తల్లిదండ్రులు బాధతో కుమిలిపోతున్నారు.వీరి ఆత్మహత్యలకు కారణం..మొదట్లో కొరియన్ టాస్క్ -ఆధారిత గేమింగ్ యాప్ అని భావించినా, పోలీసులు మాత్రం గేమింగ్ కోణాన్ని తోసిపుచ్చారు. మరణించిన ఆ అమ్మాయిలు తమ డైరీలో పేర్కొన్నట్లు కొరియన్ సంసృ్కతి,వినోదం ద్వారా ప్రభావితమయ్యారని పోలీసులు తెలిపారు.వారు తమ డైరీలో పేర్కొన్న ప్రకారం, ఆ అమ్మాయిలు కొరియన్ సంసృ్కతిని ఇష్టపడుతున్నారని, కె-పాప్ సంసృ్కతి, కొరియన్ సినిమాలు , కొరియన్ సంగీతం, షాట్ ఫిల్మ్ లు, కొరియన్ షోలు, కొరియన్ సినిమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని పోలీసు డిప్యూటీ కమిషనర్ నిమిష్ పాటిల్ తెలిపారు.కొరియన్ సినిమాలు, చూడడం, మ్యూజిక్ వినడం వారికి వ్యసనంగా మారిందని, చదువుకుంటున్న పిల్లలు... అలాంటి కంటెంట్ చూడడం గమనించిన తల్లిదండ్రులు వారిని మందలించి, వారి ఫోన్ లను గుంజుకున్నారని, దీంతో మనస్థాపం చెందిన పిల్లలు ఈ ఆత్మహత్యకు సాహసించారని అధికారులు తెలిపారు.వారి గదిలో దొరికిన సూసైడ్ నోట్ లో .. ఏడుస్తున్న బొమ్మ వేసి.. సారీ..నాన్నా అంటూ, డైరీలో పూర్తిగా చదవండి. దానిలో ఉన్నది అంతా నిజమే. అని పిల్లలు రాశారు.బాలికల తండ్రి చేతన్ కుమార్ కు ఇద్దరు భార్యలు, మొత్తం ఐదుగురు పిల్లలు. వీరంతా కలిసే ఉంటున్నారు. చనిపోయిన బాలికలలో ఒకరు మొదటి భార్య కుమార్తె కాగా, మిగత ఇద్దరూ రెండో భార్య పిల్లలు.. చేతన్ భార్యలు ఇద్దరూ అక్క చెల్లెళ్లే. మొదటి భార్యకు మొదట్లో సంతానం లేకపోవడంతో చేతన్ తన భార్య చెల్లెలినే రెండో బార్యగా వివాహం చేసుకున్నాడు.

మన తెలంగాణ 4 Feb 2026 7:56 pm

Competitions |వాలీబాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక…

Competitions | వాలీబాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక… Competitions | దండేపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Feb 2026 7:52 pm

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..

బిఆర్ఎస్ పార్టీ 11వ వార్డ్ కౌన్సిలర్ రాపర్తి రవీందర్ ఆసిఫాబాద్ ఫిబ్రవరి 4

ప్రభ న్యూస్ 4 Feb 2026 7:49 pm

Indigo |శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన విమానం

Indigo | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన విమానం Indigo | శంషాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Feb 2026 7:49 pm

ఎగరాలి జెండా 23వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం

మాజీ కౌన్సిలర్ 23 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మాజీద్ మంచిర్యాల ఫిబ్రవరి

ప్రభ న్యూస్ 4 Feb 2026 7:44 pm

అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం..పేదల పెన్నిధి మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్న

47 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బొల్లం భీమయ్య మంచిర్యాల

ప్రభ న్యూస్ 4 Feb 2026 7:40 pm

ఆశీర్వదించండి.. గెలుపు అందించండి..

ఆశీర్వదించండి.. గెలుపు అందించండి.. షాద్ నగర్, ఆంధ్రప్రభ : గతంలో చేసిన అభివృద్ధి

ప్రభ న్యూస్ 4 Feb 2026 7:37 pm

Australia |మహాత్ముని విగ్రహం చోరీ…

Australia | మహాత్ముని విగ్రహం చోరీ… Australia | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 4 Feb 2026 7:29 pm

బిజెపి అంటే అభివృద్ధి భద్రత..సేవే లక్ష్యంగా గెలుపే ధ్యేయంగా మీ బిడ్డగా ఓటేసి ఆశీర్వదించండి

బిజెపి 51వ వార్డు అభ్యర్థి నల్లపు రజిత రమేష్ మంచిర్యాల ఫిబ్రవరి 4

ప్రభ న్యూస్ 4 Feb 2026 7:28 pm

అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి

10వ వార్డు ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ నీలప్ప మక్తల్

ప్రభ న్యూస్ 4 Feb 2026 7:24 pm

రైతు భరోసాపై సిఎం రేవంత్ ఎమన్నారంటే..?

సంక్రాంతి పండగ తర్వాత కూడా రైతు భరోసా పడకపోవడంతో తెలంగాణ రైతులు నిరాశలో ఉన్నారు. ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం గూడూరులో సిఎం రేవంత్‌ రెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం కావాల్సిన 9వేల కోట్ల రూపాయలను సిద్ధం చేసుకునే పనిలో ప్రభుత్వ ఉన్నట్లు చెప్పారు. అయితే, బిఆర్ఎస్ మాత్రం, సిఎం రేవంత్ రెడ్డి.. రైతులను మోసం చేస్తున్నారని విమర్శిస్తోంది. డిసెంబర్ నెలలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను.. సంక్రాంతికి ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి రైతులను మోసం చేస్తోందని బిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

మన తెలంగాణ 4 Feb 2026 7:21 pm

తనను గెలిపించి..

తనను గెలిపించి.. అమనగల్లు, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీలోని 12వ వార్డ్ లో బీజేపీ

ప్రభ న్యూస్ 4 Feb 2026 7:17 pm

రియల్ స్టోరీతో రవితేజ వారసుడి ఎంట్రీ.. ‘మారెమ్మ’ టీజర్

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోగా ఎదిగారు మాస్ మహరాజ రవితేజ. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో సందడి నెలకొంటుంది. అయితే ఇప్పుడు రవితేజకు సినీ వారసుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అతడే రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ భూపతిరాజు. మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మారెమ్మ’. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీపా బాలు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పూర్తి గ్రామీణ వాతావరణంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ గ్రామానికి శాపం పడితే.. దాన్ని నుంచి తప్పించుకోవడానికి మారెమ్మ అనే దేవతకు పూజలు చేయడం ఈ టీజర్‌లో చూపించారు. తొలి సినిమా అయినప్పటికీ.. మాధవ్ తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహించగా.. మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. 

మన తెలంగాణ 4 Feb 2026 7:15 pm

Andhra Pradesh Government Gears Up for Budget 2026 With Focus on Welfare and Development

The Andhra Pradesh government is preparing to present the state budget for this year in the Assembly on February 14. Ahead of the presentation, detailed consultations are underway to finalise priorities and allocations. The government is aiming for a balanced budget that strengthens welfare delivery while accelerating long pending development works. Finance Minister Payyavula Keshav […] The post Andhra Pradesh Government Gears Up for Budget 2026 With Focus on Welfare and Development appeared first on Telugu360 .

తెలుగు 360 4 Feb 2026 7:15 pm

Ministry |రాష్ట్రపతి పాలన ఎత్తివేత…

Ministry | రాష్ట్రపతి పాలన ఎత్తివేత… Ministry | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 4 Feb 2026 7:13 pm

Telangana |పవన్ పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Telangana | పవన్ పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు Telangana

ప్రభ న్యూస్ 4 Feb 2026 7:05 pm

13వ వార్డులో ప్రజా మద్దతుతో కాంగ్రెస్ హోరు..

-ప్రచారంలో దూసుకుపోతున్న యువనేత తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ) -ఎమ్మెల్యే, ఎంపీ అండతో

ప్రభ న్యూస్ 4 Feb 2026 7:03 pm

మెగా ఫ్యాన్స్కు పండగే.. ఫస్ట్ 'ఉస్తాద్ భగత్సింగ్'..నెక్ట్స్ 'పెద్ది'

మెగా అభిమానులకు ఈ సమ్మర్ పండగనే చెప్పాలి.. ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. ఇందులో ముందుగా పవన్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలో విడుదల కాబోతోంది. తర్వాత 'పెద్ది'.. 'విశ్వంభర' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 'ఉస్తాద్ భగత్ సింగ్'... పవన్‌ కల్యాణ్, కల్ట్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం. ఇప్పటికే విడుదల టీజర్, సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుత షూటింగ్ పూర్తి  చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీపై రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా చిత్ర యూనిట్.. పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పింది. బుధవారం మేకర్స్ ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేస్తూ అదిరిపోయే పోస్టర్ ను వదిలారు. ఇందులో పవన్ ఎంతో స్టైలీష్ గా ఉన్నాడు. మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ లో తెలిపారు. దీంతో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 'ఓజి'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మరోసారి అదే రిపీట్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. మరోవైపు, మార్చి 26న వస్తుందనుకున్న రామ్ చరణ్ 'పెద్ది' వాయిదా పడింది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక, జూన్ 9న చిరు నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు 'విశ్వంభర'ను రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. 

మన తెలంగాణ 4 Feb 2026 6:50 pm

Barabar Premistha Trailer: Looks Promising

Chandra Hass is coming up with a love and action drama Barabar Premistha, slated for release on February 6th. Directed by Sampath Rudra and backed by producers Geda Chandu, Gayatri Chinny, and AVR under CC Creations and AVR Movie Wonders, the film is presented by Kakarla Satyanarayana. After a series of impressive promotional drops, the […] The post Barabar Premistha Trailer: Looks Promising appeared first on Telugu360 .

తెలుగు 360 4 Feb 2026 6:47 pm

వార్మప్‌ మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

నవీ ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌ని 4-1 తేడాతో కైవసం చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సత్తా చాటాలని అనుకుంటోంది. మరోవైపు సౌతాఫ్రికా కూడా ఈ మ్యాచ్‌ని చాలా కీలకంగా భావిస్తోంది. ఈ మ్యాచ్‌తోనే ఇరు జట్ల బలాబలాలు తెలిసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో చేసే ప్రయోగాలు అసలు టోర్నమెంట్‌లో ఉపయోగపడతాయి. ఇది వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. 

మన తెలంగాణ 4 Feb 2026 6:42 pm

ఐఐటి రూర్కీతో కలసి పని చేస్తున్న అమెజాన్

న్యూదిల్లీ: వ్యవసాయ వ్యర్థాల నుండి వినూత్న ప్యాకేజింగ్ సామగ్రిని అభివృద్ధి చేయడానికి అమెజాన్ ఇండియా ఈరోజు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీతో భాగస్వామ్యాన్ని ప్రక టించింది. కలపేతర కాగితం సాంకేతికతను సృష్టించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. వర్జిన్ కలప గుజ్జుపై ఒత్తిడిని తగ్గించేందుకు, వ్యవసాయ వ్యర్థాలను దహనం చేయకుండా మళ్లించేందుకు ఈ సాంకేతికత తోడ్పడనుంది. తేలికైనవే అయినప్పటికీ, ఈ బలమైన ప్యాకేజింగ్ పదార్థాలు సంప్రదాయ కలప గుజ్జు కాగితం లేదా ప్లాస్టిక్ సంచులకు బదులుగా తిరిగి వాడదగిన, ఇంట్లోనే కంపోస్ట్ చేయగల ప్రత్యామ్నాయాలను అందిస్తాయి. ఈ పరిశోధన గోధుమ గడ్డి, బగాస్ వంటి పంట అవశేషాలను పేపర్ మెయిలర్స్ తయారీకి పనికొచ్చే అధిక-నాణ్యత గుజ్జుగా మార్చడంపై దృష్టి పెడుతుంది. ఇది సంప్రదాయ కాగితపు ప్యాకేజింగ్‌తో పోల్చదగిన పనితీరును కలిగి ఉంటుంది. ఇది వ్యవసాయ వ్యర్థాలను విలువైన ప్యాకేజింగ్ పదార్థంగా మార్చడం ద్వారా భారత దేశంలో పంట అవశేషాల దహనం తగ్గించడంలో సహాయపడుతుంది. అదే విధంగా, ఇది దిగుమతి చేసుకున్న వర్జిన్ కలప గుజ్జుపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. వ్యవసాయ అవశేషాలకు మార్కెట్‌ను అందించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చు. ఐఐటీ రూర్కీలోని పేపర్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ విభాగంతో ఈ భాగస్వామ్యం 15 నెలల కాలానికి ప్రయోగశాల స్థాయిలో అభివృద్ధి, పరీక్షలతో ప్రారంభమవుతుంది. పనితీరు పరీక్షలు విజయవంతం అయిన తర్వాత, వచ్చే ఏడాది మధ్య నుండి చివరి నాటికి పారిశ్రామిక పరీక్షలు, ప్రక్రియ ధృవీకరణ, వాణిజ్య ఉత్పత్తి దశలకు పురోగమించడానికి అమెజాన్ మద్దతు అందిస్తుంది. అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ మాట్లాడుతూ, ‘‘అమెజాన్‌లో, మేం భారతదేశ అత్యంత వేగవంతమైన, సురక్షితమైన, అత్యంత విశ్వసనీయమైన కార్యకలాపాల నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నాం, నిర్వహిస్తున్నాం. దానిని మరింత సుస్థిరమైందిగా చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా, పంట అవశేషాల నుండి వినూత్న ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేయడానికి మేం ఐఐటీ రూర్కీతో భాగస్వామ్యం కలిగి ఉన్నాం. భారతదేశం ఏటా దాదాపు 500 మిలియన్ టన్నుల మేరకు ఈ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. వాటిని ప్యాకేజింగ్‌లో తిరిగి ఉపయోగించడం ద్వారా, సంప్రదాయ పదార్థాలపై ఆధార పడటాన్ని తగ్గించుకుంటూ మరింత వృత్తాకార ఆర్థిక వ్యవస్థను మేము సమర్ధించగలం’’ అని అన్నారు. ‘‘సుస్థిరత ఇకపై ఒక ఎంపిక కాదు, ఇది అత్యవసర జాతీయ ప్రాధాన్యత’’ అని ఐఐటీ రూర్కీ డైరెక్టర్ ప్రొఫెసర్ కమల్ కిషోర్ పంత్ అన్నారు. స్వచ్ఛ భారత్, స్టార్టప్ ఇండియా, నేషనల్ రిసోర్స్ ఎఫిషియన్సీ పాలసీ వంటి ప్రభుత్వ లక్ష్యాలతో అనుసంధానించబడిన భారతదేశ వృత్తాకార ఆర్థిక వ్యవస్థ దార్శనికతను సాకారం చేసు కునే దిశగా ఐఐటీ రూర్కీ- అమెజాన్ మధ్య ఈ సహకారం ఒక ముందడుగు. వ్యవసాయ అవశేషాలను బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లుగా మార్చడం ద్వారా, భారతదేశంలో పంట అవశేషాల దహనం, వర్జిన్ మెటీరియల్‌లపై ఆధారపడటం అనే రెండు సవాళ్లను మేం పరిష్కరిస్తున్నాం. అదే సమయంలో పరి శ్రమలు, రైతులు, సమాజానికి పెద్దగా ప్రయోజనం చేకూర్చే, భారీస్థాయిలో అందించగల ఉత్పత్తులను సృష్టి స్తున్నాం. విద్యా పరిశోధన, పరిశ్రమ భాగస్వామ్యాలు మరింత సుస్థిరమైన, స్వావలంబన భవిష్యత్తు వైపు భారతదేశ ప్రయాణాన్ని ఎలా వేగవంతం చేస్తాయో ఈ చొరవ ప్రదర్శిస్తుంది’’ అని అన్నారు. ఐఐటీ రూర్కీ, సహారన్‌పూర్ క్యాంపస్‌లోని పేపర్ మరియు ప్యాకేజింగ్ టెక్నాలజీ విభాగంలో INNOPAP ల్యాబ్ (పేపర్ మరియు ప్యాకేజింగ్‌లో ఆవిష్కరణలు) నుండి ప్రొఫెసర్ విభోర్ కుమార్ రస్తోగి మరియు డాక్టర్ అనురాగ్ కులశ్రేష్ఠ ఈ పరిశోధన ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తారు. ప్యాకేజింగ్‌ను తగ్గించేందుకు తాను చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా, అమెజాన్ భారతదేశంలోని కస్టమర్ల ఆర్డర్లలో 50% కంటే ఎక్కువ వాటిని వాటి అసలు ప్యాకేజింగ్‌లోనే లేదా తగ్గించిన ప్యాకేజింగ్‌తో పం పిణీ చేస్తోంది. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ నగరాల్లో కస్టమర్ల ఆర్డర్లను ఉత్పత్తి ప్యాకేజింగ్‌లోనే రవాణా చేస్తోంది. 2019 నుండి, అమెజాన్ ఇండియా తన ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలన్నింటిలో ప్యాకేజింగ్ నుండి 100% సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ను తొలగించింది. అమెజాన్ ఇండియా తన కార్యకలాపాలను మరింత స్థిరంగా శక్తివంతం చేయడానికి కట్టుబడి ఉంది. 2040 నాటికి కార్యకలాపాల అంతటా నికర-సున్నా కార్బన్‌ను చేరుకోవాలనేది అమెజాన్ లక్ష్యం. కార్బన్ రహిత శక్తి, ప్యాకేజింగ్ ఆవిష్కరణలు, తమ రవాణా నెట్‌వర్క్ విద్యుదీకరణ, సర్క్యులారిటీ మెరుగుదలలు, ఏఐలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మేం వేగంగా పనిచేశాం, అదే సమయంలో తక్కువ వ్యవధిలో ప్రభావవంతమైన పురోగతిని సాధించాం. 2027 నాటికి భారతదేశంలోని కమ్యూనిటీలకు తన ప్రత్యక్ష కార్యకలాపాలలో ఉప యోగించే దానికంటే ఎక్కువ నీటిని తిరిగి ఇవ్వాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది.

మన తెలంగాణ 4 Feb 2026 6:40 pm

ఎపిలో జంగిల్ రాజ్యం నడుస్తోంది: వైఎస్ జగన్

కూటమి ప్రభుత్వంపై మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో బుధవారం ఎపికి వచ్చిన జగన్ సిఎం చంద్రబాబుపై ఫైరయ్యారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. సిఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసిపి నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజని మీద దాడులు చేశారని.. వాళ్లు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. ఏడాదిన్నరగా కావాలనే సిఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు.  తిరుమల లడ్డులో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రకరకాలుగా తప్పుడు ప్రచారం చేశారని. పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. దేవుడంటే ఏమాత్రం భయం, భక్తి లేకుండా వీళ్లు రాజకీయాలు చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాగా, సిఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

మన తెలంగాణ 4 Feb 2026 6:35 pm

Ys Jagan : పోలీసులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. వడ్డీతో సహా చెల్లిస్తాం

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని వైఎస్ జగన్ అన్నారు

తెలుగు పోస్ట్ 4 Feb 2026 6:22 pm

అనంతపురంలో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్

అనంతపురం: మలబార్ గోల్డ్ & డైమండ్స్ అనంతపురంలో నూతన ప్రదేశంలోకి మార్చబడిన తమ షోరూమ్‌ను ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో తాము సాగిస్తోన్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. సప్తగిరి సర్కిల్ సమీపంలోని సుబాష్ రోడ్‌లో ఉన్న ఈ కొత్త షోరూమ్, పెద్ద రిటైల్ ఫార్మాట్‌లు, విస్తృత శ్రేణి కలెక్షన్ లు మరియు మెరుగైన కస్టమర్ అనుభవం ద్వారా కీలకమైన ప్రాంతీయ మార్కెట్‌లలో తమ కార్యకలాపాలను విస్తృతం చేయాలనే బ్రాండ్ యొక్క నిరంతర లక్ష్యం ను ప్రతిబింబిస్తుంది. లోతైన సాంస్కృతిక సంప్రదాయాలు, స్థిరంగా వివాహాభరణాలకు పెరుగుతున్న డిమాండ్ తో పాటుగా నమ్మకం, పారదర్శకత, దీర్ఘకాలిక సంబంధాలకు విలువనిచ్చే కస్టమర్ల కారణంగా రాయలసీమ ప్రాంతంలో ఒక ముఖ్యమైన ఆభరణాల మార్కెట్‌గా అనంతపురం కొనసాగుతోంది. ఈ కొత్త షోరూమ్ ను మరింత విశాలంగా, వ్యవస్థీకృత వాణిజ్య అనుభవాలను అందించే రీతిలో తీర్చిదిద్దడం జరిగింది. ఇది మెరుగైన మరియు స్వాగతించే వాతావరణంలో కలెక్షన్‌లను వినియోగదారులు సౌకర్యవంతంగా చూసేందుకు వీలు కల్పిస్తుంది. మొత్తం 12,518 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ షోరూమ్‌లో ప్రత్యేకంగా ఆభరణాల ప్రదర్శన ప్రాంతంతో పాటు అదనపు బ్యాక్-ఆఫీస్ విభాగం కూడా ఉంది. ఈ స్టోర్ గ్రౌండ్ , మొదటి అంతస్తులలో వినియోగదారులకు సేవలందించేలా రూపొందించబడింది. విశ్రాంతిగా, వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవాన్ని పొందటానికి తగినంత సౌకర్యమూ ఇక్కడ ఉంది. ఈ షోరూమ్‌ను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ శ్రీమతి బల్లా పల్లవి, మలబార్ గోల్డ్ & డైమండ్స్ సీనియర్ నాయకత్వం, ఆహ్వానించబడిన అతిథులు మరియు స్థానిక సమాజ సభ్యుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సీనియర్ మేనేజ్మెంట్ బృందంలో సిరాజ్ పి. కె., హెడ్ – రిటైల్ ఆపరేషన్స్, రెస్ట్ ఆఫ్ ఇండియా, నిఖిల్ చంద్రన్, జోనల్ హెడ్ – సెంట్రల్ ఆంధ్ర మరియు రాయలసీమ, ముహమ్మద్ షరీజ్ కె, జోనల్ హెడ్ – తెలంగాణ, షానిబ్ కె, జోనల్ హెడ్ – తెలంగాణ, హఫీజ్ ముహమ్మద్, అసిస్టెంట్ షోరూమ్ హెడ్, ఇతర యాజమాన్య బృంద సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం. పి. అహ్మద్ మాట్లాడుతూ, “ ఇక్కడి ప్రజలతో మాకున్న దీర్ఘకాల సంబంధాలతో పాటుగా వివిధ వర్గాలలో మాపై ఉన్న విశ్వాసం కారణంగా ఆంధ్రప్రదేశ్ మాకు అతి ముఖ్యమైన మార్కెట్ గా నిలిచింది. మా కొత్త అనంతపురం షోరూమ్ ప్రారంభం, రాష్ట్రంలోని మా వినియోగదారులకు విశాలమైన స్థలం, విస్తృతమైన అవకాశాలు మరియు మరింత సౌకర్యవంతమైన రిటైల్ అనుభవాన్ని అందించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో, మలబార్ కట్టుబడి ఉండే పారదర్శకత, నాణ్యత, నిష్పక్షపాత విలువలను మేము కొనసాగిస్తాము..” అని అన్నారు. అనంతపురం షోరూమ్ బంగారం, వజ్రం, ప్లాటినం మరియు రత్నాల ఆభరణాలలో విస్తృత శ్రేణిని ప్రదర్శిస్తుంది, వీటిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ సిగ్నేచర్ కలెక్షన్లు సైతం ఉంటాయి. పెళ్లి , పండుగ ఆభరణాల నుండి రోజువారీ ధారణ మరియు సమకాలీన డిజైన్ల వరకు, సాంప్రదాయ పనితనంను ఆధునిక సౌందర్యంతో మిళితం చేసి అభివృద్ధి చెందుతున్న కస్టమర్ ప్రాధాన్యతలకు అనుగుణంగా విభిన్న అవసరాలను తీర్చడానికి ఈ ఆభరణాలను రూపొందించారు. ప్రారంభోత్సవ ఆఫర్‌గా, అన్ని బంగారం, అన్‌కట్ , రత్నాల ఆభరణాల విలువ జోడింపుపై 30% వరకు తగ్గింపు* మరియు వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపును కస్టమర్లు పొందవచ్చు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 08, 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. దీనితో పాటు, మలబార్ గోల్డ్ & డైమండ్స్ తన ప్రధాన బ్రాండ్ హామీలను విస్తరిస్తూనే ఉంది, వాటిలో పారదర్శక ధర, సరసమైన విలువ జోడింపు ఛార్జీలు, జీవితకాల నిర్వహణ, వివరణాత్మక ఉత్పత్తి అంశాలను వెల్లడించటం మరియు బిఐఎస్ -హాల్‌మార్క్ చేసిన బంగారం , సర్టిఫైడ్ వజ్రాల ద్వారా కఠినమైన నాణ్యతకు హామీ వంటివి ఉన్నాయి. దీర్ఘకాలిక ఆభరణాల ప్రణాళికకు మద్దతు ఇచ్చే సౌకర్యవంతమైన కొనుగోలు అవకాశాల నుండి కూడా వినియోగదారులు ప్రయోజనం పొందవచ్చు. కొత్తగా మార్చబడిన ఈ షోరూమ్‌తో, మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆంధ్రప్రదేశ్ అంతటా తన విస్తరణను బలోపేతం చేస్తూనే ఉంది, స్థానిక కమ్యూనిటీలు మరియు ప్రాంతీయ మార్కెట్లకు దగ్గరగా ఉంటూనే స్థిరమైన, అధిక-నాణ్యత కలిగిన రిటైల్ అనుభవాలను అందిస్తోంది.

మన తెలంగాణ 4 Feb 2026 6:10 pm

కౌన్సిలర్‌గా అవకాశం ఇస్తే..-ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను

బీజేపీ అభ్యర్థి బూర్ల కుమార్ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాను-నన్ను ఆశీర్వదించండి..అభివృద్ధి చేసి చూపిస్తా-8వార్డులో

ప్రభ న్యూస్ 4 Feb 2026 6:08 pm

YSRCP Moves NHRC Alleging Attacks

Andhra Pradesh has turned tense following allegations of attacks on senior opposition leaders. Former ministers Ambati Rambabu and Jogi Ramesh, both leaders of the YSR Congress Party, were reportedly targeted after they criticised Chief Minister N. Chandrababu Naidu over the SIT report related to alleged adulteration of ghee used in Tirumala laddoo preparation. According to […] The post YSRCP Moves NHRC Alleging Attacks appeared first on Telugu360 .

తెలుగు 360 4 Feb 2026 6:07 pm

మీరు ఆశీర్వదించి వేసే ఓటు.. రేపటి మన అభివృద్ధికి నాంది కావాలి

హస్తం గుర్తుపై వేసే ఓటు పత్తి పకృతి గెలుపు మంచిర్యాల ఫిబ్రవరి 4

ప్రభ న్యూస్ 4 Feb 2026 6:02 pm

water |సాగునీరు వృధా కాకుండా చేస్తాం..

water | సాగునీరు వృధా కాకుండా చేస్తాం.. water | టేకుమట్ల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Feb 2026 6:02 pm

Video : Exclusive Interview with Actress DIVI VADTHYA

The post Video : Exclusive Interview with Actress DIVI VADTHYA appeared first on Telugu360 .

తెలుగు 360 4 Feb 2026 6:00 pm

Varanasi |వారణాసి రెండు పార్టులా..? ఒక పార్టేనా..? రాజమౌళి క్లారిటీ

Varanasi | వారణాసి రెండు పార్టులా..? ఒక పార్టేనా..? రాజమౌళి క్లారిటీ Varanasi

ప్రభ న్యూస్ 4 Feb 2026 6:00 pm

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రిలీజ్ ఎప్పుడో చెప్పేశారు..

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గతేడాది ‘హరిహర వీరమల్లు’, ‘ఒజి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో వీరమల్లు నిరాశపరిచినా.. ఒజి మంచి సక్సెస్‌ని సాధించింది. కాగా, పవన్ నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకుడు. ‘గబ్బర్‌సింగ్’ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ గురించి పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తగిన ఫలితం వచ్చింది. ఉస్తాద్ విడుదల తేదీని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వేసవి కానుకగా అంటే మార్చి 26న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధిచి ఓ ప్రత్యేకమైన పోస్టర్‌ని కూడా వదిలింది. ఈ పోస్టర్‌లో పవన్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని పవన్ అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు.

మన తెలంగాణ 4 Feb 2026 5:59 pm

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ సంస్థలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హర్ష వర్థన్(36)  రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆయన ప్రాణాలు విడిచారు.హర్షవర్ధన్ బుధవారం ఉదయం తన నివాసం నుంచి ఒక సూసైడ్ నోట్ రాసి బయటకు వెళ్లారు.ఆయన కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలిస్తుండగానే దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు సమాచారం అందింది.దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని హర్షవర్ధన్‌గా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ బలవన్మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

మన తెలంగాణ 4 Feb 2026 5:59 pm

Govt |పేదబడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా…

Govt | పేదబడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా… Govt | జుక్కల్

ప్రభ న్యూస్ 4 Feb 2026 5:58 pm

Revanth Reddy : ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా

మున్సిపల్ ఎన్నికలు ముగిసన వెంటనే రైతు భరోసా నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

తెలుగు పోస్ట్ 4 Feb 2026 5:57 pm

AP |లడ్డు కల్తీపై జగన్ వ్యాఖ్యలు అసత్యం..

AP | లడ్డు కల్తీపై జగన్ వ్యాఖ్యలు అసత్యం.. AP | విజయవాడ,

ప్రభ న్యూస్ 4 Feb 2026 5:55 pm

మీ వెన్నెంటే ఉంటాను…ఒక్క అవకాశం ఇవ్వండి.

1వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం దయాకర్ 1వ వార్డు అభివృద్ధే లక్ష్యం..మీ

ప్రభ న్యూస్ 4 Feb 2026 5:55 pm

Tiger |పులి చంపిన ఆవును…

Tiger | పులి చంపిన ఆవును… Tiger | ఆలేరు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Feb 2026 5:52 pm

AP |మాజీ మంత్రి వెల్లంపల్లిపై ఏసీబీకి జనసేన ఫిర్యాదు

AP | మాజీ మంత్రి వెల్లంపల్లిపై ఏసీబీకి జనసేన ఫిర్యాదు టీటీడీ లడ్డు

ప్రభ న్యూస్ 4 Feb 2026 5:50 pm

చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశలో కృషి చేయాలి..

విశాలాంధ్ర ధర్మవరం:: చేనేత పరిశ్రమను కాపాడుకుంటూ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని చేనేత నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని చేనేత సంఘం నాయకురాలు, బీసీ సంక్షేమ మహిళ రాష్ట్ర అధ్యక్షులు వారి స్వగృహంలో సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 22 రాజకీయాలకు అతీతంగా ఐక్య చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరి లో జరిగే చేనేత గర్జన పై చేనేత నాయకులు అనేక సమస్యలను చర్చించడం జరిగింది. […] The post చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశలో కృషి చేయాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 5:38 pm

కార్మిక హక్కులను హరిస్తున్న లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి..

ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం;; కార్మిక హక్కులను హరిస్తున్న లేబర్ కోర్స్ ను వెంటనే రద్దు చేయాలని, 12వ పిఆర్సి, జీతాల పెంపు డిమాండ్ సాధనకై ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సమ్మె నోటీసును పట్టణంలోని పురపాలక సంఘ కమిషనర్ వెంకట రమణయ్యకు అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షుడు అయుబుఖాన్, మున్సిపల్ కార్మిక […] The post కార్మిక హక్కులను హరిస్తున్న లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 5:32 pm

Ys Jagan : అంబటి నివాసానికి చేరుకోవడానికి ఆరు గంటలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంరబాబు నివాసానికి చేరుకున్నారు

తెలుగు పోస్ట్ 4 Feb 2026 5:29 pm

కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి.-అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది

-18వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ జబ్బార్ స్టేషన్‌ఘన్‌పూర్, ఫిబ్రవరి4 ఆంధ్రప్రభ: స్టేషన్‌

ప్రభ న్యూస్ 4 Feb 2026 5:26 pm

క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించాలి..

రిటైర్డ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు.ధర్మవరం : క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించాలని రిటైర్డ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచా క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు కొన్ని విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలు అధికమవుతున్నాయని, దీనికి ముఖ్య కారణం వ్యాధిని ముందుగా గుర్తించాలని, అదేవిధంగా చికిత్స పొందకపోవడమేనని వారు స్పష్టం చేశారు. ప్రజలు కూడా క్యాన్సర్ పట్ల […] The post క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 5:25 pm