Hyderabad : శంషాబాద్ లో విమానానికి బాంబు బెదిరింపు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది
Telangana : గ్లోబల్ సమ్మిట్ లో భారీగా ఒప్పందాలు
హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి
సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా నుంచి ’పైసా డుమ్ డుమ్’ సాంగ్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ “డార్క్ కామెడీ జానర్ లోనే కొత్తగా ప్రయత్నించాం. ఫుల్ ఫన్ ఉండే మా మూవీ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తుంది”అని అన్నారు. హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ “పైసా డుమ్ డుమ్’ సాంగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఫరియా అబ్దుల్లా కూడా మా మూవీలో ఒక పాట పాడింది. ఆ పాటను త్వరలో వింటారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, జయకాంత్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్ పాల్గొన్నారు.
Alwala |ఆశీర్వదించండి.. గెలిపించండి..
Alwala | ఆశీర్వదించండి.. గెలిపించండి.. Alwala, పెద్దమందడి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని
Telangana : నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్
నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
Manigilla |కాంగ్రెస్ వలనే సాధ్యం..
Manigilla | కాంగ్రెస్ వలనే సాధ్యం.. Manigilla, పెద్దమందడి, ఆంధ్రప్రభ : మండల
India vs South Africa : నేడు భారత్ - దక్షిణాఫ్రికా తొలి టీ20
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్ వేదికగా జరగనుంది
తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్కి పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్న చాయ్ బిస్కెట్... దేశంలోని తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫారం ‘చాయ్ షాట్స్’ ను గ్రాండ్గా లాంచ్ చేసింది. స్మార్ట్ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన థర్డ్ స్క్రీన్ ప్లాట్ఫార్మ్ లో 2 నిమిషాలకు లోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయి. ‘చాయ్ షాట్స్’ ఏంజెల్ ఇన్వెస్టర్లుగా రానా దగ్గుబాటి (నటుడు, నిర్మాత), శ్రీ హర్ష మజేటి, నందన్ రెడ్డి (స్విగ్గీ వ్యవస్థాపకులు), ఫణీంద్ర సమా (రెడ్బస్ స్థాపకుడు), అలఖ్ పాండే, ప్రత్యీక్ మహేశ్వరి (ఫిజిక్స్వాలా వ్యవస్థాపకులు), అరవింద్ సాంకా, పవన్ గుంటుపల్లి, రిషికేశ్ (రాపిడో స్థాపకులు), రోహిత్ చెన్నమనేని (డార్విన్బాక్స్ సహ వ్యవస్థాపకుడు), అమర్ నగరం (విర్జియో వ్యవస్థాపకుడు) ఉన్నారు. ’చాయ్ షాట్స్’ యాప్ లాంచ్ ఈవెంట్లో హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి మాట్లాడుతూ “చాయ్ షాట్స్.. కంటెంట్ క్రియేటర్స్ చేతిలో ఒక అడ్భుతమైన పవర్. శరత్, అనురాగ్ ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి. వాళ్ళు తెలుగు యంగ్ ఆడియన్స్ని అద్భుతంగా అర్థం చేసుకున్నారు. వాళ్ల జర్నీలో నేను ఒక చిన్న పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది”అని అన్నారు. చాయ్ బిస్కెట్ శరత్ మాట్లాడుతూ “’చాయ్ షాట్స్’ను ప్రస్తుతం తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నాం. త్వరలోనే అన్ని భాషల్లో లాంచ్ చేస్తాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్, చాయ్ బిస్కెట్ అనురాగ్, సీటీవో కృష్ణ, రాపిడో సహ వ్యవస్థాపకుడు రిషికేశ్, రెడ్బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర, డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని, రాహుల్ హుమాయున్ పాల్గొన్నారు.
Indaram |నిరంతరం కృషి చేస్తా..
Indaram | నిరంతరం కృషి చేస్తా.. Indaram, జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్
Bikkanur |ఆదర్శ పట్టణంగా మారుస్తా..
Bikkanur | ఆదర్శ పట్టణంగా మారుస్తా.. Bikkanur, ఆంధ్ర ప్రభ : ఫుట్
Earth Quake : జపాన్ లో భారీ భూకంపం.. గతంలో ఎన్నడూ చూడని విధంగా
జపాన్లో భారీ భూకంపం సంభంవించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి
Godserial |అభివృద్ధి చేసి చూపిస్తా..
Godserial | అభివృద్ధి చేసి చూపిస్తా.. Godserial, దస్తూరాబాద్, ఆంధ్ర ప్రభ :
District Judge | బండ్ల స్నేహ.. District Judge, ఘంటసాల, ఆంధ్రప్రభ :
AP | రేషన్ బియ్యం సీజ్.. AP, పెడన, ఆంధ్రప్రభ : పెడన
మనతెలంగాణ/హైదరాబాద్: చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ను ఆదర్శంగా తీసుకున్నట్టు సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. 20 ఏళ్లుగా అత్యధిక పెట్టుబడులు, ఉత్పత్తితో చైనాను లీడ్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ విధంగానే తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి సరికొత్త లక్ష్యాలతో ముందుకెళ్లనున్నట్లు సిఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి, అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు ‘తెలంగాణ రైజింగ్- 2047’ పేరుతో విజన్ డాక్యుమెంట్ను విడుదల చేస్తామని ఆయ న తెలిపారు. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని మూడు రకాలుగా వర్గీకరిస్తున్నామని వివరించా రు. మహిళలు, రైతులు, యువత, వివిధ సామాజిక వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ విజన్ డాక్యుమెంట్ను రెడీ చేశామని ఆయన తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లో స్పష్టమైన విధానాలతో దేశంలోనే తెలంగాణను మొదటిస్థానంలో నిలపాలన్న లక్ష్యాలను నిర్ధేశించామని తెలిపారు. ఈ లక్ష్యాల రూపకల్పనలో ప్రజల నుంచి అభిప్రాయాలను కోరామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. వారి అంచనాలు, ఆలోచనలు, కలలను తమతో పంచుకున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యం త్రాంగం, అధికారులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి సహాయ, సహకారాలను తీసుకున్నామన్నారు. తెలంగాణ రైజింగ్ దార్శనికతను రూపొందించడంలో సహాయ పడిన వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రకంగా నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా బృహత్తరమైన సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్కు వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపు ణులు ఇందులో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ నిపుణులు హాజరైన ఈ సమ్మిట్లో మీరందించే సలహాలు, ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 2047కు ఓ ప్రత్యేకత ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047కు ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అవుతుందని ఆయన తెలిపారు. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు మన నాయకులు దేశాన్ని ముందుకు నడిపించడానికి దూరదృష్టితో ఆలోచనలు చేశారని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడానికి చర్చోపచర్చల అనంతరం ప్రజాస్వామిక, సార్వభౌమ, ప్రజాస్వామిక, లౌకిక, గణతంత్ర దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపొందించా రన్నారు. దేశ భవిష్యత్గా ఒక రోడ్ మ్యాప్ వేయాలని భావించిన మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లతో పాటు రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతోమంది నుంచి తాము ప్రేరణ పొందామన్నారు. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని, 2014లో సోనియా గాంధీ, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ కలను సాధించుకున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఒక కొత్త యువ రాష్ట్రంగా అవతరించింది. అలాంటి తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన తెలిపారు. దేశంలోనే తెలంగాణ యువ రాష్ట్రమని ఆయన తెలిపారు.
మ నతెలంగాణ/హైదరాబాద్ : భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది. రాష్ట్ర ఉజ్జ్వల భవిష్యత్ విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సద స్సు తొలిరోజున పేరొందిన కంపెనీలు.. దేశ విదేశాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తల దృష్టిని అమితంగా ఆకట్టుకుంది. తొలి రోజే సుమారు రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 35 ఎంఒయులపై సంతకాలు జరిగాయి. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం విజన్ 2047 దిశ గా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా తన సుస్థిర స్థానాన్ని చాటుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో ప లు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశా రు. తెలంగాణలో పెట్టుబడులకు మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దీంతో ఒకే రోజున రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. ఈ పెట్టుబడు లు రాష్ట్ర అభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉద్యోగావకాశా ల సృష్టికి దోహదపడనున్నాయి. ప్రముఖ సంస్థ లు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ముందుకువచ్చాయి. ప్రత్యేకంగా, పునరుత్పాదక ఇంధనం, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడి యా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు రావటం విశేషం. ప్రధాన పెట్టుబడులు భారత్ ప్యూచర్ సిటీలో బ్రుక్ఫీల్ యాక్సిస్ వెంచర్స్ కూటమి రూ. 75 వేల కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్, డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ - రూ. 27,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఎస్ఐడిబిఐ స్టార్టప్లకు రూ.1,000 కోట్లు పెట్టబడులకు ముందుకు వచ్చింది. వరల్డ్ ట్రేట్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈవ్రెన్ యాక్సిస్ ఎనర్జీ రూ.31,500 కోట్లతో సోలార్ పవర్ , విండ్ పవర్ మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. మెఘా ఇంజనీరింగ్ గ్రూప్ రూ.8 వేల కోట్లతో సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది.ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో ఎమ్మార్వోతో పాటు కార్గో విస్తరణకు జీఎంఆర్ గ్రూప్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. డిఫెన్స్, ఏవియానిక్స్ తయారీకి అపోల్ మైక్రో సిస్టమ్ లిమిటెడ్ రూ.1,500 కోట్లు పెట్టుబడులకు సిద్ధపడింది. సోలార్ ఎరోస్పేస్, డిపెన్స్ రంగంలో మిస్త్స్రల్ భాగాలు, ఏరో ఇంజన్ స్ట్రక్షర్కు రూ. 1,500 కోట్లు, ఎంపీఎల్ లాజిస్టిక్స్ కంపెనీ రూ.700 కోట్లు, టివిఎస్ ఐఎల్పి రూ.200 కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. రెన్యూసిస్, మిడ్ వెస్ట్, అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్స్ హైడ్రోజన్ టెక్ విస్తరణకు రూ. 7,000 కోట్లు పెట్టుబడులు పెడుతాయి. డిస్ట్రిబ్యూషన్ హైడ్రో టెక్ రంగంలో సాహీటెక్ ఇండియా రూ. 1,000 కోట్లు. ఇంటిగ్రేటేడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృష్ణా పవర్ యుటిలిటీస్ రూ. 5,000 కోట్లు. సిమెంట్ రంగ విస్తరణకు అల్ట్రా బ్రైట్ సిమెంట్స్, రెయిన్ సిమెంట్స్ రూ.2000 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సీతారాం స్పిన్నర్స్ రూ.3 వేల కోట్లతో టెక్స్ టైల్ యూనిట్ నెలకొల్పనుంది. షోలాపూర్ తెలంగాణ టెక్స్ టైల్ అసోసియేషన్ అండ్ జీనియస్ ఫిల్టర్స్ పవర్ లూమ్ టెక్నికల్ యూనిట్కు రూ. 960 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దేశీయ, అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నాణ్యమైన ఉపాధి అవకాశంగా, మౌలిక సదుపాయాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. డీప్టెక్ సిటీ నుండి టెక్స్ టైల్ యూనిట్ వరకు అన్ని రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వైవిధ్యమైన పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకు రావటం తెలంగాణ సుస్థిర పరిశ్రమల విధానాన్ని ప్రపంచానికి చాటిచెపుతోందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఈ భారీ పెట్టుబడులు తెలంగాణ రైజింగ్ 2047 దిశలో బలమైన పునాదులు వేస్తాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్ విడుదల
డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళం సినిమా 'జయ జయ జయహే'కు ఇది రిమేక్. 2022లో వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటిటిలో అందుబాటులో ఉంది. తెలుగులోనూ డబ్ చేశారు. ఈ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి రూపొందించారు. ఏఆర్ సజీవ్ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు
మన తెలంగాణ / హైదరాబాద్ : ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ సదస్సు నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సదస్సు వేదికగా కంపెనీ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ఈ విషయాన్ని ప్రకటించారు. రానున్న పదేళ్లలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. గత కొన్ని నెలలుగా మమ్మల్ని తెలంగాణకు ఆహ్వానిస్తునే ఉన్నా కుదరలేదని, ఆలస్యం జరిగిందన్నారు. తెలంగాణ ముఖ్యముంత్రి రేవంత్ రెడ్డి మా పెట్టుబడులను ఆహ్వానించారని, ఇక్కడ అభివృద్దికి గొప్ప అస్కారం ఉండడంతో చివరికి రాక తప్పలేదన్నారు. భారత దేశంలో అద్భుతమైన నైపుణ్య మానవ వనరులు ఉన్నాయని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇండియానే పెద్దన్నగా కనబడుతుందన్నారు. ఇది ఎవరికి కనబడడం లేదని, ఇండి యా రైజింగ్ రాబోయే పదేళ్లలో భారతదేశం ప్రపంచ టెక్నాలజీ రంగంలో ముందుంటుందని చెప్పారు.
వందేమాతరానికి కాంగ్రెస్ ద్రోహం
న్యూఢిల్లీ: వందేమాతరం కేవలం ఒక గీతం కాదు. స్వాతంత్ర పోరాటంలో లక్షలాదిమందికి స్పూర్తిని చ్చిన మంత్రం అని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు అన్నారు. బ్రిటీష్ ఆణచివేత ఉన్నప్పటికీ , వందేమాతరం స్వాతంత్ర యోధుల ఐక్యతను ప్రేరేపించిందని అన్నారు. అలాంటి వందేమాతరం పై మహాత్మగాంధీ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చిందని పిమర్శించారు. సామాజిక సామరస్యం ముసుగులో కాంగ్రెస్ జాతీయగీతం వందేమాతరం ను ముక్కలు చేసింది, ఇప్పటికీ బుజ్జగింపు రాజకీయాలనే ఆ పార్టీ అనుసరిస్తోందని ప్రధాని దుమ్మెత్తిపోశారు. వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవం నేపథ్యంలో లోక్ సభలో జాతీయ గీతం పై జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని సుదీర్ఘంగా ప్రసంగించారు. వందేమాతరంను ముస్లింలు విరోధించగలరనే సూచనతో ఏకీభవించిన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కూడా ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మేరకు అప్పట్లో నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు రాసిన లేఖను కూడా ప్రధాని ఉదహరించారు. లక్నోలో మహమ్మద్ అలీ జిన్నా నిరసన తర్వాత నెహ్రూ ఈ లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ గీతం నేపథ్యాన్ని తాను చదివానని, అది ముస్లింలలో కోపాన్ని రేకెత్తించవచ్చని తాను అభిప్రాయపడినట్లు నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నారన్నారు. ఆ తర్వాత బంకిం చంద్ర చటర్జీ గీతం వందేమాతరం జాతీయ గీతంగా వాడే అంశంపై కాంగ్రెస్ ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసిందని మోదీ గుర్తు చేశారు. కానీ, 1937 అక్టోబర్ 26న కాంగ్రెస్ వందేమాతరం విషయంలో రాజీ పడింది. సామాజిక సామరస్యం అనే ముగుసులో వారు గీతాన్ని ముక్కలు చేశారు.ఇందుకు చరిత్ర సాక్షిగా నిలిచింది అని ప్రధాని మోదీ తెలిపారు. కొన్ని వర్గాలను సంతృప్తి పరచే రాజకీయాల ఒత్తిడిలో వందేమాతరం గీతాన్ని విభజించేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని. అందుకే దేశ విభజన డిమాండ్ కు కూడా కాంగ్రెస్ తలొగ్గిందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ముస్లింలీగ్ ముందు మోకరిల్లిందని, ఒత్తిడిలో ఇలాచేసింది అనడానికి చరిత్ర నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.కాంగ్రెస్ నేటికీ అదే బుజ్జగింపు రాజకీయాలను కొనసాగిస్తోందని మోదీ అన్నప్పుడు ట్రెజరీ బెంచ్ లు చప్పట్లతో దద్దరిల్లాయి.వందేమాతరం ఎంత ప్రజాదరణ పొందింది అంటే. అధిజాతీయగీతంగా అవతరించిందని మహాత్మగాంధీ ప్రధానికి రాసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. మరి ఆ మహా గీతానికి అన్యాయం ఎందుకు జరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వందేమాతరం వందేళ్లు.. ఎమర్జెన్సీ జాతీయగీతం వందేమాతరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ... రాజ్యాంగం అణచివేతకు గురయ్యిందని, దేశంలో అత్యవసరపరిస్థితిలో బందీ అయిందని మోదీ విచారం వ్యక్తం చేశారు. బ్రిటీష్ హయంలో ఎంతటి అణచివేత ఉన్నా.. వందేమాతరం శిలమాదిరిగా చెక్కు చెదర కుండా, స్వాతంత్ర సమర యోధులకు ఐక్యతా స్ఫూర్తిగా నిలించిందని ఆయన గుర్తు చేశారు. మన దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. ఆ సమయంలో రాజ్యాంగాన్ని తొక్కి పెట్టారు. దేశం కోసం త్యాగం చేసిన దేశ భక్తులను, దేశభక్తితో జీవించిన వారిని జైలులో పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు వందేమాతరం గొప్పతనాన్ని పునరుద్ధరించే అవకాశం మనకు ఉంది. ఈ అవకాశాన్ని చేజార్చు కోకూడదని తాను నమ్ముతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వందేమాతరం భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిని, శక్తిని ఇచ్చి, ధైర్యం, దృఢ సంకల్పం అనే మార్గాలను చూపింది ఈ రోజు పవిత్రమైన వందేమాతరం గీతాన్ని గుర్తు చేసుకోవడం మనందరికీ గొప్పగౌరవం అన్నారు ప్రధాని. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంగా మనం ఈ మహా మంత్రాన్ని గుర్తు చేసుగోవడం మనకు గర్వకారణం అని ప్రధాని ఉద్ఘాటించారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలన నిస్సారం, నిరర్థకం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం ప్రజలకు మొండి చే యి చూపిందని, పాలన పూర్తిగా ఆగమాగంగా ఉందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు విమర్శించారు. రెండేళ్ల పాలన అనేది ప్రభు త్వ పనితీరుకు గీటురాయిలాంటిదని, కానీ కాం గ్రెస్ ప్రభుత్వ పాలన నిస్సారం, నిష్పలం, నిరర్ధకంగా మిగిలిపోయిందని దుయ్యబట్టారు. ఈ రెం డేళ్లలో ఆత్మస్తుతి, పరనింద తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ భవన్లో సోమవారం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీ డియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ, రెండేళ్ళ కాం గ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించా రు. తమ ప్రభుత్వం రాగానే మిషన్ భగీరథ, మిష న్ కాకతీయ వంటి పథకాలు తెచ్చామని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా దర్బార్ కూడా ఇప్పుడు అమలు కావడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి ప్రతి రోజు ప్రజా దర్బార్లో ప్రజల ను కలుస్తా అన్నారని.. ఆ గొప్పలు ఏమయ్యాయ ని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి బిల్డప్ బాబాయ్ అం టూ ఘాటు విమర్శలు చేశారు. జల్సాలకు, విం దులకు పెళ్లిళ్లకు, సిఎల్పి మీటింగ్లకు ప్రజా భవన్ను వాడుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ తెచ్చిన మెట్రో రైలు, ఫార్మా సిటీ వంటి కీలక ప్రాజెక్టులను రద్దు చేయడం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయిందని ఆరోపించారు. మక్కలు కొని 50 రోజులు దాటినా రైతులకు ఇంకా డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. రైతులకు బేడీలు వేసిన ఈ ప్రభుత్వం రైతు సంక్షోభ ప్రభుత్వం అని మండిపడ్డారు.పూర్తిస్థాయి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని... నిరూపించలేకపోతే రాజీనామాకు సిఎం రేవంత్ రెడ్డి సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మద్యం దుకాణాలకు నోటిఫికేషన్లు ఇచ్చి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్లు బిల్లులు అడిగితే ప్రభుత్వం విజిలెన్స్, ఎసిబి దాడులు చేయిస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారు గ్లోబల్ సమ్మిట్ను ‘గోబెల్స్ సమ్మిట్‘ అంటూ హరీష్రావు ఎద్దేవా చేశారు. గతంలో దావోస్ వెళ్లి డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రేవంత్ నవ్వులపాలయ్యారని విమర్శించారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూమి, ఫార్మా సిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమి బిఆర్ఎస్ హయాంలో సమీకరించినదే గుర్తు చేశారు. అందులో రేవంత్ చెమట చుక్క కూడా లేదని అన్నారు. కెసిఆర్ యువత ఉద్యోగాల కోసం ఆలోచిస్తే, రేవంత్ ఆ భూములను తన అనుయాయులకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. రెండో ఏడాది పాలన పెనంలోంచి పొయ్యిలో పడినట్లు ఉందని, మూడో ఏడాది ఏమవుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దుయ్యబట్టారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారన్నారు. రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు. రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో చూసుకోవాలని పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ కరప్షన్ పాలన రేవంత్ కుటుంబం, మంత్రులది అని ఆరోపించారు. కరప్షన్ ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు మొండి చేయి చూపించిందని... అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం విజన్, విధానం ఏంటో ఎవరికి ఇప్పటికీ అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు జరుపుకోవాలని హరీష్రావు అన్నారు.
మంగళవారం రాశి ఫలాలు (09-12-2025)
మేషం వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారమున పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలుంటాయి. వృషభం దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి . ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. మిధునం చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. బందు మిత్రులతో సక్యతగా వ్యవహారిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కర్కాటకం సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. దైవచింతన కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సింహం ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కన్య ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. తుల పాత మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. రుణయత్నాలు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులుంటాయి. వృశ్చికం సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు నుండి బయటపడతారు. ధనస్సు పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. మకరం చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఋణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము వసూలవుతుంది. నూతన వస్తులాభాలు పొందుతారు. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. కుంభం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మీనం చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు.
పూలమ్మి, పాలమ్మి వందల ఎకరాలు కబ్జా పెట్టిండు!
మేడ్చల్ జిల్లా మేడిపండు చందంగా ఉందే తప్పితే ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్న కవిత సోమవారం కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా మేడ్చల్ జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలతోపాటు పెరెన్నికగన్న యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, డిఫెన్స్, ఎరోనాటిక్స్ లాంటి సంస్థలు, ఫార్మా కంపెనీలకు నెలవుగా ఉన్నా జిల్లాలోని అన్ని బస్తీలు, కాలనీలో కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని అన్నారు. జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి నోచుకోలేదని గుర్తు చేశారు. జిల్లా పరిధిలోని 5 నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా బీటి బ్యాచ్ అని, ఉద్యమకారులు లేరని, ఉన్న ఒక్క శంభీపూర్రాజుకు మంత్రిపదవి రాకుండా అడ్డుకున్నారని, మిగతా వారంతా అధికారం, డబ్బు సంపాదన , భూముల ఆక్రమణ కోసమే వేరే పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారని వారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ భజన చేయడం అలవాటు చేసుకున్నారని కవిత విమర్శించారు. కుత్బుల్లాపూర్ ఇప్పుడు కబ్జాల పూర్గా మారిందని స్థానికులు అంటున్నారని కవిత ఆరోపించారు. మేడ్చల్లో మల్లారెడ్డి పూలమ్మిన, పాలమ్మిన అని డైలాగులు చెబుతూ వందల ఎకరాలు కబ్జా చేశాడని ఆరోపించారు. గతంలో రేవంత్రెడ్డిపై తొడలు గొట్టి ఇప్పుడు మనువడితో రేవంత్రెడ్డి కాళ్ళుమొక్కించి సెటిల్మెంట్ చేసుకున్నాడని ఆరోపించారు.
జపాన్లో భారీ భూకంపం .. ఎగసి పడిన సునామీ అలలు
జపాన్ ఉత్తర తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6 గా నమోదైంది. కోస్తాలో 40 సెంమీ ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ ప్రధాన హోన్సు ద్వీపంలో ఉత్తర ప్రాంతంలో అయోమోరికి తూర్పు భాగంలో భూకంపం కేంద్రీ కృతమైందని వివరించింది. దీని ప్రభావంతో హొక్కైడో ద్వీపంలో యురాక్వా పట్టణం, ముత్సు ఒగవారా రేవుపట్టణాన్ని సునామీఅలలు 40 సెంమీ ఎత్తున ఎగసి చుట్టుముట్టాయని వివరించింది. హచినోహి పట్ణంలో ఒక హోటల్లో సునామీ అలల తాకిడికి అనేక మంది గాయపడ్డారు. అత్యవసరంగా నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఎమర్జెన్సీ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసిందని ప్రధాని సనాయె తకైచి వెల్లడించారు. ప్రజల ప్రానాలు కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటిలో అన్నపూర్ణ స్టూడియో
భారత్ ప్యూచర్ సిటిలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం చేయనున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు నటుడు అక్కినేని నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ చాలా అద్భుతంగా ఉందని నాగార్జున ప్రశంసించారు. ఫ్యూచర్ సిటి లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఒక ప్రత్యేకమైన ఫిలిం హబ్ ను ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రణాళికలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి చోటు కల్పించడం పట్ల నటుడు నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సినిమా షూటింగ్లకు, నిర్మాణాలకు ప్యూచర్ సిటి ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందంటూ టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, ఈ-కామర్స్ సైట్లు తన పేరు, ఫొటోలను వాడుతూ అభ్యం తరకరమైన, తప్పుడు సమాచారంతో కూడిన పోస్టులను వ్యాప్తి చేస్తున్నాయని తన పిటిషన్లో వెల్లడించారు. ఈ వ్యవహారంపై సోమవారం జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్టీఆర్ తరఫున న్యాయవాది జె. సాయిదీపక్ వాదనలు వినిపించారు. తన క్లయిం ట్ వ్యక్తిగత హక్కులకు, ప్రతిష్ఠకు హాని కలిగించేలా ఉన్న పోస్టులను తక్షణమే తొలగించాలని, వాటిని ప్రచారం చేసిన వారిపై 2021 ఐటి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను, స్క్రీన్షాట్లను కోర్టుకు సమర్పించారు. ముందుగా ఆయా సోషల్ మీడియా సంస్థలను సంప్రదించి పోస్టుల తొలగింపునకు ప్రయత్నించాలని, అప్పటికీ ఫలితం లేకపోతేనే కోర్టును ఆశ్రయించాలని న్యాయమూర్తి సూచించారు. ఇక, వాదనలు విన్న న్యాయస్థానం ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరకర మైన కంటెంట్ను మూడు రోజుల్లోగా తొలగించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది. గతంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ విషయంలోనూ ఢిల్లీ హైకోర్టు ఇలాంటి ఆదేశాలే ఇచ్చిందని ఎన్టీఆర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో పరువు నష్టంపై ఇటీవల నాగార్జున, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖులు కూడా న్యాయపోరాటం చేసిన విషయం విదితమే.
surabhi group|రాష్ట్రంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి
surabhi group| రాష్ట్రంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి ప్రభుత్వంతో ఎంఓయు1000
థాయిలాండ్ పారిపోయిన గోవా నైట్క్లబ్ యజమానులు
25మంది మరణానికి కారణమైన గోవా నైట్క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే థాయిలాండ్కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని గుర్తించేందుకు ఇంటర్పోల్ సాయం కోరినట్లు పోలీసులు వెల్లడించారు. అర్పోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్క్లబ్లో ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు ఓనర్లు ఆదివారం తెల్లవారుజామున ఫుకెట్కు పారిపోయారని గోవా పోలీసులు సోమవారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు. విచారణ క్రమంలో గుర్తించినట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసేందుకు ఇంటర్పోల్ సాయం కోరామని వివరించారు.
మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్, అలియాస్ దేవ్ మజ్జి, ఆయన భార్య సహా పది మంది మావోయిస్టులు సోమవారం నాడు చత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల తలలపై మొత్తం రూ.2.95 కోట్ల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. ఎకె 47 రైఫిల్ సహా మూడు ఇన్సాస్ రైఫిళ్లు, ఇతర పేలుడు పదార్థాలను కూడా పోలీసులకు అప్పగించారు. రాంధెర్కు హొరుపు, అమర్జీత్ అనే పేర్లు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దేవ్ మజ్జి ఎంఎంసి జోన్లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన తలపైనే రూ.1.05 కోట్ల రివార్డు ఉంది. ఆయన భార్య అనిత, అలియాస్ లత డివిజినల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో నలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, మరో నలుగురు సభ్యులు, ఇద్దరు ఏరియా కమిటీ మెంబర్లు. మరోవైపు మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో 10మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా పోలీసులకు లొంగిపోయారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. వీరి లొంగుబాటుతో దిండోరి, మాండ్లా ప్రాంతాలు పూర్తిగా మావోయిస్టు రహితం అయ్యాయని ఆయన వెల్లడించారు. లొంగిపోయిన నక్సల్స్పై రూ.2.36కోట్ల రివార్డు ఉన్నట్లు తెలిపారు.
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానని సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఓ సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానేమోనని భయంతో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్ పల్లి గ్రామంలో సోమవారం నాడు చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పిప్పడ్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి చాల్కి రాజు (36) అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేసి బరిలో నిలిచారు. అయితే ఆయన అప్పటికే అయ్యప్ప మాలాధారణ వేసి మండలంలోని శంషాద్దీన్ పూర్ గ్రామ శివారులో గల అయ్యప్ప సన్నిధానంలో తోటి అయ్యప్ప స్వాములతో ఉంటున్నాడు. కాగా రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి తోటి స్వాములతో నిద్రించాడు. సోమవారం తెల్లవారు జాము నాలుగు గంటల ప్రాంతంలో నిద్ర లేచి తోటి స్వాములతో కలిసి కాలకృత్యాలు చేయడానికి బయటకు వెళ్లాడు. అయితే బయటకు వెళ్లినఅయ్యప్ప స్వాములు తిరిగి సన్నిధానానికి వచ్చారు.. కాని రాజుస్వామి మాత్రం రాలేదు. దీంతో అయ్యప్ప స్వాములు చుట్టు పక్కల వెతికినా.. రాజు స్వామి ఆచూకి లభించలేదు. దీంతో చేసేదేమి లేక శంషాద్దీన్ పూర్ గ్రామస్తులకు సమాచారం అందించడంతో వెంటనే కొంత మంది గ్రామస్తులు అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకొని సమీప ప్రాంతంతో వెతికడంతో ఓ చెట్టుకు టావల్ తోని ఉరి వేసుకొని కనిపించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, రాయికోడ్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలాన్ని సంగారెడ్డి జిల్లా ఏఎస్పీ రఘునందన్ రావు, జహీరాబాద్ డీఎస్పీ సైదా, రూరల్ సీఐ హన్మంత్ లు పరిశీలించి జరిగిన విషయాన్ని అయ్యప్ప స్వాములను అడిగి తెలుసుకున్నారు. మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరిణ్ తెలిపారు.
తప్పుడు ప్రచారంతో టిఆర్ఎస్ గోబెల్స్ రాష్ట్ర సమితిగా మారింది:మంత్రి సీతక్క
తప్పుడు ప్రచారంతో టిఆర్ఎస్ గోబెల్స్ రాష్ట్ర సమితిగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైతే హరీష్ రావు ఓర్చుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్ కాదని, గోబెల్స్ సమ్మిట్ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా సమాధానం చెప్పారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే సహించలేకపోతున్నారని, కళ్ళల్లో నిప్పులు పోసుకొని తెలంగాణ ఆగం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కెసిఆర్ కుటుంబమే గొప్పదన్న అహంకారంతో హరీష్ రావు మాట్లాడుతూ విజనరీ ఉన్న నేతలను చులకన చేసి మాట్లాడటం హరీష్ రావు నైజమని మండిపడ్డారు. ఖరీదైన భూములను పప్పు బెల్లాలకు అమ్ముకున్న చరిత్ర బిఆర్ఎస్ పెద్దలదని ఆరోపించారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే సమ్మిట్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ దేశ విదేశా కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు వేల కొలది ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయని చెప్పారు. నిరుద్యోగులను సొంత అవసరాలకు వాడుకొని కేసీఆర్ కుటుంబం వదిలేసిందని అన్నారు. అయితే తమ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ కల్పన చేస్తున్నామని చెప్పారు. దావోస్ సమ్మిట్ ను వినడమే కానీ నేను చూడలేదని, భారత్ ఫ్యూచర్ సిటీలో దావోస్ సమ్మిట్కు మించి ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని మంత్రి సీతక్క వివరించారు.
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయింది. ఈ విషయాన్ని స్మృతి మంధాన స్వయంగా తన ఇన్ స్టా ద్వారా వెల్లడించింది.
టికెట్ ధరలను తగ్గించిన ఎయిర్ ఇండియా
ఇండిగోలో తలెత్తిన సంక్షోభం కారణంగా దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలపై ప్రభావం పడింది.
DHOOM 3 : రూ.3 కోట్లు లూటీ * తెరమీదకు హవాలా స్టోరీ
రిటైర్మెంట్ తీసుకోలేదు: షకీబ్
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు.
Rajinikanth announces Sequel for his Iconic Film
Padayappa is one of the best films in Rajinikanth’s career and the film is a massive hit. The film was dubbed into Telugu as Narasimha and the film ended up as a super hit after a simultaneous release in Telugu along with Tamil. Ramya Krishna played one more important role and her performance will be […] The post Rajinikanth announces Sequel for his Iconic Film appeared first on Telugu360 .
Chandrababu Naidu Breaks Silence on IndiGo Crisis, Blames Airline’s Poor Management
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu addressed the media at the AP Secretariat and responded for the first time to the ongoing IndiGo Airlines crisis. He stated that the mass cancellations and passenger distress were the direct result of IndiGo’s failure to follow the rules set by the Directorate General of Civil Aviation. He […] The post Chandrababu Naidu Breaks Silence on IndiGo Crisis, Blames Airline’s Poor Management appeared first on Telugu360 .
జుక్కల్ నియోజకవర్గం పిట్లం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్ రాజీ నామా బాండ్ పేపర్ను అందజేశారు. ఈ సందర్బంగా నవాబ్ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ- తన పదవీకాలం సగం అంటే 2.5 ఏళ్లు పూర్తయ్యేలోగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైతే, ఎలాంటి పదవి మోహం లేకుండా తాను స్వయంగా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసి ప్రకటించారు. తమ మాట, తమ హామీల పరిరక్షణ పట్ల ప్రజల ముందే ప్రమాణం చేస్తున్నానని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం పారదర్శక పాలన, మౌలిక వసతుల మెరుగుదల, పంచాయతీ పనుల్లో ప్రజా భాగస్వామ్యం పెంపు వంటి అంశాలను ప్రధాన ప్రాధాన్యాలుగా తీసుకొని ముందుకు సాగనున్నట్లు తెలిపారు. గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని నమ్మకమిస్తున్నట్లు నవాబ్ సుదర్శన్ గౌడ్ తెలిపారు. పిట్లం గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అండమాన్ నికోబార్ టూర్: మీ మరపురాని ప్రయాణానికి ఒక కంప్లీట్ గైడ్
అండమాన్ నికోబార్ దీవుల టూర్ కోసం ప్లాన్ చేస్తున్నారా? తప్పక సందర్శించాల్సిన ప్రాంతాల కోసం వెతుకుతున్నారా? సమగ్ర వివరాలు ఈ ప్రత్యేక కథనంలో డియర్ అర్బన్ అందిస్తోంది. నీలి సముద్రపు లోతుల్లో దాగి ఉన్న అద్భుతమైన ప్రపంచం, తీరం వెంబడి దట్టంగా పెరిగిన పచ్చని అడవులు, ఇసుక తిన్నెలు మీకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. మీ సాహసయాత్రకు ఇలా సిద్ధమవ్వండి. 1. అండమాన్ లో ది బెస్ట్ ఏవో తెలుసుకోండి: మీ ఐలాండ్ విహార ప్రణాళిక అండమాన్ […] The post అండమాన్ నికోబార్ టూర్: మీ మరపురాని ప్రయాణానికి ఒక కంప్లీట్ గైడ్ appeared first on Dear Urban .
తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లిన తోడేలు #UttarPradesh #Wildlife #Kaisarganj
తెలంగాణ హైకోర్టులో ఐఎఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
సీనియర్ ఐఎఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కేడర్ కేటాయింపుపై గతంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ స్టే విధించింది. ఈ పరిణామంతో ఆమ్రపాలికి తాత్కాలికంగా చుక్కెదురైంది. గత ఏడాది అక్టోబర్లో కేంద్రంలోని డివొపిటి ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్రపాలి డివొపిటి ఆదేశాలను సవాల్ చేస్తూ క్యాట్లో పిటిషన్ దాఖలు చేయగా క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. క్యాట్ ఆదేశాల మేరకు ఐఎఎస్ అధికారి హరికిరణ్తో స్వాపింగ్ పద్ధతి ద్వారా ఆమ్రపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. అయితే క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివొపిటి తెలంగాణ హైకోర్టులో అప్పీల్కు వెళ్లింది. ఐఎఎస్ కేటాయింపు నిబంధనల ప్రకారం ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదని డివొపిటి ప్రధానంగా వాదించింది. ఐఎఎస్ హరికిరణ్ రిజర్వ్ కేటగిరీకి చెందిన అధికారి కాబట్టి ఓపెన్ కేటగిరీకి చెందిన ఆమ్రపాలికి ఆయనతో స్వాపింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని డివొపిటి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. డివొపిటి అప్పీల్ను పరిశీలించిన హైకోర్టు క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది. అప్పటివరకు క్యాట్ ఉత్తర్వులు అమలులో ఉండవని, వాటిపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి తరఫు న్యాయవాదికి కూడా హైకోర్టు ఆదేశించింది.
ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ సజీవదహనం
బేస్తవారిపేట: ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు వద్ద టమాటా లోడ్తో వెళ్తున్న లారీ టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ లో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ ను పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన దుర్గారావుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
నెహ్రూ వాటిని ఆరంభించకపోయి ఉంటే..?: ప్రియాంక గాంధీ
పధాని మోడీ విమర్శలకు కాంగ్రెస్ సభ్యురాలు, గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక వాద్రా కౌంటర్ ఇచ్చారు. వందేమాతరంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ తరపున ఆమె మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్లో త్వరలో ఎన్నికలు ఉన్నందునే బిజెపి వందేమాతరంపై ప్రత్యేక చర్చ చేపట్టిందన్నారు. జాతీయ గేయం ఇప్పటికీ ప్రజల్లోనే ఉన్నదని, ప్రజా సమస్యలు ఇప్పుడు దేశంలో ఎన్నో ఉన్నాయని, వాటిని పక్కన పెట్టి ఈ చర్చ ఇప్పుడు చేపట్టడం అవసరమా అని ప్రశ్నించారు. భవిష్యత్ను వదిలి ప్రధానమంత్రి గతాన్ని తవ్వుతున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యను పక్కనపెట్టి వందేమాతరం చర్చ చేపట్టి అందులో నెహ్రూపై ప్రధానమంత్రి విమర్శలకు పాల్పడుతున్నారని, అయితే నెహ్రూపై కూడా ఈ తరహాలోనే చర్చకు సమయం తీసుకుందామని ప్రతిపాదించారు. ఆయన గురించి ఒక జాబితా రూపొందించి అంశాల వారీగా మాట్లాడుకుందామని ప్రియాంక సూచించారు. ప్రియాంక ప్రధాని మోడీపై పదునైన విమర్శలు గుప్పించారు. ‘మీరు పదేపదే నెహ్రూతో పాటు ఆయన వారసత్వంపై విమర్శలకు దిగుతున్నారు. 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి పదవిలో ఉంటున్నారు. కానీ నెహ్రూ 17 ఏళ్లు ఆ పదవిని అధిష్టించారు. ఆయనపై ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఆయన ఇస్రో ఆరంభించకపోయి ఉంటే ఈనాడు మంగళయాన్ ఉండకపోయేది. ఆయన డిఆర్డిఓను తీసుకురాకపోయి ఉంటే తేజాస్ మనుగడ సాధ్యమయ్యేదా?. నెహ్రూ ఐఐటిలు, ఐఐఎంలు ప్రారంభించకపోయి ఉంటే ఐటి ఎక్కడిది? ఆయన ఎయిమ్స్ మొదలు పెట్టి ఉండకపోతే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం సాధ్యమయ్యేదా? అని ప్రశ్నలు గుప్పించారు. నెహ్రూ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా 9 సార్లు జైలు పాలయ్యారు. మొత్తం 3200 రోజులు కారాగారంలో ఉన్నారని గుర్తు చేశారు. నెహ్రూను అవమానించదలచుకుంటే ఒక జాబితా తయారు చేయాలని, ఆ సంఖ్య 99 లేదా 999 మీ ఇష్టం అని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సమయం నిర్ణయించి చర్చ చేపడితే దానికి మేం సిద్ధమని ప్రియాంక సవాల్ విసిరారు. ఇందిర, రాజీవ్ ఈ దేశానికి ఏం చేశారు? వారసత్వ రాజకీయాలు అంటే ఏంటీ? నెహ్రూ చేసిన తప్పిందాలు ఏమేం ఉన్నాయి వీటన్నింటిపై చర్చ చేపడదామన్నారు. అదే సమయంలో దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కూడా మాట్లాడుకుందామని ప్రియాంక పేర్కొన్నారు.
Candidate |ప్రజా సమస్యల కోసం పని చేస్తా
Candidate | ప్రజా సమస్యల కోసం పని చేస్తా Candidate | నర్సింహులపేట,
మరికొన్ని గంటల్లో పుట్టినరోజు వేడుకలు.. అంతలోనే
పుట్టిన రోజే ఆ బాలుడికి మరణ దినంగా మారింది. మరికొన్ని గంటల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో విధి వక్రీకరించి వేడి సాంబార్ గిన్నెలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ గురుకుల విద్యాలయంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.... గురుకుల విద్యాలయం వసతిగృహం వంట మనిషిగా పని చేస్తున్న మొగిలి మధుకర్ ఆదివారం వంట చేసి సాంబారు గిన్నె పక్కనే పెట్టగా మధుకర్ కుమారుడు నాలుగు సంవత్సరాల మోక్షిత్ ఆడుకుంటూ వెళ్లి వేడి సాంబార్ గిన్నెలో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన మధుకర్ బాలుడు మోక్షిత్ను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మోక్షిత్ మృతి చెందాడు. ఆదివారం నాడే మోక్షిత్ పుట్టిన రోజు కాగా అదే రోజు మరణం సంభవించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాలుడి తండ్రి మధుకర్ ఫిర్యాదు మేరకు ధర్మారం ఎస్సై ఎం.ప్రవీణ్కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
MD |జగన్మాత సేవలో ఆంధ్రప్రభ ఎండి..
MD | జగన్మాత సేవలో ఆంధ్రప్రభ ఎండి.. MD | విజయవాడ, ఆంధ్రప్రభ
అఖండ 2 సినిమా ఘన విజయం సాధించాలని అభిమానుల ప్రత్యేక పూజలు #telugupost #balakrishna #akanda2
బైక్ను ఢీకొట్టిన లారీ: ఇద్దరి మృతి
వేగంగా దూసుకు వచ్చిన లారీ కిందపడి ఇద్దరు వ్యక్తులు దూర్మరణం. సూరారం పోలీస్ స్టేషన్ పరిధి జ్యోతి మిల్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుండి వేగంగా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల దర్యాప్తు లో తెలింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పాండు బస్తీ కి చెందిన రాపిడో డ్రైవర్ సురేందర్ రెడ్డి (45). సూరారం వెంకటరమణ కాలనీ కి చెందిన జ్యోతి (32) పల్సర్ బైక్ పైన నర్సాపూర్ రోడ్డులో వెళ్తున్నారు. బైక్ పై వెళ్తున్న వారిని వెనుక నుండి వచ్చిన లారీ అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సురేందర్ రెడ్డి, జ్యోతి కింద పడిపోయారు. లారీ ముందు టైర్లు జ్యోతి, సురేందర్ పై నుండి వెళ్ళగా అక్కడికక్కడే చనిపోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. లారీని ట్రేస్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూరారం సీఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.
Govt |కాపు, బీసీ భవనాల నిర్మిస్తా
Govt | కాపు, బీసీ భవనాల నిర్మిస్తా నా సొంత నిధులు వెచ్చిస్తున్నారాష్ట్ర
రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారు: హరీష్రావు
గ్లోబల్ సమ్మిట్ను ‘గోబెల్స్ సమ్మిట్‘ అంటూ హరీష్రావు ఎద్దేవా చేశారు. గతంలో దావోస్ వెళ్లి డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రేవంత్ నవ్వులపాలయ్యారని విమర్శించారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూమి, ఫార్మా సిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమి బిఆర్ఎస్ హయాంలో సమీకరించినదే గుర్తు చేశారు. అందులో రేవంత్ చెమట చుక్క కూడా లేదని అన్నారు. కెసిఆర్ యువత ఉద్యోగాల కోసం ఆలోచిస్తే, రేవంత్ ఆ భూములను తన అనుయాయులకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. రెండో ఏడాది పాలన పెనంలోంచి పొయ్యిలో పడినట్లు ఉందని, మూడో ఏడాది ఏమవుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దుయ్యబట్టారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారన్నారు. రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు. రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో చూసుకోవాలని పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ కరప్షన్ పాలన రేవంత్ కుటుంబం, మంత్రులది అని ఆరోపించారు. కరప్షన్ ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు మొండి చేయి చూపించిందని... అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం విజన్, విధానం ఏంటో ఎవరికి ఇప్పటికీ అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు జరుపుకోవాలని హరీష్రావు అన్నారు.
పెట్టుబడులకు కొత్త వేదిక - గ్లోబల్ సమ్మిట్: మంత్రి సురేఖ
గ్లోబల్ సమ్మిట్లో స్టాల్స్ను సందర్శించిన మంత్రి సురేఖ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త వేదిక - తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రులు, విశిష్ట అతిథులతో కలిసి మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను విస్తృతంగా సృష్టించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. స్టాల్స్ను పరిశీలించిన మంత్రి సురేఖ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ప్రతి స్టాల్కు సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సమ్మిట్ వద్ద సంప్రదాయ నృత్యకారిణిలతో కలసి నృత్యం చేశారు. మంత్రి ఆత్మీయ పలకరింపునకు సంప్రదాయ నృత్యకారిణీలు హర్షం వ్యక్తం చేశారు.
ఎగరని విమానాలు.. ఎందుకో ఈ కష్టాలు!! | Flight Cancellations in India
Cricket |బ్లైండ్ టీమ్ కెప్టెన్ దీపికకు నీరాజనం
Cricket | బ్లైండ్ టీమ్ కెప్టెన్ దీపికకు నీరాజనం Cricket | శ్రీ
TET |టెట్ పై పునః సమీక్ష అవసరం
TET | టెట్ పై పునః సమీక్ష అవసరం TET | పల్నాడు
నవజ్యోత్ కౌర్ సిద్ధూను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, పంజాబ్ మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూపై కాంగ్రెస్ వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల పార్టీపై నవజ్యోత్ కౌర్ సిద్ధూ సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవల నవజ్యోత్ సింగ్ సిద్ధూ క్రియాశీల రాజకీయాలకు తిరిగి రావడంపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. కాంగ్రెస్ 2027కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తేనే ఆయన మళ్లీ పోటీ చేస్తారని చెప్పారు. రూ.500 కోట్లు సూట్ కేసు ఇచ్చేవారే ముఖ్యమంత్రి అవుతారని..ఆ పదవిని కొనడానికి అంత డబ్బు తమ వద్ద లేవని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు పార్టీలో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆమెను ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు.
Welcome |బాల సదనాల్లో మహిళా కమిషన్ తనిఖీ
Welcome | బాల సదనాల్లో మహిళా కమిషన్ తనిఖీ Welcome | కర్నూలు,
OSSS Teaser: Tharun, Eesha’s Fun Ride
Tharun Bhascker joined hands with a debutant A R Sajeev for a rustic entertainer Om Shanti Shanti Shantihi. Eesha Rebba is cast opposite Tharun Bhascker in the movie which is done with its shoot and is getting ready for its theatrical release. Meanwhile, the makers started the promotions by revealing the teaser. Tharun Bhascker plays […] The post OSSS Teaser: Tharun, Eesha’s Fun Ride appeared first on Telugu360 .
Collector |తక్షణమే పరిష్కరించండి
Collector | తక్షణమే పరిష్కరించండి Collector | మచిలీపట్నం,- ఆంధ్ర ప్రభ :
కిరాయి వ్యక్తులతో అల్లుడిపై దాడి చేయించిన అత్త
పెనగలూరు: అన్నమయ్య జిల్లా పెనగలూరులో దారుణం చోటు చేసుకుంది. అల్లుడిపైనే ఓ అత్త కిరాయి వ్యక్తులతో దాడి చేయించింది. మునుస్వామి అనే వ్యక్తిపై నలుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాపూరు వాసి మునుస్వామి నాలుగు రోజుల క్రితం భార్యతో గొడవపడి పెనగలూరులోని తన మేనత్త ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన అత్త పెంచలమ్మ అల్లుడిపై దాడికి పురమాయించింది. రెండు బైక్లపై వచ్చిన కిరాయి వ్యక్తులు కత్తితో మునుస్వామి గొంతుపై దాడి చేశారు. స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. కత్తితో సహా రాజంపేట ప్రభుత్వాస్పత్రికి బాధితుడిని తరలించారు. పెనగలూరు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Gold |లక్కీ క్రికెటర్కు గోల్డ్ కాయిన్
Gold | లక్కీ క్రికెటర్కు గోల్డ్ కాయిన్ యువ హీరోలు రామ్ -హరి
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వృద్ధుడి మృతి
విశాలాంధ్ర – బెలుగుప్ప:రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వెంకటాద్రిపల్లి గ్రామానికి చెందిన చంద్రమౌళి (60) మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం ప్రకారం, హోటల్ నిర్వహణ చేస్తూ జీవనోపాధి సాగిస్తున్న చంద్రమౌళి బెలుగుప్పకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా, ఆవులెన్న క్రాస్ సమీపంలో తిప్పేస్వామి నడుపుతున్న బైక్ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో చంద్రమౌళికి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించిగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలిపారు.ఆయన మృతితో కుటుంబ […] The post రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వృద్ధుడి మృతి appeared first on Visalaandhra .
health |శతాధిక వృద్ధురాలు కన్నుమూత
health | శతాధిక వృద్ధురాలు కన్నుమూత health | చల్లపల్లి, ఆంధ్ర ప్రభ
Award |ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు
Award | ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు Award |
Electric |విద్యుత్ షాక్ తో ఎలక్ట్రీషియన్ మృతి
Electric | విద్యుత్ షాక్ తో ఎలక్ట్రీషియన్ మృతి Electric | పామర్రు
మహిళల ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ఇందిర మహిళా శక్తి స్టాల్
తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ఇందిర మహిళా స్టాల్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. తమ ప్రభుత్వ లక్ష్యం మహిళలను ఆత్మవిశ్వాసంతో నిలబడే యజమానిగా తీర్చిదిద్దడమేనని స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో సోమవారం ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో మహిళా సాధికారతను ప్రతిబింబించే ఇందిరా మహిళా శక్తి స్టాల్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ ఎదిగితే కుటుంబం, సమాజం, రాష్ట్రం ఎదుగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం మహిళ శక్తిని కేంద్ర బిందువుగా చేసుకుని పని చేస్తోందని అన్నారు. ఈ స్టాల్లో కనిపిస్తున్న ప్రతీ విజయకథ తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. సెర్ప్, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా రూపొందించిన ఈ స్టాల్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఆధ్వర్యంలో మహిళల చేతుల్లో నడుస్తున్న విభిన్న వ్యాపారాలు, సేవలు, ఆర్థిక కార్యకలాపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. మహిళల నిర్వహణలో ఉన్న పెట్రోలు బంకులు, హైటెక్ సిటీలో పనిచేస్తున్న మహిళా శక్తి బజార్, జిల్లాల వ్యాప్తంగా నిర్మితమైన మహిళా శక్తి భవనాలు, శక్తి క్యాంటిన్లు, అలాగే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణలో మహిళలు సాధిస్తున్న విజయాలు దేశ విదేశాల ప్రతినిధులను ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ మహిళా సంఘాలు పెద్ద స్థాయిలో వ్యాపారాలు నడపడం, కార్పొరేట్ స్థాయి సేవలు అందించడం, ఇదే కొత్త తెలంగాణ శక్తి అని అన్నారు. మహిళకు వేదిక ఇస్తే ఆమె అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుందనే దానికి ఈ ప్రదర్శనే సాక్షమని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 4 లేన్ల రోడ్లు : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ప్రపంచమంతా గ్లోబల్ సమ్మిట్ వైపు ఆసక్తిగా చూస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైసింగ్ నినాదంతో మంత్రులందరం యూనిటీగా పని చేస్తున్నామని ఆయన చెప్పారు. సోమవారం గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ, 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఆర్ అండ్ బి శాఖ ఆద్వర్యంలో జాతీయ రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త ఎయిర్పోర్టులు, డ్రైపోర్ట్ నుండి కోస్టల్ ఏరియా కనెక్టివిటీ, సౌత్ ఇండియా స్టేట్స్ కనెక్టివిటీ కారిడార్, గ్రీన్ ఫీల్ హైవేలు లాంటి ప్రణాళికతో వెళ్తున్నామని మంత్రి కోమటి రెడ్డి అన్నారు. మా విజన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా రానున్న రోజుల్లో పూర్తిగా 4లేన్ల రోడ్లు రాబోతున్నాయని కోమటి రెడ్డి చెప్పారు. మంచి రోడ్లు ఉంటే గ్రామీణ తెలంగాణ అభివృద్ది చెందుతుందని, పరిశ్రమలు వస్తాయని, .యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి, భారత్ ఫ్యూచర్ సిటీ నుండి బెంగళూరు, చెన్నై గ్రీన్ ఫీల్ రహదారులు, బుల్లెట్ ట్రైన్ కారిడార్లు రాబోతున్నాయని ఆయన చెప్పారు. ఇది రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నిలవబోతున్నాయన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేదని ఆయన విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. తమ కుటుంబంలో ఒక్కొక్కరు పదివేల కోట్లు తిన్నారని కవిత ఆరోపిస్తోందని, కెసిఆర్ క్యాబినెట్ మంత్రులపై కవిత చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని మంత్రి కోమటి రెడ్డి డిమాండ్ చేశారు.
Distribution |వృద్ధులకు దుప్పట్లు పంపిణీ..
Distribution | వృద్ధులకు దుప్పట్లు పంపిణీ.. Distribution | టేకుమట్ల, ఆంధ్ర ప్రభ
Why is Dhurandhar a Game Changer in Indian Cinema?
Bollywood has been struggling to deliver impressive films and some of the biggest action dramas fell short of expectations. Many recent spy thrillers and action dramas are packed with glamour, expensive locations and forceful action. Then came Dhurandhar, a realistic and honest action drama that unfolded some of the shocking facts that happened behind the […] The post Why is Dhurandhar a Game Changer in Indian Cinema? appeared first on Telugu360 .
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని విద్యా నగర్, కేశవ్ నగర్ కాలనిలో గల శ్రీనివాస్ శర్మ నివాసంలో సోమవారం భారీ చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాస్ శర్మ, అతని కుటుంబ సభ్యులు నవంబర్ 30న వేరే ఊరికి వెళ్ళి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి తాళం విరిగిపడి ఇంట్లో సామాన్లు చిందర వందరగా పడి ఉండడం ,బీరువాలు తెరిచి ఉన్నాయి. ఇంట్లో దొంగలు పడ్డారన్న విషయాన్ని గమనించిన శ్రీనివాస్ శర్మ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి ఎస్సై మాధవరెడ్డి తన సిబ్బందితో చేరుకుని ఇళ్ళంతా పరిశీలించారు. బాధితుడు 40 తులాల బంగారు, 6 లక్షల నగదు చోరీకి గురైందని చెప్పారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు.
Social |శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు….
Social | శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు…. Social | ధర్మపురి,
2BHK ప్లాన్ చేస్తున్నారా? 3BHK నా? ఏది బెస్ట్? మొదటిసారి ఫ్లాట్ కొనేవారికి గైడ్
హైదరాబాద్ వంటి నగరంలో మొదటిసారి ఫ్లాట్ కొనాలనుకునే వారు ఎదుర్కొనే అతిపెద్ద సందిగ్ధత 2BHK కొనాలా? లేక 3BHK తీసుకోవాలా? ఈ నిర్ణయం కేవలం ఒక అదనపు గది గురించి మాత్రమే కాదు.. ఇది మీ భవిష్యత్తు, జీవనశైలి, ఆర్థిక ప్రణాళికతో ముడిపడి ఉంటుంది. డియర్ అర్బన్ అందిస్తున్న ఈ గైడ్ ముఖ్యమైన అంశాలైన ఖర్చు, జీవనశైలి, భవిష్యత్ ప్రణాళికలను విశ్లేషించడం ద్వారా ఈ క్లిష్టమైన నిర్ణయాన్ని సులభతరం చేయడానికి రూపొందించింది. 1. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ […] The post 2BHK ప్లాన్ చేస్తున్నారా? 3BHK నా? ఏది బెస్ట్? మొదటిసారి ఫ్లాట్ కొనేవారికి గైడ్ appeared first on Dear Urban .
incident |సాంబారులో పడి బాలుని మృతి..
incident | సాంబారులో పడి బాలుని మృతి.. incident | పెద్దపల్లి జిల్లా
టి-20 ప్రపంచకప్.. జియో హాట్స్టార్ కీలక నిర్ణయం?
వచ్చే ఏడాది ఐసిసి టి-20 ప్రపంచకప్ జరుగనుంది. ఈ ప్రపంచకప్కి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ మ్యాచ్ల షెడ్యూల్ కూడా ప్రకటించారు. అయితే ఈ టోర్నీకి ముందు ప్రముఖ ఒటిటి సంస్థ జియో హాట్స్టార్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కి షాక్ ఇస్తూ.. ఈ టోర్నమెంట్ ప్రసారకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఐసిసికి చెప్పినట్లు సమాచారం. అంతేకాక నాలుగేళ్ల భారత మీడియా హక్కుల ఒప్పందంలోని మిగిలిన రెండేళ్ల కాంట్రాక్ట్ని కూడా కొనసాగించలేమని జియో హాట్స్టార్ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు ఒటిటి ఫ్లాట్ఫామ్కి వస్తున్న భారీ ఆర్థిక నష్టాలే ఈ నిర్ణయం వెనుక కారణంగా తెలుస్తోంది. దాదాపు 2.4 బిలియన్ల డాలర్లతో 2026-29 మధ్య కాలానికి భారత మీడియా హక్కులకు సంబంధించిన విక్రయ ప్రక్రియను ఐసిసి తాజాగా ప్రారంభించింది. జియో హాట్స్టార్ 2024-27 మధ్య కాలానికి 3 బిలియన్ల డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు జియో హాట్స్టార్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో బిడ్లు దాఖలు చేయాలని పలు ప్రధాన ఒటిటి ఫ్లాట్ఫామ్లను ఐసిసి ఆహ్వానించిది. సోని పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సంస్థలను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ, ఒప్పందం విలువ చాలా అధికంగా ఉండటంతో ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదని సమాచారం.
కాప్రా సాకేత్లో రియల్టర్ దారుణ హత్య
హైదరాబాద్ శివారు ప్రాంతం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ కాప్రా సాకేత్లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది.పాత కక్షలతో దుండగులు ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి,బండరాయితో మోది, తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన సోమవారం ఉదయం 8 గంటలకు జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సాకేత్లో వెలుగు చూసింది.మృతుడు కాప్రా సర్కిల్ పరిధిలోని సాకేత్లో నివసించే ఘంటా వెంకటరత్నం (54)గా పోలీసులు గుర్తించారు.పక్కా పథకం ప్రకారం నలుగురు వ్యక్తులు ఆటోలో,బైక్పై మరో ఇద్దరు వెంకటరత్నంను ఫాలో అవుతూ ఆటోను స్కూటీకి అడ్డగించి కత్తులతో విచక్షణరహితంగా దాడిచేశారు.అంతటితో ఆగకుండా తుపాకీతో కాల్చి తిరిగి అదే ఆటోలో పారిపోయారు.ఈ సంఘటనతో స్థానికులు భయాందోనళకు గురయ్యారు.సమాచారం అందుకున్న జవహర్నగర్ ఇన్స్పెక్టర్ సైదయ్య తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు. పోలీసుల వివరాల ప్రకారం కాప్రా సాకేత్లో నివసించే ఘంటా వెంకటరత్నం (54) రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తు భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం తన కూతురిని సాకేత్లోని ఫాస్టర్ బిల్లా బాంగ్ స్కూల్లో వదిలి తిరిగి ఇంటికి స్కూటీపై వస్తుండగా ఆరుగురు వ్యక్తులు ఆటోను అడ్డంగా ఉంచి అతనిపై కత్తులతో దాడి చేశారు.విచక్షణరహితంగా దాడి చేయడమే కాకుండా తుపాకీతో షూట్ చేసి పారిపోయారు. వెంకటరత్నంను హత్య చేయడానికి నిందితులు గత కొంత కాలంగా రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది.మృతుడు వెంకటరత్నం గతంలో దూల్ఫేటలో రియల్ ఏస్టేట్ వ్యాపారం నిర్వహించేవాడు.అతనిపై అక్కడ రౌడిషీట్తో పాటు హత్య నేరారోపణలు ఉన్నాయి.సాకేత్లో గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నప్పటికి అక్కడి ఆర్థిక,వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.మృతుడి తల్లి,భార్య పిల్లలు మృతదేహం వద్ద బోరున విలపించారు. తన కుమారుడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని తల్లి పోలీసుల ముందు వాపోయింది.మల్కాజ్గిరి డివిజన్ డిసిపి సిహెచ్.శ్రీధర్ ఘటన స్థలాన్ని సందర్శించి హత్యకు దారితీసిన విషయాలపై అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమోరాల పుటేజీని పరిశీలిస్తున్నామని, తొందరలోనే నిందితులను పట్టుకుంటామని డిసిపి శ్రీధర్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన జవహర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సైదయ్య తెలిపారు.
Teacher |చదువుకున్న వారికి పట్టం కట్టండి.
Teacher | చదువుకున్న వారికి పట్టం కట్టండి. Teacher | ధర్మసాగర్, ఆంధ్రప్రభ
funding |గెలిపించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా..!
funding | గెలిపించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా..! funding | ఇంద్రవెల్లి,
Vote |అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా…
Vote | దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధికి ఈనెల 11వ తేదీన
candidate |భారీ మెజార్టీతో గెలిపించండి… అభివృద్ధి చేస్తా…
candidate | భారీ మెజార్టీతో గెలిపించండి… అభివృద్ధి చేస్తా… candidate | బిక్కనూర్,
Services |ఆదరించండి..అభివృద్ధి చేసి చూపిస్తా..
Services | ఆదరించండి..అభివృద్ధి చేసి చూపిస్తా.. Services | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ :
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం #telugupost #accidentnews #bikeaccident #latestnews
Grand |చారిత్రక వైభవానికి చిరునామా బెల్లంపల్లి స్టేషన్..
Grand | చారిత్రక వైభవానికి చిరునామా బెల్లంపల్లి స్టేషన్.. Grand | బెల్లంపల్లి,
Kalvakuntla Kavitha : హరీశ్ రావుపై మరోసారి కవిత ఫైర్
హరీశ్ రావుపై మరోసారి కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Fake Break Inspector : అతడే ఇతడు
Fake Break Inspector : అతడే ఇతడు ఓ ఏఎస్ఐ ముద్దు బిడ్డ
Schemes |కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి…
Schemes | కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి… ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్….
Gold Eyes |బంగారు కన్నులు సమర్పణ..
Gold Eyes | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని
State |గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
State | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా State | నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ
WOMEN |తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జిగా పద్మ వీరపనేని
WOMEN | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జిగా పద్మ వీరపనేని WOMEN |
Public |గ్రామాభివృద్ధి చేస్తా.. ఉంగరం గుర్తుకు ఓటు వేయండి
Public | గ్రామాభివృద్ధి చేస్తా.. ఉంగరం గుర్తుకు ఓటు వేయండి Public |
ఇండిగో సంక్షోభం పై రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే?
ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు
వెంబడించిన వీధి కుక్కలు.. బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా: జిల్లాలోని రాయచోటి పట్టణంలో దారణం చోటు చేసుకుంది. వీధి కుక్కలు వెంబడించడంతో బైక్ వెళ్తున్న వ్యక్తి మృత్యువాత పడ్డారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపురంలో నివాసముంటున్న ఫజిల్(42) అనే వ్యక్తి గాలివీడు రోడ్డులోని అర్బన్ పోలీస్స్టేషన్ సమీపం నుంచి రాత్రి 3 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో వీధి కుక్కలు ఆయన బైక్ను వెంబడించాయి. కుక్కల నుంచి తప్పించుకునేందుకు ఫజిల్ బైక్ను వేగంగా నడిపారు. దీంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న ఆలయ గోడను ఢీకొని.. అక్కడికక్కడే ప్రాణాలు కో్ల్పోయారు. సమాచారం అందుకున్న రాయచోటి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆవులు, కుక్కలు ఇష్టారీతిన రోడ్ల మీద తిరుగుతున్నా.. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
అభ్యంతరకర పోస్టులు.. ఢిల్లీ హైకోర్టుకు జూ. ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై సోమవారం ఎన్టీఆర్ కోర్టులో పిటిషన్ వేశారు. తన అనుమతి లేకుండా ఫొటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. అనుమతి లేకుండా ఎన్టీఆర్ ఫోటో, పేరును వాడిన సోషల్ మీడియా ఖతాలపై, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఐటీ రూల్స్ 2021 కింద మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు న్యాయస్థానం వాయిదా వేసింది. సినీ సెలబ్రిటీలపై కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అభ్యంతరకర పోస్టులను ఎదుర్కొన్నారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కాగా, దేవర మూవీ తర్వాత తారక్.. ప్రశాంత్ నీల్ తో భారీ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇంటర్ నేషన్ స్థాయిలో ఈ మూవీ ఉండబోతోందని ఇటీవల నిర్మాత వెల్లడించారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. చాలా బక్కగా, గుబురు గడ్డంతో స్టైలీష్ గా కనిపిస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ఈ సినిమా టైటిల్ తోపాటు పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.

12 C