SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

పొంగులేటి స్వగ్రామం ఏకగ్రీవం

రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, నారాయణపురం పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. మూడో విడతలో జరగాల్సిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ లేకుండానే ఫలితం తేలిపోయింది.ఈనెల 9న ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. ఎస్‌సి జనరల్‌కు రిజర్వ్ అయిన ఈ స్థానానికి గ్రామాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా గ్రామ పెద్దలు, అన్ని పార్టీల నాయకులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు ఒకే అభిప్రాయంతో ముందుకొచ్చారు. రాజకీయాలను పక్కనబెట్టి కాంగ్రెస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ ఏకగ్రీవానికి మంత్రి పొంగులేటి సోదరుడు, పార్టీ రాష్ట్ర నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. గ్రామంలోని అన్ని వర్గాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి అభిప్రాయ భేదాలను సర్దుబాటు చేసి ఏకాభిప్రాయాన్ని కల్పించారు. దీంతో పంచాయతీ పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఏర్పడే దిశగా మార్గం సుగమమైంది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వర్లుకు మంత్రి శ్రీనివాసరెడ్డి, అతని సోదరుడు ప్రసాద్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపురం అభివృద్ధి పథంలో ఇది శుభ సూచికమని మంత్రి వ్యాఖ్యానించారు.

మన తెలంగాణ 5 Dec 2025 10:20 pm

మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం నా నైజం కాదు : బున్నె రవి

నిజామాబాద్‌/మోపాల్‌, డిసెంబర్‌ 5 : ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఊరి ప్రజలందరిపై నమ్మకంతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నానని, సుదీర్ఘ అనుభవాన్ని, ఊరి …

జనం సాక్షి 5 Dec 2025 10:17 pm

ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధం: దానం నాగేందర్

 ఎన్నికల్లో పోటీ చేసి, గెలవడం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం హిమాయత్ నగర్ డివిజన్ లో రూ. 1.40 కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై దానం నాగేందర్ స్పందించారు. రాజీనామా ప్రస్థావన ఇంకా రాలేదని, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, ఇప్పటికి 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర తనకి ఉందని చెప్పారు. అనర్హత కేసు అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, తన వైపు నుండి వాదనలు వినిపిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. రైజింగ్ తెలంగాణ కోసం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పవన్, ప్రవీణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి.రామన్ గౌడ్, అశోక్, యాదగిరి, యతితిరాజ్, ప్రభాకర్, నయీమ్, రాజేంద్రప్రసాద్, గణేష్, మన్సూర్, జాకి, సోహెల్, అజార్, ఫారుక్, ఓం ప్రకాష్, జ్ఞాని, నందు, మల్లేష్, సర్ఫరాజ్, శ్రీనాథ్, అశ్విన్, అనీష్, ప్రియ రాజ్, పూర్ణచందర్, రమేష్, బాలకృష్ణ, మహేష్,జ్యోతి రెడ్డి, మాధవి, సుజాత,హమీద్, పాషా, అఖిల్, హాసన్, అభిషేక్, జై కృష్ణ, మోసిన్, శేఖర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 5 Dec 2025 10:10 pm

'సిగ్మా'లో కేథరీన్ స్పెషల్ సాంగ్

విజనరీ సుభాస్కరన్ నేతృత్వంలోని లైకా ప్రొడక్షన్స్... జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్- అడ్వెంచర్ కామెడీ సిగ్మాను తెరకెక్కిస్తోంది. ఇందులో సందీప్ కిషన్ హీరో పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా, మగలక్ష్మి సుదర్శనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక అతిధి పాత్రలు వున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ కేథరీన్ థ్రెసా... సందీప్ కిషన్‌తో కలిసి డ్యాన్స్ చేయనుంది. తమన్ పవర్ ఫుల్ ట్రాక్‌ను కంపోజ్ చేశారు, ఇది సినిమాకి ఒక హైలైట్‌గా ఉంటుందని హామీ ఇస్తుంది. భారీ, కలర్‌ఫుల్ సెట్‌లో చిత్రీకరించబడిన ఈ పాటలో సందీప్ కిషన్, కేథరీన్ థ్రెసా హై-ఎనర్జీ తో స్క్రీన్‌ను ఉర్రూతలూగించనున్నారు. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది.

మన తెలంగాణ 5 Dec 2025 10:00 pm

Birmingham |అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో మంటలు…

అమెరికాలోని బర్మింగ్‌హామ్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు

ప్రభ న్యూస్ 5 Dec 2025 9:56 pm

హోప్ అజేయ శతకం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక వెస్టిండీస్ టీమ్ పోరాడుతోంది. భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే చివరి రోజు విండీస్ మరో 319 పరుగులు చేయాలి. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు చందర్‌పాల్ (6), జాన్ కాంప్‌బెల్ (15) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అథనాజె (5), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (4) కూడా నిరాశ పరిచారు. దీంతో విండీస్ 72 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ దశలోఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను షాప్ హోప్ తనపై వేసుకున్నాడు. అతనికి జస్టిన్ గ్రీవ్ 55(బ్యాటింగ్) అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హోప్ 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా 116 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 466 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది.

మన తెలంగాణ 5 Dec 2025 9:54 pm

AP CM Chandrababu gets invite for Telangana Rising Summit

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu got invited for the Telangana Rising Global Summit. Telangana Roads and Buildings Minister Komatireddy Venkat Reddy visited Amaravati on Friday, to personally invite AP CM for the prestigious event conducted by the Revanth Sarkar. The Revanth Reddy Government is holding Telangana Rising Global Summit – 2025 on a […] The post AP CM Chandrababu gets invite for Telangana Rising Summit appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 9:45 pm

Ambati Rambabu Accuses Chandrababu of Derailing Polavaram

Former minister Ambati Rambabu has accused Chandrababu Naidu of damaging the Polavaram project and reducing it to nothing more than a barrage. Speaking to the media in Tadepalli on Friday, he said that the State government had taken over Polavaram from the Centre only to misuse funds, even though the project was originally mandated to […] The post Ambati Rambabu Accuses Chandrababu of Derailing Polavaram appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 9:26 pm

భార్యను గెలిపిస్తే కటింగ్, షేవింగ్ ఫ్రీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఎన్నో హామీలు ఇస్తున్నారు.

తెలుగు పోస్ట్ 5 Dec 2025 9:26 pm

సర్పంచ్ అభ్యర్థిగా విద్యావంతురాలు…

సదాశివనగర్, ఆంధ్రప్రభ : సమాజ సేవనే లక్ష్యంగా పెట్టుకుని గత ఏడు సంవత్సరాలుగా

ప్రభ న్యూస్ 5 Dec 2025 9:21 pm

గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తా…

ఉట్నూర్, , ఆంధ్ర ప్రభ : ఉట్నూర్, ఆంధ్రప్రభ : లక్కారం పంచాయతీ

ప్రభ న్యూస్ 5 Dec 2025 9:13 pm

బిసి రిజర్వేషన్ల పేరిట సిఎం రేవంత్ చేసిన మోసానికి నిండు ప్రాణం బలైంది: కెటిఆర్

బిసి రిజర్వేషన్ల పేరిట సిఎం రేవంత్ చేసిన దారుణమైన మోసానికి శ్రీసాయి ఈశ్వర్ అనే యువకుడి నిండు ప్రాణం బలైందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడవడాన్ని తట్టుకోలేకే ఈశ్వర్ ఆత్మాహుతి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు కేవలం 17 శాతానికే కుదించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే అని పేర్కొన్నారు. సిఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సాయి ఈశ్వర్ మరణానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కులగణనను మొదలుకుని న్యాయస్థానాల్లో నిలబడని జిఒల దాకా కాంగ్రెస్ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్‌కు సమాధి కట్టిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

మన తెలంగాణ 5 Dec 2025 9:10 pm

Utnur |ఆదరించండి… అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

ఉట్నూర్ , ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా

ప్రభ న్యూస్ 5 Dec 2025 9:04 pm

Tangutur |ఊపందుకుంటున్న బద్దం హరిత కృష్ణారెడ్డి ప్రచారం…

శంకర్‌పల్లి, ఆంధ్రప్రభ : శంకర్‌పల్లి మండలంలోని టంగుటూరు గ్రామంలో బద్దం హరిత కృష్ణారెడ్డి

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:58 pm

జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ. 347 కోట్లు

 జోగులాంబ అమ్మ వారి ఆలయ అభివృద్ధికి రూ. 347 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. తక్షణం బాలాలయం, వజ్ర లేపనం, కుంబాభిషేకం వంటి పనులు ప్రారంభించేందుకు రూ. 35 కోట్లు అవసరం అని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, స్తపతి గోవింద హరి, ఆలయ అభివృద్ధి రూపశిల్పి సూర్యనారాయణ మూర్తి జోగులాంబ ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. త్వరలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కావాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జోగులాంబ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం సిఎం రేవంత్ రెడ్డికి ఉందని, ఈ ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పించాలన్న తపన సిఎంకు ఉందని చిన్నారెడ్డి తెలిపారు. రూ. 347 కోట్ల ప్రణాళికలో మొదటి దశలో రూ. 138.40 కోట్లు, రెండవ దశలో రూ. 117.60 కోట్లు, మూడవ దశలో రూ. 91 కోట్లు అవసరం అని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.

మన తెలంగాణ 5 Dec 2025 8:48 pm

పేదల సొంతింటి కల సాకారం

తిరువూరు, ఆంధ్ర ప్రభ : సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ముఖ్యమంత్రి

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:39 pm

వచ్చే రెండేళ్లు కష్టపడితే… వైసీపీ జెండా ఎగరడం ఖాయం!

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : కూటమి పార్టీలకు ఎందుకు ఓటు వేసామా అన్న

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:34 pm

ఆహ్లాదకర వాతావరణంలో ఎర్త్ సమ్మేట్..

ఆంధ్రప్రభ, విజయవాడ: అహ్మదాబాద్‌లో జరిగిన ఎర్త్ సమ్మిట్–2025లో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు,

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:27 pm

ఎసిబి వలలో డిప్యూటీ తహసీల్దార్

ఆర్‌టిఎ చట్టం కింద సమాచారం ఇవ్వడానికి ఒక రైతును రూ.20 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ ఎసిబి వలలో చిక్కుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన ఎసిబి అధికారులు తెలిపిన ప్రకారం వివరాల్లోకి వెళ్తే..నల్లగొండ జిల్లా, చండూర్ డిప్యూటీ తహసీల్దార్‌గా చంద్రశేఖర్ విధులు నిర్వహిస్తున్నాడు. గట్టుప్పల గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమి తన తండ్రి పేరు మీద నుంచి వేరే వ్యక్తులకి బదిలీ అయ్యింది. ఈ భూమి ఏ విధంగా ఏ సంవత్సరంలో బదిలీ అయ్యిందో తెలపాలని ఆర్టీఐ చట్టం కింద బాధితుడు సమాచారం కోరాడు. అందుకు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ రోజులు గడుపుతున్నాడు.. దీంతో బాధితుడు ఆ అధికారిని నిలదీయగా రూ.20 వేలు లంచం ఇస్తే సమాచారం ఇస్తానని స్పష్టం చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. డిప్యూటీ తహసీల్దార్ చెప్పిన విధంగా సదరు రైతు రూ.20 వేలు నగదు తీసుకొని హైదరాబాద్ బాలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద డిప్యుటీ తహసీల్దార్ ఇంటికి వెళ్లాడు. ఎసిబి అధికారులు పథకం ప్రకారం దాడి చేసి బాధితుడు లంచం డబ్బులు ఇచ్చే సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలిస్తున్నట్టు ఎసిబి అధికారులు తెలిపారు.

మన తెలంగాణ 5 Dec 2025 8:19 pm

ఘనంగా పడమటి అంజన్న పాల ఉట్లు..

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలసిన శ్రీపడమటి

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:18 pm

అధైర్యపడొద్దు.. రాబోయేది మన సర్కారే..: కెసిఆర్

ఎర్రవెల్లి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హవా నడుస్తున్న వేళ.. బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సిఎం కెసిఆర్ సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని కొన్ని కష్ట సమయాలు వస్తాయని, వాటిని తట్టుకొని నిలబడాలని పేర్కొన్నారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని అప్పటివరకూ ప్రజలు అధైర్యపడొద్దని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చేస్తుందని, ప్రజలు ఆశలు పెట్టుకొని ఆగం కావొద్దని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాజీ సిఎం వ్యాఖ్యలు చేశారు.

మన తెలంగాణ 5 Dec 2025 8:17 pm

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ : యార్లగడ్డ

గన్నవరం, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:14 pm

రహదారి భద్రతతోనే స్వర్ణాంధ్ర కల సాకారం…

ఆంధ్రప్రభ, విజయవాడ : 2024తో పోలిస్తే 2025లో ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు,

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:10 pm

Sharwa Joins Sankranthi Battle With NNNM

Charming Star Sharwa officially joins the Sankranthi battle with his upcoming family entertainer Nari Nari Naduma Murari. Despite several major films arriving for Sankranthi, the makers of NNNM are confident enough that the content will appeal to family audiences during the festival holidays. Sharwa himself has an impressive Sankranthi record. His earlier festival outings Shatamanam […] The post Sharwa Joins Sankranthi Battle With NNNM appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 8:07 pm

ఎసిబి వలలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్

అవినీతి నిరోధక శాఖ వలలో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఓ జిల్లా స్థాయి ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎసిబి డిఎస్‌పి సాంబయ్య తెలిపిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ కార్యాలయంలో వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి గత రెండేళ్ల నుంచి అడిషనల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల  హనమకొండ డిఇఓ బదిలీపై వెళ్లడంతో ఇన్చార్జి డిఇఒగా అడిషనల్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖకు సంబంధించి ఒక ఫైల్ క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. వరంగల్ రేంజ్ ఎసిబి డిఎస్‌పి సాంబయ్య ఆధ్వర్యంలో పకడ్బందీగా వల పన్ని శుక్రవారం అదనపు కలెక్టర్, హనుమకొండ ఇన్చార్జి డిఈఓ అయిన వెంకట్‌రెడ్డిని పట్టుకున్నారు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయం కాంప్లెక్స్‌లోని అడిషనల్ కలెక్టర్ ఛాంబర్‌లో ఓ వ్యక్తి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయితే ఎసిబి అధికారులు అదనపు కలెక్టర్‌తో పాటు మరో జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగిని కలెక్టర్ కార్యాలయంలోనే విచారిస్తున్నట్లు తెలిసింది . పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని ఎసిబి డిఎస్‌పి సాంబయ్య తెలిపారు. ఇదిలావుండగా, హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా వెంకటరెడ్డి బాధ్యతల స్వీకరించినప్పటి నుంచి ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి అనేక వివాదాస్పద స్థలాలను ముడుపులు తీసుకొని క్లియర్ చేసినట్లు తెలిసింది.

మన తెలంగాణ 5 Dec 2025 8:06 pm

Record Deal: Netflix Acquires Warner Bros

Top digital giant Netflix has acquired Warner Bros for a record breaking deal of 82.7 Billion USD. They have announced about entering into a definitive agreement under which Netflix will acquire Warner Bros., including its film and television studios, HBO Max and HBO. The cash and stock transactions are valued at $ 27.75 per WBD […] The post Record Deal: Netflix Acquires Warner Bros appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 8:03 pm

Nominations |మూడో విడత చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు

Nominations | మూడో విడత చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు Nominations |

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:02 pm

ఇంటి టెర్రస్ పై గంజాయి మొక్కలు పెంచిన ఇద్దరి అరెస్టు

ఇంటి టెర్రస్‌పై గంజాయి మొక్కలను పెంచిన ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. రెండు మొక్కలు ఆరు మీటర్లు ఎత్తున పెరిగాయి. రెండు గంజాయి మొక్కలు, 55 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన లవకుశ, బీమ్లేష్ ఇద్దరు మలక్‌పేట్‌గంజ్ మిషన్ మార్కెట్ సమీపంలోని ఇంటిలో ఉంటున్నారు. కింద షాపులు ఉండగా పైన బిల్డింగ్‌పై ఉంటూ రెండు గంజాయి మొక్కలను పెంచారు. టెర్రస్‌పై ఆరు నెలల నుంచి గంజాయి మొక్కలను పెంచుతున్నారు, వాటిని ఎపుగా పెరిగిన తర్వాత గంజాయిగా మార్చి విక్రయిస్తున్నారు. ఈ విషయం ఎక్సైజ్ సిబ్బంది తెలియడంతో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది దాడి చేశారు. రెండు గంజాయి చెట్ల నుంచి సుమారు 10 కిలోల గంజాయి దిగుబడిగా వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు. నిందితులను గంజాయి మొక్కలను కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.

మన తెలంగాణ 5 Dec 2025 7:58 pm

Rising Global Summit |రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

Rising Global Summit | రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం Rising Global

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:55 pm

మారేడుమిల్లి నిజనిర్ధారణకు వెళ్లిన విశ్వవిద్యాలయ విద్యార్థులు నిర్భంధం

మారేడుమిల్లి ‘ఎన్‌కౌంటర్’పై నిజ నిర్ధారణకు వెళ్లిన విశ్వవిద్యాలయ విద్యార్థుల అక్రమ నిర్బంధాన్ని ఎపి మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.జగన్నాధరావు, వై.రాజేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో మారేడుమిల్లిలో జరిగిన ‘ఎన్‌కౌంటర్’పై  ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థుల బృందం శుక్రవారం నిజనిర్ధారణ కోసం అక్కడికి వెళ్లిందన్నారు. 12 మంది విద్యార్థులు, జీప్ డ్రైవర్, వారికి సహాయంగా వచ్చిన ఒక ఆదివాసీ యువకుడు మొత్తంగా 14 మందిని ఎలాంటి చట్టబద్ద కారణం లేకుండా ఎపి పోలీసులు అడ్డగించి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధించారని తెలిపారు. ఇది రాజ్యాంగబద్ద హక్కులను కాలరాయడమేనని, ఈ విద్యార్థులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 5 Dec 2025 7:53 pm

BKR Foundation |పాలఉట్లు కొట్టిన వారికి వెండి నగదు బహుకరణ

BKR Foundation | పాలఉట్లు కొట్టిన వారికి వెండి నగదు బహుకరణ BKR

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:47 pm

Pink flag |గులాబీ జెండా రెపరెపలాడించాలి

Pink flag | గులాబీ జెండా రెపరెపలాడించాలి Pink flag | భువనగిరి,

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:41 pm

Development |బాలయ్యపల్లి సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక….

Development | బాలయ్యపల్లి సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక…. Development | రేగొండ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:35 pm

Vehicle inspections |ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు

Vehicle inspections | ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు Vehicle inspections | బెల్లంపల్లి,

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:24 pm

Flag March |ఎన్నికలు శాంతియుతంగా జరిగే దిశగా చర్యలు

Flag March | ఎన్నికలు శాంతియుతంగా జరిగే దిశగా చర్యలు Flag March

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:19 pm

గంభీర్ కీలక నిర్ణయం.. చివరి వన్డే నుంచి ఆ ఇద్దరు ఔట్?

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత బ్యాటర్లు రాణిస్తున్నప్పటికీ.. బౌలర్లు మాత్రం తేలిపోతున్నారు. 340కి పైగా స్కోర్ సాధిస్తే.. తొలి మ్యాచ్‌లో దాన్ని రక్షించుకున్నా.. రెండో మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్ల ధాటికి భారీ స్కోర్‌ను సైతం కాపాడుకోలేకపోతున్నారు. అయితే టెస్ట్ సిరీస్‌లో వైఫల్యం, రెండో వన్డే మ్యాచ్ ఓటమి నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన కీలక వన్డే మ్యాచ్‌లో తుది జట్టు నుంచి ఓ ఇద్దరు ఆటగాళ్లపై వేటు వేయాలని గంభీర్ అండ్ కో నిర్ణయం తీసుకుందట. ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. తొలి వన్డేలో 13 పరుగులు, రెండో వన్డేలో కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతడిని పక్కన పెట్టి.. స్పెషలిస్ట్ బ్యాటర్‌గా రిషబ్ పంత్‌ కానీ, తిలక్‌ వర్మను కానీ జట్టులోకి తీసుకుంటారని టాక్. ఇక బౌలర్‌ ప్రశిద్ధ్ కృష్ణను కూడా జట్టు నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. అతడి స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారట. నితీశ్‌ని జట్టులోకి తీసుకుంటే.. బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్‌ బౌలింగ్ కూడా చేయగలడు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

మన తెలంగాణ 5 Dec 2025 7:15 pm

Car collision |రోడ్డు ప్రమాదం…

Car collision | రోడ్డు ప్రమాదం… Car collision | కరీమాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:13 pm

KCR : కేసీఆర్ కీలక ప్రకటన.. ఆగం కావద్దంటూ?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.

తెలుగు పోస్ట్ 5 Dec 2025 7:12 pm

డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏఐ ఎక్స్ లెన్స్ సెంటర్

 ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వం శుక్రవారం కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే ఈ తరహా నైపుణ్య శిక్షణ కేంద్రం (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్) మొట్టమొదటిది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యా మంత్రి జూలియన్ హిల్ తో కలిసి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల బాబు ఎంఓయు వివరాలను వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను నెలకొల్పనున్నట్టు శ్రీధర్ బాబు తెలిపారు. డీకిన్ అప్లయిడ్ ఆర్టిఫిషియల్ ఇన్‌స్టిట్యూట్ ఈ ఎక్సెలెన్స్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తుందని ఆయన వివరించారు. కాలేజీల నుంచి అకడమిక్ గ్రాడ్యుయేట్లను కాకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో కూడిన ప్రతిభావంతులను తయారు చేయాలన్న లక్ష్యంతోనే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకురావడానికి సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఒప్పందం జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాలన, ఆరోగ్యం, విద్య, ఐటీ, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ రంగాల్లో పరిశోధన, నైఫుణ్య శిక్షణ అందజేయడానికి ఈ సెంటర్ ఎక్స్ లెన్స్ ఉపయోగపడుతుంది. డిజిటల్ ఇండియా భవిష్యత్తుకు తెలంగాణా ముఖ ద్వారం కానుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో కూడా నైపుణ్య శిక్షణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాను సందర్శించిన సందర్భంగా డీకిన్ యూనివర్సిటీని రాష్ట్రంలో క్యాంపస్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించాం. తెలంగాణాలో నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన ఎకో సిస్టం ఉంది. దీనికి ఈ ఎక్స్ లెన్స్ సెంటర్ సేవలు మరింత ఉపయోగపడతాయి. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వృత్తి నిపుణులకు తమ దేశంలో ఉన్నత స్థాయి నైపుణ్యాల్లో శిక్షణ అందించడానికి కూడా ఆస్ట్రేలియా అంగీకరించింది. ఎంఓయు కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు ఐ. సాయిక్రిష్ణ, ఆస్ట్రేలియా ప్రతినిధులు క్యామ్ గ్రీన్, కరేన్ సాండర్ కాక్, నథానియెల్ వెబ్, స్టీవెన్ బిడిల్, హిల్లరీ మెక్ గీచి, స్టీవెన్ కానోలీ, విక్రం సింగ్, ఐటీ శాఖ చీఫ్ స్ట్రాటెజిస్ట్ శ్రీకాంత్ లంకా తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 5 Dec 2025 6:59 pm

Ward Member |ఇల్లందకుంట అభివృద్ధికి కృషి చేస్తా..

Ward Member | ఇల్లందకుంట అభివృద్ధికి కృషి చేస్తా.. Ward Member |

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:59 pm

Revanth Reddy |వరంగల్ కు సీఎం రేవంత్ వరాలు…

Revanth Reddy | వరంగల్ కు సీఎం రేవంత్ వరాలు… తెలంగాణ ముఖ్యమంత్రి

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:58 pm

రూట్ మ్యాప్ చూపించే బడ్జెట్ స్మార్ట్ వాచ్: boAt Lunar Discovery రివ్యూ, ఫీచర్లు

బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా? కేవలం టైమ్ చూసుకోవడానికే కాకుండా, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు నావిగేషన్ చూపించే వాచ్ అయితే బాగుంటుందని అనిపిస్తోందా? అయితే మీ కోసమే మార్కెట్లోకి వచ్చింది boAt Lunar Discovery. తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లు ఇవ్వడం నిజంగా సాహసమే. ఈ వాచ్ డిజైన్, పనితీరు, బ్యాటరీ లైఫ్ ఎలా ఉన్నాయి? ఇది మీకు ఎంతవరకు అవసరం? పూర్తి వివరాలు ఈ రివ్యూలో చూద్దాం. డిజైన్, డిస్‌ప్లే:ఎండలో కూడా […] The post రూట్ మ్యాప్ చూపించే బడ్జెట్ స్మార్ట్ వాచ్: boAt Lunar Discovery రివ్యూ, ఫీచర్లు appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 5 Dec 2025 6:57 pm

‘అఖండ-2’ రిలీజ్ వాయిదా.. తమన్ పోస్ట్ వైరల్

బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ-2’. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 5) విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని అనుకొని కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ‘అఖండ-2’ విడుదల వాయిదా పడిన వేళ.. సంగీత దర్శకుడు తమన్ ఎక్స్ సోషల్‌మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మథుర నుంచి మిశ్రా సోదరులు (పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా) శ్లోకాలు పాడుతున్న వీడియోని తమన్ షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు సినిమా విడుదలకు మార్గం సుగమం అయిందని కామెంట్లు చేస్తుండగా.. రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పాలని మరికొందరు అడుగుతున్నారు. బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఐదో చిత్రం ‘అఖండ-2’ కావడం విశేషం. బాలకృష్ణ 111వ చిత్రానికి కూడా తమనే సంగీతం అందిస్తున్నారు. దీంతో ఇది డబుల్ హ్యాట్రిక్ కాంబినేషన్ కానుంది. కాగా, మిశ్రా సోదరులు అఖండ-2 చిత్రం కోసం పని చేశారు. Thanks guruji ☀️ #Mishra Brothers ji All the Way from #Mathura #Akhanda2Thaandavam #JaiBalayya pic.twitter.com/cD93QRBS6x — thaman S (@MusicThaman) December 5, 2025

మన తెలంగాణ 5 Dec 2025 6:55 pm

పాన్ మసాలా తయారీ యునిట్లపై సెస్సు బిల్లును ఆమోదించిన లోక్ సభ

న్యూఢిల్లీ పాన్ మసాలా తయారీ యునిట్లపై సెస్సు విధించడానికి సంబంధించిన బిల్లును లోక్ సభ శుక్రవారం నాడు ఆమోదించింది. ఈ సెస్సు ద్వారా సేకరించే నిధిని జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ప్రజారోగ్యాన్ని మెరుగు పరచడానికి వినియోగిస్తారు. ఆరోగ్య భద్రత, జాతీయ భద్రతా సెస్సు బిల్లు 2025 పై జరిగిన చర్చకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ప్రజారోగ్యం రాష్ట్రం అంశం కాబట్టి సెస్సును రాష్ట్రాలతో పంచుకుంటామని అన్నారు. మూజువాణి ఓటుతో బిల్లును లోక్ సభ ఆమోదించింది. జాతీయ ప్రాముఖ్యం కలిగిన ఆరోగ్యం, జాతీయ భద్రతకు అవసరమైన ఆర్థికవనరుల కల్పనే ఈ బిల్లు ఉద్దేశ్యం అని నిర్మలా సీతారామన్ అన్నారు. పాన్ మసాలా, దాని వినియోగం పై గరిష్టంగా జిఎస్టీ కింద 40 శాతం పన్ను విధిస్తున్నారు. ఈ సెస్ విధఇంచడం వల్ల జిఎస్టీ ఆదాయం ఏమాత్రం తగ్గబోదని కేంద్రమంత్రి తెలిపారు.

మన తెలంగాణ 5 Dec 2025 6:55 pm

TG MRS School |విద్యార్థులు కనబడుట లేదు….

TG MRS School | విద్యార్థులు కనబడుట లేదు…. TG MRS School

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:54 pm

MLA |గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను

MLA | గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను MLA | నవాబుపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:33 pm

Check Post |చెక్ పోస్ట్ తనిఖీ…

Check Post | చెక్ పోస్ట్ తనిఖీ… Check Post | నాగర్

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:27 pm

OTT Options for this Weekend

A number of options are available for the audience on the digital space this weekend. Telugu films like The Girlfriend, Jatadhara, The Great Pre-Wedding Show are streaming this weekend. Rashmika’s Hindi film Thamma is streaming on a rental basis on Prime Video. Malayalam film Dies Irae is streaming on Jio Plus Hotstar. Here are the […] The post OTT Options for this Weekend appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 6:27 pm

Andhra Pradesh : ఏపీలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్' కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి

తెలుగు పోస్ట్ 5 Dec 2025 6:23 pm

2,500 Drones |డ్రోన్ షోలు కాదు.. డొక్కలు నింపే విధానం రావాలి

2,500 Drones | డ్రోన్ షోలు కాదు.. డొక్కలు నింపే విధానం రావాలి

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:21 pm

One more Sequel Scrapped

Vijay Deverakonda has allocated much time for Kingdom and the makers have spent lavishly on this action drama. Jersey fame Gowtam Tinnanuri is the director and the makers also announced that the film has a second part. A portion of the shoot for the second part too has been completed even before the release of […] The post One more Sequel Scrapped appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 6:21 pm

development villagers |ఎల్లవేళలా అందుబాటులో ఉంటా

development villagers | ఎల్లవేళలా అందుబాటులో ఉంటా development villagers | మంథని,

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:15 pm

భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలివే

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి

తెలుగు పోస్ట్ 5 Dec 2025 6:11 pm

local elections |గ్రామ పాలకులం కాదు…. గ్రామ సేవకులం

local elections | గ్రామ పాలకులం కాదు…. గ్రామ సేవకులం local elections

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:09 pm

‘పుష్ప-2’ టికెట్ల కోసం కుస్తీ పట్టారు..

హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప-2’. గతేడాది విడుదలైన ఈ సినిమా గ్రాండ్ సక్పెస్‌ను సాధించింది. అయితే సినిమా విడుదలై ఏడాది పూర్తవుతున్న సమయంలో మరోసారి ప్రత్యేక షోలో ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోని మరోసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు బారులు తీరారు. బాలనగర్లలోని విమల్ థియేటర్‌లో ‘పుష్ప-2’ ప్రీమియర్ షో వేశారు. అయితే అయితే ఈ షో టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయానికి ఉంచారు. కేవలం సింగిల్ షో కావడంతో మరోసారి అభిమానులు బిగ్ స్క్రీన్ పై అల్లు అర్జున్ నట విశ్వరూపం చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో టికెట్ల కోసం ఫ్యాన్స్‌ కొట్టుకున్నట్లు తెలుస్తోంది. కొందరికి మాత్రమే టికెట్స్ దక్కడంతో మరికొందరు ఫ్యాన్స్ గొడవకు దిగారు. కొందరు ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్‌ ఏకంగా కర్రలతో దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మన తెలంగాణ 5 Dec 2025 6:08 pm

Bala Sadanam |చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ అనుబంధం

Bala Sadanam | చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ అనుబంధం Bala Sadanam |

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:07 pm

Sai Reddy |అభివృద్ధి కోసం మరొక్కసారి గెలిపించండి

Sai Reddy | అభివృద్ధి కోసం మరొక్కసారి గెలిపించండి Sai Reddy |

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:06 pm

IndiGo |ఇండిగో కష్టాలు మరో 3-4 రోజులు…

IndiGo | ఇండిగో కష్టాలు మరో 3-4 రోజులు… ఆంధ్రప్రభ : దేశీయ

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:02 pm

BC Reservation |పోరాటాల ద్వారా నే మన హక్కుల్ని సాధించుకువాలి….

BC Reservation | పోరాటాల ద్వారా నే మన హక్కుల్ని సాధించుకువాలి…. BC

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:00 pm

Exclusive Interview with Hero Shree Nandu & Actress Yamini Bhaskar

The post Exclusive Interview with Hero Shree Nandu & Actress Yamini Bhaskar appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 5:50 pm

Akhanda 2 Release: So Many Challenges

Akhanda 2 has hit a roadblock and the makers are trying hard to clear all the financial hurdles. The makers are expected to make an official announcement soon. Though there are reports that the film will be released tomorrow, the tougher part is overseas. The entire shows for the first weekend across the USA and […] The post Akhanda 2 Release: So Many Challenges appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 5:47 pm

Cyber Crime : మీ చేతిలో ఫోన్ తో జాగ్రత్త.. క్షణాల్లో లక్షలు ఆవరవుతాయ్..తస్మాత్ జాగ్రత్త

సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ట్రేడింగ్ యాప్ పేరిట మోసాలు చేస్తున్నారు

తెలుగు పోస్ట్ 5 Dec 2025 5:43 pm

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఉచితంగా న్యాయం

సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు విశాలాంధ్ర -ధర్మవరం : దివ్యాంగుల సమస్యల పరిష్కారం కొరకు కోర్టు దూరంగా చట్టపరంగా ఉచితంగా న్యాయం చేకూర్చబడునని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని పోతుకుంట గ్రామంలో గల ఆర్డిటి స్కూల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా దివ్యాంగులకు వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, చక్కటి చదువుకు […] The post దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఉచితంగా న్యాయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 5:32 pm

ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య

జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ విశాలాంధ్ర ధర్మవరం;; నేటి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్యను అందిస్తోందని, ఉపాధ్యాయులు సమన్వయంతో తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేసీతో పాటు స్థానిక ఆర్డివో మహేష్, మండల విద్యాశాఖ అధికారి -1 రాజేశ్వరి […] The post ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 5:27 pm

MPDO |నామినేషన్ సెంటర్ల పరిశీలన

MPDO | నామినేషన్ సెంటర్ల పరిశీలన MPDO | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Dec 2025 5:27 pm

MLA |లోకేష్ చొరవతో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు

MLA | లోకేష్ చొరవతో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు MLA | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 5 Dec 2025 5:26 pm

election rules |ఎన్నికల నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి.

election rules | ఎన్నికల నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి. election rules

ప్రభ న్యూస్ 5 Dec 2025 5:23 pm

Youth |అభివృద్ధికే పట్టం కట్టాలి

Youth | అభివృద్ధికే పట్టం కట్టాలి Youth | షాద్ నగర్, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 5 Dec 2025 5:22 pm

Indigo : ఇండిగో..గో..గో.. కేంద్ర ప్రభుత్వం సీరియస్

ఇండిగో విమాన సర్వీసులు రద్దును కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

తెలుగు పోస్ట్ 5 Dec 2025 5:21 pm

ప్రాజెక్ట్ వర్క్ ప్రదర్శనను పరిశీలించిన డైట్ ప్రిన్సిపాల్,ఎంఈఓ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శాంతినగర్ లో గల పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ బేస్ లైన్ అసైన్మెంట్ లో భాగంగా ఎంఈఓ రాజేశ్వరి దేవి డైట్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ డైట్ లెక్చరర్ మేరీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్టు వర్కుల్ని ప్రదర్శించిన తీరు పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రశ్నలను అడిగి వారితో సమాధానాలు కూడా రాబట్టారు. అలాగే మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 విద్యార్థులు యొక్క కృషిని […] The post ప్రాజెక్ట్ వర్క్ ప్రదర్శనను పరిశీలించిన డైట్ ప్రిన్సిపాల్,ఎంఈఓ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 5:16 pm

సాగుకు ఉచిత కరెంటుపై పేటెంట్ హక్కు ఉన్నది కాంగ్రెస్ కు మాత్రమే : రేవంత్

హైదరాబాద్: మీ ఓటును ఆయుధంగా మార్చి గడీల పాననను కూల్చారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తవుతుందని అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో సిఎం రేవంత్ పర్యటించారు. రూ.532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు, రూ.200 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వరంగల్ గడ్డకు చెందిన ఎందరో వీరులు తమ పరాక్రమాన్ని ప్రపంచానికి చూపారని, కాకతీయ యూనివర్శిటీ పోరాటాలు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని తెలియజేశారు. తెలంగాణ వస్తే.. సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ జిల్లా ప్రజలు కూడా ఆశించారని, కుర్చీలో కూర్చున్న వారి ఆస్తులు పెరిగాయి.. కానీ ప్రజల జీవితాలు మారలేదని విమర్శించారు. వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని ఆనాటి మాజీ సిఎం కెసిఆర్ అన్నారని, కాంగ్రెస్ వస్తే.. కరెంటు ఉండదని, ఆనాటి సిఎం ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం మాత్రం.. రైతు పండించిన చివరి గింజ వరకు కొంటోందని, కాంగ్రెస్ వస్తే.. రైతుబంధు బంద్ అవుతుందని ప్రజలను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక.. రాష్ట్రాన్ని దోచుకున్న వారి పవర్ మాత్రమే కట్ అయిందని సిఎం పేర్కొన్నారు. సాగుకు ఉచిత కరెంటుపై పేటెంట్ హక్కు ఉన్నది కాంగ్రెస్ కు మాత్రమేనని కొనియాడారు. గత సీజన్ లో 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లను రైతు భరోసా కింద ఇచ్చామని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీని 9 ఏళ్లపాటు సాగదీయడంతో అప్పుడు ఇచ్చిన డబ్బులు వడ్డీలకే సరిపోలేదని అన్నారు. సన్న వడ్లకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తున్నామని, గత ప్రభుత్వం పదేళ్లపాటు పేదలకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రేషన్ కార్డుల్లో కొత్తవారి మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం ఇప్పటికే 1.10 కోట్ల కొత్త రేషన్ కార్డులను ఇచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం పేదవాడి ఆకలిని తీర్చలేదని, మిల్లర్లు, దళారులు దొడ్డు బియ్యాన్ని ప్రాసెసింగ్ చేశారని.. వాళ్లే లాభపడ్డారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇచ్చి పేదల ఆకలితీరుస్తోందని రేవంత్ స్పష్టం చేశారు.

మన తెలంగాణ 5 Dec 2025 5:16 pm

కారులో భారీగా హవాలా డబ్బు లభ్యం

హైదరాబాద్:  హవాలా మార్గంలో కారులో తరలిస్తున్న భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు. శామీర్‌పేటలో పక్కా సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు ఓ కారులో టైర్లు, సీట్ల కింద దాచిన రూ.4 కోట్ల నగదును బోయిన్‌పల్లి క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా కేసులో 2024లో ఓ వ్యక్తి పరారయ్యాడు. శుక్రవారం ఆ వ్యక్తి భారీ మొత్తంలో నగదుతో నిజామాబాద్ నుంచి వస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు శామీర్‌పేట ఔటర్ రింగ్‌ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని, హవాలాలో తరలిస్తున్న నగదును సీజ్ చేశారు.

మన తెలంగాణ 5 Dec 2025 5:16 pm

Nomination |ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా..

Nomination | ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. Nomination | ఇల్లందకుంట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Dec 2025 5:15 pm

మున్సిపల్ కార్మికులకు రగ్గుల పంపిణీ…

తొర్లికొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ… విశాలాంధ్ర నందిగామ:-తొర్లికొండ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ్గ కార్యక్రమముగా మున్సిపల్ కమిషనర్ చైర్మన్ అన్నారు శుక్రవారం స్థానిక బాబు జగజ్జీవన్ రామ్ భవన్ లో తొర్లికొండ ట్రస్ట్ ద్వారా మున్సిపల్ కార్మికులకు 150 మందికి 150 రగ్గుల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ట్రస్టు ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకొని కొనియాడారు ప్రతి ఒక్కరు కూడా […] The post మున్సిపల్ కార్మికులకు రగ్గుల పంపిణీ… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 5:11 pm

local body elections |మరోసారి సర్పంచ్ బరిలో పోగుల దంపతులు….

local body elections | మరోసారి సర్పంచ్ బరిలో పోగుల దంపతులు…. local

ప్రభ న్యూస్ 5 Dec 2025 5:09 pm

Vote For |అభివృద్ధికి పట్టం కట్టండి

Vote For | అభివృద్ధికి పట్టం కట్టండి Vote For | షాద్

ప్రభ న్యూస్ 5 Dec 2025 5:05 pm

VOTE |కల్లబొల్లి మాటలు నమ్మకండి

VOTE | కల్లబొల్లి మాటలు నమ్మకండి VOTE | షాద్ నగర్, ఆంధ్ర‌

ప్రభ న్యూస్ 5 Dec 2025 5:01 pm

Election campaign |ఆదర్శంగా తీర్చిదిద్దుతా …

Election campaign | ఆదర్శంగా తీర్చిదిద్దుతా … Election campaign | షాద్

ప్రభ న్యూస్ 5 Dec 2025 5:01 pm

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా): ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘాల దేవి పేర్కొన్నారు. పరింపూడి ఎంపీపీ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల ను రాష్ట్ర కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు సకల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని ఆమె తెలిపారు. […] The post విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 4:56 pm

Kadiyam Kavya |మహిళ, శిశు అభ్యున్నతిపై ఫోకస్ చేయండి

Kadiyam Kavya | మహిళ, శిశు అభ్యున్నతిపై ఫోకస్ చేయండి Kadiyam Kavya

ప్రభ న్యూస్ 5 Dec 2025 4:53 pm

ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఇంచార్జి ఆర్ఎంఓగా హేమలత

విశాలాంధ్ర- అనంతపురం : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఇంచార్జి ఆర్ఎంఓగా డాక్టర్ హేమలత నియమితులయ్యారు. ఈ వైద్యశాల పర్యవేక్షకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం గురువారం నియామక ఉత్తర్వు జారీ చేశారు. మొన్నటి దాకా ఆర్ ఎంఓగా పనిచేసిన డాక్టర్ రామకృష్ణ గత నెలలో పదవీ విరమణ పొందడం జరిగింది. ఆయన స్థానంలోకి ప్రస్తుత ఉప ఆర్ఎంఓ డాక్టర్ హేమలతకు ఇంచార్జి ఆర్ ఎం ఒ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పలువురు శుక్రవారం ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి […] The post ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఇంచార్జి ఆర్ఎంఓగా హేమలత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 4:52 pm

రెండేళ్ల బాలుడిపై వీధికుక్క దాడికి యత్నం..

హైదరాబాద్: చిన్నారులపై వీధికుక్కలు దాడులు చేస్తున్న కేసులు తరచూ జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఓ మూగ బాలుడిపై వీధికుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలుడు వీధి కుక్క దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. యూసుఫ్‌గూడలో రెండేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడికి యత్నించింది. లక్ష్మీనరసింహనగర్‌లో మన్వీత్ నందన్ ఇంటి ముందు ఆడుకుంటుండగా.. బాలుడిపైకి వీధి కుక్క దూసుకెళ్లింది. చిన్నారిని కరిచే ప్రయత్నం చేసింది. అయితే అక్కడే ఉన్న బాలుడి తాత ఇది గమనించి కర్రతో కొట్టడంతో వీధి కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో చిన్నారికి పెను ప్రమాదం తప్పింది. 

మన తెలంగాణ 5 Dec 2025 4:48 pm

ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ ఇచ్చారనే వార్తలపై సైబర్ క్రైమ్ డీసీపీ స్పందన

ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ చేశారంటూ ప్రచారం ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికి పోలీసులు ఉద్యోగం ఆఫర్ చేశారంటూ వస్తున్న వార్తలను సైబర్ క్రైమ్ పోలీసులు ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు స్పష్టం చేశారు. ఇటీవల రవిని విచారించినప్పుడు అతనికి జాబ్ ఆఫర్ చేశారని, దాన్ని అతను తిరస్కరించాడని వచ్చిన కథనాలను ఆయన కొట్టిపారేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎనిమిది రోజుల […] The post ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ ఇచ్చారనే వార్తలపై సైబర్ క్రైమ్ డీసీపీ స్పందన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 4:40 pm

Mega Parent Teacher Meeting 3.0 Begins Across Andhra Pradesh

The Andhra Pradesh government held its ambitious Mega Parent Teacher Meeting 3.0 today across the state. More than forty five thousand government, aided, and unaided schools participated in the initiative, making it one of the largest parent engagement drives in recent years. As part of the program, Chief Minister Chandrababu Naidu and Education Minister Lokesh […] The post Mega Parent Teacher Meeting 3.0 Begins Across Andhra Pradesh appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 4:29 pm