160 Additional |సెకండియర్ ఇంప్రూవెమెంట్ ఫీజు ఎంతంటే?
160 Additional | సెకండియర్ ఇంప్రూవెమెంట్ ఫీజు ఎంతంటే? 160 Additional |
కేసీఆర్ ను కలిసిన మాజీ మంత్రి పువ్వాడ
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తన పుట్టినరోజు సందర్భంగా
పెడనలో ఘనంగా గౌతు లచ్చన్న 20వ వర్ధంతి
పెడన, ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం తోటమూలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్
Nagabandham’s Sura Sura: Visual Extravaganza
Nagabandham is steadily turning heads as it marches toward its grand theatrical release on July 3rd. Directed by Abhishek Nama and backed by NIK Studios, the Virat Karrna starrer is building strong anticipation with each promotional step. The makers have now dropped the second single, Sura Sura, and it arrives like a burst of celebration. […] The post Nagabandham’s Sura Sura: Visual Extravaganza appeared first on Telugu360 .
IPL Ticket Row: Kushita Kallapu Post Raises Questions Around Revanth Reddy
The excitement of the Indian Premier League has now entered Telangana politics. A recent match between Sunrisers Hyderabad and Chennai Super Kings at the Rajiv Gandhi International Cricket Stadium has sparked a fresh controversy online. The issue began when influencer Kushita Kallapu shared a photo of her match tickets on Instagram. The tickets clearly mentioned […] The post IPL Ticket Row: Kushita Kallapu Post Raises Questions Around Revanth Reddy appeared first on Telugu360 .
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు
ఘంటసాల, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని
19thAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
19thAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’ 19thAprilCartoon ట్రంప్ వ్యాఖ్యలపై వ్యంగ్య ప్రతిబింబంబెదిరింపుల
అక్కడ అంతకు మించి స్పీడు వద్దు..
అక్కడ అంతకు మించి స్పీడు వద్దు.. కడెం, ఆదిలాబాద్ జిల్లా : కవ్వాల్
విద్యాపీఠంలో 20న ఆద్యశిల మహోత్సవం
విద్యాపీఠంలో 20న ఆద్యశిల మహోత్సవం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మండలం
Chandrababu : తమిళనాడు ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు
తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు
Registration |రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్లలో గందరగోళం
Registration | రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్లలో గందరగోళం Registration | పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు
పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా
పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు
అమెరికా వెంట ఇజ్రాయెల్ నిలిచింది: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాకు..ఇజ్రాయెల్ గొప్ప మిత్రదేశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్ణించారు. ఇజ్రాయెల్ ను ప్రశంసలతో ట్రంప్ ముంచెత్తారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సంఘర్షణలో కొన్ని దేశాలు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టాయని, ఇతర దేశాల మాదిరి కాకుండా అమెరికా వెంట ఇజ్రాయెల్ నిలిచిందని తెలియజేశారు. ఇజ్రాయెలీలు ధైర్యవంతులు, సాహసవంతులు, విధేయులు, తెలివైనవారని కొనియాడారు. ఇజ్రాయెల్ గట్టిగా పోరాడుతుందని..ఎలా గెలవాలో వారికి తెలుసు అని ట్రంప్ పేర్కొన్నారు.
భార్య కోసం కూల్డ్రింక్లో గడ్డిమందు కలిపి పిల్లలకు తాగించి
అమరావతి: భార్య కాపురానికి రావడంతో లేదని కూల్డ్రింక్లో గడ్డి మందు కలిపి ఇద్దరు పిల్లలకు తాగించి అనంతరం తండ్రి తాగాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... గంగుపల్లితండాలో దంపతులు మధ్య గొడవ జరగడంతో పిల్లలను వదిలేసి భార్య వెళ్లిపోయింది. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో భర్త కుంగిపోయాడు. కుల్డ్రింక్లో గడ్డి మందు కలిపాడు. అనంతరం ఇద్దరు పిల్లలకు తాగించి తాను తాగాడు. వెంటనే స్థానికులు గుర్తించి వారిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద లారీ బోల్తా #Nizamabad #LorryAccident #Indalvai
Shouryuv made an impressive debut with Hi Nanna featuring Nani. The emotional entertainer impressed the audience. Shouryuv penned a script and pitched the idea to top actor NTR after the release of Hi Nanna. NTR was quite interested to take up the film but he had several commitments and Shouryuv was kept in waiting mode. […] The post Did VD pick up NTR’s Project? appeared first on Telugu360 .
కొండపల్లి బొమ్మల పండుగకు మంత్రి దుర్గేష్
కొండపల్లి బొమ్మల పండుగకు మంత్రి దుర్గేష్ ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి బొమ్మల
Three Releases for Suriya in 2026
Post pandemic, none of the films of Suriya performed well in theatres. Soorarai Pottru and Jai Bhim received exceptional response but they had a direct digital release. The actor has three films lined up and all these three films will release in a gap of six months in 2026. He is done with the shoot […] The post Three Releases for Suriya in 2026 appeared first on Telugu360 .
అటవీ ప్రాంతంలో ఆగిన రైలులో నుండి ప్యాసెంజర్ ను చిరుత లాక్కుని వెళ్లిందా? #FakeVideo #FactCheck
వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ముగ్గురు మృతి
హైదరాబాద్: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన తల్లి, నాలుగేళ్ల కుమారుడిగా గుర్తించారు. యాదిగిరిగుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామ పరిధిలో ద్విచక్రవాహనం, ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందాడు. బైక్ పైనుంచి కిందపడడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. మరో ముగ్గురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మిద్దె వెంకటేశ్వర్లుకు ‘దళిత రత్న’ పురస్కారం..
మిద్దె వెంకటేశ్వర్లుకు ‘దళిత రత్న’ పురస్కారం.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, ఆంధ్రప్రభ :
Injuries and Surgeries for Mega Heroes in 2026
2026 started on a grand note for Mega family after Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu ended up as one of the biggest blockbusters of Telugu cinema. Soon, Megastar took a break and he underwent shoulder surgery. He took rest and is back to work recently. Ram Charan suffered a small injury on the sets […] The post Injuries and Surgeries for Mega Heroes in 2026 appeared first on Telugu360 .
అభివృద్ధి పనులను అడ్డుకుంటే.. కుభీర్, ఆంధ్రప్రభ : మండలంలో జరిగే అభివృద్ధి పనులను
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్... రైటర్-, డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి ’గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. తాజాగా మేకర్స్ జింగాలా సాంగ్ రిలీజ్ చేశారు. గాయపడ్డ సింహం (తరుణ్ భాస్కర్ ) మనసులో దాగి ఉన్న బాధను, ఆవేశాన్ని, తిరిగి లేచే శక్తిని అద్భుతంగా ఆవిష్కరించే పాట ఇది. స్వీకర్ అగస్తి సంగీతం ఈ పాటకు ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీని అందించగా, నకాష్ అజీజ్ గాత్రం మరింత ఎనర్జీ ఇచ్చింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Train Journey : రైలు ప్రయాణమంటేనే హడల్.. మెడలో బంగారం ఉందా?
రైళ్లలో దోపిడీలు, దొంగతనాలు ఎక్కువవుతున్నాయి
మైహోం పరిశ్రమలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు..
మైహోం పరిశ్రమలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు.. మేళ్లచెరువు, ఆంధ్రప్రభ : జాతీయ అగ్నిమాపక
తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు
తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు హుజూర్నగర్, ఆంధ్రప్రభ : హుజూర్నగర్ మున్సిపల్
నేడు తెరుచుకోనున్న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు
ఈరోజు చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది.
Women’s Bill Fallout: How Modi Flipped a Setback Into a Narrative Win
Prime Minister Narendra Modi’s address to the nation after the defeat of the Constitution (131st Amendment) Bill and the Delimitation Bill was not just a response to a legislative setback. It looked like a carefully planned political move. On the surface, the government failed to secure the numbers needed to pass a major constitutional reform […] The post Women’s Bill Fallout: How Modi Flipped a Setback Into a Narrative Win appeared first on Telugu360 .
కరీంనగర్ మేయర్ ను కలిసిన బిజెవైయం నాయకుడు శరత్ కుమార్
కరీంనగర్ మేయర్ ను కలిసిన బిజెవైయం నాయకుడు శరత్ కుమార్ స్టేషన్ ఘన్
మహాత్మ బసవేశ్వరుని తత్వాలు.. డోంగ్లి, ఆంధ్రప్రభ : కుల,లింగ,వర్ణ విభేదాలను వ్యతిరేకించిన మహాత్మా
విజయసాయిరెడ్డి అమరావతి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు
యువ బౌలర్లు ప్లాన్ వేసి గెలిపించారు: ఇషాన్ కిషన్
హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. సిఎస్కెపై ఎస్ఆర్హెచ్ పది పరుగుల తేడాతో గెలుపొందింది. ఎస్ఆర్హెచ్ బౌలర్ ఇసాన్ మలింగ కీలకమైన మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మలింగకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మీడియాతో మాట్లాడారు. ఈ మ్యాచ్లో కనీసం తాము 20 నుంచి 40 పరుగులు చేయాల్సి ఉందని తెలిపారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేసినప్పుడు 230 పరుగులు చేస్తామని ధీమా వచ్చిందని, ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేటలో వెనకబడిపోయామని వివరించారు. తమ టీమ్లో ముగ్గురు బ్యాటర్ లలో ఒకరు భారీ స్కోర్ చేస్తే కచ్చితంగా గెలుస్తామన్నారు. యువ బౌలర్లు బాధ్యత తీసుకొని ముందడుగు వేశారని ప్రశంసించారు. యువ బౌలర్లు ఫీల్డింగ్ సెట్ చేసుకొని బౌలింగ్ వేసి ఫలితం రాబట్టారని కొనియాడారు. కుర్రాళ్లు ప్లాన్ వేసి మ్యాచ్ను గెలిపించడంతో తన సంతోషానికి అవధులు లేకుండాపోయాయన్నారు. యువ బౌలర్లపై నమ్మకం పెడితే అద్భుతాలు చేసి నిరూపించారని ఇషాన్ మెచ్చుకున్నారు. హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉందని, ఇలాంటి పిచ్పై తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని తెలియజేశారు. ఒక్కో మ్యాచ్ గెలవడంపైనే దృష్టి పెట్టామని, పాయింట్ల పట్టిక గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని ఇషాన్ పేర్కొన్నారు. షాట్ల ఎంపికలో కొన్ని తప్పిదాలు చేశామని, తాము నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని ఇషాన్ పేర్కొన్నారు.
ప్రథమ భూదాత వెదిరే రామచంద్రారెడ్డి ఆదర్శనీయుడు
ప్రథమ భూదాత వెదిరే రామచంద్రారెడ్డి ఆదర్శనీయుడు చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಬಾಲ್ಕನಿಯಿಂದ ಬೀಳುತ್ತಿದ್ದ ಮಗುವನ್ನು ಕೋತಿಯೊಂದು ರಕ್ಷಿಸಿತು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಬಾಲ್ಕನಿಯಿಂದ ಬೀಳುತ್ತಿದ್ದ ಮಗುವನ್ನು ಕೋತಿಯೊಂದು ರಕ್ಷಿಸಿತು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
అలా జరగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం..
అలా జరగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం.. వికారాబాద్, ఆంధ్రప్రభ : చట్టసభల్లో మహిళా
Gold Price Today : బంగారం ధరలు ఈరోజు ఎలా ఉన్నాయంటే
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులేదు
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన ప్రదర్శన
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన ప్రదర్శన చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి అదే కారణమా?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగానే ఉంది
తెలంగాణ సర్పంచ్ సంఘం ఉపాధ్యక్షురాలుగా దేవన శ్రీ వాణీ
తెలంగాణ సర్పంచ్ సంఘం ఉపాధ్యక్షురాలుగా దేవన శ్రీ వాణీ వికారాబాద్, ఆంధ్రప్రభ :
వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
మన తెలంగాణ/మోత్కూర్: వాహన దారులు విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సిఐ సి వెంకటేశ్వర్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే 108, 100,112 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఆరైవ్ , ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వాహనాల దారులకు, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. వాహన దారులు తమ వాహనాలకు సంబందించిన పత్రాలు వాహనంతో పాటు ఉంచుకోవాలని, ద్వి చక్ర వాహన దారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపవద్దన్నారు. కార్లు,బస్సులు, ఆటోలు నడిపే వారు సీట్ బెల్ట్ ధరించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కే సతీష్ , ఏ ఎస్ ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ నర్సింహ, పోలీస్ సిబ్బంది రామనర్సయ్య, పోలీస్ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.
Road Accident : ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు
శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం..
శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం.. తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి
అల్తాఫ్ బాబా పుట్టినరోజు వేడుకల్లో సర్వమత ప్రార్థనలు..
అల్తాఫ్ బాబా పుట్టినరోజు వేడుకల్లో సర్వమత ప్రార్థనలు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: కొండపల్లిలో సూఫీ
Naredna Modi : కాంగ్రెస్ పెద్ద తప్పు చేసింది : నరేంద్ర మోదీ
కొందరికి దేశం కంటే రాజకీయాలే ఎక్కువని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు
ఇబ్రహీంపట్నంలో డ్రగ్స్ పై దండయాత్ర 2.O
ఇబ్రహీంపట్నంలో డ్రగ్స్ పై దండయాత్ర 2.O ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : గంజాయి ఇతర
Andhra Pradesh : ఇంటర్ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది
Pawan Kalyan : పవన్ కు ఏం శస్త్ర చికిత్స జరిగిందంటే?
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స జరిగింది
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
అమరావతి: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 30 మంది ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తోంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి అనంతరం బోల్తా పడింది. పలువురు ప్రయాణికులు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అర్జున్ అంబటి హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘పరమపద సోపా నం’. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహించారు. గణపర్తి శ్వేత సమర్పణలో స్వయంభూ క్రియేషన్స్ బ్యానర్పై గణపర్తి నారాయణరావు ఈ చిత్రా న్ని నిర్మించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా... పులగం సుప్రి య కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథా నాయికగా నటించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఒక గ్రిప్పింగ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సం దర్భంగా ’కింగ్ ఆఫ్ కంటెంట్’ శ్రీవిష్ణు ’పరమపద సోపానం’ ట్రైలర్ ను లాం చ్ చేశారు. అనంతరం శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా ఆసక్తికరంగా, గ్రిప్పింగ్ గా ఉంది. మంచి థ్రిల్లర్ సినిమా చూడబోతున్నామనే ఆసక్తిని కలిగించింది. అర్జున్ అంబటి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.
IPL 2026 : ఐపీఎల్ లో నేడు వీకెండ్ థమాకా
ఐపీఎల్ లో నేడు మరో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి
పనికి వెళ్లడం లేదని అడిగినందుకు ఉరేసుకున్న భర్త
అమరావతి: పనికి వెళ్లడం లేదని భార్య మందలించినందుకు భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాస్ట్రం పోలవరం పంచాయతీ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాతపోలవరం గ్రామంలో సూరవరపు గంగాధర్(42), రామలక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతడ వంటి మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి పనులు లేకపోవడంతో మద్యం తాగుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పనికి వెళ్లకపోతే ఎట్లా అని భర్తను భార్య పలుమార్లు మందలించింది. మరుసటి రోజు ఉదయం పనికి వెళ్తున్నానని, వేడి వేడి గంజి కావాలని అతడు భార్యను అడిగాడు. భార్య గంజి కాసి ఇచ్చి బయటకు వెళ్లింది. తోడి కోడలు పిల్లలకు ఇంటికి వెళ్లి ఒకసారి బాబాయ్ ఇంట్లో ఉన్నాడా? చూసి రమ్మని చెప్పింది. గంగాధర్ వేలాడుతూ కనిపించాడు. వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మృతుడి భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
IPL 2026 : చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది
Strait of Hormuz : హోర్ముజ్ జలసంధి మళ్లీ మూత.. ఇరాన్ కఠిన నిర్ణయం
హోర్ముజ్ జలసంధి అంశంలో ఉద్రిక్తత మళ్లీ పెరిగింది
అంధకారంలో మూడు మండలాలు మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం డంపింగ్ యార్డ్
19thaprileditorial |మోడీ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లు
19thaprileditorial | మోడీ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లు 19thaprileditorial | మహిళా రిజర్వేషన్
One Nation One Reservation |రిజర్వేషన్ వ్యవస్థలో అసమానతలు
One Nation One Reservation | రిజర్వేషన్ వ్యవస్థలో అసమానతలు One Nation
Revanth reddy |మహిళా సాధికారతలో తెలంగాణ ముందంజ
Revanth reddy | మహిళా సాధికారతలో తెలంగాణ ముందంజ Revanth reddy |
19thaprilchintana |అక్షయ తృతీయ ప్రాముఖ్యత..
19thaprilchintana | అక్షయ తృతీయ ప్రాముఖ్యత.. 19thaprilchintana | అక్షయ తృతీయ అర్థం
హర్మూజ్ జలసంధిలో భారత నౌకపై కాల్పులు
టెహ్రాన్: హర్మూజ్ జలసంధి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తెరిచినట్టే తెరిచే గంటల వ్య వధిలో ఇరాన్ తిరిగి మూసివేసింది. దానికి అమెరికా అనుసరిస్తున్న వైఖరే కారణమని స్పష్టం చే సింది. శుక్రవారంనాడు జలసంధిని తెరిచిన ఇరా న్ శనివారంనాడు మూసివేసింది. హర్మూజ్ను తెరిచినప్పటికీ ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాం డ్ పేర్కొంది. ‘హర్మూజ్ జలసంధిపై నియంత్రణ తిరిగి మొదటికి వచ్చింది. ప్రస్తుతం మా సాయు ధ దళాల నియంత్రణలో ఉంది. ఇరాన్ ఓడరేవుల పై అమెరికా దిగ్బంధనం అమలులో ఉన్నంత కా లం జలసంధి మార్గంలో రాకపోకలను అడ్డుకుం టాం’ అని ఇరాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేవరకు హర్మూజ్లో దిగ్బంధనం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ఇరాన్ నుంచి తాజా ప్రకటన వెలువడింది. ఆ వెంటనే హర్మూజ్లో రాకపోలను ఇరాన్ నియంత్రించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో జలసంధిని దాటేందుకు ముడి చమురు, గ్యాస్తో కూడిన 14 భారతీయ జెండాలతో కూడిన నౌకల కాన్వాయ్ను ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ అడ్డుకున్నారు. ఐఆర్జిసికి చెందిన రెండు గన్బోట్లు ఎలాంటి హెచ్చరికలు లేకుండా వాటిలో ఒకదానిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నౌక కిటికీ అద్దం దెబ్బతింది. కెష్మ్లరాక్ దీవుల నడుమ ఈ ఘటన చోటుచేసుకుంది. ముడి చమురుతో కూడిన హెచ్పిసిఎల్కు చెందిన మరో నౌక మాత్రం సురక్షితంగా హర్మూజ్ను దాటి భారత్వైపు పయనిస్తోంది. మిగతా 12 నౌకలను గన్బోట్లు 37 కిలో మీటర్ల మేరకు వెంటాడి ఒమన్ను ఈశాన్య దిశలో అడ్డుకున్నాయి. దీంతో హర్మూజ్ను దాటకుండా ఆ నౌకలు వెనక్కి పయనమయ్యాయి. 14 నౌకలు ఏడు భారతీయ జెండాలతో కూడినవి కాగా, నాలుగు లైబీరియా, రెండు మార్షల్ దీవులు, మరొకటి వియత్నాంకు చెందినవి. వీటిలో ఆరింటిలో ముడి చమురు, మూడింటిలో ఎల్పిజి, నాలుగు ఎరువులతో నిండి ఉన్నాయి. ఈ నౌకలన్నింటినీ లరాక్ దీవులకు దక్షిణాన లంగరు వేయించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఇరాన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మిగతా నౌకలను కూడా క్షేమంగా హర్మూజ్ దాటించేందుకు పయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా దాడికి గురైన నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నాం.. మరోవైపు దేశం లోని పలు ఎయిర్ పోర్టులను తిరిగి తెరవడంతోపాటు తమ గగనతలాన్ని పాక్షికంగా తెరుస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. తూర్పు మార్గంలో అంతర్జాతీయ విమానాలు ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్టు సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. యురేనియంను అమెరికాకు అప్పగించేది లేదు: ఇరాన్ అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందని, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చేస్తున్న ప్రకటనలను ఇరాన్ ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శుద్ధి చేసిన యురేనియ ం నిల్వలను అమెరికాకు అప్పగించేది లేదని ఇరాన్ విదేశాంగ ఉపమంత్రి సయీద్ ఖతిబ్జడేహ్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య భవిష్యత్లో జరగనున్న చర్చలకు యురేనియం ప్రధాన అంశమని ట్రంప్ చేస్తున్న వాదనలను కొట్టి పారేశారు. టర్కీ లోని అంటల్యా సిటీలో ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ సయీద్ అమెరికాతో మరో దఫా ముఖాముఖి చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదని వెల్లడించారు. ఎందుకంటే అమెరికా తన గరిష్టవాదాన్ని విడిచిపెట్టడం లేదని వ్యాఖ్యానించారు. గత ఏడాది అమెరికా మిలిటరీ ఇరాన్లో ధ్వంసం చేసిన అణుక్షేత్రాల కింద శుద్ధి చేసిన యురేనియం నిల్వలు 440 కిలోగ్రాముల వరకు నిక్షిప్తమై ఉండవచ్చని, ఆ నిల్వలన్నీ అమెరికా స్వాధీనం చేసుకోవడానికి ఇరాన్ వెళ్తుందని శుక్రవారం ట్రంప్ ప్రకటించారు.ఈ నేపథ్యంలో సయీద్ఖతిబ్జ్దేహ్ తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
19aprSunday2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
19aprSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఓ మనిషీ…నన్ను కాపాడు(కో)…! ముఖచిత్ర కథనం
19thApril2026 |ఆదివారం నేటి పంచాంగం
19thApril2026 | ఆదివారం నేటి పంచాంగం 19thApril2026 | దిన విశేషాలు &
ఒకప్పుడు గుండెపోటు అనేది వృద్ధులకు మాత్రమే సంబంధించిన అనారోగ్యంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది. 18 నుంచి 45 ఏళ్ల మధ్య యువతలో గుండెపోటు మరణాలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఈ తీవ్రతను స్పష్టం చేస్తాయి. గత ఆరేళ్లలో (2020 నుంచి 2026 జనవరి వరకు) ఈ వయసు సమూహంలో దాదాపు 18వేల మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. 2020లో 2,394 మరణాలు నమోదు కాగా, 2025లో 3,255కి పెరిగాయి. ప్రతి సంవత్సరం ఈ సంఖ్యలు పెరుగుతున్న ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాజిక నిర్మాణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. యువతే దేశ భవిష్యత్తు. వారి మరణాలు కేవలం వ్యక్తిగత నష్టం కాదు, జాతీయ సంక్షోభం. ఈ పరిస్థితికి ప్రధాన కారణం జీవనశైలి. టెక్నాలజీ యుగంలో శారీరక శ్రమ తగ్గిపోయింది. కార్యాలయాల్లో గంటల తరబడి కూర్చుని పని చేయడం, స్మార్ట్ఫోన్లకు అంటుకుపోయి ఉండటంవల్ల గుండె బలహీనపడుతోంది. అహారపు అలవాట్లు మరింత దారుణం. ఫాస్ట్ ఫుడ్, కల్తీ ఆహారం, రాత్రి భోజనాలు రక్తపోటు, కొలెస్ట్రాల్ను పెంచుతున్నాయి. పొగతాగడం, మద్యపానం వంటి హానికర అలవాట్లు యువతను హత్తుకుంటున్నాయి. మరింత ముఖ్యం మానసిక ఒత్తిడి. ఉద్యోగ పోటీ, ఆర్థిక ఒత్తిడి, సామాజిక మీడియా ప్రభావంవల్ల యువత రోజురోజుకూ ఒత్తిడి హార్మోన్లతో బాధపడు తోంది. ఈ హార్మోన్లు గుండెపై అదనపు భారం వేసి, హార్ట్ అటాక్కు దారి తీస్తాయి. పట్టణీకరణ, రాత్రి షిఫ్టులు సర్కాడియన్ రిథమ్ను దెబ్బ తీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల కంటే నగరాల్లో ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాలుష్యం, పని ఒత్తిడి, నిద్రలేమి ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఈ ధోరణి మరింత పెరిగిందనే అనుమానాలు ఉన్నాయి. వైరస్ లేదా వ్యాక్సిన్తో సంబంధం ఉందా అనే ప్రశ్నలు ప్రజల మనసులో తిరుగుతున్నాయి. కానీ హర్యానా ప్రభుత్వం సర్వే చేయలేదని తెలిపింది. ఇది ప్రధాన లోపం. అపోహలు పెరిగి, ఆరోగ్యంపై తప్పు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్రీయ అధ్యయనాలు చేపట్టి సత్వరం సమాధానం ఇవ్వాలి. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వాలు చురుకైన చర్యలు తీసుకోవాలి. స్కూల్, కాలేజీలు, కార్యాలయాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి జిల్లాలో కార్డియాక్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఉచిత పరీక్షలు అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు బలోపేతం చేయాలి. యోగ, ధ్యానం వంటి కార్యక్రమాలను ప్రచారం చేయాలి. కానీ ప్రభుత్వాలు మాత్రమే కాదు, వ్యక్తుల బాధ్యత కూడా కీలకం. రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం, సమతుల ఆహారం, సకాలంలో నిద్ర, ఒత్తిడి నిర్వహణ అవసరం. పొగ, మద్యం వంటి వాటిని వదిలేయాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెట్టర్ దాన్ క్యూయర్ అనే సూక్తిని ఆచరణలో పెట్టాలి. లక్షణాలు తీవ్రమైన తర్వాతే వైద్యుల వద్దకు వెళ్లే మన దృక్పథం మారాలి. యువతలో ఈ మరణాలు మౌన సంక్షోభం. దీనిని సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలి. ప్రభుత్వాలు సమగ్ర విధానాలు అమలు చేస్తే, వ్యక్తులు జాగ్రత్తగా ఉంటేనే భవిష్యత్ తరాలను రక్షించగలం. ఇప్పుడే చర్య తీసుకోకపోతే, రేపు యువత లేని దేశం మిగిలిపోతుంది. ఆరోగ్యం మన ఆస్తి. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని, ఆరోగ్యవంతమైన భారతాన్ని నిర్మించాలి. దయ్యాల అశోక్ 95508 89907
న్యూఢిల్లీ: దేశం యావత్తూ చూస్తుండగానే స్వార్థపూరిత ప్రతిపక్షాలు చట్టసభ సాక్షిగా భ్రూణహత్యకు పాల్పడ్డాయని ప్రధా ని నరేంద్ర మోడీ ఘాటుగా స్పందించారు. మహిళా కోటా పెంపుదల, చట్టసభలలో సీట్ల విషయంలో నిజాయితీతో ముందుకు సాగితే , వెన్నుపోటుకు దిగారని ప్రధాని విమర్శించా రు. లోక్సభలో మహిళా బిల్లు మెజార్టీ సాధించలేక వీగిపోయిన మరుసటి రోజున శనివారం ప్రధాని జాతిని ఉద్ధేశిం చి టీవీ ప్రసార సాధనాల మాధ్యమాల ద్వారా ప్రసంగించా రు. దాదాపు 30 నిమిషాల ఆయన ప్రసంగంలో ప్రతిపక్ష కూటమిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలలో గౌరవప్రదమైన సంఖ్యాబలం మహిళలకు కల్పించడం బాధ్యత. వారి హక్కును వారు పొందేలా చేసే ఓ ఉదాత్తమైన సదుద్ధేశ సంకల్పానికి దిగాం. అయితే కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె , సమాజ్వాది పార్టీలు రాజకీయ స్వార్థం కట్టలు తెంచుకున్న దశలో ఫలించే దశలో భ్రూణహత్యకు పాల్పడ్డాయని ప్రధాని విమర్శించారు. సభలో చేసిన పాపపు చర్యకు తరువాత వారు సభ వెలుపల సంబరాలు కూడా చేసుకున్నారని , ఇది దేశ ఆడపడుచుల పాలిటి న్యాయమేనా అని ప్రశ్నించారు. బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు నిర్థయతో మహిళల కలలను నేలరాచాయని విమర్శించారు. శక్తికి సరైన రీతిలో పట్టం కట్టాలనే సంకల్పాన్ని తామేదో గొప్ప పనిచేస్తున్నామనే ఆలోచనలతో ప్రతిపక్షాలు కలిసికట్టుగా అడ్డుకున్నాయని ప్రధాని మోడీ విమర్శించారు. భారతీయ మహిళకు తరతరాల నుంచి అన్యాయాన్ని మౌనంగా భరించే ఓపిక , రక్త స్వతహసిద్ధ, జీవన ధర్మ క్షమా ఓపిక గుణం నిండుకుని ఉంది. అయితే ఇదే సమయంలో తనకు అన్యాయం చేసిన వారిని గుర్తు పెట్టుకుని , ఎప్పటికీ క్షమించని స్థాయిలో శిక్షించే శక్తి కూడా మహిళా లోకానికి ఉందని ప్రధాని తెలిపారు. నిబద్థతతో ముందుకు వెళ్లితే వెనకకు లాగారు ఎంతో నిబద్దతతోనే మహిళా చట్టం సాకారానికి , వారి కలలు పండటానికి తమ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుందని, అయితే చివరి దశలో ప్రతిపక్షాల చర్యతో ఈ చట్టం చతికిలపడిపోయిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము మహిళలకు న్యాయం చేయలేకపోయినందుకు సోదరీమణులు తల్లులు తమను క్షమించాలని కోరారు. ముందుగా వారికి క్షమాపణలు చెపుతున్నానని , ప్రధాని మోడీ చేతులు జోడించారు. నిజమే ఆకాశంలో సగం అంతకు మించిన వెలుగు రేఖల సొంతమైన హక్కులు కొందరి సంకుచిత రాజకీయాలకు చిక్కుల్లో పడ్డాయని, దీనితో మహిళలకు ఉన్న ఉక్కు సంకెళ్లను తెంపివేయడం సాధ్యం కాలేదన్నారు. చట్టసభలలో వారి కోటా సముచిత మరోసారి ఎండమావి అయిందని ప్రధాని తెలిపారు. విచిత్రం ఏమిటంటే అధికారం విషయంలో తగవులకు దిగే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు ఈ మహిళా బిల్లు ఓటమికి ఒకే తాటికి రావడం , తమ ఓటుతో దండెత్తడం అని విమర్శించారు. అంతా చూసే ఉంటారు...లోక్సభలో మహిళా బిల్లు వీగిపోయిన తరువాత కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె ఇతర విపక్షాల సభ్యులు ఎగిరినంత పనిచేశారు. బల్లలు చరుస్తూ ఆనందోత్సహాలను చాటుకున్నారు. ఒకరిని ఒకరు కౌగలించుకుంటూ అభినందనలు తెలియచేసుకున్నారు. చేసిన విచ్ఛిత్తికి వారికి ఇంతటి సంతసం కల్గిందని వ్యాఖ్యానించారు.టిఎంసి, డిఎంకె అధికారంలో ఉన్న బెంగాల్, తమిళనాడులలో వచ్చే వారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అక్కడి మహిళా స్పందన ఇప్పటి బిల్లు ఓటమి తరువాత ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సి ఉందని పరోక్షంగా మోడీ ప్రస్తావించారు. కష్టం నష్టం భరిస్తారు..అవమానం సహించబోరు మహిళ ఏ విషయాన్ని అయినా మరిచిపోగలదు. కష్టాలను నష్టాలను భరించగలదు. అయితే తనకు అవమానం కల్గించే వారిని ఎప్పటికీ క్షమించబోదని ప్రధాని తెలిపారు. చట్టసభలలో ప్రతిపక్షాల బల్లచరుపులు, నవ్వులు కేకలు ఏకంగా దేశ మహిళా గౌరవంపై , మర్యాదలపై వారి హుందాతనంపై జరిగిన దాడిగా భావించాల్సి ఉంటుందన్నారు. సభలో కాంగ్రెస్ , మిత్రపక్షాల వైఖరి దేశవ్యాప్తంగా ఎప్పటికి తిరుగులేని రికార్డుగా ఉంటుంది. దీని తరువాతి పరిణామాలు కూడా తీసిపోని విధంగానే వారు చవిచూడాల్సి ఉంటుందని ప్రతిపక్షాలపై ప్రధాని తమ ఆగ్రహం ఉధృతం చేశారు. సీట్ల పెంపుదలకు బ్రేక్తో రాష్ట్రాలకు అన్యాయం ప్రతిపక్షాలు చేసిన పనితో ప్రతి రాష్ట్రానికి కనీసం సగానికి పైగా సీట్లు పెరిగే అవకాశం పోయిందని , అన్ని రాష్ట్రాలకు మరింతగా గొంతు కల్పించే తమ యత్నాలను ప్రతిపక్షాలు నిలదీశాయని, కలబడి కాదన్నాయని విమర్శించారు. చిన్న పెద్ద, ప్రాంతాలు తేడా లేకుండా అన్ని రాష్ట్రాల చట్టసభలలో సీట్లపెంపుదల ప్రక్రియను దెబ్బతీశాయని విమర్శించారు. ‘తరతరాల ఆశల చిన్ని చిన్ని కువకువలకు రెక్కలు తొడుగాలని అనుకుంటే, సాధికారిక కొమ్మలకు వారి జీవితాలు విస్తారితం కావాలని అనుకుంటే , కొందరు అడ్డుపడ్డారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్షాలు రాజ్యాంగంలోని మహిళా సాధికారికతను అడ్డుకుని రాజ్యాంగాన్ని గేలిచేశారని విమర్శించారు. నిండు సభలో నారీ శక్తికి నారీ శక్తి వందన్ అదినియం అడ్డంకులతో ఘోర అవమానం జరిగిందని, దీనిని స్త్రీ జాతి విస్మరించదు, క్షమించదని స్పష్టం చేశారు. కాంగ్రెస్పార్టీ ఈ విషయంలో తన పాత తప్పిదాలను దిద్దుకుంటుందని ఆశించానని అయితే అందుకు విరుద్ధంగా వ్యవహరించిదని ప్రధాని తెలిపారు. కుటుంబ పాలన వ్యవస్థ దెబ్బతింటుందనే ఆలోచనతోనే మహిళకు పెద్ద పీట వేయనివ్వలేకపోయారని కాంగ్రెస్, ఎస్పి, డిఎంకెపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం సాధన ఒక చారిత్రాత్మక ఘట్టం. దశాబ్దాల పాటు సాగిన ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువత, రైతులు, ఉద్యోగులు మాత్రమే కాదు -మేధావులు కూడా కీలక పాత్ర పోషించారు. విశ్లేషణలతో, రచనలతో, సభలతో ప్రజల్లో చైతన్యం నింపి ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమానికి ఆలోచనా పునాది మేధావులే వేశారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే మేధావుల పాత్ర ఏమైంది? ఈ ప్రశ్న ఈ రోజు సామాన్య ప్రజలలో మాత్రమే కాదు, ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వర్గాలలో కూడా గట్టిగా వినిపిస్తోంది. ఉద్యమ సమయంలో ప్రజాస్వరంగా ఉన్న వారు, రాష్ట్రం వచ్చిన తర్వాత మౌన వీక్షకులుగా మారిపోయారా అనే అనుమానం పెరుగుతోంది. రాష్ట్రం వచ్చిన తొలిదశలో కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని భావించడం సహజమే. కొత్త వ్యవస్థను స్థిరపరచడానికి కొంత సమయం అవసరం ఉంటుంది. కానీ ఆ సమయం సంవత్సరాలుగా మారిన తర్వాత కూడా మేధావుల నుంచి స్పష్టమైన, నిరంతర ప్రజాపక్ష స్వరం వినిపించకపోవడం ఆందోళనకరమైన విషయం. పత్రికా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, రాజకీయ పారదర్శకత, ఆర్థిక అసమానతలు, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలపై సమగ్ర చర్చలు జరిపి ప్రజలను సమీకరించే ప్రయత్నాలు చాలా పరిమితంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో ఒక ప్రధాన విమర్శ ఏమిటంటే -తెలంగాణ మేధావుల్లో చాలామంది స్వతంత్రత కోల్పోయి, రాజకీయ పార్టీలకు దగ్గరవుతున్నారనే భావన. ఉద్యమ సమయంలో అధికారాన్ని ప్రశ్నించిన వారు, ఇప్పుడు అధికారానికి అనుగుణంగా మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు మౌనం, అదే ప్రభుత్వం మారిన తర్వాత గట్టిగా విమర్శలు చేయడం -ఈ ద్వంద్వ వైఖరి ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది కేవలం వ్యక్తుల వైఫల్యం కాదు -వ్యవస్థలో జరిగిన మార్పుల ప్రతిబింబం కూడా. ఉద్యమ కాలంలో విమర్శకులుగా, మార్గదర్శకులుగా ఉన్న మేధావులు, రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవస్థలో భాగస్వాములుగా మారారు. కొందరు నిజంగా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యవస్థలోకి వెళ్లినా, అధికారానికి దగ్గరయ్యాక స్వతంత్ర స్వరం బలహీనపడింది. మరికొందరు గుర్తింపు, నామినేటెడ్ పదవులు, ఆర్థిక లాభాల కోసం తమ వైఖరిని మార్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఒక పెద్ద నైతిక సంక్షోభం. మేధావి అనే పదానికి ఉన్న గౌరవం, బాధ్యత, సామాజిక కర్తవ్య భావన. ఇవి అన్నీ బలహీనపడుతున్నాయి. ఒక మేధావి తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలను ముందుకు పెట్టాలి. కానీ ప్రస్తుతం కొంతమంది వద్ద ఈ సమతుల్యత కనిపించడం లేదు. సోషల్ మీడియా ప్రభావంతో ప్రజా ఉద్యమాల బలహీనత. ఇక మరో ముఖ్యమైన అంశం-ప్రజా ఉద్యమాల బలహీనత. సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన ఈ కాలంలో ప్రతి సమస్య ఒక డిబేట్గా మారుతోంది.కానీ అది మూవ్మెంట్గా మారడం లేదు. ఆన్లైన్ చర్చలు ఎక్కువగా ఉన్నా, ఆఫ్లైన్లో ప్రజలను సంఘటితం చేయడం లోపిస్తోంది. దీని వల్ల మేధావుల స్వరం కూడా ప్రభావం కోల్పోతోంది. కులాలు, వర్గాలు, మతాల ఆధారంగా సమాజంలో విభజనలు పెరగడం కూడా మరో పెద్ద సమస్య. ఒకే సమస్యపై కూడా ప్రజలు ఏకమవ్వలేకపోతున్నారు. ఈ విభజనల మధ్య మేధావులు కూడా తమ తమ వర్గాలకు మాత్రమే పరిమితం అవుతున్నారనే భావన కలుగుతోంది. ఫలితంగా సమాజాన్ని ఒకే దిశగా నడిపించే శక్తి బలహీనపడుతోంది. సంఘటిత శక్తి లోపిస్తుందా? అయితే పూర్తిగా మౌనం కూడా లేదు. కొంతమంది అకడమిక్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు వివిధ అంశాలపై స్పందిస్తున్నారు. కోర్టుల్లో, పబ్లిక్ డిబేట్స్లో, స్వతంత్ర వేదికలలో తమ వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు విస్తృత ప్రజా ఉద్యమాలుగా మారడం లేదు. కారణం -సంఘటిత శక్తి లోపం, ప్రజల మద్దతు కొరత, కొన్నిసార్లు భయాలు. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఎదురవుతుంది: మేధావులు ప్రజల కోసం నిలబడకపోతే, మరి ఎవరు నిలబడాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క వర్గంతో రాదు. మేధావులు స్వతంత్రంగా నిలబడాలి. అదే సమయంలో ప్రజలు కూడా వారికి మద్దతు ఇవ్వాలి. విమర్శకులను పార్టీ కోణంలో కాకుండా ప్రజా ప్రయోజనాల దృష్టితో చూడాలి. మేధావులను ప్రోత్సహించాలి, రక్షించాలి. తెలంగాణ ఉద్యమం గొప్ప పాఠ్యం నేర్పింది తెలంగాణ ఉద్యమం మనకు ఒక గొప్ప పాఠం నేర్పింది. -సంఘటిత ప్రజాశక్తి ఏదైనా సాధించగలదు. అదే స్ఫూర్తి ఇప్పుడు మళ్లీ అవసరం. మేధావులు తమ పాత్రను తిరిగి నిర్వచించుకోవాలి. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదికలుగా మారాలి. కేవలం విమర్శలతో కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను సూచించాలి. ప్రజలు కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. సమస్యలపై స్పందించాలి. చర్చలను చర్యలుగా మార్చాలి. విభజనలను పక్కన పెట్టి సామాన్య ప్రయోజనాల కోసం ఏకమవ్వాలి. లేకపోతే, మేధావి అనే పదం కేవలం ఒక గుర్తింపుగా మిగిలిపోతుంది. సమాజాన్ని మార్గనిర్దేశం చేసే శక్తిగా కాదు, వ్యక్తిగత ప్రయోజనాల సాధనంగా మారిపోతుంది. ఇప్పుడు అయినా ఒక ఆత్మపరిశీలన అవసరం - మేధావులు తమ బాధ్యతను గుర్తించాలి. ప్రజలు తమ శక్తిని గుర్తించాలి. ఈ రెండూ కలిసినప్పుడే తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్యం బలపడుతుంది. సిహెచ్ వి ప్రభాకర్ రావు 9391533339
బిల్లు ముసుగులో బిజెపి కుట్రలు
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం చట్టాల ఓటమి కాదని, అది మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధికి జరిగిన ఓటమి అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో సీట్ల పెంపు (డీలిమిటేషన్), రిజర్వేషన్ల రద్దు వంటి ప్రయత్నాలను ప్రతిపక్షాలు కలిసికట్టుగా అ డ్డుకున్నాయని, ఇది బిజెపి అహంకారానికి చెంపపెట్టు అ ని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్లో ఓడిపోయింది మోడీ అహంకారం తప్ప మరొకటి కాదన్నారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్, బిజెపి చిత్తశుద్ది ఏమిటో తేల్చుకుందామని సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 2011 జనాభా లెక్కలు, ఇతర డేటా ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయన్నారు.2009లో డీలిమిటేషన్ జరిగిందని, ఆ లెక్కలతో ఆగష్టు 15, 2026 లోపు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించవచ్చని సిఎం అన్నారు. ఆ రిజర్వేషన్లతో ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో 2027లో జరిగే ఎన్నికల్లో అమలు చేయవచ్చన్నారు. ఆ విధంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే తెలంగాణ సిఎంగా తాను బాధ్యత తీసుకొని దక్షిణాది రాష్ట్రాల సిఎంలు స్టాలిన్, పినరయి విజయన్, సిద్ధరామయ్య, చంద్రబాబు నాయుడు, పుదుచ్చేరి సిఎం రంగసా మిలతో చర్చలు జరుపుతానని, ఇండియా కూటమి నేతల మద్దతు కూడగతారని ఆయన చెప్పారు. 2023లో పాస్ అయిన బిల్లులో సవరణలు చేయాలనుకుంటే ఒక చిన్న మార్పుతో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, బిజెపి ఉద్దేశం రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లు ఎత్తివేయడమేనని, పార్లమెంట్ వేదికగా జరిగిన ఈ తీరును 140 కోట్ల మంది దేశ ప్రజలు చూశారని ఆయన తెలిపారు. మాకు గంట సమయం ఇస్తే బిల్లును మార్చేస్తా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో శనివారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లోనే ప్రజలు బిజెపి కుట్రలను ఓడించారని, ఇప్పుడైనా పంతాలకు పోకుండా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్, సమగ్రతను బలహీనపర్చేలా దేశ రాజకీయ చిత్రపటాన్నే మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకువచ్చిందని దానిని ప్రతిపక్ష పార్టీలు ఓడించాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు అడ్డుకున్నది ప్రమాదకరమైన నియోజకవర్గాల పునర్విభజన బిల్లునేని మరేం కాదన్నారు. ప్రతిపక్షాలు నిలువరించింది, ఓడించింది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్నేనని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బిల్లుల విషయంలో బిజెపి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నిజాయితీ లేదని సిఎం విమర్శించారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసిందన్నారు. తమకు గంట సమయం ఇస్తే బిల్లును మార్చివేస్తామని అమిత్ షా అన్నారని సోమవారం వరకు సమయం ఉందని, ప్రస్తుతం ఉన్న 543 సీట్లతోనే బిజెపి మహిళా బిల్లు తీసుకువస్తే మంగళవారం పాస్ చేస్తామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. రిజర్వేషన్ల ఎత్తివేయాలంటే బిజెపికి 2/3 వంతుల మెజార్టీ మూడొంతుల మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేయాలని అన్ని వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని బిజెపి భావిస్తోందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. అందుకే చార్ సౌ పార్ (400 సీట్లకు మించి) నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్లారన్నారు. ఆ ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగ మార్పుతో పాటు, రిజర్వేషన్లు తొలగించాలని బిజెపి భావించిందన్నారు. ప్రజలు జాగృతమై 240 సీట్లకే బిజెపిని పరిమితం చేశారని, రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల ఎత్తివేయాలంటే బిజెపికి 2/3 వంతుల మెజారిటీ కావాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు బిల్లుల ముసుగులో రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దుకు బిజెపి మరోసారి చేసిన ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు కలిసి ఓడించాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం నాటికి కొత్త చట్టాలను రూపొందించాలి ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 సీట్లలో 1/3 వంతు సీట్లు, రాష్ట్రాల శాసనసభల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా మహిళా రిజర్వేషన్లపై సోమవారం వరకు కొత్త చట్టాలను రూపొందించి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలా బిల్లు తెస్తే ఇండియా కూటమితో కలిపి 2023 మాదిరిగా ఆ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని, సోమవారం బిల్ పాస్ చేసుకొని మంగళవారం నుంచే ఈ చట్టాన్ని అమలు చేయవచ్చని సిఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనకు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని, నిపుణు లతో చర్చించాలని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తెలుసుకోవాలని, ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి జాతీయ ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆయా రాష్ట్రాలతో సంప్రదించి శాసనసభల్లో స్థానాల సంఖ్య పెంచవచ్చని సిఎం అన్నారు. రాజ్యాంగాన్ని మార్చుతానంటే దేశ ప్రజలు ఒప్పుకోరని, దీంతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని మేం యోచిస్తే దానిని కాంగ్రెస్ అడ్డుకుందని తమను బద్నాం చేసే పనిలో మోడీ, బిజెపిలు ఉన్నాయని సిఎం విమర్శించారు. అందులో భాగంగానే ఆందోళనలు చేపట్టారన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్తశుద్ది చాటుకోవాలని, సరైన పద్ధతిలో బిల్లులు తయారు చేయాలని సిఎం సూచించారు. కాంగ్రెస్ పార్టీకి దేశం మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాత ప్రజలు, చివరగా పార్టీ అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ, బిజెపికి మాత్రం తొలుత పార్టీ, తర్వాత సొంత విషయాలు, ఆ తర్వాతే దేశమని సిఎం విమర్శించారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాలు భాగమేనని దేశంలోనే దక్షిణాది ప్రజలు బతుకుతున్నారని, దేశ సేవలో తాము ఎవరికన్నా తక్కువ కాదని, దేశాన్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేలా డీలిమిటేషన్ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేలా డీలిమిటేషన్ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విధానాల ఆధారంగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయిందన్నారు. దేశానికి విధేయంగా వ్యవహారించిన దక్షిణాది రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి జరిమానా విధిస్తామనడం ఏవిధంగా సరైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తల్లిని చంపి, బిడ్డను రక్షించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర విభజనపై పలుమార్లు ద్వేషం చూపారని ఇప్పుడు ఆయన బాటలోనే ఎంపి తేజస్వీ సూర్య పయనిస్తున్నారని సిఎం మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపి లక్ష్మణ్ మోడీ దృష్టిని ఆకర్షించి ప్రమోషన్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే తప్ప ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని సిఎం రేవంత్రెడ్డి విమర్శించారు. తాను సూచించిన విధానం కిషన్ రెడ్డికి నచ్చకపోతే ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలే తప్ప ఎదురుదాడి చేయడమేమిటని సిఎం ప్రశ్నించారు. స్వాతంత్య్రం రాకముందే కాంగ్రెస్కు మహిళా అధ్యక్షులు... మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిని ఏ ఒక్కరూ ప్రశ్నించలేరని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఓటు హక్కు కోసం మహిళలు 150 సంవత్సరాలు పోరాడారని, కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే పురుషులతో పాటు మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేననన్నారు. దేశానికి మహిళా రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కాంగ్రెస్ అందించిందని, లోక్సభ స్పీకర్గా, అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా మహిళలను కాంగ్రెస్ పార్టీ చేసిందని సిఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్య్రానికి పూర్వమే మహిళలు అధ్యక్షులుగా ఎన్నికయ్యారని, స్వాతాంత్య్రనంతరం ఇందిరా గాంధీ, సోనియా గాంధీ అధ్యక్షులుగా సేవలందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోనియా గాంధీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పని చేశారని సిఎం తెలిపారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారని, ఫలితమే ఇప్పుడు దేశంలో పలు ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిథ్యం 50 శాతానికి చేరుకుందన్నారు. 1980లో ఏర్పడిన బిజెపికి ఇప్పటివరకు 15 మంది అధ్యక్షులైతే అందులో ఒక్కరూ కూడా మహిళ లేరని సిఎం తెలిపారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లు రెండు మూడు సార్లు అధ్యక్షులయ్యారని, కానీ, ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదన్నారు. అలాంటి బిజెపి మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎలా విమర్శిస్తుందని సిఎం ప్రశ్నించారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదు ? బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదని సిఎం రేవుంత్ రెడ్డి అన్నారు. బీహార్ మాజీ సిఎం నితీశ్ కుమార్, మహారాష్ట్ర మాజీ సిఎం ఏక్ నాథ్ షిండే పరిస్థితి చూస్తునే ఉన్నామని, భవిష్యత్లో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని సిఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంలో బిజెపికి సీట్లు తక్కువగా ఉన్నాయని అందుకే టిడిపికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. భవిష్యత్లో బిజెపి బలం పెరిగితే టిడిపిని పక్కన పెడతారన్నారు. లోక్సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికేనని వాటిని అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని ఆయన తెలిపారు. 2/3 మెజారిటి వచ్చినంత మాత్రాన అన్నీ చట్టాలు చేయలేమని, 2/3 మెజారిటీ ఉందని ప్రధానిగా ఉన్న వ్యక్తి తానే రాజునని చట్టం చేసుకుంటే కుదురుతుందా అని సిఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఎపిలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే ఉన్నాయని, తానే రాజునని చంద్రబాబు చట్టం తెస్తే ఒప్పుకుంటారా? డిక్టేటర్ షిప్ని ఎవరూ అంగీకరించరన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని సిఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపిలు డాక్టర్ మల్లు రవి, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, విప్లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/ జగిత్యాల ప్రతినిధి: జగిత్యా ల పోరాటాల పురిటిగడ్డ అని, జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభిస్తామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆ ర్ అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ ఏ ర్పాట్లను సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి త న్నీరు హరీష్రావుతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. జీవన్రెడ్డి నివాసానికి వెళ్లి ఆ యనతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందన్నారు.కేసీఆర్ అనే సింహం బయటకు వస్తుందంటే గుంట నక్కల గుండెల్లో దడ పుట్టడం మొదలైందన్నారు. కేసీఆర్ సభ సక్సెస్ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని, కేసీఆర్ సభను డైవర్ట్ చేసేందుకే సీఎం రేవంత్ అదే రోజు మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారన్నారు. గత రెండున్నరేండ్లుగా మేడిగడ్డ వైపు కన్నెత్తి కూడా చూడని రేవంత్రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకొని చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే, కోరుట్ల మార్గం నుంచి జగిత్యాల సభకు జనం రాకుండా అడ్డుకునేందుకు రోడ్డును తవ్వి వంతెన నిర్మాణ పనులు చేపట్టడం శోచనీయమన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఏ బ్రీడో తెలియడం లేదని, విలేకరుల సమావేశంలో నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పుకొంటూ కాంగ్రెస్ కార్యాలయంలో కూర్చుంటున్నాడని, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. రెండున్నరేండ్ల రేవంత్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదని, ఇచ్చిన హామీలన్నీ గాలికివదిలేశారని విమర్శించారు. రేవంత్రెడ్డిది అట్టర్ఫ్లాప్ పాలన అని రాష్ట్ర ప్రజలంతా గొంతెత్తి చెప్తున్నారన్నారు. కేసీఆర్ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సభను విజయవంతం చేసి తీరుతామన్నారు. నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని నియమించామని, వారంతా ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహించి జనం సభకు తరలివచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 20న సాయంత్రం 5.30 గంటల వరకు కేసీఆర్ సభా స్థలికి చేరుకుంటారని, గంట పావు సేపు సభ జరుగుతుందన్నారు. సభకు వచ్చే జనానికి దాహార్తి తీర్చేందుకు మూడు లక్షల నీళ్ల సీసాలు, రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సహనం కోల్పోకుండా సభ విజయవంతం కోసం కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన వెంట మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కె.విద్యాసాగర్రావు, తుల ఉమ, దావ వసంత తదితరులున్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ వేసవి కాలం ముగిశాకే జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరగవచ్చని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. పలు కీలక అంశాలపై ఆయన స్పందిస్తూ ఎన్నికలు ఈ సమ్మర్ అయ్యా కే ఉండే అవకాశం ఉందని, కేబినెట్ విస్తరణపై చ ర్చ ఉందని విడతల వారీగా జరుగుతుందని ఆ యన తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండబోతున్నాయ న్న విషయమై ఆయన మాట్లాడుతూ ఏ శాఖ ఎవరికీ శాశ్వతం కాదని, అయితే, ఆయా శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజమని ఆయన అన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ సైతం త్వరలోనే ఉండబోతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మార్కెట్ వాల్యూ.. రాష్ట్రంలో త్వరలోనే భూముల విలువ పెరగనుందని ఈ మేరకు కసరత్తు జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భూముల మార్కెట్ వ్యాల్యూ పెంచలేదన్నారు. ధరణి సమస్యలు భూ-భారతితో పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో మ్యాప్ను జతపరచడం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. మ్యాప్తో కూడిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ పాలేరులో జరుగుతుందని రెవెన్యూలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నామని ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతుందన్నారు. అసైన్డ్ భూములపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు. నాలుగు రకాల ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని ఆయన తెలిపారు. నాకు మంత్రులు మద్ధతుగా నిలిచారు.. అసెంబ్లీలో తనపై ప్రతిపక్షం దాడి చేసినప్పుడు మంత్రులు మద్దతుగా నిలిచారని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రతిపక్షం ట్రాప్లో తాను పడనని అందుకే ఎంత విమర్శించినా ఓపికగా ఉండి సమాధానం చెప్పానని ఆయన అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనుల జాబితా తయారవుతోందని సరైన సమయంలో అన్నీ బయటకు వస్తాయని మంత్రి హెచ్చరించారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పథకం రెండో విడత నిధులను ఈనెల 20న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా కాటారంలో 20న జరి గే బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమక్షంలో ఈ నిధులను రైతుల ఖాతా ల్లో జమ చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.50కోట్ల ఎకరాలకు ‘రైతు భరోసా’ కింద ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఈ నిధులు జమ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా, వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడతగా ఒక్కో ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. మొదటి విడతలో దాదాపు రూ.3,590 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. రెండో విడతలో 45.11 లక్షల మందికి లబ్ధి రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది రైతులు రైతు భరోసా సాయం అందుకోనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. దీంతో రూ.5,653 కోట్లు రెండవ విడత రైతు భరోసా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతలో ప్రతి రైతుకు ఒక ఎకరానికి మాత్రమే సాయం అందించగా, రెండో విడతలో మిగిలిన భూమికి అర్హత మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం, మూడో విడత నిధులను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు పెట్టుబడి సాయం అందేలా ప్రణాళిక రూపొందించినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గి సకాలంలో సాగు చేపట్టేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నిధుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుండటంతో పారదర్శకత ఉంటోందని అధికారులు చెబుతున్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మండుతున్న ఎండల నుంచి కొంత ఉపశమనం ల భించనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే నాలుగు రోజులు పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఉపరితల చక్రవాక ఆవర్తనం, ద్రో ణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో 4రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు చెపుతున్నారు. అయితే వర్షాలు కురిసినా పలు జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తర తెలంగాణలో వడగాలులు వీస్తున్నాయని దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆదివారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబా ద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంటకు 3040 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆయా జి ల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు మరో 3రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా శనివారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5, జగిత్యాల జిల్లా ఎండపల్లి, నిర్మాల్ జిల్లా ఖానాపూర్లో 44.4 డిగ్రీలు నమోదయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సూర్యుడి ఎండ వేడిమికి కొంత విరామం లభించింది. శనివారం సాయంత్రం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. జయశర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో పెద్ద అంబర్పేట్, వనస్థలిపురం, హయత్నగర్, ఎల్బీనగర్, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ జల్లులు పడ్డాయి. మధ్యాహ్నం నుంచే నగరంలో ఆకా శం మేఘావృతమయి చల్లబడింది. రాష్ట్రంలో మార్చి చివరి నుంచి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ప్రస్తుతం సా ధారణం కంటే మూడు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావర ణ శాఖ తెలిపింది. ఏప్రిల్ మొదటి వారంలో రా ష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రజలకు కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఆ తర్వాత ఎండలు మళ్లీ తీవ్రరూపం దాల్చా యి. ఏప్రిల్ చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింత గా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచ నా వేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా ఎల్ నినో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 0.51 డిగ్రీ మేర పెరగడంతో ఎల్ నినో ప్రభావం ఏర్పడిందని, దీని కారణంగా దక్షిణ భారతదేశంపై ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వివరించింది. ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి, వర్షపాతం తగ్గే అవకాశం ఉంది.
అందరికీ చేరువయ్యే కథనంతో ‘రేజర్’.. ట్రైలర్ విడుదల
కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రవి బాబు తన తాజా చిత్రం ‘రేజర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లై యింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ ఒక డార్క్, ఫెరోషియస్ ప్రపంచాన్ని సూచిస్తోంది. ఈ కథలో రవి బాబు ఒక డాగ్ గ్రూమర్గా కనిపిస్తారు. ఒక చిన్న అమ్మాయిని కాపాడేందుకు అతను ఎంతవరకు వెళ్తాడో చూపించే పాత్ర ఇది. రచయిత, దర్శకుడిగా రవి బాబు తన ప్రత్యేక స్టయిల్ ని కొనసాగిస్తూ, ఈసారి అందరికీ చేరువయ్యే కథనంతో ముందుకొచ్చారు.
పాక్ హెడ్ కోచ్గా సర్ఫరాజ్ అహ్మద్
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును గాడిలో పెట్టేందుకు కీలక చర్య లు చేపట్టింది. ప్రపంచ క్రికెట్లో వరుసగా విఫలమవుతున్న జట్టును పటిష్టం చేసేందుకు ప్రణాళికను రూ పొందించిం ది. అందులో భాగంగా శనివారం కొత్త కోచ్లను నియమించుకుం ది. అయితే, బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్తో జట్టుకు పూర్వవైభవం తీసుకురావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూనియార్ స్థాయిలో కోచ్ గా సక్సెస్ అయిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ను ప్రదాన కోచ్గా ఎంపిక చేయగా.. బౌలింగ్ కోచ్గా పేసర్ ఉమ మ్ గుల్, బ్యాటింగ్ కోచ్గా అసద్ ఫసిక్లకు బాధ్యలను ఒప్పజెప్పింది. కాగా, పాకిస్థాన్ జట్టు వచ్చే నెలలో బంగ్లాతో రెండు మ్యాచ్ టెస్టు సిరీస్ ఆడనుంది. దీంతో బంగ్లా పర్యలనలోనే జట్టును గాడిలో పడేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
టెండర్లు ఆహ్వానించిన హెచ్సిఎ హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సిఎ) కీలక ముందడుగు వేసింది. ఐపిఎల్ తరహాలో తెలంగాణ టి20 లీగ్ ఎడిషన్ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ లీగ్ నిర్వహణకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. మొదట 5 ఏళ్ల పాటు జట్టు యాజమాన్య హక్కులు ఉంటాయని, ఆ తరువాత మూడేళ్లకోసారి రిన్యూవల్ చేసుకోవాలని తెలిపింది హెచ్సిఎ. జట్టు బిడ్ ధర రూ.3 కోట్లుగా నిర్ణయించారు. ఆటగాళ్ల జీతాలు, సిబ్బంది ఖర్చులు, వసతి, జెర్సీలు, ప్రయాణ ఖర్చులు సయితం ఫ్రాంచెజీలే భరించాలని, జట్టు కోనుగోలు చేసేందకు ఆసక్తి ఫ్రాంచైజీలకు ఈనెల 28వ తేదీలోపు టెండర్ పత్రాలు సమర్పించాలని స్పష్టం చేసింది. జూన్లో ప్రారంభమయ్యే ఈ లీగ్కు ఈనెల 30న షార్ట్లిస్ట్ చేసి, ఫ్రాంచైజీలను ప్రకటించనున్నట్టు పేర్కోంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు పాల్గొనే ఈ టోర్నీలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్ జట్లుగా ప్రకటించారు. 21 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో ఉప్పల్ వేదికగా 32 మ్యాచ్లు నిర్వహించనున్నారు.
ఉత్కంఠ పోరులో చెన్నైపై హైదరాబాద్ ఘన విజయం
ఉప్పల్ స్టేడయంలో జరిగిన ఉత్కంఠ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి అదిరిపోయే ఆరంభం లభించింది. అయితే, చివర్లో హైదరాబాద్ బౌలర్లు పుంజుకోవడంతో తిరిగి పట్టు సాధించింది. ఈక్రమంలో విజయం కోసం ఇరుజట్లు నువ్వా నేనా అన్నట్లు ఆడటంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో చివరి ఓవర్ వరకు వెళ్లిన ఈ మ్యాచ్ లో చెన్నైపై హైదరాబాద్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
రాజేంద్రనగర్ ఆర్డిఓకు ఆరు నెలల జైలు
అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు భూమి విచారణ చేపట్టిన ఆర్డీఓ తీర్పు వెల్లడించకపోవడం పట్ల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీలింగ్లో లేని భూమిలో హక్కుదారులను వెలువరచకపోవడంతో రెవెన్యూ డివిజనల్ అధికారి నిర్లక్ష్య వైఖరిపై దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కోర్టు ధిక్కరణగా పరిగణించి ఆర్డీఓ వెంకట్రెడ్డికి నెల రోజుల జైలుశిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధించింది. అయితే అప్పీలు నిమిత్తం తీర్పు అమలును రెండు వారాలు వాయిదావేశారు. వివరాల్లోకి వెళ్తే... రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సుమారు 74 ఎకరాల పైచిలుకు భూమి సీలింగ్లో ఉన్నట్లు చూపారు. దాంతో సదరు భూమి హక్కుదారు మహ్మద్ యూసఫుద్దీన్ భూ సంస్కరణల అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా 2017లో కోర్టు రాజేంద్రనగర్ భూ సంస్కరణల అధీకృత అధికారి (ఆర్డీవో)ను విచారించాలని ఆదేశించింది. దాంతో విచారణ చేపట్టిన ఆర్డీవో తీర్పును వెలువరుచకపోవడంతో కోర్టు ఆరు వారాలలో తీర్పు వెలువరుచాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను ఆర్డీవో ఖాతరు చేయలేదు. ఇటీవల విచారణ చేపట్టిన కోర్టు పై విధంగా తీర్పు వెలువరించింది. ఆర్డీవో వెంకట్రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేస్తూ ఈ వివాదాన్ని మరో అధికారికి కేటాయించాలని జిల్లా కలెక్టరును ఆదేశించింది. కాగా, అప్పీలు నిమిత్తం తీర్పు అమలును రెండు వారాలు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే రాజేంద్రనగర్ ఆర్డీవో శనివారం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా, పెద్దషాపూర్ పరిధిలోని 74 ఎకరాల పైచిలుకు భూమి ప్రస్తుతం చాలా విలువైనదిగా స్థానికుల ద్వారా తెలిసింది. పాలమాకుల నుంచి పెద్ద గోల్కోండ ఔటర్ రింగ్ రోడ్డుకు వెళ్లే రేడియల్ రోడ్డు ఇరువైపులా చిన్నజీయర్ ఆశ్రమం ఉన్నదని, దానిన తర్వాత ఉండే ఈ భూములున్నాయని తెలిసింది.
సల్మాన్ ఖాన్-నయనతార కాంబోలో వంశీ పైడిపల్లి మూవీ షురూ..
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టింది. ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవగా, కథానాయికగా నయనతార అధికారికంగా సెట్స్లో చేరారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ కొలాబరేషన్ కావడం విశేషం. ‘ఎస్విసి63’ ప్రాజెక్టు శనివారం సంప్రదాయ ముహూర్తం కార్యక్రమంతో ప్రారంభమై, నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్ మొదలైంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో హై-ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్లో నయనతార కూడా ప్రధాన తారాగణంలో చేరారు. బలమైన భావోద్వేగాలతో కూడిన హై ఎనర్జీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం 2027లో గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
హాలీవుడ్ స్థాయిలో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. పోస్టర్ రిలీజ్
ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ. హాయ్ నాన్న ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న భారీ గ్లోబల్ ప్రాజెక్ట్ను శనివారం అధికారికంగా ప్రకటించారు. ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. వైరా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్ చిత్రాల వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఎరిక్ డస్ట్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్థాయి క్రేజ్ తీసుకురావడంలో వారణాసి, రాకా చిత్రాల్లా విజయ్ శౌర్యువ్ మూవీ కూడా ప్రయత్నిస్తోంది. ఇక శనివారం రిలీజ్ చేసిన వీడీ శౌర్యువ్ మూవీ పోస్టర్ లో విజయ్ దేవరకొండ చేతిలో నాలుగు పెట్ డాగ్స్ ను తీసుకుని నడుచుకుంటూ వస్తుండటం, ఆసక్తి కలిగిస్తోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్డ్రాప్లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.
పవన్ కల్యాణ్కు తీవ్ర అస్వస్థత
ఎపి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం ఉదయం అధికారులతో సమావేశంలో ఉండగా తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను కూడా పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్ఐ కూడా నిర్వహించారు. రిపోర్టులను సమీక్షిం చిన వైద్యులు, శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించి విజయవంతంగా పూర్తి చేశారు. వారం నుంచి పది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత పవ న్ కల్యాణ్ తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని వైద్యులు వెల్లడించారు. అయితే, ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి గణనీ యమైన సమయం పడుతుందని, దీర్ఘకాలికంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వివరాలను జనసేన అధ్యక్షుడి రాజకీ య కార్యదర్శి పి. హరిప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా, పవన్ కల్యాణ్కు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వ హించినట్టు తెలుస్తోంది.
సిఎం మేడిగడ్డ పర్యటన ఒక బోగస్: ఎర్రవెల్లి దయాకర్రావు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే సభను ఫెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారని, సీఎం మేడిగడ్డ పర్యటన ఒక బోగస్ పర్యటన అని మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్రావు ఆరోపించారు. కేసీఆర్ నల్గొండలో మీటింగ్ పెడితే అప్పుడు మేడిగడ్డకు వచ్చాడని, ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తున్నాడని, కేసీఆర్ బయటకు వెళ్తే రేవంత్రెడ్డికి వణుకుపుడుతుందని ఎద్దేవా చేశారు. మహదేవ్పూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని మేడిగడ్డ బ్యారేజ్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో కలసి శనివారం ఆయన మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మట్లాడుతూ.. కేసీఆర్ జగిత్యాలలో వాలంటీర్లతో సమావేశం పెడితే, రేవంత్ అధికార యంత్రాంగాన్ని కదిలించి అధికారిక సమావేశం పెడుతున్నారని ఆరోపించారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా మూడేండ్లు రైతులను గోసపెట్టారని విమర్శించారు. 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్లో 20వ పిల్లర్ కుంగిపోయిన సంగతి తెలిసిందే కాగా దానికి మరమ్మతులు చేస్తే బీఆర్ఎస్కు, కేసీఆర్కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేయడం లేదని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం రూ.94 వేల కోట్లయితే, లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ విష ప్రచారం చేస్తున్నదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఏ ఒక్క ఎకరానికి సాగునీరు అందలేదని, ఈ ప్రాంత ప్రస్తుత ఎమ్మెల్యే నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటానని దుద్దిళ్ల శ్రీధర్బాబుకు సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్కు బుద్ధి చెప్పాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాజయ్య, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎంమ్మెల్యేలు పుట్ట మధు, ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, దాసరి మనోహర్, భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ జెడ్పి చైర్పర్సన్ జక్కు శ్రీహరిని రాకేష్, బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
పౌరసత్వ వివాదంలో రాహుల్కు ఊరట
ద్వంద్వ పౌరసత్వం వివాదంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉపశమనం కల్గింది. ఈ కేసులో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ దాఖలు వాయిదా పడింది. ఇంతకు ముందు వెలువరించిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సంబంధిత లక్నో బెంచ్ ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందటి ఆదేశాలను నిలిపివేసింది. న్యాయమూర్తులు సుభాష్ విద్యార్థితో కూడిన బెంచ్ ఇప్పుడు రాహుల్పై ఎఫ్ఐఆర్ దాఖలుకు ముందస్తు నోటీసు ఇవ్వడం చట్టపరంగా అవసరమా ? లేదా అనేది ఖరారు చేస్తుంది. ఇప్పటి ప్రాధమిక సాక్షాధారాల మేరకు చూస్తే నిందితుడు నేరానికి పాల్పడినట్లు భావించాల్సి వస్తోంది. కేంద్రీయ దర్యాప్తు సంస్థ పరిధికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును అప్పగించేందుకు సమ్మతిస్తోంది. అయితే దీనికి ముందు నోటీసు జారీ గురించి ఖరారు చేయాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ‘ఎలక్ట్రిక్ సోనా వీకెండ్’ ప్రకటించింది. అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ముందుకొచ్చింది. అన్ని వాహనాలపై రూ.50వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కొత్త వాహనాలపై రూ.40వేల డిస్కౌంట్ అందిస్తున్న ఓలా... హెచ్ఎస్బిసి, బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంకు తదితర క్రెడిట్ కార్డులపై రూ.10వేల వరకు అదనపు డిస్కౌంట్ అందజేస్తోంది. ఆఫర్లు నేడు ఆదివారంతో ముగియనున్నాయి.
భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు
న్యూఢిల్లీ : హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన భారత నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరపడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమం లోనే భారత్ లోని ఇరాన్ రాయబారికి కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హార్ముజ్ను ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించి 24 గంటలు గడవక ముందే ఇరాన్ మళ్లీ జలసంధిని మూసేసింది. ఇదే సమయంలో జలసంధి నుంచి వెళ్లేందుకు జగ్ అర్నవ్, సాన్మర్ హెరాల్డ్ అనే భారత నౌకలు ప్రయత్నించగా,వాటిలో జగ్ అర్నవ్ అనే చమురు నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కాల్పులు జరిపారు. ఈ సంఘటనపై తీవ్ర నిరసన తెలియజేస్తూ ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. భారత పతాకం ఉన్న ఈ చమురు నౌక ఇరాక్ నుంచి 2 మిలియన్ బ్యారెళ్ల చమురును మోసుకొస్తోంది.
బిజెపి డౌన్ఫాల్ మొదలైంది: మమతా బెనర్జీ
హౌరా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం బీజేపీపై , ప్రధాని నరేంద్రమోడీ, అమిత్షాలపై విరుచుకు పడ్డారు. 2029 నుంచి అమలు చేయాలనుకున్న మహిళా రిజర్వేషన్ కోటాకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపచేయడంలో వైఫల్యం కావడం తో కాషాయం పార్టీ డౌన్ఫాల్ ప్రారంభమైందన్నారు. హౌరా, సౌత్ 24 పరగణాల్లో యులుబెరియా, బరుయుపూర్ల్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో శనివారం ఆమె పాల్గొన్నారు. పార్లమెంటులో శుక్రవారం నాటి పరిణమాలు బీజేపీ స్వంతంగా మెజార్టీ అంటూ లేని మైనార్టీ అని, మిత్రపక్షాల పొత్తుతో మనుగడ సాగిస్తోందని తేటతెల్లం చేస్తున్నాయని మమత ధ్వజమెత్తారు. ఎన్డిఎ లోని కేవలం రెండుపార్టీల మద్దతు పైనే బీజేపీ ఆధారపడి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రానికి ఇది పెద్ద లోపమన్నారు. డీలిమిటేషన్తో మహిళా రిజర్వేషన్ ఎందుకు ముడిపెట్టారని ఆమె నిలదీశారు. “లోక్సభలో మీ ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఓడి పోతారు. ఈ మార్గాని బెంగాల్ చూపిస్తుంది ” అని వ్యాఖ్యానించారు.
Allu Arjun’s Raaka will release in 2027
Icon Star Allu Arjun is completely occupied with the shoot of his upcoming film Raaka. Atlee is the director of this unique attempt and the team is maintaining utmost secrecy about the film right from the genre to the shoot. The film started rolling last year and there are a lot of speculations about the […] The post Allu Arjun’s Raaka will release in 2027 appeared first on Telugu360 .
2023 మహిళా చట్టం అమలు చేయండి.. ప్రధానికి విపక్షాల లేఖ
న్యూఢిల్లీ: ఇంతకు ముందటి 2023 మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నాయి. ఇండియా కూటమి వేదిక ద్వారా ఈ మేరకు ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ 33 శాతం మహిళా కోటా చట్టం అమలులోకి వచ్చింది. దీనిని క్షేత్రస్థాయిలో తక్షణం అమలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతిపక్షాలు సమగ్ర లేఖ రాసేందుకు సిద్ధం అయ్యాయి. చట్టసభలలో మహిళలకు 33 శాతం కోటా విషయంలో ప్రతిపక్షాలు వ్యతిరేకతతో ఉన్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, దీనిని ఎదుర్కొవాలని సంకల్పించారు. ఇదే దశలో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాలలో మహిళా బిల్లుపై ప్రతిపక్షాల పార్టీల తరఫున ఇండియా కూటమి వేదికగా విలేకరుల సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి తరువాత తొలిసారిగా అధికార పక్షం సభా ముఖంగా ఎదురుదెబ్బ తింది. ఈ విషయాన్ని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసేందుకు ప్రజల వద్దకు వెళ్లాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మహిళా బిల్లుపై చిత్తశుద్ధి ఉంటే 2023 చట్టం అమలుకు ముందుకు రావాలని కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ సవాలు విసిరారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సోమవారం ఈ చట్టం అమలు విషయంలో చర్చించేందుకు సోమవారమే (20వ తేదీ) పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయాలి. మహిళా చట్టం మునుపటి స్థాయిలో ఉన్నదే అమలు చేస్తామని ప్రతిపాదించాలి. అప్పుడు ఈ కోటాకు ఎవరు వ్యతిరేకం? ఎవరు బాసటగా నిలుస్తున్నారు? అనేది స్పష్టం అవుతుందని ప్రియాంక తేల్చిచెప్పారు.
ట్రంప్ నియంత్రణలో మోడీ: రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రణలో ఉంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. అదే విధంగా ఎఐఎడిఎంకె ద్వారా తమిళనాడులో అధికారం చేజిక్కించుకుని తమిళనాడు ముఖ్యమంత్రిని తన నియంత్రణలో ఉంచుకోవాలని కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. మన రైతులను, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అమెరికాకు ధారాదత్తం చేయడమే కాకుండా మన ఇంధన భద్రతను, డేటాను అమెరికాకు అప్పగించేశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. “పార్లమెంట్లో నిన్న మీరు మోడీ ముఖాన్ని చూసే ఉంటారు. పూర్తిగా నమ్మకం కోల్పోయినట్టు కనిపించింది. విపక్షాలను ఆయన ఎదుర్కోలేకపోయారు. పక్కదారుల్లో కూర్చున్నారు. దీనికి కారణం ఆయన అమెరికా నియంత్రణలో ఉండడమే” అని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆయన సంతకం చేశారని, అది పూర్తిగా మనదేశాన్ని అమ్ముడుబోయేలా చేసిందని విమర్శించారు. ట్రంప్ నియంత్రణలో మోడీ ఉండడానికి ఎపిస్టెయిన్ ఫైల్స్ వ్యవహారమే కారణమని ఆరోపించారు. మోడీ ఆర్థిక సంబంధాలు ట్రంప్కు తెలుసునని, ఆదానీతో మోడీకి ఉన్న సంబంధాలు ట్రంప్కు తెలుసునని ధ్వజమెత్తారు.
తడబడిన సన్రైజర్స్ మిడిలార్డర్.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఉప్పల్ లో జరుగుతున్న మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్.. చెన్నై సూపర్ కింగ్స్ ముందు 195 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(59) మెరుపు అర్ధశతకంతో అలరించాడు. ఆ తర్వాత క్లాసెన్(59) కూడా హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ట్రావిస్ హెడ్ 23 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే, మిడిలార్డర్ విఫలమవ్వడంతో సన్రైజర్స్ 200 మార్క్ ను చేరుకోలేకపోయింది. ఇక, చెన్నై బౌలర్లలో జెమీ ఓవర్టన్, కాంబోజ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేష్ చౌదరి రెండు వికెట్లు, గుర్జప్నీత్ సింగ్ ఒక వికెట్ తీశాడు.
Mythri, Prashanth Neel’s Film Titled Impressively 418
Mythri Movie Makers is stepping into darker territory with its latest venture, 418, a film that aims to revive the true essence of horror. Presented by Prashanth Neel, and directed by Kirtan Nadagouda, the project has been unveiled with a spooky poster that immediately sets it apart from the recent wave of horror-comedy entertainers. The […] The post Mythri, Prashanth Neel’s Film Titled Impressively 418 appeared first on Telugu360 .
బ్యాంకాక్లో ప్రతిరోజూ 8 గంటల కఠోర శిక్షణ తీసుకుంటున్న రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’తో తన కెరీర్లో అత్యంత సవాలుతో కూడిన దశలోకి అడుగుపెడుతోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ’మైసా’లో రష్మిక ఒక గోండ్ గిరిజన అమ్మాయిగా కనిపిస్తోంది. ఈ పాత్రకు శారీరక దృఢత్వం అవసరం. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు రూపొందుతున్నాయి. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతోంది. కథ విన్న తర్వాత రష్మిక ఈ పాత్ర కోసం తనను తాను శారీరకంగా, మానసికంగా పూర్తిగా మార్చుకోవాలని ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. రా, రియల్గా అనిపించే యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆమె బ్యాంకాక్కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్స్డ్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు. త్వరలో కేరళలో 16 రోజుల పాటు కీలక యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందుకు అనుగుణంగా ఆమె ట్రైనింగ్ సాగుతోంది.
80%norules |స్లీపర్ బస్సుల ట్రెండ్ వెనుక వాస్తవం
80%norules | స్లీపర్ బస్సుల ట్రెండ్ వెనుక వాస్తవం 80%norules | ప్రమాదాలకు

39 C