మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మూడవ విద్యుత్ పంపిణి సంస్థ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి వి ద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన మూడవ డిస్కం పేరును తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టిజిఆర్పిడిసిఎల్)గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే దక్షిణ తె లంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (టిజిఎస్పిడిసిఎల్), ఉ త్తర తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (టిజిఎన్పిడిసిఎల్) రెండు డిస్కంలు పనిచేస్తున్నాయి. తాజాగా మూడ వ డిస్కంగా టిజిఆర్పిడిసిఎల్ను అధికారికంగా ఏర్పా టు చేశారు. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ నీటి సరఫరా వ్యవస్థలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పరిధిలోని కనెక్షన్లు, ఎల్టి విఐబి కేటగిరీ పరిధిలోని మునిసిపల్ నీటి సరఫరా కనెక్షన్లు టిజిఆర్పిడిసిఎల్ పరిధిలోకి రానున్నాయి. దక్షి ణ తెలంగాణ వి ద్యుత్ పంపిణి సంస్థలో సిఎండి గా పనిచేసిన అ నుభవమున్న ము షారఫ్ ఫరూఖీను కొత్త విద్యుత్ సంస్థకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. అలాగే రాష్ట్రంలోని దక్షిణ, ఉత్తర తెలంగాణ పంపిణి సంస్థల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్న వి.తిరుపతిరెడ్డి, పి.కృష్ణరెడ్డి, వి.మోహన్ రా వు, ఎన్.నరసింహులును పాలక మండలి సభ్యులుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కా గా, టిజిఆర్పిడిసిఎల్ నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బందిని డిప్యూటేషన్, ప్రత్యక్ష నియామకాలు లేదా అవుట్సోర్సింగ్ విధానం ద్వారా సమకూర్చుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సేవల సామర్థ్యాన్ని పెంచడం, రైతులకు మ రింత మెరుగైన సేవలు అందించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ధర్పల్లి మాజీ ఎంపిపి ఇమ్మడి గోపి దారుణ హత్య
ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి బుధవారం దారుణ హత్య కు గురయ్యారు. ఆయన సమీప బంధువే లింగాపూర్ గ్రామ శివారులో కారు తో ఆక్సిడెంట్ చేసి బయటకు ఈడ్చి కత్తుల తో పొడిచి హత్య చేసారని సమాచారం. నిజమాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి గోపి ధర్పల్లి లింగాపూర్ నుండి గౌరారం వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గొడ్డలితో దాడి చేసి సినిమాను తలపించే విధంగా పరిగెత్తించి గొడ్డలితో నరికి చంపినట్లు స్థానికులు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గురువారం రాశి ఫలాలు (12-03-2026)
మేషం ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. వృషభం సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. మిధునం ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కర్కాటకం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారంతో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సింహం సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. తుల చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృశ్చికం ఆదాయ మార్గాలు తగ్గుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. ధనస్సు ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారమున భాగస్తులతో సమస్యలు ఉంటాయి. బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మకరం కుటుంబ సభ్యులు నుండి ధనసహాయం లభిస్తుంది. గృహమున చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కుంభం మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారములలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనం దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి. సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వాషింగ్టన్ ః ఆద్యంతం భద్రతా ఏర్పాట్లతో నిఘాతో ఉండే అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వద్ద గురువారం ఉదయం తీవ్రకలకలం చెలరేగింది. వైట్హౌస్కు కూతవేటు దూరంలోని భద్రతా వలయాల కారిడార్లను వేగంగా ఢీకొంటూ ఓ వాహనం దూసుకువచ్చింది. ఎప్పుడూ ప్రజలు, సిబ్బందితో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఈ ఘటన కలవరానికి దారితీసింది. ప్రస్తుత యుద్ధ వాతావరణం దశలో అమెరికాలో మరింత సంచలనం అయింది. ఈ ఘటన వెంటనే డౌన్టౌన్లో రహదారులను మూసివేయించారు. జనం కదలికలను నియంత్రించారు. వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికార వర్గాలు పూర్తి స్థాయిలో సమగ్ర ప్రకటన వెలువరించాల్సి ఉంది.
నౌకపై దాడి అమానుషం.. హర్మూజ్ ఘటనను ఖండించిన భారత్
న్యూఢిల్లీ: హర్మూజ్ జలసంధి మార్గంలో భారత్లోని గుజరాత్ కాండ్ల రేవుకు వస్తున్న మయూరి నారీ నౌకపై రాకెట్ దాడిని భారతదేశం ఖండించింది. బుధవారం సాయంత్రం విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి ఘాటుగా స్పందన వెలువడింది. థాయ్ జాతీయ పతాకంతో వస్తున్న నౌకపై గుర్తుతెలియని క్షిపణి లేదా డ్రోన్ దాడి జరిగింది. ఈ క్రమంలో పలువురు సిబ్బంది గాయపడ్డారు. ఇంతవరకూ దాడికి ఏ సంస్థా బాధ్యత వహించలేదు. అయితే ఇరాన్ సైన్యం మాటువేసి ఈ దాడికి దిగినట్లు అంతర్జాతీయ మీడియా చెపుతోంది. వాణిజ్య నౌకపై దాడి జరిపి ప్రాణాంతక చర్యకు దిగడం అమానుషం, అనాగరికం అని ఖండించారు. ఇటువంటి చర్యలు గర్హనీయం అని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఓ నౌకపై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. కొందరు గాయపడ్డారు. ఇప్పుడు జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు జాడతెలియకుండా పోయినట్లు గుర్తించారు. వీరికోసం అన్వేషిస్తున్నారు. ఈ నౌకలోని 20 మందికి పైగా సిబ్బందిని , నౌక మంటల్లో చిక్కినా క్షేమంగా బయటకు తరలించినట్లు ఒమన్ నౌకాదళం తెలిపింది. అరబ్ ఏమిరేట్స్లోని ఖలీఫా పోర్టు నుంచి గుజరాత్ తీరానికి బయలుదేరినప్పుడు దాడికి గురైంది.
ఖమ్మం వెలుగుమట్ల బాధితుల ఇళ్లు కూల్చేసిన చోటనే ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవా రం సాయంత్రం విరమించారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వెలుగుమట్ల బాధితులకు ఇండ్లు కూల్చేసిన చోటునే కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఖమ్మంలో మహాధర్నా చేపట్టిన కవిత, విశార దన్, బాధితులు అదే రోజు రాత్రి నిర్వాసితులతో కలిసి అంబేద్కర్ భవన్ లో నిరవధిక నిరాహార దీక్ష చేసిన విషయం విదితమే. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ సహా ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేసి, విడుదల చేశారు. అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత, డీఎస్పీ ఆఫీస్లో విశారదన్ దీక్ష కొనసాగించారు. ప్రభుత్వం ఆక్రమణదారులు అంటూ వెలుగుమట్లలో ఇండ్లు కూల్చేసిన వారినే బుధవా రం ఆ స్థలాలకు యజమానులుగా పేర్కొం టు టోకెన్లు జారీ చేయడంతో దీక్ష విరమించినట్లు ప్రకటించారు. వెలుగుమట్లలో మిగతా బాధితులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని కవిత, విశారదన్ ప్రకటించారు. బాధితులపై కేసులు ఎత్తేయాలి కానీ బాధితులకు అండగా నిలిచిన జాగృతి కార్యకర్తలపై కేసులు పెట్టారని కవిత అన్నారు. తనపై, విశారదన్పై పెట్టిన కేసులు ఎత్తివేయకపోయి నా పర్వాలేదు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, జాగృతి కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. తమ దీక్ష సందర్భంగా ఎన్నో ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
హర్మూజ్ జలసంధి మార్గంలో భారత్లోని గుజరాత్ కాండ్ల రేవుకు వస్తున్న మయూరి నారీ నౌకపై రాకెట్ దాడిని భారతదేశం ఖండించింది. బుధవారం సాయంత్రం విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి ఘాటుగా స్పందన వెలువడింది. థాయ్ జాతీయ పతాకంతో వస్తున్న నౌకపై గుర్తుతెలియని క్షిపణి లేదా డ్రోన్ దాడి జరిగింది. ఈ క్రమంలో పలువురు సిబ్బంది గాయపడ్డారు. ఇంతవరకూ దాడికి ఏ సంస్థా బాధ్యత వహించలేదు. అయితే ఇరాన్ సైన్యం మాటువేసి ఈ దాడికి దిగినట్లు అంతర్జాతీయ మీడియా చెపుతోంది. వాణిజ్య నౌకపై దాడి జరిపి ప్రాణాంతక చర్యకు దిగడం అమానుషం, అనాగరికం అని ఖండించారు. ఇటువంటి చర్యలు గర్హనీయం అని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఓ నౌకపై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. కొందరు గాయపడ్డారు. ఇప్పుడు జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు జాడతెలియకుండా పోయినట్లు గుర్తించారు. వీరికోసం అన్వేషిస్తున్నారు. ఈ నౌకలోని 20 మందికి పైగా సిబ్బందిని , నౌక మంటల్లో చిక్కినా క్షేమంగా బయటకు తరలించినట్లు ఒమన్ నౌకాదళం తెలిపింది. అరబ్ ఏమిరేట్స్లోని ఖలీఫా పోర్టు నుంచి గుజరాత్ తీరానికి బయలుదేరినప్పుడు దాడికి గురైంది.
పునరుద్ధరణకు సిద్ధం లక్ష్మీపురం–రుద్రారం త్రికూట శివాలయం
కాకతీయుల కాలం నాటి శిధిల దేవాలయానికి పునర్వైభవం లక్ష్యం
ഫാക്ട് ചെക്ക്: കുംഭമേളയിലെ വൈറൽ താരത്തെ വിവാഹം ചെയ്തത് കേരളത്തിൽ നിന്നുള്ളയാളല്ല.
തിരുവനന്തപുരത്ത് വെച്ച് വിവാഹിതയായ മൊണാലിസ ഭോസ്ലേയുടെ വരൻ മഹാരാഷ്ട്ര സ്വദേശിയാണ്
Fact Check: Viral video claiming Benjamin Netanyahu’s house is on fire is false
The footage actually shows a February 2026 house fire in Galloway, New Jersey
ఇక యుద్ధం ఎప్పుడైనా ఆగిపోతుంది: ట్రంప్
ఇరాన్ను దెబ్బతీయడానికి ఏమిలేదు నాయకుడు లేడు. నాయకత్వం దెబ్బతింది ఆరువారాల లక్ష్యం.. రెండో వారంలోనే పూర్తి హడావిడి ప్రెస్మీట్లో ట్రంప్ కీలక ప్రకటన వాషింగ్టన్ : ప్రస్తుత మధ్యప్రాచ్య యుద్ధం ఏ క్షణంలో అయినా ఆగిపోవచ్చునని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్ తో తమ యుద్ధం అనంతర పరిణామాల విశ్లేషణ క్రమంలో తమ ఆంతరంగిక సలహదారులతో ట్రంప్ సుదీర్ఘంగా చర్చించారు. తరువాత వైట్హౌస్లో కిక్కిరిసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. యుద్ధం ఆగిపోతుంది. అయితే ఇది తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆగిపోవచ్చు. ఇప్పుడు తమ ముందు ఇరాన్ సంబంధిత టార్గెట్స్ ఏమీ మిగిలిలేవు. అక్కడి అగ్రనాయకత్వం పోయింది. రెండో శ్రేణి కథ ముగిసింది. ఇక తాము కొట్టడానికి మిగిలిదేమీ లేదని ట్రంప్ స్పందించారు. ఇరాన్ ఇక సరైన నాయకత్వంతో ముందుకు సాగుతుందని అనుకుంటానని తెలిపారు. ఇప్పటికే ఇరాన్ సైనిక బలగాలు బాగా దెబ్బతిన్నాయని, వారు కోలుకోలేని రీతిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక యుద్ధం ముగుస్తుంది. త్వరలోనే ఆగిపోతుందని తెలిపారు. ఇజ్రాయెల్ బలగాలతో కలిసి అమెరికా సేనలు సాగించిన పోరులో ఇరాన్లోని పలు వ్యూహాత్మక స్థావరాలను దెబ్బతీశామని వివరించారు. ఇంకా కొన్ని మిగిలి ఉండవచ్చు. అయితే వారు పుంజుకోవడానికి మిగిలిందేమీ లేదన్నారు. తాను ఎప్పుడు ఆపివేయాలనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుందని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ యుద్ధం స్వల్పకాలికమే అన్నారు. అయితే యుద్ధం ముగిసిందనే ట్రంప్ వాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ రెవెల్యూషనరీ గార్డ్ దళాలు ఇప్పుడు అమెరికా కీలక స్థావరాలను, ప్రత్యేకించి టెక్ సాధనసంపత్తిని దెబ్బతీసే క్రమంలో ఉన్నాయని తెలిపారు. తాము బలోపేతం అవుతున్న దశలోనే, అమెరికాలో ట్రంప్పై వ్యతిరేకత పెరుగున్నదని, దీనితోనే ఆయన ఇప్పుడు ఓ డ్రామాగా ఈ మాటలకు దిగారని ఇరాన్ స్పందించింది. ఇప్పటికి సాగిన వార్ గొప్పగా ఉందని, తాము నిర్ణీత లక్షాలను కాలపరిమితికి ముందే చేరుకున్నామని , అనుకున్న దానికంటే ముందే శత్రువును దెబ్బతీయడం జరిగింది. ఇది అమెరికాకు గ్రేట్ వార్, అంతకు మించి గ్రేట్ ఫన్ అన్నారు. నిర్ణీత అంచనాల ప్రకారం ఆరు నెలలు యుద్ధం ఉంటుందనుకున్నానని, అయితే ముందే ఆగిపోయేలా ఉందని తెలిపారు. ఇరాన్ది విచ్ఛిన్నకర విధానం అని విమర్శించారు. ఇతర ప్రాంతాలపై అల్లరిచిల్లరిగా దాడికి దిగడం ద్వారా దశాబ్దాల తరబడి కోలుకులేని నష్టం కల్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. చమురు ఎఫెక్ట్తోనే ట్రంప్ ప్రకటన? ఓ వైపు గల్ఫ్దేశాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం, దీనితో ఆయా దేశాల నుంచి అమెరికాపై ఒత్తిళ్లు, మరో వైపు హర్మూజ్ జలసంధి నౌకా మార్గంలో చమురు రవాణా నౌకలపై ఇరాన్ బలగాల దాడులు, చమురు సరఫరా వలయానికి విఘాతం, అన్నింటికీ మించి అమెరికా సైన్యం ఇప్పటి యుద్ధంపై మానసికంగా వ్యతిరేకత ప్రదర్శించడం వంటి కారణాలతోనే ట్రంప్ ఇప్పుడు యుద్ధం ఆగిపోతుందని ప్రకటించినట్లు విశ్లేషిస్తున్నారు. ఇక ఏ దశలో అయినా బ్యారెల్ చమురు ధర 200 డాలర్లకు చేరుకుంటుందని ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయ ఇంధన ఆధారిత మార్కెట్లో ప్రకంపనలకు దారితీసింది. మరో వైపు రష్యా అధ్యక్షులు పుతిన్ నేరుగా ట్రంప్తో ఫోన్లో మాట్లాడటం, జరుగుతున్న పరిణామాల్లో అమెరికా నుంచి తక్షణ స్పందన అవసరం అని తెలియచేయడంతో ట్రంప్ తానే గెలిచినట్లు ప్రకటిస్తూ యుద్ధ విరమణకు దిగినట్లు స్పష్టం అవుతోంది. మరో వైపు చైనా అత్యంత వ్యూహాత్మకంగా ఇరాన్కు బలోపేతమైన ఆయుధ వ్యవస్థను అందించడం, తాము వెంట ఉంటామని అంతర్గతంగా తెలియచేయడం వంటి పరిణామాలు కూడా అమెరికా వైఖరిలో కొట్టొచ్చేమార్పునకు దారితీసిన కారణాలు అని ప్రచారం జరుగుతోంది. వైమానిక దాడుల క్రమంలో ఇరాన్కు ఏ మేరకు నష్టం జరిగిందనేది బేరీజు వేసుకుని, ఈ క్రమంలో అమెరికా సైనిక పాటవ శక్తికి ఆర్థిక నష్టం ఏ మేరకు ఉందనేది లెక్కించుకుని ప్రస్తుత యుద్ధపర్వానికి ముగింపును , దీనికి ముందు సంబంధిత సంకేతాలను వెలువరించాలని ట్రంప్ భావించినట్లు , దీని వెనుక ఆయన సలహాదారుల బృందం కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. సుదీర్ఘ కాల యుద్ధమే ః ఇజ్రాయెల్ ఓ వైపు ట్రంప్ యుద్ధం ముగిసిందని చెపుతున్న దశలోనే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జూ భిన్నంగా స్పందించారు. ఇది ఇప్పట్లో తేలేది కాదని, దీర్ఘకాలిక యుద్థానికే ఇజ్రాయెల్ సంసిద్ధం అయిందని ఇజ్రాయెల్లో ఓ గుర్తు తెలియని చోటు నుంచి మాట్లాడుతూ చెప్పారు. నిర్ణీత లక్షాలను చేరుకోవల్సి ఉంటుంది. నిర్ణయాత్మక విజయం దక్కేవరకూ పోరు నిలిపేది లేదని , ఇందుకు ఇజ్రాయెల్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత తీవ్రస్థాయి పోరు బుధవారంతో రెండో వారంలోకి చేరుకుంది.
IPL 2026.. ఉప్పల్పై చిన్న చూపు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ 2026 తొలి విడత షెడ్యూల్లో హైదరాబాద్కు ఒక మ్యాచ్ను మాత్రమే కేటాయించారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇతర నగరాలకు రెండేసి మ్యాచ్లను కేటాయించిన నిర్వాహకులు హైదరాబాద్కు మాత్రం ఒక మ్యాచ్తోనే సరిపెట్టారు. ఏప్రిల్ 5న ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో లక్నోతో హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ క్రికెట్లో రాజుకున్న వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
మహిళా సాధికారతకు రైల్వే శాఖ పెద్ద పిట..
మహిళా సాధికారతకు రైల్వే శాఖ పెద్ద పిట.. విజయవాడ రైల్వే డివిజన్లో ఘనంగా
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ధర్పల్లీ మండల కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఓ వ్యక్తి మహిళా మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా, అది ఒక్కసారిగా కింద పడిపోవడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీయగా.. మృతురాలు సీతాయిపేటకు చెందిన జారుపుల కాంతిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు . మృతదేహాన్ని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె ఎలా మృతి చెందింది? మృతదేహాన్ని బైక్పై ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు
మంత్రి కొండా సురేఖను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు కరీమాబాద్, ఆంధ్రప్రభ :
దాగుడుమూతలాడుదామని అత్యాచార యత్నం..
దాగుడుమూతలాడుదామని అత్యాచార యత్నం.. శివ్వంపేట, ఆంధ్రప్రభ : నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ళ
Video : Director Harish Shankar Exclusive Interview
The post Video : Director Harish Shankar Exclusive Interview appeared first on Telugu360 .
ఛత్తీస్ ఘడ్ లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల దండకారణ్యం నుంచి 108 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర డిజిపి అరుణ్ దేవ్ గౌతమ్ వెల్లడించారు. బుధవారం ఆయన బస్తర్ డివిజన్ కేంద్రమైన జగదల్పూర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సంయుక్తంగా రాష్ట్రంలో దండకారణ్యం ప్రాంతాలలో శాంతిని నెలకొల్పాలనే దిశగా మావోయిస్టుల కార్యకలాపాలను నిర్మూలించడానికి పునరావాస పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో హింస మార్గాన్ని వీడి రాష్ట్రంలోని వివిధ దండకారణ్య జిల్లాల నుండి బుధవారం 108 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఆయన వెల్లడించారు.లొంగిపోయిన వారిలో 5 గురు డివిజన్ కమిటీ సభ్యులు, ఇద్దరు జోనల్ స్థాయి పి ఎల్ జి ఏ కంపెనీ చీఫ్ లు, 15 మంది ప్లాటు పార్టీ కమిటీ సభ్యులు, 21 మంది ఏరియా కమిటీ సభ్యులు,63 మంది పార్టీ కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. లొంగిపోయిన 108 మంది మావోయిస్టులపై 3 కోట్ల 29 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు తెలిపారు.వీరి వద్దనుండి ఏకే పార్టీ 47 రైఫిల్స్ 6, ఏకే 47 తార్ 1,10 ఇన్సాస్ రైఫిల్స్, కార్బన్ 1, ఎస్ ఎల్ ఆర్ రైఫిల్స్ 5,7.62 ఎం ఎం ఎల్ ఎం జి 1,5.56 ఎం ఎం ఎల్ ఎం జి 1,303 ఎం ఎం ఎల్ ఎం జి 1,303 రైఫిల్స్ 20, 12 బోర్ రైఫిల్స్ 25, బీజీఎల్ లాంచర్లు 11, 51 ఎంఎం మోర్టర్ 1, 315 బోర్ రైపిల్స్ 3, మజిల్ లోడింగ్ రైఫిల్, బర్మర్ 13, మెగా బిజిఎల్ 1 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుండి అందే అన్ని సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు.అలాగే రాష్ట్రంలో గత 26 నెలల్లో 2714 మంది మావోయిస్టు లొంగిపోయినట్లు,వీరిలో ముఖ్య నేతలు, వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, పార్టీ సభ్యులు ఉన్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ వివేకానంద్, బిఎస్ఎఫ్ అదనపు డిజిపి శివాంగ్ నాంగ్యాల్, బస్తర్ రేంజ్ డీఐజీ పి సుందర్ రాజ్, సిఆర్పిఎఫ్ ఐజి షాలిన్, చత్తీస్ ఘడ్ సాయుధ దళాల ఐజి బిఎస్ ధ్రువ, బస్తర్ డివిజన్ లోని ఏడు జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.
భాగ్యనగరానికి తాకిన ‘గ్యాస్’ సెగ
హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్- ,అమెరికా-, ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు సైబరాబాద్ పరిధిలోని హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్న హాస్టళ్లు, చిన్న, పెద్ద హోటళ్లు, మెస్ కేంద్రాలు ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బ్లాక్ మార్కెట్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. రోజూ వందలాది మందికి వంట చేయాల్సిన హాస్టల్ నిర్వాహకులు గ్యాస్ అందుబాటులో లేక వంట పనులను కొనసాగించడం కష్టంగా మారిందని చెబుతున్నారు. హాస్టళ్లలో నివసించే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు బయట నుంచి వచ్చి ఇక్కడే ఉంటూ ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు హాస్టళ్లలో లేదా సమీప హోటళ్లలోనే ఆహారం తీసుకుంటారు. అయితే గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో చాలా హాస్టళ్లలో వంట పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. కొంతమంది నిర్వాహకులు తాత్కాలికంగా ఇండక్షన్ స్టౌలు లేదా చిన్న సిలిండర్లతో వంట చేయడానికి ప్రయత్నిస్తున్నా, పెద్ద సంఖ్యలో ఉన్న నివాసితులకు ఆహారం సిద్ధం చేయడం సాధ్యపడటం లేదని చెబుతున్నారు. దీంతో కొన్ని హాస్టళ్లు బయట హోటళ్ల నుంచి భోజనం తెప్పించి ఇస్తుండగా, మరికొన్ని తాత్కాలికంగా మెస్ సేవలను నిలిపివేశాయి. ఇక హోటళ్ల పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. కమర్షియల్ గ్యాస్ లేకపోవడంతో అనేక చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తమ వ్యాపారాన్ని కొనసాగించడం కష్టంగా మారింది. కొంతమంది హోటల్ యజమానులు వ్యాపార సమయాలను తగ్గించగా, మరికొన్ని హోటళ్లు పూర్తిగా మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా రాత్రి ఆలస్యంగా వరకు బయట ఫుడ్పైనే ఆధారపడుతుంటారు. రాత్రి రెండు గంటల వరకు కూడా తెరిచి ఉండే టిఫిన్ సెంటర్లు, హోటళ్లు ఈ ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా ఆహారం అందుబాటులో లేకపోవడం ఉద్యోగులకు పెద్ద సమస్యగా మారుతోంది. మేము రోజూ హాస్టల్ మెస్ లేదా సమీప హోటళ్లపైనే ఆధారపడుతుంటాం. ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల భోజనం దొరకడం కూడా కష్టంగా మారింది. ఇది ఇంకా కొనసాగితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఒక ఐటీ ఉద్యోగి తెలిపారు. రోజూ వందల మందికి వంట చేయాలి. కమర్షియల్ గ్యాస్ లేకపోతే అది అసాధ్యం. చిన్న సిలిండర్లతో అంత పెద్ద స్థాయిలో వంట చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఒక హాస్టల్ నిర్వాహకుడు తెలిపారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ఐటీ కారిడార్లో ఆహార సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. కరోనా సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసేలా పరిస్థితులు మారుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, సంబంధిత గ్యాస్ సరఫరా సంస్థలు తక్షణ చర్యలు తీసుకుని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని హాస్టల్ నిర్వాహకులు, హోటల్ యజమానులు, ఉద్యోగులు కోరుతున్నారు. లేదంటే నగరంలోని కీలక ఐటీ ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హాస్టల్ నిర్వాహకులు సమావేశం ఏర్పాటు చేసి హాస్టల్స్ నడపలెమని చేతులెత్తెశారు.కనీసం హాస్టల్స్ వరకు డొమెస్టిక్ వాడేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వైపుకు కంపెనీల మొగ్గు : ప్రస్తుతం మళ్ళీ నగర జీవనంపై కరోనా లాంటి పరిస్థితులు దాపురించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హాస్టల్స్, హోటల్స్లలో గ్యాస్ లేక ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున సైబరాబాద్ పవరిధిలోని పలు కంపెనీలు తమ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఫుడ్ బిజినెస్కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నగరంలో హోటల్స్ మూతతో కోట్లాది రూపాయల నష్టం ఏర్పడే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ రంగం పై ఆధారపడి బతికే కార్మికులకు గడ్డు పరిస్థితులు ఏర్పడనున్నాయి.
లోక్సభ అందరిదీ.. మాట్లాడనివ్వాల్సిందే: రాహుల్
న్యూఢిల్లీ: చట్టసభ అంటే ఏదో ఒక పార్టీకి చెందినది కాదు. మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహించేది అని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. తనను అనేక సార్లు సభలో కీలక విషయాలపై మాట్లాడనివ్వలేదని, ఇది ఎంతవరకూ న్యాయం అని ప్రశ్నించారు. స్పీకర్ ఓం బిర్లా తొలిగింపు తీర్మానంపై చర్చలో ఆయన జోక్యం చేసుకుంటూ రాహుల్ మాట్లాడారు. సభ దేశానికి చెందినది. దేశానికి సంబంధించిన కీలక సమస్యలు, అంశాలపై మాట్లాడే అవకాశం, అధికారం అందరికీ ఉంటుంది. అడ్డుకోవడం కుదరదని తెలిపారు. ప్రధాని మోడీ అన్ని విషయాలపై రాజీపడ్డారని, దీని ఫలితం ఏ విధంగాఉందనేది అందరికీ తెలిసివస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత సభలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పార్లమెంటరీ నియమావళిని నిబందనలను పట్టించుకోవల్సి ఉందని బిజెపి ఎంపి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. మంత్రి ప్రజాస్వామిక ప్రక్రియను గౌరవిస్తూ మాట్లాడాల్సి ఉంటుంది. పలు సార్లు సభలో అధికార పక్షం, మంత్రులు తన పేరు అనుచితంగా ప్రస్తావించారు. స్పీకర్ పాత్ర ఏమిటనేది సభ్యులందరికీ అవసరం అయిన విషయం. సభ ప్రజల స్పందనకు వ్యక్తీకరణకు వేదిక కావాల్సి ఉంటుంది. తాను ఎప్పుడు సభలో మాట్లాడాలనుకున్నా తనను అడ్డుకున్నారని , ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు.
పౌర సేవల ప్రజాభిప్రాయంలో…పల్నాడుకు రెండవ స్థానం…!!
పౌర సేవల ప్రజాభిప్రాయంలో…పల్నాడుకు రెండవ స్థానం…!! పల్నాడు ప్రతినిధి, ఆంధ్ర ప్రభ: పౌర
చమురు నిల్వల విడుదలకు జపాన్ నిర్ణయం
టోక్యో: ఇరాన్ యుద్ధం కారణంగా అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో అంతర్జాతీయగంగా బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్లకు మించి పెరిగింది. ఈ నేపథ్యంలో చమురు సరఫరా పెంచి ధరలను అదుపులో పెట్టడానికి వివిధ దేశాలు తమ వద్ద ఉన్న వ్యూహాత్మక చమురు రిజర్వులను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు జపాన్ తమ దేశంలో ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయబోతున్నట్టు జపాన్ ప్రధాని సనాయే తకాయిచి బుధవారం వెల్లడించారు. ఈ నెల 16 లోగా చమురు నిల్వలను విడుదల చేస్తామని ఆమె ప్రకటించారు. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరల స్థిరీకరణ జరుగుతుందని సికాయిచి అన్నారు. ఈ పనిచేసిన తొలి జీ7 దేశంగా జపాన్ నిలిచింది. చమురు సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు చమురును ఎక్కువగా వినియోగించే దేశాలు తమ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్ నుంచి కొంత విడుదల చేయాలనేది ఒక ఒప్పందం. దీనివల్ల ఇతర దేశాలకు సరఫరా పెంచి, ధరలను తగ్గించి, అక్కడి ప్రజలకు ఉపయోగపడేలా చేయవచ్చు. ఈ వ్యవహారాన్ని అంతా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ నూతన సుప్రీం మొజ్తాబా ఖమేనీ సురక్షితం
టెహ్రాన్: ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గాయపడినట్టు వార్తలు వచ్చాయి. వీటిని ఇరాన్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగా, సురక్షితంగానే ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుమారుడు యూసఫ్ వెల్లడించారు. మొజ్తాబా గాయపడినట్టు వస్తున్న వార్తలు తన దృష్టికి వచ్చాయని, ఆయన సన్నిహితుల నుంచి ఆరా తీయగా ఆయన క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని వారు చెప్పారని యూసఫ్ పేర్కొన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ ఆపరేషన్ చేపట్టిన తొలి రోజులోనే మొజ్తాబా తన భార్య, తండ్రి ఖమేనీతో సహా పలువురు కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఈ దాడుల్లో ఆయన కూడా గాయపడినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. పశ్చిమాసియాలో భీకరంగా పోరు సాగుతున్నా ఆయనకు కనిపించకపోవడం , ప్రజలను ఉద్దేశించి ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిచ్చింది. సుప్రీం నేతగా ఇటీవల ఆయన ఎన్నికైనా ఆయన కార్యాలయం నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో తలెత్తిన సందేహాలన్నీ తాజాగా ఇరాన్ అధ్యక్షుడి కుమారుడి ప్రకటనతో దూరమయ్యాయి.
పల్నాడులో నెదర్లాండ్స్ బృందం పర్యటన
పల్నాడులో నెదర్లాండ్స్ బృందం పర్యటన పల్నాడులో ప్రకృతి వ్యవసాయ నమూనాలపై నెదర్లాండ్స్ నిపుణుల
కావూరి సాంబశివరావు కన్నుమూత..ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు (82) అనారోగ్యంతో బుధవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను గురువారం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహిం నున్నట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కావూరి చురుగ్గా పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆయన 5 సార్లు లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మచిలీ పట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించారు.యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. కావూరి సాంబశివరావుకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విశాఖపట్నం ఎంపీ, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు అయిన శ్రీ భరత్... కావూరి సాంబశివరావుకు స్వయానా మనవడు (కుమార్తె కుమారుడు). రాష్ట్ర విభజన సందర్భంలో ఆయన సమైక్యాంధ్రకు మద్దతిచ్చారు. కావూరి సాంబశివరావు వరంగల్లోని ఆర్ఇసిలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. కావూరి మృతి పట్ల పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖు లు సంతాపం వ్యక్తం చేశారు. ఎపి సిఎం చంద్రబాబు సంతాపం ‘సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి అత్యంత బాధాకరం. మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు మరణం తీరనిలోటు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరిది ప్రత్యేక ముద్ర. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కావూరి సాంబశివరావు మృతి పట్ల ఎపి బిజెపి అధ్యక్షుడు మాదవ్ సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు హిందీ పాటలతో సందడి చేస్తున్న శ్రీలంక గాయని యోహాని #Yohani#ManikeMageHithe#TeluguSong
సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే జూలకంటి
సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే జూలకంటి పల్నాడు ప్రగతే చంద్రబాబు ధ్యేయం: ఎమ్మెల్యే
Hansika Motwani is now Divorced
Actress Hansika Motwani got married to businessman Sohael Khaturiya four years ago and they have been granted divorce by the Bandra Family Court in Mumbai today. Hansika appeared before the court and she appealed for separation by mutual consent. The family members and the friends tried to reconcile them but the efforts were not successful. […] The post Hansika Motwani is now Divorced appeared first on Telugu360 .
ఈ నెల 13న గన్నవరంలో సీఎం చంద్రబాబు పర్యటన
ఈ నెల 13న గన్నవరంలో సీఎం చంద్రబాబు పర్యటన సూరంపల్లిలో ‘అన్నదాత సుఖీభవ’
పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు భాగస్వాములు కావాలి
పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు భాగస్వాములు కావాలి చెత్తను పారేయకుండా కళగా మార్చుకుందాంమున్సిపల్ కార్యాలయంలో
సమాజ సేవలో ఆదర్శం.. స్టేషన్ ఘన్ పూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్
సమాజ సేవలో ఆదర్శం.. స్టేషన్ ఘన్ పూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ రామలింగేశ్వర
ప్రియుడిని పెళ్లి చేసుకున్న మోనాలిసా #Monalisa #Wedding #Thiruvananthapuram #NewsUpdate #TeluguNews
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ రోజు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM కిసాన్) లబ్ధిదారులకు శుభవార్త. 22వ విడత పిఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. మార్చి 13న గౌహతి పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ 22వ విడత నిధులను విడుదల చేస్తారు. ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు సుమారు రూ.19,000 కోట్లు విడుదల చేయనున్నట్లు వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, ఫిబ్రవరి 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan)ను ప్రారంభించింది. ఈ పథకం కింద, దేశంలోని అర్హత కలిగిన రైతులందరికీ ప్రభుత్వం ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మూడు వాయిదాలలో రూ.6,000 పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
లోక్సభ స్పీకర్పై వీగిన అవిశ్వాసం..
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణం మూజువాణి ఓటుతో వీగిపోయింది. స్పీకర్ సభలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తు విపక్ష సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి నేటి వరకూ సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో విపక్షాలు చేసిన విమర్శలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్పై మండిపడ్డారు. అనంతరం సభ గురువారానికి వాయిదాపడింది.
‘జైలర్- 2’ లో పోలీసు ఆఫీసర్ గా షారుఖ్ ఖాన్
సూపర్స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ చిత్రం ‘జైలర్- 2’. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. 2023లో విడుదలైన జైలర్కు సీక్వెల్గా ఈ చిత్రం రూపుదిద్దు కుంటోంది. ఈ సినిమాలో షారుఖ్ ప్రత్యేక పాత్రలో ఓ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. ఈనెల చివరి వారంలో సెట్స్లోకి షారుఖ్ వస్తాడనీ, ఎనిమిది రోజుల పాటు చిత్రీకరించనున్న సన్నివేశాలతో షూటింగ్ పూర్తవుతుందని తెలిసింది. కాగా ‘జైలర్’లో శివరాజ్కుమార్, మోహన్లాల్ వంటి స్టార్ నటులు కథను మలుపు తిప్పే అతిథి పాత్రల్లో నటించారు.
ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదు : జగపతిబాబు
ప్రముఖ నటుడు జగపతి బాబు బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ ’వదలా’తో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకత్వంలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. బుధవారం మేకర్స్ గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో హీరో జగపతిబాబు మాట్లాడుతూ “అందరూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమా భోపాల్లో చేశాం. భరద్వాజ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కార్తిక్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. తన నుంచే వదలా అనే టైటిల్ కూడా వచ్చింది. లయ ‘వదలా’లో అద్భుతంగా నటించింది. ఆముద పాత్రలో హ్రితిక కూడా చాలా చక్కగా నటించింది”అని అన్నారు. హీరోయిన్ లయ మాట్లాడుతూ “డైరెక్టర్ వంశీ కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి కథ నేనెప్పుడూ కూడా వినలేదు. చివరి వరకు ఏమవుతుందో అనేది ఎవరు ఊహించలేరు”అని తెలిపారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ “జగపతి బాబుకి ఈ కథ చాలా నచ్చింది. కథ పై నమ్మకంతో ఈ సినిమా మొదలుపెట్టాం”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హృతికా శ్రీనివాస్, కిషోర్ నాయుడు, చోటా కె నాయుడు, కార్తీక్ పాల్గొన్నారు.
Jagapathi Babu’s Vadhala Teaser: Haunting Thriller
Jagapathi Babu who is busy with multiple films as a character artist is back to playing the lead in Vadhala, a suspense drama. Directed by Akella V Krishna and backed by producers Kishore Naidu Chirumamilla and Tammareddy Bharadwaj, the film also features Laya and Hrithika Srinivas in key roles. The newly released teaser opens with […] The post Jagapathi Babu’s Vadhala Teaser: Haunting Thriller appeared first on Telugu360 .
తమ్ముడు శ్రీకృష్ణ పిచ్చి మాటలు మాట్లాడవద్దు: కెటిఆర్
తమ్ముడు పిచ్చి మాటలు మాట్లాడవద్దని టిడిపి ఎంపి శ్రీకృష్ణదేవరాయపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో తెలంగాణపై ఎంని శ్రీకృష్ణదేవరాయ చేసిన కామెంట్పై కెటిఆర్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు అయిపోయిందని, అభివృద్ధిలో దూసుకుపోతోందని కెటిఆర్ గుర్తు చేశారు. నువ్వు మా తమ్ముడివి, యువకుడివి, వేరేవాళ్ల గురించి తప్పుడు మాటలు మాట్లాడాల్సిన ఖర్మ మాకు లేదని, ఎపి, తెలంగాణ బాగుండాలని మేం కోరుకుంటున్నామని, ఎపి అభివృద్ధిపై, చంద్రబాబు చేస్తున్న మంచి పనులపై మాట్లాడాలని, తెలంగాణపై ఏడుపులు బంద్ చేయాలని మాజీ మంత్రి కెటిఆర్ టిడిపి ఎంపి శ్రీకృష్ణదేవరాయలను హెచ్చరించారు.
స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే…
స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే… స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ
విజయవంతంగా 100 రోజులు 100 గ్రామాలు
విజయవంతంగా 100 రోజులు 100 గ్రామాలు వంద రోజులు 100గ్రామాలు 50వ రోజు
విద్యుత్ సమస్య లేకుండా కృషి చేస్తా…
విద్యుత్ సమస్య లేకుండా కృషి చేస్తా… చిట్యాల,, ఆంధ్రప్రభ : పెద్ద కపర్తి
భద్రాద్రికి గోటి బియ్యం తలంబ్రాలు…
భద్రాద్రికి గోటి బియ్యం తలంబ్రాలు… చిట్యాల, ఆంధ్రప్రభ : శ్రీరామదాసు భక్తమండలి చేల్పూర్
శివాజీ వర్ధంతి వేడుకలు.. విజయవాడ, ఆంధ్రప్రభ: పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో
రక్షించండి.. ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు 'కుంభమేళా' మోనాలిసా
2025లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో దండలు అమ్ముకుంటూ కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసిన మోనాలిసా.. మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి తిరువనంతపురం పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది. తమను రక్షించాలంటూ మోనాలిసా తన ప్రియుడితో కలిసి తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. మోనాలిసా, కేరళకు చెందిన ఫర్హాన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్తో మోనాలిసా డేటింగ్ చేస్తోంది. మోనాలిసా-ఫర్మాన్ ఖాన్ ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి ప్రేమను మోనాలిసా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తమకు రక్షణ కల్పించాలని మోనాలిసా కోరినట్లు తెలుస్తోంది. ప్రియుడితో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయవాడ అభివృద్ధికి వైసీపీ అడ్డంకి
విజయవాడ అభివృద్ధికి వైసీపీ అడ్డంకి విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ నగర అభివృద్ధికి వైఎస్సార్
వెలుగుమట్ల భూములు భూదాన్ బోర్డువే: కెటిఆర్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో వెయ్యి మంది పేదల ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టిన ఘటనపై ఆయన మండిపడ్డారు. భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదలను బలవంతంగా గెంటేసిందని, గతంలో అదే భూదాన్ భూముల్లో కొంతభాగాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులపరం చేసిందని కెటిఆర్ ఆరోపించారు. వాస్తవానికి వెలుగుమట్లలో ఇళ్లు కూలగొట్టిన ప్రాంతంలోని భూములు భూదాన్ భూములని ఆయన తెలిపారు. 1950ల్లో ఆచార్య వినోభాబావే నాయకత్వంలో జరిగిన భూదానోద్యమంలో పలువురు దాతలు భూములను దానం చేశారన్నారు. అదేవిధంగా వెలుగుమట్లలో కూడా ఇద్దరు దాతలు 62 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకు విరాళంగా ఇచ్చారన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేవరకు కూడా ఆ భూమి భూదాన్ బోర్డు పేరుతోనే పట్టాతో ఉందని దాదాపు 30 ఏళ్లకుపైగా భూదాన్ బోర్డు పేరు మీద ఉన్న ఆ భూములను నాడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదకు మార్చిందని ఆయన మండిపడ్డారు. ఆ భూమిని 2014 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ భూదాన్ బోర్డు 1,895 మందికి పట్టాలు చేసిందన్నారు.
ముగిసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండక్షన్ కార్యక్రమం
ముగిసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండక్షన్ కార్యక్రమం డేటా సైన్స్, ఏఐ విద్యార్థులకు
Medha Patkar Urges CM Revanth to Halt Musi Event, Traces Back to Chandrababu Era
Social activist Medha Patkar, representing the National Alliance of People’s Movements (NAPM), has written to Telangana Chief Minister A. Revanth Reddy urging the government to halt the planned March 13 unveiling of the Detailed Project Plan for the Musi River Rejuvenation (Phase II) and initiate a broader democratic consultation process. Referring to the project’s background, […] The post Medha Patkar Urges CM Revanth to Halt Musi Event, Traces Back to Chandrababu Era appeared first on Telugu360 .
Fire Near Amaravati Secretariat Raises Suspicion During Collectors Conference
A fire broke out near the Seed Access Road in Amaravati and caused concern among officials. The incident occurred near the N9 road at Velagapudi Junction, where plastic pipes meant for capital construction works were stored. Large quantities of these pipes were destroyed in the blaze. Fire department officials reached the spot immediately after receiving […] The post Fire Near Amaravati Secretariat Raises Suspicion During Collectors Conference appeared first on Telugu360 .
రైతులకు ప్రభుత్వ రాయితీలపై అవగాహన
రైతులకు ప్రభుత్వ రాయితీలపై అవగాహన సూక్ష్మ నీటి సాగులో ఆటోమేషన్ యూనిట్ ప్రదర్శన
ఐపిఎల్-2026 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్ ఎవరి మధ్యంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026కి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. మార్చి 28వ తేదీ నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి 20 మ్యాచ్ల షెడ్యూల్ని ప్రకటించారు. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య బెంగళూరు వేదికగా జరుగనుంది. మార్చి 29న ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య, మార్చి 30వ తేదీ రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. మూడు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత మిగితా షెడ్యూల్ని విడుదల చేస్తామని ఐపిఎల్ బోర్డు పేర్కొంది. News Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 ️ Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections. More details ▶️… pic.twitter.com/8Iq492v8TE — IndianPremierLeague (@IPL) March 11, 2026
నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు…..
నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు….. రోడ్డెక్కిన అన్నదాతలు. రాయపోల్, ఆంధ్రప్రభ : సాగునీరు
అంగడి వేలంపాట రూ.24 లక్షల 4వేలు
అంగడి వేలంపాట రూ.24 లక్షల 4వేలు నర్సింహులపేట, ఆంధ్రప్రభ : నర్సింహులపేట అంగడి
ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశం..
ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశం.. విజయవాడ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని
హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలి.
హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలి. ఎస్సీ సంక్షేమ హాస్టల్ తనిఖీ
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం… హైదరాబాద్ వ్యాపారికి రూ.5.4 లక్షల నష్టం
జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తానని నమ్మబలికిన వ్యక్తిఎనిమిది మందికి వర్క్ పర్మిట్ పేరిట డబ్బులు వసూలు
టీ20లో విధ్వంసం.. టాప్-2కు దూసుకెళ్లిన ఇషాన్ కిషన్
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచ కప్ 2026లో విధ్వంసకర ఆటతో చెలరేగిన టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లోనూ సత్తా చాటాడు. బుధవారం ఐసిసి, టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో ఇషాన్ ఏకంగా రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ప్రపంచ కప్కు ముందు ఇషాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగిన కిషన్ 871 రేటింగ్ పాయింట్లు సాధించిన నంబర్ 2 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక, భారత మరో స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తన నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. అభిషేక్ 875 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ 848 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ శ్రీలంక బ్యటార్ పాతుమ్ నిస్సాంక వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నారు. ఇక, బౌలర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. T20 ప్రపంచ కప్ 2026లో టిమిండియా తరపున బుమ్రాతోపాటు అత్యధిక వికెట్లు పడగొట్టినప్పటికీ.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో తన వరుణ్.. 740 రేటింగ్ పాయింట్లతో రెండవ స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 753 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకున్నాడు.పాకిస్తాన్కు బౌలర్ అబ్రార్ అహ్మద్ మూడో స్థానానికి ఎగబాకగా.. ఆదిల్ రషీద్, కార్బిన్ బాష్ వరుసగా నాలుగు, ఐదు స్థానంలో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని 702 రేటింగ్ పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నాడు.
ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ
ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ గ్లకోమా పట్ల అప్రమత్తంగా ఉండాలి:
ఎర్రగట్టు జాతరలో సేవలందించిన వైద్యాధికారి
ఎర్రగట్టు జాతరలో సేవలందించిన వైద్యాధికారి హసన్ పర్తి, ఆంధ్రప్రభ : కిట్స్ వాకర్స్
కేసీఆర్కు క్షమాపణ చెప్పే ధైర్యం ఉందా?
కేసీఆర్కు క్షమాపణ చెప్పే ధైర్యం ఉందా? స్టేషన్ ఘన్ పూర్ , ఆంధ్రప్రభ:
ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ధోనీ సీజన్ మొత్తం ఆడుతాడు..: సిఎస్కె సిఇవొ
ఇటీవలే టి-20 ప్రపంచకప్ ముగిసింది. భారత్ విశ్వవిజేతగా నిలవడంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో క్రికెట్ ఫ్యాన్స్కి ఫుల్ మజా ఇచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం కానుంది. ఈసారి తమ అభిమాన జట్టు అద్భుతంగా ఆడాలని.. కప్పు కొట్టాలని అభిమానులు ఇప్పటి నుంచే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో ఓ ప్రశ్న నెలకొంది. ఆ జట్టు మాజీ సారథి.. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఈ సీజన్లో ఆడుతాడా.? లేదా.? అనే సందేహం నెలకొంది. దీనిపై ఆ జట్టు సిఇవొ కాశీ విశ్వనాథ్ ఓ శుభవార్త తెలిపారు. మాజీ సారథి ఎంఎస్ ధోనీ.. ఈ సీజన్ మొత్తం ఆడుతాడని ఆయన వెల్లడించారు. తాజాగా కాశీ విశ్వనాథ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ధోనీని సీజన్ మొత్తం మైదానంలో చూడొచ్చా.? అని రిపొర్టర్ అడిగిన ప్రశ్నకు.. ‘‘ధోనీ ఈ సీజన్ మొత్తం ఆడతాడు. అన్ని మ్యాచుల్లోనూ బరిలోకి దిగుతాడు’’ అని సమాధానం ఇచ్చారు. అయితే ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్గా వినియోగిస్తారా? అనే ప్రశ్నకు ‘‘ఆ ప్రశ్న గురించి నేనేం మాట్లాడలేను. అది క్రికెట్కు సంబంధించిన నిర్ణయం. స్టాఫ్ నిర్ణయం తీసుకుంటారు. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ తీసుకొనేది కాదు. బ్యాటర్గా ఆడతాడా? వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గానా? ఇంపాక్ట్ ప్లేయర్గానా అనేది వారు డిసైడ్ చేస్తారు’’ అని సమాధానం ఇచ్చారు.
కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ లో రెండవ రోజు ఏసీబీ తనిఖీలు…
కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ లో రెండవ రోజు ఏసీబీ తనిఖీలు… విజయవాడ కార్పొరేషన్,
ఆ భూముల్లోనే నిరుపేదలకు ఇళ్లు ఇస్తాం: మంత్రి తుమ్మల
వెలుగు మట్ల భూదాన్ భూముల్లో కొందరు ముఠాగా ఏర్పడి పేదలను అడ్డంపెట్టుకొని మోసం చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాల అందజేత కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కోర్టు తీర్పు మేరకే ప్రభుత్వం ఆదేశాలతో ఖాళీ చేయించి కలెక్టర్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. సమాంతర వ్యవస్థ నడుపుతూ ముఠా సభ్యులు ఎవరిని లోపలికి రానీయకుండా దౌర్జన్యంగా వ్యవహరించారని.. అయినా, గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. కోర్టులో కేసు ఉండటంతో అక్కడ తాము ఎలాంటి సౌకర్యాలు కల్పించలేక పోయామని మంత్రి తుమ్మల అన్నారు. ప్రస్తుతం భూదాన్ ట్రస్టు లేదు..అది సీసీఎల్ఏకు బదలాయించిందన్నారు. ముఠా చేతిలో నుంచి బాదితులను రక్షించేందుకు తాము అనేక ప్రయత్నాలు చేసామని తెలిపారు. భూదాన్ భూముల్లోనే బాధితులకు ఇళ్లు ఇవ్వాలని సిఎం, ముగ్గురు మంత్రులం నిర్ణయించామని.. డిసెంబర్ 9న సిఎం చేతుల మీదుగా ఇళ్ల గృహ ప్రవేశం చేస్తామని.. అక్కడ అన్ని మౌళిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.
లోక్ సభ స్పీకర్ పై వీగిన అవిశ్వాసం
లోక్ సభలో స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్ష పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది
Gudivada Cricket Betting Racket Exposed, Associates of Kodali Nani Arrested
Police in Krishna district recently uncovered an online cricket betting racket in Gudivada. Five people were arrested during the operation. Among them is Masala Shiva, who is known to be a close associate of former YSR Congress Party minister Kodali Nani. The police seized ₹1.05 lakh in cash and eight mobile phones from the accused. […] The post Gudivada Cricket Betting Racket Exposed, Associates of Kodali Nani Arrested appeared first on Telugu360 .
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్- అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడనున్నట్లు వస్తున్న వార్తలపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పందించారు. వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ ముడి చమురు, గ్యాస్ సరఫరాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోపే డెలివరీ అవుతుందని అధికారి వెల్లడించారు. దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ అన్నారు. భారత ముడి చమురు సరఫరా స్థిరంగా ఉందని తెలిపారు. దేశం రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుందని.. భారత్, దాదాపు 40 దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని చెప్పారు. అంతేకాదు, భారత్ కు రెండు ముడి చమురు కార్గోలు రాబోతున్నాయని ఆమె తెలిపారు.
యర్రపల్లిలో “కాఫీ విత్ క్యాడర్”తో వైసీపీ
యర్రపల్లిలో “కాఫీ విత్ క్యాడర్”తో వైసీపీ గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరించిన మాజీ
చిన్నారుల ఆరోగ్యం, వార్డ్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి…
చిన్నారుల ఆరోగ్యం, వార్డ్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి… అంగన్వాడీ కేంద్రాలు, నాలా క్లీనింగ్
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. పరీక్షలు రాయనున్న 550 మంది విద్యార్థులు.. జన్నారం,
సురక్షా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 మందికి సైకిళ్లు
సురక్షా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 మందికి సైకిళ్లు విజయవాడ, ఆంధ్రప్రభ
నా పొట్టను దాచలేక విసిగిపోయాను.. కెటిఆర్ పోస్ట్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటిఆర్ సోషల్మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు సంబంధించిన విషయాలు, పార్టీ వ్యవహారాలు, ఇతర విషయాలను ఆయన సోషల్మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ ఫన్నీ పోస్ట్ పెట్టారు. జిమ్లో దిగిన ఫోటోని షేర్ చేసిన కెటిఆర్.. ఇంతకాలం తన పొట్టని దాచలేక విసిగిపోనని.. పేర్కొన్నారు. ‘‘ఆరు నెలల తర్వాత మళ్లీ ట్రైనింగ్ మొదలు పెట్టాను జూలైలో నాకు 50 సంవత్సరాల వచ్చే నాటికి మంచి షేప్లోకి రావాలని ఆశిస్తున్నా’’ అని కెటిఆర్ రాసుకొచ్చారు. Tired of hiding my paunch Started training again after a gap of 6 months. Hoping to be in better shape by July when I turn 50 #FitnessGoals pic.twitter.com/o99hm3tEj4 — KTR (@KTRBRS) March 11, 2026
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవo
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవo నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : ఆడపిల్లలను ఉన్నతంగా
ఔషధ మొక్కల సాగుతో అత్యధిక ఆదాయం
ఔషధ మొక్కల సాగుతో అత్యధిక ఆదాయం మోపిదేవి, ఆంధ్రప్రభ: ఔషధ మొక్కల సాగుతో
Telangana : 14 నుంచి పదో తరగతి పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి
కనకదుర్గమ్మకు కానుక వర్షం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ
విపక్షాలు కుట్ర చేస్తున్నాయి: భట్టి విక్రమార్క
ఖమ్మం: పేదలకు మేలు జరగకుండా విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాల అందజేత కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు రాష్ట్రంలోని పేదలపై ప్రేమ లేదని... పేదల నిస్సహాయతను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు మాఫియాగా ఏర్పడి.. పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని డిప్యూటీ సిఎం ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ పేదల గురించి ఆలోచించే ప్రభుత్వమని.. నిజమైన పేదలు అయ్యుంటే.. ఇళ్లు లేని వారు ఉండొద్దనేది తమ ప్రభుత్వ ఆశయమని తెలిపారు. పేదలపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోందని చెప్పారు. తొలి ఏడాదే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని.. త్వరలో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని భట్టి స్పష్టం చేశారు.
రద్దీగా ఉన్న రహదారిపై విమానం అత్యవసర ల్యాండింగ్
19 ఏళ్ల యువ పైలట్ నికో బ్రే తన విమానాన్ని రద్దీగా ఉన్న రహదారిపై సురక్షితంగా దించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘటన 2026 మార్చి 6వ తేదీ మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.19 ఏళ్ల యువ పైలట్ నికో బ్రే తన స్నేహితుడితో కలిసి చిన్న సింగిల్ ఇంజిన్ విమానంలో (Cessna 150) ప్రయాణిస్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్ శక్తిని కోల్పోయింది. విమానం నేల నుండి కేవలం 500 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోవడంతో పైలట్ ఏమాత్రం కంగారు పడకుండా మొదట బీచ్ దగ్గర ఉన్న A1A రోడ్డుపై దించాలని అనుకున్నా, అది ఇరుగ్గా ఉండటంతో వెడల్పుగా ఉన్న ఇండియన్ టౌన్ రోడ్డును ఎంచుకున్నాడు. విమానం కిందికి రావడం గమనించిన ఒక ట్రక్కు డ్రైవర్ రోడ్డుపై ట్రాఫిక్ను ఆపి విమానం దిగడానికి ఖాళీ ప్రదేశం కల్పించారు. దీంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఏ వాహనాన్ని ఢీకొట్టకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.ఈ ఘటనలో పైలట్, అతని స్నేహితుడు మరియు రోడ్డుపై ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. 19 ఏళ్ల వయసులోనే నికో బ్రే ప్రదర్శించిన ధైర్యం మరియు నైపుణ్యాన్ని స్థానిక అధికారులు, ప్రజలు మెచ్చుకున్నారు.
ఘనంగా వీడ్కోలు సంబరాలు దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని వెల్గనూర్ ఉన్నత
₹14,500కే అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి టూర్ #IRCTC#DivyaDakshinaYatra#TempleTour#Arunachalam
Hyderabad : పెళ్లిళ్ల సీజన్ పై ఎల్.పి.జి ఎఫెక్ట్.. ఆల్టర్నేటివ్ చూస్తున్న హోటల్స్ యజమానులు
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత వెంటాడుతోంది.
వెలగపూడిలో అగ్ని ప్రమాదం.. రోడ్డుపక్కన భారీగా మంటలు..
అమరావతిలో వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన భారీగా మంటలు చెలరేగి.. ఎల్ అండ్ టి సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు దగ్ధమయ్యాయి. భారీ మంటలు ఎగసి పడటంతో పరిసర ప్రాంతంలో దట్టంగా పొగ అలముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Farmers |జూన్- ఆగస్టు మధ్య మండే ఎండలు
Farmers | జూన్- ఆగస్టు మధ్య మండే ఎండలు ప్రభుత్వం అప్రమత్తంగా ఉందిజిల్లాల్లోనూ
అంగనవాడి కేంద్రంలో అస్వస్థకు గురైన చిన్నారులు
అంగనవాడి కేంద్రంలో అస్వస్థకు గురైన చిన్నారులు వీఆర్ పురం పోలవరం జిల్లా, ఆంధ్రప్రభ
ఇంటిపన్ను చెల్లించలేదని గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లి
ఇంటి పన్ను చెల్లించలేదని అధికారులు గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లారు
మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు
మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కరీమాబాద్,
ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి…. ఎమ్మెల్యేసాంబశివ రావుకు, ఎమ్మెల్సీ సత్యంకు చేనేత కార్మిక సంఘం
మహిళా సమస్యల పరిష్కారమే అజెండాగా జన్ సున్వాయ్
మహిళా సమస్యల పరిష్కారమే అజెండాగా జన్ సున్వాయ్ వేగవంతంగా, పారదర్శకంగా సమస్యల పరిష్కారానికి
Attacks | నలుగురికి గాయాలు Attacks | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Hyderabad : హైదరాబాద్లో ఓన్లీ ఇడ్లీ...ఉప్మా.. నో దోశ, పూరి, వడ
ఎల్.పి.జి గ్యాస్ కొరతతో హోటల్ రంగం సంక్షోభంలో పడింది
సాయిపల్లవి తొలి హిందీ చిత్రం.. ట్రైలర్ వచ్చేసింది..
హీరోయిన్గా పరిచయమైన అనతి కాలంలోనే స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. దక్షిణాది ఇండస్ట్రీలతో హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు సాయి పల్లవి బాలీవుడ్లో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘ఏక్ దిన్’ అనే చిత్రం ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది సాయి పల్లవి. తాజాగా బుధవారం ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఒక ఇంటర్నేషన్ టూర్లో ఇద్దరు సహోద్యోగుల మధ్య కలిగిన ఒక రోజు పరిచయం, వారి జీవితాలను ఎలా మార్చిందనే కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రోహన్ పాత్రలో జునైద్, మీరా పాత్రలో సాయిపల్లవి నటించారు. స్నేహా దేశాయ్, స్పందన్ మిశ్రా ఈ చిత్రానికి రచనా సహకారం అందించగా.. మన్సూర్ ఖాన్, అమిర్ ఖాన్, అపర్ణా పురోహిత్ నిర్మించారు. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది.

21 C