SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

18    C
... ...View News by News Source

24th jan 2026 |నేటి పంచాంగం

24th jan 2026 | నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు

ప్రభ న్యూస్ 24 Jan 2026 6:00 am

కెటిఆర్ ప్రశ్నలతో సిట్ ఉక్కిరిబిక్కిరి

మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ చేయించి పారిశ్రామికవేత్తల నుంచి పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు సేకరించారా అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్‌ను సిట్ అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (ప్రత్యే క దర్యాప్తు బృందం) విచారణకు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయంలో జరిగిన విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయం త్రం వరకు ఆరు గంటల వరకు దాదాపు ఏడు గంటల పాటు విచారించారు. కెటిఆర్‌ను విచారణ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి లు ప్రశ్నించారు. విచారణలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్‌కు బీఆర్‌ఎస్ సేకరించిన పార్టీ ఫండ్ కు లంకే పెట్టి కెటిఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది.ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్ రావు బృందం వ్యాపారులను బెదిరించడం ద్వారా బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు సేకరించడంపై సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు కెటిఆర్ ఘాటుగా సమాధానమిస్తూ మరి మా పార్టీకి ఏ ఏ కంపెనీలు అయితే ఇచ్చాయో, అవే కంపెనీలు బిజెపి, కాంగ్రెస్‌కి కూడా ఇచ్చాయి కదా, మరి వారిని ఎవరు బెదిరించారు అని కెటిఆర్ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. భూముల కేటాయింపు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నిస్తూ టిఎస్‌ఐసిసి కేటాయించిన భూములపై ప్రశ్నించగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు, భూముల కేటాయింపునకు సంబంధం లేదని, వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కెటిఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా టెలిఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం లేని పలు ప్రశ్నలను సిట్ అధికారులు అడగగా ఆ సందర్భంగా కెటిఆర్‌కు వారికి మద్య వాగ్వివాదం జరిగినట్లు తెలిసింది. కేవలం వదంతులు, ఊహజనితమయిన పుకార్ల చుట్లూ ప్రశ్నలు తిప్పడం తప్ప ఈ కేసుకు సంబందం లేని ప్రశ్నలను ఎందుకు అడుగుతున్నారని కెటిఆర్ అధికారులను నిలదీసినట్లు తెలిసింది. సిట్ అధికారుల ప్రశ్నలకు ధీటుగా కెటిఆర్ ప్రశ్నించిన ప్రతి సారి ఈ అంశంతో కేసుకు సంబంధం ఉంది దానికి సంబంధించిన వివరాలు మేము చెప్పలేం అంటూ అధికారులు దాటవేసినట్లు సమాచారం. అలాగే హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్‌కు సబంధించి సిట్ అధికారులను కెటిఆర్‌ఏ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన సమాచారం తమకు లేదని, తాము ఎలాంటి లీకులు ఇవ్వలేదని, వారు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనికి కెటిఆర్ స్పందిస్తూ కేవలం లీకులిచ్చి నా వ్యక్తిత్వ హననం ఇన్ని రోజులు చేశారు. దానికి మీరు బాధ్యత వహిస్తారా అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ అంశం సంబంధించి అధికారికంగా ప్రకటన ఇవ్వకుండా, సమావేశం పెట్టకుండా ఇన్ని పుకార్లు, వార్తలు ఎలా బయటకు వచ్చాయని కెటిఆర్ నిలదీసినట్లు తెలిసింది. బిఆర్‌ఎస్ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యహారాలను ఎవరు చూస్తారని కూడా వారు ప్రశ్నించగా, ఈ అంశం ఫోన్ ట్యాపింగ్‌తో సంబందం లేనప్పటికీ మీరు ఎలా అడుగుతారని, కేవలం తనను దేనికయితే నోటీసులు ఇచ్చారో దాని గురించి మాత్రమే అడగండి అని కెటిఆర్ తెలిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కెటిఆర్ నన్ను ఎందుకు పిలిచారు, సాక్షిగా పిలిచారా, ఏ కారణంగా పిలిచారో చెప్పాలని కూడా ప్రశ్నించగా, కేవలం విచారణకు మాత్రమే పిలిచినట్లు సిట్ అధికారులు సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.కెటిఆర్ పర్యటనలు, సోషల్ మీడియా, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేనప్పటి నిర్ణయాలు, పలు వ్యక్తుల పేర్లు చెప్పి వారితో ఉన్న సంబంధాలు, పరిచయాల పైన సిట్ అధికారులు పదే పదే ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విచారణ మొత్తంగా వాటి చుట్టే తిరిగినట్లు సమాచారం. మొత్తంగా పదుల సంఖ్యలో కొందరి వ్యక్తుల పేర్లు చెప్పి వీరు మీకు తెలుసా, వారితో ఎప్పుడయినా మాట్లాడారా, వారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి వంటి తదితర ప్రశ్నలను పదే పదే సిట్ అధికారులు అడిగినప్పటికీ కెటిఆర్ వాటికి ధీటుగా సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా ఉండగా ఇదే కేసులో కెటిఆర్‌ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, కెటిఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరించారు. పోలీస్ స్టేషన్‌కు రెండువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్ వెలుపల చోటుచేసుకున్న ఆందోళనల పరిణామాలతో మరింత పటిష్ఠ బందోబస్తు చర్యలు తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్, ఏఆర్ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కెటిఆర్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రహదారి వెంట పలువురు కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వానికి, సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసులో త్వరలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక వ్యక్తి ఒకరిని విచారణకు పిలిచే అవకాశం ఉందని సిట్ వర్గాల సమాచారం.

మన తెలంగాణ 24 Jan 2026 5:30 am

సింగరేణి.. స్కామ్‌ల గని

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణిలో సో లార్ పవర్‌ప్లాంట్‌లోనూ మరో స్కామ్ బయటపడిందని, 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో పెద్ద కుంభకోణం జరిగిందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. మూ డు వేర్వేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే ది ఉంటే తమ అనుచరులకు కట్టబెట్టడానికి, పో టీ తగ్గించడానికి ఎంఎస్‌ఎంఇలు పాల్గొనకుండా ఉండేందుకు మూడు సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారని ఆరోపించారు. ఎంఎస్‌ఎంఇలు పాల్గొనకూడదని మూడింటికి కలిపి ఒకేసారి టెండర్లు పిలిచారని, సోలార్ పవర్ టెండర్ అనుమతులు కఠినం చేస్తూ సైట్ విసిట్ సర్టిఫికెట్ అనే నిబంధన పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం అనుకున్న వారికి టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు మార్చారని ఆరోపించారు. దేశంలో 1 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తికి సగటున రూ.3 నుంచి 3.5 కోట్లు అయితే సింగరేణి భూమి ఇచ్చి మరీ రూ.5 కోట్లకు గోల్టి కంపెనీకి టెండర్ కట్టబెట్టారని అన్నారు. అలాగే 107 మెగావాట్ల కోసం రూ.214 కోట్లు అదనంగా చెల్లించగా, మరో టెండర్‌లో 67 మెగావాట్లకు రూ.480 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. సింగరేణిలో జిలిటెన్ స్టిక్స్ ఖర్చునూ తమ వారి కోసం రేవంత్‌రెడ్డి 30 శాతం పెంచారని ఆరోపించారు. ఒక మెగావాట్ సోలార్ ఉత్పత్తి చేయడానికి మూడున్నర కోట్లు అవుతుందని, పైగా భూమి కూడా సోలార్ కంపెనీలదే ఉంటుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఒక మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తికి రూ.3 కోట్లు అవుతుందని, రాష్ట్రంలో మాత్రం ఒక మెగావాట్ సోలార్ ఉత్పత్తికి రూ.5.04 కోట్లు ఇచ్చారని, అదనంగా సింగరేణి భూములు కూడా ఇచ్చారని ఆరోపించారు. సింగరేణిలో సోలార్ పవర్ ఉత్పత్తికి దాదాపు రూ.200 కోట్లు అదనంగా చెల్లించారని పేర్కొన్నారు. ఈ సోలార్ పవర్ స్కామ్ రామగుండంలో జరిగిందని, నెంబర్ 3 సోలార్ పవర్ స్కాం.. 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ అని పేర్కొన్నారు. దాదాపు ఏడు కోట్లకు ఒక మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఈ ప్లాంట్‌ను కట్టపెట్టారు.. నేషనల్ ఆవరేజ్ కంటే ఇది రెట్టింపు వ్యయం అని చెప్పారు. బొగ్గు కుంభకోణాన్ని బిఆర్‌ఎస్ బయటపెట్టిన తర్వాతే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష చేస్తున్నారని చెప్పారు. 480 కోట్లకు వారికి కావలసిన కంపెనీకి కట్టబెట్టారని, ఈ కంపెనీకి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనలు మార్చి తమ అనువాయులకు కట్టబెట్టారని అన్నారు. అక్కడ 250 కోట్లు ఇక్కడ 250 కోట్లు నేరుగా చేతులు మారాయని, 500 కోట్లు అదనంగా చెల్లింపులు జరిగాయని తెలిపారు. టెండర్లు వేసిన వారితో సిఎం బావమరిది హోటళ్లలో భేటీ అవుతున్నారని ఆరోపించారు. బిడ్లను తెరిచే ప్రక్రియ ఐదారుసార్లు ఎందుకు వాయిదా పడుతోందని ప్రశ్నించారు. నాడు సింగరేణి సిరుల గనిగా ఉండేదని, నేడు సింగరేణి సృజన్ గనిగా మారిందని విమర్శలు చేశారు. మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు. మంత్రుల పంచాయతీ కాంగ్రెస్‌కు ఉరితాడులా మారిందని ఆక్షేపించారు. సృజన్ వ్యవహారం బయటపెట్టిన తర్వాత.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేదని విమర్శించారు. బావమరిది సృజన్ రెడ్డి కోసం చేసిన ఈ కుంభకోణం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారిందని అన్నారు. మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిందని, ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. నాడు కోల్ స్కాం యుపిఎ ప్రభుత్వ పతనానికి కారణమైందని ప్రస్తావించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కోల్ స్కాం నాందిగా మారిందని తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి బామ్మర్థి బాగోతం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు పంపించారని చెప్పారు. యుపిఎ ప్రభుత్వంలో కోల్ స్కాం 1,50,000 కోట్లు అని, అది మొత్తం దేశాన్ని కుదిపేసిందని చెప్పారు. ఈ గండం గట్టేక్కేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకు బిజెపితో కుమ్మక్కై ఈ సిట్ల డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఈ డ్రామాలో భాగంగా మూడు రోజుల క్రితం తనకు, తాజాగా కెటిఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో జివి రెడ్డి అనే ఒక డైరెక్టర్ 30 శాతం ఎక్కువ రేటుకు కొనడానికి నిరాకరిస్తే ఆ ఒత్తిడికి ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారని చెప్పారు. మరో డైరెక్టర్ వికె శ్రీనివాస్ సంతకం పెట్టడానికి నిరాకరిస్తే ఆయనను డైరెక్టర్ నుంచి జిఎం పదవికి రివర్షన్ ఇచ్చారని చెప్పారు. ఢిల్లీ కిషన్ రెడ్డి గల్లీకి వచ్చి మీటింగ్ పెడుతున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన కార్యాలయానికి వెళ్లి సమీక్ష చేస్తున్నారని తమకు సమాచారం ఉందని, రెండేళ్లు బొగ్గు మంత్రిగా ఉన్నా కూడా ఆయన ఇప్పటివరకు పట్టించుకోలేదని అన్నారు. బిఆర్‌ఎస్ బయట పెడితేనే ఢిల్లీలో అత్యవసర సమావేశం జరిగిందని, ఢిల్లీ కిషన్ రెడ్డి గల్లీకి వచ్చి కొత్తగూడెంలో సింగరేణిపై మీటింగ్ పెడుతున్నారని విమర్శించారు. ఈ కుంభకోణంపై విచారణ కోరుతూ హరీష్‌రావు లేఖ రాశారు. కోల్ స్కాంపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్.. పొట్టు.. లట్టు..దేనికీ భయపడేది లేదు సిట్.. పొట్టు.. లట్టు..దేనికీ భయపడేది లేదని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అవినీతిని బయటపెట్టే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు.ధైర్యం ఉంటే సిట్ విచారణ వీడియో బయటపెట్టాలని హరీష్‌రావు సవాల్ విసిరారు. లీకులతో ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారు..? అని ప్రశ్నించారు. రెండేళ్లు దాటినా లీకు రాజకీయాలే నడుపుతారా..? అని ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్ అని సెటైర్లు గుప్పించారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే సిట్ నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ విచారణపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లోపల ఏదో జరుగుతోందని తప్పుడు లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. లీకులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కట్టుకథలతో ఇంకెన్నాళ్లు ప్రభుత్వాన్ని నడుపుతారని నిలదీశారు. సిఎంం రేవంత్‌త్‌రెడ్డి ఉడత బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరించారు.

మన తెలంగాణ 24 Jan 2026 5:00 am

జనగణనకు 33 ప్రశ్నలు

న్యూఢిల్లీ: జనాభా లెక్కలు 2026-2027 నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ ఏప్రిల్ 1 నుంచి మొదటి దశ జనగణన ప్రారంభమవుతుంది. ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేటర్లుదాదాపు 33 ప్రశ్నలు వేసి జవాబులు నమోదు చేస్తారు. ప్రభుత్వం గురువా రం 33 ప్రశ్నలను నోటిఫై చేసింది. ప్రతి ఇంటిలో ఉన్న మనుషుల జాబితా. ఇంటి గుర్తింపుతో పాటు, ఆ ఇళ్లలో ఎంతమం ది వివాహిత జంటలు ఉన్నాయి. ఇంటర్ నెట్ ఉందా. స్నానపు గదులు ఉన్నాయా. వంటి వివరాలను జనాభా గణన సిబ్బంది నమోదు చేస్తారు. 2011లో జనాభా గణన సందర్భంగా కేవ లం 29 ప్రశ్నలనే అడిగారు. ఈ సారి మరి కొన్ని ప్రశ్నలు జో డించారు. కొన్ని ప్రశ్నలను విభజించి, వివరాలు సేకరిస్తున్నా రు. 2027 జనగణనలో చేర్చిన ముఖ్యమైన ప్రశ్నలలో ఇంటర్నెట్ సదుపాయం ఉందా, కుటుంబ సభ్యులు వినియోగించే ప్రధాన తృణధాన్యాలు ఏమిటి వంటివి ఉన్నాయి. అయితే, బ్యాంకింగ్ సౌకర్యాలకు సంబంధించిన ప్రశ్నలను తొలగించారు. పౌరులకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయా, ఉం టే, వారు ఉపయోగించే మొబైల్ ఫోన్ వివరాలను అడుగుతా రు. 2027 జనాభా లెక్కల మొదటి దశలో ఇంటింటితిరిగి జ రిపే జనగణన ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ జరుగుతుంది. రాష్ట్రాలోనూ, కేంద్రపాలిత ప్రాంతంలోనూ నిర్దేశించిన 30 రోజుల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. రెండోదశ - జనభా గణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. 30 రోజుల గృహాల జాబితా కార్యక్రమానికి ముందు 15 రోజుల పాటు స్వీయ గణన నిర్వహించే అవకాశం ఉంది. మొదటి దశ నోటిఫికేషన్ ను హోం మంత్రిత్వశాఖ జారీచేసినా, రెండో దశ ప్రశ్నపత్రం - జనాభా గణన కు సంబంధించిన నియమాలను త్వరలో ప్రకటించనున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ , సెన్సెస్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలలో ఆ ఇంటి పైకప్పు ఎలాంటిది ఉంది. ఫ్లోరింగ్ చేస్తే, ఏలాంటిది చేశారు. గోడలు ఎలాఉన్నాయి. ఎలాంటి నిర్మాణం, ఇం టి యజమాని పురుషులా, స్త్రీలా, వారు ఏ రకం తృణధాన్యా లు వినియోగిస్తారు. ఆధునిక సౌకర్యాలు వారికి ఉన్నాయా, వారికి వాహనాలు ఏమైన ఉన్నాయా, ఎన్నిరకాల వాహనాలు ఉన్నాయి అన్న వివరాలు ప్రశ్నిస్తారు. అలాగే ఇళ్లలో విద్యుత్ ఉందా, సోలార్ లైటింగ్ ఉపయోగిస్తున్నారా. మరుగుదొడ్లు ఉంటే, ఎలాంటి రకం, డ్రైనేజి సిస్టమ్ ఉందా, వంటగది ఉందా. ఎల్ పిజి ఉపయోగిస్తున్నారా.. లేక పిఎన్ జినా, వంట కోసం ప్రధాన ఇంధనం ఏమిటి వంచి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తారు. జనాభాగణన సిబ్బంది ఇళ్లలో టీవీ ఉందా, రేడియో, ట్రాన్సిస్టర్‌లు ఉన్నాయా, ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ఉన్నాయా, బైసైకిల్, మోటర్ సైకిల్, స్కూటర్ ల వివరాలు, కారు జీపు వ్యాన్‌ల వివరాలు అడుగుతారు. జనాభా లెక్కల అధికారులు తమకు కేటాయించిన స్థానిక ప్రదేశాలలో పౌరులనుంచి జాబితాలో పేర్కొన్న 33 ప్రశ్నలను అడగవచ్చునని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

మన తెలంగాణ 24 Jan 2026 4:30 am

జనగనణకు కేంద్రం రంగం సిద్దం

33 ప్రశ్నలతో వివరాల సేకరణ గెజిట్ విడుదల చేసిన సర్కార్ న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశ వ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధమైంది. రెండు దశల్లో జనగణన చేపట్టాలని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం …

జనం సాక్షి 24 Jan 2026 4:20 am

మేడారం జాతరకు కేంద్రం సహాయం

రూ.3 కోట్ల 70 లక్షల నిధుల విడుదల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో మంజూరు న్యూఢిల్లీ(జనంసాక్షి):ఎట్టకేలకు మేడారం జాతరకు కేంద్రం భారీ సహాయాన్ని అందించింది. కేంద్ర ప్రభుత్వం …

జనం సాక్షి 24 Jan 2026 4:19 am

ఫోన్ ట్యాపింగ్‌కేసులో కేటీఆర్‌పై ఏడు గంటల పాటు ప్రశ్నలవర్షం

` ఫోన్ ట్యాపింగ్‌లో ముగిసిన కేటీఆర్ విచారణ హైదరాబాద్(జనంసాక్షి):ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి …

జనం సాక్షి 24 Jan 2026 4:16 am

జలాల హక్కులు కాపాడుకునేందుకు ఏ పోరాటానికైనా సిద్ధం

` దేశానికే ఆదర్శంగా మన వ్యవసాయం ` రికార్డు స్థాయి దిగుబడులు.. అదే స్థాయిలో కొనుగోళ్లు: మంత్రి ఉత్తమ్ హుజూర్‌నగర్(జనంసాక్షి): రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి …

జనం సాక్షి 24 Jan 2026 4:15 am

రూపాయి ఘోరంగా పతనం

` ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి పడిపోయిన రూపీ ` ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.91.99కి చేరిన మారకం విలువ ` విదేశీ పెట్టుబడుల తరలింపు,వాణిజ్య ఒప్పందాల జాప్యం, అంతర్జాతీయ …

జనం సాక్షి 24 Jan 2026 4:14 am

డబ్లూహెచ్‌ఓకు అమెరికా గుడ్‌బై

వాషింగ్టన్ ః ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) నుంచి అగ్రరాజ్యం వైదొలిగింది. ఈ సంస్థతో తమ 78 సంవత్సరాల అనుబంధం, కట్టుబాట్ల నుంచి పక్కకు తొలుగుతున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ ఏడాది క్రితమే ప్రకటించారు. ఇప్పుడు అమెరికా అధికారికంగా ఈ నిర్ణయాన్ని అమలులో పె ట్టింది. ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగడం అనేది అధ్యక్షుడిగా తాను తీసుకున్న అతి దారుణ నిర్ణయం అని ట్రంప్ చెప్పారు. సంస్థ నుంచి వైదొలి గే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఇంతవరకు సంస్థ స క్రమ రీతిలోపనిచేయలేదని స్పందించారు. కొవిడ్ మహమ్మారి నియంత్రణ, ప్రపంచ వ్యాప్త ఆరోగ్య సంస్కరణల అమలులో డబ్లుహెచ్‌ఒ విఫలం అయింది. ప్రపంచదేశాలలో దాదాపుగా ప్రతి ఒక్క దేశం డబ్లుహెచ్‌ఒలో సభ్య దేశంగా ఉంది. ఆరోగ్యం చికిత్సల విషయాలలో పేదదేశాలకు ఎప్పటికప్పుడు ఈ సంస్థ ద్వారా సేవలు అందుతాయి. పైగా తలెత్తే పలు రకాల అంటువ్యాధులు, వైరస్‌ల విషయంలో ముందస్తు జాగ్రత్తలను వెలువరించే బాద్యత కూడా ఈ సంస్థ తీసుకుంటుంది. అయితే సంస్థ నుంచి వైదొలిగే సమయానికి సంస్థకు అమెరికా నుంచి 260 మిలియన్ డాలర్ల నిధుల బకాయిలు చెల్లించాలి. దీని విలువ రూపాయలలో 2382 కోట్లు వరకూ ఉంటుంది. అమెరికా తనకు తానుగా నిర్ణయం తీసుకుంటే సరిపోదని, ముందుగా బకాయిలు చెల్లించాల్సిందేనని, లేకపోతే అధికారికంగా సంస్థలో అమెరికా ఉన్నట్లే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వాదనను అమెరికా అధికారికంగా తోసిపుచ్చింది. 

మన తెలంగాణ 24 Jan 2026 3:30 am

ఇరాన్‌పై యుద్ధమేఘాలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సైనిక చర్యకు సిద్ధమయ్యారు. ఫైటర్ జెట్ విమానాలను,విమాన వాహక యుద్ధ నౌకలను మోహరించారు. ఏ క్షణమైనా విరుచుకు పడేందుకు కట్టుదిట్టమైన సిద్ధపడ్డారు. గురువారం దావోస్ వేదికగా ట్రంప్ తన బోర్డ్ ఆఫ్ పీస్ ను ప్రారంభిస్తూ, ఇది స్థిరత్వాన్ని సాధించేందుకు, ఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో శాశ్వత శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేసే అంతర్జాతీయ సంస్థ అని ప్రకటించిన 24 గంటలలోనే యుద్ధసన్నాహాలు మొదలయ్యాయి. మరో పక్క ఇజ్రాయెల్ పరిస్థితిని గమనిస్తూ ఉంది. ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ప్రదర్శనలు పెచ్చు పెరగడం, సైన్యం కాల్పులలో వేలాది మంది మరణించడం పై గతంలోనే ట్రంప్ ఇరాన్ కు బలమైన హెచ్చరిక చేశారు. నిరసన కారులపై హింసాత్మక అణచివేత నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకు అమెరికా అరేబియా సముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుఎస్‌ఎస్ అబ్రహం లింకన్, గైడెడ్ - క్షిపణి వ్యవస్థలతో కూడిన విమానవాహక నౌకలు ఉంటాయని అమెరికా అధికారులు తెలిపారు. దాడికి సిద్ధంగా ఉన్న ఆయుధ శ్రేణి లో యుద్ధవిమానాలు, యుద్ధనౌకలతో పాటు జలాంతర్గాములు ఉన్నాయి. ప్రస్తుతానికి అవి హిందూ మహా సముద్రం, దక్షిణచైనా సముద్రంలో మోహరింపబడి ఉన్నాయి. ట్రంప్ ఊ అంటే, పశ్చిమాసియా ప్రాంతం వైపు దుసుకువెళ్లే పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్, క్షిపణిదాడులను ఎదుర్కొనేందుకు 2024 ఏప్రిల్ లో మోహరించిన అదే స్క్వాడ్రన్ కు చెందిన ఎఫ్- 15ఇ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ లు ఇప్పటికే పశ్చిమాసియాలో సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో పేరు ప్రకటించని స్థావరంలో విమానం ల్యాండింగ్ అవుతున్నట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. యుద్ధ సన్నాహాలు ఎంత విసృ్తతంగా ఉన్నాయంటే, యుద్ధవిమానాలకు ఆకాశంలోనే ఇంధనం అందించే కెసి - 135 వైమానిక రీ ఫ్యూయలర్లను సన్నద్ధం చేశారని అమెరికా మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్, ఖతార్ వంటి అమెరికా మిత్రదేశాల సాయంతో క్షిపణి నిరోధక వ్యవస్థలు తహాద్, పేట్రియాట్ లను పశ్చిమాసియా ఇంతటా మోహరించి ఉన్నట్లు అమెరికా పత్రికలు వార్తలు చెబుతున్నాయి.

మన తెలంగాణ 24 Jan 2026 3:00 am

Naveen Polishetty – The Raju of USA to Meet You Live

After Rocking Andhra & Telangana, Naveen Polishetty Takes the Celebration to the USA. After setting theatres on fire across Andhra Pradesh and Telangana, In just five days, the film has stormed past a massive ₹100.2 CRORES GROSS worldwide, turning the Sankranthi star entertainer Naveen Polishetty is now bringing his electrifying energy to the USA, as […] The post Naveen Polishetty – The Raju of USA to Meet You Live appeared first on Telugu360 .

తెలుగు 360 24 Jan 2026 1:14 am

సీతక్క పర్యటనలో ఉద్రిక్తత

మన తెలంగాణ 24 Jan 2026 12:04 am

ఎంఎసఎంఈలను ప్రోత్సహిస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి

. పారిశ్రామికవేత్తలుగా 5 లక్షల మంది మహిళలు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూత. ఆర్థిక సంస్థలకు కేంద్రంగా అమరావతి. బడుగుల అభ్యున్నతికి బ్యాంకర్లు చేయూత ఇవ్వాలి. ఎసఎల్బీసీ సమావేశంలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి బాట పట్టాలంటే ఎంఎసఎంఈలను ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూత ఇవ్వాలని సీఎం […] The post ఎంఎసఎంఈలను ప్రోత్సహిస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 11:40 pm

తెలుగులో ఉత్తర్వులు వచ్చేదెన్నడు?

ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమితమా?భాషాభిమానుల్లో అసంతృప్తి విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏపీ ప్రభుత్వం తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ)లు జారీ చేస్తామని అధికారికంగా ప్రకటించి ఏడాది గడుస్తున్నా… ఆ నిర్ణయం కాగితాలకే పరిమితమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినప్పటికీ, ఆ దిశగా అధికార యంత్రాంగం ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. ప్రస్తుతం హోం శాఖ పేరోల్‌కు సంబంధించిన కొద్ది జీఓలు మాత్రమే […] The post తెలుగులో ఉత్తర్వులు వచ్చేదెన్నడు? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 11:33 pm

మారని బతుకులు

. జీడి పరిశ్రమల్లో అమలుకాని చట్టాలు. వేతనాల కోసం నిత్యం పోరాటాలే. ఐదు దశాబ్దాలుగా కాయకష్టం. మారని కార్మికుల జీవనస్థితి. కోట్లు కొల్లగొడుతున్న యాజమాన్యాలు… బ్రోకర్లు. ప్రభుత్వ ఆదాయానికి గండి జీడిపిక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు చట్టాలు వర్తించవు. రెక్కాడితే గాని డొక్కాడని కష్ట జీవులు సుమారు ఐదు దశాబ్దాలుగా కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. జీవనస్థితిలో మార్పు మచ్చుకైనా కానరావడం లేదు. వేతనాలు పెంచండి మహాప్రభు అంటూ పోరాడాల్సి వస్తోంది. పరిశ్రమల్లో కనీస సౌకర్యాలూ ఉండవు. […] The post మారని బతుకులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 11:31 pm

అమెజాన్‌లో 14000 మంది ఉద్యోగులపై వేటు

మెజాన్‌లో ఉద్యోగాల మంగళం వచ్చే వారం 14 వేల జాబ్స్ పై వేటు వాషింగ్టన్ : ఆన్‌లైన్ దిగ్గజ వ్యాపార సంస్థ అమెజాన్‌లో దాదాపుగా మరో 14000 కార్పొరేట్ ఉద్యోగాలపై వేటు పడనుంది. మంగళవారం నుంచి ఈ తొలిగింపుల ప్రక్రియ చేపడుతారని వెల్లడైంది. వచ్చే వారంలో ఈ కీలక పరిణామం జరుగుతుందని రాయిటర్స్‌తెలిపింది.సంస్థ అంతర్గత వర్గాల ద్వారా ఈ సమాచారం అందిందని తెలిపారు. అంతర్గత బ్యూరోక్రసీ భారం తగ్గించుకునేందుకు, దాదాపుగా 30 వేల మంది వైట్‌కాలర్ ఉద్యోగులను తొలిగించేందుకు కంపెనీ సిద్ధం అయింది. ఇందులో భాగంగానే 14 వేల నుంచి 16 వేల వరకూ జాబ్స్‌పై వేటుపడుతుంది. వీరంతా ఉద్యోగాలు కోల్పోతారు. ఈ లే ఆఫ్‌ల దశ 27వ తేదీ నుంచి ఆరంభం కానుంది. దీనితో సంస్థలోని పది శాతం కార్పొరేట్ ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌కు ఉన్న 1.58 మిలియన్ ఉద్యోగులలో ఇప్పుడు తొలిగింపునకు గురయ్యే ఉద్యోగుల సంఖ్య కొద్ది పాటిగా ఉంటుంది. అమెజాన్‌లో అత్యధిక సంఖ్యలో వేర్‌హౌసెస్, ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లలో పనిచేసే వారు ఉన్నారు. ఇప్పటి లే ఆఫ్‌లు ప్రాధమికంగా కార్పొరేట్, వైట్ కాలర్ బాధ్యతల్లో ఉన్నవారిపైనే పడుతుంది. అయితే ఈ లే ఆఫ్‌లకు ఆర్థిక అంశాల ప్రభావితం కావని, అదే విధంగా ఎఐ పరిణామాలతో తలెత్తినవి కావని అమెజాన్ సిఇఒ ఆండీ జస్సీ తెలిపారు. కంపెనీ విధానాలు ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుని చేపట్టిన చర్య అని పేర్కొన్నారు. అమెజాన్‌కు ఇటీవలి కాలంలో అత్యధిక సంఖ్యలో బ్యూరోక్రసీ భారం పెరిగిందని, దీనిని సరిదిద్దుకోవల్సి ఉందని వివరించారు. గత ఏడాది అక్టోబర్‌లో సంస్థలో దాదాపు పదివేల ఉద్యోగాలకు కోత పెట్టారు. 

మన తెలంగాణ 23 Jan 2026 11:28 pm

వైష్టవిఏపీ బడ్జెట్ కసరత్తు షురూ

మార్చిలోనే అసెంబ్లీ సమావేశాలుసవరణలు, అంచనాల ప్రతిపాదనలపై సమీక్షలు విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభుత్వ కసరత్తు ప్రారంభమైంది. ఆయా శాఖలు తమ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు అందించే పనిలో ఉన్నాయి. గతంలో కంటే భిన్నంగా బడ్జెట్ ప్రవేశ పెట్టాలని, సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతివ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండాలని, కీలక పథకాలకు నిధులు కేటాయిస్తూనే ఆదాయ పెంపు మార్గాలను అన్వేషించాలని యోచిస్తోంది. వివిధ శాఖలతో ఆర్థిక శాఖ ఇప్పటికే […] The post వైష్టవిఏపీ బడ్జెట్ కసరత్తు షురూ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 11:24 pm

టీమిండియా ఘన విజయం

న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 20 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 15.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), సంజు శాంసన్ (6) విఫలమయ్యారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చి ఇషాన్ కిషన్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అతనికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండగా నిలిచాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ 32 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. ఇదే సమయంలో మూడో వికెట్ 48 బంతుల్లోనే 122 పరుగులు జోడించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ 37 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 9 ఫోర్లతో 82 పరుగులు సాధించాడు. అతనికి శివమ్ దూబె 36(నాటౌట్) అండగా నిలిచాడు. ఇక కివీస్ టీమ్‌లో సాంట్నర్ (47), రవీంద్ర (44) రాణించారు.

మన తెలంగాణ 23 Jan 2026 10:46 pm

ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సజ్జనార్ నోటీసులు

రిటైర్డ్ ఐపిఎస్ అధికారి, బిఆర్‌ఎస్ నాయకులు ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్‌కు హైదరాబాద్ కమిషనర్ వి.సి సజ్జనార్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో ఏడు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని సిట్ అధికారిగా ఎలా నియమిస్తారంటూ సిట్ చీఫ్‌గా ఉన్న తనపై ఆరోపణలు చేసినందుకు గాను అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను నోటీసులు అందిన రెండు రోజుల్లోపు ఇవ్వాలని కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు బాధ్యతారాహిత్యంగా, తప్పుదారి పట్టించే విధంగా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్నాయన్నారు. ఆరోపణలన్నీ కేవలం ప్రచారం కోసమే చేశారని, ఇవి సిట్, అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆధారాలు అందచేయడంలో విఫలమయితే చట్టపరమయిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.

మన తెలంగాణ 23 Jan 2026 10:40 pm

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం రేగింది. తిరుపతి నుంచి శంషాబాద్ వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్‌లో సిఐఎస్ ఎఫ్ సెక్యూరిటీ అధికారులు బుల్లెట్‌ను గుర్తించారు. తెలిసిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌కు చెందిన నాథూరామ్ తిరుపతిలో దైవదర్శనం చేసు కుని శంషాబాద్ మీదుగా తన స్వస్థలానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అతని లగేజీ తనిఖీ చేయగా అందులో ఒక బుల్లెట్ లభ్యమైంది. సిఐఎస్‌ఎఫ్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. నాథూరామ్‌కు లైసెన్సు ఉన్న ట్లు పోలీసులు గుర్తించారు. అతడు లగేజీలో ఉన్న దుస్తుల్లో బుల్లెట్‌ను పొరపాటున తీసుకొచ్చినట్లు గుర్తించారు ఈ ఘటనతో ఎయిర్‌పోర్టులో కొద్ది సేపు కలకలం నెలకొంది. గతేడాది అక్టోబర్‌లోనూ కోల్‌కతా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద సెక్యూరిటీ అధికారులు బుల్లెట్‌ను గుర్తించారు. ఆ ప్రయాణి కుడిని విశాల్‌గా గుర్తించారు. అతడి బ్యాగ్‌లో 38 ఎంఎం బుల్లెట్ లభ్యమైంది. విశాల్‌ను అదుపులోకి తీసుకున్న సెక్యూరి టీ అధికారులు అతడిని పోలీసులకు అప్పగించారు. శంషాబాద్ విమానాశ్రయం నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. వివిధ దేశాలు, రాష్ట్రా లకు వెళ్లే సాధారణ ప్రయాణికులు, వీఐపీలు ఎయిర్‌పోర్టుకు వస్తుంటారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ప్రతీ ప్రయాణికుడి బ్యాగ్‌లను భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుంటారు. తనిఖీల సందర్బంగా డ్రగ్స్, బంగారం, ఆయుధాలు బయటపడుతూ ఉంటాయి.

మన తెలంగాణ 23 Jan 2026 10:37 pm

మేడారంలో కుప్పకూలిన హోర్డింగ్

 మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంతంలో హరిత హోటల్ వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్ హోర్డింగ్ శుక్రవారం మధ్యాహ్నం కుప్పకూలింది. మేడారం మహా జాతర సందర్భంగా గత కొద్ది రోజుల క్రితమే హరిత హోటల్ వనదేవతల గద్దెలవద్ద జరుగుతున్న విశేషాలను, ప్రచారాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా పెద్ద సైజులో స్క్రీన్ ఏర్పాటు చేశారు. అది హఠాత్తుగా కూలిం. ఆ సమయంలో భక్తులు ఎక్కువగా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇద్దరు భక్తులకు గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సంఘటన స్థలానికి చేరుకొని, కూలిన హోర్డింగ్‌ను పరిశీలించారు. జేసీబీ సాయంతో హోర్డింగును తొలగించారు.

మన తెలంగాణ 23 Jan 2026 10:33 pm

Mrunal Thakur |డెకాయిట్‌తో సక్సెస్ సాధించేనా..?

Mrunal Thakur | డెకాయిట్‌తో సక్సెస్ సాధించేనా..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 23 Jan 2026 10:30 pm

జమ్మూకశ్మీర్ కథువాలో ఎన్ కౌంటర్..జేషే టెర్రరిస్ట్ హతం

జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలో శుక్రవారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో జైష్ -ఏ-మొహమ్మద్ సంస్థకు చెందిన పాక్ టెర్రరిస్ట్ ను భద్రతాదళాలు హతమార్చాయని పోలీసులు తెలిపారు. బిల్లావర్ జనరల్ ప్రాంతంలో భద్రతదళాలు, జమ్మూకశ్మీర్ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ లో ఆ ఉగ్రవాదిని కాల్చి చంపినట్లు జమ్మూ రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ భీమ్ సేన్ టుట్టి తెలిపారు. మరణించిన జైషే టెర్రరిస్ట్ ను ఉస్మాన్ గా గుర్తించారు. ఉధంపూర్ - కథువా బెల్ట్ లో రెండేళ్లుగా జేషే మొహమ్మద్ తరుపున చురుగ్గా పనిచేస్తున్న ఉస్మాన్, తరచు సరిహద్దు దాడి చొరబడుతూ తప్పించుకు తిరుగుతున్నాడని ఆయన తెలిపారు. ఉస్మాన్ గతంలోనూ ఓ ఎన్ కౌంటర్ సందర్భంగా తప్పించుకున్నాడు. జనవరి 7, 13 తేదీలలో వరుసగా, కహోగ్ , మజోట్ అడవులలో వరుస ఎన్ కౌంటర్లు జరిపినట్లు అధికారులు తెలిపారు.

మన తెలంగాణ 23 Jan 2026 10:23 pm

వచ్చే నెల 9న ఏపీయంసీ ఎన్నికలు

విశాలాంధ్ర`విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలను నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడంపై వైద్య వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఏపీయంసీ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ నంద కిషోర్ , డాక్టర్ కార్తీక్ నేతృత్వంలోని డాక్టర్స్ డెమోక్రటిక్ ప్యానెల్ అభ్యర్థులు శుక్రవారం తాడేపల్లిలోని కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నంద కిషోర్ మాట్లాడుతూ వచ్చే నెల ఫిబ్రవరి 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని, చరిత్రలో మొదటిసారిగా ఈ […] The post వచ్చే నెల 9న ఏపీయంసీ ఎన్నికలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 10:04 pm

ప్రజాభిప్రాయాలు బుట్టదాఖలు

బాధ్యత విస్మరిస్తున్న నియంత్రణ మండలి.. జి. కోటేశ్వరరావువిశాలాంధ్రవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అనేది స్వతంత్ర వ్యవస్థ గా నడపాల్సిన బాధ్యత విస్మరించి పాలకుల లోపభూయిష్ట ఆర్థిక విధానాలు అమలు చేసే వ్యవస్థగా మారిందని సీపీఐ నగర సమితి కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆరోపించారు. 2026 - 2027 ఆర్థిక సంవత్సర ఆదాయ అవసరాల రిటైల్ ధరలపై నియంత్రి మండలి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ శుక్రవారం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళక్షేత్రం లో నిర్వహించింది. ఈ సందర్భంగా సీపీఐ […] The post ప్రజాభిప్రాయాలు బుట్టదాఖలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 9:59 pm

రక్తదానంతో నిండు ప్రాణాలను కాపాడుకుందాం

జిల్లా కలెక్టర్ లక్ష్మీశ,విశాలాంధ్ర`విజయవాడ: రక్తదానం మహా యజ్ఞఫలంతో సమానమని రక్తదానం చేయడం ద్వారా ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం అదృష్టంగా ప్రతి ఒక్కరూ భావించాల్సిన అవసరం ఉందని రక్తదానానికి మించిన మరొక దానం లేదని రక్తదానం చేసేలా యువతను ప్రోత్సహించాలల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.స్వాంతంత్ర సమరయోదుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరియు నలంద విద్యా సంస్థల సంయుక్త అధ్వర్యంలో […] The post రక్తదానంతో నిండు ప్రాణాలను కాపాడుకుందాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 9:49 pm

హెల్మెట్ ప్రయాణం సురక్షితం

కలెక్టర్ జి లక్ష్మీశ విశాలాంధ్రవిజయవాడ:ద్విచక్ర వాహన చోదకుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని హెల్మెట్ ధరించి వాహనం నడిపి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు.జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా, పోలీసు శాఖల అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మహిళల బైక్ ర్యాలీ కలెక్టరేట్ నుండి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలలో హెల్మెట్ ధరించి వాహనాలను నడపడం పై పూర్తి అవగాహన కల్పించేందుకు […] The post హెల్మెట్ ప్రయాణం సురక్షితం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 9:46 pm

77వ రిపబ్లిక్ డే స్పీచ్: యువతను ఉర్రూతలూగించేలా ప్రసంగించండి ఇలా

భారతదేశం 2026 జనవరి 26న 77వ రిపబ్లిక్ డే జరుపుకుంటోంది. దేశ భవిష్యత్తును నిర్మించే యువతలో స్ఫూర్తిని నింపేలా, పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ సభల్లో ప్రసంగించడానికి సిద్ధం చేసిన ప్రసంగ పాఠం మీ కోసం.. గణతంత్ర దినోత్సవ ప్రత్యేక ప్రసంగం ప్రారంభం: “వేదికపై ఉన్న పెద్దలకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, నా దేశ భవిష్యత్తు అయిన నా తోటి యువతీ యువకులకు నమస్కారం. ఈరోజు మనం భారత మాత ముద్దుబిడ్డలుగా, సగర్వంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. […] The post 77వ రిపబ్లిక్ డే స్పీచ్: యువతను ఉర్రూతలూగించేలా ప్రసంగించండి ఇలా appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 23 Jan 2026 9:42 pm

ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరంలాగా మారుతున్నాయి

విశాలాంధ్ర – ధర్మవరం; పట్టణములో వివిధ సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు నేడు పేదలకు వరంలాగా మారుతుండడంతో చక్కటి ఆరోగ్యాన్ని పొందుతున్నారని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆరోగ్య లబ్ధిదారులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయంలో 119వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి […] The post ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరంలాగా మారుతున్నాయి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 9:29 pm

రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడు నారా లోకేష్

ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిచార శ్రీరామ్ విశాలాంధ్ర – ధర్మవరం; రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడు నారా లోకేష్ అని, ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా నారా లోకేష్ పై విశ్వాసంతో ఉన్నారు అని ధర్మవరం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. ధర్మవరంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించారు. ముందుగా నారా లోకేష్ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ పట్టణంలోని దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిడిపి […] The post రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడు నారా లోకేష్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 9:18 pm

భారత్ టార్గెట్ 209

ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా షహీద్ వీర్‌నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టి-20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంభాన్ని రచిన్ రవీంద్ర (44) కొనసాగించగా.. మిచెల్ శాంట్నర్ ( 47 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. భారత బౌలర్లలో కుల్దీప్ 2 వికెట్లు తీయగా, వరుణ్, శివమ్,హార్దిక్ పాండ్యా, హర్షిత్ తలో వికెట్ పడగొట్టారు.

మన తెలంగాణ 23 Jan 2026 9:11 pm

కేరళలో మార్పు తిరువనంతపురంతో ఆరంభం: పిఎం మోడీ

కేరళలో మార్పు చోటుచేసుకుంటుందని, ప్రజలకు బిజెపిపై నమ్మకం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. బిజెపి తరఫున తిరువనంతపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాజకీయ మార్పునకు వీలుందని తెలిపారు. తిరువనంతపురంలో నాలుగు దశాబ్దాల వామపక్ష పాలన అంతం అయింది. బిజెపిపై ప్రజలకు ఏర్పడుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనం అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గుజరాత్‌లో నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. గుజరాత్‌లో ఒకే ఒక్క నగరంలో గెలుపు సాధించి , ఆ తరువాత అక్కడ బిజెపి పూర్తిస్థాయిలో అధికారానికి వచ్చింది. తిరుగులేకుండా సాగుతోందని గుర్తు చేశారు. ఇక్కడ కేరళలో కూడా తిరువనంతపురంతో ఆరంభమైన బిజెపి విజయం విస్తరించుకుంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. 1987 ముందటి వరకూ గుజరాత్‌లో బిజెపి నామమాత్రపు పార్టీగా ఉండేది. మీడియా కూడా ఎక్కువగా పట్టించుకోకుండా ఉండేది. 1987లో రాజకీయ మలుపు చోటుచేసుకుంది. అక్కడ తొలిసారిగా రాజధాని అహ్మదాబాద్‌లో బిజెపి ఆధిపత్యం నెలకొంది. అక్కడి నుంచి పార్టీ విజయయాత్ర సాగిందన్నారు. కేరళలో కూడా ఇప్పుడు తిరువనంతపురం గెలుపు మలుపు అవుతుందని చెప్పారు. ఏ మార్పు కోసం అయినా ప్రజల నమ్మకం కీలకం అవుతుంది. అక్కడ అహ్మదాబాద్ ఆరంభం. ఇక్కడ తిరువనంతపురం మైలురాయి అవుతుందని చెప్పారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి సేవలు అందించేందుకు అవకాశం కల్పించారు. దీనిని తాము నిలబెట్టుకుంటున్నామని తిరువనంతపురం సభలో చెప్పారు. ఇక్కడి బిజెపి గెలుపు మామూలు విషయం కాదు. కేరళను ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్‌ల అవినీతి వలయాల , రంగుల రాట్నాల బారి నుంచి విముక్తం చేయాలనే కృత నిశ్చయానికి తొలి గెలుపు అని విశ్లేషించారు. తిరువనంతపురం ప్రజలను అభినందించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే కేరళలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త రైలు సేవల ఆరంభానికి ప్రధాని మోడీ కేరళ పర్యటనకు వచ్చారు. ప్రజల ప్రేమను డ్రామాగా గేలిచేసే రకాలు..విమర్శకులపై ప్రధాని మోడీ మండిపాటు జనం ప్రేమాభిమానాలు చూపితే , వాటి వెనుక డ్రామాలు ఉన్నాయని అంటారు. పైగా ప్రచారపు ఎత్తుగడగా దుష్ప్రచారం చేస్తారు. అయితే ఇటువంటి గేలికి తాను అలవాటు పడ్డానని ప్రధాని మోడీ తెలిపారు. శుక్రవారం తిరువనంతపురంలో ఓ చిన్నారి మోడీ చిత్రాన్ని గీసి తనకు కన్పించేలా నిలబడినప్పుడు ప్రధాని స్పందించారు. ఈ బాలుడి వద్ద ఉన్న ఫోటోను తన రక్షణ సిబ్బందికి చెప్పి తెప్పించుకున్నారు. దీని వెనుక పేరు, అడ్రసు రాయమని, తరువాత మాట్లాడుతానని చెప్పారు. తాను ఎక్కడికి అయినా వెళ్లినప్పుడు ప్రజలు తన పట్ల చూసే అభిమానం గురించి ప్రస్తావించారు. ప్రత్యేకించి పిల్లలు, యువత తమ స్పందనను ఈ విధంగా చిత్రాలతో కనబరుస్తారు. వీటిని తాను స్వీకరిస్తాను. అయితే తరువాత దీనిపై కొందరు వెంటనే వ్యంగ్మాత్మక విమర్శలతో రీల్స్ చేస్తారు. మోడీది ప్రచార ఆర్బాటం, పెద్ద నాటకం అని దెప్పిపొడుస్తారు. అయితే ఇటువంటి వాటితో తన తలబొప్పి కొట్టింది. తాను ప్రజల ప్రేమ అభిమానాలను సాదరంగా స్వీకరిస్తానని, వేరే విధంగా స్పందించే వారి వైఖరితో ప్రజల పట్ల ఆదరణను మరింత పెంచుకుంటానని తెలిపారు. జనం మధ్యలో బాబు చాలా సేపు తన పటంతో నిలబడ్డాడని, అలసిపోతూనే ఈ బొమ్మ తనకు కనబడాలని తపించాడని, ఇటువంటివి తరచూ తనకు ఎదురయ్యే ఘటనలు అని తెలిపిన ప్రధాని ఇదే దశలో వెటకారాలకు దిగే వారూ ఉంటారని నవ్వుతూ చెప్పారు.

మన తెలంగాణ 23 Jan 2026 9:10 pm

ఓటు వజ్రాయుధం

విశాలాంధ్ర -జేఎన్టీయూ ఏ : సుపరి పాలన, ప్రజా సంక్షేమ, స్వేచ్ఛ సమాజ నిర్మాణానికి ఓటు వజ్రాయుధమని అనంతపురం రూరల్ తహశీల్దార్ కే. మోహన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ఓటు హక్కు పై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొంది ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాలని సూచించారు. అనంతరం ఓటు హక్కు దరఖాస్తు విధానం, నిబంధనలపై వివరించారు. చైర్మన్ అనంత రాముడు […] The post ఓటు వజ్రాయుధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 9:00 pm

బైక్ టాక్సీలపై నిషేధాన్ని రద్దు చేసిన హైకోర్టు

బైక్ టాక్సీలను నిషేధిస్తూ గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు మంగళవారం నాడు తప్పుపట్టింది. బైక్ టాక్సీల పై నిషేధాన్ని హైకోర్టు జనవరి 23న రద్దు చేసింది. ఈ విషయంలో బైక్ టాక్సీ అగ్రిగేటర్లు, వ్యక్తిగత బైక్ టాక్సీ యజమానులు, ఇతరులు దాఖలు చేసిన అపీళ్లను అనుమతించింది. మోటార్ సైకిళ్లను రవాణా వహనాలుగా నమోదు చేయాలని, కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్లను మంజూరు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విభు బఖ్రు, జస్టిస్ సిఎం జోషీలతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.వాహనాల రిజిస్ట్రేషన్, పర్మిట్ల జారీకి సంబంధించిన అంశాలపై రవాణా అధికారులు ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ, మోటర్ సైకిళ్లు అనుమతించబడవు అనే కారణంతో వారు పర్మిట్లను, రిజిస్ట్రేషన్ ను తిరస్కరించలేరని డివిజన్ బెంచ్ పేర్కొంది.

మన తెలంగాణ 23 Jan 2026 8:57 pm

జోగి రమేష్ జైలు నుంచి విడుదల

మాజీ మంత్రి, వైసిపి నేత జోగి రమేష్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపిం చారు. 83 రోజుల పాటు తనను జైల్లో ఉంచి, ఇష్టం వచ్చినట్లుగా వివిధ జైళ్లకు తిప్పారని వాపోయారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కేసులు పెడితే వైసీపీ నేతలు భయపడతారని అనుకుంటే అది పొరపాటేనని స్పష్టం చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్ నాయకత్వంలో ముందుకు సాగుతామని అన్నారు. శనివారం అమ్మవారి ఆలయానికి వెళ్లి తాను తప్పు చేయలేదని ప్రమా ణం చేస్తానని జోగి రమేష్ వెల్లడించారు.

మన తెలంగాణ 23 Jan 2026 8:51 pm

మేడారం జాతరకు 3 కోట్ల 70 లక్షల కేంద్ర నిధులు

గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం మూడు కోట్ల 70 లక్షల రూపాయలు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ మొత్తాన్ని విడుదల చేశాయి.కేంద్ర పర్యాటక శాఖ అధ్వర్యంలో మేడారం చుట్టు పక్కల ఉన్న ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం గిరిజన సర్కూట్ పేరిట గతంలో ఎనభై కోట్లతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన బౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా పలు అభివృద్ధి పనులను కూడా చేపట్టింది. అదేవిధంగా యునెస్కొ గుర్తింపు లభించిన రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం రూ. 140 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

మన తెలంగాణ 23 Jan 2026 8:45 pm

పీపీపీతో వైద్యవిద్య, ప్రజారోగ్యం ప్రమాదకరం

బందెల నాసర్ జీ ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంతో ప్రైవేట్‌కు ధారాదత్తం చేసే చంద్రబాబు ప్రభుత్వం విధానాలు విద్యతో పాటు ప్రజారోగ్య హక్కుకు ముప్పే. 2025 సెప్టెంబర్ 4వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నూతనంగా కేటాయించిన 17 ప్రభుత్వ వైద్యకళాశాలలో 10వైద్య కళాశాలలను (ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, అమలాపురం, పాలకొల్లు, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం) పీపీపీ […] The post పీపీపీతో వైద్యవిద్య, ప్రజారోగ్యం ప్రమాదకరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 8:44 pm

గ్రీన్‌లాండ్‌పై అమెరికా దుర్నీతి

సుంకవల్లి సత్తిరాజు ఇతర దేశాలను కొనుగోలు చేయడం, వీలుకాకుంటే ఆక్రమించుకోవడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. అమెరికా చరిత్రను పరిశీలిస్తే ఈ వాస్తవం అవగతమవుతుంది. 50 రాష్ట్రాల అమెరికాలో అలాస్కా రాష్ట్రం అతి పెద్దది. అలాస్కాను 1867లో రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది. అమెరికాలో అత్యధిక జనాభా గల రాష్ట్రమైన కాలిఫోర్నియాను గతంలో మెక్సికో పై దాడి చేసి అమెరికా వశపరచుకుంది. నెవాడా, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో వంటి రాష్ట్రాల భూభాగాలు మెక్సికో నుంచి […] The post గ్రీన్‌లాండ్‌పై అమెరికా దుర్నీతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 8:40 pm

భారత రాజ్యాంగం…వైరుధ్యాలు

షేక్ కరీముల్లా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26. ఆ రోజు దేశమంతా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. అయితే ఇది మొక్కుబడి కార్యక్రమం కాకూడదు. రాజ్యాంగ లక్ష్యాలు సాధించగలగాలి. భావిభారత పౌరులకు రాజ్యాంగ స్ఫూర్తిని అందించగలగాలి. కానీ ఆచరణ మాత్రం భిన్నంగా ఉంది. భారతదేశం ఒక సామాజిక సమ్మేళనం. స్వాతంత్య్రనాంతరం దేశ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం. మన రాజ్యాంగ కూర్పునకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. […] The post భారత రాజ్యాంగం…వైరుధ్యాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 8:38 pm

గూగుల్ మ్యాప్ చూస్తూ బావిలో పడిన యువకుడు

గూగుల్ మ్యాప్ చూస్తూ బైక్ పై వెళుతున్న యువకుడు బావిలో పడిపోయిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. రాయ్ బరేలికి చెందిన రితేశ్ జైస్వాల్ లఖ్నోలోని అర్జున్ గంజ్ లో నివాసముంటున్నాడు. అయితే రితేశ్ తన సొంత ఊరికి బైక్ వెళ్లే సమయంలో కరోరా-నాగ్రామ్ దారిలో గూగుల్ మ్యాప్ ను చూస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ చోట పెద్ద మలుపు రావడంతో ముందుకు వెళ్లగా బావి గోడను ఢీకొట్టాడు. దీంతో రితేశ్ బైక్ పై నుంచి బావిలో పడిపోయాడు. అదే దారిలో గస్తీలో ఉన్న పోలీసులు రోడ్డు పక్కన బైక్ పడిపోయి ఉండటాన్ని గమనించి బావి వద్దకు వెళ్ళి చూడగా బావిలో రితేశ్ అరుపులు వినిపించాయి. వెంటనే రితేశ్ ను పోలీసులు స్థానికుల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో రితేశ్ స్వల్పంగా గాయపడ్డాడు. 

మన తెలంగాణ 23 Jan 2026 8:37 pm

‘RaaKaaSaa’ Glimpse Promises a Wholesome Fantasy-Comedy Entertainer

The glimpse of the upcoming Telugu fantasy-comedy RaaKaaSaa has generated strong buzz, thanks to its smart humour, quirky tone, and refreshing narrative approach. Offering a playful blend of fantasy and satire, the glimpse clearly establishes comedy as the film’s core strength and sets expectations for a light-hearted yet imaginative entertainer. The glimpse opens with a […] The post ‘RaaKaaSaa’ Glimpse Promises a Wholesome Fantasy-Comedy Entertainer appeared first on Telugu360 .

తెలుగు 360 23 Jan 2026 8:34 pm

పంట పొలాల్లో మొసలి కలకలం

 పంట పొలాల్లోకి మొసలి వచ్చిన సంఘటన ముగ్ధుంపురం గ్రామంలో చోటుచేసుకుంది. కాగా గ్రామానికి చెందిన గొర్రె రవి రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా అక్కడ మొసలిని చూశాడు. వెంటనే నెక్కొండ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న నెక్కొండ సెక్షన్ ఆఫీసర్ సోమిరెడ్డి సరిత, సోమ యోగేష్, బీట్ ఆఫీసర్, డ్రైవర్ శివ మొసలిని పట్టుకుని పాకాల చెరువులో వదిలేశారు.

మన తెలంగాణ 23 Jan 2026 8:23 pm

Icon Star |బన్నీ మరో రెండు సినిమాలు ఓకే చేశాడా..?

Icon Star | బన్నీ మరో రెండు సినిమాలు ఓకే చేశాడా..? ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Jan 2026 8:20 pm

అతి వేగం.. రెయిలింగ్ ఢీకొని ఇద్దరు దుర్మరణం

ఖమ్మం: జిల్లాలోని కల్లూరు మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపు తప్పి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఏలూరు జిల్లాకు చెందిన సాయి మహేష్(35), గట్టు రాంబాబు(39) శుక్రవారం ఖమ్మం వెళ్తుండగా.. లింగాల సమీపంలో ఈ ఘటన జరిగింది. వారు బైక్‌పై అతి వేగంగా ప్రయాణిస్తూ రెయిలింగ్‌ను ఢీకొన్నారు. దీంతో కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 

మన తెలంగాణ 23 Jan 2026 8:19 pm

చత్తీస్‌గఢ్‌లో 9మంది మావోల లొంగుబాటు

చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ జిల్లా కేంద్రంలో  9మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాయపూర్ రేంజ్ ఐజి ఉమరేష్ కుమార్ మిశ్రా, జిల్లా ఎస్పీ ఎదుట దామ్ తరిలో నగరి ఏరియా కమిటీ, సీతానది ఏరియా కమిటీ, గరియా బంద్, సువాపాడ డివిజన్‌కు చెందిన 9మంది మావోయిస్టులు ఎల్‌జిఎస్ ఆయుధాలతో లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఇద్దరు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరంతా జిల్లాలో జరిగిన అనేక ప్రధాన సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులపై 47 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు తెలిపారు. చత్తీగఢ్ రాష్ట్ర ప్రభుత్వం, రాయపూర్ జిల్లా పోలీసులు లొంగిపోయిన మావోయిస్టులకు అందజేస్తున్న సౌకర్యాలకు ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్టు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసి సుఖవంతమైన జీవితం గడపాలనే మావోయిస్టులు తమ ఎదుట లొంగిపోవచ్చని సూచించారు.

మన తెలంగాణ 23 Jan 2026 8:06 pm

CMRF checks |సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ…

CMRF checks | సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ… CMRF checks | చిట్యాల,

ప్రభ న్యూస్ 23 Jan 2026 7:58 pm

బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్ఎ పై పది కోట్ల పరువు నష్టం దావా

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు కోపం వచ్చింది. తనపై నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వికారాబాద్ జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పై పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ తరఫున న్యాయవాది సదరు మాజీ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసు పంపించారు.తనను మానసికంగా క్షోభ పెట్టినందుకు పది కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించడంతో పాటుగా వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టం ప్రకారం న్యాయ స్థానాల ద్వారా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.మెతుకు ఆనంద్ ఈ నెల 14న ఇంకా ఈ నెల 19న తేదీలలో మీడియా సమావేశాల్లో నిర్లక్షంగా మాట్లాడుతూ తనపై నిరాధార తప్పుడు, అసత్య, అభూత కల్పనలు, కట్టు కథలతో కూడిన అవినీతి ఆరోపణలు చేశారని, వ్యక్తిగత జీవితానికి, గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లలో తాను వందల కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆనంద్ ఆరోపించారని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. రాజ్యాంగబద్దమైన పదవిని అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా వికారాబాద్ పురపాలన సంఘాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారనే కట్టు కథలు అల్లారని ఆయన విమర్శించారు.అంతేకాకుండా తనను బుల్లెట్ రాజు అంటూ అవహేళనగా మాట్లాడి వ్యక్తిగతంగా మనసును గాయపరిచారని, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలో ఇతరులపై విమర్శలు చేసే స్వేచ్ఛ, స్వాతంత్య్రం రాజ్యాంగం కల్పించిందని, కానీ నిరాధార ఆరోపణలు చేయడం మాత్రం అత్యున్నత పదవులను అవమానించడం, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీయడానికి చేసే ప్రయత్నం అవుతుందని ఆయన విమర్శించారు. ఇలాంటి చర్యలను సమాజంలో సాకుగా, న్యాయ స్థానాలు కూడా సమర్థించవని, భారత న్యాయ సహితలోని సెక్షన్ ల ప్రకారం దురుద్వేశ ఆరోపణలు చేసిన వారు శిక్షార్హులని ఆయన వివరించారు.అట్టడుగు స్థాయి నుంచి వచ్చి శాసన వ్యవస్థలో అత్యన్నతమైన శాసన సభాపతి హోదాలో ఉంటూ, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంతో పాటుగా వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయిస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 23 Jan 2026 7:58 pm

School |ఎమ్మెల్యే వినోద్‌కు ‘గజమాల’స్వాగతం..

School | ఎమ్మెల్యే వినోద్‌కు ‘గజమాల’ స్వాగతం.. School | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Jan 2026 7:54 pm

ఇక నుంచి షోరూంల వద్దే వాహనాల రిజిస్ట్రేషన్

షోరూంల వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యింది. ప్రయోగాత్మకం గా హైదరాబాద్ పరిధిలోని ఓ షోరూంలో దీనిని రవాణా శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. వాహనాల యజమానులు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లకుండా డీలర్ వద్దే వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా రవాణా శాఖ ఈనెల 8వ తేదీన విధాన పర నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా రవాణా శాఖ అధికారులు సాఫ్ట్‌వేర్‌ను 15 రోజుల్లో సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత సాఫ్ట్‌వేర్ ఆధారంగా ప్రయోగా త్మకంగా శుక్రవారం శ్రీ కృష్ణ ఆటోమోటివ్స్ షో రూంలో డీలర్ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని విజయవంతంగా అధికారులు నిర్వహించారు. ఈ విధానం విజయవంతం కావడంతో ఇక నుంచి కొత్త వాహనాలు షోరూంల వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు తెలిపారు. 24-01-2026 నుంచి కొన్న వాహనాలకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందని - రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానం ప్రకారం డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకుంటారు. అవసరమైన పత్రాలు (ఇన్‌వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫొటోలు మొదలైనవి) ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో వచ్చిన పత్రాల ఆధారంగా రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. అనంతరం వాహనానికి సంబంధించి ఆర్‌సిని స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపిస్తారు. ఈ విధానం అమలుతో ప్రజలకు సమయం ఆదా అవుతుంది. ఈ విధానం గురించి రవాణా శాఖ కమిషనర్ 33 జిల్లాల రవాణా శాఖ అధికారులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఆ విధానం అమల్లో షో రూం డీలర్లకు ఏవైనా సందేహాలుంటే సంబంధిత జిల్లా రవాణా శాఖ అధికారులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని రవాణా శాఖ తెలిపింది.

మన తెలంగాణ 23 Jan 2026 7:53 pm

Documents |సర్పంచులకు ప్రశంసా పత్రాలు అందజేత

Documents | సర్పంచులకు ప్రశంసా పత్రాలు అందజేత Documents | చిట్యాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Jan 2026 7:48 pm

సిద్ధార్థ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో అక్షరాభ్యాస వేడుకలు..

విశాలాంధ్ర, పెనుకొండ..వసంత పంచమిని పురస్కరించుకొని శుక్రవారం పెనుకొండలోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరస్పాండెంట్ లింగారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ వసంత పంచమి ప్రాధాన్యతను విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. మనిషి జీవితంలో ఎదగడానికి జ్ఞానం, ధనం కీలక పాత్ర పోషిస్తాయని, జ్ఞానానికి ప్రతీక సరస్వతీ మాత, ధనానికి ప్రతీక లక్ష్మీదేవి […] The post సిద్ధార్థ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో అక్షరాభ్యాస వేడుకలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 7:47 pm

ఎస్‌బీఐ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం..

విశాలాంధ్ర, డీ హీరేహాళ్ ..డీ హీరేహాళ్ మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీ హీరేహాళ్ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్ జి. రాజేష్ నేతృత్వంలో స్థానిక హైస్కూల్ డీ హీరేహాళ్ మరియు హైస్కూల్ హెచ్. సిద్దాపురం లో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది డీ హీరేహాళ్ మండలంలోని 700 మందికి పైగా విద్యార్థినులకు sanitary napkins పంపిణీ చేసినట్లు మేనేజర్ రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ స్టేట్ […] The post ఎస్‌బీఐ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 7:36 pm

‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్.. నవ్వులే నవ్వులు

హైదరాబాద్: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. జయ జయ జయహే అనే మలయాళ మూవీకి ఇది రీమేక్‌. ఎ.ఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. భార్య మధ్య జరిగే ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాల మధ్య జరిగే సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సినిమా ట్రైలర్‌ చూసేయండి..

మన తెలంగాణ 23 Jan 2026 7:33 pm

Temple |వైభవంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం

Temple | వైభవంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం Temple | ఆలేరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Jan 2026 7:33 pm

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಶಿಮ್ಜಿತಾ ಮುಸ್ತಫಾಳನ್ನು ಕೇರಳ ಪೊಲೀಸರು ಬಂಧಿಸಿದ್ದಾರೆ ಎಂದು ಹಳೆಯ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ​

ಶಿಮ್ಜಿತಾ ಮುಸ್ತಫಾಳನ್ನು ಕೇರಳ ಪೊಲೀಸರು ಬಂಧಿಸಿದ್ದಾರೆ ಎಂದು ಹಳೆಯ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ​

తెలుగు పోస్ట్ 23 Jan 2026 7:30 pm

డీహెరేహాల్ లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర డీహెరేహాల్. ..మండల కేంద్రంలోని శివలింగ స్వామి మఠంలో శుక్రవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చిత్రపటానికి పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య స్టేట్ డైరెక్టర్ నాగల్లి రాజు, గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయకుమార్, తిప్పే స్వామి, వన్నూరు స్వామి, సురేష్, మోహన్, నీలప్ప, గోపాల్, గుండ్రాయి, అంజి, హనుమంత తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి నారా లోకేష్‌కు […] The post డీహెరేహాల్ లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 7:27 pm

Award |బంజారా సాహిత్య జ్ఞానరత్న అవార్డు ప్ర‌దానం…

Award | బంజారా సాహిత్య జ్ఞానరత్న అవార్డు ప్ర‌దానం… Award | ఉట్నూర్,

ప్రభ న్యూస్ 23 Jan 2026 7:24 pm

బండ్ల గణేష్ సంకల్పయాత్రకు సంఘీభావం..

విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ని అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన సమయంలో, ఆయన క్షేమంగా విడుదలైతే హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తానని సినీ నిర్మాత బండ్ల గణేష్ మొక్కుకున్నారు. తన మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేష్ ‘సంకల్పయాత్ర’ను చేపట్టారు. ఈ సంకల్పయాత్రలో భాగంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కళ్యాణదుర్గం యువ నాయకుడు ఉన్నం మారుతి చౌదరి బండ్ల గణేష్‌ను కలుసుకుని సంఘీభావం […] The post బండ్ల గణేష్ సంకల్పయాత్రకు సంఘీభావం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 7:10 pm

development |ప్రజల సమస్యలు పరిష్కరిస్తా..

development | ప్రజల సమస్యలు పరిష్కరిస్తా.. development | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 23 Jan 2026 7:07 pm

Munsif’s court |వర్గ పోరు సృష్టించిన వ్యక్తి రిమాండ్

Munsif’s court | వర్గ పోరు సృష్టించిన వ్యక్తి రిమాండ్ Munsif’s court

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:58 pm

విషాదం: ఐదేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు

పుణె: మహారాష్ట్రలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడిని ఓ కారు చిదిమేసింది. పుణెలోని లోనికల్బోర్ ప్రాంతంలోని ఓ నివాస సముదాయంలో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం తన ఇంటి సముదాయంలో ఐదేళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. కటుంబసభ్యులు కూడా అక్కడే ఉన్నారు. అటువైపుగా దూసుకొచ్చిన ఓ కారు.. అతడి మీద నుంచి వెళ్లిపోయింది. వెంటనే కారు నడుపుతున్న వ్యక్తి దిగొచ్చి, పిల్లాడిని పైకి లేపాడు. బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాల కారణంగా అతడు చనిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడి సిసికెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 23 Jan 2026 6:56 pm

OSSS Trailer: Breezy Godavari Rom-Com, With A Twist

Tharun Bhascker and Eesha Rebba ignite the screen in Om Shanti Shanti Shantihi, A R Sajeev’s debut directorial gem- a breezy rural drama blending sharp banter and heartfelt family vibes. Building on the teaser and songs’ massive buzz, Vijay Deverakonda just released the trailer, ramping up excitement for its January 30th theatrical release. Fish trader […] The post OSSS Trailer: Breezy Godavari Rom-Com, With A Twist appeared first on Telugu360 .

తెలుగు 360 23 Jan 2026 6:53 pm

Medaram |సమన్వయంతో సమిష్టిగా సక్సెస్ చేద్దాం

Medaram | సమన్వయంతో సమిష్టిగా సక్సెస్ చేద్దాం Medaram | వరంగల్ క్రైమ్,

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:50 pm

Free medical |రాచపూర్‌లో ఉచిత వైద్య శిబిరం

Free medical | రాచపూర్‌లో ఉచిత వైద్య శిబిరం Free medical |

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:43 pm

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

రాయ్‌పూర్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా షహీద్ వీర్‌నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టి-20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. అదే సమరోత్సాహంతో ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన కివీస్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో రెండు మార్పులు చేసింది. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో హర్షిత్ రాణాను, ఇక బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్‌ని జట్టులోకి తీసుకుంది. ఇక న్యూజిలాండ్ జట్టులో మూడు మార్పులు చేసింది. సీఫెర్ట్, ఫౌల్క్స్, మాట్ హర్నీలు కివీస్ జట్టులోకి వచ్చారు. తుది జట్లు: భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ.

మన తెలంగాణ 23 Jan 2026 6:41 pm

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ చేసిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ విచారణ పూర్తి అయింది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరులోని ఎసిబి కోర్టులో సిట్ అధికారులు సంచలన విషయాల తో కూడిన తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగి నట్లు విచారణలో శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ భారీ స్కామ్‌లో సిట్ మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొంది. వీరిలో 12 మంది టిటిడి ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా మాజీ టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ వ్యక్తిగత సహాయకుడు కాసూరి చిన్న అప్పన్న పేరు ఛార్జి షీట్‌లో ప్రముఖంగా ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా చేసే కంపెనీలతో కుమ్మక్కై, కిలోకు రూ. 25 చొప్పున కమీషన్లు డిమాండ్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ మేరకు హవాలా మార్గాల్లో దాదాపు రూ. 50 లక్షల వరకు లంచాలు అప్పన్నకు అందినట్లు విచారణ లో వెల్లడైంది. అప్పన్న ఎవరి కోసం ఇలా చేశాడో సిబిఐ తేల్చాల్సి ఉంది. ఉత్తరాఖండ్‌కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ఈ కుంభ కోణంలో కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ గుర్తించింది. అస్సలు పాలు, వెన్న సేకరించని ఈ డెయిరీ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనా లను కలిపి కృత్రిమ నెయ్యి ని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసింది. 2019-24 మధ్య సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని రూ. 250 కోట్ల విలువైనది టిటిడికి అంటగట్టినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. 2022లో ఈ డెయిరీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినప్పటికీ, ఇతర బినామీ డెయిరీల పేరుతో మళ్ళీ సరఫరా కొనసాగించడం గమనార్హం. కమీషన్ల కక్కుర్తి కోసం నాణ్యత లేని నెయ్యిని అనుమతించడం వల్ల శ్రీవారి లడ్డూ రుచి, నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నాయని సిబిఐ స్పష్టం చేసింది. తక్కువ ధరకు టెండర్లు వేసిన కంపెనీలు, నాణ్యతా ప్రమాణాలను పాటించకుం డా ల్యాబ్ రిపోర్టులను సైతం మేనేజ్ చేసినట్లు విచారణలో బయటపడింది. లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్ట బోమని, చట్టప రంగా కఠిన చర్యలు తీసుకుంటామని విచారణాధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు భక్తుల్లో తీవ్ర చర్చ మొదలైంది.

మన తెలంగాణ 23 Jan 2026 6:40 pm

129th Birthday |ఘనంగా చంద్రబోస్ జయంతి వేడుకలు

129th Birthday | ఘనంగా చంద్రబోస్ జయంతి వేడుకలు 129th Birthday |

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:38 pm

Bank |అవినీతి పై చర్యలు తీసుకోవాలి….

Bank | అవినీతి పై చర్యలు తీసుకోవాలి…. Bank | బోధన్, ఆంధ్ర

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:34 pm

Sports |విజేతలకు బహుమతులు ప్రధానం

Sports | విజేతలకు బహుమతులు ప్రధానం Sports | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:30 pm

Ram Charan |పెద్ది తెర వెనుక ఏం జరుగుతోంది..?

Ram Charan | పెద్ది తెర వెనుక ఏం జరుగుతోంది..? ఆంధ్రప్రభ వెబ్

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:30 pm

Madaram |గోదావరిఖని సమ్మక్క జాతరకు భారీ ఏర్పాట్లు

Madaram | గోదావరిఖని సమ్మక్క జాతరకు భారీ ఏర్పాట్లు Madaram | గోదావరిఖని,

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:25 pm

Public issues |ప్రజా సమస్యలు ఎజెండాగా…ఆంధ్రప్రభ పత్రిక

Public issues | ప్రజా సమస్యలు ఎజెండాగా…ఆంధ్రప్రభ పత్రిక Public issues |

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:18 pm

Video : Exclusive Interview with Producer Sahu Garapati

The post Video : Exclusive Interview with Producer Sahu Garapati appeared first on Telugu360 .

తెలుగు 360 23 Jan 2026 6:15 pm

Political |మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం పోటీ

Political | మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం పోటీ Political | చౌటుప్పల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:15 pm

Home Guards |సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టిన హోంగార్డులు

Home Guards | బాసర నిర్మల్ జిల్లా, ఆంధ్ర‌ప్ర‌భ : బాసర పుణ్యక్షేత్రంలో

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:13 pm

Returning |మున్సిపల్ ఎన్నికలపై ఆర్ ఓ, ఏఆర్ ఓలకు శిక్షణ

Returning |మున్సిపల్ ఎన్నికలపై ఆర్ ఓ, ఏఆర్ ఓలకు శిక్షణ Returning |

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:08 pm

Jayanti celebrations |సరస్వతీ మాత జయంతి వేడుకలు

Jayanti celebrations | సరస్వతీ మాత జయంతి వేడుకలు Jayanti celebrations |

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:06 pm

అండర్-19 ప్రపంచకప్‌లో ఆసీస్ బౌలర్ వీర విజృంభణ

డిఫెండింగ్ ఛాంపియన్‌గా అండర్-19 ప్రపంచక్ప బరలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు అందుకు తగ్గట్టుగానే రాణిస్తోంది. ఇప్పటికే ఐర్లాండ్, జపాన్‌పై విజయాలు సాధించిన ఆస్ట్రేలియా శుక్రవారం శ్రీలంకతో తగలపడుతోంది, ఈ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ విల్ బైరోమ్ చెలరేగిపోయాడు. ఐదు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించాడు. బైరోమ్‌తో పాటు లచ్‌మండ్, కెసి బార్టన్ తలో రెండు, ష్కిల్లర్ 1 వికెట్ తీశారు. దీంతో శ్రీలకం 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సులభంగా చేధించింది. 12 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి వికెట్ మాత్రమే కోల్పోయి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బైరోమ్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మన తెలంగాణ 23 Jan 2026 6:04 pm

Awareness |రోడ్డు భద్రతపై వినూత్న ప్రచారం

Awareness | పాలకుర్తి, ఆంధ్రప్రభ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:02 pm

ఆదోని ప్రత్యేక జిల్లా సాధనకు ప్రైవేట్ పాఠశాలల మద్దతు

* స్వచ్ఛందంగా స్కూళ్ల బంద్ విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : ఆదోని ప్రత్యేక జిల్లా సాధన లక్ష్యంగా జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న బంద్‌కు పెద్దకడబూరు మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా శుక్రవారం పెద్దకడబూరులో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ నాయకులు సమావేశమయ్యారు. మండలంలోని ప్రైవేట్ పాఠశాలలను స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నట్లు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ తాలూకా కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి వెల్లడించారు. ఆదోని ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక […] The post ఆదోని ప్రత్యేక జిల్లా సాధనకు ప్రైవేట్ పాఠశాలల మద్దతు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 6:00 pm

MLA |చెరువు సుందరీకరణకు 3.14 కోట్లు మంజూరు

MLA | చెరువు సుందరీకరణకు 3.14 కోట్లు మంజూరు MLA | నాగర్

ప్రభ న్యూస్ 23 Jan 2026 5:59 pm

నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన టిడిపి నాయకులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కోసిగిలో శుక్రవారం మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. జన్మదినం సందర్భంగా జాలవాడి గ్రామ అధ్యక్షులు వెంకన్న, టీడీపీ నేతలు భీమన్న, రంగన్న, కాసిం, శాంతప్ప, నాగరాజు, బజారి, దేవదానం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, అధ్యక్షులు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, సొసైటీ […] The post నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన టిడిపి నాయకులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:57 pm

పెద్దింటమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి…

విశాలాంధ్ర కైకలూరు:ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.శుక్రవారం పెద్దింటి అమ్మవారి జాతర సమన్వయ కమిటీ సమావేశంలో కామినేని శ్రీనివాస్ అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ ఈఓ, అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. వచ్చే నెల 18 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని,ఫిబ్రవరి 28న పెద్దింటమ్మ సమేత జలదుర్గా గోకర్ణేశ్వరస్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ […] The post పెద్దింటమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:53 pm

అంగరంగ వైభవంగా పెద్దమ్మ మారెమ్మ వార్షికోత్సవం

విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలో కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా దశాబ్దాల క్రితం వెలసిన పెద్దమ్మ, మారెమ్మ అమ్మవార్ల దేవాలయం 11వ వార్షికోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి విగ్రహాలను పూజారి ఓబులయ్య ఉదయాన్నే పూలతో అలంకరణ చేశారు. భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఫల, పుష్పాలు, కాయకర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులకు అన్నం వితరణ కార్యక్రమం చేశారు. The post అంగరంగ వైభవంగా పెద్దమ్మ మారెమ్మ వార్షికోత్సవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:50 pm

Hyderabad : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళుతున్నారా? అయితే మీ పార్కింగ్ ఎక్కడంటే?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే వారు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలంటే మార్పులు గమనించాల్సి ఉంది

తెలుగు పోస్ట్ 23 Jan 2026 5:49 pm

ఘనంగా వసంత పంచమి వేడుకలు

విశాలాంధ్ర ఆస్పరి : మండల కేంద్రంలోని నారాయణ ప్రైమ్ స్కూల్ నందు శుక్రవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సరస్వతి దేవి పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పూజా అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ దీప్తి మాట్లాడుతూ వసంత పంచమి అనేది మాఘ శుద్ధ పంచమి రోజున జరుపుకునే పవిత్ర పర్వదినమని, వసంత ఋతువు ఆరంభానికి ఇది సంకేతమని తెలిపారు. జ్ఞానం, విద్య, కళలకు ప్రతీక […] The post ఘనంగా వసంత పంచమి వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:47 pm

గోదావరి పుష్కరాలలో తగిన విధంగా ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించాలి…

పోలవరం, కుక్కునూరు, వేలేరుపాదులలో 44 ఘాట్ల ఏర్పాటు… గోదావరి పుష్కర ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష… విశాలాంధ్ర ఏలూరు: రానున్న గోదావరి పుష్కరాలలో ఏలూరు జిల్లాలో సుమారు 50 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కర […] The post గోదావరి పుష్కరాలలో తగిన విధంగా ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించాలి… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:44 pm