SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

18    C
... ...View News by News Source

సోమవారం రాశి ఫలాలు (02-02-2026)

మేషం సమాజంలో సేవ కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు సాధిస్తారు. వృషభం కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. మిధునం ఋణ పరమైన ఒత్తిడిలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలాకష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు. కర్కాటకం సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలు పురోగతిలో సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సింహం చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తుంది. చేపట్టిన వ్యవహారములలో అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కన్య ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తుల ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. వృశ్చికం సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ధనస్సు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి. మకరం సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం కలుగుతుంది. ఖర్చుకు మించిన ఆదాయం సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగమున ఆశించిన అవకాశములు అందుతాయి. కుంభం ప్రయాణాలు వాయిదాపడతాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. మీనం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు పొందుతారు.  

మన తెలంగాణ 2 Feb 2026 12:00 am

యూపి వారియర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

యూపి వారియర్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూపి వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా 123 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.4 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(34), ఫెఫాలీ వర్మ(29), వోల్వార్ట్(47) పరుగులు చేశారు. యూపి బౌలర్లలో దీప్తి శర్మ2, శిఖా పాండే, డాటిన్, ఎక్లిస్టన్ తలో వికెట్ పడగొట్టారు.

మన తెలంగాణ 1 Feb 2026 11:25 pm

dammapeta |మందలపల్లి గురుకులంలో విద్యార్థి పరార్.

సమయస్ఫూర్తితో బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ఇంటెలిజన్స్ కానిస్టేబుల్ భార్య దమ్మపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 11:13 pm

ఉత్సాహంగా అలెన్‌ వరల్డ్‌ జూనియర్ రన్‌

అలెన్‌ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సాహంగా.. ఉల్లాసంగా జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ రన్‌లో హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ క్రీడాకారులతో సహా 180కి పైగా పాఠశాలలకు చెందిన రెండు వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. స్పాట్‌ఆన్‌ స్పోర్ట్స్‌ సంస్థ నిర్వహించిన ఈ రన్‌ను ఆసియా గేమ్స్‌ బ్రాంజ్‌ మెడలిస్ట్‌ అగసర నందిని జెండా ఊపి ప్రారంభించింది. దీనికి ముందు ఆమె మాట్లాడుతూ క్రీడల్లో అందరికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రైవేట్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌తో కలిపి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఈ రన్‌లో పాల్గొనే అవకాశం కల్పించడం గొప్ప విషయమని నిర్వాహకులు, స్పాట్‌ఆన్‌ స్పోర్ట్స్‌ సీఈఓ రోహిత్‌ మిశ్రాను నందిని అభినందించింది. పిల్లల ఉత్సాహం చూస్తుంటే వీరిలో పదేళ్ల కిందటి తన కెరీర్‌ ప్రారంభ రోజులు గుర్తు వస్తున్నాయని తెలిపింది. క్రీడలపై పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ప్రశంసించింది. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థలు ప్రోత్సహించినప్పుడే రాష్ట్రంలో, దేశంలో క్రీడారంగం అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడింది. రూ.3 లక్షల ప్రైజ్‌మనీ గచ్చిబౌలిలో స్టేడియంలో మొదలైన రన్‌, టీమ్స్‌ గేటు నుంచి గోపీచంద్‌ అకాడమీ, ఐఎస్‌బీ సర్కిల్‌ మీదగా తిరిగి స్టేడియంలో ముగిసింది. 1కే కాస్ట్యూం ర‌న్‌లో పిల్ల‌ల‌తో పాటు త‌ల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 1కే, 3కే, 5కే, 10కే విభాగాల్లో కలిపి మొత్తం రూ.3 లక్షల ప్రైజ్‌ మనీని 84 మంది క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌, అలెన్‌, డీపీఎస్‌ కొల్లూరు, పటాన్‌చెరువ్‌, అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, బిర్లా ఓపెన్‌ మైండ్స్‌, మీరుతో పాటు 180కి పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ రన్‌లో పాల్గొన్నారు.

మన తెలంగాణ 1 Feb 2026 11:00 pm

వికసిత్ భారత్ బడ్జెట్:ఎంపి ఈటల

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారని బిజెపి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ ప్రశంసించారు. అభివృద్ధి, ప్రజా రంజక బడ్జెట్ అని ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉపాధి, చేతి వృత్తుల వారికి, ఆరోగ్యానికి పెద్ద పీట వేశారని ఆయన తెలిపారు. దూరదృష్టితో దీర్ఘకాలిక నిర్ణయాల వల్ల భారత జిడిపి ఏడు శాతం పెరిగిందని ఆయన తెలిపారు. గత ఏడాది యాభై లక్షల కోట్ల రూపడాయల బడ్జెట్ ప్రవేశపెడితే ఈ ఏడాది యాభై మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారని ఆయన చెప్పారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గత ఏడాది బడ్జెట్‌లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెడితే ఈ ఏడాది కూడా పెట్టారని ఆయన తెలిపారు. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియాకు అనుగుణంగా యువశక్తి దేశ పురోగమనంలో భాగస్వాములు చేయాలని లక్షంతో బడ్జెట్ పెట్టారని ఆయన చెప్పారు. ఇంకా అనేక మందులపై దిగుమతి పన్ను తగ్గించారని, క్యాన్సర్‌తో పాటు పదిహేడు రకాల మందులపై పన్ను రాయితీ ఇచ్చి పేద రోగులకు ఉపశమనం కల్పించారని ఈటల రాజేందర్ తెలిపారు.

మన తెలంగాణ 1 Feb 2026 10:44 pm

ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 124

డబ్ల్యూపిఎల్ 2026 సీజన్ లో ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ యూపి వారియర్స్ ఆదివారం వడోదరలోని బిసిిఎ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది . టాస్ ఓడి  బ్యాటింగ్ కు దిగిన  యూపి వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పొయి 123 పరుగులు చేసింది. దీప్తి శర్మ(24), శిఖా పాండే(23), సిమ్రన్ షైక్(22) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మారిజేన్ కాప్ 3, చినెల్లీ హెన్నీ 2, శ్రీ చరణి 2, మిన్ను మణి ఒక వికెట్ తీశారు.

మన తెలంగాణ 1 Feb 2026 10:33 pm

ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

 ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ లో పెండింగ్ నిధులను నెలవారీగా విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ. 720 కోట్లు విడుదల చేసింది. జనవరి మాసానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ. 720 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత సంవత్సరం జూన్ నెలాఖరులో రూ.183 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసంగా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా విడుదల చేసిన నిధుల్లో 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్ క్యాష్‌మెంట్ పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసింది. వీటితోపాటు విడుదలైన బిల్లులో గ్రాట్యుటీ, జిపిఎఫ్, సరెండర్ లీవ్ లు,అడ్వాన్సులున్నాయి.

మన తెలంగాణ 1 Feb 2026 10:20 pm

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఇడి క్లీన్‌చిట్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎపి సిఎం చంద్రబాబుకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) క్లీన్ చిట్ ఇచ్చింది. రెండు రోజుల కిందట విశాఖపట్నంలోని పిఎంఎల్‌ఎ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో నిధుల మళ్లింపు, నేరపూరిత కార్యకలాపాల్లో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇడి స్పష్టంగా పేర్కొంది. ఇడి దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, దానికి సంబంధించిన వ్యక్తులు షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులను మళ్లించినట్లు గుర్తించింది. వికాస్ ఖన్వేల్కర్, సుమన్ బోస్ , ఇతరులు ఈ నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఇడి తేల్చింది. 2024 అక్టోబర్‌లో రూ.23.5 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. 2023 సెప్టెంబర్‌లో వైసిపి ప్రభుత్వ హయాంలో సిఐడి కూడా కేసులు పెట్టింది. ఆయనను అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలు లో పెట్టింది. కానీ ఒక్క రూపాయి ఆర్థిక లావాదేవీలను చూపించలేకపోయింది. తప్పుగా నమోదు చేసిన కేసుగా చివరికి గుర్తించి విజయవాడ లోని ఎసిబి కోర్టులో క్లోజర్ రిపోర్టును సమర్పించింది. చంద్రబాబుపై మోపిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని సిఐడి తన నివేదికలో వెల ్లడించింది. ఈ నివేదికను అంగీకరించిన కోర్టు, జనవరి 13న చంద్రబాబుతో పాటు మరో 36 మందిపై ఉన్న కేసును అధికారికంగా కొట్టివేసింది. ఈ పరిణామాలు రాజకీయంగా, న్యాయపరంగా చంద్రబాబుకు పెద్ద విజయంగా నిలిచాయి. ప్రభుత్వ నిధులను దారి మళ్లించి స్కామ్ చేశారన్న ఆరోపణలను కేంద్ర దర్యాప్తు సంస్థ, రాష్ట్ర దర్యాప్తు సంస్థ రెండూ తోసిపుచ్చడంతో ఈ సుదీర్ఘ న్యాయ వివాదానికి తెరపడింది. అడ్వకేట్ జనరల్ (ఎజి) దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ సుదీర్ఘ దర్యా ప్తు తర్వాత చంద్రబాబుతోపాటు పలువురు నేతలకు స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని కోర్టు నిర్దారించిందని వెల్లడించారు.

మన తెలంగాణ 1 Feb 2026 10:07 pm

SIT Grills Former KCR in Phone Tapping Investigation

The phone tapping case in Telangana has entered a decisive phase with the questioning of former Chief Minister K Chandrashekar Rao by the Special Investigation Team. The inquiry took place on Sunday at his residence in Nandinagar Hyderabad and lasted for more than four hours. Officials began the examination at 3 pm after making arrangements […] The post SIT Grills Former KCR in Phone Tapping Investigation appeared first on Telugu360 .

తెలుగు 360 1 Feb 2026 10:03 pm

రూ.10,000 కోట్లతో కంటైనర్ పథకం

వచ్చే ఐదేళ్లలో కంటైనర్ తయారీని ప్రోత్సహించేందుకు రూ. 10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఒక పథకాన్ని ఆర్థికమంత్రి నిర్మల ప్రతిపాదించారు. పర్యావరణ పరంగా స్థిరమైన కార్గో తరలింపును ప్రోత్సహించేందుకు, అధికంగా విలువైన, ఆధునిక సాంకేతిక విలువలతో కలిగిన కంటైనర్ లను దేశీయంగా తయారీకి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ఆదివారం బడ్జెట్ ప్రతిపాదనల సందర్భంగా చెప్పారు.రానున్న ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం 20 కొత్త జలమార్గాలను (ఎన్ డబ్ల్యూ) అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తల్చేర్ , అంగుళ్ ఖనిజ సంపన్న ప్రాంతాలను, కళింగ నగర్ వంటి పారిశ్రామిక కేంద్రాలను పరదీప్, ధమ్రా ఓటరేవులకు అను సంధానించడానికి ఒడిశా లోని ఎన్ డబ్ల్యూ -5 నుంచి జలమార్గాల ఏర్పాటు మొదలవుతుంది.వారణాశి, పట్నా లో లోతట్టు జలమార్గాల కోసం ఓడల మరమ్మతు వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు .2047 కల్లా లోతట్టు జలమార్గాలు, తీర ప్రాంత షిప్పింగ్ వ్యవస్థ వాటాను 6 నుంచి 12 శాతానికి పెంచేందుకు, కోస్టల్ కార్గో ప్రమోషన్ పథకం ప్రారంభించాలని మంత్రి ప్రతిపాదించారు.జలమార్గాలను సమర్థంగా నిర్వహించేందుకు నావికుల శిక్షణ సంస్థలను, ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. జలమార్గాల అంతటా యువత శిక్షణ పొందేందుకు, నైపుణ్యాల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది.

మన తెలంగాణ 1 Feb 2026 10:03 pm

ఆస్ట్రేలియా ఓపెన్ విజేత అల్కరాజ్

 ప్రతిష్ఠాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అత్యంత చిన్నవయసులో కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించిన ఆటగాడిగా నయా చరిత్ర సృష్టించాడు. అల్కరాజ్ 22 ఏళ్ల వయసులో నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా అల్కరాజ్‌కు ఇది ఏడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇప్పటికే వింబుల్డన్, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్‌లను రెండేసి సార్లు గెలుచుకున్నాడు. తొలిసారిగా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో అల్కరాజ్ 26, 62, 63,75తో సెర్బియా యోధుడు, నాలుగో సీడ్ నొవాక్ జకోవిచ్‌ను ఓడించాడు. కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని భావించిన నొవాక్ మరోసారి నిరాశే మిగిలింది. ఆరంభం నుంచే మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌లో నొవాక్ ఆధిపత్యం చెలాయించాడు. అల్కరాజ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ తర్వాతి సెట్‌లలో అల్కరాజ్ అనూహ్యంగా పుంజుకున్నాడు. తన మార్క్ షాట్లతో నొవాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇదే క్రమంలో రెండో, మూడో సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ నాలుగో సెట్‌లో అల్కరాజ్‌కు నొవాక్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన అల్కరాజ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్‌గా అవతరించాడు.

మన తెలంగాణ 1 Feb 2026 9:59 pm

Chandrababu Naidu and Bill Gates Join Hands to Drive Andhra Pradesh Health Revolution

Andhra Pradesh government has launched the ambitious Sanjeevani Project. The initiative aims to provide comprehensive health screening to citizens across the state. Chief Minister Chandrababu Naidu announced that nearly 72 lakh people will undergo medical tests under the Sanjeevani Project. Based on these tests, detailed digital health profiles will be created for every individual. The […] The post Chandrababu Naidu and Bill Gates Join Hands to Drive Andhra Pradesh Health Revolution appeared first on Telugu360 .

తెలుగు 360 1 Feb 2026 9:37 pm

అండర్-19 ప్రపంచకప్‌.. సెమీస్ కు చేరిన భారత్

 అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్ యువ జట్టు పాకిస్థాన్‌ యువ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసింది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. చివర్లో కనిష్క్ చౌహాన్ (35) విలువైన పరుగులు జోడించాడు. 253 పరుగుల లక్ష్య చేధనలో పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే ఈ లక్ష్యాన్ని 33.3 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంది. కానీ భారత బౌలర్ల ధాటికి వారు కనీసం గెలవలేకపోయారు. ఉస్మాన్ ఖాన్ (66) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే తన స్పిన్ మ్యాజిక్‌తో 3 వికెట్లు పడగొట్టి పాక్ నడ్డి విరిచాడు

మన తెలంగాణ 1 Feb 2026 8:58 pm

సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి మృతి

 సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి గారు శనివారం అర్థరాత్రి  తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 72 ఏళ్లు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉన్న తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించాడు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్ది నెలల క్రితమే ఆయన కుమారుడు కూడా మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. రఘునాథ రెడ్డికి భార్య అన్నపూర్ణ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.నాటక రంగం నుంచి వచ్చిన ఆయన 1991లో శోభన్ బాబు నటించిన 'సర్పయాగం' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తన విలక్షణమైన కంచు కంఠంతో, గంభీరమైన మాట తీరుతో సహాయ నటుడిగా, విలన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 370 సినిమాల్లో నటించారు. 'ఓరేయ్ రిక్షా', 'ప్రేమించు పెళ్లాడు', 'చంటి', 'శ్రీరామరాజ్యం' వంటివి ఆయనకు మంచి పేరు తెచ్చిన చిత్రాలు.కేవలం సినిమాలే కాకుండా పలు ప్రజాదరణ పొందిన సీరియల్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

మన తెలంగాణ 1 Feb 2026 8:42 pm

Foundation |‘టీఏఏఎల్ఎం’ ఫౌండేషన్ శ్రమదానం

Foundation | ‘టీఏఏఎల్ఎం’ ఫౌండేషన్ శ్రమదానం Foundation | బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 8:17 pm

ఖానాపూర్‌లో చిరుతల సంచారం

ఖానాపూర్ పరిసరాల్లోని నాలుగు కిలోమీటర్ల పరిధిలో 15 నిమిషాల వ్యవధిలో రెండు చిరుతల సంచారం శనివారం రాత్రి కలకలం రేపింది. ఖానాపూర్‌ను ఆనుకునివున్న కొమురం భీమ్ చౌరస్తా నుంచి తర్లపాడు మధ్య అటవీ ప్రాంతంలో రాత్రి 8ః30 సమయంలో ఓ చిరుత రోడ్డు దాటడానికి ప్రయత్నించగా నిర్మల్ వైపు నుంచి కడెంకు వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 15 నిమిషాల వ్యవధిలోనే ఖానాపూర్ నుంచి దిలావర్‌పూర్ మీదుగా సత్తెనపల్లి వెళ్లే రహదారి ఆనుకొనివున్న పంట పొలంలో మరో చిరుత కనిపించి కలకలం సృష్టించింది. దిలావర్‌పూర్‌కు చెందిన మంగతార అనే మహిళా రైతు.. తన పంట చేలో తరుచుగా వ్యవసాయ పనిముట్లు చోరీకి గురవుతుండటంతో రక్షణ కొరకు 8 సీసీ కెమెరాలు అమర్చారు. శనివారం రాత్రి 9 గంటలలోపు మంగతార అనే రైతు పంట చేనులో చిరుత సంచరించడంతో పక్కనే ఉన్న రైతులు భయాందోళనకు గురయ్యారు. చిరుత కనిపించడంతో రాత్రిళ్లు పంట చేనుకు కాపలాలకు వెళ్లే రైతులు జంకుతున్నారు. కొమురం భీమ్ చౌరస్తా సమీపంలో చిరుత కనిపించడంతో అక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న స్టాటస్టిక్స్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. సిబ్బంది అడవిలో రోడ్డుపై టెంట్లు వేసుకొని ఎన్నికల తనిఖీ విధులు నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి చిరుతలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి సంచరిస్తున్న చిరుత పులుల ఆచూకీ కనుగొని.. వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించి ఎన్నికల సిబ్బందికి, పంట పొలాలకు కాపలా వెళ్లే రైతులకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.

మన తెలంగాణ 1 Feb 2026 8:17 pm

Cardensearch |శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్‌ సెర్చ్‌…

Cardensearch | శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్‌ సెర్చ్‌… Cardensearch | నందికొట్కూరు,

ప్రభ న్యూస్ 1 Feb 2026 8:12 pm

బడ్జెట్ ఓ అవకాశాల హైవే: పిఎం మోడీ

బడ్జెట్ చరిత్రాత్మకమైనది.140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేసి, వికసిత్ భారత్ కోసం స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందిస్తుంది. నిర్మల ప్రతిపాదించిన బడ్జెట్ ఓ అవకాశాల హైవే. బడ్జెట్ మహిళల బలం..శక్తివంతమైన ఉనికికి ప్రతిరూపం. ఈ బడ్జెట్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు కొత్త ఊపును ఇస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణానికి ఈ బడ్జెట్ పునాది. అదే విధంగా సంస్కరణలకు కొత్త శక్తిని, కొత్త వేగాన్ని ఇస్తుంది. ప్రపంచంలో భారతదేశం పాత్రను మరింత బలోపేతం చేస్తుంది. భారతదేశంలోని 1.4 బిలియన్ పౌరులు కేవలం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థపై సంతృప్తి చెందలేదు. త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేదుకు బడ్జెట్ దోహదకారిగా ఉంటుంది. ఈ బడ్జెట్ విశ్వాసం ఆధారిత పాలన, మానవ-కేంద్రీకృత ఆర్థిక చట్రం యొక్క దృక్పథాన్ని కలిగి ఉంది. 

మన తెలంగాణ 1 Feb 2026 8:12 pm

ఫోన్ ట్యాపింగ్ కేసు: ముగిసిన కెసిఆర్ సిట్ విచారణ..

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సిట్ విచారణ ముగిసింది. నందినగర్‌లోని నివాసంలో కెసిఆర్‌ని సిట్ అధికారులు విచారించారు. సుమారు ఐదు గంటలపాటు సిట్ అధికారులు కెసిఆర్‌ను ప్రశ్నించారు. సిట్ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి, నారాయరెడ్డి, శ్రీధర్, కెఎస్ రావు ఈ విచారణలో పాల్గొన్నారు. కెసిఆర్ విచారణను సిట్ అధికారులు ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేశారు. ఈ కేసులో కెసిఆర్ వాంగ్మూలాన్ని కూడా సిట్ అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం సిట్ అధికారులు సంబంధిత డాక్యూమెంట్లు, ఇతర ఆధారాలతో సిట్ అధికారులు నందినగర్‌లోని నివాసాన్ని విడిచి వెళ్లారు. 

మన తెలంగాణ 1 Feb 2026 8:09 pm

Forest |వికారాబాద్ జిల్లాకు భవిష్యత్తు ఉంది…

Forest | వికారాబాద్ జిల్లాకు భవిష్యత్తు ఉంది… Forest | వికారాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 8:06 pm

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం: ఎంపి మల్లు రవి

 కేంద్ర బడ్జెట్ నిరాశజనక బడ్టెట్ అని కాంగ్రెస్ ఎంపి మల్లు రవి అభివర్ణించారు. దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలను పూర్తి నిరాశకు గురి చేసిందన్నారు. ముఖ్యమంత్రి,మంత్రులు చేసిన విజ్ఞప్తులను పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ,జాతీయ ప్రాజెక్టులు, హైదరాబాద్ మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని కోరినా అవి ఏవీ ఇవ్వకపోగా, హైదరాబాద్ మెట్రో గురించి ప్రస్తావన లేనే లేదన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై బడ్జెట్‌లో మాట్లాడతారని, ప్రస్తుత భారతను గాలికి వదిలేసి 2047 ఫోకస్ చేస్తూ.. ఇప్పుడున్న సమస్యలను పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉందని, నిరుద్యోగ సమస్యను గుర్తించకపోవ డం అన్యాయం కాక మరేమిటి? అని ప్రశ్నించారు. 11 ఏళ్లుగా 22 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, 2014 నుంచి కార్పొరేట్ సంస్థలకు అనుకూల బడ్జెట్ ఇస్తున్నారని తెలిపారు. వృద్ధి రేటుకు అర్థం ఉండదని, సామాన్య ప్రజలకు ఉపయోగం లేకుండా ఉండే వృద్ధి రేటు ఉందని.. ఉన్నవారు లేని వారికి మధ్య అంతరం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సమానత్వాన్ని బిజెపి మర్చిపోయిందని విమర్శిం చారు. ఉపాధి హామీకి నిధులు పెంచారు అంటున్నారు కానీ అవి బడ్జెట్‌లో కనిపించడం లేదన్నారు. అదే విధంగా నిరుద్యోగం, నిత్యావసర ధరలు పెరగడం వల్ల పక్క దేశాల్లో యువత ఆందోళనలు చేస్తున్నాయని గుర్తు చేశారు. నిత్యవసర ధరలు తగ్గించడం లేదని, ఇది పేదలకు వ్యతి రేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలనేది రైతుల ప్రధాన డిమాండ్, దాని గురించి కూడా ప్రస్తావించలేదన్నా రు. ప్రధాన పంటలకు సంబంధించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదని, పంట నష్టం ఇన్‌పుట్ సబ్సిడీ గురించి మాట్లాడలేదని, దేశవ్యాప్తంగా ఉన్న నిరు ద్యోగం, పట్టణ ఉపాధి కల్పన, పంటలకు చట్టబద్దత గురించి మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. బ్రిటిష్ వారు ఉన్నపుడు పెట్టేలా ప్రస్తుత బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. పాలమూరురంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ లేదన్నారు. మూసి ప్రక్షాళన కు నిధులు ఇవ్వలేదని, గంగ నదికి,యమునా నదికి నిధులు ఇస్తారని, మూసి నదికి ఇవ్వడం లేదని, తెలంగాణకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు అమలు చేయాలని, తెలంగాణ వాటా నిధులు విడుదల చేయాలని, తెలంగాణ బిజెపి ఎంపిలు ప్రధాని ఆర్థిక మంత్రితో మాట్లాడి, తెలంగాణ అవసరాలు తీర్చడానికి పనిచేయాలని సూచించా రు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పార్లమెంటు లోపల బయట పోరాడుతామని ఎంపి మల్లు రవి వెల్లడించారు.

మన తెలంగాణ 1 Feb 2026 8:05 pm

Press Club |అసత్య ఆరోపణలు మానుకోవాలి…

Press Club | అసత్య ఆరోపణలు మానుకోవాలి… Press Club | చెన్నూర్,

ప్రభ న్యూస్ 1 Feb 2026 8:02 pm

School |గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

School | గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి School | కుంటాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:57 pm

కెసిఆర్ రాజ్యాంగం ముగిసింది: మంత్రి వాకిటి

బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యాంగం ముగిసిందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జోస్యం చెప్పారు. కెసిఆర్‌కు నిబద్ధత, నిజాయితీ ఉంటే కడిగిన ముత్యంలా బయటకు రావాలని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని కె. కవిత ఆరోపించారని ఆయన తెలిపారు. ధరణి పెట్టి భూములు, రియల్ ఎస్టేట్ వ్యవస్థను ఆగమాగం చేసింది మీరు కాదా? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ, లోక్‌సభ, గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పినా, ఆ పార్టీ నాయకులు మారలేదని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయమేమీ కాదన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి, వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ దేశంలోనే అత్యంత దుర్మార్గమైన చర్య అని ఈ చర్య వల్ల తెలంగాణ ప్రతిష్ట దేశవ్యాప్తంగా దిగజారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల ఫఓన్లు, వ్యాపారుల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, సినీ నటుల ఫోన్లు, చివరకు భార్య-భర్తల ఫోన్లూ ట్యాప్ చేయడం నీచమైన చర్య అని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. బిఆర్‌ఎస్ గెలిచి ఉంటే ఇప్పటికీ ఫోన్ల ట్యాపింగ్‌లు కొనసాగేవని ఆయన తెలిపారు

మన తెలంగాణ 1 Feb 2026 7:54 pm

Hostel |గురుకుల హాస్టల్‌లో విద్యార్థులకు నాసిరకం ఆహారం

Hostel | గురుకుల హాస్టల్‌లో విద్యార్థులకు నాసిరకం ఆహారం Hostel | మునుగోడు,

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:53 pm

కెసిఆర్ తెలంగాణ జాతిపిత కాదు: ఎంపి చామల

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ మఖ్యమంత్రి కెసిఆర్ జాతిపిత కాదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కెసిఆర్‌కు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం అంటూ లబోదిబోమంటున్నారని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఫోన్ ట్యాటింగ్ ఆధారాలు లేకుండా చేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు వచ్చిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరులను విస్మరించినప్పుడు కెసిఆర్‌కు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా గాయకుడు గద్దర్‌ను, మీ ప్రభుత్వ హయాంలో హోం మంత్రిగా ఉన్న మహమూద్ అలీని ప్రగతి భవన్ గేటు బయటి నుంచే వెనక్కి పంపించినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అరాచక పాలన చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ఆరోపించారని, దానికి సమాధానం ఇవ్వడం లేదన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల హక్కులు హరించబడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 1 Feb 2026 7:51 pm

Bee form |బీజేపీ జండా ఎగురవేయడం టార్గెట్

Bee form | బీజేపీ జండా ఎగురవేయడం టార్గెట్ Bee form |

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:49 pm

తెలంగాణకు హైస్పీడ్ రైళ్లు..

 తెలంగాణకు 3 హైస్పీడ్ కారిడార్లను కేంద్రం ప్రకటించింది. దేశంలో కొత్తగా 7 నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించగా పుణె- హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై కారిడార్లు తెలంగాణ మీదుగా వెళ్లనున్నాయి. వీటితో పాటు ముంబయి-పుణె, ఢిల్లీ- వారణాసి, వారణాసి-సిలిగుడి, చెన్నై- బెంగళూరు మధ్య కూడా కొత్త కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్‌సభలో ప్రకటించారు. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత సంవత్సరం రూ.11.2 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి స్వల్పంగా పెంచారు. వీటి ద్వారా ప్రధాన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందని అన్నారు. సుదూర ప్రయాణాల విషయంలో పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థగా ఈ కారిడార్లు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవి ప్రయాణ సమాయాన్ని కుదిస్తాయని, రహదారి మార్గం, ఇప్పటికే ఉన్న రైలు నెట్‌వర్క్‌లో రద్దీని తగ్గిస్తాయని పేర్కొన్నారు.

మన తెలంగాణ 1 Feb 2026 7:46 pm

Tapping |కక్షపూరితంగానే కేసీఆర్‌కు సిట్ నోటీసులు…

Tapping | కక్షపూరితంగానే కేసీఆర్‌కు సిట్ నోటీసులు… Tapping | కుంటాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:45 pm

సిట్.. ‘సిఎం ఇన్‌స్ట్రక్షన్ టీమ్’గా పని చేస్తోంది: హరీశ్ రావు

హైదరాబాద్: కెసిఆర్‌ను విచారించటం.. రాజకీయ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట అని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నందినగర్‌లోని కెసిఆర్ నివాసంలో ఆయన్ను సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 4 గంటలకు పైగా ఈ విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. సిట్ పేరిట ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ విచారణలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలనూ ఉల్లంఘించారని పేర్కొన్నారు. కెసిఆర్‌కు నోటీసులు ఇవ్వడంలో చట్టపర విధానాలు పాటించలేదని ధ్వజమెత్తారు. ఎర్రవెల్లిలో ఇవ్వకుండా నందినగర్‌ ఇంటి గోడలకు నోటీసులు అంటించారని అన్నారు. ఇలా నోటీసులు అంటించడం ఇది చౌకబారు రాజకీయమని విమర్శించారు. కెసిఆర్ ఎక్కడ ఉంటున్నారో ఈ రాష్ట్రానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఈ సిట్.. ‘సిఎం ఇన్‌స్ట్రక్షన్ టీమ్‌’గా పని చేస్తోందని ఎద్దేవా చేశారు. విచారణకు సహకరిస్తున్నప్పటికీ.. పోలీసులు అతి చేస్తున్నారు మండిపడ్డారు. 

మన తెలంగాణ 1 Feb 2026 7:43 pm

Mallanna Swamy |జాతరకు తరలి వెళ్తున్న భక్తులు

Mallanna Swamy |జాతరకు తరలి వెళ్తున్న భక్తులు Mallanna Swamy |కుంటాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:38 pm

Tension Erupts Outside Jogi Ramesh’s Residence After Controversial Remarks

Political tempers flared in Ibrahimpatnam on Saturday following provocative remarks made by YSR Congress Party leader Jogi Ramesh against Chief Minister N. Chandrababu Naidu and IT Minister Nara Lokesh. What began as verbal aggression soon spilled onto the streets, triggering unrest outside Jogi Ramesh’s residence and forcing police to step in. TDP supporters gathered in […] The post Tension Erupts Outside Jogi Ramesh’s Residence After Controversial Remarks appeared first on Telugu360 .

తెలుగు 360 1 Feb 2026 7:31 pm

Development |అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా

Development | అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా Development | మంచిర్యాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:31 pm

Corporation |కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి…

Corporation | కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి… Corporation | మేడ్చల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:25 pm

Medical |ఘ‌న విజ‌యం సాధిస్తాం…

Medical | ఘ‌న విజ‌యం సాధిస్తాం… Medical | మేడ్చల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:22 pm

హైదరాబాద్ డాక్టర్‌కు రూ.35.19 లక్షల ఆన్‌లైన్ ఐపీవో మోసం

వాట్సాప్‌లో సంస్థాగత ట్రేడింగ్ పేరుతో వలఇంకా డబ్బులు చెల్లించకపోవడంతో ఖాతా బ్లాక్

తెలుగు పోస్ట్ 1 Feb 2026 7:20 pm

చరిత్ర సృష్టించాడు.. ఆస్ట్రేలియా ఓపెన్ విజేత అల్కరాస్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో నొవాక్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)పై ప్రపంచ నెంబర్ 1 అల్కరాస్ విజయం సాధించాడు. హోరాహోరీగా జరిగి ఈ మ్యాచ్‌లో అల్కరాస్ 2-6, 6-2, 6-3, 7-5 తేడాతో టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో పురుషుల టెన్నిస్‌లో కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా అతడు చరిత్ర సృష్టించాడు. 22 ఏళ్ల అల్కరాస్‌కి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇది తొలి టైటిల్. ఇప్పటికే అతను ఫ్రెంచ్ ఓపెన్ (2024,2025), వింబుల్డన్ (2023, 2024), యూఎస్ ఓపెన్ (2022, 2025) టైటిళ్లు సాధించాడు. మరోవైపు జకోవిచ్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ఫైనల్‌లో ఇది తొలి ఓటమి. ఇప్పటివరకూ ఫైనల్‌కు చేరిన పదిసార్లు అతడు విజేతగా నిలిచాడు. టెన్నిస్ చరిత్రలో అత్యధిక (25) గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు సాధించాలన్న జకోవిచ్ ఆశలపై అల్కరాజ్ నీళ్లుచల్లాడు. ప్రస్తుతం 24 టైటిళ్లతో ఉన్న జకోవిచ్ 25 టైటిల్‌ కోసం తెగ కష్టపడుతున్నాడు. చివరగా 2023లో యుఎస్ ఓపెన్ గెలిచాక.. అతడు మళ్లీ గ్రాండ్‌స్లామ్ కొట్టలేకపోతున్నాడు.

మన తెలంగాణ 1 Feb 2026 7:18 pm

Budget |అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా..

Budget | అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా.. Budget | నిజామాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:17 pm

Roads |ఒకట‌వ‌ వార్డు అభివృద్ధే నా లక్ష్యం…

Roads | ఒకట‌వ‌ వార్డు అభివృద్ధే నా లక్ష్యం… Roads | స్టేషన్

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:58 pm

డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్‌తో.. భయపెడుతున్న ‘హనీ’ ట్రైలర్..

హారర్ చిత్రాలు అంటేనే వాటికి ఉండే క్రేజ్ వేరు. ఎంత భయంగా ఉన్నా సరే.. హారర్ చిత్రాలు చూడాలనే ఫాంటసీ చాలా మందిలో ఉంది. అలా హారర్ జానర్‌లో వచ్చిన చిత్రాలు దాదాపుగా ప్రేక్షకాదరణ పొందుతాయి. కొన్ని ఫెయిల్ అవుతాయి. అలా ఓ డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘హనీ’. నవీన్ చంద్ర, దీపికా పిళ్లై, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. శేఖర్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. ‘ఓ దేవత వాహనం పిల్లి’ అంటూ ట్రైరల్ ప్రారంభ అవుతుంది. ఆ తర్వాత ట్రైలర్ ఆద్యంతం భయపట్టే విధంగా ఉంది. ఆ పిల్లి ఎవరి వద్ద ఉంటే వారికి ఇతరులు దాసోహం కావడమనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించగా.. రవి పీట్లా నిర్మించారు. ఫిబ్రవరి 6వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

మన తెలంగాణ 1 Feb 2026 6:54 pm

హైదరాబాద్ వ్యక్తి రూ.58.22 లక్షల మోసం నకిలీ ‘బ్లాక్ ట్రేడింగ్’ పెట్టుబడి పేరుతో సైబర్ మోసం

5పైసా ప్రతినిధులమని నటించిన మోసగాళ్లుఅనేక బ్యాంక్ ఖాతాలు, యూపీఐలకు నగదు బదిలీదేశవ్యాప్త ఖాతాల నెట్‌వర్క్‌పై సైబర్ క్రైమ్ దర్యాప్తు

తెలుగు పోస్ట్ 1 Feb 2026 6:53 pm

108 pairs |యజ్ఞంలో 108 జంటలతో పాల్గొన్న దంపతులు

108 pairs | యజ్ఞంలో 108 జంటలతో పాల్గొన్న దంపతులు 108 pairs

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:51 pm

Nirmala Sitharaman |దేశ గతి మారనుందా?

Nirmala Sitharaman | దేశ గతి మారనుందా? Nirmala Sitharaman | 2047

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:37 pm

MLA |గ్రామానికి సోలార్‌తో నిత్యం వెలుగులు

MLA | గ్రామానికి సోలార్‌తో నిత్యం వెలుగులు MLA | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:34 pm

Breaking : అంబటి రాంబాబు ఇంటి దాడిపై హైకోర్టు సీరియస్

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దాడిపై హైకోర్టు సీరియస్ అయింది

తెలుగు పోస్ట్ 1 Feb 2026 6:33 pm

Election |గెలుపే లక్ష్యంగా ప్రచారం….

Election | గెలుపే లక్ష్యంగా ప్రచారం…. Election | చండూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:29 pm

Phone tapping |సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం

Phone tapping | సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం Phone tapping

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:25 pm

KCR: మూడున్నర గంటలుగా కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్ లోని నందినగర్ లో కేసీఆర్ ను గత మూడు గంటలుగా విచారిస్తున్నారు

తెలుగు పోస్ట్ 1 Feb 2026 6:23 pm

Notice |రాష్ట్ర ప్రజల గుండెచప్పుడైనా కేసీఆర్‌కు నోటీసులా…?

Notice | రాష్ట్ర ప్రజల గుండెచప్పుడైనా కేసీఆర్‌కు నోటీసులా…? Notice | రుద్రూర్,

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:21 pm

B-forms |అభ్యర్థులకు ‘బి-ఫామ్స్’ పంపిణీ

B-forms | అభ్యర్థులకు ‘బి-ఫామ్స్’ పంపిణీ B-forms | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:17 pm

రాష్ట్రానికి మూడు హై స్పీడ్ రైళ్లు : కిషన్ రెడ్డి

మెట్రో రైలు గురించి ప్రత్యేకంగా బడ్జెట్‌లో ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మెట్రో డిపిఆర్ ఇస్తే.. పట్టణాభివృద్ధి శాఖ నిధులు ఇస్తుందని పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టుకు మంత్రివర్గ ఆమోదంతో నిధులు వస్తాయని తెలిపారు. ప్రస్తుత మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేస్తానని చెప్పిందని.. టేకోవర్ ప్రక్రియ పూర్తి చేసి డిపిఆర్ ఇస్తే కేంద్రం ఆమోదిస్తుందని అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసు ఓ టివి సీరియల్‌లా కొనసాగుతోందని విమర్శించారు. కేసు మొదలై ఇప్పటికే రెండేళ్లు అయిందని.. ఇంకా ఎన్నాళ్లో తెలియదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిజమని.. స్వయంగా కెసిఆర్ కుమార్తెనే చెప్పారని అన్నారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని స్వయంగా కవిత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని అఫిడవిట్ వేశారని.. నేతలు, జడ్జిలు, వ్యాపారులు, నటుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని అంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మూడు హై స్పీడ్ రైళ్లు రానున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. డేటా సెంటర్లకు ఉపయోగపడే నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నదని అన్నారు. డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహంతో రాష్ట్రానికి కూడా లాభం చేకూరుతుందని తెలిపారు. విదేశీ విద్యపై ఉండే పన్నును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎరువులకు రాయితీని కూడా కేంద్రం పెంచిందని తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలోని రైతులు కూడా లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్‌ను కేంద్రం ఏర్పాటు చేయనుందని.. రాష్ట్రంలో 33 జిల్లాలకు బాలికల హాస్టళ్లు మంజూరు అవుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. 

మన తెలంగాణ 1 Feb 2026 6:12 pm

Nominations |బల్దియా సమరం : 34 వార్డుల్లో అభ్యర్థులు వీరే..

Nominations | బల్దియా సమరం : 34 వార్డుల్లో అభ్యర్థులు వీరే.. Nominations

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:12 pm

Chityala |అన్ని విధాలుగా సహకారాలు అందిస్తా

Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ పరిధిలో గల శివనేని గూడెం

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:08 pm

Puja |గూడెంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు…

​Puja | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండెపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:04 pm

Nizamabad |ఆకట్టుకున్న ఎడ్లబండ్ల ఊరేగింపు…

Nizamabad | ఆకట్టుకున్న ఎడ్లబండ్ల ఊరేగింపు… Nizamabad | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:03 pm

TG |బోర్ల గూడెంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

TG | బోర్ల గూడెంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం TG | మహా

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:02 pm

Asifabad |మాజీ మంత్రిని కలిసిన మాటూరి రాజయ్య

Asifabad | మాజీ మంత్రిని కలిసిన మాటూరి రాజయ్య Asifabad | ఆసిఫాబాద్

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:59 pm

జోగి రమేష్ ఇంటికి టీడీపీ శ్రేణుల నిప్పు.. వ్యాఖ్యలకు నిరసనగా

జోగి రమేష్ ఇంటికి టీడీపీ శ్రేణుల నిప్పు.. వ్యాఖ్యలకు నిరసనగా

తెలుగు పోస్ట్ 1 Feb 2026 5:54 pm

Bhimgal Town |ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి…

Bhimgal Town | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : తాను కాంగ్రెస్ పార్టీ

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:29 pm

TG |అన్ని వార్డుల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం…

TG | అన్ని వార్డుల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం… TG | భీమ్‌గల్‌ టౌన్,

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:25 pm

protest |వరంగల్‌లో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

protest | కరీమాబాద్, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:21 pm

టీం ఇండియా ఆలౌట్.. పాక్ టార్గెట్ ఎంతంటే..

బులవాయో: అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా పాకిస్థాన్‌ యువ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ యువ జట్టు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌ దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీలు కలిసి తొలి వికెట్‌కి 47 పరుగులు జోడించారు. కానీ, 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే డకౌట్ అయ్యాడు. ఈ దశలో కష్టాల్లో పడిన జట్టుకు వేదాంత్ త్రివేది అండగా నిలిచాడు. 98 బంతులు ఎదురుకున్న అతడు 2 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 68 పరుగులు చేశాడు. ఇక కనిష్క్ చౌహాన్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సుతో 35, అంబ్రిష్ 29, ఖిలన్ 21, విహాన్ 21 పరుగులు చేశారు. దీంతో భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్థాన్ బౌలింగ్‌లో సుభాన్ 3, సయ్యమ్ 2, రజా, హుస్సేన్, ఖమర్, హసన్ తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 1 Feb 2026 5:17 pm

Road Accident |చావుబతుకుల మధ్య సోమగూడెం యువకుడు..

Road Accident | చావుబతుకుల మధ్య సోమగూడెం యువకుడు.. Road Accident |

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:16 pm

Jukkal |గ్రామ గ్రామాన బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు…

Jukkal | గ్రామ గ్రామాన బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు… సీఎం రేవంత్ రెడ్డి

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:05 pm

Dharna |సిట్ విచారణకు వ్యతిరేకంగా ర్యాలీ

Dharna | సిట్ విచారణకు వ్యతిరేకంగా ర్యాలీ Dharna | భీమ్‌గల్‌ టౌన్,

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:04 pm

BRS |నల్ల బ్యాడ్జీలతో రోడ్డుపై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా….

BRS | నల్ల బ్యాడ్జీలతో రోడ్డుపై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా…. BRS |

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:03 pm

ఫారెక్స్ ట్రేడింగ్ యాప్ మోసం: హైదరాబాద్ వ్యాపారికి రూ.1.52 కోట్ల నష్టం

సోషల్ మీడియా ద్వారా వలఎల్‌బీ నగర్ కోర్టులో ఫిర్యాదు

తెలుగు పోస్ట్ 1 Feb 2026 5:00 pm

Chityala |రాజకీయాల్లో నూతన ఒరవడి

Chityala | రాజకీయాల్లో నూతన ఒరవడి Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:58 pm

TG |కేసీఆర్‌ను విచారిస్తే తప్పేంటి

TG | కేసీఆర్‌ను విచారిస్తే తప్పేంటి TG | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:57 pm

Chennur |సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం

Chennur | సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం Chennur | చెన్నూర్,

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:53 pm

కవలలు పుట్టిన వేళ.. రామ్ చరణ్ రెట్టింపు ఆనందం

హైదరాబాద్: హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. శనివారం ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. ఈ సందర్భంగా మెగా కాంపౌండ్‌లో సందడి వాతావరణం నెలకొంది. రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి శనివారం రాత్రే ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్‌మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ విషయంపై రామ్ చరణ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. రెట్టింపు ఆనందంతో ఓ పోస్ట్ పెట్టారు. ఉపాసన బేబీ బంప్‌తో ఉన్న ఫోటోని ఆయన షేర్ చేశారు. ‘‘మాకు బాబు, పాప పుట్టారని తెలుపుటకు ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని కలిగి ఉండటం ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాం. మన జీవితంలో మహిళలే అత్యంత బలం. ఎప్పుడూ మాకు అండగా నిలిచిన కుటుంబం, అభిమానులకు, శ్రేయోభిలాషులకు థ్యాంక్స్’’ అంటూ చరణ్ పేర్కొన్నారు. 

మన తెలంగాణ 1 Feb 2026 4:46 pm

Video : Special Interview with Abishan Jeevinth & Anaswara Rajan

The post Video : Special Interview with Abishan Jeevinth & Anaswara Rajan appeared first on Telugu360 .

తెలుగు 360 1 Feb 2026 4:41 pm

Jangaon |ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

Jangaon | జనగామ, ఆంధ్రప్రభ : కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:27 pm

Yendapalli |కేసీఆర్‌పై సిట్ విచారణకు వ్యతిరేకంగా ధర్నా…

Yendapalli | కేసీఆర్‌పై సిట్ విచారణకు వ్యతిరేకంగా ధర్నా… Yendapalli | ఎండపల్లి,

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:27 pm

లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి భారత్ ఎదిగింది: మోడీ

ఢిల్లీ: లోక్ సభలో కేంద్ర బడ్జెట్ లో ఆత్మనిర్భర్ భారత్ కు కీలక కేటాయింపులు జరిగాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. చరిత్రాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టామని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర బడ్జెట్ పై మోడీ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ ద్రవ్యలోటును నియంత్రిస్తుందని, కేంద్ర బడ్జెట్ భవిష్యత్ కు రోడ్ మ్యాప్ గా నిలుస్తుందని తెలియజేశారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్ త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని మోడీ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ లో మరింత ఊతమని, లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి భారత్ ఎదిగిందని కొనియాడారు. యువశక్తిని ప్రోత్సహించేలా కేంద్ర బడ్జెట్ అని..యువతకు గేమింగ్, టూరిజం, క్రీడా సౌకర్యాలు ఉంటాయని అన్నారు. వికసిత్ భారత్ ప్రయాణం వేగవంతానికి బడ్జెట్ తోడ్పాటు చేస్తుందని, భారత్ ప్రయోజనాల కోసం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ జరుగుతుందని చెప్పారు. భారత్ ను డేటా సెంటర్ హబ్ గా మార్చేందుకు ట్యాక్స్ హాలిడే అని..ఉద్యోగాల కల్పనకు బడ్జెట్ మరింత దోహదపడుతుందని మోడీ స్పష్టం చేశారు.

మన తెలంగాణ 1 Feb 2026 4:24 pm

YCP party |నుంచి అంబటిని సస్పెండ్ చేయ్…

YCP party | నుంచి అంబటిని సస్పెండ్ చేయ్… YCP party |

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:23 pm

Student |గురుకుల పాఠశాలలో దారుణం….

Student | గురుకుల పాఠశాలలో దారుణం…. Student | ఉమ్మడి నల్లగొండ బ్యూరో,

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:22 pm

Notices |మున్సిపల్ ఎన్నికల్లో ఎదుర్కొలేకనే సిట్ డ్రామాలు

Notices | మున్సిపల్ ఎన్నికల్లో ఎదుర్కొలేకనే సిట్ డ్రామాలు Notices | మర్రిగూడ

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:15 pm

Dharna |కాంగ్రెస్‌ది కక్షసాధింపు రాజకీయాలే

Dharna | కాంగ్రెస్‌ది కక్షసాధింపు రాజకీయాలే Dharna | రాయపోల్, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:15 pm

AP |నిర్మలమ్మ బడ్జెట్ భేష్…

AP | నిర్మలమ్మ బడ్జెట్ భేష్… కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు AP

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:10 pm

Election |నూతన కమిటీ ఎన్నిక..

Election | ఖానాపూర్‌ రూరల్‌, ఆంధ్రప్రభ : మండలంలోని సేవ్యా నాయక్ తండ

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:09 pm

TG |సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

TG | సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం TG | చిట్యాల,

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:06 pm

రాణించిన బౌలర్లు.. సౌతాఫ్రికాను ఎట్టకేలకు ఓడించిన వెస్టిండీస్

జొహెన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టు ఎట్టకేలకు విజయంతో సిరీస్‌‌ని ముగించింది. మూడు టి-20ల సిరీస్‌లో భాగంగా వాండరర్స్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌‌లో డక్‌వర్త్ లుయీస్ విధానంలో వెస్టిండీస్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిది. ఈ మ్యాచ్‌లో తొలుత వెస్టిండీస్‌ 10 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. ఆ తర్వాత డిఆర్‌ఎస్ ప్రకారం సౌతాఫ్రికాకు 10 ఓవర్లలో 125 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు. కానీ, ఈ లక్ష్య చేధనలో సఫారీ జట్టు విఫలమైంది. 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయడంతో ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 పరుగుల తేడాతో గెలిచింది. అయినప్పటికీ.. సిరీస్‌ని 1-2 తేడాతో కోల్పోయింది.

మన తెలంగాణ 1 Feb 2026 3:34 pm

Nirmala Sitharaman |పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం Nirmala Sitharaman |వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : వికసిత్ భారత్‌

ప్రభ న్యూస్ 1 Feb 2026 3:27 pm

BRS |కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి….

BRS | కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి…. BRS | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 3:26 pm

TG |మున్సిపాలిటీ ఎన్నికల కోడ్… ప్రజావాణి రద్దు…

TG | మున్సిపాలిటీ ఎన్నికల కోడ్… ప్రజావాణి రద్దు… TG | వనపర్తి

ప్రభ న్యూస్ 1 Feb 2026 3:22 pm

AP |ఎన్‌జీజీఓ రాష్ట్ర సంఘ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

AP | ఎన్‌జీజీఓ రాష్ట్ర సంఘ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల AP |

ప్రభ న్యూస్ 1 Feb 2026 3:20 pm