SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

Health News : కళ్ళు తిరుగుతున్నాయా? అయితే ఇదిగో పరిష్కారం

చాలా మందిలో ఇప్పుడు బీపీ సాధారణంగా మారింది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 10:04 am

Chandrababu : నేడు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు రానున్నారు.

తెలుగు పోస్ట్ 17 Apr 2026 9:57 am

ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 9:52 am

అనకాపల్లిలో భూకంపం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాకపల్లి జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. రాంబిల్లి మండలంలో అర్థరాత్రి 12.05 నిమిషాలకు భూమి కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. 

మన తెలంగాణ 17 Apr 2026 9:52 am

మార్కెట్ యార్డుకు మొక్కజొన్న తీసుకురావద్దు..

మార్కెట్ యార్డుకు మొక్కజొన్న తీసుకురావద్దు.. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Apr 2026 9:51 am

Road Accident : మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

తెలుగు పోస్ట్ 17 Apr 2026 9:45 am

Earth Quake : అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు

అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి

తెలుగు పోస్ట్ 17 Apr 2026 9:33 am

17thAprilchintana |వ్యక్తిత్వ వికాసం – విలువలు, నైతికతతో జీవన మార్గం

17thAprilchintana | వ్యక్తిత్వ వికాసం – విలువలు, నైతికతతో జీవన మార్గం 17thAprilchintana

ప్రభ న్యూస్ 17 Apr 2026 9:31 am

IPL 2026 : నేడు మరో కీలక మ్యాచ్

IPL 2026 : నేడు మరో కీలక మ్యాచ్

తెలుగు పోస్ట్ 17 Apr 2026 9:22 am

Varanasi in Song Shoot Mode

A crucial schedule of Superstar Mahesh Babu’s Varanasi is happening in Hyderabad from the past one month. After filming crucial episodes on the lead actors, the team is now picturizing a song in a special set in Hyderabad. Top choreographer Bosco Martis is supervising the song. The shoot is happening in Taher Studios, Hyderabad. After […] The post Varanasi in Song Shoot Mode appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 9:21 am

పాంటింగ్ సలహాతోనే మూడు వికెట్లు తీశా: అర్ష్ దీప్ సింగ్

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ముంబయిపై పంజాబ్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఐదు మ్యాచ్‌లో పంజాబ్ నాలుగు విజయాలు, ఒకటి రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అర్ష్‌దీప్ సింగ్ వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. ప్రస్తుతం అతడు 87 మ్యాచ్‌లలో 102 వికెట్లు తీసుకున్నాడు. ఈ సందర్భంగా అర్ష్‌దీప్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తనకు రీల్స్ చేయడం అంటేనే ఇష్టమని, రీల్స్ ద్వారానే తాను చాలా మందికి తెలుసునని, రీల్స్‌తో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యానని వివరణ ఇచ్చాడు. ఇంక ముందు కూడా రీల్స్ చేసి అభిమానులు సంతోషపరుస్తానని తెలియజేశారు. ముంబయిపై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని, విజయంలో కీలక పాత్ర పోషించడంతో చాలా ఆనందంగా ఉందని, ఈ మ్యాచ్‌కు ముందు కోచ్ రికీ పాంటింగ్‌తో సంభాషించానని, తనపై పెట్టుకున్న భారీ అంచనాలతో చాలా ఇబ్బంది పడ్డానని, దాన్నుంచి బయటపడడానికి పాంటింగ్‌తో చిట్‌చాట్ చేశానని వివరణ ఇచ్చాడు. ప్రాథమిక సూత్రలకు కట్టుబడి బౌలింగ్ చేయమని  పాంటింగ్ సలహా ఇచ్చాడని వివరించారు. రికెల్టన్‌ను ఔట్ చేసిన బంతి చాలా స్పెషల్ అని, భిన్నమైన వేరియేషన్‌తో బంతిని విసిరి వికెట్లు తీశానని, సిరాజ్ కూడా అలా బౌలింగ్ చేస్తూనే వికెట్లు తీసేవాడని పేర్కొన్నాడు. వైడ్, యార్కర్లు విసరడంతోనే బ్యాటర్లు బౌండరీలు తరలించకుండా ఉంటారని అతడు తెలియజేశారు. 

మన తెలంగాణ 17 Apr 2026 9:17 am

ఏడి కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నల్లగొండ జిల్లా దేవరకొండలో అవినీతి వ్యతిరేక శాఖ

ప్రభ న్యూస్ 17 Apr 2026 9:15 am

రా రా ధీవర..

నిఖిల్ సిద్ధార్థ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘స్వయంభూ’తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్ భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో, టాగోర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రారా ధీవర’ అంచనాలను భారీ గా పెంచింది. రవి బస్రూర్ సంగీతం అందించడంతో ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఆయన ఆ అంచనాలను మించి అదిరిపోయే సంగీతాన్ని అందించారు. పవర్ ఫుల్ డ్రమ్స్, ఆర్కెస్ట్రా లేయర్స్‌తో పాట ఒక యోధుడి నినాదంలా అనిపిస్తుంది. సంతోష్ వెంకీ వోకల్స్ పవర్‌ను మరింత పెంచగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ధైర్యం, సంకల్పం, యోధుని ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఈ పాటలో నిఖిల్ తన కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తున్నారు. రఫ్ అండ్ టఫ్ లుక్, యుద్ధానికి సిద్ధమైన బాడీ లాంగ్వేజ్, ఖడ్గాలతో చేసే యాక్షన్ ఫైట్స్.. కఠిన సాధనను చూపిస్తున్నాయి. ఆయన చేసిన ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. హై ఎనర్జీ డ్యాన్స్ మూ మెంట్స్‌తో కూడా ఆకట్టుకుంటారు. నభా న టేశ్ ఈ పాటలో కనిపిస్తూ విజువల్ మరింత ఆకర్షణ తెచ్చారు. సినిమా గ్రాండియర్ ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మ్యూజికల్ లాంచ్‌తో ‘స్వయంభూ’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే టీజర్‌తో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం పాన్ ఇండి యా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

మన తెలంగాణ 17 Apr 2026 9:14 am

నేడు లోక్ సభలో ఓటింగ్

మూడు కీలక బిల్లులపై నేడు లోక్‌సభలో ఓటింగ్‌ జరగనుంది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 9:11 am

ఓపెన్ ప్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలి..

ఓపెన్ ప్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలి.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 17 Apr 2026 9:07 am

తస్సాదియ్యా..

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్‌గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపో యే అప్డేట్‌ను వదిలారు. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ఈ ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ని మేకర్స్ రూపొందించారు. ‘తస్సాదియ్యా’ అంటూ సాగే ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా.. చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించారు. ఇక సంతోష్ నారాయణన్ బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక ఇందులో సమంత కనిపించిన తీరు, ఎనర్జిటిక్ స్టెప్పులు, క్లాసీ కొరియోగ్రఫీ అన్నీ కూడా పాటను విజువల్ ట్రీట్‌గా మార్చేసింది. ‘ఓ బేబీ’ తరువాత నందినీ రెడ్డి, సమంత కలిసి చేస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఆడియెన్స్‌లో అంచనాలు ఏర్పడతాయి. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ రాబోతోంది. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 15న విడుదల కానుంది.

మన తెలంగాణ 17 Apr 2026 9:03 am

Gold Rates Today : బంగారం ధరలు ఇక ఆగేట్లు లేవు..ఇంతగా పెరిగాయిగా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధర స్థిరంగా ఉంది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 8:59 am

Tamil Nadu Elections 2026: Vijay’s TVK Splits Votes, Set to Emerge as Kingmaker

The political landscape in Tamil Nadu is heading towards one of its most unpredictable elections. With polling scheduled for the 23rd, the contest has evolved into a three-cornered fight. The main battle is between the Dravida Munnetra Kazhagam (DMK) and the All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK). However, what has truly changed the dynamics […] The post Tamil Nadu Elections 2026: Vijay’s TVK Splits Votes, Set to Emerge as Kingmaker appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 8:56 am

నదిలో జలకాలాడుతున్న యువతి... ఎదో కదులుతుందని పైకెత్తి చూడగా

హైదరాబాద్: వేసవికాలం కావడంతో ఎక్కువ మంది కాలువ, చెరువు, నదిలో స్నానం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఓ యువతి నదిలో దిగి స్నానం చేస్తుండగా కాలు దగ్గర ఎదో కదిలినట్టు అనిపించింది. వెంటనే చేప అనుకొని పైకి లేపింది. అది మొసలి కావడంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. వెంటనే తేరుకొని నీళ్లలో నుంచి ఒడ్డుకు చేరింది. కొంచెంసేపు ప్రాణం పోయినట్టుగా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీళ్లలో దిగి ముందు అక్కడ ప్రాంతంపై అవగాహన పెంచుకోవాలని నెటిజన్లు చెబుతున్నారు. అదే పెద్ద మొసలి అయితే ఆమె ప్రాణాలు గాల్లో కలిసేవన్నారు. మొసలి పిల్ల అక్కడ ఉందంటే తల్లి మొసలి అక్కడే ఉండి ఉంటుందని అందులోకి ఎవరు దిగకండని సూచనలు చేశారు. 

మన తెలంగాణ 17 Apr 2026 8:50 am

Hyderabad : కుమారుడికి చిప్స్ కొనివ్వలేదని.. యాసిడ్ తాగించి

కుమారుడికి చిప్స్ కొనిపెట్టలేదనే కోపంతో ఓ పిన్ని నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించింది.

తెలుగు పోస్ట్ 17 Apr 2026 8:44 am

అందుకే.. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక

అందుకే.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక చౌటుప్పల్, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధి

ప్రభ న్యూస్ 17 Apr 2026 8:41 am

ఈనెల 19న హిందూ సమ్మేళనం

ఈనెల 19న హిందూ సమ్మేళనం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 17 Apr 2026 8:34 am

Brahmastra part 2 |నిజంగా ఉంటుందా..?

Brahmastra part 2 | నిజంగా ఉంటుందా..? Brahmastra part 2 |

ప్రభ న్యూస్ 17 Apr 2026 8:22 am

సింగపూర్ కు ఏపీ మంత్రుల బృందం

ఈ నెల 21వ తేదీన తొమ్మిది మంది మంత్రుల బృందం సింగపూర్ వెళ్లనుంది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 8:22 am

Thimmarajupalli TV Movie Review

Thimmarajupalli TV Movie Review Telugu360 Rating: 2.5/5 Young Tollywood actor Kiran Abbavaram has produced a small film Thimmarajupalli TV which introduced several youngsters and new faces. Muniraju is the director and the rural drama features Sai Tej, Veda Jalandhar and Pradeep Kotte in the lead roles. Thimmarajupalli TV released today and here is the review […] The post Thimmarajupalli TV Movie Review appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 8:18 am

జార్ఖండ్ అడవుల్లో ఎదురుకాల్పులు

జార్ఖండ్ రాష్ట్రంలోని సరంద అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి

తెలుగు పోస్ట్ 17 Apr 2026 8:15 am

తిరుమల కొండల్లో అద్భుతమైన దృశ్యం

తిరుపతి: తిరుమల కొండల్లో అద్భుతమైన దృశ్యం కనిపించింది. పాలకడలే శ్రీవారి దర్శనానికి తరలి వచ్చిందా అన్నట్లుగా ఉంది. తిరుమలలో రెండో ఘాట్ రోడ్డు చివరి మలుపు వద్ద పొగమంచు పాలకడలి వలే కదిలింది. దీంతో భక్తులు వాహనాలను ఆపి అద్భుతమైన దృశ్యాన్ని కనులారా చూశారు. వేసవికాలంలో దూదిపింజల్లాంటి మేఘాలు కనిపించడంతో భక్తులు పులకించిపోయారు. తిరుమల ఘాట్ రోడ్లు అంటేనే పచ్చని అందాలకు మారుపేరు. పొగమంచు మేఘాలు వీక్షించి ప్రకృతి ప్రేమికులు పరవశించిపోయారు. 

మన తెలంగాణ 17 Apr 2026 8:12 am

Exclusive: Mahesh Babu’s Date for Srinivasa Mangapuram

Ghattamaneni youngster Jaya Krishna, son of Late Ramesh Babu is all set for his acting debut with Srinivasa Mangapuram. The film is directed by RX 100 fame Ajay Bhupathi and it is in the final stages of shoot. The teaser has been out recently and the response is decent. The makers are now considering a […] The post Exclusive: Mahesh Babu’s Date for Srinivasa Mangapuram appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 8:12 am

ఉన్నత విద్యలోనూ ఫేస్ రికగ్నిషన్ : లోకేశ్

ఉన్నత విద్యాసంస్థల్లో ఫేస్ రికగ్నిషన్ పెట్టాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు

తెలుగు పోస్ట్ 17 Apr 2026 8:09 am

పోలవరం ప్రాజెక్ట్ వద్ద కేంద్ర బృందం పరీక్షలు

పోలవరం ప్రాజెక్ట్ లో కేంద్ర బృందం పరీక్షలు నిర్వహించింది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 8:04 am

టివికె అధినేత విజయ్‌కు తప్పిన ప్రమాదం

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టివికె అధినేత విజయ్ దూసుకుపోతున్నాడు. టివికె పార్టీ మేనిఫేస్టో విడుదల సందర్భంగా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రైతు వేదిక పైనుంచి విజయ్ వరి పైరుతో పాటు వేల్‌ను ఆయను ఇవ్వబోయారు. పైకి ఎత్తిన నేపథ్యంలో విజయ్ కన్నుకు వరి తగలింది. వెంటనే విజయ్ అప్రమత్తమై తల పక్కకు జరిపాడు. లేకపోతే వరి అతడి కళ్లను తాకింది ప్రమాదం జరిగేది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతున్నాయి. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంది. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె, అన్నాడిఎంకె, టివికె పార్టీలు త్రిముఖ పోటీ ఇస్తున్నాయి. 

మన తెలంగాణ 17 Apr 2026 7:57 am

‘క్యాస్ట్’ అందరికీ కనెక్ట్ అవుతుంది

వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఎకె జంపన్న రచన, దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘క్యాస్ట్’. కశికా కపూర్, దివి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. గురువారం మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ “కథ విన్నప్పుడు చాలా కొత్త, డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించింది. ఇందులో చాలా బలమైన క్యారెక్టర్ చేశాను. ఇందులో ప్రతి క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గగన్ చాలా అంకితభావంతో చేశారు. యాంకర్ రవి నుంచి యాక్టర్ రవిగా తన చాప్టర్ ప్రారంభించబోతున్నారు. తను కూడా చాలా చక్కగా నటించారు. సత్యం రాజేష్‌తో నా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో చాలా మంచి పాయింట్ తీసుకుని చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. అందరికీ కనెక్ట్ అవుతుంది”అని అన్నారు. డైరెక్టర్ ఏకే జంపన్న మాట్లాడుతూ “మనం చేసే పనిని బట్టి కులాన్ని నిర్ణయించే రోజుల్లో అంత బాగుండేది. కానీ మనిషి పుట్టుకను బట్టి కులాన్ని నిర్ణయించడం మొదలైనప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. కులం అనేది మనిషికి మనిషికి మధ్య ఒక అడ్డు గోడగా మారింది. ఈ సినిమాను చాలా కమర్షియల్‌గా చెబుతున్నాను. కులం మన నిత్యజీవితంలో ఎలా ప్రభావం చూపుతుందో ఇందులో చూపించాం. కులం గురించి మాట్లాడటానికి చాలామంది వెనుకాడుతారు. కానీ ఇది జీవితంలో ఎంత ముఖ్యమో చూపించాం”అని తెలిపారు. నిర్మాత కోటేశ్వరరావు మాట్లాడుతూ “ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన మా డైరెక్టర్ జంపన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమాను జూన్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గగన్ బాబు, సత్యం రాజేష్, రవి పాల్గొన్నారు.

మన తెలంగాణ 17 Apr 2026 7:50 am

IPL 2026 : ముంబయికి లక్కు లేదు.. పంజాబ్ కు తిరుగులేదు

పంజాబ్ కింగ్స్ ముంబయి ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 7:44 am

Lebanon - Israel Ceasefire : గుడ్ న్యూస్.. లెబనాన్ - ఇజ్రాయిల్ పది రోజుల కాల్పుల విరమణకు అంగీకారం

లెబనాన్‌లో శుక్రవారం నుంచి పది రోజుల యుద్ధ విరమణ అమల్లోకి వచ్చింది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 7:31 am

కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి..

కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి.. బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : మండలంలోని అంతంపల్లి

ప్రభ న్యూస్ 17 Apr 2026 7:22 am

మహిళల టి20 సిరీస్‌.. నేడు సఫారీతో భారత్ తొలి పోరు

కింగ్స్‌మెడ్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు శుక్రవారం తెరలేవనుంది. రానున్న వన్డే వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా నిర్వహిస్తున్న ఈ సిరీస్ రెండు జట్లకు కీలకంగా మారింది. ఇందులో రాణించడం ద్వారా రానున్న వరల్డ్‌కప్ టోర్నీకి మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. రెండు జట్లలోనూ స్టార్ క్రికెటర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితానని తారుమారు చేసే బౌలర్లు, బ్యాటర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది. ఇక లౌరా వాల్‌వర్డ్, నడైన్ డి క్లార్క్, సునే లూస్,ట్రియాన్, తజ్మిన్ బ్రిస్ట్, ఖాఖా తదితరులతో సౌతాఫ్రికా కూడా బాగానే కనిపిస్తోంది. దీంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

మన తెలంగాణ 17 Apr 2026 7:20 am

కోల్‌కతాకు చావోరేవో.. నేడు గుజరాత్‌తో కీలక పోరు

అహ్మదాబాద్: వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరు చావోరేవోగా మారింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా ఒక్క దాంట్లో కూడా విజయం సాధించలేక పోయింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఒక పాయింట్ దక్కింది. నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైన కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. నాకౌట్ రేసులో నిలువాలంటే ఇకపై జరిగే మ్యాచుల్లో విజయం సాధించాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. రహానె, రఘువంశీ, గ్రీన్, రొమన్ పొవెల్, రింకు సింగ్, రమణ్‌దీప్ సింగ్, నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి స్టార్‌లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ఇక శుభ్‌మన్ గిల్, ఫిలిప్స్, రబడా, రషీద్ ఖాన్, సిరాజ్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్ తదితరులతో గుజరాత్ కూడా బలంగానే ఉంది. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

మన తెలంగాణ 17 Apr 2026 7:10 am

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಇತ್ತೀಚಿಗೆ ಪಂಜಾಬ್‌ ಬಿಜೆಪಿ ಶಾಸಕ ಅರುಣ್ ನಾರಂಗ್‌ರನ್ನು ಅರೆ ಬೆತ್ತಲೆ ಮಾಡಿ ರೈತರು ಥಳಿಸಿದರು ಎಂದು ಹಳೆಯ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

ಇತ್ತೀಚಿಗೆ ಪಂಜಾಬ್‌ ಬಿಜೆಪಿ ಶಾಸಕ ಅರುಣ್ ನಾರಂಗ್‌ರನ್ನು ಅರೆ ಬೆತ್ತಲೆ ಮಾಡಿ ರೈತರು ಥಳಿಸಿದರು ಎಂದು ಹಳೆಯ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 17 Apr 2026 7:00 am

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం: అమిత్ షా

న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన తర్వాత లోక్‌సభలో దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఫైరయ్యారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు మరింత బలం పెరుగుతుందని అమిత్ షా అన్నారు.   గురువారం (ఏప్రిల్ 16) ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో షా మాట్లాడుతూ..రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల విధానాలలో మార్పులకు సంబంధించిన రెండు చట్టాలు అనే ఈ మూడు బిల్లులతో దిగువ సభలో దక్షిణ రాష్ట్రాల బలం 195 వరకు పెరుగుతుందని చెప్పారు. మొత్తం సీట్ల పెరుగుదల వల్ల ఏ రాష్ట్రం కూడా తన ప్రస్తుత ప్రాతినిధ్యాన్ని సంపూర్ణంగా కోల్పోదని షా అన్నారు. మొత్తం 543 సీట్లలో ప్రస్తుతం ఈ సభలో దక్షిణాది రాష్ట్రాల నుంచి 129 మంది ఎంపీలు ఉన్నారని.. ఇది సుమారుగా 23.76 శాతమని, బిల్లు తర్వాత 195 మంది ఎంపీలు ఇక్కడ ఉంటారని.. అప్పుడు 23.97 శాతంగా ఉంటుంది అని షా అన్నారు.

మన తెలంగాణ 17 Apr 2026 6:40 am

17thaprilsplstory |ప్రపంచ శాంతికి భారత్ పాత్ర ఎంత కీలకం?

17thaprilsplstory | ప్రపంచ శాంతికి భారత్ పాత్ర ఎంత కీలకం? 17thaprilsplstory |

ప్రభ న్యూస్ 17 Apr 2026 6:35 am

17thaprileditorial |మహిళలకు సామాజిక భద్రత ఎందుకు అత్యవసరం?

17thaprileditorial | మహిళలకు సామాజిక భద్రత ఎందుకు అత్యవసరం? 17thaprileditorial | మహిళల

ప్రభ న్యూస్ 17 Apr 2026 6:15 am

దక్షిణాదికి భరోసా

న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ (డిలిమిటేషన్)తో ఏ ప్రాంతానికీ ఎటువంటి అన్యాయం జరగబోదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఏ రాష్ట్రం, అది దక్షిణాది , లేదా ఉత్తరాది అని వివక్షకు గురయ్యే అవకాశమే లేదని లోక్‌సభలో గురువారం ఆయన స్పష్టం చేశారు. చిన్న పెద్ద రాష్ట్రాలు, ప్రాం తాల వారి తేడాలు అనేవి ఉండవవని తెలిపారు. లోక్‌సభలో గురువారం డిలిమిటెషన్, మహిళా రిజర్వేషన్ల కో టా అమలు ప్రక్రియల బిల్లులు ప్రవేశపెట్టిన తరువాత జరిగిన చర్చలో జోక్యం చేసుకుంటూ ప్రధాని ఉద్వేగభరిత ప్రసంగానికి దిగారు. మహిళా కోటాకు డిలిమిటేషన్‌కు సంబంధం ఉంది. ఈ దశలో ఈ సంస్కరణను వ్యతిరేకించే వారిని దేశంలోని ఏ ఆడపడుచు కూడా క్షమించబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లులను మీరు (ప్రతిపక్షాలు) వ్యతిరేకిస్తే, ఏదో ఒక కారణంతో అడ్డుకుంటే, అందుకు ప్రతిగా తాను రాజకీయ లబ్థి పొందుతానని తెలిపారు. ప్రతిపక్షాలను తిప్పికొట్టేందుకు యత్నించారు. ఈ బిల్లులతో మీరు కూడా కలిసి వస్తే , రాజకీయ లబ్థి ఏ ఒక్కరి ఖాతాలోకి పోదనేది గుర్తుంచుకోవాలని చురకలకు దిగారు. ఇప్పుడు పెద్ద ఎత్తున డిలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఏ లోక్‌సభ నియోజకవర్గ ప్రాతినిధ్యంలో ఎటువంటి మార్పు ఉండబోదని వెల్లడించారు. ఇక వ్యత్యాసం అంటూ ఉంటే అది తగు రీతిలోనే జరుగుతుందని తేల్చిచెప్పారు. 2029 మహిళా కోటా అమలు ప్రతిష్ట ప్రతిపక్షాలకు చెందుతుంది తమ అధికారిక వ్యవస్థ 2029లో జరిగే మహిళా రిజర్వేషన్ల కోటా అమలు ఘనత దక్కించుకోవాలనుకోవడం లేదని ప్రధాని తెలిపారు. పైగా ఈ గౌరవం ప్రతిపక్షాలకు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, మీరు మీ ఖాతా ల్లో వేసుకోండని చమత్కరించారు. వ్యతిరేకిస్తే మీకే న ష్టం, ఈ లాభం తన ఖాతాలోకి వస్తుందని తెలిపారు. మ నం అంతా ఏదో ఈ దేశ మహిళలకు గొప్ప మంచి మేలు చేస్తున్నామని అనుకోరాదని, ఆ విధంగా అనుకుంటే అది భ్రమే అవుతుందని చురకలు పెట్టారు. నిజానికి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు వారి హక్కు అని, ఇప్పుడు వారి హక్కు వారికి దక్కుతుందని, మనం ఇచ్చేది ఏమీ లేదని తెలిపారు. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీ లూ గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రభుత్వానికి కొత్తగా క్రెడిట్ అవసరం లేదు. మీ లాగా మేం గ్యారంటీలు, వాగ్దానాలకు పోవాలనుకుంటే పోతాం అని, అయితే ఆ పనిచేయబోమని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఉద్ధేశం మంచిది అయితే పదాల గారడీలు, గ్యారంటీల హంగామాలతో పనిలేదని తెలిపారు. ఏ రాష్ట్రానికి ఏమి కీడు జరగదు ఇదే నా హామీ కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకించి దక్షిణాది, తూర్పు రాష్ట్రాల వారు డిలిమిటేషన్‌పై వెలువరిస్తున్న అనుమానాలు, భ యాలను తొలిగించేందుకు ప్రధాని తమ ప్రసంగంలో యత్నించారు. ఈ చర్యతో ఏ రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరగదని తెలిపారు. ఈ విషయంలో తాను ఎంతో బాధ్యతాయుతంగా, విచక్షణాయుతంగా మాట ఇస్తున్నానని, ఉత్తరాది, దక్షిణాది, తూర్పు, పడమర, చిన్న పెద్ద రాష్ట్రా లు అనే భేదం ఉండదు. ఇప్పటి విధాన నిర్ణయాక ప్రక్రియలో ఎవరికి ఎటువంటి కీడు తలపెట్టేది లేదని ప్రధాని పదేపదే ఉద్ఘాటించారు. ఇంతకు ముందు మహిళలకు ఈ హక్కు ఇవ్వడానికి తటపటాయించిన వా రిని మహిళాలోకం క్షమించలేదని, ఈ ఫలితం వారు ఇప్పుడు రాజకీయంగా అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ కోణాలలో చూడవద్దనేది వినతి ఇప్పటి డిలిమిటేషన్ అనుంబంధ మహిళా బిల్లును ఎవ రు కూడా రాజకీయ కణాలలో చూడరాదని, రాజకీయ గణాంకాలకు దిగరాదని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఇది దేశ ప్రయోజనాల కోణంలో తీసుకున్న నిర్ణయం అని తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళ లు మనను ఇప్పుడు వీక్షిస్తున్నారు. ఇక్కడి నిర్ణయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. నిర్ణయాల కంటే ఎ క్కువగా అంతా మన ఉద్ధేశాలేమిటనేది బేరీజు వేసుకుంటారని,ఈ మేరకు వారి తీర్పు ఉంటుందని ప్రధాని తమ ప్రసంగంలో తెలిపారు. మన చేత మంచిది అయితే మన భవిత కూడా అదే విధంగా ఉంటుందని, దీనిని నిర్ణయించేది సంబంధిత మహిళా శక్తిది అని స్పష్టం చేశారు. మన కు దురుద్ధేశం ఉన్నట్లు అయితే, మనను ఈ దేశం క్షమించబోదని, ఇందులో అందరికీ ఫలితం ఉంటుందని తెలిపారు. 2023లో కూడా రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో చ ర్చ జరిగింది. అప్పుడు తొందరగా అమలు చేయాలని అన్నారు. అయితే వెంటనే వీలు కాలేదు. ఇప్పుడు 2029లో దీనిని కార్యరూపంలోకి తీసుకురావడానికి అవసరం అయిన సమయం ఉందని ప్రధాని తెలిపారు. 2029లో కూడా అమలు చేయకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటనేది మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడున్న అవసరాలను బట్టి చూస్తే ఇక మనం ఈ విషయంలో ఎటువంటి జాప్యానికి దిగరాదనేది కీలక విషయం అయిందన్నారు. లోక్‌సభలో గురువారం అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణల బిల్లు తీసుకువచ్చారు. దీని మేరకు లోక్‌సభలో సీట్ల సంఖ్య 815కు పెరుగుతుంది. మహిళలకు 33 శాతం కోటా పరిధిలో వారి సీట్ల సంఖ్య 272కు రిజర్వ్ అవుతుంది. ఇది కూడా 2029 ఎన్నికల నాటికి సాకారం అవుతుంది. కాలా వాలాలతో దిష్టిపోతుంది : ప్రధాని మోడీ డిఎంకె ఎంపిల బ్లాక్ డ్రసు నిరసనలపై వ్యాఖ్యలు లోక్‌సభలో మహిళా కోటా బిల్లు సంబంధిత రాజ్యాంగ సవరణల దశలో డిఎంకె సభ్యులు నల్లటి దుస్తులతో సభకు రావడంపై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో స్పందించారు. వారు నిరసన తెలిపేందుకు నల్లటి దుస్తులతో రావడం మంచిదే అయిందేమో, ఎందుకంటే ఈ బిల్లుకు, చట్టానికి ఉన్న దిష్టిపోవవడానికి ఇది నల్లటి తిలకం మాదిరిగా పనిచేస్తుందేమో అని వ్యాఖ్యానించారు. దుష్టశక్తి పోవడానికి ఇటువంటి శకునాలు ఉండటం మంచిదే అని డిఎంకె నిరసనలపై స్పందించారు. మంచి పనులు చేసేముందు నల్లటి బొట్లు పెట్టుకోవడం ఆనవాయితీ. ఇప్పుడు కొందరు సభ్యులు ఈ నల్లటి దుస్తులతో వచ్చి ఈ వెలితి తీర్చారని చమత్కరించారు. లోక్‌సభకు డిఎంకె సభ్యులు నల్లటి దుస్తులతో వచ్చి, బ్లాక్ బిల్లు అంటూ నిరసన తెలిపారు. తమిళనాడులో డిఎంకె కార్యకర్తలు వెంటరాగా ముఖ్యమంత్రి, పార్టీ నేత స్టాలిన్ నల్లటి జెండా ధరించి నిరసనకు దిగారు. డిలిమిటేషన్ బిల్లు ప్రతిని బ్లాక్ లా అంటూ అందరి సమక్షంలో తగులబెట్టారు. ఈ బిల్లు అమలు అయితే తమిళులు సొంత రాష్ట్రంలోనే శరణార్థులు అవుతారని డిఎంకె నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ డిమిలిమిటేషన్ వ్యవహారం రాజకీయ అస్త్రంగా మారేందుకు రంగం సిద్ధం అయింది. 

మన తెలంగాణ 17 Apr 2026 6:00 am

17thApril2026 |శుక్రవారం నేటి పంచాంగం

17thApril2026 | శుక్రవారం నేటి పంచాంగం 17thApril2026 | తిథి, నక్షత్రం వివరాలుశుభ

ప్రభ న్యూస్ 17 Apr 2026 6:00 am

నాడు భూదానం.. నేడు భూదాహం

ఒక ఉద్యమం ఫలితంగా లభించిన భూదాన భూముల్ని పేదలకు పంచాల్సి ఉండగా, తెలంగాణలో ఇంకా పంచకుండా మిగిలిన వాటిని ఎలా కాజేయాలనే కుట్రలు తీవ్రస్థాయిలో సాగుతున్నాయి. స్పష్టమైన రికార్డులున్న భూదాన భూముల నుంచి ఆక్రమణదారులు తొలగట్లేదు. తాజా కబ్జాలకు కొన్ని చోట్ల యత్నాలు సాగుతున్నాయి. అక్కడక్కడా వారికి ప్రభుత్వాలే వత్తాసు పలుకడం ఆందోళన కలిగిస్తోంది. సాగుకు యోగ్యమైన సుమారు 8000 ఎకరాలపైనే అందరిదీ కన్ను. భూదానోద్యమంలో భాగంగా సేకరించిన వాటిలో పెద్ద మొత్తం భూముల్ని పేద రైతులకు, ప్రభుత్వ రంగ సంస్థలకు, ఇతర స్వచ్ఛంద సేవా సంఘాలకి, పేదల ఇళ్ల నిర్మాణానికి ఇది వరకే ఇచ్చారు. ఇవి కాకుండా భూదాన భూములు పలు చోట్ల అన్యాక్రాంతమయ్యాయి. న్యాయస్థానాల జోక్యంతో కొన్ని చోట్ల వాటిని వెనక్కి తెచ్చినప్పటికీ ఇంకా కొన్ని భూములు అక్రమార్కుల కబ్జా కోరల్లోనే ఉన్నాయి. వాటిని కాపాడుతూ, దురాక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన భూదాన బోర్డు ఇప్పుడు ఉనికిలోనే లేకుండా పోయింది. బోర్డును రద్దు చేశాక చట్టప్రకారం ఆరు మాసాల్లో పునరుద్ధ్దరించాల్సి ఉండేది. ఆ గడువును చట్ట సవరణ ద్వారా మూడేళ్లకు పెంచారు. కానీ, ఎనిమిదేళ్లవుతున్నా బోర్డు ఏర్పాటు అతీగతీ లేదు. గత ప్రభుత్వం భూదాన భూముల కోసం ప్రత్యేక అధికారిని నియమించినా, విచక్షణాధికారాల పరంగా, స్ఫూర్తిపరంగా వారు పూర్తిస్థాయిలో పనిచేయలేని పరిస్థితి! భూదాన భూముల్ని సంరక్షించి పేదలకు పంచాల్సిన చోట సర్కార్ల వ్యవహారం సందేహాలకు తావిచ్చేదిగా ఉంటోంది. స్ఫూర్తిది ఒక వారసత్వం అనుకోని పరిస్థితుల్లో భూదానోద్యమం 75 ఏళ్ల కింద మొదలైంది. నికార్సయిన గాంధేయవాది, గాంధీ మెచ్చిన శిష్యుడు భారతరత్న ఆచార్య వినోబా భావే దీనికి కారకుడు. 18 రాష్ట్రాల్లో ఎనభై వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్రతో, 44 లక్షల ఎకరాల భూమిని.. ఉన్నవాళ్ల నుంచి లేని వాళ్ల కోసం బదలాయించిన ‘భూదాన ఉద్యమం’కు తెలంగాణ నడిబొడ్డునున్న నల్గొండ జిల్లాలోని చీరల పోచంపల్లిలో బీజం పడింది. అందుకే, అప్పట్నుంచి అది ‘భూదాన్ పోచంపల్లి’ అయింది. ఏడాదిగా సాగిన వజ్రోత్సవాలు రేపటితో ముగుస్తున్నాయి. 1951 ఏప్రిల్‌లో శివరాంపల్లిలో సర్వోదయ సమ్మేళనానికి వచ్చిన వినోబా ఒక సాయంత్రం పోచంపల్లిలో ఉన్నారు. తెలంగాణలో నాడు తీవ్రస్థాయిలో ఉన్న సాయుధ పోరు గురించి ఆయన కలత చెంది, ‘ఎందుకీ రక్తపాతం?’ అన్నపుడు, ‘మాకు గంటెడు భూమి లేదు, ఉంటే సాగుచేసుకొని బతికే వాళ్లం’ అని ఆ గ్రామ పేదలు బదులిచ్చారు. ‘అవును మీకు భూమి కావాలి, ఎవరిస్తారు? వచ్చే నెల ఒక భేటీ ఉంది, నేను దేశ ప్రధాని నెహ్రూతో మాట్లాడుతాను’ అని అనునయించి, ఆ సాయంత్రపు ప్రార్థన సమావేశం ముగించారు. మరుసటి రోజు ఉదయం సమావేశమైనపుడు, ఆ గ్రామపు మోతుబరు రైతు వెదిరె రామచంద్రారెడ్డి వంద ఎకరాల తమ భూమి పేదల కోసం దానంగా ఇస్తానని వినోభా సమక్షంలో ప్రకటించారు. అలా మొదలయింది భూదానోద్యమం. వందలువేల మంది దాతలు ముందుకు వచ్చారు. దాన పత్రాలు స్వీకరిస్తూ, రెవెన్యూ రికార్డులు సవరిస్తూ అలా లభించిన భూముల రక్షణకు, తదుపరి కార్యాచరణ నిర్వహణకు భూదాన, గ్రామదాన బోర్డును ప్రత్యేక చట్టాన్నే తెచ్చారు. విస్తృత అధికారాలతో బోర్డును (1965) ఏర్పాటు చేశారు. భూదాన యజ్ఞ సమితి, బోర్డు నిర్వహణలో ఉమ్మెత్తల కేశవరావు, ప్రభాకర్ జి, సంగం లక్ష్మీబాయి, బూర్గుల రామకృష్ణారావు వంటి వారు తొలితరంలో కృషి చేస్తే, సి.వి. చారి, డాక్టర్ గున్నా రాజేందర్‌రెడ్డి వంటి వారు మలి తరంలో విశేషంగా కృషి చేశారు. భూదాన భూముల రికార్డులు భద్రపరచడం, న్యాయస్థానాల్లో కేసులు వేసి దురాక్రమణల నుంచి తప్పించడం, యోగ్యులైన పేద రైతులకు సాగు భూములివ్వటం, గూడు లేని నిరుపేదలకు కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలివ్వటం వారసత్వంగా చేస్తూ వస్తున్నారు. ఉండాల్సిన బోర్డే లేని పరిస్థితి భూదాన భూములపై పలుకుబడి కలిగిన కొందరు, దురాక్రమణదారుల కన్నుపడటంతో తరచూ వివాదాస్పదం అవుతూ వచ్చింది. వేర్వేరు ప్రభుత్వాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు కమిటీతో సహా వివిధ కమిటీలు నివేదికలిచ్చాయి. 2006లో కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం 1,71,404 ఎకరాల భూదాన భూమి ఉండగా, 65,660 ఎకరాలు రాళ్లు, రప్పలతో సాగుకు యోగ్యం కానిదని పేర్కొన్నారు. యోగ్యమైన 99,616 ఎకరాల భూమిని 36,236 మంది రైతులకు పంపిణి చేశారు. 6581 ఎకరాల భూమి మిగిలింది. దురాక్రమణల నుంచి 1235 ఎకరాల భూమిని కోర్టు ఉత్తర్వుల ద్వారా బోర్డు తిరిగి స్వాధీనపరచుకుంది. 2000 ఎకరాల భూమిని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు చెందిన వివిధ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు ఇచ్చారు. 371 ఎకరాల్లో పదివేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 201417 మధ్య జరిగిన పలు పరిణామాల్లో భూదాన భూములపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమిస్తూ జిఒ ఇచ్చింది. బోర్డు నుంచి బలవంతంగా రికార్డుల్ని స్వాధీనపరచుకుంది. అది దురుద్దేశపూర్వకమనే అభియోగాలున్నాయి. ప్రభావితులు కోర్టుకు వెళ్లినపుడు జిఒను కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. డివిజన్ బెంచ్‌కి అప్పీల్ వెళ్లినా జిఒ సరికాదనే పేర్కొంది. భూదాన చట్టాన్ని ఉటంకిస్తూ, బోర్డును 2017లో ప్రభుత్వం రద్దు చేసింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రత్యేక అధికారిగా నియమించింది. దాన్ని కోర్టులో సవాల్ చేసినపుడు, బోర్డు రద్దును, ప్రత్యేక అధికారి నియామకాన్ని సమర్థించిన న్యాయస్థానం గడువు లోపల బోర్డును పునరుద్ధరించాలని ఆదేశించింది. ప్రభుత్వం వినలే! ఆరు మాసాల గడువును మూడేళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఆ గడువు కూడా తీరినా బోర్డును ఏర్పాటు చేయకపోవడం, భూదాన భూముల్ని పలువురు కబ్జా చేయడం, పాపయ్యగూడ వంటి చోట్ల పేదల ఇళ్లు కూల్చడం వంటి ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల కూల్చిన నిరుపేదల వెయ్యి ఇళ్లున్నది భూదాన భూములేనని, వారంతా పట్టాలు పొందిన వారేనని రికార్డులు చెబుతున్నాయి. కలువల రాజారావ్ ఈ భూముల్ని స్వయంగా వినోబా భావేకు దానమిచ్చారు. ఇక్కడి ఇండ్లను కూల్చే విఫలయత్నమొకటి గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది. భూదాన బోర్డుకు చెందిన 400 ఎకరాల సాగుభూమి నాగులపల్లి అడవిలో పదిహేనేళ్లుగా అన్యాక్రాంతమై ఉంది. భూదాన భూముల వివాదాల్ని పరిష్కరించే అధికారం బోర్డుకే తప్ప రెవెన్యూ అధికారులకు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భూములన్నీ మాయం! భూముల ధరలు అడ్డగోలుగా పెరిగిన తర్వాత రాష్ర్టంలో భూఅరాచకాలకు హద్దులు చెరిగాయి. మానవ సంబంధాలు మంటగలిశాయి. కుటుంబ సభ్యులు, రక్తసంబంధీకుల నడుమ హత్యానేరాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి గ్రామంలో భూవివాదాలే! ధరణి వచ్చినా, అది పోయి భూభారతి వచ్చినా భూవివాదాలు, దురాక్రమణలు, దాడులు, హత్యానేరాలు పెచ్చుమీరుతున్నాయే తప్ప తగ్గట్లేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ హయాంలోని రకరకాల భూములు అమ్మకానికో, ఆక్రమణలకో గురవుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బంజరు భూము లు, లావాణీ భూములు, గైరాన్ భూములు, అసైన్డ్ స్థలాలు, దేవాదాయ, వక్ఫ్, కాంధిశీకుల భూములు, అటవీ భూములు, గ్రామ కంఠాలు... ఇలా అన్నీ కనుమరుగవుతున్నాయి. భూదాన భూముల్ని కూడా ఖతం చేసే చర్యలు ముమ్మరమయ్యాయి. నాటి స్ఫూర్తి భూదానమయితే నేటి స్వార్థం భూదాహం కావటం వల్లే ఈ విపరిణామాలిలా పెచ్చుమీరుతున్నాయి. దిలీప్‌రెడ్డి

మన తెలంగాణ 17 Apr 2026 5:50 am

నెంబర్ గేమ్‌లో నెగ్గేనా?

న్యూఢిల్లీ: మహిళల రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయడానికి అవసరమైన రెండు మూడొంతుల మెజారిటీ ప్రస్తుతం అధికార ఎన్డీఏ కూటమికి లేదని స్పష్టమవుతోంది. ఇతర పార్టీల మద్దతు పొందడం లేదా కొన్ని పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉండటం వంటి పరిస్థితులు ఏర్పడితేనే బిల్లుకు ఆమోదం సాధ్యమవుతుందని విశ్లేషణలు చెబుతున్నాయి. లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు ఉండగా, ఇది స భ మొత్తం బలంలో సుమారు 54 శాతం. ప్రతిపక్షానికి 233 మంది ఎంపీలు ఉన్నారు. అదనంగా 7 మంది స్వతంత్రులు, నలుగురు వైఎస్సార్‌సీపీకి, ఒక్కొక్కరు ఏఐఎంఐఎం, శిరోమణి అకాలి దళ్‌కు చెందినవారు ఉన్నారు. ఏఐఎంఐఎం ఇప్పటికే బిల్లుకు వ్యతిరేకంగా నిలిచింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో సహా ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే కనీసం 360 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయాలి. అయితే కొంతమంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉంటే అవసరమైన సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు 30 మంది సభ్యులు ఓటింగ్‌కు హాజరుకాకపోతే మొత్తం సంఖ్య 510కి తగ్గి, రెండింట మూడొంతుల సంఖ్య 340 అవుతుంది. 60 మంది దూరంగా ఉంటే ఈ సంఖ్య 320కి, 90 మంది దూరంగా ఉంటే 300కి పడిపోతుంది. లోక్‌సభలో బిల్లుకు ఆమోదం రావాలంటే సమాజ్‌వాదీ పార్టీ (37 ఎంపీలు), తృణమూల్ కాంగ్రెస్ (28 ఎంపీలు), డీఎంకే (22 ఎంపీలు) వంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలలో కనీసం రెండు పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్‌కు లోక్‌సభలో 98 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు బీజేపీకి 240, టీడీపికి 16, జేడీయూకు 12 మంది సభ్యులు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు. లోక్‌సభలో బిల్లులు ఆమోదం పొందకపోతే, అవి రాజ్యసభకి వెళ్లే అవకా శం ఉండదు. ఎగువ సభలో ఎన్డీఏకు 141 మంది సభ్యుల మ ద్దతు (సుమారు 58 శాతం) ఉండగా, ప్రతిపక్షానికి 83 మంది ఉన్నారు. బీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, బీజేడీ, బీఎస్పీ, స్వతంత్రులు కలిపి 20 మంది సభ్యులు ఉన్నారు. వీరి ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే కనీసం 163 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 107 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్‌కు 28, తృణమూల్ కాంగ్రెస్‌కు 13, ఆమ్ ఆద్మీ పార్టీకి 10, డీఎంకేకు 8 మంది సభ్యులు ఉ న్నారు. ఇదిలా ఉండగా, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఒడి శా రాష్ట్ర రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు డీలిమిటేషన్ బిల్లుతో ముప్పుకు గురవుతున్నాయని పేర్కొంటూ, రాష్ట్ర ఎంపీలు ఐక్యంగా పోరాడాలని  పిలుపునిచ్చారు. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతూ, రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకించాలని ఆయన సూచించారు. ఇక బిల్లులు ఆమోదం పొందడానికి తగిన సంఖ్యాబలం తమ వద్ద లేదని కొందరు బీజేపీ ఎంపీలు వ్యక్తిగతంగా అంగీకరించినట్టు సమాచారం. రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంట్ రెండు సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. అంటే మొత్తం సభ్యులలో 50 శాతం కంటే ఎక్కువ మద్దతుతో పాటు, హాజరై ఓటు వేసిన సభ్యులలో రెండు మూడొంతుల మద్దతు ఉండాలి. ప్రస్తుతం 540 మంది సభ్యులు హాజరై ఓటు వేస్తే, 360 మంది మద్దతు అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల మద్దతు కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో భావోద్వేగపూరిత విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షం వ్యతిరేకించినా తాను విమర్శలను స్వీకరించేందుకు సిద్ధమని, అయితే అందరూ కలిసి మద్దతిస్తే కీర్తిని పంచుకునేందుకు ఖాళీ చెక్ ఇవ్వడానికి తయారుగా ఉన్నానని అన్నారు. గురువారం లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఓటింగ్ అనంతరం ప్రవేశపెట్టబడింది. అలాగే డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు కూడా ప్రవేశపెట్టారు. సుమారు 40 నిమిషాల తీవ్ర చర్చ తర్వాత జరిగిన ఓటింగ్‌లో 251 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా, 185 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు ప్రవేశం పొందింది.

మన తెలంగాణ 17 Apr 2026 5:30 am

సూర్య దుమారం

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుపై బిజెపి ఎంపి తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ లోక్‌సభలో బిజెపి ఎంపి తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, ఎంపిలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు భగ్గుమన్నారు. బిజెపి ఎంపి వ్యాఖ్యలు అమరవీరుల త్యాగాలను అమానించడమేనని వారు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులు జూపల్లి కృ ష్ణారావు, పొన్నం ప్రభాకర్‌లు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం ఎంపి అజ్ఞానానికి పరాకాష్టగా వారు అభివర్ణించారు. తేజస్వి సూర్య తక్షణమే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు నిరసనగా టి కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగా రు. తేజస్వీ సూర్య దిష్టిబొమ్మను దహనం చేశారు. బిజెపి ఎంపికి అవగాహన లేదు:మంత్రి వాకిటి శ్రీహరి తెలంగాణపై బిజెపి ఎంపికి అవగాహన లేకుండానే మా ట్లాడుతు న్నారని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తాకట్టపెట్టేలా ఎంపి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు పార్లమెంట్‌లో ఆమోదించుకున్న తరువాతే తెలంగాణ ఏర్పడిందని కనీసం ఈ విషయంపై ఆవగాహన లేకుండా బిజెపి ఎంపి మాట్లాడడం తప్పవని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై బిజెపి విషం: కెటిఆర్ పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-, పాకిస్థాన్ విభజనతో పోల్చ డం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బిజెపి నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ నుంచి ఈరోజు పార్లమెంట్ సభ్యుడు తేజస్వీసూర్య వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు పైన విషం కక్కుతూ బిజెపి చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు. తెలంగాణ అనేది ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, ఎవరి భిక్ష వల్లనో ఏర్పడింది కాదని కెటిఆర్ స్పష్టం చేశారు. బిజెపి ఎంపిని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలి: ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్ తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బిజెపి ఎంపి తేజస్వి సూర్యను వెంటనే పార్లమెంట్ నుంచి సస్పెం డ్ చేయాలి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటును భారత్, -పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బిజెపి ఎంపి తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అజ్ఞానానికి, తెలంగాణ పట్ల ఉన్న వివక్షా పూరిత ఆలోచనా ధోరణికి అద్దం పడుతుందన్నారు. తేజస్వీ సూర్య ఒక లాయర్ అని చెప్పుకుంటారని, భారత రాజ్యాంగం మీద కనీస అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, దేశ అత్యున్నత పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించి, రాష్ట్రపతి గెజిట్ విడుదల చేసిన పవిత్ర ప్రక్రియ అని గుర్తు చేశారు. తేజస్వీ సూర్య తెలివిలేని నాయకుడని మంత్రి పొన్నం ప్ర భాకర్ మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణపై అజ్ఞానంగా మాట్లాడారని అతడి సభ్యత్వాన్ని వెం టనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తేజస్వీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. తేజస్వీ మాటలపై తెలంగాణ బిజెపి ఎంపిలు తెలంగాణ బిడ్డలైతే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇది ఏ ఒక్కరి కో అవమానం కాదని, ఇది మన ఉద్యమాన్ని, మన రాష్ట్రా న్ని అమానించడమేనన్నారు. మరొకరు తెలంగాణ ఏర్పాటుపై నోరువిప్పే ధైర్యం చేయకుండా చట్ట ప్రకారం బుద్ధి చెప్పాల్సి ఉందన్నారు. దీనిపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు సమాధానం చెప్పాలన్నారు. తేజస్వీపై చర్య తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాస్తున్నట్లు ఆయన చెప్పారు. పుండుమీద కారం చల్లొద్దు తెలంగాణ తల్లికి అవమానం జరుగుతుంటే బిజెపి ఎంపిలు మౌనంగా ఉండటం అంటే తల్లిని అమానించడమేనన్నారు. నాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే పారిపోయిన కిషన్ రెడ్డి ఇవాళ తెలంగాణ తల్లిని అవమానిస్తే మౌనంగా ఉండిపోయారని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోడీ, అమిత్ షా, ఇప్పుడు తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటుపై తప్పుడుగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. ఇటీవల అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా ఓటిడిపి ఎంపి సైతం ఇదే రకంగా మాట్లాడారని ఇటువంటి అజ్ఞానులు, ధన బలం, మందబలంతోనో పార్లమెంట్ కు వస్తే అలాంటి వారి పార్టీ అయినా బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలా ది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమని, అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడనని బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే హ రీశ్‌రావు అన్నారు. బిజెపి ఎంపి తేజస్వీ సూర్య వాఖ్య లు హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలు అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమేనన్నారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పాటయిన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలవడాన్ని బిజెపి తట్టుకోలేకపోతుందన డానికి తేజస్వీ అహంకార పూరిత వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. .

మన తెలంగాణ 17 Apr 2026 5:30 am

రాజ్యమా.. ఇదేమి న్యాయం?

భారతదేశం ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే ఆలోచన మీద నిర్మితమైంది. భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం మన రాజ్యాంగానికి ప్రాణం. కానీ ఇప్పుడు ముందుకు వస్తున్న డీలిమిటేషన్ చర్చలు ఆ సూత్రాన్నే ప్రశ్నించేలా మారుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల దృష్టిలో ఇది కేవలం పరిపాలనా ప్రక్రియ కాదు. ఇది సమానత్వం, న్యాయం, ఫెడరలిజం గురించి ఉన్న మౌలిక ప్రశ్న. డీలిమిటేషన్ అనేది సూత్రప్రాయంగా జనాభా ఆధారంగా ప్రాతినిధ్యాన్ని సవరించే ప్రక్రియ. కానీ ఇక్కడ సమస్య జనాభా మాత్రమే ప్రమాణంగా తీసుకోవడంలో ఉంది. దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విధానాలను కఠినంగా అమలు చేశాయి. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారతపై పెట్టుబడులు పెట్టాయి. ఫలితంగా జనాభా వృద్ధిని నియంత్రించాయి. అదే సమయంలో ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాలు ఈ మార్గంలో అంతగా ముందుకు రాలేకపోయాయి. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన దిక్సూచీలు. అధిక పన్ను ఆదాయం, మెరుగైన మానవ వనరులు, పారిశ్రామిక వృద్ధి -ఇవన్నీ ఈ రాష్ట్రాల కృషి ఫలితాలు. దేశానికి ఆర్థిక బలం ఇచ్చే ఈ ప్రాంతాలకు, రాజకీయ ప్రాతినిధ్యం తగ్గించడం ఒక విరుద్ధ సంకేతం. ఇది పని చేసినవారికి శిక్ష, చేయనివారికి బహుమతి అనే భావనను బలపరుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం కేవలం సంఖ్యల ఆట కాదు. అది సమాన అవకాశాలు, ప్రాంతీయ సమతౌల్యం, చారిత్రక బాధ్యతల సమ్మిళితం కావాలి. కేవలం జనాభా ఆధారంగా లోక్‌సభ స్థానాలను పెంచితే, రాజకీయ శక్తి సమీకరణం పూర్తిగా మారిపోతుంది. దక్షిణాది రాష్ట్రాల స్వరం క్రమంగా బలహీనపడుతుంది. ఇది పాలనా నిర్ణయాల్లో అసమానతలకు దారితీస్తుంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ముఖ్యం, కానీ ఆ సంఖ్య వెనుక ఉన్న బాధ్యతా రాహిత్యాన్ని ప్రోత్సహించి, బాధ్యతగా వ్యవహరించిన వారిని శిక్షించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. భారత రాజ్యాంగం ప్రకారం దేశం ఒక ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’. అంటే రాష్ట్రాల కలయికతో ఏర్పడిన ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ. కానీ రానున్న రోజుల్లో జరగబోయే ‘డీలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియను గమనిస్తుంటే, ఈ వ్యవస్థలోని ‘సమానత్వం’ అనే పునాది కదులుతోందా అన్న అనుమానం కలగకమానదు. దేశం ఇచ్చిన పిలుపుని బాధ్యతగా స్వీకరించి, జనాభాను నియంత్రించి, మానవ వనరులపై పెట్టుబడిపెట్టిన దక్షిణాది రాష్ట్రాలకు ఇది పురస్కారమా లేక శిక్షా? 1970 నుండి కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణను ఒక జాతీయ లక్ష్యంగా ప్రకటించింది. దీనిని దక్షిణాది రాష్ట్రాలు- ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక- అత్యంత నిబద్ధతతో అమలు చేశాయి. అక్షరాస్యతను పెంచాయి, వైద్య సదుపాయాలను మెరుగుపరిచాయి, తద్వారా జనాభా పెరుగుదల రేటును గణనీయంగా తగ్గించాయి. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలు ఈ విషయంలో విఫలమయ్యాయి. ఇప్పుడు కేవలం ‘జనసంఖ్య’ ప్రాతిపదికన పార్లమెంటు సీట్లను పెంచితే, బాధ్యతగా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. ఇది కేవలం అంకెల సవరణ కాదు, దేశ భవిష్యత్తును శాసించే గొంతుకను నొక్కేయడం. మెరుగైన పాలన అందించినందుకు, విద్యారంగంపై ఇన్వెస్ట్ చేసినందుకు ఇప్పుడు మాకు దక్కుతున్న బహుమానం ఇదేనా? ప్రజాస్వామ్యం అంటే కేవలం తలల లెక్కింపు మాత్రమే కాదు, ఆ తలల వెనుక ఉన్న ప్రగతిశీల ఆలోచనలకు గౌరవం ఇవ్వడం. ఒక ప్రాంతం మరో ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించే పరిస్థితి వస్తే అది ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. జనాభాను అదుపుచేయని రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం అంటే- అప్రకటితంగా ‘మీరు జనాభాను పెంచండి, మీకు అధికారాన్ని ఇస్తాం’ అని చెప్పడమే అవుతుంది. ఇది దేశ సమగ్రతకు, అభివృద్ధికి గొడ్డలి పెట్టు. ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా డీలిమిటేషన్ చేపడితే, దక్షిణాది ఉనికి నామమాత్రం అవుతుంది. ఫెడరల్ వ్యవస్థ అంటే కేవలం అధికారాల విభజన కాదు; అది పరస్పర గౌరవం, సమన్వయం, సమాన భాగస్వామ్యం.ఒక ప్రాంతం జనాభా ఎక్కువగా ఉందని, ఆ ప్రాంతానికి అధిక రాజకీయ ఆధిపత్యం ఇవ్వడం, ఇతర ప్రాంతాల పాత్రను తగ్గించడం ద్వారా దీర్ఘకాలంలో దేశ ఏకత్వానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. డీలిమిటేషన్ అనేది అవసరం లేనిదని ఎవరూ చెప్పడం లేదు. కానీ అది న్యాయసమ్మతంగా, సమతౌల్యంతో జరగాలి. కొన్ని ముఖ్యమైన సేప్‌గార్డ్ తప్పనిసరిగా ఉండాలి. జనాభా మాత్రమే కాకుండా, ఆర్థిక భాగస్వామ్యం, మానవ అభివృద్ధి సూచీలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య వ్యత్యాసం ఎక్కువ కాకుండా పరిమితులు పెట్టాలి. రాజ్యసభ పాత్రను బలోపేతం చేసి ప్రాంతీయ సమతౌల్యాన్ని కాపాడాలి. దశలవారీగా అమలుచేసి అకస్మాత్తుగా శక్తి సమీకరణ మార్పులను నివారించాలి. ఇవి లేకుండా జరిగే డీలిమిటేషన్ కేవలం నియోజకవర్గాల పునర్విభజన కాదు. అది భారత సమాఖ్య స్వరూపాన్నే మార్చే నిర్ణయం అవుతుంది. ఇక్కడ ఒక పెద్ద మౌలిక ప్రశ్న నిలుస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలు తలచుకుంటే దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల అవసరాల కంటే, జనాభా సమస్యలతో సతమతమయ్యే రాష్ట్రాల ఓటు బ్యాంకు రాజకీయాలే దేశ ఎజెండాను నిర్ణయిస్తాయి. దక్షిణ భారతం దేశం నుంచి ప్రత్యేక హక్కులేమీ కోరడం లేదు. కేవలం ‘న్యాయాన్ని’ కోరుతోంది. అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రాలను వెనక్కినెట్టి, వెనుకబడిన పాత పద్ధతులకే పెద్దపీట వేయడం అసంబద్ధం. భారత్ ఒక శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే, బాగా పనిచేసే రాష్ట్రాలకు ప్రోత్సాహం ఉండాలి కానీ, వారి గొంతు నొక్కే ప్రయత్నం జరగకూడదు. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన సమన్యాయం అమలవ్వాలి అంటే, డీలిమిటేషన్ ప్రక్రియ కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా, ఆర్థిక సహకారం, సామాజిక అభివృద్ధి, జాతీయ లక్ష్యాల సాధన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. లేనిపక్షంలో ఇది ఒక ప్రాంతంపై మరో ప్రాంతం సాగిస్తున్న రాజకీయ దాడిగా చరిత్రలో మిగిలిపోతుంది. ఇప్పటికే దక్షిణాదిపై ఢిల్లీలో ఒక రకమైన వివక్ష ఉంటుంది. గతంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్వర్గీయ ఎన్‌టిఆర్ పార్టీ పెట్టి మరి పోరాడారు. అదే విధంగా తమిళనాడులో కూడా. అదే విధమైన పోరాటాలు జరిగాయి. కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎపిలో అధికారంలో టిడిపి పార్టీయే కీలకం కాబట్టి దక్షిణాది అన్యాయంపై గళంఎత్తి అడగాలి. ఎండి సలీమ్ పాషా  సీనియర్ జర్నలిస్ట్

మన తెలంగాణ 17 Apr 2026 5:30 am

హైదరాబాద్‌లో ప్రోటోల్యాబ్స్ జిసిసి

మన తెలంగాణ/హైదరాబాద్: ఆధునాతన ఇంజనీరింగ్, డిజిటల్ తయా రీ సంస్థ ప్రోటోల్యాబ్స్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి గ్లోబల్ సామర్థ్య కేంద్రం (జిసిసి) ఏర్పాటుకు ముందుకొచ్చిందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. దీని స్థాపనతో 300 మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయని ఆయన తెలిపారు. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రోటోల్యా బ్స్ స్థానిక ఆరోహన్ గ్లోబల్ కన్సల్టెంగ్‌తో కలిసి ఈ జిసిసిని నెలకొల్పుతోం ది. గురువారం ప్రోటోల్యాబ్స్ ప్రతినిధి బృందం సచివాలయంలో శ్రీధర్ బాబుతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తమ విస్తరణ కార్యక్రమాలను వివరించారు. జిసిసి ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం పట్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ‘గడచిన ఏడాది కాలంలో 80 జిసిసిలు ఇక్కడ ఏర్పాటయ్యాయని తెలిపారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, చక్కని ఎకో సిస్టం ఉండటం వల్ల జిసిసిలను ఆకర్షించగలుగుతున్నామని చెప్పారు. డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు కూడా తెలంగాణా ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నైపుణ్యం ఉన్న ఇంజనీరింగ్ మానవ వనరులు, పటిష్టమైన డిజిటల్ మౌలిక వ్యవస్థ, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, వేగంగా విస్తరిస్తున్న తయారీ రంగం, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి జీసీసీలకు అగ్రగామి గమ్యస్థానంగా తీర్చిదిద్దామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. డిజైన్, ఇంజినీరింగ్, ప్రోటోటైపింగ్, తయారీ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా అధునాతన ఇంజినీరింగ్, డిజిటల్ తయారీ సాంకేతికతలు, ఉత్పత్తి అభివృద్ధి రంగాల్లో విస్తృత కార్యకలాపాలు సాగనున్నాయని తెలిపారు. దీంతో హైదరాబాద్ హై వ్యాల్యూ తయారీ రంగంలో మరింత శక్తివంతంగా ఎదుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రోటోల్యాబ్స్ రాకతో స్థానిక స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు), పెద్ద పరిశ్రమలకు ప్రోటోటైపింగ్ తయారీ సదుపాయాలు స్థానికంగా అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి మరింత వేగంగా తీసుకురావడానికి ఇది దోహదపడుతుందని వివరించారు. చైనాపై ఆధారపడే అవసరం తగ్గిపోతుందని చెప్పారు. ప్రోటోల్యాబ్స్ ప్రతినిధి బృందంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డాన్ షూమాకర్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అగ్నెస్ సెమింగ్టన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ కెర్మిష్, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ శర్మ ఉన్నారు. సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ కూడా పాల్గొన్నారు.

మన తెలంగాణ 17 Apr 2026 4:00 am

అనర్హత కేసులో స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఏల అనర్హతపై దాఖలయిన పిటిషన్లపై లోతయిన విచారణ అవసరమని హై కోర్టు చీఫ్ జస్టిస్ ఎ.కె.సింగ్ ధర్మాసనం పేర్కొంది. పార్టీ మారలేదని స్పీకర్ గతంలో ప్రకటించిన 9 మంది ఎంఎల్‌ఏలతో పాటు స్పీకర్ కూడా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తమ వాదనలతో కూడిన కౌంటర్‌ను దాఖ లు చేయాలని స్పష్టం చేసింది. బిఆర్‌ఎస్ నుంచి 9మంది ఎంఎల్‌ఏలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్లను లోతయిన, సుదీర్ఘ విచారణ అవసరమని ధర్మాసనం భావిస్తున్నట్లు చెప్పింది. ఈ వ్యవహారంలో స్వయంగా స్పీకర్ కూడా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించి, తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా, దా నం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య,ప్రకాష్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి (సంజయ్), తెల్లం వెంకట్రావులు గతంలో బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరినా ఈ ఎమ్మెల్యేలు సాంకేతికంగా పార్టీ మారలేదని, వారు ఇంకా బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారనే అర్థం వచ్చేలా స్పీకర్ తీర్పునిచ్చారు. అయితే, వారు బహిరంగంగానే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, స్పీకర్ నిర్ణయం ఏకపక్షంగా ఉందని పేర్కొంటూ బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.

మన తెలంగాణ 17 Apr 2026 3:30 am

శుక్రవారం రాశి ఫలాలు (17-04-2026)

మేషం బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభం కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. కీలక విషయాలలో అలోచించి ముందుకు సాగాలి. మిధునం అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారములలో నష్ట సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. కర్కాటకం వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సింహం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి. కన్య కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు ఋణాలు తీర్చగలుగుతారు. తుల గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వృశ్చికం కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని పనులు అనుకూలంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనస్సు మొండి బాకీలు వసూలు అవుతాయి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటరు. వృత్తి,ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మకరం ఇతరులతో అలోచించి మాట్లాడటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. కుంభం నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. మీనం వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయట పడతారు. ఆర్ధిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.  

మన తెలంగాణ 17 Apr 2026 12:20 am

భారత మహిళలకు మూడో స్థానం

 ప్రతిష్టాత్మక ఫిఫా సిరీస్ 2026 పోటీల్లో భారత మహిళా ఫుట్‌బా జట్టు మూడో స్థానం సొంతం చేసుకుంది. కెన్యా రాజధాని నైరోబి వేదికగా ఈ పోటీలు జరిగాయి. కాగా, కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత్ 32 గోల్స్ తేడాతో మలావి టీమ్‌ను ఓడించింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో భారత్ అద్భుత విజయం సాధించింది. 18వ నిమిషంలో అస్టమ్ ఒరావన్, 46వ నిమిషలంలో అవేక సింగ్ గోల్స్ నమోదు చేశారు. 80వ నిమిషలో ప్రియదర్శిని భారత్‌కు మూడో గోల్ సాధించి పెట్టింది. ఇదిలావుంటే మలావి తరఫున ఇరీన్ (42), హెన్రీ డెబొరా (60)వ నిమిషంలో గోల్స్ సాధించారు.

మన తెలంగాణ 16 Apr 2026 11:34 pm

లెబనాన్ పాపం చేసినట్లే: హెజ్‌బోల్లా

 ఇజ్రాయెల్‌తో లెబనాన్ ప్రభుత్వ ప్రత్యక్ష చర్చలు పాపం అంతకు మించి ఘోర తప్పిదం అని హెజ్‌బోల్లా అధినేత హుస్సేన్ హాజ్ హస్సన్ గురువారం స్పందించారు. లెబనాన్, ఇజ్రాయెల్ పది రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయనే ట్రంప్ ప్రకటనపై ఆయన స్పందించారు. ఇజ్రాయెల్ దారుణ యుద్ధ నేరాలకు , అంతకు మించి అఘాయిత్యాలకు పాల్పడింది. ఇందుకు బదులుగా లెబనాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు భారీ రాయితీలు ప్రకటించడం యుద్ధాన్ని మించిన నేరం అని వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రజల శత్రువుపై ఔదార్యం అంతకు మించి ఆదరణ చూపడం క్షమించరాని నేరం అన్నారు. తమ పార్లమెంటరీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అమెరికా కోరికలకు అనుగుణంగా, ట్రంప్ పొగడ్తలకు ఆశపడి ఈ విధంగా వ్యవహరించారని విమర్శించారు.

మన తెలంగాణ 16 Apr 2026 11:23 pm

భార్యకు తగు భరణం భర్త బాధ్యత: సుప్రీంకోర్టు

జీవిత భాగస్వామి నిర్వహణ భర్తకు ఉన్న ప్రాధమిక, నిరంతర బాధ్యత అని సుప్రీంకోర్టు గురువారం తేల్చిచెప్పింది. భార్య గౌరవప్రదంగా సమాజంలో తలెత్తుకుని జీవించే విధంగా భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఇది భర్త ఉండే బాధ్యత , ఇందులో వేరే ప్రశ్నకు తావులేదని తేల్చిచెప్పారు. న్యూఢిల్లీలో 2023లో భార్యాభర్తలు అయిన దంపతుల కేసులో న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ఆగస్టీన్ జార్జి మాసిహ్‌తో కూడిన ధర్మాసనం స్పందించింది. భార్యకు భార్య నుంచి నెలవారి ఖర్చులను ఇప్పుడున్న రూ 15000 నుంచి రూ 25000కు పెంచింది. అయితే ఈ నిర్వహణకు అయ్యే మొత్తం ఖరారు అనేది సముచిత రీతిలో ఉండాలి. ఆమె గౌరవప్రదంగా ఉండేలా చూసుకోవల్సి ఉంటుంది. అయితే ఇదే క్రమంలో ఆయనకు శక్తికి మంచిన భారం మోపేలా ఈ నిర్వహణ మొత్తం ఉండరాదని స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 16 Apr 2026 11:20 pm

ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య 10 రోజుల సంధి..

వాషింగ్టన్: ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గురువారం తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. లెబనాన్ అధ్యక్షులు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ మధ్య చర్యలు అత్యద్భుతంగా జరిగాయి. ఫలితంగా కాల్పుల విరమణ నిర్ణయానికి వచ్చారని ట్రంప్ తెలిపారు. లెబనాన్ ప్రభుత్వానికి , ఇజ్రాయెల్‌కు మధ్య 34 ఏండ్ల వ్యవధి తరువాత జరిగిన చర్చలు ఫలించడం కీలకమని ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది దౌత్యపరంగా అత్యంత కీలక పరిణామం అన్నారు. కాల్పుల విరమణ తక్షణం అమలులోకి వచ్చిందని తెలిపారు. అయితే ఈ చర్చల గురించి ఇజ్రాయెల్ నుంచి కానీ హెజ్‌బోల్లా నుంచి కానీ ఎటువంటి నిర్థారణ వెలువడలేదు. ఈ రెండు పక్షాల మధ్యనే ఇప్పుడు నిత్య సమరం సాగుతోంది. 

మన తెలంగాణ 16 Apr 2026 11:19 pm

పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన ముంబయి..

ఐపిఎల్ 2026లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు, ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్, 3.3 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించింది. ఓపెనర్ ప్రభు సిమ్రాన్ సింగ్(80 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(66)లు భారీ అర్ధ శతకాలతో రాణించారు. దీంతో పంజాబ్ జట్టు 16.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో ముంబయిపై పంజాబ్ ఏడు వికెట్లతో గెలుపొందింది. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. శార్దుల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. కాగా, పంజాబ్ కు వరుసగా నాలుగో విజయం ఇది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(110 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. డికాక్ తోపాటు నమన్ ధీర్(50) అర్ధశతకంతో రాణించాడు. ర్యాన్‌ రికెల్టన్‌(2), హార్దిక్ పాండ్యా(14), రూథర్ ఫోర్డ్(1)లు విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా..జాన్సెన్, శశాంక్ సింగ్ లకు చెరో వికెట్ దక్కింది

మన తెలంగాణ 16 Apr 2026 11:16 pm

బిజెపి ఎంపి తేజస్విపై చర్యలు తీసుకోవాలి: పొన్నం ప్రభాకర్

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్‌లో తెలంగాణ విభజన పై భారత్ పాకిస్థాన్ తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి తేజస్వి సూర్య పై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం డిజిపికి లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటు అనేది ఇక్కడి ప్రజల న్యాయమైన ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, ఒక ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఫలితంగా జరిగిందని ఆయన తెలిపారు. దీనిని భారతదేశపు బాధాకరమైన, హింసాత్మక విభజనతో పోల్చడం ఆ ప్రక్రియ పవిత్రతను తగ్గించడమే కాక, తెలంగాణ ప్రజల మనోభావాలను విస్మరించినట్లు అవుతుందని మంత్రి అన్నారు. ఇలాంటి ప్రకటనలు ప్రజా సామరస్యాన్ని దెబ్బతీయడానికి, ప్రాంతీయ కలహాలను పెంచడానికి, చారిత్రక, రాజ్యాంగ వాస్తవాలను వక్రీకరించడానికి అవకాశం ఉందని మంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, ప్రజా శాంతి, సామరస్యాలను కాపాడటానికి, ఈ విషయాన్ని పరిశీలించి, చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిజిపిని కోరారు.

మన తెలంగాణ 16 Apr 2026 10:37 pm

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଇରାନ ଏବଂ ଆମେରିକାକୁ ନେଇ ସାମ୍ବାଦିକଙ୍କ ଭାଇରାଲ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ

ଆମେରିକା ଏବଂ ଇରାନ ମଧ୍ୟରେ ଆଲୋଚନା ବିଫଳ ହୋଇଛି। ଆଲୋଚନା ନିର୍ଣ୍ଣାୟକ ନହେବା ପାଇଁ ଆମେରିକାକୁ ଇରାନ ଦାୟୀ କରିଛି। ଇରାନର ସରକାରୀ ଖବର ପ୍ରେସ ଟିଭି କହିଛି ଯେ, ଆମେରିକା ଅନେକ ଦାବି ଏବଂ ସର୍ତ୍ତ ରଖିଥିବାରୁ ଆଲୋଚନା ଆଗକୁ ବଢ଼ିପାରିଲା ନାହିଁ। ଅପରପକ୍ଷରେ ଆମେରିକାର ଉପ-ରାଷ୍ଟ୍ରପତି ଜେଡି ଭାନ୍ସ କହିଛନ୍ତି, ଆମେ ଇରାନ ସହିତ ଅନେକ ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ ଆଲୋଚନା କରିଛୁ। ଏହା ଏକ ଭଲ ଖବର। ଖରାପ ଖବର ହେଉଛି ଯେ, ଆମେ କୌଣସି ଚୁକ୍ତିରେ ପହଞ୍ଚି ନାହୁଁ। ମୁଁ ଭାବୁଛି ଏହା ଆମେରିକା ଅପେକ୍ଷା ଇରାନ ପାଇଁ ଅଧିକ ଖରାପ ଖବର। ଇରାନ କହିଛି,ଆମେରିକା ବିଭିନ୍ନ ଦାବି କରିଥିଲା। ଫଳରେ କୌଣସି ନିଷ୍ପତ୍ତି ହୋଇପାରିଲା ନାହିଁ। ହର୍ମୁଜ୍ ପ୍ରଣାଳୀ, ପରମାଣୁ ଅଧିକାର ଏବଂ ଅନ୍ୟାନ୍ୟ ପ୍ରସଙ୍ଗ ଆଲୋଚନା ବିଫଳତାର କାରଣ। ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭିଡିଓରେ ଗୋଟିଏ ଷ୍ଟୁଡିଓ ଭିତରେ ଦୁଇଜଣ ଖବର ଉପସ୍ଥାପନା କରୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉଭୟଙ୍କ ମଧ୍ୟରୁ ଜଣେ ପୁରୁଷ ଉପସ୍ଥାପକ କହୁଛନ୍ତି, ପାକିସ୍ତାନ ଇରାନ ଏବଂ ଆମେରିକା ମଧ୍ୟରେ ଚାଲିଥିବା ଯୁଦ୍ଧକୁ ଅଟକାଇଦେଇଛି । ଯାହାକି ସାରା ବିଶ୍ୱକୁ ଅଟକାଇ ଦେଇଛି । ଏହା ଆମର ପାଇଁ ଏକ ସୁଭସଙ୍କେତ ନୁହେଁ କି ବିଜୟ ମଧ୍ୟ ନୁହେଁ । View this post on Instagram A post shared by The Daily Inside (@thedailyinside) ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ । ଦାବିର ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏଭଳିକୌଣସି ଘଟଣା ଘଟିଥିବାର ପାଇନଥିଲୁ । ଅଳ୍ପକିଛି ଫେକ୍ ଆକାଉଣ୍ଟ ଏବଂ କିଛି କଣ୍ଟେଣ୍ଟ କ୍ରିଏଟର ଉକ୍ତ ଭିଡିଓ କୁ ସେୟାର କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ସେହିପରି ଭାଇରାଲ ଭିଡିଓକୁ ସଠିକ ଭାବେ ଯଦି ତର୍ଜମା କରି ଆପଣ ଦେଖିବେ ଉକ୍ତ ଭିଡିଓରେ ଚ୍ୟାନେଲର ନାଁ ଟି ସଠିକ ଭାବେ ଦିଶୁନାହିଁ । ସେହିପରି ଭିଡିଓରେ ଏକାଧିକ ତ୍ରୁଟି ଦେଖା ଯାଉଛି ଯେପରିକି, ଉପସ୍ଥାପକଙ୍କ ପଛପଟେ ଲାଗିଥିବା ଏଲ ସିଡିରେ ଡିବେଟ ଲେଖାଟି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ଭୁଲ୍ ରହିଛି । ଗୋଟିଏ କୋଣରେ ଥିବା ଗ୍ରାଫିକ୍ସରେ ଇଣ୍ଡିଆ ଲେଖା ହୋଇଥିବା ବେଳେ ତା ତଳେ ହିନ୍ଦୀରେ କିଛି ଲେଖା ହୋଇଛି ଯାହାର କୌଣସି ଅର୍ଥ ମଧ୍ୟ ଆସୁନାହିଁ । ତା ନିକଟରେ ଥିବା ଗ୍ରାଫିକ୍ସସରେ ମଧ୍ୟ ହିନ୍ଦୀରେ ଯାହା ଲେଖା ହୋଇଛି ତାହା ମଧ୍ୟ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭୁଲ୍ ଅଛି । ଯେତେବେଳେ ଚେୟାରରୁ ଉପସ୍ଥାପକ ଜଣଙ୍କ ଉଠି ଯାଉଛନ୍ତି କିଛି ସମୟ ପରେ ଉକ୍ତ ଚେୟାରଟି ଟ୍ରାନ୍ସପରେଣ୍ଟ ହୋଇଯାଉଛି । ଯାହାକି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ଅସମ୍ଭବ । ଅନ୍ୟପଟେ ଉପସ୍ଥାପକ ଜଣଙ୍କ ଯେତେବେଳେ ରାଗିକି ପେପରକୁ ଫିଙ୍ଗି ଦେଉଛନ୍ତି ତାହା କିଛି ସମୟ ପରେ ଏକ ପ୍ଲାଷ୍ଟିକ ପ୍ଲେଟ ପରି ଦୃଶ୍ୟମାନ ହେଉଛି । ପାଖରେ ବସିଥିବା ମହିଳା ଜଣଙ୍କ ଏତେ ମାତ୍ରାରେ କୌଣସି ପ୍ରତିକ୍ରିୟା ଦେଖିବାକୁ ମିଳୁନାହିଁ  ଅନୁମାନ କରାଯାଏ ଯେ ଉକ୍ତ ଭିଡିଓଟି କୌଣସି ମତରେ ଏଡିଟ ହୋଇଥାଇ ପାରେ । ଅଧିକ ତଦନ୍ତ କରିବାକୁ ଯାଇ ଭାଇରାଲ ଭିଡିଓର ଏକ ଅଂଶକୁ ନେଇ ହାଇଭ ମଡରେସନ ଟୁଲ୍ ରେ ପରୀକ୍ଷା କରିଥିଲୁ । ପରୀକ୍ଷାରୁ ଉକ୍ତ ଭିଡିଓଟି ୬୬.୯ % ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ରିପୋର୍ଟ ପ୍ରକାଶ ପାଇଥିଲା । ସେହିପରି ସେହି ଭିଡିଓକୁ ଲାଇକଲି ଏଆଇ ଡିଟେକଟିଭ ଟୁଲ୍ ଯୋଗେ ପରୀକ୍ଷା କରିଥିଲୁ । ପରୀକ୍ଷାରୁ ଉକ୍ତ ଭିଡିଓଟି ୭୨% ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ହୋଇଥାଇପାରେ ବୋଲି ରିପୋର୍ଟ ପ୍ରକାଶ ପାଇଥିଲା । ଓଡ଼ିଶାର ଜଣେ କାର୍ଯ୍ୟରତ ସାମ୍ବାଦିକ ତପନ ଦାସ ଉକ୍ତ ଭିଡିଓକୁ ସେୟାର କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଯେଉଁଥିରେ ଉକ୍ତ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ହୋଇଥାଇପାରେ ବୋଲି ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି । ଯେଉଁଥିରେ ଏକାଧିକ କମେଣ୍ଟରେ ଏହା ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ବିଭିନ୍ନ ୟୁଜର୍ସ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଭାଇରାଲ ଭିଡିଓ ଏବଂ ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ କ୍ଲିପଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ଅଟେ । 

తెలుగు పోస్ట్ 16 Apr 2026 10:34 pm

తెలంగాణ ఏర్పాటుపై బిజెపి విషం: కెటిఆర్

పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్-, పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత, తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బిజెపి నాయకులు పదేపదే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ నుంచి ఈరోజు పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకతను పదేపదే చాటుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు పైన విషం కక్కుతూ బిజెపి చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటుందన్నారు. తెలంగాణ అనేది ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, ఎవరి భిక్ష వల్లనో ఏర్పడింది కాదని కెటిఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాల పోరాట ఫలితం: హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితమని, అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బిజెపి ఎంపి తేజస్వి సూర్య వాఖ్యలు హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలు అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమేనన్నారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పాటయిన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలవడాన్ని బిజెపి తట్టుకోలేకపోతుందనడానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 

మన తెలంగాణ 16 Apr 2026 10:30 pm

రాజ్యసభ సభ్యునిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం

 బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్, సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ సంఘ్వీ, మరో 13 మంది కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి , రాజ్యసభ ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ బీహార్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణలకు చెందిన మొత్తం 16 మంది నూతన ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ 16 మందిలో ఎనిమిది మంది బీజేపీకి చెందిన వారు కాగా, ముగ్గురు బీజేపీ మిత్ర పక్షాల వారు. మిగతా ఐదుగురు ఎంపీలు కాంగ్రెస్‌కు చెందినవారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా నబీన్ ఎన్నికైన తరువాత బీహార్ శాసనసభకు రాజీనామా చేసి రాజ్యసభకు ఎంపీ అయ్యారు. అధికార సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ఆయన హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. బీహార్ నుంచి తిరిగి ఎన్నికైన కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఉపేంద్ర కుష్వాహా (ఆర్‌ఎల్‌ఎం), శివేష్ కుమార్ (బీజేపీ) కూడా బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు . అస్సాంకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెరాష్ గోవల్లా (బీజేపీ) , జోగెన్ మోహన్ (బీజేపీ) ప్రమోద్‌బోరో (యుపిపిఎల్) ప్రమాణస్వీకారం చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లక్ష్మీవర్మ (బీజేపీ) ,ఫూలోదేవి నేతమ్ (కాంగ్రెస్) , హర్యానా ఎంపీలైన కరమ్‌వీర్ సింగ్ బౌధ్ ’( కాంగ్రెస్ ) ,సంజయ్ భాటియా (బీజేపీ) ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సంఘ్వీ, వేమ్ నరేంద్రరెడ్డి, ఈ ఇద్దరూ కాంగ్రెస్ ఎంపీలే. ఒడిసా ఎంపి సుజీత్ కుమార్ ’(బీజేపీ) హిమాచల్ ప్రదేశ్ ఎంపీ అనురాగ్‌శర్మ(కాంగ్రెస్) ప్రమాణస్వీకారం చేశారు. 

మన తెలంగాణ 16 Apr 2026 10:20 pm

షా తెలివికి చాణక్యుడికే షాక్ ః ప్రియాంక గాంధీ

 మహానుభాడు చాణక్యుడు బతికి ఉంటే, ఈ సభకు వచ్చి ఉంటే మీ వక్రబుద్ధికి కంగుతిని పోయి ఉండేవాడని కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ లోక్‌సభలో చురకలకు దిగారు. హోం మంత్రి అమిత్ షాను ఉద్ధేశించి ఆమె స్పందించారు. కేంద్రం డిలిమిటేషన్ బిల్లు, మహిళా కోటా పెంపుదల జోడిస్తూ తీసువచ్చిన బిల్లులపై చర్చలో ప్రియాంక పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును సమర్థిస్తుంది. అయితే ఈ బిల్లు వెనుక రాజకీయ దురుద్ధేశాలను వ్యతిరేకిస్తుంది. మొత్తం మీద ఎన్నికలలో రాజకీయ ట్రంప్ కార్డు మాదిరిగా ఈ బిల్లును వాడుకుంటున్నందుకు చివరికి చాణుక్యుడు అయినా విస్తుపోయి తీరాల్సిందే అని అమిత్ షాను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. దీనికి అమిత్ షాతో పాటు బిజెపి, మిత్రపక్షాల ఎంపిలు చిరునవ్వులు చిందించారు. ప్రియాంక కూడా నవ్వుతూనే ఘాటుగా విమర్శలకు దిగారు. రాజకీయ ఎత్తుగడలతో సభకు విజెపి వారు బాగా సిద్ధం అయి వచ్చినట్లు ఉందని స్పందించారు. ఆడవారికి ఎవరు నిజాలు చెపుతున్నారో, ఎవరు అసత్యాలకు దిగుతారో అన్ని తెలుసునని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 16 Apr 2026 10:10 pm

34 ఏండ్లలో అపూర్వం ః ట్రంప్

 ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గురువారం తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. లెబనాన్ అధ్యక్షులు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ మధ్య చర్యలు అత్యద్భుతంగా జరిగాయి. ఫలితంగా కాల్పుల విరమణ నిర్ణయానికి వచ్చారని ట్రంప్ తెలిపారు. లెబనాన్ ప్రభుత్వానికి , ఇజ్రాయెల్‌కు మధ్య 34 ఏండ్ల వ్యవధి తరువాత జరిగిన చర్చలు ఫలించడం కీలకమని ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది దౌత్యపరంగా అత్యంత కీలక పరిణామం అన్నారు. కాల్పుల విరమణ తక్షణం అమలులోకి వచ్చిందని తెలిపారు. అయితే ఈ చర్చల గురించి ఇజ్రాయెల్ నుంచి కానీ హెజ్‌బోల్లా నుంచి కానీ ఎటువంటి నిర్థారణ వెలువడలేదు. ఈ రెండు పక్షాల మధ్యనే ఇప్పుడు నిత్య సమరం సాగుతోంది. 

మన తెలంగాణ 16 Apr 2026 10:00 pm

రిజర్వేషన్లతో.. లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు: మేఘ్వాల్

 లోక్‌సభ సభ్యుల సంఖ్యను 815కు పెంచి, అందులో 272 స్థానాలను మహిళలకు కేటాయించనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం వెల్లడించారు. ఈ మహిళా రిజర్వేషన్ అమలుతో పురుషులకు గానీ, ఏ రాష్ట్రానికి గానీ ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. మహిళల రిజర్వేషన్ చట్టంలో సవరణలు చేయడం, డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై లోక్‌సభలో ప్రారంభ ప్రసంగం చేస్తూ, మొత్తం స్థానాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించే సులభ సూత్రం ప్రకారం 272 స్థానాలు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రతిపాదిత చట్టాల ప్రకారం ప్రస్తుత లోక్‌సభ బలం కంటే సుమారు 50 శాతం పెరగనుంది. మహిళల రిజర్వేషన్ అమలైన తరువాత పురుషులు గానీ, ఏ రాష్ట్రం గానీ నష్టపోరు అని ఆయన పునరుద్ఘాటించారు.లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభల్లో కూడా మహిళల కోటాలోనే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని మంత్రి తెలిపారు. ‘నారి శక్తి వందన్ అధినియమ్ 2023’ ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగితే, 2026 తర్వాత లభించే జనగణన డేటా ఆధారంగా మాత్రమే నియోజకవర్గాల రిజర్వేషన్ సాధ్యమవుతుందని, అందువల్ల 2029 ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్ అమలు కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకువచ్చామని తెలిపారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు తగిన హక్కులు కల్పించడమే ప్రధాన లక్ష్యం అని మేఘ్వాల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఓటు హక్కులు భారతదేశంతో పోలిస్తే ఆలస్యంగా వచ్చినట్టు మేఘ్వాల్ చెప్పారు. అమెరికాలో పురుషులకు ఓటు హక్కు వినియోగించుకున్న144 సంవత్సరాల తరువాత మహిళలకు ఓటు హక్కు లభించిందని, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 1918లో కొన్ని షరతులతో, 1928లో పూర్తిస్థాయిలో మహిళలకు ఓటు హక్కు కల్పించారని వివరించారు. భారతదేశంలో మాత్రం తొలి ఎన్నికల నుంచే మహిళలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు లభించింది అని అన్నారు. ఈ బిల్లుకు అన్ని పార్టీలు, సభ్యులు పూర్తి మద్దతు ఇవ్వాలని మెఘ్వాల్ కోరారు. లోక్‌సభ గురువారం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు 2026, డీలిమిటేషన్ బిల్లు 2026లను చర్చించి ఆమోదం కోసం తీసుకుంది. సుమారు 40 నిమిషాల తీవ్ర చర్చ అనంతరం బిల్లులు ప్రవేశపెట్టగా, రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. తరువాత జరిగిన ఓటింగ్‌లో 251 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా, 185 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు ప్రవేశపెట్టబడింది. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ప్రకారం, 2011 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి, 2029 లోక్‌సభ ఎన్నికలకన్నా ముందే మహిళల రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచనున్నారు. అదేవిధంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు స్థానాల సంఖ్యను పెంచుతారు. మహిళలకు కేటాయించిన స్థానాలు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విభిన్న నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిలో కేటాయించబడతాయని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రాజ్యాంగ సవరణ బిల్లులోని డీలిమిటేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా ఓటు వేయాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. అయితే శాసనసభల్లో మహిళల రిజర్వేషన్‌కు తాము వ్యతిరేకం కాదని అవి స్పష్టం చేశాయి.

మన తెలంగాణ 16 Apr 2026 9:50 pm

SRH అభిమానులకు గుడ్ న్యూస్..

సిడ్నీ: ఐపిఎల్‌లో ఆడేందుకు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ పాట్ కమిన్స్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. కొంత కాలంగా ఫిట్‌నెస్ సమస్యను ఎదుర్కొంటున్న కమిన్స్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. అతను ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ అయ్యాడు. దీంతో ఐపిఎల్ ఆడేందుకు అడ్డంకులు తొలగి పోయాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు కమిన్స్ సారథిగా ఉన్న సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్ సమస్య తలెత్తడంతో కమిన్స్ ప్రస్తుతం ఐపిఎల్‌కు దూరంగా ఉన్నాడు. కాగా, వైద్య పరీక్షల్లో పాస్ కావడంతో హైదరాబాద్ బయలుదేరి రానున్నాడు. త్వరలోనే కమిన్స్ సన్‌రైజర్స్ టీమ్‌లో చేరే అవకాశాలున్నాయి. హైదరాబాద్ చేరిన సిఎస్‌కె టీమ్ ఐపిఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గురువారం నగరానికి చేరుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సిఎస్‌కె జట్టుకు ఘన స్వాగతం లభించింది. చెన్నై శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడనుంది. సిఎస్‌కె సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. కాగా, తమ ఆరాధ్య క్రికెటర్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. దీంతో విమానాశ్రయం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. కాగా, సిఎస్‌కె టీమ్ రాక నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే సిఎస్‌కె జట్టు శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో సాధన చేయనుంది.

మన తెలంగాణ 16 Apr 2026 9:49 pm

డీలిమిటేషన్‌లో దక్షిణానికి నష్టం లేదు.. 50% పెంపుతో లాభమే: బీజేపీ ఎంపీ

 డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు స్థానాలు తగ్గుతాయనే ఆందోళనల మధ్య, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఈ ప్రక్రియ దక్షిణాదికి నష్టాన్ని కాకుండా లాభాన్నే కలిగిస్తుందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకూ సమానంగా 50 శాతం సీట్ల పెంపు చేయనున్నందున దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తరువాత హోంమంత్రి అమిత్ షా కూడా తన ప్రసంగంలో హామీ ఇచ్చారు. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా సూర్య మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాల ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయి. జనాభా నియంత్రణలో మెరుగ్గా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఈ బిల్లు ఉత్తమమైన అవకాశమని అన్నారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం కేంద్రం మూడు బిల్లులను ప్రవేశపెట్టిన నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లు కీలక వివాదంగా మారింది. ఈ బిల్లు ప్రకారం 2011 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఈ ప్రక్రియతో లోక్‌సభ సీట్ల సంఖ్య 543 నుంచి సుమారు 850కి (రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35) పెరగనుంది. వీటిలో 273 సీట్లు మహిళలకు కేటాయించబడతాయి. దక్షిణ రాష్ట్రాల ప్రధాన ఆందోళన ఏమిటంటే, జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే ఉత్తర భారత రాష్ట్రాలకు ఎక్కువ లాభం చేకూరుతుందని.. జనాభా నియంత్రణలో ముందంజలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలు తమ వాటాను కోల్పోతామని భావిస్తున్నాయి. దీని వల్ల పార్లమెంట్‌లో తమ ప్రభావం, అలాగే పన్నుల పంపిణీలో వాటా తగ్గే ప్రమాదం ఉందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ వంటి ఆరు రాష్ట్రాలు కలిపి దేశ జనాభాలో సుమారు 24 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఈ ఆందోళనలను తేజస్వి సూర్య కొట్టిపారేస్తూ, అన్ని రాష్ట్రాలకు ప్రస్తుత వాటా ప్రకారం సమానంగా 50 శాతం సీట్ల పెంపు ఉంటుందని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(2) ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ పనిచేస్తుంది. అందువల్ల ప్రతి రాష్ట్రానికి దాదాపు 50 శాతం అదనపు సీట్లు ఇవ్వడం మాత్రమే సాధ్యమైన మార్గం అని ఆయన చెప్పారు. కర్ణాటక ఉదాహరణగా అమిత్ షా వివరించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి 28 లోక్‌సభ సీట్లు ఉండగా, కొత్త బిల్లుతో అవి 42కు పెరుగుతాయని చెప్పారు. మొత్తం 816 స్థానాల్లో కర్ణాటక వాటా దాదాపు మారకుండా ఉంటుందని, అందువల్ల వాస్తవంగా ఎలాంటి నష్టం ఉండదని పేర్కొన్నారు. ఈ 50 శాతం సూత్రం ప్రకారం దక్షిణ రాష్ట్రాలకు లభించే సీట్లు ఇలా ఉండే అవకాశముంది: తమిళనాడు: ప్రస్తుతం 39 సీట్లు సుమారు 59 సీట్లు కేరళ: ప్రస్తుతం 20 సీట్లు సుమారు 30 సీట్లు ఆంధ్రప్రదేశ్: ప్రస్తుతం 25 సీట్లు సుమారు 37 సీట్లు ఒడిశా: ప్రస్తుతం 21 సీట్లు సుమారు 31 సీట్లు తెలంగాణ: ప్రస్తుతం 17 సీట్లు సుమారు 25 సీట్లు కర్ణాటక: ప్రస్తుతం 28 సీట్లు సుమారు 42 సీట్లు మొత్తంగా చూస్తే, 2011 జనగణన ఆధారంగా లెక్కిస్తే.. సూత్రం ద్వారా దక్షిణ రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెరిగే అవకాశముందని కేంద్రం వాదిస్తోంది.

మన తెలంగాణ 16 Apr 2026 9:48 pm

సైనిక సంఘర్షణ.. సమస్యలను పరిష్కరించలేదు: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : పశ్చిమాసియా, ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పడుతోందని, ప్రధాని నరేంద్రమోడీ ఆందోళన వెలిబుచ్చారు. ఈ దేశాల్లో సుస్థిర ,సుదీర్ఘ శాంతికి పిలుపునిచ్చారు. ఆస్ట్రియన్ ఛాన్సెలర్ క్రిస్టియన్ స్టాకర్‌తో కలిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. “ కొన్ని దేశాల యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కోవాల్సివస్తోంది. ఆ ప్రభావం మనందరిపై పడుతోంది. ఈ సైనిక సంఘర్షణలకు ఇంకా పరిష్కారం లభించలేదు. అది ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా శాశ్వత శాంతి, సుస్థిరత కావాలని కోరుకుంటున్నాం. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంస్కరణలు చేపట్టాలి. ఇందుకోసం ఉగ్రవాదాన్ని పారదోలడం ఎంతైనా అవసరం ” అని మోడీ పేర్కొన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత ఆస్ట్రియా ఛాన్సెలర్ రాకతో భారత్‌లో వాణిజ్య, పెట్టుబడుల రంగంలో నూతనోత్సాహం మొదలైందని మోడీ తెలిపారు. భారత్ ఈయూ మధ్య కొత్త ఒప్పందాలతో సువర్ణాధ్యాయం ప్రారంభం కాగలదని పేర్కొన్నారు. ఆస్ట్రియా ఛాన్సెలర్ పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. 

మన తెలంగాణ 16 Apr 2026 9:33 pm

సెంచరీతో చెలరేగిన డికాక్.. పంజాబ్ కు భారీ టార్గెట్

ఐపిఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(110 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ స్టేడియంలో ప్రేక్షకులను అలరించాడు. డికాక్ తోపాటు నమన్ దీప్(50) అర్ధశతకంతో రాణించాడు. ర్యాన్‌ రికెల్టన్‌(2), హార్దిక్ పాండ్యా(14), రూథర్ ఫోర్డ్(1)లు విఫలమయ్యారు. దీంతో ముంబై 200 మార్కో స్కోరును చేరుకోలేకపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా..జాన్సెన్, శశాంక్ సింగ్ లకు చెరో వికెట్ దక్కింది.

మన తెలంగాణ 16 Apr 2026 9:30 pm

బాహుబలి, అవతార్ సినిమాల్లా ’రావు బహదూర్’ మైమరపిస్తుంది

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్... వెంకటేష్ మహా దర్శకత్వంలో, సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న ’రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా అందిస్తోంది. ఈ చిత్రాన్ని ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ’ఓ సుందరి’ని రిలీజ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ “మహేష్ బాబు, నమ్రత కథ విని ఓకే చెప్పగానే మేము ఈ సినిమాను మొదలుపెట్టాం. గోపాలకృష్ణ రావడంతో పని ఇంకా సులభమైంది. ఈ సినిమా కోసం సత్య ప్రతిరోజూ ఐదు గంటల పాటు మేకప్ వేసుకునేవారు. ఈ పాత్ర కోసం 30 టేకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీప ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. ఆమె పాత్ర గుర్తుండిపోతుంది. స్మరణ్ సాయి సంగీతం సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ‘ఓ సుందరి’ పాట దానికి నిదర్శనం. ఈ సినిమా అందరికీ మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తుందని నమ్ముతున్నాను”అని అన్నారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ “ఓ సుందరి పాట వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నేను సినిమాలకు వచ్చిన కొత్తలో కమల్ హాసన్ లాంటి పాత్రలు ఎప్పుడైనా వస్తుందా అని అనుకునేవాడిని. ఒక రోజు వెంకటేష్ మహా ఈ కథ చెప్పారు. షూటింగ్ మొదటి రోజు ఉదయం మూడు గంటలకు సెట్‌లోకి వెళ్లి రాత్రి రెండు గంటల వరకు షూటింగ్ చేశాను. ఇలా ఐదు రోజులు గడిచాక టెన్షన్ వచ్చి ఇంకా ఎన్ని రోజులు ఇలా? అని అడిగాను. దాదాపు 85 రోజులు అని చెప్పారు. అప్పుడు నా పని అయిపోయింది అనుకున్నాను. అలాంటి సమయంలో ‘ఓ సుందరి’ పాట వినిపించారు. ఆ పాట మాకు డిటాక్స్‌లా అనిపించింది. ఈ పాట మహిళలు సెలబ్రేట్ చేసేలా ఉంటుంది. మా నిర్మాతలు ఇంత ఆనందంగా ఉన్నారంటే, దర్శకుడు మహా ఎంత అద్భుతంగా ఈ సినిమా తీశాడో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి, అవతార్ లాంటి సినిమాలు ఆ స్కేల్లో ఎలా అయితే మిమ్మల్ని కూర్చోబెట్టగలిగాయో మా రావు బహుదూర్ సినిమా కూడా మిమ్మల్ని అంతే స్థాయి లో అలరిస్తుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దీప థామస్, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, గోపాలకృష్ణారెడ్డి, స్మరణ్ సాయి, విజయ్ యేసుదాస్ పాల్గొన్నారు. 

మన తెలంగాణ 16 Apr 2026 9:20 pm

హైదరాబాద్ రావాల్సిన ఆకాశ విమానాన్ని ఢీకొన్న స్పైస్‌జెట్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో గురువారం పెను ప్రమాదం తప్పింది. రన్‌వే పై టాక్సీయింగ్ చేస్తున్న సమయంలో ఆకాశ ఎయిర్ , స్పైస్ జెట్‌కు చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. విమానాలు టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరేందుకు ఆకాశ ఎయిర్ విమానం రన్‌వేపై ఉంది. అదే సమయంలో పార్కింగ్‌వైపు ప్రయాణిస్తున్న స్పైస్‌జెట్ విమానం, ఆకాశ విమానాన్ని పక్కనుంచి తాకుతూ వెళ్లింది. ఈ ప్రమాదంలో స్పైస్‌జెట్ విమానం కుడివైపు రెక్కభాగం దెబ్బతినగా, పార్క్ చేసి ఉన్న ఆకాశ ఎయిర్ విమానం ఎడమవైపు భాగం దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు కానీ, సిబ్బందికి కానీ ఎలాంటి గాయాలు తగల లేదు. ఈ సంఘటనపై డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీవ్రంగా స్పందించింది. రన్‌వే పై విమానాల కదలికలో ఎక్కడ లోపం జరిగిందో దర్యాప్తునకు ఆదేశించింది. ఆకాశ ఎయిర్ అధికార ప్రతినిధి దీనిపై స్పందిస్తూ“ ఈ సంఘటనలో ప్రయాణికులు, సిబ్బందిని వెంటనే కిందకు దింపాం. వారి భద్రత మా ప్రథమ ప్రాధాన్యం. ప్రయాణికులను హైదరాబాద్ పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం ” అని వెల్లడించారు. 

మన తెలంగాణ 16 Apr 2026 9:06 pm

2023లో మద్దతిచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు కొర్రీలు పెడుతోంది: పురందేశ్వరి

న్యూఢిల్లీ: మహిళ రిజర్వేషన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని రాజమండ్రి లోక్‌సభ ఎంపి పురందేశ్వరి అన్నారు. గతంలో చాలాసార్లు బిల్లు పెట్టినా సాకారం కాలేదని, అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ మద్దతివ్వలేదని తెలిపారు. మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ఆమె మాట్లాడారు. రాజకీయాల్లో మహిళ పాత్ర పెరిగిందని గ్రహించాలన్నారు. ‘‘ఈ బిల్లు పాస్ కావడం మహిళల దశాబ్ధాల కల. 2023లో మద్దతిచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మాత్రం కొర్రీలు పెడుతోంది. జనగణన పేరుతో అభ్యంతరాలు చెబుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు మొట్టమొదట 1996లో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ మాత్రం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది’’ అని అన్నారు.

మన తెలంగాణ 16 Apr 2026 8:30 pm

లష్కరే కోఫౌండర్ ఆమిర్‌ హమ్జాపై కాల్పులు..

లాహోర్ : లష్కరే తయ్యిబా సహ వ్యవస్థాపకుడు ఆమిర్ హమ్జాపై గుర్తు తెలియని సాయుధులు కాల్పులు జరిపారు. లాహోర్ లోని ఓ న్యూస్ ఛానల్ ఆఫీస్ బయట ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని మీడియా కథనాలు వెల్లడించాయి. సిసిటివి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. 24 న్యూస్ హెచ్‌డి టివి అనే ప్రయివేట్ టివి ఛానల్ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన జస్టిస్ (రిటైర్డ్( నజీర్ అహ్మద్ ఘాజీ తోపాటు అమిర్ హమ్జా ప్రయాణిస్తున్న ఛానల్ వాహనంపై ఈ కాల్పులు జరిగాయి. ఘాజీ మాత్రం గాయపడకుండా తప్పించుకోగలిగారు. ఈ దాడిని పాకిస్థాన్ మర్కజి ముస్లిం లీగ్ తీవ్రంగా ఖండించింది. దాడులకు పాల్పడిన వారిని తక్షణం అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని లీగ్ కోరింది. ఆమిర్ హమ్జాను ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్‌లో జరిగిన ఉగ్ర కార్యకలాపాల్లో అతడి పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. 

మన తెలంగాణ 16 Apr 2026 8:28 pm

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి, ఈ క్రమంలో గురువారం రాష్ట్రంలో పది జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలంగాణ వెథర్ మ్యాన్ వెల్లడించారు. రాష్ట్రంలో విపరీతమయిన ఎండలకు జగిత్యాలలో అత్యధికంగా 44.4 డిగ్రీలు నమోదు కాగా, వరుసగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 44.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక మెదక్, సిరిసిల్ల 43.8, పెద్దపల్లి 43.6, ములుగు, నాగర్ కర్నూల్ 43.5, గద్వాల్, రంగారెడ్డి 43.1, నారాయణ పేటలో43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలంగాణ వెధర్ మ్యాన్ పేర్కొన్నారు. ఈ ఉష్ణోగ్రతలు మరో రెండు, మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని, దీంతో పాటు వడగాలలు వీస్తాయని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో సైతం బానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. హైదరాబాద్‌లో అత్యధికంగా ఆర్‌సి పురంలో 42.3, ఆసిఫ్‌నగర్, హిమాయత్ నగర్ 42 డిగ్రీలు నమోదు కాగా, 15 ప్రాంతాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలపైగా నమోదయ్యాయి. ఈ పరిస్ధితులు మరో మూడు రోజుల పాటు నగరంలో కొనసాగుతాయని వెధర్ మ్యాన్ పేర్కొన్నారు. దీని తొడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతాయని, ఎండలకు తోడు వడగాలులు వీస్తాయని 30 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండ వేడిని దృష్టిని ఉంచుకుని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మన తెలంగాణ 16 Apr 2026 8:27 pm

దైవదర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు

ఆధ్యాత్మిక యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. భక్తి పారవశ్యంతో రాఘవేంద్రుడి దర్శనం కోసం బయల్దేరిన ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. తెల్లవారు జామున ప్రశాంతంగా సాగుతున్న ప్రయాణాన్ని మృత్యువు లారీ రూపంలో కబళించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. భక్తులతో వెళ్తు న్న బొలెరో వాహనం, ఎదురుగా వస్తున్న రెడీమిక్స్ లారీ అత్యంత వేగంతో ఒకదాని కొకటి ఢీకొనడంతో క్షణాల్లో రక్తపాతం చోటు చేసుకుంది. కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన సుమారు 21 మంది భక్తులు మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి దర్శనం కోసం బొలెరో వాహనంలో బయల్దేరారు. గమ్యస్థానానికి చేరువవుతున్న సమయంలో చిలకలడోన వద్ద ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద దాటికి బొలెరో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఘటనాస్థలంలోనే ఐదుగురు ప్రాణాలు విడవగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు కన్ను మూశా రు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉండటం అందరినీ కలిచివేస్తోం ది. మరో 13 మంది తీవ్ర గాయాలతో ఎమ్మిగనూరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా భక్తుల హాహాకారాలతో దద్దరిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు యుద్ధ ప్రాతిపదికన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపటా ్టరు. వాహన శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన బాధితులను బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించారు. తెల్లవారుజాము న వెలుతురు సరిగ్గా లేకపోవడం, వాహనాల వేగం ఈ ఘోరానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పవిత్ర పుణ్య క్షేత్ర దర్శనానికి వెళ్తూ, గమ్యానికి కూతవేటు దూరంలో ఉండగా ఇలా విగతజీవులుగా మారడం చిక్‌మంగళూరులో ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. మృతులను కుమార్ (60), దీపిక వీణ (35), సునీల్ (40), బెల్లి (3), పుట్టమ్మ (60), మీనాక్షి (50), తాయమ్మ (60), లోలాక్షిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదస్థలాన్ని పరిశీ లించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బొలెరో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి ప్రాథమిక కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. ఘట నపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై ఎపి సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ఎపి మంత్రులు భరత్, జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్య సేవలు అందిం చాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. బాధితులకు పరిహారం ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

మన తెలంగాణ 16 Apr 2026 8:22 pm

ఉక్రెయిన్‌పై రష్యాదాడులు.. 16 మంది మృతి

కీవ్ : ఉక్రెయిన్ లోని పౌరనివాస ప్రాంతాలపై రష్యా వందలాది డ్రోన్లు, డజన్ల కొద్దీ బాలిస్టిక్,క్రూయిజ్ క్షిపణులతో డాడులు చేయడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడ్డారు. గత రెండు వారాల్లో ఇదే భారీ దాడిగా ఉక్రెయిన్ అధికారులు గురువారం వెల్లడించారు. రష్యా దాదాపు 700 డ్రోన్లు, డజన్ల కొద్దీ బాలిస్టిక్,క్రూయిజ్ క్షిపణులతో పౌర నివాస ప్రాంతాలనే లక్షంగా చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా రోజూ పౌర ప్రాంతాలపైనే రష్యా దాడులు సాగిస్తోందని, అప్పుడప్పుడు ఈ విధంగా భారీ దాడులకు పాల్పడుతోందని తెలిపారు. ఈ దాడుల్లో 15,000 మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. రష్యా క్షిపణుల దాడులను నివారించడానికి ఎక్కువ గగన రక్షణ వ్యవస్థలను సాధించడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈవారం జర్మనీ, నార్వే, ఇటలీ దేశాలకు పర్యటించిన నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఉక్రెయిన్ గగన రక్షణ వ్యవస్థకు మద్దతుగా ఈవారం కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకున్నందుకు జర్మనీ, నార్వే, ఇటలీ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు.కీవ్‌లో 12 ఏళ్ల చిన్నారితోసహా నలుగురు,ఒడిసాలో తొమ్మిది మంది, డినిప్రో ప్రాంతంలో ముగ్గురు మృతి చెందారు. ఉక్రెయిన్ వైమానిక దళం 700కి పైగా లక్ష్యాలను అడ్డుకున్నట్టు తెలియజేసింది.

మన తెలంగాణ 16 Apr 2026 8:21 pm

కట్ట మైసమ్మ చెరువులో ఆటో డ్రైవర్ మృతదేహం లభ్యం

మానసిక ఆందోళనతో ఓ ఆటో డ్రైవర్ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబా నగర్‌కు చెందిన మరాటి సాయిలు (54) గత 20 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న సాయిలు, అనారోగ్యం కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఈనెల 15న మధ్యాహ్నం ఆటో నడపడానికి వెళ్తున్నానని భార్య స్రవంతికి చెప్పి బయలుదేరారు. రాత్రి అయినా ఆయన తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోయింది.గురువారం మధ్యాహ్నం సూరారంలోని కట్ట మైసమ్మ చెరువు సమీపంలో సాయిలు ఆటో నిలిపి ఉంచడాన్ని గమనించారు. పోలీసులు స్థానికుల సాయంతో గాలించగా చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సూరారం సిఐ సుధీర్ కృష్ణ తెలిపారు.

మన తెలంగాణ 16 Apr 2026 8:17 pm

పిన్నధరిలో అంగరంగ వైభవంగా వనభోజనాల మహోత్సవం..

తాడిమర్రి, విశాలాంధ్ర: మండల పరిధిలోని పిన్నధరి గ్రామంలో బుధవారం వనభోజనాల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఏడు గంటల సమయంలో గ్రామస్థులంతా కలిసి గ్రామాన్ని ఖాళీ చేసి శ్రీ రామస్వామి, అతకల్లప్ప స్వామి విగ్రహాలను ఊరి బయటకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర శర్మ స్వామి ఆధ్వర్యంలో రామాయణ పురాణాలను భక్తులకు వినిపించారు. అనంతరం గ్రామస్థులు తమ బంధువులతో కలిసి ఆనందంగా వనభోజన కార్యక్రమాన్ని జరుపుకున్నారు.శ్రీరామనవమి పండుగ అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో […] The post పిన్నధరిలో అంగరంగ వైభవంగా వనభోజనాల మహోత్సవం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 8:15 pm

రెండో భార్యతో కలిసి పిల్లలను చంపడానికి ప్రయత్నించిన తండ్రి

విషం కలిపిన బిస్కెట్లతో సొంత పిల్లలను చంపేందుకు తండ్రి, అతని రెండో భార్య ప్రయత్నించారు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. అనిత తరిగొప్పుల మండలం ఆంక్షాపూర్ గ్రామానికి చెందినది. తన ఇద్దరి కుమారులతో కలిసి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాలో నివసిస్తున్నది. అయితే అనిత భర్త శ్రీనివాస్ సంవత్సరం కిత్రం ముడావత్ మమతను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో అనిత పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేయగా పెద్దమనుషుల సమక్షంలో పిల్లల పేరిట 20 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని భర్త శ్రీనివాస్ ఒప్పుకున్నాడు.పిల్లలను చూసుకుంటూ , భూమిని సాగు చేసుకుంటూ, అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్తూ అనిత జీవనం సాగిస్తుండగా ఈ మధ్య తన భూమి తనకు ఇవ్వాలని అనితను శ్రీనివాస్ వేధించడం ప్రారంభించాడు. మరోసారి పోలీసులను ఆశ్రయించిన అనిత ఫిర్యాదుతో, శ్రీనివాస్ భూమిని దక్కించుకోవాలనే కక్షతో పిల్లలను హత్య చేసేందుకు పథకం రచించాడు. ఇందుకోసం రెండో భార్య మమత సహాయం తీసుకున్నాడు.స్కల్ కు వెళ్తున్న పిల్లలకు విషం కలిపిన బిస్కెట్లను తినిపినించాలని ఓ వ్యక్తి సుపారీ ఇచ్చాడు. అయితే ఆ విషయం సుపారీ తీసుకున్న వ్యక్తి అనితకు చెప్పాడు.దీంతో అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్‌తో పాటు అతని రెండో భార్య మమతను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మన తెలంగాణ 16 Apr 2026 8:15 pm

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు..

విశాలాంధ్ర, పెనుకొండ: మండల పరిధిలోని వెంకటగిరిపాలెం గ్రామానికి చెందిన రమేష్ (35) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామం నుంచి పని నిమిత్తం గుట్టూరు గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో బొలెరో వాహనానికి అతని మోటార్ బైక్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రమేష్‌కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.రమేష్ తల్లి వెంకటరత్నమ్మ […] The post రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 8:04 pm

వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బొల్లపల్లి కృష్ణ

వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బొల్లపల్లి కృష్ణ రఘునాథపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Apr 2026 8:03 pm

బైపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్ర ద్వితీయ ర్యాంకు..

బైపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్ర ద్వితీయ ర్యాంకు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:59 pm

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన తనిఖీలు

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన తనిఖీలు నిర్వహిస్తున్న పశ్చిమ తహశీల్దార్ డి.రిబ్కా రాణి

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:53 pm

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు: అమిత్ షా

న్యూఢిల్లీ: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మహిళ రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ సంబంధిత బిల్లులపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన పలు వివరాలు వెల్లడించారు. డీలిమిటేషన్‌తో తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు పెరుగుతాయని.. అలాగే ఎపిలో ఉన్న 25 స్థానాలు 38కి పెరుగుతాయన్నారు. కర్ణాటకలో 28 నుంచి 42కు, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు. 

మన తెలంగాణ 16 Apr 2026 7:50 pm

క‌రెంటు షాక్ త‌గిలి మహిళ మృతి

క‌రెంటు షాక్ త‌గిలి మహిళ మృతి కడెం, ఆంధ్రప్రభ : కూలర్‌లో నీళ్లు

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:48 pm

ర‌క్త దానం.. ప్రాణ‌దానం

ర‌క్త దానం.. ప్రాణ‌దానం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ర‌క్త దానం.. ప్రాణ‌దానంతో

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:38 pm

అబ్బుర పరిచేలా కొండపల్లి బొమ్మల పండుగ ..

అబ్బుర పరిచేలా కొండపల్లి బొమ్మల పండుగ .. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రాష్ట్ర

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:36 pm

సుజ‌నా చౌద‌రి కార్యాల‌యంలో సీయం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ….

సుజ‌నా చౌద‌రి కార్యాల‌యంలో సీయం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ…. భవానిపురం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:32 pm

అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి

అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:28 pm

శిలాఫలకాలపై ఎమ్మెల్యే కీలక నిర్ణయం…

శిలాఫలకాలపై ఎమ్మెల్యే కీలక నిర్ణయం… అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రత్యేక కార్యక్రమాలకు మినహా

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:24 pm

Hyderabad : మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక నిందితుడి అరెస్ట్

మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును పోలీసులు అరెస్ట్ చేశారు

తెలుగు పోస్ట్ 16 Apr 2026 7:21 pm