SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

గంజాయి అమ్మితే కఠిన చర్యలు తప్పవు

– కల్వకుర్తి సీఐ నాగార్జున – గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ రిమాండ్ – అభినందించిన నాగర్ కర్నూల్ జిల్లా …

జనం సాక్షి 29 Jan 2026 11:29 am

ఏకాకిగా అమెరికా

‘అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో రెండోసారి ఆశ్చర్యకరమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి ఏడాది పరిపాలన చూస్తుంటే అంతర్జాతీయంగా అమెరికాను ఏకాకిగా మారుస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రపంచ జిడిపిలో 25 వ్యాపార భాగస్వామ్యం గల ఇండియా ఇయు తాజాగా కుదుర్చుకున్నవాణిజ్య ఒప్పందం కీలక భాగస్వామ్య దేశాలే అమెరికాకు దూరంగా మారుతున్నట్లు వెల్లడి అవుతున్నది. 17 సంవత్సరాల సుదీర్ఘ మంతనాల తర్వాత కుదిరిన ఈ ఒప్పందంతో భారత్, ఇయులోని 27 దేశాల్లో దాదాపు 200 కోట్ల మందితో కూడిన స్వేచ్ఛా వాణిజ్య మార్కెట్ ఏర్పడుతుంది. ఈ మార్కెట్ పరిధిలో ఎగుమతి, దిగుమతి జరిగే దాదాపు 93 శాతం వస్తు, సేవలపై దాదాపుగా సుంకాలు ఉండవు. కొన్నింటిపై నామమాత్రపు సుంకాలు ఉంటాయి. యావత్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారిన భారత్-ఇయు వాణిజ్య ఒప్పందం ఒక విధంగా అంతర్జాతీయ వ్యవహారాలలో అమెరికా ప్రాధాన్యతను విస్మరించటమే అవుతుంది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత, సోవియట్ యూనియన్ కూలిపోవడంతో అమెరికా ఒక విధంగా అంతర్జాతీయంగా ఏకైక ఆధిపత్య శక్తిగా నిలిచింది. అటువంటిది ట్రంప్ నాయకత్వంలో దాదాపు శతాబ్ద కాలంగా అమెరికాకు నమ్మకమైన మిత్రదేశాలుగా ఉంటూ వస్తున్న ఐరోపా దేశాలు నేడు దూరం జరుగుతున్నాయి. గ్రీన్ లాండ్‌ను ఆక్రమించుకొంటానని ప్రకటించినప్పుడు ఐరోపా యూనియన్ ప్రతిఘటించడం, ఎదురు దాడులకు సిద్ధం అనే సంకేతమివ్వడం ఓ విధంగా అమెరికా ధోరణుల పట్ల అభిశంసన వ్యక్తం చేయటమే. అంతర్జాతీయ మర్యాదలను కాలదన్ని పొరుగుదేశమైన వెనెజువెలపై దాడి చేసి, దేశ అధ్యక్షుడిని భార్యతో సహా బందీగా తన దేశం తీసుకొచ్చి, న్యాయస్థానం ముందు నిలబెట్టిన తీరు ట్రంప్ ప్రదర్శిస్తున్న అహంకారానికి పరాకాష్టగా చెప్పవచ్చు. అయితే అటువంటి బెదిరింపులు ఇరాన్, గ్రీన్ లాండ్ వంటి దేశాల విషయంలో పనిచేయడం లేదు. అదే విధంగా ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లకు పైగా సాగుతున్నా శాంతి ప్రతిపాదనలలో విఫలం కావడం, గాజా సంక్షోభంలో నిర్ణయాత్మకంగా వ్యవహరింపలేకపోవడం అంతర్జాతీయ వ్యవహారాలలో కుంచించుకు పోతున్న అమెరికా పెత్తనాన్ని వెల్లడి చేస్తున్నాయి. గాజా పునర్నిర్మాణం కోసం అంటూ ఐక్యరాజ్య సమితిని పక్కకు నెట్టివేసి సొంతంగా తన సారథ్యంలో ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలిలో పలు కీలక దేశాలు పాల్గొనక పోవడం ఈ సందర్భంగా గమనార్హం. ఘర్షణల నివారణకు శాంతి సమాలోచనలు ఇప్పుడు ఐరోపా, అమెరికాలలో కాకుండా ముస్లిం దేశాలలో జరుగుతున్నాయి. అమెరికా, రష్యా వంటి దేశాలు తమ ప్రతినిధులను అక్కడకు పంపుతున్నారు. అమెరికా ‘పెద్దన్న పాత్ర’ క్రమంగా నిర్వీర్యం అవుతున్నట్లు స్పష్టం అవుతుంది. పైగా, పలుదేశాలు డాలర్‌ను త్రోసివేసి ఇతర కరెన్సీలలో వాణిజ్యం చేసేందుకు మొగ్గుచూపుతూ ఉండటం కూడా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేసినట్లు అవుతుంది. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై మరిన్ని సుంకాల బెదిరింపులతో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ట్రంప్, భారత్ కన్నా ఎక్కువగా చమురు, ఇంధనం కొనుగోలు చేస్తున్న చైనా, ఐరోపా దేశాలపై నోరు మెదపలేకపోతున్నారు. చైనా ఎదురు సుంకాలు విధిస్తే ట్రంప్‌కు కాళ్లబేరానికి రాక తప్పలేదు. తన అహంకారపూరిత చర్యల ద్వారా ట్రంప్ అమెరికాను కాకుండా చైనాను మళ్ళీ గొప్పగా మారుస్తున్నారని ఓ ప్రపంచ సర్వే సూచిస్తోంది. ఐరోపాలో అమెరికాకు గట్టి మద్దతుదారునిగా ఉంటూ వస్తున్న బ్రిటన్ సైతం ఇప్పుడు పలు అంశాలలో విభేదిస్తున్నది. అందుకనే చైనాతో బంధం పటిష్టం చేసుకునేందుకు బ్రిటిష్ ప్రధాని ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (ఇసిఎఫ్‌ఆర్) థింక్ ట్యాంక్ కోసం 21 దేశాలలో జరిపిన ఈ సర్వేలో ట్రంప్ పాలనలో, అమెరికా దాని సాంప్రదాయ విరోధులకు తక్కువ భయపడుతుందని, దాని మిత్రదేశాలు ముఖ్యంగా యూరప్‌లో మరింత దూరంగా ఉన్నట్లు అనిపిస్తుందని కూడా తేలింది. చాలా మంది యూరోపియన్లు ఇకపై అమెరికాను నమ్మకమైన మిత్రదేశంగా చూడటం లేదు. ఉక్రేనియన్లు మద్దతు కోసం వాషింగ్టన్ కంటే బ్రస్సెల్స్ వైపు చూస్తున్నారు. ఈ సర్వే చేసిన దాదాపు ప్రతి ప్రాంతంలోని మెజారిటీ ప్రజలు రాబోయే దశాబ్దంలో చైనా ప్రపంచ ప్రభావం పెరుగుతుందని అంచనా వేశారని కనుగొన్నారు. చాలా మంది ఇయు పౌరులు చైనా త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వనరులలో ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తుందని అంచనా వేశారు. ఉక్రెయిన్, దక్షిణ కొరియాలలో మాత్రమే మెజారిటీ ప్రజాలు చైనాను ప్రత్యర్థిగా లేదా విరోధిగా చూస్తున్నారని, దక్షిణాఫ్రికా, భారతదేశం, బ్రెజిల్‌లలో ఎక్కువ మంది చైనాను రెండేళ్ల క్రితం కంటే మిత్రదేశంగా చూస్తున్నారని పోల్ కనుగొంది. చైనాతో సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌కు కీలక సైనిక సహాయం అందించే దేశంగా ఉన్నప్పటికీ అమెరికా ఏకపక్ష ధోరణుల కారణంగా ఆ దేశంతో తన సంబంధాలను మెరుగుపరచుకోక తప్పడం లేదు. గాల్వాన్ ఘర్షణల సమయంలో చైనాతో వాణిజ్యాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించినప్పటికీ, ఆ తర్వాతి సంవత్సరాలలో విశేషంగా పెంచుకుంటూ వస్తుంది. గతంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన సైనిక కూటమి క్వాడ్‌లో భాగస్వామిగా చేరిన భారత్ ఇప్పుడు ఈ దిశలో ముందడుగు వేసేందుకు ఆసక్తి కనబరచే అవకాశాలు కనిపించడం లేదు. అదే సమయంలో అమెరికా ప్రభావవంతంగా ఉంటుందని చాలామంది నమ్ముతున్నప్పటికీ, బ్రెజిల్, భారతదేశం, దక్షిణాఫ్రికా, టర్కీ వెలుపల అమెరికాలో కూడా అమెరికన్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయానికి మెజారిటీ లేదు. చైనా పట్ల అనుకూల దృక్పథాలు పెరుగుతున్న నేపథ్యంలో సర్వే చేసిన దాదాపు అన్ని దేశాలలో మిత్రదేశంగా అమెరికా హోదా పడిపోయింది. యురోపియన్ యూనియన్ పౌరులలో ఇప్పుడు కేవలం 16% మంది మాత్రమే అమెరికాను మిత్రదేశంగా భావిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా 20% మంది దానిని ప్రత్యర్థిగా లేదా శత్రువుగా చూస్తున్నారు. ఈ సిరీస్‌లో నాల్గవదైన ఈ సర్వేను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ‘యూరప్ ఇన్ ఎ చేంజింగ్ వరల్డ్’ ప్రాజెక్ట్‌తో కలిసి నిర్వహించారు. ప్రపంచంలో అధికార సమతుల్యత మారుతున్నందున, ఐరోపాపట్ల ప్రజల అవగాహన కూడా మారుతోందని ఇది సూచిస్తుంది. ముఖ్యంగా రష్యాలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ఐదవ సంవత్సరంలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, రష్యాలోని ప్రతివాదులు గత సంవత్సరం (41%) కంటే ఇప్పుడు యూరప్‌ను ప్రత్యర్థిగా చూసే అవకాశం ఎక్కువగా ఉంది (51%). 12 నెలల క్రితం (48%) కంటే అమెరికాను అలా భావించే అవకాశం తక్కువగా ఉంది. (37%) వాస్తవానికి, ఈ సర్వేలో అనేక దేశాలలో మాదిరిగా కాకుండా, చైనాలో మెజారిటీ ప్రజలు (59%) యురోపియన్ యూనియన్‌ను ఒక గొప్పశక్తిగా భావిస్తున్నారని తేలింది. 46% మంది ఈ కూటమిని ఎక్కువగా ఒక భాగస్వామిగా చూస్తున్నారు. ట్రంప్ యురోపియన్ యూనియన్‌కు వ్యతిరేక వాక్చాతుర్యం ఉన్నప్పటికీ 40% మంది అమెరికన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ‘యూరప్‌లోని రాజకీయ నాయకులు ఇకపై తమ సొంత పౌరులు ప్రస్తుత భౌగోళిక రాజకీయ మార్పుల రాడికల్ స్వభావాన్ని గ్రహించారా? అని తమను తాము ప్రశ్నించుకోకూడదు. వారు గ్రహిస్తారు’ అని భావిస్తున్నారు. యూరోపియన్లు పాత క్రమం ముగిసిందని చూస్తారనివారు చెప్పారు. యూరోపియన్ నాయకులు ఇప్పుడు ‘వాస్తవికంగా, అదే సమయంలో ధైర్యంగా’ ఉండాలి, ‘బహుళ ధ్రువ ప్రపంచంలో నిర్వహించడానికి మాత్రమే కాకుండా, ఆ ప్రపంచంలో ఒక ధ్రువంగా మారడానికి లేదా ఇతరులలో అదృశ్యం కావడానికి’ కొత్త మార్గాలను కనుగొనాలని స్పష్టం చేశారు. - చలసాని నరేంద్ర 98495 69050

మన తెలంగాణ 29 Jan 2026 11:29 am

నేడు రెండోరోజు వింగ్స్‌ ఇండియా-2026

నేడు రెండోరోజు వింగ్స్‌ ఇండియా-2026 ప్రదర్శన హైదరాబాద్ లో జరుగుతుంది

తెలుగు పోస్ట్ 29 Jan 2026 11:28 am

బైక్ పై పొంగులేటి …

జనవరి 29,( జనం సాక్షి ) ; జాతర ఏర్పాట్లు భక్తుల సౌకర్యాలు పర్యవేక్షణ.. …

జనం సాక్షి 29 Jan 2026 11:24 am

Possession | 43కిలోల హెరాయిన్, గ్రెనేడ్లు స్వాధీనం

Possession | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పోలీసులు పంజాబ్ సరిహద్దుల్లో భారీ

ప్రభ న్యూస్ 29 Jan 2026 11:24 am

మద్యం బార్ల రీ నోటిఫికేషన్స్

–ఎక్సైజ్ సీఐ చంద్రమణివిశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని రెండు మద్యం బార్ లకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెండు మద్యం బార్లకు ఫిబ్రవరి 5 నుంచి ఆగస్టు 31/2028 వరకు లైసెన్స్ పొందడం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ బార్లకు దరఖాస్తు చేసుకునేవారు జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6:00 వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. దరఖాస్తుదారులు ఆన్లైన్, హైబ్రిడ్, […] The post మద్యం బార్ల రీ నోటిఫికేషన్స్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 29 Jan 2026 11:21 am

observation |బైక్‌ల పై పరిశీలించిన రాష్ట్ర మంత్రులు

observation | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మేడారం జాతర ఏర్పాట్లను ఇవాళ

ప్రభ న్యూస్ 29 Jan 2026 11:17 am

జాతీయస్థాయి జూడో పోటీలకు జీవనజ్యోతి పాఠశాల విద్యార్థి

అభినందించిన పాఠశాల హెచ్ఎం సుజాతవిశాలాంధ్ర ధర్మవరం: జాతీయస్థాయి జూడో పోటీలకు పట్టణంలోని జీవనజ్యోతి పాఠశాల విద్యార్థిని ఎన్. వైష్ణవి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ సిస్టర్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వెన్. వైష్ణవి నవంబర్ 28 నుండి 30 వరకు చిగిచెర్ల గ్రామంలో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్ 19 రాష్ట్రస్థాయి జూడో పోటీలలో మొదటి స్థానంలో నిలిచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని […] The post జాతీయస్థాయి జూడో పోటీలకు జీవనజ్యోతి పాఠశాల విద్యార్థి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 29 Jan 2026 11:10 am

మున్సిపల్ ఎన్నికలలో ఆ గుర్తుపై పోటీ చేస్తాం: కవిత

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తు పోటీచేస్తామని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డితో కలిసి కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, జిహెచ్‌ఎంసి ఎన్నికలలో కలిసి పని చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కవితతో జావెద్ లతీఫ్ చర్చలు జరిపారు. 

మన తెలంగాణ 29 Jan 2026 11:07 am

Two lorries |క్లీనర్ సజీవదహనం

Two lorries | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రెండు లారీలు ఢీకొని

ప్రభ న్యూస్ 29 Jan 2026 11:02 am

ఘనంగా యశోద కాన్సెప్ట్ స్కూల్ 18 వ వార్షికోత్సవం

కరెస్పాండెంట్ మల్లికార్జున.విశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని యశోద కాన్సెప్ట్ స్కూల్లో 18 వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నట్లు డైరెక్టర్ రవీంద్ర, కరెస్పాండెంట్ మల్లికార్జున తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ శ్రీ వీణవడ్డీ రెడ్డి, ఎంఈఓ లు రాజేశ్వరి దేవి గోపాల్ నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో యశోద కాన్సెప్ట్ స్కూలుకు మంచి గుర్తింపు, మంచి విద్యతోనే రావడం జరిగిందని తెలుపుతూ యాజమాన్యాన్ని వారు అభినందించారు. చైర్మన్ […] The post ఘనంగా యశోద కాన్సెప్ట్ స్కూల్ 18 వ వార్షికోత్సవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 29 Jan 2026 11:01 am

ACB Raids |ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో రైడ్స్

ACB Raids | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అవినీతి

ప్రభ న్యూస్ 29 Jan 2026 10:55 am

ఫిబ్రవరి 8న కేజిఎఫ్ చారిత్రాత్మక సభ

లక్షలలో తరలిరానున్న కమ్మ సోదరులు..విశాలాంధ్ర అనంతపురం టౌన్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సోదరులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు 2023 వ సంవత్సరంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ( కే జి ఎఫ్ ) ను జెట్టి కుసుమ కుమార్ వ్యవస్థాపక అధ్యక్షులుగా స్థాపించారు. అప్పుడు హైదరాబాద్ వేదికగా జరిగిన మహాసభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం ఫిబ్రవరి 8వ తేదీన తమిళనాడు తిరువల్లూరు జిల్లా వేమపట్టు గ్రామంలో చారిత్రాత్మకంగా కమ్మ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు […] The post ఫిబ్రవరి 8న కేజిఎఫ్ చారిత్రాత్మక సభ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 29 Jan 2026 10:52 am

అధికారులూ గమనించండి.. జనసేన ఎన్డీయే ప్రభుత్వం లో భాగస్వామ్యమే

కొవ్వూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి టివిఆర్ చురక విశాలాంధ్ర – తాళ్లపూడి: రాష్ట్రం లో ఎన్డీయే కూటమి లో జనసేన భాగస్వామ్యం అయినప్పటికీ, కొవ్వూరు నియోజకవర్గం లో మాత్రం జనసేన పార్టీ కి గౌరవం, ఆ హక్కు దక్కడం లేదని, మెడికల్ రీ-ఎంబెర్స్మెంట్ కి కూడా టీడీపీ ని ముష్టి ఎత్తుకోవాల్సిన పరిస్థితుల్లో జనసైనికులున్నారని, ఇబ్బందులుంటే బయ(ట)పడకండి, నేరుగా మంగళగిరి కార్యాలయాని కి తేలియ చేద్దాం అని కొవ్వూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి టివిరామారావు పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వ […] The post అధికారులూ గమనించండి.. జనసేన ఎన్డీయే ప్రభుత్వం లో భాగస్వామ్యమే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 29 Jan 2026 10:44 am

Chiru Vs Balayya |ఒక తరహా కథతో చిరు, బాలయ్య..?

Chiru Vs Balayya | ఒక తరహా కథతో చిరు, బాలయ్య..? ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 29 Jan 2026 10:43 am

పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం: కీర్తి సురేష్

హైదరాబాద్: హీరోయిన్ కీర్తి సురేశ్ తన చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌ను పెళ్లి చేసుకున్న విషయం విధితమే. 2024 డిసెంబర్ 12న హిందూ సంప్రదాయం, 15న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుక అంగరంగా వైభవంగా జరిగింది. అప్పటి మధుర క్షణాలను మీడియాతో కీర్తి సురేష్ పంచుకున్నారు. ఇంత గ్రాండ్ పెళ్లి వేడుక జరుగుతుందని తాము ఊహించలేదన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నామని, తాళి కట్టే సమయంలో కళ్ల ముందు తన ప్రేమయాణం కదలాడిందని గుర్తు చేశారు. ఆనందబాష్పాలు ఆగలేదని, ఆంటోనీ కూడా నమ్మలేకపోయారని కీర్తి తెలిపారు. ఆంటోనీ కళ్లలో కూడా ఆనందం చూశానని, ఇది ఓ అందమైన ప్రయాణం అని చెప్పారు. తాము పారిపోయి పెళ్లి చేసుకుంటామని అనుకున్నామని కానీ కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వివాహం ఘనంగా జరిందన్నారు. 

మన తెలంగాణ 29 Jan 2026 10:41 am

Telangana : తెలంగాణ ఐ సెట్ నోటిఫికేషన్ ఎప్పుడంటే?

తెలంగాణ ఐసెట్‌–2026 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 6న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు

తెలుగు పోస్ట్ 29 Jan 2026 10:40 am

ఓ కర్మయోగి జీవిత కథ

ఇదో సమర్థుడైన, విజయవంతమైన ఐఏఎస్ అధికారి అనుభవాల సంకలనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక బాధ్యతలు నిర్వహించడమే కాక, ఎన్నో కీలకమైన ప్రభుత్వరంగ పరిశ్రమలను తన సామర్థ్యంతో నిలబెట్టిన అనుభవజ్ఞుడైన అధికారి ఎం. గోపాల కృష్ణ గారు. నిజమైన కర్మయోగి విశిష్టమైన ఐఏఎస్ కెరీర్, అధికార స్వామ్యానికి అతీతమైన జీవితాన్ని వివరంగా వివరిస్తుంది. సంఘంలో పలుకుబడి, హోదా, అధికారం, ఇంటా బయటా సమాజంలో గౌరవం, రాజకీయ వర్గాలలోనూ ప్రత్యేక గుర్తింపు పొందే ఐఏఎస్ అంటే అందరికీ మోజు. యువతరంలో కాస్త ప్రతిభా పాటవాలు గలవారిలో మెజారిటీ ఐఏఎస్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతారు. సినీ ప్రముఖుల తర్వాత ఐఏఎస్‌లు అంటేనే మోజు. ఇదో పవిత్రమైన వృత్తి. అధికార వర్గాలతో మమేక మవుతూ, తమ జీవితంలో ఎక్కువ సమయాన్ని గడిపే అలాంటి వారు తన అనుభవాలను, జ్ఞాపకాలను, వాస్తవాలను పంచుకుంటూ చెప్పే కథలు ఆసక్తికరంగానే ఉంటాయి. ఐఏఎస్ జీవితం అంటే నల్లేరుమీద నడక కాదు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ, కీలకమైన అంశాలలో తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఒక్కోసారి నో గో జోన్స్- అంటే అత్యంత ప్రమాదకరమైన, భద్రతా కారణాల వల్ల నిషేధిత ప్రాంతాలలో దూసుకు వెళ్లవలసి వస్తుంది. అప్పుడు ఎదురైన సంఘటనలు, అనుభవాలు, వెల్లడించేందుకు ఆసక్తి చూపుతారా అన్నది ప్రశ్న. అలాగే ఆ పరిస్థితుల్లో పాలనాపరమైన లోపాలను కప్పిపుచ్చుతారా, మొహమాటం లేకుండా వెల్లడిస్తారా అన్నది మరో ప్రశ్న. ఆయా రచయితలు వ్యక్తిగత అభిప్రాయంపై ఇది ఆధారపడి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన, ఓ నిర్ణయం తీసుకునే ముందు ఎంత కసరత్తు జరుగుతుందన్న విషయాలను ఈ పుస్తకాలు వెల్లడిస్తాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. గోపాలకృష్ణ గారి లైఫ్ ఆఫ్ ఎ కర్మయోగి -అనే పుస్తకం భారీ సంకలనం. 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈ కెరీర్ బ్యూరోక్రాట్ కేంద్రంలో, రాష్ట్రంలో రెండు చోట్ల కీలక బాధ్యతలు నిర్వహించి ఎంతో అనుభవం సాధించారు. ఈశాన్య రాష్ట్రాలలోనూ గణనీయమైన పరిపాలనా అనుభవం ఉంది. ఆయన ప్రజ్ఞా పాటవాలకు ఒక ఉదాహరణ. గోదావరి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ షెడ్యూల్ కన్నా ముందుగానే, అంచనా వ్యయం బడ్జెట్‌లోనే ప్రారంభించేటట్లు సిద్ధం చేసి కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. ఇది ప్రాజెక్టు నిర్వహణలో కేస్ స్టడీగా నిలవడం విశేషం. ఆయన ప్రతిభ, సామర్థ్యం ఆయనకు 400పైగా అవార్డులు గెలుచుకునేటట్లు చేసింది. కార్యనిర్వహకుడిగా, ట్రబుల్ షూటర్‌గా ఆయన నైపుణ్యం అపారం. గోపాలకృష్ణ గారు.. ఒక సందర్భంలో ఇలా అన్నారు. తనకన్నా ముందు సివిల్ సర్వెంట్స్ విద్యాపరంగా, సాంకేతిక పరంగా, అనుభవపూర్వకంగా చాలా అర్హత కలిగినవారు, బహుముఖ ప్రజ్ఞకలవారు. అభివృద్ధి ప్రణాళికలను విశ్లేషించడానికి, ప్రయోజనకరమైన సలహాలు ఇచ్చి నడిపించడానికి తగినవారు అని తాను గమనించానని, అలాంటి వారి చేతిలో భారతదేశం సురక్షితంగా ఉంది అని పేర్కొన్నారు. పుస్తకంలోని మొదటి భాగంలో 36 అధ్యాయాలు ఉన్నాయి. రచయిత దేశం వివిధ ప్రాంతాలలో తాను కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఎదురైన బహుళ అనుభవాలను ఈ అధ్యాయాలలో వివరించారు. ఆయన ప్రభుత్వరంగ ప్రతినిధిగా స్టాండిగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (ఎస్‌సిఒపిఇ) చైర్మన్‌గా కూడా పనిచేశారు. పుస్తకంలో రెండో భాగం పదవీ విరమణ తర్వాత ఆయన అనుభవాలు, అనుభూతులను వివరిస్తుంది. దీనిని ఆయన సేవా విత్ భావ అన్నారు. ఇది ఆయన ఇఎంఆర్‌ఐ, ఎన్‌హెచ్‌ఆర్‌డి, ఎన్‌బిఎ, ఎప్‌ఐసిసిఐ, గ్రామీణాభివృద్ధి వంటి వివిధ సంస్థలను నిర్వహిస్తున్న సమయంలో ఎదురైన అనుభవాల సేకరణ. అటువంటి అద్భుతమై కెరీర్‌లో ఎదురైన అనుభవాలు ఎందరికో స్ఫూర్తి దాయకం. అప్పటి గవర్నర్ డాక్టర్ సి.రంగరాజన్ నుంచి, ఆయనతో కలిసి పనిచేసిన తోటి బ్యురోక్రాట్ల అభిప్రాయాలు, అనుభవాలు సంక్షిప్తంగా 10 పేజీలలో కన్పిస్తాయి. ఆయన అసాధారణ నైపుణ్యాలు, సామర్థ్యాలపై తోటి వారి అభిప్రాయానికి ఆ పేజీలు అద్దం పడతాయి. డాక్టర్ రంగరాజన్.. తన స్పందనలో గోపాల కృష్ణ కథనం వివరాలతో నిండి ఉంది. ఆయన తన కెరీర్‌లో ఎదురైన ఘటనలను వివరణాత్మకంగా గుర్తు ఉంచుకుని రాశారు. ఆయనకు అసాధారణ జ్ఞాపకశక్తి ఉండాలి, కథనంలో ఆసక్తికరమైన అంశం ఎనిమిది దశాబ్దాల సామాజిక, కుటుంబ జీవితం గురించి వివరించడం. ఉమ్మడి కుటుంబాల పనితీరు, ఆనాటి అనుభవాలను చక్కగా వివరించారు. సివిల్ సర్వీస్‌కు వెళ్లాలని ఆసక్తి ఉన్నవారికి నిజమైన పాలన అంటే ఏమిటో ఈ పుస్తకం వివరిస్తుంది. ఎంతో సమాచారాన్ని అందిస్తుంది. - మల్యాల 

మన తెలంగాణ 29 Jan 2026 10:39 am

విమాన ప్రమాదానికి అదీ ఒక కారణమేమో?

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి

తెలుగు పోస్ట్ 29 Jan 2026 10:33 am

فیکٹ چیک: واراناسی کے پولنگ مرکز کی تصویر، مہاراشٹرا بلدی انتخابات میں مسلم ووٹروں کے ہجوم کے گمراہ کن دعوے کے ساتھ وائرل

مہاراشٹرا بلدی انتخابات میں مسلم ووٹروں کے سیلاب کے دعویٰ کے ساتھ پولنک مرکز کی تصویر سوشل میڈیا پر وائرل کی جارہی ہے۔ تحقیق سے واضح ہوا کہ یہ تصویر جون 2024 کے عام انتخابات کے دوران واراناسی میں لی گئی ہے، نہ کہ حالیہ بلدی انتخابات کی۔

తెలుగు పోస్ట్ 29 Jan 2026 10:32 am

హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’

దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్ మీద హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన ప్రపంచాన్ని ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ద్వారా పరిచయం చేశారు. మిథున్ ముకుందన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ అంటూ నిర్వహించిన కార్యక్రమంలో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ .. “అందరికీ ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. శబార అంటే ప్రపంచం.. ప్రేమ్ చంద్ సృష్టించిన ప్రపంచమిది. అడవిలోనే మొత్తం కథ జరుగుతుంది”అని అన్నారు. దర్శకుడు ప్రేమ్ చంద్ కిలారు మాట్లాడుతూ .. “హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’కి మంచి స్పందనను ఇచ్చారు. చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు వస్తాం”అని తెలిపారు. క్రితికా సింగ్ మాట్లాడుతూ ప్రేమ్ చంద్ లేకపోతే ‘శబార’ ఇంత గొప్పగా వచ్చేది కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీషా నారంగ్, రాజీవ్ పిళ్లై, భూషణ్ కళ్యాణ్, సుమాయా, శివ కామేష్, మోహన్ భగత్, మిథున్ ముకుందన్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 29 Jan 2026 10:07 am

Sammakka Sarakka |మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్..

Sammakka Sarakka | మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.. Sammakka Sarakka, చిట్యాల,

ప్రభ న్యూస్ 29 Jan 2026 10:05 am

Union Budget : దంపతులకు గుడ్ న్యూస్ చెప్పనున్న నిర్మలమ్మ..ఇక పన్ను చెల్లించక్కర్లేదుగా

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1వ తేదీన లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు

తెలుగు పోస్ట్ 29 Jan 2026 10:01 am

‘ఆకాశంలో ఒక తార’లో కీలక పాత్రలో..

వర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ’ఆకాశంలో ఒక తార’తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్, స్వప్న సినిమా సమర్పణలో ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. తాజాగా చిత్ర బృందం ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఆచితూచి సినిమాలు చేస్తున్న శృతి హాసన్, ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, టీం ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఆమె కళ్ళకు అద్దాలు పెట్టుకుని ఇంటెన్స్ లుక్ లో కనిపించడం ఆకట్టుకుంది. కథలో శ్రుతి హాసన్ పాత్ర కీలక మలుపుగా నిలవనుంది. ప్రస్తుతం నిర్మాణ చివరి దశలో ఉన్న ’ఆకాశంలో ఒక తార’ చిత్రం 2026 వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. 

మన తెలంగాణ 29 Jan 2026 10:00 am

నేడు మంత్రి నారాయణ పర్యటన ఇలా

మంత్రి నారాయణ నేడు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 29 Jan 2026 9:56 am

Police |రోడ్డు భద్రత మహోత్సవాలు..

Police | రోడ్డు భద్రత మహోత్సవాలు.. Police, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ

ప్రభ న్యూస్ 29 Jan 2026 9:54 am

Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం.. ఈ ఏడాది ఎండలెలా ఉంటాయంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భిన్నమైన వాతావరణం నెలకొంది

తెలుగు పోస్ట్ 29 Jan 2026 9:46 am

Telangana : నేడు బీజేపీ అభ్యర్థుల ప్రకటన

నేడు తెలంగాణలో మున్సిపల్ అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది.

తెలుగు పోస్ట్ 29 Jan 2026 9:42 am

Chandrababu : నేడు మహారాష్ట్రకు చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మహారాష్ట్రకు వెళ్లనున్నారు.

తెలుగు పోస్ట్ 29 Jan 2026 9:34 am

Maruthi Teaches a Lesson for Tollywood Directors

It is not an easy journey for director Maruthi in Telugu cinema. He balanced his career by working with stars and he supported small-budget films. He penned scripts and co-produced films. Finally, he bagged an opportunity to work with a star actor like Prabhas which is a dream for many. But unfortunately, he could not […] The post Maruthi Teaches a Lesson for Tollywood Directors appeared first on Telugu360 .

తెలుగు 360 29 Jan 2026 9:27 am

హార్వర్డ్ ప్రొఫెసర్లతో విద్యా ప్రమాణాలపై రేవంత్ చర్చ

న్యూయార్క్: ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా పర్యటనలో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్‌లో విద్యార్థులు, ప్రొఫెసర్లతో సమావేశామయ్యారు. విద్యా ప్రమాణాల పెంపుపై చర్చలు జరిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ విజన్ తీసుకోచ్చామని వివరించారు. విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిఎం కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ తెలిపారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు విద్యా విధానాలు, ప్రక్రియలపై భేటీలో ప్రధానంగా చర్చించారు. ఆధునిక నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక వృద్ధిలో మానవ వనరుల అభివృద్ధి పాత్ర వంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా ప్రొఫెసర్లతో చర్చలు జరిపారు. 

మన తెలంగాణ 29 Jan 2026 9:26 am

Gold Prices Today : భారీ షాకిచ్చిన బంగారం.. పరుగులు పెడుతున్న వెండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.

తెలుగు పోస్ట్ 29 Jan 2026 9:20 am

இலங்கை அதிபர் துப்பாக்கி பாதுகாப்புடன் இந்து கோயிலில் வழிபாடு செய்தாரா?

இலங்கை அதிபர் அனுர குமார திசநாயக்க இந்து கோயிலில் சட்டையின்றி வழிபாடு செய்ததாக பரவும் வீடியோ ஏஐ மூலம் உருவாக்கப்பட்டது

తెలుగు పోస్ట్ 29 Jan 2026 9:18 am

AP |పోలీస్ శాఖలో కఠిన చర్యలు..

AP | పోలీస్ శాఖలో కఠిన చర్యలు.. AP, కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 29 Jan 2026 9:07 am

Tirumala : తిరుమలకు నేడు వచ్చే వారికి గుడ్ న్యూస్

నేడు తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.

తెలుగు పోస్ట్ 29 Jan 2026 9:04 am

Municipal Elections |కాంగ్రెస్ బుజ్జగింపులు షురూ..

Municipal Elections | కాంగ్రెస్ బుజ్జగింపులు షురూ.. Municipal Elections, మోత్కూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 29 Jan 2026 8:57 am

నేడు వైసీపీ నేతలు గీతం భూముల పరిశీలన

విశాఖపట్నంలో నేడు వైసీపీ నేతలు గీతం విద్యా సంస్థల భూములను పరిశీలించనున్నారు

తెలుగు పోస్ట్ 29 Jan 2026 8:54 am

Pawan Kalyan : నేటి నుంచి పవన్ విశాఖ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 29 Jan 2026 8:46 am

సీమ ప్రాంత రైతులు తీపి కబురు.. మీ పంటలకు ఇక దిగులులేదు

కర్నూలు వాసులకు గుడ్ న్యూస్. రాయలసీమలో మరొక పరిశ్రమ ఊపిరి పోసుకోనుంది

తెలుగు పోస్ట్ 29 Jan 2026 8:39 am

ఈ కాంబినేషన్‌తోనే వరల్డ్ కప్‌లో బరిలోకి దిగుతాం: సూర్య

హైదరాబాద్: విశాఖపట్నంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో టి20లో టీమిండియా ఓటమిని చవిచూసింది. భారత జట్టుపై కివీస్ 50 పరుగుల తేడాతో గెలిచింది. న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి భారత జట్టు ముందు 216 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత జట్టు 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలటౌంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు ఫుల్‌టైమ్ బౌలర్లతో బరిలోకి దిగింది. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. 180 నుంచి 200 పరుగులు ఛేదిస్తున్నప్పుడు తొలి మూడు వికెట్లు త్వరగా పడిపోతే మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఒత్తిడికి లోనవుతారని తెలిపారు. అందుకే ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగామని వివరించారు. తమను తామే ఛాలెంజ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని, వరల్డ్ కప్‌లో కూడా ఇదే జట్టుతో ఆడుతామని చెప్పారు. తొలుత తాము బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో చక్కగా తమ బాధ్యత నిర్వర్తించామన్నారు. ఛేదనలో తమను తాము పరీకించుకోవడంతో పాటు మళ్లీ ఒకసారి ఛేదనలో విజయం సాధిస్తామి ధీమా వ్యక్తం చేశారు. మ్యాచ్‌లో శివమ్ దూబే శివ తాండవం చేశారు. దూబే 23 బంతుల్లో 65 పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యాడు. మ్యాట్ హెన్రీ బౌలర్ చేతికి బంతి తగిలి వికెట్లకు తగలడంతో దూబె ఔటయ్యాడు.   

మన తెలంగాణ 29 Jan 2026 8:30 am

నేడు పార్లమెంటు ముందుకు ఆర్థిక సర్వే

పార్లమెంటు సమావేశాలు నేడు రెండో రోజు జరగనున్నాయి

తెలుగు పోస్ట్ 29 Jan 2026 8:18 am

నేడు అజిత్ పవార్ భౌతిక కాయానికి అంత్యక్రియలు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి

తెలుగు పోస్ట్ 29 Jan 2026 8:11 am

Medaram : భక్త జనసంద్రంగా మారిన మేడారం

మేడారం మహా జాతరలో నేటి నుంచి కీలక ఘట్టం చేరుకోనుంది

తెలుగు పోస్ట్ 29 Jan 2026 7:57 am

గాంధీ నుంచి అజిత్ వరకూ.. విమాన ప్రమాదాల్లో ప్రముఖుల విషాదాంతాలు

న్యూఢిల్లీ: పలువురు వివిధ రంగాల ప్రముఖులు విమాన , హెలికాప్టర్ల ప్రమాదాలలో దుర్మరణం చెందారు. వీరిలో రాజకీయ దిగ్గజాలు పలువురు ఉన్నారు. ప్రమాదాలలో మృతి చెందిన ప్రముఖుల వివరాలు ఘటనల అంశం అజిత్ పవార్ విషాదాంతం దశలో ప్రస్తావనకు వచ్చింది. భారతదేశ అణు భౌతికశాస్త్రవేత్త హోమి జహంగీర్ బాబా 1966 జనవరి 24న ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఈ విమానం స్విస్ అల్ప్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. జెనీవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారితో సరైన సమాచార సమన్వయం లేకపోవడంతో ప్రమాదం జరిగింది. 1980లో సంజయ్ గాంధీ, 2009లో వైఎస్.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ 1980 జూన్ 23వ తేదీన ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ వద్ద సాహస గగనతల విన్యాసాలకు దిగుతూ ఉండగా విషాదాంతం చెందారు. విమానం అదుపు తప్పి, నేలకూలింది. సంజయ్ గాంధీ విషాదాంతం సంచలనం అయింది. తరువాత 2001లో యువ నేత, మాజీ విమానాయాన మంత్రి మాధవరావు సింధియా 2001 సెప్టెంబర్ 30న కాన్పూర్‌కు రాజకీయ సభ కోసం వెళ్లుతున్నప్పుడు జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందాడు. సరైన వెలుతురు లేకపోవడంతో విమానం పతనం అయింది. 2002లో తెలుగుదేశం నేత స్పీకర్ బాలయోగి 2002 మార్చి 3వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద చనిపోయారు. కైకలూరు వద్ద చెరువులో పడిన దశలో ఈ కోస్తా నేత దుర్మరణం చెందారు. మేఘాలయ నేత సంగ్మా షిల్లాంగ్‌లో పవన్ హన్స్ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన 2004 సెప్టెంబర్‌లో జరిగింది. ఒపి జిందాల్ , సురేం దర్ సింగ్ 2005లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నదశలో డోర్జీ ఖండూ ఇతరులు హెలికాప్టర్ దుర్ఘటనలో 2011 ఎప్రిల్ 30న చనిపోయారు. ఇక సైనిక ప్రధానాధికారి సిడిఎస్ బిపిన్ రావత్ అత్యంత మిస్టరీగా మిగిలిన హెలికాప్టర్ ప్రమాదంలో 2021 డిసెంబర్ 8న మృతి చెందారు. ఇక గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 2025 జూన్ 12న అహ్మదాబాద్ వద్ద జరిగిన ఘోరాతిఘోర ఎయిరిండియా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. 

మన తెలంగాణ 29 Jan 2026 7:40 am

India vs New zealand : భారత్ పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్

నాలుగో టీ20లో భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.

తెలుగు పోస్ట్ 29 Jan 2026 7:39 am

ఉప్పల్ లో నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ ట్రక్కు

ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఉప్పల్ నుంచి తార్నకకు వెళ్తుండగా క్రికెట్ స్టేడియానికి సమీపంలో భారీ ట్రక్కు బోల్తాపడింది. రోడ్డు డివైడర్ కు ఢీకొట్టి నడి రోడ్డుకు అడ్డంగా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు క్లీనర్ కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తులోనికి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.  క్రేన్ సహాయంతో ట్రక్కును తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 29 Jan 2026 7:37 am

సిఎం కావాలనే కోరిక తీరకుండానే..

ఆరుసార్లు ఉపముఖ్యమంత్రిగా సేవలు బారామతితో ముడివడిన అజిత్ పవార్ అనుబంధం ముంబై ః మహారాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ కీలక వ్యక్తి అయిన అజిత్ పవార్ కింగ్‌మేకర్‌గానే వెళ్లిపోయారు. ఆయన ఎప్పుడూ పెళ్లి కొడుకు కాలేకపొయ్యారు. దగ్గరి వరకూ వచ్చిన తరువాత తోటి పెళ్లికొడుకు పాత్రకు పరిమితం కావల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు తెలిపారు. చింతించడం, చేజారిన అవకాశాలకు ఆయన మారుపేరుగా నిలిచారు. రికార్డు స్థాయిలో ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆరుసార్లు సేవలు అందించారు. ముఖ్యమంత్రి కావాలనే తన ఆకాంక్ష నెరవేరకుండానే జీవితం ముగించాల్సి వచ్చింది. స్వస్థలం బారామతి ఆయనకు ఉజ్వల రాజకీయ వైభవం ప్రసాదించింది. చివరికి ఆయన ముగింపు కూడా బారామతి వద్దనే జరిగింది. 2023 లో బిజెపి, శివసేనల చీలిక వర్గం ప్రభుత్వంలో చేరడానికి ముందు ఆయన దేవెంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో కూడా డిప్యూటీ సిఎంగా ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం కేవలం రెండు రోజులే అధికారంలో ఉంది. శరద్ పవార్‌తో విభేదించి చీలిక వర్గం ఎన్‌సిపి నేతగా అజిత్ పవార్ ఎన్‌డిఎలో చేరి తిరిగి ఉప ముఖ్యమంత్రి కావల్సి వచ్చింది. కాంగ్రెస్, శివసేన, బిజెపి హయాంల్లో డిప్యూటి అయ్యారు రాజకీయాల్లో పెద్ద అన్నగా పిలవబడిన (దాదా) పవార్ ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలతో మమేకం అయి తిరిగారు. రూ 70 వేల కోట్ల స్కాం అప్పట్లో ఆయనను చుట్టుకుంది. తరువాతి దశలో కుమారుడు పార్థా పుణే భూ కుంభకోణం కూడా షాక్ ఇచ్చింది. అయితే ఇవేవీ ఆయన రాజకీయ చరిత్రను దెబ్బతీయలేకపోయాయి. 2023లో ఆయన శరద్ పవార్ నీడలో నుంచి బయటపడ్డాడు. తిరుగుబాటుకు దిగాడు. పార్టీ ఎమ్మెల్యేలతో తన పేరిట వేరే గుర్తుతో ఎన్‌సిపిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దశలో ఆయన బిజెపి నుంచి ఎక్కువగా సాయం తీసుకున్నాడు. అయితే శరద్ పవార్ తన రాజకీయ గురువు అంతకు మించి అని, అయితే రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తప్పవని అజిత్ పవార్ చెపుతూ వచ్చారు. 1959 జులై 29న అజిత్ పవార్ ఆశా అనంత్‌రావు పవార్ దంపతులకు జన్మించారు. 1982లో రాజకీయాల్లోకి వచ్చారు. కేవలం శరద్ పవార్ మార్గదర్శకత్వంలోనే తన రాజకీయ జీవితం ఆరంభం అయిందని అజిత్ పవార్ తన విధేయతను చాటుకుంటూ వచ్చారు. కానీ ఆయనకే ఎదురుతిరిగారు. ఇది అత్యధిక మరాఠాలకు నచ్చలేదు. ప్రమాదమే .. రాజకీయం చేయవద్దు: శరద్ పవార్ బుధవారం విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందిన ఘటనపై సీనియర్ నేత శరద్ పవార్ సాయంత్రం స్పందించారు. ఇది ప్రమాదమే, దయచేసి దీనిని ఎవరూ రాజకీయం చేయవద్దు అని బారామతి నుంచి ముంబైకి తిరిగి వచ్చిన దశలో మీడియాకు ప్రకటన వెలువరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రకటన వెలువరించారు. దీనికి ప్రతిగానే శరద్ పవార్ స్పందించినట్లు వెల్లడైంది. మహారాష్ట్ర ఓ సమర్థవంతమైన నేతను కోల్పోయింది. కొన్ని అంశాలు మన చేతుల్లో లేనివి కూడా ఉంటాయి.ఎవరూ దీనిపై రాజకీయ అనుమానాలు వ్యక్తం చేయరాదని శరద్ పవార్ కోరారు. 

మన తెలంగాణ 29 Jan 2026 7:20 am

పుర పోరుకు సిఎం సమరభేరి

3 నుంచి సిఎం జిల్లాల పర్యటన షురూ ‘పుర’ పోరుకు మూడు పార్టీలు వ్యూహాలు టికెట్‌ల కోసం ఆశావహుల నుంచి తీవ్రమైన పోటీ ప్రధాన పార్టీల్లో అసమ్మతి సెగలు బలమైన అభ్యర్థుల కోసం నివేదికలు సిద్ధం అధిక స్థానాలను గెలిచేలా కాంగ్రెస్ వ్యూహాం.. అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చేలా బిఆర్‌ఎస్ ప్రణాళికలు తమ స్థానాల్లో పట్టునిలుపుకునేలా బిజెపి సమాయత్తం మనతెలంగాణ/హైదరాబాద్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు అవసరమైన వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండా జరిగాయి. పురపాలక సంఘాల ఎన్నికలు పార్టీల గుర్తుల మీద నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపిలు ఈ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టికెట్ కోసం ఈ మూడు పార్టీల్లో పలువురు పోటీ పడుతుండడంతో ఈ మూడు ప్రధాన పార్టీల్లో అసమ్మతిసెగలు చోటు చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ప్రధాన పార్టీల అధి నాయకత్వాలు జిల్లా స్థాయి నేతలు, ఇన్‌చార్జీలకు సూచించినట్టుగా తెలిసింది. మిర్యాలగూడ సభతో సిఎం శ్రీకారం వచ్చేనెల 3వ తేదీన సిఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. అదేరోజు మిర్యాలగూడలో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 04వ తేదీన జగిత్యాల, 5వ తేదీన చేవెళ్ల, 6వ తేదీన భూపాలపల్లి, 7వ తేదీన మెదక్, 8వ తేదీన నిజామాబాద్‌లో నిర్వహించే సభల్లో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఇక, బిఆర్‌ఎస్ నుంచి ముఖ్య నాయకులు, బిజెపి నుంచి ఆ పార్టీ అధ్యక్షుడితో పాటు కేంద్రమంత్రులు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేసి ఎన్నికల సభలో పాల్గొననున్నారు. సామాజిక మాధ్యమాలు, డిజిటల్ ప్రచారం వైపు ఇక, తక్కువ సమయంలో ఓటర్లను చేరుకోవడానికి పార్టీలన్నీ సామాజిక మాధ్యమాలు, డిజిటల్ ప్రచారం, వార్డు స్థాయి సమావేశాలపై ఎక్కువగా ఆధారపడనున్నాయి. ప్రస్తుతం యువత ఓటింగ్ శాతం పెరిగే అవకాశముండటంతో వారి సమస్యలు, అంశాలను కూడా అన్ని పార్టీలు ప్రధాన అంశాల్లో చేర్చినట్టుగా తెలిసింది. ప్రధానంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బిఆర్‌ఎస్ అన్నట్టుగా సాగుతాయని రాజకీయ వర్గాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పట్టణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికార పార్టీ ఆశలు అధికార కాంగ్రెస్ పార్టీ పంచాయతీల్లో అత్యధిక స్థానాలను గెలిచిన విధంగానే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో కాంగ్రెస్ జెండా ఎగుర వేసేందుకు ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు ఉత్సాహాంగా ఉండగా అదే దూకుడుతో రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వారు సమాయత్తం అవుతున్నారు. గెలుపు బాధ్యతలను ముఖ్యంగా డిసిసి అధ్యక్షులపైనే కాంగ్రెస్ పార్టీ మోపింది. ఇప్పటికే జిల్లాల వారీగా మంత్రులకు ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఎన్నికల తేదీని ప్రకటించడంతో అభ్యర్థుల గుర్తింపు దగ్గరి నుంచి అసమ్మతి నేతల బుజ్జగింపులను ఇన్‌చార్జీ మంత్రులు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ బాధ్యులను సమన్వయం చేసుకొని పార్టీ అభ్యర్థులు గెలిచేలా అవసరమైన కసరత్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిసిసిలకు ఆదేశాలు జారీచేసింది. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రధానంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ కేడర్‌కు దిశానిర్ధేశం చేసింది. అధికార పార్టీలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల సమాచారం తెలుసుకుంటుండడం విశేషం. గెలుపు వ్యూహాలపై బిఆర్‌ఎస్ ఇన్‌చార్జీల పర్యవేక్షణ ఇక, బిఆర్‌ఎస్ ముఖ్య నేతలైన కెటిఆర్, హరీశ్‌రావులు ఈ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారు. పలువురు సీనియర్ నాయకులకు ఇన్‌చార్జీల బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ధీటుగా బిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవాలని దానికోసం బిఆర్‌ఎస్ ఇన్‌చార్జీలు కృషి చేయాలని బిఆర్‌ఎస్ అధినాయకత్వం జిల్లాలోని కేడర్‌కు ఇన్‌చార్జీలకు సూచించినట్టుగా తెలిసింది. బిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు, ఇన్‌చార్జీలకు బిఆర్‌ఎస్ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రమంత్రులు బిజెపి పార్టీ సైతం అన్ని పురపాలికల్లో పోటీ చేసి మెజార్టీ కౌన్సిలర్లు గెలిపించేందుకు అవసరమైన కసరత్తు చేస్తోంది. దీని కోసం త్వరలోనే ఇన్‌చార్జీలను నియమించనుంది. కేంద్రమంత్రులు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలను రూపొందిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న అసమ్మతే అస్త్రంగా.... పట్టణాల్లో పెరిగిన జీవన వ్యయం, ఇంధన ధరలు, ఆస్తి పన్నులు, ట్రాఫిక్ సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రధాన అంశాలను అస్త్రాలుగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. రిజర్వేషన్ల ప్రక్రియలో కొన్ని చోట్ల అసమతుల్యత ఉందన్న ఆరోపణలు, వార్డు పునర్విభజనలో రాజకీయ లాభనష్టాల కోణం ఉందన్న విమర్శలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు తమ కేడర్‌కు సూచించినట్టుగా తెలిసింది. నిర్లక్షం వద్దు మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్షం వద్దని కేడర్‌కు కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి తమ నేతలకు దిశానిర్ధేశం చేసినట్టుగా తెలిసింది. ఇక కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలకు జిల్లాల్లో మంచి పట్టు ఉండగా బిజెపికి మాత్రం పట్టణ ప్రాంతాల్లో పట్టు ఉంది. దీంతో ఆయా పార్టీలు తాము ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ బలహీనంగా ఉన్నామో ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నట్టుగా తెలిసింది. ఇక, ఈ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని ప్రధాన పార్టీలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. లాబీయింగ్ చేసిన వారికి టికెట్లు ఇస్తే ఎన్నికల్లో విజయావకాశాలు, మెజార్టీ సీట్లు కోల్పోయే చాన్స్ ఉందని ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ప్రజల్లో ఆదరణ ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తే గతంలో కంటే మంచి ఫలితాలు వస్తాయని ప్రధాన పార్టీలు తమ కేడర్‌కు సూచించినట్టుగా సమాచారం.

మన తెలంగాణ 29 Jan 2026 7:10 am

వనమంతా జనమే!

 కన్నెపల్లి నుంచి గద్దెపైకి చేరిన సారలమ్మ మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతం గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజు నేడు గద్దెపైకి చేరనున్న సమ్మక్క విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా మేడారం మన తెలంగాణ/ వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అంబరాన్నంటేలా వనదేవతల సంబురం ఆరంభమైంది. మేడారం మహా జాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిరోజైన బుధవారం రాత్రి కన్నెపల్లినుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకుంది. ఈ ఘట్టంతో నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే మహా జాతరకు అంకురార్పణ జరిగింది. మరోవైపు కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగరం మండలం కొండాయినుంచి గోవిందరాజు కూడా బుధవారంమే గద్దెలపైకి చేరారు. జాతరలోని నలుగురిలో ముగ్గురు ఒకేసారి గద్దెలపై కొలువుదీరారు. దేవతల రాకతో భక్తుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. రెండవరోజైన గురువారం జాతరలో ప్రధాన ఘట్టానికి తెరలేవనుంది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకురానున్నారు. తొలిరోజు కన్నెపల్లి వద్దనున్న సారలమ్మ గుడివద్ద మేడారంలోని కాక వంశీయులైన ఆదివాసీ పూజారులు తమ సంప్రదాయాలతో పూజా విధానం నిర్వహించారు. మేళ తాళాలు, సంప్రదాయ నృత్యాలతో కోలాహలం మధ్య అమ్మవారిని గుడినుంచి జంపన్న వాగు మీదుగా గద్దెల ప్రాంగణానికి తరలించారు. దారిపొడవునా గ్రామానికి చెందిన మహిళలు బిందెలతో నీళ్లు పోసి మంగళహారతులతో స్వాగతించారు. కన్నెపల్లి నుంచి మేడారంలోని గద్దెపైకి సారలమ్మను తీసుకువస్తున్న దారిలో తమ కోరికలు తీర్చాలని వేడుకుంటూ భక్తులు అమ్మవారికి పొర్లు దండాలు చేశారు. పూజారులను తాకేందుకు భక్తులు ఉత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దారిపొడవునా సారలమ్మ ఆశీస్సుల కోసం జనం బారులు తీరారు. వనదేవతలను దర్శించుకునేందుకు ఇప్పటికే లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో మేడారం అటవీ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఎక్కడ చోటు దొరికితే అక్కడే భక్తులు గుడారాలు వేసుకుని వనదేవతల దర్శనానికి వేచిచూస్తున్నారు. భక్తుల నుంచి ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని పూజారులకు పోలీసులు రోప్ పార్టీతో గట్టి బందోబస్త్ ఏర్పాటుచేశారు. శివసత్తుల పూనకాలు...కొమ్ము బూర నాదాలుశివసత్తుల పూనకాలతో మేడారం ఊగిపోతున్నది. చాలాచోట్ల భక్తులు శివాలూగుతున్నారు. దేవుడిని చెబుతున్నారు. కొమ్ము బూర నాదాల మధ్య ఆధ్యాత్మిక భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. భక్తి గీతాలతో మేడారం అంతా మార్మోగిపోతోంది. కొందరైతే కుటుంబంతో కలిసి జంపన్న వాగులో స్నానాలు ఆచరించి డప్పు చప్పుళ్ళతో కాలినడకన అమ్మవార్ల గద్దెలకు వస్తున్నారు. వనదేవతలకు నిలువెత్తు బెల్లం సమర్పించి మొక్కలు చెల్లించుకుంటున్నారు. రెండు కోట్లకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈసారి సరికొత్తగా మేడారం జాతర కనిపిస్తున్నదని భక్తులు చెబుతున్నారు. జాతరకు మంత్రి సురేఖ డుమ్మా తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహా జాతరకు మంత్రి కొండా సురేఖ డుమ్మాకొట్టారు. దేవాదాయ మంత్రి హోదాలో అన్నీ తానై పనిచేయాల్సిన కొండా సురేఖ దూరంగా ఉండడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత జిల్లాలో జరిగే మహా జాతరలో మంత్రి సురేఖ కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవానికితోడు మంత్రిగా పనిచేసినప్పటికీ.. రాజకీయంగా పొసగక పోవడంవల్లనే దూరంగా ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. మంత్రి కొండా సురేఖకు తొలినుంచి మేడారం మహా జాతర విషయంలో విబేధాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జాతరలో కూడా అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క పూర్తిగా జాతరపై పట్టు పెంచుకోవడంతో మరో మంత్రి కొండా సురేఖతో గ్యాప్ పెరిగిందని రాజకీయంగా జోరుగా చర్చ జరిగింది. దేవాదాయ మంత్రి హోదాలో మేడారం జాతరలో తొలిసారి చేసే ప్రయత్నాలకు చెక్ పడడంతో సురేఖ కిమ్మనకుండా ఉన్నట్టు ప్రచారం సాగింది. అయితే ఈసారి జాతర నిర్వహణలో మరోసారి మంత్రులమధ్య విబేధాలు తలెత్తి.. తారాస్థాయికి చేరుకున్నాయి. ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి అస్త్రంగా మంత్రి సురేఖ కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. జాతరలో ప్రభుత్వపరంగా చేపట్టే పనులు తనకు తెలియకుండా జరుగుతున్నాయని మంత్రి సురేఖ ఆరోపించడంతో వివాదం చెలరేగింది. దాదాపు 250 కోట్లతో మేడారంలో చేపట్టిన పనుల పర్యవేక్షణ కూడా చేయలేదు. ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి చేపట్టిన సమీక్షకు కూడా మంత్రి సురేఖ గైర్హాజరయ్యారు. చిలికి చిలికి గాలివానలా మారిన వివాదం ప్రభుత్వపెద్దల జోక్యంతో సద్దుమణిగింది. తర్వాత్ జరిగిన సమీక్షలకు మొక్కుబడిగా మంత్రి సురేఖ హాజరయ్యారు. ఇకనుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జాతర నిర్వహణ ఉంటుందని భావించినప్పటికీ.. మంత్రి సురేఖ మాత్రం మేడారంవైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే మహా జాతర బుధవారంనుంచి ప్రారంభమైంది. ఈ సమయంలోనైనా జాతరలో ఉంటుందని ఊహించినప్పటికీ మంత్రి సురేఖ జాడ లేకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. సుమారు 3కోట్ల భక్తులు దర్శించుకునే సమ్మక్క, సారలమ్మ జాతరను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తుండగా జాతరను పర్యవేక్షించాల్సిన దేవాదాయ శాఖ మంత్రి జాడ లేకపోవడం పలు సందేహాలకు తావిస్తున్నది. గత మూడు నెలలుగా జాతర కోసం అక్కడే తిష్ట వేసి మంత్రి సీతక్క పనులు చేస్తున్నది. అయితే ఆమెతో వైరం పెంచుకోవడం ఇష్టం లేకనే మంత్రి సురేఖ దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కిన మేడారం జాతర సమయంలో దేవాదాయ శాఖ మంత్రి హోదాలో సురేఖ ఉంటే బాగుండేదని చర్చించుకొంటున్నారు

మన తెలంగాణ 29 Jan 2026 6:50 am

రేపు దానం విచారణ

మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఈ నెల 30న విచారణకు హాజరుకావాల్సిందిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటిసు జారీ చేశారు. పిటిషనర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటిసు జారీ చేశారు. అదే రోజున విచారణకు హాజరుకావాల్సిందిగా నోటిసులో పేర్కొన్నారు. ఇదిలాఉండగా నోటీసు రావడంతోనే వెంటనే స్పందించిన దానం నాగేందర్ తాను పార్టీ ఫిరాయించలేదంటూ స్పీకర్‌కు అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. పూర్వపరాల్లోకి వెళితే తమ పార్టీ నుంచి ఎన్నికైన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని బిఆర్‌ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా వీరిలో ఏడుగురు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి. ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవని, వారు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలేనని నిర్థారిస్తూ స్పీకర్ తీర్పు వెలువరించారు. ఇంకా మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కె. సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు అక్టోబర్‌లో స్పీకర్‌ను ఆదేశించింది. దీంతో స్పీకర్ సుప్రీం తీర్పును అమలు చేయకుండా ధిక్కరణకు పాల్పడ్డారని దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్‌పై ఈ నెల 19న సుప్రీం కోర్టు విచారణకు చేపట్టింది. స్పీకర్ అసెంబ్లీ సమావేశాల్లో బిజిగా ఉన్నందున, కామన్‌వెల్త్ పార్లమెంటు సమావేశాలకు హాజరైనందున సమయం సరిపోలేదని, దీంతో మరో నాలుగు వారాల గడువు కావాలని కోరడంతో సుప్రీం కోర్టు అందకు అంగీకరించినా, మీకు ఇదే చివరి అవకాశం అని హెచ్చరిక చేసింది.. దీంతో స్పీకర్ మిగతా ముగ్గురి విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే దానంకు నోటీసు పంపించారు. ఇంకా కె. సంజయ్, కడియం శ్రీహరి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలాఉండగా దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొంది. --++--

మన తెలంగాణ 29 Jan 2026 6:40 am

మేడారం జాతరను జాతీయ పండుగ గా ప్రకటించాలి: జాజుల

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆసియా ఖండం లోనే అతి పెద్ద గిరిజన జాతర, తెలంగాణ రాష్ట్ర కుంభమేళా గా ప్రసిద్ధి చెందిన మేడారం లో వెలసిన సమ్మక్క, సారక్క పండుగ ను కేంద్రం ప్రభుత్వం తక్షణమే జాతీయ పండుగ గా ప్రకటించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. మేడారం లో వెలసిన వన దేవతలు సమ్మక్క సారలమ్మ లను యాబై మంది బిసి కులాల రాష్ట్ర అధ్యక్షుల తో కలిసీ జాజుల దర్శించుకున్నట్లు వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ ల జీవిత చరిత్రను బౌవిష్యత్ తరాలకు చేర్చడానికి పాఠ్య పుస్తకాల్లో చేర్చడంతో పాటు మొత్తంగా గ్రంథస్తం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి జిల్లా, భువనగిరి జిల్లాకు యాదాద్రి జిల్లా , గద్వాల జిల్లాకు జోగులాంబ జిల్లా అని పేరు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు ఎందుకు పెట్టడం లేదని తక్షణమే ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మల జిల్లాగా పేరు పెట్టాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. కోట్లాదిమంది తరలివచ్చే మేడారం జాతర ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్న సమ్మక్క సారమ్మల వారసురాలు మంత్రి సీతక్కకు జాజుల శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

మన తెలంగాణ 29 Jan 2026 6:40 am

సామాజిక న్యాయానికి పెద్దపీట

 పదేళ్ల పాలనలో 25 కోట్లమందికి పేదరికం నుంచి విముక్తి పేదలకు 4 కోట్ల పక్కాఇళ్లు వందకోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు 95కోట్ల మందికి సామాజిక భద్రత ఆయుష్మాన్ భారత్ కింద 11 కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి న్యూఢిల్లీ: దేశంలో అన్నివర్గాలకు సామాజిక న్యాయం, భద్రత కల్పించేందుకే తమ ప్రభు త్వం నిరంతరం కృషిచేస్తున్నదని బుధవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రభుత్వం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ ( అందరితో అభివృద్ధి, అందరికీ అనే దృక్పథం తో అన్నివర్గాల ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా దళితులు, వెనుకబడినవర్గాలు, అణగారిన, గిరిజన వర్గాల కోసం కృషిచేస్తున్నదన్నారు. 2014 ప్రారంభంలో, సామాజిక భద్రతా పథకాలు కేవలం 25 కోట్ల మంది పౌరులకే చేరువయ్యాయని,తమ ప్రభుత్వం నిరంతర కృషి వల్ల, నేడు దాదాపు 95 కోట్ల మంది భారతీయులకు సామాజిక భద్రత కల్పించబడిందని రాష్ట్రపతి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎప్పుడూ సమానత్వం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వ నిబద్ధత వల్లనే గత దశాబ్దంలో 25 కోట్ల మంది పౌరులు పేదరికాన్ని అధిగమించారని ముర్ము చెప్పారు.గత పదేళ్ల కాలంలో పేదలకోసం నాలుగు కోట్ల పక్కాఇళ్లు నిర్మించామని చెప్పారు.గత ఏడాదిలోనే 32 లక్షల కొత్త ఇళ్లను పేదలకు కల్పించిన విషయాన్ని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కింద గత ఏడాది 11 కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు అందాయని, ఆస్పత్రులలో చేరిన రెండున్నర కోట్ల మందికి ఉచిత చికిత్స లభించిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, దేశవ్యాప్తంగా 1.80 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లు పనిచేస్తున్నాయని ముర్ము వివరించారు. జాతీయ అనీమియా నివారణ మిషన్ కింద 6.5 కోట్ల మంది మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాలలోని వారికి పరీక్షలు నిర్వహించి, వ్యాధిని గుర్తించడంతో సమర్థవంతంగా నివారణ సాధ్యమవుతున్నదన్నారు. భారత సైనిక దళాల పాటవం గర్వకారణం భారత సైనిక దళాలు ఆపరేషన్ సిందూర్ , తర్వాత జరిగిన ఘర్షణలో చూపిన ధైర్యసాహసాలు దేశానికే గర్వకారణమని రాష్ట్రపతి అన్నారు. టెర్రరిస్ట్ శిబిరాలను నేలమట్టం చేయడం ద్వారా ప్రపంచానికి భారత సైనిక సత్తా చాటారన్నారు. జాతీయ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు మిషన్ సుదర్శన్ చక్ర పై దేశం కృషిచేస్తున్నదని రాష్ట్రపతి తెలిపారు. మావోయిస్ట్ ఉగ్రవాదం పై భద్రతా దళాలు నిర్ణయాత్మక చర్య తీసుకున్నాయని ప్రశంసించారు. 

మన తెలంగాణ 29 Jan 2026 6:20 am

నయీం కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన ఇడి

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణను వేగవంతం చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఇడి అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని రంగారెడ్డి కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఛార్జిషీటును పరిగణలోకి తీసుకుని పరిశీలించిన కోర్టు విచారణకు స్వీకరించింది. కాగా, నయీం తన గ్యాంగ్‌తో సంపాదించిన సుమారు రూ.11.30 కోట్ల విలువైన 91 ఆస్తులను గుర్తించిన ఇడి పాశం శ్రీనివాస్, హసీనా బేగం, మహమ్మద్ తాహెరా బేగం, మహమ్మద్ సలీమా బేగం, మహమ్మద్ అబ్దుల్ సలీమ్, అహేలా బేగం, సయ్యద్ నీలోఫర్, ఫిర్దౌస్ అంజుమ్, మహమ్మద్ ఆరిఫ్,హీనా కౌసర్ అనే పది మందిపై అభియోగాలు మోపింది. ఆస్తులు బలవంతంగా బాధితులను బెదిరించి రిజిస్టర్ అయినట్లుగా గుర్తించారు. అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోని షాపింగ్ కాంప్లెక్స్‌లు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ నయీం తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై బినామీలుగా రిజిస్టర్ చేసినట్లుగా అధికారులు ధృవీకరించారు. కేసులో నయీం భార్య హసీనా బేగంతో పాటు పలువురు కుటుంబ సభ్యుల పేర్లను ఇడి తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.

మన తెలంగాణ 29 Jan 2026 6:20 am

రాజకీయ లబ్ధి కోసమే..

బ్రూవరీలకు బిఆర్‌ఎస్ హయాంలోని నిబంధనలే అమలు మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే అడ్డగోలు ఆరోపణలు: మంత్రి జూపల్లి మన తెలంగాణ/హైదరాబాద్ : బ్రూవరీలకు అనుమతులకు బిఆర్‌ఎస్ హాయాంలో ఉన్న నిబంధనలే ఉన్నాయని, బిఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన రవీంధ్ర భారతిలో మీడియాతో మాట్లాడుతూ బ్రీవరీలకు సంబంధించి రెండేళ్లలో ఎటువంటి కొత్త చట్టం తీసుకురాలేదని 2015 ఆగస్ట్‌లో జారీ చేసిన జీఓ నెంబర్ 151 ద్వారానే నిబంధలు ఉన్నాయన్నారు. ఆ జీఓ ప్రకారమే 2016లో 20 కంపెనీలకు అనుమతిచ్చారని, 50 దరఖాస్తులు వస్తే ఎటువంటి లాటరీ విధానం పాటించకుండా 20 దరఖాస్తులకు అనుమతిచ్చినట్లు చెప్పారు. మైక్రో బ్రీవరీలకు సంబంధించి అనుమతుల కోసం తన వద్దకు ఎలాంటి ఫైళ్లు రాలేదని, సంబంధిత శాఖకు మాత్రమే వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు. కొత్త బ్రీవరీలకు దరఖాస్తులు వస్తే- ఆయా సంస్థలకు ఉన్న భూ లభ్యత, మౌలిక వసతులపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే- అప్పుడు వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గత బిఆర్‌ఎస్ హయాంలో 105 ఎలైట్ బార్లకు అనుమతి ఇచ్చారని, లాటరీ లేకుండా నచ్చిన వారికి అనుమతులు ఇచ్చింది నిజం కాదా అని నిలదీశారు. ప్రతి 15 రోజులకు బకాయిలు చెల్లిస్తే బిఆర్‌ఎస్ హయాంలో ఎక్సైజ్ శాఖలో రూ. 3,500 కోట్లు ఎలా బకాయిలు పడ్డాయని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది బిఆర్‌ఎస్ అని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఎక్సైజ్ ఆదాయం రూ. 10, 012 కోట్లు మాత్రమేనని, 2014 నుండి 2023 వరకు ఎక్సైజ్ ఆదాయాన్ని రూ. 34,869 కోట్లకు పెంచారని దుయ్యబట్టారు. సింగూర్ జలాలను బీర్ల కంపెనీలకు తరలిస్తున్నారని, క్రాప్ హలిడే ప్రకటించారని విమర్శలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కంపెనీకి అనుమతి ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 29 Jan 2026 6:10 am

అభ్యర్థుల ఎంపికలో అప్రమత్తంగా ఉండండి

పార్టీ నేతలకు అమెరికా నుంచి సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశం అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులదే: పిసిసి చీఫ్ మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక, గెలిపించుకునే బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులదేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇదిలాఉండగా అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కూడా మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. నామినేషన్ల దాఖలుకు రెండే రోజులు ఉన్నందున అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఇదివరకే లోక్‌సభ వారీగా నియమించిన ఇన్‌ఛార్జి మంత్రులు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. పోటీ చేసేందుకు ఆశావాహుల్ సంఖ్య ఎక్కువ ఉన్నట్లయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో జిల్లా పార్టీ ముఖ్యులతో, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థుల ఎంపికకు వడపోసే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి పేరు ఉన్న నాయకులను, ఇంకా బలమైన నాయకులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. ఏకాభిప్రాయం కుదర్చకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే తిరుగుబాటు తలనొప్పులు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలపై వార్ రూంలో చర్చించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సహపంక్తి భోజనం కార్యక్రమం కుదింపు బుధవారం నుంచి శనివారం (31) వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామ పథకం కూలీలతో కలిసి సహపంక్తి భోజనం చేయాలనుకున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన కార్యక్రమాన్ని కుదించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున ఈ కార్యక్రమాన్ని కుదించుకుని, బుధవారం మెదక్ జిల్లా, మానుకొండూలో గ్రామ సభలో మాత్రమే పాల్గొన్నారు.

మన తెలంగాణ 29 Jan 2026 6:00 am

29th jan 2026 |నేటి పంచాంగం

29th jan 2026 | నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు

ప్రభ న్యూస్ 29 Jan 2026 6:00 am

ఇరాన్ దిశగా మరిన్ని యుద్ధనౌకలు

` వాటిని వినియోగించే అవసరం రాకూడదని ఆశిస్తున్నా ` ట్రంప్ హెచ్చరికలు వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు చేశారు మరిన్ని యుద్ధనౌకలు ఆ …

జనం సాక్షి 29 Jan 2026 5:52 am

మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం

` పార్టీ పనితీరు, గెలుపు అవకాశాలు లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ` మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్‌గానే తీసుకుంది ` సీఎం లేనప్ప్పుడు మంత్రులు తనను కలవడంలో …

జనం సాక్షి 29 Jan 2026 5:50 am

మహా డిప్యూటీ సిఎం అజిత్‌పవార్ దుర్మరణం

బారామతి ఎయిర్‌పోర్ట్ సమీపంలో నేల కూలిన విమానం ఉప ముఖ్యమంత్రి పవార్, మరో నలుగురు మృతి మృతుల్లో పైలట్ కెప్టెన్ సుమిత్‌కుమార్, ఫస్ట్ లేడీ ఆఫీసర్ శాంభవీ పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలీ, పవార్ వ్యక్తిగత సహాయకుడు విదిప్ జాదవ్  బారామతి : మహారాష్ట్రలో బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన న్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మరాఠా సీనియర్ నేత అజిత్ పవార్, మరో నలుగురు మృతి చెందారు. ప్రమాదానికి కారణాలు ఏమిటనేవి వెనువెంటనే తెలియలేదు. అయితే అత్యవసర లాండింగ్ పరిస్థితుల్లో తలెత్తిన విషమ పరిస్థితితోనే ఈ ఛార్టెడ్ ఫ్లెయిట్ రెండు ముక్కలై పోలిపోయిందని ప్రాధమికంగా తేలింది. బుధవారం ఉదయం పుణే జిల్లాలోని పవార్‌ల బలీయ ప్రాంతమైన బారామతిలోని విమానాశ్రయం వద్దనే ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలో దాదాగా పిలవబడే 66 సంవత్సరాల అజిత్ పవార్ ఎన్‌సిపి చీలిక వర్గం అధినేతగా ఉన్నారు. ఆయన ఫిబ్రవరి 5వ తేదీన జరిగే జడ్‌పి ఎన్నికల్లో ప్రచారానికి ముంబై నుంచి బయలుదేరారు. ఈ విమానాన్ని ఢిల్లీకి చెందిన విఎస్‌ఆర్ వెంచర్స్ నిర్వహిస్తోంది. ముంబై నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరిన తరువాత ఈ లియర్‌జెట్ 45 ఛార్టెడ్ విమానం దాదాపు 8.45 ప్రాంతంలో రాడార్ వ్యవస్థలో కన్పించకుండా పోయింది. సరిగ్గా ఐదు నిమిషాల్లో అంటే 8.50 నిమిషాలకు విమాన పతనం జరిగింది. పవార్‌తో పాటు ఈ ప్రమాదంలో మరణానికి గురైన వారిలో ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఓ అటెండెంట్ ఇద్దరు విమాన సిబ్బంది పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ సుమిత్ కుమార్, ఫస్ట్ లేడి ఆఫీసరు కెప్టెన్ శాంభవి పాఠక్ ఉన్నారని విమానయాన వ్యవహారాల డిజిసిఎ అధికారి ప్రకటన వెలువరించారు. ప్రమాదం తరువాత విమానంలో మంటలు చెలరేగాయని జిల్లా ఎస్‌పి సందీప్ సింగ్ గిల్ తెలిపారు. పూర్తిగా గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉన్న స్థితిలో మృతదేహాలను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అత్యంత సీనియర్ నేత అయిన శరద్ పవార్ అజిత్ పవార్‌కు బాబాయి అవుతారు. అజిత్ పవార్‌కు భార్య సునేత్ర ఇద్దరు కుమారులు పార్ధ్ , జై ఉన్నారు. భార్య సునేత్ర రాజ్యసభ ఎంపి. మంటల్లో దగ్ధమైన విమానం బారామతి విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ సమయంలో విమానంలోపల సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం కూలిపోయే ముందు విమానం కుదుపులకు గురైంది. తరువాత మంటలు చెలరేగాయి. ఈ దశలోనే నాలుగు అయిదు సార్లు పేలుళ్ల చప్పుళ్లు విన్పించాయి. అయితే ఈ విషయాలను అధికారులు నిర్థారించలేదు. రాష్ట్రపతి, ప్రధాని ప్రముఖుల సంతాపం అజిత్ పవార్ ఇతరులు విమాన ప్రమాదంలో మృతిచెందిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రగతికి అజిత్ పవార్ సర్వదా పాటుపడ్డారని కొనియాడారు. ప్రత్యేకించి రాష్ట్రానికి అత్యవసరం అయిన సహకార రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమ స్పందనలో అజిత్ పవార్‌కు జన బాహుళ్యంతో ఉన్న బంధం విస్తృతం అన్నారు. అకాల మరణంతో రాజకీయాల్లో అగాథానికి దారితీసిందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎన్‌డికు కుటుంబానికరే కాకుండా తనకు కూడా వ్యక్తిగతంగా బాధాకరం అని ప్రకటన వెలువరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ ముంబైలో మాట్లాడుతూ ఈ విషాద వార్త తనకు నమ్మశక్యంగా కాకుండా ఉందన్నారు. తాను ఓ మంచి స్నేహితుడిని కోల్పోయ్యానని చెప్పారు. ఆయన లేని లోటును పూడ్చడం కస్టమని తెలిపారు. ఘటనా స్థలికి శరద్ పవార్ .. బోరున విలపించిన ఎంపి సుప్రియా అజిత్ పవార్ దుర్మరణం గురించి తెలియగానే సీనియర్ నేత శరద్ పవార్ కొద్ది మంది నేతలతో కలిసి బారామతి ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి వెంటనే అజిత్ పవార్ భౌతిక కాయం ఉంచిన స్థానిక మెడికల్ కాలేజ్ వద్దకు కూడా వెళ్లారు. బారామతి ఎంపి సుప్రియా సూలే ఈ ఘటనతో షాక్ అయ్యారు. 

మన తెలంగాణ 29 Jan 2026 5:50 am

అనర్హతపై వేగం పెంచిన స్పీకర్ దానంకు నోటీసులు

` రేపు స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ …

జనం సాక్షి 29 Jan 2026 5:49 am

వికసిత్ భారత్ వైపు దేశం పయనిస్తోంది

` పదేళ్లలో పేదల కోసం 4కోట్ల ఇళ్ల నిర్మాణం ` జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు ` వందేభారత్, అమత్ భారత్ రైళ్ల ద్వారా …

జనం సాక్షి 29 Jan 2026 5:48 am

హైదరాబాద్ వేదికగా అఖిలభారత పోలీస్ ఫుట్ బాల్ సమరం

` మార్చిలో నిర్వహణ ` ఏర్పాట్లపై బి శివధర్ రెడ్డి సమీక్ష హైదరాబాద్(జనంసాక్షి): జనవరి 28:74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ …

జనం సాక్షి 29 Jan 2026 5:47 am

రాష్ట్రంలో మరో కుంభకోణం

` ఎక్సైజ్ శాఖలో మైక్రో బేవరేజెస్‌కు అనుమతుల్లో అవినీతి:హరీశ్‌రావు హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో మరో అవినీతి కుంభకోణాన్ని బయటపెడుతున్నట్లు మాజీ మంత్రి, బీఆరఎస్ నేత హరీశ్ రావు తెలిపారు. …

జనం సాక్షి 29 Jan 2026 5:45 am

ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం …

జనం సాక్షి 29 Jan 2026 5:44 am

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

` ఆయనతో పాటు ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలెట్లు మతి ` ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి యత్నించి.. బండరాయిని ఢీ కొట్టడంతో దుర్ఘటన ` ఎన్నికల ప్రచారం నిమిత్తం …

జనం సాక్షి 29 Jan 2026 5:43 am

నాలుగో టి20లో కివీస్ గెలుపు

విశాఖపట్నం: నాలుగో టి20 భారత్ చిత్తయింది. వరుస విజయాలతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాకు న్యూజిలాండ్ షాకిచ్చింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో50 పరుగుల తేడాతో సూర్యాకమార్ సేనాను చిత్తు చేసింది కివీస్. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో దెవోన్ కాన్వే(44), టిమ్ షెఫార్ట్(64)లు టీమిండియా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. తొలి వికెట్‌కు 101 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరికి తోడు డారీల్ మిఛెల్(38), గ్లెన్ ఫిలిఫ్స్(24)లు బ్యాట్ ఝలిపించడంతో కివీస్ భారీ స్కోరు చేయగలిగింది. అనంరతం లక్ష ఛేదనకు దిగిన టీమిండియాకు అదిలో గట్టి షాక్ తగిలింది. ఫించ్ హిట్టర్ అభిషేక్ శర్మ(0) పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు. అనంతరం సంజూ సామ్‌సన్(24) కాసేపు మెరిసినా.. పరుగులు రాబట్టలేక పోయాడు. సాట్నర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్‌కు దారిపట్టాడు. సూర్యా కుమార్(8) సయితం రాణించలేక పోయాడు. రింకు సింగ్(39), శివం ధూబె(64) బ్యాట్ ఝలిపించినా మిగతావారెవరూ రాణించక పోవడంతో పూర్తి ఓవర్లు ఆడకుండానే 165 పరుగులకే టీమిండియా చాపచుట్టేసింది. దీంతో భారత్ ఘోరపరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. 

మన తెలంగాణ 28 Jan 2026 11:30 pm

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో ’స్పిరిట్’, ’ఫౌజి’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ’స్పిరిట్’ను వచ్చే ఏడాది మార్చిలో విడుదలకు ప్లాన్ చేస్తుండగా, ’ఫౌజి’ ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలున్నాయి. ఈ రెండు చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ’కల్కి 2898 ఎడి: పార్ట్ 2’ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే పార్ట్ 2 షూట్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది కానీ ప్రభాస్ ఇతర సినిమాల మూలాన ఆగుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం కల్కి 2 సినిమా షూట్ కి ప్రభాస్ సిద్ధమైనట్టు తెలిసింది. కల్కి 2 షూట్‌ని ఫిబ్రవరి 2 నుంచి డార్లింగ్ మొదలు పెట్టనున్నాడట. దీనితో పాటు స్పిరిట్ షూట్‌ని కూడా ప్రభాస్ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తాడని తెలిసింది. ఇక ఈ భారీ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. వైజయంతి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ‘కల్కి’ ఫస్ట్ పార్ట్‌లో దీపికా పదుకొనే నటించిన సుమతి పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు దీపిక స్థానం కోసం మొదట అలియా భట్, ప్రియాంకా చోప్రా, అనుష్క శెట్టి, శ్రద్ధా కపూర్, కల్యాణి ప్రియదర్శన్ పేర్లు వినిపించాయి. ముఖ్యంగా ప్రియాంకా చోప్రా పేరు గట్టిగా ప్రచారంలోకి వచ్చినా, చివరికి ఈ కీలక పాత్రకు సాయి పల్లవి పేరు బలంగా వినిపిస్తోంది. సాయి పల్లవి అయితే ’కల్కి 2’ స్టోరీకి, ప్రభాస్‌కు జోడీగా సెట్ అవుతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడనే టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

మన తెలంగాణ 28 Jan 2026 10:59 pm

సహకరించండి

కేంద్ర మంత్రులకు పవన్‌ విజ్ఞప్తి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి అనేక కీలక అంశాలపై చర్చించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర గోడ నిర్మాణానికి సంబంధించి కాకినాడ జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రతిపాదనను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ముందు ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించినందుకు అమిత్‌ షాకు కృతజ్ఞతలు తెలిపారు. […] The post సహకరించండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Jan 2026 10:55 pm

కేంద్ర మంత్రికి నిరసన సెగ

. కార్మిక సంఘాల ఐక్యవేదిక మెరుపు ఆందోళన. లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలంటూ నినాదాలు. పోలీసులు, కార్మిక సంఘాల మధ్య వాగ్వాదం. కేంద్ర మంత్రికి, అధికారులకు వినతి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర పర్యటన నిమిత్తం వచ్చిన కేంద్ర మంత్రికి కేంద్ర కార్మిక సంఘాల నుంచి ఊహించని నిరసన సెగ ఎదురైంది. విజయవాడ రింగ్‌ రోడ్డులోని నోవోటెల్‌లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి శోభా కరంధాంజే రెండు రోజులుగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ […] The post కేంద్ర మంత్రికి నిరసన సెగ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Jan 2026 10:50 pm

మేడారం జాతరకు అధికారికంగా సెలవు దినం ప్రకటించాలి

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క-సారక్క జారతకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పెద్ద జాతర అని చెప్పుకుంటున్న ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం విడ్డూరమని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రెండేళ్లకోసారి కనీవినీ ఎరుగని రీతిలో గిరిజన వేడుక జరగడం తెలంగాణకే తలమానికమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడంబరాలు చేస్తోందని, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడటం లేదన్నారు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపుని ఇవ్వకపోవడం శోచనీయమని, ఆడంబరాలతో గుర్తింపు రాదని ఎద్దేవా చేశారు. మేడారం జాతరలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 30, 31 వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా అధికారిక సెలవు దినం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. తూతూ మంత్రంగా జాతర జరిగే ప్రాంతాలలో ఆప్షన్ హాలిడే ఇవ్వడం, తర్వాత వచ్చే నెలలో రెండో శనివారం రద్దు చేస్తూ దానిని పని దినంగా నిర్వహించడం అనేది దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఇంటిల్లిపాది సమ్మక్క సారక్క తల్లులను కొలిచేందుకు తరలి వెళ్తున్నారని, ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు, పత్రికా ప్రకటనలకు పరిమితం కాకుండా అధికారికంగా సమ్మక్క సారక్క వేడుకలకు సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 28 Jan 2026 10:22 pm

ఫ్యాక్ట్ చెక్: తెలంగాణలోని నల్గొండలో చోటు చేసుకున్న ఘటనను ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుందిగా ప్రచారం చేస్తున్నారు

తెలంగాణలోని నల్గొండలో చోటు చేసుకున్న ఘటనను ఉత్తరప్రదేశ్ లో

తెలుగు పోస్ట్ 28 Jan 2026 10:14 pm

జైళ్లలో సంస్కరణలు తీసుకువస్తాం: బండి సంజయ్

 జైళ్ల ఆధునీకరణ, హైసెక్యూరిటీ జైళ్ల నిర్మాణం కోసం రూ.950 కోట్ల కేటాయింపు  పేద ఖైదీలకు మద్దతు పథకం కింద ఏటా రూ.20 కోట్లు కేటాయింపు  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  విశాఖపట్నంలో ‘జైలు అధికారుల 9వ జాతీయ సమ్మేళం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి మన తెలంగాణ / అమరావతి : దేశవ్యాప్తంగా జైళ్ల బలోపేతంతోపాటు ఆయ జైళ్లను సంస్కరించి ఖైదీల్లో మార్పు తీసుకురావడంపై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు కింద రూ.950 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.. హై-సెక్యూరిటీ జైళ్లతోపాటు ఆయా జైళ్లలో భద్రతా మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలోని సాయిప్రియా రిసార్ట్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన “జైలు అధికారుల 9వ జాతీయ సమ్మేళం’ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీపీఆర్‌డీ డైరెక్టర్ అలోక్ రంజన్, ఏపీ జైళ్ల శాఖ డీజీ అంజనీకుమార్, ఉన్నతాధికారులు రవి లోకు, జితేంద్ర మీనా, తెలంగాణ జైళ్ల డీజీ సౌమ్య మిశ్రాతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన జైళ్ల ఉన్నతాధికారులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ విశాఖపట్నంలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఆంధ్రప్రదేశ్ కారాగారాలు, సవరణ సేవల విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘జైలు అధికారుల 9వ జాతీయ సమ్మేళం’ దేశవ్యాప్తంగా జైలు సంస్కరణలను మరింత బలోపేతం చేసే కీలక వేదికగా నిలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ సదస్సు ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన కరెక్షనల్ అడ్మినిస్ట్రేటర్స్ పరస్పర అనుభవాలను పంచుకునే అవకాశం లభించడమే కాకుండా, ఉత్తమ ఆచరణల, వినూత్న కార్యక్రమాల, విధానపరమైన అవసరాలుపై లోతైన చర్చ జరగడం ద్వారా జైలు పరిపాలన నాణ్యతను మెరుగుపర్చేందుకు అవసరమైన కార్యాచరణకు మార్గం సుగమం చేస్తోందని వివరించారు. పునరావాసం అంశాలపై దృష్టి సారించాలి కస్టడీలో ఉంటూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న పేద ఖైదీల సంరక్షణ, మోడల్ జైలు ప్రమాణాల అమలు, ఖైదీల విడుదల అనంతర పునరావాసం వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు. పేద ఖైదీలకు మద్దతు పథకం, జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు అమలులో వ్యూహాలు, మోడల్ ప్రిజన్ మాన్యువల్-2016, మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ చట్టం- 2023 అమలులో సవాళ్లపైనే ఈ సదస్సులో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత - సెక్షన్ 479 అమలు, జైళ్లలో సాంకేతికత వినియోగం, ఆధార్ ధృవీకరణ, వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీమెడిసిన్, జైలు శిక్షణా సంస్థల ప్రామాణీకరణ, గుర్తింపు వంటి అంశాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం నిరంతరం మార్గదర్శనం జైళ్లలో సంస్కరణలకు విధాన మార్గదర్శకాలు, చట్టపరమైన నిర్మాణం, లక్ష్యిత పథకాల ద్వారా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిరంతరం మార్గదర్శనం చేస్తోందని పేర్కొన్నారు. పేద ఖైదీలకు మద్దతు పథకం కింద ఏటా రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని, ఇప్పటివరకు 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 237 మంది ఖైదీలకు ఈ పథకం ద్వారా ఉపశమనం లభించిందని అన్నారు. జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు కింద మొత్తం రూ.950 కోట్లు కేటాయించామని వెల్లడించారు. హై-సెక్యూరిటీ జైళ్లు, భద్రతా మౌలిక సదుపాయాల బలోపేతమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని, 2025 -26 ఆర్థిక సంవత్సరానికి రూ.101.45 కోట్లు కేటాయించినట్లు వివరించారు. పరిశోధనాధారిత ప్రమాణాలు, సామర్థ్యవృద్ధి కార్యక్రమాల ద్వారా మానవీయ, సురక్షిత, సంస్కరణాత్మక జైలు వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక దృషి జాతీయ జైలు శిక్షణ విధానం-2025 ద్వారా మానవ హక్కులు, వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. 1997 నుంచి ఇప్పటివరకు 701 శిక్షణా కోర్సులు నిర్వహించి 15,875 మంది జైలు అధికారులకు శిక్షణ అందించారని తెలిపారు. జైలు పరిపాలన రాష్ట్ర అంశమైనప్పటికీ, కేంద్రం-రాష్ట్రాల సమన్వయంతో సురక్షితమైన, మానవీయమైన, పునరావాస దృష్టితో కూడిన జైలు వ్యవస్థను నిర్మించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో జరిగే చర్చలు, తీర్మానాలు భవిష్యత్తు పాలసీలు, చట్టాలు, పరిపాలనా సంస్కరణలకు దిశానిర్దేశం చేయాలని కోరారు.

మన తెలంగాణ 28 Jan 2026 10:04 pm

Rajinikanth working on his Autobiography

Superstar Rajinikanth is busy with Jailer 2 and the film releases in August this year. He will soon kick-start the shoot of his next film that will be produced by Kamal Haasan. The veteran actor announced that he is working on his Autobiography. His daughter Soundarya Rajinikanth has revealed that Superstar has started working on […] The post Rajinikanth working on his Autobiography appeared first on Telugu360 .

తెలుగు 360 28 Jan 2026 9:51 pm

రాష్ట్రంలో మరో కొత్త స్కామ్‌కు తెర: హరీశ్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం బీరు కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. మీకు బీరు కంపెనీలు ముఖ్యమా... రైతులు ముఖ్యమా అంటే బీరు కంపెనీలే ముఖ్యం అంటున్నారని ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన హరీశ్ రావు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా సింగూరు డ్యాం రిపేర్ పేరు మీద రైతులకు క్రాఫ్ హాలిడే ప్రకటించారని ఈ ప్రాజెక్టు కింద. 40వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు. మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్ట కింద 30వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు. ఇదే సంగారెడ్డి జిల్లాలో ఉన్న బీరు కంపెనీలకు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా నీటి సరఫలా జరుగుతోందని ఇది మద్యం తయారీదారు ప్రభుత్వమా? లేక రైతు ప్రభుత్వమా? అని నిలదీశారు. అబ్కారీ శాఖ స్పెషల్ సీఎస్ సంగారెడ్డి జిల్లాకు వెళ్లి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై రైతులకు నీటి సరఫరా ఆపి బీర్ల కంపెనీలకు నీటి కొరత రాకుండా చూడండని ఆదేశించారని ఆరోపించారు. తెలంగాణలో మరో కొత్త స్కామ్ జరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అబ్కారీ శాఖలో ఓ ముఖ్యనేత, మంత్రి కోటా కింద అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖలో కొత్తగా మైక్రో బేవరేజెస్ కు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ఇందుకోసం 110 అప్లికేషన్లు వస్తే తొలుత 25 ఇవ్వబోతున్నట్లు చెప్పారు. అయితే ఇందులో మంత్రి కోటా 4, మరో ముఖ్య నేత కోటా కింద 21 మైక్రో బెవరేజులను సెలెక్ట్ చేసుకున్నారని పంచుకున్నారని ఆరోపించారు. ఈ మధ్య ముఖ్య నేతకు తోడై, నీడై, ఇంట్లోనే ఆ నాయకుడు ఉంటున్నాడని, ఈ మధ్య వార్తల్లో కూడా ఉన్నారని ఆరోపించారు. కారు నేరుగా ముఖ్య నేత ఇంట్లోకి వెళ్తుందని, ఈ మధ్య ఈ ముఖ్య నేత తిరుపతి వెళితే సదరు నేత నీడగా వెంటే ఉన్నాడని ఆరోపించారు. ఒక్కో బ్రూవరీకి 1.80 కోట్లుగా ధర నిర్ణయించారని ఇందులో రూ.ఒక్కటిన్నర కోటి ముఖ్యనేతకు, మిగతా రూ.30 లక్షలు తోడు నీడ కు అని ఆరోపించారు. 21 తోడు నీడ ఫైనల్ చేసుకుంటే 4 మంత్రి ఫైనల్ చేసుకున్నారన్నారు. మైక్రో బేవరేజీల కోసం 110అప్లికేషన్లు వచ్చాయని అంటున్నారని అలాంటప్పుడు వైన్స్‌లకు లాటరీ తీసినట్టు వీటికి ఎందుకు లాటరీ తీయడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనివిధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు 4500 కోట్లు బకాయిలు పడ్డారని, కొన్ని బకాయిలు 16 నెలలకు పైబడి ఉన్నాయన్నారు. గతంలో ఎన్నడు కూడా ఈ విధమైన పరిస్థితి లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో 15 రోజుల్లో చెల్లింపులు జరిగేవన్నారు. బకాయిల వల్ల సరఫరా ఆగిపోయిందని దీంతో చాలా షాపుల్లో సరుకు అందుబాటులో లేకుండా పోతోందన్నారు. ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు కూడా సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించాయని లేఖలు కూడా రాశాయన్నారు. వాటాల పంపకాల్లో తేడాతోనే బకాయిలు నిలిచిపోయాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో మరికొన్ని బ్రాండ్స్ నిలిపివేసే పరిస్థితి ఉన్నదని దీనితో ప్రభుత్వం ఆదాయం పడిపోతోందన్నారు. ఇప్పటికే హాలోగ్రామ్ టెండర్లు విషయంలో ముఖ్య నేత అల్లుడుకి, మంత్రి కొడుక్కి కావాలని పట్టుపట్టారని హరీష్‌రావు ఆరోపించారు.

మన తెలంగాణ 28 Jan 2026 9:51 pm

ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కవిత

మన తెలంగాణ/హైదరాబాద్: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. ఆటో యూనియన్ల నాయకులతో బుధవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటోడ్రైవర్లకు ఇస్తామన్న రూ. 12 వేలు వెంటనే ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఇతర జిల్లాల ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలిగించటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అన్ని ఆటో సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. అవసరమైతే కార్మిక శాఖ మంత్రి ని కలుస్తామన్నారు. చట్టబద్దమైన అనుమతులు ఉన్నప్పటికీ జిల్లాల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లను అడ్డుకోవటం సరికాదన్నారు. కార్మికుల భద్రతతో పాటు వారి ఉపాధి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందన్నారు. సమావేశంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ఆటో జాగృతి అధ్యక్షుడు ఎంఏ సలీమ్, ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ వెంకటేష్, ఐఎన్ టీయూసీ జనరల్ సెక్రెటరీ మల్లేశం గౌడ్, టీ ఏడీఎస్ ప్రెసిడెంట్ సత్తిరెడ్డి, టీ ఎన్ టీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి, జీ యూ టీఎస్ అధ్యక్షులు శ్రీనివాస్, బీఆర్టీయూ అధ్యక్షుడు పరశురాముడు, తెలంగాణ జాగృతి నాయకులు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మన తెలంగాణ 28 Jan 2026 9:41 pm

టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 12 నుండి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి 16 వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ సమర్పణకు చివరి గడువు మన తెలంగాణ/హైదరాబాద్: టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ‘టీఎస్ ఐసెట్- 2026’ షెడ్యూల్ విడుదలైంది.. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో జరిగిన సమావేశంలో షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష బాధ్యతలను ఉన్నత విద్యా మండలి నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి అప్పగించింది. టీఎస్ ఐసెట్ కన్వీనర్‌గా ఎంజీయూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సీనియర్ ప్రొఫెసర్, యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, వివిధ యూనివర్సిటీల వీసీలు, వివిధ సెట్స్ కన్వీనర్లు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజును -ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. - ఇతర అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులకు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. - ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు మే 13, 14న కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి : ప్రొఫెసర్ అల్వాల రవి తెలంగాణ వ్యాప్తంగా టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్షలు నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగానే అర్హులైన అభ్యర్థులంతా సకాలంలో దరఖాస్తులను సమర్పించాలని ప్రొఫెసర్ అల్వాల రవి కోరారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని వివరించారు.

మన తెలంగాణ 28 Jan 2026 9:34 pm

దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్

రూ.100 కోట్లతో ఆధునిక పరికరాలు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ శిక్షణా కేంద్రం క్షేత్రస్థాయి వరకు అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్ల ఏర్పాటు రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల నిర్వహణా సంస్థ (డిజాస్టర్ మేనేజిమెంట్) విభాగాన్ని బలోపేతం చేసి దేశానికి ఒక రోల్ మోడల్‌గా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కొనేలా వంద కోట్ల రూపాయిలతో ఆధునిక పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో విపత్తుల నిర్వహణా విభాగం, ఫైర్ సర్వీసెస్, ఎస్డీఆర్‌ఎఫ్, హైడ్రా, ఐసిసిసి విభాగాలతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరికరాలను కొనుగోలు చేయాలన్న విషయమై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. వరదలు, అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన స్పందించడానికి కచ్చితమైన సమాచార వ్యవస్థ, రియల్టైమ్ మానిటరింగ్ సాధ్యమయ్యేలా విపత్తు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, డ్రోన్లు, శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్, ఆధునిక రెస్క్యూ పరికరాలు, అత్యాధునిక ఫైర్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లను సాంకేతికతను రెవెన్యూ- విపత్తు నిర్వహణ విభాగాలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. విపత్తు విభాగంలో పనిచేసే వారికి శిక్షణ విపత్తు విభాగంలో పనిచేసే వారికి శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో అత్యుత్తమ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే వాతావరణ పరిస్థితులు క్షేత్రస్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేలా ఆయా స్థానిక పరిస్థితులను బట్టి మండలస్థాయి వరకు అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. భారీ వర్షాలు వరదల సమయంలో వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎయిర్లిఫ్ట్ మెకానిజం తయారు చేసుకోవాలని ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని తరలించడానికి 70 నుంచి 80 కిలోల బరువును ఎత్తే డ్రోన్‌లను కొనుగోలు చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. 77 హైస్పీడ్ బోట్లను కొనుగోలు చేయాలి ఎయిర్ లిఫ్ట్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల 2024 సంవత్సరంలో తన పాలేరు నియోజవకర్గంలో వాగుల్లో చిక్కుకున్న బాధితులను రక్షించుకోలేకపోయానని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా మాట్లాడడానికి వీలుగా సిమ్ ఆధారిత విహెచ్ ఎఫ్ రేడియో సిస్టమ్స్ అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇప్పటికే ఈ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. ఈ వ్యవస్థను క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లాలని మంత్రి సూచించారు. అలాగే హైదరాబాద్‌లో హైరేజ్డ్ భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని హైడ్రా కమిషనర్‌కు సూచించారు. 77 హైస్పీడ్ బోట్లను కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో 12 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయని, ఒక్కో బృందంలో వెయ్యిమంది వరకు ఉన్నారని వారికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, అగ్నిమాపకశాఖ డైరెక్టర్ విక్రమాన్ సింగ్, హైడ్రా కమిషనర్ రంగనాధ్, ఐసిసిసి డైరెక్టర్ కమల్హాసన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి పొంగులేటి ఆరా మేడారం మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటి భక్తుల కొంగు బంగారం, తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో అత్యంత పవిత్రమైన మొదటి ఘట్టం బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో సచివాలయం నుంచి హై ఫ్రీక్వెన్సీ వాకీటాకీతో మేడారంలో ట్రాఫిక్ విధులను పర్యవేక్షిస్తున్న సిబ్బందితో మంత్రి పొంగులేటి మాట్లాడారు. తొలిరోజు కావడంతో భక్తుల సంఖ్య, సారలమ్మ వార్ల రాక ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన, జాతరలో నెలకొన్న పరిస్థితులు గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తూ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, భక్తుల సౌకర్యార్థం తాగునీరు, రవాణా సౌకర్యాలు ఎప్పటికప్పుడు పరీక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

మన తెలంగాణ 28 Jan 2026 9:25 pm

మున్సిపల్ ఎన్నికలు.. తొలిరోజు 902 నామినేషన్‌లు

కాంగ్రెస్ 382, బిఆర్‌ఎస్ 258, బిజెపి నుంచి 169 దాఖలు ఈనెల 30వ తేదీన నామినేషన్‌ల దాఖలుకు చివరిగడువు మనతెలంగాణ/హైదరాబాద్:మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీల అభ్యర్థులు మొదటిరోజు నామినేషన్‌లు వేయడానికి ఉత్సాహం చూపారు. ఈ నేపథ్యంలోనే మొదటిరోజు (బుధవారం) నామినేషన్‌ల పర్వం భారీగా కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి భారీగా నామినేషన్‌లు రాగా, బిఆర్‌ఎస్ నుంచి, బిజెపిల నుంచి నామమాత్రంగా నామినేషన్‌లు దాఖలు కావడంతో మొత్తంగా 902 నామినేషన్‌లు దాఖలయ్యాయి. మంగళవారం ఎన్నికల కమిషనర్ మున్సిపల్ షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఈనెల 30వ తేదీ వరకు నామినేషన్‌లకు చివరిగడువుగా పేర్కొన్నారు. దీంతో మొదటిరోజు వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్‌లను దాఖలు చేయడానికి ఆసక్తి చూపారు. ఇంకా రెండు రోజులే నామినేషన్‌లకు గడువు ఉండడంతో నేడు, రేపు నామినేషన్‌లు భారీగా దాఖలవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. 123 మున్సిపాలిటీల్లోని 2,996 వార్డుల్లో ఎన్నికలు 123 మున్సిపాలిటీల్లోని 2,996 వార్డుల్లో ఎన్నికలు జరుగనుండగా మొదటిరోజు 890 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 902 నామినేషన్‌లను దాఖలు చేశారు. ఆప్ నుంచి (1), బిఎస్పీ నుంచి (7), బిజెపి నుంచి (169), సిపిఐ నుంచి (08), కాంగ్రెస్ నుంచి (382), ఐఏఎంఐఎం నుంచి (03), బిఆర్‌ఎస్ నుంచి (258), టిడిపి నుంచి (0), వైఎస్‌ఆర్ సిపి నుంచి (0), ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి (19), స్వతంత్ర అభ్యర్థుల నుంచి (55) నామినేషన్‌లు కలిపి మొత్తంగా 902 నామినేషన్‌లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. నో- డ్యూ సర్టిఫికెట్‌కు రూ.3 నుంచి రూ.5వేలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి నో- డ్యూ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి అన్న నిబంధనను విధించడంతో ప్రస్తుతం దానికోసం అభ్యర్థులు నానాతంటాలు పడుతున్నారు. ఈ సర్టిఫికెట్ కోసం అధికారులు సుమారుగా రూ.3 నుంచి రూ.5 వేలు వసూళ్లు చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత పురపాలకల్లో ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలను పెండింగ్ లేకుండా చెల్లిస్తేనే ఈ సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు బకాయిలను చెల్లించడానికి పురపాలికల వద్ద క్యూ కడుతున్నారు. గతంలో నెలల తరబడి బకాయిలు చెల్లించని వారు ఒక్కసారిగా మొత్తం చెల్లించేందుకు ముందుకు వస్తుండడంతో పురపాలిక అధికారులు దానిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

మన తెలంగాణ 28 Jan 2026 9:13 pm

నాలుగో టీ20లో చెలరేగిన కివీస్ ఓపెనర్లు.. భారత్ కు భారీ టార్గెట్

విశాఖ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ జట్టు, : టీమిండియాకు 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టుకు ఓపెనర్లు సీఫెర్ట్ (62), కాన్వే(44)లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 8.2 ఓవర్లలోనే వంద పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో కివీస్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఓవర్లలో కొంచెం నిదానంగా ఆడినా.. క్రమంగా కవీస్ బ్యాటర్లు దూకుడు పెంచారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు, స్కోరు బోర్డు మాత్రం తగ్గకుండా పరుగులు రాబట్టారు. చివర్లలో డారిల్ మిచెల్ ధనాధన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మిచెల్.. 18 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సులతో 39 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు సాధించింది. ఇక, భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా..బుమ్రా, రవి బిష్ణోయ్ లు ఒక్కో వికెట్ తీశారు.

మన తెలంగాణ 28 Jan 2026 8:51 pm

தமிழ்நாடு அரசின் ஊர்தியில் இந்திக்கு முக்கியத்துவமா? - உண்மை இதுதான்

குடியரசு தினத்தில் தமிழ்நாடு அரசு இயக்கிய ஊர்தியில் இந்திக்கு முக்கியத்துவம் அளிக்கப்படுவதாக தவறான தகவல் பரப்பப்படுகிறது.

తెలుగు పోస్ట్ 28 Jan 2026 8:27 pm

Video : Medaram Sammakka Saralamma Jatara 2026

The post Video : Medaram Sammakka Saralamma Jatara 2026 appeared first on Telugu360 .

తెలుగు 360 28 Jan 2026 8:21 pm

Dhanush to Launch his son Yatra

Top Tamil actor Dhanush is busy as an actor in Tamil, Hindi and Telugu languages. Apart from this, he is busy producing content-driven films and is directing at least one film every year. One wonders how Dhanush manages to work on so many projects and how he manages to handle all the crafts of cinema. […] The post Dhanush to Launch his son Yatra appeared first on Telugu360 .

తెలుగు 360 28 Jan 2026 8:03 pm