పశ్చిమ పనులపై కూటమి నాయకుల సమీక్ష..
భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజక వర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ధి పనుల
Nani’s The Paradise Mass Mayhem Anthem Aaya Sher for his birthday
Natural Star Nani is setting huge expectations for his upcoming biggie, The Paradise. Director Srikanth Odela is putting in every effort to make the film a special event in the actor’s career and Indian Cinema history. The raw blood bath is going to be a cult event that will deliver new-age cinematic experience to audiences. […] The post Nani’s The Paradise Mass Mayhem Anthem Aaya Sher for his birthday appeared first on Telugu360 .
మణికొండలో పేలిన మంజీరా నీటి పైప్లైన్... సెల్లార్లలోకి భారీగా నీరు
మణికొండ: రంగారెడ్డి జిల్లా మణికొండలో మంజీరా నీటి పైప్లైన్ భారీ శబ్ధంతో పేలింది. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో మణికొండ రోడ్డులో మంజీరా నీటి పైప్లైన్ పేలడంతో భారీ వరద నీరు ఆ ప్రాంతాన్ని ముంచెత్తెంది. ఐదు నిమిషాల్లోనే అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీరు నిండిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హైడ్రా, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటన వల్ల భారీ ఎత్తున నీరు విడుదల కావడంతో సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐదు నిమిషాల వ్యవధిలోనే దాదాపు ఆరు అడుగుల మేర నీరు అపార్ట్మెంట్ సెల్లార్లలోకి చేరింది. అపార్ట్మెంట్లలో పార్క్ చేసిన దాదాపు 7 నుండి 8 కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోయి భారీగా దెబ్బతిన్నాయి. సెల్లార్లో ఉన్న వస్తువులు, విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందిన వెంటనే హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) బలగాలు, అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైప్లైన్ లో నీటిని వెంటనే నిలిపివేసి, సెల్లార్లలో ఉన్న నీటిని తోడే ప్రక్రియను ప్రారంభించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ప్రారంభం #CBSE #BoardExams #Hyderabad #Education #Class10
సనాతన ధర్మం రక్షణ అంటే ఇదీ.. మాటలు కాదు చేతల్లో యూట్యూబర్లు
యూట్యూబర్లు కేవలం తమ సొంత ప్రయోజనాలే కాదు.. సామాజిక సమస్యలకు కూడా చెక్ పెడుతున్నారు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
ఈ నెలాఖరులో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతవరణ శాఖ వెల్లడించింది
Weather Report : బాబోయ్ ఇవేం ఎండలు.. ప్రాణాలు పోతాయా ఏంది?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వేడి వాతావరణం ప్రారంభమయింది
Revanth Reddy : నేడు ముంబైకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు ముంబైకి వెళ్లనున్నారు
Mothkur l మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్నకు సన్మానం..
Mothkur l మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్నకు సన్మానం.. Mothkur, ఆంధ్రప్రభ :
Gold Price Today : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే వెయిట్ చేయండి
నేడు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధర స్వల్పంగా తగ్గింది
BRS l పొలంలో వినూత్నంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..
BRS l పొలంలో వినూత్నంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.. BRS, బెజ్జంకి, ఆంధ్రప్రభ
పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్! #Cricket #IshanKishan #AditiHundia #TeamIndia #T20WorldCu
Nalgonda l వానరానికి అంత్యక్రియలు.. పాల్గొన్న గ్రామప్రజలు..
Nalgonda l వానరానికి అంత్యక్రియలు.. పాల్గొన్న గ్రామప్రజలు.. Nalgonda, గట్టుప్పల, ఆంధ్రప్రభ :
BJP Alleges Massive House Site Patta Fraud Under Former YSRCP Government in Andhra Pradesh
The Andhra Pradesh unit of the Bharatiya Janata Party has launched a sharp attack on the previous YSR Congress Party government, alleging a large-scale political fraud in the name of distributing house site pattas to poor families between 2019 and 2024. As part of its statewide outreach programme, Janata Varadhi, BJP leaders submitted petitions to […] The post BJP Alleges Massive House Site Patta Fraud Under Former YSRCP Government in Andhra Pradesh appeared first on Telugu360 .
రైల్ వన్ యాప్ కు సూపర్ రెస్పాన్స్
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'రైల్ వన్ ' సూపర్ యాప్ ప్రయాణికుల ఆదరణ పొందుతోంది
సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు
సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది.
వర్సటైల్ స్టార్ శివకార్తికేయన్... దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం కోసం చేతులు కలిపారు. అమరన్ తర్వాత శివకార్తికేయన్ మరోసారి రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్తో కలిసి పనిచేస్తుండడం విశేషం. గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెయాన్ అనే శక్తివంతమైన టైటిల్ను ఖరారు చేశారు. 2026లో బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచేలా ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, వినోదాన్ని మేళవిస్తూ ఈ సినిమా రూపొందుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో శివకార్తికేయన్ ఆధ్యాత్మిక లుక్లో కనిపిస్తున్నారు. ధోతి, విభూతి, రుద్రాక్షలతో సంప్రదాయానికి దగ్గరగా కనిపిస్తూ, చేతిలో వంపు ఉన్న కత్తి ఆయన ప్రశాంతత వెనుక దాగిన శక్తిని సూచిస్తోంది. వెనుకన కనిపించే నెమలి రెక్కలు, చుట్టూ ఉన్న నెమళ్లు మురుగన్ స్వామి ప్రతీకను గుర్తు చేస్తూ పాత్రకు మిథికల్ టచ్ను అందిస్తున్నాయి. ఈ చిత్రంలో శివకార్తికేయన్ పవర్ఫుల్, డైనమిక్ పాత్రలో కనిపించనున్నారు. రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, శివకార్తికేయన్, ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కలిసి పనిచేస్తున్న తొలి సినిమా కావడం ఈ ప్రాజెక్ట్కు మరో ప్రత్యేకగా నిలిచింది. తన ప్రత్యేకమైన మ్యూజికల్ స్టైల్తో, చార్ట్బస్టర్ ఆల్బమ్స్తో పేరుగాంచిన సంతోష్ నారాయణన్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుంది.
రీల్ కాదు రియల్గా శుభలగ్నం సినిమా రిపీట్... భర్తను కోటిన్నరకు అమ్మేసిన భార్య
భోపాల్: శుభలగ్నం సినిమాలో భర్తను భార్య కోటి రూపాయలకు అమ్మేస్తుంది. 1990లో ఈ సినిమాకు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. అది రీల్లో జరిగితే ఇప్పుడు రియల్గా జరిగింది. ఓ వ్యక్తి తన కుటుంబాన్ని వదిలి ప్రియురాలితో కలిసి ఉండడంతో భార్య, కూతురు కోర్టుకెక్కింది. దీంతో భర్త తన ప్రియురాలితో కలిసి ఉంటానని తెగేసి చెప్పడంతో కోటిన్నర రూపాయలకు భర్తను ప్రియురాలికి భార్య అమ్మేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఓ న్యాయస్థానంలో జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం... భోపాల్కు చెందిన ఓ వ్యక్తి 23 సంవత్సరాల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆఫీసులో పని చేసే మహిళతో పరిచయం పెంచుకొని ప్రేమలో పడ్డాడు. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ప్రియురాలుతో ఉంటూ తన భార్య, పిల్లలను పట్టించుకోకపోవడంతో కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తన తండ్రి తనని పట్టించుకోవడంలేదని పెద్ద కుమార్తె కోర్టు మెట్లు ఎక్కింది. ఫ్యామిలీ కోర్టు ప్రియురాలితో పాటు అతడి కుటుంబాన్ని కూడా కౌన్సిలింగ్కు పిలిచింది. తాను ప్రియురాలితో కలిసి ఉంటానని భర్త స్పష్టం చేయడంతో భార్య ఓ నిర్ణయానికి వచ్చింది. భర్తకు విడాకులు ఇస్తానని, కానీ ప్రియురాలికి ఓ షరతు పెట్టింది. భర్తను వదిలించుకోవాలంటే తనకు కోటిన్నర రూపాయలు ఇవ్వాలని ప్రియురాలిని భార్య డిమాండ్ చేసింది. దీంతో ప్రియురాలు కోటిన్నర ఇస్తానని చెప్పడంతో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. డూప్లెక్స్ విల్లాతో పాటు రూ.27 లక్షలను ప్రియుడి భార్యకు ప్రియురాలు బదిలీ చేయడంతో వివాదానికి తెరపడింది. తన ఇద్దరు కూతుళ్లతో తల్లి వెళ్లిపోయింది. ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని ప్రియురాలు వెళ్లిపోయింది.
Prakash Raj about his role in Varanasi
Veteran actor Prakash Raj is playing a crucial role in Varanasi, a big-budget attempt directed by SS Rajamouli featuring Superstar Mahesh Babu in the lead role. Bollywood actor Rajat Kapoor was on board for the role but he was replaced due to creative differences. Prakash Raj was later roped in for the role and he […] The post Prakash Raj about his role in Varanasi appeared first on Telugu360 .
ಯುವತಿಯೊಬ್ಬಳು ಪಿಜ್ಜಾ ಡೆಲಿವರಿ ಬಾಯ್ ತನ್ನ ಸ್ನೇಹಿತನೆಂದು ವ್ಯಂಗ್ಯ ಮಾಡುತ್ತಿರುವ ವೀಡಿಯೊ ಸ್ಕ್ರಿಪ್ಟ್ಡ್
Tirumala : హమయ్య తిరుమలలో కొంత రష్ తగ్గింది.. భక్తులకు గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది.
వైద్యులకంటే రోబోలు బాగా ఆపరేషన్లు చేస్తాయా?
కోట్లు ఖర్చుపెట్టి మెడికల్ విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడం వేస్ట్.. మరో మూడు సంవత్సరాలలో రోబోలు వైద్యుల కంటే బాగా ఆపరేషన్లు చేస్తాయని ఎలాన్ మస్క్ అంటున్నాడు. ఒకటి కొత్తది కనిపెట్టగానే అప్పటికి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. సెల్ ఫోన్ రాగానే ల్యాండ్ లైన్ ఫోన్లు కాలగర్భంలో కలిసిపోయినట్లు, కానీ ఆ సెల్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు, అమ్మే షాపులు రీఛార్జ్ సెంటర్లు ఈ విధంగా ఎంతోమందికి అది ఉపాధిని కలిగించింది. అలాగే ఈ కొత్త రోబోటిక్ టెక్నాలజీ వచ్చిన కానీ అది ఇంకా ఎంతోమంది వైద్యుల కు ఉపాధిని కల్పిస్తుంది. రోబోటిక్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటివి వైద్యులకు సహాయ కారి అవుతాయే కాని వైద్యులకు ప్రత్యామ్నాయం కాజాలవు. ఇప్పటికే కనిపెట్టిన లేటెస్ట్ టెక్నాలజీలో అయినా ఎండోస్కోపీలు, లాప్రోస్కోపిలు, రోబోటిక్ సర్జరీలు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, డయాగ్నొస్టిక్ పరికరాలు అన్నీ కూడా వైద్యులకు ప్రత్యామ్నాయం కాలేదని, అవి వైద్యులకు సహాయకారిగా ఉంటూ వైద్యులకు ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఉదాహరణకు క్లినికల్ నాలెడ్జ్ తో పరీక్ష చేసి నిర్ధారణ చేసే చిన్నపాటి జ్వరాలకు కూడా ఇప్పుడు ఎన్నో డయాగ్నొస్టిక్ టెస్టులు చేసి వేలు ఖర్చుపెట్టి జబ్బు నిర్ధారణ చేసిన విధంగా ఉంటుంది. వాళ్ల టెక్నాలజీని అమ్ముకోవడానికి ఈ విధంగా డబ్బా కొడుతూనే ఉంటారు. కానీ వైద్యుడిని ఏ టెక్నాలజీ రీప్లేస్ చేయలేదు. అది వైద్యుని సహాయం తీసుకుని వైద్యునికి ఉపయోగకరంగా ఉంటూ డెవలప్ కావాల్సిందే. మీరేమంటారు? డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Telangana : నేడు తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నిక
నేడు తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నిక నేడు జరగనుంది
neela rajamma, gattayya l 30 ఏళ్ల రాజకీయ అనుబంధానికి ఫలితం..
neela rajamma, gattayya l 30 ఏళ్ల రాజకీయ అనుబంధానికి ఫలితం.. Kadiyam
Ilayaraja gets a Big Shock from Delhi High Court
Legendary music composer Ilayaraja has been trolled and criticized in the recent times for his legal claims on the songs that are used in several films. A composer of that stature should not demand money for using his songs. Several producers had to pay money for Ilayaraja. The legendary music composer has received a rude […] The post Ilayaraja gets a Big Shock from Delhi High Court appeared first on Telugu360 .
వైస్ చైర్మన్గా పల్లెర్ల వెంకన్న పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నిక మున్సిపల్ పీఠంపై మూడో మహిళా చైర్మన్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సన్మానించి శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే సామేల్ . మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ చైర్మన్గా గడ్డం స్వప్నసోమనర్సయ్య, వైస్ చైర్మన్గా పల్లెర్ల వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మున్సిపల్ కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ భవనంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులకు గాను కాంగ్రెస్ 8 వార్డులు, బీఆరఎస్ 3 వార్డులు, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. కాంగ్రెస్ తమ కౌన్సిలర్లకు విప్ జారీ చేయడంతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎంపిక చేసి బీఫాంలు అందజేశారని, విప్ను ధిక్కరిస్తే సభ్యులు అనర్హతకు గురవుతారని మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సురేష్ ప్రకటించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం పూర్తి కోరం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు పల్లెర్ల వెంకన్న, కుర్మిళ్ల ప్రమీల, గడ్డం స్వప్న, గనగాని శైలజ, పన్నాల శ్రీవిద్య, బీసు శ్రీకాంత్, కారుపోతుల వెంకన్న, మెంట రమణ, బీఆరఎస్ కౌన్సిలర్లు సుల్తాన్ స్వామి, కొండ శోభ, నల్ల మధు, ఇండిపెండెంట్ మొగుళ్ల అనురాధ హాజరయ్యారు. చైర్మన్ కోసం ఎన్నిక నిర్వహించగా 8వ వార్డు కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య 6వ వార్డు కౌన్సిలర్ గడ్డం స్వప్నను ప్రతిపాదించగా 7వ వార్డు కౌన్సిలర్ గనగాని శైలజ బలపర్చారు. పోటీ లేకపోవడంతో మెజార్టీ కోరంతో గడ్డం స్వప్న చైర్మన్గా ఎన్నికైనట్టు ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సురేష్ ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా 11వ వార్డు కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న 1వ వార్డు కౌన్సిలర్ పల్లెర్ల వెంకన్నను ప్రతిపాదించగా 9వ వార్డు కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ బలపర్చారు. పోటీ లేకపోవడంతో వైస్ చైర్మన్గా పల్లెర్ల వెంకన్న ఎన్నికైనట్టు ప్రకటించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించి ఎన్నికల ఆఫీసర్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ముగిసే వరకు కూడా ముగ్గురు బీఆరఎస్ కౌన్సిలర్లు సమావేశంలోనే కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ పీఠంపై మూడో మహిళా చైర్మన్ మోత్కూరు మున్సిపల్ పీఠంపై మూడో మహిళా చైర్మన్ కొలువుదీరారు. మోత్కూరు మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత రెండోసారి ఎన్నికలు జరిగాయి. 2018 ఆగస్టు 2న కొత్త మున్సిపాలిటీగా ఏర్పడగా 2020 జనవరిలో ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఆ ఎన్నికల్లో బీఆరఎస్ 7 స్థానాల్లో గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. చైర్మన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా తొలి మున్సిపల్ చైర్మన్గా తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి ఎన్నికయ్యారు. 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మున్సిపాలిటీలో మారిన రాజకీయ సమీకరణాలు, కౌన్సిలర్ల అసంతృప్తితో చైర్మన్ సావిత్రిమేఘారెడ్డిపై అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసంతో సావిత్రిమేఘారెడ్డి చైర్మన్ పదవి కోల్పోగా, కాంగ్రెస్ కౌన్సిలర్ గుర్రం కవితలక్ష్మీనర్సింహారెడ్డి చైర్మన్ అయ్యారు. కౌన్సిల్ ఐదేళ్ల పదవీకాలంలోనే ఇద్దరు మహిళలు చైర్మన్ పదవి చేపట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో 8 వార్డుల్లో గెలిచిన కాంగ్రెస్ మున్సిపాలిటీని కైవసం చేసుకోగా 6వ వార్డు (ఎస్సీ జనరల్) నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలుపొందిన గడ్డం స్వప్నసోమనర్సయ్య మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. దీంతో ముగ్గురు మహిళలు చైర్మన్ పదవుల్లో కొలువుదీరినట్టు అయ్యింది. కాంగ్రెస్లో చైర్మన్ పదవి కోసం 12వ వార్డు కౌన్సిలర్ మెంట రమణనగేష్, వైస్ చైర్మన్ పదవి కోసం 9వ వార్డు కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ తీవ్రంగా పోటీ పడినప్పటికీ ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరిని బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. పోయిన సారి వైస్ చైర్మన్ పదవి బీసీకి దక్కగా, ఈసారి వైస్ చైర్మన్ పదవి వైశ్య సామాజికవర్గానికి దక్కింది. కౌన్సిలర్లను సన్మానించిన ఎమ్మెల్యే సామేల్ సమావేశం ముగిసిన అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చైర్మన్ స్వప్న, వైస్ చైర్మన్ వెంకన్నతో పాటు కాంగ్రెస్, బిఆరఎస్ కౌన్సిలర్లను సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ను నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేశామని, మెయిన్ రోడ్డు, అంగడి బజారు సీసీ రోడ్డు చేశామని, పెద్ద చెరువులో కలుస్తున్న డ్రైనేజీని మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, బృందావన్ కాల్వ వెంట ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో కాల్వను శుభ్రం చేయిస్తామన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో మున్సిపాలిటీని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
Andhra Pradesh : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి
రేబీస్ కారణంగా కుక్కలా ప్రవర్తించిన యువకుడు అంటూ
Tirumala : పదిన్నర గంటల పాటు తిరుమల ఆలయం మూసివేత
మార్చి 3వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు
ఆ మిస్ ఇండియా ఫైనలిస్ట్ తో ఇషాన్ పెళ్లి: తాతయ్య
హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ కు ఇష్టమైన యువతినే పెళ్లి చేసుకుంటాడని అతడి తాతయ్య రామ్ అనురాగ్ పాండే తెలిపారు. టి20 వరల్డ్ కప్ తరువాత ఇషాన్ వివాహం జరిపిస్తామన్నారు. ఆయన మీడియతో మాట్లాడారు. ఇషాన్ కిషన్ సోదరుడికి లవ్ మ్యారేజ్ చేశామని, అదే విధంగా ఇషాన్ కూడా లవ్ మ్యారేజ్ చేయడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. గర్ల్ ఫ్రెండ్ అదితి హుందియాతోనే ఇషాన్ ప్రేమలో ఉన్నాడని, వారికి వివాహం చేస్తామన్నారు. ఆమె మోడల్గా రాణించడంతో పాటు మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానంలో ఉన్నారని అనురాగ్ కొనియాడారు. తన మనవడు ప్రతి మ్యాచ్లో ఉత్తమంగా ఆడాలని తన కుటుంబం కోరుకుంటుందని, అందుకోసం దేవుడిని ప్రార్థిస్తామని, పాకిస్థాన్తో మ్యాచ్ ముందు అభిషేక్ శర్మ-ఇషాన్ కిషన్ ఒకటే అడిగానని, తొలి పది ఓవర్లలో వంద పరుగులు చేస్తే పాక్పై ఒత్తిడి పెరుగుతుందని సలహా ఇచ్చానన్నారు. పాక్పై ఇషాన్ హాఫ్ సెంచరీ చేయడంతో కాస్త రిలాక్స్ అయ్యామని తెలియజేశారు. పాక్పై భారత్ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. టి20 వరల్డ్ కప్ను టీమిండియా గెలువాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. అదితి హుందియా ఎవరు అంటే ఆమె రాజస్తాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన వ్యాపారవేత్త కూతురు. ఆమె పేరుమీదనే ఓ ఫ్యాషన్ బ్రాండ్ కూడా ఉంది. ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్లో ఉంది. 2019 నుంచి అదితి, ఇషాన్ ప్రేమలో ఉన్నారు.
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రంతో ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఓ ఐటమ్ సాంగ్తో ఎంట్రీ ఇస్తున్నారు. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి మ్యూజికల్ ప్రమోషన్స్ను మేకర్స్ ప్రారంభిస్తున్నారు. ‘న్యాయం చేయరా దేవుడా..’ అంటూ వర్మ డ్యాన్స్ నెంబర్తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ వారంలోనే ఈ సాంగ్ని మేకర్స్ విడుదల చేయబోతున్నారు.
17Feb2026 |నేటి తిరుమల సమాచారం..
17Feb2026 | నేటి తిరుమల సమాచారం.. “ఓం నమో
“Even If You Eat, Do It Focusedly”: KCR’s Philosophy Faces Test at 72
Hyderabad: A senior BRS leader who met K. Chandrashekar Rao in the recent past recalled a small but telling moment. During the meeting, KCR was quietly relishing a delicacy served to him – unhurried, attentive, fully present, enjoying every bite. It reminds of KCR’s own words from his time in office: “Leakage of dynamism is […] The post “Even If You Eat, Do It Focusedly”: KCR’s Philosophy Faces Test at 72 appeared first on Telugu360 .
Hyderabad, February 16: What appeared routine on the surface – a biscuit wrapper, a bike taxi ride and a parcel sent in a private bus – turned out to be parts of a cocaine supply network that operated between Bengaluru and Hyderabad until it was busted by the EAGLE Force. The EAGLE Force, Telangana, in […] The post Dark Fantasy wrapper, Rapido ride and private bus: Engineering dropout ran cocaine chain before EAGLE bust appeared first on Telugu360 .
తెలంగాణలో పాఠశాలలకు హాఫ్ డే హంగామా... మార్చి 16 నుంచి అమల్లోకి! #Education #Telangana #SSC
KCR : ఉద్యమ నేత కేసీఆర్ జన్మదినం నేడు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబరాలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు 72వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు
Solar Eclipse : నేడు సూర్యగ్రహణం.. భారత్ లో మాత్రం?
నేడు సూర్యగ్రహణం సంభవించనుంది
మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతికి పట్టీ ఉండటం గమనించి పలువురు అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందారు. ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “చేతికి పట్టీ ఉండటం గమనించి అభిమానులు, శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం చిన్నపాటి షోల్డర్ కీ హోల్ సర్జరీ. ప్రస్తుతం నేను కోలుకున్నాను, నా దినచర్య సజావుగా సాగుతోంది. ఈ సర్జరీని ఎంతో నైపుణ్యంతో, సాఫీగా నిర్వహించిన అత్యుత్తమ ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్కి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు”అని అన్నారు.
India vs Pak T20 World Cup : భారత్ పై ఓటమితో పాక్ పై సొంత దేశంలో దుమారం.. బాయ్ కాట్ చేయాల్సిందంటూ?
టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ చేతిలో భారీ పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓటమి పాలవడంతో ఆ దేశ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది
నలభై ఆరేళ్ల క్రితం అంటే 1980లో దేశంలో కంప్యూటరీకరణను విస్తరింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఆందోళనలు తలెత్తాయి. 1984 సంవత్సరాన్ని ‘యాంటీ కంప్యూటరైజేషన్ సంవత్సరం’గా పరిగణించారు. దీంతో తమ ఉద్యోగాలు పోతాయని, ఆర్థికంగా దెబ్బతింటాయని, దేశంలో తీవ్ర పరిస్థితులు తలెత్తుతాయని కార్మికులు నిరసన ప్రదర్శనలు సాగించారు. అయితే రానురాను డిజిటల్ టెక్నాలజీని అమలు లోకి విస్తారంగా తీసుకు రావడంతో సమాజంలోని అన్ని వర్గాల్లో, దేశం మొత్తం మీద ఆలోచనల్లో మార్పు రావడం ప్రారంభమైంది. కంప్యూటర్లు, ఆధునిక సాంకేతికత భారీగా ఉద్యోగాలు కల్పిస్తాయని, జీవితంలో అనేక విధాలుగా ఉపయోగపడతాయని నమ్మకం పెరిగింది. ఎఐ (కృత్రిమ మేధ) ఆధునిక ప్రపంచంలో కీలకమైన కేంద్రంగా వర్ధిల్లుతోంది. ఇప్పుడు ఎక్కడ విన్నా ఎఐ గురించే చర్చ వినిపిస్తోంది. మానవ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో పెద్దమార్పులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎఐ అన్నది అత్యంత శక్తివంతమైన, అతి గొప్ప ఆవిష్కరణల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ సాంకేతిక నాయకత్వంలో భారత్ అగ్రస్థానం సాధించాలన్న లక్షంతో ఢిల్లీలోని భారత్ మండపంలో సోమవారం నాడు ‘ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్’ ప్రారంభం కావడం చెప్పుకోదగిన ఘట్టం. ఎఐ యుగం నియమాలు, ప్రమాణాలు, అవకాశాలను రూపొందించడంలో మనదేశం కీలకంగా ఉండాలనే ప్రధాన లక్షంతో ఏర్పాటైన ఈ సదస్సు గురించి ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ సదుపాయాల కల్పన, శక్తివంతమైన స్టార్టప్ల ఏర్పాటు, అత్యాధునిక పరిశోధనలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భారత్ బాధ్యత మరింత పెరగనుందని వెల్లడించడం గమనార్హం. ఇప్పటికే దేశంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పరిపాలన, వంటి అనేక రంగాల్లో ఎఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు 22 రంగాల్లోని 17 రంగాల కంపెనీలు తమను తాము ఎఐ సాంతికత దిశగా మార్చుకోవలసిన ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఎఐతో ఎక్కువ అనుబంధం ఉన్న ఐటి వంటి రంగాల్లో పెద్ద మార్పులు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఎఐ సిఇఒ ముస్తఫా సులేమాన్ వచ్చే 18 నెలల్లో కంప్యూటర్ ఉద్యోగాలన్నీ ఎఐతో భర్తీ అవుతాయని అంచనా వేశారు. ఎఐ వల్ల 2035 నాటికి ప్రపంచ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) లో 15 శాతం పాయింట్లు పెరగవచ్చని ఏడాది క్రితం ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే సంస్థ అంచనా వేసింది. అంటే ప్రతి సంవత్సరం సుమారు 1 శాతం అదనపు అభివృద్ధి తథ్యమన్న అంచనాలు వెలువడ్డాయి. ఈ సదస్సు ఒక బలీయమైన జాతీయ ఎఐ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి మాత్రమే ప్రయత్నించకుండా ప్రపంచ దక్షిణార్థ దేశాలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలన్న తపన కనిపిస్తోంది. ఆయా దేశాలు కృత్రిమ మేధపై తమ ప్రణాళికలను ఈ వేదికపై వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎఐ ప్రణాళికలకు సంబంధించి భారత్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఈ సాంకేతికతకు కావలసిన కనీస సెమీ కండక్టర్లు లేదా కంప్యూటర్ చిప్లు తయారు చేసే సామర్థం ఇంకా భారత్కు అలవడ లేదు. ప్రస్తుతం దేశంలో ఎఐ సంపూర్ణ సామర్థంతో ఏ కంపెనీ లేదు. అలాగే మెగా డేటా సెంటర్లు లేవు. పాత్రధారులు, నాటకం స్క్రిప్టు, కనీసం వేదిక లేకుండా ఏదైనా నాటకం ఎలా ప్రదర్శించలేరో అలాగే క్షేత్రస్థాయిలో కనీస మౌలిక అవసరాలులేకుండా ఎఐ సాంకేతికతను సాధించడం కష్టతరమే. అయినప్పటికీ ఎఐకి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ గత కొన్నేళ్లుగా ఏర్పడి చిగుళ్లు మొలకెత్తడం ప్రారంభమైంది. గత రెండేళ్లుగా సెమీకండక్టర్ల తయారీ అత్యంత నాటకీయంగా ఆవిర్భావమైంది. ఈ ఏడాది జనవరి నాటికి దేశం లోని ఆరు రాష్ట్రాల్లో 10 సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులు వచ్చాయని, వీటిలో కొన్ని ఆన్లైన్లో ఉన్నాయని ప్రభుత్వం అంచనాగా చెబుతోంది. ఇక రెండో అంశం.. దేశంలో మెగా డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించడం గత ఏడాది గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, డిజిటల్ కనెక్షన్, తదితర ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థలు 2030 వరకు ఎఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల్లో దాదాపు 68 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు చిప్ డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పర్యావరణం నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే చెప్పవచ్చు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభిస్తేనే ఊపందుకుంటుంది. ఆయా ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థల అధినేతలు భారతదేశ సామర్థం గురించి ఆశావహులుగా ఉన్నారు. ఎన్విడియా జెన్సెన్ హుయాంగ్, గూగుల్ సిఇఒ సుందర్పిచాయ్, తదితరులు భావితరానికి ఎఐ సాంకేతిక కేంద్రంగా భారత్ వర్ధిల్లుతుందని, ఎఐని భారత్ ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయాలతో దృఢమైన విశ్వాసం వెలిబుచ్చడం గమనార్హం. భారత్లో మానవ వనరులకు లోటు లేదని, ఎఐ అమలు స్థాయి మరింత ముందుకు వెళ్తుందని చెబుతున్నారు. ఇప్పటికే ఎఐ ఫ్రంట్న్న్రర్ చాట్ జిపిటిలో ప్రపంచం మొత్తం మీద రెండో భారీ మార్కెట్గా భారత్ ఉంటోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ అల్ట్మాన్ అంగీకరించారు. ఎఐ నమ్మదగిన ముఖ్యమైన మార్కెట్గా అభివర్ణించారు. ఇవన్నీ ఎఐ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారుస్తున్నాయి. ఈ తరుణంలో ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఢిల్లీలో ప్రారంభం కావడం శుభోదయమే. ఇది విజయవంతమైతే ఈ శిఖరాగ్ర సమావేశం భారతీయ సంకల్పానికి కేవలం ఒక వేడుకలా మాత్రమే కాకుండా, ప్రపంచానికే కీలకమైన మలుపుగా మారుతుందన్న ఆశ కలుగుతోంది.
భవిష్యత్తు నిర్మించాలంటే చరిత్రను చదవాల్సిందే.. ఇప్పుడు అటువంటి చరిత్రను కొత్త తరానికి ఖచ్చితంగా మరింత విస్తృతంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నేల తల్లిపడ్డ గోసలను, ఆ విముక్తికోసం జరిగిన వివిధ పోరాటాలను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చర్చించాలి.. లేకుంటే అసలు చరిత్రను కనుమరుగు చేసే ప్రమాదం ఉన్నది. తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటింది.. కానీ తెలంగాణ బందీలో ఉన్నది మాత్రం ఆరు దశాబ్దాలు .. ఆ ఆరు దశాబ్దాల కాలంలో తెలంగాణ పడ్డ గోసలు.. ఎన్నో.. అంతటి గోసలకు కారణం ఎవరనే సంగతిని వివరంగా ప్రస్తుత తరాలముందు ఉంచాలి. చరిత్రను ముందు ఉంచనంత కాలం.. వేటగాడు చెప్పింది ధర్మం అన్నట్లు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మరింత మోసపోయే ప్రమాదం ఉన్నది. సహజంగా కొత్తతరానికి కెసిఆర్ 14 ఏళ్ల పోరాటం అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అలాగే కెసిఆర్ కంటే ముందు రాజకీయ పార్టీలను పెట్టి వాదాన్ని వాడుకొని పదవులను అనుభవించిన సంగతి అందరికీ తెలియదు. కెసిఆర్ ఎంతటి సంఘర్షణకు గురై తెలంగాణ నేలను ఎలా విముక్తి చేశారనే చరిత్రను భవిష్యత్తు తరాలకు బలంగా చెప్పాలి.. లేకుంటే బిఆర్ఎస్ను సాధారణ రాజకీయ పార్టీగా భావించే అవకాశం ఉంది. గులాబీ పార్టీ బిఆర్ఎస్ తెలంగాణ బతుకుల కోసం ఏర్పడిన పార్టీ, తెలంగాణ అస్తిత్వం కోసమే ఏర్పడి నేడు రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన సంగతిని గుర్తు చేయాలి. వాస్తవానికి తెలంగాణ నేల తల్లిని విముక్తి చేసిన యోధుడు కెసిఆర్. కెసిఆర్ అనే రాజకీయ శక్తి లేకపోతే నేటి తెలంగాణ లేదు. ఇక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో విలీనం చేసి ఎన్నో గాయాలకు కారణమయ్యారు. స్వయంగా ఆనాటి ప్రధాని నెహ్రూ చెప్పి మరీ తెలంగాణను నిజామాబాద్ కేంద్రంగా ఆంధ్రలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ తుంటరి అమ్మాయిని.. ఆంధ్ర అనే గడుసు అబ్బాయితో వివాహం చేస్తున్నామని ఒకవేళ అభ్యంతరాలు వచ్చిన సమయంలో నిరభ్యంతరంగా విడిపోవచ్చని ఆనాడే నెహ్రూ ప్రకటించారు. ఆ తరువాత ఏర్పడిన పరిణామాల వల్ల తెలంగాణ రాష్ట్రం అరిగోసలు చూడక తప్పలేదు. తలాపున గోదారి ఉన్న గుక్కెడు నీరు తెలంగాణ గొంతు తడపలేదు. విస్తారమైన భూములు ఉన్నా తెలంగాణ భూములన్నీ పడావుగా మారి తెలంగాణ వారికి వ్యవసాయం రాదన్నట్లుగా చిత్రీకరించే కుట్రలు చేశారు. వాస్తవానికి తెలంగాణ గడ్డ అనేకమైన ఖనిజ సంపదతోపాటు ప్రకృతి వనరులు పుష్కలంగా కలిగి ఉంది. అయినప్పటికీ కావాలనే పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని గొంతు నులిమి అదిమి పట్టినట్లు చేశారు. ఫలితంగా తెలంగాణ ఆరుదశాబ్దాలు అరిగోసవడ్డది. ప్రతిభగళ్ల బిడ్డలు ఉన్నా వలసలు తప్పలేదు. కన్న బిడ్డలను సాదలేని పరిస్థితుల్లో అమ్ముకున్న సందర్భాలు హృదయాలపై కొండంత గాయాలు చేసింది. పరాయిపాలనలో నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అంతులేని మోసం వల్ల తెలంగాణ గడ్డ తరతరాలుగా దగావడుతూ.. భౌగోళికంగా తెలంగాణ పదం లేకుండా చేయాలనే కుట్రలు చేశారు. స్వాతంత్య్ర పోరాటం తరువాత అంతటి తెగువతో పోరాటం సుదీర్ఘకాలం నడిచింది. ఆరు దశాబ్దాలుగా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం కొనసాగింది. తెలంగాణ దోపిడీపై జరిగిన సాయుధ రైతాంగ పోరాటం నుంచి మలివిడత ఉద్యమం వరకూ తెలంగాణ తెగువతో నిలబడింది. తన అస్తిత్వాన్ని కనుమరుగు చేసుకోలేక ఎంతోమంది త్యాగధనులను తెలంగాణ గడ్డకన్నది. తెలంగాణ తల్లి తనను విముక్తి చేసుకోవడానికి కన్న బిడ్డల్లో అనేక మంది ఉన్నారు. ఎంతో మంది అమరులయ్యారు. ముల్కీ, నాన్ ముల్కీ, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, 1969 రైతాంగ పోరాటం లాంటి అనేక సంఘటనలతో తెలంగాణపై జరుగుతున్న కుట్రలను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. అటువంటి తెలంగాణ తల్లి ముద్దుబిడ్డ ఉద్యమ విద్యార్థి నాయకునిగా తెలంగాణ సాధించడమే లక్ష్యంగా తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఉపాధ్యాయుని స్థాయినుంచి కాకతీయ యూనివర్శిటీ విసిగా పని చేస్తూనే తెలంగాణ వాదాన్ని ఎప్పూడూ ఆయన వదలకుండా భుజాన మోశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కళ్లారా చూడడమే లక్ష్యమని కలలు గంటూ తెలంగాణ ఏర్పాటు కోసం కలిసివచ్చిన సంఘజీవులను ఏకం చేస్తూ పోరాట స్ఫూర్తిని నింపిన గొప్ప వ్యక్తి జయశంకర్సార్. తెలంగాణ ఆంధ్రలో విలీనం అయినప్పటినుంచి జరుగుతున్న అనేక మోసాలు, కుట్రలు, ద్రోహాలపై నిత్యం చైతన్య సదస్సులు నిర్వహించే వారు. తెలంగాణ అణువణువు తెలిసి.. నీళ్లు, నిధులు, నియామకాల కుట్రలను ఎప్పటికప్పుడు విప్పి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ తెరపైకి వచ్చిన ప్రతీ సమయంలో ఏ నాయకుడు వచ్చినా జయశంకర్ సార్ తెలంగాణ వాదం బలపడడానికి ఆయన వారితో కలిసి నడిచారు. తెలంగాణ రాష్ట్రం కోసం అంటూ వచ్చిన అనేక మంది పదవులకు తలొగ్గి ఉద్యమాన్ని వదిలేశారు. అయినప్పటికీ జయశంకర్ సార్ మాత్రం ఆయన ఆశయాన్ని వదలలేదు. తెలంగాణ రాష్ట్రం కేవలం రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుందని అందుకు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతూ రాజకీయాలను ప్రభావితం చేసే రాజకీయ పోరాటం ద్వారానే రాష్ట్రాన్ని సాధించగలమని చెప్పేవారు. తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ప్రతీ అంశంపై అవగాహన పెంచుకొని జయశంకర్ సార్ అనేక వ్యాసాలు, పుస్తకాల రూపంలో సమాజం ముందు ఉంచారు. ఇదిలా ఉంటే చదువుకున్న మేధావి వర్గాన్ని కూడా ఉద్యమంలో అవగాహన కల్పించడానికి విదేశాలలోనూ ఉన్నత విద్యావంతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. అమెరికా, ఇతర దేశాలలో ఉన్న తెలంగాణ వాసులను ఒక్కతాటిపైకి తేగలిగారు. 2001 ఏప్రిల్ 27న అతి కొద్ది మందితో హైదరాబాద్లోని జలదృశ్యంలో గులాబీ పార్టీ పురుడుపోసుకుంది. పిడికెడు మందితో మొదలైన రాజకీయ పోరాటానికి కెసిఆర్ లాంటి నాయకుడు కారణమనే భావనకు సార్ జయశంకర్ సార్ వచ్చారు. తెలంగాణ ప్రాంతంపట్ల సుదీర్ఘమైన అవగాహన, లోతైన అధ్యయనం చేయగలిగే సత్తా కలిగిన నాయకుడు కెసిఆర్ అని జయశంకర్ సార్ నమ్మారు. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ భావజాల వ్యాప్తి మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని భావించారు. అందుకే జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సమితికి సిద్ధాంత కర్తగా ఉంటూ... కెసిఆర్కు సలహాలు ఇస్తూ బలమైన ఉద్యమ నేతగా జయశంకర్ సార్ కల్వకుంట్ల చంద్రశేఖరరావును తీర్చిదిద్దారు. ఒక్కో వ్యూహంతో వివిధ సమావేశాలు, సభలతో తెలంగాణలో ప్రతీ మారుమూల పల్లెలోకి తెలంగాణ భావజాలాన్ని కెసిఆర్ రూపంలో జయశంకర్ సార్ తీసుకెళ్లగలిగారు. అలా 2001లో ఆరంభమైన ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రపోరాటం 14ఏళ్ల పాటు కొనసాగింది. ఎన్ని ఒడిదొడుకులు సృష్టించినా.. వెనుకకు తగ్గలేరు. ఓ వైపు ఉద్యమం, మరోవైపు రాజకీయ ప్రక్రియ ద్వారా ప్రజల్లో విస్తృతమైన భావజాలం పెంపొందింది. వరుసగా ఎన్నికలలో పోటీచేయడం, ప్రజాక్షేత్రంలోకి వెళ్లడంతో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ కు సై అనక తప్పలేదు. ఇంటి పార్టీగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు ఆదరించడంతో స్థానిక సంస్థల నుంచి సార్వత్రిక ఎన్నికలలో కూడా ప్రభావితం చేయగలిగింది. తెలంగాణపై అణువణువునా అవగాహమ కలిగిన వ్యక్తిగా ఏర్పడిన తెలంగాణలో పదేళ్లలో ప్రతీ ఊరు, వాడ, చేను, చెలక, ప్రతీ పండగ సంబురపడేలా తెలంగాణ పూర్వ వైభవాన్ని మన కళ్లముందు ఉంచారు. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం.. విద్వేషంలేని పాలనతో పదేళ్ల కెసిఆర్ పాలన ఓ సువర్ణయుగాన్ని తలపించింది. కెసిఆర్ ఈ పదం లేకుంటే నేటి తెలంగాణ వచ్చి ఉండేదే కాదు. తెలంగాణ తల్లి విముక్తి కోసం పంపిన యోధుడిలా ఆయన బలమైన సంకల్పం తీసుకోకుంటే తెలంగాణ మరింత అధ్వానానికి చేరుకూనేది. 14ఏళ్ల వనవాసంలా కెసిఆర్ తెలంగాణనే ఊపిరిగా ఉక్కుపిడికిలితో ఉద్యమించారు. కెసిఆర్ అనే పదం ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ ఆయన పోరాటం ఆయన పేరు సాక్ష్యంగా చరిత్రగా నిలవనుంది. తెలంగాణ కోసం ఎవరు నినాదం ఎత్తుకున్నా పదవులకు లొంగిపోయో కారణం ఏదైనా తెలంగాణ ఆకాంక్షను వారికి అనుకూలంగా మలుచుకున్నారే గానీ చివరి దాకా ఎవరూ వాదాన్ని మోయలేదు. అటువంటిది కెసిఆర్ మాత్రం ఉన్న పదవులను వదిలి అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రమే.. రాష్ట్రం సాధించి పెట్టేదాక విశ్రమించా అంటూ ఆయన చేసిన పోరాటం గొప్పది. ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాలకు కావాల్సిన అనేక సంక్షేమ పథకాలతో ఆయన ప్రతీ గడపకు వెలుగులు పంచారు. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి వైపు, సంక్షేమ తెలంగాణ కోసం ఆయన చేసిన విశేష కృషి మరువలేనిది. తెలంగాణ సమాజం యెథలు తెలిసిన నాయకుడు కెసిఆర్. అందుకే ఆయనకు తెలంగాణ ప్రతీ పల్లెపై అవగాహన ఉంది. అంతటి దూరదృష్టితో కెసిఆర్ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఓ గొప్ప చరిత్రకు సాక్ష్యం. ఒకనాడు తెలంగాణ రైతు నాగలి గుర్తుగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ బొమ్మ గుర్తు వల్ల కెసిఆర్ రైతుల సంక్షేమానికి పెద్దపీఠ వేశారు. మహబూబ్నగర్లోని రాజోలుబండ వద్ద చోటు చేసుకున్న సంఘటన మాదిగ మల్లవ్వ చెప్పిన చెరువు సంఘటనతో పుట్టిన ఆలోచననే మిషన్ కాకతీయ చెరువులు ఇలాంటి అనేక సంఘటనల ఆధారంగానే తెలంగాణలో పదేళ్లలో ప్రతీ ఇంటికీ సంక్షేమాన్ని చేర్చి పుట్టిన బిడ్డనుంచి కాటికి కాలు జాపిన అవ్వ దాకా కెసిఆర్ ఆలోచించిన తీరు ఆదర్శపాలన భవిష్యత్తులో మరెవరి వల్ల కాదు. అందుకే తెలంగాణ పల్లెలన్నీ కెసిఆర్ను గుర్తు చేసుకుంటున్నాయి. గులాబీ పార్టీ పుట్టి 25ఏళ్ల బిఆర్ఎస్ ప్రయాణం ఎన్నో పోరాటాలు, మరెన్నో త్యాగాలు, దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని త్యాగం బిఆర్ఎస్ది. సంపత్ గడ్డం 78933 03516
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్: తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ల లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నికయ్యారు. 7 కార్పొరేషన్లలో అధికా ర కాంగ్రెస్ 5, బీజేపీ 1, సీపీఐ 1 స్థానాల్లో ఎంపికయ్యారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల దారిలోనే నడిచింది. 7 కార్పొరేషన్లలో ఖాతా తెరవలేదు. -నిజామాబాద్, మంచిర్యాల, మహబూబ్నగర్, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. మంచిర్యాల, రామగుండం, మహబూబ్నగర్, నల్గొండ నగరపాలికల్లో స్పష్టమైన మెజారిటీ ఉండగా ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ పీఠాన్ని దక్కించుకుంది. బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకోగా సీపీఐ కొత్తగూడెం కార్పొరేషన్ను దక్కించుకుంది. నిజామాబాద్లో ఎంఐఎంతో కలిసి అధికార కాంగ్రెస్ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. నిజామాబాద్ మేయర్గా ఉమారాణి, డిప్యూటీ మేయర్గా సల్మా తహసీన్ ఎంపికయ్యారు. నల్గొండ నగరపాలక సంస్థ కాంగ్రెస్ దక్కించుకుంది. తొలి మేయర్గా బుర్రి చైతన్య నియమితులయ్యారు. డిప్యూటీ మేయర్ పదవి మహ్మద్ అశ్రఫ్ అలీని వరించింది. మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం అయింది. మేయర్గా ధర్ని మధు, డిప్యూటీ మేయర్గా రమ్య ఎంపికయ్యారు. కొత్తగూడెం మేయర్ స్థానాన్ని సీపీఐ దక్కించుకుంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం కార్పోరేషన్ను సీపీఐ కైవసం చేసుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో మేయర్ పదవి సీపీఐకి దక్కగా డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ దక్కించుకుంది. మేయర్గా మూడ్ గణేశ్, డిప్యూటీ మేయర్గా లలితకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్గా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన గుముల మమత ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవి మారేపల్లి సురేందర్ రెడ్డిని వరించింది. రామగుండం కార్పొరేషన్ మేయర్గా కాంగ్రెస్ మద్దతుదారుడు మహంకాళి స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్గా ఎల్లయ్యను ఎన్నుకున్నారు. కరీంనగర్ మేయర్ పీఠంను ఎట్టకేలకు బీజేపీ కైవసం చేసుకుంది. మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని ఆ పార్టీ దక్కించుకుంది. డిప్యూటీ మేయర్గా చెందిన సునీల్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటించారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యూహత్మకంగా వ్యవహరించారు. మేయర్ పదవికి పోటీ పడ్డ కాంగ్రెస్ అభ్యర్థికి 21 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరించింది.
17th feb2026 |మంగళవారం నేటి పంచాంగ వివరాలు – తిథి, నక్షత్రం, యోగం, కరణం
17th feb2026 |మంగళవారం నేటి పంచాంగ వివరాలు – తిథి, నక్షత్రం, యోగం,
అమెరికా -రష్యా దేశాల మధ్య అణ్వాయుధాల నియంత్రణకు మిగిలి ఉన్న ఏకైక రక్షణ కవచం ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం ముగిసింది. 2026 ఫిబ్రవరి 5తో దీని గడువు తీరిపోగా.. రెండు దేశాలూ మంకుపట్టు వీడకపోవడంతో.. కొత్త ఒప్పందం కుదరలేదు. దీంతో ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టింది. యావత్ భూమండలాన్ని నాలుగైదుసార్లు బూడిద చేయగల స్థాయి అణ్వాయుధాలు ఇప్పటికే ఈ రెండు దేశాల దగ్గర గుట్టలుగా పడి ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా కొత్త ఒప్పందం కుదరకపోతే.. ఈ రెండు దేశాల మధ్య మళ్లీ ‘న్యూక్లియర్’ రేస్ ప్రారంభమయ్యే ప్రమాదం పొంచిఉంది. అదే జరిగితే మానవాళి మనుగడకే పెను ముప్పు వాటిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. మాన్హట్టన్ ప్రాజెక్టు పేరుతో 1942లో అణుబాంబుల తయారీని ప్రారంభించిన అమెరికా.. 1945 జులైలో మొట్టమొదటి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అమెరికాను చూసి సోవియట్ యూనియన్ 1943లో తన అణుబాంబుల తయారీ ప్రాజెక్టును మొదలుపెట్టి 1949లో తొలి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అప్పటి నుంచి అగ్రరాజ్యాలుగా ఉన్న ఆ రెండు దేశాల మధ్య న్యూక్లియర్ రేస్ ప్రారంభమైంది. మధ్యలో కొన్ని ఒప్పందాలవల్ల వాటిని నియంత్రించగలిగినా.. ఇప్పటికీ ఆ రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలు గుట్టలుగా పడి ఉన్నాయి. అంతర్జాతీయ రక్షణ సంస్థల అంచనాల ప్రకారం ప్రస్తుతం అమెరికా వద్ద 5,044 న్యూక్లియర్ వెపన్స్ ఉండగా.. అదే రష్యా వద్ద 5,580 అణు బాంబులు ఉన్నాయి. అణ్వాయుధాలతో ప్రపంచానికి తీవ్ర ప్రమాదమని గుర్తించిన ఈ అగ్రరాజ్యాల గత పాలకులు వీటి నియంత్రణ కోసం కొన్ని ఒప్పందాలు చేసుకొని పాటించారు. 1970 దశకంలో కుదుర్చుకున్న కుదిరిన ‘సాల్ట్- 1’, ‘సాల్ట్- 2’ ఒప్పందాల వల్ల అణ్వాయుధాల తయారీ పరుగుకు కొంత మేరకు బ్రేకులుపడ్డాయి. 1987లో కుదిరిన ‘ఐఎన్ఎఫ్’ ఒప్పందం ద్వారా మధ్యశ్రేణి దూరం వెళ్లే క్షిపణులను పూర్తిగా నిషేధించారు. అయితే 2019లో అమెరికా దీని నుంచి వైదొలగింది. సోవియట్ యూనియన్ విడిపోతున్న సమయంలో 1991లో కుదిరిన ‘స్టార్ట్-1’ ఒప్పందం చరిత్రలోనే అతిపెద్ద నిరాయుధీకరణకు దారితీసింది. అప్పుడు చాలా వరకు అణువార్ హెడ్లను నిర్వీర్యం చేశారు. ‘స్టార్ట్-2’ ఒప్పందం ద్వారా మల్టిపుల్ వార్ హెడ్లను నిషేధించే ప్రయత్నం జరిగింది. 2002 వచ్చిన ‘సార్ట్’ లో వచ్చిన వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం రెండు దేశాల మధ్య ఆయుధాలను గణనీయంగా తగ్గించింది. చివరగా 2010లో కుదిరిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం ద్వారా రెండు దేశాలు మోహరించే అణ్వాయుధాల సంఖ్యను 1,550 కే పరిమితం చేసింది. ఇప్పుడు ఈ గడువు తీరిపోవడంతో పాత కథ మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా -రష్యా దేశాల మధ్య కొత్త ఒప్పందం కుదరడానికి అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. నిజానికి న్యూ స్టార్ట్ ఒప్పందం గడువు ముగిసే సమయానికి.. ఎలాంటి షరతులు లేకుండా దీన్ని కనీసం ఒక ఏడాది పాటైనా స్వచ్ఛందంగా పొడిగించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రతిపాదన తెచ్చారు. కానీ అమెరికా దానికి ససేమీరా అన్నది. అయితే ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాత అమెరికా -రష్యా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికా తమను వ్యూహాత్మకంగా ఓడించాలని చూస్తున్నదని, అణు స్థావరాల తనిఖీలను రష్యా నిలిపి వేసింది. అమెరికా అధికారులు తమ భూభాగంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని చెప్పింది. దీంతో తనిఖీలకు అనుమతించకుండా.. కేవలం కాగితాలమీద ఒక ఏడాది ఒప్పందం పొడిగిస్తామంటే పారదర్శకత ఉండదని అమెరికా వాదించింది. మరోవైపు కొత్త మెరుగైనా ఒప్పందం కావాలని, చైనాను చేర్చాలని ట్రంప్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. కేవలం రష్యా, అమెరికా మాత్రమే ఒప్పందం చేసుకుంటే లాభం లేదని, ఇప్పుడు చైనా కూడా విపరీతంగా అణుబాంబులను తయారు చేస్తున్నదని, కాబట్టి చైనాను కూడా ఈ ఒప్పందంలో కలపాలని అమెరికా పట్టుబడుతున్నది. చైనా దీనికి ఒప్పుకోవడం లేదు. దీంతో చర్చలు ఆగిపోయినట్టు తెలుస్తున్నది. గత ఒప్పందాల వల్ల ఒక దేశం మరో దేశానికి సంబంధించి అణు స్థావరాలను 18 సార్లు తనిఖీ చేసే అవకాశముండేది. కొత్త ఒప్పందం కుదరకపోవడంతో ఆ అవకాశం లేదు. దీంతో పారదర్శకత లోపించి.. ఒకరిపై ఒకరు అనుమానంతో రెండు దేశాలూ అధిక సంఖ్యలో అణ్వాయుధాలు తయారు చేసే ప్రమాదమున్నది. పరిమితులు లేకపోవడంతో పాతవాటినీ ఆధునీకరించడంతోపాటు కొత్త వాటిని కూడా తయారు చేసుకునే వీలుంది. దీనికి తోడు ఇప్పుడు ఎఐ టెక్నాలజీ కూడా వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను న్యూక్లియర్ వెపన్స్కు వాడితే.. ఏ చిన్న టెక్నికల్ పొరపాటు జరిగినా.. మనుషులతో సంబంధం లేకుండానే.. బాంబులు వాటంతట అవే ప్రయోగించబడే ముప్పు సైతం పొంచి ఉన్నది. ఈ ఆయుధాల రేసుకోసం వినియోగించే అధిక వ్యయం వల్ల ప్రజాసంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను సైతం పక్కనపెట్టే ప్రమాదమున్నది. రెండు దేశాల మధ్య పంతాలు చూస్తుంటే.. ఇప్పటికిప్పుడు కొత్త ఒప్పందం కుదిరే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ పరిష్కార మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. ముందుగా అమెరికా -రష్యా కనీస స్థాయి చర్చలను పునరుద్ధరించడం అవసరం. డేటా మార్పిడి, పరిమిత తనిఖీలు, కొత్త సాంకేతిక ఆయుధాలపై ప్రత్యేక చర్చా వేదికలు ఏర్పాటు చేసుకోవాలి. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలను మరింత సక్రియంగా ఉపయోగించాలి. భద్రత కోసం రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి.. దౌత్యమార్గాలను ఎంచుకోవాలి. భారత్, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలను సైతం కలుపుకొని పోయి.. అందరూ కలిసి ఒకే వేదికపై మాట్లాడుకోవాలి. ఎందుకంటే అణుయుద్ధం వస్తే గెలిచే దేశం అంటూ ఏదీ ఉండదు. మిగిలేది బూడిద మాత్రమే అనే విషయాన్ని అగ్రరాజ్యాల పాలకులు గుర్తించాలి. మహమ్మద్ ఆరిఫ్, 70131 47990
అమెరికా హెచ్1బి వీసా విధానంలో వస్తున్న సమూల మార్పులు, కొత్త బిల్లులు అమెరికా వెళ్ళాలనుకునే భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి అమలులోకి రానున్న నూతన విధానం ప్రకారం, హెచ్1బి వీసాలు ఇకపై లాటరీ పద్ధతిలో కాకుండా, అధిక జీతం, అర్హత ఆధారంగా ఇవ్వబడతాయి. తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు వీసా ఎంపిక ప్రక్రియలో తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గత 15 ఏళ్లుగా అమెరికా హెచ్1బి వీసాలు పెంచుతూ వచ్చినప్పటికీ, ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాలను సైతం పరిశీలించి ఇస్తోంది. హెచ్1బితో పాటు డిపెండెంట్లకు ఇచ్చే హెచ్4 వీసాలకు కూడా సోషల్ వెట్టింగ్ తప్పనిసరి చేయడంతో వీసా రెన్యూవల్ స్టాంపింగ్, కొత్త వీసాలు ఆగిపోయాయి. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డులను ప్రవేశపెట్టింది, గ్రీన్ కార్డుల కోసం తొమ్మిది కోట్లు వెచ్చించి గోల్డ్ కార్డ్ వీసా తీసుకోవాలంటూ భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చాలామంది అమెరికా వెళ్ళాలన్న ఆలోచనను విరమించుకుంటున్నారు. నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ కోసం 1990లో ప్రారంభించిన హెచ్1బి వీసా ప్రోగ్రామ్. ట్రంప్ డిసెంబర్లో గోల్డ్ కార్డులను ప్రవేశపెట్టిన తర్వాత వాటి అమ్మకాల కోసం హెచ్1బి వీసాల జారీని జాప్యం చేస్తున్నారు. ఇప్పటికే 1.3 బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్ కార్డ్ను విక్రయించారు. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ నివేదిక ప్రకారం, గ్రీన్ కార్డుల కోసం తొమ్మిది కోట్లు వెచ్చించి గోల్డ్ కార్డ్ వీసా తీసుకోవాలంటూ 10 లక్షలమంది భారతీయులకు ‘బంపర్ ఆఫర్’ ఇచ్చారు. ఇంత డబ్బు వెచ్చించి అమెరికా వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఏముందంటూ చాలా మంది ఈ ఆలోచనను విరమించుకుంటున్నారు. తక్కువ జీతానికి పని చేస్తున్నారన్న ఉద్దేశంతో అమెరికన్ కంపెనీలు విదేశీయులకు ఉద్యోగాలు ఇస్తున్నాయంటూ ట్రంప్ యంత్రాంగం తరచుగా ఆరోపిస్తోంది.ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన చేస్తున్న ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. విదేశీ వృత్తి నిపుణుల కారణంగా అమెరికన్లకు ఉద్యోగావకాశాలు దక్కడం లేదని ట్రంప్ వాదిస్తున్నారు. హెచ్-1బి వీసా కార్యక్రమంవల్ల ప్రపంచంలోని ప్రతిభావంతులను అమెరికాకు తీసుకువచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని ట్రంప్ అంటున్నారు. వలసలను ఆపేందుకు ట్రంప్ ప్రయత్నిస్తుండగా, ఆయన పార్టీ సభ్యులు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. హెచ్1బి వీసా ప్రోగ్రామ్ను పూర్తిగా ముగించే బిల్లును అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ ప్రవేశపెట్టారు. ఇమ్మిగ్రేషన్, జాతీయతా చట్టాన్ని సవరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అమెరికా కార్మికుల ఉద్యోగాలను కాపాడాలని, కంపెనీలు తక్కువ వేతనాలకు విదేశీ కార్మికులను తీసుకురావటం ఆపాలంటూ గ్రెగ్ ఈ ప్రతిపాదన తెచ్చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇమ్మిగ్రేషన్ చట్టంలో మార్పులు చేసి 2027 ఆర్థిక సంవత్సరం నుంచి హెచ్1బి వీసాల జారీని పూర్తిగా నిలిపివేస్తారు. భవిష్యత్తులో హెచ్1బి వీసాలు అనేవి ఇవ్వబోరు. విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అమెరికా పౌరుల శ్రేయస్సు, సంపద దెబ్బతింటోందని రిపబ్లికన్ పార్టీ సభ్యులు వాదిస్తున్నారు. ఇది అమెరికా విలువలకు, జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమని గళమెత్తుతున్నారు. అమెరికన్ డ్రీమ్ను తమ పిల్లల కోసం కాపాడుకోవాలని, విదేశీయులకు అనుమతించొద్దని అంటున్నారు. హెచ్1బి వీసాల్లో 70%కి పైగా భారతీయులకే వస్తున్నాయి, తర్వాత స్థానంలో చైనీయులు ఉన్నారు. ఈ హెచ్1బి వీసాలు అమెరికన్ల ఉద్యోగాలను తీసేస్తాయని, వేతనాలను తగ్గిస్తాయని ఆరోపణలు ఉన్నాయి. గతంలో 2015లో డిస్నీ 250 మంది అమెరికా ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో హెచ్1బి వీసాతో వచ్చిన విదేశీయులను నియమించింది. 2014లో సదరన్ కాలిఫోర్నియా ఎడిషన్ కంపెనీ 540 మందిని తొలగించి, ఔట్సోర్సింగ్ కంపెనీల నుంచి విదేశీ కార్మికులను తీసుకుంది. 2025లో మైక్రోసాఫ్ట్లో 16 వేల మంది అమెరికా ఉద్యోగులను తొలగించారు, 9,000 హెచ్1బి వీసాల ఆమోదం తర్వాత ఈ పరిణామం జరిగింది. ఈ వ్యవస్థ వల్ల 10,000ల మందికి పైగా వైద్యులు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. ఏటా 5,000 మంది విదేశీ డాక్టర్లు అమెరికా వస్తున్నారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారత టెక్కీల ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుంది. ట్రంప్ ప్రభుత్వం కఠిన విధానాలకు తోడు ఈ కొత్త బిల్లు అమెరికా వెళ్ళాలనుకునే భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఐనం ప్రసాద్ 98489 28787
మన తెలంగాణ/హైదరాబాద్: రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని మున్సిపల్ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. బద్ద సిద్ధాంత వైరుధ్య పార్టీలు కూడా పదవుల కోసం ఎంతకైనా దిగజారుతాయని తేలిపోయిం ది. మున్సిపల్ కార్పోరేషన్, మున్సిపాలిటీలలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదువుల కోసం సోమవారం జరిగిన ఎన్నికల్లో అనైతిక పొత్తులు, పదవులు కోసం చివరి నిమిషంలో పార్టీ ఫిరాయింపులు, అప్పటికప్పుడు ప దవులు దక్కించుకోవడం వంటి చిత్రవిచిత్రమైన ఎత్తులు, పొత్తులతో రాజకీయం రసకందాయం గా మారింది. కొన్ని చోట్ల రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ జతకడి తే, మరికొన్ని చోట్ల బిజెపి, ఎంఐఎం పార్టీలు ప దవులు పంచుకోవడం వంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి. తమ పార్టీలు జారీ చేసిన విప్ల ను సైతం ఖాతరు చేయకుండా రాజకీయ ప్రత్యర్థులతో క్షేత్రస్థాయిలో జతకట్టి చైర్మన్, వైస్ చైర్మ న్ పదవులను దక్కించుకున్న ఉదంతాలు ఆయా పార్టీల అధిష్టాలను ఖంగుతినిపించగా, ఇండెపెండెంటెంట్లు సైతం చివరి నిమిషంలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవడం వంటి ఆ సక్తికర సంఘటనలు రక్తికట్టించాయి కామారెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కామారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఇప్ప ఉమారాణిని చైర్ పర్సన్ పీఠం వరించింది. ఈ ఎన్నికల్లో స్వత్రంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేది లేదంటూ కామారెడ్డిలోని బిఆర్ఎస్ పార్టీ నేతలు తేల్చి చెప్పారు. దాంతో పార్టీలో చేరిన ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవికి ప్రతిపాదించగా, సమాన స్థానాలు గెలుచుకున్న ప్రతిపక్ష బిఆర్ఎస్ తమకు వైస్ చైర్మన్ పదవి ఇస్తే కాంగ్రెస్ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని మెలికె పెట్టింది. వైస్ చైర్ పర్సన్గా కాసర్ల గోదావరి అభ్యర్థితిత్వాన్ని బిఆర్ఎస్ ప్రతిపాదించింది. దీంతో ఇరు పార్టీ రాజీ కుదుర్చుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్, బిఆర్ఎస్ నుంచి వైస్ చైర్మన్ పదవులు పంచుకోవడం విశేషం. ఇలాంటి ఉదంతమే అదిలాబాద్లోనూ చోటుచేసుకుంది. అక్కడ స్వంతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనూష బండారి నాటకీయ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్ పర్సన్గా ఎన్నికయ్యారు. ఇక్కడ బిజెపి అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోవడంతో ఉత్కంఠ భరితంగా ఎన్నికలు జరిగాయి. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన అనంతరం తిరిగి కాంగ్రెస్లో చేరి చైర్మన్ పదవి దక్కించుకున్నారు. భైంసాలో బిజెపి, ఎంఐఎం రెబల్స్ దోస్తీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా భైంసాలో బిజెపి, ఎంఐఎం పార్టీలు జతకట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మజ్లిస్ పార్టీ 12 స్థానాలను గెలుచుకోవడంతో ఆ పార్టీకి చైర్మన్ పదవి దక్కుతుందని భావించారు.అయితే, మజ్లిస్ పార్టీకి చైర్మన్ పదవి దక్కకుండా బిజెపి చక్రం తిప్పింది. ఇక్కడ మజ్లిస్ పార్టీ నుంచి రెబల్గా పోటీ చేసి గెలిచిన బీబీ ఖతీజా సిద్ధిఖీకి వైస్ చైర్మన్ పదవి ఎరవేసి ఆయనను తమ పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థి తూము దత్తాత్రి చైర్మన్ పదవి కట్టబెట్టింది. గెలుపొందిన వారిలో అత్యధికులు తమ పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థులు కావడంతో చివరి నిమిషంలో వారిని దారికి తెచ్చుకుని మజ్లిస్ పార్టీకి చైర్మన్ పీఠం దక్కకుండా పావులు కదిపింది. అమన్గల్లో గంటలో మారిన రాజకీయం అమన్గల్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థి ఫత్యా నాయక్ చైర్మన్ ఎన్నికకు గంట ముందు పార్టీ మారి కాంగ్రెస్ తరపున మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. చైర్మన్ ఎన్నికకు ముందు ఆయన బిఆర్ఎస్ శిబిరం నుంచి తప్పించుకుని ఎంపి మల్లు రవి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత జరిగిన చైర్మన్ ఎన్నికలో ఫత్యా నాయక్ను చైర్మన్గా కాంగ్రెస్ ప్రతిపాదించగా, బిజెపి మద్దతు పలికి వైస్ చైర్మన్ పదవిని తల్లోజు గీత దక్కించుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన బిఆర్ఎస్ పార్టీ అమన్గల్ చౌరస్తాలో రోడ్డుపై భైఠాయించి కొద్దిసేపు ఆందోళనకు దిగింది. నర్సాపూర్లో ఒక్కటైన కాంగ్రెస్, కమలం ఆలయ్బలాయ్ నర్సాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు జతకట్టం ఆసక్తికర పరిణామం. అక్కడ మొత్తం 15 వార్డులకుగాను కాంగ్రెస్ 6, బిఆర్ఎస్ 5, బిజెపి 4 వార్డులు గెలవడంతో హంగ్ ఏర్పడింది.అయితే, ఇక్కడ బిఆర్ఎస్కు చైర్మన్ పదవి దక్కకుండా కాంగ్రెస్, బిజెపి పార్టీలు జతకట్టాయి. ఛైర్పర్సన్గా కాంగ్రెస్ 5వ వార్డు కౌన్సిలర్ మాచునూరి లక్ష్మి ఎన్నిక కాగా, వైస్ ఛైర్మన్గా 13వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన బిజెపి అభ్యర్థి బుచ్చేశ్ యాదవను ఎన్నుకున్నారు. ఈ విజయాన్ని కాంగ్రెస్, బిజెపి నేతలు కలిసి సంబరాలు జరుపుకోవడం విశేషం. వడ్డేపల్లిపై ఎగిరిన ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ జెండా రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిల రాజకీయాలే నడిచేవి. అనూహ్యంగా ఈసారి జరిగిన మున్సిపల్ ఎన్నికలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తమ సంస్థ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి బి.ఫామ్లతో బరిలోకి దింపింది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశించి భంగపడిన అభ్యర్థులంతా ఒక్కతాటిపైకి వచ్చి ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేసి పది స్థానాలు గెలుచుకున్నారు. స్పష్టమైన ఆధిక్యత ఇక్కడ ఫార్వార్డ్ బ్లాక్కే లభించడంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు మహిళలల్లో మంజుల మున్సిపల్ చైర్మన్గా, సారమ్మ వైస్ చైర్మన్గా పదవులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. కాగా, సిర్పూర్ కాగజ్నగర్, మెట్పల్లిలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవడం, అలాగే అలియాబాద్లో కాంగ్రెస్ చైర్మన్ పదవికి బిజెపి మద్దతు ఇవ్వడం వంటి ఉదంతాలు కూడా చోటుచేసుకున్నాయి.
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పోలీసు బలగాలను అడ్డుపెట్టుకొని పలు పట్టణాల్లో అభ్యర్థులను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ ‘గుండా రాజ్యానికి’ అద్దం పడుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. స్వయంగా అధికారులు, పోలీసులు అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక అరాచక విధానాలను కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్వయంగా ఎంపిలు, ఎంఎల్ఎలే గెలిచిన ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేసే ప్రయత్నాలకు పాల్పడడం, ఎక్కడికక్కడ దాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తోర్రూర్, జనగామ, క్యాతనపల్లి, కాగజ్నగర్ వంటి అనేక పట్టణాల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. మంత్రులు, ఎంఎల్ఎలే నేరుగా అక్రమ పద్ధతుల్లో ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియలో తలదూర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ అఫీషియో ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేసుకొని మరీ పదవులను పొందాలని చూడడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర డిజిపి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోరం ఉన్న చోట్ల కూడా కేవలం అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి ఎన్నికలను వాయిదా వేయడం ఎన్నికల సంఘం పనితీరుపై మాయని మచ్చగా నిలుస్తుందని ఆక్షేపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమ కిడ్నాప్లు, దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తన క్రిమినల్ మెంటాలిటీతో, గూండాల బలంతో ప్రజల ఆకాంక్షలను, బిఆర్ఎస్ పోరాటాలను ఆపలేదని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగిస్తున్న ఈ అరాచకానికి, గూండాయిజానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కెటిఆర్ స్పష్టం చేశారు. 8 పట్టణాలకు ఇంఛార్జీల నియామకం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలు, కుట్రల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. మంగళవారం ఎన్నికలు జరగనున్న కీలకమైన హంగ్ మున్సిపాలిటీల కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రత్యేకంగా ఎన్నికల ఇం-ఛార్జిలను నియమించారు. ఈ మేరకు ఆయన ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం, నియోజకవర్గ ఎంఎల్ఎలు, ఇం-ఛార్జిలతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. కాంగ్రెస్ అరాచకాల నేపథ్యంలో స్థానిక నాయకత్వానికి అన్ని విధాలా అండగా నిలబడేందుకు, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున సీనియర్ నాయకులను ప్రత్యేక ఇం-ఛార్జిలుగా పంపుతున్నట్లు ప్రకటించారు. కెటిఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు వెంటనే తమకు కేటాయించిన మున్సిపాలిటీలకు బయలుదేరి వెళ్లారు.
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మక వి ద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది మొత్తంగా 12మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోరుతో మెరిశా రు. వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నరేంద్రబాబు గారి మహి త్, పసల మోహిత్, తెలంగాణ నుంచి వివాన్ శరద్ మహిశ్వరి అదరగొట్టారు.100 పర్సంటైల్ స్కోరు సాధించిన వా రిలో అత్యధికంగా రాజస్థాన్కు చెందిన వారేనని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) సోమవారం ప్రకటించింది. 100 పర్సంటైల్ స్కోరు సాధించిన అభ్యర్థుల్లో ముగ్గురు రాజస్థాన్, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉండగా, తెలంగాణ, ఢిల్లీ, బిహా ర్, ఒడిశా, హరియాణా, మహారాష్ట్ర, గుజరాత్, రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఉన్నారు. అయి తే, అర్హత సాధించిన 12 మంది అ భ్యర్థులూ బాలురే కావడం విశే షం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివాన్ శరద్ మహిశ్వరి, నరేంద్రబాబు గారి మహిత్ (ఎ పి), పసల మోహిత్ (ఎపి), కబీర్ చిల్లర్(రాజస్థాన్), చిరంజీబ్ కర్ (రాజస్థాన్),అర్నవ్ గౌతమ్ (రాజస్థాన్), శుభమ్ కుమార్ (బిహార్), భవేశ్ పాత్రా (ఒడిశా), అనయ్ జైన్ (హరియాణా), మాధవ్ వైరాదియా (మహారాష్ట్ర), శ్రేయస్ మిశ్రా (దిల్లీ), పురోహిత్ నిమయ్ (గుజరాత్) ఉన్నారు. మరోవైపు, నరేంద్రబాబు గారి మహిత్ ఒబిసి ఎన్సీఎల్ కేటగిరీలో టాపర్గా నిలిచాడు. మరో ఇద్దరు, పసల మో హిత్, వివాన్ శరద్ మహిశ్వరి 100 పర్సంటైల్ స్కోరుతో జనరల్ కేటగిరీలో టాపర్లుగా నిలిచారు. తెలంగాణకు చెందిన వివన్ శరద్ వహిస్వరి, ఆంధ్రప్రదేశ్కు చెందిన నరేంద్రబాబు గారి మహిత్, పాసాల మోహిత్ 100 పర్సంటైల్ స్కోరు సాధించారు. పరీక్ష రాసిన 13,04,653 మంది విద్యార్థులు జెఇఇ మెయిన్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 13,55,293 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 13,04,653 మంది (96.26 శాతం) హాజరయ్యారు. మరోవైపు, జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడత పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు జరుగుతాయి. ఈ రెండింటిలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులను కేటాయిస్తారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50 లక్షల మందిని జెఇఇ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జెఇఇ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంటారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు 1. శ్రేయస్ మిశ్రా (దిల్లీ) 2. నరేంద్రబాబు గారి మహిత్ (ఎపి) 3. శుభమ్ కుమార్ (బిహార్) 4. కబీర్ చిల్లర్(రాజస్థాన్) 5. చిరంజీబ్ కర్ (రాజస్థాన్) 6. భవేశ్ పాత్రా (ఒడిశా) 7. అనయ్ జైన్ (హరియాణా) 8. అర్నవ్ గౌతమ్ (రాజస్థాన్) 9. పసల మోహిత్ (ఎపి) 10. మాధవ్ వైరాదియా (మహారాష్ట్ర) 11. పురోహిత్ నిమయ్ (గుజరాత్) 12. వివాన్ శరద్ మహిశ్వరి(తెలంగాణ)
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజనలో భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మండలానికి ఆ నుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కో రారు. సోమవారం అమరావతిలో ఏపి చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన సాగునీటి వసతులు, ప్రజల సౌకర్యానికి సంబంధించిన పలు కీలక విజ్ఞప్తులు చేశారు. యటపాక, కన్నాయిగూ డెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండటం వల్ల ప్రజలు పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ సిఎం దృష్టి కి తీసుకెళ్లారు. ఈ గ్రామాలు గోదావరి నది, అటవీ ప్రాం తాల మధ్య ఉండటంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంక్లేవ్లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రజ లు దాదాపు ఎనిమిది గంటలు ప్రయాణించాల్సి వస్తోందని మంత్రి పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర చెక్పోస్టులు, పన్నులు, పరిపాలనా అనుసంధానం లోపం, భద్రతా సమస్యలు వంటి అంశాలు స్థానిక గిరిజన ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని మంత్రి తుమ్మల వివరించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించిన భూభాగాల్లో కొంత భాగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటం వల్ల దేవస్థానం పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భక్తులకు మెరుగైన సేవలు అందించాలంటే గ్రామాల విలీనం అవసరమని మంత్రి పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ చర్య కీలకమని తెలిపారు. అదే విధంగా, ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్ట్ శాశ్వత మరమ్మత్తులు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 16,000 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, అందులో సుమారు 13,640 ఎకరాలు (85.25%) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 2,360 ఎకరాలు (14.75%) తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అని మంత్రి వివరించారు. ప్రాజెక్ట్ శాశ్వత పునరుద్ధరణకు సుమారు రూ.92.20 కోట్ల వ్యయం అంచనా అవుతుందని, రెండు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఖర్చును 85:15 నిష్పత్తిలో భరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. రైతుల సాగు, జీవనాధారం ఈ ప్రాజెక్ట్పై ఆధారపడి ఉండటంతో తక్షణ ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరి వరద రక్షణ కరకట్టలోని మూడవ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతిన్న విషయం కూడా మంత్రి ప్రస్తావించారు. భద్రాచలం పట్టణాన్ని వరదల నుంచి రక్షించేందుకు నిర్మించిన రక్షణ గోడలో జరిగిన నష్టం భవిష్యత్తులో భారీ ప్రమాదానికి దారితీయొచ్చని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కరకట్టలోని రక్షణ గోడ నిర్మించిన భాగం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లడంతో నిర్వహణలో సమస్యలు ఏర్పడ్డాయని మంత్రి తెలిపారు. ఈ అంశం ఇప్పటికే తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని మంత్రి పేర్కొన్నారు. తక్షణ సాంకేతిక పరిశీలన చేపట్టి తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, రెండు రాష్ట్రాల సమన్వయంతో శాశ్వత పునరుద్ధరణ చర్యలు ప్రారంభించాలని, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి అవసరమైన భూమి గుర్తింపు పూర్తయిందని, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కోరారు. స్థానిక భక్తుల దీర్ఘకాలిక ఆశయాన్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక యాత్రికుల భవనం నిర్మాణానికి సుమారు 5 ఎకరాల భూమి కేటాయించాలని మంత్రి ప్రతిపాదించారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వసతి కొరతను తగ్గించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శన కల్పించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం పెంపొందిస్తే సాగునీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతుల విస్తరణలో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో : మెజారిటీ సీట్లను సాధించిన బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవి దక్కకుండా సీఎం రే వంత్ రెడి, మం త్రులు,బీఆర్ఎస్,ఎంఐఎంతో కలిసి మీరు చేయని కుట్రలకు,సీఎం మొదలు పెట్టిన ఆటకు ముగింపు ఇస్తాన ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమా ర్ పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్బల్దియా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంత రం మీడియాతో మాట్లాడుతూ మీరు అనవసరంగా, అప్రజా స్వా మికంగా నన్ను కెలికి ఆటమొ దలుపెట్టారన్నారు. ఇక మీ ఆటకు నేను ముగింపు ఇస్తా అని సీఎం రేవం త్ రెడ్డికి అల్టి మేటం ఇచ్చారు. క్రికెట్లో ఇండియాపై పాకిస్తాన్ ఘనవిజయం సాధించినట్లుగానే, కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల కబడ్డీ ఆటలో...మీ అందరినీ ఓడించి బీ జేపీ కప్ గెలుచుకుందని పేర్కొన్నా రు.కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటి కావ డానికి కారణమేంటి? ప్రజాస్యామ్యాన్ని అపహా స్యం చేసేలా ఫాంహౌజ్ వేదికగా కుట్రలు ఎందుకు చేశారు? ఎవరిపై మీ కోపం? కాంగ్రెస్ గెలిచింది 14 సీట్లు, ఎంఐఎం గెలిచింది 3 సీట్లు, బీఆర్ఎస్ గెలిచింది 9 సీట్లు... అన్నీ కలుపుకున్నా 26 సీట్లు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ దాటనే లేదన్నారు. ఇవన్నీ తెలిసి ఎందుకు బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, కాంగ్రెస్, బీఆర్ ఎస్, మజ్లిస్ పార్టీలన్నీ కలిసి రెండు రోజులుగా జరుగుతున్న కుట్రలను చూసి ప్రజలే విస్తుపోయారన్నారు. ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటున్నారా? అంటూ సోషల్ మీ డియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.ఎన్నిక ఈ విషయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల పంథాను చూసి అభినందించకుండా ఉండలే కపోతు న్నానన్నారు. ప్రజాస్వామ్య తీర్పును శిరసావహించాలనే ఉద్దేశంతో పార్టీ నిర్ణ యానికి భిన్నంగా వ్యవహరించిన తీరు గొప్ప విషయమన్నారు.
‘ఫౌజీ’ షూటింగ్లోప్రభాస్కు స్వల్ప గాయాలు
హైదరాబాద్: హను రాఘవపూడి దర్శ కత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఫౌజీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీక రిస్తుండగా గుర్రం నుంచి అదుపు తప్పి ప్రభాస్ కింద పడ్డాడు. దీంతో చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలియ గానే అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఇది చిన్న గాయమేనని, ప్రభాస్ త్వరలోనే కోలుకుని షూటింగ్ కొనసాగిస్తా రని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ […] The post ‘ఫౌజీ’ షూటింగ్లోప్రభాస్కు స్వల్ప గాయాలు appeared first on Visalaandhra .
విజయ్-రష్మికపెళ్లి ముహూర్తం ఖరారు
హైదరాబాద్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నల పెళ్లి గురించి కొన్నాళ్లుగా వరుస వార్తలు వైరల్ అవుతున్న సంగతి విదితమే. అయితే ఈ సారి ఏకంగా వారి వివాహ నిశ్చయ తాంబూలాల ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వెడ్డింగ్ కార్డ్ ప్రకారం, వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26, 2026న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక ప్రైవేట్ వేడుకగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సినీ రాజకీయ ప్రముఖుల కోసం […] The post విజయ్-రష్మికపెళ్లి ముహూర్తం ఖరారు appeared first on Visalaandhra .
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి సినిమా ‘విశ్వంభర’పై పడింది. భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ, వీఎఫఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. గతంలో విడుదలైన టీజర్పై అంతగా సానుకూల స్పందన రాకపోవడంతో సీరియస్గా తీసుకున్న చిత్ర బృందం, ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని అందించేలా సీజీ వర్క్ను […] The post విశ్వంభర ‘ట్రైలర’ సిద్ధం appeared first on Visalaandhra .
హైదరాబాద్: టాలీవుడ్లో ఇటీవల సెన్సార్ బోర్డు ఆంక్షలతో దర్శకనిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల విడుదలైన సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రానికి టైటిల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో దానికి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. టైటిల్ను ‘ఫ్రెండ్లీ కపుల’గా మార్చాలని బోర్డు సూచించినా, చిత్ర యూనిట్ మాత్రం అందుకు నిరాకరించింది. గత నెలలో కూడా ‘వానర’ అనే చిన్న సినిమా టైటిల్ను ‘వనవీర’గా మార్చాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే కోవలో సుహాస్, శివాని నగరం జంటగా […] The post సుహాస్ సినిమా పేరు మార్పు appeared first on Visalaandhra .
సహచరులకు కెప్టెన్ సూర్య సందేశంన్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్ గ్రూప్ఎ లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన భారత్పాకిస్థాన్ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆటగాళ్లకు ఇచ్చిన సూచనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సహచరులకు స్పష్టంగా చెప్పిన […] The post మాటలొద్దు… చేతలు చూపండి appeared first on Visalaandhra .
ఎట్టకేలకు అఫ్గాన్ బోణీయూఏఈ జట్టుపై విజయం
న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైన అఫ్గాన్, తాజాగా యూఏఈపై ఘన విజయం సాధించింది. గ్రూప్ డీలోభాగంగా సోమవారం దిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇబ్రహీం జర్దాన్ (53 పరుగులు), అజ్ముతుల్లా ఒమర్జాయ్ (40 పరుగులు) రాణించారు. యూఏఈ […] The post ఎట్టకేలకు అఫ్గాన్ బోణీయూఏఈ జట్టుపై విజయం appeared first on Visalaandhra .
ఇమ్రాన్ను కలిసేందుకు వైద్యుల్ని అనుమతించట్లేదు
మాజీ ప్రధాని సోదరి అలీమా ఆగ్రహంఇస్లామాబాద్: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, జైలులో ఆయన పట్ల షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని ఇమ్రాన్ సోదరి అలీమా ఖానుమ్ మండిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ 800 రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న క్రమంలో తన సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై అలీమా ఖానుమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇమ్రాన్ఖాన్కు అతడి వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఆసిమ్ యూసుఫ్తో ఒక కుటుంబ సభ్యుడి సమక్షంలో చికిత్స అందించాలని […] The post ఇమ్రాన్ను కలిసేందుకు వైద్యుల్ని అనుమతించట్లేదు appeared first on Visalaandhra .
వెస్ట్ బ్యాంక్పై ఇజ్రాయిల్ కన్ను
టెలఅవివ్: పశ్చిమాసియాలో మరోమారు తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గజాపై ఇజ్రాయిల్ మారణీVAమం సష్టిస్తోంది. మరోపక్క ఇరాన్-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ మెత్తబడిందో లేదో ఇప్పుడు ఇజ్రాయిల్ మరో దుశ్చర్యకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద భూమి వెస్ట్ బ్యాంక్ను విలీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. వెస్ట్ బ్యాంక్ను స్వాధీనం చేసుకునేందుకు నెతన్యాహు ప్రభుత్వ అడుగులు పడుతున్నాయనేందుకు తాజా పరిణామాలే నిదర్శనం. ఇప్పటికే వెస్ట్ బ్యాంక్లో అధికారిక భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను […] The post వెస్ట్ బ్యాంక్పై ఇజ్రాయిల్ కన్ను appeared first on Visalaandhra .
సూడాన్లో 3 రోజుల్లో6 వేల మంది ఊచకోత
. పారామిలిటరీ ఘాతుకం. ఐరాస సంచలన నివేదిక న్యూయార్క్: సూడాన్లో పారామిలిటరీ దళాలు సృష్టించిన మారణకాండపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) సంచలన నివేదిక విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ చివరిలో దార్ఫుర్ ప్రాంతంలో కేవలం మూడు రోజుల్లోనే రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆరఎసఎఫ్) దళాలు 6వేల మందికి పైగా పౌరులను అత్యంత క్రూరంగా హతమార్చినట్లు తెలిపింది. ఈ హింస దిగ్భ్రాంతికరంగా ఉందని, ఇవి యుద్ధ నేరాలు, మానవత్వంపై ఘోరాలతో సమానమని ఐరాస మానవ హక్కుల కార్యాలయం తన నివేదికలో […] The post సూడాన్లో 3 రోజుల్లో6 వేల మంది ఊచకోత appeared first on Visalaandhra .
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సును నేడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ హైటెక్స్లో జరగబోయే బయోఏషియా-2026 సదస్సు ఈ నెల 17, 18 తేదీల్లో రెండు రో జుల పాటు జరుగనుంది. ఈ ప్రపంచ స్థా యి సదస్సు ప్రధానంగా ‘టెక్బయో అన్లీష్డ్ - ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వ స్తున్న విప్లవాత్మక పరిణామాలు’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్నారు. టెక్బయో ఇన్నోవేషన్స్లో దేశం గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో లైఫ్ సైన్సెస్ రంగంలో భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ సంబంధించిన అంశాలపై ఈ సదస్సు చర్చించనుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏర్పాటు చేసే అంతర్జాతీయ ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం బయోఏషియా సదస్సును ప్రారంభించి ఆయన ప్రసంగిస్తారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు, బయో సైన్సెస్ రంగంలో నిష్ణాతులు ఆయా అంశాలపై ప్రసంగించనున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్, అమెరికాకు చెందిన ఆమ్జెన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ హోవర్డ్ వై చాంగ్ కీలకోపన్యాసం చేయనున్నారు. సైన్స్, సాఫ్ట్వేర్ అండ్ సప్లయ్, నెక్స్ట్ జనరేషన్ బయోలాజిక్స్, ఫార్మా, బయోటెక్ భవిష్యత్, ఏఐ, ఆర్ అండ్ డి (డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్), గ్లోబల్ ఇంపాక్ట్, తెలంగాణ రైజింగ్ 2047 -వరల్డ్-క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ వంటి కీలక అంశాలపై జరిగే చర్చల్లో వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు పాల్గొంటారు.
మంగళవారం రాశి ఫలాలు (17-02-2026)
మేషరాశి రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో ఆర్థిక లబ్ది కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృషభం చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అధికారులతో చికాకులు కలుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. మిధునం కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. కర్కాటకం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సింహం వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సకాలంలో అందుతాయి. కన్య ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి. తుల వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. వృశ్చికం వ్యాపార వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ధనస్సు గృహమున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి ఉన్నత పదవులు పొందుతారు. మకరం నూతన గృహ వాహన యోగం ఉన్నది. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సహకార విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కుంభం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. మీనం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనల వలన వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.
. జనగణనలో కులగణన. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమం. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ విశాలాంధ్ర`కాకినాడ: ప్రజాసమస్యలపై పోరుబాట పట్టాలని, సీపీఐని రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా నడిపించాలని, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం జనగణనలో కుల గణన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బీసీ కులాలు ఐక్యంగా సమరశీల […] The post ప్రజా సమస్యలపై పోరుబాట appeared first on Visalaandhra .
జేఈఈ మెయిన్స్ ఫలితాలు వచ్చేశాయ్…
ముగ్గురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్ . ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒకరు. దేశవ్యాప్తంగా 12 మంది టాపర్లు న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ 2026 జనవరి సెషన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తాను మరోసారి చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన 12 మంది టాపర్ల జాబితాలో ముగ్గురు […] The post జేఈఈ మెయిన్స్ ఫలితాలు వచ్చేశాయ్… appeared first on Visalaandhra .
కామారెడ్డి, ఆదిలాబాద్లలో ఇండిపెండెంట్లకు ఛైర్మన్ పదవులు
కామారెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కామారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఇప్ప ఉమారాణిని చైర్ పర్సన్ పీఠం వరించింది. ఈ ఎన్నికల్లో స్వత్రంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేది లేదంటూ కామారెడ్డిలోని బిఆర్ఎస్ పార్టీ నేతలు తేల్చి చెప్పారు. దాంతో పార్టీలో చేరిన ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవికి ప్రతిపాదించగా, సమాన స్థానాలు గెలుచుకున్న ప్రతిపక్ష బిఆర్ఎస్ తమకు వైస్ చైర్మన్ పదవి ఇస్తే కాంగ్రెస్ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని మెలికె పెట్టింది. వైస్ చైర్ పర్సన్గా కాసర్ల గోదావరి అభ్యర్థితిత్వాన్ని బిఆర్ఎస్ ప్రతిపాదించింది. దీంతో ఇరు పార్టీ రాజీ కుదుర్చుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్, బిఆర్ఎస్ నుంచి వైస్ చైర్మన్ పదవులు పంచుకోవడం విశేషం. ఇలాంటి ఉదంతమే అదిలాబాద్లోనూ చోటుచేసుకుంది. అక్కడ స్వంతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనూష బండారి నాటకీయ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్ పర్సన్గా ఎన్నికయ్యారు. ఇక్కడ బిజెపి అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోవడంతో ఉత్కంఠ భరితంగా ఎన్నికలు జరిగాయి. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన అనంతరం తిరిగి కాంగ్రెస్లో చేరి చైర్మన్ పదవి దక్కించుకున్నారు.
ఈ నెల 18న ఢిల్లీకి సిఎం రేవంత్రెడ్డి
ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్కు హాజరు మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొంటారు. న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా నిర్వహిస్తోన్న ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సోమవారం ఘనంగా ప్రారంభ మైంది. ఫిబ్రవరి 16 నుండి 20 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) వల్ల కలిగే మార్పులు, అవకాశాలు, సవాళ్లపై ప్రపంచ స్థాయి చర్చలకు ఈ సమ్మిట్ వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎఐ వినియోగం, భద్రత, సహకారం కోసం ఒక ఉమ్మడి మార్గదర్శకాన్ని ప్రకటించడం ఈ సదస్సు ముఖ్య లక్ష్యంగా ఉంది. ఉద్యోగాల్లో వస్తున్న మార్పుల నుండి పిల్లల భద్రత వరకు ఎఐ ప్రభావం చూపే అన్ని కీలక అంశాలపై ఇందులో చర్చించనున్నారు. ఈ సదస్సులో దాదాపు 30 దేశాల నుండి 2.5 లక్షల మంది సందర్శకులు పాల్గొంటారని అంచనా. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, బ్రిటన్ సహా 13 దేశాలు ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేశాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలు భారత్లో దాదాపు 68 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, ఈ సదస్సు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్మాన్, ముఖేష్ అంబానీ వంటి దిగ్గజాలు ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతును ప్రపంచ ఎఐ వేదికపై బలంగా వినిపించాలని భారత్ భావిస్తోంది.
దేశం పరువు తీశారు.. పాక్ జట్టుపై మాజీలు ఫైర్
లాహోర్: భారత్తో జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్లో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ టీమ్ పై విమర్శల వర్షం కురుస్తోంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ ఎలాంటి పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. జట్టు ప్రదర్శనపై పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, మహ్మద్ యూసుఫ్, జావేద్ మియాందాద్ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేలవమైన ప్రదర్శనతో దేశ పరువును తీశారని ఆగ్రహ్రం వ్యక్తం చేశారు. బాబర్ ఆజమ్, కెప్టెన్ సల్మాన్ ఆఘా, షహీన్ అఫ్రిది తదితరులపై వారు దుమ్మెత్తి పోశారు.
రేపు విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం విశాఖపట్నం రానున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయుధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలి హోదాలో రాష్ట్ర పతి ఈ విన్యాసాలను సమీక్షిస్తారు. అంతర్జాతీయ నౌకాదళ ప్రతినిధులు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలు ఒకచోటకి చేరి తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడమే ఐఎఫ్ఆర్ ముఖ్య ఉద్దేశం. మంగళవారం రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందుతో ఐఎఫ్ఆర్-2026 కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన యాంకరేజ్ ప్రాంతంలో భారత్తో పాటు స్నేహపూర్వక దేశాలకు చెందిన సుమారు 70 యుద్ధనౌకల ఫ్లీట్ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ఈ కార్యక్రమంలో ఎపి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొంటారు. దేశాల మధ్య సముద్రయాన శక్తిని, సహకారాన్ని, స్నేహాన్ని ప్రదర్శించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని భారత నౌకాదళం తెలిపింది. ఈసారి ఐఎఫ్ఆర్లో ’ఆపరేషన్ సిందూర్’ హీరో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ’ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్ నౌకాదళాన్ని కట్టడి చేయడంలో ఈ యుద్ధనౌక వ్యూహాత్మకంగా కీలకపాత్ర పోషించింది. మిత్ర దేశాల నౌకాదళాలు ఈ విమాన వాహక నౌకను సమీపం నుంచి పరిశీలించనున్నాయి. ఈసారి విశాఖ కేవలం ఐఎఫ్ఆర్కే కాకుండా మరో రెండు కీలక కార్యక్రమాలకు కూడా వేదికైంది. భారత నౌకాదళం ఆధ్వర్యంలో 13వ ఎడిషన్ మిలాన్-2026, హిందూ మహాసముద్ర నౌకాదళ సింపోజియం సదస్సు కూడా ఇక్కడే జరుగుతున్నాయి. 135కి పైగా దేశాలను మిలాన్ విన్యాసాలకు ఆహ్వానిం చారు. భారత్ ఈ మూడు ప్రధాన సముద్రయాన కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించడం ఇదే ప్రప్రథమం. భారత్లో తొలి ఐఎఫ్ఆర్ను 2001లో ముంబైలో నిర్వహించగా, అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ సమీక్షించారు. రెండోసారి 2016లో విశాఖపట్నంలో నిర్వహించగా, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఇప్పుడు మూడోసారి జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా భారత నౌకాదళ శక్తి, అంతర్జాతీయ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
34 స్కూళ్లకు బాంబు బెదిరింపు..
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్, వడోదరలో మొత్తం 34 స్కూళ్లకు సోమవారం ఉదయం ఈ మెయిళ్ల ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే ఆ స్కూళ్లను ఖాళీ చేయించామని పోలీసులు చెప్పారు. ఖలిస్థాన్ మద్దతుదారులమని బెదిరింపులు రావడంతో బాంబు తనిఖీ స్కాడ్లు రంగం లోకి తనిఖీ చేపట్టగా అవి ఉత్తవే అని తేలిందని పోలీస్ డిజిపి రాహుల్త్రిపాఠీ చెప్పారు. ఈ మెయిళ్లు ఎక్కడ నుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదే విధంగా జనవరి 23న అహ్మదాబాద్ లోని అనేక స్కూళ్లకు బెదిరింపులు రాగా ఉత్తవేనని తేలిందన్నారు.
టి20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియాకు లంక షాక్
పల్లెకెలె: టి20 వరల్డ్కప్లో ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. సోమవారం శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో సూపర్8 అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక 8 వికెట్ల తేడాతో కంగారూలను ఓడించిన శ్రీలంక సూపర్8కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. మిఛెల్ మార్ష్ (54), ట్రావిస్ హెడ్ (56)లు రాణించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన లంక 18 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా 52 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. కుశాల్ మెండిస్ (51), పవన్ (28) నాటౌట్ తమవంతు పాత్ర పోషించారు.
ఆన్లైన్ బెట్టింగ్లో భారీ మోసం..రూ.1.5 కోట్లు కోల్పోయిన హైదరాబాద్ వ్యాపారి
వాట్సాప్ ప్రకటనలతో ఉచ్చులోకి లాగిన ముఠాలాభాల పేరుతో సైట్లు మార్చుతూ డబ్బు దోచుకున్న నిందితులు
న్యూస్క్లిక్, ఎడిటర్లకు రూ.184 కోట్ల ఇడి పెనాల్టీ..
న్యూఢిల్లీ: న్యూస్పోర్టల్ న్యూస్క్లిక్కు,దాని ఎడిటర్ ఇన్ చీఫ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ.184 కోట్ల విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద సోమవారం పెనాల్టీ విధించింది. న్యూస్క్లిక్కు రూ.120 కోట్లు, ఎడిటర్ ఇన్ఛార్జి ప్రబీర్ పురకాయస్థకు రూ. 64 కోట్లు మొత్తం రూ. 184 కోట్లు పెనాల్టీ విధించినట్టు వివరించింది. చట్టం నిబంధనలు ఉల్లంఘించడం, నిధుల వినియోగం తప్పుగా చూపించడంతో ఈ పెనాల్టీ విధించినట్టు ఇడి పేర్కొంది. అయితే దీనిపై న్యూస్క్లిక్ ఇంకా స్పందించ లేదు. మనీ లాండరింగ్ కేసు కింద 2021లో మొదటిసారి న్యూస్క్లిక్పై ఇడి దాడి చేసింది. గ్లోబల్ నెట్వర్క్లో భాగంగా ప్రారంభమైన ఈపోర్టల్ అమెరికా బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘం నుంచి నిధులు పొందుతోందని, చైనా ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తోందని బీజేపీ 2023లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
అబూసలెంకు సుప్రీం కోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: గత పది నెలలుగా తాను అక్రమ కస్టడీలో ఉన్నానని ఆరోపిస్తూ గ్యాంగ్స్టర్ అబూసలెం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో ఇప్పటికే తాను 25 ఏళ్ల శిక్ష అనుభవించానని నిందితుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. అబూసలెం పరారీ కాగా, పోర్చుగల్ నుంచి 2005 నవంబరు 11న భారత్కు తీసుకు రాగలిగారు. భారత్కు అప్పగించినప్పుడు పోర్చుగల్తో కుదిరిన ఒప్పందం ప్రకారం అతడికి మరణశిక్ష విధించకూడదు. అలాగే జైలు శిక్ష 25 ఏళ్లు మించకూడదు. అబూసలెం జైలు శిక్ష 25 ఏళ్లు ఇంకా పూర్తి కాలేదని బొంబై హైకోర్టు జులైలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో జస్టిస్లు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా విచారించారు. దీనిపై హై కోర్టుకు వెళ్లాలని సూచించారు.
రేవంత్ రెడ్డిపై కేసు కొట్టివేత సబబే: సుప్రీంకోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో విజయం దక్కింది. రేవంత్ రెడ్డిపై 2016లో దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసే పిటిషన్ను అత్యుత్తమ న్యాయస్థానం తోసిపుచ్చింది. అప్పట్లో రేవంత్ రెడ్డిపై ఎస్సి/ ఎస్టి యాక్ట్, ఐపిసి పరిధిలో కేసు దాఖలు అయింది. దీనిపై హైకోర్టు వెలువరించిన తీర్పు సముచితమే అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జాయ్మాల్యా, విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు పూర్వాపరాలను హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. కేసులో రెండవ ప్రతివాదిగా పేర్కొన్న రేవంత్ రెడ్డిపై కేసు దాఖలుకు ఎటువంటి ప్రాధమిక సాక్షాధారాలు లేవని గుర్తించారు. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన రూలింగ్ సరైనదే అని అభిప్రాయపడుతున్నామని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో తాము ముఖ్యమంత్రికి క్లీన్చిట్ ఇస్తున్నట్లు భావించరాదు. అయితే నిజానిజాల నిర్థారణల తరువాత హైకోర్టు రూలింగ్ సరైనదిగా ఉందని స్పష్టం అవుతోందని ధర్మాసనం పేర్కొంది. ఏది ఏమైనా రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి న్యాయస్థానాలు వేదికలు కారాదని ఈ పందర్భంగా పార్టీలకు సిజెఐ చురకలు పెట్టారు. ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ను గత ఏడాది జులై 17న రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2016లో గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఎస్సి మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్తో సంబంధం ఉన్న ఎన్ పెద్దిరాజు రేవంత్రెడ్డిపై కేసు దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే అప్పట్లో ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, ఇతరులు గోపన్నపలి గ్రామంలోని సొసైటీ భూమిని కబ్జా చేశారని, కులం పేరిట తిట్టి, అక్కడున్న రూంలను కూలగొట్టారని ఫిర్యాదు చేశారు. తనపై దాఖలు అయిన కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ దశలో రేవంత్ రెడ్డి పాత్ర తెలిపే సాక్షాధారాలు లేవని పేర్కొంటూ ఆయనపై ఎప్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదించారు. వ్యాజ్యానికి దిగిన వ్యక్తి తరచూ దురుసుగా వ్యవహరించే రకం అని, గతంలో ఈ కేసుకు సంబంధించి హైకోర్టు జడ్జిపై కూడా పలు ఆరోపణలు చేశారని వివరించారు. అన్ని విషయాలను పరిశీలించి సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డిపై ఎప్ఐఆర్ కొట్టివేతను సమర్థించింది. ఇటువంటి కేసులు సుప్రీంకోర్టుకు తీసుకురావద్దని పిటిషనర్ను మందించింది.
Festiva l వైభవంగా దుర్గా నాగేశ్వర స్వామి రథోత్సవం..
Festiva l వైభవంగా దుర్గా నాగేశ్వర స్వామి రథోత్సవం.. Festiva l మోపిదేవి,
మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత
మార్చి 3న (సోమవారం) సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు 9 గంటల పాటు మూసివేయనున్నారు.మార్చి 3 ఉదయం 8:00 గంటలకు తలుపులు మూసివేస్తారు.గ్రహణ సమయం ఉదయం 11:34 నుండి మధ్యాహ్నం 3:23 వరకు.గ్రహణానంతరం శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి, సాయంత్రం 5:00 గంటలకు తిరిగి తలుపులు తెరుస్తారు.గ్రహణం కారణంగా ఆ రోజున బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (Rs. 300) మరియు ఇతర ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రద్దు చేసింది. ఆలయం మూసి ఉన్న సమయంలో అన్నప్రసాద వితరణ కూడా నిలిపివేయబడుతుంది.ఆలయం తెరిచిన తర్వాత కేవలం సర్వదర్శనం (ధర్మ దర్శనం) భక్తులను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది.గ్రహణం రోజున తిరుమల వెళ్లాలనుకునే వారు ఈ సమయాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది.
Book |శ్రీనివాసునికి బొల్లినేని కృష్ణయ్య శ్రీమాలిక కానుక !
Book | శ్రీనివాసునికి బొల్లినేని కృష్ణయ్య శ్రీమాలిక కానుక ! ప్రముఖ రచయిత
హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు బిజెపి అధ్యక్షుడు నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. తాను అలా మాట్లాడడం తప్పేనని, అనవసరంగా నోరు జారనని సోమవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇటీవల నాగేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ.. టివికె చీఫ్, నటుడు విజయ్కు రాజకీయాలు తెలియవని, త్రిష తో ఉన్న బంధం నుంచి బయటకు రావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుండగా త్రిష కూడా నాగేంద్రన్ పేరు ఎత్తకుండానే పరోక్షంగా స్పందించారు. తన లాయర్ తరపున సోషల్ మీడియాలో సోమవారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి అలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి ఎలా లాగుతారని నిలదీశారు. తన క్లయింట్కు రాజకీయాలతో సంబంధం లేదని, మున్ముందు కూడా ఉండబోదని తెలిపారు. త్రిష పేరును సంబంధం లేని అంశాల్లోకి లాగడం సరైంది కాదన్నారు.
Vision |విజన్ 2047 వైపు దూసుకెళ్తున్న బడ్జెట్…
Vision | విజన్ 2047 వైపు దూసుకెళ్తున్న బడ్జెట్… Vision | విజయవాడ,
SK’s Seyon First Look: Fierce, Yet Divine
Kannada beauty Ashika Ranganath made her debut in Telugu cinema with Nagarjuna’s Naa Saami Ranga and the actress was seen in a traditional role. She bagged an opportunity in Megastar Chiranjeevi’s Vishwambara which is due for release. The actress surprised everyone with her glamour show in Ravi Teja’s recent offering Bhartha Mahasayulaku Wignyapthi. Right from […] The post SK’s Seyon First Look: Fierce, Yet Divine appeared first on Telugu360 .
మెర్క్యురీ ఫిల్లింగ్స్కు ముగింపు: ఇండియన్ హెల్త్ సర్వీస్ నిర్ణయం
2027 నాటికి పూర్తిగా నిలిపివేతగ్లోబల్ ఒప్పందానికి ముందుగానే అమెరికా అడుగు
Poxo |నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
Poxo | నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
feb14thshiva-lingam |గట్టు గూడెం గుట్టపై వెలిసిన శివలింగం
feb14thshiva-lingam | భక్తులకు అడ్డంకులు, బీజేపీ ఆధ్వర్యంలో పూజలు feb14thshiva-lingam | దేవుణ్ణి
చెలరేగిన హెడ్, మార్ష్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?
పల్లెకెలె: టి20 వరల్డ్ కప్ 2026లో భాగంగా శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఆసీస్, శ్రీలంక జట్టుకు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు ఓపెనర్స్. మిచెల్ మార్ష్ (54, 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు), ట్రావిస్ హెడ్ (56, 29 బంతుల్లో 7 ఫోర్లు, 3సిక్సులు) అర్ధ శతకాలతో చెలరేగారు. దీంతో వీరిద్దరూ తొలి వికెట్ కు 104 పరుగులతో శతక భాగస్వామ్యాన్ని అందించారు. అయితే, వీరిద్దరూ ఔటైన తర్వాత ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మధ్యలో మ్యాక్స్ వెల్(22), జోష్ ఇంగ్లిస్(27)లు ఫర్వాలేదనిపించినా.. మిగతా వారు ఘోర విఫలమయ్యారు. దీంతో ఆసీస్ 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది.
procession |బంగారు పల్లకిలో శివపార్వతుల ఊరేగింపు
procession | బంగారు పల్లకిలో శివపార్వతుల ఊరేగింపు శివపార్వతుల ఊరేగింపులో భక్తులుదారి పొడవున
Imprisonment |దుర్మార్గుడు దొరికాడు ఇలా ….
Imprisonment | దుర్మార్గుడు దొరికాడు ఇలా …. ఆదోని రెండవ అదనపు జిల్లా
రాజస్థాన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం
జైపూర్ : రాజస్థాన్ లోని ఖైర్తల్ తిజారా జిల్లా భివాడిలో సోమవారం ఉదయం అక్రమ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించి ఏడుగురు సజీవదహనమయ్యారు. ఖుష్కోరా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఈ ఫ్యాక్టరీని అసలు ఇది దుస్తుల తయారీ కోసమని లీజుకు తీసుకుని అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నారని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సుమిత్రా పరీక్ వెల్లడించారు. ఇంకా ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన ఇద్దరిని బయటకు తీసుకొచ్చి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చేర్చామని, వారి పరిస్థితి ఆందోళనగా ఉందని తెలిపారు. పోలీసులు మామూలుగా పెట్రోల్ నిర్వహిస్తుండగా సమాచారం తెలిసి పోలీసులు వచ్చారని, వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించారని చెప్పారు. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సహాయ కార్యక్రమాలను నిర్వర్తించాలని తక్షణం బాధితులను రక్షించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. ప్రమాద స్థలం అల్వార్కు తక్షణం వెళ్లాల్సిందిగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి సంజయ్ శర్మను సిఎం ఆదేశించారు. తరువాత సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి శర్మ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని, స్పెషల్ క్యాంపైన్ నిర్వహించి బివాడీ పారిశ్రామిక వాడలో అన్నిపరిశ్రమలను తనిఖీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ ఫ్యాక్టరీ అయినా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ ఆర్తిక శుక్లా ,ఇతర సీనియర్ అధికారులు , పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ప్రమాద సమయంలో ఆ ఫ్యాక్టరీలో 20 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారని , అగ్ని ప్రమాదం జరగ్గానే తొమ్మిది మంది తప్ప మిగతా వారు బయటపడ గలిగారని తెలిసింది. గంటన్నర సేపు ప్రయత్నించాక మంటలు అదుపు లోకి వచ్చాయి. కొన్ని అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ పేలుడు తరువాత మంటలు చుట్టుముట్టడం సిసిటివీ ఫుటేజీలో కనిపించింది. ఫ్యాక్టరీ వద్ద గన్పౌడర్, ఫైర్క్రాకర్స్, ప్యాక్ చేసిన పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. శరీర అవశేషాలను పాలిథిన్ బ్యాగుల్లో సేకరించారు. మృతుల్లో కొందరు బీహార్కు చెందిన వారు.ఫోరెన్సిక్ బృందం ఎముకలను, కాలిన ఫైర్ క్రాకర్ల నమూనాలను సేకరించింది. ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోం సహాయ మంత్రి జవహర్ సింగ్ బెధం చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొత్సారా,మాజీ సిఎం అశోక్ గెహ్లాట్ , విపక్ష నాయకుడు తికరామ్ జుల్లీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
ప్రపంచ స్థాయి ఎఐ సదస్సు ప్రారంభం
దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం ప్రపంచ స్థాయి ఎఐ సదస్సుకు కనులపండువైన వేదిక అయింది. సోమవారం ఆరంభం రోజే లోనికి ప్రవేశించడానికి భారీ స్థాయిలో క్యూలైన్లు వెలిశాయి. పలు దేశాలకు చెందిన ప్రముఖ ఐటి కంపెనీల అధినేతలు, ఎఐ రంగ నిపుణులు , విధాన నిర్ణేతలు , ఎఐ సంస్థల వ్యవస్థాపకులు , సాంకేతిక నిపుణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ ముందుకు వచ్చిన ఎఐ గురించి సరైన రీతిలో అవగావహనకు ఎక్కువగా యువతరం ఈ సమ్మిట్ తో కూడిన ఎక్స్పోకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపింది. సదస్సు ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభం అయింది. ఈ సమయానికి చాలా ముందుగానే జనంతో కిటకిటలాడుతూ ఈ ప్రాంగణం సందడిగా మారింది. ఎఐ సదస్సులో సుందర్ పిచయ్ , ఓపెన్ ఎఐకి చెందిన సామ్ అల్ట్మెన్ , ఆంత్రోపిక్ నుంచి డారియో అమోడియి వంటి వారు తమ విశ్లేషణలు వెలువరిస్తారు. అయితే వారి నిర్ణీత సెషన్లు బుధవారం నుంచి ఆరంభం అవుతాయి. అయినప్పటికీ ఇప్పటి నుంచే వీరి ప్రసంగాల పట్ల సర్వత్రా ఉత్సాహం ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రాంగణం వెలుపలనే కాకుండా, ఢిల్లీలో పలు ప్రాంతాలలో ఈ సదస్సుకు వస్తున్న ప్రతినిధులకు, వక్తలకు అతిధులకు ప్రత్యేకించి ప్రారంభోత్సవానికి వచ్చే ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ కటౌట్లు వెలిశాయి. సదస్సు చివరి రెండు రోజులు 19, 20వ తేదీలలో దాదాపు 20 దేశాలకు చెందిన ప్రముఖ నేతలు, కొందరు ప్రభుత్వాధినేతలు హాజరు కానున్నారు. వీరిలో ఫ్రాన్స్ నేత మెక్రాన్, బ్రెజిల్ డాసిల్వా వంటి వారు మాట్లాడుతారు. వీరితో పాటు ప్రధాని మోడీ సెషన్ కూడా ఉంటుంది. ప్రత్యేకించి ఎఐ సంబంధిత వ్యాపార వాణిజ్య కంపెనీల బాస్లు, ఇన్వెస్టర్లు కూడా వారికి కేటాయించిన సమయం ప్రకారం ప్రసంగిస్తారు. అంతర్జాతీయ జాతీయ మీడియా ఈ సదస్సుకు అత్యంత ప్రాధాన్యతను కల్పించింది. ప్రత్యేకించి ప్రపంచాన్ని శాసించే రీతిలో మారేందుకు అవకాశం ఉన్న ఎఐ అవలక్షణాలను బేరీజువేసుకునేందుకు, ఈ వెల్లువను సక్రమ రీతిలో వినియోగించుకునేందుకు ఉద్ధేశించిన సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమ్మిట్లో మొత్తం మీద 3250మంది వక్తలు సందేశాలు ఉంటాయి. 500 కు పైగా సెషన్స్ సాగుతాయి. ఈ సదస్సుకు ముందు బ్రిటన్లో 2023లోనే తొలి ఎఐ సమ్మిట్ జరిగింది. అప్పుడు ఎఐ భద్రత, తీవ్రస్థాయి ముప్పు విషయాలను విశ్లేషించారు. తరువాత ప్రాన్స్లో 2025లో జరిగింది. ఇప్పుడు ఈ వ్యవస్థ వేగవంత మార్పుల క్రమంలో భారతదేశంలో జరిగే సదస్సు మరింత విస్తృతస్థాయి వేదిక అవుతోంది.
Accident |శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సు బోల్తా…
Accident | శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సు బోల్తా… రక్షణ
Electricity |నేలకు ఒరిగిన మద్దిరాల విద్యుత్ ప్రభ
Electricity | నేలకు ఒరిగిన మద్దిరాల విద్యుత్ ప్రభ Electricity | చిలకలూరిపేట,
Games |జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ పోటీలు…
Games | జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ పోటీలు… పోస్టర్ను

28 C