SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

22    C
... ...View News by News Source

ఉదయం లేవగానే ఇవి తింటున్నారా? చైనీస్ వైద్యం ఏం చెబుతోందంటే…అల్లం నీటి రహస్యాలివే!

మనం ఉదయం నిద్రలేవగానే ఏం తింటాం, ఏం తాగుతాం అనేదే ఆ రోజు మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ విషయంలో మన భారతీయ ఆయుర్వేదానికి, ప్రాచీన చైనీస్ వైద్యానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఉదయం వేళ కడుపులో ఉండే ‘అగ్ని’ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అని చైనీస్ వైద్యం చెబుతోంది. ఆ వివరాలేంటో సూటిగా, స్పష్టంగా చూద్దాం. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య సమయం జీర్ణ వ్యవస్థకు (Stomach Meridian) అత్యంత […] The post ఉదయం లేవగానే ఇవి తింటున్నారా? చైనీస్ వైద్యం ఏం చెబుతోందంటే… అల్లం నీటి రహస్యాలివే! appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 5 Dec 2025 8:39 am

రోడ్డు ప్రమాదంలో ప్రేమజంట మృతి

అమరావతి: ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల ప్రేమపై విధి అసూయ చూపించింది. ఆధార్ కార్డులో పేరు సరి చేసుకుందామని వెళ్తుండగా వారిని లారీ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జుత్తుక లీలా ప్రసాద్(21), జుత్తుక సౌమ్య ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ప్రేమపెళ్లి చేసుకున్నారు. రాజమహేంద్రవరంలోని బర్మాకాలనీలో ఇద్దరు ఉంటున్నారు. ఈ జంటకు మూడు నెలల క్రితం ఓ పాప జన్మించింది. లీలా ప్రసాద్ ఎలక్ట్రీక్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆధార్ తప్పులు సరి చేయించుకోవడంతో రాజానగరం వచ్చారు. నరేంద్రపురం రోడ్డు దాటుతుండగా లారీ వారిని ఢీకొట్టడంతో ప్రేమజంట ఘటనా స్థలంలోనే చనిపోయారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

మన తెలంగాణ 5 Dec 2025 8:11 am

Bigg Boss Telugu 9: Strategic Alliances Shape the Ticket to Finale Battles

The race for the Ticket to Finale intensified in today’s episode as strategy, alliances and sharp observations took centre stage. With every task holding the power to eliminate a contender from the race, gameplay shifted from individual performance to group coordination, giving viewers a clearer understanding of the underlying power blocs in the house. Sanjana […] The post Bigg Boss Telugu 9: Strategic Alliances Shape the Ticket to Finale Battles appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 7:54 am

కోనసీమలో స్కూల్ నుంచి బాలిక కిడ్నాప్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ముమ్మిడివరం మండలం ఠాణేలంక‌ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పల్లంకుర్రు బాలికను మోకా గిరి (33) అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. బాలికను మాయమాటలతో మోసగించి తనతో ఆమెను గిరి తీసుకెళ్లాడు. దగ్గరి బంధువైన యువతి ద్వారా బాలికను ట్రాప్ చేసి తీసుకెళ్లినట్టు సమాచారం. స్కూల్ నుంచి తమ కుమార్తెను బయటకు పంపడంతో బాలిక బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గిరికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా సమాచారం.

మన తెలంగాణ 5 Dec 2025 7:44 am

Akhanda2 Legal Battle Explained: The Full Story Behind the Madras High Court Case

The Madras High Court case surrounding Akhanda II is not actually about the film itself. The dispute traces back to a completely different film – the 2011 blockbuster Dookudu – and a long-running financial battle between Eros International Media Ltd. and production house 14 Reels Entertainment Pvt. Ltd. Below is a clear breakdown of the […] The post Akhanda2 Legal Battle Explained: The Full Story Behind the Madras High Court Case appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 7:33 am

బోర్డును పునరుద్ధరించాలి

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి కొవ్వూరు – విశాలాంధ్ర : భవన నిర్మాణ బోర్డును తక్షణమే పునరుద్దించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ నంబూరు శివన్నారాయణ అన్నారు . కొవ్వూరు ప్రైవేటు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని “సభ” నిర్వహించారు. ఈ సభకి రోoగల హరీష్ కుమార్ అధ్యక్షత వహించారు. యూనియన్ ప్రెసిడెంట్ రొంగల హరీష్ మాట్లాడుతూ […] The post బోర్డును పునరుద్ధరించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 7:17 am

రాజ‌మండ్రిలో ప్ర‌సాదిత్య మాల్

ఏపిలో చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి కృషి– సార‌ధి సినిమాస్ ప్రారంభోత్స‌వంలో మంత్రి కందుల దుర్గేష్ విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి : ఆంధ్ర ప్ర‌దేశ్ లో చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి కృషి చేస్తామ‌ని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం రాజ‌మండ్రిలో ప్ర‌సాదిత్య మాల్ లో నూత‌నంగా ఏర్పాటు చేసిన సార‌ధి సినిమాస్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రి కందుల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాజమండ్రి న‌గ‌రంలో ప‌ర్యాట‌కం, సంస్కృతి, వినోద రంగాల్లో మ‌రింత అభివృద్ధి […] The post రాజ‌మండ్రిలో ప్ర‌సాదిత్య మాల్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 6:33 am

అభివృద్ధి పథంలో నిడదవోలు

సమిష్టి కృషితో అభివృద్ధి పథంలో నిడదవోలు మండలం విశాలాంధ్ర – నిడదవోలు : స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో అభివృద్ధి పదంలో నిడదవోలు మండలం పయనిస్తుందని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు తిరుమళ్ల భాగ్యలక్ష్మి దుర్గారావు అన్నారు. నిడదవోలు మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశం ఎంపీపీ తిరుమళ్ల భాగ్యలక్ష్మి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. ముందుగా మండల […] The post అభివృద్ధి పథంలో నిడదవోలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 6:24 am

సమాన పనికి సమాన వేతనం

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి – సిఆర్పిలు డిమాండ్ విశాలాంధ్ర – రాజానగరం : సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని క్లస్టర్ రిపోర్స్ పర్సన్ (సిఆర్పిలు)ఎస్ వి వి రామకృష్ణ ,ఆర్.పూసలరావు అన్నారు. మండల కేంద్రమైన రాజానగరంలోని ఎంఈవో కార్యాలయంలో గత కొన్నేళ్లుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు గా కీలక సేవలందిస్తున్న సిఆర్పిలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.దీనిలో భాగంగా తహశీల్దార్ జి.అనంత లక్ష్మీ సత్యవతి దేవికి , మండల విద్యాశాఖ అధికారులు ఎం.రామన్న […] The post సమాన పనికి సమాన వేతనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 6:19 am

ప్రజలకు మెరుగైన సేవలు

ప్రజలకు మెరుగైన సేవలు * అధికారులకు పరిపాలన సులభతరం– పంచాయతీ రాజ్ వ్యవస్థలో పర్యవేక్షణ బలోపేతానికి కృషి– ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో అట్టహాసంగాడిడివో కార్యాలయం ప్రారంభం– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరివిశాలాంధ్ర – రాజానగరం : ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటుగా అధికారులకు పరిపాలన సులభతరం చేసేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు దోహదపడతాయని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలోని హౌసింగ్ బోర్డు […] The post ప్రజలకు మెరుగైన సేవలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 6:12 am

ఎర్రబస్సు రానిచోట ఎయిర్ బస్

మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లాను వ్యాపార కేంద్రంగా, వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇంది రా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి గడ్డం వివేకానంద, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా శాసనమండలి సభ్యుడు దండే విఠల్, ఆదిలాబాద్, బెల్లంపల్లి, ఖానాపూ ర్ ఎంఎల్‌ఎలు పాయల్ శంకర్, గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ప లు అభివృద్ధి పనులకు ఆయన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో 700 ఎకరాలలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని, ఈ క్రమంలో భూసేకరణకు జీవో జారీ చేశామని తెలిపారు. ఎయిర్ పోర్ట్ కోసం భూమి కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించిందని, సంవత్సరంలోగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ పనులను ప్రారంభించి ఎర్ర బ స్సు రావడమే కష్టంగా ఉన్న ఎయిర్ బస్సులను నడిపిస్తామని తెలిపారు. ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్ట్ ఉంటే ఇక్కడి అభరణ్యంలో ఉన్న పులులను చూడడానికి ఇతర రాష్ట్రాల ప్రజలు వస్తారని అ న్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పేద ప్రజల ఆశీస్సులతో ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను ఆహ్వానించామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతిపక్షాలను సైతం కలుపుకుని ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రజాపాలన చేస్తోందని, కొమురం భీం, రాంజీ గోండు స్ఫూర్తితో ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించడమే కాకుండా అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి, నష్టపరిహారం అందించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాబోవు 2 నెలలలో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలపై అధికారులను, ప్రజాప్రతినిధులను ఒకచోట చేర్చి నివేదికలు స్వీకరించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో తుమ్మిడిహెట్టి నుండి చేవెళ్ల వరకు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 38 వేల 500 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించామని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా కోసం టెండర్లు పిలిచారని, వ్యవసాయ భూములకు గోదావరి నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలోని అపారమైన సున్నపు గనులను వినియోగించుకుని సిమెంటు కర్మాగారాలను నెలకొల్పి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తామని తెలిపారు. ఖమ్మంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరిట ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మంజూరు చేసి పనులు ప్రారంభించామని, ఆదిలాబాద్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుండి ఉద్యోగ భర్తీ చేసేందుకు కృషి చేసి 61 వేల మంది నిరుద్యోగులకు ఎల్.బి. స్టేడియంలో ప్రజల సాక్షిగా నియామక పత్రాలను అందించామని తెలిపారు. పారదర్శకంగా పరీక్షల నిర్వహించి 562 మంది గ్రూప్ 1 అధికారులను నియమించామని, గ్రూప్ 2లో 785 మందికి, పోలీస్, వైద్య శాఖతో పాటు ఇతర శాఖలలో ఉద్యోగాలు కల్పించి తెలంగాణ పునర్నిర్మాణంలో యువతను భాగస్వామ్యులను చేశామని తెలిపారు. రాబోవు రోజులలో మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణ యువత అధికారులుగా, ఉద్యోగులుగా తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి 2 సంవత్సరాల కాలంలో 8 వేల 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ఆడబిడ్డలను వెయ్యి బస్సులకు యజమానులను చేశామని, సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, పెట్రోల్ బంకుల నిర్వహణకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలలోని ఆడబిడ్డలను అన్ని వ్యాపార రంగాలలో ప్రోత్సహించి ఆర్థిక అభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డలకు చీర, సారె పెట్టే తెలంగాణ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను అందించామని తెలిపారు. -2026 మార్చిలో అన్ని మున్సిపాలిటీలలోని మహిళలకు అందిస్తామని తెలిపారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తామని, కుటుంబ మర్యాదను నిలబెట్టే విధంగా ఆడబిడ్డలను ఇంటి యజమానులను చేశామని తెలిపారు. దేశంలోనే వరి పంట మొదటి స్థానంలో రాష్ట్రం నిలబడిందని, రైతుల వద్ద నుండి మద్దతు ధర చెల్లించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని తెలిపారు. చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మంది ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గత పాలకుల తీరును ఎండగట్టారు.

మన తెలంగాణ 5 Dec 2025 6:00 am

అమెరికాకో న్యాయం.. భారత్‌కో న్యాయమా?

న్యూఢిల్లీ: భారత్‌కు రష్యా చమురు సరఫరా సజావుగా, ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సా గుతోందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ వె ల్లడించారు. భారత్ పర్యటన నేపథ్యంలో పుతిన్ ఓ ప్రత్యేక ఇంటర్వూలో పలు కీలక అంశాలు వె ల్లడించారు.భారతీయ చమురు పరిశ్రమను రష్యా అత్యంత విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా భా విస్తుందని తెలిపారు. భారత్‌కు రష్యా చమురుపై అమెరికా వ్యతిరేకత గురించి ప్రస్తావించారు. అ మెరికానే రష్యా ముడిచమురు తీసుకుంటూ ఉం డగా, భారత్ తెప్పించుకుంటే తప్పేముంది? దీని నే హిపోక్రసీ అంటారేమో ఇండియా టుడే ప్రత్యేక ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. భారత్‌ను బెదిరించే తరహాలో ట్రంప్ వ్యవహరిస్తున్నాడని పుతిన్ విమర్శించారు. ప్రధాని మోడీ ఎవరి ఒత్తిళ్లకో లొంగేరకం కాదని , ఆయన పద్ధతి ప్రకారం ఆయన వ్యవహరిస్తూ వెళ్లుతాడని స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల బెదిరింపులతో భారత్‌ను భయపెట్టాలనేది అమెరికా ఆలోచనగా ఉందన్నారు. మాస్కోలోని క్రెమ్లిన్‌లో చారిత్రక ఎకటెరినా కథరైన్ హాల్‌లో ముందుగానే రికార్డు చేసిన ఇంటర్వూ ఇప్పుడు పుతిన్ భారత్ పర్యటన దశలో ప్రసారం అయింది. భారత్‌కు రస్యా చమురు వద్దంటున్న ట్రంప్ వాదనలో పసలేదని పుతిన్ కొట్టిపారేశారు. రష్యా నుంచి ఓ వైపు అమెరికా దండిగానే న్యూక్లియర్ ఫ్యూయల్‌నుతమ దేశ అణు ఇంధన కేంద్రాల కోసం కొనుగోలుచేసుకొంటోంది. మరి భారత్‌ను ఎందుకు వద్దంటోందని ప్రశ్నించారు. రష్యా యురేనియం ఇప్పుడు అమెరికా రియాక్టర్లకు అందుతోందని చెప్పారు. అమెరికాకు ఓ ధర్మం భారత్‌కు మరో న్యాయమా? అని నిలదీశారు. భారత్‌ను వద్దంటున్న ట్రంప్ వ్యవహారంపై పూర్తి స్థాయి పరిశీలన అవసరమే. ఇందుకు తాము అవసరం అయితే ట్రంప్‌తో కూడా చర్చించేందుకు సిద్ధం అని పుతిన్ తేల్చిచెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని నిజంగానే ట్రంప్ కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన శాంతి స్థాపకులు అని అనుకోవచ్చు, అయితే ఈ విషయంలో ఆర్థిక, భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నట్లు ఉన్నాయని అన్నారు. శాంతి స్థాపనకే అలాస్క భేటీ సాగిందని తెలిపారు. భారత్ రష్యా సంబంధాలు ప్రత్యేకమైనవి, విశిష్టమైనవి, ఇతర దేశాలతో సంబంధాలకు ముప్పు కల్గించేవి కావని పుతిన్ తెలిపారు. ఇవి ఇతరులకు వ్యతిరేకం అని అనుకోరాదని స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ ట్రంప్ సొంత అజెండాతో ఉంటారని అయితే ఇతరులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా సంబంధాలు మల్చుకోవడమే తమ అజెండా అని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధ విరమణను ఆకాంక్షిస్తున్నామని చెప్పిన పుతిన్, నాటో అత్యంత ప్రమాదకరం అన్నారు. నాటో పట్ల ఉక్రెయిన్ తటస్థ వైఖరి పాటించడం ఆ దేశానికే మంచిదన్నారు. ఇక అంతర్జాతీయ విషయాల గురించి మాట్లాడుతూ యూరప్ తిరోగమన దశలో ఉంది. భారత్ పురోగమిస్తోంది. జి 7కు ప్రాధాన్యత లేదన్నారు. ఇండియా ముందంజలో ఉండటమే అమెరికా కలవరానికి కారణం అని ఆయన విశ్లేషించారు. బ్రిక్స్ కరెన్సీ ఇప్పట్లో వచ్చే వీలులేదని తెలిపారు. స్వాతంత్య్రానంతరం భారత్ వెలుగు అద్బుతం అని, ఇది ఎవరికి అంతుచిక్కని వాస్తవం అన్నారు.

మన తెలంగాణ 5 Dec 2025 5:30 am

ల్యాండ్ రెవిన్యూ రూ.100కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్/రంగారెడ్డి : ఆదాయానికి మించిన ఆస్తుల కే సులో మరో అవినీతి భారీ తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) చి క్కింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కోతం శ్రీనివాసులు ఇంట్లో ఎసిబి అధికారులు గురు వారం సోదాలు నిర్వహించగా లభించిన సమాచారం మేరకు ఆయన ఆస్తి రూ.100 కోట్లకు పైగా నే ఉంటుందని ఎసిబి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.రాయదుర్గంలోని ఆయన నివాసం, బంధువులు, స్నేహితులు, బినామీలు, సన్నిహతులకు సంబంధించిన 7 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఈ సోదాల్లో లో 33 ఎకరాల వ్యవసాయ భూమి (నారాయణపేటలో 11 ఎకరాలు. ఆనంతపురంలో 11 ఎకరాలు. కర్ణాటకలో 11 ఎకరాలు), 7 ప్లాట్లు, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్, ప్లాట్, మూడు వాహనాలు, ఐదు లక్షల నగదు , 1600 గ్రాముల బంగారం, 770 గ్రాముల వెండితో సహా విలువైన ఆస్తులు కనుగొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో తనిఖీలు చేశారు. శ్రీనివాసులు తన సర్వీసు కాలంలో అవినీతి , అసాధారణ మార్గాల ద్వారా ఆస్తులు కూడబెట్టినట్లు ఎసిబి దర్యాప్తులో వెల్ల డైంది. ఈ శాఖలో ఇంత పెద్ద మొత్తంలో అవినీతి తిమింగలం ఎసిబికి దొరకడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఇంకా ఏమైనా పత్రాలు, నగదు,నగలు బ్యాంకు లాకర్లలో ఉన్నాయా? అనే కోణంలో కూడా ఎసిబి అధికారులు కూపీ లాగుతున్నారు. ఇలాంటి అవినీతి తిమింగలాల గురించి ఏదైనా సమాచారం ఉంటే తమ టోల్-ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ 9440446106, నేరుగా తమ కార్యాల యంలో గానీ సంప్రదించవచ్చని ఎసిబి ఈ సందర్భంగా సూచించింది. 

మన తెలంగాణ 5 Dec 2025 5:00 am

మేం రాగానే ‘హిల్ట్’ రద్దు

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: హిల్ట్ పాలసీ(హెచ్‌ఐఎల్‌టిపి) పేరిట కాంగ్రెస్ ప్రభు త్వం భారీ భూ కుంభకోణానికి తెరలేపిందని.. ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములనూ ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టి రేవంత్‌రెడ్డి అవినీతి అనకొండగా మారారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రా మారావు విమర్శించారు. బిఆర్‌ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ పరిధిలోని పారిశ్రామిక వాడలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిఆర్‌ఎస్‌ఎల్ఫీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సత్యవతి రా థోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్ది, పార్లమెంటరీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా తో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్ది తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌ఐఎల్‌టిపి (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ పాలసీ) పేరుతో 5 లక్షల కోట్ల రూపాయల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోంది. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు, పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారనారు. పరిశ్రమలు వద్దంటూ... అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవేట్ వ్యక్తుల భూములు కావు. ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములు. కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనలతోనే ఆ భూములను ఇవ్వడం జరిగిందనారు. మార్కెట్‌లో గజం ధర లక్షన్నర రూపాయలు పలుకుతుంటే, ప్రభుత్వం కేవలం 4,000 రూపాయలకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తోంది. హైదరాబాద్ నగరంలో పేదలకు ఇండ్లకు, పాఠశాలలకు, ఆసుపత్రులకు, చివరికి శ్మశానాలకు కూడా స్థలం లేదు. కానీ, ప్రైవేట్ వ్యక్తులకు 9,300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తామంటోందని మండి పడ్డారు. ఈ 9,300 ఎకరాల భూములను తిరిగి వెనక్కి తీసుకొని, అక్కడ కాంగ్రెస్ చెబుతున్న ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కూల్స్, ఆసుపత్రులు కట్టాలి. హైదరాబాద్‌లో స్థలం లేదని చెప్పి ఇప్పటిదాకా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ కట్టలేదని ఆరోపించారు. ఇక్కడ ఉన్న కంపెనీలు తరలివెళ్తే, హైదరాబాద్ నగరంలో వాటిపైన ఆధారపడిన లక్షల మంది ఉపాధి పోతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే ఈరోజు పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నామనారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న భూముల ధర నిర్ధారణ, దాని వెనుక ఉన్న అసలు నిజాలు నిగ్గుతేల్చాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఇక్కడితో మా పార్టీ వదిలిపెట్టదు. హెచ్‌ఐఎల్‌టి (హిల్ట్) పాలసీ కుంభకోణం పైన త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాము. నగరంలో కాలనీలలో ప్రజలకు ఈ అంశాన్ని వివరిస్తాము, రౌండ్ టేండ్ సమావేశాలు నిర్వహిస్తాము. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు పోతాము అని కేటీఆర్ అన్నారు. ఈ పాలసీని వెనక్కి తీసుకొని, లక్షల కోట్ల విలువైవ ప్రజల భూమిని కాపాడే దాకా మా పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాము. మా ప్రభుత్వం రాగానే ఈ పాలసీని రద్దు చేస్తాము. అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని తీసుకువస్తాము అన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే, అటు పారిశ్రామిక భూములతో పాటు డబ్బులు కూడా పోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోండని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇంతటి భారీ కుంభకోణాన్ని, దోపిడీని చూసి తట్టుకోలేక... తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న ఓ తెలంగాణ బిడ్డ మాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పైన మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, సమాచారం లీక్ అయింది అంటూ ప్రభుత్వం బాధపడుతోంది. చిత్తశుద్ధి ఉంటే తమ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పైన ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నారు. ఈరోజు మేము పర్యటిస్తున్న జీడిమెట్ల ప్రాంతంలో మార్కెట్ ధర గజానికి కనీసం లక్ష రూపాయలు ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 4,000 రూపాయలకే పూర్తిగా భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతామని చెబుతోందనారు. ఒకవైపు 170 కోట్ల రూపాయలకు ఎకరం చొప్పున భూములు అమ్మిన ప్రభుత్వం అంటూ రోజు వార్తలు రాయించుకుంటున్న సర్కార్, మరోవైపు కేవలం కోటి రూపాయలకు ఎకరం చొప్పున జీడిమెట్లలో భూమిని ఎలా అమ్ముతుంది? ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుంభకోణానికి క్షేత్రస్థాయిలో ఉన్న నిదర్శనం అని అన్నారు. గతంలో తెచ్చిన గ్రిడ్ (GRID) పాలసీ ద్వారా కేవలం ఐటీ కార్యాలయాలు మాత్రమే నిర్మాణం చేసేందుకు అవకాశం ఉండేది. ఐటీ కార్యాలయాల ఏర్పాటు వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయి, పరోక్షంగా అనేకమందికి ఉపాధి లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మా పాలసీ ఆదర్శం అయితే... ఈ పారిశ్రామిక భూములలో ఎలాంటి కాలుష్యం లేని పరిశ్రమలకు మాత్రమే తిరిగి భూములు కేటాయించాలి. ఐటీ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు మాత్రమే అనుమతించాలి. అంతేకానీ అప్పనంగా అపార్ట్‌మెంట్లకు, విల్లాలకు ఇస్తామంటే కుదరదు అన్నారు. హైదరాబాద్ నగరం నుంచి కాలుష్య కారక పరిశ్రమలను బయటకి పంపించాలన్నది అందరి ఉద్దేశం. అందుకే ఎలాంటి పొల్యూషన్ లేని అంతర్జాతీయ స్థాయి ఫార్మాసిటీని ఏర్పాటు చేశాము. దాన్ని కూడా రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నాడని ధ్వజం ఏతారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి తెలిసింది కేవలం రియల్ ఎస్టేట్ దందా మాత్రమే. అందుకే అక్కడ ఫార్మాసిటీలోనూ, ఇక్కడ పారిశ్రామిక భూముల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అన్నారు. అనంతరం జీడిమెట్ల పారిశ్రామిక లోని పలు పరిశ్రమలను సందర్శించి కార్మిక సమస్యలపై కార్మికులతో, పారిశ్రామిక వేత్తలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో బిఆర్‌ఎస్ బృందాల పర్యటన హిల్ట్ పాలసీతో కాంగ్రెస్ రూ.5 లక్షల కోట్ల భూకుంభకోణం చేస్తోందని ఆరోపిస్తూ బిఆర్‌ఎస్ పారిశ్రామిక వాడల్లో బృందాలుగా పోరు బాట చేపట్టింది. ఈ మేరకు పారిశ్రామిక భూముల బదలాయింపు విధానంపై బిఆర్‌ఎస్ నియమించిన నిజనిర్ధారణ బృందాలు గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో కెటిఆర్ నేతృత్వంలోని బృందం, సనత్‌నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం, బహదూర్‌పూర్ చందూలాల్ బరదరి ఇండస్ట్రియల్ ఏరియాలో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్, ఇతర నేతలు పర్యటించి కార్మికులతో మాట్లాడారు. ఆయా ప్రాంతాలో అక్కడి స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకొని హిల్ట్ పాలసీతో జరిగే నష్టాలను, వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించారు. ఒకప్పుడు అక్కడ పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ప్రజలు భూములు ఇచ్చిన తీరును ప్రభుత్వం కేటాయించిన తీరును వాటిని చవకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు కట్టబెట్టిన అంశాన్ని, వాటి ఉద్దేశాలను పార్టీ నేతల బృందాలు ప్రస్తావించారు. 5 లక్షల కోట్ల భూ కుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాడతామని కెటిఆర్ వెల్లడించారు.

మన తెలంగాణ 5 Dec 2025 4:30 am

రాష్ట్రానికి పచ్చలహారం

రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని 33 శాతాని కి పెంచడమే లక్ష్యంగా తెలంగాణలోని ప్ర జా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమా న్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 2024లో 20.02 కోట్ల మొక్కలను నాటాలని లక్షం గా పెట్టుకోగా, 16.75కోట్ల (84%) మొక్కలను నాటా రు. 2025లో 18కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకో గా, 15.64 కోట్ల మొక్కలు నాటారు. 202526లో 10కోట్ల మొక్కలు నాటి 99% లక్ష్యాన్ని చేరుకున్నారు.

మన తెలంగాణ 5 Dec 2025 3:30 am

సంక్షేమానికి ‘గ్యారంటీ’

రెండేళ్లలో అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం గ్యారం టీ ఇచ్చింది. రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి న రోజు నుంచే రైతులు, మహిళలు, నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలబడే గ్యారంటీలను అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రజల సమక్షంలోనే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే కొత్త ఒరవడి అమలు చేశారు. రెండేళ్లలో కోటికి పైగా కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించారు.

మన తెలంగాణ 5 Dec 2025 3:00 am

తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం

ఈరోజు సాయంత్రం సాయి అనే యువకుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అన్యాయం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేస్తుందని దీనిపై పోరాటం చేయాలని తీన్మార్ మల్లన్న నీ కలిసేందుకు వచ్చానని స్థాఫ్ తో చెప్పారు.. మల్లన్న ఆఫీసులో లేరని రేపు ఉదయం రావాలని చెప్పి పంపించారు.. అక్కడి నుండి కిందకి వచ్చిన ఆయన క్యూ న్యూస్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు.. గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్ కు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పి ఆ యువకున్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు..ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమం గా ఉందని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు వెంటనే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిని పరామర్శించనున్నారు

మన తెలంగాణ 5 Dec 2025 12:28 am

శుక్రవారం రాశి ఫలాలు (05-12-2025)

మేషం ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృషభం వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మిధునం నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోదాలుంటాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలసిరావు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. కర్కాటకం ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులు సహాయంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సింహం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. కన్య వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. తుల వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వృశ్చికం వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ఇంటాబయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధనస్సు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు. మకరం వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు. కుంభం ఆర్థిక వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మీనం నూతన పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగమున చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి.

మన తెలంగాణ 5 Dec 2025 12:10 am

రేపు నర్సంపేటకు సిఎం రేవంత్

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రజా పాలన ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగే ఉత్సవాల్లో పాల్గొననున్నారు. సిఎం హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 1 గంటకు నర్సంపేట పట్టణ సమీపంలోని మెడికల్ కళాశాల దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగనున్నారు. అక్కడ నుంచి కిలోమీటరు దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. మొదటగా సుమారు రూ.600 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేసి మరో రూ. 400 కోట్ల ప్రతిపాదిన నిధులను ప్రకటించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మన తెలంగాణ 4 Dec 2025 11:30 pm

రెండేండ్ల పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు

న్యూఢిల్లీ-ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి : రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మకమైన

ప్రభ న్యూస్ 4 Dec 2025 11:22 pm

డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఈషా'

ఇటీవల లిటిల్‌హార్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని డిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్‌రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ “ఈషా దర్శకుడు శ్రీనివాస్ నాకు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు. ఎంతో ఓపిక, ప్రతిభ ఉన్న దర్శకుడు. మంచి సినిమాను థియేటర్ వరకు తీసుకెళ్లాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి ప్లానింగ్ కావాలి. అది ఇప్పుడు వాసు, వంశీ చేస్తున్నారు”అని అన్నారు. బన్నీవాస్ మాట్లాడుతూ “నాకు దెయ్యాలు, ఆత్మలు అంటే నమ్మకం లేదు. కానీ ఈ సినిమా చూసిన తరువాత నేను కూడా థియేటర్‌లో నాలుగు సార్లు భయపడ్డాను. దర్శకుడు నా లాంటి వాళ్లను భయపెట్టాడంటే కంటెంట్‌లో దమ్ము ఉందనిపించింది. చివరి పదిహేను నిమిషాలు సినిమా అందరికీ ఎంతో థ్రిల్‌ను కలిగిస్తుంది. ఇక ఈ సినిమాను హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్లు మాత్రం చూడొద్దు”అని తెలిపారు. ఈ సమావేశంలో వంశీ నందిపాటి పాల్గొన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 11:20 pm

చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 18కి చేరిన మృతులు

 చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, బైరాంగడ్ - నైమేడ్ అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టు మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజి సుందర్ రాజ్, బీజాపూర్ జిల్లా ఎస్‌పి డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ ధ్రువీకరించారు. గురువారం బీజాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మృతి చెందిన 18 మందిలో 16 మృతదేహాలను గుర్తించగా మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందన్నారు. మృతుల్లో పిఎల్‌జిఏ కంపెనీ ఇన్‌ఛార్జి, వెల్లా మొరియం, సిఐపిసి కంపెనీ 3 డివిసిఎం సన్ను అవడం, పిపిసిఎం నందా మీడియం, లాలు అలియాస్ సీతారాం, రాజు, కామేష్, కవాసి లక్ష్మి, తాతి బండి, సఖి లేకం, సోమిడీ కొంచెం, దళ సభ్యుడు చందు, కోసం, శాంతి, సోని, మాద్వి సంగీత, పద్దం నన్ను లుగసను గుర్తించామని వెల్లడించారు. మిగిలిన ఇద్దరి మృతదేహాలను గుర్తించే ప్రయత్నం కొనసాగుతోందన్నారు. ఎన్‌కౌంటర్ ప్రాంతం నుండి ఎఎంజి ఒకటి, నాలుగు ఏకే 47, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్‌లు, నాలుగు ఇన్ సాస్, రెండు 303 రైఫిల్స్, నాలుగు సింగిల్ షాట్ రైఫిల్స్, రెండు బిజిఎల్ లాంచర్స్, ఒక మజిల్ లోడింగ్ రైఫిల్, మావోయిస్టు సామగ్రి, కరపత్రాలను స్వాధీనపరుచుకున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఎస్‌పి జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. 2025 సంవత్సరంలో జిల్లా లో జరిగిన వివిధ ఎదురుకాల్పుల సంఘటనల్లో 161 మావోయిస్టలు మృతి చెందగా 546 మందిని అరెస్ట్ చేశామని, 560 మంది లొంగిపోయారని అన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 10:58 pm

సాఫీగా భారత్ రష్యా చమురు బంధం

 భారత్‌కు రష్యా చమురు సరఫరా సజావుగా , ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సాగుతోందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. భారత్ పర్యటన నేపథ్యంలో పుతిన్ ఓ ప్రత్యేక ఇంటర్వూలో పలు కీలక అంశాలు వెల్లడించారు.భారతీయ చమురు పరిశ్రమను రష్యా అత్యంత విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా భావిస్తుందని తెలిపారు. భారత్‌కు రష్యా చమురుపై అమెరికా వ్యతిరేకత గురించి ప్రస్తావించారు. అమెరికానే రష్యా ముడిచమురు తీసుకుంటూ ఉండగా, భారత్ తెప్పించుకుంటే తప్పేముంది? దీనినే హిపోక్రసీ అంటారేమో అని వ్యాఖ్యానించారు. ఇండియా టుడే ప్రత్యేక ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. భారత్‌ను బెదిరించే తరహాలో ట్రంప్ వ్యవహరిస్తున్నాడని పుతిన్ విమర్శించారు. ప్రధాని మోడీ ఎవరి ఒత్తిళ్లకో లొంగేరకం కాదని , ఆయన పద్ధతి ప్రకారం ఆయన వ్యవహరిస్తూ వెళ్లుతాడని స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల బెదిరింపులతో భారత్‌ను భయపెట్టాలనేది అమెరికా ఆలోచనగా ఉందన్నారు. మాస్కోలోని క్రెమ్లిన్‌లో చారిత్రక ఎకటెరినా కథరైన్ హాల్‌లో ముందుగానే రికార్డు చేసిన ఇంటర్వూ ఇప్పుడు పుతిన్ భారత్ పర్యటన దశలో ప్రసారం అయింది. భారత్‌కు రస్యా చమురు వద్దంటున్న ట్రంప్ వాదనలో పసలేదని పుతిన్ కొట్టిపారేశారు. రష్యా నుంచి ఓ వైపు అమెరికా దండిగానే న్యూక్లియర్ ఫ్యూయల్‌నుతమ దేశ అణు ఇంధన కేంద్రాల కోసం కొనుగోలుచేసుకొంటోంది. మరి భారత్‌ను ఎందుకు వద్దంటోందని ప్రశ్నించారు. రష్యా యురేనియం ఇప్పుడు అమెరికా రియాక్టర్లకు అందుతోందని చెప్పారు. అమెరికాకు ఓ ధర్మం భారత్‌కు మరో న్యాయమా? అని నిలదీశారు. భారత్‌ను వద్దంటున్న ట్రంప్ వ్యవహారంపై పూర్తి స్థాయి పరిశీలన అవసరమే. ఇందుకు తాము అవసరం అయితే ట్రంప్‌తో కూడా చర్చించేందుకు సిద్ధం అని పుతిన్ తేల్చిచెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని నిజంగానే ట్రంప్ కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన శాంతి స్థాపకులు అని అనుకోవచ్చు, అయితే ఈ విషయంలో ఆర్థిక, భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నట్లు ఉన్నాయని అన్నారు. శాంతి స్థాపనకే అలాస్క భేటీ సాగిందని తెలిపారు. భారత్ రష్యా సంబంధాలు ప్రత్యేకమైనవి, విశిష్టమైనవి, ఇతర దేశాలతో సంబంధాలకు ముప్పు కల్గించేవి కావని పుతిన్ తెలిపారు. ఇవి ఇతరులకు వ్యతిరేకం అని అనుకోరాదని స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ ట్రంప్ సొంత అజెండాతో ఉంటారని అయితే ఇతరులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా సంబంధాలు మల్చుకోవడమే తమ అజెండా అని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధ విరమణను ఆకాంక్షిస్తున్నామని చెప్పిన పుతిన్, నాటో అత్యంత ప్రమాదకరం అన్నారు. నాటో పట్ల ఉక్రెయిన్ తటస్థ వైఖరి పాటించడం ఆ దేశానికే మంచిదన్నారు. ఇక అంతర్జాతీయ విషయాల గురించి మాట్లాడుతూ యూరప్ తిరోగమన దశలో ఉంది. భారత్ పురోగమిస్తోంది. జి 7కు ప్రాధాన్యత లేదన్నారు. ఇండియా ముందంజలో ఉండటమే అమెరికా కలవరానికి కారణం అని ఆయన విశ్లేషించారు. బ్రిక్స్ కరెన్సీ ఇప్పట్లో వచ్చే వీలులేదని తెలిపారు. స్వాతంత్య్రానంతరం భారత్ వెలుగు అద్బుతం అని, ఇది ఎవరికి అంతుచిక్కని వాస్తవం అన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 10:52 pm

వివాహం పేరుతో మోసం

 వివాహం చేసుకుంటానని చెప్పి మహిళ వద్ద నుంచి రూ. 3,38,200 సైబర్ నేరస్థులు కొట్టేశారు. హైదరాబాద్, సైదాబాద్, వినయ్ నగర్‌కు చెందిన మహళ(47) యూక్‌కు చెందిన హిరాద్ అహ్మద్ వివాహం ప్రపోజల్ వచ్చింది. మ్యాట్రీమోనిలో రావడంతో మహిళ అంగీకరించింది, ఇద్దరు మొబైల్ నంబర్ మార్చుకుని రోజు మాట్లాడుకునేవారు, వీడియో కాల్స్, ఛాటింగ్ చేసుకునేవారు. తర్వాత బాధితురాలిని రెండు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించాడు, రెండు కొత్త సిమ్‌లు తీసుకోమని ఢిల్లీలోని యూకే నకిలీ అఫైర్స్ ఆఫీస్‌లోకు పంపమని చెప్పాడు. తర్వాత నకిలీ వీసా బాధితురాలికి పంపించి, వివాహానికి సంబంధించిన పేపర్లు పంపించాడు. వాటిని ప్రాసెస్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు. వీసా ఫీజులు, లేట్ ఛార్జీలు తదితరాల పేరు చెప్పి రూ. 3,38,200 వసూలు చేశాడు. తర్వాత కూడా వేరే నంబర్లతో కాల్స్ రావడంతో బాధితురాలు మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 10:48 pm

మంత్రి సీతక్క స్వగ్రామం జగ్గన్నపేటలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్వగ్రామం ములుగు జిల్లా, ములుగు మండలంలోని జగ్గన్నపేటలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వడం ద్వారా ఏకగ్రీవమైందని మంత్రి సీతక్క కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సర్పంచ్ పదవికి కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, గ్రామాభివృద్ధికి ఏకాభిప్రాయం అవసరమని మంత్రి సీతక్క చేసిన సూచనల మేరకు స్థానిక నాయకులు పోటీదారులతో సమాలోచన జరిపారు. ఈ చర్చల ఫలితంగా, కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్న అర్రెo వెంకన్న పేరును ఏకగ్రీవ అభ్యర్థిగా ఖరారు చేశారు. తదనంతరం ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవడంతో అర్రెo వెంకన్న సర్పంచ్‌గా ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు.

మన తెలంగాణ 4 Dec 2025 10:43 pm

395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లాలో 33 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మొత్తం 9,331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తొలిదశలో 4,236 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 37,440 వార్డు స్థానాలకు నవంబర్ 27 నుంచి 29 వరకు తొలి విడత పోలింగ్‌కు నామినేషన్లు స్వీకరించారు. అందులో బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, 4,236 సర్పంచ్ స్థానాలకు 395 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు 13,127 అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 37,440 వార్డు స్థానాలకు 67,893 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. తొలి విడతలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది తమ ఉపసంహరించుకోగా, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 9,626 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. రెండో విడత నామినేషన్ల గడువు ఈనెల 2వ తేదీతో ముగియగా, ఉపసంహరణకు శనివారం(డిసెంబర్ 6) వరకు గడువు ఉంది. ఏకగ్రీవాల కోసం భారీగా ఖర్చు..? రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామపంచాయతీల్లో సర్పంచి పీఠాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకునేందుకు కొందరు బడా వ్యాపారులు భారీగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లోకి వెళితే అనవసరంగా భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసుకోవాల్సి రావడంతో పాటు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తామన్న గ్యారంటీ ఉండదు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకుల మద్దతుతో సర్పంచి పదవికి ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎంఎల్‌ఎ పోరు కంటే పల్లెపోరునే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. గ్రామంలో సర్పంచి పదవి అంటేనే అందరూ ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఆ సర్పంచి పీఠం కోసం అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉంటుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికలకు ముందు నుంచే ఊళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వారి సొంత డబ్బులతో చేస్తుంటారు. మరికొంత మంది సర్పంచి పదవి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కొందరు ఆస్తులను, భార్యల పుస్తెల తాడులను కూడా తాకట్టు పెట్టి సర్పంచి పీఠం కోసం పోటీ చేస్తారు. అయితే కొన్ని గ్రామాలలో మాత్రం కొంతమంది అభ్యర్థులు గ్రామానికి ఇన్ని డబ్బులు ఇస్తాము అని చెప్పి ఏకగ్రీవం చేసుకుంటుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలంపాట, బెదిరింపులకు పాల్పడితే అలాంటి ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ (ఎన్నికల నిర్వహణ) చట్టం -2018లోని 15వ నిబంధన ప్రకారం.. ఒక స్థానంలో పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే, గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి.. ఒక్కరే పోటీలో ఉండడం, ఇతర అభ్యర్థులను భయపెట్టడం లేదా మోసానికి పాల్పడడం వంటివి జరగకుంటేనే ఏకగ్రీవంగా ప్రకటించాలని సూచించారు.

మన తెలంగాణ 4 Dec 2025 10:39 pm

14 Reels Plus: A Golden Opportunity Wasted

Akhanda 2 was a crazy film and several top producers were in the race to produce the film. After months of wait, 14 Reels Plus were finalized to bankroll the film. Akhanda 2 was completed on a grand scale and the buzz was huge. The makers have also closed the business deals for record prices […] The post 14 Reels Plus: A Golden Opportunity Wasted appeared first on Telugu360 .

తెలుగు 360 4 Dec 2025 10:25 pm

Revanth Reddy Promises Airport Works in Adilabad Within a Year

Chief Minister Revanth Reddy announced that Adilabad, a district that once struggled to get even basic transport facilities, will soon see the start of airport construction. He said the government is committed to transforming the region and bringing new industries that can create long-term growth. He promised that airport works would begin within a year […] The post Revanth Reddy Promises Airport Works in Adilabad Within a Year appeared first on Telugu360 .

తెలుగు 360 4 Dec 2025 10:24 pm

రథోత్సవ వేడుకల్లో జనసందోహం..

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో వెలసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి

ప్రభ న్యూస్ 4 Dec 2025 9:46 pm

Choutuppal |వైభవంగా అయ్యప్ప స్వామి 18వ మహా పడిపూజ..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట

ప్రభ న్యూస్ 4 Dec 2025 9:25 pm

Choutuppal |రెండవ రోజు 36 నామినేషన్లు..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని 26 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను

ప్రభ న్యూస్ 4 Dec 2025 9:22 pm

NBK’s Akhanda 2 Premieres TODAY Across USA

Akhanda 2 is more than an action-packed spectacle, it is a tribute to the eternal values of Sanatana Dharma. The film is charging into North America with the BIGGEST-EVER NBK RELEASE, igniting staggering momentum and unprecedented industry-wide uproar. Pre-sales are shattering every benchmark, with bookings moving at rocket speed across all major circuits. The global […] The post NBK’s Akhanda 2 Premieres TODAY Across USA appeared first on Telugu360 .

తెలుగు 360 4 Dec 2025 9:20 pm

చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు కంట్రోల్ తప్పి ముందు వెళ్తున్న కంటైనర్ ను ఢీకొట్టింది. గురువారం రాత్రి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 4 Dec 2025 8:58 pm

పరిశ్రమ భూములను బడా వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర

సనత్ నగర్‌, ఆంధ్రప్రభ : పరిశ్రమలకు కేటాయించిన భూములను ప్రజల అవసరాలకే వినియోగించాలని

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:54 pm

Putin’s India Visit |ఒక భారత్, ఒక రష్యా.. మధ్యలో ట్రంప్..

Putin’s India Visit | ఒక భారత్, ఒక రష్యా.. మధ్యలో ట్రంప్..

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:43 pm

సర్పంచ్ బరిలో తల్లి, కుమార్తె

పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పలుచోట్ల ఎన్నో ఆసక్తికర  సంఘటనలు, విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. వివరాలలోకి వెళితే.. ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండల కేంద్రంలో పెనుబల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన తేజావత్ సామ్రాజ్యం పోటీ చేస్తుండగా, ఆమె కుమార్తె బానోతు పాప బిఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. ఒకే ఊర్లో ఒకే స్థానానాకి తల్లి కుమార్తెలు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయటంతో సర్వత్రా చర్చ కొనసాగుతోంది.

మన తెలంగాణ 4 Dec 2025 8:37 pm

Independent |పోటాపోటీగా నామినేషన్లు దాఖలు

Independent | పోటాపోటీగా నామినేషన్లు దాఖలు Independent | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:34 pm

Rs. 1000 crore |విమర్శలకు బెదిరేది లేదు…

Rs. 1000 crore | విమర్శలకు బెదిరేది లేదు… Rs. 1000 crore

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:28 pm

ఈ నెల 7న ఇందిరా పార్క్ దగ్గర బిజెపి మహాధర్నా

 కాంగ్రెస్ మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా, రెండేళ్లుగా అమలుకాని హామీల సాధనే ధ్యేయంగా బిజెపి నిర్వహిస్తున్న ‘మహాధర్నా’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు పిలుపునిచ్చారు. మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా బిజెపి సమరశంఖం పూరించిందని ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా పేర్కొన్నారు. ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడానికి, ప్రజల పక్షాన నిలబడేందుకు బిజెపి నిర్వహిస్తున్న ‘మహాధర్నా’లో పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. ఈ నెల 7న ఉదయం 9 గంటలకు ఇందిరా పార్క్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో జరుగనున్న ‘మహాధర్నా’లో పాల్గొనేందుకు తరలి రావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 4 Dec 2025 8:25 pm

కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని ఆసుపత్రి లో పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ఎల్‌బి నగర్‌లో ప్రేమ్ చంద్ అనే బాలుడిపై కుక్కల దాడి ఘటనపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ప్రేమ్ చంద్‌కు తగిన వైద్యం, ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి అడ్లూరి అన్నారు. బుధవారం నీలోఫర్ ఆస్పత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న బాలుడిని మంత్రి అడ్లూరి పరామర్శించారు. ప్రేమ చంద్ తల్లి దండ్రులు. తిరుపతి రావు, చంద్రకళ దంపతులకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, బాలుడికి స్పెషల్ స్కూల్ లో అడ్మిషన్ ఇప్పించి చదువును ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ హృదయ విదారక ఘటన తనను ఎంతో కలిచి వేసిందన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల బృందం నిలోఫర్ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న బాలుడి తల్లిదండ్రులను కలసి వివరాలు సేకరించినట్లు మంత్రి చెప్పారు. బాధిత బాలుడి తండ్రి వినతిని పరిగణలోకి తీసుకొని, బాలుడి సంపూర్ణ వైద్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం దగ్గరుండి చేసుకుంటుందన్నారు. బాలుడికి అవసరమైన సహాయక చర్యలన్నీ ప్రభుత్వం నుంచి అందిస్తున్నామన్నారు. మంత్రి అడ్లూరి ఆదేశాల మేరకు సంబంధిత శాఖ అధికారులు ఆ బాలుడికి దివ్యాంగుల గుర్తింపు కార్డు తక్షణమే జారీ చేశారు. అర్హత ప్రకారం దివ్యాంగ పింఛను మంజూరు చేస్తామన్నారు. కోలుకున్న తర్వాత బాలుడికి కావలసిన సంరక్షణకు కావలసిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. వైద్య చికిత్స, పునరావాస సహాయం అందించడం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎప్పుడు , ఎక్కడ, చోటు చేసుకున్న జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారులు ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబాలను సందర్శించి, అవసరమైన సేవలు, సహాయం వెంటనే అందించాలని కూడా మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శైలజ నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ,ఆర్ ఎం ఓ డా ఆనంద్, లాలూ ప్రసాద్, బాబురావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 8:20 pm

parking lot |సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లు ప‌రిశీల‌న‌…

parking lot | సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లు ప‌రిశీల‌న‌… parking lot

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:20 pm

PawanKalyan | 750 మంది కార్యకర్తలతో సమావేశం

PawanKalyan | 750 మంది కార్యకర్తలతో సమావేశం చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో :

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:16 pm

Pawan kalyan |పదవి అలంకారం కాదు…

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పదవి, పరువు, ప్రతిష్టలన్నీ పక్కన పెట్టి ప్రజల

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:16 pm

Akhanda 2 Premieres Cancelled

Akhanda 2 is planned for a record release across the globe with paid premiere shows from this night. But the film has been stuck with financial hurdles of the producers and the premiere shows across India are cancelled. The advance bookings in AP are opened well in advance and the theatres are processing the refunds. […] The post Akhanda 2 Premieres Cancelled appeared first on Telugu360 .

తెలుగు 360 4 Dec 2025 8:09 pm

దేదీప్యమానంగా కనక దుర్గమ్మ కలశ జ్యోతి ఊరేగింపు…

ఆంధ్రప్రభ, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను నియమబద్ధ దీక్షతో పూజించి అమ్మవారి అనుగ్రహం

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:00 pm

అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్

భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 7:54 pm

Government |దివ్యాంగులను ప్రోత్సహించాలి…

Government | దివ్యాంగులను ప్రోత్సహించాలి… Government | భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:54 pm

ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..‘అఖండ 2’ ప్రీమియర్స్‌ రద్దు

నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ షాక్. ‘అఖండ 2’ మూవీ ప్రీమియర్స్‌ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి 8 గంటలకు ఈ మూవీ ప్రీమియర్స్ షోలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా ప్రీమియర్స్ రద్దు చేసినట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా క్యాన్సిల్‌ చేసినట్టు తెలిపింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా, రేపు(డిసెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

మన తెలంగాణ 4 Dec 2025 7:53 pm

Hot Topics |పుతిన్…

Hot Topics | పుతిన్… Hot Topics | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:43 pm

ఢిల్లీ చేరుకున్న పుతిన్‌.. మోడీ ఘన స్వాగతం

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ భారత్‌కు చేరుకున్నారు. గురువారం సమీపంలోని పాలెం ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో దిగిన పుతిన్‌కు ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ఈరోజు రాత్రి విందు కోసం పుతిన్, మోడీ నివాసానికి వెళ్తారు. శుక్రవారం, ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఓ కార్యక్రమానికి కూడా హాజరుకానున్నట్లు సమాచారం. కాగా, పుతిన్ పర్యటన భారత్, రష్యా.. రెండు దేశాలకు కీలకం కానుంది. భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా మోడీ, పుతిన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బహుళ వాణిజ్య, రక్షణ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. రష్యా నుండి సు-57 ఐదవ తరం యుద్ధ విమానాలు, ఎస్-500 క్షిపణి రక్షణ వ్యవస్థ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే, రష్యన్ ముడి చమురుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్, రష్యన్ ముడి చమురు ఎక్కువగా సేకరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి ఉక్రెయిన్‌తో యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్ కు రావడం ఇదే తొలిసారి. 

మన తెలంగాణ 4 Dec 2025 7:37 pm

MGM Hospital |కాజీపేటలో కత్తితో దాడి..

MGM Hospital | కాజీపేటలో కత్తితో దాడి.. MGM Hospital | కాజీపేట,

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:34 pm

కుత్బుల్లాపూర్ కెటిఆర్ పర్యటనలో అపశృతి

 బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పర్యటనలో  అపశృతి చోటుచేసుకుంది. విధి నిర్వహణ లో ఉన్న ఓ వీడియో జర్నలిస్ట్ ఒక్కసారి గా కుప్ప కూలిపోయాడు .హుటా హుటినా ఆస్పత్రి కి తరలించగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో మాజీ మంత్రి కెటిఆర్ హెచ్‌ఐఎల్‌టిపి భూ కేటాయింపి అంశం పై జీడిమెట్ల పారిశ్రామికవాడలో పర్యటించారు. అక్కడ హమాలీ అడ్డా లో కార్మికులతో మాట్లాడిన అనంతరం కెటొఆర్ ప్రభుత్వ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద, మాధవరం కృష్ణ రావు, ఎమ్మెల్సీల శంబిపూర్ రాజు, సునీత రాథోడ్, ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి,తదితరుల తో కలిసి పలు కంపెనీలలో కార్మికులతో మాట్లాడారు. ఈ సమయం లో అక్కడ విధి నిర్వహణలో న్యూస్ కవరేజ్ కోసం వచ్చిన సీనియర్ వీడియో జర్నలిస్ట్,ఆజ్ తక్ దామోదర్ టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అత్యుత్సాహంతో , సెల్ఫీల బెడదలో తొక్కిసలాటలో ఒకసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న తోటి రిపోర్టర్లు, గన్ మెన్లు, జీడిమెట్ల పోలీసుల సహాయంతో ఆటోలో షాపూర్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నోటి నుండి వాంతులు చేసుకున్న దామోదర్ బ్లడ్ ప్రెషర్ పెరిగి ఒత్తిడికి లోనయ్యాడు .పరిస్థితి విషమించడంతో వైద్యులు చికిత్స అందిస్తుండగా దామోదర్ మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు వీడియో జర్నలిస్ట్ కుటుంబానికి సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:25 pm

Awareness conference |ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

Awareness conference | ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు Awareness conference

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:24 pm

బెలూన్ల పంచాయతీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు

ఐరోపాలోని బెలారస్, లిథువేనియా దేశాల మధ్య వాతావరణ బెలూన్ల కారణంగా సమస్యలు వస్తున్నాయి.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 7:23 pm

భారీగా అక్రమాస్తులు.. రంగారెడ్డి జిల్లా ఎడి శ్రీనివాస్‌ అరెస్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా భూ సర్వే అండ్ భూ సంస్కరణల రికార్డు అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఎడి) శ్రీనివాస్‌ అరెస్టు అయ్యాడు. శ్రీనివాస్‌కు సంబంధించి ఎసిబి అధికారులు భారీగా ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో శ్రీనివాసులు పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాస్ నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు.  హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేసిన అధికారులు.. దాదాపుగా 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. అలాగే, మై హోం భూజాలో ఒక ఫ్లాట్‌, నారాయణపేటలో రైస్ మిల్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపూర్‌లో 11 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 4 ప్లాట్లు, నారాయణపేటలో మరో 3 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన ఎసిబి అధికారులు.. సోదాల్లో విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:18 pm

సెంచరీ దిశగా రూపాయి పరుగులు

అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి రోజు రోజుకీ క్షీణించిపోతోంది.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 7:17 pm

Special Team |బిందెలు స్వాధీనపరచుకున్న పోలీసు అధికారులు

Special Team | బిందెలు స్వాధీనపరచుకున్న పోలీసు అధికారులు Special Team |

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:16 pm

గోవిందరాజును గద్దెను కదలించిన పూజారులు

 మేడారంలో గోవిందరాజు గద్దెను పూజారులు గురువారం కదలించారు. మేడారంలో పూజ సామాగ్రిని సిద్దం చేసుకుని సమ్మక్క- సారలమ్మ పూజారులతో కలిసి గోవిందరాజు పాత గద్దె వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ఐదుగురు పూజారులు కలిసి గద్దెను కదలించారు. ఈకార్యక్రమానికి ముందుగా సమ్మక్క- సారలమ్మ గద్దెల వ ద్ద పసుపు, కుంకుమ, సారా అరగించి పూజలు చేశారు. నూతనంగా పునర్నిర్మిస్తున్న గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పనులు పూర్తయి తర్వాత గద్దెలపై ఎఎధ్వజ స్తంబాలను ప్రతిష్టించనున్నారు. ఈనెల 24న గోవిందరాజు, పగిడిద్దరాజు నూతనంగా నిర్మిస్తున్న గద్దెలపై ధ్వజ స్థంబాలను ప్రతిష్టించనున్నట్లు పూజారులు తెలిపారు. ఈకార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు. పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక సారయ్య, కొక్కెర రమేష్, చందా రఘుపతి, పగిడిద్దరాజు పూజారి దబ్బకట్ల గోవర్థన్, పూజారులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:15 pm

sections |రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు

sections | రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు sections | జన్నారం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:11 pm

కెటిఆర్ మాట్లాడే చిట్టిలను కాపీ కొడుతున్నా కిషన్ రెడ్డి: సామ రాంమ్మోహన్ రెడ్డి

తెలంగాణలో కిషన్ రెడ్డి కిరికిరి రెడ్డిగా మారారని, రాష్ట్ర అభివృద్ధికి పదే పదే అడ్డుపడుతున్నారని, కెటిఆర్ మాట్లాడే చిట్టిలను చూసి కిషన్ రెడ్డి కాపీ కొడుతున్నారని కాంగ్రెస్ నేత సామ రాంమ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బిజెపి నేతలపై కాంగ్రెస్ నేత సామ రాంమ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డి ఒక బ్రోకర్ అని ఆయన మండిపడ్డారు. ఒకటే స్క్రిప్ట్‌ను కెటిఆర్, కిషన్ రెడ్డిలు జీరాక్స్ చేసి చదువుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో గాలిని కొనుక్కొని బ్రతికే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో ఆ పరిస్థితి రాకూడదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. హైదరాబాద్‌ను కూడా ఢిల్లీగా మార్చాలని కిషన్‌రెడ్డి, కెటిఆర్ కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహేశ్వర్ రెడ్డికి చిట్టీలు అందించేది ఎవరో తెలియదా అని ఆయన ప్రశ్నించారు. హిల్ట్ పాలసీ కింద ఉన్నవి ప్రైవేట్ భూములు అని ప్రైవేట్ ఓనర్ల నిరుపయోగమైన భూములపై వలంటరీగా వెసులుబాటు ఇస్తే కెటిఆర్‌కు ఇబ్బంది ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. హిల్ట్ పాలసీలో ప్రభుత్వ భూమి లేదని, దేవాలయాలపై జీఎస్టీ వేస్తే బిజెపి నాయకులు మౌనంగా ఉంటారా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ దేవాలయాలపై వేసిన జీఎస్టీ తగ్గించే దాకా పోరాడడానికి కిషన్ రెడ్డి వస్తాడా? అని అన్నారు. బిజెపి నాయకులకు నరేంద్ర మోడీ ఒక్కడే దేవుడని, నిజమైన హిందువులకు ముక్కోటి దేవుళ్లు ఉన్నారని, సిఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నారని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:05 pm

Cyber ​​crimes |సైబర్ నేరాలపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు…

Cyber ​​crimes | సైబర్ నేరాలపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు… Cyber ​​crimes

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:05 pm

నవోదయ అడ్మిషన్లకు ట్రయల్ రన్…

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:00 pm

Temple |ఘనంగా అంజన్న బ్రహ్మోత్సవాలు…

Temple | ఘనంగా అంజన్న బ్రహ్మోత్సవాలు… Temple | ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:55 pm

Elections |మద్దిమడుగు ఆంజనేయ స్వామి ద‌ర్శ‌నం…

Elections | మద్దిమడుగు ఆంజనేయ స్వామి ద‌ర్శ‌నం… Elections | అచ్చంపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:49 pm

Tea Poll App |పోస్టల్ బ్యాలెట్ పనుల పరిశీల‌న‌…

Tea Poll App | పోస్టల్ బ్యాలెట్ పనుల పరిశీల‌న‌… Tea Poll

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:43 pm

Akhand 2: అఖండ మూవీ నిర్మాత కీలక నిర్ణయం..బాలయ్యఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

అఖండ 2 మూవీ నిర్మాత సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 6:43 pm

తెలంగాణ రైజింగ్‌-గ్లోబల్‌ సమ్మిట్‌.. సామాన్యులకు ఉచిత ప్రవేశం

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. దేశ, విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఈ సదస్సుకు ఆహ్వానిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, గ్లోబల్‌ సమ్మిట్‌కు సామాన్య ప్రజలకు కూడా ప్రవేశం కల్పించాలని ప్రభుత్వ నిర్ణయించింది. డిసెంబర్‌ 10 నుంచి 13 వరకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పించనుంది. భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి సెషన్లు, ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్‌, సాంస్కృతిక కార్యక్రమాల వీక్షించేందుకు ఏర్పాటు చేయనుంది. ఈ సమ్మిట్ కు వెళ్లేందుకు ప్రతిరోజూ హైదరాబాద్ నగరంలోని ఎంజిబిఎస్‌, జెబిఎస్, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఎల్‌బినగర్‌ నుండి ప్రత్యేక ఉచిత బస్సులను నడపనుంది.

మన తెలంగాణ 4 Dec 2025 6:39 pm

శ్రీతేజ ఆరోగ్యంపై స్పందించిన దిల్ రాజు

శ్రీ తేజ వ్యవహారంపై తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు

తెలుగు పోస్ట్ 4 Dec 2025 6:35 pm

ధూమ్‌ధామ్‌గా రాష్ట్ర యువజనోత్సవాలు..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో: యువతలో నిక్షిప్తమైన ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీయడమే యువజన మహోత్సవం

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:31 pm

Smart City |స్మార్ట్‌ నిధులు ఏమయ్యాయి…?

Smart City | స్మార్ట్‌ నిధులు ఏమయ్యాయి…? Smart City | కరీమాబాద్,

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:25 pm

అబద్ధాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ : జగన్

అబ‌ద్ధాల‌కు అంబాసిడ‌ర్ ఎమ్మెల్యే వైఎస్ జ‌గ‌న్ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 6:22 pm

Nandigama MLA |ప‌టిష్ట వ్య‌వ‌స్థ‌ల‌తోనే అభివృద్ధి ప‌రుగులు..

Nandigama MLA | ప‌టిష్ట వ్య‌వ‌స్థ‌ల‌తోనే అభివృద్ధి ప‌రుగులు.. Nandigama MLA |

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:22 pm

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి తీరుతాం..

ఆదిలాబాద్‌: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం సిఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.18.7 కోట్ల అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన-విజయోత్సవ బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. రెండేళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నా. రెండేళ్ల క్రితం ఓటును ఆయుధంగా మార్చి నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపారు. ప్రజలు తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంటోంది. సంక్షేమం-అభివృద్ధి రెండుకళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్‌ కంపెనీని మళ్లీ ప్రారంభిస్తాం. ఏడాదిలో ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌ పనులు ప్రారంభిస్తాం. ఎర్ర బస్సు రావడం కష్టమనుకున్న ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్‌ తీసుకొస్తున్నాం. అత్యంత వెనకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 6:20 pm

Facilitation Center |స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్

Facilitation Center | స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్ Facilitation Center

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:16 pm

30 Police Act |శాంతియుతంగా ఎన్నికలు

30 Police Act | శాంతియుతంగా ఎన్నికలు 30 Police Act |

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:12 pm

Chittoor |ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం

చిత్తూరు బ్యూరో, ఆంధ్ర‌ప్రభ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:10 pm

TP |మోసపూరిత ప్లాన్లు ఎందుకిచ్చారు?

TP |మోసపూరిత ప్లాన్లు ఎందుకిచ్చారు? TP | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:07 pm

KCR : కేసీఆర్ పాలిటిక్స్ ను ఇక వదిలేసినట్లేనా? కీలక నేతలు ఏమంటున్నారంటే?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది

తెలుగు పోస్ట్ 4 Dec 2025 6:06 pm

Temple |శివభక్త మార్కండేయ దేవాలయంలో…

Temple | శివభక్త మార్కండేయ దేవాలయంలో… Temple | కరీమాబాద్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:00 pm

Year 2000 |దత్తాత్రేయ జయంతి వేడుకలు ..

Year 2000 | దత్తాత్రేయ జయంతి వేడుకలు .. Year 2000 |

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:55 pm

Elections |రాయికల్ ను అభివృద్ధి చేస్తా

Elections | రాయికల్ ను అభివృద్ధి చేస్తా సర్పంచి అభ్యర్థి జ్యోతి శ్రీనివాస్

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:50 pm

ప్రశాంతంగా ఉన్న‌ గ్రామాల్లో ఫ్యాక్ష‌న్ మంట ర‌గ‌ల్చొద్దు….

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుకుంటుంది.

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:49 pm

Telangana : అఖండ 2 మూవీ నిర్మాతకు షాకిచ్చిన తెలంగాణ సర్కార్

తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 మూవీ సినిమా విడుదల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 5:28 pm

Heavy Rain |ఉప్పొంగుతున్న ముదిగేడు వాగు

Heavy Rain | ఉప్పొంగుతున్న ముదిగేడు వాగు Heavy Rain | పొదలకూరు,

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:25 pm

Toll Plaza : టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు.. రయ్.. రయ్ మంటూ

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 5:18 pm

Krishna Tarang |తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం..

Krishna Tarang | తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. Krishna Tarang | మచిలీపట్నం,

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:17 pm