SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

22    C
... ...View News by News Source

Chandrababu |మనమే టాప్

Chandrababu | మనమే టాప్ ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : దేశంలో ఏ

ప్రభ న్యూస్ 1 Dec 2025 9:22 pm

అర్జీదారులు సంతృప్తి చెందాలి

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : అర్జీదారులు సంతృప్తి పొందేలా ప్రజా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో

ప్రభ న్యూస్ 1 Dec 2025 9:05 pm

అన్ని పూజలు నూతన మండపంలోనే..

ఆంధ్రప్రభ, విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి

ప్రభ న్యూస్ 1 Dec 2025 9:02 pm

Eluru |కిడ్నీ బాధితురాలి ఇంటికి ..

Eluru | కిడ్నీ బాధితురాలి ఇంటికి .. ఏలూరు/ఉంగుటూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:57 pm

ఘనంగా విశాఖ ప్రగతి బంధు…

ఆంధ్రప్రభ, ఆరిలోవ విశాఖపట్నం : విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ విశాఖపట్నం

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:44 pm

విజయవాడలో మెగా పాస్‌పోర్ట్ మేళా

ఆంధ్రప్రభ, విజయవాడ : త్వరలో నిర్వహిస్తున్న మెగా పాస్‌పోర్ట్ మేళను సద్వినియోగం చేసుకోవాలని

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:42 pm

కనీస వేతనాలు చెల్లించని సంస్థలపై చర్యలు..

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రైవేట్ వ్యాపార సంస్థలు

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:36 pm

తీర్మానం ఉంది అందుకే చెల్లించాం..

శావల్యాపురం, ఆంధ్రప్రభ : పొట్లూరు గ్రామంలో అభివృద్ధి పనులకు పంచాయతీ తీర్మానం ప్రకారమే

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:34 pm

ఎయిడ్స్ ప‌ట్ల అప్రమత్తత అవసరం..

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : హెచ్ఐవి, ఎయిడ్స్ ప‌ట్ల విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:32 pm

మైల‌వ‌రంలో 2న పీజీఆర్ఎస్…

ఆంధ్రప్రభ, విజయవాడ : ఈ నెల 2వ తేదీ మంగ‌ళ‌వారం మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గస్థాయి

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:28 pm

కౌలు రైతు వీరన్నది ఆత్మహత్య కాదు..ప్రభుత్వం చేసిన హత్యే: హరీష్ రావు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. పురుగుల మందు తాగుతూ పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనమని అన్నారు. వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం, మీకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుందని అన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 1 Dec 2025 8:28 pm

Photos : Anand Deverakonda’s Epic Movie First Look launch

The post Photos : Anand Deverakonda’s Epic Movie First Look launch appeared first on Telugu360 .

తెలుగు 360 1 Dec 2025 8:27 pm

అలసత్వం సహించం..

ఆంధ్రప్రభ, విజయవాడ (కార్పొరేషన్) : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:25 pm

ఆ 5 ఊళ్లు ఆగ్రహం…

కర్నూలు, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఆదోని ప్రాంతంలో మండల విభజనపై రాజకీయ–పాలనాత్మక

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:22 pm

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నిరంజన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరులో తట్ట మన్ను తీయలే, చూసుకోని ముర్వ చెప్పుకుని ఏడ్వ అన్నట్లుంది పాలమూరు పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చేసింది ఏం లేదని అన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. శంకుస్థాపనలు తప్ప రెండేళ్లలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలకు ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించయారు. పదేళ్లలో కేసీఆర్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3.48 లక్షల కోట్లు తద్వారా చేసిన అభివృద్ధి, గణాంకాలు కండ్ల ముందు ఉన్నాయని చెప్పారు. కేవలం రెండేళ్లలో కార్పోరేషన్ రుణాలు కాకుండానే రూ.2.50 లక్షల కోట్లు అప్పుచేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంజన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారు, అభివృద్ధి పనులు పక్కనపెట్టారని, రైతులను గాలికి వదిలి పంటలను వాటి కర్మానికి వదిలేశారని మండిపడ్డారు. బోనస్ అని బోగస్ మాటలు చెప్పి బ్రోకర్ల అవతారం ఎత్తారని అన్నారు. తెలంగాణ రైజింగ్ అంటూ అప్పులు తెస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ రెవెన్యూ 25 శాతం వరకు పెరిగిందని, అయితే కాంగ్రెస్ పాలన పుణ్యాన ఈ ఏడాది - 0.76 శాతానికి పడిపోయిందని విమర్శించారు. అడ్డగోలు అప్పులు చేసి అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తూ రైజింగ్ అంటూ పొంకనాలు కొట్టడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.

మన తెలంగాణ 1 Dec 2025 8:21 pm

ఎన్నికల సంఘం సిఎంపై కేసు నమోదు చేయాలి: హరీశ్

హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఎం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుంటే ఎస్ఇసి ఏం చేస్తుందని ప్రశ్నించారు. శుంకుస్థాపన చేసే ప్రాజెక్టులు, రోడ్లు గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడవా? అని నిలదీశారు. ఎన్నికల సంఘం వెంటనే సమీక్షించి సిఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక విద్యుత్‌ శాఖ గురించి మాట్లాడుతూ.. ‘‘విద్యుత్‌శాఖను మొత్తం ఎపి అధికారులతో నింపుతున్నారు. కీలకమైన బాధ్యతల్లో ఆంధ్ర అధికారులను నియమిస్తున్నారు. ప్రభుత్వాన్ని తెలంగాణ వారు నడుపుతున్నారా? వెనకుండి ఎపి వాళ్లు నడుపుతున్నారా? ఎపి అధికారులు, అవినీతితో రాష్ట్ర విద్యుత్ రంగం అస్తవ్యస్థమవుతోంది. తక్కువ ధరకే ఎన్టిపిసి విద్యుత్ ఇస్తుంటే.. కొత్త ప్లాంట్లు ఎందుకు? కమీషన్ల కోసమే కొత్త పవర్‌ప్లాంట్లు చేపడుతున్నారు. ఈ విషయంలో చర్చ పెడితే ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. కొత్తగా చేపట్టే మూడు ప్లాంట్లకు రూ.45 వేల కోట్లు అవుతుంది. పైసా ఖర్ఛు లేకుండా ఎన్టిపిసి విద్యుత్‌ ఇస్తుంటే.. ఇన్ని వేల కోట్లు ఎందుకు?’’ అని హరీశ్ రావు ప్రశ్నించారు.

మన తెలంగాణ 1 Dec 2025 8:19 pm

సుజనా ఫౌండేషన్ కు కలెక్టర్ అభినందన

ఆంధ్రప్రభ భవానీపురం : విజయవాడ పశ్చిమ లోని జి.ఎన్.ఆర్.ఎంసి ప్రభుత్వ పాఠశాలలోనీ విద్యార్థులకు

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:18 pm

Bellampalli |‘ట్రాఫిక్’పోలీస్ స్టేషన్ ఏర్పాటయ్యేనా?

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణం నేడు మంచిర్యాల జిల్లాలో వేగంగా అభివృద్ధి

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:13 pm

నకిలీ ఎసిబి ముఠా పట్టివేత

ఎసిబి డిఎస్‌పి అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్న ఘరానా నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా కలిసి సోమవారం అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో నకిలీ ఎసిబి ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి పుట్టపర్తి జిల్లా, వేలమద్ధి గ్రామానికి చెందిన రాచంపల్లి శ్రీనివాస్, అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు తో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముఠా సభ్యులు హరి జిల్లాకు చెందిన నవీన్ జేఆర్, బెంగళూరుకు చెందిన మంగళ రవీందర్, మురళి, ప్రసన్నలను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు సూర్యప్రకాశ్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ శాఖలలో ఉన్నతాధికారులతో పాటు పదవీవిరమణకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని వారికి ఏసిబి డి.ఎస్పీనంటూ ఫోన్ చేసి..‘మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి, కేసు నమోదు చేయడం జరిగింది, ఈ కేసు నుండి బయటపడాలంటే డబ్బులు ఇవాల్సి ఉంటుంది’ అని బెదింపులకు పాల్పడి సులభంగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు వరంగల్ జిల్లా రోడ్డు రవాణా శాఖలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి ఎసిబి డిఎస్పీ నంటూ బెదిరించి సుమారు 9 లక్షల 96 వేల రూపాయలను వివిధ మార్గాల్లో దోచుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్, అతనికి సహకరించిన మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడున శ్రీనివాసులును పోలీసులు విచారించగా, నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో 2002 సంవత్సరంలో మొదట ద్విచక్ర వాహనం చోరీతో దొంగతనాలకు శ్రీకారం చూట్టాడు. మరికొద్ది రోజులకు నిందితుడు నకిలీ పోలీస్ అధికారిగా అవతారమెత్తి రాయలసీమ ప్రాంతములో జరిగిన పలు దొంగతనాల్లో అరెస్టు అయిన నిందితుల కుటుంబ సభ్యులను టార్గెట్‌గా చేసుకొని వారి వద్ద దొంగ సొత్తు దాచి ఉంచారని బెదిరించి వారి నుండి బంగారం, డబ్బు దోపిడీకి పాల్పడ్డాడు. ఇతను సుమారు 50 కేసుల్లో నిందితుడుని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలులో నిందితుడు తన వ్యవహార శైలిని మార్చుకోకుండా జైలు నుండి విడుదలైన అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు, రాయలసీమ ప్రాంతాల్లో 41కి పైగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడటంతో పోలీసులు మరోమారు నిందితుడి అరెస్టు చేసి జైలుకు తరలించారు . నిందితుడు జైలు నుండి విడుదలైన అనంతరం మళ్ళీ సులభంగా డబ్బును సంపాదించాలనే లక్ష్యంగా నకిలీ ఎసిబి డిఎస్పీగా అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగులను ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు ఇతనిపై మొత్తం 19 కేసులు నమోదై ఉన్నాయి. సుమారు రూ.50 లక్షలు పైగా దోపిడీకి పాల్పడగా, ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 9 నేరాలు, ఆంధ్ర రాష్ట్రంలో 10 నేరాలకు పాల్పడ్డాడు. ఇందులో 8 కేసుల్లో అరెస్ట్ కాగా, మిగిలిన 11 కేసుల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో మిల్స్ కాలనీతో పాటు 2021 సంవత్సరంలో స్టేషన్ ఘన్పూర్, కరీంనగర్, హైదరాబాద్, రాచకొండ, రామగుండం, వికారాబాద్, జగిత్యాల, వనపర్తితో పాటు ఆంధ్రలోని కర్నూల్ జిల్లాలో జరిగిన నేరాలలో అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. బెదిరింపులకు పాల్పడుతూ దోచేసిన డబ్బును నిందితుడు ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసి విచారణలో వున్న మిగతా నిందితులతో పాటు, ప్రస్తుతం పరారీలో వున్న నిందితులతో కలసి ఆన్లైన్ బెట్టింగ్, గోవాలో కాసినోలలో జూదం ఆడటంతో పాటు గోవా, బెంగుళూరు ప్రాంతాల్లో వ్యభిచార గృహాల్లో ఖర్చు చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా, ఘరానా మోసగాడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి డి.కవిత, వరంగల్ ఎసిపి ఎన్. శుభం ప్రకాష్, టాస్క్‌ఫోర్స్ ఎసిపి ఏ. మధుసూదన్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు ఎల్. పవన్ కుమార్, కె. శ్రీధర్, ఎల్. మంగిలాల్, మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ బి. రమేష్, ఎస్.ఐ లు ఎస్. మహేష్, ఎం. సురేష్‌లను, టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పి.ఎస్. సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేశారు.

మన తెలంగాణ 1 Dec 2025 8:12 pm

కెసిఆర్ దీక్ష ఓ నాటకం: మహేశ్‌కుమార్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో నాడు కెసిఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జిల్లా నూతన అధ్యక్షుడుగా ఎంపికైన నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడుగా ఎంపికైన బొబ్బిలి రామకృష్ణ సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నగరంలోని ఓ కళ్యాణ మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనే పిసిసి చీఫ్ మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పార్టీ జిల్లా, నగర అధ్యక్షులకు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి వరకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల సమస్యలు తీర్చడంలో పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కలిసికట్టుగా ఉండి విజయమే లక్ష్యంగా అడుగు వేయాలని సూచించారు. గత 10 సంవత్సరాల కష్టకాలంలో జిల్లా పార్టీకి అండగా ఉంటూ అధికారమే లక్ష్యంగా పెట్టుకొని సేవలందించిన మనాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణును అభినందించారు. బిఆర్‌ఎస్ ఉనికిని చాటుకునేందుకు కోట్లాది రూపాయల ఖర్చుతో దీక్షా దివస్ పేరుతో ఆ నాటకాన్ని రక్తి కట్టించేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. ఆ రోజున కెసిఆర్ చేసిన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, సోనియాగాంధీ వల్ల రాష్ట్రం వచ్చిందని అన్నారు. ఆనాడు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే కెసిఆర్ ముఖ్యమంత్రిగా, కెటిఆర్, హరీశ్‌రావు, కవితకు పదవులు వచ్చేవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయని జోస్యం చెప్పారు. దీక్షా దివస్ చేసిన మాజీ ఎమ్మెల్యే జిల్లాలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్లపై ఎంతో శ్రమించి తీసుకువస్తే బిజెపి నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. అందువల్లనే వారికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉండదని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ పాటికే పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి ప్రజలు ఆకర్షితులై పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పేర్కొన్న హామీలు, ఆరు గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. జిల్లాకు 35 ఏళ్ల కల అయిన ఇంజనీరింగ్ కళాశాల తీసుకువచ్చామని తెలిపారు. తన స్వగ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 11 ఎకరాలు దానం చేసినట్లు తెలిపారు.

మన తెలంగాణ 1 Dec 2025 8:07 pm

అయ్యప్పస్వాముల గిరిప్రదక్షిణతో మార్మోగిన యాదాద్రి

అయ్యప్పస్వాముల గిరిప్రదక్షిణతో యాదాద్రి కొండలు మార్మోగాయి. భక్తుల ఇలవేల్పు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ గిరిప్రదక్షిణను అయ్యప్ప స్వాములు శరణు.. శరణు..నారసింహ..స్వామియే శరణమయ్యప్పా అంటూ నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో కొండ కింద గల పాదాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామిని ఊరేగిస్తూ గిరిప్రదక్షిణ నిర్వహించారు. అయ్యప్ప స్వాముల శరణుఘోషతో యాదాద్రి పరిసర ప్రాంతాలు నారసింహుడి నామస్మరణతో మార్మోగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు గిరిప్రదక్షిణలో పాల్గొని సందడి చేశారు. గిరిప్రదక్షిణ అనంతరం అయ్యప్ప స్వాములందరూ కాలినడకన కొండపైకి చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములకు నేరుగా గర్భాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు కల్పించారు. అయ్యప్ప స్వాములకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు. గిరిప్రదక్షిణలో పాల్గొనడం సంతోషంగా ఉంది ః ఎమ్మెల్యే అయ్యప్ప స్వాములతో కలిసి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి గిరిప్రదక్షిణలో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. సోమవారం తెల్లవారుజామున అయ్యప్పస్వాములతో కలిసి ఆయన గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. అయ్యప్పలతో కలిసి కొండపైకి కాలినడకన వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండోసారి కూడా అయ్యప్ప స్వాముల గిరిప్రదక్షిణ నిర్వహించడం సంతోషంగా ఉందని, శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గిరిప్రదక్షిణలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈవో వెంకట్రావు, బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గురుస్వామి, బాసర పీఠాధిపతి, గో పాదయాత్ర నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి, అనిల్ గురుస్వామి, పెండెం శ్రీనివాస్‌తో పాటు అయ్యప్పస్వాములు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక చర్యలు.. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయ్యప్ప స్వాముల కోసం ట్రాఫిక్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయ్యప్ప స్వాములు ఏ రూట్లో వచ్చే వారి కోసం ఆ రూట్లోనే పార్కింగ్ సౌకర్యం కల్పించిట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూశారు. అటు స్థానికులకు, ఇటు అయ్యప్ప స్వాములకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

మన తెలంగాణ 1 Dec 2025 8:04 pm

కరిచే వాళ్లు లోపల ప్రభుత్వాన్ని నడుపుతున్నారు: రేణుకా చౌదరి

 పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కను కూడా వెంటబెట్టుకుని రావడంతో చర్చనీయాంశం కావడంతో పాటు విమర్శలకు దారి తీసింది. ఆమె కారులో కుక్క ఉన్నట్లు గుర్తించిన భద్రతా సిబ్బంది గేటు వద్దే నిలిపివేశారు. అక్కడి నుంచి కుక్కను తిరిగి ఆమె ఇంటికి పంపించారు. దీనిపై రేణుకా చౌదరి ఆగ్రహానికి గురయ్యారు. కుక్కను అనుమతించడానికి ప్రోటోకాల్ ఏంటని ప్రశ్నించారు. పెంపుడు జంతువు ప్రాణాన్ని రక్షించడాన్ని కూడా అభ్యంతరపెడతారా అని ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యులు పెంపుడు శునకాన్ని తీసుకురావద్దనడానికి ఏదైనా చట్టం ఉందా అని నిలదీశారు. తన కుక్క ఎవరినీ కరవదని, కరిచే వాళ్లు లోపల ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వ్యంగంగా వ్యాఖ్యానించారు. రేణుకా చౌదరి వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. ఆమె వైఖరి పార్లమెంట్‌ను అవమానించడమేనని దుయ్యబట్టింది. కాంగ్రెస్ ఎంపి తన తోటి సభ్యులను కుక్కతో పోల్చదల్చుకున్నారా అని బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. గతంలో ఆమె జవాన్లను కూడా అవమానించారని, ఆపరేషన్ సింధూర్‌ను ఆపరేషన్ మహదేవ్‌గా అభివర్ణించారని గుర్తు చేశారు. ఇదిలావుండగా రేణుకా చౌదరి కుక్కను వెంట బెట్టుకుని రావడంపై పార్లమెంట్ వర్గాలు సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు సమాచారం.

మన తెలంగాణ 1 Dec 2025 8:00 pm

తిరుపతిలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు

తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు హోటళ్లను లక్ష్యంగా చేసు కుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపారు. దీంతో హోటళ్ల యాజమాన్యాలు తీవ్ర ఆందోళనకు గురై వెంటనే పోలీ సులకు సమాచారం అందించాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలో ఉన్న రెండు హోటళ్లకు బాంబు పెట్టినట్లు బెదిరిం పు మెయిల్స్ అందాయి. ఈ సమాచారం అందుకున్న హోటళ్ల నిర్వాహకులు అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆయా హోటళ్లకు చేరుకున్నారు. అక్కడ తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. అయితే, అక్కడ ఎలాంటి బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజుల క్రితమే తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం, టిటిడి కార్యాలయం, రైల్వే స్టేషన్‌కు కూడా ఇలాగే ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం గమనా ర్హం. అప్పుడు కూడా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిచారు. ప్రస్తుతం మళ్లీ హోటళ్లను లక్ష్యంగా చేసుకోవడంతో ఇది ఆకతాయిల పనే అని పోలీసులు అనుమానిస్తు న్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోం ది. 

మన తెలంగాణ 1 Dec 2025 7:49 pm

ప్రియురాలితో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌

గ్రామానికి సర్పంచ్‌ అవ్వాలని అనుకున్నాడు ఆ యువకుడు. ఎన్నికలు వచ్చేసినా రిజర్వేషన్‌ అనుకూలించలేదు.

తెలుగు పోస్ట్ 1 Dec 2025 7:45 pm

చంద్రబాబు నమోదైన ఎక్సైజ్ కేసు మూసివేత

 ఎపి సిఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై గత జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఎక్సైజ్ కేసును ఎసిబి కోర్టు సోమవారం మూసివేసింది. ఫిర్యాదు చేసిన వారు నిరభ్యంతర పత్రం ఇప్పటికే న్యాయస్థానానికి అందజేశారు. సిఐడి అధికారు ల దర్యాప్తును అంగీకరించి కేసును ఎసిబి కోర్టు క్లోజ్ చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.... వైసిపి ప్రభుత్వ హయాంలో 2023 అక్టోబర్ 30న ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయని సిఐడి కేసు నమోదు చేసింది. గతంలో టీడీపీ హయాంలో 2014-19 లో ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయని, డిస్టిలరీలకు అర్హత లేకపోయినా లైసెన్సులు ఇవ్వడం, కొందరికి ప్రయోజనాలు కల్పించే విధంగా వ్యవహరించారని సిఐడి అభియోగాలు మోపింది.దీనిపై పిసి యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఎపి బేవరేజేస్ ఎండి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎ1 గా సుధాకర్, ఎ2 కొల్లు రవీంద్, ఎ3 చంద్రబాబు పేర్లను ఎపి సిఐడి నమోదు చేసింది. అయితే తాజాగా ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఇందుకు ఆధారాల్లేవని సిఐడి కోర్టుకు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తెలియజేయడంతో ఈ కేసును మూసివేసింది. అలాగే గతంలో చంద్రబాబుపై గత ప్రభుత్వం పెట్టిన ఫైబర్‌నెట్ కేసును కూడా కోర్టు మూసివేసింది. ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, సంస్థకు ఎటువంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని సిఐడి దర్యాప్తులో తేలినట్టు పేర్కొన్నారు.

మన తెలంగాణ 1 Dec 2025 7:44 pm

సామూహిక వివాహ వేడుకలో తాళి కట్టిన సీఎం కొడుకు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కుమారుడి వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా జరిపించారు.

తెలుగు పోస్ట్ 1 Dec 2025 7:37 pm

Title Glimpse: Anand Deverakonda’s Epic

Baby pair Anand Deverakonda and Vaishnavi Chaitanya are working together for the second time and the film is titled Epic. The title glimpse of Epic is out and it is quite impressive. 90s fame Aditya Hasan is the director of this romantic entertainer and the shooting portions of Epic are completed. Set in the backdrop […] The post Title Glimpse: Anand Deverakonda’s Epic appeared first on Telugu360 .

తెలుగు 360 1 Dec 2025 7:26 pm

టెస్టుల్లో ఆడడంపై విరాట్ కోహ్లీ క్లారిటీ

విరాట్ కోహ్లీ తన భవిష్యత్ ప్రణాళికలపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. తాను కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు.

తెలుగు పోస్ట్ 1 Dec 2025 7:24 pm

విలేజ్‌ కుకింగ్‌.. 3 కోట్లు దాటింది

‘విలేజ్‌ కుకింగ్‌ యూట్యూబ్‌ ఛానల్‌’.. పక్కా గ్రామీణ శైలిలో ఉంటాయి ఇందులోని వంటకాలు.

తెలుగు పోస్ట్ 1 Dec 2025 7:21 pm

చందానగర్‌లో అగ్ని ప్రమాదం.. గుడిసెలు దగ్ధం

హైదరాబాద్: చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవన నిర్మాణ సంస్థ వద్ద.. కార్మికులు వేసుకున్న గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. అక్కడ దాదాపు 50 గుడిసెలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి గల కారణంగా తెలియ రాలేదు.

మన తెలంగాణ 1 Dec 2025 7:10 pm

బోయింగ్ విమానాలు న‌డ‌పాలి..

కేంద్ర మంత్రి ఎంపీ కేశినేని వినతి . ఆంధ్రప్రభ, విజయవాడ : శ‌బ‌రిమ‌ల

ప్రభ న్యూస్ 1 Dec 2025 7:10 pm

NRI రియాలిటీ మీట్‌ను నిర్వహించిన ASBL..

హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్

ప్రభ న్యూస్ 1 Dec 2025 7:03 pm

కొత్తూరు లో ప్రేమ జంట ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం కొత్తూరు మండల కేంద్రంలో ఇద్దరు ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి ప్రేమ కథ ఆత్మహత్య రూపంలో విషాదాంతంగా ముగియడంతో కొత్తూరులో విషాదఛాయలు అలముకున్నాయి. పొట్ట చేత పట్టుకుని బీహార్ నుండి బ్రతుకుతెరువు కోసం కొత్తూరు వచ్చిన వలస కార్మికుడి కుటుంబంలో చెలరేగిన ఈ కల్లోలానికి ముక్కుపచలానని పసి హృదయాలు పాడే ఎక్కబోతున్నాయి. కొత్తూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న ట్రక్ డ్రైవర్ నవనీత్ దత్తకు ఇద్దరు కుమార్తెలు ఇందులో అనామిక (21) అనే యువతీ ధనుంజయ్ (25) అని యువకుడితో ప్రేమలో ఉంది. అయితే వీరందరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. గత మూడు రోజులుగా అనామిక కంపెనీకి వెళ్లడం లేదు. సుమారు అనామిక కోసం ధనుంజయ్ ఇంటికి వచ్చాడు. అప్పటికే అనామిక ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. ఈ దుష్యం చూసి తట్టుకోలేని ప్రేమికుడు అతను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు కొత్తూరు సిఐ నరసయ్య తెలిపారు. ట్రక్ డ్రైవర్ తండ్రి నవనీత్ దత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఇంట్లో కనిపిస్తున్న సిసి కెమెరాకు సంబంధించిన ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటికీ అది సరిగ్గా పని చేయడం లేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపబోతున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని శంషాబాద్ ఎసిపి శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు.

మన తెలంగాణ 1 Dec 2025 7:01 pm

చరిత్ర సృష్టించిన ఇషాన్.. అనితరసాధ్యమైన రికార్డు సొంతం

యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ టి-20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌లో తన సొంత జట్టు జార్ఖండ్‌కు అతడు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జార్ఖండ్, త్రిపుర జట్టుతో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో త్రిపుర జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం జార్ఖండ్ జట్టు 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 185 పరుగులు చేసి విజయం సాధించింది. జార్ఖండ్ బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 113 పరుగులు చేసి అద్భుత శతకాన్ని సాధించాడు. దీంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో టి-20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇషాన్ కెప్టెన్, కీపర్‌గా ఉంటూ సాధించిన సెంచరీలు మూడు. గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2018-19 సీజన్‌లో జార్ఖండ్ కెప్టెన్‌గా, కీపర్‌గా అతడు రెండు సెంచరీలు చేయగా.. ఈ సీజన్‌లో మరో సెంచరీ సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ పేరిట ఉండేది. గిల్‌క్రిస్ట్ మిడిల్‌స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరఫున కీపర్‌గా, కెప్టెన్‌గా ఉంటూ రెండు శతకాలు సాధించాడు.

మన తెలంగాణ 1 Dec 2025 6:51 pm

తుపాకీతో బెదిరించి ..వివస్త్రగా చేసి

ఓ మహిళా వ్యాపారవేత్త పట్ల ప్రైవేటు కంపెనీ ఎండీ అతి దారుణంగా వ్యవహరించిన సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. తుపాకీతో బెదిరించి ఆమెను వివస్త్రగా చేసి వేధింపులకు పాల్పడ్డాడు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రాంకో- ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ఎండి జాయ్ పాస్కల్ పోస్ట్ మీటింగ్ ఉందంటూ బాధితురాలిని ఆఫీసుకు పిలిచి తుపాకీతో ఆమెను బెదిరించి బట్టలు తీయించి నగ్నంగా ఉండగా ఫోటోలు, వీడియోలు సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు.ఈ విషయం బయట ఎవరికైనా చెప్పితే ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. అక్కడ నుండి బయటకు వచ్చిన బాధిత మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జాన్ తో పాటు మరో ఐదుగురిపై లైంగిక వేధింపుల కేసు పెట్టి విచారణ ప్రారంభించారు.

మన తెలంగాణ 1 Dec 2025 6:43 pm

Why Are Fans Still Holding On? The Painful Reaction to Samantha’s New Beginning

Today, Samantha married Raj Nidimoru. A simple, happy moment. A woman starting a new chapter in her life with someone she chose. But the peace didn’t last even a few hours. The moment her wedding photos appeared online, the trolling began. Social media is filled with comparisons, judgments and unwanted nostalgia. Many users rushed to […] The post Why Are Fans Still Holding On? The Painful Reaction to Samantha’s New Beginning appeared first on Telugu360 .

తెలుగు 360 1 Dec 2025 6:42 pm

ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన పెంపొందించుకోవాలి

నెల్లికుదురు, ఆంధ్రప్రభ : ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని

ప్రభ న్యూస్ 1 Dec 2025 6:34 pm

Telangana : తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు

తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలుగు పోస్ట్ 1 Dec 2025 6:22 pm

NTR bharosa|పొదుపు మంచిది

NTR bharosa| పొదుపు మంచిది NTR bharosa| భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Dec 2025 6:22 pm

కోహ్లీ సెంచరీ చూస్తే.. అలా అనిపించింది: కుల్దీప్ యాదవ్

రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుత శతకం బాదిన విషయం తెలిసిందే. 11 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 135 పరుగులు చేసి కోహ్లీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, కోహ్లీ చాలా కాలం తర్వాత సెంచరీ చేయడంతో అటు అభిమానులే కాదు.. సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ కూడా సంతోషంలో మునిగిపోయారు. తొలి వన్డేలో నాలుగు వికెట్ల తీసిన కుల్దీప్ కూడా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ‘‘కోహ్లీ భాయ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నా కెరీర్ ప్రారంభమైంది. అతడు బ్యాటంగ్ చేసిన విధానం చూస్తే నేను 8-9 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లు అనిపించింది. 2017, 2018, 2019లో ఆడినట్లు ఈ మ్యాచ్‌లో ఆడాడు. ఇది చాలా మంది ఇన్నింగ్స్, అతడు చాలా ఆత్మ విశ్వాసంతో కనిపించాడు. కోహ్లీతో కలిసి ఆడటం చాలా బాగుంది. అతడి నుంచి చాలా నేర్చుకుంటాం. బౌలర్లకు కూడా మద్దతిస్తూ ఇన్‌పుట్స్ ఇస్తుంటాడు. ఆటగాళ్లలో ఉత్సహాన్ని నింపుతాడు. అతను జట్టులో ఉండటం మా అదృష్టం’’ అని కుల్దీప్ అన్నాడు.

మన తెలంగాణ 1 Dec 2025 6:06 pm

ELECTIONS|పద్మశాలి సత్తా చాటాలి..

ELECTIONS| కమలాపూర్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో

ప్రభ న్యూస్ 1 Dec 2025 6:04 pm

Meenakshi Natarajan : మీనాక్షి.. దూరం.. దూరం.. రాహుల్ ను అదే కోరారా?

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నామమాత్రంగా మారిపోయారు

తెలుగు పోస్ట్ 1 Dec 2025 6:02 pm

STUDENTS |వ్యసనాలకు దూరంగా ఉండాలి

STUDENTS | వ్యసనాలకు దూరంగా ఉండాలి డీఐఈఓ అంజయ్య STUDENTS | జన్నారం

ప్రభ న్యూస్ 1 Dec 2025 6:00 pm

Congress |సుగుణక్కకు సన్మానం

Congress | సుగుణక్కకు సన్మానం Congress | తిర్యాణి, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:55 pm

Checking |అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ

Checking | వాంకిడి, ఆంద్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో భద్రతా

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:52 pm

Srikakulam |అత్యవసర చికిత్స అందించాలి

Srikakulam | అత్యవసర చికిత్స అందించాలి తాళ్లవలస డయేరియా ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:51 pm

NBK’s Akhanda 2 will do Shiva Thandavam in theatres

God of Masses Nandamuri Balakrishna and director Boyapati Srinu’s Akhanda 2 has become most anticipated film in Indian Cinema. The movie teaser, trailer and songs have created such buzz and hype that people are eager to watch in theatres. Now, producers Ram Achanta and Gopi Achanta, have interacted about the film with media. The producers […] The post NBK’s Akhanda 2 will do Shiva Thandavam in theatres appeared first on Telugu360 .

తెలుగు 360 1 Dec 2025 5:47 pm

Charities |బడ్డీకొట్టు వితరణ

Charities | బడ్డీకొట్టు వితరణ వైఎస్ఆర్‌ చారిటీ ద్వారా అంద‌జేత‌ Charities |

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:47 pm

progress |రామగుండం ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణకు పురోగతి

progress | రామగుండం ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణకు పురోగతి progress | గోదావరిఖని టౌన్,

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:45 pm

Vijayawada |ప్ర‌తి నెలా 1న ఠంచ‌న్‌గా పింఛ‌న్‌

Vijayawada | ప్ర‌తి నెలా 1న ఠంచ‌న్‌గా పింఛ‌న్‌ ఎన్‌టీఆర్ భ‌రోసాతో పేద‌ల

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:42 pm

Tirumala : గుడ్ న్యూస్...తిరుమల తరహాలోనే అన్ని చోట్ల అన్న ప్రసాదాలు

తిరుమలలో లభించే అన్న ప్రసాదం తరహాలో అన్ని ఆలయాల్లో తయారు చేస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘల్ తెలిపారు

తెలుగు పోస్ట్ 1 Dec 2025 5:40 pm

Nellore |తండ్రి చేతిలో కొడుకు హతం

Nellore | తండ్రి చేతిలో కొడుకు హతం Nellore | (నెల్లూరు ,

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:28 pm

శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కి అరుదైన గౌరవం

న్యూఢిల్లీ: శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కి అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా కేంద్ర హోం శాఖ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో శామీర్‌పేట స్టేషన్ చోటు దక్కించుకుంది. దేశంలోనే ఏడో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా (తెలంగాణలో నెం.1) నిలిచింది. ఢిల్లీలోని ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్ పోలీస్‌స్టేషన్ అగ్రస్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్‌ స్టేషన్లను హోం శాఖ ఎంపిక చేస్తుంది. తాజాగా ఎంపిక చేసిన జాబితాలో శామీర్‌పేట్ పిఎస్ చోటు దక్కించుకుంది.

మన తెలంగాణ 1 Dec 2025 5:28 pm

District wide |జిల్లాలో పోలీసు యాక్ట్

District wide | జిల్లాలో పోలీసు యాక్ట్ District wide | సంగారెడ్డి

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:26 pm

MLA |పెన్షన్లు ఘనత కూటమిదే..

MLA | పెన్షన్లు ఘనత కూటమిదే.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు…. MLA |

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:23 pm

YSRCP |సైకిల్ ఎక్కిన వైసీపీ నాయకులు

YSRCP | సైకిల్ ఎక్కిన వైసీపీ నాయకులు పసుపు కండువాలు కప్పి ఆహ్వానించిన

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:18 pm

Kerala : కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఇంటికి బాంబు బెదిరింపు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది

తెలుగు పోస్ట్ 1 Dec 2025 5:17 pm

CONGRESS|గెలుపు కోసం కృషి చేయాలి

CONGRESS| గెలుపు కోసం కృషి చేయాలి CONGRESS| తిర్యాని, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:14 pm

Buzz: Nani to work with Tamil Director?

Natural Star Nani raced to the top among the tier two actors of Telugu cinema. His non-theatrical market has been rock solid and he is working with several talented directors. He is currently shooting for ‘The Paradise’ directed by Srikanth Odela. He film releases during the first half of 2026 and Nani will soon work […] The post Buzz: Nani to work with Tamil Director? appeared first on Telugu360 .

తెలుగు 360 1 Dec 2025 5:12 pm

పాలమూరు జిల్లా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించాం: రేవంత్

హైదరాబాద్: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రెండేళ్ల విజయోత్సవ సభను మొదట మక్తల్ లో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక తెలంగాణలోనూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని, ఉమ్మడి పాలమూరు జిల్లాలకు ఏదైనా చేయాలని గతంలో ఏ నేత అనుకోలేదని తెలియజేశారు. అందుకే ఈ సారి పాలమూరు జిల్లా ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారని, స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో ఈ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు సిఎం అయ్యారని అన్నారు. తర్వాత 75 ఏళ్లలో పాలమూరు జిల్లా నుంచి ఎవరూ సిఎం కాలేదని, ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డ రాష్ట్ర సిఎంగా మీ ముందు నిలబడ్డారని రేవంత్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా పాలమూరు జిల్లా కరువు, వలసలకు మాత్రమే పేరుగాంచిందని, పాలమూరు నుంచి ఎంపిగా చేసిన మాజీ సిఎం కూడా ఈ జిల్లాకు ఏమీ చేయలేదని విమర్శించారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారని, ఈ సారి పాలమూరు బిడ్డను గెలిపించి అధికారం కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. ఈ సారి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించామని అన్నారు. పదేళ్లు నిర్లక్ష్యానికి గురైన నారాయణ పేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని, నారాయణ పేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంపై కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. రైతులు నష్టపోవద్దని ఎకరాకు రూ. 20 లక్షల పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చామని, పాలమూరు జిల్లాలో కృష్ణానది పారుతున్నా.. ఇక్కడి నేలకు నీళ్లు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాయగాళ్ల మాటలు విని.. ప్రాజెక్టులు, అభివృద్ది పనులను అడ్డుకోవద్దని హెచ్చరించారు. ఎంత డబ్బు ఖర్చయినా సరే.. మక్తల్- నారాయణపేట ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నారాయణ పేట జిల్లా మక్తల్ సిఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి, మక్తల్- నారాయణ పేట మధ్య 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి, మక్తల్ లో క్రీడాభవనం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారెడ్డి, కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరిమక్తల్ లో పలు అభివృద్ధి సిఎం మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. జూరాల దిగువన రూ. 121.92 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణానికి, అభివృద్ధి పనులు ప్రారంభం చేశారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

మన తెలంగాణ 1 Dec 2025 5:04 pm

GOVT |అర్హులందరికీ పింఛన్లు

GOVT | అర్హులందరికీ పింఛన్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:03 pm

సాయుధ దళాల ఫ్లాగ్‌ డే నిధికి కలెక్టర్‌ విరాళం..

కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: దేశ రక్షణ కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న సాయుధ

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:03 pm

vote |ఓటు హక్కును వినియోగించుకోండి..

vote | ఓటు హక్కును వినియోగించుకోండి.. vote | చెన్నూర్, ఆంధ్రప్రభ: మరికొద్ది

ప్రభ న్యూస్ 1 Dec 2025 4:57 pm

Hospital |ఎయిడ్స్‌పై అవగాహనే ప్రధాన ఆయుధం

Hospital | ఎయిడ్స్‌పై అవగాహనే ప్రధాన ఆయుధం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల

ప్రభ న్యూస్ 1 Dec 2025 4:53 pm

వాళ్లిదర్దూ లేకుండా ప్రపంచకప్ గెలవడం కష్టమే: మాజీ క్రికెటర్

రాంచీలో జరిగిన వన్డేలో టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ (135) సెంచరీలో కదం తొక్కగా.. రోహిత్ (57) తనదైన శైలీ ధనాధన్ మెరుపులతో అర్థ శతకం చేశారు. దీంతో వీరిద్దరు తమ ఫిట్‌నెస్‌పై వచ్చిన ప్రశ్నలుకు సమాధానం ఇచ్చినట్లైంది. అంతేకాక 2027 ప్రపంచకప్ వరకూ జట్టులో కొనసాగాలని అనుకుంటున్న అభిమానులకు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్-రోహిత్‌లు లేకుంటే వన్డే ప్రపంచకప్ గెలవడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. వారిద్దరూ వేరే లెవల్‌లో క్రికెట్ ఆడుతున్నారని పేర్కొన్నారు. ‘‘ఇక ప్రపంచకప్‌లో రోహిత్-విరాట్‌లు ఆడుతారా? ఫిట్‌నెస్‌తో ఉంటారా? వంటి ప్రశ్నలు వేయొద్దు. వాళ్లిద్దరు కలిసి 20 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి కథ సమాప్తమైనట్లే. రాంచీలో అదే జరిగింది. వారిద్దరు తమ బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా ఓటమిని శాసించారు. వాళ్లు నెలకొల్పిన భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను మానసికంగా దెబ్బతీసింది. రో-కో జోడి చాలా కష్టపడుతున్నారు. కేవలం ఒకే ఫార్మాట్‌లో ఆడుతూ తమ రిథమ్‌ను కొనసాగించడం అంత సులువు కాదు. ప్రపంచకప్‌లో వారిద్దరు కీలకం కానున్నారు’’ అని శ్రీకాంత్ అన్నారు. కాగా, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 349 పరుగులు చేసి దక్షిణాఫ్రికా 350 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. ఈ లక్ష్యాన్ని చేధించడంతో సఫారీలు విఫలమయ్యారు. 332 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ కావడంతో భారత్ ఈ మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డే రాయ్‌పూర్ వేదికగా జరుగనుంది. 

మన తెలంగాణ 1 Dec 2025 4:47 pm

Mylavaram |రేపు మైలవరంలో నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్…

Mylavaram | రేపు మైలవరంలో నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్… మైలవరం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Dec 2025 4:29 pm

Demolition |అక్రమాలపై చర్యలు షురూ

Demolition | అక్రమాలపై చర్యలు షురూ Demolition | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Dec 2025 4:28 pm

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. యువతి యువకుడు మృతి

కొత్తూరు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలక కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానస్పద స్థితిలో యువతీ యువకుడు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఓ కార్మికుడు కొత్తూరు శివారులోని ఓ కంపెనీలో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ స్థానిక బిస్కెట్ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తండ్రి భోజనానికి ఇంటికి రాగా.. తలుపు గడియ లోపలి నుంచి పెట్టి ఉంది. ఎంతసేపు తలుపు కొట్టిన ఎవరు స్పందించలేదు. దీంతో కిటికీ నుంచి తలుపు గడియ తీసి లోపలికి వెళ్లాడు. ఓ గదిలో అతడి కుమార్తెతో పాటు మరో గుర్తు తెలియని యువకుడి మృతదేహాలను చూశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ యువకుడు యువతిని హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

మన తెలంగాణ 1 Dec 2025 4:22 pm

Bella Bella From Ravi Teja’s BMW: Crowd-Pleaser

Mass Maharaja Ravi Teja is gearing up to storm the Sankranthi race with Bharatha Mahasayulaku Vignyapthi, directed by Kishore Tirumala. After the fun-filled title glimpse, the team has now released the high-voltage first single, Bella Bella. Music director Bheems Ceciroleo delivers yet another mass number. Bella Bella is designed to stick- packed with thumping beats […] The post Bella Bella From Ravi Teja’s BMW: Crowd-Pleaser appeared first on Telugu360 .

తెలుగు 360 1 Dec 2025 4:21 pm

HIV |ఎయిడ్స్‌పై విద్యార్థుల‌కు అవగాహన

HIV | ఎయిడ్స్‌పై విద్యార్థుల‌కు అవగాహన HIV | బండి ఆత్మకూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Dec 2025 4:20 pm

Andhra Prabha Smart Edition |పొల్యూషన్​/డ్రామాలొద్దు/రాజ్​తో సమంత

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 01-12-2025, 4.00PM తెలంగాణలో ఎయిర్​ పొల్యూషన్​ డ్రామాలొద్దు.. సభకు

ప్రభ న్యూస్ 1 Dec 2025 4:18 pm

BRS|కేటీఆర్ సమక్షంలో..

BRS| కేటీఆర్ సమక్షంలో.. BRS| జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం మండల మాజీ

ప్రభ న్యూస్ 1 Dec 2025 4:08 pm

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి

పరకాల, డిసెంబర్ 1 (జనం సాక్షి): ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో …

జనం సాక్షి 1 Dec 2025 4:08 pm

FOREST |మాకు న్యాయం చేయండి..

FOREST | మాకు న్యాయం చేయండి.. తహసీల్దార్‌కు చెంచుల విన‌తి FOREST |

ప్రభ న్యూస్ 1 Dec 2025 4:06 pm

Sigachi |బాధితుల పరిహారం ఏమైంది?

Sigachi | బాధితుల పరిహారం ఏమైంది? ఆగ‌మేఘాల మీద కాదు ఆలోచించి హామీలివ్వాలిప్ర‌భుత్వానికి

ప్రభ న్యూస్ 1 Dec 2025 4:01 pm

GRAIN |ప్రత్యేక మార్గదర్శకాలతో కొనుగోళ్లు

GRAIN | ప్రత్యేక మార్గదర్శకాలతో కొనుగోళ్లు ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరికలెక్టర్

ప్రభ న్యూస్ 1 Dec 2025 3:59 pm

observation |వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిశీలన‌

observation | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ పట్టణానికి నీటిని సరఫరా చేసే

ప్రభ న్యూస్ 1 Dec 2025 3:59 pm

నిర్దేశిత స‌మ‌యంలోనే మేడారం అభివృద్ధి ప‌నులు పూర్తి : రేవంత్

హైదరాబాద్: మేడారం అభివృద్ధి ప‌నుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్ర‌దాయాలు, ఆచారాల‌కు పెద్ద పీట వేయాల‌ని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిర్దేశిత స‌మ‌యంలోనే అభివృద్ధి ప‌నులు పూర్తి కావాల‌ని అన్నారు. అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను సిఎం ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి ప‌నులను ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షించాల‌ని.. ఏ మాత్రం పొర‌పాట్లు దొర్లినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. మేడారం అభివృద్ధి ప‌నుల‌పై మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప‌నులు సాగుతున్న తీరుపై ప్ర‌ద‌ర్శించిన‌ పవ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్‌ను రేవంత్ ప‌రిశీలించారు. మేడారం అభివృద్ధిలో భాగంగా రాతి ప‌నుల‌తో పాటు ర‌హ‌దారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గ‌ద్దెల చుట్టూ భ‌క్తుల రాక‌పోక‌ల‌కు సంబంధించిన మార్గాలు, భ‌క్తులు వేచి ఉండే ప్ర‌దేశాలు ఇలా ప్ర‌తి ఒక్క అంశంపైనా ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచ‌నలిచ్చారు. ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ‌, దేవాదాయ శాఖ‌, అట‌వీ శాఖ‌, స్థ‌ప‌తి శివ‌నాగిరెడ్డి గారి స‌మ‌న్వ‌యంతో సాగాలని సూచించారు. నిర్దేశిత స‌మ‌యంలోనే అభివృద్ధి ప‌నులు పూర్తి కావాల‌ని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, సిఎం ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ‌నివాస‌రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ హ‌రీష్‌ , ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహ‌న్ నాయ‌క్‌ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. 

మన తెలంగాణ 1 Dec 2025 3:53 pm

December 2025 Release Chart Updated

2025 is now in the last month and the month is packed with a number of releases. Nandamuri Balakrishna will test his luck with Akhanda 2 and the film releases on December 5th. The makers are making grand arrangements for the release and Akhanda 2 is the most awaited Telugu film of the month. A […] The post December 2025 Release Chart Updated appeared first on Telugu360 .

తెలుగు 360 1 Dec 2025 3:48 pm

Congress Pushes for Dominance as Village Polls Heat Up in Telangana

Village panchayat elections in Telangana have turned into a fierce political battleground. Chief Minister Revanth Reddy instructed ruling party MLAs to ensure that at least 80 percent of Congress-backed candidates win. His directive raised the stakes and pushed legislators to treat this election cycle as a matter of prestige. Opposition MLAs from the BRS are […] The post Congress Pushes for Dominance as Village Polls Heat Up in Telangana appeared first on Telugu360 .

తెలుగు 360 1 Dec 2025 3:35 pm

Akhanda 2 Jukebox: Impressive Songs Hidden

Akhanda 2 is the last big film from Telugu cinema for this year. The film featuring Balakrishna is all set for December 5th release and is high on expectations. Two singles from the film are out and they fell short of expectations. They are decent but could not receive blockbuster response. Thaman was trolled for […] The post Akhanda 2 Jukebox: Impressive Songs Hidden appeared first on Telugu360 .

తెలుగు 360 1 Dec 2025 3:33 pm

GOLD RATE|ప‌సిడి ప్రియం!

GOLD RATE| ప‌సిడి ప్రియం! GOLD RATE| వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 1 Dec 2025 3:29 pm

Center |నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

Center | నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి రాష్ట్ర పంచాయతీ ఎన్నికల పరిశీలకులు

ప్రభ న్యూస్ 1 Dec 2025 3:28 pm

ఒటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న వరుణ్ సందేశ్.. టైటిల్ ఏంటంటే..

ఒకప్పుడు వరుస హిట్స్‌తో సక్సెస్‌ఫుల్ హీరోగా ఉన్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత వరుస ఫ్లాప్స్‌తో సతమతమయ్యాడు. గత కొంతకాలంగా అతడు ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం అతడు ఒటిటిలోకి ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ‘నయనం’ అనే వెబ్‌సిరీస్‌తో వరుణ్ సందేశ్ ఒటిటి ఎంట్రీకి ప్లాన్ చేశాడు. ఈ సిరీస్‌లో అతడు డాక్టర్ నయన్ అనే పాత్రలో కనిపించనున్నాడు. మ‌నుషుల్లోని నిజ స్వ‌భావానికి, ఏదో కావాల‌ని త‌పించే తత్వానికి మ‌ధ్య ఉండే సున్నిత‌మైన అంశాల‌ను ఇందులో చూపించారు. జీ 5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఈ సైకో థ్రిలర్‌కి స్వాతి ప్రకాశ్ దర్శకత్వం వహించారు. సోమవారం ఈ వెబ్‌సిరీస్ నుంచి వరుణ్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. తన పాత్రలోని డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టతను ఇందులో ఆవిష్కరించారు. ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి.

మన తెలంగాణ 1 Dec 2025 3:26 pm

Collector |ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌తోనే ఎయిడ్స్ నివార‌ణ

Collector | ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌తోనే ఎయిడ్స్ నివార‌ణ క‌లెక్ట‌ర్ బాదావ‌త్‌ Collector |

ప్రభ న్యూస్ 1 Dec 2025 3:23 pm

RALLY |మన పంతం.. ఎయిడ్స్ అంతం

RALLY | మన పంతం.. ఎయిడ్స్ అంతం పలువురు వక్తల వెల్లడినల్లమాడ మండల

ప్రభ న్యూస్ 1 Dec 2025 3:15 pm