SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

14thaprileditorial |ట్రంప్ చర్యలు.. ప్రపంచ ఆందోళనలు

14thaprileditorial | ట్రంప్ చర్యలు.. ప్రపంచ ఆందోళనలు 14thaprileditorial | ఇరాన్‌పై దాడులు:

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:21 am

14thApril2026 |మంగళవారం నేటి పంచాంగం

14thApril2026 | మంగళవారం నేటి పంచాంగం 14thApril2026 | రోజు విశేషాలు మరియు

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:08 am

డీలిమిటేషన్‌కు హైబ్రిడ్ ఫార్ములా

మన తెలంగాణ/హైదరాబాద్: హైబ్రిడ్ ప్రాతిపదికన సీట్లు పెంచాలన్నదే తమ డిమాండ్ సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశానికి ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలను గౌరవించాలని ఆయన కోరారు. కొత్తగా వచ్చే 272 సీట్లలో 50 శాతం జీడిపి ప్రాతిపదికగా తీసుకోవాలని, మరో 136 సీట్లను జనాభా ప్రాతిపదికగా పెంచాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగేలా గతంలో సీట్ల కేటాయింపు జరిగిందని ఆయన తెలిపారు. మొదటగా మహిళా బిల్లు ఆమోదించి తర్వాతే డీలిమిటేషన్‌పై చర్చ చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సచివాలయంలో సిఎం రేవంత్‌రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అనేవి దేశ ప్రజలకు సంబంధించిన అంశాలని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ, బిజెపి మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహారిస్తోందని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ను కలిపి తీసుకురావడం, పాత జనాభా లెక్కల ప్రకారం వెళ్లడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏ మాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన అన్నారు. సీట్ల పునర్విభజనలో పర్సంటేజీలు కాదు నెంబర్ ముఖ్యమని, రాజకీయాల్లో నెంబర్ ముఖ్యమని, వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయిందని నెంబర్ లేకుండా రాజకీయాల్లో ఎవరూ ఎవరితోనూ చర్చలు చేయరని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సీట్ల పెంపు తర్వాత దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు 195 అవుతాయని, సీట్ల పెంపు తర్వాత ఉత్తరాదిలో  సీట్లు 620కి పెరుగుతాయని, ఉత్తరాది, దక్షిణాది మధ్య ప్రస్తుతం 412 సీట్ల గ్యాప్ ఉందని, అది రానున్న రోజుల్లో 620 సీట్ల గ్యాప్‌నకు పెరుగుతుందని, అప్పుడు ఉత్తరాదికి 208 సీట్లు అదనంగా వస్తాయని సిఎం రేవంత్ వివరించారు. ప్రస్తుతం 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న యూపికి ఉన్న అంతరం ప్రస్తుతం 60 సీట్లు మాత్రమేనని, కానీ యాభై శాతం పెంచితే ఈ రెండు రాష్ట్రాల మధ్య 90 సీట్ల గ్యాప్ పెరుగుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గింది ఎన్డీఏ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని కీలకశాఖల్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని, దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షను మరింత పెంచేలా బిజెపి వెళుతోందని ఆయన వివర్శించారు. దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి పన్నులు కట్టడం, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలి అన్నట్లుగా ఉందని, పన్నులు కట్టాలి, సలాం కొట్టాలి అనే విధానానికి తాము వ్యతిరేకమని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులు ఉత్తరాది రాష్ట్రాలు దేశానికి రాజకీయ రాజధానులైతే, దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులని ఆయన అభివర్ణించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. దేశానికి అత్యధిక ఆదాయాన్ని, జీఎస్‌డిపిని అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం దేశ మనుగడకే ప్రమాదకరమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం వల్ల అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో పెంచాలనుకుంటున్న 273 అదనపు సీట్లలో 50 శాతం జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50 శాతాన్ని ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధిరేటు ఆధారంగా కేటాయించాలని ఆయన ప్రతిపాదించారు. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని ఆయన కోరారు. డీలిమిటేషన్ విషయంలో మాత్రం తొందరపాటు వద్దని సూచించారు. దీనికి 2028 వరకు సమయం ఉన్నందున, హడావిడి చేయకుండా అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలు మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కావాలనే ఈ రెండు అంశాలను కలిపి బిజెపి రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపు రెండూ కీలక అంశాలని ఆయన చెప్పారు. దేశ ప్రజలందరికీ సంబంధించి ఈ రెండూ కీలక అంశాలని ఆయన పేర్కొన్నారు. బిజెపి మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహారిస్తోందని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదని బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందన్నారు. మహిళలకు ఓటు హక్కు సహా సమాన హక్కులను కల్పించింది కాంగ్రెస్ అని సిఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కావాలని, కుట్రపూరితంగా దేశ వ్యాప్తంగా కేంద్రం హడావిడి చేస్తోందని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్‌లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు 33 శాతం మహిళా రిజర్వేషన్‌లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పాత జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండింటిని కలిపి 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు చేయా లని కేంద్రం చూస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను చేయాలన్నదే తమ డిమాండ్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2026 వరకు సీట్ల పెంపు వద్దని 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం చట్ట సవరణ చేసిందని ఆయన గుర్తు చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, మహిళా రిజర్వేషన్లను ఆర్నెళ్లలోనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళా బిల్లును అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ చేయొద్దని ఆయన కోరారు. ప్రమాదకర దిశలో డీలిమిటేషన్ ప్రమాదకర దిశలో డీలిమిటేషన్ వెళుతోందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న రాష్ట్రాలు, దక్షిణాదికి అన్యాయం చేసే కుట్రను మోడీ చేస్తున్నారని, కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సమర్థంగా అమలు చేశాయని, ఉత్తరాదిలో కుటుంబ నియంత్రణ సరిగా జరగకపోవటంతో జనాభా విపరీతంగా పెరిగిందని ఆయన ఆరోపించారు. జనాభా అంతరం వల్లనే నియోజకవర్గాల పెంపును కేంద్రం గతంలో వాయిదా వేసిందని, జనాభా ప్రాతిపదికన చేస్తే చిన్న రాష్ట్రాలు నష్టపోతాయని ఆయన పేర్కొన్నారు జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు వద్దని దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా చెప్పాయని, దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకత వల్ల మోడీ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారని, ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచుతామని మోడీ చెబుతున్నారని ఆయన తెలిపారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో సీట్లు భారీగా పెరగనున్నాయని, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్లలో అంతరం భారీగా పెరుగుతుందని ఆయన తెలిపారు. అన్ని పార్టీలకు, సిఎంలకు లేఖలు రాస్తా డీలిమిటేషన్ అన్యాయంపై అన్ని పార్టీలకు, సిఎంలకు లేఖలు రాస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడి పెట్టొద్దని, సీట్లు పెంచాలనుకుంటే అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఏ ప్రాతిపదికన 50 శాతం సీట్లు పెంచుతారు?. సీట్లు 50 శాతం పెంచాలని మోడీకి ఏ దేవుడు చెప్పాడు, 50 శాతం సీట్లు పెంచితే ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరం పెరుగుతుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ శాసనసభల్లోనూ చర్చ జరగాలని, డీలిమిటేషన్‌పై ఒక కమిటీ వేసి ప్రజాసంఘాల అభిప్రాయాలు కూడా సేకరించాలని ఆయన సూచించారు. 2026లో జనగణన పూర్తి చేసి సమగ్ర చర్చ తర్వాత సీట్ల పెంపు చేయాలని, నియోజకవర్గాల పెంపునకు 2028 వరకు గడువు ఉందని, అప్పటివరకు ఎక్స్‌పర్ట్ కమిటీని వేయాలని, అసెంబ్లీ అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన వివరించారు. వివక్ష వల్ల భవిష్యత్‌లో ప్రాంతీయ అసమానతలు, ఉద్యమాలకు 1967లో 520గా ఉన్న లోక్‌సభ స్థానాలను, 1976లో ఇందిరాగాంధీ 542కు పెంచారని సిక్కిం చేరికతో అది 543కు చేరిందని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. సీట్లు తగ్గడం వల్ల రాజకీయంగా బలహీనవర్గాలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాల మధ్య గ్యాప్ పెంచేలా కేంద్రం వ్యవహారించవద్దని ఆయన హితవు పలికారు. బిజెపి నేతలు ముఖ్యంగా ఎంపి లక్ష్మణ్ వంటి వారు యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లడం వల్ల ఆ ప్రాంత ప్రమోజనాల కోసం దక్షిణాదికి ద్రోహం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వివక్ష వల్ల భవిష్యత్‌లో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలకు, ఉద్యమాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు బిజెపి అధ్యక్షురాలిగా ఒక్క మహిళను నియమించలేదు 60 ఏళ్లలో మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 46 ఏళ్లలో ఒక్క మహిళ ను పార్టీ అధ్యక్షురాలిగా బిజెపి చేయలేదని, కనీసం జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పదవి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. మహిళలను చిన్న చూపు చూడటమే బిజెపి లక్షణమని, ద్వితీయ శ్రేణి పౌరులుగా మహిళలను చూస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన బిజెపి పార్టీ ఏర్పాటైంది, ఇప్పటి వరకు 15 మంది బిజెపి అధ్యక్షుల నియామకం జరిగింది, కానీ, ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఒక్క మహిళను కూడా నియామించలేదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో అతి ఎక్కువ కాలం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ మహిళలకు అన్యాయం చేస్తుందా..? బిజెపికి మహిళా నాయకురాలిని అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్ మాట్లాడాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పునర్విభజనపై పోరాడుతాం బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ్యతిరేకమని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మా ఎంపిలు తెలంగాణను సాధించారని, ఇప్పుడు పునర్విభజనపై పోరాడుతారని ఆయన తెలిపారు. దక్షణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తామని, పార్లమెంట్ లో బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్‌దేనని, యాభై శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు మోడీ ఇంటి ముందు బంట్రోతులుగా నిలబడాల్సి వస్తుందని, వాళ్ల అవసరం ఇక ముందు ఉండదని, అన్ని దక్షణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు దీనిపైన లేఖ రాస్తానని ఆయన తెలిపారు. 2001లో వాజ్‌పేయి పునర్విభజనపై చట్ట సవరణ 2024 లోక్‌సభ ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తే 181 మహిళలు లోక్‌సభకు ఎన్నికయ్యే వారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2001 లో వాజ్ పేయి పునర్విభజనపైన చట్ట సవరణ చేశారని, దాని వల్ల 2009 లో తెలంగాణకు 17 ఎంపి సీట్లు, ఆంధ్రాకు 25 ఎంపి సీట్లు వచ్చాయన్నారు. తెలంగాణకు 119 అసెంబ్లీ సీట్లు, ఎపికి 175 శాసనసభ సీట్లు వచ్చాయన్నారు.

మన తెలంగాణ 14 Apr 2026 6:00 am

డీలిమిటేషన్‌పై సిఎంకు అవగాహన లేదు

మన తెలంగాణ/హైదరాబాద్: డీ-లిమిటేషన్‌పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించగా, డీ-లిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం ఏమిటీ? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. డీలిమిటేషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన విమర్శలపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులిరువురూ వేర్వేరుగా ధ్వజమెత్తారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై ముఖ్యమంత్రి అపోహలు సృష్టిస్తున్నారని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని, మహిళా రిజర్వేషన్ బిల్లు దేశంలోని మహిళల గౌరవాన్ని పెంచే చారిత్రక నిర్ణయం అని ఆయన తెలిపారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ నిర్ణయాన్ని రాజకీయంగా చూడకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టిందని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు దీనిపై రాజకీయాలు చేయకుండా, దేశంలోని 70 కోట్ల మహిళల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పడం సరైంది కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలు కావని, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం డీలిమిటేషన్ అవసరం ఉంటుందని చెప్పారు. దీనికి సమయం పడుతుందని అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కేంద్రం తీసుకుంటుందని ఆయన వివరించారు. అందువల్ల అపోహలు సృష్టించకుండా, ప్రజలకు అసలైన సమాచారం ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సిఎం వాదనలో శాస్త్రీయత లేదు: బండి సంజయ్ డీలిమిటేషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న వాదనలో శాస్త్రీయత లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్ విమర్శించారు. అత్యధిక ఆదాయం ఇచ్చిన వాళ్లకు మా త్రమే సీట్లు, ఓట్లు ఇవ్వాలని చెబుతారా? మీరు చెప్పిన ప్రాతిపదిక ప్రకారం, అత్యధిక ఆదాయం ఇస్తున్న హైదరాబాద్‌కు మాత్రమే అత్యధిక సీట్లు, ఓట్లు ఇవ్వాలా? అని ఆయన ప్రశ్నించారు. మీరు పుట్టి పెరిగిన పాలమూరుకు, వెనుకబడిన ఆదిలాబాద్, ఇతర జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరమే లేదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు మూటలు పంపి డబ్బు ప్రాతిపదికనే సిద్దాంతాలు రచిస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతం ఇదేనా?, ఆర్ధికంగా బలంగా ఉన్న వాళ్లకు సగం, జనాభా ప్రాతిపదికన మిగిలిన ప్రజలకు సగం సీట్లు ఇవ్వాలని చెబుతారా? అని ఆయన ప్రశ్నించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బతికి ఉంటే కాంగ్రెస్‌ను దేశం నుంచి బహిష్కరించాలని రాజ్యాంగంలో పొందుపరిచే వారన్నారు. నేను రేవంత్‌రెడ్డిలా అవకాశవాదిని కాదు తాను ఉత్తర భారత దేశానికి వలస వెళతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. వలసపోవడానికి తాను అవకాశవాదిని కాదని, రేవంత్‌రెడ్డిని అంతకంటే కాదని ఆయన విమర్శించారు. తాను చచ్చినా బతికినా బిజెపిలోనే ఉంటానని ఆయన తెలిపారు. తాను చనిపోతే తన శవంపై కప్పేది కాషాయ జెం డానే అని ఆయన తెలిపారు. ఆ సన్నివేశం చూడడానికైనా రేవంత్‌రెడ్డి నిండు నూరేళ్లు బతికి ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. తాను చచ్చినా, బతికినా, ఓడినా, గెలిచినా కేరాఫ్ అడ్రస్ కరీంనగరేనని ఆయన చెప్పారు. తన రక్తంలోనే జాతీయవాదమనే డీఎన్‌ఏ ఉందన్నారు. వలసవాది, అవకాశవాదానికి ప్రతిరూపం రేవంత్‌రెడ్డి అని ఆయన విమర్శించారు. పాలమూరు నుంచి మల్కాజ్‌గిరి దాకా వలస పోయిం ది రేవంత్‌రెడ్డేనని ఆయన ధ్వజమెత్తారు. మహిళా బిల్లును వ్య తిరేకించే మీరు కూడా తమను విమర్శిస్తారా? అని ఆయన ప్ర శ్నించారు. మీరు నిజంగా మహిళా రిజర్వేషన్లకు సానుకూలమైతే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు అమలు చేయలేద ని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో దాదాపు 30 ఏళ్లకుపైగా కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నా మహిళా రిజర్వేషన్లను ఎం దుకు అమలు చేయలేదని కేంద్ర మంత్రి బండి ప్రశ్నించారు.

మన తెలంగాణ 14 Apr 2026 5:30 am

మహిళా బిల్లుతో సరికొత్త చరిత్ర

సరికొత్త చరిత్రను సృష్టించేందుకు అతి చేరువలో భారత్‌ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 21వ శతాబ్దంలో అత్యంత కీలకమైన నిర్ణయాలలో ఒకదానిని తీసుకోబోతోందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఉద్దేశించి సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2029 నాటికి దీన్ని అమలు చేసేందుకు అవసరమైన సవరణలను ఆమోదించడానికి పార్లమెంట్ సమావేశం కానున్న నేపథ్యంలో, దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందుగా మహిళా చట్టాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, ‘నారీ శక్తి వందన్ అధినియం’ సవరణలు గత స్వప్నాలను సాకారం చేయడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలను నెరవేర్చుతాయని అన్నారు. పాలనలో మహిళల పాత్రను ప్రశంసిస్తూ, మరింత పెద్ద బాధ్యతలు చేపట్టేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. మన దేశ పార్లమెంట్ కొత్త చరిత్రను సృష్టించే దశలో ఉంది. ఇది గత ఆశయాలను నిజం చేస్తూ, భవిష్యత్ సంకల్పాలను నెరవేర్చే చరిత్ర అవుతుంది. సమానత్వం, సామాజిక న్యాయం మన కార్యసంసృ్కతిలో భాగమయ్యే భారతదేశ నిర్మాణానికి ఇది దారి చూపుతుంది. భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యావశ్యకం. సుదీర్ఘ కాలం తర్వాత ఈ బిల్లు వస్తోంది. ప్రతి పార్టీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. 2029లోగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి. ఈ నిర్ణయం మహిళా శక్తి, గౌరవానికి అంకితం. సమానత్వంతో కూడిన భారతదేశానికి ఇదో తీర్మానం. ఇక్కడ సామాజిక న్యాయం నినాదానికే పరిమితం కాదు. అది మన పని సంసృ్కతిలో ఒక భాగం. రాష్ట్ర శాసనసభల నుంచి దేశ పార్లమెంట్ వరకు దశాబ్దాల నిరీక్షణకు తెరదించే సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఏప్రిల్ 16, 17, 18 అని మోదీ పేర్కొన్నారు. 2023లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని, ముఖ్యంగా ప్రతిపక్షం 2029 నాటికి అమలు చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలు నుంచి పార్లమెంట్ వరకు మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ సవరణలు అవసరమని చెప్పారు. 2023 సెప్టెంబర్‌లో పార్లమెంట్ ఆమోదించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడో వంతు సీట్ల రిజర్వేషన్ కల్పించారు. అయితే జనగణన అనంతరం జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు అనుసంధానించబడిన కారణంగా, ఈ చట్టం అమలు 2034 వరకు ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిని ముందుకు తెచ్చి 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే అమలు చేయడానికి సవరణలు తీసుకువస్తున్నారు. ఈ సవరణలు అమలులోకి వస్తే లోక్‌సభ సీట్ల సంఖ్య 816కి పెరిగి, అందులో 273 సీట్లు మహిళలకు కేటాయిస్తారు. మహిళా భాగస్వామ్యం పెరగడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియను చర్చ, సహకారం, భాగస్వామ్యంతో పూర్తి చేయాలని ఆయన ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా మహిళల్లో ఈ అంశంపై ఉత్సాహం పెరుగుతోందని, శాసనసభలు, లోక్‌సభకు చేరాలన్న ఆశయాలు వ్యక్తమవుతున్నాయని మోదీ అన్నారు. ఈ ప్రక్రియలో మహిళలు చురుకుగా పాల్గొని తమ అభిప్రాయాలను ఎంపీలకు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళల పాత్ర స్వాతంత్య్ర పోరాటం నుంచి రాజ్యాంగ నిర్మాణం వరకు మహిళల పాత్రను గుర్తుచేసిన ప్రధాని, అవకాశాలు లభించిన ప్రతిసారి మహిళలు దేశానికి విశేష సేవలు అందించారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రపతి నుంచి ఆర్థిక మంత్రివరకు కీలక పదవుల్లో మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలను మహిళల నాయకత్వానికి ఉత్తమ ఉదాహరణగా చూపుతూ, ప్రస్తుతం 14 లక్షలకుపైగా మహిళలు స్థానిక సంస్థల్లో సేవలందిస్తున్నారని తెలిపారు. సుమారు 21 రాష్ట్రాల్లో మహిళల భాగస్వామ్యం 50 శాతం వరకు చేరుకుందని చెప్పారు. మహిళల నిర్ణయాధికారంలో పెరుగుదల వల్ల నీరు, విద్య, ఆరోగ్యం, పోషణ వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధ్యమయ్యాయని, ‘జల్ జీవన్ మిషన్’ విజయానికి కూడా మహిళా పాత్ర కీలకమని మోదీ వివరించారు. స్థానిక సంస్థల్లో అనుభవం సంపాదించిన లక్షలాది మహిళలు ఇప్పుడు పెద్ద బాధ్యతలకు సిద్ధంగా ఉన్నారని, ఈ చట్టం అమలు వారి జీవితాల్లో గొప్ప అవకాశంగా మారుతుందని ఆయన అన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల ప్రయాణం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. అవకాశాలు కల్పించాలి.. దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తె ఆశయాలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, వాటి సాధనకు అన్ని చర్యలు తీసుకుంటుందని మోదీ భరోసా ఇచ్చారు. మహిళలు కష్టపడి, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారని, వారికి మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. వికసిత భారతదేశ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొంటూ, 2014 నుంచి మహిళల జీవన చక్రంలోని ప్రతి దశను దృష్టిలో ఉంచుకుని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. బాలికల రక్షణ, విద్య కోసం ‘బేటీ బచావో- బేటీ పడావో’, గర్భిణీల పోషణ కోసం ‘మాత్రు వందన్ యోజన’, బాలికల భవిష్యత్తు కోసం ‘సుకన్య సమృద్ధి యోజన’ వంటి పథకాలను ఉదాహరణగా పేర్కొన్నారు. గతంలో ఇళ్లు పురుషుల పేర్ల మీదే ఉండేవి. భూమి, దుకాణం, కారు.. ఇలా ఏది చూసుకున్నా మగవాళ్ల పేరు మీదే ఉండేవి. అదంతా సహజమనే భావన ఉండేది. అందుకే మేం పీఎం ఆవాస్ యోజన తీసుకొచ్చాం. దాని కింద మహిళ పేరు మీదే ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు మేం ప్రాధాన్యం ఇచ్చాం అని అన్నారు. ఇలా మహిళా సాధికారత కోసం తీసుకువచ్చిన పథకాల గురించి ప్రస్తావించారు. తాను కుటుంబ జీవితాన్ని జీవించకపోయినా.. ఆ వ్యవహారాలపై అవగాహన ఉందని ప్రధాని సరదాగా వ్యాఖ్యానించారు.

మన తెలంగాణ 14 Apr 2026 5:00 am

హైడ్రాకు కళ్లెం

మన తెలంగాణ/హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది. కూల్చివేతలపై హైడ్రాకు సరైన ప్రామా ణికత లేదని హైకోర్టు అభిప్రాయపడింది. నోటీ సులు ఇవ్వకుం డానే కూల్చివేతలు చేపడు తున్నారని ఉన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ హైడ్రా కూల్చి వేతలపై షరీఫ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అమీన్‌పూర్ కూల్చివేతల వీడియోలను పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. నోటీస్ ఇవ్వకుండా కూల్చివేశారని పిటిషనర్ తరపు న్యాయవాది రవిచందర్ వాదించారు. వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణకు యత్నించారని, అనుమతి లేకుండా భవనాలు నిర్మిం చారని ఎఎజి ఇమ్రాన్ ఖాన్ తన వాదనను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎలాంటి కూల్చి వేతలు చేపట్టరాదని స్పష్టపరుస్తూనే.. చెరువులు, పార్కులు, రహదా రులు ఆక్రమిస్తే నిబంధనల మేరకు మాత్రమే కూల్చివేతలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

మన తెలంగాణ 14 Apr 2026 4:30 am

రేపటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ - తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం(ఏప్రిల్ 15) నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ వి.బాలకిష్టారెడ్డి దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్లు ఇ.పురుషోత్తం, ఎస్‌కె మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, డిగ్రీ ప్రవేశాలకు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. మొదటి విడత దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి మే 7 వరకు కొనసాగుతుందని అన్నారు. మొదటి వెబ్ ఆప్షన్ల  నమోదు ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మే 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. మే 14న తొలి విడత డిగ్రీ సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈసారి డిగ్రీలో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. మారుతున్న పరిశ్రమ అవసరాలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త కోర్సులను రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. కొత్త కోర్సుల ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 30 నాటికి దోస్త్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, విద్యార్థులు కొత్త కోర్సులకు కూడా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మూడు విడతల్లో దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రూ400 రిజిస్ట్రేషన్ ఫీజుతో మే 15 నుంచి రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే మే 31 నుంచి మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి జూన్ 27 వరకు నేరుగా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. జూన్ 29, 30 తేదీలలో డిగ్రీ ఓరియెంటేషన్ తరగతులు ఉంటాయని, జులై 1 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో దోస్త్ పరిధిలో 969 డిగ్రీ కాలేజీల్లో 4,40,107 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.గత ఏడాది 2,05,140 సీట్లు భర్తీ కాగా, 54 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయనని చెప్పారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జెఎన్‌టియుహెచ్, తెలంగాణ మహిళా యూనివర్సిటీ, జెఎన్‌టియుహెచ్, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే డిగ్రీ చేరాలనుకునే అభ్యర్థులకు దోస్త్ సింగిల్ విండోలాంటిది అని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గతంలో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న సమయంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే మళ్లీ మొదటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవలసి వచ్చేదని అన్నారు. ఈసారి ఆ సమస్య తలెత్తకుండా ట్యాబ్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఏదైనా కారణంతో రిజిస్ట్రేషన్ మధ్యలో అంతరాయం ఏర్పడినా ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇదీ దోస్త్ షెడ్యూల్ ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు రూ.200 ఫీజుతో మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు -ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం మే 14వ తేదీన మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు మే 15 నుంచి 25 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం మే 15 నుంచి 25 వరకు రూ.400 ఫీజుతో రెండవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు మే 15 నుంచి 26 వరకు రెండవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం మే 30వ తేదీన రెండవ విడత డిగ్రీ సీట్ల కేటాయింపు మే 31 నుంచి జూన్ 5 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం మే 31 నుంచి జూన్ 16 వరకు మూడవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు మే 31 నుంచి జూన్ 26 వరకు మూడవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం జూన్ 16వ తేదీన మూడవ విడత సీట్ల కేటాయింపు జూన్ 20 నుంచి 25 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం జూన్ 20 నుంచి 27 వరకు మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు నేరుగా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి -జూన్ 29,30 తేదీలలో విద్యార్థులకు కళాశాలల్లో ఒరియెంటేషన్ ఉంటుంది. జులై 1 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభం వాట్సాప్‌లో దోస్త్ సేవలు దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200 ద్వారా వాట్సాప్ చాట్‌బాట్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు ఈ వాట్సాప్ నెంబర్‌కు ‘Hi’ అని టైప్ చేసి పంపిస్తే దోస్త్ మెను వస్తుంది. అందులో విద్యార్థులు తమ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులు కోరితే వారి వాట్సాప్ నెంబర్‌కు ఒటిపి, ఇతర అలర్ట్ కూడా వస్తాయి. వీటితోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. దోస్త్ ఫేస్‌బుక్ పేజీ: facebook.com/dost.telangana దోస్త్ యూట్యూబ్ చానల్ : http://youtube.com/c/dost.telangana దోస్త్ ట్విట్టర్ ఖాతా : twitter.com/dost. telangana దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200 హెల్ప్ లైన్ నెంబర్ : 040 23120416 ...........................................................................................

మన తెలంగాణ 14 Apr 2026 3:30 am

సమ్మెకు వెళ్లొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) కార్మిక సంఘాలు ప్రేరేపిత సమ్మెకు వెళ్లవద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాల కు విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసి ఇ ప్పుడిప్పుడే గాడిలో పడుతున్న పరిస్థితుల్లో ఇ బ్బందులకు గురి చేయవద్దని కోరారు. పెం డింగ్ డీఏ ను ఇప్పటికే విడుదల చేశామని, పీఆర్సీపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ అంశంపై కమిటీ వేశామని, ప్రస్తుతం కమిటీ వద్ద ఈ రెండు అంశాలు పరిశీలనలో ఉన్నాయని అన్నారు. ఈ రెం డు ప్రధాన సమస్యలు మినహా మిగతా అం శాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సిబ్బందికి సంబంధించిన ఏ సమస్యలైనా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నగరంలోని ఖైరతాబాద్ రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాల గోడపత్రికను మంత్రి పొన్నం సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్ర త్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వికాస్ రా జ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, టిజిఎస్‌ఆర్‌టిసి ఎండి నాగిరెడ్డి, రవాణా శాఖ జెటిసిలు చంద్రశేఖర్ గౌడ్, రమేష్, శివ లిం గయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలని, తొందర పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తీసుకున్న సమ్మె ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. 13 నుంచి 18 వరకు రోడ్డు భద్రతపై అవగాహన ఈ నెల 13 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తం గా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ల క్ష్యంతో పోలీస్, రవాణా శాఖలు కలిసి అరైవ్-అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తె లిపారు. రవాణా నిబంధనలు, రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలపై చర్చించి, వా టిని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, రోడ్డు ప్ర మాదాలను తగ్గించే చర్యలు మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.  

మన తెలంగాణ 14 Apr 2026 3:00 am

మంగళవారం రాశి ఫలాలు (14-04-2026)

మేషం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృషభం నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉన్నది. మిధునం వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని విషయాలలో మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన ఋణయత్నాలు చెయ్యకపోవడం మంచిది. కర్కాటకం కుటుంబ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. సింహం వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కన్య కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన విజయం సాధిస్తారు. వృత్తి,ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తుల చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృశ్చికం సంతాన విద్యా విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ధనస్సు శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది. మకరం ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. కుంభం చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. మీనం ఆర్ధిక విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వలన శిరో బాధలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  

మన తెలంగాణ 14 Apr 2026 12:20 am

ఫ్యాక్ట్ చెక్: హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేయలేదు. అదొక ఫేక్ లెటర్

హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది

తెలుగు పోస్ట్ 14 Apr 2026 12:19 am

హైదరాబాద్ ఘన విజయం

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో వరుస విజయాలతోదూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది రెండో విజయం కాగా, రాజస్థాన్ తొలి ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (18)లు విఫలమయ్యారు. అయితే కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన ఇషాన్ 44 బంతుల్లోనే 6 సిక్స్‌లు, 8 ఫోర్లతో 91 ప రుగులు చేశాడు. క్లాసెన్ (40), నితీశ్ కుమా ర్ రెడ్డి (28), సలీల్ అరోరా 24 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. ప్రఫుల్, సాకిబ్ నాలుగేసి వికెట్లను పడగొట్టారు.

మన తెలంగాణ 14 Apr 2026 12:03 am

కెసిఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు

అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లీగల్ నోటీసు పంపించారు. మంత్రి తరఫున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఈ నోటీసు పంపించారు. నోటీసులో అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టిజిటిఎస్) నిర్వహించిందని, టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇందులో తన ప్రమేయం లేదని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొత్తం టెండర్ విలువ రూ.44.42 కోట్లే ఉన్నప్పటికీ, అందులో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం అసంబద్ధమని, ఇది పూర్తిగా ఆధారాలు లేని ఆరోపణ అని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో మొబైల్ ఫోన్‌ను రూ.11,650కే కొనుగోలు చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరకు టీజీటీఎస్ ద్వారా కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనల మేరకే టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని మంత్రి వివరించారు. దుష్ప్రచారానికి పార్టీ అధినేతగా కేసీఆరే బాధ్యత వహించాలి బీఆర్‌ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న దుష్ప్రచారానికి పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఈ మేరకు 48 గంటల్లో సోషల్ మీడియా పోస్టులను తొలగించి, బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీసులో హెచ్చరించారు. ప్రజా భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క, అంగన్వాడి మొబైల్ కొనుగోలు విషయంలో బీఆర్‌ఎస్ పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. వ్యక్తిగతంగా ఎవరైనా ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కానీ అవాస్తవాలను పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేయడం వల్లే ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు లీగల్ నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు తాను కెసిఆర్‌కు లీగల్ నోటీసు పంపించినట్టు గుర్తుచేశారు. తప్పును పదిసార్లు చెబితే నిజం కాదని అన్నారు. రూ.44 కోట్ల టెండర్లో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం హాస్యాస్పదమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడినప్పుడు తాను గట్టిగా సమాధానం ఇచ్చిన తరువాత తనపై దుష్ప్రచారం ప్రారంభమైందని మంత్రి సీతక్క గుర్తు చేశారు.

మన తెలంగాణ 13 Apr 2026 11:40 pm

మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం కాంగ్రెస్ డిఎన్‌ఏలోనే ఉంది: బిజెపి ఎంపీ లక్ష్మణ్

మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం కాంగ్రెస్ డిఎన్‌ఏలోనే ఉం దని బిజెపి ఒబిసి మోర్చా అధ్యక్షుడు, రాజ్యస భ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. మహిళా బిల్లుపై కాంగ్రెస్ దొంగ నీతికి పాల్పడుతున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ఎస్‌సి, ఎస్‌టిల రాజకీయ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతోందని ఆయన విమర్శించారు. నారీ శక్తి వందన్ అధినియంపై సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) అమలు విషయంలో సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని తీవ్రం గా విమర్శించారు. రాజకీ య లబ్ధి కోసమే ఈ చారిత్రాత్మక బిల్లును కాంగ్రెస్ అడ్డుకునే ప్రయ త్నం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.గత 30 ఏళ్లు గా ఏదో ఒక సాకుతో మహిళా బిల్లు ను కాంగ్రె స్ అడ్డుపడుతున్నదని ఆయన గుర్తు చేశారు. యూపీఏ హయాంలో సోనియా గాం ధీ మహి ళా చైర్ పర్సన్ గా ఉన్నప్పటికీ, కూ టమి పార్టీల పేరు చెప్పి వెనక్కి తగ్గారే తప్ప, మ హిళా సాధికారతపై, రిజర్వేషన్ల అమలుపై వారికి ఎప్పుడూ చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు.

మన తెలంగాణ 13 Apr 2026 11:18 pm

ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు మృతి

 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని నక్సల్ ప్రభావిత కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు సోమవారం నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో పార్థాపూర్ ఏరియా కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావో నేత రూపి అలియాస్ రంగబోయిన భాగ్య ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ఆమెపై గతంలో రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన రూపి, 2025 ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత విజయ్ రెడ్డి . ఎన్‌కౌంటర్ తరువాత సంఘటన స్థలం నుంచి ఒక ఆటోమేటిక్ తుపాకీతోపాటు విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాఖేచా వెల్లడించారు. కాల్పుల తరువాత మరో 10 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. వారి కోసం మాచ్‌పల్లి అడవుల్లో గాలింపు ముమ్మరం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌పై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ స్పందిస్తూ అడవుల్లో ఉన్న మావోయిస్టులకు సమయం చాలా తక్కువగా ఉందని, ఇప్పటికైనా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతి లోకి రావాలని హెచ్చరించారు. హతమైన రూపి స్వస్థలం తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంగా గుర్తించారు. ఆమె వయసు 46 సంవత్సరాలు. 2004లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆమె తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశారు. ఆ తరువాత అబూజ్‌మడ్ వంటి కఠినమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. తాజా సంఘటనతో ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇంతవరకు 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. గత ఏడాది రాష్ట్రంలో 285 మంది మావోయిస్టులు హతమయ్యారు. 

మన తెలంగాణ 13 Apr 2026 11:10 pm

అది రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ

మహిళా రిజర్వేషన్ బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజనే అత్యంత ముఖ్యమైన అంశమని కాంగ్రెస్ అగ్రనత, ఆ పార్టీ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డిలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత ప్రమాదకరమైనది మాత్రమే కాకుండా, రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. అంతేకాక ఎన్నికల సమయంలో ‘నారీ శక్తి వందనం అధినియమ్’ సవరణ బిల్లును తీసుకురావడం పైనా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుల అసలు ఉద్దేశ్యం మహిళల రిజర్వేషన్ కాదని, డిలిమిటేషన్ అంశమే ప్రధానమని సోనియా గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుల సంఖ్య పెంపుతో కూడిన డిలిమిటేషన్ రాజకీయంగా సమానత్వంతో ఉండాలని, కేవలం గణితపరమైన లెక్కలతో మాత్రమే నిర్ణయించకూడదని ఆమె స్పష్టం చేశారు. “రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై కేంద్రం తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ ప్రతిపాదన గురించి ప్రతిపక్షం ఒకసారి కాదు, ఇప్పటికే మూడుసార్లు కేంద్రానికి లేఖ రాసింది. అయినా అందరికీ ఉపయోగపడే ఈ అభ్యర్థనను ప్రధాని తిరస్కరించారు. దీనికి బదులుగా ప్రధానమంత్రి సంపాదకీయాల రాయడం, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తులు చేయడం, ఇతర సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ‘నా మాటే నెగ్గాలి’ అన్నట్లుగా ప్రధానమంత్రి వ్యవహరించడం విచారకరం. రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల వేళ ఈ అంశాలపై కేంద్రం పార్లమెంటులో చర్చ చేపట్టాలని చూస్తోంది అంటూ సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఉదృ్ధతంగా జరుగుతున్న సమయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ లాభం పొందడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆమె అన్నారు. ప్రతిపక్షాన్ని రక్షణాత్మక స్థితిలోకి నెట్టడానికే ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, సోనియా గాంధీ వ్యాసాన్ని ఉటంకిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా స్పందించారు. మహిళల రిజర్వేషన్ ప్రక్రియలో తొందరపాటు డిలిమిటేషన్ వల్ల అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.2023లో ఆమోదించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ ప్రకారం, మహిళల రిజర్వేషన్ అమలు తదుపరి జనగణన, డిలిమిటేషన్ పూర్తైన తర్వాతే అమలులోకి రావాల్సి ఉందని సోనియా గాంధీ గుర్తుచేశారు. అయితే ప్రతిపక్షం ఈ షరతును కోరలేదని, వెంటనే అమలు చేయాలని అప్పట్లో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారని తెలిపారు. ఇప్పుడేమో 2029 నుంచే మహిళల రిజర్వేషన్ అమలు చేయాలనే సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని, అయితే ఈ నిర్ణయానికి 30 నెలలు ఎందుకు పట్టిందని ఆమె ప్రశ్నించారు. కొన్ని వారాలు వేచి అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేయడంలో ఏమి ఇబ్బంది ఉందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల చివరి దశ (ఏప్రిల్ 29) అనంతరం అన్ని పార్టీల సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షం మూడుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ప్రభుత్వం తిరస్కరించిందని ఆమె తెలిపారు. బదులుగా వ్యాసాలు రాయడం, సమావేశాలు నిర్వహించడం ద్వారా ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. మహిళల రిజర్వేషన్ చట్టం 73వ, 74వ రాజ్యాంగ సవరణల ఆధారంగా ఏర్పడినదని, వాటి ద్వారా పంచాయతీలు, నగర పాలక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించారని ఆమె గుర్తుచేశారు. 2021లో జరగాల్సిన జనగణనను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల, జాతీయ ఆహార భద్రత చట్టం కింద సుమారు 10 కోట్ల మంది ప్రయోజనాల నుంచి దూరమయ్యారని సోనియా గాంధీ ఆరోపించారు. ఐదేళ్ల ఆలస్యానంతరం మాత్రమే జనగణన ప్రక్రియ ప్రారంభమవుతోందని ఆమె తెలిపారు.

మన తెలంగాణ 13 Apr 2026 11:00 pm

సముద్రంలో సమరం..

పశ్చిమాసియా యుద్ధం మరో మలుపు తిరిగింది. అమెరికా అన్నంత పని చేస్తోంది. ఇరాన్‌కు చెందిన హర్మూజ్ జలసంధితో పాటు అన్ని రేవులను దిగ్బంధం చేస్తామని హెచ్చరించినట్లుగానే సోమవారంనాడు ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇరాన్ పోర్టుల వైపు వచ్చి, వెళ్తున్న నౌకలను అడ్డుకోవడం ప్రారంభించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7గంటలకు అమెరికా వివిధ దేశాల నౌకలను దిగ్బంధించడం మొదలుపెట్టింది. ఇరాన్ పోర్టుల్లోకి వచ్చి వెళ్లే అన్ని దేశాల నౌకలను అమెరికా నావికాదళం అడ్డుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పాకిస్థాన్‌లో శాంతి చర్చల విఫలం తరువాత ప్రెసిడెంట్ ట్రంప్ హర్మూజ్ దిగ్బంధం తప్పదని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు అమెరికా నౌకాదళాలు చర్యకు దిగాయి. ఈ చర్యపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ సైన్యం పర్షియన్ గల్ఫ్ పోర్టులను దిగ్బంధిస్తుందని హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు బెదిరింపులు కుదరవని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జిసి ) ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ గల్ఫ్ వెంబడి భద్రత అనేది అందరికీ వర్తించేది లేదా ఎవరికి భద్రత ఉండకూడదని స్పష్టం చేశారు. హర్మూజ్‌పై నౌకల రాకపోకల భద్రతను తాము పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇప్పుడు ఇరాన్ రేవులు, తీర ప్రాంతాల బ్లాకేడ్‌కు రంగం సిద్ధం అయింది. ఇరాన్ నౌకలు ఏవీ అంగుళం కూడా కదలలేవని యుఎస్ దళాలు స్పష్ట చేశాయి. దీనికి ప్రతిగా ఇరాన్ తీవ్రస్థాయిలో స్పందించింది. వేరే శక్తులు హర్మూజ్‌కు చేరినా, రేవులను దిగ్బంధించినా మాడిపోవడం తథ్యం అని హెచ్చరించారు. . ఇరాన్ రేవులకు ఏ దేశం నౌకలు రాకుండా చేస్తాం. అక్కడి నుంచి కదలకుండా చేస్తామని , ఈ విషయంలో ఎటువంటి పక్షపాతం ఉండదని వ్యాఖ్యానించారు. అమెరికా బ్లాకేడ్ హెచ్చరికతో రెండు రోజులుగా హర్మూజ్ మీదుగా ఇంతకు ముందటి వరకూ కనీసం పరిమితంగా అయినా తిరిగిన నౌకలు కూడా కదలలేని పరిస్థితి తలెత్తింది . యుద్ధం ముందు హర్మూజ్ మీదుగా రోజుకు కనీసం 100 నుంచి 135 వరకూ వాణిజ్య నౌకలు తిరిగేవి. కాగా కాల్పుల విరమణ తరువాత రెండు మూడు రోజులు ఈ మార్గం మీదుగా 40 నౌకలు ప్రయాణించాయని మెరైన్ విశ్లేషక సంస్థ లాయడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ తెలిపింది. మరోవైపు ఈ దిగ్బంధనం సెగ భారత్‌ను కూడా తాకింది. హర్మూజ్ జలసంధి మీదుగా రావాల్సిన 15 భారత నౌకలు చిక్కుకుపోయినట్లు సమాచారం. వీటిలో అధికంగా ఎల్‌పిజి, ముడి చమురు ట్యాంకర్లు ఉన్నాయి. అమెరికా బ్లాకేడ్‌ను తాము సమ్మతించడం లేదని, ఇరాన్ రేవుల దిగ్బంధ చర్యల్లో తాము పాల్గొనేది లేదని బ్రిటన్ తెలిపింది. ఈ మేరకు దేశ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం ప్రకటన వెలువరించారు. హర్మూజ్‌లో సీ మైన్స్ తీసివేతకు బ్రిటన్ సహకరిస్తుందనే ట్రంప్ వాదనపై స్టార్మర్ స్పందించారు. ఈ విషయంలో తమ దేశం సహకరించవచ్చు. అయితే ముందుగా పోరు పూర్తిగా నిలిచిపోవల్సి ఉందని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 13 Apr 2026 10:51 pm

You’ll All Know, All I Said Is Right Or Not: Shaurya

Naga Shaurya will be seen in an out-and-out mass avatar in his upcoming flick Bad Boy Karthik, directed by Ramesh and produced by Srinivasa Rao Chintalapudi, Vijaya Kumar Chintalapudi and Dr. Ashok Kumar Chintalapudi. The film is up for release this week on April 19th. The producers shunned the rumours that they are in deep […] The post You’ll All Know, All I Said Is Right Or Not: Shaurya appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 10:44 pm

ఏడేండ్ల తరువాత భారత్‌కు ఇరాన్ క్రూడాయిల్

ఏడేండ్ల తరువాత ఇరాన్ ముడిచమురు సరుకు భారత్ తీర ప్రాంతానికి చేరింది. ఇరాన్ క్రూడాయిల్‌తో అతి భారీ వాహక నౌక ఫెలిసిటి ఆదివారం గుజరాత్ తీరంలోని సిక్కాకు చేరుకుంది. రెండు మిలియన్ క్రూడాయిల్ బ్యారెల్స్‌తో ఫిబ్రవరి చివరిలో ఇరాన్ ఖర్గ్ దీవి నుంచి ఈ నౌక బయలుదేరి, ఇప్పుడు క్షేమంగా ఇక్కడికి చేరింది. ఇక మరో చమురు నౌక జయ ఒడిషా తీరంలోని పరదీప్ వద్దకు చేరుకుంది. ఇందులో కూడా 2 మిలియన్ బ్యారెల్స్ సరుకు ఉంది. ఈ క్రూడాయిల్ సరఫరాకు దాదాపు ఏడేండ్ల క్రితం ఇరుదేశాల చమురు కంపెనీల మధ్య కాంట్రాక్టు కుదిరింది. అయితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షల దశలో చాలా కాలంగా సరఫరా నిలిచిపోయింది. ఇటీవలి కాలంలో ఇరాన్ చమురు తెప్పించుకునేందుకు వీలుగా అమెరికా ఆంక్షలు ఎత్తివేసింది. ఈ దశలో క్రూడాయిల్ రవాణాకు వీలేర్పడింది. 

మన తెలంగాణ 13 Apr 2026 10:30 pm

టిసిఎస్‌లో లైంగిక వేధింపులు..ఏడుగురు ఉద్యోగులపై వేటు

ప్రముఖ టెక్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టిసిఎస్)లో లైంగిక వేధింపుల ఘటన సంచలనం రేపుతోంది. నాసిక్ క్యాంపస్‌లో జరిగిన ఈ వ్యవహారంలో ఏడుగురు ఉద్యోగులపై సంస్థ వేటు వేసింది. మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో హెచ్‌ఆర్ మేనేజర్ కూడా ఉన్నారు. అరెస్టయిన ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు టిసిఎస్ సోమవారంనాడుఒక ప్రకటనలో తెలిపింది. నాసిక్ క్యాంపస్‌కు చెందిన ఓ ఉద్యోగిని తన సహోద్యోగి పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ క్రమంలో మరికొందరు ముందుకు వచ్చి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు ఇచ్చారు. హెచ్‌ఆర్ మేనేజర్ సహా ఎవరూ పట్టించుకోకపోవడంతో పోలీసులు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు. మారువేషంలో క్యాంపస్‌లోకి ప్రవేశించారు. ఓ మహిళా ఉద్యోగిని మరో ఉద్యోగి వేధిస్తున్నది వారి కంట పడింది.ఈ కేసు విచారణ క్రమంలో మిగతా ఫిర్యాదులపై కూడా దర్యాప్తు జరిపారు. సిసిటివి ఫుటేజీలను పరిశీలించిన హెచ్‌ఆర్ మేనేజర్ అసిఫ్ అన్సారీ, షఫీ షేక్, రజా మేమన్, తౌసిక్, షారుఖ్, డానిష్ షేక్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. వీరు సహోద్యోగులను అనుచితంగా తాకడం, అసభ్యంగా ప్రవర్తించడం, మాంసాహారం తినమని బలవంతం చేయడం ఇలాంటివి గుర్తించారు. ఈ ఘటనపై కేంద్ర కార్మిక శాఖకు ఐటి ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. మరోవైపు నాసిక్ క్యాంపస్ వ్యవహారంపై టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పందించారు. బాధ్యులైన వ్యక్తులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, చీఫ్ ఆపరేటింగ్ అధికారి నేతృత్వంలో సమగ్ర విచారణకు కూడా ఆదేశించినట్లు తెలిపారు.

మన తెలంగాణ 13 Apr 2026 10:20 pm

ఈ నెల 20న జగిత్యాలలో కెసిఆర్ బహిరంగ సభ

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలను ప్రకటించారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ, సభ విజయవంతం కోసం సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్‌చార్జిలను కేటీఆర్ ఖరారు చేశారు. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిల వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల నియోజకవర్గానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గానికి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి ఎమ్మెల్సీ ఎల్. రవీందర్ రావు, వేములవాడ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, చొప్పదండి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలను నియమించారు. సభకు వచ్చే జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో ఉండి సభ ముగిసే వరకు అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తారని కేటీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 13 Apr 2026 10:10 pm

రాష్ట్రంలో మోగిన సమ్మె సైరన్

 రాష్ట్రంలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుండి సమ్మె చేస్తున్నట్టు టిజిఎస్ ఆర్‌టిసి జెఎసి ప్రకటించింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె అనివార్యమయ్యిందని వెల్లడించింది. మార్చి 13న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం నుంచి కాని, యాజమాన్యం నుండి కాని ఎలాంటి స్పందన లేదని తెలిపింది. యాజమాన్యం, ప్రభుత్వం ముందు 32 డిమాండ్లు పెట్టినట్లు తెలిపారు. ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని జెఎసి చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి మౌలనా డిమాండ్ చేశారు. ఏప్రిల్ 22న మొదటి డ్యూటీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు జెఎసి నేతలు వెల్లడించారు. ఈ జెఎసి వెనుక 40 వేల మంది కార్మికుల బలం ఉందని చెప్పారు. కార్మికులంతా ఏకతాటిపై ఉన్నారని, విభజించు పాలించు అనే ధోరణి ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కమిటీ వేశామంటూ కాలయాపన చేయొద్దని, ఆ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము అడుగుతున్నామని చెప్పారు. కొత్త కోర్కెలేవీ కోరడం లేదన్నారు. ఖాళీగా ఉన్న అన్ని కేటగిరీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను ఇబ్బంది పెట్టే బదిలీలు ఆపి, ఎక్కడి వారిని అక్కడే ఉంచాలన్నారు. సోమవారం కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి కార్మిక సంఘాలు, పాల్గొనగా వరుసగా రెండో సారి ఆర్‌టిసి యాజమాన్యం హాజరు కాకపోవడంతో ఎలాంటి చర్చలు జరగలేదు. దీంతో జెఎసి నేతలు ఈ నెల 22 నుండి సమ్మెకు వెళుతున్నట్లు జెఎసి నేతలు ఈదురు వెంకన్న, ధామస్ రెడ్డి, ఎండి మౌలానా పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 13 Apr 2026 10:00 pm

ఇప్పటి వరకు 3.80 లక్షల పాస్‌బుక్‌ల జారీ: మంత్రి పొంగులేటి

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పునర్నిర్మిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ హక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతి రహిత సేవలు సామాన్యుడికి సులభంగా అందేలా గత ఏడాది తీసుకొచ్చిన భూ భారతి చట్టం తెలంగాణ చరిత్రలో కీలక సంస్కరణగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో నిజాం కాలం నుంచి 378 గ్రామాలను నక్షాలు లేవని మంత్రి  చెప్పారు. ఇందులో ఐదు గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి భూధార్ నెంబర్ కేటాయించామన్నారు. మిగిలిన 373 గ్రామాల్లో రోవర్స్ వంటి ఆధునిక సర్వే సాంకేతికతను ఉపయో గించి రీసర్వే పనులు కొనసాగిస్తున్నామన్నారు. జిల్లాకు 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సర్వే చేపట్టబోతున్నామని, సర్వే అనంతరం హద్దులను గుర్తించి భూధార్ నంబర్ ఇస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు వినియోగంలో ఉండగా,అప్పటి నుంచి ఇప్పటివరకు 77 సంవత్సరాల్లో 2.99 కోట్లకు చేరాయన్నారు.వీటికి భూధార్ నంబర్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారుచేస్తున్నామన్నారు. గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం వీలైనంత వరకు వినియోగించుకుంటు న్నామన్నారు. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశామన్నారు. త్వరలో మరో 400 కొనుగోలు చేయబోతున్నాం. భూ భారతి పోర్టల్ ప్రారంభించిన గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు 3.80 లక్షల పాస్‌బుక్‌లు జారీ చేసినట్లు వివరించారు.

మన తెలంగాణ 13 Apr 2026 9:40 pm

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం: సిఎం రేవంత్‌రెడ్డి

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బిజెపికి తాత్కాలికంగా లాభం జరగవచ్చు, కానీ, దీర్ఘకాలంలో దేశానికి నష్టమని సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్ (ఎక్స్‌లో) పేర్కొన్నారు. ఈ మేరకు డీలిమిటేషన్ విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ వేర్వేరు అంశాలని, మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామని, కానీ, మహిళా రిజర్వేషన్లను ఒక ముసుగుగా ఉపయోగించి జనాభా ఆధారితంగా లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్‌ను ముందుకు తీసుకురావడం సరికాదన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం ముఖ్యమని డీలిమిటేషన్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై జాతీయ ఏకాభిప్రాయం అవసరమని ఈ విషయంలో అన్ని పార్టీలతో చర్చించాలని ఆయన సూచించారు. ప్రత్యామ్నాయ నమూనాలను సైతం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి షేర్ చేశారు. డీలిమిటేషన్‌కు జీఎస్టీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) పార్ములాను సూచించారు. ప్రగతిశీల రాష్ట్రాలకు పొలిటికల్ డివిడెంట్ దక్కాలని 50 -50 గ్రోత్ ఫార్ములాను సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. లోక్ సభ సీట్ల పెంపులో దక్షిణాధి రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, జనాభా ప్రాతిపదికన కాకుండా దేశ వృద్ధిలో ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న అంశాల ఆధారంగా సీట్ల పెంపు చేపట్టాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారు.

మన తెలంగాణ 13 Apr 2026 9:30 pm

చెలరేగిన ఇషాన్.. రాజస్థాన్ కు భారీ టార్గెట్

హైదరాబాద్‌: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్(91) భారీ అర్ధ శతకంతో చెలరేగాడు. ఇషాన్ తోపాటు క్లాసెన్ (40), నితీశ్ రెడ్డి (28), సలీల్(23 నాటౌట్) రాణించారు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. 

మన తెలంగాణ 13 Apr 2026 9:22 pm

ఆదివాసీ, గిరిజనుల... అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

హైదరాబాద్: ఆదివాసీ, గిరిజ‌న, ఏజెన్సీ ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధికి అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కు అడ్డంకిగా ఉన్న స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారం పైన ప్ర‌త్యేక దృష్టి సారిస్తాన‌ని ఆయ‌న తెలిపారు. ఆదివాసీ, గిరిజ‌న‌,ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి ప‌నుల పైన మంత్రి సీత‌క్క నేతృత్వంలో గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేల బృందం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో క‌లిసి ప‌లు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. ఆదివాసీ, గిరిజ‌నుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాం ల నిర్మాణంపైన దృష్టి సారిస్తామ‌ని వారికి సీఎం హామీ ఇచ్చారు. వీటి ద్వారా తాగు, సాగు నీటి అవ‌స‌రాల‌ను తీర్చ‌వ‌చ్చున‌ని ఆయ‌న అన్నారు. చెక్ డ్యాం లు, ర‌హ‌దారుల నిర్మాణం కోసం అట‌వీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు. వీలైనంత త్వ‌ర‌గా అట‌వీ శాఖ నుంచి అనుమ‌తులు వ‌చ్చేలా చూస్తాన‌న్నారు. ఆదివాసీ,గిరిజ‌న రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేయ‌డానికి అనుమ‌తులు ఇవ్వాల‌ని చేసిన విజ్ఝ‌ప్తికి ముఖ్య‌మంత్రి సానుకూలంగా స్పందించారు. అట‌వీశాఖ అభ్యంత‌రాల వ‌ల్ల ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌త్తులు ఆల‌స్యం అవుతాయ‌ని, కొన్ని చోట్ల కొత్త ర‌హ‌దారులకు అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని వారు సీఎం దృష్టికి తీసుకువ‌చ్చారు. వీలైనంత త్వ‌ర‌గా వీటిపైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి అట‌వీ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. ఆదివాసీ, గిరిజ‌న ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల కోటా పెంచే విష‌యాన్ని ప‌రిశీలిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వారికి హామీ ఇచ్చారు.ఐటీడీఏ ల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌న్న ముఖ్య‌మంత్రి ఆదివాసీ, గిరిజ‌నులకు అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. 

మన తెలంగాణ 13 Apr 2026 9:11 pm

సుప్రీంకోర్టులో లాలూకు నిరాశ

ఆర్‌జెడి చీప్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. భూములకు ఉద్యోగాలు ఇచ్చారనే కేసులో తనపై, తన కుటుంబ సభ్యులపై సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ లాలూ వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు తోసిపుచ్చింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటేశ్వర సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. కేసులో మెరిట్స్‌ను పరిశీలించే అధికారాన్ని ట్రయిల్ కోర్టుకే విడిచిపెడుతూ, చట్టప్రకారం విచారణ కొససాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. అయితే ట్రయల్ కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి లాలూకు మినహాయింపు ఇచ్చింది. ఈకేసులో ఇంతకుముందు లాలూ ప్రసాద్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తలిగింది. సీబీఐ తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ లాలూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని కోర్టు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని లాలూ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపైనే సుప్రీం తాజా తీర్పు చెప్పింది.  

మన తెలంగాణ 13 Apr 2026 9:10 pm

మహిళల వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ పెంపు

ఈ ఏడాది జరిగే మహిళల టి20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భారీగా పెంచింది. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇందులో 12 జట్లు పోటీ పడుతున్నాయి. అయితే గతంతో పోల్చితే ఈసారి ప్రైజ్‌మనీని పెద్ద మొత్తంలో పెంచారు. 2024లో రూ. 70 కోట్లకు పైగా ఉన్న నగదు బహుమతిని ఈసారి 10 శాతం పెంచింది. 2026 ఎడిషన్‌లో 8,764,615 డాలర్లకు పెంచారు. దీంతో ఈ వరల్డ్‌కప్‌లో వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ రూ.81 కోట్లకు చేరింది. విజేతగా నిలిచే జట్టుకు రూ.21.8 కోట్లు అందజేస్తారు. రన్నరప్ టీమ్‌కు రూ. 10 కోట్లు దక్కుతాయి. సెమీస్‌లో ఓడిన జట్లకు రూ.6 కోట్ల చొప్పున అందిస్తారు. ఇక గ్రూప్ దశలో గెలిచిన ప్రతి జట్టుకు రూ.29 లక్షలు అందజేస్తారు.ఇక టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి జట్టుకు కనీస హామీగా రూ.2.3 కోట్లు చెల్లించాలని ఐసిసి నిర్ణయించింది. కొన్నేళ్లుగా పురుషుల క్రికెట్‌కు సమానంగా మహిళలకు కూడా ఐసిసి భారీ మొత్తంలో నగదు బహుమతిని ఇస్తోంది. ఇది మహిళా క్రికెట్ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మన తెలంగాణ 13 Apr 2026 9:04 pm

కేంద్రం, 19 రాష్ట్రాలను ఒక్కదాన్నే ఎదుర్కోగలను: సిఎం మమత

 కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలపై సిఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. తనను ఓడించడానికి 19 రాష్ట్రాలు, కేంద్రం కలిసి కట్టుగా వచ్చాయని, కానీ ఒంటిచేత్తో వారందరినీ ఎదుర్కొంటున్నాని అన్నారు. సోమవారంనాడిక్కడ ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 226 సీట్లు సాధించబోతుందన్నారు. యువతను ప్రభావితం చేయడానికి ప్రధాని మోడీ మన్ కీ బాత్‌ను పదేపదే ప్రసారం చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులతో డబ్బు మూటలు ఇచ్చి రాష్ట్రంలో ఓటర్లకు పంచి మభ్యపెడుతున్నారని మమత ఆరోపించారు. బీహార్ నుంచి రైళ్లు, బస్సుల్లో ఓటర్లను తరలిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సహా 19 రాష్ట్రాల బిజెపి నేతలు కలిసి వచ్చినా వారందరికి తాను ఒక్కదాన్నే సమాధానం చెప్పగలన్నారు. సామాన్య ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడుతానని మమత పేర్కొన్నారు. 

మన తెలంగాణ 13 Apr 2026 9:00 pm

పవర్‌ఫుల్ లుక్‌లో ఎన్టీఆర్..

స్టార్ హీరో - ఎన్టీఆర్, ‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న సినిమా ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్). కాగా ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ రద్దయిందన్న వదంతులను చిత్ర నిర్మాతలు ఖండించారు. తాజాగా ఫ్యాన్స్ ఉత్సాహానికి మరింత జోష్‌ని జోడిస్తూ, ఒక పవర్‌ఫుల్ జిమ్ ఫోటోతో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను ఆశ్చర్యపరిచారు. విశాలమైన భుజాలు, సన్నని నడుముతో ధృఢమైన ఫిజిక్‌లో ఎన్టీఆర్ కనిపించడం విశేషం. మొత్తానికి క్లాసిక్ బ్యాక్ డబుల్ బైసెప్స్ పోజులో ఎన్టీఆర్ బ్యాక్ ఫోటో నిజంగా అదిరింది. ఇక ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది. ఆయన తీసిన కేజిఎఫ్, సలార్ ఇలాగే సాగాయి. కాబట్టి, ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కూడా ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ పిక్చరైజేషన్ తోనే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట. పైగా బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా సినిమాలో కనిపించదట. మరి ప్రశాంత్ నీల్ అంత కలర్ ఫుల్ గా ఏం తీస్తున్నాడో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది.

మన తెలంగాణ 13 Apr 2026 8:56 pm

ఆస్పత్రి నుంచి మహిళా ఖైదీ పరార్

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళా ఖైదీ పరారైన సంఘటన పేట్లబుర్జు మెటర్నిటీ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. గంటసాల త్రివేణి(26) చంచల్‌గూడ జైలులో ఖైదీగా ఉంది. త్రివేణి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పేట్లబుర్జు మెటర్నిటీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. సెక్యూరిటీగా ఎఆర్ కానిస్టేబుళ్లు వచ్చారు. సెక్యూరిటీ గార్డుల కళ్లు కప్పి త్రివేణి ఆస్పత్రి నుంచి పరారయ్యారు. పోలీసులు హుస్సేనీ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 13 Apr 2026 8:50 pm

థానెలో ఘోర రోడ్డు ప్రమాదం..11మంది దుర్మరణం

మహారాష్ట్రలోని థానె జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ముర్బాద్ సమీపంలోని రైతా వంతెన వద్ద ఓ వ్యాన్, సిమెంట్ మిక్సర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కల్యాణ్ నుంచి ముర్బాద్‌కు వెళ్తున్న వ్యాన్ సిమెంట్ మిక్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లో ఉన్న 13 మందిలో 11మంది చనిపోగా, మరో ఇద్దరికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 8 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులకు ఉల్లాస్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల్లో పలువురిని గుర్తించామని, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించనున్నట్లు తెలిపారు. 

మన తెలంగాణ 13 Apr 2026 8:38 pm

కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసు

ఓటింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లను (డూప్లికేట్ ఓటింగ్) నివారించేందుకు ఫింగర్ ప్రింట్, ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మాల్యా బఘ్చిలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈ అభ్యర్థనను వర్తింపజేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో జరిగే పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికలకు ఈ విధానాన్ని అమలు చేయాలా అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై కేంద్రం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇతర రాష్ట్రాల నుంచి సమాధానాలు కోరుతూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఉపాధ్యాయ్ వ్యక్తిగతంగా హాజరై వాదనలు వినిపిస్తూ, ఈ విధానం అమలైతే లంచాలు, ప్రాక్సీ ఓటింగ్ వంటి అక్రమాలు తగ్గుతాయని తెలిపారు. అయితే, ఈ విధానాన్ని అమలు చేయడానికి చట్టాలలో విసృ్తత మార్పులు అవసరమవుతాయని, భారీ ఆర్థిక వ్యయం కూడా ఉంటుందని బెంచ్ వ్యాఖ్యానించింది.పిటిషన్ ప్రకారం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలను వినియోగించి ఫింగర్, ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను ప్రవేశపెట్టవచ్చని పేర్కొంది. దీంతో ఓటర్ల గుర్తింపును బలోపేతం చేయడంతో పాటు డూప్లికేట్, గోస్ట్ ఓటింగ్ వంటి సమస్యలను నివారించవచ్చని వాదించింది. ప్రస్తుతం ఓటర్ల గుర్తింపు ఓటర్ ఐడీ కార్డులు, మాన్యువల్ ధృవీకరణపై ఆధారపడుతోందని, పాత ఫొటోలు, లిపి పొరపాట్లు, రియల్ టైమ్ ధృవీకరణ లేకపోవడం వంటి కారణాల వల్ల దుర్వినియోగానికి అవకాశం ఉందని పిటిషన్ పేర్కొంది. బయోమెట్రిక్ విధానం ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనదిగా ఉండటంతో ‘ఒక పౌరుడు ఒక ఓటు’ సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయవచ్చని తెలిపింది.  దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి ఉన్నందున, వివిధ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాల్లో అసమానతలు ఏర్పడుతున్నాయని కూడా పిటిషన్ పేర్కొంది. ఫింగర్, ఐరిస్ గుర్తింపు ద్వారా రియల్ టైమ్ ధృవీకరణ సాధ్యమవుతుందని, ఓటింగ్ కేంద్రాల్లో డిజిటల్ రికార్డు కూడా ఏర్పడుతుందని వివరించింది. ఇక యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న ఆధార్ వ్యవస్థను ఉదాహరణగా చూపుతూ, బ్యాంకింగ్, సంక్షేమ పథకాల అమల్లో ఇది మోసాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో బయోమెట్రిక్ ధృవీకరణను ప్రవేశపెట్టడం తగినదిగా, సమర్థవంతమైన చర్యగా ఉంటుందని పిటిషన్ అభిప్రాయపడింది.

మన తెలంగాణ 13 Apr 2026 8:35 pm

ఉత్కంఠ.. హార్మూజ్ దగ్గర చిక్కుకుపోయిన 15 భారత నౌకలు..

ఇరాన్-అమెరికా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. అరేబియా గల్ఫ్ తో పాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోని ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించడంతో నౌకల రాకపోకలపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధి దగ్గర 15 భారతీయ నౌకలు చిక్కుకున్నాయి. ఇందులో గ్యాస్ కారియర్లు, క్రూడాయిల్ ట్యాంకర్ల పాటు ఓ కెమికల్ కంటైనర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన మొత్తం 15 భారత జెండా నౌకలను వెనక్కి తీసుకురావడానికి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. మేము, విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ, మా నౌకలను వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. హోర్ముజ్ జలసంధి నుండి మా నౌకలు ప్రయాణించడం సాధ్యమైన వెంటనే, ఆ నౌకలు తిరిగి వస్తాయి అని ముఖేష్ తెలిపారు.

మన తెలంగాణ 13 Apr 2026 8:23 pm

చెలరేగిన ఆర్ఆర్ బౌలర్లు.. కష్టాల్లో సన్‌రైజర్స్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లోపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు ఎస్ఆర్‌హెచ్ జట్టును బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన హైదరాబాద్‌ జట్టుకు తొలి బంతికే షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ(0) తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్.. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 55 పరుగులు జోడించారు. అయితే రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ (18) ఔట్ కావడంతో ఈ జోడీకి బ్రేక్ పడింది. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఇషాన్(48), క్లాసెన్(6) ఉన్నారు.

మన తెలంగాణ 13 Apr 2026 8:16 pm

NTR is not in a Hurry

NTR is completely occupied with Prashanth Neel’s project Dragon. Like never before, there are heaps of speculations about the film. The makers have issued clarifications several times to condemn the rumors. For Tarak’s birthday on May 20th, fans predicted that a short teaser or a video glimpse from Dragon will be released. But there is […] The post NTR is not in a Hurry appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 8:15 pm

Allu Arjun Raaka Movie: అల్లు అర్జున్ సినిమాకి అతనే మైనస్ అవుతాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాకా’. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబందించిన టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే, ఎన్నో అంచనాలున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ అయ్యాక మాత్రం టోటల్ నెగిటివ్ టాక్ వినిపించింది. అది బన్నీ విషయంలో కాదు, దర్శకుడు అట్లీ విషయంలో కాదు. మరి, ఎవరి విషయంలో..పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళి చూద్దాం. […] The post Allu Arjun Raaka Movie: అల్లు అర్జున్ సినిమాకి అతనే మైనస్ అవుతాడా? appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 13 Apr 2026 8:14 pm

సముద్ర యుద్థానికి రంగం సిద్ధం ?

పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు మలుపు తిరిగింది. ఇరాన్‌కు చెందిన అన్ని రేవుల దిగ్బంధం చేస్తామని తీర ప్రాంత బ్లాకేడ్‌కు దిగుతామని అమెరికా సైన్యం సోమవారం ప్రకటించింది. అంతకు ముందు పాకిస్థాన్‌లో శాంతి చర్చల విఫలం తరువాత ప్రెసిడెంట్ ట్రంప్ హర్మూజ్ దిగ్బంధం తప్పదని హెచ్చరించారు. పైగా ఇరాన్ నౌకలు ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని తమ సముద్ర మార్గ యుద్ధ వ్యూహం వెలువరించారు. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు అమెరికా నౌకాదళాలు రంగంలోకి దిగాయి.ఈ చర్యపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా ఈ చర్యలకు దిగితే తమ సైన్యం పర్షియన్ గల్ఫ్ పోర్టులను దిగ్బంధిస్తుందని హెచ్చరించారు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు బెదిరింపులు కుదరవని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జిసి ) ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ గల్ఫ్ వెంబడి భద్రత అనేది అందరికీ వర్తించేది లేదా ఎవరికి భద్రత ఉండకూడదని స్పష్టం చేశారు. హర్మూజ్‌పై నౌకల రాకపోకల భద్రతను తాము పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇప్పుడు ఇరాన్ రేవులు, తీర ప్రాంతాల బ్లాకేడ్‌కు రంగం సిద్ధం అయింది. చర్చల విఫలం తరువాత ఇరాన్, అమెరికాలు ఇప్పుడు మరింత తీవ్రస్థాయిలో తలపడేందుకు కసరత్తులు చేపట్టాయి. ఇరాన్ నౌకలు ఏవీ అంగుళం కూడా కదలలేవని యుఎస్ దళాలు స్పష్ట చేశాయి.దీనికి ప్రతిగా ఇరాన్ తీవ్రస్థాయిలో స్పందించింది. వేరే శక్తులు హర్మూజ్‌కు చేరినా, రేవులను దిగ్బంధించినా మాడిపోవడం తథ్యం అని హెచ్చరించారు. అయితే యుఎస్ సెంట్రల్ కమాండ్ ( సెంట్‌కామ్) దీనిని పట్టించుకోకుండా తమ తీవ్రస్థాయి చర్యలు సోమవారం ఆరంభమవుతాయని ప్రకటించింది. ఇరాన్ రేవులకు ఏ దేశం నౌకలు రాకుండా చేస్తాం. అక్కడి నుంచి కదలకుండా చేస్తామని , ఈ విషయంలో ఎటువంటి పక్షపాతం ఉండదని వ్యాఖ్యానించారు. అరేబియా గల్ఫ్ , ఒమన్ గల్ఫ్ వెంబడి ఉన్న ఇరాన్ రేవులు, తీర ప్రాంతాల్లో ఎటువంటి నౌకా రవాణా లేకుండా చేసి తీరుతామని ప్రకటించారు. ట్రంప్ అత్యున్నత స్థాయి వ్యూహంలో భాగంగానే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ కీలక నిర్ణయం అమలుకు దిగినట్లు స్పష్టం అయింది. అంతకు ముందు ట్రంప్ హర్మూజ్ మొత్తం దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అయితే ఇందుకు కొంచెం సడలింపుగా యుఎస్ కమాండ్ వర్గాలు తాము ఇరానేతర రేవుల నుంచి హర్మూజ్ మీదుగా నౌకలు వెళ్లేందుకు ఇంతకు ముందులాగానే వీలు కల్పిస్తామని తెలిపారు. బ్లాకేడ్ హెచ్చరికతో రెండు రోజులుగా హర్మూజ్ మీదుగా ఇంతకు ముందటి వరకూ కనీసం పరిమితంగా అయినా తిరిగిన నౌకలు కూడా కదలలేని పరిస్థితి తలెత్తింది . యుద్ధం ముందు హర్మూజ్ మీదుగా రోజుకు కనీసం 100 నుంచి 135 వరకూ వాణిజ్య నౌకలు తిరిగేవి. కాగా కాల్పుల విరమణ తరువాత రెండు మూడు రోజులు ఈ మార్గం మీదుగా 40 నౌకలు ప్రయాణించాయని మెరైన్ విశ్లేషక సంస్థ లాయడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ తెలిపింది. బ్లాకేడ్‌కు మేం దూరం ః బ్రిటన్ అమెరికా బ్లాకేడ్‌ను తాము సమ్మతించడం లేదని, ఇరాన్ రేవుల దిగ్బంధ చర్యల్లో తాము పాల్గొనేది లేదని బ్రిటన్ తెలిపింది. ఈ మేరకు దేశ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం ప్రకటన వెలువరించారు. హర్మూజ్‌లో సీ మైన్స్ తీసివేతకు బ్రిటన్ సహకరిస్తుందనే ట్రంప్ వాదనపై స్టార్మర్ స్పందించారు. ఈ విషయంలో తమ దేశం సహకరించవచ్చు. అయితే ముందుగా పోరు పూర్తిగా నిలిచిపోవల్సి ఉందని స్పష్టం చేశారు. హర్మూజ్ మూసివేతకు కాకుండా, ఈ మార్గం పూర్తి స్థాయి రీ ఓపెన్‌కు బ్రిటన్ సైనిక శక్తిని వినియోగించడం జరుగుతుందని వివరించారు. ఈ విషయంలో తమ దేశం పలు దేశాలతో చర్చిస్తోంది. ఏ విధంగా హర్మూజ్‌ను తిరిగి రాకపోకలకు తెరవాలి, ఈ కీలక చమురు మార్గం మీదుగా నౌకలు ముందుకు పాగాలనే వ్యూహాలను ఇతరులతో కలిసి ఖరారు చేసుకుంటామని, ఇందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో పలు దేశాలు ముందుకు వచ్చాయని తెలిపారు. చర్చలతో శాంతి : ఆగ్నేయాసియా కూటమి ఇక శాంతి చర్చల ప్రక్రియ కొనసాగేలా చూడాలని ఆగ్నేయాసియా దేశాలు ఇరాన్, అమెరికాలకు విజ్ఞప్తి చేశాయి. కాల్పుల విరమణ జరగాలి. హర్మూజ్ మీదుగా నౌకా, విమాన రాకపోకలు సురక్షితంగా సాగేలా చూడాల్సి ఉందని తెలిపారు. 11 దేశాల కూటమి విదేశాంగ మంత్రులు ఇండోనేసియాలో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. తరువాత ప్రకటన వెలువరించారు. అమెరికా, ఇరాన్‌లకు తక్షణ సందేశం పంపించారు. ఇప్పటి యుద్ధం, హర్మూజ్ ఇతర పరిస్థితులతో పెరుగుతున్న చమురు ధరలు ఇతర పరిణామాలపై విస్తృతరీతిలో సమీక్షించారు. ప్రపంచ సంక్షభ దశలో ఆగ్నేయాసియా దేశాలు ఏ విధంగా స్పందించాలి? సహకరించుకోవాలి? అనే విషయాలపై చర్చించారు.

మన తెలంగాణ 13 Apr 2026 8:09 pm

129 Tonnes of Adulterated Food Seized in Hyderabad, Sajjanar Reviews H-FAST Drive

Hyderabad Police have seized 129.34 tonnes of adulterated food products and booked 117 cases since February as part of a citywide crackdown led by the H-FAST unit. Police Commissioner V. C. Sajjanar on Monday visited the H-FAST office in Begum Bazaar and reviewed the unit’s enforcement operations, infrastructure and field performance. During the inspection, he […] The post 129 Tonnes of Adulterated Food Seized in Hyderabad, Sajjanar Reviews H-FAST Drive appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 8:05 pm

Bhu Bharati Marks One Year, Over 52 Million Visits to Telangana Land Portal

Telangana Revenue Minister Ponguleti Srinivasa Reddy said the state’s Bhu Bharati Act has completed one year, calling it a landmark reform in land governance and a major step toward transparency, protection of land rights, and citizen-friendly revenue services. Reviewing the implementation of the Act at the Secretariat on Monday, the minister said the government under […] The post Bhu Bharati Marks One Year, Over 52 Million Visits to Telangana Land Portal appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 8:02 pm

బిహార్‌లో బీజేపీ తొలి ముఖ్యమంత్రి ఎవరు?

 బిహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన తొలి ముఖ్యమంత్రిని మంగళవారం ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు వెల్లడించారు. అధికార బదిలీ ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌చౌహాన్ పట్నాకు రానున్నట్లు సమాచారం. నూతన శాసనసభ పక్ష నాయకుడి ఎన్నిక కోసం కేంద్ర పరిశీలకుడిగా నియమితులైన చౌహాన్, రాష్ట్ర పర్యటనకు రానున్న రోజు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్, ఉదయం 11 గంటలకు జరగనున్న చివరి కేబినెట్ సమావేశం అనంతరం గవర్నర్‌ను కలసి రాజీనామా సమర్పించనున్నట్లు సమాచారం. బీజేపీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సారోగి మాట్లాడుతూ, శివరాజ్ సింగ్ చౌహాన్ రేపు పట్నాకు వస్తారు. ఆయన సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు అని తెలిపారు. అయితే, అధికార మార్పిడి నేపథ్యంలో పార్టీ నేతలు జాగ్రత్తగా స్పందిస్తున్నారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ, ఇది భావోద్వేగ క్షణం. నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాం అని అన్నారు. 243 సభ్యుల బిహార్ అసెంబ్లీలో ఎన్డీఏకు 202 సీట్లతో ఘన మెజారిటీ ఉంది. ఇందులో బీజేపీకి 89 సీట్లు ఉండగా, జేడీయూకు 85 సీట్లు ఉన్నాయి. మిగతా సీట్లను చిన్న మిత్రపక్షాలు ఆక్రమించాయి. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌చౌదరి పేరు ముందంజలో ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయన గతంలో ఆర్జేడీ, జేడీయూ పార్టీల్లో పని చేసిన నేపథ్యాన్ని కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌పేరు కూడా వినిపిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త ముఖ్యమంత్రి ఓబీసీ లేదా దళిత వర్గానికి చెందినవారే అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. బిహార్ రాజకీయాల్లో సామాజిక సమీకరణలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. మరోవైపు, నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ రాజకీయ ప్రవేశంపై కూడా చర్చ జరుగుతోంది. ఇటీవలే జేడీయూలో చేరిన ఆయనను ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని కొందరు భావిస్తుండగా, అనుభవం సంపాదించిన తరువాతే పెద్ద బాధ్యతలు ఇవ్వాలని మరో వర్గం అభిప్రాయపడుతోంది. ఇక నితీష్ కుమార్ కుటుంబం అధికారాన్ని కోల్పోయే పరిస్థితిని సమన్వయంగా స్వీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అధికార నివాసమైన అన్నే మార్గ్ నుంచి వారి సామగ్రి తరలింపు జరుగుతుండగా, త్వరలోనే ఆ నివాసంలో కొత్త ముఖ్యమంత్రి ప్రవేశించనున్నారు.

మన తెలంగాణ 13 Apr 2026 8:00 pm

ఒక్క మహిళనూ అధ్య‌క్షురాలిగా నియామించలేదు: సిఎం

భార‌తీయ జ‌న‌తా పార్టీ...అధ్య‌క్షురాలిగా ఒక్క మ‌హిళ నియామ‌కం జ‌ర‌గ‌లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1980 ఏప్రిల్ 6 బిజెపి ఏర్పాటైందని.. అప్పటి నుంచి మొత్తం 15 మంది బిజెపి అధ్య‌క్షుల నియామ‌కం జ‌రిగిందని.. కాని ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీ అధ్య‌క్షురాలిగా ఒక్క మ‌హిళ నియామ‌కం జ‌ర‌గ‌లేదని విమర్శించారు. దీనిబట్టే.. బిజెపికి మ‌హిళ ప‌ట్ల గౌర‌వం, చిత్త‌శుద్ది ఉందో అర్థ‌మౌతుందన్నారు. సోమవారం సాయంత్రం సిఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నాయ‌క‌త్వంలో అతి ఎక్కువ కాలం ప‌నిచేసిన పార్టీ కాంగ్రెస్ మ‌హిళ‌ల‌కు అన్యాయం చేస్తుందా..? అని ప్రశ్నించారు. బీజేపీకి మ‌హిళ‌ను అధ్య‌క్షురాలిగా నియ‌మించుకున్న త‌ర్వాత‌ బండి సంజ‌య్ మాట్లాడాలి. బండి సంజ‌య్ వ్యాఖ్య‌లు ద‌క్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ,ఎస్టీ, మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేకం. మా ఎంపీలు తెలంగాణ ను సాధించారు.. ఇప్పుడు పున‌ర్విభ‌జ‌న పైన కూడా పోరాడుతారు. ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌తో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం. పార్ల‌మెంట్ లో బిల్లు ను ఎలా ఆమోదిస్తారో చూస్తాం. 60 యేళ్ల‌లో మ‌హిళ‌ల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది. 46 యేళ్ల‌లో ఒక్క మ‌హిళ ను పార్టీ అధ్య‌క్షురాలి ని బీజేపీ చేయ‌లేదు.. జ‌న‌ర‌ల్ సెక్ర‌టరీ ఆర్గ‌నైజేష‌న్ ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేదు. మ‌హిళ‌ల‌ను చిన్న చూపు చూడ‌ట‌మే బీజేపీ ల‌క్ష‌ణం.. ద్వితీయ శ్రేణి పౌరులుగా మహిళ‌ల‌ను చూస్తున్నారు. స్వాతంత్య్రం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్య‌త కూడా కాంగ్రెస్ దే. యాభై శాతంతో సీట్ల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ లు మోదీ ఇంటి ముందు బంట్రోతు లుగా నిల‌బ‌డాల్సి వ‌స్తుంది.. వాళ్ల అవ‌స‌రం ఇక ముందు ఉండ‌దు. అన్ని ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌తో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాల‌కు దీనిపైన లేఖ రాస్తాను అని పేర్కొన్నారు.

మన తెలంగాణ 13 Apr 2026 7:59 pm

‘జననాయగన్’ లీక్‌కు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు : ఎడిటర్స్ యునియన్

చెన్నై: ప్రముఖ సినీ నటుడు, టివికె పార్టీ అధినేత విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రంలోని కొంత భాగం ఆన్‌లైన్‌లో లీక్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తమిళ చిత్ర పరిశ్రమలో దుమారం రేపింది. అయితే సినిమా ఎడిటర్ ప్రదీప్ ఇ.రాఘవ్ ఈ లీక్స్‌కి కారణం అంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఎడిటర్స్ యూనియన్ ఖండించింది. ఈ ఘటనతో ప్రదీప్‌కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ‘‘గ్రాఫిక్స్, సౌండ్ మిక్సింగ్‌ను మరింత మెరుగు పరిచేందుకు దర్శకుడు, నిర్మాతల అనుమతితోనే సినిమా కాపీని జనవరిలోనే ఓ స్టూడియోకి ప్రదీప్ పంపారు. ఒకవేళ ఆయన లీక్ చేయాలనుకుంటే ఎలాంటి వాటర్ మార్క్ లేకుండానే చేసేవారు కదా.?’’ అని పేర్కొంది. ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేసింది. 

మన తెలంగాణ 13 Apr 2026 7:52 pm

నేను రేవంత్ రెడ్డిలా అవకాశవాదిని కాదు: మంత్రి బండి

తాను ఉత్తర భారత దేశానికి వలస వెళతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. వలసపోవడానికి తాను అవకాశవాదిని కాదని, రేవంత్ రెడ్డిని అంతకంటే కాదని ఆయన విమర్శించారు. తాను చచ్చినా బతికినా బిజెపిలోనే ఉంటానని ఆయన తెలిపారు. తాను చనిపోతే తన శవంపై కప్పేది కాషాయ జెండానే అని ఆయన తెలిపారు. ఆ సన్నివేశం చూడడానికైనా రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు బతికి ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. తాను చచ్చినా, బతికినా, ఓడినా, గెలిచినా కేరాఫ్ అడ్రస్ కరీంనగరేనని ఆయన చెప్పారు. తన రక్తంలోనే జాతీయవాదమనే డీఎన్‌ఏ ఉందన్నారు. వలసవాది, అవకాశవాదానికి ప్రతిరూపం రేవంత్ రెడ్డి అని ఆయన విమర్శించారు. పాలమూరు నుంచి మల్కాజ్ గిరి దాకా వలస పోయింది రేవంత్ రెడ్డేనని ఆయన ధ్వజమెత్తారు. మహిళా బిల్లును వ్యతిరేకించే మీరు కూడా తమను విమర్శిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మీరు నిజంగా మహిళా రిజర్వేషన్లకు సానుకూలమైతే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో దాదాపు 30 ఏళ్లకుపైగా కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ ఉన్నా మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.

మన తెలంగాణ 13 Apr 2026 7:50 pm

టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ విడుదల

టిజి టెట్ జూన్ 2026 పరీక్ష (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) షెడ్యూల్ విడుదలైంది. 2026 జూన్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. 15 రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టిజి టెట్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా, 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జూన్ 9 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ చేసి, జూన్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జులై 28 నుంచి 31 మధ్య ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. టెట్ జూన్ 2026 ముఖ్యమైన తేదీలు ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం ఏప్రిల్ 15 నుంచి 30 వరకు టెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ జూన్ 9 నుంచి టెట్ హాల్‌టికెట్లు జారీ జూన్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్ష నిర్వహణ జులై 28 నుంచి 31 మధ్య టెట్ ఫలితాలు విడుదల

మన తెలంగాణ 13 Apr 2026 7:41 pm

ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమిపాలు కాని రాజస్థాన్ తమ విజయ పరంపరని కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు సొంత మైదానంలో మ్యాచ్ గెలిచి పరువు కాపాడుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. బ్రిజేష్ స్థానంలో తుషార్ దేశ్‌పాండే, హెట్మైర్‌ స్థానంలో లువాన్-డ్రే ప్రెటోరియస్ ఆరంగేట్రం చేస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక మార్పు చేసింది. హర్షల్ పటేల్ స్థానంలో ప్రఫుల్ హింగేని జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, ధృవ్ జురేల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), లువాన్-డ్రే ప్రెటోరియస్, డొనావన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే. ఎస్‌ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలిల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబె, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగా.

మన తెలంగాణ 13 Apr 2026 7:19 pm

Breaking : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లనున్నారు.

తెలుగు పోస్ట్ 13 Apr 2026 7:09 pm

125 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్ గా మహిళా...

ఆస్ట్రేలియా చరిత్రలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మహిళను ఆర్మీ చీఫ్ గా నియమించింది. దేశ రక్షణ దళాల నాయకత్వంలో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగా, చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ తమ సైన్యాధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు ఆస్ట్రేలియా సోమవారం (ఏప్రిల్ 13) ప్రకటించింది. ప్రస్తుత జాయింట్ క్యాపబిలిటీస్ చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయిల్ జూలైలో సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. ఆమె లెఫ్టినెంట్ జనరల్ సైమన్ స్టువర్ట్ స్థానంలో సైన్యాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, కోయల్.. ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్ లో పలు ఆపరేషన్లు, ఉన్నతస్థాయి పదవులు నిర్వహించారు. 

మన తెలంగాణ 13 Apr 2026 6:59 pm

ఎన్నికల నిర్వహణపై కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు..

న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణపై కేంద్రం, భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాలలో డూప్లికేట్ ఓటింగ్‌ను అరికట్టేందుకు బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో బిజెపి నాయకుడు, న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈసి, కేంద్రంతోపాటు రాష్ట్రాలకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం నోటీసు జారీ చేసింది.  అయితే, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేమని వారు స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల గురించి తాను మాట్లాడటం లేదని ఆయన చెప్పడంతో, ఈ అంశంపై విచారించడానికి న్యాయస్థానం అంగీకరించింది. తదుపరి పార్లమెంటరీ ఎన్నికలు లేదా రాష్ట్ర ఎన్నికలకు కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించవచ్చో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఓటింగ్ నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాలు మే 4న ఫలితాలను ప్రకటిస్తాయి.

మన తెలంగాణ 13 Apr 2026 6:45 pm

పంజాబ్‌తో మ్యాచ్‌కి ముందు ముంబై ఇండియన్స్‌కి షాక్?

ఒకప్పుడు ఐపిఎల్‌కే రారాజుగా వెలుగొందిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో తడబడుతోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్‌లోనే విజయం సాధించి.. టేబుల్‌లో 8వ స్థానంలో స్థిరపడింది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై గెలుపు కోసం పోరాడినప్పటికీ.. పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో రాబోయే మ్యాచ్‌లు అన్ని ముంబై ఇండియన్స్ జట్టుకు కీలకంగా మారాయి. అయితే ముంబై తదుపరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా ముంబై స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్‌సిబితో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తొడ కండరాల గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. త్వరలో అతడు స్కానింగ్ చేయించుకుంటాడని తెలుస్తోంది. రిపోర్టుల్లో గాయం తీవ్రమైందని తేలితే.. పంజాబ్‌తో మ్యాచ్‌కి రోహిత్ అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే ఎంఐ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి రోహిత్ లేని లోటుని జట్టులో ఎవరితో భర్తి చేస్తారో వేచి చూడాల్సిందే.

మన తెలంగాణ 13 Apr 2026 6:35 pm

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్

ధ్రప్రదేశ్ ఆర్టీసీ సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 13 Apr 2026 6:34 pm

Pocharam : చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత శ్రీనివాసా

పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు

తెలుగు పోస్ట్ 13 Apr 2026 6:12 pm

రోడ్డుపై పారుతున్న మురికి నీరు .. వాహనదారులు, ప్రజల ఇబ్బందులు

విశాలాంధ్ర గుంతకల్లు.. ప్రధాన రహదారి పై మురికి నీరు పారుతుండడంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని15 వార్డులో అంబంబ దేవాలయం ఉన్న ప్రధాన రహదారి పై మురికి కాలువ చెత్తాచెదారంతో నిండిపోవడంతో మురికి నీరు ప్రధాన రహదారి పై చెరువును తలపించేలా తయారయ్యింది. ఈ మురికి నీరు నిలవడంతో దుర్గంధం వెదజల్లుతూ స్థానికవాసులు, వాహనదారులు ఇబ్బందులు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 10వ తేదీ శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ […] The post రోడ్డుపై పారుతున్న మురికి నీరు .. వాహనదారులు, ప్రజల ఇబ్బందులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Apr 2026 5:58 pm

పరిశ్రమలకు శరవేగంగా అనుమతులు : చంద్రబాబు

రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు విషయంలో ఎలాంటి జాప్యం జరగ్గకుండా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు

తెలుగు పోస్ట్ 13 Apr 2026 5:52 pm

Revanth Reddy Proposes Hybrid Delimitation Model

Telangana Chief Minister A. Revanth Reddy on Monday proposed a hybrid model for the forthcoming delimitation exercise, saying parliamentary representation should be based on both population and economic contribution, and not population alone. Hybrid Formula for Seat Allocation On delimitation, Mr. Reddy said a purely population-based redistribution of seats would punish states that successfully implemented […] The post Revanth Reddy Proposes Hybrid Delimitation Model appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 5:51 pm

విజయ్‌కి ఏమైనా సలహాలిస్తారా..? పవన్‌కల్యాణ్ ఏమన్నారంటే..

సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సిఎంగా ఎదిగారు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. ఇప్పుడు అదే రీతిలో తమళినాడు ఎన్నికలల్లో పోటీ పడుతున్నారు అక్కడి స్టార్ హీరో విజయ్. తమిళగ వెట్రి కజగం(టివికె) పార్టీ పెట్టిన ఆయన ఈ అసెంబ్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ‘‘విజయ్‌కి మీరేమైనా సలహా ఇస్తారా?’’ అనే ప్రశ్నకు పవర్‌స్టార్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తాను ఎవరికీ సలహాలు ఇవ్వను అని.. తన పిల్లల విషయంలోనూ అంతే అని పవన్ స్పష్టం చేశారు. విజయ్ విషయానికొస్తే.. ఆయన చాలా సమర్థుడని.. చాలా పెద్ద స్టార్ అని కొనియాడారు. ‘జనసేనాని విత్ జెన్‌జీ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో యువత అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానాలు ఇచ్చారు. ‘ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ అయి ఉంటే.. ఏ కంటెంట్‌పై వీడియోలు చేస్తారు?’ అని అడగ్గా.. దేశభక్తి, ప్రకృతి పరిరక్షణపై చేస్తానని తెలిపారు. ఇంకా రాజకీయాలు, సోషల్‌మీడియా గురించి కూడా పవన్‌ తనదైన శైలీలో సమాధానాలు ఇచ్చారు.

మన తెలంగాణ 13 Apr 2026 5:51 pm

శ్మశానా వాటికల సమస్యలను పరిష్కరించండి– సిపిఐ డిమాండ్….

విశాలాంధ్ర – నార్పల: మండలంలో స్మశాన వాటికల సమస్యలు తీవ్రరూపం దాల్చడంతో సిపిఐ నాయకులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి వినతి పత్రం సమర్పించారు.స్మశానాలకు రహదారులు లేకపోవడం, భూముల కొరత వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా మృతదేహాలను అంత్యక్రియల కోసం తీసుకెళ్లే సమయంలో సరైన మార్గాలు లేక ప్రజలు తీవ్ర […] The post శ్మశానా వాటికల సమస్యలను పరిష్కరించండి– సిపిఐ డిమాండ్…. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Apr 2026 5:46 pm

Perni Nani : రాజధాని అంటే అప్పులా... సిరిసంపదలు ఎక్కడ?

రాజధాని అంటే సిరిసంపదలు కల్పించేలా ఉండాలని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు

తెలుగు పోస్ట్ 13 Apr 2026 5:44 pm

ఉమెన్స్ T20 వరల్డ్ కప్.. రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసిసి

న్యూఢిల్లీ: 2026 మహిళల T20 ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది. జూన్ 12న ఇంగ్లాండ్, వేల్స్‌లో ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌కు ఇంకా 60 రోజుల సమయం ఉండగా.. ట్రోఫీ పర్యటన ప్రారంభమైన సందర్భంగా సోమవారం ఐసిసి ప్రైజ్ మనీని ప్రకటించింది. అలాగే, మొట్టమొదటిసారిగా 12 జట్లతో ఈ మెగా టోర్నమెంట్ ను నిర్వహించనుంది.  కాగా, 2024 టోర్నమెంట్ కోసం జట్లకు కేటాయించిన మునుపటి ప్రైజ్ మనీ మొత్తం US$7,958,077గా ఉంది. 2026 ఎడిషన్ కోసం ప్రైజ్ మనీని ౧౦ శాతం పెంచింది. దీంతో ఈ టోర్నీలో పాల్గొనే జట్లు.. ఇప్పుడు US$8,764,615 (సుమారు రూ. 81 కోట్ల 83 లక్షలు) అందుకోనున్నాయి. రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 విజేత జట్టు భారీ మొత్తంలో US$2,340,000 (సుమారు రూ. 21 కోట్ల 84 లక్షలు) ప్రైజ్ మనీని అందుకోనుంది. రన్నరప్ జట్టు US$1,170,000 (సుమారు రూ. 10 కోట్ల 92 లక్షలు) సొంతం చేసుకుంటుంది. సెమీఫైనల్‌లో ఓడిన జట్లు ఒక్కోటి US$675,000 (సుమారు రూ. 6 కోట్ల 30 లక్షలు) చొప్పున పొందుతాయి. గ్రూప్ దశలో సాధించే ప్రతి విజయానికి జట్లకు US$31,154 (సుమారు రూ. 29 లక్షలు) లభిస్తుంది. ఇక, టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లన్నింటికీ US$247,500 (సుమారు రూ. 2 కోట్ల 31 లక్షలు) చొప్పున లభిస్తుంది.

మన తెలంగాణ 13 Apr 2026 5:31 pm

ఎక్కడి చెత్త అక్కడే…వ్యర్థ పదార్థాలతో నిండిన కాలువ

సమయ పాలన పాటించని ఉపాధ్యాయులు ఉపాధ్యాయ పని తీరుపై విమర్శలు…. విశాలాంధ్ర,కదిరి : పేదరికంతోనూ,కుటుంబ సమస్యలతోనూ కొందరు చదువు మధ్యలో మానేసి డ్రాపవుట్స్ గా మిగిలిపోతున్నారు.ఇలాంటి వారికి కల్పతరువుగా ఏపీ ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఏర్పాటు చేసింది. అహర్లాదకరమైన వాతావరణం,ఆధునాతన వసతులు ఏర్పాటు చేసి అద్భుత ఫలితాలు సాదించాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు.పట్టణంలో అగ్నిమాపక కేంద్రం సమీపంలో గల ఏపీ ట్రైబల్ బాలికల వసతి గృహంలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు(పదవ […] The post ఎక్కడి చెత్త అక్కడే…వ్యర్థ పదార్థాలతో నిండిన కాలువ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Apr 2026 5:05 pm

50 శాతం సీట్లు పెంచాలని మోడీకి ఏ దేవుడు చెప్పాడు: సిఎం

హైదరాబాద్: మహిళ రిజర్వేషన్లు, డీలిమిటేషన్ల రెండు అంశాలను బిజెపి కలిపి రాజకీయం చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన డీ-లిమిటేషన్‌పై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘మహిళ రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు కీలకమైన అంశాలు. రెండు అంశాలు దేశ ప్రజలందరికీ సంబంధించిన కీలక అంశాలు. బిజెపి మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదని బిజెపి దుష్ప్రచారం చేస్తోంది. మహిళలకు రాజకీయ హక్కులు మొట్టమొదట కల్పించిందే కాంగ్రెస్. మొదట ఓటు హక్కు, తర్వాత రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించింది’’ అని అన్నారు. రాజ్యంగబద్ధ పదవులను కూడా మహిళలకు ఇచ్చి గౌరవించింది కాంగ్రెస్ పార్టీ అని సిఎం అన్నారు. ‘‘స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చింది రాజీవ్ గాంధీ. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును 2013లోనే సోనియా గాంధీ ప్రవేశపెట్టారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు చేయాలని ఎన్డిఎ చూస్తోంది. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్లను చేయాలనేది మా డిమాండ్. ఈ రెండింటిని కలపటం, పాత జనాభా లెక్కల ప్రకారం వెళ్లడంలో కుట్ర ఉంది. 33 శాతం మహిళ రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. మహిళ రిజర్వేషన్లను ఆర్నెళ్లలోనే అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం’’ అని సిఎం పేర్కొన్నారు. నాభా ప్రాతిపదికన సీట్ల పెంపు వద్దని దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా చెప్పాయని సిఎం అన్నారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకత వల్ల మోడీ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచుతామని మోడీ చెప్తున్నారు. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో సీట్లు భారీగా పెరగనున్నాయి. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్లలో అంతరం భారీగా పెరుగుతుంది. సీట్ల పెంచు తర్వాత దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు 195 అవుతాయి. సీట్ల పెంపు తర్వాత ఉత్తరాదిలో సీట్లు 620కి పెరుగుతాయి. ఉత్తర, దక్షిణాది మధ్య ప్రస్తుతం ఉన్న 210 సీట్ల అంతరం 412కు పెరుగుతుంది’’ అని సిఎం తెలిపారు. ఎన్డిఎ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏ మాత్రం ప్రాధాన్యం దక్కటం లేదని సిఎం ధ్వజమెత్తారు. ‘‘కేంద్రంలోని కీలకశాఖల్లో ఏవీ దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వటం లేదు. సీట్లు పెంచాలనుకుంటే అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడాలి. ఏ ప్రాతిపదికన 50 శాతం సీట్లు పెంచుతారు. సీట్లు 50 శాతం పెంచాలని మోడీకి ఏ దేవుడు చెప్పాడు. 50 శాతం సీట్లు పెంచితే ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరం పెంచుతుంది. దక్షిణాదిపై చూపుతున్న వివక్షతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షను మరింత పెంచేలా బిజెపి వెళ్తోంది. మహిళ బిల్లును అడ్డుపెట్టుకుని డీ లిమిటేషన్ చేయొద్దు. ప్రస్తుత సీట్ల ప్రకారమే చట్ట ప్రకారమే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి’’ అని సిఎం స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 13 Apr 2026 5:04 pm

నిప్పుల కొలిమిలా రాప్తాడు.. మారుతున్న వాతావరణం.. పెరుగుతున్న ముప్పు!

​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా): రాప్తాడు గడ్డపై భానుడు భగభగలాడుతున్నాడు. సాధారణంగా మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయికి చేరుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు వేడి గాలులు వీస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం […] The post నిప్పుల కొలిమిలా రాప్తాడు.. మారుతున్న వాతావరణం.. పెరుగుతున్న ముప్పు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Apr 2026 5:00 pm

కడపలో.. పెట్రోల్ ట్యాంకర్ ఢీ: బస్సు బోల్తా

అమరావతి: కడప జిల్లాలో  మైదుకూరు మండలం వరదాయపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్యాంకర్ బీభత్సం చేసింది. సిమెంట్ ట్యాంకర్ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల బస్సును ఢీకొంది. పెట్రోల్ ట్యాంకర్ రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్నిఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. రహదారిపై ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని..సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మన తెలంగాణ 13 Apr 2026 4:53 pm

అయ్యప్ప సేవా సమితి సేవలు ఎనలేనివి… తంగిరాల సౌమ్య

విశాలాంధ్ర నందిగామ:-సేవ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న అయ్యప్ప సేవా సమితి వారి సేవలు వెలకట్టలేనివని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు సోమవారం నందిగామ మెయిన్ బజార్ లో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన చలివేంద్రాన్ని ఆమె స్థానిక కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు మొదటి రోజు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రజాసేవలో కొనసాగుతున్న అయ్యప్ప సేవాసమితి […] The post అయ్యప్ప సేవా సమితి సేవలు ఎనలేనివి… తంగిరాల సౌమ్య appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Apr 2026 4:52 pm

ఫ్యాక్ట్ చెక్: తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ వెనుక ఉన్నది పాకిస్థాన్ జెండాలు కావు

తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ వెనుక ఉన్నది పాకిస్థాన్ జెండాలు కావు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. IUML పార్టీ జెండా అది

తెలుగు పోస్ట్ 13 Apr 2026 4:45 pm

డీ-రెగ్యులేషన్‌ ఫేజ్‌-2లో నిబంధనలు తగ్గించి అనుమతులు వేగవంతం చేయాలి

సీఎం చంద్రబాబుఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి సందీప్‌ పౌండ్రిక్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రతిపాదించిన రెండో దశ నియంత్రణ సడలింపు విధానాలపై విస్తృతంగా చర్చించారు.పరిశ్రమల స్థాపనలో వేగం పెంచడం, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. కేంద్రం రూపొందించిన ప్రతిపాదనలను కార్యదర్శి ముఖ్యమంత్రి ఎదుట వివరించారు.అనంతరం ఈ అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎనిమిది […] The post డీ-రెగ్యులేషన్‌ ఫేజ్‌-2లో నిబంధనలు తగ్గించి అనుమతులు వేగవంతం చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Apr 2026 4:40 pm

Deconstruct Joins Hands With Anirudh

Sometimes, the most impactful brand collaborations aren’t meticulously planned- they unfold on their own. That’s exactly what happened with Deconstruct and music sensation Anirudh Ravichander. What began as a casual Instagram reel featuring Anirudh and his stylist unexpectedly became the spark. Eagle-eyed fans spotted a Deconstruct sunscreen sitting in the background, and within hours, the […] The post Deconstruct Joins Hands With Anirudh appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 4:39 pm

మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు…

గాయని మంగ్లీ (సత్యవతి), న్యాయవాది సింగపోగు సుబ్బారావు మధ్య నడుస్తున్న పరస్పర ఆరోపణల వివాదం మరో మలుపు తిరిగింది. మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుబ్బారావుకు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ (డ్రంకెన్) టెస్ట్ నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పరీక్షలో ఆయన రక్తంలో27 mg/100mlఆల్కహాల్ ఉన్నట్లు రీడింగ్ నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మైక్రోఫైనాన్స్ పేరుతో మంగ్లీ, ఆమె సోదరుడు రూ.10 కోట్లకు మోసం చేశారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తుల […] The post మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Apr 2026 4:20 pm

ఢిల్లీ, కేరళ టూర్లు ఆపి.. రైతుల కష్టాలపై రివ్యూ చేయ్యండి: హరీష్ ఫైర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైరయ్యారు. సిఎం రేవంత్.. ఢిల్లీ, కేరళ టూర్లు ఆపి రైతుల కష్టాల మీద రివ్యూ చేయాలన్నారు. సోమవారం(ఏప్రిల్ 13) సంగారెడ్డి నియోజకవర్గం, సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించి..రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఏటిగడ్డ సంఘం తదితర గ్రామాల రైతులు తమ శనగలు కొనడం లేదని తమ దృష్టికి తీసుకురావడంతో, ఇక్కడి డీసీఎంఎస్ సెంటర్ కు రావడం జరిగిందని.. రైతులను, నిర్వాహకులను అడిగితే కోటా అయిపోయిందని చెబుతున్నారని తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోందని విమర్శించారు. సకాలంలో రైతుబంధు ఇవ్వకపోగా.. కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదని, ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు గల్లీకి తక్కువ.. ఢిల్లీకి ఎక్కువ అన్నట్లుగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. గాలి మోటార్లలో తిరుగుతూ కేరళ, ఢిల్లీ పర్యటనల్లో ఉన్న బిజీలో వారికి రైతుల కష్టాలు పట్టడం లేదని మండిపడ్డారు. సదాశివపేటలో కొత్తగా శనగలు కొనకపోగా, ఇప్పటికే కొన్న శనగలను కూడా బిల్లులు కావడం లేదని బస్తాలు ఖాళీ చేసి రైతులకే వెనక్కి ఇచ్చేస్తున్నారని.. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నామని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని ధ్వజమెత్తారు. మార్కెటింగ్ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడికి పోయారు? అని ప్రశ్నించారు. జొన్నల కొనుగోలుపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయమే తీసుకోలేదు. ఆరుగాలం కష్టపడ్డ రైతులు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి సగం ధరకే జొన్నలు అమ్ముకునే దుస్థితి వచ్చింది. వడ్లు కూడా రోడ్ల మీదనే ఉన్నాయి.  ముఖ్యమంత్రి గారు ఢిల్లీ, కేరళ టూర్లు ఆపి రైతుల కష్టాల మీద రివ్యూ చేయాలి. భూములు, కాంట్రాక్టులు, కమిషన్ల మీద రివ్యూలు చేస్తారు తప్ప గరీబ్ రైతుల కోసం మీకు సమయం దొరకదా?. కొనుగోళ్లు ఆగిపోయాయన్న కనీస సమాచారం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్పడం లేదా?.  మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా?. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, సన్ ఫ్లవర్, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. కోటా పేరుతో ఆగిపోయిన శనగల కొనుగోలును వెంటనే తిరిగి మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీష్ రావు అన్నారు.

మన తెలంగాణ 13 Apr 2026 4:13 pm

బొగ్గవరపు రాజసేవలు అమోఘం : మంత్రి సవిత

( విశాలాంధ్ర) వత్సవాయి : బిసి సంక్షేమ శాఖ మంత్రి సవిత చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బొగ్గవరపు వెంకట రాజారావు ను సన్మానం చేశారు. స్థానిక వత్సవాయి గ్రామంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల సందర్శనార్థం విచ్చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సమక్షంలో అతి కొద్ది సమయంలో సుమారు నాలుగు లక్షల రూపాయల విలువైనటువంటి వసతులు సమకూర్చినటువంటి […] The post బొగ్గవరపు రాజసేవలు అమోఘం : మంత్రి సవిత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Apr 2026 4:11 pm

స్మశాన వాటికల కొరతపై ఎమ్మెల్యే దృష్టికి సిపిఐ…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండలంలో స్మశాన వాటికల సమస్యలు తీవ్రరూపం దాల్చడంతో సిపిఐ నాయకులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి వినతి పత్రం సమర్పించారు.స్మశానాలకు రహదారులు లేకపోవడం, భూముల కొరత వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా మృతదేహాలను అంత్యక్రియల కోసం తీసుకెళ్లే సమయంలో సరైన మార్గాలు […] The post స్మశాన వాటికల కొరతపై ఎమ్మెల్యే దృష్టికి సిపిఐ… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Apr 2026 4:07 pm

అంధత్వ నివారణ దేశంగా మనమందరం పాటు పడదాం..

రోటరీ క్లబ్ కోశాధికారి కే. నరేందర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; భారతదేశాన్ని అంధత్వ నివారణ దేశంగా చేసేందుకు మనమందరము పాటుపడుదాం అని రోటరీ క్లబ్ కోశాధికారి కె.రవీందర్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సీనియర్ డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా నేత్రదానంపై ప్రజలకు కొన్ని సంవత్సరాలుగా అవగాహన కల్పిస్తున్నామని, ఈ అవగాహన వల్ల మరో ఇద్దరికి చూపు వస్తుందని తెలిపారు. 1994 నుండి నేత్ర సేకరణ రోటరీ క్లబ్ […] The post అంధత్వ నివారణ దేశంగా మనమందరం పాటు పడదాం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Apr 2026 4:03 pm

Ram Charan’s Unmatched Swag breaks the Internet

Mega Powerstar Ram Charan has once again set the internet ablaze with his latest photoshoot, capturing an unmatched swagger that is hard to ignore. Ever since the phenomenal success of RRR, his global recognition has been growing day by day, transforming him into a true international fashion and cinematic icon. The striking visuals from his […] The post Ram Charan’s Unmatched Swag breaks the Internet appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 3:53 pm

Ram Charan Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో బుచ్చిబాబు క్లారిటీ ఎప్పుడిస్తాడు?

Ram Charan Peddi Movie: టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది గురించి అభిమానులకు ఆందోళన ఎక్కువవుతోంది. దీనికి కారణం మరోసారి ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అవుతుండటమే. పెద్ద సినిమాకి ఒక్కసారి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాక, ఆ డేట్ కి సినిమా రిలీజ్ అవకపోతే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఎలాంటి నెగిటివిటీ మొదలవుతుందో ఇప్పటికే చాలా సినిమాల విషయంలో చూసిందే. గత ఏడాది అఖండ […] The post Ram Charan Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో బుచ్చిబాబు క్లారిటీ ఎప్పుడిస్తాడు? appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 13 Apr 2026 3:50 pm

అర్జున్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ట్రైలర్ విడుదల

ఒటిటిలు అంటేనే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సినిమాలతో పాటు.. రకరకాల వెబ్ సిరీస్‌లు కూడా. అందులోనే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు మంచి ప్రేక్షకాదరణ ఉంటుంది. అలాంటి వెబ్ సిరీసే.. ‘పోచమ్మ’. బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ నటుడు అర్జున్ అంబాటి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ త్వరలో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఈ సిరీస్ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఓ గ్రామంలోనే భవంతి అడ్డుగా ఉందని పోచమ్మ విగ్రహాన్ని తొలగిస్తారు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఆ ఊరి ప్రజలపై పోచమ్మ ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేసింది అనే బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్‌ని తీసినట్లు తెలుస్తోంది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. This isn’t just a mansion… it’s a CURSE! Every lie will be exposed, Every sin will be punished. #Pochamma , Releasing in Telugu & Tamil on April 17 (24hrs early access for aha gold users) pic.twitter.com/fjBgSDYLRJ — ahavideoin (@ahavideoIN) April 13, 2026

మన తెలంగాణ 13 Apr 2026 3:37 pm

Price |ధరాభారం పెరగనుందా?

Price | ధరాభారం పెరగనుందా? Price | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 13 Apr 2026 3:35 pm

అమరావతి రాజముద్ర..

అమరావతి రాజముద్ర.. భారత రాష్ట్రపతికి ప్రత్యేక కృతజ్ఞతలు… రాష్ట్ర ఎంపీలు.. నంద్యాల ఎంపీ..

ప్రభ న్యూస్ 13 Apr 2026 3:35 pm

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో బిజెపికి లాభం జరగొచ్చు: రేవంత్

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ వేర్వేరు అంశాలు అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా కోటాను తక్షణమే అమలు చేస్తే దేశమంతా దానిని స్వాగతిస్తుందని అన్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై ప్రధాని నరేంద్రమోడీకి సిఎం రేవంత్‌ లేఖ రాశారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో బిజెపికి లాభం జరగొచ్చునని విమర్శించారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలే మిన్నగా ఉండాలని, డీలిమేషన్ కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి కోరారు.   

మన తెలంగాణ 13 Apr 2026 3:33 pm

భవిష్యత్ తరాల కోసమే నా తాపత్రయం

భవిష్యత్ తరాల కోసమే నా తాపత్రయం లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : భవిష్యత్ తరాల

ప్రభ న్యూస్ 13 Apr 2026 3:30 pm

కామారెడ్డిలో భారీ చోరీ

కామారెడ్డిలో భారీ చోరీ కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; కామారెడ్డి జిల్లా కేంద్రంలోని

ప్రభ న్యూస్ 13 Apr 2026 3:30 pm

అమెరికా-ఇరాన్ మధ్య హై టెన్షన్..

ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ జలసంధిని తన నియంత్రణలోకి తీసుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయంగా ఆందోళనకు దారితీస్తున్నాయి. ఈ చర్య కేవలం దౌత్యపరమైన అంశంగానే కాకుండా, ఒక భారీ ప్రాంతీయ యుద్ధానికి నాంది పలికే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు, అంతర్జాతీయ చమురు సరఫరాపై పూర్తి ఆధిపత్యం చెలాయించాలనే లక్ష్యంతో […] The post అమెరికా-ఇరాన్ మధ్య హై టెన్షన్.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Apr 2026 3:27 pm

పత్రికా స్వేచ్ఛపై ఆరోపణలు..

పత్రికా స్వేచ్ఛపై ఆరోపణలు.. దుర్భాష ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అచ్చంపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Apr 2026 3:26 pm

BSE Sensex |కుప్ప‌కూలిన స్టాక్ మార్కెట్లు

BSE Sensex | కుప్ప‌కూలిన స్టాక్ మార్కెట్లు BSE Sensex | ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Apr 2026 3:25 pm

అమరావతి బిల్లుకు రాజముద్ర.. రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజముద్ర వేయడం చరిత్రాత్మకమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపేందుకు, మంత్రి లోకేశ్ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీల బృందం సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ చారిత్రక నిర్ణయంతో మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-మా రాజధాని అమరావతి అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునేలా చేశారని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ […] The post అమరావతి బిల్లుకు రాజముద్ర.. రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎంపీలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Apr 2026 3:22 pm

Bomb Threat for Trisha’s Residence in Chennai

A fresh bomb threat news broke out targeting the Chennai residence of Tamil actress Trisha Krishnan. The Chennai cops were alerted after the Director General of Police (DGP) Control Room received an email about the bomb threat. The email was sent at 9.30 AM and it said that an explosive device was planted at the […] The post Bomb Threat for Trisha’s Residence in Chennai appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 3:18 pm