SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

Narsampet |ఆర్టీసీ డిపోలో ఫైర్ సేఫ్టీ డెమో

Narsampet | ఆర్టీసీ డిపోలో ఫైర్ సేఫ్టీ డెమో Narsampet | నర్సంపేట,

ప్రభ న్యూస్ 28 Nov 2025 12:29 pm

వారి కోసమే ఇందిరమ్మ క్యాంటీన్లు: పొన్నం

హైదరాబాద్: తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ఉపాధి, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం కోసం ఇందిరమ్మ క్యాంటీన్ లలో అల్పాహారం, మధ్యాహ్న సమయంలో భోజనం  ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కవాడిగూడ ఎన్ టిపిసి వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరముంటాయో అక్కడ ప్రభుత్వం గుర్తిస్తుందని, స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరిన చోట కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఇందిరమ్మ క్యాంటీన్ ల ద్వారా ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉపాధి కల్పన కోసం వచ్చిన వారికి ఇందిరమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేయడం జరుతుందని వివరించారు. 

మన తెలంగాణ 28 Nov 2025 12:29 pm

Collector |పూలే బాటలో నడుద్దాం..

Collector | పూలే బాటలో నడుద్దాం.. మహనీయునికి నివాళిఅనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్

ప్రభ న్యూస్ 28 Nov 2025 12:24 pm

Supreme Court : పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో షాక్

పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది

తెలుగు పోస్ట్ 28 Nov 2025 12:19 pm

YCP |మహానుభావుడు..

YCP | మహానుభావుడు.. YCP | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ వైసీపీ

ప్రభ న్యూస్ 28 Nov 2025 12:19 pm

Jangaon |నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన డీసీపీ

Jangaon | నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన డీసీపీ Jangaon | రఘునాథపల్లి,

ప్రభ న్యూస్ 28 Nov 2025 12:16 pm

CONGRESS |ఆదరించండి.. అభివృద్ధి చేస్తా

CONGRESS | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా కొమ్మాయిగూడెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి

ప్రభ న్యూస్ 28 Nov 2025 12:13 pm

Srilanka : శ్రీలంకలో వరదల బీభత్సం.. 56 మంది మృతి

శ్రీలంకలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 12:11 pm

Brahmotsavam |అంజన్న బ్రహ్మోత్సవానికి సర్వం సిద్ధం

Brahmotsavam | అంజన్న బ్రహ్మోత్సవానికి సర్వం సిద్ధం Brahmotsavam | అచ్చంపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Nov 2025 12:10 pm

Hanmakonda |ఫూలే సిద్దాంతాలు సమాజానికి అనుసరణీయం

Hanmakonda | ఫూలే సిద్దాంతాలు సమాజానికి అనుసరణీయం ఫూలే విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే,

ప్రభ న్యూస్ 28 Nov 2025 12:04 pm

JOURNEY |పొగ మంచులో ప్రయాణం జాగ్ర‌త్త‌…

JOURNEY | పొగ మంచులో ప్రయాణం జాగ్ర‌త్త‌… సంగారెడ్డి రూర‌ల్ ఎస్సై మధుసూధన్

ప్రభ న్యూస్ 28 Nov 2025 12:03 pm

Bigg Boss 9 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్... భరణి దెబ్బకు అవుట్

బిగ్ బాస్ 9 సీజన్ లో టాప్ 5 లో ఎవరు ఉంటారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 12:01 pm

TDP|టీడీపీ నేత మృతి

TDP| కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు టీడీపీ నేత సింగం సుబ్రహ్మణ్యం (బాపిచ్చ)

ప్రభ న్యూస్ 28 Nov 2025 12:00 pm

Edapalli |గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..

Edapalli | గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా.. Edapalli | ఎడపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Nov 2025 11:53 am

బంగాళాఖాతంలో దిత్వా తుపాను.. కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను ఏర్పాటు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ాదిత్వా్ణ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల ప్రతిస్పందన సంస్థ హెచ్చరించింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ప్రస్తుతం ఈ తుపాను శ్రీలంక తీరానికి సమీపంలో, ట్రింకోమలీకి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పుదుచ్చేరికి 480 కి.మీ, చెన్నైకి 580 కి.మీ దూరంలో ఉన్న ఈ తుపాను, గడిచిన […] The post బంగాళాఖాతంలో దిత్వా తుపాను.. కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 11:49 am

Cetaphil Baby Daily Lotion: మీ చిన్నారి మృదువైన చర్మానికి 24 గంటల రక్షణ.. తల్లులు మెచ్చిన నంబర్ 1 ఛాయిస్!

పసిపిల్లల చర్మం చాలా త్వరగా పొడిబారుతుంది (Dryness). వాళ్ల చర్మంలో సహజంగా ఉండే తేమ (Lipids) తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అందుకే మీ బుజ్జాయి చర్మానికి సాధారణ లోషన్లు సరిపోవు. దీనికి ప్రత్యేకమైన సంరక్షణ కావాలి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటిలో సెటాఫిల్ బేబీ లోషన్ (Cetaphil Baby Lotion) అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది. మార్కెట్లో పిల్లల కోసం ఎన్నో రకాల లోషన్లు ఉన్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా చర్మ నిపుణులు (Dermatologists), చిన్నపిల్లల వైద్యులు […] The post Cetaphil Baby Daily Lotion: మీ చిన్నారి మృదువైన చర్మానికి 24 గంటల రక్షణ.. తల్లులు మెచ్చిన నంబర్ 1 ఛాయిస్! appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 28 Nov 2025 11:29 am

రష్యా ఇం‘ధన’మే యుద్ధానికి ఆజ్యమా?

రష్యా నుంచి భారత్ వంటి దేశాలు చమురు కొనుగోలు పూర్తిగా మానేస్తేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని, రష్యా దిగివచ్చి శాంతి ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. చమురు నుంచి వచ్చే పుష్కలమైన ఆదాయ వనరులతోనే ఆర్థికంగా బలం పెంచుకుని రష్యా ఉక్రెయిన్‌పై ఎడతెగని యుద్ధాన్ని కొనసాగిస్తోందని ట్రంప్ బాహాటంగా వెల్లడిస్తున్నారు. అంతేకాదు రష్యా లోని ప్రముఖ చమురు సంస్థలపై ఆంక్షలు కూడా విధించారు. ఈ ఆంక్షల ప్రభావం ఎంతవరకు యుద్ధాన్ని ఆపగలుగుతుందో చెప్పలేం. కానీ భారత్ మాత్రం ఈ ఆంక్షలతో చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. మాస్కో లోని రోస్‌నెఫ్ట్, లుకోయిల్ అనే భారీ చమురు ఉత్పత్తి సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంతో రష్యా నుంచి చవకగా చమురు కొనుగోలు చేయడం భారత్‌కు కష్టమవుతోంది. రష్యా కన్నా చవకగా మరే దేశం భారత్‌కు చమురు సరఫరా చేయడం లేదన్నది వాస్తవం. రష్యా నుంచి అందే చమురు సరఫరాలు భారత్ చమురు అవసరాల్లో 36 శాతం తీరుస్తున్నాయి. 2023 నుంచి రోజుకు అయిదు బిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు భారత్‌కు సరఫరా అవుతోంది. దీనివల్ల భారత్‌కు అదనపు ఖాతాలపై భారం చాలా వరకు తగ్గుతోంది. అయితే తాజాగా రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు రోజుకు 47 శాతం వంతున తగ్గిపోయాయి. అంటే అక్టోబర్‌లో రోజుకు 1.86 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి కాగా, ఈ నవంబరులో రోజుకు 9,82,000 బ్యారెళ్ల ముడి చమురు మాత్రమే దిగుమతి అయింది. దీన్ని బట్టి డిసెంబర్ జనవరి నాటికి దిగుమతులు మరింత ఎక్కువగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ స్వంత రిఫైనరీలు, రిలయన్స్ వంటి ప్రైవేట్ రిఫైనరీలు రష్యా నుంచి నేరుగా చమురు కొనుగోళ్లను తగ్గించి వేస్తున్నాయి. రిలయన్స్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని దాదాపు నిలిపివేసిందని చెప్పవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ సంస్థలు అమెరికా ఆంక్షల పరిధి లోకి రాని కంపెనీల నుంచి డిస్కౌంట్ ధరలకు చమురు సరఫరా చేస్తే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికాతోపాటు పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో భారతీయ కంపెనీలు రష్యాకు బదులుగా పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, పశ్చిమాఫ్రికా, అమెరికా, కెనడా తదితర దేశాల వైపు తమ దృష్టిని మరల్చుతున్నాయి. ఏదేమైనా చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడడం మాత్రం మనకు తప్పడం లేదు. ఈ దిశలో రష్యాయేతర ఇంధన వనరుల సంస్థలతో చమురు వాణిజ్య సంబంధాలు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచ చమురు మార్కెట్ ఇంధన నిల్వలతో సమృద్ధిగా ఉండటమే కాక, ధరలు కూడా తగ్గుముఖం పడతాయన్న అంచనా వస్తోంది. బ్రెంట్ ముడి చమురు ధరలు గత జనవరిలో బ్యారెల్‌కు 79 డాలర్లు ఉండగా, అక్టోబర్ నాటికి 64 డాలర్లకు పడిపోయాయి. అప్పటి నుంచి ధరలు నిలకడగా ఉంటున్నాయి. అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్‌కు బ్యారెల్‌కు 62.5 డాలర్లకు, 2026 మొదటి మూడు నెలల్లో 54 డాలర్లకు చమురు ధరలు ఇంకా పడిపోతాయని అమెరికా ఎనర్జీ ఇన్‌ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఇఐఎ) ముందస్తు అంచనా వెలువడింది. పెట్రోలు ఎగుమతి దేశాల ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ, ఇఐఎ వంటి సంస్థలు ధరలపై వేటికవే అస్పష్టమైన అంచనాలు అందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ధరలు తగ్గితేనే రష్యా దారి లోకి వస్తుందన్న దృఢ నమ్మకంతో ఉంటున్నారు. కానీ ఆయన ప్రయత్నాలు బెడిసికొట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా కొనసాగితే రష్యా చమురు సంస్థలపై మరిన్ని ఆంక్షలు అమెరికా విధించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచ చమురు మార్కెట్ మరింత కట్టుదిట్టమై ధరలు అమాంతంగా పెరిగిపోవచ్చు. అలాంటప్పుడు భారత్ పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న. అందుకని భారత్ ముందుచూపుతో ఒక్క రష్యాయే కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోక తప్పదన్న హెచ్చరికలు వస్తున్నాయి. భౌగోళిక రాజకీయాలు చమురు ధరలపై విపరీత ప్రభావం చూపిస్తాయి. 88 శాతం వరకు పూర్తిగా ఇంధన దిగుమతులపై ఆధారపడే భారత ఇంధన భద్రతకు ఇదో పెద్ద సవాలు. దేశీయ చమురు ఉత్పత్తిలో వివిధ కారణాల వల్ల ఏర్పడుతున్న క్షీణతను గమనించి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు భారత్ ముమ్మరం చేయవలసిన అగత్యం ఏర్పడుతోంది. చమురు ఉత్పత్తికోసం పెట్టుబడి పెట్టడంలో అవరోధకరమైన నిబంధనలు, అత్యధిక పన్నుల భారం, ఇవన్నీ సహజ చమురు క్షేత్రాలనుంచి ఉత్పత్తికి ఆటంకాలుగా పరిణమిస్తున్నాయి. ఈ అవాంతరాలను తొలగించుకోక తప్పదు. చమురు కోసం సముద్రగర్భ అన్వేషణ సాగించడంలో మనకు తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. ప్రపంచ చమురు దిగ్గజం చెవ్రాన్ అత్యంత ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అల్ట్రా హై ప్రెజర్‌తో చమురు తవ్వకాలను కొనసాగిస్తోంది. ఇదివరకు ఉపయోగించే సామర్థం కన్నా మూడింతలు ఎక్కువతో అన్వేషణలో దూసుకెళ్తోంది. మెక్సికో జలసంధిలో గతంలో చమురు లభ్యం కాని క్షేత్రాలనుంచి ఇప్పుడు సమృద్ధిగా చమురును సేకరించగలుగుతోంది. అలాంటి మార్గదర్శకత్వంతో మనదేశ సముద్ర తీర చమురు పరిపక్వ క్షేత్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చమురు నిల్వలను వెలికి తీయగల ప్రముఖ చమురు సంస్థల దిగ్గజాలను ప్రోత్సహించే ప్రణాళికలను ప్రభుత్వం చేపడితేనే చమురు సంపాదనలో స్వయం సామర్థం పెరుగుతుంది. స్వయం సామర్థం పెరిగితేనే రష్యా వంటి దేశాలపై చమురు కోసం ఆధారపడవలసిన గతి తప్పుతుంది. 

మన తెలంగాణ 28 Nov 2025 11:28 am

Shocker: Raj Tarun’s Film on OTT in a Week

Tollywood actor Raj Tarun has been struggling for success from the past few years. He released several films in the past few months and they ended up as debacles. His recent offering Paanch Minar, a comic entertainer released last Friday and the response has been disastrous. The film opened on a poor note and struggled […] The post Shocker: Raj Tarun’s Film on OTT in a Week appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 11:24 am

Cyber crime | 8 లక్షలు స్వాహా..

Cyber crime | 8 లక్షలు స్వాహా.. Cyber crime, మచిలీపట్నం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Nov 2025 11:13 am

poxo|ఇంటర్ బాలికపై అత్యాచారం..

poxo|ఇంటర్ బాలికపై అత్యాచారం.. poxo|గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : గుంటూరులో పట్టాభిపురం పోలీస్

ప్రభ న్యూస్ 28 Nov 2025 11:13 am

రంగారెడ్డి జిల్లాలో కారును ఢీకొట్టిన బస్సు... దగ్ధం

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కారును బస్సు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. వాహనదారులు డ్రైవర్ ను సురక్షితంగా కాపాడారు. క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చి కారును బస్సు ఢీకొట్టింది. బస్సుకు మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వికారాబాద్ నుండి శంకర్ పల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. శంకర్ పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. 

మన తెలంగాణ 28 Nov 2025 11:09 am

Makthal | 30న పుష్కరిణి ప్రారంభోత్సవం

Makthal | 30న పుష్కరిణి ప్రారంభోత్సవం పూర్తి కావస్తున్న పనులు పరిశీలించిన మంత్రి

ప్రభ న్యూస్ 28 Nov 2025 11:08 am

Temple |అయ్యప్ప వార్షికోత్సవ వేడుకలు…

Temple | అయ్యప్ప వార్షికోత్సవ వేడుకలు… అయ్యప్ప ఆలయ వార్షిక సన్నాహక సమస్యలు

ప్రభ న్యూస్ 28 Nov 2025 11:07 am

Hyderabad : అఖండ ఎఫెక్ట్...నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 11:00 am

Donation|హరే కృష్ణ హెరిటేజ్ టవర్‌ కు రూ.2 కోట్లు విరాళం

Donation| హైదరాబాద్, ఆంధ్రప్రభ : హరేకృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన

ప్రభ న్యూస్ 28 Nov 2025 11:00 am

Naveen Polishetty |సింగర్ గా రాణించేనా..?

Naveen Polishetty | సింగర్ గా రాణించేనా..? Naveen Polishetty, ఆంధ్రప్రభ వెబ్

ప్రభ న్యూస్ 28 Nov 2025 10:57 am

ఫూలేను అర్థం చేసుకున్నామా?

మహాత్మ అనే బిరుదు ఎవరికి పూర్తిగా సరిపోతుంది అని వెతికితే ఈ దేశంలో మొట్టమొదట కనిపించే పేరు జ్యోతిరావు ఫూలేది. ఆయన ఎందుకోసం మహాత్ముడయ్యాడు? ఎవరినైతే ఈ సమాజం హీనంగా చూసిందో ఫూలే వారిని అక్కున చేర్చుకున్నాడు. ఎవరికైతే చదువుకునే హక్కులేదని పండితులు గగ్గోలుపెట్టారో ఆ జాతికి చదువు చెప్పాడు. ఎవరినైతే ఇంటినుంచి బయటకు రారాదని శాసించి హింసించారో వాళ్లకు బయట ప్రపంచమేమిటో ఎలా ఉంటుందో చూపించాడు. ఆనాడు ఏ హక్కులూలేని మనుషులను మనుషులుగా చూసాడు. స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కులు ఉంటాయని భావించటం ఆనాడు ఒక పెద్ద నేరం. అలాంటి సందర్భంలో స్త్రీ హక్కుల కోసం గొంతు విప్పినవాడు ఫూలే. ప్రాచీనకాలంలో బుద్ధుడు, మధ్యయుగాల్లో వేమనల తరువాత ఒక జాతి మరొక జాతిమీద పడితింటూ వారినే అణచిఉంచే దుర్మార్గాన్ని ఎత్తిచూపిన ఆధునిక తొట్టతొలి భారతదేశపు విప్లవకారుడు ఫూలే. ఈ పని ఆయన కాలానికి ఎంత గొప్పదో ఆనాటి చరిత్రను చదివితే తెలుస్తుంది. ఫూలే అసమతుల్యమైన ఆనాటి చరిత్రను మార్చటానికి అనేక వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని పోరాడాడు. ప్రజలజీవితాలను శాసించేవి మతవిశ్వసాలు అని గుర్తించి వాటి మూలాలను అన్వేషించాడు. ఈ అన్వేషణా ఫలితంగానే గులాంగిరి, తృతీయ రత్న లాంటి విలువైన గ్రంథాలు పుట్టాయి. జనాభాలో సగానికిపైగా ఉన్న స్త్రీలు చదువు లేకపోవటం వల్ల, చైతన్యం లేకపోవటం వల్ల వెనుకబడిన సంగతిని గుర్తించి వారికోసం పాఠశాలలు నడిపాడు. ఈ దేశంలో ఆడపిల్లల కోసం మొట్టమొదటిసారిగా 1848 లోనే పాఠశాలలు పెట్టినవాడు ఫూలే. ఆడపిల్లలకు చదువు చెప్పటానికి మహిళా ఉపాధ్యాయులు అందుబాటులో లేరు. ఎందుకంటే ఆడపిల్లలు చదివితే కుటుంబానికే కాకుండా ఊరికే అరిష్టమని ప్రచారం చేశారు ఆనాటి మతపెద్దలు. అందుకే మొదట తన భార్యకు చదువు చెప్పి ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది ఆడపిల్లలకు చదువు చెప్పించాడు. దీంతో ఆగ్రహించిన ఆనాటి పండిత లోకం ఫూలే దంపతులమీద అనేక రకాల దాడులకు తెగబడ్డారు. ఆయన తండ్రి ద్వారానే ఇంట్లో నుంచి గెంటివేయించారు. 1856 లోనయితే ఆయనను చంపే కుట్ర కూడా చేసారు. ఇవేవీ ఆయన దృఢ సంకల్పం ముందు నిలబడలేకపోయాయి. కిందికులాలు అన్ని రకాలుగా పీడింపబడటానికి కారణాలు కనిపెట్టాడు. కులం గురించి ఆనాటికే శాస్త్రీయమైన అవగాహనను ఆయన కలిగి ఉన్నాడు. మతం గురించి కూడా హేతుబద్ధంగా ఆలోచించాడు. సెప్టెంబర్ 24, 1873 నాడు సత్యశోధక్ సమాజాన్ని స్థాపించాడు. పండితులు చెప్పే సత్యానికి అసలు సత్యానికి తేడా ఏమిటో ఈ సంఘం ద్వారా ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేసాడు. సామాజిక సంస్కరణను ప్రధాన కర్తవ్యంగా స్వీకరించామని చెప్పుకున్న ఆనాటి కొన్ని సంస్థల అసలు స్వరూపాన్ని ఆయన బట్టబయలు చేసాడు. తన‘సత్ సార’ గ్రంథంలో వాళ్ళ మీద సహేతుక విమర్శలను ఎక్కుపెట్టాడు. తాను రాసిన ‘సార్వజనిక్ సత్యధర్మ’ అనే పుస్తకంలో ఆయా సంఘాలలో శూద్రులను, అంటరాని కులాల్ని ఎందుకు భాగం చేయటం లేదన్న ప్రశ్నలు వేసాడు. ఆయన రచనలన్నీ అనేక ప్రశ్నలతో నిండి ఉంటాయి. సంభాషణా శైలిలో రచనలు చేసి తన సమకాలీన ప్రజల హృదయాలలోకి వెళ్లగలిగాడు. భాష కూడా పండిత భాష కాకుండా ఆనాటి ప్రజలభాషను పట్టుకొని రచనలు చేసాడు. సాహిత్య లోకానికి సంబంధించి అది కూడా ఒక విప్లవమే. అంబేద్కర్, ఫూలే వేసిన ఇదే తోవలో మరింత సమర్థవంతంగా పనిచేసి ఈ దేశంలో ప్రజలందరికీ న్యాయం చేయగలిగాడు. సాహిత్య రంగంలోను, సామాజిక రగం లోను ఫూలేకి అసలైన వారసుడు ఈ దేశంలో అంబేద్కర్ మాత్రమే. ఈ క్రమంలోనే అంబేద్కర్ ఫూలేను తన గురుత్రయంలో ఒకనిగా గౌరవించాడు. తాను రాసిన ‘కులనిర్మూలన’ అన్న పరిశోధనాగ్రంథాన్ని ఫూలేకి అంకితమిచ్చాడు. జి.పి.దేశ్‌పాండే చెప్పినట్టు ఫూలే మొట్టమొదటి శూద్ర మేధావి. శూద్రులలో(బిసి) అతిశూద్రులలో (ఎస్‌సి) చైతన్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు.అంబేడ్కర్‌ను కేవలం దళితులకే నాయకుణ్ణి చేయటం ఎంత పొరపాటో, ఫూలేను కేవలం బిసిలకు మాత్రమే అంటగట్టడం అంతే పొరపాటు. ఫూలే ఈ రెండు వర్గాలకోసం పని చేసాడు. ఈ వర్గాలలోని కార్మికులు, రైతుల హక్కుల కోసం ఆలోచించాడు. ఈ నేపధ్యంలో వాళ్ల జీవితాలలో మెరుగుదల కోసం అప్పటి బ్రిటీషు ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేసాడు. అయితే మెజారిటీ ప్రజల జీవితాలు ఇలా ఎందుకు అణగారిపోయాయో అన్నదానిమీద ఆయనకు స్పష్టత ఉంది. బ్రాహ్మనిజం (ఈ పదం ఆయన వాడాడు) దీనికి కారణమని ఆయన అనేక రచనల్లో చెప్పాడు. కార్ల్ మార్క్ పాలకవర్గం, పాలిత వర్గం అని విభజించినట్టుగా ఫూలే కూడా దేశప్రజలను రెండు జాతులుగా విభజించాడు. ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దోచుకుతింటున్న క్రమాన్ని గుర్తించి పీడిత వర్గం వైపు నిలబడి జీవితాంతం పోరాటం చేసాడు. ఈ పీడనను ధర్మబద్ధం చేస్తున్న మతవిశ్వాసాల పట్ల, ఆ సాహిత్యం పట్ల శత్రుత్వంతో నిలబడ్డాడు. కానీ అవన్నీ వదిలేసి ఫూలేను బిసి నాయకునిగా మాత్రమే చూడటంవల్ల జరిగే లాభం శూన్యం. ఆనాడు ఆయన ఏ అసమ వ్యవస్థతోనయితే పోరాడాడో అదే అసమ వ్యవస్థ ఈనాడు అనేక కొత్తరూపాల్లో కొనసాగుతూనే ఉంది. అది అలాగే కొనసాగినంత కాలం బిసిలకయినా, ఎస్‌సిలకయినా ఒనగూరేది శూన్యం. - తోకల రాజేషం, 9676761415 -  నేడు మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్థంతి

మన తెలంగాణ 28 Nov 2025 10:56 am

Chennur |మంత్రి వివేక్ మార్నింగ్ వాక్

Chennur | మంత్రి వివేక్ మార్నింగ్ వాక్ సమస్యలపై ఆరా Chennur |

ప్రభ న్యూస్ 28 Nov 2025 10:54 am

అతిపెద్ద వర్గం.. హక్కులకు దూరం

భారత రాజకీయ వ్యవస్థలో అతి పెద్ద వర్గం ఎవరు? అనడిగితే క్షణం ఆలస్యం లేకుండా చెప్పాల్సిన సమాధానం -బిసిలు. జనాభాలో 56 శాతం ఉన్నప్పటికీ హక్కుల్లో ఆరు శాతం కూడా రానివ్వని రాజకీయ జాలంలో బిసిలు చిక్కుకున్నది ఏ రోజునో ఎవరికీ గుర్తు లేదు. స్వాతంత్య్రం వచ్చిన 1947 నుంచీ 2025 వరకూ 78 సంవత్సరాలుగా దేశం ఎన్నో మార్పులు చూసింది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు ప్రవహించాయి, శాసనాలు వచ్చాయి, రాజ్యాంగ సవరణలు జరిగాయి, కానీ బిసి వర్గం మాత్రమే అన్యాయం అనే శబ్దానికి ప్రతీకగా మారిపోయింది. జనాభాపరంగా అతిపెద్ద వర్గమై ఉండటం రాజకీయ పార్టీలకు ఒక వరమైతే, వారి హక్కులు ఇవ్వకపోవడం అదే పార్టీలకు ఒక విధానంగా మారిపోయింది. బిసిల పరిస్థితి గంగలో ఆచమనం చేసినట్టు, గొప్ప మాటలతో ఆశలు చూపిస్తూ, కానీ అసలు హక్కుల వద్దకు రానీయకుండా, ఓట్లను మాత్రం కట్టిపడేసేలా చేస్తున్న అత్యంత వ్యవస్థీకృత రాజకీయ మాయాజాలానికి నిదర్శనం. దేశంలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు బిసిలు. వారు వ్యవసాయంలో పనిచేస్తారు, శిల్పకళల్లో పనిచేస్తారు, వృత్తుల్లో పనిచేస్తారు, పట్టణాల కార్మిక శక్తిలో పనిచేస్తారు. దేశంలోని ఉత్పత్తి వ్యవస్థలో వీరే వెన్నెముక. అయినా దేశపాలనలో వీరి స్థానమేంటి? శూన్యం. ఈ శూన్యం సాదాసీదా సంఖ్య కాదు, ఇది రాజకీయ, సామాజికంగా సద్దుమణిగించిన వర్గం చరిత్ర. ఎవరైనా బిసి నాయకుడు ఎదిగితే అది అతని వ్యక్తిగత పోరాటం, భగవద్గీతలో చెప్పిన స్వధర్మ యుద్ధం వంటిదే తప్ప, వర్గం మొత్తం ఎదిగిన కథ కాదు. ఎందుకంటే రాజకీయం ఈ వర్గాన్ని ఎప్పుడూ వ్యక్తుల వరకు పరిమితం చేసింది, వర్గం వరకు ఎప్పుడూ వెళ్లనీయలేదు. కారణం ఒకటే 56 శాతం వర్గం ఒక్కటైతే దేశ రాజకీయ సమీకరణం మొత్తం తలకిందులవుతుంది. జనగణన విషయంలోనే బిసిలపై ఎంత ఘోరమైన మోసం జరిగిందో భారత చరిత్రలో పెద్ద అధ్యాయమే. 1931లో చివరిసారిగా కులగణన జరిగి, 1941 లో యుద్ధ కారణంగా జరగక, ఆ తర్వాత స్వతంత్ర భారత్ ఒక శతాబ్దం జరిగిన దాకా కులగణన చేయించకుండా అడ్డుపడింది. ఎవరు అడ్డుపడ్డారు? రాజ్యాంగాన్ని కాపాడతామనే మాటలు చెప్పే జాతీయ పార్టీలు, వర్గ అభివృద్ధే తమ సిద్ధాంతమని చెప్పే ప్రాంతీయ పార్టీలు. ఎందుకు అడ్డుపడ్డారు? ఎందుకంటే నిజమైన సంఖ్య బయట పడితే, అంటే బిసిలు నిజంగా 56 శాతమని అధికారిక గణాంకం వెలువడితే వెంటనే రాజకీయ సమానత్వం కోరి ఒక మహాఉద్యమం వస్తుంది. ఇది పార్టీలు భరించలేవు. అందుకే బిసిల అసలు బలం గుప్తంగానే ఉంచారు. పార్లమెంట్‌లో బిసిల ప్రాతినిధ్యం ఇప్పటికీ 6-7 శాతం చుట్టూ తిరుగడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఎంత పెద్ద అపహాస్యమో చెప్పడానికి మాటలు చాలవు. స్వభావంలో బిసిలను అన్ని పార్టీలూ ఓటు బ్యాంకుగా చూసినప్పటికీ, అధికార పథానికి మాత్రం వీరిని దగ్గరకు రానీయలేదు. ప్రధానమంత్రి పదవి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, హోం మంత్రి, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి వంటి కీలక పదవుల్లో బిసిలు అరుదైన అతిథులు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది నిర్మిత వ్యవస్థ. ఎస్‌సి, ఎస్‌టిలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు, ఎందుకంటే వారిని ప్రాతినిధ్యం కల్పించకపోతే రాజ్యాంగమే ప్రశ్నార్థకమవుతుంది. కానీ బిసిలకు మాత్రం రాజకీయ రిజర్వేషన్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకు? ఎందుకంటే బిసిలకు రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన రోజు దేశ రాజకీయ భూకంపం తప్పదని ప్రతి పార్టీకి తెలుసు. 56 శాతం వర్గానికి సీట్లలో 50 శాతం కూడా వస్తే ఇక పార్టీలు, నాయకులు, పోలిటికల్ ఇంజినీరింగ్ అన్నీ మారిపోతాయి. జాతీయ పార్టీలు తమ తమ విధానాలతో బిసిలను మాయచేశాయి. కాంగ్రెస్ స్వాతంత్య్రం నుంచి 1990 వరకు బిసి అంశాన్ని పక్కనపెట్టింది. మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేసి కూడా దాని సిఫార్సులను అమలు చేయలేక సిగ్గుపడిపోయారు. అది అమలు అయినది కూడా కాంగ్రెస్ వల్ల కాదు, రాజకీయ ఒత్తిడితో, ఓటు సమీకరణాలతో. బిజెపి 2014 తర్వాత బిసిలను పెద్ద వర్గంగా సంకలనం చేసుకున్నా, బిసిలకు రాజ్యాంగ హక్కులు ఇవ్వడంలో, రాజకీయ రిజర్వేషన్ విషయంలో, కులగణన విషయంలో అడుగులు వేయలేదు. బిసిలు పార్టీకి ముఖ్యమైన వర్గం, కానీ నిర్ణయ ప్రక్రియలో ప్రభావం చూపే వర్గం కావడం మాత్రం అనుమతించలేదు. ఇది మరో రూపంలోని మాయాజాలం. ప్రాంతీయ పార్టీల ఆట అయితే మరింత సుతిమెత్తగా, మరింత చురుకుగా సాగింది. ప్రతి రాష్ట్రంలో బిసి అనే నినాదం పెద్దగా వినిపిస్తుంది. టిక్కెట్లు ఇస్తామని, కుర్చీలు ఇస్తామని, కమిషన్లు వేస్తామని పెద్ద ప్రచారం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిసిలు సాధారణంగా మూడో, నాలుగో వరుసలో ఉంటారు. ముఖ్యమంత్రి పదవి బిసికి దక్కడం భారతదేశంలో ఓ అరుదైన సూర్యగ్రహణంలా మారిపోయింది. రాష్ట్రాల్లో కేబినెట్ శాఖల్లో ముఖ్య పదవులు సాధారణంగా ప్రాధాన్యత గల వర్గాలకు మాత్రమే. బిసిలకు లభించేది తక్కువ ప్రాధాన్యత గల శాఖలు, అదీ రాజకీయ అవసరాల కోసం మాత్రమే. ఒకసారి ఎన్నికల వరకు కావలసినట్లుగా బిసిలను పెద్ద ఎత్తున వాడుకుంటారు. ఎన్నికలు ముగిసిన వెంటనే బిసిల సమస్యలు, వారి అభివృద్ధి, వారి విద్య, వారి ఉద్యోగాలు అన్నీ పార్టీలు మరచిపోతాయి. ఇకపైనా బిసిలకు నినాదాల కంటే హక్కులు కావాలి. మాటల కంటే అవకాశాలు కావాలి. కార్పొరేషన్ రుణాల కంటే రాజ్యాంగ హక్కులు కావాలి. బిసిలు ఈ దేశానికి వెన్నెముక అయితే, దేశ పాలనలో కూడా వెన్నెముకలా ఉండాలి. 56 శాతం వర్గానికి 6 శాతం హక్కులు సరిపోవు, సమానత్వానికి, ప్రజాస్వామ్యానికి, న్యాయానికి ఇది అవమానం. ఈ అన్యాయాన్ని సరిదిద్దబోయే శక్తి పార్టీలలో లేదు, ఆ శక్తి బిసిలలోనే ఉంది. వారు తమ శక్తిని గుర్తించాలి, తమ హక్కులను స్వయంగా డిమాండ్ చేయాలి, తమను మాయచేసే రాజకీయ భాష్యాలను చీల్చి పారేయాలి. 78 ఏళ్ల మాయాజాలానికి ముగింపు పలకాలంటే బిసిల చేతుల్లో ఉన్న ఓటు శక్తి చైతన్యవంతమవాలి. మాకు హక్కులు ఇవ్వాలి అన్న స్వరం ఒక రాష్ట్రంలో కాదు, దేశమంతటా ఒకటిగా వినిపించాలి. అప్పుడే బిసిల 56 శాతం సంఖ్య కేవలం ఓటు సంఖ్య కాదు, రాజకీయ, సామాజిక ఆర్థిక, సమానత్వానికి బలమైన ఆజ్ఞగా మారుతుంది. ఇక దేశం బిసిలను ఓటుగా కాదు, పాలనా భాగస్వాములుగా గుర్తించాల్సిన కాలం వచ్చింది అనేది నగ్నసత్యం. - మన్నారం నాగరాజు, 9550844433

మన తెలంగాణ 28 Nov 2025 10:39 am

ఆ కాంగ్రెస్ ఎంఎల్ఎపై అత్యాచారం కేసు నమోదు... సిఎంకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

తిరువనంతపురం: కేరళలోని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ రాహుల్ మామ్‌కుటత్తిల్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. రాహుల్ తనపై అత్యాచారం చేయడంతో పాటు గర్భాన్ని తొలగించుకోవాలని బలవంతం చేయడంతో పాటు తనని చంపేస్తానని బెదిరిస్తున్నాడని ముఖ్యమంత్రి పినరయ్ విజయ్‌కు యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్నామని, తనకు బిడ్డకావాలని పలుమార్లు కాంగ్రెస్ ఎంఎల్‌ఎ రాహుల్ బలవంతం చేశాడన్నారు. గర్భం దాల్చిన తరువాత అబార్షన్ చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడని వివరించింది. తాను అబార్షన్ చేసుకోవడానికి వ్యతిరేకించడంతో తనని చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను రికార్డు చేసి పోలీసులకు అప్పగించింది.   ఈ ఘటనపై రాహుల్ స్పందించారు. తాను ఇప్పటివరకు తప్పు చేయలేదని, కావాలని తనని ఇరిక్కిస్తున్నారని, దీనిని చట్టపరంగా ఎదుర్కొంటానని తెలియజేశారు. గతంలో రాహుల్ మామ్‌కుటత్తిల్ తననిపై లైంగికంగా వేధించాడని ఓ నటి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ పార్టీకి చెందిన యువనేత తనన లైంగికంగా వేధిస్తున్నాడని నటి రీని జార్జ్ ఇంటర్వూలో ఆరోపణలు చేసిన విషయం విధితమే. 

మన తెలంగాణ 28 Nov 2025 10:38 am

WORKER |పెద్దపల్లిలో ప్రమాదం…

WORKER | పెద్దపల్లిలో ప్రమాదం… పెద్దపల్లి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో ఎన్

ప్రభ న్యూస్ 28 Nov 2025 10:38 am

suicide|అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య..

suicide| బిక్కనూర్, ఆంధ్రప్రభ : కుటుంబ పోషణ కోసం చేసిన అప్పుడు తీర్చలేక

ప్రభ న్యూస్ 28 Nov 2025 10:37 am

Heavy snow|పలు గ్రామాలలో దట్టమైన పోగ మంచు

Heavy snow| వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ వేల్పూర్

ప్రభ న్యూస్ 28 Nov 2025 10:26 am

Vijayawada |భక్తుల కోసం..

Vijayawada | భక్తుల కోసం.. Vijayawada, ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : సామాన్య

ప్రభ న్యూస్ 28 Nov 2025 10:25 am

Collector |రోడ్లు ఇలా ఉంటే ఎలా?

Collector | రోడ్లు ఇలా ఉంటే ఎలా? కలెక్టర్ మేడం ఈ రహదారి

ప్రభ న్యూస్ 28 Nov 2025 10:24 am

జనవరి1న అందరం ఒకేసారి లొంగిపోతాం: మావోయిస్టులు

రాయ్‌పూర్: అందరం కలిసి ఒకేసారి లొంగిపోతామని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. ఛత్తీస్‌గడ్-మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ ప్రతినిధి పేరుతో అనంత్ లేఖ విడుదల చేశారు. జనవరి-౧న ఆయుధాలను విడిచి లొంగిపోతామని వివరించారు. ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని పేర్కొన్నారు. ఇప్పటికే హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ బలహీనమైంది. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగిపోయిన విషయం తెలిసిందే. మిగిలిన వారు లొంగిపోవాలని కేంద్రం విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. 2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామని, ఆయుధాలు ప్రభుత్వాలకు అప్పగించి పునరావాసాన్ని అంగీకరిస్తామని తెలియజేశారు. అందరం లొంగిపోయే వరకు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని కోరారు. జనజీవన స్రవింతిలో కలిసేందుకు సమయం కావాలని గతంలో మావోయిస్టులు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

మన తెలంగాణ 28 Nov 2025 10:17 am

‘వానర’ సక్సెస్ కావాలి

అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా వానర. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘వానర‘ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న ‘వానర‘ సినిమా మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ అవినాశ్ తిరువీధుల ఆయన టీమ్ కష్టపడి చేసిన ‘వానర‘ సక్సెస్ కావాలి అని అన్నారు. హీరో, డైరెక్టర్ అవినాశ్ తిరువీధుల మాట్లాడుతూ “వానరుడి లాంటి హీరో తనకు ఇష్టమైన బైక్‌ను రావణుడి లాంటి విలన్ తీసుకెళ్లిపోతే ఆ బైక్ ను తిరిగి తెచ్చుకునేందుకు ఎంతవరకు వెళ్లాడు, ఎలాంటి ఫైట్ చేశాడు అనేది ఈ చిత్ర కథాంశం. ఈ కథ అనేక మలుపులు తిరుగుతూ థ్రిల్ పంచుతుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిమాధవ్ బుర్రా, శంతను పత్తి, సుజాత సిద్ధార్థ్, శివాజీ రాజా, విశ్వజిత్, హర్ష ఛోటా కె ప్రసాద్, జానకీరామ్ పాల్గొన్నారు. 

మన తెలంగాణ 28 Nov 2025 10:09 am

India Vs South Africa : వన్డే సిరీస్ ను అయినా కొట్టండి బాసూ

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నెల 30వ తేదీన రాంచీ వేదికగా తొలి వన్డే జరగనుంది

తెలుగు పోస్ట్ 28 Nov 2025 10:08 am

ఫ్యాక్ట్ చెక్: తెలుగు యాంకర్ శివ జ్యోతి ఆధార్ కార్డును టీటీడీ యాజమాన్యం బ్లాక్ చేయలేదు

తెలుగు యాంకర్ శివ జ్యోతి ఆధార్ కార్డును టీటీడీ యాజమాన్యం బ్లాక్ చేసింది

తెలుగు పోస్ట్ 28 Nov 2025 10:08 am

Telangana : గ్రామాల్లో ఎన్నికల కోలాహలం..తొలిరోజు నామినేషన్లు ఏన్నంటే?

తెలంగాణలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 10:05 am

టీమిండియాకు కష్ట కాలం!

మన తెలంగాణ/ హైదరాబాద్: సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య భారత జట్టు వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. సిరీస్ ఆరంభానికి ముందు భారత్ ఫేవరెట్‌గా కనిపించింది. సౌతాఫ్రికా నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాదని, టీమిండియా అలవోక విజయం సాధిస్తుందని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు జోస్యం చెప్పారు. పర్యాటక దక్షిణాఫ్రికాకు కూడా గెలుపుపై పెద్దగా ఆశలు లేవు. సిరీస్‌ను సమం చేస్తే చాలు అనే ఉద్దేశంతో భారత పర్యటనకు వచ్చింది. కానీ ఈడెన్ గార్డెన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేసిన పోరాటాన్ని ఎంత పొగిడినా తక్కువే. స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుంటూ మ్యాచ్‌లో చారిత్రక విజయం సాధించింది. సౌతాఫ్రికా టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన విజయంగా చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతోంది. సొంత గడ్డపై భారత్‌ను 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించకుండా ఆపడంలో సౌతాఫ్రికా సఫలమైంది. సఫారీ బౌలర్లు అసాధారణ ప్రతిభతో తమ జట్టుకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు. ఇక గౌహతిలో కూడా సౌతాఫ్రికా మెరుగైన ఆటతో అలరించింది. భారత్‌ను మరోసారి ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి వరుసగా రెండో టెస్టులోనూ జయకేతనం ఎగుర వేసింది. అంతేగాక 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను దక్కించుకుంది. కోలుకోవడం కష్టమే దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు ఇప్పట్లో కోలుకోవడం అంత తేలిక కాదనే చెప్పాలి. స్వల్ప వ్యవధిలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో టీమిండియా టెస్టుల్లో వైట్ వాష్‌కు గురైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన భారత్ సొంత గడ్డపై జరిగిన సిరీస్‌లో ఇలాంటి ఘోర పరాజయాలను మూట గట్టుకోవడం ఇదే ప్రథమం. ఈ షాక్ నుంచి బయటపడి టెస్టుల్లో మళ్లీ విజయాల బాట పట్టడం అనుకున్నంత సులువు కాదని చెప్పొచ్చు. టీమిండియా పేలవమైన ప్రదర్శనకు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సీనియర్ క్రికెటర్లపై అతను అనుసరిస్తున్న విధానం జట్టు ప్రస్తుత దుస్థితికి ఒక కారణంగా చెప్పక తప్పదు. అంతేగాక అనవసర ప్రయోగాలకు దిగుతూ జట్టు ఆత్మవిశ్వాసాన్ని కూడా పూర్తిగా దెబ్బతీశారు. ఇలాంటి స్థితిలో గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తప్పించడమే మంచిదనే డిమాండ్ ఊపందుకుంది.

మన తెలంగాణ 28 Nov 2025 10:03 am

IBomma : నేడు రెండో రోజు ఐబొమ్మ రవి విచారణ

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని నేడు రెండో రోజు సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు

తెలుగు పోస్ట్ 28 Nov 2025 10:01 am

పవర్‌ఫుల్ ‘వనవాసం..’

బబుల్గమ్ తో సక్సెస్‌ఫుల్ డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల తన సెకండ్ మూవీ ’మోగ్లీ 2025’ తో వస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. గురువారం మేకర్స్ సెకండ్ సింగిల్ వనవాసం రిలీజ్ చేశారు. కాల భైరవ స్వరపరిచిన ఈ పాటలో భావోద్వేగం పురాణ చిహ్నాలతో ఇంటెన్స్‌గా కనిపిస్తుంది. రోషన్, సాక్షి మడోల్కర్ కెమిస్ట్రీ అందంగా అలరిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. 

మన తెలంగాణ 28 Nov 2025 9:50 am

క్లైమాక్స్ కు చేరిన పరకామణి చోరీ కేసు..నేడు వైవీ సుబ్బారెడ్డి విచారణకు

పరకామణి చోరీ కేసులో సిట్‌ అధికారులు విచారణను వేగవంతం చేయనున్నారు

తెలుగు పోస్ట్ 28 Nov 2025 9:49 am

Breaking : మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 9:45 am

AP |ధాన్యం సేకరణ..

AP | ధాన్యం సేకరణ.. AP, పెడన, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్

ప్రభ న్యూస్ 28 Nov 2025 9:43 am

Dead body |ఆ.. మృతదేహం ఎవరిది..?

Dead body | ఆ.. మృతదేహం ఎవరిది..? Dead body, ఎడపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Nov 2025 9:36 am

Cyclone Alert : తుపాను తీరం దాటే సమయంలో ఇలా వ్యవహరించాల్సిందేనట

నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుపాన్ గా మారనుంది

తెలుగు పోస్ట్ 28 Nov 2025 9:34 am

Earth Quake : అమెరికాలో భూకంపం

అమెరికాలోని అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతగా నమోదయింది

తెలుగు పోస్ట్ 28 Nov 2025 9:29 am

‘అఖండ 2’లో అబ్బురపరిచే వాహనం

అఖండ 2 సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ నడిపిన వాహనాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఎక్స్‌డ్రైవ్ అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా, ఎక్స్ స్టూడియోస్ దానికి అద్భుతమైన సినీమాటిక్ లుక్‌ను అందించింది. పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుంది. నందమూరి బాలకృష్ణ శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ “అమర్ ఈ వాహనాన్ని రాత్రి పగలు కష్టపడి గొప్పగా డిజైన్ చేశారు. అందుకు ఆయనని అభినందించాలి. ఈ వెహికల్ ని యాక్షన్‌లో ఎంత అద్భుతంగా వాడుకున్నామో అది మీరు థియేటర్స్‌లో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. అఖండ2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. అభిమానులు అందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యే సినిమా ఇది”అని అన్నారు. అమర్ మాట్లాడుతూ “అఖండ 2 సినిమాలో ఈ వాహనం స్క్రీన్ మీద అబ్బురపరుస్తుంది. తప్పకుండా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది”అని తెలిపారు.

మన తెలంగాణ 28 Nov 2025 9:29 am

Chittoor |కాకరకాయ.. కాసుల వర్షం..

Chittoor | కాకరకాయ.. కాసుల వర్షం.. Chittoor, చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 9:22 am

Narendra Modi : నేడు రెండు రాష్ట్రాలకు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 9:20 am

దోనీ ఇంటికెళ్లిన టీమిండియా ఆటగాళ్లు

రాంచీ: టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. తొలి వన్డే రాంచీలో జరుగుతుండడంతో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. రాంచీ అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే. దీంతో టీమిండియా ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్‌తో ధోనీకి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ముగ్గురు కలిసి దోనీ ఇంటికి వెళ్లారు. రాంఛీలో టీమిండియా ఆడుతుండడంతో ధోనీ ఈ మ్యాచ్‌ను వీక్షిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఐపిఎల్ తరువాత ధోనీ ఇప్పటివరకు మైదానంలో చూడలేదు. ధోని తొలి వన్డే మ్యాచ్ కోసం మైదానానికి వస్తాడని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి గాయంతో ఆటకు దూరం కావడంతో కెఎల్ రాహుల్ వన్డే కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్, విరాట్ బ్యాటింగ్ చూసే అవకాశం అభిమానులకు దక్కింది. 

మన తెలంగాణ 28 Nov 2025 9:06 am

Lottery |ఆ.. నలుగురు అరెస్ట్..

Lottery | ఆ.. నలుగురు అరెస్ట్.. Lottery, చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో :

ప్రభ న్యూస్ 28 Nov 2025 9:03 am

Gold Price Today : బంగారం బరువెక్కుతుంది.. వెండి వేడెక్కుతుందిగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:58 am

Makthal |రథోత్సవం..

Makthal | రథోత్సవం.. Makthal, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:53 am

Tirumala : తిరుమలకు నేడు వెళితే.. మీరు ఎన్ని గంటలు వెయిట్ చేయాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:40 am

TG |ఎన్నికల పంచాయితీ..

TG | ఎన్నికల పంచాయితీ.. TG, ఎడపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయితీల

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:38 am

భార్యకు డెత్ సర్టిఫికెట్ పంపిన భర్త

అమరావతి: భార్య కాపురం చేయడానికి రావడం లేదని ఆమెకు భర్త డెత్ సర్టిఫికెట్ పంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ కడప జిల్లా ముద్దనూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కలసపాడు మండలం దూలంవారిపల్లెకు చెందిన ఆదిలక్ష్మి అనే యువతి 14 సంవత్సరాల క్రితం ముద్దనూరుకు చెందిన మారుతిరాజును పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఆదిలక్ష్మి భర్తను వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు ఫోన్ చేసి భార్యన ఇంటికి రమ్మని భర్త కబురు పంపాడు. ఆమె రాకపోవడంతో విసుగు చెంది భార్య పేరుతో డెత్ సర్టిఫికెట్ తయారు చేసి పోస్టులో పంపాడు. తాను బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ పంపడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి మారుతిరాజు స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తన తల్లి పేరుతో ఉన్న డెత సర్టిఫికెట్ మారన్చి తయారు చేశానని ఒప్పుకున్నాడు.  

మన తెలంగాణ 28 Nov 2025 8:33 am

Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:26 am

Photos: Vaanaram Movie Teaser Launch

The post Photos: Vaanaram Movie Teaser Launch appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 8:21 am

దేవ్ జీ ని కోర్టులో హాజరు పర్చండి

దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నారని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని మావోయిస్టు పార్టీ కోరింది

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:16 am

Photos: Anaganaga Oka Raju Song Launch Event

The post Photos: Anaganaga Oka Raju Song Launch Event appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 8:15 am

కాసు లిస్తేనే కుట్లు

విశాలాంధ్ర బ్యూరో – తూర్పుగోదావరి : ఆ కమ్యూనిటీయల్ హెల్త్ సెంటర్లో కాసులు ఇస్తే మద్యం మత్తులో కుట్లు వేస్తారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కాసులు ఇస్తే కానీ కుట్లు వేయని ఉద్యోగి బాగోతం బయట పడింది. అతను మద్యం సేవించి విధులకు హాజరు అవుతారు. ఇతనిని ప్రశించే నాధుడే లేరు. కొవ్వూరు కమ్యూనిటీయల్ సెంటర్లో సౌకర్యాలు కరువయ్యాయని గతంలో వరుస కథనాలతో విశాలాంధ్ర పత్రిక సమస్యలను బయట పెట్టడంతో స్పందించిన అధికారులు […] The post కాసు లిస్తేనే కుట్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 8:11 am

BB Telugu 9, Day 81: Ex-Housemates Stir Romance, Chaos and Competition

Day 81 brought a lively mix of romance, comedy and heated arguments as former Bigg Boss contestants Prince Yawar, Shobha Shetty and Syed Sohail entered the house. Their presence not only entertained but also played a decisive role in shaping the captaincy race for the week. Prince Yawar Brings Flirtation and Fun Season 7 contestant […] The post BB Telugu 9, Day 81: Ex-Housemates Stir Romance, Chaos and Competition appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 8:07 am

Amaravathi : అపూర్వ ఘట్టానికి నేడు ముహూర్తం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:06 am

రాజధాని రైతులకు ఇక సమస్యలుండవ్

రాజధాని ల్యాండ్ పూలింగ్ కు లంక భూములు ఇచ్చిన రైతుల సమస్య పరిష్కారం అయిందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:03 am

Murder |మాజీ మావోయిస్టు హత్య..

Murder | మాజీ మావోయిస్టు హత్య.. తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:02 am

శిక్షణ కార్యక్రమం

రైతు ఉత్పత్తిదారుల సంస్థ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం విశాలాంధ్ర -కొవ్వూరు : కొవ్వూరు డిఆర్డిఏ సెర్ప్ మరియు హిఫర్ ఇంటర్నేషనల్ వారి భాగ్యస్వామ్యంతో రైతు ఉత్పత్తిదారుల సంస్థ సిబ్బందికి సుస్థిరత మరియు వృద్ధి శిక్షణ సమావేశం కొవ్వూరు వెలుగు కార్యాలయంలో గురువారం జరిగింది ఏపీఎంకే నిర్మల కుమారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఆర్డిఏ పిడి ఎన్ వీవీ ఎస్ మూర్తి డిఆర్డిఏ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్య నాయుడు హాజరయ్యారు. రైతు ఉత్పత్తిదారుల […] The post శిక్షణ కార్యక్రమం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:52 am

Machilipatnam |జడ్పీ సమావేశం..

Machilipatnam | జడ్పీ సమావేశం.. Machilipatnam, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ప్రజా

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:51 am

ఫ్యాక్ట్ చెక్: బైక్ మీద వెళుతున్న వ్యక్తిపై పులి దాడి చేస్తున్న వీడియో నిజమైనది కాదు. ఏఐ ద్వారా సృష్టించారు

బైక్ మీద వెళుతున్న వ్యక్తిపై పులి దాడి చేస్తున్న వీడియో. కొందరు పులి దాడి చేయడం చూడగానే పారిపోతూ కనిపించారు

తెలుగు పోస్ట్ 28 Nov 2025 7:50 am

Amaravathi : అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయాల్సిందే.. చంద్రబాబు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండో దశ భూసమీకరణ తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు

తెలుగు పోస్ట్ 28 Nov 2025 7:50 am

కత్తికి తగ్గిన పదును.... కత్తికి దూరంగా వెళ్లిపోతున్న వైద్యులు

ఇటీవల కాలంలో మెడికల్ విద్యార్థులు సర్జరీ విభాగంలో పనిచేయడానికి ఉత్సాహం చూపించడం లేదు. ఈ నెలలో జరిగిన నీట్ 2025 పరీక్షల కౌన్సిలింగ్ లో అత్యధిక మంది విద్యార్థులు జనరల్ మెడిసిన్ మరియు రేడియాలజీని తీసుకున్నారు. ఢిల్లీలో టాప్ 1,500 మంది అభ్యర్థులలో, 632 మంది విద్యార్థులు (42%) MD జనరల్ మెడిసిన్‌ను ఎంచుకున్నారు, ఇది అనేక మెడికల్ సూపర్‌స్పెషాలిటీలకు ప్రవేశ ద్వారంగా దాని స్థానాన్ని మనకు తెలియచేస్తుంది. రేడియోడయాగ్నసిస్‌ను నిశితంగా అనుసరించారు, 447 మంది అభ్యర్థులు ఎండి రేడియాలజీ (30%) తీసుకున్నారు, ఇది మరింత నిర్మాణాత్మక గంటలు, తక్కువ అత్యవసర పరిస్థితులను అందించే రంగంగా ఉంది. దీనికి విరుద్ధంగా, 99 మంది విద్యార్థులు (6.6%) మాత్రమే ఎంఎస్ జనరల్ సర్జరీని ఎంచుకున్నారు, ఇది అధిక-రిస్క్ అయినా ఆపరేషన్ల విభాగాన్ని విధానపరమైన విభాగాల పట్ల విముఖతను హైలైట్ చేస్తుంది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఆ కాలంలో ఎక్కువమంది సర్జరీ తీసుకునేవారు ఆర్థోపెడిక్స్ తీసుకునేవారు. చాలామంది సర్జరీ తీసుకుంటే మెడికల్ విషయాలలో తలనొప్పి అని భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ చిన్న ఆపరేషన్ చేసినా కానీ ఎప్పుడైనా కాంప్లికేషన్ రావచ్చు దీనివలన డాక్టర్లపై దాడులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా కోర్టులలో వాజ్యాలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి డాక్టర్లు దోచుకుంటా అన్నారు అని అనడం, దాడి చేయడం ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే మెడికల్ ఫెసిలిటీలు పరీక్షలు ఐసియు ఛార్జీలు ఎక్కువ అయ్యి వైద్యం చాలా కాస్ట్లీ అయిపోయింది. ఈ విషయం మన ప్రజలకు అర్థం కాకపోవడం వలన ఆపరేషన్లు ఫెయిల్యూర్ అయితే డబ్బులు ఖర్చయిపోయినాయి అని బాధపడి దాడులు చేస్తున్నారు. ఇది ఒక ముఖ్య కారణంగా విద్యార్థులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ కాలం శ్రమించి ఆపరేషన్లు నేర్చుకోవాలి, వాళ్లకు వచ్చే డబ్బులు కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందువలన ఎందుకొచ్చిన తలకాయ నొప్పి అని ఆ బ్రాంచ్ ను తీసుకోవడం తగ్గించేసారు. శస్త్రచికిత్స వృత్తిలో స్థిరపడటానికి తరచుగా న్యూరోసర్జరీ, కార్డియాక్ సర్జరీ, యూరాలజీ లేదా పీడియాట్రిక్ సర్జరీ వంటి రంగాలలో మరింత సూపర్ స్పెషలైజేషన్ అవసరం, అలా చేయగలిగితేనే స్థిరత్వానికి మార్గాన్ని పొడిగిస్తుంది. దీనికి మరలా మూడు సంవత్సరాల ఎం సి హెచ్ చేయవలసి ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు మూడేళ్ల చదువు తమ ఎండి చేయడంలో కొనసాగించి ఎంబిబిఎస్ తో కలుపుకుంటే 9 ఏండ్లు అప్పటికే చదివి వింటారు.. ఇంకా మూడేళ్లు అనగా 12 ఏళ్లు చదవవలసి వస్తుంది. దాని తర్వాత ఆపరేషన్లలో సూపర్ స్పెషాలిటీలో నైపుణ్యం సంపాదించాలి అంటే మరో ఐదేళ్ల కాలం పడుతుంది. దీనికి ఈ కాలం విద్యార్థులు సిద్ధంగా లేరు... ఇందుకు కారణం చాలా లోతుగా ఉంది. ఈ సర్జరీ విభాగాలలో చేరితే ఎక్కువ పని గంటలు చేయాల్సి రావడం, ఎక్కువ అంకితభావంతో పనిచేయాల్సి రావడము, అధికమైన భావోద్వేగ పరిస్థితులలో పని చేయాల్సి రావటము వలన అత్యధికమైన మోటివేషన్ లేకుంటే బర్నౌట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ప్రైవేట్ కాలేజీలలో విద్యను అభ్యసించి ఎక్కువ ఫీజులు చెల్లించి మెడిసిన్ చదివిన ఈ కాలపు యువతకు అంత కష్టపడాల్సిన అవసరం ఉందా? అని భావిస్తున్నారు.. అందుకనే ఎక్కువ ప్రమాదం లేని రేడియాలజీ జనరల్ మెడిసిన్ లాంటి విభాగాలను ఎంచుకుంటున్నారు.. ఈ విధంగా తక్కువ రిస్క్ గల బ్రాంచ్ల వైపు విద్యార్థులు మారడాన్ని ఫ్యూచర్లో మనకు సర్జన్ల కొరత ఎక్కువ అయిపోయి కీలకమైన ఆపరేషన్లు చేసే సర్జన్లు తక్కువగా అయిపోయి ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇక సూపర్ స్పెషాలిటీ లైన గుండె ఆపరేషన్ల విభాగము ఎంసిహెచ్ సిటివిఎస్ న్యూరో సర్జరీ విభాగాలలో తీసుకునే వాళ్ళు విదేశాల్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ ట్రెండ్ ఇప్పటికే అన్ని దేశాలలో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు భారతీయ యువత కూడా చాలెంజింగా ఉండి ఎక్కువ రిస్క్ తో కూడిన ఆపరేషన్ చేసే వైపునుండి స్థిరత్వంగా ఆదాయం ఉండి తక్కువ పని గంటలు తక్కువ రిస్కు ఉండే రేడియాలజీ మెడిసిన్ లాంటి వైపుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందువలన కత్తికి పదును తగ్గి కత్తికి దూరంగా వెళ్లిపోతున్నారు. ఈ మార్పు మంచిదేనా సమాజానికి అనేది మనం గమనించాలి.. సమాజం పోకడల వలన విద్యార్థులు మారారా లేక విద్యార్థులలో రిస్కు తీసుకొని చాలెంజింగా వృత్తిని నిర్వహించాలి అనే స్పృహ తగ్గిందా? మీరు ఏమంటారు?   డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్  గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

మన తెలంగాణ 28 Nov 2025 7:48 am

కలలకు ఆటంకం- గౌరమ్మ

బాల్య వివాహాలతో బాలికల బంగారు కలలకు ఆటంకం – బాల్య వివాహ ముక్త భారత్ కొవ్వొత్తుల ర్యాలీ – సిడిపివో జి.గౌరమ్మ విశాలాంధ్ర – రాజానగరం : బాల్య వివాహాలతో బాలికల బంగారు కలలకు ఆటంకపరచడంతో పాటుగా విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధి వంటి అవకాశాలను దూరం చేస్తుందనీ రాజానగరం చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సిడిపివో) జి.గౌరమ్మ అన్నారు. మండల కేంద్రమైన రాజానగరంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో ఐసిడిఎస్ సిడిపివో అధ్యక్షతన ఉమెన్ అండ్ చైల్డ్ […] The post కలలకు ఆటంకం- గౌరమ్మ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:44 am

AP |స్టూడెంట్స్ కోసం..

AP | స్టూడెంట్స్ కోసం.. AP, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : డిసెంబర్ 5వ

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:43 am

పోలీస్ స్టేషన్ లో బంగారు వ్యాపారుల‌ను క్రూరంగా కొట్టిన వసంత్ ఎవరు: టిడిపి ఎంఎల్ఎ

అమరావతి: ఒక అనధికారిక వ్యక్తి వద్దకు తుపాకీ ఎలా వచ్చిందని పోలీసులను ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ప్రశ్నించారు. పోలీసుల తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు వ్యాపారుల‌ను అత్యంత క్రూరంగా కొట్టిన విషయంలో విజయవాడ అడిషనల్ ఎస్పీ అని చెప్పుకున్న అనధికారిక వ్యక్తి వసంత్ ఎవరు? అని, ప్రొద్దుటూరు డిఎస్ పి ఏం చేస్తున్నారని నిలదీశారు. పోలీసు అధికారి కాని వ్యక్తి తుపాకీ గురిపెట్టి నిరపరాదులను బెదిరిస్తారా? అని పోలీసులను వ‌ర‌ద‌రాజులురెడ్డి అడిగారు. ప్రొద్దుటూరు డిఎస్ పి కార్యాలయంలో వసంత్ అనే వ్యక్తి వచ్చి మాట్లాడారని మాకు సమాచారం ఉందని ఆరోపణలు చేశారు. పక్కనే ఉన్న పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎందుకు బదిలీ చేశారని అడిగారు. ఇలాంటి సంఘటన జరిగిన దానికి తాము సిగ్గుపడుతున్నామని, ఇక మీదట ఇలాంటి చర్యలు జరగకుండా శాసనసభ్యునిగా చూసే బాధ్యత తనపై ఉందన్నారు. ఈ విష‌యాన్ని డిఐజి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని వ‌ర‌ద‌రాజులురెడ్డి స్పష్టం చేశారు.  ఉన్నతాధికారుల ప్రమేయంతో పోలీసులు ప్రైవేట్ పంచాయితీలు చేస్తున్నారన్న వరదరాజులురెడ్డి గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శ్రీనివాసులు అనే బంగారు వ్యాపారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపణ చేసిన విషయం విధితమే. 

మన తెలంగాణ 28 Nov 2025 7:36 am

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం

విశాలాంధ్ర – నిడదవోలు : దేవస్థానం అభివృద్ధి కి, ఆస్తుల పరిరక్షణ కు కృషి చేస్థామని శ్రీ ఉమా మల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు అన్నారు. నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో వేంచేసి యున్న శ్రీ ఉమా మల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం నిర్వహించారు. ఉమా మల్లేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ గొల్లపల్లి మురళి కృష్ణ పాలకవర్గ సభ్యులుగా భోగిరెడ్డి సుబ్బారావు, పులిమి సూర్యనారాయణ, సింగనపూడి మందేశ్వరరావు., అయినమిల్లి యేసు, గొలుగొండ వెంకటలక్ష్మి, […] The post ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:33 am

Amaravathi : నేడు అమరావతిలో 25 బ్యాంకులకు శంకుస్థాపన

అమరావతిలో నేడు ఇరవై ఐదు బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది

తెలుగు పోస్ట్ 28 Nov 2025 7:29 am

దేవదాసుకు పదోన్నతి

సీనియర్ అసిస్టెంట్ దేవదాసుకు పదోన్నతి. విశాలాంధ్ర – కడియం : కడియం మండల పరిషత్తు సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ దేవదాసు కు డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి దక్కింది. ఆయనను రాజనగరం మండలం జి ఎస్ డబ్ల్యూ ఎస్ డిప్యూటీ ఎంపీడీవో గా నియమిస్తూ జిల్లా కలక్టర్ కీర్తి చేకూరి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గత మూడేళ్లుగా ఇక్కడ సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తూ అందరి మన్ననలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఎంపీపీ వెలుగుబంటి […] The post దేవదాసుకు పదోన్నతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:25 am

తోట పార్టీ

భూపతి పాలెం ఏపీఆర్ స్కూల్లో పిన్సిపల్ పి సత్య శేఖర్ ఆధ్వర్యంలో తోట పార్టీ ( గార్డెన్ పార్టీ )విశాలాంధ్ర – గోకవరం : గోకవరం మండలం భూపతి పాలెం గ్రామంలో నున్నా ఏపీ ఆర్ స్కూల్ లో గురువారం ప్రిన్సిపాల్ పి సత్య శేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గార్డెన్ పార్టీ . ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ లో చదువుకున్న పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ సృజన్ సమక్షంలో ఆలుమిని ఎగ్జిక్యూటివ్ నెంబర్లు కలిసి స్కూల్లో చదువుతున్న […] The post తోట పార్టీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:21 am

Panchayat elections |యువత షరతు..

Panchayat elections | యువత షరతు.. Panchayat elections, టేకుమట్ల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:21 am

Telangana : తెలంగాణ అన్నదాతలకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 7:18 am

అనుచిత రాజకీయ ఒత్తిళ్లు ఆందోళనకరం

– జిల్లా అధ్యక్షుడు వర్మ విశాలాంధ్ర – రాజమహేంద్రవరం :తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది‌పై జరుగుతున్న అనుచిత రాజకీయ ఒత్తిళ్లు ఆందోళనకరం అని జిల్లా అధ్యక్షుడు పి. గిరి ప్రసాద్ వర్మ అన్నారు. వర్మ మాట్లాడుతూతూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పలు రాజకీయ ఒత్తిడులు, అనుచిత ప్రవర్తనల వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటువంటి పరిస్థితుల్లో నుంచి వైద్య ఆరోగ్య శాఖను తక్షణమే రక్షించాలని […] The post అనుచిత రాజకీయ ఒత్తిళ్లు ఆందోళనకరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:01 am

Kavitha |పూజలు..

Kavitha | పూజలు.. Kavitha, బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : కామారెడ్డి జిల్లా

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:59 am

జిల్లాలో డ్రైవ్ –జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ 

జిల్లాలో స్కూల్ బస్సుల ప్రత్యేక డ్రైవ్ – నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4* *భద్రతా తనిఖీలు & ప్రధాన ప్రమాణాలు* *బస్సు తనిఖీ లు యాజమాన్యాల బాధ్యత – లోపాలు కనపడితే కఠిన చర్యలు* జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ విశాలాంధ్ర – రాజమహేంద్రవరం :తూర్పు గోదావరి జిల్లాలోని విద్యాసంస్థల స్కూల్ బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడానికి రవాణా శాఖ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు […] The post జిల్లాలో డ్రైవ్ – జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 6:43 am

రైతన్న మీ కోసం లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

రైతన్న మీ కోసం’ – తొర్రేడులో కరపత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి *వరి సాగు లాభాలపై రైతులతో ముఖాముఖి – కలెక్టర్ కీర్తి చేకూరి* *సేంద్రీయ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన – పంట మార్పిడిపై దృష్టి సారించాలని సూచన* విశాలాంధ్ర – రాజమహేంద్రవరం రూరల్ :గురువారం తొర్రేడు గ్రామంలో నిర్వహించిన ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కరపత్రాలను పంపిణీ చేసి, రైతులతో నేరుగా మాట్లాడారు. వరి […] The post రైతన్న మీ కోసం లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 6:36 am

Akhanda 2 |వెహికిల్ మెస్మరైజ్ చేస్తుంది –బోయపాటి

Akhanda 2 | వెహికిల్ మెస్మరైజ్ చేస్తుంది – బోయపాటి Akhanda 2,

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:30 am

సత్యదేవ నర్సరీని సందర్శించిన ఒరిస్సా

సత్యదేవ నర్సరీని సందర్శించిన ఒరిస్సా ఎన్నికల అధికారులు. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని ఒరిస్సా జిల్లా పరిషత్ ఛైర్మన్ మరియు సర్పంచ్ ఎన్నికల అధికారుల బృందం గురువారం సందర్శించింది. నర్సరీ రైతు పుల్లా పెద్ద సత్యనారాయణ వారికి మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. ఇక్కడి మొక్కలు ప్రకృతిలో సంభవిస్తున్న కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రిస్తున్నాయని వారికి వివరించారు. నర్సరీలో పలు రకాల మొక్కల శాస్త్రీయ నామాలు, వాటివల్ల ఉపయోగాలను వారు […] The post సత్యదేవ నర్సరీని సందర్శించిన ఒరిస్సా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 6:16 am