TDP : టీడీపీకి అనుకూల శత్రువు సీఆర్
సీనియర్ నేత సి. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఉండి కూటమిలోని బీజేపీ పై విమర్శలు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పదవ తరగతి విద్యార్థులు ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు
జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా: సుప్రీం
ఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అని పిటిషన్ వేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తిరుమల లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని ఎవరూ మాట్లాడకుండా స్టే విధించాలని మానురూ శ్రీనివాస్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే లడ్డూ వ్యవహారం సిబిఐ దర్యాప్తు చేస్తోందని, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని శ్రీనివాస్ను సిజెఐ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఏమైనా ఆధారాలు ంటే సిబిఐ అధికారులకు అందించాలని అతడికి కోర్టు సలహా ఇచ్చింది. సిబిఐ విచారణ జరుగుతుండగా తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది.
Supreme Court |పిటిషన్ కొట్టివేత
Supreme Court | పిటిషన్ కొట్టివేత Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్
బోరు వెల్ ఏర్పాటు పనులకు పూజ..
కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని బెల్లాల్ గ్రామ పంచాయతీ లోని ఎస్టీ
కాంగ్రెస్ నేతల మధ్య లేఖల యుద్ధం
పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్న అయ్యర్, థరూర్ న్యూదిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నేతలు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, శశిథరూర్ బహిరంగ లేఖల రూపంలో తాజాగా పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. థరూర్తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకుంటున్నట్లు అయ్యర్ పేర్కొనగా.. ఆయన తీరును థరూర్ తీవ్రంగా తప్పుబట్టారు. థరూర్కు అయ్యర్ రాసిన బహిరంగ లేఖ ఓ మ్యాగజీన్లో ఇటీవల ప్రచురితమైంది. ఈ నెల 6న థరూర్ ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ… ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ […] The post కాంగ్రెస్ నేతల మధ్య లేఖల యుద్ధం appeared first on Visalaandhra .
ప్రతి వార్డులోని సమస్యలు పరిష్కరిస్తా..
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ప్రతి వార్డులోని సమస్యలను పరిష్కరిస్తానని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్
10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం..
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్( యు
హైదరాబాద్లో MIM ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను చించివేసిన మాధవీలత #Hyderabad#Iftar#Ramzan#BanjaraHills
కడెంలో టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: ఎంఈఓ షేక్ హుస్సేన్
కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలో ఈ నెల 14
రెండ్రోజుల్లో మరొకటి రాక…న్యూదిల్లీ: పశ్చిమాసియా యుద్ధ జ్వాలలను దాటి చమురు నౌకలు భారత్కు చేరుకుంటున్నాయి. ఇందులో ఒక నౌక అత్యంత వ్యూహాత్మకంగా బుధవారం నాటికి ముంబయికి చేరుకుంది. రెండ్రోజుల్లో మరొకటి భారత్కు చేరుకోనుంది. ఈ రెండింటి ద్వారా 3 మిలియన్ బ్యారెళ్ల చమురు అందుబాటులోకి రానుంది. లైబీరియా జెండాతో ఉన్న షెన్లాంగ్ అనే భారీ చమురు ట్యాంకర్ సౌదీ అరేబియాలోని రస్ తనూరా పోర్టులో ఈ నెల 1వ తేదీన చమురును నింపుకొంది. అప్పటికి పశ్చిమాసియా యుద్ధం […] The post భారత్కు చేరుకున్న చమురు నౌక appeared first on Visalaandhra .
srh |కావ్య పాపపై ఫ్యాన్స్ ఫైర్
srh | కావ్య పాపపై ఫ్యాన్స్ ఫైర్ పాక్ ఆటగాడిని ఎలా కొనుగోలు
Rajampet |భార్య ఆత్మహత్య చేసుకుంటుండగా.. భర్త..
Rajampet | భార్య ఆత్మహత్య చేసుకుంటుండగా.. భర్త.. Rajampet | ఆంధ్రప్రభ, వెబ్
సమస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ ; ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా
నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే జీఎస్సార్
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ …
బాహుబలి పాటతో ఉత్తేజితులయ్యాం...కెప్టెన్ సూర్యకుమార్ #TeamIndia#T20WorldCup#Suryakumar#AxarPatel
ఇరాన్ నాయకులు భూమి పైనుంచి తుడిచిపెట్టుకుపోయారు: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ నౌకాదళం ఇప్పటికే కనుమరుగైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ వైమానికదళం కూడా ఇక ఉండదు అని అన్నారు. ఇరాన్ కు మరోసారి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మతి చెడిన నేతలకు ఇవాళ ఏం జరుగుతుందో మీరే చూస్తారని, ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని తెలియజేశారు. ఇరాన్ నాయకులు భూమి పైనుంచి తుడిచిపెట్టుకుపోయారని, 47 ఏళ్లుగా ఇరాన్ అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారని విమర్శించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను వారిని అంతం చేస్తున్నానని, తనకు ఈ అవకాశం రావడం ఎంతో గొప్ప గౌరవం అని ట్రంప్ పేర్కొన్నారు.
ఒలంపియాడ్ పోటీ పరీక్షలో ప్రతిభను కనబరిచిన మై డ్రీమ్ స్కూల్ విద్యార్థులు
వరంగల్ ఈస్ట్ , మార్చి13 (జనం సాక్షి)ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అంతోటి రామకృష్ణ ఆధ్వర్యంలో మూడు జోన్లలో నిర్వహించిన పోటీ పరీక్షకు సుమారు …
Hyderabad : మిర్చిలేదు. బజ్జీ లేదు.. పావు లేదు.. భాజీ లేదు
హైదరాబాద్ వాసులకు గ్యాస్ కొరత నోటి రుచులను దూరం చేస్తుంది.
Breaking : తిరుమల లడ్డూ కల్లీ పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది
ఆ టీమిండియా ఆటగాడు మా జట్టులో ఉంటే మాదే ట్రోఫీ: మైఖేల్ వాన్
హైదరాబాద్: టి20 ప్రపంచ కప్ను టీమిండియా కైవసం చేసుకుంది. భారత జట్టు ఎక్కువగా బ్యాటింగ్తో అదరగొట్టి సెమీఫైనల్కు వరకు చేరుకుంది. బ్యాటింగ్ విభాగంలో సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, సూర్యకుమార్, హార్ధిక్ పాండ్యా, అభిషేక్ శర్మలు రాణించారు. బౌలింగ్ విభాగం వచ్చేసరికి భారత జట్టు బుమ్రాపైనే అదారపడి ఉంది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాకు వరల్డ్ కప్ అందించాడు. దీంతో అతడిని మాజీలు, విదేశీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ జస్ప్రీత్ బుమ్రాను కొనియాడారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ బుమ్రా అని మెచ్చుకున్నారు. బుమ్రా లాంటి ఆటగాడు తమ జట్టులో ఉంటే వరల్డ్ కప్ గెలుస్తామని స్పష్టం చేశారు. ఇండియా పేస్గుర్రం బుమ్రాను లియోనో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి ప్రపంచ క్రీడాకారులతో పాల్చాడు. 1985 నుంచి తాను క్రికెట్ చూస్తున్నానని, తాను చూసిన బౌలర్లలో అత్యుత్తమ బౌలర్ బుమ్రా అని వాన్ ప్రశంసించారు. టి20 వరల్డ్ కప్ 2026లో 14 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో బుమ్రా 15 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో పొదుపు బౌలింగ్ చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
marriage |వంశిక వెడ్స్ కుల్దీప్
marriage | వంశిక వెడ్స్ కుల్దీప్ చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడబోతున్న స్టార్ స్పిన్నర్ఉత్తరాఖండ్లోని
CPM Party | నిద్రలోనే…. CPM Party | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచి పని #ITEmployees#WorkFromHome#GasShortage#Infosys#HCLTech
భూములివ్వని రైతులకు నారాయణ లాస్ట్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు
US lifts sanctions on Russian oil సాహో రష్యా Andhra Prabha News
US lifts sanctions on Russian oil సాహో రష్యా Andhra Prabha
Allu Cinemas |బన్నీ ఎందుకిలా చేశాడు..?
Allu Cinemas | బన్నీ ఎందుకిలా చేశాడు..? Allu Cinemas | అల్లు
Andhra Pradesh : ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ నేడు ప్రమాణస్వీకారం చేశారు
పశ్చిమబెంగాల్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ (ఎస్ఐఆర్)ను ఎన్నికల కమిషన్ చేపట్టిన తరువాత అనేక అవకతవకలు ఉన్నాయని దాదాపు 63 లక్షలమంది జాబితాలనుంచి తొలగించబడ్డారు. దీనిపై భారీ ఎత్తున ఓటర్ల నుంచి ఆందోళనలు లేచాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమస్యను తానే చేపట్టి సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిన్నమొన్నటివరకు దీనిపై ధర్నా కూడా సాగించారు. ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా వచ్చే పిటిషన్లను విచారించడానికి సుప్రీం కోర్టు అపిల్లేట్ ప్యానెళ్లను ఏర్పాటు చేయించింది. ఈ ప్యానెళ్లను నిర్వహించడానికి హైకోర్టు మాజీ జడ్జీల సేవలను వినియోగించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 28న ఓటర్ల తుది జాబితాల నుంచి 63 లక్షలమంది తొలగించబడగా, 10 లక్షలమంది నుంచి మాత్రమే ఫిర్యాదులు వచ్చాయి. ఈ 10 లక్షల ఫిర్యాదులను రెండు నెలల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే అపిల్లేట్ ప్యానెళ్లు పరిశీలించడం పూర్తవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఫిర్యాదులను పైపైన పరిశీలించినా సరే నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం పడుతుందని ఎవరైనా విశ్వసిస్తారు. ఈ వ్యవస్థను పటిష్టం చేయడానికి సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్ కలిసి ఎక్కువ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది జడ్జీలను అభ్యర్థించినా, చాలా సమయమే పడుతుందని అంచనా వేస్తున్నారు. సుప్రీం కోర్టు రూపొందిస్తున్న కొత్త అపిల్లేట్ విధానం ప్రకారం ప్రతీ అప్పీలును యోగ్యత ఆధారంగా పూర్తి స్థాయిలో విచారించి నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయమే పడుతుంది. ముక్తసరిగా చెప్పాలంటే ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్ పరుగుపందెం వేసుకున్నా సమయం తక్కువగా ఉండడంతో పూర్తి అవుతుందో లేదో చెప్పలేం. ఈ పరిస్థితిలో ఈ ప్రక్రియను ఎలాగైనా పూర్తి చేయాలన్న అత్యుత్సాహం ఎందుకు? రూఢిగా చెప్పాలంటే ఇలాంటి ఈ జాబితాల సవరణ పూర్తయిన తరువాతనే ఓటింగ్ నిర్వహించాలని కచ్చితంగా నిర్ధారించే చట్టం ఏదీ లేదు. అప్పెల్లెట్ లేదా ఎన్నికల కమిషన్ తీర్పు ప్రకారం గుర్తింపు పొందిన వారికే ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఓటర్ల జాబితాలో అన్ని ఎంట్రీలను కలిగి ఉన్న, మంజూరు చేయబడిన పత్రం తప్పనిసరి అని ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తోంది. అది కూడా ఈ దేశానికి చెందిన చట్టబద్ధమైన పౌరులై ఉండాలని వివరించింది. దీనిని ఏ రాజకీయ పార్టీ లేదా పౌరుడు లేదా కోర్టులు కూడా కాదనలేరు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో ఎనిమిదిసార్లు ఓటర్ల జాబితాల సవరణ జరిగింది. నిజానికి ఇప్పుడు లేవదీస్తున్న అభ్యంతరాలు గతంలో ఎప్పుడూ లేవదీయడం జరగలేదు. మునుపటి అన్ని సందర్భాల్లోనూ తాజాగానే సజావుగా జాబితాలు తయారయ్యాయి. ఓటర్లకు పెద్దగా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాలేదు. ఈ సందర్భంగా గ్రీకు గణిత శాస్త్ర పండితుడు యూక్లిడ్ ఆనాడు ఈజిప్టు రాజు ఒకటో టోలెమీతో ఏమన్నారో ఇక్కడ ప్రస్తావించ వలసి ఉంది. ఏదేమైనా రేఖాగణితం నేర్చుకోవడానికి రాజమార్గం అంటూ ఏదీ లేదని యూక్లిడ్ నిష్కర్షగా ప్రకటించారు. అదే విధంగా ఇప్పుడు సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్ పౌరులు ఓటు వేసేలా హక్కు కల్పించడమే ముఖ్యం తప్ప విధానాలు వెతకడం అనవసర కాలయాపనే అవుతుంది. సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్, అపిల్లేట్ వ్యవస్థలు ఇవన్నీ పౌరుల అత్యంత పవిత్రమైన ఓటు హక్కును కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి రాజమార్గం అంటూ ఏదీ లేదని గమనించాలి. అయితే ఈ ప్రక్రియలో పౌరులకు న్యాయం జరగడానికి కొంత సమయం తీసుకుంటుంది. అందువల్ల ఎవరైనా ఓర్పుగా ఉండడం అవసరం. ఎన్నికల కమిషన్ లేదా సుప్రీం కోర్టు తదితర సంస్థల్లో ఎవరు ఉన్నత స్థానాల్లో కూర్చున్నా వారి కర్తవ్యం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించడమే. ఎవరి ఓటు హక్కునూ అణగదొక్కే అధికారం ఎవరికీ లేదు. భారతీయులకు స్వాతంత్య్రం జన్మహక్కు. ఎన్నో కష్టనష్టాలు సుదీర్ఘకాలం అనుభవించి సాధించుకున్నారు. ఆ సాధనలో అడ్డుగా నిలబడే హక్కు ఎవరికీ లేదు. అందుకే అర్హులైన ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.ఓటు హక్కు లేకుంటే ఎవరైనా చనిపోయినట్టే భావిస్తుంటారు. అలాంటి పరిస్థితి కలగకూడదు. పశ్చిమబెంగాల్లో 60 లక్షల మంది జాబితానుంచి అదృశ్యం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 7.04 కోట్ల మందే ఓటర్లు నికరంగా తేలారని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అందుకనే జాబితాలో లేని వారు న్యాయపరిధిలో ఉన్నట్టు పరిగణించి వారి వినతులను పరిష్కరించడానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో అప్పిలేట్ ట్రిబ్యునళ్లు ఏర్పడుతున్నాయి. ఈ ప్రక్రియ ముగిశాకనే బెంగాల్లో ఎన్నికలు జరుగుతాయా లేక ముందే పూర్తి అవుతాయా అన్నది చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉండగా చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ జ్ఞానేశ్కుమార్ ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అధికార బిజెపికే కొమ్ము కాస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఆ పదవి నుంచి తొలగించాలనే తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. సిఇసి అభిశంసనకు లోక్సభ స్పీకర్ మాదిరిగానే లోక్సభలో నోటీసు ఇవ్వడానికి కనీసం 100 మంది సభ్యులు, రాజ్యసభలో 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి. సుమారు 120 మంది లోక్సభ సభ్యులు, 60 మంది రాజ్యసభ సభ్యుల నుంచి సంతకాలు సేకరించాయని తెలుస్తోంది. సిఇసిపై పార్లమెంట్లో అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం ఇదే తొలిసారి అవుతుంది.
మధు జీ జన్మదిన ముబారక్… నీలం మధుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏఐసీసీ
Telangana | నలుగురు దుర్మరణం.. Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
మూసీ మెరవాలి.. భాగ్యనగరం మురవాలి
జలమే జగతికి ప్రాణాధారం.. జలమే ప్రగతికి మూలాధారం’ అని పెద్దలు చెప్పిన మాటలను ప్రయోగాత్మకంగా అక్షర సత్యం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ బృహత్ కార్యక్రమం చేపట్టడం ఆదర్శంగా నిలిచింది. చరిత్రాత్మకమైన హైదరాబాద్ను ఒకప్పుడు ‘చెరువుల నగరం’ అని పిలిచేవారు. నగర అభివృద్ధికి ముందు ఇక్కడ వేల సంఖ్యలో చెరువులు ఉండేవి. ఈ చెరువులు వర్షపు నీటిని నిల్వచేసి నగరానికి తాగునీరు, సాగునీరు, వరద నియంత్రణలో కీలక పాత్ర పోషించేవి. కానీ నగర విస్తరణ, రియల్ ఎస్టేట్ అభివృద్ధితోపాటు ఆక్రమణల వల్ల చాలా చెరువులు నేడు కబ్జాలకు గురయ్యాయి. కనుమరుగవుతున్న చెరువులతో నగర భవిష్యత్తు ప్రమాదరకంగా మారుతున్న విషయాన్ని పసిగట్టి పరిస్థితులను చక్కదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం కట్టింది. హెచ్ఎండిఎ పరిధిలో చెరువుల పరిరక్షణకు హైద్రాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కు పూర్తి అధికారాలు ఇవ్వడంతో ఆ ఫలాలు ఇప్పుడు నగర ప్రజలకు అందుతున్నాయి. నిజాం పాలనలో నీటి నిర్వహణకు, చెరువులకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. హైదరాబాద్ చుట్టూ చిన్న పెద్ద కలిపి వేల వరకు చెరువులు ఉండేవి. ముఖ్యంగా 1908లో మూసీ నది వరదల తర్వాత నగరాన్ని రక్షించేందుకు నిజాం పాలకులు అనేక చెరువులు, రిజర్వాయర్లు అభివృద్ధి చేశారు. హుస్సేన్సాగర్, మిర్ ఆలమ్ ట్యాంక్, సరూర్నగర్ చెరువు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి చెరువులు నగరానికి ముఖ్యమైన నీటి వనరులుగా వెలిశాయి. ఇవి తాగునీరు, సాగునీరు, వరద నియంత్రణలో కీలక పాత్ర పోషించేవి. కాలానుగుణంగా నగరం అభివ ద్ధి చెందుతున్న దశలో చెరువుల సంఖ్య తగ్గుతూ వచ్చాయి. గత మూడు, నాలుగు దశాబ్దాల్లో నగర విస్తరణ వల్ల అనేక చెరువులు పలు కాలనీలు, రోడ్లు కమర్షియల్ భవనాలుగా మారిపోయాయి. గ్రేటర్ నగరంలో చెరువుల పునరుద్ధరణతో పాటు చరిత్రాత్మకమైన మూసీ నది పరిరక్షణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ పలు చర్యలు చేపట్టింది. అప్పట్లో సుమారు 3000కు పైగా చెరువులు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నట్లు చరిత్ర చెబుతున్నా పలు పరిశోధనల సంఖ్యలో కొంత తేడాలు కనిపిస్తున్నాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఎ) నివేదిక ప్రకారం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 900లకు పైగా చెరువులు ఉండగా 280కి పైగా పూర్తిగా మాయమయ్యాయి. 200కు పైగా పాక్షికంగా ఆక్రమాల పాలయ్యాయి. కుంటలు, చెరువులు పేర్లు మాత్రమే మిగిలాయి. మహానగరంలో కుంచించుకుపోయిన చెరువులకు హైడ్రా పుణ్యమా అని పునరుజ్జీవం పొందుతూ ఆహ్లాద, పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయి. నీటి వనరుల పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆశయాల మేరకు 2024 జులై 19న ఏర్పాటైన హైడ్రా ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే విభేదాలు లేకుండా నగరం నలువైపులా ఇప్పటి వరకు యాభైకి పైగా చెరువుల్లో ఆక్రమణలను తొలగిస్తూ సుమారు 275 ఎకరాల విస్తీర్ణంలో కబ్జాలను తొలగించడమే కాకుండా కోట్లాది రూపాయలు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దుతుంది. మొత్తం 47 చెరువుల అభివృద్ధికి రూ. 160 కోట్లకుపైగా ఖర్చు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చెరువులు మురికికూపంగా మారి దుర్వాసన వెదజల్లుతుండగా, ఇప్పుడు చాలా చోట్ల ఉద్యానవనంలా మారాయి. చెత్త కుప్పగా ఉండే అంబర్పేటలోని బత్తుకమ్మకుంటలో గత దసరాకి ఆనందంగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ప్రముఖుల చేతిలో కబ్జాకు గురైన మాదాపూర్ తమ్మిడికుంట చెరువు, సున్నం చెరువులు అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధి పనులు కొనసాగుతున్న సున్నం చెరువు విస్తీర్ణం కబ్జాల తొలగింపు అనంతరం 16.41 ఎకరాల నుండి 30.5 ఎకరాలకు చేరుకుంది. సుందరీకరణ పనులు జరుగుతున్న ఉప్పల్ నల్లచెరువు కబ్జాలతో 52.5 ఎకరాలకు కుంచించుకుపోగా వాటిని తొలగించడంతో 67.31 ఎకరాలకు చేరుకుంది. దుర్గంచెరువు, సరూర్ నగర్ చెరువు, ఫాక్స్ సాగర్ చెరువు, నల్లగండ్ల చెరువులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాతబస్తీలో కబ్జాకి గురై 4.12 ఎకరాలున్న బుమ్రుక్ దౌల చెరువును 17.05 ఎకరాల్లో అభివృద్ధి చేసింది. కూకట్పల్లిలో 16 ఎకరాలకు కుచించుకుపోయిన నల్లచెరువును 30 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇవేకాక రెండో దశలో మరో 14 చెరువుల అభివృద్ధికి హైడ్రా కంకణం కట్టుకుంది. చెరువుల నగరం హైదరాబాద్లో చెరువులు పరిరక్షించాలనే సంకల్పంతో అడుగులేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అదే సమయంలో మూసీ సుందరీకరణకు కూడా కంకణం కట్టుకుంది. గ్రేటర్ నగరానికి మణిహారంగా ఉన్న మూసీ నది ఇప్పుడు మురికికూపంగా మారిన దశలో ప్రభుత్వం మొదటి దశలో రూ. 5812 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు రూ. 14 వేల కోట్లను ఆశిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అదనంగా రూ. 4 వేల కోట్లను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి రుణంగా తీసుకోనుంది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నగరం నడిబొడ్డున మూసీ నది తీరంలో ఉన్న బాపూ ఘాట్ను ఆహ్లాదకరంగా సుందరీకరించేందుకు ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో 2028 నాటికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జాతిపిత మహాత్మాగాంధీ అస్థికలను నిమజ్జనం చేసిన 68 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బాపుఘాట్ను టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును రూపొందిస్తున్నది. ఇక్కడ 100 అడుగల ఎత్తులో గాంధీ విగ్రహంతోపాటు చుట్టూ గాంధీ స్మారక్ పార్క్, మ్యూజియం, ధ్యాన కేంద్రం, వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ, నిధుల ఖర్చుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న దశలో స్వయంగా ముఖ్యమంత్రి వివరణ ఇస్తూ గాంధీ విగ్రహం కోసం రూ. 70 కోట్లు, ప్రాజెక్టులో భాగంగా ఇతర పనుల కోసం మొత్తం రూ. 200 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పడంతో గాంధీ సరోవర్పై అపోహలు తగ్గాయి. హైదరాబాద్లో ఇటీవల తరుచూ భారీ వర్షాలు కరుస్తున్న నేపథ్యంలో చెరువులు, కుంటలు వరదలను నియంత్రిస్తాయి. భూగర్భ జలాలతో పాటు జీవవైవిధ్యం కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలతో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమే. చెరువుల సంస్కృతితో వెలుగొందిన హైదరాబాద్లో కాలక్రమేణా ఆక్రమణలు, నిర్లక్ష్యంతో నీటి వనరులు కనుమరుగయ్యాయి. అయితే ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక చర్యలతో నగర జల వనరుల పునరుద్ధరణపై ఆశలు రేగుతున్నాయి. చెరువుల పునర్జీవంతోపాటు మూసీ సుందరీకరణ కూడా పూర్తయితే గ్రేటర్ హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. -ఐవి మురళీకృష్ణ శర్మ
Exclusive: Trivikram’s Big No for Pawan Kalyan’s Films
The entire Telugu cinema is well aware that Pawan Kalyan relies on Trivikram Srinivas in finalizing his projects. Mega fans were furious when Trivikram picked up remakes for Pawan Kalyan. Rumors also say that Trivikram also holds a share in Pawan’s films for setting up films and finalizing the scripts. The biggest surprise is that […] The post Exclusive: Trivikram’s Big No for Pawan Kalyan’s Films appeared first on Telugu360 .
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం..
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : నేటి నుండి ప్రారంభమై పదో తరగతి పరీక్షలకు
గద్దర్ అవార్డ్తో ప్రజాకళలకు పట్టం
కళ కళ కోసమే కాదు, కళ సామాజిక ప్రయోజనం కోసం, పాట వినోదం కోసం కాదు, పాట సమాజ హితం కోసం, ప్రజల ఆశలు, ఆవేదనలే పల్లె పాటలు వారి మనసు ఆకళింపు చేసుకోవడానికి కళ ఒక శక్తివంతమైన ఆయుధం. ప్రజాసంస్కృతికి గొంతుక అయిన గద్దర్, ఆధునిక తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరు గద్దర్. తన పాటల ద్వారా, ప్రదర్శనల ద్వారా గద్దర్ సంప్రదాయ జానపద కళలను సామాజిక, రాజకీయ వ్యక్తీకరణకు శక్తివంతమైన మాధ్యమంగా మార్చాడు. జననాట్య మండలితో అనుబంధంగా ఉంటూ బుర్రకథ, ఒగ్గుకథ, జముకుల కథ వంటి జానపద కళారూపాలను వినియోగించి అణగారిన వర్గాల జీవితం, వ్యవసాయ కూలీల కష్టాలు, సామాజిక పోరాటాల కథలను ప్రజలకు వినిపించాడు. గద్దర్ ప్రదర్శనలు ఆట, పాట, మాటల సమ్మేళనంగా ఉండేవి. పురాణ కథలకే పరిమితం కాకుండా భూమిలేని రైతులు, పేదరికం, కులవివక్ష, దోపిడీ వంటి సమస్యలను తన కళారూపాల ద్వారా ప్రతిబింబించాడు. అతని పాటలు నిరసన స్వరాలుగా మారి విప్లవోద్యమాలకూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికీ సాంస్కృతిక చైతన్యాన్ని కల్పించాయి. తెలంగాణ భాషా వ్యాప్తికి, సాంస్కృతిక వికాసానికి సిఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందనడానికి నిదర్శనం గత రెండు సంవత్సరాలుగా ప్రజాకళలకు, కళాకారులకు, రచయితలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తున్నారు. తెలంగాణలో దశాబ్దాల కాలంనుంచి భాషా, సాహిత్య సాంస్కృతిక, కళల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థల సేవలను మరింత ప్రోత్సహించేందుకు ఆయా సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తూ రేవంత్ రెడ్డి ‘సృజనాత్మక శతాబ్దం వినోదరంగ భవిష్యత్తు’ అని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో చిత్రరంగం అత్యున్నత స్థాయికి వెళ్లాలని కాంక్షించారు. తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ ఎదుగుదలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం స్పష్టం చేస్తూ భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రపంచ స్థాయిలో ఐరిష్ రచయిత నాటకరంగ పితామహుడు ఆస్కార్ విల్డ్, భారతీయ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, స్వర్ణ కమలం అవార్డు, అసోంలో ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికాకు ఇచ్చిన గౌరవం ఎంత గొప్పదో, తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దర్కు అదే స్థాయి గౌరవాన్ని ఇచ్చింది. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం కళాకారులకు మాత్రమే కాకుండా ప్రజా ఉద్యమాలకు కూడా గౌరవం ఇచ్చినట్టే. కొత్త కథలు, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆలోచనతో గద్దర్ అవార్డులు ముందుకు రావడం అభినందనీయం, ఇదే సమయంలో సినీ రంగానికి మరింత ప్రోత్సాహం అందించాలంటే ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. గద్దర్ పేరుతో పురస్కారాలు ఇవ్వడం తెలంగాణ సంస్కృతి, పోరాట చరిత్రకు గుర్తింపుగా నిలుస్తుంది. విప్లవ గాయకుడు గద్దర్ ప్రజల మనసుల్లో ఎప్పటికీ జీవించే వ్యక్తి, ఆయన పాటలు సమాజంలో చైతన్యం తీసుకు వచ్చాయి, ప్రజలను ఆలోచింపజేశాయి. తెలంగాణ గడ్డపై ప్రతి ఇంట్లో గద్దర్ వంటి స్ఫూర్తిదాయక వ్యక్తులు ఉంటారు. అలాంటి మహానుభావుడి పేరుతో ప్రభుత్వం అవార్డులు ఏర్పాటు చేయడం నిజంగా గర్వకారణమం. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చే నంది పురస్కారాలకు ఎంతో గౌరవం ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అవి నిలిచిపోవడంతో సినీ పరిశ్రమలో ఒక లోటు ఏర్పడిందని అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులు ప్రారంభించడం ద్వారా కళాకారులకు మళ్లీ ప్రోత్సాహం కలిగింది. ముఖ్యంగా ఈ అవార్డుల్లో యువతరానికి ఎక్కువ అవకాశాలు రావడం సంతోషకరం అని తెలంగాణ ప్రజానీకం భావిస్తుంది. ఉత్తమనటులు, దర్శకులు, గాయకులు వంటి అనేక విభాగాల్లో కొత్త ప్రతిభ కనిపించడం సినీ రంగానికి మంచి సంకేతమని అని భావించి ఉత్తమ పౌర సమాజ నిర్మాణంలో చిత్ర పరిశ్రమకు అంటూ ఒక అర్థం ఉండాలని భావించి కళాకారులను అభివృద్ధి వైపు సంక్షేమం వైపు ఆలోచించడానికి వారిని అభినందించడానికి గద్దర్ని స్ఫూర్తిగా తీసుకోవడం ప్రజాకళలకు పట్టం కట్టడమే. - డా. జివి వెన్నెల ( చైర్మన్, తెలంగాణ సాంస్కృతిక సారథి)
Boyapati |ఆ మూవీ సీక్వెల్ చేయబోతున్నాడా..?
Boyapati | ఆ మూవీ సీక్వెల్ చేయబోతున్నాడా..? Boyapati | అఖండ 2
All about Dolby Cinema in Allu Cinemas
To offer the best viewing experience for the patrons, Allu Aravind and his family came up with a Dolby Cinema screen in Allu Cinemas. The four-screen multiplex has a Dolby screen in one of them. Dolby Cinema offers a premium theatre experience combining advanced Dolby Vision dual-laser projection (high-contrast, vibrant HDR) with Dolby Atmos sound […] The post All about Dolby Cinema in Allu Cinemas appeared first on Telugu360 .
నిజామాబాద్ జల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి నలుగురు మృ*తి #Nizamabad#RoadAccident
భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం: పది మందికి గాయాలు
అమరావతి: శ్రీశైలంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్గేట్ వద్ద భక్తులపైకి వాహనం దూసుకెళ్లడంతో పది మంది గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వాహన డ్రైవర్ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ అజాగ్రత కూడా ఉండి ఉంటుందని తెలుస్తోంది.
శ్రుతి మించుతున్న క్రమ‘శిక్ష’ణ
విద్యాలయాలు భావిభారత పౌరులను మాత్రమే తయారు చేసేవి కావు. వారికి అవసరమైన జ్ఞానంతోపాటుగా వ్యక్తిగత విలువలు, సామాజిక విలువలు, నీతి, నిజాయితీ, క్రమశిక్షణ లాంటివి నేర్పి దేశానికి ఉపయోగపడే మానవ వనరులను ఉత్పత్తి చేసే కేంద్రాలు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే అంటే దైవం కూడా తర్వాత స్థానమే. అందుకే అదొక బాధ్యతయుతమైన వృత్తి మాత్రమే కాదు గౌరవనీయమైన వృత్తి కూడా. తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును గురువు చేతిలో పెట్టి నిశ్చింతగా ఉంటారు. వారు కనీసం పట్టించుకోరు ఎందుకంటే అది గురువుపై వారికి ఉన్న అచంచల విశ్వాసం. విద్యార్థి శారీరక మానసిక ఆరోగ్యం బాగోగులుచూసుకునేది ఉపాధ్యాయులు. విద్యార్థి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దేది తరగతి గదిలోని టీచర్ల చేతలే! విద్యార్థులకు ఉపాధ్యాయులే ఆదర్శం. వారిని అనుకరిస్తారు, అనుసరిస్తారు. అలాంటి ఉపాధ్యాయ వర్గం తప్పు చేస్తే విద్యార్థులు నమ్మలేరు, సహించలేరు. ఈ మధ్య జరిగిన వరుస సంఘటనల్లో ఉపాధ్యాయుల వింత ప్రవర్తన, విపరీత ధోరణి సమాజానికి ఆశ్చర్యమే కాదు, వారిపట్ల ఏహ్య భావాన్ని కూడా కలిగిస్తున్నాయి. వారు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నారు. వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారా లేక యాజమాన్యాలు వారిని ఆ రకంగా తీవ్రమైన చర్యలకు ప్రేరేపించుతున్నాయా అనేది అధ్యయనం చేయవలసిన అంశం. రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని హఫీజ్పేటలో నడుస్తున్న ఒక ప్రైవేటు పాఠశాలలో ఒక వింత సంఘటన జరిగింది. ఒక విద్యార్థి జుట్టు బాగా పెరిగిందని చెప్పి పాఠశాల యాజమాన్యం అతడికి పూర్తిగా గుండు కొట్టించింది. విద్యార్థి అంతగా ప్రతిఘటించినా, వారించినా పాఠశాల యాజమాన్యం వినలేదు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్ద గొడవకు దిగారు. తమ కొడుకుకు లక్ష్మీనరసింహస్వామి మొక్కు ఉందని గతంలోనే తాము పాఠశాల ప్రిన్సిపాల్కు చెప్పడం జరిగిందని అయినా వారు అతడికి గుండు కొట్టించడంతో వారు కోపోద్రిక్తులయ్యారు. తమ కొడుకు తల వెంట్రుకలు (కత్తిరించినవి) కావాలని అవైనా స్వామికి సమర్పిస్తామని వారు కోరారు. అతిగా జుట్టు పెంచుకోవడం పాఠశాల నియమ నిబంధనలకు విరుద్ధమే కావచ్చు కానీ వారు ఆ విద్యార్థిని బయట నిలబెట్టడం ఇంటికి పంపడం లేక తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడడం చేసినట్లయితే ఇంత వివాదానికి దారి తీసేది కాదు. పైగా అది మొక్కుకు సంబంధించినది. వారి మనోభావాలు దెబ్బతిని వారు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో వాగ్వివాదానికి దిగారు. విద్యార్థి లేదా అతని తల్లిదండ్రుల మనసును గాయపరచకుండా శిక్షిస్తే బాగుండేది. కానీ పాఠశాల ప్రిన్సిపాల్ గుండు కొట్టించడంతో సమస్య రచ్చగా మారింది. విద్యార్థి ఐదవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు అదే పాఠశాలలో చదువుకుంటున్నాడని అతడి తల్లి తెలిపింది. పాఠశాల వారు అతిగా ప్రవర్తించడం సర్వదా చర్చనీయాంశమైంది. క్రమశిక్షణను అమలు చేసే ప్రయత్నంలో దాని పరిమితి దాటితే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ఇటీవల జరిగిన మరో సంఘటనలో ఒక పాఠశాల విద్యార్థులు కొంతమంది షూస్ వేసుకురాకుండా పాఠశాలకు హాజరయ్యారు. అది గమనించిన ఉపాధ్యాయురాలు ఆగ్రహంతో విద్యార్థుల మెడలో వారు ధరించిన చెప్పులను దండగా వేయించింది. అది విద్యార్థులకు ఎంత అవమానకరమో ఆ టీచర్ కనీసం ఆ క్షణంలో ఆలోచించారా? తోటి విద్యార్థుల మధ్య తమకు జరిగిన అవమానానికి వారు అదృష్టవశాత్తు ఏ దుశ్చర్యకు పాల్పడలేదు. లేదంటే ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. వారి చేసిన నేరం షూస్ కాకుండా చెప్పులు వేసుకురావడమే! చెప్పులు వేసుకు రావడం పాఠశాల నియమ నిబంధనలకు విరుద్ధం కావచ్చు, కానీ విద్యార్థుల ఆత్మగౌరవాన్ని భంగపరచవచ్చని వారి నియమాల్లో ఉన్నదా? ప్రశ్నించిన తల్లిదండ్రులతో కూడా ఆ పాఠశాల ఉపాధ్యాయులు మర్యాదగా మాట్లాడలేదు. పైగా తమ చర్యను సమర్థించుకోవడం జరిగింది. తర్వాత రోజు నుండి విద్యార్థులందరూ షూస్ వేసుకొస్తున్నారని ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. అంటే మిగిలిన విద్యార్థులను ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నది స్పష్టం అవుతున్నది. క్రమశిక్షణ పేరుమీద విద్యార్థుల మెడలో చెప్పుల దండవేసి వారిని అగౌరవ పరుస్తారా? దీనిని క్రమశిక్షణ అంటారా? క్షమాపణలు చెప్పినంత మాత్రాన వచ్చిన మచ్చ మాసిపోతుందా? జరిగిన అవమానం సమసిపోతుందా? ఈ రెండు రోజుల్లో జరిగిన వేరువేరు సంఘటనల్లో ఉపాధ్యాయులు మరింత కర్కశంగా ప్రవర్తిస్తున్నారనిపిస్తుంది. హోంవర్క్ చేసుకరాలేదన్న నెపంతో ఉపాధ్యాయుడు విద్యార్థిని వాతలు తేలేలా కొట్టడం జరిగింది. పర్యవసానంగా ఇంటికి చేరిన విద్యార్థి సరిగా నిలబడలేక కూర్చోలేక ఇబ్బంది పడుతుండగా గమనించిన తల్లి విషయం తెలుసుకొని సదరు టీచర్ను ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. ఏం చేసుకుంటావో చేసుకో అన్న తీరుగా ప్రవర్తించాడు. మరొక మహిళా టీచర్ కూడా అదే విధంగా ఐదవ తరగతి విద్యార్థికి శరీరంపై వాతలు తేలేలా కొట్టింది. ఎందుకింత అమానుషత్వం? తప్పులు విద్యార్థులు కాక మరెవరు చేస్తారు? వాటిని సరిదిద్దాల్సిన టీచర్లు సంయమనం కోల్పోయి విచక్షణ మరిచిపోయి విద్యార్థులను శారీరకంగా శిక్షించడం ఏమాత్రం తగదు. ఇది విద్యార్థికి ఆ టీచర్ పట్ల అతడు చెప్పే సబ్జెక్టుపట్ల వ్యతిరేక భావాన్ని కలుగజేసి భవిష్యత్తులో అతడు చదువులో వెనకబడే ప్రమాదం ఉంది. విద్యార్థితో సున్నితంగా ప్రవర్తించాలి అన్న కనీస అవగాహన లోపించడం ఉపాధ్యాయ లోకాన్ని ఆత్మపరిశీలనలో పడవేస్తుంది. విద్యార్థులకు విద్యతోపాటుగా క్రమశిక్షణ అవసరమే. దానిని పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల నడవడిక ప్రవర్తనతోనే విద్యార్థులు సగం నేర్చుకుంటారు. వారి సమయపాలన, నీతి నిజాయితీ, నిబద్ధత విద్యార్థులను ఆకట్టుకొని వారిని అనుకరించి అనుసరించేలా చేస్తాయి. కానీ విద్యాసంస్థలు క్రమశిక్షణ పేరిట భయోత్పాతం సృష్టించకూడదు. వారిని సంస్కరించాలి. వారిలో పరివర్తన తీసుకురావాలి. వారు తమ తప్పు తెలుసుకొని దానిని పునరావృతం చేయకుండా వారిలో మానసిక మార్పు తేవాలి. విద్యార్థులు సహజంగా ఆలస్యంగా రావడం, హోంవర్క్ చేయకపోవడం, తరగతిగదిలో అల్లరి చేయడం, తక్కువ మార్కులు సాధించడం లేదా పాఠశాల నియమ నిబంధనలను సరిగా పాటించకపోవడం - ఇవన్నీ ఘోరమైన తప్పిదాలు ఏమీ కావు. వీటి వల్ల మొత్తం సమాజం వెంటనే చెడిపోదు. వారిని మందలించవచ్చు, నిలదీయవచ్చు ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. అంతేకానీ వారిని అవమానించే హక్కులేదు. వారిని శారీరకంగా, మానసికంగా హింసించకూడదని చట్టాలు ఘోషిస్తున్నాయి. వారి ఆత్మగౌరవాన్ని కించపరిచే ఏ చర్య అయిన అది సమర్థనీయం కాదు. కొన్నిసార్లు ఉపాధ్యాయులు విచక్షణ మరచి విద్యార్థులను గొడ్డును బాదినట్లు బాదుతున్నారు. ఆ దెబ్బ తగలరాని చోట తగిలితే అది ఆ విద్యార్థికి జీవితాంతం శిక్ష అవుతుంది. ఆ రకంగా చెవులు కండ్లు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. ఇది ఉపాధ్యాయ లోకానికి మచ్చతెచ్చే విషయం. విద్యార్థులను ప్రేమతో చూసుకోవాల్సిన వారు తల్లిదండ్రుల లాగా కాపాడవలసిన వారు సహనం కోల్పోయి ఆ రకంగా ప్రవర్తించడాన్ని సభ్యసమాజం ఖండిస్తుంది. ఉపాధ్యాయ లోకం తలదించుకుంటుంది. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులకు ఇచ్చే శిక్ష వారికి జీవితాంతం శాపం కాకూడదు. మనస్తత్వశాస్త్రం చదివిన ఉపాధ్యాయులే ఈ విధంగా విచక్షణా రహితంగా ప్రవర్తిస్తే అమాయక విద్యార్థులు తప్పులు చేయడంలో తప్పేముంది? క్షమాగుణంతో విద్యార్థి మనసును, ప్రవర్తనను మార్చగలమన్న కనీస జ్ఞానాన్ని వీరు ఆవేశంలో మరిచిపోతున్నారా? విద్యాలయాలు సంస్కరణాలయాలుగా మారాలి. పరివర్తనా కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలి. సున్నిత మనస్కులైన విద్యార్థినీ విద్యార్థులను అనునయంగా మాట్లాడ్డం ద్వారా వారి మనసును మార్చవచ్చు, గెలవవచ్చు, పరివర్తన తీసుకురావచ్చు. దండనల ధోరణి మారాలి. విద్యార్థుల మనసునెరిగి బోధించేవాడు, ప్రవర్తించేవాడే నిజమైన గురువు. అక్షర జ్ఞానం అందించడమే అతడి లక్ష్యం కాకూడదు. పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని అందించి భవిష్యత్తుకు ఉత్తమమైన పౌరులను మంచి మానవ వనరులను తయారు చేసే విధంగా ఉపాధ్యాయుడి దండనలు ఉండాలి. వ్యక్తిత్వ నిర్మాణం విలువల నిర్వహణ దిశగా అతని బోధనలు ప్రభావితం చేయాలి. విద్యార్థుల మనోభావాలను గౌరవించాలి. వారి ఆత్మగౌరవాన్ని కించపరచకుండా ఆత్మస్థైర్యం నెలకొల్పే విధంగా ఉపాధ్యాయుడు చేస్తే అతడు విద్యార్థుల మదిలో చిరకాలం గుర్తుండిపోతాడు. వారికి ఆదర్శంగా కూడా నిలుస్తాడు. - శ్రీ శ్రీ కుమార్
చిట్యాలలో గ్యాస్ కొరత.. చిట్యాల, ఆంధ్రప్రభ : పచ్చిమాసీయాలో యుద్ధ వాతావరణ నేపథ్యంలో
Did Allu Arjun replace Ranveer Singh?
Icon Star Allu Arjun has been discussing a script with Malayalam actor and director Basil Joseph from sometime. Though the official announcement was not made, the film is in the upcoming lineup of Allu Arjun. As per the latest speculations, Basil has first narrated the script to Bollywood actor Ranveer Singh. The film is a […] The post Did Allu Arjun replace Ranveer Singh? appeared first on Telugu360 .
షాద్నగర్లో చెరువులోకి దూసుకెళ్లిన కారు
రంగారెడ్డి: కారు చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతంలో జరిగింది. చటాన్ పల్లిలోని సురసముద్రం చెరువులోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కారును చెరువులో నుంచి బయటకు తీశారు. కారులో ఎవరు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో నుంచి చెరువులో పడిపోయారా? లేకపోతే కావాలని కారులో చెరువులోకి తోసేసారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాద్నగర్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అవి.. రోడ్డు మీద పారయ్యొద్దు..
అవి.. రోడ్డు మీద పారయ్యొద్దు.. ములకలపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని మూకమామిడి
New Rations Cards : కొత్త రేషన్ కార్డులో ఈ నిబంధనలు తప్పనిసరి.. చేయకుంటే కార్డు తొలగించడం గ్యారంటీ
కేంద్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరులో నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది
అమెరికాకు షాక్.. ఇరాక్ లో కూలిన విమానం
బాగ్దాద్: పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తీవ్రంగా వైమానికి దాడులకు పాల్పడుతోంది. ఈ దాడులను ఇరాన్ తిప్పుకొడుతుంది. ఈ దాడులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాక్ భూభాగంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమానం కూలిపోవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అమెరికాకు చెందిన కెసి-135 స్ట్రాటో ట్యాంకర్ రిఫ్యూయలింగ్ అనే విమానం ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సైనికులు చనిపోయారని ఇరాన్ మీడియా తెలియజేసింది. అమెరికా విమానాన్ని తామే కూల్చివేశామని సోషల్ మీడియాలో ఇరాన్ అనుకూల వర్గం ప్రచారం చేసుకుంటుంది. విమానం కూలిన ఘటన నిజమేనని, శత్రువుల దాడిలో మాత్రం కూలిపోలేదని, రెండు విమానాలు ఒకదానితో ఒకటి తగలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అమెరికా తెలిపింది. ఇరాన్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ ఫ్యూరీలో భాగంగా ఈ విమానం విధులు నిర్వహిస్తోందని అమెరికా రక్షణ శాఖ వివరించింది. విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొంది. పశ్చియాసియాలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం కావడం గమనార్హం. హార్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్ వంటి దేశాలలో తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడింది.
పాకిస్థాన్ స్పిన్నర్ కొనుగోలు కావ్యా మారన్పై విమర్శలు #KavyaMaran#Sunrisers#AbrarAhmed#TheHundred
Hyderabad : అగ్నిప్రమాదలో రెండు కోట్ల ఆస్తి బుగ్గిపాలు
హైదరాబాద్ చందానగర్లో నిన్నరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో రెండు కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది
ఆది, మేఘ, హనిక హీరో హీరోయిన్లుగా నటిస్తు న్న సినిమా బుల్లెట్ రెడ్డి. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి ఫిలింస్ బ్యానర్ పై ఆది దర్శక నిర్మాతగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ చిత్ర విశేషాలను హైదరాబాద్ ఫిలింఛాంబర్లో జరిగిన ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాత హీరో ఆది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ ఖయ్యూం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత హీరో ఆది మాట్లాడుతూ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రమిది. ఈ చిత్రం లో హీరో బుల్లెట్ రెడ్డి వెయ్యి ఎకరాల జమీందారు. ఆయనకు చెందాల్సిన లక్షల కోట్ల రూపాయల విలువైన నిధి దక్కించుకునేందుకు కొం దరు దురాశ పరులు ఎలా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆద్యంతం ఆసక్తికరంగా ఉం టుంది. మా సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్లో ఉంది. ఆదిలాబాద్ అడవుల్లో పాట చిత్రీకరణ జరిపాం. అలాగే నిజామాబాద్లో ఫైట్ సీక్వెన్స్ లు రూపొందించాం. ఈ నెల 23వ తేదీ నుంచి రాజమండ్రి, అమలాపురం పరిసర ప్రాం తాల్లో తదుపరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఏప్రిల్ 5వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఆ తర్వాత గోవాలో జరిపే షెడ్యూల్ లో పాటల చిత్రీకరణ జరిపి, చివరి షెడ్యూల్ మళ్లీ ఆదిలాబాద్, నిజామాబాద్ లో చేస్తాం. ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 16న మా మూవీని రిలీజ్ చేస్తాం”అని అన్నారు.
Weather Report : కూల్.. న్యూస్.. తర్వాత మాత్రం మాడు పగిలిపోతుందట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.
అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత..
అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో అక్రమంగా ఇసుకను
Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
Iran Backed Militia : కూలిన US KC-135 Andhra Prabha News
Iran Backed Militia : కూలిన US KC-135 Andhra Prabha News
యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్లో ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ సెట్ లో షూట్ ర్యాప్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో అడివి శేష్ మాట్లాడుతూ “డెకాయిట్ ఒక కొత్త జోనర్ లో చేసిన సినిమా. ఇది థ్రిల్లింగ్ యాక్షన్ లో చెప్పిన లవ్ స్టోరీ. సినిమా చివరకు వచ్చేసరికి అందరూ ఎమోషన్ అవుతారు. ఈ సినిమాలో ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమా ఫ్యామిలీస్తో కలిసి చూడొచ్చు”అని అన్నారు. ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ “డైరెక్టర్కి ఇది ఫస్ట్ ఫిలిం, అనురాగ్ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా. శేష్ చేస్తున్న ఫస్ట్ లవ్ స్టోరీ ఇది”అని తెలిపారు. డైరెక్టర్ షానియల్ డియో మాట్లాడుతూ “భీమ్స్ తన మ్యూజిక్తో సినిమాను నేను నెక్స్ లెవెల్ తీసుకెళ్లారు. అనురాగ్తో వర్క్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. సుప్రియకి, శేష్కి ధన్యవాదాలు. ఈ సినిమా అందరికీ ఒక మంచి అనుభూతినిస్తుంది”అని తెలియజేశారు. ఈ సమావేశంలో అనురాగ్ కశ్యప్, భీమ్స్, విజయ్, నాగేంద్ర పాల్గొన్నారు.
రెండో శనివారం విద్యా సంస్థలు పని చేయాలి..
రెండో శనివారం విద్యా సంస్థలు పని చేయాలి.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లాలోని
Tirumala : తిరుమలకు వెళ్లే వారికి హై అలెర్ట్
తిరుమలలో భక్తుల నేడు రద్దీ పెరిగింది
రంగారెడ్డి జిల్లాలో అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు #Shadnagar#Rangareddy#CarAccident
Gold Rates Today : బంగారం కొంటున్నారా? అయితే కొంచెం ఆగాల్సిందేనట
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.
పారిశుద్య పనుల పై డిపిఓ పర్యవేక్షణ..
పారిశుద్య పనుల పై డిపిఓ పర్యవేక్షణ.. గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా
ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ కొండిగారి రాములు కన్నుమూత
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ కొండిగారి రాములు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో రాములు తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన రెండు సార్లు(1989, 1994) సిపిఎం పార్టీ నుంచి గెలిచి ఇబ్రహీంపట్నం ఎంఎల్ఎగా ప్రజలకు సేవలందించారు. కొద్దిసేపటి క్రితం ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పరమపదించడంతో ఇబ్రహీంపట్నం ప్రజలు, సిపిఎం కార్యకర్తలు శోకసంద్రంలోే మునిగిపోయారు. ఇబ్రహాంపట్నంలో విషాదచాయలు అలుముకున్నాయి.
పెన్షన్ పంపిణీ చేయడానికి వెళుతుంటే..
పెన్షన్ పంపిణీ చేయడానికి వెళుతుంటే.. సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
దామగుండం ఆలయంలో.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన దామగుండం
ఇష్టంతో చదివితే.. చిట్యాల, ఆంధ్రప్రభ : ఇష్టంతో చదివితే రాణిస్తారని.. పదో తరగతి
Annadatha Sukhibhava : నేడు అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదల
ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం రైతన్నలకు ‘అన్నదాత సుఖీభవ’ నిధులు జమ చేయనుంది
9 ఏళ్ల క్రితం కేసు.. 10 ఏళ్లు జైలు శిక్ష..
9 ఏళ్ల క్రితం కేసు.. 10 ఏళ్లు జైలు శిక్ష.. పెద్దవంగర, ఆంధ్రప్రభ
Andhra Pradesh : నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది.
ఎల్పీజీ కొరతపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన
దేశంలో ఎల్పీజీ కొరతపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో..
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో.. భువనగిరి/ ఆంధ్రప్రభ : ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో
ముగ్గురు బాలికలపై అత్యాచారం... నిందితుడికి మరణశిక్ష
చెన్నై: ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసిన వ్యక్తి కోర్టు మరణశిక్ష విధించిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలో జరిగింది. మేళపాళయం ప్రాంతం అళగిరిపురానికి చెందిన ఆనంద్ శేఖర్(41) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2023లో ముగ్గురు బాలికలను గదిలో బంధించి అత్యాచారం చేశాడు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడికి తిరునెల్వేలి కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. బాదితురాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 లక్షల పరిహ్వారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Ethiopia landslide : దక్షిణ ఇథియోపియోలో వర్ష బీభత్సం.. యాభై మంది మృతి...125 మంది గల్లంతు
దక్షిణ ఇథియోపియాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదం మిగిల్చాయి
చేపలు పడుతుండగా మత్య్సకారుడి గొంతులో ఇరుక్కున్న చేప
అమరావతి: చేపలు పడుతుండగా బతికున్న గొంతులో ఇరుక్కోవడంతో మత్సకారుడు ఊపిరాడక విలవిలలాడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సముద్రంలో చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. వలలో చేపలు పట్టి బయటకు తీసుకొచ్చాడు. వల నుంచి చేపలను వేరు మరో మత్సకారుడితో మాట్లాడుతున్నాడు. చేప ఒక్కసారిగా ఎగిరి అతడి నోట్లో పడింది. వెంటనే గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక విలవిలలాడాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. గొంతు వద్ద ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశాడు. జిజిహెచ్ ఇఎన్టి విభాగం వైద్యులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఒకరి ప్రాణం కాపాడారని కొనియాడాతున్నారు.
Iran - Israel War : ఇరాన్, లెబనాన్ లపై బాంబులతో దాడులు..ఖమేనీ వార్నింగ్
ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధం పదమూడో రోజుకు చేరుకుంది.
డ్రైవర్ తప్ప తాగి వాహనం నడపడంతో..
డ్రైవర్ తప్ప తాగి వాహనం నడపడంతో.. ఆంధ్రప్రభ : 16వ నంబరు జాతీయ
నెట్ఫ్లిక్స్తో హైదరాబాద్కు హాలీవుడ్ వచ్చినట్లే
మన తెలంగాణ/హైదరాబాద్: నెట్ఫ్లిక్స్ ఇక్కడకు వచ్చిందంటే హైదరాబాద్కు హాలీవుడ్ వచ్చినట్లేనని, నెట్ఫ్లిక్స్ను హైదరాబాద్కు ఆహ్వానిస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. ఓటిటి దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో గురువారం సిఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని, నెట్ ఫ్లిక్స్ కు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆయన చెప్పారు. బాల్యం నుంచే తనకు సినిమాలపై ఆసక్తి ఉందని తన చిన్నతనం నుంచి ఇ ప్పటివరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయన్నారు. బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్, అరుంధతి వంటి అత్యున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయని సిఎం రేవంత్రెడ్డి గుర్తు చేశారు. తెలు గు చిత్రపరిశ్రమను చెన్నై నుంచి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్కు తీసుకువచ్చారని ఆయన తెలిపారు. డివిడి అద్దె సంస్థ నుంచి వరల్డ్ ఓటిటి లీడర్గా నెట్ ఫ్లిక్స్ ఎదిగిందని, మీడియా స్టూడియోగా నెట్ ఫ్లిక్స్ ఎదగడం చూస్తుంటే సం భ్రమాశ్చర్యంతో పాటు ఆదర్శంగా అనిపిస్తుందని ఆయన అన్నారు. నెట్ఫ్లిక్స్, హైదరాబాద్ రెండిం టి వృద్ధి అంతర్జాతీయంగా దినదిన ప్రవర్థమానం అవుతోందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. నెట్ ఫ్లి క్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ, మంచి కంటెంట్ను సేకరించి వీక్షకులకు అందిస్తుందన్నారు. అందరికీ ఎంటర్టైన్మెంట్ఇ వ్వడమే నెట్ఫ్లిక్స్ ధ్యేయమని ఆయన తెలిపారు. దీంతోపాటు హైదరాబాద్ ప్రపంచ సంస్థలకు వేదిక అవుతూ అన్ని రకాల సంస్కృతీ, సంప్రదాయాలను నగరం గౌరవిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, నెట్ఫ్లిక్స్లు సమాజంలో జరుగుతున్న మార్పులను స్వీకరిస్తూ ముందుకు కదులుతున్నాయని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. నిజాం కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆహ్లాదకరమైన నగరంగా హైదరాబాద్ విరాజిల్లుతోందని ఆయన తెలిపారు. అయితే, ఇప్పుడు హైదరాబాద్ ఎన్నో రంగాల్లో ఎదిగిందని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ను, హైదరాబాద్ను అందరూ ప్రేమిస్తారని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఎందుకంటే, ఈ రెండు ఎంతోమందికి ఫుడ్, ట్రావెల్, హిస్టరీ, హెరిటేజ్, సంస్కృతీ, సంప్రదాయాలను అందిస్తున్నాయన్నారు. నెట్ ఫ్లిక్స్ ఐలైన్ ఇక్కడకు రావడంతో ప్రపంచ ప్రేక్షకులకు తెలంగాణ స్థానిక సంస్కృతీ, సంప్రదాయాలను చూపించే అవకాశం దొరుకుతుందన్నారు. నెట్ ఫ్లిక్స్ ఇటీవల క్రీడలపై చాలా దృష్టి పెట్టిందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో నెట్ ఫ్లిక్స్ క్రీడా ప్రసార సంస్థగా మారుతుందని భావిస్తున్నామని సిఎం అన్నారు. తెలంగాణ కూడా క్రీడలపై కూడా కీలకంగా దృష్టి కేంద్రీకరించిందని, క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మించడం, క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం, క్రీడలకు సంబంధించి అన్ని స్థాయిల్లో ప్రతిభను ప్రోత్సహిస్తున్నామని ఆయన అన్నారు. ఇందుకు నెట్ఫ్లిక్స్ సహకారం అవసరమని ఆయన తెలిపారు. ప్రపంచ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇండియా, తెలంగాణ ఎంతటి పాత్రను పోషించబోతున్నాయో తెలిపేందుకు ఈరోజు జరిగిన కార్యక్రమమే ఒక పెద్ద ఉదాహరణగా ఆయన తెలిపారు. భూమి ఇచ్చేందుకు రెడీ నెట్ఫ్లిక్స్కు ఇది దేశంలోనే రెండో కార్యాలయం అని సిఎం పేర్కొన్నారు. తమ దృష్టి హాలీవుడ్ పైనే అని తాను గతంలోనే చెప్పానని ఆయన తెలిపారు. నెట్ ఫ్లిక్స్తో నాకల నిజం కాబోతుందని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని, నెట్ ఫ్లిక్స్ విస్తరణకు కావాల్సిన భూమిని ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణలో మీ పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని సిఎం రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని ఆయన తెలిపారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో స్టూడియోను ఏర్పాటు చేయండి: మంత్రి శ్రీధర్బాబు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ (ఏవిజీసి) రంగంలో హైదరాబాద్ను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఓ వైపు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే మరోవైపు స్కిల్లింగ్, రీ -స్కిల్లింగ్, అప్ - స్కిల్లింగ్ పై దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్కు నెట్ ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్లో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్, అడ్వానస్డ్ టూల్స్, ఇన్నోవేషన్-లెడ్ వర్క్ ఫ్లో ఇక్కడి ఎకో సిస్టంలో భాగమవుతాయని, ఇక్కడి యువతకు ఫ్యూచర్ రెడీ స్కిల్స్ లభిస్తాయన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులను మంత్రి శ్రీధర్బాబు కోరారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో స్టూడియోను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆయన ఆహ్వానించారు. డిజిటల్, వినోద రంగాలకు కేంద్రంగా హైదరాబాద్ ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజూ మాట్లాడుతూ సృజనాత్మక సాంకేతికతలు, దృశ్య శ్రవ్య కథన రీతులు, డిజిటల్, వినోద రంగాలకు కేంద్రంగా హైదరాబాద్ విస్తరిస్తోందన్నారు. వేగంగా విస్తరిస్తున్న మీడియా, వినోద రంగ మౌలిక సదుపాయాలతో ప్రతిభకు, ఆవిష్కరణలకూ శక్తిమంతమైన కేంద్రంగా ఈ నగరం నిలిచిం దని ఆయన వ్యాఖ్యానించారు. అద్భుతమైన కథన వారసత్వం భారత్కు ఉందని, సాంకేతిక పురోగతి వల్ల కథనం తీరు తెన్నులు, వేదికల్లో వేగంగా మార్పులొస్తున్నాయని ఆయన అన్నారు. వినోదం నేడు కళ, సాంకేతికతల సమ్మేళనంగా మారిందని, ఐలైన్ స్టూడియోస్ వంటి కార్యక్రమాలు భవిష్యత్ తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. గతేడాది ముంబయిలో నిర్వహించిన ప్రపంచదృశ్య, శ్రవణ వినోద సదస్సును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సృజనాత్మక, సాంస్కృతిక రంగాలపై ప్రధానంగా దృష్టి సారించే ‘ఆరెంజ్ ఎకానమీ’ ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
టెహ్రాన్: హతుడైన ఖమేనీ వారసుడిగా ఇరాన్ సుప్రీం నేతగా వచ్చిన మొజ్తబా ఖమేనీ గురువారం తొలిసారిగా అధికారిక ప్రకటన వెలువరించారు. అమెరికా, ఇజ్రాయెల్లపై తమ దేశ ప్రతీకార దాడులు సాగుతాయని ఆయన హెచ్చరించారు. ఆయన వెలువరించిన ప్రకటనను ఇరాన్ అధికారిక మీడియా సంస్థల ద్వారా ప్రసారం చేశారు. త మ దేశాన్ని గాయపర్చిన శత్రువుపై మరిన్ని భీకర దాడు లు ఉంటాయని తెలిపారు. ప్రత్యేకించి శత్రువుపై పలు విధాలుగా ఒత్తిడి తీసుకురావల్సి ఉంది. ఇందుకు తమ దేశం నుంచి హర్మూజ్ జలసంధి మార్గంలో నౌకల రవాణా నిలిపివేత సాగుతుందని, ఈ మార్గంలో ఏ నౌక రవాణా జరిగినా తమ దాడులకు గురి కావల్సిందే అన్నారు. ఇక గల్ఫ్లోని తమ మిత్రదేశాలు ఇకనైనా అక్కడి అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలి. అమెరికాతో మిత్రత్వం వదులుకోవాలి. ఆయా దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు ఇకపై కూడా ఆగకుండా సాగుతాయని తెలిపారు. గల్ఫ్ దేశాలతో తమ స్నేహాన్ని గౌరవిస్తామని ,అయితే అక్కడి యుఎస్ స్థావరాలు తమ దాడులకు దెబ్బతినాల్సిందే అని హెచ్చరించారు. ట్రంప్ యుద్ధ విరమణ సంకేతాల ప్రకటన జోలికి వెళ్లకుండా ఇరాన్ కొత్త నేత , ఖమేనీ వారసుడు తీవ్రపదజాలంతో హెచ్చరికలు వెలువరించడం అంతర్జాతీయ యుద్ధ స్థితిని మరింతగా రగిలించినట్లు అయింది. మినాబ్ పాఠశాలపై దాడులు, అక్కడి చిన్నారుల వధ వంటి పలు అమానుష ఘటనలపై తమ ప్రతీకారం తప్పదని మొజ్తబా హెచ్చరించారు. ఏదో విధంగా తమ ఇరుగుపొరుగుదేశాలతో స్నేహ సంబందాలు పునరుద్ధరించుకోవాలని యత్నిస్తామని, అయితే ఈలోగా తమ సైనిక చర్యలు సాగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభంలోనే మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారని , ఆయన నాయకత్వం కుదరకపోవచ్చునని ఇజ్రాయెల్ సంస్థలు అంచనావేశాయి. ఇప్పుడు ఆయన నుంచి తీవ్రస్థాయి ప్రకటన వెలువడింది. 56 సంవత్సరాల మొజ్తాబా టీవీలలో ప్రత్యక్షంగా కనబడలేదు. అయితే ఆయన ప్రకటనను అధికారికంగా చదివి విన్పించారు. మూడు షరతులు అంగీకరిస్తే యుద్ధం ఆపేస్తాం: ఇరాన్ పశ్చిమాసియాలో యుద్ధం పరిసమాప్తం కావడానికి ఇరాన్ మూడు షరతులు విధించింది. ఈ షరతులు నెరవేరితేనా యుద్ధానికి ముగింపు పలుకుతామని ఎక్స్ వేదికగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ట్వీట్ చేశారు. ఈ షరతులపై అమెరికాఇజ్రాయెల్తో సంప్రదింపులు జరిపేందుకు రష్యాపాకిస్థాన్లు మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. మొదటి షరతుగా ఇరాన్ హక్కులను అంతర్జాతీయంగా గుర్తించాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది. తమ సార్వభౌమాధికారాన్ని అంగీకరించకపోతే శాంతి సాధ్యం కాదని స్పష్టం చేసింది. రెండవ షరతుగా ఇప్పటివరకు జరిగిన యుద్ధ దాడుల వల్ల కలిగిన నష్టాలకు అమెరికా, ఇజ్రాయెల్ పరిహారం చెల్లించాలని కోరింది. మూడవ షరతుగా భవిష్యత్తులో ఇరాన్పై దాడులు జరగబోవని హామీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మూడు షరతులకు అంగీకరించకుంటే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించింది. యుద్ధానికి ముందు అణు ఒప్పందంపై చర్చల సమయంలో ఇరాన్ అణుశక్తిని పెంపొందించుకోవడం తమ హక్కుగా వాదించింది. తమ దేశం అణుబాంబుల కోసం కాకుండా శాంతియుత ఇంధన అవసరాల కోసం యూరేనియం శుద్ధి చేసే హక్కును సమర్ధించుకుంది. ఈనెల 10న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్తో తక్షణం యుద్ధాన్ని ఆపాలని సూచించారు. చర్చల ద్వారానే రాజకీయ పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పెజెష్కియన్ ఇరాన్కు మానవతాసాయం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరాన్ హెచ్చరిక.. ఒక బ్యారెల్కు 200 డాలర్ల వంతున చెల్లించడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని గురువారం ఇరాన్ హెచ్చరించింది. చమురు సంక్షోభాన్ని ఎదుర్కోడానికి వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ సిఫారసు చేసిన నేపథ్యంలో తాజా హెచ్చరిక వచ్చింది. హర్మూజ్ జలసంధిలో అమెరికా మిత్రదేశాల నౌకలు ప్రవేశిస్తే పేలిపోయేలా ఇరాన్ సముద్రపు మందుపాతరలు అమర్చడం ఆందోళన కలిగిస్తోంది.
న్యూఢిల్లీ: ఏ దశలో అయినా ప్రపంచం ఇప్పుడు ఇంధన అవసరాల వలయంలో చిక్కుకుంది. అ యితే మధ్యప్రాచ్య యుద్ధం తీవ్రతరం, హర్మూజ్ జలసంధిపై చమురు నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలతో పలు దేశాలకు చిక్కులు ఏర్పడుతున్నా యి. ఈ అత్యంత క్లిష్టమైన దశలోనే భారతదేశాని కి భారీ క్రూడాయిల్ లోడ్తో లైబిరియా దేశపు జెండాతో బయలుదేరిన నౌక స్యూజ్మాక్స్ ట్యాం కర్ షెన్లాంగ్ ఈ అత్యంత ప్రమాదకరమైన సము ద్ర మార్గం ద్వారానే నిర్ణీత గమ్యం అయిన ముం బై పోర్టులోని జవహర్ ద్వీప్ టర్మినల్కు చెక్కుచెదరని రీతిలో క్షేమంగా చేరింది. ఇంతకూ ఈ చమురు ట్యాంకర్ నౌకకు భారతీయుడే క్యాప్టెన్గా ఉన్నాడు. ఇరాన్ దాడులకు గురి కాకుండా చేసుకునేందుకు ఈ నౌక ఈ జలసంధి దాటేంత వరకూ డార్క్లోకి వెళ్లింది. సాధారణంగా ప్రతి నౌక ప్రయాణం , కదలికలను తెలియచేసేందుకు తనంతతానే పనిచేసే ఆటోమోటిక్ ఐడెంటిఫికేషన్ సిస్థమ్ (ఎఐఎస్) అమర్చి ఉంటుంది. ప్రత్యేకించి చమురు రవాణా నౌకలకు దీనిని ఖచ్చితంగా అమరుస్తారు. దీని వల్ల నౌక గుర్తింపు, ఇది ఏ ప్రాంతంలో ఉన్నది ? వేగం ఇతర వివరాలు ఇతర నౌకలకు , పర్యవేక్షక సాంకేతిక అధికారుల బృందానికి తెలుస్తాయి. అయితే ప్రస్తుత ఉద్రిక్తతలు, చమురు నౌకలు జలసంధిలో కనబడితే చాలు , పేల్చేస్తాం, కూల్చేస్తాం అనే ఇరాన్ బెదిరింపుల మధ్య ఇప్పుడు ఈ షెన్లాంగ్ డార్క్లోకి వెళ్లింది. అంటే గమనం తెలిపే ఎఐఎస్ స్విచ్ఛాఫ్ చేసేసి , కొద్ది దూరం ఈ విధంగా ప్రయాణించి చివరికి ముంబై రేవుకు చేరుకుంది. సౌదీలోని రాస్ టనూరా పోర్టు నుంచి బయలుదేరి క్షేమంగా భారత్కు చేరడం రికార్డు అయింది. నౌక జాడతెలియకుండా చేసుకుని, సముద్రంలో ప్రయాణించడం ద్వారా గమ్యం చేరుకుంది. మార్చి 1వ తేదీన సౌదీ నుంచి బయలుదేరిన తరువాత మధ్యలో రెండు మూడురోజుల వరకూ అదీ కూడా హర్మూజ్ జలసంధి మార్గం వద్దనే సిగ్నల్ లేకుండా పోయింది. దీనితో నౌకాయాన నియంత్రణ వ్యవస్థలు నివ్వెరపోయాయి. అయితే ఎంతో రిస్క్తో కూడిన గోయింగ్ డార్క్ ప్రక్రియతో భారతీయ కెప్టెన్ దీనిని ముంబై రేవుకు చేర్చడం కీలక పరిణామం అయింది. ఆషామాషీ నౌక కాదు.. 1,35,335 టన్నుల క్రూడాయిల్ సరుకు సౌదీలో లోడ్ అయిన ఈ నౌకలో మొత్తం 1,35,335 టన్నుల ముడిచమురు ఉంది. హర్మూజ్ జలసంధి మార్గంలో జాడ తెలియకుండా వచ్చిన నౌక తిరిగి మారిటైం డాటా సంస్థ లాయడ్ లిస్ ఇంటలిజెన్స్కు, ట్యాంకర్ ట్రాకర్ల దృష్టికి ఈ నెల 9న చిక్కింది. అప్పటికీ ఈ నౌక సరుకుతో ముంబై తీరంలో ఉంది. ఈస్టర్న్ ముంబైలోని మహులూలోని రిఫైనరీలకు ఈ చమురు అందుతోంది. ప్రతి నౌకా ఎఎస్ఐ వాడాల్సిందే ..అత్యవసరమైతే తప్పితే నౌకల గుర్తింపు, కదలికల వివరాలను తెలిపే ఎఐఎస్ అంతర్జాతీయ సముద్రయాన సంస్థ నిబందనల మేరకు ఖచ్చితంగా ప్రతి సరుకు రవాణా నౌకకు ఉండాల్సిందే. దీని ద్వారా అంతర్జాతీయ సముద్ర జలాల్లో నౌకల కదలికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. కానీ ఘర్సణలు, సముద్ర జలాల్లో పోరు ఇతర పరిస్థితుల మధ్య ఈ పరికరాన్ని పనిచేయకుండా చేసుకునే అసాధారణ అవకాశం ఉంటుంది. దీనిని గో డార్క్ అని వ్యవహరిస్తారు. ఏ దేశపు నౌక అయినా ఇరాన్ ముందస్తు అనుమతి తీసుకున్న తరువాతనే హర్మూజ్ జలమార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అది కూడా అత్యంత జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. బుధదారం మయూరి నారీ నౌక గుజరాత్లోని కాండ్లా పోర్టుకు థాయ్ జెండాతో బయలుదేరినప్పుడు హర్మూజ్లో దాడికి గురైంది. ఇరాన్ జరిపిన ఈ దాడిలో భారతీయ నావికులు ఇద్దరు మృతి చెందారు. అప్పటి నుంచి మరో భారతీయుడు జాడ తెలియకుండా పోయ్యాడు. తమ ముందస్తు అనుమతి లేకుండానే నౌక కదలిందని, దాడికి గురైందని ఇరాన్ తెలిపింది. ఇక పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారతీయ జెండాలతో కూడిన చమురు నౌకలు సిద్ధంగా రవాణాకు ఉన్నాయి.వీటిలో 24 హర్మూజ్కు పశ్చిమాన ఉన్నాయి. వీటిలో మొత్తం 677 మంది భారతీయ నావికులు విధుల్లో ఉన్నారు. మరో వైపు ఈ జలసంధి తూర్పున నాలుగు నౌకలు ఉన్నాయి. వీటిలో 101 మంది భారతీయ నావికులు ఉన్నారు. హర్మూజ్ రవాణా సాఫీకి దౌత్యం ఇరాన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ చర్చలు గల్ఫ్ యుద్ధం, హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రవాణాకు ఆటంకాల దశలో బారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇరాన్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. గడిచిన కొద్దిరోజుల్లో ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో మూడుసార్లు మాట్లాడారు ఈ విషయాన్ని విదేశాంగ కార్యాలయ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. గల్ఫ్ యుద్ధ ప్రభావం క్రమేపీ దేశంలో చమురు నిల్వలపై పడుతోంది. సముద్ర మార్గాలలో నౌకారవాణాకు ఆటంకాలు చిక్కులకు దారితీస్తున్నాయి. ముంబై తీరానికి భారీ లోడ్తో సౌదీ నుంచి చమురు నౌక చేరుకున్న తరువాత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించింది. కాగా భారతీయ నౌకలకు, ప్రత్యేకించి భారతీయ జెండాతో ఉన్న రవాణా నౌకలకు ఇరాన్ హర్మూజ్ జలసంధి ద్వారా కదిలేందుకు అనుమతి ఇస్తుందని ఇరాన్ ప్రకటించింది. అయితే వాస్తవికంగా కొన్ని నౌకలు విదేశీ సంస్థలకు చెందినవి కావడం, భారతదేశానికి చేరుకోవల్సి ఉండటం, నౌకలపై ఎగిరే జండాలు వంటి విషయాలలో పలు క్లిష్టతలు తలెత్తుతున్నాయి. ఈ దశలో సంక్లిష్టతల తొలిగింపు దశలో జైశంకర్ ఇరాన్ మంత్రితో మాట్లాడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే అత్యంత కీలకమైన ఈ విషయంపై వివరాలు కొన్ని పూర్తిగా వెల్లడించలేమని కూడా స్పష్టం చేశారు.
పెద్దాసుపత్రులకు మందుల సరఫరా నిలిపివేస్తాం!
మన తెలంగాణ/గోషామహల్/హైదరాబాద్: గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని ట్విన్సిటీస్ మెడిసిన్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేని పక్షంలో నగరంలోని ఆసుపత్రులకు మం దుల సరఫరాను నిలిపి వేస్తామని హెచ్చరించింది. ఈ విషయమై ఇప్పటికే గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్కు నోటీసులు ఇచ్చిన అసోసియేషన్ నా యకులు, గురువారం ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెం డెం ట్కూ నోటీసులు అందించినట్లు తెలిసింది. బకాయిలు చెల్లించక పోవడంతో గత్యంతరంలేక మందుల సరఫరాను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ట్విన్ సిటీస్ మెడిసిన్ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందాల రామచందర్ పేర్కొన్నారు. 2022 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల మెడిసిన్ సరఫరాకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం చెల్లించడంలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, ఆప్తాల్మాలజీ, న్యూరో సర్జరీ, ఆర్ధో ఫెడిక్ విభాగాలకు సంబంధించిన స్టంట్స్, సర్జిక ల్స్, డిస్పోజబుల్స్, ఇంప్లాంట్స్, కిట్స్లతో పాటు లివర్, కిడ్నీ ట్రాన్స్ఫ్లాంటేషన్కు సంబంధించిన డిస్పోజబుల్స్, ఇంప్లాంట్స్ సరఫరా చేస్తు న్నా, సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు. 2024 లో సిఎంని కలిసి వినతిపత్రం సమర్పించినా బకాయిపడిన మం దుల బిల్లులకు మోక్షం లభించలేదని, యేడాదిగా ఆరోగ్యశ్రీకి సం బంధించిన బిల్లులు సైతం చెల్లించక పోవడంతో మెడిసిన్ సప్లయర్స్కు మందుల సరఫరా చేయడం తలకుమించిన భారంగా మా రిందన్నారు. 2025లో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సం బంధించి సుమారు రూ.60 కోట్ల బకాయిలు ఉండగా, టీజీఎస్ ఎంఎస్ఐడీసీ నుండి రూ.60కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో 70 శాతం మందుల సరఫరాను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మిగతా 30 శాతం ఎమర్జెన్సీ మెడిసిన్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి వార్షి క పరీక్షలు శనివారం(మార్చి 14) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మ ధ్యాహ్నం 12.30 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభ సమయానికి మరో 5 నిమిషాలు అదనంగా అంటే ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేం ద్రాల్లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,17,727 మంది పరీక్షలకు హాజరుకానుండగా, వారిలో 2,60,916 బాలురు, 2,56,811 బాలికలు ఉన్నారు. పదవ తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యం లో విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల ప్రారంభానికి ఒకటి రెండు రోజుల ముందు పరీక్షా కేం ద్రాలను సందర్శించాలని సూచించించింది. పరీక్షలు జరిగే రోజుల్లో కేంద్రాల వద్ద 144 సెక్షన్ (బిఎన్ఎస్ఎస్ 163) అ మలులో ఉంటుంది. పది పరీక్షలు సజావుగా నిర్వహించేందు కు 144 ఫ్లైయింగ్ స్కాడ్లను నియమించారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరికి పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతి ఉండదు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ సబంధించిన ఎటువంటి పరికరాలు పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురాకూడదు. హాల్టికెట్, ఎగ్జామ్ ప్యాడ్, పెన్ పె న్సిల్, షార్ప్నర్, ఎరాయిజర్, జామెట్రిక్ పరికరాలతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చు. అయితే, విద్యార్థులు పెన్ను లు, ఎరాయిజర్, జామెట్రీ బాక్స్లు ఒకరి నుంచి ఒకరు తీసుకునేందుకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈసారి వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు వాట్సాప్ నంబర్ (8096958096) ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిని ప్రింట్ తీసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. అలాగే విద్యార్థులు తమ హాల్టికెట్లను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ bsc.telangana.gov.in ద్వారా పొందవచ్చు. ఈసారి కొత్తగా హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాంతో విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది.. ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రానికి వెళ్లవచ్చు. పరీక్షల టైం టేబుల్ ఇలా.. పదో తరగతి పరీక్షలు ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. సైన్స్ పరీక్షలు రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, 7న బయాలజీ, ఏప్రిల్ 13 సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్ 1 భాషా పరీక్ష, 16న ఒకేషనల్ కోర్సు పేపర్ 2 భాషా పరీక్ష జరుగనుంది. మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రం(ఆబ్జెక్టివ్ పేపర్) పార్ట్ బి పరీక్ష చివరి అర గంట ముందు ఇస్తారు. విద్యార్థులు ఆ 30 నిమిషాల్లోనే అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్కు మాత్రం పార్ట్ బి కూడా పార్ట్ ఎ కూడా ఇస్తారు. విద్యార్థులకు సూచనలు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 8.30 గంటల సమయానికి పరీక్షా కేంద్రాలకు వెళ్లేలా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఆలస్యంగా కేంద్రాలకు వెళితే హడావుడిగా ఉండి పరీక్షలు సరిగ్గా రాయలేకపోవచ్చు. - విద్యార్థులు హాల్ టికెట్, రైటింగ్ప్యాడ్, అవసరమైన పెన్నులు, ఎరాయిజర్,పెన్సిల్ తీసుకెళ్లాలి. -- విద్యార్థులు తమకు కేటాయించిన స్థానంలోనే కూర్చుకోవాలి ---- ప్రశ్నపత్రంపై విద్యార్థి తన హాల్టికెట్ నెంబర్ రాయాలి. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరికి పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతి ఉండదు. ---- -www.dse.telangana.gov.in వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో కీలక ప రిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎ దుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి గురువారం మధ్యాహ్నం వె ళ్లిన సిబిఐ అధికారులు ఈ నెల 16న విచారణకు హాజరు కావాల ని కోరుతూ ఆమెకు సమన్లు అందజేశా రు. ఫిబ్రవరి 27న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా 23 మందిని డిశ్చార్జ్ చేస్తూ సంచలన తీర్పునిచ్చిన సంగతి విదితమే. సిబిఐ మోపిన అభియోగాలు నిరాధా రమని కోర్టు అప్పట్లో పేర్కొంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ట్రయల్ కోర్టులో ఇడి కేసు విచారణను వాయిదా వేయాలని ఆదేశించడంతో పాటు, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సిబిఐ అధికారు లు కవితకు సమన్లు అందించారు. కవితతో పాటు వ్యాపార వేత్తలు అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపి మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సమన్లు అందాయి. సిబిఐ సమన్లపై కవిత ఏమన్నారంటే.. ఈ విషయంపై కవిత స్పందించారు. ఈ మేరకు ఎక్స్లో ఆమె ప్రకటన చేశారు. ఢిల్లీ మద్యం కేసులో చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టేసిన విషయం మీ అందరికీ తెలిసిందేనని, కేసు కొట్టేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను సైతం ఎంక్వయిరీ చేయాలని సైతం రౌస్ అవెన్యూ కోర్టు కామెంట్ చేసిన విషయమూ మీ అవగాహనలో ఉందని కవిత ఎక్స్ లో పేర్కొన్నారు. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు పై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిందని, ఈ కేసు విచారణ ఈనెల 16న ఉన్నదన్న విషయాన్ని సిబిఐ అధికారులు స్వయంగా తెలియచేశారని కవిత తెలిపారు. ఈ విషయంపై తమ లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తున్నామని, సత్యం నా తోడుగా సంపూర్ణంగా అధికారులకు సహకరిస్తానని కల్వకుంట్ల కవిత ఎక్స్లో పోస్టు ద్వారా తన స్పందనను తెలియజేశారు.
మన తెలంగాణ/శేరిలింగంపల్లి: అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ పరిణామాలు దేశంలో ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నా యి. ఈ ప్రభావం ఇప్పుడు నగరాల్లోని హోటల్స్, హాస్టల్స్, కంపెనీలపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దక్షణాది, దక్కన్, ఇరానీ వంటకాలకు కేరాఫ్ అ డ్రస్గా ఉన్న హైదరాబాద్ మహానగరంపై ఈ ప్రభావం పెద్ద ఎత్తున పడుతుంది. విద్యార్థి, ఉద్యోగులతో పాటు బయటి ఆహారాన్ని ఇష్టంగా తినే నగర వాసులకు ఇపుడు కష్టంగా మారుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తీవ్రంగా తగ్గిపోవడంతో మార్కెట్లో కొరత ఏర్పడింది. దీం తో సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయా యి. అధికారికంగా లభించని పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్లో ఒక్క సిలిండర్ ధర ఆరు వేల రూపాయలు దాటిందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ కొరతను కొందరు ఏజెన్సీలు అవకాశంగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా రో జులుగా బుకింగ్ చేయని పేర్లపై సిలిండర్లు తీసుకుని వాటిని బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అ మ్ముతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డోమేస్టిక్ కాస్తా కమర్షియల్గా మారుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు ఈ విధమైన వ్యాపారానికి తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూతపడే పరిస్థితిలో హోటల్స్, హాస్టల్స్, కంపెనీలు? నగరంలో వేల సంఖ్యలో ఉన్న హాస్టల్స్, చిన్న హోటల్స్ ప్రస్తుతం గ్యాస్ కొరతతో సంక్షోభంలో ఉన్నాయి. అదేవిదంగా పలు కంపెనీలు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి.హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, ఈసీఐఎల్, తార్నాక, మెహిదీపట్నం, దర్గా, కోకాపేట అమీర్ పేట్, పంజాగుట్ట, మియాపూర్,అదిభట్ల, వనస్థలిపురం, తుక్కుగూడ, పఠాన్ చెరువు, చందానగర్, కూకట్ పల్లి, జేఎన్టీయూ, కేపీ హెచ్ బీ, జెడిమెట్ల, షాపూర్, బాలానగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో హాస్టల్స్, హోటల్స్, జాతీయ, అంతర్జాతీయ కంపెనీ లు ఉన్నాయి. రోజూ లక్షలాది మందికి వంట చేయాల్సి ఉండటంతో గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు సిలిండర్లు దొరకకపోవడం, దొరికినా భారీ ధర ఉండటంతో నిర్వాహకులు నష్టాల్లో నడుపుతున్నారు. కొన్ని హోటల్స్ ఇప్పటికే పని గంటలు తగ్గించగా, మరికొన్ని పూర్తిగా మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. మెనూలలో మార్పులు గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండే వంటకాలను అనేక హోటల్స్ తమ మెనూ నుండి తొలగిస్తున్నాయి. ఎక్కువ సమయం పట్టే వంటలు చేయకుండా తక్కువ గ్యాస్తో అయ్యే వంటకాలకే పరిమితమవుతున్నాయి. దీంతో వినియోగదారులకు అందే ఆహారంలో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.టీ, కాఫీ, దోశ, చపాతీ, పూరి లాంటి వంటకాలు అందుబాటులో ఉంచటం లేదు.అదేవిదంగా వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉండే హాస్టల్స్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్యాస్ ఖర్చు తగ్గించేందుకు నిర్వాహకులు మెనూలలో మార్పులు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు వంటకాలను తగ్గించడం, సులభంగా అయ్యే ఆహారాన్ని మాత్రమే అందించడం వంటి మార్పులు చేస్తున్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్థిని, విద్యార్థులకు ఉద్దేశించిన వందలాది హాస్టల్స్ లలో కూడా ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 18 వరకు ఇంటర్ పరీక్షలు ముగుస్తుండగా ఎంసెట్ ఇతర కోచింగ్ ల కోసం విద్యార్థులు అక్కడే ఉండే అవకాశం ఉంది. అదే విదంగా ఈ నెల 14 నుండి 10వ తరగతి పరీక్షలు సైతం ప్రారంభం కానుండటంతో ఆయా హాస్టల్స్ పరిస్థితులు ఎలా ఉంటాయోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.రోజుకు రెండు మూడు సిలిండర్లు అవసరం అవుతుంది. ఇప్పుడు సిలిండర్ దొరకడం లేదు. దొరికినా ఆరు వేల రూపాయలు అడుగుతున్నారు. ఇలా అయితే హోటల్ నడపడం కష్టమే అని హోటల్ నిర్వాహకులు చెబుతుండగా,వందల మంది విద్యార్థులకు వంట చేయాలి, గ్యాస్ ఖర్చు ఎక్కువ కావడంతో మెనూలను మార్చాల్సి వస్తోందని హాస్టల్ ల యజమానులు చెబుతున్నారు. గ్యాస్ లేకపోతే మళ్లీ కట్టెలతో వంట చేయాల్సిన పరిస్థితి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టెల పొయ్యిల వైపు నిర్వాహకుల చూపు గ్యాస్ కొరత మరింత పెరగడంతో కొంతమంది హోటల్, హాస్టల్ నిర్వాహకులు మళ్లీ కట్టెల పొయ్యిల వైపు చూస్తున్నారు. గతంలో పూర్తిగా మానేసిన కట్టెల వంటలను తిరిగి ప్రారంభించాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే కట్టెలతో వంటలు ప్రారంభించినట్లు సమాచారం.గ్యాస్ దొరకకపోవడంతో కట్టెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. నగర పరిసర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కట్టెల ధరలు కూడా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
శుక్రవారం రాశి ఫలాలు (13-03-2026)
మేషం స్వల్ప అనారోగ్యం సమస్యలుంటాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తికావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృషభం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిధునం దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. కర్కాటకం ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. సింహం అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కన్య ఇంటాబయట ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. తుల ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. వృశ్చికం వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ధనస్సు గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. మకరం గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. కుంభం వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగమున విధులలో ఆటంకాలు తొలగుతాయి. మీనం ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారమున చిక్కులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.
ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో అయతుల్లా ఖమేనీ భార్య మన్సోరేష్ ఖోజసెహ్ మరణించలేదు. ఆమె సజీవంగానే ఉన్నారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా గురువారం అధికారికంగా తెలిపింది. గత నెల 27 రాత్రి జరిపిన దాడిలో అక్కడికక్కడే ఖమేనీ హతులయ్యారని, ఆయన భార్య మరుసటి రోజు చికిత్స దశలో చనిపోయారని ఇంతకు ముందు వార్తలు వెలువడ్డాయి. ఇవి నిజం కావని ఇరాన్ వార్తా సంస్థ తెలిపింది. ఆమె ఓ రహస్య ప్రాంతంలో క్షేమంగా, ఆరోగ్యంగా, భద్రంగా ఉన్నారని వివరించారు. కాగా ఇరాన్ నూతన నేత మొజ్తాబా ఖమేనీ అధికార పగ్గాల తరువాత తమ తొలి ప్రసంగంలో ఎక్కువగా తండ్రి ఖమేనీ గురించి ప్రస్తావించారు. సీనియర్ ఖమేనీ వీరోచిత పోరు తనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం అన్నారు. అయితే తల్లి గురించి మాట్లాడలేదు.
మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రేవంత్ దేశంలోనే ప్రముఖ హెల్త్కేర్ హబ్గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆసుపత్రుల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించ డంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని గురువారం సీఎం ప్రారంభించారు. దీంతో భారత్లో మెడికవర్ ఆసుపత్రుల సంఖ్య 25కి చేరింది. అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక వైద్య సాంకేతికతతో రూపొందిం చిన […] The post హెల్త్కేర్ హబ్గా హైదరాబాద్ appeared first on Visalaandhra .
. దేశ గౌరవం ట్రంప్కు తాకట్టు. యుద్ధ ప్రభావంతో ధరల పెరుగుదల. ముర్ము వైఖరి సమర్థనీయం కాదు. కమ్యూనిస్టు సిద్ధాంతం శాశ్వతం నారాయణ విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న భారతదేశానికి మోదీ అత్యంత బలహీన ప్రధాని అని, యుద్ధాన్ని ఆపే కనీస ప్రయత్నం చేయడం లేదని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సాగిలపడటం తప్ప మోదీ మరేపని చేయలేక పోతున్నారని అన్నారు. ఇందిరాగాంధీకి ఉన్న […] The post బలహీన ప్రధాని మోదీ appeared first on Visalaandhra .
జాబ్ కన్సల్టెన్సీ యజమాని హత్య..
జాబ్ కన్సల్టెన్సీ యజమాని హత్య చేసిన నిందితుడిని మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. కత్తితో పాటు ఐఫోన్-15, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్స్పెక్టర్ ప్రభాకర్ వివరాలు వెల్లడించారు. తేదీ 10-03-2026 సాయంత్రం సుమారు 17:30 గంటలకు, హైదరాబాద్లోని ఇంజనీర్స్ కాలనీలోని బెస్ట్ గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ జాబ్ కన్సల్టెన్సీ జగ్గవరపు శశికిరణ్ రెడ్డి నిర్వహిస్తున్నాడు. ఇందులో హెచ్.ఆర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న దులిపాడు అక్షయ అలియాస్ సాయి శృతి పనిచేస్తోంది. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ఎపిలోని విశాఖపట్నం జిల్లా, మునగపాక మండలం, గణపర్తి గ్రామానికి చెందిన సుమారుపొల్లమారి శెట్టి ప్రభు కుమార్ అలియాస్ షాను(19) ప్రైవేట్ ఉద్యోగి. ఉద్యోగం కోసం కొంత కాలం క్రితం కన్సల్టెన్సీలో ఉద్యోగం కావాలని సంప్రదించాడు, రూ.2,500 చెల్లించాడు. ఓ హోటల్లో ఉద్యోగంలో చేరిన ప్రభు కుమార్ ఉద్యోగం నచ్చకపోవడంతో రెండు రోజులకే మానివేశాడు. తర్వాత కన్సల్టెన్సీ కార్యాలయానికి వచ్చిన నిందితుడు కన్సల్టెన్సీ ద్వారా ఇప్పించిన ఉద్యోగం నచ్చలేదని, తాను చెల్లించిన డబ్బును , పని చేసిన రోజుల జీతాన్ని తిరిగి ఇవ్వాలని గొడవపడ్డాడు. అక్షయ నిందితుడిని కౌన్సెలింగ్ గదిలో కూర్చోబెట్టి, యజమాని జగ్గవరపు శశి కిరణ్ రెడ్డి కి సమాచారం ఇచ్చింది. తర్వాత శశికిరణ్ గదిలోకి వెళ్లిన ప్రభు కుమార్ ఆయనతో గొడవపడ్డాడు. గది నుండి పెద్దగా అరుపులు రావడంతో అక్షయ శశికిరణ్ గదిలోకి వెళ్లగా కత్తితో బయటికి వచ్చిన నిందితుడు అక్షయ ఎడమ భుజంపై పొడిచి అక్కడి నుండి పారిపోయాడు. నిందితుడు వెళ్లిన తర్వాత సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా, జగ్గవరపు శశి కిరణ్ రెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నారు. అతడి శరీరంపై సుమారు 23 కత్తిపోట్లు ఉన్నాయి. వెంటనే అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిపై 103(1), 109, 329(4), 127(2), 351(2), 305 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఇన్స్స్పెక్టర్ హెచ్. ప్రభాకర్, డిటెక్టివ్ ఇన్స్స్పెక్టర్ , సిబ్బంది దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు.
. మంత్రి తుమ్మల హామీ. భూదాన్ భూముల్లో 38 ఇళ్లకు భూమి పూజ. ఉగాదిలోపు విద్యుత్ సరఫరా పనుల పూర్తికి ఆదేశం విశాలాంధ్రబ్యూరో – ఖమ్మం: వెలుగుమట్లను మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితుల 38 ఇళ్లకు గురువారం మంత్రి తుమ్మల… ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. నిర్వాసితులకు […] The post మోడల్ కాలనీగా వెలుగుమట్ల appeared first on Visalaandhra .
నేడు పార్లమెంటు ముందుకు200 మంది ఎంపీల సంతకాలు న్యూదిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం నోటీసు సమర్పించనున్నాయి. 130 మంది లోక్సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. గురువారం కూడా కొందరు సభ్యులు ముందుకొచ్చి సంతకాలు చేశారని ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు. నిబంధనల ప్రకారం 100 మంది ఎంపీలు సంతకాలు చేస్తే లోక్సభలో, 50 మంది మద్దతిస్తే […] The post సీఈసీపై అభిశంసన appeared first on Visalaandhra .
స్పీకర్ నిర్ణయమే అంతిమం: సుప్రీం
న్యూదిల్లీ: తెలంగాణలో బీఆరఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను గురువారం సుప్రీంకోర్టు ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా… స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆరఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాగా… సర్వోన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. […] The post స్పీకర్ నిర్ణయమే అంతిమం: సుప్రీం appeared first on Visalaandhra .
మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు రావటంతో తీవ్ర కలకలం చెలరేగింది. ముంబైలోని విధాన్ భవన్లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. దీంతో అధికారులు అప్రమత్తమ య్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. అసెంబ్లీలోని వారందరినీ దూరంగా పంపించేశారు. బాంబ్ స్క్వాడ్తో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎలాంటి బాంబు లేదని తేలింది. దర్యాప్తు అధికారులు బెదిరింపులకు పాల్పడ్డ వారికోసం గాలిస్తున్నారు. బాంబు బెదిరింపులతో అసెంబ్లీలో […] The post మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు appeared first on Visalaandhra .
సరకు రవాణాలోవిశాఖ పోర్టు రికార్డు
విశాలాంధ్ర – విశాఖపట్నం: సరకు రవాణాలో విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) రికార్డు సృష్టించిం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 345 రోజుల్లోనే 85.07 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసింది. తద్వారా చరిత్రాత్మక మైలు రాయిని చేరుకుంది. 92 ఏళ్ల విశాఖ పోర్టు చరిత్రలో ఈ స్థాయి సరకు రవాణా ఎప్ప్పుడు జరగలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 90 ఎంఎంటీ సరకు నిర్వహణ లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉన్నట్లు పోర్టు అథారిటీ చైర్మన్ డాక్టర్ […] The post సరకు రవాణాలోవిశాఖ పోర్టు రికార్డు appeared first on Visalaandhra .

35 C