SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్ దర్శి, ఆంధ్రప్రభ : క్రికెట్

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:24 am

Road Accident : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 16 Apr 2026 7:19 am

Women reservation bill |వికసిత్‌ భారత్‌లో మహిళల పాత్ర

Women reservation bill | వికసిత్‌ భారత్‌లో మహిళల పాత్ర Women reservation

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:45 am

Andhra Prabha SPL Story |మోడీ నాయకత్వం: వ్యూహం –నిర్ణయాలు

Andhra Prabha SPL Story | మోడీ నాయకత్వం: వ్యూహం – నిర్ణయాలు

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:29 am

16thaprileditorial |ట్రంప్‌-చైనా సంబంధాలు.. మారుతున్న స్వరూపం

16thaprileditorial | ట్రంప్‌-చైనా సంబంధాలు.. మారుతున్న స్వరూపం 16thaprileditorial | హార్మూజ్‌ జలసంధి

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:10 am

పార్లమెంట్‌లో ఢీలిమిటేషన్

న్యూఢిల్లీ: నేటి నుంచి (గురువారం) మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అధికార ఎన్‌డిఎ, కాంగ్రెస్ సారధ్య ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి వ్యాగ్యుద్ధం జరిగేందుకు రంగం సిద్ధం అయింది. చాలా కాలంగా అంతా ఎదురుచూస్తున్న చట్టసభలలో మహిళా రిజర్వేషన్ల కోటా బిల్లుకు , లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) తద్వారా లోక్‌సభ స్థానాల పెంపుదలకు ముడిపెడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక రాజ్యాగ సవరణల బిల్లుకు సిద్ధం అయింది. ఇందుకోసం బడ్జెట్ సమావేశాల పొడిగింపుగా ప్రత్యేక పార్లమెంట్ సిట్టింగ్‌కు దిగింది. దేశంలో రాజ్యాంగ నిర్ణీత అధికారాలను అన్నింటినీ క్రమేపీ ప్రభుత్వ పెత్తనంతో కూడిన కార్యనిర్వాహక వర్గం తన చెప్పుచేతల్లోకి తీసుకొంటోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. డిలిమిటేషన్ ప్రక్రియ పేరిట కేంద్రం తీసుకువస్తున్న రాజ్యాంగ సవరణల బిల్లు ఆదరాబాదరగా ఆమోదానికి చూస్తున్నారు. లోక్‌సభ స్థానాల పెంపుదలను కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దశలో చేపట్టాలని రాజకీయ కుతంత్రాలకు దిగుతున్నారు.ఈ ఏకపక్ష బుల్‌డోజింగ్ విధానానికి నిరసనగా ప్రతిపక్షాలు సంఘటితం అయ్యాయని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే బుదవారం విమర్శించారు. అంతకు ముందు ఇండియా కూటమి నేతల సమావేశంలో కీలక విషయాలపై , ప్రత్యేకించి ఇప్పటి సిట్టింగ్‌పై సమీక్షించారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగసవరణల్లోని డిలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఓటు వేస్తాయని వారి తరఫున ఖర్గే ప్రకటించారు. దీనితో గురువారం ఆరంభం అయ్యే సిట్టింగ్ ఇప్పటి నుంచే వేడిమి సంకేతాలకు దారితీసింది. ప్రభుత్వం మహిళా బిల్లుకు , డిలిమిటేషన్‌కు లింక్ పెట్టి తన రాజకీయ ప్రాబల్యం చాటుకునేందుకు పావులు కదిపిందని విమర్శించారు. ప్రతిపక్షాలుఏ ఎప్పుడూ కూడా మహిళా కోటాకు వ్యతిరేకంగా వ్యవహరించలేదు. అయితే ఇప్పుడు ఈ బిల్లును కేంద్రం తీసుకువస్తున్న రాజకీయ మెలికల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆమ్ ఆద్మీపార్టీ, ఇండియా కూటమి పార్టీల నేతలు అంతా కలిసి ఖర్గే నివాసంలో సమావేశం అయ్యారు. మూడురోజుల ప్రత్యేక పార్లమెంట్ సిట్టింగ్‌లో ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వ్యూహం, కట్టుదిట్టమైన ఉమ్మడి కార్యాచరణపై చాలా సేపు చర్చించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ప్రతిపక్షాలు సమ్మతిస్తున్నాయి. అయితే దీనిని తీసుకువచ్చే విషయంలో కేంద్రం రాజకీయ ధోరణిని తప్పుపడుతున్నామని ఖర్గే ఆ తరువాత తెలిపారు. ఇప్పుడు తీసుకువచ్చే బిల్లును తిప్పికొట్టేందుకు నిర్ణయించుకున్నామని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల దశలో కీలక బిల్లు ఎందుకు? పైగా దేశంలో కులగణన పూర్తి కాకుండా డిలిమిటేషన్ ఎంత వరకు సబబు? అని ఖర్గే ప్రశ్నించారు. జనాభా లెక్కల తరువాతనే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. అప్పుడే సరైన న్యాయం జరుగుతుందనేది ప్రతిపక్షాల సమైక్య వాదన అని, దీనిని సభలలో విన్పించి తీరుతామని మీడియాతో ఖర్గే తేల్చిచెప్పారు. 2029 నుంచే డిలిమిటేషన్ లోక్‌సభ స్థానాల సంఖ్య ఇక 850 మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచే అమలు చేసేందుకు వీలు కల్పించేలా రాజ్యాంగ సవరణలతో , డిలిమిటేషన్ వీలుతో ఉండేలా రాజ్యాంగ సవరణల బిల్లును మూడురోజుల సిట్టింగ్‌లో ఆమోదింపచేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ఇందుకు అధికార ఎన్‌డిఎ అన్ని విధాలుగా సమాయత్తం అయింది. మహిళా బిల్లును పూర్తి స్థాయిలో అమలుపర్చేందుకు , వారికి చట్టసభలలో 33 శాతం సీట్ల కేటాయింపునకు వీలుగా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. దీనితో ఇప్పుడు లోక్‌సభ స్థానాల గరిష్ట సంఖ్య 550ని ఏకంగా 850కి పెంచేందుకు ప్రతిపాదించారు మహిళలకు లోక్‌సభ సీట్ల సంఖ్యలో న్యాయానికి నియోజకవర్గాల పెంపుదలకు సబంధం ఉందని , ఇది లేకుండా అది వీలు కాదని చెపుతోంది. మహిళా బిల్లు ఇష్టం లేకపోవడంతోనే ప్రతిపక్షాలు ఈ ప్రత్యేక సిట్టింగ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని అధికార పక్ష నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. అయితే బిజెపి , మిత్రపక్షాలు తమ రాజకీయ ముసుగుతో ఈ బిల్లు ద్వారా తమ రాజకీయ స్వార్థం చాటుకుంటున్నాయని ఖర్గే ఇతర నేతలు విమర్శించారు. డిలిమిటేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు పూర్తిగా వ్యతిరేకం, మహిళా కోటాకు సంపూర్ణ మద్దతుతో ఇస్తున్నామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, టిఎంసి నేత సాగరిక ఘోష్, శివసేన యుబిటి నేత సంజయ్ రౌత్, డిఎంకె నుంచి టిఆర్ బాలు, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, అరవింద్ సామంత్, ఎన్‌సిపి నాయకురాలు సుప్రియా సూలే , ఎస్‌పి నాయకులు అఖిలేష్ యాదవ్, వామపక్షాల నుంచి ఏ రాజా, నిలోత్పల్ బసు, ఆప్ నేత సంజయ్ సింగ్ , ఇండిపెండెంట్ ఎంపి కపిల్ సిబల్, ఐయుఎంఎల్ నుంచి ఇటి మెహమ్మద్ బషీర్, ఆర్‌ఎస్‌పి తరఫున ఎన్‌కె ప్రేమాచంద్రన్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు కెసి వేణుగోపాల్, జైరాం రమేష్ దగ్గరుండి నిర్వహించారు. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరిట బిల్లుకు సవరణలను తీసుకువచ్చేందుకు 16, 17, 18 తేదీలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు రంగం సిద్ధం అయింది. ఇందుకోసం బిజెపి ఎంపిలకు విప్ జారీ చేసి ఉంచింది. మిత్రపక్షాల ఎంపిలు కూడా విధిగా హాజరు అయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ గెర్రిమాండరింగ్ చేష్టలు సాగవు రాజకీయ జంజాటంతోనే డిలిమిటేషన్ ః రాహుల్ కేంద్ర ప్రభుత్వం రాజకీయాధికారం లాక్కునేందుకు, నియోజకవర్గాలపై పట్టుకు గెర్రిమాండరింగ్‌కు ఇప్పుడు డిలిమిటేషన్ ద్వారా దిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ డిలిమిటేషన్ ఎత్తుగడను కాంగ్రెస్ పార్టీ సహించేది లేదని ఆయన బుదవారం ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. దేశంలో దక్షిణాది, ఈశాన్య , చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తమ పార్టీ సహించేది లేదన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు 2023లోనే పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపిందని, రాజ్యాంగంలో ఓ భాగంగా ఉందని తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకురావడం ఎందుకు? కేవలం ఈ బిల్లు సాకుతో తమ అనుకూల రీతిలో సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు చేసే కసరత్తు అని విమర్శించారు. ఒడిసి, దళిత, ఆదివాసీ వర్గాల వాటాల చోరీని తాము సహించేది లేదని హెచ్చరించారు. కులగణనతో ఆయా వర్గాలకు కల్పించే ప్రాతినిధ్యం ముఖ్యంగా ఖరారు కావల్సి ఉంది. అది లేకుండా జరిగే కోటా సంబంధిత డిలిమిటేషన్‌ను ఆమోదించేది లేదన్నారు. 

మన తెలంగాణ 16 Apr 2026 6:00 am

56% బిసిలు

మన తెలంగాణ / హైదరాబాద్ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ నివేదిక వివరాలను ప్రజలకు అందుబాటులో (పబ్లిక్ డొమేన్‌లో) ఉంచుతున్నట్లు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో కలిసి మంత్రలు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంఎల్‌సి , పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్వే నివేదికను మీడియాకు విడుదల చేశారు. ఇప్పటికే ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చిండంతో పాటు బిసిలకు 42 శాతం రిజర్యేషన్లు కల్పించాలని సర్వే అధారంగా సుప్రీంకోర్టు వరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేసిందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదరా బాదరాగా సర్వేను వెల్లడించడానికి కారణమేమిటని మీడియా ప్రశ్నించినపుడు ఆయన సమాధానాన్ని దాట వేశారు. సర్వే నివేదికలోని ముఖ్యాంశాలలో రాష్ట్రంలో మూడున్నర కోట్ల జనాభాలో బిసిలు 56.36 శాతం, ఎస్‌సిలు 17.42 శాతం, ఎస్‌టిలు 10.43 శాతం, ఓసీలు 15.79 శాతం ఉన్నారని మంత్రి వెల్లడించారు. అలాగే ఈ సర్వే నివేదికలో తమ వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన వారు 4 శాతం కాగా వీరి జనాభా 14 లక్షల మందిగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 55 లక్షల 50వేల 759 జనాభా కలిగి ఉన్నారని తెలిపారు. ఒక కోటి 12 లక్షల 36 వేల 849 కుటుంబాలు (97.10 శాతం) సర్వేకు వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. ఈ సర్వే కోసం లక్షా 3వేల మంది ఎనుమరేటర్లు, 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఉపయోగించుకున్నట్లు తెలిపారు. సర్వేకు ముందు కర్నాటక, బీహార్ రాష్ట్రాల లో అక్కడి అధ్యయనాలను రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా పర్యటించి చర్చించిందన్నారు. సమాజంలోని వివిధ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను అంచనా వేసి తగిన విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశం కల్పించే ఉద్దేశంతో తమ ప్రభుత్వం చారిత్రాత్మక సర్వేను నిర్వహించిందన్నారు. సర్వే డేటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 2 కీలక బిల్లులను ఆమోదించి దాని ద్వారా విద్య, ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో 42 శాతం బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినప్పటికీ అది న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొందని మంత్రి వివరించారు. అయినప్పటికీ తమ చిత్తశుద్దిని నిరూపించుకునేందుకు ఫిబ్రవరి 4వ తేదీని తెలంగాణ సామాజిక, న్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఇది తెలంగాణ సామాజిక న్యాయం, సమానత్వం సాధించడంలో తమ సర్వే ఒక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. సర్వేతో పాటు మేధావులు రూపొందించిన నివేదికను కూడా తామ ప్రజలకు అందుబాటులో నేటి నుంచి పబ్లిక్ డొమేన్‌లో పెడ్తున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో 57 శాతం మహిళలు (75 లక్షలు) ఉన్నారని సర్వేలో తేలిందన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయం, వ్యాపారం, పారిశ్రామిక రంగాల్లో మహిళల పాత్ర ఎంతో కీలకంగా నిలుస్తోందని సర్వే వెల్లడించిందన్నారు. మహిళా సమాఖ్యలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆదాయ వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు.

మన తెలంగాణ 16 Apr 2026 5:30 am

డీలిమిటేషన్‌లో అన్యాయం జరిగితే తీవ్ర ప్రతిఘటన

మన తెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరిగితే సహించేది లేదని, బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హెచ్చరించారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, 2023 సెప్టెంబర్‌లో తాను చేసిన పోస్టును ట్యాగ్ చేశారు. ఈ విషయంలో మూడేళ్ల క్రితమే బిఆర్‌ఎస్ అభిప్రాయం చెప్పామని, అందులో మార్పు లేదని స్పష్టం చేశారు. దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డిలిమిటేషన్ జరిగితే, అది కేవలం ఒక రాజకీయ ప్రక్రియగానో లేక చట్ట సవరణ గానో మిగిలిపోదు అని పేర్కొన్నారు. మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని అన్నారు. తామంతా గర్వించదగ్గ భారతీయులం అని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులం అని పేర్కొన్నారు. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు, ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్‌లో తమ ప్రజల స్వరాన్ని, ప్రతినిధిత్వాన్ని అణచివేయాలని చూస్తే తాము నిశ్శబ్దంగా చూస్తూ ఉండబోమని, దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. 

మన తెలంగాణ 16 Apr 2026 4:30 am

త్వరలో పదవుల పందేరం

మన తెలంగాణ/హైదరాబాద్: కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ కోసం నిరంతరం పోరాటం చేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ముఖ్య నేతల కీలక సమావేశంలో నిర్ణయించారు. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేపట్టింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. సుమారు నాలుగు గంటల పాటు వీరు చర్చించారు. సామాజిక సమతుల్యత పాటిస్తూనే నిరంతరం పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వడం ద్వారా న్యాయం జరిగిందన్న భావన పార్టీలో ప్రతి ఒక్కరికీ కలగాలని వారు భావించారని తెలిసింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కార్యకర్తలకు త్వరలోనే తీపి కబురు అందనుంది. ఇప్పటి వరకూ నామినేట్ కాకుండా ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య ఎంత ?, ఇదివరకే నామినేట్ అయి వారి గడువు ముగుస్తున్న పదవులు ఎన్నీ? అని వారు తొలుత సమీక్షించారు. ఆ తర్వాత ముఖ్యమైన నేతలకు ఎవరెవరికీ ఏయే పదవులు ఇవ్వాలన్న అంశంపై వారు చర్చించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి ఎమ్మెల్యే పద్మావతికి ఆర్టీసీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఇచ్చే అంశంపై కూడా చర్చ జరిగిందని తెలిసింది. అయితే మిగతా పదవుల కేటాయింపులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాలని వారు ఈ సందర్భంగా ప్రధానంగా చర్చించారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా జాబితాలు సిద్ధం చేశారని పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీలో సామాజిక సమతుల్యత కుదరక ఒకే సామాజికవర్గం వారు ఎక్కువ సంఖ్యలో ఉంటే వారిని పిసిసి రాష్ట్ర కార్యవర్గంలో పదవి కల్పించాలని, వారిని అందుకు బుజ్జగించాలని వారు భావించినట్లు తెలిసింది.అందరికీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వలేం కాబట్టి పిసిసిలో, జిల్లా స్థాయి కమిటీల భర్తీపై తుది నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇప్పటికే జిల్లా స్థాయి పోస్టుల జాబితాను అధిష్టానం సిద్ధం చేసింది. కేవలం అర్హత, సిఫార్సులకు అవకాశం ఇవ్వకుండా నిజంగా పార్టీ కష్టకాలంలో అండగా నిలబడిన వారికే పదవులు ఇస్తూ జాబితాలు సిద్ధమైనట్లు తెలిసింది. ఇదిలాఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్స్, కార్యదర్శులు, ఇతర ఆర్గనైజేషన్ పదవులపైనా వారు చర్చించి నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. డిలిమిటేషన్‌పై పోరాట బాట ఇదిలాఉండగా కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా చేపట్టనున్న డీలిమిటేషన్‌పైనా పోరాట బాట చేపట్టాల్సిన అవసరంపైనా వారు చర్చించారు. ఇప్పటికే తాను దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల అన్ని పార్టీల ముఖ్య నేతలతో కలిసి పోరాటం చేయాల్సిన అంశంపైనా వారు మంతనాలు జరిపారని తెలిసింది. ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద చేపట్టనున్న ధర్నా అంశంపై కూడా వారు చర్చించారు.

మన తెలంగాణ 16 Apr 2026 4:00 am

కదిరిలో భారీ పేలుడు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కదిరి మండలంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. వివరాల్లోకి వెళితే కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ కూలీ ఇంట్లో ఈ దుర్ఘటన జరిగింది. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు డిటోనేటర్లు మొదట పేలాయి. ఈ పేలుడు ధాటికి మంటలు చెలరేగి, అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్లకు అంటుకున్నాయి. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు దెబ్బకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.. ఆ పక్కనే ఉన్న మరి కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు తీవ్రతకు మృతుల శరీరాలు ముక్కలై, మాంసపు ముద్దలుగా చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లు పేలినట్లు అక్కడ పరిస్థితులు చూస్తే అర్ధమవుతోంది కానీ ఈ పేలుడుకు డిటోనేటర్లు, అమ్మోనియా సల్ఫేట్ వల్లే పేలుడు సంభవించి ఉండి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పేలుడు సంభవిం చిన ఇంట్లో పేలుడు పదార్థాలు అమర్చేం దుకు ఉపయోగించే డ్రిల్లింగ్ మెషిన్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత మంట లు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయ పడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మృతి చెందిన వారిని మబున్నీ, మధు, సంపత్, వెంకన్నగా పోలీ సులు గుర్తించారు. మరొ మృతుడిని గుర్తించాల్సి ఉంది. ఈ దుర్ఘటనపై మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అక్రమంగా డిటోనేటర్లు ఎందుకు నిల్వ ఉంచారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వలస వెళ్లిన వెంకన్న, సంపత్ కుటుంబం తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం నుంచి 12 ఏళ్ల క్రితం వెంకన్న, సంపత్ కుటుంబం ఎపిలోని శ్రీ సత్యసాయి జిల్లాకు వలస వెళ్లింది. కొండల్లో డిటోనేటర్లు పేల్చి ఆ రాళ్లను విక్రయిస్తూ జీవనం కొనసాగించేవారు. ఈ క్రమంలో ఇంట్లో డిటోనేటర్లు, అమ్మోనియం సల్ఫేట్, డీజిల్ వంటి పేలు డు స్వభావం కలిగిన వాటిని నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు సంభవించినప్పుడు ప్రమాదాన్ని పసిగట్టిన వెంకన్న, సంపత్‌లు వెంటనే పిల్లలను తీసుకుని బయటకు పరిగెత్తారు. మంటలు ఆర్పేందుకు నీళ్ల బకెట్లతో ఇంటి వద్దకు వెంకన్నతో పాటు స్థానికులు కూడా వెళ్లారు. ఆ సమయంలో డిటోనేటర్లు పేలడంతో సాయం చేసేందుకు వెళ్లిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఘటనాస్థలంలో నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. పేలుడుకు గ్యాస్ సిలిండర్లు కారణం కాదని నిర్ధారించారు. పేలుడు జరిగిన తర్వాత సిలిండర్లను విపత్తు నిర్వహణ సిబ్బంది దూరంగా తరలించారు. ఘటనాస్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్‌పి, ఎంఎల్‌ఎ కందికుంట ప్రసాద్ పరిశీలించారు.

మన తెలంగాణ 16 Apr 2026 3:30 am

బాబోయ్ ఎండలు

మన తెలంగాణ/హైదరాబాద్: సూర్యుడి ప్రతాపానికి రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతొంది. ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు గత రెండు రోజులుగా 43 డిగ్రీల మార్కును చేరుకోవడంతో ఎండ వేడి విపరీతంగా పెరిగింది. దీనికి తొడు వడగాలులు తొడవ్వడంతో ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రాష్ట్రంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 43. డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోగా రాష్ట్రంలో రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యింది. దీంతో పాటు రెండు రోజుల్లో 31 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల తరువాత ఎవరూ బయటకు రావద్దని, తప్పనిసరి పరిస్థితులు అయితే తగు జాగ్రత్తలతో బయటకు వెళ్లాలని సూచించింది. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు వడ గాలులు వీచే అవకాశం ఉందని, వడదెబ్బతో ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో సైతం ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బయటకు వెళ్లేవారు శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంచుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. జిల్లా అధికారులను అలర్ట్ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో విపరీతమయిన ఎండ, వడగాలులు నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వడగాలు వీచే అవకాశం ఉందని, దీంతో పాటు ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల నుంచి 4.5 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉండంటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా అధికారులు ఎండల పరిస్థితిపై నిరంతరం సమీక్షలు నిర్వహించాలని, వాతావరణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ప్రజలు తెలియజేయాలని పేర్కొంది. ప్రభుత్వం నిరంతర వాతావరణ స్థితిగతులు అధికారులకు తెలియజేస్తుందని, ఈ సమాచారంతో జిల్లా స్థాయి పరిస్థితులు పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను నియమించుకుని సంబంధిత అన్ని శాఖలో సమన్వయం చేసుకోవాలని తెలిపింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో అందచేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

మన తెలంగాణ 16 Apr 2026 3:00 am

పేదల కడుపుకొడితే సహిస్తారా?

గ్రామీణ ప్రాంత ప్రజానీకం జీవనాడి అయిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎనఆర్‌ఈజీఏ) బలోపేతం చేయడంలో ఘోరంగా విఫలమైన మోదీ ప్రభుత్వం, దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్‌గార్ అజీవికా మిషన్ (జి రామ్ జి) ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి ఉసురు తీసింది. నిస్సిగ్గుగా చేపట్టిన ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల హననమే. కొత్త చట్టం ఉత్తుత్తి చట్టమేమీ కాదు. హక్కులపై ఓ బుల్డోజర్. మహాత్మాగాంధీ పేరు […] The post పేదల కడుపుకొడితే సహిస్తారా? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 12:29 am

తీర ప్రాంత ప్రజలకు కారిడార్ ముప్ప్పు

గుల్ల కాంతారావు ఒక పని తలపెట్టినప్పుడు దాని పర్యవసానాలను ముందుగానే అంచనా వేయాలి. మంచిచెడులను ఆలోచించాలి. విచక్షణ, సంయమం అనేవి వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా తప్పనిసరి. ఇవి లోపించినప్పుడు, ఆ నిర్ణయాల దుష్పరిణామాలు సమాజంపై ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం సహజ వనరుల వినియోగం పేరుతో తీసుకుంటున్న విధాన నిర్ణయాలు ఇదే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. కార్పొరేట్లకు అనుకూలంగా మారుతున్న విధానాల కారణంగా బీచ్ శాండ్ మినరల్స్ తవ్వకాల విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో పెను ముప్పుగా మారే […] The post తీర ప్రాంత ప్రజలకు కారిడార్ ముప్ప్పు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 12:04 am

ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కుతున్నారు

వెంక గారి భూమయ్య తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేడు సంక్షోభపు అంచున నిలిచింది. హామీల అమలులో మొండిచేయి, బకాయిల చెల్లింపులో మీనమేషాలు లెక్కించడం ఈ రెండూ కలిపి వేలాది మంది కార్మికుల భవిష్యత్తునే అనిశ్చితిలోకి నెట్టేశాయి. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో 45 వేల మంది కార్మికులను రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది కేవలం వేతనాల కోసం చేసే పోరాటం కాదు. ఇది వారి ఉనికిని […] The post ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కుతున్నారు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 12:03 am

నితీశ్ యుగాంతం

రెండు దశాబ్దాల పాటు బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న జనతా దళ్ (యు) నాయకుడు నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ నాయకుడు, నితీశ్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్ చౌధŠరి బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించనున్నారు. అయితే నితీశ్ నుంచి బీజేపీకి అధికారం బదలాయించడానికి దాదాపు నెల రోజులు పట్టింది. మార్చి మొదటి వారంలోనే నితీశ్ కుమార్ తనకు రాజ్యసభ సభ్యుడు కావాలన్న కోరిక ఉందని చెప్పారు. నిజానికి నితీశ్‌ను తప్పించి తమ […] The post నితీశ్ యుగాంతం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 11:53 pm

రైతు బతుకుపై కల్తీ దాడి

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆంధ్రాలో రైతు దుస్థితి అశనిపాతంగా, ఆత్మహత్యా సదృశ్యంగా, అప్ప్పుల ఊబిలో చిక్కుకుపోతుంది. కల్తీ పురుగు మందులు, కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు ముప్పేట పెరిగి రైతు మెడకు ఉరితాడై బిగుస్తున్నాయి. అదునులో సకాలంలో పంట సాగు పెట్టుబడులకు ప్రభుత్వ రుణాలందక, సరైన దిగుబడి వంగడాల సరఫరా లేక, వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కి, బోగస్ విత్తన కంపెనీల మోసాలకు బలై, వాతావరణ వైపరీత్యాల ధాటికి గురై ప్రతి సంవత్సరం రైతు కష్టనష్టాల్లో కన్నీరై […] The post రైతు బతుకుపై కల్తీ దాడి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 11:53 pm

పోరాట‌ ప్రతినిధి నాగమణి

కోనాల భీమారావు కమ్యూనిస్టు ఉద్యమ గమనంలో కొన్ని జంటలు కేవలం దంపతులుగానే కాకుండా విడదీయలేని ఆశయ బంధాలుగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన, ఆదర్శవంతమైన జంట దివంగత వంక సత్యనారాయణ -నాగమణి జంట. 70 ఏళ్ళ వారి వైవాహిక జీవితంలో ఉద్యమమే ఊపిరిగా, ఆశయమే బాటగా సాగిన వారి ప్రస్థానం నేటి తరానికి ఒక పాఠం. వంక సత్యనారాయణ తన 95వ ఏట 2018లో కన్నుమూయగా వంక నాగమణి తన 95వ ఏటే 2026 ఏప్రిల్ 5న కన్ను […] The post పోరాట‌ ప్రతినిధి నాగమణి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 11:50 pm

భద్రత కరువు

భారతదేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులకు సంబంధించి ఇటీవల విడుదలైన నివేదికలు ఆందోళనకరమైన గణాంకాలను వెల్లడిస్తున్నాయి. నేషనల్ కైమ్ రికార్డ్స్ బ్యూరో (bన్‌సీఆర్‌బీ), జాతీయ మహిళా కమిషన్ (bన్‌సీడబ్ల్యు) నివేదికల ప్రకారం భారత్‌లో మహిళలపై నేరాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ప్రతి గంటకు సగటున 51 మంది మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. 2025 మే నాటికే జాతీయ మహిళా కమిషన్‌కు సుమారు 7,698 ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా […] The post భద్రత కరువు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 11:48 pm

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

. అందుబాటులోకి 14 వేల సూపర్ స్పెషాల్టీ బెడ్లు. వైద్య విద్యకు మరింత ప్రోత్సాహం. నిరుద్యోగుల ఉపాధి మెరుగుకు స్కిల్ వర్సిటీలు. ఆసుపత్రి ప్రారంభోత్సవంలో భట్టి విశాలాంధ్ర బ్యూరో ఖమ్మం/ సత్తుపల్లి: ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. “తెలంగాణ మోడల” పాలనను చూసి అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు చదువు, ప్రతి కుటుంబానికి […] The post అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 11:44 pm

చారిత్రక కట్టడాలను తీర్చిదిద్దుతాం

మంత్రి జూపల్లివిశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణలో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని ప్రపంచ పర్యాట కులకు పరిచయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కష్ణారావు అన్నారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా వాటిని అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొ న్నారు. కుతుబ్ షాహీ టూంబ్స్‌లోని ఇంటర్‌ర్పి టేషన్ కేంద్రంలో జరుగుతున్న పనులను బుధవారం మంత్రి పరిశీలించారు. వక్ఫ్ ట్రిబ్యునల్‌లో […] The post చారిత్రక కట్టడాలను తీర్చిదిద్దుతాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 11:41 pm

లక్నో సూపర్ జెయింట్స్‌ పై రాయల్ చాలెంజర్స్ విజయం

ఐపిఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగి న బెంగళూరు 15.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు మా త్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 49 పరుగులు చేశాడు. కెప్టెన్ రజత్ పటిదార్ (27), జితేశ్ శర్మ (23) పరుగులు చేశారు. టిమ్ డేవిడ్ (14) నాటౌట్, షెఫర్డ్ (14) నాటౌట్ తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు లక్నో తక్కువ స్కోరుకే పరిమితమైంది. మిఛెల్ మార్ష్ (40), బడోని (38), ముకుల్ చౌదరి (39) మాత్రమే రాణించారు. బెంగళూరు బౌలర్లలో రాసిఖ్ సలమ్ దర్ నాలుగు, భువనేశ్వర్ మూడు, కృనాల్ రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఆర్‌సిబి అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

మన తెలంగాణ 15 Apr 2026 11:31 pm

కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది

కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని, ఆ కంపెనీలో నేను బ్యాండ్ వాడిగా కొనసాగలేకనే బయటకు వచ్చానని మాజీ మంత్రి తాటిప ర్తి జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో ఉన్న 42 ఏండ్ల అనుబంధాన్ని ఎవరూ తెంచుకోవాలని కోరుకోరని, పార్టీలో సరైన గౌరవం లభించకపోగా, పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగకపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానన్నా రు. కాంగ్రెస్ పటిష్టత కోసం పని చేసినవారికే సీట్లు కేటాయిస్తామని మీనాక్షి నటరాజన్ చె ప్పారని, అయితే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీతో సంబంధం లేనివారికి బీఫాంలు ఇచ్చి పార్టీ కోసం కష్టపడ్డవారికి మొండిచేయి చూపారని ఆరోపించారు. రేవంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని, ఆయనపై కాంగ్రెస్ పట్టు కోల్పోయిందన్నారు. రేవంత్ సూచనల మేరకే కాం గ్రెస్ అధిష్టానం నడుచుకుంటోందని ఆరోపించారు. నేను పదవుల కోసం బీఆర్‌ఎస్‌లోకి వెళ్ల డం లేదని, పదవులే కావాలనుకుంటే నేను నీ దగ్గరే పడిగాపులు కాసేవాడినంటూ సీఎం రే వంత్‌కు చురకలంటించారు. కేసీఆర్ నా వయస్సును గౌరవిస్తాడని, రాజకీయంగా నేను ఆయనకు సమకాలీకుడినన్నారు. కేసీఆర్ ఎప్పుడూ నన్ను అన్నా అని సంబోధిస్తాడని జీవన్‌రెడ్డి పే ర్కొన్నారు. కేసీఆర్‌పై విధానపరంగా విమర్శలు చేశానే తప్పా ఏనాడూ ఆయనను వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. కేసీఆర్‌కు ప్రజలంటే చాలా గౌరవమని, నీలా కాదంటూ సీఎంను ఉ ద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాంతానికి సాగునీటి సమస్య తీర్చి సస్యశ్యామ లం చేయాలనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని, కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా మళ్లీ చూడాలనుకుంటున్నారన్నారు. కేసీఆర్ కంటే మెరుగైన పా లన కోరుకుని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే రెండేండ్లలోనే రేవంత్ సర్కార్ ప్రజల విశ్వాసా న్ని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ నేతలందరినీ హైదరాబాద్‌కు పిలిపించుకొని మాట్లాడటం సంతోషకరమని, ఇప్పటికైనా పార్టీని నమ్ముకున్నవాళ్లందరికీ న్యాయం చేయాలని రేవంత్‌కు ఆయన సూచించారు.

మన తెలంగాణ 15 Apr 2026 11:30 pm

వికారాబాద్‌లో కవిత ధర్నా, అరెస్ట్

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రై తులు నిత్యం బాధపడుతున్నారని జా గృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బు ధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో భూములు కోల్పోతున్న రైతులు, ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్‌తో కలిసి ఎన్టీఆర్ చౌరస్తాలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఈ నెల 25న రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ రాబోతుందని చెప్పారు. తాను ప్రకటించే పా ర్టీ రైతుల పక్షాన నిలుస్తోందని స్పష్టంచేశారు. కవిత కలెక్టర్ దీపక్ తివారితో ఫోన్‌లో మాట్లాడారు. ఆర్డీఓను పం పించి సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు నోటీసులు జారీచేసిన నేపథ్యంలో రైతులు గత కొన్ని రోజుల నుంచి ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాధిత రైతులతో కలిసి బుధవారం వికారాబాద్ ఆర్డీఓ కార్యాయ లం ముందు ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించారు. అక్కడ ధర్నా చేసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో కవిత, రైతులతో ధర్నాకు దిగారు. రైతులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట ఉధృతంగా మారింది. ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం కవితను అరెస్ట్ చేసి ధారూర్ మీదుగా బంట్వారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మన తెలంగాణ 15 Apr 2026 11:20 pm

నీటి భద్రత కోసం జలధార కార్యాచరణ ప్రణాళిక

. పోలవరం నీటి వినియోగంపై ముందే ప్రణాళిక. నేరడి బ్యారేజ్, చింతలపూడి మెయిన్ కెనాల్‌కు త్వరలో టెండర్లు. జల వనరుల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగానే గోదావరి జలాలను కుడి, ఎడమ కాలువల ద్వారా తరలించి వాటిని ఏయే అవసరాల కు, ఎంత మేర వినియోగించుకోవాలనే దానిపై ఒక నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుడి, ఎడమ […] The post నీటి భద్రత కోసం జలధార కార్యాచరణ ప్రణాళిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 11:19 pm

మీసేవ కేంద్రాలపై ఎసిబి కొరడా

మీ సేవా కేంద్రాలపై ఎసిబి కొరడా ఝళిపించింది. నగరంలోని పలు కీలక ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో అవి నీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఖైరతాబాద్, అంబర్‌పేట్, అల్వాల్ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో అధికారులు సోదాలు నిర్వహిం చారు. పౌర సేవా సర్టిఫికెట్లు జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ దాడులు జరిగినట్లుగా సమాచారం. అయితే, సాధారణ ప్రజలకు అందాల్సిన సేవలను అడ్డుకుంటూ, మీసేవ సిబ్బంది దళారుల ద్వారా చక్రం తిప్పుతున్నట్లుగా ఎసిబి ప్రాథమికంగా గుర్తిం చింది. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దళారుల ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తూ ఇక నేరుగా వచ్చే సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లుగా సమాచారం. సోదాల సమయంలో మీసేవ కార్యాలయాల్లోని నగదు నిల్వలు, దరఖాస్తుల పెం డింగ్ జాబితా, సిబ్బంది వ్యక్తిగత వివరాలను ఎసిబి బృందాలు పరిశీలించాయి. మరోవైపు మీ సేవ కేంద్రాల్లో దోపీడి ఎక్కువైపోయిందని ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. చార్జీల పేరుతో మీసేవ సిబ్బంది చేస్తోన్న దోపిడీకి అడ్డుఅదుపు లేకుండా పోయిందని జనం ఆరోపిస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో కుల, ఆదాయ, నివాస, బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం వెళ్తే దోచుకుంటున్నారు. టెక్నాలజీతో పౌర సేవలను మరింత సులభతరం చేస్తున్నా మంటూ అన్ని సేవలను మీ సేవ కేంద్రాలకు అప్పగించి అధికారులు మాత్రం చేతులు దులుపుకుంటున్నారు. దీంతో నిర్వాహకులు అందినకాడి కి దండుకుంటున్నారు. కుల, ఆదాయ, నివాస, కుటుంబసభ్యుల ధ్రువీకరణ, ఒబిసి తదితర సర్టిఫికెట్ల కోసం రూ. 45 చెల్లిస్తే చాలు. కానీ, ఈ ఫీజు ఎక్కడా తీసుకోవడం లేదు. దాదాపు రూ.500 నుంచి రూ.1000 వరకు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే, అక్రమ వసూ ళ్లకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మన తెలంగాణ 15 Apr 2026 11:10 pm

తీరని రైతు గోస!

. మైక్రో ఇరిగేషన్‌లో అగ్రగామిగా ఏపీ. అయినా తప్పని తిప్పలు. పరిష్కారం లేని సాంకేతిక సమస్యలు. నిర్వహణ భారంతో అల్లాడుతున్న అన్నదాత విశాలాంధ్ర-సచివాలయం: నవ్యాంధ్రప్రదేశ్ వ్యవసాయ ముఖచిత్రం మారుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.26 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి ఏపీ రికార్డు సృష్టించింది. గుజరాత్ వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి, రూ. 1030 కోట్ల భారీ సబ్సిడీతో హార్టికల్చర్ హబ్‌గా అవతరించింది. అయితే రైతుల పరిస్థితి పేరు […] The post తీరని రైతు గోస! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 11:08 pm

ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం

ప్రథమ సంవత్సరం 77, ద్వితీయ 81 శాతం ఉత్తీర్ణత. కృష్ణాజిల్లా ప్రథమ స్థానం కైవసం. 2, 3 స్థానాల్లో గుంటూరు, ఎన్టీఆర్. చివరికి పరిమితమైన అన్నమయ్య. సత్తా చాటిన బాలికలు. ఎక్స్‌లో ఫలితాలు ప్రకటించిన మంత్రి లోకేశ్ విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఇంటర్మీడియట్ మార్చి 2026 ఫలితాల్లో ప్రభంజనం నెలకొంది. 12 ఏళ్ల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇంటర్ ఉత్తీర్ణతా శాతం నమోదయింది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు గరిష్ఠ స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం […] The post ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 11:01 pm

హార్మూజ్ జలసంధిని ‘శాశ్వతంగా తెరిచేస్తున్నా’: ట్రంప్

హార్మూజ్ జలసంధిని తాను శాశ్వతంగా తెరిచేస్తున్నాను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై చైనా చాలా సంతోషంగా ఉంది అని పేర్కొంటూ, ప్రతిఫలంగా బీజింగ్ ఇరాన్‌కు ఆయుధాలు పంపడం నిలిపివేస్తుందని తెలిపారు. అయితే, ఈ ప్రకటనతో అనేక సందేహాలు మొదలయ్యాయి. ఇటీవలే ఇరాన్ పోర్టులకు వెళ్లే, వచ్చే నౌకలపై అమెరికా దిగ్బంధం విధించిన నేపథ్యంలో, ఇప్పుడు జలసంధిని తెరవడం ఏమిటి? అనే అంశంపై స్పష్టత లేదు. యుద్ధ సమయంలోనే ఇరాన్ కూడా ఆ మార్గంలో నౌకా రాకపోకలను గణనీయంగా తగ్గించింది. అమెరికా మార్కెట్లు ప్రారంభానికి ముందు సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో చేసిన పోస్టులో ట్రంప్, హార్మూజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచేస్తున్నాను. ఇది చైనాకే కాదు, ప్రపంచానికీ ప్రయోజనకరం. ఇలాంటి పరిస్థితి మళ్లీ రావద్దు అని పేర్కొన్నారు.ఇంకా చైనా ఇకపై ఇరాన్‌కు ఆయుధాలు పంపదని అంగీకరించింది. కొద్ది వారాల్లో నేను చైనాకు వెళ్లినప్పుడు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నన్ను ఆత్మీయంగా ఆహ్వానిస్తారు. మేము తెలివిగా, సమర్థంగా కలిసి పనిచేస్తున్నాం అని ట్రంప్ వెల్లడించారు.ఇదిలా ఉండగా, అమెరికా సైన్యం ఆరు వాణిజ్య నౌకలను తిరిగి పంపించిందని, ఇరాన్ పోర్టుల నుంచి వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ పరిణామాలు ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో చైనా, ఇరువైపులూ శత్రుత్వాన్ని తగ్గించి హార్మూజ్ సముద్రసంధిని తెరవాలని పిలుపునిచ్చింది. ఆ మార్గం ద్వారా చైనా తన ఇంధన అవసరాల్లో పెద్ద భాగాన్ని పొందుతోంది. ట్రంప్ ప్రకటన చైనా కోసం మాత్రమేనా, లేక ఇతర దేశాల నౌకలకు కూడా అనుమతి ఉంటుందా అనే విషయంపై స్పష్టత కోరుతూ వైట్ హౌస్‌ను మీడియా సంస్థలు సంప్రదించాయి. ఇదే అంశంపై ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇరాన్‌కు ఆయుధాలు పంపుతున్నారన్న ఆరోపణలను ఖండించారని తెలిపారు.

మన తెలంగాణ 15 Apr 2026 11:00 pm

ఈనెల 20న సిఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం పర్యటన

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 20న కాళేశ్వరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. అనంతరం సరస్వతి నది అంత్య పుష్కరాల ఏర్పాట్లపై సిఎం సమీక్షించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు. సిఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్‌బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మన తెలంగాణ 15 Apr 2026 10:56 pm

‘కలర్ గ్రానైట’ దోపిడీ

. గిరిజన సొసైటీ ముసుగులో కొల్లగొడుతున్న వైనం. చప్పరపాలెంలో గిరిజనేతరుల కనుసన్నల్లో తవ్వకాలు. మైనింగ్, రెవెన్యూ అధికారుల మొద్దునిద్ర. క్వారీ యాజమాన్యంతో కుమ్మక్కు. ఉన్నతాధికారులకు తప్ప్పుడు నివేదికలు విశాలాంధ్ర బ్యూరో- రంపచోడవరం: పోలవరం జిల్లా రంపచోడవరం మండలం చుప్పరపాలెం గిరిజన క్వారీ కార్మికుల కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో విలువైన ‘కలర్ గ్రానైట’ దోపిడీ బహిరంగంగానే సాగుతోంది. సొసైటీ కాలపరిమితి ముగిసినా సర్వే నంబర్లు 37/1, 70/2, 72/2లో సుమారు 3.930 హెక్టార్ల విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా, గిరిజనేతర […] The post ‘కలర్ గ్రానైట’ దోపిడీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:55 pm

అండమాన్ సముద్రంలో పడవ బోల్తా

250 మంది గల్లంతునైపిడావ్ (మైన్మార్): అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ మునిగిపోయిన దుర్ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన సముద్ర ప్రయాణాల్లో ఉన్న ప్రమాదాలను మరోసారి బయటపెట్టింది. గల్లంతైన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉండటంతో పరిస్థితి మరింత విషాదంగా మారింది. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన పడవ బంగ్లాదేశ్ దక్షిణ ప్రాంతంలోని […] The post అండమాన్ సముద్రంలో పడవ బోల్తా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:49 pm

ఐరాసలో ఘనంగా అంబేద్కర్ జయంతి

న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని భారత్ ఘనంగా నిర్వహించింది. అనేక దేశాల రాయబారులు, విద్యావేత్తలు, నిపుణులు పాల్గొన్నారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారత శాశ్వత ప్రతినిధి బృందం ఘనంగా స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘అంబేద్కర్ రాజ్యాంగ నైతికత దార్శనికత, బహుపాక్షికతలో దాని ప్రాసంగికత’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. ఈ మేరకు ‘ఎక్స’లో పోస్ట్ […] The post ఐరాసలో ఘనంగా అంబేద్కర్ జయంతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:48 pm

Middle East War Impact on Indian Biggies

Several Indian films are planned for shoot abroad and some of them are impacted because of the Iran and USA war. Several Middle East countries are impacted and the shoots planned are disrupted. SS Rajamouli has planned a key schedule in Middle East region and the schedule has been put on hold. Rajamouli and his […] The post Middle East War Impact on Indian Biggies appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 10:44 pm

అమెరికా దిగ్బంధం ఎత్తివేయకపోతే గల్ఫ్ వాణిజ్యాన్ని పూర్తిగా అడ్డుకుంటాం: ఇరాన్

ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన దిగ్బంధం కొనసాగితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, ఓమన్ సముద్రం, రెడ్ సీ పరిధిలో ఎగుమతులుదిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ గట్టిగా హెచ్చరించింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ అధిపతి అలీ అబ్దుల్లాహి మాట్లాడుతూ, దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు ఇరాన్ దృఢంగా చర్యలు తీసుకుంటుంది అని స్పష్టం చేశారు. అమెరికా విధించిన దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించే దిశగా తీసుకున్న తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రారంభమైన నెలకుపైగా కాలంలోనే ఇరాన్ హార్మూజ్ జలసంధిని వాస్తవానికి మూసివేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఇరాన్ పోర్టులకు వెళ్లే, వచ్చే నౌకలపై అమెరికా దిగ్బంధం అమలు చేయడం ప్రారంభించింది. అయితే, పర్షియన్ గల్ఫ్‌లో ఇతర దేశాల నౌకల రాకపోకలకు అడ్డంకులు కలగనివ్వమని అమెరికా స్పష్టం చేసింది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.

మన తెలంగాణ 15 Apr 2026 10:40 pm

ఇరాన్‌తో యుద్ధం వద్దు

సర్వేలో స్పష్టం చేసిన అమెరికన్లువాషింగ్టన్: పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం వల్ల అమెరికా సైన్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ఇరాన్‌పై దాడులను సొంత పౌరులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదంటూ 54శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ఇప్సాస్-రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. గత కొన్ని వారాలుగా ఇరాన్‌పై యుద్ధం సాగిస్తోన్న అమెరికా… తాజాగా కీలకమైన ీVAర్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. అయితే, ఈ చర్యలను 54శాతం […] The post ఇరాన్‌తో యుద్ధం వద్దు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:39 pm

హోర్మూజ్‌ను పూర్తిగా తెరవాలి

ఇరాన్‌తో చర్చలకు అమెరికా షరతు వాషింగ్టన్: శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అమెరికా-ఇరాన్ మరోసారి చర్చలకు సిద్ధమవుతున్నాయి. రెండు రోజుల్లో ఇరు పక్షాల ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్ వేదికగా సంప్రదింపులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈసారి చర్చల కోసం ఇరాన్‌కు అమెరికా రెండు షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి ీVAర్మూజ్ జలసంధికి సంబంధించినదేనని సమాచారం. ఈ మేరకు అమెరికా దౌత్య వర్గాలను ఉటంకిస్తూ ఇజ్రాయిల్ మీడియా కథనం వెల్లడించింది. […] The post హోర్మూజ్‌ను పూర్తిగా తెరవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:37 pm

మాపై ఏ బలప్రయోగమైనా విఫలమే

ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తెహ్రాన్: కాల్పుల విరమణ గడువు మరో వారం రోజులే మిగిలి ఉండటంతో అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లోనే సంప్రదింపులు జరగనున్నాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధం నేపథ్యంలో తెహ్రాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న బాహ్య ఒత్తిడి, సైనిక దురాక్రమణలను తిప్పికొట్టారు. పశ్చిమాసియాలో శత్రుత్వానికి పూర్తిస్థాయిలో ముగింపు పలికేందుకు కుదిరిన పెళుసైన కాల్పుల విరమణ, దౌత్యపరమైన […] The post మాపై ఏ బలప్రయోగమైనా విఫలమే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:36 pm

ఏఐఏఎఫ్‌లో ప్రదర్శనకు ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్‌’

భారతీయ చిత్రానికి దక్కిన అరుదైన గౌరం: రాజమౌళిహైదరాబాద్: రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ ప్రాంచైజీ నుంచి ఆయన దర్శకత్వంలోనే రూపొందుతోన్న సరికొత్త యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ఎటర్నల్ వార’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అండర్ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ చిత్రం ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఫ్రాన్స్‌లో జరగనున్న ప్రతిష్టాత్మాక ఎన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్`2026 (ఏఐఏఎఫ్)లోని వర్క్ ఇన్ ప్రోగ్రస్ విభాగంలో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది. దీనిపై దర్శకుడు రాజమైళి స్పందిస్తూ… ‘ఇది […] The post ఏఐఏఎఫ్‌లో ప్రదర్శనకు ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్‌’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:29 pm

ముంబై ఇండియన్స్‌కు షాక్

మరో రెండు మ్యాచ్‌లకు రోహిత్ దూరంముంబై: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస సవాళ్లను ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ…గాయం కారణంగా రాబోయే కనీసం మరో రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రీడా వర్గాల సమాచా రం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన హోరాహోరీ పోరులో రోహిత్ శర్మ గాయపడటమే దీనికి ప్రధాన కారణం.ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న […] The post ముంబై ఇండియన్స్‌కు షాక్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:23 pm

రిలయన్స్ జ్యువెల్స్ అక్షయ తృతీయ ఆఫర్లు

ముంబై: భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన రిలయన్స్ జ్యువెల్స్, పండుగ కొనుగోళ్లను మరింత స్మార్ట్‌గా, అందుబాటులోకి తీసుకువచ్చేలా రూపొందించిన కొత్త బంగారం, వజ్రాల కలెక్షన్‌లను పరిచయం చేస్తూ, ఒక సరికొత్త, విలువ ఆధారిత విధానంతో అక్షయ తృతీయను స్వాగతిస్తోంది. వినియోగదారులు బంగారు ఆభరణాలపై ఫ్లాట్ 9% మేకిం> ఛార్జీతో మరియు వజ్రాల ఆభరణాలపై బంగారం విలువపై 99% తగ్గింపుతో పొందవచ్చు, తద్వారా వారు ప్రధానంగా వజ్రాలకే చెల్లించేలా ఇది నిర్ధారిస్తుంది. ఇది నిజంగా ఆకర్షణీయమైన, […] The post రిలయన్స్ జ్యువెల్స్ అక్షయ తృతీయ ఆఫర్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:17 pm

ఫ్లిప్‌కార్ట్‌తో ఉబర్ భాగస్వామ్యం

బెంగళూరు: భారతదేశపు స్వదేశీ ఈ`కామర్స్ మార్కెట్‌ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్, భారతదేశంలోని ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఉబర్‌తో భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులు అర్హత కలిగిన ప్రతి ఉబర్ ప్రయాణంపై సూపర్‌కాయిన్‌లను సంపాదించవచ్చు. ఈ కార్యక్రమం, సూపర్‌కాయిన్‌లను ఒక జీవనశైలి లాయల్టీ ప్రోగ్రామ్‌గా ముందుకు తీసుకువెళుతుంది. ఇది వినియోగదారులు తమ రోజువారీ ప్రయాణాలపై సంపాదించడానికి వీలు కల్పిస్తూనే, భారతదేశపు లాయల్టీ వ్యవస్థను పోలిన రివార్డ్స ప్రోగ్రామ్‌ను నిర్మించాలనే ఫ్లిప్‌కార్ట లక్ష్యంను మరింత ముందుకు […] The post ఫ్లిప్‌కార్ట్‌తో ఉబర్ భాగస్వామ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:13 pm

దల్జీత్, జాన్వీలతో కోకోకోలా హాఫ్ టైమ్ క్షణాలు ఆవిష్కరణ

న్యూదిల్లీ: దల్జీత్ దోసాంజ్, జాన్వీ కపూర్‌లతో కూడిన తన ప్రచార కార్యక్రమాన్ని కోక కోలా బుధవారం ప్రకటించింది. ఇది దైనందిన జీవితంలోని క్షణాల్లోకి “కోకకోలా హాఫ్ టైమ” అనే భావనను సజీవంగా తీసుకువస్తుంది. ఈ ఆలోచనకు వలాధారం ఒక నమ్మకం: అదేమిటంటే, ఒక ‘హాఫ్ టైమ’ (విరామ సమయం) కేవలం ఆ రోజు కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ఇవ్వడం మాత్రమే కాకుండా, మిమ్మల్ని తిరిగి ఆ కార్యకలాపాల్లోకి ఉత్సాహంగా తీసుకువ్లెలా ఉండాలి. కోకాకోలా తన రుచికరమైన, ఉత్తేజకరమైన […] The post దల్జీత్, జాన్వీలతో కోకోకోలా హాఫ్ టైమ్ క్షణాలు ఆవిష్కరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:11 pm

ఎయిర్ ఇండియాకు రూ.22,000 కోట్ల నష్టం

 టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను చవిచూసింది. మార్చి 31తో ముగిసిన కాలానికి గానూ సుమారు రూ.22,000 నష్టాన్ని ప్రకటించింది. గతేడాది మే నెలలో పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడం వల్ల విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం, జూన్ నెలలో జరిగిన విమాన ప్రమాదం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సంస్థ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఈ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు ఎయిర్ ఇండియా తన వాటాదారులైన టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ నుండి నిధుల సహాయాన్ని కోరుతోంది. మరోవైపు సంస్థ సిఇఒ కాంప్‌బెల్ విల్సన్ ఈ ఏడాది చివరలో పదవి నుండి తప్పుకోనున్నట్లు ప్రకటించారు.  

మన తెలంగాణ 15 Apr 2026 10:10 pm

టాటా మోటార్స్ లక్నో ప్లాంట్‌లో 10 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి మైలురాయి

లక్నో: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ లిమిటెడ్, ఉత్తరప్రదేశ్‌లో ఏడున్నర దశాబ్దాలకు పైగా తన ఉనికిని, పారిశ్రామిక శ్రేష్ఠత, ఆర్థిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, నిరంతర జీవనోపాధి కల్పనకు తన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ, తాజాగా తన లక్నో ప్లాంట్ నుండి 10వ లక్ష వాణిజ్య వాహనాన్ని విడుదల చేసి ఒక కీలకమైన మైలురాయిని చేరుకుంది. భారతదేశ వాణిజ్య వాహన పరిశ్రమ పరిశుభ్రమైన, స్మార్ట, మరింత సమర్థవంతమైన మొబిలిటీ పరిష్కారాల వైపు వేగంగా […] The post టాటా మోటార్స్ లక్నో ప్లాంట్‌లో 10 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి మైలురాయి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:05 pm

మారుతి సుజుకి తయారీ కేంద్రాలలో మహిళల భాగస్వామ్యం పెంపు

న్యూదిల్లీ: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ లింగ వైవిధ్యం, సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. గత రెండేళ్లలో, ఈ సంస్థ తన గురుగ్రామ్, మనేసర్ కేంద్రాలలో వాహన తయారీ, ఇంజన్ ట్రాన్స్‌మిషన్ విభాగాలలో మహిళల నియామకాలను క్రమపద్ధతిలో పెంచింది. ఈ మహిళా నియామకాలు వాహన తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. వీరు కచ్చితత్వంపై గట్టి దష్టి పెడుతూ, అసెంబ్లీ, నాణ్యత నియంత్రణ విభాగాలలో బాధ్యతలు స్వీకరిస్తారు. వారు తమ పురుష సహోద్యోగులతో సమాన స్థాయిలో ఉద్యోగంలోనే […] The post మారుతి సుజుకి తయారీ కేంద్రాలలో మహిళల భాగస్వామ్యం పెంపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 10:02 pm

ఎసిబికి చిక్కిన ఏఈ

కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పురపాలక సంఘంలో అసిస్టెంట్ ఇంజినీర్ (AE)గా పనిచేస్తున్న నుసుం సుధాకర్‌రెడ్డిని బుధవారం రూ.50,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక కాంట్రాక్టర్ తుపాను నీటి కాలువ పనులను పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించిన తుది బిల్లును ప్రాసెస్ చేయాలన్నా, మెజర్మెంట్ బుక్‌లో వివరాలు నమోదు చేయాలన్నా తనకు లంచం ఇవ్వాలని ఏఈ సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనితో విసిగిపోయిన బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పథకం రచించిన ఏసీబీ అధికారులు, బుధవారం హుజూరాబాద్‌లోని ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద ఏఈ సుధాకర్ రెడ్డి బాధితుడి నుంచి రూ.50,000 నగదు తీసుకుంటుండగా మెరుపు దాడిచేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడిని కరీంనగర్‌లోని స్పెషల్ జడ్జి ఫర్ ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన విచారణ కొనసాగుతోంది. పభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు గానీ, ఏసీబీ వాట్సాప్ నంబర్ 9440446106కు గానీ సమాచారం అందించాలని అధికారులు కోరారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 15 Apr 2026 10:00 pm

పోతి రెడ్డిపల్లి శివారులో గేద దూడపై చిరుత దాడి

 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతి రెడ్డిపల్లి గ్రామ అటవీ శివారు ప్రాంతంలో బుద వారం తెల్లవారు జామున గేద దూడపై చిరుతపులి దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. అను నిత్యం జనసందోహం ఉండే ప్రాంతంతోల చిరుత దాడి భయాందోళనలకు గురి చేసింది. అదే గ్రామానికి చెందిన సదుల పూర్ణ అనే రైతు అటవీ శివారులో గల తన పశువుల పాకలో రాత్రిపూట రెండు మాసాల వయస్సుగల దూడను కట్టి వేసి ఇంటికి చేరాడు. ఉదయం వెల్లగా కళేబరం కనిపించడంతో ఆందోళనకు గురై గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు. దాడి చేసి దూడను చంపి వేసిన కౄర జంతువు పై ఆరాతీశారు. ఈసంఘటనపై సిరిసిల్ల పారెస్ట్ అధికారి మోహన్‌లాల్ తన సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకొని పాద ముద్రల అనవాల్లను సేకరించి వేటాడిన తీరును నిర్దారించారు. దాడికి పాల్పడింది చిరుత పులి అని తేల్చి చెప్పారు. శివారు అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నందున రైతులు, ప్రజలు ఒంటరిగా వెల్లకూడదని సూచించారు. పశువులను పాకలలో ఒంటరిగా కట్టి వేయరాదని హితవు చెప్పారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మలకపేట రిజర్వాయర్ సమీప అడవిలో గుహ ఏర్పాటు చేసుకొని ధర్మారం, వెంకటాపూర్ చిట్టడువుల్లో సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేగ దూడలు,కుక్కలను పసి గట్టి దాడులు చేస్తున్నట్లు వాపోతున్నారు. సిరిసిల్ల రేంజ్ పరిదిలో చిరుతుల సంఖ్య పేరగడంతో పశులు, గొర్రెల మందలపై దాడులు జరుగుతున్నాయి.మలకపేట రాజర్వాయర్ నిర్మాణంతో వాటికి రక్షణ పెరిగి యదేచ్చగా సంచరిస్తున్నాయి. అనేక మందికి చిరుతలు తారస పడుతున్నాయి. ఒ చిరుత గత సంవత్సరం మూడు పిల్లలకు జన్మనిచ్చింది.

మన తెలంగాణ 15 Apr 2026 9:20 pm

బిహార్ సిఎంగా సమ్రాట్ చౌధరీ ప్రమాణం

 భాజాపా సీనియర్ నేత సమ్రాట్ చౌధరి బిహార్ 21 ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్ సయ్యద్ అలా హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో భాజాపాకు చెందిన కీలక నాయకులు, కూటమి భాగస్వాములు పాల్గొన్నారు. బిహార్‌లో భాజాపా నుంచి సీఎం పదవి చేపట్టిన తొలి నాయకుడిగా సమ్రాట్ రికార్డు సృష్టించారు. రాజ్యసభకు ఎన్నికైన జేడీ అధినేత నితీష్‌కుమార్ మంగళవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్‌కు ఆ పదవిని కట్టబెట్టేందుకు భాజాపా మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే సమ్రాట్ చౌధరి సీఎంగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాజీ బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన చౌధరి, రాష్ట్ర సుసంపన్నత కోసం వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తానని తెలిపారు. బీహార్ అభివృద్ధి నిరంతర ప్రక్రియ. మోదీనితీశ్ మోడల్‌లోనే పాలన కొనసాగుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్డీఏ నేతలు అభినందనలు తెలుపుతూ, చౌధరి నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకల్పించిన ‘వికసిత భారత్’ లక్ష్య సాధనలో బీహార్ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్డీఏ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో చౌధరి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌సరౌగీ మాట్లాడుతూ, చౌధరి నాయకత్వంలో రాష్ట్రం ‘వికసిత భారత్ 2047’ లక్ష్యానికి దోహదం చేస్తుందని అన్నారు. నితీశ్ కుమార్ ఏర్పాటు చేసిన న్యాయపాలన, అభివృద్ధి పునాదులను కొత్త సీఎం మరింత బలోపేతం చేస్తారని తెలిపారు. చౌధరి తండ్రి, సీనియర్ రాజకీయ నేత శకుని చౌధరి ఈ పరిణామాన్ని దైవకృపగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నితీశ్ కుమార్ ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

మన తెలంగాణ 15 Apr 2026 9:00 pm

మేడిగడ్డ ఎందుకు కూలిందో కెసిఆర్‌ను నిలదీయండి : ఎమ్మెల్సీ బల్మూరి

మేడిగడ్డ ఎందుకు కూలిందో ముందు బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను నీలదీయండి..అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇటీవల బిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికి సూచించారు. జీవన్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ నుంచి 14 సార్లు బి-ఫామ్ తీసుకున్నారని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష కారణంగానే జీవన్ రెడ్డి ఈ స్థాయికి చేరుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాలు మరిచిపోయి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా మారిందని జీవన్ రెడ్డి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. కాని జీవన్ రెడ్డి కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరానన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆ కంపెనీలో కెసిఆర్, కెటిఆర్ తప్ప మరొకరు ఉండరన్న సంగతి జీవన్ రెడ్డికి తెలియదా ? అని ఆయన ప్రశ్నించారు. కన్న కూతురును కూడా ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పంపించిన విషయం జీవన్ రెడ్డికి తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం ఎవరైనా కెసిఆర్‌తో చేతులు కలుపుతారా? అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చిన ఘనత కెసిఆర్‌దేనని ఆయన విమర్శించారు. మేడిగడ్డ రిపేర్ చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వచ్చే తరాలు క్షమించవని జీవన్ రెడ్డి మాట్లాడటం ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ప్రజల ఆకాంక్ష మేరకే బిఆర్‌ఎస్‌లో చేరుతున్నానని జీవన్ రెడ్డి అంటున్నారని, రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ అవసరమే లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు. జీవన్ రెడ్డి నిర్ణయాన్ని జగిత్యాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, బిఆర్‌ఎస్‌లో చేరడంతోనే ఆయన రాజకీయంగా భూస్థాపితం అయ్యారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.

మన తెలంగాణ 15 Apr 2026 8:50 pm

హనుమాన్ మాల వేసుకున్న విద్యార్థిని స్కూల్లోకి రానివ్వని హెడ్‌మాస్టర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. హనుమాన్ మాల వేసుకున్న 7వ తరగతి విద్యార్థి ఓంకార్‌ను పాఠశాల లోనికి రాకుండా అడ్డుకున్నారు. మాలతీసి పాఠశాలకు రావాలని హుకుం జారీ చేయడంతో విద్యార్థి తల్లిదండ్రులు, భజరంగ్‌దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ప్రశ్నించిన తల్లిదండ్రులపై హెడ్‌మాస్టర్ దుర్బాషలాడటం హేయనీయం. హెడ్‌మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని భజరంగ్‌దళ్ నాయకులు శ్యామ్‌లాల్, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. 

మన తెలంగాణ 15 Apr 2026 8:40 pm

బిసి వసతిగృహంలో 8వ తరగతి విద్యార్థిని మృతి..

వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని ర్యాపని శ్రావణి (14) అనుమానాస్పద స్థితిలో బుధవారం తెల్లవారు జామున మృతి చెందింది. మృతదేహం వసతి గృహం వరండాలో పడి ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నసురుల్లాబాద్ మండలం హాజీపూర్‌కు చెందిన శ్రావణి బీసీ వసతిగృహంలో 8వ తరగతి చదువుతున్నది. పలువురు విద్యార్థినిలు ఉదయం ఐదు గంటల తర్వాత బాత్రూం వైపు వెళ్తుండగా వరండాలో శ్రావణి అచేతనంగా పడి ఉంది. ఆమెను గమనించిన విద్యార్థినిలు వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా డాక్టర్లు శ్రావణి మరణించినట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుమార్తె శ్రావణి మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లి లక్ష్మి, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. అయితే, అనుమానస్పద స్థితిలో మృతిచెందిన శ్రావణి గుండెపోటు గురై మృతి చెందిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్థానిక ఆర్డీవో ప్రభాకర్, తహశీల్దార్ ప్రేమ్‌కుమార్, సీఐ రాజిరెడ్డి, ఎస్సై మహేష్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. శ్రావణి మరణించిన విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ, ఏబీవీపీ, బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 15 Apr 2026 8:30 pm

సిఎం రేవంత్ రెడ్డి ‘హైబ్రిడ్’ ముఖ్యమంత్రి: కెటిఆర్

హైదరాబాద్: పార్లమెంట్‌లో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. మహిళ రిజర్వేషన్లకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మహిళ బిల్లును డీలిమిటేషన్‌తోె ముడి పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఒక ‘హైబ్రిడ్’ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదని విమర్శించారు. ఉదయం కాంగ్రెస్ ప్రతినిధిగా, సాయంత్రం బిజెపి నేతగా ఉంటారని కెటిఆర్ అన్నారు. హైబ్రిడ్ విధానం రేవంత్ రెడ్డి పాలనలో కూడా కనిపిస్తుందని తెలిపారు. కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న బిల్లులో అస్పష్టత ఉందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు 24 శాతంగానే కొనసాగాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిస్తే తీవ్రమైన తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. కేంద్రం రాజకీయాలు వదిలేసి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు. 

మన తెలంగాణ 15 Apr 2026 8:28 pm

సిబిఎస్‌ఇ 10 ఫలితాలు విడుదల..బాలికల అత్యుత్తమ ప్రతిభ

సిబిఎస్‌ఇ 10వ తరగతి పరీక్షా ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ విషయాన్ని బోర్డు సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. ఈసారి పరీక్షలలో మొత్తం 93.7 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఈ బోర్డు పరీక్షలలో బాలికలే బాలురతో పోలిస్తే రాణించారు. బాలికలలో మొత్తం 94.99 శాతం మంది పాసయ్యారు. ఈ సారి సిబిఎస్‌ఇ రెండు దఫాల బోర్డు పరీక్షలు నిర్వహించింది. పదవ తరగతి పూర్తికి విద్యార్థులు తప్పనిసరిగా తొలి రౌండ్ పరీక్షకు హాజరుకావల్సి ఉంటుంది. ఈ మేరకు జరిగిన మొదటి దఫా ఫలితాలు ఇప్పుడు విడుదల అయ్యాయి.ఈసారి మొత్తం 8074 కేంద్రాలలో 24.71 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణులైన వారిలో దాదాపు 55,368 మందికి 95 శాతం పైగా మార్కులు, రెండు లక్షల మందికి పైగా 90 శాతం పైగా మార్కులు సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొంచెం తక్కువ సంఖ్యలో లక్షా 47 వేల మంది వరకూ కంపార్ట్‌మెంట్ కేటగిరి లో స్థానం దక్కించుకున్నారని అధికారి వివరించారు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకూ తొలి ఎడిషన్ పరీక్షలు జరిగాయి మే నెలలో రెండవ విడత పరీక్షలు ఉంటాయి. సిబిఎస్‌ఇ అధికారిక వెబ్‌సైట్ సిబిఎస్‌ఇ . ఎన్‌ఐసి. ఇన్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు . ఈసారి పరీక్షలలో కూడా కేంద్రీయ విద్యాలయ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభ చాటుకున్నారు. 

మన తెలంగాణ 15 Apr 2026 8:19 pm

అండమాన్ వద్ద పడవ బోల్తా: 250 మందికి పైగా గల్లంతు

అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెలుతున్న పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 250 మందికి పైగా గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమీషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్‌లు సంయుక్తంగా ప్రకటించాయి. గల్లంతయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. మలేషియాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వారికోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్‌లోని టేక్‌నాఫ్ ప్రాంతం నుండి బయల్దేరినట్లు ఈ ప్రకటనలో ఐక్యరాజ్యసమితి అధికారులు తెలిపారు. మలేషియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు కెరటాల ఉదృ్ధతి కారణంగా పడవ మునిగిపోయినట్లు వెల్లడించారు. కాగా.. ఈ పడవలో పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించారని, అది కూడా ప్రమాదానికి ఒక కారణమై ఉండొచ్చని వారు తెలిపారు. ఈ పడవ ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుండి బయలుదేరినట్లు తెలుస్తోంది. కాక్స్బజార్‌లోని శరణార్థుల శిబిరాల్లో ఉన్న వీరు కనీస జీవన సదుపాయాల కోసం మలేషియాకు వలసన వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోయినా, బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కమాండర్ సబ్బిర్ ఆలం సుజాన్ తెలిపిన ప్రకారం, ఏప్రిల్ 9న ముగ్గురు రోహింగ్యాలు, ఆరుగురు బంగ్లాదేశ్ పౌరులు సహా తొమ్మిది మందిని రక్షించారు. బంగ్లాదేశ్ జెండా కలిగిన వాణిజ్య నౌక ‘ఎం.టి. మేఘ్నా ప్రైడ్’ సిబ్బంది సముద్రంలో తేలియాడుతున్న ఈ వ్యక్తులను గుర్తించి రక్షించినట్లు ఆయన తెలిపారు. పడవ ఎప్పుడు మునిగిందో, ప్రస్తుతం అధికారిక శోధన చర్యలు కొనసాగుతున్నాయా, లేదా అన్న విషయాలు స్పష్టంగా తెలియరాలేదు. మరో కోస్ట్ గార్డ్ మీడియా అధికారి తెలిపిన ప్రకారం, రక్షించిన ఎనిమిది మంది పురుషులు, ఒక మహిళను టెక్నాఫ్‌లో పోలీసులకు అప్పగించారు. ఈ రక్షణ చర్య అధికారిక శోధనలో భాగం కాదని, బంగ్లాదేశ్ నుండి ఇండోనేషియాకు వెళ్తున్న సమయంలో మేఘ్నా ప్రైడ్ నౌక సిబ్బంది వీరిని కాపాడినట్లు తెలిపారు.రోహింగ్యాల గల్లంతు ఘటన వారి దీర్ఘకాల నిరాశ్రయ స్థితిని ప్రతిబింబిస్తోందని యుఎన్‌హెచ్సిఆర్, ఐఓఎం పేర్కొన్నాయి. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో కొనసాగుతున్న హింస కారణంగా రోహింగ్యాల భద్రమైన పునరావాసం అనిశ్చితంగా మారిందని వెల్లడించాయి. బంగ్లాదేశ్‌లో మయన్మార్ నుంచి వచ్చిన 10 లక్షలకుపైగా రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తున్న నేపథ్యంలో, వారికి ప్రాణ రక్షణ సహాయం అందించేందుకు అంతర్జాతీయ సమాజం మరింత నిధులు, ఐక్యతతో ముందుకు రావాలని యుఎన్‌హెచ్సిఆర్, ఐఓఎం విజ్ఞప్తి చేశాయి.

మన తెలంగాణ 15 Apr 2026 8:14 pm

పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు వెలువరించిన తాత్కాలిక వారం రోజుల యాంటిసిపేటరీ బెయిల్‌పై సుప్రీంకోర్టు బుధవారం స్టే వెలువరించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వాస్ శర్మ భార్య రింకి భూయాన్ శర్మపై ఖేరా వెలువరించిన ఆరోపణలు, పాస్‌పోర్టును ప్రశ్నిండంపై ఆయనపై కేసు దాఖలు అయింది. అసోం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా ఖేరా తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆయనకు ఏప్రిల్ 10వ తేదీన యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, ఎఎస్ చంద్రశేఖర్‌తో కూడిన ధర్మాసనం స్టే విధించింది. ఈ విషయంపై ఖేరాకు , సంబంధితులు ఇతరులకు నోటీసులు వెలువరించారు. ఖేరా ఈ కేసులో అసోం పరిధిలో తమ పిటిషన్ దాఖలు చేసుకుని ఉంటే, సుప్రీంకోర్టు కలుగచేసుకునే పరిస్థితి ఉండేది కాదని ధర్మాసనం తెలిపింది. అసోం పోలీసుల తరఫున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఖేరా తనకు ఉపశమనం గురించి అసోం కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? తెలంగాణ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారేది తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఖేరా తనకు ఉపశమనం గురించి అసోం కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? తెలంగాణ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారేది తెలియడం లేదని వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 15 Apr 2026 8:07 pm

రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన

రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన బాసర సీఐ కిరణ్ కుమార్ బాసర, (నిర్మల్

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:51 pm

భారీ మూల్యం చెల్లించక తప్పదు: డీలిమిటేషన్‌పై స్టాలిన్

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 16న బ్లాక్ ఫ్లాగ్ నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు వ్యతిరేకంగా ఈ ఆందోళన నిర్వహించనున్నట్లు పేర్కొంటూ, తమిళనాడు స్వరాన్ని కేంద్రం పట్టించుకోకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదు, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని” హెచ్చరించారు. రూలింగ్ పార్టీ డీఎంకే అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్, డీలిమిటేషన్ అంశంపై పార్టీ ఎంపీలు, జిల్లా కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ, ఇప్పటివరకు మన తలపై వేలాడుతున్న కత్తి ఇప్పుడు మనపై పడింది అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఎంపీలతో సంప్రదింపులు జరుపుతూ, ఈ తీవ్ర ప్రమాదంను ఎదుర్కొనేందుకు సమన్వయ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్రంలోని భాజాపా ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ సవరణ బిల్లు తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో తమిళనాడు గళాన్ని పట్టించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశాభివృద్ధికి కృషి చేసిన నేరానికి కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తుందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రేపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లుపై దక్షిణ భారత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని స్టాలిన్ అన్నారు. నియోజకవర్గాల పునర్విజనకు నిరసనగా రేపు తమిళనాడంతటా నల్ల జెండాలతో నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు స్వరాన్ని గౌరవించకుండా వెనక్కి తగ్గకపోతే దాని ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది కేవలం పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే కాకుండా ఆత్మగౌరవం గల తమిళుడిగా హెచ్చరిక చేస్తున్నానని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ, ఇది పార్టీల గురించి కాదు, వ్యక్తుల గురించి కాదు; మన ప్రజల హక్కులకు సంబంధించిన విషయం. భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు అన్ని పార్టీలూ, ఎంపీలు ఏకమవ్వాలి అని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గాల అశాస్త్రీయ పునర్విభజనను తాము వ్యతిరేకిస్తూనే ఉన్నప్పటికీ ఎన్నికలను ముందు కేంద్రప్రభుత్వం ఈ అంశాన్ని తెరమీదకు తీసుకురావడం కుట్రపూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు పేరుతో పార్లమెంటులో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకు ముందు రోజే స్టాలిన్ డీలిమిటేషన్ వల్ల రాష్ట్రంపై పడే ప్రభావాలపై చర్చించేందుకు ఎంపీలు, జిల్లా కార్యదర్శులతో వేర్వేరు అత్యవసర సమావేశాలు నిర్వహించారు.ధర్మపురి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశం ఆయన ఎన్నికల ప్రచార బిజీ మధ్య నిర్వహించబడిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలోపార్లమెంట్‌లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసినట్లు సమాచారం.మంగళవారం కూడా స్టాలిన్ ఇదే అంశంపై హెచ్చరిస్తూ, తమిళనాడుకు నష్టం కలిగించే లేదా ఉత్తర రాష్ట్రాలకు అసమానంగా రాజకీయ శక్తిని పెంచే విధంగా డీలిమిటేషన్ అమలు చేస్తే, రాష్ట్రం పూర్తిగా స్థంభించే స్థాయిలో భారీ ఆందోళనలు జరుగుతాయని చెప్పారు. అవసరమైతే 1950-60 దశకాలలో జరిగినట్టే డీఎంకే మళ్లీ ఆందోళనలకు దిగుతుందని సూచించారు. సి.ఎన్. అన్నాదురై స్థాపించిన డీఎంకే పార్టీ 1949లో ఆవిర్భవించింది. ప్రారంభ దశలో రాష్ట్ర హక్కుల కోసం, హిందీ విధానానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలకు నేతృత్వం వహించింది.ఉత్తర తమిళనాడులో ఎన్నికల సభల్లో మాట్లాడిన స్టాలిన్, మహిళా రిజర్వేషన్ బిల్లు రూపకల్పన కూడా డీలిమిటేషన్ అమలులోకి వచ్చిన తర్వాత తమిళనాడు- ఉత్తర రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచే ఒక కుట్రగా కనిపిస్తోందని ఏప్రిల్ 14న స్టాలిన్ ఆరోపించారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:49 pm

హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణ..,.

హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణ..,. రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన….ఎస్ఐ కృష్ణయ్య మాడుగుల

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:49 pm

ఈ తొమ్మిది ప్రతిజ్ఞలను పాటించండి:పిఎం మోడీ

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి తొమ్మిది పనుల గురించి సామూహిక హామీ తీసుకున్నారు. నీటి సంరక్షణ నుంచి సహజ వ్యవసాయం, ఆరోగ్యం, సేవా భావం వరకు విస్తరించే ఈ ప్రతిజ్ఞలతో వికసిత కర్ణాటక, వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రధాని అడిగిన హామీలు ఏంటంటే.. మొదటిగా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకుందాం. ‘తల్లి పేరుతో మొక్కలు నాటుదాం(ఏక్ పేడ్ మా కే నామ్)’. పబ్లిక్ ప్రదేశాల్లో పరిశుభ్రతను పాటిద్దాం. వోకల్ ఫర్ లోకల్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ స్వదేశీయతను చాటుదాం. జాతీయ పర్యావరణ రంగాన్ని అభివృద్ధి చేద్దాం. దేశీయ పర్యాటకాన్ని పెంపొందిస్తూ, రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ఆచరిద్దాం. మిల్లెట్లను ఆహారంలో భాగం చేసుకుందాం. వంటలో నూనె వినియోగాన్ని తగ్గిద్దాం. యోగా, ఫిట్‌నెస్‌ను అలవర్చుకుని బరువును అదుపులో ఉంచుకుంటూ ప్రకృతికి సేవ చేద్దాం. ఈ తొమ్మిది సంకల్పాలపై నిజాయితీతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగితే, వికసిత కర్ణాటకతో పాటు వికసిత భారత్ వైపు వేగంగా పురోగమించవచ్చు అని మాండ్యలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠంలో నిర్మితమైన శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవెగౌడతో కలిసి ‘సౌందర్య లహరి శివ మహిమ స్తోత్రం’ అనే పుస్తకాన్ని కూడా మోదీ ఆవిష్కరించారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:46 pm

మరింత మంది సామాజిక కార్యక్రమాల్లో ముందుకు రావాలి

మరింత మంది సామాజిక కార్యక్రమాల్లో ముందుకు రావాలి చలివేంద్రం ప్రారంభంలో ఎస్సై రవికుమార్

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:45 pm

Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్

కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు

తెలుగు పోస్ట్ 15 Apr 2026 7:43 pm

కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, వైఫల్యం

కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, వైఫల్యం భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : పసుపు

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:42 pm

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్

వికారాబాద్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను వికారాబాద్ పిఎస్‌కు తరలించారు. పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణను నిరసిస్తూ ఉదయం నుంచి కవిత ఆందోళన చేశారు. బలవంతంగా భూములు తీసుకోవద్దన్నారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు స్థానిక ఎన్టిఆర్ చౌరస్తాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:42 pm

తాగునీటి సమస్యకు పరిష్కారం…

విశాలాంధ్ర – విడపనకల్లు.. మండల కేంద్రంలోని సుంకులమ్మ గుడి ప్రాంతంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాల మేరకు, వి.కొత్తకోట రస్తా నుంచి సుంకులమ్మ గుడి వరకు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి.భూమి పూజ అనంతరం జేసీబీ యంత్రంతో పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సత్యబాబు, పంచాయతీ […] The post తాగునీటి సమస్యకు పరిష్కారం… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 7:38 pm

ఘనంగా ‘అరైవ్ అలైవ్’రోడ్డు భద్రతా కార్యక్రమం..

ఘనంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం.. ​చిట్యాల, ఆంధ్రప్రభ : ​రోడ్డు

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:34 pm

ప్రాథమిక దశలోనే అగ్నిని ఆర్పివేయడం ప్రధాన కర్తవ్యం..

ప్రాథమిక దశలోనే అగ్నిని ఆర్పివేయడం ప్రధాన కర్తవ్యం.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రాథమిక

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:31 pm

Video : Exclusive F2F with Producer Supriya Yarlagadda

The post Video : Exclusive F2F with Producer Supriya Yarlagadda appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 7:31 pm

మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా దర్బార్..

విశాలాంధ్ర, ఉరవకొండ.. ఉరవకొండలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు హాజరై తమ సమస్యలను మంత్రి కి వివరించారు. మంత్రి స్వయంగా ప్రజల వినతులను శ్రద్ధగా విని, వినతిపత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందిస్తూ, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, […] The post మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా దర్బార్.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 7:28 pm

గవ్వ రవీందర్ రెడ్డికి మాతృవియోగం..

గవ్వ రవీందర్ రెడ్డికి మాతృవియోగం.. సంఘం నేతల నివాళి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:25 pm

వ్యభిచారం కేసులో నలుగురిపై కేసు నమోదు

వ్యభిచారం కేసులో నలుగురిపై కేసు నమోదు భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : హైదరాబాద్

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:22 pm

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభ …

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభ … లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:16 pm

పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

 పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పాలమూరు రిజర్వాయర్లను వచ్చే వానాకాలంలో కచ్చితంగా నింపాలని, దానికి కావాల్సిన పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. మే మొదటివారంలో ప్రత్యక్ష యుద్దానికి పూనుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు మండుటెండల్లో పాదయాత్రలు చేస్తామని, పాలమూరును ఎందుకు పడావు పెట్టారో ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం బిఆర్‌ఎస్ నేతలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేఎల్‌ఐ నీళ్లు ఎలాంటి ఆంటంకం లేకుండా ఆ ప్రాంతానికి నీళ్లు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 1956కు ముందు పాలమూరు అత్యధిక వ్యవసాయ భూములు, చెరువులు, కుంటలు, బావులతో సస్యశ్యామలంగా ఉన్న జిల్లా అని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత అవలంభించిన విధానాల మూలంగా తెలంగాణ వచ్చే నాటికి పాలమూరు జిల్లా వలసల జిల్లా , కరువు జిల్లా, ఆకలి జిల్లా, పేదల జిల్లా, వెనకబడిన జిల్లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధలు, కష్టాల ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమంలో పాటలు, సాహిత్యం, వ్యాసాలు అన్నీ పాలమూరు వెతలను కేంద్ర బిందువుగా చేసుకుని వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడో ఏడాది నడుస్తుందని.. కానీ, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జిల్లా వాసి అయిన సిఎం కనీసం ఎందుకు సమీక్షించడం లేదని ప్రశ్నించారు. జిల్లా ఎంఎల్‌ఎలు, మంత్రులు హైలెవెల్ రివ్యూ కోసం ఎందుకు అడగడం లేదు..? అని అడిగారు. పాలమూరు ప్రజల శాశ్వత ప్రయోజనాల కోసం పాలమూరు మంత్రులు, ఎంఎల్‌ఎలు పనిచేయాలని సూచించారు. మొండి వాదనతో పనులు చేస్తామన్న దోరణిని వదులు కోవాలని హితవు పలికారు. ప్రతి ఎకరానికి సాగునీరు అందాలన్న తపనతో తాము పనిచేశామని, గతంలో తాము చొరవ తీసుకుని చేసిన పనుల కారణంగానే భీమా ద్వారా కొల్లాపూర్ ప్రాంతానికి 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని చెప్పారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:15 pm

మేడ్చల్ –ఘనపూర్తా గునీటి సరఫరా లైన్ల తనిఖీ….

మేడ్చల్ – ఘనపూర్తా గునీటి సరఫరా లైన్ల తనిఖీ…. ​లోపాలను సరిదిద్ది ప్రజలకు

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:13 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సిబి

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్‌లో మూడో స్థానంలో ఉన్న ఆర్‌సిబి ఈ మ్యాచ్‌లో గెలిస్తే నెట్‌ రన్‌రేట్ ప్రకారం మొదటిస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు గుజరాత్‌తో ఓటమి ఎదురుకున్న ఎల్‌ఎస్‌జి ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఒక మార్పు చేసింది. డఫీ స్థానంలో హేజిల్‌వుడ్ జట్టులోకి వచ్చాడు. లక్నో అదే జట్టుని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తుంది. తుది జట్లు: ఆర్‌సిబి: ఫిలిప్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయేష్ శర్మ, రషిక్ సలామ్ దర్. ఎల్‌ఎస్‌జి: ఎయిడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, ఆవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠి, ప్రిన్స్ యాదవ్.

మన తెలంగాణ 15 Apr 2026 7:12 pm

ఇసుక తరలిస్తున్న మాఫియా పై పోలీసులు పంజా..!

ఇసుక తరలిస్తున్న మాఫియా పై పోలీసులు పంజా..! లారీ డ్రైవర్, యజమానులపై కేసు

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:08 pm

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి చెందాడు. హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తుండగా విజయవాడ-హైదరబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి  వద్ద తను ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి వేగంగా డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో జావీద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి రూరల్ పోలీసులు చేరుకొని మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:08 pm

రెండేళ్ల కన్న కూతురిని గొంతు నులిమి చంపిన తండ్రి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (మ) హనుమాపురం లో దారుణం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవ మళ్లీ వివాదం తలెత్తడంతో  రెండేళ్ల కన్న కూతురిని  తండ్రి శ్రీ రాములు గొంతు నులిమి హత్య  చేశాడు. ఈ ఏడాది ఉగాదికి తల్లిగారింటి నుంచి భార్య హనుమాపురంకు వచ్చింది. ఈ క్రమంలో గొడ‌వ‌లు ఎక్కువ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో శ్రీ‌రాములు త‌న కూతురిని హ‌త‌మార్చిన‌ట్లు స‌మాచారం. శ్రీరాములుకు  మాటలు రావు,చెవులు విన‌బ‌డ‌వు. హ‌త్య అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ ప్రారంభించారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:01 pm

స్మార్ట్‌టీవీ లవర్స్‌కి పండగే.. షియోమీ కొత్త స్మార్ట్ టీవీలు వచ్చేశాయ్!

షియోమీ టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ సిరీస్ (2026) భారత మార్కెట్లో విడుదలైంది. ఈ స్మార్ట్ టీవీ లైనప్ 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాల డిస్‌ప్లే సైజులలో అందుబాటులో ఉంది. అన్ని మోడళ్లలో 4K రిజల్యూషన్‌తో కూడిన క్యూడీ-మినీ ఎల్ఈడీ ప్యానెల్స్ ఉన్నాయి. వీటిలో సరికొత్త ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్, షియోమీ సౌండ్‌కు అనుగుణంగా ట్యూన్ చేయబడిన 34W క్వాడ్-స్పీకర్ సిస్టమ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.  షియోమీ టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ సిరీస్ (2026) ధర, లభ్యత కంపెనీ ఈ సిరీస్‌లోని 55-అంగుళాల మోడల్ ధర రూ.51,999గా, 65-అంగుళాల మోడల్ ధర రూ.71,999గా పేర్కొంది. ఇక 75-అంగుళాల మోడల్ ధర రూ.71,999గా నిర్ణయించింది. ఇప్పటికే ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న ఈ కొత్త సిరీస్ ఏప్రిల్ 22వ తేదీ నుండి Mi.com, అలాగే ఈ-కామర్స్ సైట్లు, షియోమీ రిటైల్ స్టోర్లలో సేల్స్ కి వస్తుంది.  ప్రీ-బుకింగ్ సమయంలో షియోమీ రూ.10,000 వరకు బ్యాంక్ ప్రయోజనాలను, అలాగే రెండు సంవత్సరాల పొడిగించిన వారంటీని అందిస్తోంది. దీనితో మొత్తం కవరేజ్ నాలుగు సంవత్సరాల సమగ్ర వారంటీ అవుతుంది. అలాగే, 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. షియోమీ టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ సిరీస్ (2026) ఫీచర్లు 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాల డిస్‌ప్లే ఆప్షన్లలో లభించే ఈ సిరీస్ 4K రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ లైనప్‌లో 178-డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్, 60Hz రిఫ్రెష్ రేట్, DLG 120Hz ఉన్నాయి. ఈ టీవీలలో మల్టిపుల్ డిమ్మింగ్ జోన్‌లు, లైట్ సెన్సార్, డైనమిక్ బ్యాక్‌లైట్ ఉన్నాయి. మెరుగైన స్పష్టత కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 ఉపయోగించారు. ఈ సిరీస్‌లో 34W క్వాడ్-స్పీకర్ సెటప్ ఉంది. ఇందులో రెండు ట్వీటర్లు, రెండు ఫుల్-రేంజ్ స్పీకర్లు ఉంటాయి. ఇది డాల్బీ ఆడియో, DTS:X, DTS వర్చువల్:X, షియోమీ సౌండ్‌కు సపోర్ట్ చేస్తుంది.  ఇక కనెక్టివిటీ కోసం ఈ సిరీస్‌లో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ ఉన్నాయి. ఇందులో మాలి-G52 GPUతో కూడిన క్వాడ్-కోర్ A55 CPU, 2GB RAM, 32GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ సిరీస్ షియోమీ సరికొత్త ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్‌పై పనిచేస్తుంది. ఇందులో ప్యాచ్‌వాల్+, ఉచిత లైవ్ టీవీ ఛానెళ్లు, తల్లిదండ్రుల నియంత్రణలతో కూడిన కిడ్స్ మోడ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మన తెలంగాణ 15 Apr 2026 6:55 pm

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్…

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్… హుజురాబాద్, ఆంధ్రప్రభ : లంచం తీసుకుంటూ.. మరో

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:53 pm

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి…

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి… వృద్ధులకు ఇలాంటి వాతావరణం కల్పించిన నిర్వాహకులను

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:48 pm

నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చి బ్యాంకు లోనే కుప్పకూలి మృతి

హబ్సిగూడ లో విషాదం చోటుచేసుకుంది. నగదు డిపాజిట్ చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వచ్చిన విశ్రాంత ఉద్యోగి లక్ష్మీ నారాయణ గుండెపోటు తో బ్యాంకు లోనే కుప్పకూలి మృతి చెందాడు. బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చి డిపాజిట్ స్లిప్ లో వివరాలు రాస్తూ అలాగే కూర్చున్న చోట నుండి కిందపడిపోయి మృతి చెందాడు. నాచారంలో నివసించే రిటైర్డు ఉద్యోగి లక్ష్మీనారాయణ బుధవారం హబ్సిగూడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చి హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పకూలి పోయారు.. బ్యాంక్ సిబ్బంది హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పారు.బ్యాంక్ సిబ్బంది సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

మన తెలంగాణ 15 Apr 2026 6:45 pm

కొండపల్లి బొమ్మల పండుగను విజయవంతం చేద్దాం…

కొండపల్లి బొమ్మల పండుగను విజయవంతం చేద్దాం… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రపంచ వారసత్వ

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:44 pm

ముంబై ఇండియన్స్‌కి షాక్.. స్టార్ ఆటగాడు దూరం..

ఐపిఎల్ 19వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించి టేబుల్‌లో 9వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కి చేరాలంటే.. ఇక నుంచి ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ మరో షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో భారీ లక్ష్యఛేదన చేస్తుండగా స్టార్ బ్యాటర్‌ రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ మరో రెండు మ్యాచ్‌లకు జట్టుకు దూరం అవుతాడని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 20న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో రోహిత్ శర్మ 4 మ్యాచుల్లో 137 పరుగులు స్కోర్ చేశాడు. 

మన తెలంగాణ 15 Apr 2026 6:44 pm

Fall In Love With Rao Bahadur’s O Sundari Instantly

Starring Satya Dev and directed by Venkatesh Maha, the upcoming psychological thriller Rao Bahadur is presented by Mahesh Babu and Namrata Shirodkar’s GMB Entertainment, and produced by A+S Movies and SriChakraas Entertainments. The makers today released the film’s first song, O Sundari, that brings a soft and romantic flavour to its world. The listeners will […] The post Fall In Love With Rao Bahadur’s O Sundari Instantly appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 6:39 pm

Srinivasa Mangapuram Teaser: Love In The Line Of Fire

Ajay Bhupathi, who delivered a blockbuster with his last film Mangalavaram, is now directing Srinivasa Mangapuram, which marks the debut of Superstar Krishna’s grandson Jaya Krishna Ghattamaneni. It also marks Rasha Thadani’s entry into Telugu cinema. The teaser, unveiled by Mahesh Babu, offers a raw and emotional glimpse into this powerful, love-driven drama. Set against […] The post Srinivasa Mangapuram Teaser: Love In The Line Of Fire appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 6:36 pm

నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

నాణ్యమైన ఆహారాన్ని అందించాలి టెక్కలి, ఆంధ్రప్రభ : విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:27 pm

దానిమ్మ తొక్కలతో అద్భుత ఆరోగ్య లాభాలు.. తెలిస్తే వదిలిపెట్టారు!

హెల్తీగా ఉండాలంటే డైట్ లో పండ్లు, తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే, ఇవి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఇక పండ్ల విషయానికి వస్తే దేని ప్రత్యేకత దానిదే! అయితే, మనం తరచుగా దానిమ్మ పండును తిన్న తర్వాత వాటి తొక్కలను పనికిరానివని భావించి పడేస్తుంటాం. అయితే, ఈ తొక్కలు అనేక విధాలుగా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. దానిమ్మ తొక్కలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి దానిమ్మ తొక్కలు ఏ విధంగా ప్రభావవంతంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ తొక్కల ఆరోగ్య ప్రయోజనాలు ఇవే చర్మంపై సహజమైన కాంతి: దానిమ్మ తొక్కలను ఎండబెట్టి, పొడిగా నూరిన పొడిలా తయారు చేసుకోవాలి. దీనిని పెరుగు లేదా రోజ్ వాటర్‌తో కలిపి ఫేస్ ప్యాక్‌గా అప్లై చేయాలి. ఇది చర్మాన్ని నిర్మలంగా, కాంతివంతంగా ఉంచుతుంది. మచ్చలను సైతం తగ్గిస్తుంది. జుట్టును బలపరుస్తుంది: దానిమ్మ తొక్కల పొడి జుట్టుకు కూడా మేలు చేస్తుంది. దీనిని హెయిర్ ప్యాక్‌లో కలుపుకోవడం వల్ల జుట్టు బలపడి, చుండ్రు తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఎండిన దానిమ్మ తొక్కల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దుర్వాసన నుండి ఉపశమనం కలిగిస్తుంది: దానిమ్మ తొక్కలను ఉడకబెట్టి, ఆ నీటితో పుక్కిలించాలి. ఇది దుర్వాసనను తొలగించి, దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పికి ఉపశమనం కలిగిస్తుంది: గొంతులో నొప్పి ఉంటే దానిమ్మ తొక్కల కషాయం తయారుచేసుకుని తాగవచ్చు లేదా ఆ నీటితో   పుక్కిలించవచ్చు. ఇది గొంతుకు ఉపశమనం కలిగించి, ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

మన తెలంగాణ 15 Apr 2026 6:24 pm

పంటలు ఉత్పత్తి పెంచుటకు పుష్కల అవకాశాలు

పంటలు ఉత్పత్తి పెంచుటకు పుష్కల అవకాశాలు ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:23 pm