SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

19    C
... ...View News by News Source

యూరప్ తనపై యుద్ధానికి తానే నిధులు సమకూరుస్తోంది

` భారత్`ఈయూ వాణిజ్య ఒప్పందం వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు న్యూయార్క్(జనంసాక్షి):భారత్, యురోపియన్ యూనియన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చిన వేళ.. అమెరికా ఆర్థికశాఖ …

జనం సాక్షి 27 Jan 2026 1:09 am

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్‌కు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం హైదరాబాద్(జనంసాక్షి):సంచలనం సష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు తాజాగా బీఆరఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ …

జనం సాక్షి 27 Jan 2026 1:08 am

అభివద్ధిలో తెలంగాణ రైజింగ్

` ఫ్యూచర్ సిటీదే ఫ్యూచర్ ` మూడు ఎకనమిక్ జోన్లుగా రాష్ట్ర విభజన ` తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌తో పెరిగిన ఇమేజ్ ` సర్వతో ముఖాభివద్దికి ప్రభుత్వం …

జనం సాక్షి 27 Jan 2026 1:06 am

ఘనంగా గణతంత్ర వేడుకలు

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన శకటాలు ` జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము ` ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన ` ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ …

జనం సాక్షి 27 Jan 2026 1:01 am

యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

మల్టీ టాలెంటెడ్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌ మిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. ఈ రీమేక్ సినిమాలో మన తెలుగు నేటివిటికి తగ్గట్టు కథలో పాత్రల్లో చాలా మార్పులు చేశారు. ఇందులో ఉండే భావోద్వేగాలు అందరికీ కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంటా యి. నాకు శాంతి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తరుణ్ భాస్కర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తెరపై మీకు ఓంకార్ నాయుడు పాత్ర మాత్రమే కనిపిస్తుంది. మంచి సమ్మర్‌లో ఈ సినిమా షూటింగ్ చేశాము. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఒక సీన్ చేశాము. నాకు నీళ్లంటే భయం. ఆ సీన్ చేస్తున్నప్పుడు నిజంగా భయపడ్డాను. అయితే ఆ సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు సజీవ్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు”అని అన్నారు. 

మన తెలంగాణ 27 Jan 2026 1:00 am

మంగళవారం రాశి ఫలాలు (27-01-2026)

మేషం కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఇంటా బయట కొందరి ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మిధునం బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్త్రీ సంబంధ వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో చిన్నపాటి వివాదాలు కలగుతాయి. కర్కాటకం కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ పడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహం వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ముఖ్యమైన పనులలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్య దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. తుల వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. వృశ్చికం నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధనస్సు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మకరం నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన పరంగా ఒడిదుడుకులు అదికమౌతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంత పెరుగుతుంది. కుంభం ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి. మీనం ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. వ్యాపారాల్లో నూతన విధానాలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది.  

మన తెలంగాణ 27 Jan 2026 12:10 am

ఆ ముగ్గురితో భారత్ ట్రేడ్ డీల్‌కు బ్రేక్..

 ఆ ముగ్గురితో భారత్ ట్రేడ్ డీల్‌కు బ్రేక్ ట్రంప్‌పై రిపబ్లికన్ సెనెటర్ మండిపాటు వాషింగ్టన్ : భారత్ అమెరికా ట్రేడ్ డీల్‌కు వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో, ఉపాధ్యక్షులు వాన్స్, ప్రెసిడెంట్ ట్రంప్ అడ్డుపడుతున్నారని రిపబ్లిక్ సెనెటర్ టెడ్ క్రూజ్ విమర్శించారు.అధికార పార్టీ సభ్యుడే ఈ దాడికి దిగారు. పార్టీ డోనర్స్‌తో జరిగిన సమావేశంలో ఈ సెనెటర్ ప్రత్యేకించి ట్రేడ్ డీల్ విషయం ప్రస్తావించినట్లు అమెరికా మీడియా తెలిపింది. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం అత్యవసరం. అయితే దీనిని ముందుకు సాగకుండా, నాన్చడం వెనుక ప్రముఖుల పాత్ర ఉందని ఈ రిపబ్లికన్ ఎంపి మండిపడ్డారు. అంతర్గత సమావేశంలో ప్రస్తావిత అంశాల ఆడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. టెక్సాస్ సెనెటర్ అయిన క్రూజ్ 2028 ప్రెసిడెంట్ ఎన్నికలపై కన్నేసి ఉంచారు. ట్రంప్ టారీఫ్‌లతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. చివరికి ఇది ఆయన అభిశంసనకు దారితీస్తుందని కూడా హెచ్చరించినట్లు వెల్లడైంది. సెనెటర్ల నుంచి ట్రంప్‌పై కీలక విషయాల్లో ఒత్తిడి వస్తోంది. అయితే ఆయన తప్పుడు మాటలకు తలొగ్గుతున్నారు తప్పితే మంచి విషయాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అమెరికాలో ట్రంప్ నిర్ణయాలతో ఇకపై భారీగా ధరలు పెరుగుతాయి. పరిస్థితి తలకిందులు అవుతుందని ఆయన హెచ్చరించారు. ...............................

మన తెలంగాణ 26 Jan 2026 11:46 pm

భారీ మంచుతుపాన్.. అమెరికాలో పదివేల విమానాలు రద్దు

వాషింగ్టన్: మంచుతుపాన్ ఉధృతితో అమెరికాలో ఆదివారం పదివేలకు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో సర్వీసులకు జాప్యం ఏర్పడింది. దేశంలోని అత్యంత రద్దీగల విమానాశ్రయాలు మంచుధాటికి నిర్మానుష్యం అయ్యాయి. దేశ వ్యాప్తంగా 18 కోట్ల మంది వరకూ మంచు తుపాన్, భారీ వర్షాలతో తల్లడిల్లుతున్నారు. న్యూయార్క్ , బోస్టన్ ఇతర ప్రాంతాల్లో 1 నుంచి రెండు అడుగుల వరకూ మంచు పేరుకుపోయింది. 

మన తెలంగాణ 26 Jan 2026 11:38 pm

మంచు తుపాను కారణంగా కూలిన విమానం.. ఏడుగురు మృతి

మంచు తుపాను కారణంగా విమానం కూలిన సంఘటన అమెరికాలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. స్థానిక అధికారుల కథనం ప్రకారం.. ఎనిమిది మందితో ఓ ప్రవేటు బిజినెస్ విమానం ఆదివారం రాత్రి 7.45 గంటల( భారత కాలమానం ప్రకారం) సమయంలో బాంగోర్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. విమానాశ్రయం నుంచి కొంతదూరం వెళ్లగానే విమానం కూలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారిలో ఏడుగురు మంటల్లో కాలి చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు విమానాశ్రయంను మూసివేశారు. ఘటన సమయంలో దట్టంగా మంచు కురుస్తున్నట్లు సమాచారం.

మన తెలంగాణ 26 Jan 2026 11:29 pm

రేపటి నుంచి పార్లమెంట్‌

నేడు అఖిలపక్షం భేటీన్యూదిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థికసర్వే ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఆదివారం వచ్చింది. ఆదివారం […] The post రేపటి నుంచి పార్లమెంట్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 11:23 pm

బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశం నిషిద్ధం

న్యూదిల్లీ: ఉత్తర భారతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ చైర్మన్‌ హేమంత్‌ ద్వివేది ధ్రువీకరించారు. ఈ రెండు ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే మిగతా దేవాలయాల్లోనూ ఇదే ప్రవేశ నిబంధన వర్తించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే […] The post బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశం నిషిద్ధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 11:19 pm

బద్రీనాథ్ కేదారినాథ్‌ల్లో హిందువులకే ప్రవేశం

హరిద్వార్ ః ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకు ఇకపై కేవలం హిందువులనే అనుమతిస్తారు. హిందూయేతరులకు నిషేధం విధించాలని ఆలయాల నిర్వాహక కమిటీ నిర్ణయించింది. తొందర్లో జరిగే బద్రీనాథ్ కేదారినాథ్ ట్రస్టు కమిటీ (బికెటిసి) బోర్డు సమావేశంలో తీర్మానం చేసిఆమోదించనున్నారు. కమిటీ ప్రతిపాదన వివరాలను మీడియాకు ఛైర్మన్ సురేష్ సెమ్వాల్ సూచనప్రాయంగా తెలిపారు. ఆదివారం కమిటీ కమిటీ బోర్డు పూర్తి స్థాయి సమావేశంలో నిర్ణయం వెలువడుతుంది. దీనిని పూర్తి స్థాయిలో ఆలయాల బోర్డు పరిధిలోకి వచ్చే ఇతర క్షేత్రాలు గంగోత్రి , ముఖుంబకు కూడా వర్తిస్తాయి. ఆలయాల పురాతన సాంప్రదాయాలకు కట్టుబడి వ్యవహరించాలనే ఆలోచనలతోనే ఇతర మతస్తులకు ఆలయ నిషేధం విధించనున్నట్లు తెలిసింది. ఈ రెండు ఆలయాలు ఉత్తరాఖండ్‌లో నెలకొని ఉన్నాయి, ఛార్‌ధామ్ యాత్రలో భాగంగా ఆలయాలను ఏటా లక్షలాది భక్తులు సందర్శిస్తారు. శీతాకాలం లో ఆరు నెలల పాటు ఆలయాలు మూసివేస్తారు. తిరిగి ఏప్రిల్ 23న తలుపులు తెరుచుకుంటాయి. గతంలో మతాచారాలకు విరుద్ధంగా ఆలయాల్లోకి అందరిని అనుమతిస్తూ వచ్చారు. దీనిని గుర్తించి చక్కదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. 

మన తెలంగాణ 26 Jan 2026 11:13 pm

వారి రాకతో ఐరోపా బంధానికి రెక్కలు: మోడీ

న్యూఢిల్లీ: ఇండియా ఇయూ మధ్య బలోపేత సంబంధాలు రిపబ్లిక్ డే వేడుకలకు ఇయూ నేతల రాకతో స్పష్టం అయిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇయూ కౌన్సిల్ , కమిషన్ సారధులు ఈసారి వేడులకు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. రెండు పక్షాలూ ఉమ్మడి విలువలకు కట్టుబడి ఉన్నాయి. ఇదే క్రమంలో ఐరోపా సమాఖ్యతో భారతదేశ అనుబందం విస్తరించుకొంటోందని తెలిపారు. ఆంటోనియో కోస్టా, ఉర్సులా వా అతిధులుగా రావడం గర్వకారణం అన్నారు. విభిన్న రంగాలలో భారత్ ఐరోపా దేశాల మధ్య స్నేహ సహకారం విస్తరణకు ఇయూ నేతల భారత్ సందర్శన దోహదం చేస్తుందని ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. 

మన తెలంగాణ 26 Jan 2026 11:01 pm

కూటమికి కత్తిమీద సామే!

. ప్రశ్నార్థకంగా నిరుద్యోగ భతి, ఆడబిడ్డ నిధి. ప్రతి నెలా అప్ప్పుల కోసం దిల్లీవైపు చూపు. అమలుకు చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ విమర్శనాస్త్రాలు సూపర్‌ సిక్‌్స హామీల్లో ప్రధానంగా నిరుద్యోగ భతి, ఆడబిడ్డ పథకం అమలు కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు ఎన్నికల ముందు ఈ రెండు పథకా లను ఆశగా చూపి నిరుద్యోగులు, మహిళల ఓట్లు దండుకుని అధికారం లోకి వచ్చారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షమైన వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. నిరుద్యోగ భతి నెలకు […] The post కూటమికి కత్తిమీద సామే! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 11:00 pm

సౌభాగ్యాంధ్ర దిశగా…

. పునరుద్ధరణ మార్పు ప్రారంభమైంది. శరవేగంగా అభివద్ధి, సంక్షేమం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. 77వ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌. రాజధాని గడ్డపై త్రివర్ణ పతాక రెపరెపలు విశాలాంధ్ర-సచివాలయం:2047 నాటికి ప్రపంచంతో పోటీపడే విధంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని, కలిసి కట్టుగా ఆరోగ్య, ఆనంద, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామని గవర్నర్‌ పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర స్థాయి 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజధాని అమరావతి నేలపాడులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా […] The post సౌభాగ్యాంధ్ర దిశగా… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 10:48 pm

బిజెపికి మాజీ ఎంఎల్ఎ అరూరి రమేష్ గుడ్‌బై

వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బిఆర్‌ఎస్ ఆహ్వానం మేరకు త్వరలో పెద్ద ఎత్తున అనుచరులతో ఆ పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్‌లో చేరడం అంటే తన సొంత ఇంట్లోకి వెళ్ళినట్లేనని ఆయన పేర్కొన్నారు. బిజెపిలో తనకు ఇంత కాలం సహకరించిన వారందరికీ అరూరి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.

మన తెలంగాణ 26 Jan 2026 10:45 pm

సంతోష్‌కు సిట్ నోటీసులు యాదృచ్ఛికం కాదు: కెటిఆర్

టెలిఫోన్ టాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కి సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఖండించారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తం ఒక అట్టర్ ప్లాప్ టివి సీరియల్‌ను తలపిస్తోందని ఒక ప్రకనటలో పేర్కొన్నారు. అసలైన బాధ్యులైన అధికారులను వదిలేసి, కేసుతో ఎలాంటి సంబంధం లేని ప్రతిపక్ష నాయకులకు వరుసగా విచారణకు పిలవడం కేవలం రాజకీయ కక్షసాధింపు, అటెన్షన్ డైవర్షన్‌లో భాగమేనని విమర్శించారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజల సమస్యల నుంచి దృష్టి మరల్చడం కోసమే ఈ కేసు, విచారణ డ్రామాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న భారీ అవినీతి, కుంభకోణాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ విచారణను ఒక ఆయుధంగా వాడుకుంటోందని మండిపడ్డారు. ముఖ్యంగా నైని బొగ్గు గనుల కుంభకోణం బయటపడటంతో ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో ఉందని, దానిని పక్కదారి పట్టించేందుకే ఈ నోటీసుల డ్రామా అని పేర్కొన్నారు. గతంలో హరీష్ రావును, తనను కూడా ఇదే కేసు పేరుతో విచారించినా ఏమీ సాధించలేకపోయారని, ఇప్పుడు సంతోష్ కుమార్‌నుని లక్ష్యంగా చేసుకున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. మంగళవారం రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు బొగ్గు కుంభకోణంపై వినతిపత్రం ఇస్తామని తాము ప్రకటించిన వెంటనే సంతోష్‌కు నోటీసులు రావడం యాదృచ్ఛికం కాదని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన అటెన్షన్ డైవర్షన్ అని ఆరోపించారు. సంతోష్ కుమార్‌కు పార్టీ అండగా ఉంటుందని, న్యాయస్థానాల్లో ఈ అక్రమ కేసులను ఎదుర్కొంటామని కెటిఆర్ తెలిపారు.

మన తెలంగాణ 26 Jan 2026 10:42 pm

అంబరాన్నంటిన గణతంత్రం

. కర్తవ్‌్యపథ్‌లో భారత సైనికశక్తిని చాటేలా పరేడ్‌. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఆయుధ వ్యవస్థను ప్రదర్శించిన త్రివిధదళాలు. పరేడ్‌లో పాల్గొన్న ఈయూ సైనిక బృందం. జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్రపతి ముర్ము. ముఖ్య అతిథులుగా హాజరైన ఈయూ నేతలు న్యూదిల్లీ: దేశ రక్షణ సామర్ధ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ దిల్లీలోని కర్తవ్య పథ్‌లో భారత 77వ గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత రాష్ట్రపతి భవన్‌ నుంచి […] The post అంబరాన్నంటిన గణతంత్రం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 10:38 pm

పద్మశ్రీ విజేతలను సన్మానించిన మెగాస్టార్

పద్మశ్రీ విజేతలను సన్మానించిన మెగాస్టార్ రిపబ్లిక్ డే సందర్భంగా టాలీవుడ్ ఆనందంతో వెలిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం సినీ పరిశ్రమకు విశేష గౌరవంగా నిలిచింది. ఈ ఆనందాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల నివాసాలకు వెళ్లి వారిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. ఈ ముగ్గురి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణలు, జ్ఞాపకాలు పంచుకోవడం.. దశాబ్దాల పాటు కలిసి ప్రయాణించిన అనుబంధాన్ని, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించాయి. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి... ఇది చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక ఆనందకరమైన రోజు అని అభివర్ణించారు. ఇదే సందర్భంలో సోషల్ మీడియా ద్వారా కూడా చిరంజీవి పద్మ అవార్డు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మమ్ముట్టీ, మాధవన్‌తో పాటు క్రీడారంగం నుంచి రోహిత్ శర్మ, వరల్ కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, అలాగే డాక్టర్ దత్తాత్రేయుడు నోరికి అభినందనలు తెలియజేశారు.

మన తెలంగాణ 26 Jan 2026 10:37 pm

రికార్డు స్థాయికి బంగారం..

 గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సోమవారం బంగారం 5,100 డాలర్లను దాటి చరిత్రాత్మక గరిష్టాన్ని చేరుకుంది. భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక విధానాలపై అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా బంగారంపై ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. డాలర్ బలహీనత, అమెరికా వడ్డీ రేట్లు తగ్గవచ్చనే అంచనాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు బంగారం ర్యాలీకి కారణమవుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వ వాణిజ్య, టారిఫ్ హెచ్చరికలతో అమెరికా ఆస్తులపై నమ్మకం తగ్గిందని విశ్లేషకులు తెలిపారు. వెండి, ప్లాటినం, పల్లాడియం ధరలూ కొత్త గరిష్టాలను తాకాయి. 2026లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మన తెలంగాణ 26 Jan 2026 10:31 pm

ఐక్యతకు అర్థం చెప్పిన అమ్తుస్సలామ్‌

తాడి ప్రకాష్‌, 9704541559 “…ఆ కత్తులు దొరికేదాకా నేను పచ్చిమంచినీళ్లు ముట్టను…” అంది ఆమె.చడీచప్పుడూ లేకుండా, పిడుగు పడినట్టుగా ఉంది ఆమె మాట. 1946 – తూర్పు బెంగాల్లోని మారుమూల కుగ్రామం అది. మతవిద్వేషాలతో మనసులు మసిబారిపోతున్న సమయం…ఆ విపరిణామాలతో తనకేమీ సంబంధం లేనట్టుగా డిసెంబర్‌ నెల చలిగాలి రివ్వున వీస్తోంది. చలికి తువ్వాళ్లు, మఫ్లర్లు చెవులకు చుట్టుకున్నవాళ్లు, ఒళ్లంతా దుప్పట్లతో పైపంచెలతో కప్పుకున్నవాళ్లు ఆమె మాటలకి ఉలిక్కిపడ్డారు.“ఏమన్నారూ…!” … ఖురాన్‌ పఠనం చేసే కరీం సాహెబ్‌ […] The post ఐక్యతకు అర్థం చెప్పిన అమ్తుస్సలామ్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 10:30 pm

పతాక వందనం!!

జయహో గణతంత్ర పతాక! జనప్రియ జాతి జాగత గీతిక!!కేతన రెపరెపలు ప్రతీవాడలా స్వేచ్ఛస్వచ్ఛతల ప్రతీకలుసు“తంత్రపు”మువ్వన్నెల రంగుల్లోంచి సంభ్రమ్మాలికలు!! అర్థవంతమైన స్వాతంత్య్రం కోసం పరితపించి అసువులు బాసిన త్యాగధనులెందరో కదా?! బానిసయుగాల పరదాశ్య శంఖలాల్నించి విడివడిన స్వతంత్రం గణతంత్రం ఫలాలునేటికీ దేశభక్తిజాతీయతల అస్తిత్వ మూలాలు ఆనాటి పోరాటాలు పోరుబావుటాలు వర్తమానంచరిత్రగతి నిర్దేశనకు ఆలంబనలే కదా?!I I Iలౌకిక భావనల నిర్మితుల రాజ్యాంగ నిర్దేశనంతోశాసనాలుచట్టాలు నిజాచరణం ఆశయాలుజాతిజాతీయతల భారతీయతకు నిదర్శనం మతాలుఅభిమతాలు భిన్నత్వాల్నించిమనం నుంచి జనం భావనలు కొరవడ్తూంటేపాలితులుపాలకుల నడుమ […] The post పతాక వందనం!! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 10:28 pm

వంట-వార్పూ అవార్డులు

పేపకాయల ప్రసాద్‌, 9490712967 ‘మూను కన్న మొల్ల కన్న/ నీదు మోము బ్రైటట…./టటట టా/టటట టా /టటట టా’ అరమోడ్పు కనులతో పాడుకుంటున్నాడు గిరీశం. పక్కనపెట్టిన చుట్ట నుంచి లేచిన పొగ అక్కడంతా వ్యాపిస్తోంది.ఏమివాయ్‌ మై డియర్‌ షేక్స్పియర్‌… మొఖం మళ్ళీ వేలవేసినావ్‌… దూరం నుంచి నీరసంగా నడిచివస్తున్న శిష్యుణ్ణి పలకరించాడు గిరీశం.ఛ… వూరుకోండి గురూగారూ… ఎప్పుడూ అదే పిలుపా! ముఖం వేలవేసే వాడు ఈ ప్రపంచంలో షేక్స్పియర్‌ ఒక్కడేనా ఏంటి…మీరు అప్డేట్‌ అవ్వడం లేదండి… విసుక్కున్నాడు […] The post వంట-వార్పూ అవార్డులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 10:23 pm

Video : Director & Actor Tharun Bhascker Exclusive Interview

The post Video : Director & Actor Tharun Bhascker Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 10:20 pm

ఆస్ట్రేలియా ఓపెన్.. క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్, రిబకిన

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ జన్నిక్ సినర్ (ఇటలీ), నాలుగో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), నాలుగో సీడ్ అమందా అనిసిమోవా (అమెరికా), ఐదో సీడ్ ఎలినా రిబకిన (కజకిస్థాన్) తదితరులు ప్రిక్వార్టర్ ఫైనల్ పోటీల్లో విజయం సాధించి ముందంజ వేశారు. రెండో సీడ్ స్వియాటెక్ 60, 63 తేడాతో ఆస్ట్రేలియా క్రీడాకారిణి మాడిసన్ ఇంగ్లిస్‌ను ఓడించింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన స్వియాటెక్ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్ కూడా అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రిబకిన 61, 63తో ఎలిసె మెర్టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది. అనిసిమోవా మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లో చెమటోడ్చి నెగ్గింది. చైనాకు చెందిన వాంగ్‌తో జరిగిన పోరులో అనిసిమోవా 76, 64తో జయకేతనం ఎగుర వేసింది. మరో పోటీలో ఆరో సీడ్ జెస్సిక పెగులా (అమెరికా) జయభేరి మోగించింది. అమెరికాకే చెందిన మాడిసన్ కీస్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పెగులా 63, 64తో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సినర్ 61, 63, 76తో ఇటలీకే చెందిన డార్డెన్‌ను ఓడించాడు. మూడో సెట్‌లో సినర్‌కు గట్టి పోటీ ఎదురైనా చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక చెక్ రిపబ్లిక్ ఆటగాడు మెన్సిక్‌తో జరిగిన పోరులో జకోవిచ్‌కు వాకోవర్ లభించింది. మరో పోటీలో 8వ సీడ్ బెన్ షెల్టన్(అమెరికా) విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కుచేరుకున్నాడు. ఐదో సీడ్ ముసెట్టి (ఇటలీ) కూడా ముందంజ వేశాడు.

మన తెలంగాణ 26 Jan 2026 10:18 pm

సేవకు దక్కిన అరుదైన గౌరవం

విశాలాంధ్ర- ఎ కొండూరు మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన తెదేపా నాయకులు గడ్డి కృష్ణారెడ్డికి జిల్లా ఉత్తమ మార్గదర్శి అవార్డును సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ చేతుల మీదగా ఉత్తమ మార్గదర్శి అవార్డును అందించడం జరిగిందని గడ్డి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోనే కాకుండా ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు వారిని ఆదరించే […] The post సేవకు దక్కిన అరుదైన గౌరవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 10:09 pm

పోలీసు ఆపరేషన్..10 వేల కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం

జైపూర్ : రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో పోలీసుల వేటలో 10000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాల దశలోనే ఈ మందుగుండు సామాగ్రి ఒకటే చోట దొరకడం సంచలనానికి దారితీసింది. థావ్లా పోలీసు స్టేషన్ పరిధిలోని హర్సౌర్ గ్రామంలో నిర్మానుష్యపు ఫార్మ్‌హౌస్‌లో దీనిని గుర్తించారు. ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై తనిఖీల సందర్భంగా ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ సోదాల సందర్భంగా సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక్కడ భారీ స్థాయిలో స్మగ్లింగ్ ముఠా కార్యకలాపాలు సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎర్రకోట వద్ద ఉగ్రవాదుల బాంబు పేలుడుకు వాడిన మందుగుండు సామాగ్రి రాజస్థాన్ నుంచే సరఫరా అయిందని ప్రాధమికంగా తెలిసింది. అయితే ఇప్పటి రికవరికి ఎర్రకోట ఘటనకు సంబంధం ఉన్నదీ లేనిదీ నిర్థారణ కాలేదు. అక్రమ మైనింగ్‌కు ఈ పేలుడు పదార్థాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడైందని జిల్లా ఎస్‌పి మృదుల్ కచ్చావా తెలిపారు. ఇక్కడ పోలీసుల తనిఖీలో 187 సంచుల్లో అమ్మోనియం నైట్రేట్‌ను కనుగొన్నారు. పలు డిటోనేటర్లు, వైర్లు కూడా లభ్యం అయ్యాయి. అక్రమ తవ్వకాలకు అవసరం అయిన వస్తువులను తాను ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నట్లు అరెస్టు అయిన సులేమాన్ ఖాన్ తెలిపాడు. 

మన తెలంగాణ 26 Jan 2026 10:08 pm

అంతరాయంలేని విద్యుత్ సరఫరా లక్ష్యం

గణతంత్ర వేడుకల్లో పుల్లారెడ్డి విశాలాంధ్రవిజయవాడ: ప్రజలకు అంతరాయంలేని నాణ్యమైన విద్యుత్‌ను అందించి వినియోగదారుల మన్ననలను చూరగొనాలని ఏపిసిపిడిసియల్ సీయండీ పి పుల్లారెడ్డి సూచించారు. సోమవారం కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ అందరి కషితో జాతీయ స్ధాయిలో కార్పొరేషన్ బి గ్రేడ్‌క చేరుకుందని, మరింతగా కష్టపడి ఎ గ్రేడ్ సాధించాలని అభిలాషించారు. ముఖ్యంగా రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ ను ఆలస్యం లేకుండా త్వరితగతిన ఇవ్వాలని […] The post అంతరాయంలేని విద్యుత్ సరఫరా లక్ష్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 10:01 pm

మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ పవర్‌ఫుల్ లుక్..

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘డేవిడ్ రెడ్డి’. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా ‘డేవిడ్ రెడ్డి‘ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా ‘డేవిడ్ రెడ్డి‘ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లాంచ్ చేశారు. ఈ పోస్టర్స్‌లో రూత్‌లెస్, బ్రూటల్ అనే రెండు లుక్స్‌లో మంచు మనోజ్ ఇంటెన్స్ గా కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఈ రెండు లుక్స్ చూస్తే మూవీలో అద్భుతమైన యాక్షన్ ఉంటుందని తెలుస్తోంది. మంచు మనోజ్ తన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, లుక్స్, నటనతో డేవిడ్ రెడ్డి పాత్రకు లైఫ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా తీసుకుని ‘డేవిడ్ రెడ్డి‘ సినిమాను ప్రతిష్టాత్మకంగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రిటీష్ క్రూర పాలనకు ఎదురునిలిచి పోరాడిన యోధుడి పాత్రలో మనోజ్ నటిస్తున్నారు.

మన తెలంగాణ 26 Jan 2026 9:59 pm

మహనీయుల స్ఫూర్తితో అభివృద్ధికి ముందడుగు

–ఎన్టీఆర్ జిల్లా ప్రగతికి సమష్టిగా కృషి `ఆకట్టుకున్న శకటాలు..ఈ వేడుకలలో ప్రదర్శించిన మొత్తం 18 శాఖల శకటాలు స్వర్ణాంధ్ర పది సూత్రాల కార్యాచరణను కళ్లకుకట్టాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, స్వర్ణాంధ్ర 2047 , జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ , పౌరసరఫరాల శాఖ, పర్యాటక శాఖ, పాఠశాల విద్యా,, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఈగల్ టీం, వైద్య ఆరోగ్య , జిల్లా మహిళా శిశు సంక్షేమ, నీటి పారుదల, అటవీ, వ్యవసాయం, పంచాయతీరాజ్ , పశుసంవర్థక, ఉద్యాన, […] The post మహనీయుల స్ఫూర్తితో అభివృద్ధికి ముందడుగు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 9:54 pm

వైభవంగా గణతంత్ర వేడుకలు

రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం... దోనేపూడి శంకర్విశాలాంధ్రవిజయవాడ: నగరంలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. తొలుత భారత జాతీయ పతాకాన్ని గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు దోనేపూడి శంకర్ ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు సభ్యులతో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయులందరికీ పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విలువలతో కూడిన రాజ్యాంగ విలువలను […] The post వైభవంగా గణతంత్ర వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 9:48 pm

Anil Sunkara’s AIRFORCE – Bezawada Batch Announces First Cast Member with a Fun, Grounded Welcome

Producer Anil Sunkara has consistently been at the forefront of encouraging fresh talent and original storytelling, and his latest announcements reaffirm that commitment. His much-talked-about movie-making reality show, Show Time – Cinema Teeddam Randi, has already generated a strong buzz, inspiring countless hopefuls across the film community. Carrying this spirit forward, Anil Sunkara has unveiled […] The post Anil Sunkara’s AIRFORCE – Bezawada Batch Announces First Cast Member with a Fun, Grounded Welcome appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 9:35 pm

Teja Sajja | 3 సీక్వెల్స్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న తేజ సజ్జ

Teja Sajja | 3 సీక్వెల్స్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న తేజ సజ్జ

ప్రభ న్యూస్ 26 Jan 2026 9:30 pm

Why are Tollywood Stars not ready to Face Media?

Gone are the days when stars were excited to interact with the media and reveal interesting updates about their films. With the social media era and digital media replacing the world, most of our stars are not much interested in facing the media. A section of the media too is biased and are targeting the […] The post Why are Tollywood Stars not ready to Face Media? appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 9:18 pm

డిజిపి సిల్వర్ మెడల్స్ అందజేసిన జిల్లా కలెక్టర్, జిల్లాఎస్పీలు

విశాలాంధ్ర – పార్వతీపురం:పార్వతీపురం మన్యంజిల్లాలో పోలీస్ శాఖలో విశేష సేవలు అందించిన ఎనిమిదిమందికి డిజిపి సిల్వర్ మెడల్స్, ప్రశంసపత్రాలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డిలు సోమవారం నాడు అందజేశారు. సిల్వర్ మెడల్ తీసుకున్న వారిలో సాలూరు సిఐ రామకృష్ణ, ఏఎస్ఐ టి శారద, ఆర్ఎస్ఐ కే రమేష్, బి విజయభాస్కరరావు, పి లావణ్య, పి గోవర్ధన్ కుమార్, వి గణపతి, పతివాడ శ్రీనులు ఉన్నారు. వారందరిని […] The post డిజిపి సిల్వర్ మెడల్స్ అందజేసిన జిల్లా కలెక్టర్, జిల్లాఎస్పీలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 9:08 pm

Good Chance for Vishwak Sen

Vishwak Sen has delivered disasters and he was badly criticised for his script selection. He also landed into controversy for his statements during the promotions of his previous films. This time the actor is focused on Funky, a comic entertainer directed by Jathi Ratnalu fame Anudeep KV. The promotional activities started recently and the film […] The post Good Chance for Vishwak Sen appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 9:01 pm

కూకట్ పల్లిలో ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా

కూకట్ పల్లి  వివేకానంద నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివేకానంద నగర్ ప్రధాన రహదారిపై చైనా మాంజా (నైలాన్ దారం) మెడకు చుట్టుకోవడంతో ఐదేళ్ల చిన్నారి నిషిక దరియా దుర్మరణం చెందింది. కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా రహదారిపై తేలియాడుతున్న చైనా మాంజా చిన్నారి మెడకు చిక్కుకుని తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిషేధం ఉన్నప్పటికీ చైనా మాంజా వినియోగం ప్రాణాంతకంగా మారుతోందని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మన తెలంగాణ 26 Jan 2026 8:58 pm

Technology Is the Backbone of Transparent and Fast Governance: Chandrababu Naidu

Technology is not just about convenience. It is a powerful tool for transparent and fast governance, said Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Monday. He made these remarks during a high level review meeting of the Real Time Governance Society at the camp office, where he outlined a clear roadmap for the state’s […] The post Technology Is the Backbone of Transparent and Fast Governance: Chandrababu Naidu appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 8:54 pm

ఆ ముగ్గురి వల్లే ఈ విజయాలు.. టీమిండియాపై గవాస్కర్ ప్రశంసల వర్షం

ముంబై: న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరుగుతున్న టి20 సిరీస్‌లో వరుస విజయాలతో అదరగొడుతున్న టీమిండియాపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కివీస్ సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాలతో భారత జట్టు చాటిందన్నాడు. రానున్న టి20 వరల్డ్‌కప్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ విజయాలు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా ప్రదర్శన చాలా అద్భుతమన్నాడు. యువ సంచలనం అభిషేక్ శర్మ సిరీస్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోతుండడం తనను ఎంతో ఆకట్టుకుందన్నాడు. ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ల బ్యాటింగ్‌ను కూడా గవాస్కర్ కొనియాడాడు. ఈ ముగ్గురి వల్లే టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిందని ప్రశంసించాడు.

మన తెలంగాణ 26 Jan 2026 8:53 pm

నకిలీ హెచ్‌టి పత్తి విత్తనాలు పట్టివేత

నారాయణపేట జిల్లాలో రైతులను మోసం చేస్తూ నకిలీ హెచ్‌టి పత్తి విత్తనాలను అక్రమంగా విక్రయిస్తున్న వారిపై నారాయణపేట జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. సోమవారం నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పత్రిక సమావేశం నిర్వహించి, జిల్లాలో పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాల వివరాలను వెల్లడించారు. నారాయణపేట మండలం బండగొండ గ్రామం మరియు కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామంలలో జిల్లా పోలీసులు, టాస్క్ ఫోర్స్ ప్రత్యేక పోలీసు బృందం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో, సుమారు రూ.1 కోటి విలువైన 10 టన్నుల (100 క్వింటాళ్ల) నకిలీ హెచ్‌టి పత్తి విత్తనాలను నిందితులైన తండ్రీకొడుకుల ఇళ్ల నుండి, వారి స్వాధీనంలో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు, మద్దూరు పోలీస్ స్టేషన్‌లో మరో కేసు చొప్పున మొత్తం రెండు కేసులు నమోదు చేయబడినట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో, నిందితులు ఎ1 వి. బాలకృష్ణ నాయుడు, ఎ2: శశివర్ధన్ నాయుడు లు నకిలీ హెచ్ టి పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేసి, నారాయణపేట జిల్లాలో రైతులకు అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా లాభాలు పొందుతున్నట్లు తేలింది. ఎ1 నిందితుడు గతంలో మద్దూరు, నర్వ, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఆ కేసులన్నీ ప్రస్తుతం కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల వ్యాపారంలో ఎవరైనా పాల్గొంటే, రవాణా చేసినా, సరఫరా చేసినా లేదా అధిక ధరలకు విక్రయించినా, వారిపై చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ప్యాకింగ్ లేని, అనుమానాస్పద విత్తనాలను కొనుగోలు చేయవద్దని, నకిలీ విత్తనాల వ్యాపారం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ ఇప్పుడు పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాలు సుమారు మూడు మండలాల్లో పంటలు వేయడానికి సరిపడే పరిమాణంలో ఉన్నాయని తెలిపారు. రైతులు గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ షాపులలోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్ తీసుకోవాలని, లాట్ నెంబర్ ఉన్న విత్తనాలనే కొనాలని సూచించారు. ఎక్కడైనా అక్రమంగా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించినందుకు, డీఎస్పీ నల్లపు లింగయ్య పర్యవేక్షణలో సమర్థవంతంగా పనిచేసిన నారాయణపేట, కోస్గి సీఐలు, శివశంకర్, సైదులు, నారాయణపేట రూరల్,మద్దూరు ఎస్‌ఐలు విజయ్ కుమార్, రాముడు, టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ పురుషోత్తం, ప్రత్యేక పోలీసు బృందం, వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ అభినందించారు.

మన తెలంగాణ 26 Jan 2026 8:51 pm

వైద్యరంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను డాక్టర్ దిడ్డి స్వప్న లత కు ప్రశంసా పత్రం

కలెక్టర్ చేతుల మీదుగా డాక్టర్ స్వప్నలతకు ప్రశంసా పత్రం అందజేత కరీమాబాద్ జనవరి

ప్రభ న్యూస్ 26 Jan 2026 8:46 pm

బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం ఓ లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం దివిటిపల్లి వద్ద చోటుచేసుకుంది. దీంతో జాతీయ రహదారిపై 5 కి.మీ మేర వాహనాలు నిలిచిపోడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్టున్నారు.

మన తెలంగాణ 26 Jan 2026 8:45 pm

బిసిసిఐ మాజీ అధ్యక్షుడు బింద్రా కన్నుముత

న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా (84) ఆదివారం తుదిశ్వాస విడిచారు. బింద్రా 1993 నుంచి 1996 మధ్య బిసిసిఐ అధ్యక్షుడిగా పని చేశారు. అంతేగాక 1978 నుంచి 2014 వరకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన సేవలకు గుర్తింపుగా పిసిఎ క్రికెట్ స్టేడియానికి ఐఎస్ బ్రిందా పేరు పెట్టారు. తన పదవీ కాలం సమయంలో బింద్రా భారత క్రికెట్‌లో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. క్రికెట్ ప్రసారంలో దూరదర్శన్ గుత్తాధిపత్యానికి పుల్‌స్టాప్ పెట్టి ఈఎస్‌పిఎన్, టెన్ టివి వంటి ప్రపంచ సంస్థలను భారత మార్కెట్‌కు తేవలంలో ముఖ్య భూమిక పోషించారు. అంతేగాక 1987 ప్రపంచకప్ టోర్నీ భారత్‌లో నిర్వహించడంలో తనవంతు సహకారం అందించారు.

మన తెలంగాణ 26 Jan 2026 8:44 pm

ఉత్తమ డిపిపిగా మంతిని మానస

విశాలాంధ్ర – పార్వతీపురం: జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగంలో డిపిపి గా పనిచేస్తున్న మంతిని మానస ఉత్తమ అధికారిగా ఎంపికై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డిల చేతుల మీదుగా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారంనాడు ప్రశంసాపత్రాన్నీ తీసుకున్నారు. ప్రకృతి వ్యవసాయవిభాగంలో చేసినకృషికి గాను ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్నీ తీసుకున్నారు. ఆమెను జిల్లా వ్యవసాయ అధికారి రెడ్డి అన్నపూర్ణ, జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం డిపిఎం ఎం.శ్రావణ్ […] The post ఉత్తమ డిపిపిగా మంతిని మానస appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 8:39 pm

విద్యార్థులకు విద్య సామగ్రి పంపిణీ

విశాలాంధ్ర- డుంబ్రిగుడ : మండలంలోని కండ్రుం ప్రాథమికోన్నత పాఠశాల 108 మంది విద్యార్థులకు అక్షర ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం ఫౌండర్ ప్రియ బాంధవి ఆధ్వర్యంలో సోమవారం గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని మండల విద్యాశాఖ అధికారి 2 గెన్ను చేతులు మీదుగా విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా విద్యాసామాగ్రిని అందించిన వెల్ఫేర్ సొసైటీ కు కృతజ్ఞతలు తెలిపారు. అందించిన విద్యాసామగ్రిని విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు […] The post విద్యార్థులకు విద్య సామగ్రి పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 8:28 pm

కర్రగుట్టలో ఐఈడీల మోత..11మంది భధ్రాతా సిబ్బందికి గాయాలు

దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్న సందర్బంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఐఈడీ పేలుళ్ళు కలకలం రేపాయి. ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలోని బీజాపూర్-తెలంగాణ సరిహద్దు సమీపంలోని కర్రెగుట్ట కొండల ప్రాంతంలో మావోయిస్టులు సోమవారం పలుచోట్ల ఐఈడీ పేలుళ్లకు పాల్పడటంతో.. 11మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరో పదిమంది ప్రమాదం నుంచి సురక్షితంగా బైటపడ్డారు. ఆదివారం జరిగిన వరుస పేలుళ్లు నేపధ్యంలో ఛత్తీస్‌గఢ్ పోలీసుల జిల్లా రిజర్వ్ గార్డ్, సిఆర్‌పిఎఫ్ ఎలైట్ కోబ్రా యూనిట్ సిబ్బందితో కూడిన ఉమ్మడి యాంటీ-నక్సల్ ఆపరేషన్ బృందం లక్ష్యంగా సోమవారం పలుచోట్ల ఐఈడీ పేలుళ్ళకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లు చోటుచేసుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హెలిక్యాప్టర్ ద్వారా రాయఫూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11మంది జవాన్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని బీజాపూర్ పోలీసులు అధికారికంగా వెల్ల డించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా బీజాపూర్‌లోని కర్రెగుట్ట కొండతోసహా 13 ప్రదేశాలలో సోమవారం ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ పతకాన్ని పోలీసు భద్రాతా సిబ్బంది ఎగురవేశారు. కర్రెగుట్ట కొండను నక్సలైట్ల నుండి విముక్తి చేయడానికి, 22,000 మంది సైనికులు 21 రోజులపాటు యాంటీ-నక్సల్ ఆపరేషన్ ప్రారంభించి 36మంది నక్సలైట్లను హతమార్చి అక్కడ బేస్ క్యాంపును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తడ్పల క్యాంప్ వద్ద 196 సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ 204వ బెటాలియన్ కోబ్రా సైనికులు మువ్వెన్నల జెండాను ఎగురవేశారు. కర్రెగుట్ట ప్రాంతాల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలుడులో 11మంది సైనికులు గాయపడ్డినప్పటికీ, సైనికులు ధైర్యంగా ఉండి నక్సలైట్ కోటపై త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేశారు. బీజాపూర్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలడంతో భద్రతా దళాలకు చెందిన 11మంది జవాన్లు తీవ్రంగా గాయపడగా, మరో పది మంది భద్రతా సిబ్బంది గాయాల నుంచి సురక్షితంగా బయటపడ్డారని, పేలుడులో గాయపడిన వారు ప్రాణహాని నుంచి బయటపడ్డారని ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి శర్మ తెలిపారు. ఐఈడి పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మన తెలంగాణ 26 Jan 2026 8:27 pm

రిపబ్లిక్ డే ఆఫర్.. రూ.26 వేలకే కారు

 రిపబ్లిక్ డే సందర్భంగా రూ.26 వేలకే పాత కారు అంటూ ఇచ్చిన సూపర్ బంపర్ ఆఫర్ చివరకు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా ప్రచారం చేసిన ఈ ఆఫర్‌ను నమ్మి హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి వందలాది జనం నాచారం, మల్లాపూర్‌లోని ట్రస్ట్ కార్స్ కార్యాలయాలకు రెండు రోజులుగా తరలివచ్చారు. ఒక దశలో రాత్రి వచ్చి ఇక్కడే నిద్రకు ఉపక్రమించారు. మరీ క్యూలో గంటల తరబడి వెయిట్ చేశారు. కానీ, ప్రచారంలో చెప్పినట్టుగా కార్లు ఇవ్వకపోవడం, కార్లు లేవని మోసానికి పాల్పడటంతో కొనుగోలుదారులు ఆగ్రహానికి గురయ్యారు. తమను మోసం చేశారంటూ ట్రస్ట్ కార్స్ కార్యాలయాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కొన్ని కార్లు, కార్యాలయాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాథమిక విచారణలో ఆఫర్ పేరుతో ప్రజలను ఆకర్షించి, స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా గందరగోళం సృష్టించినట్లు గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యుడిగా ట్రస్ట్ కార్స్ ఎండీని నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తక్కువ ధరకు కారు అనే ఆశతో వచ్చిన సామాన్య ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా ప్రకటనలపై నమ్మకం పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

మన తెలంగాణ 26 Jan 2026 8:20 pm

Canal water |రోడ్డుపై వృధాగా పోతున్న కడెం కెనాల్ నీరు….

Canal water | రోడ్డుపై వృధాగా పోతున్న కడెం కెనాల్ నీరు…. Canal

ప్రభ న్యూస్ 26 Jan 2026 8:17 pm

Why Vijayasai Reddy Turned Rebel Against YSRCP and His June Padayatra Plan

For years, Vijayasai Reddy was regarded as the sharp strategist and most trusted aide of the YS family. From the era of YS Rajasekhara Reddy to the rule of Y. S. Jagan Mohan Reddy, Vijayasai Reddy stood firmly beside the party leadership. He shared prison time with Jagan and emerged as the undisputed number two […] The post Why Vijayasai Reddy Turned Rebel Against YSRCP and His June Padayatra Plan appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 8:15 pm

Republic |పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు

Republic | పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు Republic | లక్షేట్టిపేట, ఆంధ్ర

ప్రభ న్యూస్ 26 Jan 2026 8:04 pm

అవినీతి పై సమగ్ర విచారణ నిర్వహించాలి

విశాలాంధ్ర – ధర్మవరం ; ధర్మవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సిడిపిఓ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని ఏఐటియుసి సిపిఐ నాయకులు సిడిపిఓ ప్రాజెక్ట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాలోని ధర్మవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారినిపై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి అని, దీనిపైన జిల్లా కలెక్టర్ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ , రాష్ట్ర ఐసిడిఎస్ […] The post అవినీతి పై సమగ్ర విచారణ నిర్వహించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 8:04 pm

VD14: పవర్‌ఫుల్‌గా.. విజయ్ సినిమా టైటిల్, గ్లింప్స్

హైదరాబాద్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘VD14’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. కాగా, సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు ‘రణబాలి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ఓ గ్లింప్స్‌ని కూడా విడుదల చేశారు. ఈ కథ స్వాతంత్ర్యం గురించి కాదని.. స్వాతంత్ర్యం ముందు జరిగిన ఓ చీకటి చరిత్ర గురించి అని గ్లింప్స్‌ ఆరంభంలో పేర్కొన్నారు. ఇక ఆ సమయంలో జరిగిన దారుణాల గురించి.. భారతదేశం నుంచి బ్రిటీషర్లు దోచుకెళ్లిన సంపద గురించి టీజర్‌లో చూపించారు. ఈ కథ 1878 ప్రాంతంలో జరిగినదిగా టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో సర్ థియోడర్ హెక్టర్‌గా ఆర్నాల్డ్ వోస్లో, జయమ్మగా రష్మిక మందన్న నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్-అతుల్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది.

మన తెలంగాణ 26 Jan 2026 8:00 pm

Vijay Deverakonda as Ranabaali: A Powerful Pre Story to the Revolutionary tale

Rowdy Vijay Deverakonda and director Rahul Sankrityan, previously collaborated for blockbuster Taxiwaala and now bringing a revolutionary tale VD14. The film titled Ranabaali is releasing in theatres on September 11th, 2026 across Pan India. The title was officially announced today with a powerful prelude that introduces the Cursed Land and its Hero, featuring striking visuals […] The post Vijay Deverakonda as Ranabaali: A Powerful Pre Story to the Revolutionary tale appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 7:56 pm

appreciation |ఉత్తమ ఉద్యోగిగా ఎన్నికైన సంగెం ఏఎస్ఐ

appreciation | ఉత్తమ ఉద్యోగిగా ఎన్నికైన సంగెం ఏఎస్ఐ appreciation | సంగెం,

ప్రభ న్యూస్ 26 Jan 2026 7:49 pm

High school |ఆలేరు ఎన్ సిసి విద్యార్థులకు అభినంద‌న‌లు

High school | ఆలేరు ఎన్ సిసి విద్యార్థులకు అభినంద‌న‌లు High school

ప్రభ న్యూస్ 26 Jan 2026 7:42 pm

Chiranjeevi’s warm gesture to Telugu Cinema Padma awardees

Megastar Chiranjeevi is known for his warmth and genuine emotional connect with everyone. He showcased once again why he is able to win hearts with his immaculate gesture. He personally visited Murali Mohan and Rajendra Prasad, who were Padma Shri, on this Republic Day to become a part of their celebrations. He got Padma Vibhushan […] The post Chiranjeevi’s warm gesture to Telugu Cinema Padma awardees appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 7:41 pm

Certificate |జిల్లాస్థాయి ఉత్తమ ఆర్డీవోగా శేఖర్ రెడ్డి …

Certificate | జిల్లాస్థాయి ఉత్తమ ఆర్డీవోగా శేఖర్ రెడ్డి … Certificate |

ప్రభ న్యూస్ 26 Jan 2026 7:33 pm

అమెరికా రహస్య ఆయుధం డిస్కోంబోబుటర్

అమెరికా వెనెజువెలాలో నిర్వహించిన సైనిక చర్యలో భాగంగా, యూఎస్ సైనికులు వాడిన రహస్య ఆయుధం పేరును ట్రంప్ ఎట్టకేలకు వెల్లడించారు. ఆ ఆయుధం పేరును డిస్కోంబోబుటర్ అని తెలిపారు. వెనెజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించినప్పుడు ఆ దేశపు సైనిక వ్యవస్థను స్థంభింపజేసేందుకు ఈ ఆయుధాన్ని ఉపయోగించినట్లు ట్రంప్ తెలిపారు. న్యూయార్క్ పోస్ట్ కి శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంగా మెక్సికోతో సహా డ్రగ్ ను వ్యాపింపజేసే దేశాలపై దాడులు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా వద్ద పల్స్డ్ ఎనర్జీ ఆయుధం ఉందనే నివేదికలపై వ్యాఖ్యానిస్తూ, ది డిస్కోంబోబుటర్ ఆ ఆయుధం అనీ, దాని గురించి మాట్లాడేందుకు తనకు అనుమతి లేదని పేర్కొన్నారు. వెనెజువెలా వద్ద చైనా, రష్యా కు చెందిన రాకెట్లు ఉన్నాయని, వారు ఎప్పుడూ ఉపయోగించలేదని పేర్కొన్నారు. తాము బటన్ నొక్కినప్పుడు ఆవి ఏవీ పనిచేయలేదని, అలాగే తాము ప్రయోగించిన ఆయుధం వల్ల కారకస్ లోదాదాపు అన్ని లైట్లు ఆగిపోయాయని పేర్కొన్నారు. అసలు అది ఎలా సాధించారో మాత్రం వివరించలేదు. తూర్పు ఫసిఫిక్ మహా సముద్రంలో మాదక ద్రవ్యాలను అక్రమ రవాణాచేస్తున్న పడవపై శుక్రవారం అమెరికా దాడి చేసింది. మదురు పట్టుబడిన తర్వాత ఇలాంటి దాడి చేయడం ఇదే తొలిసారి.

మన తెలంగాణ 26 Jan 2026 7:26 pm

దేశభక్తిని ప్రతి ఒక్కరూ చాటుకోవాలి

ఆర్డీవో మహేష్విశాలాంధ్ర – ధర్మవరం;; దేశభక్తిని ప్రతి ఒక్కరూ చాటుకోవాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కార్యాలయ అధికారులు, సిబ్బంది నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు మన దేశానికి స్వాతంత్రం తేవడం వల్లనే ఈరోజు మనం ఇలా ఉన్నామని వారు తెలియజేశారు. ఉద్యోగులందరూ తమ విధులను నిజాయితీతో, బాధ్యతతో సేవా భావంతో నిర్వర్తించాలని తెలిపారు. తదుపరి అందరికీ గణతంత్ర దినోత్సవ […] The post దేశభక్తిని ప్రతి ఒక్కరూ చాటుకోవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 7:22 pm

Minister |మధుసూదన్ రెడ్డి మృతి తీరని లోటు…

Minister | మధుసూదన్ రెడ్డి మృతి తీరని లోటు… Minister | వెబ్

ప్రభ న్యూస్ 26 Jan 2026 7:18 pm

WPL-2026: టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్‌సిబి

వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా బిసిఎ స్టేడియం వేదికగా హై టెన్షన్ మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సిబి జట్టు ముంబైని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ టోర్నమెంట్‌ ఆరంభ మ్యాచ్‌లో ముంబైని ఆర్‌సిబి చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని రాబట్టాలని స్మృతి మంధన సేన భావిస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు తప్పుకుండా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మ్యాచ్‌పై తారాస్థాయిలో ఉత్కంఠ నెలకొంది. తుది జట్లు: ముంబై: సజీవన్ సజన, హేలీ మ్యాథ్యూస్, నాట్ స్కీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమిలియా కెర్ర్, రహిలా ఫిర్దౌస్(కీపర్), అమంజోత్ కౌర్, సంస్కృతి గుప్తా, వైష్ణవి శర్మ, షబ్నిమ్ ఇస్మాయిల్, పూనమ్ ఖేమ్నార్. బెంగళూరు: గ్రేస్ హారిస్, స్మృతి మంధన(కెప్టెన్), జార్జియా వోల్, గౌతమి నాయక్, రిచా ఘోష్(కీపర్), రాధా యాదవ్, నదీన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్‌ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్.

మన తెలంగాణ 26 Jan 2026 7:15 pm

కూరగాయలు అమ్ముతున్న మహిళలపైకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి

రహదారి పక్కన కూరగాయలు అమ్ముతున్న మహిళలపైకి కారు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని  సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పెంటపాడు గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. పెంటపాడు గ్రామానికి చెందిన మహిళలు పాంగి సావిత్రి,కొర్ర సుశీల రహదారి పక్కన రోజూ కూరగాయలు అమ్ముతుంటారు. ఈ క్రమంలో రింతాడ గ్రామనికి చెందిన ఉపాధ్యాయుడు తన కారులో చింతపల్లి నుంచి రింతాడకు వెళ్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కొర్ర సుశీల ఘటనాస్థలిలోనే మృతి చెందింది. సావిత్రి తీవ్రంగా గాయపడింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 26 Jan 2026 7:11 pm

ముద్దాయి లకు అన్ని వసతులు కల్పించాలి

సీనియర్ సివిల్ జడ్జ్, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ టి. వెంకటేశ్వర్లు విశాలాంధ్ర – ధర్మవరం; పట్టణంలోని సబ్ జైల్లో గల ముద్దాయిలకు అన్ని వసతులు కల్పించేలా సబ్జైలర్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ టి. వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం జడ్జి ఆకస్మికంగా సబ్ జైలును తనిఖీ చేశారు. ఖైదీలు ఉండే గదులు పరిశీలించారు, తదుపరి ఖైదీలకు పెట్టే భోజనంను స్వయంగా వారు […] The post ముద్దాయి లకు అన్ని వసతులు కల్పించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 7:10 pm

At home |ఏపీ లోక్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం

At home | ఏపీ లోక్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం At home

ప్రభ న్యూస్ 26 Jan 2026 7:09 pm

Social service |మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదానం

Social service | మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదానం Social service |

ప్రభ న్యూస్ 26 Jan 2026 7:06 pm

భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం, పలువురు మిస్సింగ్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సౌత్ 24 పరగణాల జిల్లాలోని నజీరాబాద్ ప్రాంతంలో సోమవారం ఒక గిడ్డంగిలో సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవదహనమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. నరేంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేూసుకుంది. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. పన్నెండు అగ్నిమాపక యంత్రాలతో దాదాపు 7గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోలీస్, అగ్నిమాపక దళ బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టి కాలిపోయిన ముగ్గురి మృతదేహాలను వెలికితీశాయని.. మృతులను ఇంకా గుర్తించలేదని బరుయ్‌పూర్ పోలీస్ జిల్లా ఎస్పీ శుభేందు కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలోఆరుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం శిథిలాలు తొలగిస్తున్నారని.. పూర్తిగా తొలగించబడిన తర్వాత ఎంతమంది వాటి చిక్కుకున్నారో తెలుస్తుందని పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన విద్యుత్ మంత్రి అరూప్ బిశ్వాస్ మాట్లాడుతూ.. దట్టమైన పొగ కారణంగా గిడ్డంగి లోపల మరెవరైనా ఉన్నారో లేదో ధృవీకరించడం కష్టమైందని...పొగను బయటకు పంపడానికి గోడలను పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

మన తెలంగాణ 26 Jan 2026 6:59 pm

ఆ విషయంలో విరాట్ రికార్డును సమం చేసిన సంజూ

ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా గువాహటి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి-20లో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టును 153 పరుగులకే కట్టడి చేసిన టీం ఇండియా ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే చేధించింది. దీంతో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ని 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే భారత జట్టులో సంజూ శాంసన్ మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న సంజూ.. చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. తొలి టి-20లో 10 పరుగులు, రెండో టి-20లో 6 పరుగులు చేసి ఔట్ అయిన సంజూ.. మూడో మ్యాచ్‌లో ఏకంగా తొలి బంతికే ఔటై.. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో జట్టులో అతడి స్థానంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ క్రమంలో సంజూ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టి-20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డక్‌లుగా వెనుదిరిగిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. విరాట్ మొత్తం ఏడుసార్లు గోల్డెన్ డక్‌ కాగా.. సంజూ కూడా 7 సార్లు తొలి బంతికే ఔట్ అయ్యాడు. విరాట్‌ ఈ అవాంఛిత రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్‌లు తీసుకుంటే, శాంసన్‌ కేవలం 47 మ్యాచ్‌ల్లోనే ఈ అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ లిస్ట్‌లో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ 151 మ్యాచుల్లో మొత్తం 12 సార్లు గోల్డెన్‌ డక్‌ ఔట్ అయ్యాడు.

మన తెలంగాణ 26 Jan 2026 6:57 pm

24k gold |ధరలు రికార్డు స్థాయిలో.. ఇప్పుడే కొనాలా? పెళ్లిళ్ల సీజన్ ముందు నిపుణుల కీలక విశ్లేషణ

24k gold |బంగారం ధరల పెరుగుదల: పెట్టుబడిదారులకు హెచ్చరికా? అవకాశమా? 24k gold

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:54 pm

Klavakuntla Kavitha : కవిత విమర్శలకు కౌంటర్ ఇవ్వకపోతే ఎలా.. బీఆర్ఎస్ లో అంతర్మధనం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు పంటి కింద రాయిలా మారారు

తెలుగు పోస్ట్ 26 Jan 2026 6:47 pm

MLA |ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ప్రజలతోనే ఉంటా….

MLA | ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ప్రజలతోనే ఉంటా…. MLA |

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:47 pm

Award |వ్య‌వ‌సాయ అధికారికి ఉత్త‌మ పుర‌స్కారం…

Award | వ్య‌వ‌సాయ అధికారికి ఉత్త‌మ పుర‌స్కారం… Award | దండేపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:40 pm

ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె

ఫిబ్రవరి 12వ తేదీన దేశ వ్యాప్తంగా జరుగుతున్న జాతీయ సమ్మెకు తెలంగాణ ఎన్జీఓల సంఘం మద్ధతు ఇస్తుందని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జిఈఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడు టిఎన్జీఓ సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ముజీబ్‌హుస్సేనీలు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారని కేంద్రం తీసుకుంటున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఈ పోరాటాలు చేస్తున్నామని వారు తెలియజేశారు. అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ సమావేశాలు మహారాష్ట్రలోనీ షిర్డీలో మూడురోజుల పాటు జరిగాయి. ఈ సమావేశంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ తరపున మారం జగదీశ్వర్, ముజీబ్‌హుస్సేనీలు పాల్గొని దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. దేశవ్యాప్తంగా ఉద్యోగ,ఉపాధ్యాయ కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ సమావేశంలో చర్చించి వాటి పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని తీర్మానించారు. సమావేశాల అనంతరం జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో భాగంగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జిఈఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడిగా టిఎన్జీఓ సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్‌హుస్సేనీ, కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశాలు జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబ, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీ కుమార్ నేతృత్వంలో జరిగాయి. తెలంగాణ నుంచి నలుగురికి జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

మన తెలంగాణ 26 Jan 2026 6:39 pm

ఫోన్ ట్యాపింగ్ కేసు.. మాజీ ఎంపి సంతోష్‌కు నోటీసులు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రధాన రాజకీయ నాయకులు, అధికారుల ఫోన్లు బిఆర్ఎస్ హయాంలో ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు దీనిపై సిట్ విచారణ జరుపుతోంది. తాజాగా ఈ కేసులో బిఆర్ఎస్ మాజీ ఎంపి సంతోష్ కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను సిట్ విచారించిన విషయం తెలిసిందే. తాజాగా సంతోష్‌కు కూడా నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 

మన తెలంగాణ 26 Jan 2026 6:35 pm

Little Hans |లక్ష్యంతో ఉన్నత శిఖరాలను అధిగమించాలి

Little Hans | లక్ష్యంతో ఉన్నత శిఖరాలను అధిగమించాలి Little Hans |

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:35 pm

School |ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని పెంపొందించుకోవాలి

School | ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని పెంపొందించుకోవాలి School | చిట్యాల,

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:31 pm

సంతోష్ రావుకు సిట్ నోటీసులు

బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు

తెలుగు పోస్ట్ 26 Jan 2026 6:27 pm

Cultural |ఘనంగా ప్రారంభమైన శ్రీధం.. 2026

Cultural | ఘనంగా ప్రారంభమైన శ్రీధం.. 2026 Cultural | హసన్ పర్తి,

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:23 pm

విజయవాడ వెళుతుండగా బస్సు డ్రైవర్ కు గుండెపోటు

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ నాగరాజుకు గుండెనొప్పితో మరణించారు

తెలుగు పోస్ట్ 26 Jan 2026 6:17 pm

Collector |అవార్డులు అందజేసిన కలెక్టర్

Collector | అవార్డులు అందజేసిన కలెక్టర్ Collector | ఆలేరు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:11 pm

Lokesh Kanagaraj finally responds about Kaithi 2

Lokesh Kanagaraj emerged as a top director after the release of Kaithi. He went on to direct top stars like Kamal Haasan, Rajinikanth and Vijay. The sequel for Kaithi 2 was announced but the project got delayed because of the priorities of Lokesh Kanagaraj. The talented director has announced his next film with Allu Arjun […] The post Lokesh Kanagaraj finally responds about Kaithi 2 appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 6:09 pm

మంత్రి లోకేశ్ తో వైసీపీ నేత బొత్స భేటీ

ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది.

తెలుగు పోస్ట్ 26 Jan 2026 6:07 pm

పని మనిషిపై అత్యాచారం.. ‘దురంధర్’ నటుడు అరెస్ట్

ముంబై: అత్యాచారం కేసులో ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన ‘దురంధర్’ చిత్రంలో నటించిన నదీమ్ ఖాన్‌ అరెస్ట్ అయ్యాడు. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాల్వానీ పోలీసులు నదీమ్‌ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. 41 ఏళ్ల ఓ మహిళ నదీమ్ ఇంట్లో 2015 నుంచి పని చేస్తోంది. పెళ్లి చేసుకుంటానని అతడు నమ్మించాడు. కానీ, ఆమె వివాహం గురించి ఎన్నిసార్లు అడిగినా నదీమ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. నదీమ్ పలుమార్లు అత్యాచారం చేశా చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ మహిళ ఆరోపణలు ధృవీకరించామని, ఈ మేరకు అరెస్ట్ చేశామని పోలీసు అధికారి వెల్లడించారు.

మన తెలంగాణ 26 Jan 2026 6:06 pm

Indervelly |ఘనంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు

Indervelly | ఘనంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు Indervelly | ఇంద్ర‌వెల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:01 pm

Parade |గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…

Parade | గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు… Parade | ముధోల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:01 pm

టీ20 వరల్డ్ కప్.. భారత్‌-పాక్ మ్యాచ్ రద్దు?

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ కూడా ఈ మెగా టోర్నీని బాయ్ కాట్  చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీ20 ప్రపంచ కప్‌ 2026లో పాకిస్థాన్ జట్టు పాల్గొనడానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టోర్నీలో ఆడటానికి అనుమతి ఇచ్చినా.. టీమిండియాతో జరిగే మ్యాచ్‌ను పాక్ బహిష్కరించాలని భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. టోర్నీ లో భాగంగా ఫిబ్రవరి 15న కొలోంబో వేదికగా భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది  అయితే, బంగ్లాదేశ్ బాటలోనే మొదట మొత్తం టోర్నమెంట్ నుండి వైదొలగాలనే నిర్ణయానికి వచ్చినట్లు పాకిస్తాన్ స్థానిక మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు టీమిండియాతో జరిగే మ్యాచ్‌ను మాత్రమే పాక్ బహిష్కరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై PCB చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పందించలేదు. టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పాల్గొనాలా? వద్దా? అనేది ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని.. ప్రధాన మంత్రి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున తుది నిర్ణయం తీసుకోలేదని నఖ్వీ తెలిపాడు. దీంతో టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. ఇదిలావుంటే.. బంగ్లాదేశ్ వివాదం తర్వాత పాకిస్తాన్ ఐసిసి ఆదాయ వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ద్వారా ఎక్కువ డబ్బు వస్తుంది. ఒకవేళ ఇండియాతో మ్యాచ్ ని బహిష్కరిస్తే.. ఐసిసికి భారీగా నష్టం జరుగుతుంది. అయితే, 2026 టి20 ప్రపంచ కప్ లో ఏదైనా మ్యాచ్ ని బహిష్కరించడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ పై ఐసిసి భారీ శిక్ష విధించే అవకాశం ఉంది. కాగా, పాకిస్తాన్ ఇప్పటికే టోర్నమెంట్ కోసం తమ జట్టును ప్రకటించింది. కీలక ప్లేయర్లు ఏస్ పేసర్ హరిస్ రౌఫ్, మహ్మద్ రిజ్వాన్ లను జట్టు నుంచి తొలగించారు. పాకిస్థాన్ జట్టు: సల్మాన్ అలీ అఘా (c), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మహ్మద్ నఫాయ్ (wk), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (wk), సయీమ్ అయూబ్, షహద్ ఖాన్, U షహద్ ఖాన్, U షాద్ ఖాన్ తారిఖ్.

మన తెలంగాణ 26 Jan 2026 5:56 pm

Urkonda |ఉత్తమ సేవా అవార్డు అందుకున్న…

Urkonda | ఉత్తమ సేవా అవార్డు అందుకున్న… Urkonda | ఊర్కొండ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:54 pm

Award |ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా శ్రీనివాస్

Award | ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా శ్రీనివాస్ Award | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:54 pm