‘ఫౌజీ’ షూటింగ్లోప్రభాస్కు స్వల్ప గాయాలు
హైదరాబాద్: హను రాఘవపూడి దర్శ కత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఫౌజీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీక రిస్తుండగా గుర్రం నుంచి అదుపు తప్పి ప్రభాస్ కింద పడ్డాడు. దీంతో చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలియ గానే అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఇది చిన్న గాయమేనని, ప్రభాస్ త్వరలోనే కోలుకుని షూటింగ్ కొనసాగిస్తా రని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ […] The post ‘ఫౌజీ’ షూటింగ్లోప్రభాస్కు స్వల్ప గాయాలు appeared first on Visalaandhra .
విజయ్-రష్మికపెళ్లి ముహూర్తం ఖరారు
హైదరాబాద్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నల పెళ్లి గురించి కొన్నాళ్లుగా వరుస వార్తలు వైరల్ అవుతున్న సంగతి విదితమే. అయితే ఈ సారి ఏకంగా వారి వివాహ నిశ్చయ తాంబూలాల ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వెడ్డింగ్ కార్డ్ ప్రకారం, వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26, 2026న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక ప్రైవేట్ వేడుకగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సినీ రాజకీయ ప్రముఖుల కోసం […] The post విజయ్-రష్మికపెళ్లి ముహూర్తం ఖరారు appeared first on Visalaandhra .
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి సినిమా ‘విశ్వంభర’పై పడింది. భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ, వీఎఫఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. గతంలో విడుదలైన టీజర్పై అంతగా సానుకూల స్పందన రాకపోవడంతో సీరియస్గా తీసుకున్న చిత్ర బృందం, ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని అందించేలా సీజీ వర్క్ను […] The post విశ్వంభర ‘ట్రైలర’ సిద్ధం appeared first on Visalaandhra .
హైదరాబాద్: టాలీవుడ్లో ఇటీవల సెన్సార్ బోర్డు ఆంక్షలతో దర్శకనిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల విడుదలైన సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రానికి టైటిల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో దానికి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. టైటిల్ను ‘ఫ్రెండ్లీ కపుల’గా మార్చాలని బోర్డు సూచించినా, చిత్ర యూనిట్ మాత్రం అందుకు నిరాకరించింది. గత నెలలో కూడా ‘వానర’ అనే చిన్న సినిమా టైటిల్ను ‘వనవీర’గా మార్చాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే కోవలో సుహాస్, శివాని నగరం జంటగా […] The post సుహాస్ సినిమా పేరు మార్పు appeared first on Visalaandhra .
టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ మాజీల ఆగ్రహం
ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలైన పాకిస్థాన్ జట్టు, జట్టు మేనేజ్మెంట్పై ఆ దేశానికి మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం కొలంబోలో జరిగిన టీమిండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీనిపై షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ… నాకే అధికారం ఉంటే బాబర్, షాబాద్, షాహీన్ను జట్టులోకి తీసుకోనని స్పష్టం చేశాడు. వారికి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చినప్పటికీ వరుసగా విఫలమవుతున్నారన్నాడు. పాక్ […] The post టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ మాజీల ఆగ్రహం appeared first on Visalaandhra .
సహచరులకు కెప్టెన్ సూర్య సందేశంన్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్ గ్రూప్ఎ లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన భారత్పాకిస్థాన్ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆటగాళ్లకు ఇచ్చిన సూచనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సహచరులకు స్పష్టంగా చెప్పిన […] The post మాటలొద్దు… చేతలు చూపండి appeared first on Visalaandhra .
ఇమ్రాన్ను కలిసేందుకు వైద్యుల్ని అనుమతించట్లేదు
మాజీ ప్రధాని సోదరి అలీమా ఆగ్రహంఇస్లామాబాద్: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, జైలులో ఆయన పట్ల షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని ఇమ్రాన్ సోదరి అలీమా ఖానుమ్ మండిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ 800 రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న క్రమంలో తన సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై అలీమా ఖానుమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇమ్రాన్ఖాన్కు అతడి వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఆసిమ్ యూసుఫ్తో ఒక కుటుంబ సభ్యుడి సమక్షంలో చికిత్స అందించాలని […] The post ఇమ్రాన్ను కలిసేందుకు వైద్యుల్ని అనుమతించట్లేదు appeared first on Visalaandhra .
వెస్ట్ బ్యాంక్పై ఇజ్రాయిల్ కన్ను
టెలఅవివ్: పశ్చిమాసియాలో మరోమారు తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గజాపై ఇజ్రాయిల్ మారణీVAమం సష్టిస్తోంది. మరోపక్క ఇరాన్-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ మెత్తబడిందో లేదో ఇప్పుడు ఇజ్రాయిల్ మరో దుశ్చర్యకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద భూమి వెస్ట్ బ్యాంక్ను విలీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. వెస్ట్ బ్యాంక్ను స్వాధీనం చేసుకునేందుకు నెతన్యాహు ప్రభుత్వ అడుగులు పడుతున్నాయనేందుకు తాజా పరిణామాలే నిదర్శనం. ఇప్పటికే వెస్ట్ బ్యాంక్లో అధికారిక భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను […] The post వెస్ట్ బ్యాంక్పై ఇజ్రాయిల్ కన్ను appeared first on Visalaandhra .
సూడాన్లో 3 రోజుల్లో6 వేల మంది ఊచకోత
. పారామిలిటరీ ఘాతుకం. ఐరాస సంచలన నివేదిక న్యూయార్క్: సూడాన్లో పారామిలిటరీ దళాలు సృష్టించిన మారణకాండపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) సంచలన నివేదిక విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ చివరిలో దార్ఫుర్ ప్రాంతంలో కేవలం మూడు రోజుల్లోనే రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆరఎసఎఫ్) దళాలు 6వేల మందికి పైగా పౌరులను అత్యంత క్రూరంగా హతమార్చినట్లు తెలిపింది. ఈ హింస దిగ్భ్రాంతికరంగా ఉందని, ఇవి యుద్ధ నేరాలు, మానవత్వంపై ఘోరాలతో సమానమని ఐరాస మానవ హక్కుల కార్యాలయం తన నివేదికలో […] The post సూడాన్లో 3 రోజుల్లో6 వేల మంది ఊచకోత appeared first on Visalaandhra .
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సును నేడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ హైటెక్స్లో జరగబోయే బయోఏషియా-2026 సదస్సు ఈ నెల 17, 18 తేదీల్లో రెండు రో జుల పాటు జరుగనుంది. ఈ ప్రపంచ స్థా యి సదస్సు ప్రధానంగా ‘టెక్బయో అన్లీష్డ్ - ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వ స్తున్న విప్లవాత్మక పరిణామాలు’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్నారు. టెక్బయో ఇన్నోవేషన్స్లో దేశం గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో లైఫ్ సైన్సెస్ రంగంలో భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ సంబంధించిన అంశాలపై ఈ సదస్సు చర్చించనుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏర్పాటు చేసే అంతర్జాతీయ ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం బయోఏషియా సదస్సును ప్రారంభించి ఆయన ప్రసంగిస్తారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు, బయో సైన్సెస్ రంగంలో నిష్ణాతులు ఆయా అంశాలపై ప్రసంగించనున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్, అమెరికాకు చెందిన ఆమ్జెన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ హోవర్డ్ వై చాంగ్ కీలకోపన్యాసం చేయనున్నారు. సైన్స్, సాఫ్ట్వేర్ అండ్ సప్లయ్, నెక్స్ట్ జనరేషన్ బయోలాజిక్స్, ఫార్మా, బయోటెక్ భవిష్యత్, ఏఐ, ఆర్ అండ్ డి (డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్), గ్లోబల్ ఇంపాక్ట్, తెలంగాణ రైజింగ్ 2047 -వరల్డ్-క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ వంటి కీలక అంశాలపై జరిగే చర్చల్లో వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు పాల్గొంటారు.
మంగళవారం రాశి ఫలాలు (17-02-2026)
మేషరాశి రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో ఆర్థిక లబ్ది కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృషభం చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అధికారులతో చికాకులు కలుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. మిధునం కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. కర్కాటకం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సింహం వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సకాలంలో అందుతాయి. కన్య ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి. తుల వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. వృశ్చికం వ్యాపార వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ధనస్సు గృహమున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి ఉన్నత పదవులు పొందుతారు. మకరం నూతన గృహ వాహన యోగం ఉన్నది. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సహకార విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. కుంభం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. మీనం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనల వలన వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.
. జనగణనలో కులగణన. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమం. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ విశాలాంధ్ర`కాకినాడ: ప్రజాసమస్యలపై పోరుబాట పట్టాలని, సీపీఐని రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా నడిపించాలని, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం జనగణనలో కుల గణన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బీసీ కులాలు ఐక్యంగా సమరశీల […] The post ప్రజా సమస్యలపై పోరుబాట appeared first on Visalaandhra .
కడుపు కాల్చుకుంటూనేబిడ్డల కడుపునింపి…
. కుక్లు, కమాటీల జీవితాలు దుర్భరం. మూడు నెలలుగా అందని జీతాలు. ఏజెన్సీల కమీషన్ల దందా… చేతికందని వేతనం. పూట గడవక పస్తులు. బీసీ హాస్టళ్లలో కొత్త తరహా వెట్టిచాకిరీ. జోక్యం చేసుకోవాలంటూ పాలకులకు వినతి విశాలాంధ్ర – సచివాలయం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ బిడ్డల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాష్ట్రంలో బీసీ హాస్టళ్లలో చదువుకునే పిల్లల కడుపు నింపేందుకు ప్రభుత్వం ‘మెనూ’ మార్చింది. నాణ్యమైన భోజనం అందించాలని సంకల్పించింది. ఇంతవరకు బాగానే […] The post కడుపు కాల్చుకుంటూనేబిడ్డల కడుపునింపి… appeared first on Visalaandhra .
జేఈఈ మెయిన్స్ ఫలితాలు వచ్చేశాయ్…
ముగ్గురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్ . ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒకరు. దేశవ్యాప్తంగా 12 మంది టాపర్లు న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ 2026 జనవరి సెషన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తాను మరోసారి చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన 12 మంది టాపర్ల జాబితాలో ముగ్గురు […] The post జేఈఈ మెయిన్స్ ఫలితాలు వచ్చేశాయ్… appeared first on Visalaandhra .
ఈ నెల 18న ఢిల్లీకి సిఎం రేవంత్రెడ్డి
ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్కు హాజరు మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొంటారు. న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా నిర్వహిస్తోన్న ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సోమవారం ఘనంగా ప్రారంభ మైంది. ఫిబ్రవరి 16 నుండి 20 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) వల్ల కలిగే మార్పులు, అవకాశాలు, సవాళ్లపై ప్రపంచ స్థాయి చర్చలకు ఈ సమ్మిట్ వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎఐ వినియోగం, భద్రత, సహకారం కోసం ఒక ఉమ్మడి మార్గదర్శకాన్ని ప్రకటించడం ఈ సదస్సు ముఖ్య లక్ష్యంగా ఉంది. ఉద్యోగాల్లో వస్తున్న మార్పుల నుండి పిల్లల భద్రత వరకు ఎఐ ప్రభావం చూపే అన్ని కీలక అంశాలపై ఇందులో చర్చించనున్నారు. ఈ సదస్సులో దాదాపు 30 దేశాల నుండి 2.5 లక్షల మంది సందర్శకులు పాల్గొంటారని అంచనా. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, బ్రిటన్ సహా 13 దేశాలు ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేశాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలు భారత్లో దాదాపు 68 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, ఈ సదస్సు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్మాన్, ముఖేష్ అంబానీ వంటి దిగ్గజాలు ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతును ప్రపంచ ఎఐ వేదికపై బలంగా వినిపించాలని భారత్ భావిస్తోంది.
దేశం పరువు తీశారు.. పాక్ జట్టుపై మాజీలు ఫైర్
లాహోర్: భారత్తో జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్లో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ టీమ్ పై విమర్శల వర్షం కురుస్తోంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ ఎలాంటి పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. జట్టు ప్రదర్శనపై పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, మహ్మద్ యూసుఫ్, జావేద్ మియాందాద్ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేలవమైన ప్రదర్శనతో దేశ పరువును తీశారని ఆగ్రహ్రం వ్యక్తం చేశారు. బాబర్ ఆజమ్, కెప్టెన్ సల్మాన్ ఆఘా, షహీన్ అఫ్రిది తదితరులపై వారు దుమ్మెత్తి పోశారు.
రేపు విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం విశాఖపట్నం రానున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయుధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలి హోదాలో రాష్ట్ర పతి ఈ విన్యాసాలను సమీక్షిస్తారు. అంతర్జాతీయ నౌకాదళ ప్రతినిధులు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలు ఒకచోటకి చేరి తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడమే ఐఎఫ్ఆర్ ముఖ్య ఉద్దేశం. మంగళవారం రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందుతో ఐఎఫ్ఆర్-2026 కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన యాంకరేజ్ ప్రాంతంలో భారత్తో పాటు స్నేహపూర్వక దేశాలకు చెందిన సుమారు 70 యుద్ధనౌకల ఫ్లీట్ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ఈ కార్యక్రమంలో ఎపి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొంటారు. దేశాల మధ్య సముద్రయాన శక్తిని, సహకారాన్ని, స్నేహాన్ని ప్రదర్శించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని భారత నౌకాదళం తెలిపింది. ఈసారి ఐఎఫ్ఆర్లో ’ఆపరేషన్ సిందూర్’ హీరో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ’ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్ నౌకాదళాన్ని కట్టడి చేయడంలో ఈ యుద్ధనౌక వ్యూహాత్మకంగా కీలకపాత్ర పోషించింది. మిత్ర దేశాల నౌకాదళాలు ఈ విమాన వాహక నౌకను సమీపం నుంచి పరిశీలించనున్నాయి. ఈసారి విశాఖ కేవలం ఐఎఫ్ఆర్కే కాకుండా మరో రెండు కీలక కార్యక్రమాలకు కూడా వేదికైంది. భారత నౌకాదళం ఆధ్వర్యంలో 13వ ఎడిషన్ మిలాన్-2026, హిందూ మహాసముద్ర నౌకాదళ సింపోజియం సదస్సు కూడా ఇక్కడే జరుగుతున్నాయి. 135కి పైగా దేశాలను మిలాన్ విన్యాసాలకు ఆహ్వానిం చారు. భారత్ ఈ మూడు ప్రధాన సముద్రయాన కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించడం ఇదే ప్రప్రథమం. భారత్లో తొలి ఐఎఫ్ఆర్ను 2001లో ముంబైలో నిర్వహించగా, అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ సమీక్షించారు. రెండోసారి 2016లో విశాఖపట్నంలో నిర్వహించగా, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఇప్పుడు మూడోసారి జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా భారత నౌకాదళ శక్తి, అంతర్జాతీయ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
34 స్కూళ్లకు బాంబు బెదిరింపు..
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్, వడోదరలో మొత్తం 34 స్కూళ్లకు సోమవారం ఉదయం ఈ మెయిళ్ల ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే ఆ స్కూళ్లను ఖాళీ చేయించామని పోలీసులు చెప్పారు. ఖలిస్థాన్ మద్దతుదారులమని బెదిరింపులు రావడంతో బాంబు తనిఖీ స్కాడ్లు రంగం లోకి తనిఖీ చేపట్టగా అవి ఉత్తవే అని తేలిందని పోలీస్ డిజిపి రాహుల్త్రిపాఠీ చెప్పారు. ఈ మెయిళ్లు ఎక్కడ నుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదే విధంగా జనవరి 23న అహ్మదాబాద్ లోని అనేక స్కూళ్లకు బెదిరింపులు రాగా ఉత్తవేనని తేలిందన్నారు.
టి20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియాకు లంక షాక్
పల్లెకెలె: టి20 వరల్డ్కప్లో ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. సోమవారం శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో సూపర్8 అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక 8 వికెట్ల తేడాతో కంగారూలను ఓడించిన శ్రీలంక సూపర్8కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. మిఛెల్ మార్ష్ (54), ట్రావిస్ హెడ్ (56)లు రాణించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన లంక 18 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా 52 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. కుశాల్ మెండిస్ (51), పవన్ (28) నాటౌట్ తమవంతు పాత్ర పోషించారు.
ఆన్లైన్ బెట్టింగ్లో భారీ మోసం..రూ.1.5 కోట్లు కోల్పోయిన హైదరాబాద్ వ్యాపారి
వాట్సాప్ ప్రకటనలతో ఉచ్చులోకి లాగిన ముఠాలాభాల పేరుతో సైట్లు మార్చుతూ డబ్బు దోచుకున్న నిందితులు
ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
జెరూసలెం: ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటిస్తారు. ఆదివారం మేజర్ అమెరికన్ జ్యూయిష్ ఆర్గనైజేషన్ల అధ్యక్షుల సదస్సు లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మొదట మోడీ పర్యటన గురించి ప్రకటించారు. ఇజ్రాయెల్ భారత్ మధ్య అద్భుతమైన మైత్రి ఉందని, అన్ని విధాలైన సహకార సమన్వయంపై తాము చరిస్తామని నెతన్యాహు పేర్కొన్నారు. ఇప్పుడు భారత్ చిన్న దేశం కాదని, 1.4 బిలియన్ జనాభా ఉన్న అత్యంతశక్తివంతమైన దేశమని, నెతన్యాహు ప్రస్తావించారు. తన పర్యటనలో మోడీ ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోడీ ద్వైపాక్షిక, ప్రాంతీయ ప్రయోజనాల అంశాలను చర్చిస్తారు. 2017లో మొదటిసారి మోడీ ఇజ్రాయెల్ లో పర్యటించగా, ఇది రెండో పర్యటన అవుతుంది.
న్యూస్క్లిక్, ఎడిటర్లకు రూ.184 కోట్ల ఇడి పెనాల్టీ..
న్యూఢిల్లీ: న్యూస్పోర్టల్ న్యూస్క్లిక్కు,దాని ఎడిటర్ ఇన్ చీఫ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ.184 కోట్ల విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద సోమవారం పెనాల్టీ విధించింది. న్యూస్క్లిక్కు రూ.120 కోట్లు, ఎడిటర్ ఇన్ఛార్జి ప్రబీర్ పురకాయస్థకు రూ. 64 కోట్లు మొత్తం రూ. 184 కోట్లు పెనాల్టీ విధించినట్టు వివరించింది. చట్టం నిబంధనలు ఉల్లంఘించడం, నిధుల వినియోగం తప్పుగా చూపించడంతో ఈ పెనాల్టీ విధించినట్టు ఇడి పేర్కొంది. అయితే దీనిపై న్యూస్క్లిక్ ఇంకా స్పందించ లేదు. మనీ లాండరింగ్ కేసు కింద 2021లో మొదటిసారి న్యూస్క్లిక్పై ఇడి దాడి చేసింది. గ్లోబల్ నెట్వర్క్లో భాగంగా ప్రారంభమైన ఈపోర్టల్ అమెరికా బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘం నుంచి నిధులు పొందుతోందని, చైనా ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తోందని బీజేపీ 2023లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
రేవంత్ రెడ్డిపై కేసు కొట్టివేత సబబే: సుప్రీంకోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో విజయం దక్కింది. రేవంత్ రెడ్డిపై 2016లో దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసే పిటిషన్ను అత్యుత్తమ న్యాయస్థానం తోసిపుచ్చింది. అప్పట్లో రేవంత్ రెడ్డిపై ఎస్సి/ ఎస్టి యాక్ట్, ఐపిసి పరిధిలో కేసు దాఖలు అయింది. దీనిపై హైకోర్టు వెలువరించిన తీర్పు సముచితమే అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జాయ్మాల్యా, విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు పూర్వాపరాలను హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. కేసులో రెండవ ప్రతివాదిగా పేర్కొన్న రేవంత్ రెడ్డిపై కేసు దాఖలుకు ఎటువంటి ప్రాధమిక సాక్షాధారాలు లేవని గుర్తించారు. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన రూలింగ్ సరైనదే అని అభిప్రాయపడుతున్నామని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో తాము ముఖ్యమంత్రికి క్లీన్చిట్ ఇస్తున్నట్లు భావించరాదు. అయితే నిజానిజాల నిర్థారణల తరువాత హైకోర్టు రూలింగ్ సరైనదిగా ఉందని స్పష్టం అవుతోందని ధర్మాసనం పేర్కొంది. ఏది ఏమైనా రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి న్యాయస్థానాలు వేదికలు కారాదని ఈ పందర్భంగా పార్టీలకు సిజెఐ చురకలు పెట్టారు. ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ను గత ఏడాది జులై 17న రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2016లో గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఎస్సి మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్తో సంబంధం ఉన్న ఎన్ పెద్దిరాజు రేవంత్రెడ్డిపై కేసు దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే అప్పట్లో ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, ఇతరులు గోపన్నపలి గ్రామంలోని సొసైటీ భూమిని కబ్జా చేశారని, కులం పేరిట తిట్టి, అక్కడున్న రూంలను కూలగొట్టారని ఫిర్యాదు చేశారు. తనపై దాఖలు అయిన కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ దశలో రేవంత్ రెడ్డి పాత్ర తెలిపే సాక్షాధారాలు లేవని పేర్కొంటూ ఆయనపై ఎప్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదించారు. వ్యాజ్యానికి దిగిన వ్యక్తి తరచూ దురుసుగా వ్యవహరించే రకం అని, గతంలో ఈ కేసుకు సంబంధించి హైకోర్టు జడ్జిపై కూడా పలు ఆరోపణలు చేశారని వివరించారు. అన్ని విషయాలను పరిశీలించి సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డిపై ఎప్ఐఆర్ కొట్టివేతను సమర్థించింది. ఇటువంటి కేసులు సుప్రీంకోర్టుకు తీసుకురావద్దని పిటిషనర్ను మందించింది.
Festiva l వైభవంగా దుర్గా నాగేశ్వర స్వామి రథోత్సవం..
Festiva l వైభవంగా దుర్గా నాగేశ్వర స్వామి రథోత్సవం.. Festiva l మోపిదేవి,
మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత
మార్చి 3న (సోమవారం) సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు 9 గంటల పాటు మూసివేయనున్నారు.మార్చి 3 ఉదయం 8:00 గంటలకు తలుపులు మూసివేస్తారు.గ్రహణ సమయం ఉదయం 11:34 నుండి మధ్యాహ్నం 3:23 వరకు.గ్రహణానంతరం శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి, సాయంత్రం 5:00 గంటలకు తిరిగి తలుపులు తెరుస్తారు.గ్రహణం కారణంగా ఆ రోజున బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (Rs. 300) మరియు ఇతర ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రద్దు చేసింది. ఆలయం మూసి ఉన్న సమయంలో అన్నప్రసాద వితరణ కూడా నిలిపివేయబడుతుంది.ఆలయం తెరిచిన తర్వాత కేవలం సర్వదర్శనం (ధర్మ దర్శనం) భక్తులను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది.గ్రహణం రోజున తిరుమల వెళ్లాలనుకునే వారు ఈ సమయాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది.
Book |శ్రీనివాసునికి బొల్లినేని కృష్ణయ్య శ్రీమాలిక కానుక !
Book | శ్రీనివాసునికి బొల్లినేని కృష్ణయ్య శ్రీమాలిక కానుక ! ప్రముఖ రచయిత
హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు బిజెపి అధ్యక్షుడు నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. తాను అలా మాట్లాడడం తప్పేనని, అనవసరంగా నోరు జారనని సోమవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇటీవల నాగేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ.. టివికె చీఫ్, నటుడు విజయ్కు రాజకీయాలు తెలియవని, త్రిష తో ఉన్న బంధం నుంచి బయటకు రావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుండగా త్రిష కూడా నాగేంద్రన్ పేరు ఎత్తకుండానే పరోక్షంగా స్పందించారు. తన లాయర్ తరపున సోషల్ మీడియాలో సోమవారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి అలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి ఎలా లాగుతారని నిలదీశారు. తన క్లయింట్కు రాజకీయాలతో సంబంధం లేదని, మున్ముందు కూడా ఉండబోదని తెలిపారు. త్రిష పేరును సంబంధం లేని అంశాల్లోకి లాగడం సరైంది కాదన్నారు.
Vision |విజన్ 2047 వైపు దూసుకెళ్తున్న బడ్జెట్…
Vision | విజన్ 2047 వైపు దూసుకెళ్తున్న బడ్జెట్… Vision | విజయవాడ,
Ashika’s Glamour Show brings No New Offers
Kannada beauty Ashika Ranganath made her debut in Telugu cinema with Nagarjuna’s Naa Saami Ranga and the actress was seen in a traditional role. She bagged an opportunity in Megastar Chiranjeevi’s Vishwambara which is due for release. The actress surprised everyone with her glamour show in Ravi Teja’s recent offering Bhartha Mahasayulaku Wignyapthi. Right from […] The post Ashika’s Glamour Show brings No New Offers appeared first on Telugu360 .
SK’s Seyon First Look: Fierce, Yet Divine
Kannada beauty Ashika Ranganath made her debut in Telugu cinema with Nagarjuna’s Naa Saami Ranga and the actress was seen in a traditional role. She bagged an opportunity in Megastar Chiranjeevi’s Vishwambara which is due for release. The actress surprised everyone with her glamour show in Ravi Teja’s recent offering Bhartha Mahasayulaku Wignyapthi. Right from […] The post SK’s Seyon First Look: Fierce, Yet Divine appeared first on Telugu360 .
Poxo |నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
Poxo | నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
feb14thshiva-lingam |గట్టు గూడెం గుట్టపై వెలిసిన శివలింగం
feb14thshiva-lingam | భక్తులకు అడ్డంకులు, బీజేపీ ఆధ్వర్యంలో పూజలు feb14thshiva-lingam | దేవుణ్ణి
చెలరేగిన హెడ్, మార్ష్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?
పల్లెకెలె: టి20 వరల్డ్ కప్ 2026లో భాగంగా శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఆసీస్, శ్రీలంక జట్టుకు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు ఓపెనర్స్. మిచెల్ మార్ష్ (54, 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు), ట్రావిస్ హెడ్ (56, 29 బంతుల్లో 7 ఫోర్లు, 3సిక్సులు) అర్ధ శతకాలతో చెలరేగారు. దీంతో వీరిద్దరూ తొలి వికెట్ కు 104 పరుగులతో శతక భాగస్వామ్యాన్ని అందించారు. అయితే, వీరిద్దరూ ఔటైన తర్వాత ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మధ్యలో మ్యాక్స్ వెల్(22), జోష్ ఇంగ్లిస్(27)లు ఫర్వాలేదనిపించినా.. మిగతా వారు ఘోర విఫలమయ్యారు. దీంతో ఆసీస్ 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది.
procession |బంగారు పల్లకిలో శివపార్వతుల ఊరేగింపు
procession | బంగారు పల్లకిలో శివపార్వతుల ఊరేగింపు శివపార్వతుల ఊరేగింపులో భక్తులుదారి పొడవున
Imprisonment |దుర్మార్గుడు దొరికాడు ఇలా ….
Imprisonment | దుర్మార్గుడు దొరికాడు ఇలా …. ఆదోని రెండవ అదనపు జిల్లా
రాజస్థాన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం
జైపూర్ : రాజస్థాన్ లోని ఖైర్తల్ తిజారా జిల్లా భివాడిలో సోమవారం ఉదయం అక్రమ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించి ఏడుగురు సజీవదహనమయ్యారు. ఖుష్కోరా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఈ ఫ్యాక్టరీని అసలు ఇది దుస్తుల తయారీ కోసమని లీజుకు తీసుకుని అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నారని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సుమిత్రా పరీక్ వెల్లడించారు. ఇంకా ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన ఇద్దరిని బయటకు తీసుకొచ్చి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చేర్చామని, వారి పరిస్థితి ఆందోళనగా ఉందని తెలిపారు. పోలీసులు మామూలుగా పెట్రోల్ నిర్వహిస్తుండగా సమాచారం తెలిసి పోలీసులు వచ్చారని, వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించారని చెప్పారు. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సహాయ కార్యక్రమాలను నిర్వర్తించాలని తక్షణం బాధితులను రక్షించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. ప్రమాద స్థలం అల్వార్కు తక్షణం వెళ్లాల్సిందిగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి సంజయ్ శర్మను సిఎం ఆదేశించారు. తరువాత సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి శర్మ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని, స్పెషల్ క్యాంపైన్ నిర్వహించి బివాడీ పారిశ్రామిక వాడలో అన్నిపరిశ్రమలను తనిఖీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ ఫ్యాక్టరీ అయినా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ ఆర్తిక శుక్లా ,ఇతర సీనియర్ అధికారులు , పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ప్రమాద సమయంలో ఆ ఫ్యాక్టరీలో 20 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారని , అగ్ని ప్రమాదం జరగ్గానే తొమ్మిది మంది తప్ప మిగతా వారు బయటపడ గలిగారని తెలిసింది. గంటన్నర సేపు ప్రయత్నించాక మంటలు అదుపు లోకి వచ్చాయి. కొన్ని అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ పేలుడు తరువాత మంటలు చుట్టుముట్టడం సిసిటివీ ఫుటేజీలో కనిపించింది. ఫ్యాక్టరీ వద్ద గన్పౌడర్, ఫైర్క్రాకర్స్, ప్యాక్ చేసిన పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. శరీర అవశేషాలను పాలిథిన్ బ్యాగుల్లో సేకరించారు. మృతుల్లో కొందరు బీహార్కు చెందిన వారు.ఫోరెన్సిక్ బృందం ఎముకలను, కాలిన ఫైర్ క్రాకర్ల నమూనాలను సేకరించింది. ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోం సహాయ మంత్రి జవహర్ సింగ్ బెధం చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొత్సారా,మాజీ సిఎం అశోక్ గెహ్లాట్ , విపక్ష నాయకుడు తికరామ్ జుల్లీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
ప్రపంచ స్థాయి ఎఐ సదస్సు ప్రారంభం
దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం ప్రపంచ స్థాయి ఎఐ సదస్సుకు కనులపండువైన వేదిక అయింది. సోమవారం ఆరంభం రోజే లోనికి ప్రవేశించడానికి భారీ స్థాయిలో క్యూలైన్లు వెలిశాయి. పలు దేశాలకు చెందిన ప్రముఖ ఐటి కంపెనీల అధినేతలు, ఎఐ రంగ నిపుణులు , విధాన నిర్ణేతలు , ఎఐ సంస్థల వ్యవస్థాపకులు , సాంకేతిక నిపుణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ ముందుకు వచ్చిన ఎఐ గురించి సరైన రీతిలో అవగావహనకు ఎక్కువగా యువతరం ఈ సమ్మిట్ తో కూడిన ఎక్స్పోకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపింది. సదస్సు ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభం అయింది. ఈ సమయానికి చాలా ముందుగానే జనంతో కిటకిటలాడుతూ ఈ ప్రాంగణం సందడిగా మారింది. ఎఐ సదస్సులో సుందర్ పిచయ్ , ఓపెన్ ఎఐకి చెందిన సామ్ అల్ట్మెన్ , ఆంత్రోపిక్ నుంచి డారియో అమోడియి వంటి వారు తమ విశ్లేషణలు వెలువరిస్తారు. అయితే వారి నిర్ణీత సెషన్లు బుధవారం నుంచి ఆరంభం అవుతాయి. అయినప్పటికీ ఇప్పటి నుంచే వీరి ప్రసంగాల పట్ల సర్వత్రా ఉత్సాహం ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రాంగణం వెలుపలనే కాకుండా, ఢిల్లీలో పలు ప్రాంతాలలో ఈ సదస్సుకు వస్తున్న ప్రతినిధులకు, వక్తలకు అతిధులకు ప్రత్యేకించి ప్రారంభోత్సవానికి వచ్చే ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ కటౌట్లు వెలిశాయి. సదస్సు చివరి రెండు రోజులు 19, 20వ తేదీలలో దాదాపు 20 దేశాలకు చెందిన ప్రముఖ నేతలు, కొందరు ప్రభుత్వాధినేతలు హాజరు కానున్నారు. వీరిలో ఫ్రాన్స్ నేత మెక్రాన్, బ్రెజిల్ డాసిల్వా వంటి వారు మాట్లాడుతారు. వీరితో పాటు ప్రధాని మోడీ సెషన్ కూడా ఉంటుంది. ప్రత్యేకించి ఎఐ సంబంధిత వ్యాపార వాణిజ్య కంపెనీల బాస్లు, ఇన్వెస్టర్లు కూడా వారికి కేటాయించిన సమయం ప్రకారం ప్రసంగిస్తారు. అంతర్జాతీయ జాతీయ మీడియా ఈ సదస్సుకు అత్యంత ప్రాధాన్యతను కల్పించింది. ప్రత్యేకించి ప్రపంచాన్ని శాసించే రీతిలో మారేందుకు అవకాశం ఉన్న ఎఐ అవలక్షణాలను బేరీజువేసుకునేందుకు, ఈ వెల్లువను సక్రమ రీతిలో వినియోగించుకునేందుకు ఉద్ధేశించిన సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమ్మిట్లో మొత్తం మీద 3250మంది వక్తలు సందేశాలు ఉంటాయి. 500 కు పైగా సెషన్స్ సాగుతాయి. ఈ సదస్సుకు ముందు బ్రిటన్లో 2023లోనే తొలి ఎఐ సమ్మిట్ జరిగింది. అప్పుడు ఎఐ భద్రత, తీవ్రస్థాయి ముప్పు విషయాలను విశ్లేషించారు. తరువాత ప్రాన్స్లో 2025లో జరిగింది. ఇప్పుడు ఈ వ్యవస్థ వేగవంత మార్పుల క్రమంలో భారతదేశంలో జరిగే సదస్సు మరింత విస్తృతస్థాయి వేదిక అవుతోంది.
Accident |శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సు బోల్తా…
Accident | శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సు బోల్తా… రక్షణ
Games |జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ పోటీలు…
Games | జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ పోటీలు… పోస్టర్ను
అనకాపల్లిలో సుడిగుండాల బీభత్సం #Weather #Anakapalli #NTVStyle #ViralVideo #Nature
కొద్దిలో తప్పించుకుంది.. ఇంగ్లాండ్ కు చెమటలు పట్టించిన ఇటలీ
టి20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఇటలీ ఓడినా.. సంచలన ప్రదర్శన చేసింది. ఓ దశలో ఇంగ్లండ్ కు ఓటమి తప్పదా అన్నట్లు మ్యాచ్ జరిగింది. ఇటలీ బ్యాటర్లు బెన్ మనెంటి(60), గ్రాంట్ స్టీవార్ట్(45) చెలరేగడంతో.. టి20లో మరో సంచలన విజయం నమోదయ్యేలా కనిపింది. కానీ, బౌలర్లు పుంజుకుని వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకిదిగిన ఇటలీ 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. బెన్ మనెంటి, గ్రాంట్ స్టీవార్ట్ లతోపాటు ఓపెనర్ జస్టిన్ మోస్కా(43) రాణించాడు. అయితే, భారీ షాట్లతో మెరుపులు మెరిపించిన బెన్ మనెంటి, గ్రాంట్ స్టీవార్ట్ లు ఔటైన తర్వాత ఇటలీ వరుస వికెట్లు కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్, 24 పరుగుల తేడాతో ఇటలీపై గెలుపొందింది. ఈ విజయంతో ఇంగ్లండ్ జట్టు సూపర్ 8కు అర్హత సాధించింది. ఇప్పటికే విండీస్ జట్టు సూపర్ 8కు దూసుకెళ్లింది.
Corporation |భార్య డిప్యూటీ మేయర్…భర్త కార్పోరేటర్
Corporation |భార్య డిప్యూటీ మేయర్… భర్త కార్పోరేటర్ Corporation | నిజామాబాద్, ఆంధ్రప్రభ
Education |పిల్లలకు అధునాతన విద్య అందించాలి..
Education | పిల్లలకు అధునాతన విద్య అందించాలి.. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు
Hospital |ఆర్టీసీ బస్సు –కారు ఢీ
Hospital | ఆర్టీసీ బస్సు – కారు ఢీ Hospital | అచ్చంపేట,
విజయ్- రష్మిక వెడ్డింగ్ కార్డు.. నెట్టింట #Movies #VijayDeverakonda #Rashmika #WeddingBuzz
Mp |కూటమి ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం
Mp | కూటమి ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం Mp | మొవ్వ,
schools |పాఠశాలల మూసివేతను వెంటనే విరమించుకోవాలి:
schools | పాఠశాలల మూసివేతను వెంటనే విరమించుకోవాలి: schools | అచ్చంపేట, ఆంధ్రప్రభ
హైదరాబాద్లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ మరియు వెల్నెస్ సదస్సు టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ నిర్వహించింది. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్నిర్మించడంపై దృష్టి సారించిన చర్చలు మరియు సహకార పరివర్తన కోసం విధాన నిర్ణేతలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు మరియు సామాజిక ప్రభావ నాయకులను విజయవంతంగా ఒకచోట చేర్చింది.ఒక ముఖ్యమైన ఉద్దేశ్యాన్ని టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ నెరవేరుస్తుంది: టిఏఎల్ హాస్పిటల్స్ ద్వారా ఆరోగ్య సంరక్షణ అవకాశాలను విస్తరించే భాగస్వామ్యాలను నిర్మించడం, ఇది తగిన ఆరోగ్య సంరక్షణ సేవలు అందని రోగులను ఉచిత శస్త్రచికిత్సలు, ప్రాణాలను కాపాడే సంప్రదింపులను అందించే ఆసుపత్రులతో అనుసంధానించే ప్రో బోనో నెట్వర్క్. టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ సీఈఓ సాయి గుండవెల్లి మాట్లాడుతూ , “టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ ద్వారా, ఆరోగ్య సంరక్షణ అత్యంత అవసరమైన చోట విస్తరించడానికి మేము సాంకేతికతను ఉపయోగిస్తున్నాము. మెరుగైన వైద్య సేవలను పొందలేనట్టి రోగులను ప్రో బోనో కేర్ అందించే ఆసుపత్రులతో టిఏఎల్ హాస్పిటల్స్ అనుసంధానిస్తుంది, ఆరోగ్య సంరక్షణ అనేది కేవలం స్థానికంగా మాత్రమే కాదు - అది నిజంగా గ్లోకల్ అని నిరూపిస్తుంది. ఈ రోజు, మేము ప్రపంచవ్యాప్తంగా వైద్యులను అనుసంధానించే ప్రపంచ వేదిక అయిన టిఏఎల్ మేడోరాను ప్రారంభిస్తున్నాము. భారతదేశం తమ 1.4 బిలియన్ల మంది ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కేవలం మూడు మిలియన్ డాలర్లను మాత్రమే ఖర్చు చేస్తున్నందున, సాంకేతికత మరియు సహకారం ఈ అంతరాన్ని - డబ్బు ద్వారా కాదు, ప్రజలు తమ సమయాన్ని మరియు నైపుణ్యాన్ని స్వచ్ఛందంగా అందించడం ద్వారా - తగ్గించగలవని మేము విశ్వసిస్తున్నాము ” అని అన్నారు. హైదరాబాద్లోని టి-హబ్లో ఈ సమావేశం ప్రారంభమైంది. కర్ణాటక ప్రభుత్వ గౌరవనీయ క్యాబినెట్ మంత్రి శ్రీ ఎన్. ఎస్. బోస్రాజు ప్రారంభోపన్యాసం చేశారు. స్థిరమైన ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థలను సృష్టించడానికి ఆవిష్కరణ, నమ్మకం మరియు అవకాశాలను ఏకీకృతం చేయవలసిన తక్షణ అవసరాన్ని ముఖ్యోపన్యాసం నొక్కి చెప్పింది. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడి పెడుతున్న వేళ, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో సైతం పెట్టుబడి పెడుతున్నాము. సాంకేతికత అపారమైన ప్రభావాన్ని చూపగలదు. గ్రామీణ ప్రాంతంలోని వ్యక్తి కూడా ఆవిష్కరణల మద్దతుతో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ నుండి ప్రయోజనం పొందవచ్చు. భారతదేశాన్ని ప్రపంచ ఆవిష్కరణ నాయకుడిగా నిలబెట్టాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ వంటి వేదికలు ఈ లక్ష్యాన్ని వేగవంతంగా చేరుకోవటానికి తోడ్పడతాయి . ఈ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను సమర్ధించడానికి , సాంకేతిక పురోగతి ప్రతి పౌరుడికి చేరేలా చేయటానికి కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి పేర్కొన్నారు. ఏహెచ్ పిఐ వ్యవస్థాపకుడు మరియు ఏహెచ్ పిఐ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ గోవింద హరి మాట్లాడుతూ కొవిడ్ తర్వాత, ప్రభుత్వం, లాభాపేక్షలేని సంస్థలు, ఆసుపత్రుల మధ్య భాగస్వామ్యాలు నాణ్యత మరియు లభ్యత, రెండింటినీ విస్తరించడానికి తప్పనిసరి అయ్యాయి అని నొక్కి చెప్పారు. డేటా భద్రత మరియు పాలన, జీవిత భవిష్యత్తు మరియు వ్యాక్సిన్ ఆర్&డి లో విప్లవాత్మక ఆవిష్కరణలు, mRNA, కాంజుగేట్ వ్యాక్సిన్లు, ప్రెసిషన్ డెలివరీ టెక్నాలజీలో పురోగతితో సహా ఆకట్టుకునే అంశాలపై కీలకోపన్యాసాలు జరిగాయి. ఏఐ , క్వాంటం సాంకేతికతలు మరియు తదుపరి తరం డేటా వేదికలు ఔషధ ఆవిష్కరణ, రోగ నిర్ధారణలు మరియు రోగి సంరక్షణను ఎలా మార్చగలవో నిపుణులు చర్చించారు. రోజంతా, కీలకమైన ప్రపంచ ఆరోగ్య సంరక్షణ నేపథ్యాలతో ప్రభావవంతమైన చర్చా కార్యక్రమాల శ్రేణిని టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 నిర్వహించింది. వీటిలో ఈ దిగువ అంశాలు వున్నాయి : · ఆరోగ్య సంరక్షణలో క్వాంటం & ఏఐ యొక్క వాస్తవ స్థితి. · దీర్ఘాయువు & ఆరోగ్యం మరియు వయోధికుల సంరక్షణలో పరివర్తన. · ప్రపంచ వైద్య పర్యాటక పరిశ్రమలో భారతదేశం యొక్క వ్యూహాత్మక పాత్ర. · మానసిక ఆరోగ్యం - బర్న్అవుట్, డిజిటల్ జోక్యాలు, అపోహల తగ్గింపు మరియు ఆరోగ్య వ్యవధిని మెరుగుపరచడం. · ఆరోగ్య సంరక్షణ కోసం కమ్యూనిటీ ఛేంజ్ మేకర్స్ ను ప్రోత్సహించటం. ఈ సదస్సులో కీలక వక్తలుగా మార్క్ లీ (సోలిక్స్ టెక్నాలజీస్), నిషిత్ దేశాయ్ మరియు మిహిర్ పారిఖ్ (నిషిత్ దేశాయ్ అసోసియేట్స్), మరియు డాక్టర్ రమేష్ మాటూర్ (myRNA థెరప్యూటిక్స్) ఉన్నారు. ఈ చర్చా కార్యక్రమాలను ఉదయ్ సక్సేనా (వేల్ ట్యాంక్ బయోక్యాటలిస్ట్), మురళీ కృష్ణం, జో లాంకాస్టర్, రాజు పూసపాటి (సోలిక్స్ టెక్నాలజీస్), డాక్టర్ బాల విద్యాధర్ మల్లాది (పుష్పగిరి విట్రియో రెటినా ఇన్స్టిట్యూట్), మరియు గోపాల్ గార్గ్ (అశోక) మోడరేట్ చేశారు, డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ (ఫెర్నాండెజ్ హాస్పిటల్), అన్షు గుప్తా (గూంజ్), దీపిక టి. గ్రంధి (క్లీవ్ల్యాండ్ క్లినిక్) మరియు భారతదేశం , అంతర్జాతీయంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ నాయకులతో సహా 30 మందికి పైగా ప్రముఖ ప్యానలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఐటిఈ &సి , పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగంతో ఈ కార్యక్రమం ముగిసింది. టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, వెల్నెస్ ప్రాక్టీషనర్లు, పరిశోధకులు, స్టార్టప్లు, లాభాపేక్షలేని సంస్థలు మరియు ప్రపంచ సంస్థల కోసం ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, సమానమైన ఆరోగ్య సంరక్షణ అవకాశాలను వేగవంతం చేయడానికి సహకార వేదికగా పనిచేస్తూనే ఉంది.
దిగజారిన శాంతి భద్రతలకు ఇవాల్టి పరిణామాలే నిదర్శనం: కెటిఆర్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాగిరి చేసిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. కిడ్నాప్లు, దాడులు, అక్రమ ఓట్లతో పదవులు పొందారని ఆరోపించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇవాల్టి పరిణామాలే నిదర్శనమని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎక్స్ అఫీషియో ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేశారు కాంగ్రెస్ తొత్తులుగా మారిన పోలీసులపై డిజిపి చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు ఛైర్వర్సన్ల ఎన్నికను కొన్ని చోట్ల వాయిదా వేశారు. సంబంధింత అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు. మరోవైపు హంగ్ వచ్చిన మున్సిపాలిటీలపై బిఆర్ఎస్ దృష్టి సారించింది. 8 పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్చార్జిలుగా నియమించింది.
నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్గా ఉమారాణి
నిజామాబాద్ మేయర్ ఎన్నికల పర్వంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి పీఠాన్ని కైవసం చేసుకుంది. నగర నాలుగో మేయర్గా కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా ఎంఐఎంకు చెందిన సాల్మా తాహిసిన్ నియామకమయ్యారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ముగియగానే, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సీల్డ్ కవర్ తీసి ఉమారాణి పేరును ప్రకటించడంతో ఒక్కసారిగా సమీకరణాలన్నీ మారిపోయాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక సరికొత్త సామాజిక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 49వ డివిజన్ నుంచి గెలిచిన ఉమారాణి నేపథ్యం అత్యంత సామాన్యమైంది. పండ్లు, కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే స్థాయి నుంచి నగర ప్రథమ పౌరురాలి స్థాయికి ఆమె ఎదగడం విశేషం. మేయర్ స్థానం మహిళా (జనరల్) కేటగిరీకి దక్కినప్పటికీ, బీసీ సామాజిక వర్గానికి (ముదిరాజ్) అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయాలకు బాటలు వేసుకుంది. నగరంలో ముదిరాజ్ సామాజిక వర్గం బలంగా ఉండటం, లోక్సభ పరిధిలో వారికి ఎక్కడా కీలక పదవులు దక్కకపోవడంతో ఉమారాణిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నగరంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్ చాకచక్యంగా పావులు కదిపింది. కాంగ్రెస్ పార్టీకి 17 మంది కార్పొరేటర్లు కాగా 14 మంది సభ్యులు గెలిచిన ఎంఐఎం మద్దతును కాంగ్రెస్ కూడగట్టింది. మరో బీఆర్ఎస్ సభ్యుడు కూడా మద్దతు తెలపడంతో కాంగ్రెస్ బలం 34కు చేరింది. మరోవైపు 28 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులతో మేయర్ పీఠానికి చేరువైన బీజేపీ, సంఖ్యాబలం లేక చతికిలపడింది. 2005 తర్వాత సుదీర్ఘ కాలానికి కాంగ్రెస్ మళ్లీ నగరంపై గులాబీ జెండాను దించి హస్తం జెండాను ఎగురవేసింది. అభ్యర్థి ఎంపికలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాత అనుబంధానికే పెద్దపీట వేశారు. 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత (మున్నూరు కాపు) పేరు కోసం సీనియర్ నేతలు గట్టిగా ఒత్తిడి తెచ్చారు. లలిత భర్త చరణ్ సుదీర్ఘ కాలంగా ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తి. అయితే ఉమారాణి భర్త కరాటే రమేష్కు పీసీసీ చీఫ్ మహేష్తో ఉన్న 45 ఏళ్ల దోస్తీ ఇక్కడ కీలకంగా మారింది. తన మిత్రుడి కుటుంబానికి రాజకీయ గుర్తింపు ఇవ్వాలనే పట్టుదలతో మహేష్ కుమార్ గౌడ్ ఉమారాణి వైపు మొగ్గు చూపారు. ముందుగా వ్యాపారవేత్త నరేందర్ రెడ్డి భార్య సమంతను అభ్యర్థిగా అనుకున్నా ఆమె ఓడిపోవడంతో అనూహ్యంగా ఉమారాణి తెరపైకి వచ్చారు. అన్ని అవరోధాలను అధిగమించి కూరగాయలు అమ్ముకునే సామాన్య మహిళను మేయర్ పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నగరంపై తన పట్టును నిరూపించుకుంది.
politics |సుందర నగరంగా తీర్చి దిద్దుతాము..!
politics | సుందర నగరంగా తీర్చి దిద్దుతాము..! politics | మోత్కూర్, ఆంద్రప్రభ
మున్సిపల్ తీర్పుతో విపక్షాల నోళ్లు మూత: భట్టి విక్రమార్క
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ మున్సిపల్ ఎన్నికల విజయం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు సోమవారం మధిర మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎక్స్ ఆఫిషియో మెంబర్ గా ఆయన హజరయ్యారు. కొత్త పాలకవర్గం కొలువుదిరిన అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కేవలం గ్రామీణ పార్టీయేనని, బురద చల్లిన వారికి ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులా మారయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమని పేర్కోన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని, ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రతి ఓటరుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వెల్లువెత్తిన కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర మంత్రిమండలి సమిష్టిగా పనిచేస్తూ అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమతూకంతో ముందుకు తీసుకెళ్ళి, అర్బన్ సెంటర్లను అభివృద్ధి బాట పట్టించారని భట్టి పేర్కొన్నారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మా పోటీ ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదని, ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఇతర దేశాలతోనే మా పోటీ అన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణను గ్లోబల్ హబ్గా మారుస్తామని భట్టి ధీమా వ్యక్తం చేశారు. పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పారిశ్రామికీకరణ ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు సృష్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వర్ రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామనాథం, మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోన ధని కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటరమణ, నూతనంగా గెల్చిన కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Commissioner |మన నగరం -మన ఇల్లు తో సమానం
Commissioner |మన నగరం -మన ఇల్లు తో సమానం Commissioner | విజయవాడ,
పెళ్లికి ముందు కలయిక తగదు: సుప్రీం కోర్టు
పెళ్లికి ముందు శారీరక లైంగిక సంబంధాలకు దిగరాదని యువతీయువకులకు సుప్రీంకోర్టు సోమవారం హితవు పలికింది. పెళ్లికి ముందు పరిచయాల దశలో పరస్పరం పూర్తి స్థాయిలో అపరిచుతులే అవుతారు. ఈ క్రమంలో మాయమాటలకు లొంగి, నమ్మి ఈ తప్పుడు పనికి దిగకండని పేర్కొన్నారు. తాము చెపుతున్నది పాతచింతకాయ పచ్చడి ముచ్చటగా తీసిపారేయరాదని న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్జల్ భూయాన్తో కూడిన ధర్మాసనం అందరికి సందేశం వెలువరించింది. ఓ యువకుడు , ఓ యువతి సంబంధిత కేసులో ధర్మాసనం అత్యంత కీలకమైన ప్రస్తుత సామాజిక విపరీత అంశాన్ని విశ్లేషించింది. ఈ యువకుడు యువతిపై అత్యాచారం కేసులో జైలు పాలయ్యి బెయిల్కు అప్పీల్ చేసుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఈ యువకుడు తనను దుబాయ్కు తీసుకెళ్లాడని, అక్కడ లైంగిక చర్యకు దిగాడని యువతి కేసు పెట్టింది. అయితే ఆమె తనతో అంగీకారంతోనే దుబాయ్కు వచ్చిందని, అక్కడ ఇద్దరం కలిసి ఉన్నామని, ఇష్టం లేకపోతే తనతో ఎందుకు వచ్చిందని యువకుడు బెయిల్ దరఖాస్తులో తెలిపారు. అయితే ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. పరస్పర అంగీకారం ఉండొచ్చు. అయితే పెళ్లికి ముందు ఇటువంటి శారీరక సంబంధాలకు దిగడం సరికాదని తెలిపింది. వారిద్దరి మధ్య ప్రగాఢ అనుబంధం ఉండొచ్చు. అయితే ఈ క్రమంలో పెళ్లికి ముందు ఈ చేష్టకు దిగడం ఎందుకో తమకు అర్థం కావడం లేదని మహిళా న్యాయమూర్తి నాగరత్న తెలిపారు. యువతి తరఫు న్యాయవాది తమ వాదనలో ఆమె వివాహ వేదిక వెబ్సైట్ ద్వారానే ఆయనతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసగించాడని వివరించారు. తరువాత ఈ యువకుడు వేరే పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని కూడా యువతి తెలిపింది. పరస్పర అంగీకారంతో జరిగిన చర్య విషయంలో శిక్షలు పడ్డ కేసులు లేవని, ఈ దశలో యువతి ఏదో విధంగా ఓ పరిష్కారానికి దిగవచ్చునని సూచించారు.క్రమంలో తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
జెఇఇ మెయిన్స్ ఫలితాలు విడుదల.. టాపర్ ఎవరంటే..
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఇతర కోర్సుల ఎంట్రెన్స్ కోసం విద్యార్థుల రాసే జెఇఇ మెయిన్స్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఇందులో ముగ్గురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ముగ్గురికి 100 పర్సెంటైల్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర విద్యార్థి వివన్ శరద్ మహీశ్వరికి, ఎపికి చెందిన ఇద్దరు విద్యార్థులు జి.నరేంద్ర బాబు, పసల మోహిత్కు 100 పర్సెంటైల్ వచ్చింది. ఒబిసి కేటగిరీలో నరేంద్రబాబు టాపర్గా నిలిచాడు. ఎస్సి కేటగిరీలో ఎపి విద్యార్థి దేవ శ్రీవేద్ టాపర్గా నిలిచాడు. ఈసారి 13.04 లక్షల మంది జెఇఇ మెయిన్స్ రాశారు.
development |అందరి సహకారంతో అభివృద్ధి పథంలో నడిపిస్తా.
development | అందరి సహకారంతో అభివృద్ధి పథంలో నడిపిస్తా. development | చిట్యాల,
CM Revanth Reddy |సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో…
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో… CM Revanth
11 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నిక వాయిదా
రాష్ట్రవ్యాప్తంగా పలు కారణాల వల్ల 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నాకల్, జనగాం,తొర్రూర్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొర్రూరులో 16 వార్డులు ఉండగా బిఆర్ఎస్ -9, కాంగ్రెస్ -7 గెలుచుకున్నాయి. దీంతో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ కడియం కావ్య, ఎంఎల్ఎ యశస్వినిరెడ్డి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఎక్స్అఫీషియో ఓట్లతో బలాబలాలు సమానమయ్యాయి. ఈ నేపథ్యంలో కడియం కావ్య ఓటుపై అభ్యంతరం చేస్తూ బిఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు.
election |చైర్మన్ గా అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి
election | చైర్మన్ గా అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి election |
#RS Code ప్రచారాన్ని ప్రారంభించిన రాయల్ స్టాగ్
క్రికెట్ జ్వరం తారాస్థాయిలో ఉన్న సమయంలో, సీగ్రామ్ రాయల్ స్టాగ్ ప్యాకేజ్డ్ త్రాగునీరు రాయల్ స్టాగ్ కోడ్ ఆఫ్ లార్జ్ (#RS Code)ను ఆవిష్కరించింది. ఇది బ్రాండ్ అంబాసిడర్ మరియు మాజీ టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు మెటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్ లతో కూడిన మొదటి డేటా ఆధారిత కార్యక్రమం మరియు విజయాన్ని డీకోడ్ చేయడానికి విజయాన్ని సంబరం చేయడానికి మించి వెళ్తుంది. రెండు ICC T20 ప్రపంచ కప్పులను గెలిచిన ఏకైక భారతీయుడు రోహిత్ శర్మ, భయం లేని వ్యక్తిత్వం మరియు విజయాన్ని ప్రతిబింబిస్తాడు-జీవితాన్ని తనదైన విధానంలో జీవించడం, ప్రామాణికమైనది మరియు రాయల్ స్టాగ్ యొక్క గొప్పగా జీవించే సిద్ధాంతానికి పూర్తి అనుగుణంగా ఉంటుంది. #RS కోడ్ అనేది రోహిత్ శర్మ యొక్క లోతైన డేటా విశ్లేషణ ఫలితం. ఇది రాయల్ స్టాగ్ బ్రాండ్ యొక్క స్ఫూర్తితో కలిపి డేటా సైన్స్ ను వినియోగించి ఈ క్షణంలో జీవించడం మరియు గొప్పగా జీవించడం సిద్ధాంతాన్ని సంబరం చేసుకోవడం చుట్టూ కేంద్రీకరించబడింది. ఈ ప్రక్రియ విజయాన్ని డీకోడింగ్ చేయడానికి పునాది వేసే 4 విలక్షణమైన వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడించింది. ఈ లక్షణాలు ప్రతి వ్యక్తికి విలక్షణంగా ఉంటాయి. నాలుగు నిర్వచించబడే లక్షణాలు రోహిత్ విజయానికి నిరంతరంగా మద్దతునిస్తున్నాయి- లక్షణాలు రాయల్ స్టాగ్ యొక్క దీర్ఘకాలం సిద్ధాంతాన్ని నిజంగా ప్రతిబింబిస్తున్నాయి. పూర్తి కార్యక్రమానికి విశ్వశనీయతను తీసుకురావడానికి, కార్యక్రమానికి సబ్జెక్ట్ నిపుణుడిగా, పెర్ఫార్మెన్స్ డేటాను అర్థవంతమైన ఆలోచనలుగా అనువాదం చేసిన కాంపైన్ ప్యాడీ అప్టాన్ ను చూపిస్తుంది. RS Code నాలుగు లక్షణాలపై రూపొందింది- నిస్వార్థం(ఫియర్ లెస్) , దీనిలో జట్టు విజయం ఎల్లప్పుడూ వ్యక్తిగత మైలురాళ్లను అధిగమిస్తుంది; డ్రివెన్, దీనిలో ప్రతి క్షణం వేడుక చేయబడుతుంది మరియు కొత్త ప్రారంభానికి సహాయపడుతుంది; నిర్భయం (ఫియర్ లెస్), దీనిలో ఉన్నతమైన బాధ్యతలను అనుసరించడానికి వ్యక్తుల సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది మరియు ప్రేరేపణ (ఇన్ స్పైరింగ్), దీనిలో ఒకరి నాయకత్వం ప్రేరణాత్మకంగా ఉండటమే కాకుండా మరొకరు కూడా అనుసరించేదిగా ఉంటుంది. మొత్తంగా, ఇవి రాయల్ స్టాగ్ కోడ్ ఆఫ్ లార్జ్, #RSCode ను ఏర్పరుస్తాయి, ఇది క్రికెట్ కు మాత్రమే కాకుండా జీవితానికి కూడా అన్వయించబడే సిద్ధాంతం . RS Code దశలవారీగా, డిజిటల్ -ఫస్ట్ కాంపైన్ ద్వారా ఆసక్తి మరియు పాల్గొనడాన్ని పెంపొందించడానికి తీసుకురాబడింది. ఇది రోహిత్ శర్మ మరియు ప్యాడీ అప్టాన్ లు ద్వారా టీజర్ తో ప్రారంభమైంది. ఇది RS Code గురించి ఆసక్తిని కలిగిస్తుంది, తదుపరి విక్రమ్ సాథే నిర్వహించిన రోహిత్ శర్మ, ప్యాడీ అప్టాన్ ల మధ్య అత్యంత ప్రభావం కలిగించిన టాక్ షో ద్వారా అధికారికంగా వెల్లడించబడింది. ఇది RS Code యొక్క ‘ప్రేరేపిత ’ లక్షణాన్ని పునఃశక్తివంతం చేసే సూర్య కుమార్ ఆకస్మికంగా కనిపించడం సహా కథలు చెప్పడం మరియు నిజమైన క్షణాలతో డేటా ఆధారిత అభిప్రాయాలతో స్థిరంగా కలిసిపోతుంది. ఈ కాంపైన్ విలక్షణమైన AI-తో ప్రోత్సహించబడిన #RSCode Finder ద్వారా మద్దతు చేయబడుతోంది. ఇది ప్రేక్షకులకు తమ సొంత వ్యక్తిగత కోడ్ ఆఫ్ లార్జ్ ను కనుగొనవలసిందిగా ఆహ్వానిస్తోంది. కొన్ని సాధారణ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ద్వారా, వినియోగదారులు తమ విలక్షణమైన కోడ్ ను డీకోడ్ చేయాలి, తదుపరి రోహిత్ శర్మ నుండి వ్యక్తిగత వీడియో సందేశం ద్వారా వెల్లడించబడుతుంది- అత్యంత ఆకర్షణీయమైన మరియు వ్యక్తిగత బ్రాండ్ అనుభవాన్ని సృష్టిస్తుంది. కాంపైన్ గురించి మాట్లాడుతూ, దేబాశ్రీ దాస్ గుప్తా, ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, పెర్నాడ్ రికార్డ్ ఇండియా, ఇలా అన్నారు, “ కాంపైన్ గురించి మాట్లాడుతూ, దేబాశ్రీ దాస్ గుప్తా, ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, పెర్నాడ్ రికార్డ్ ఇండియా, ఇలా అన్నారు, “ ICC భాగస్వామిగా రాయల్ స్టాగ్, నిజమైన “గొప్పగా జీవించు (లివ్ ఇట్ లార్జ్) ” అనుభవాన్ని ప్రతి చోట క్రికెట్ అభిమానులకు అందచేయడానికి మాకు అవకాశం ఇచ్చింది. విజయం సాధించే దిశగా తమ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి బ్రాండ్ వారి నిబద్ధతతో సమ్మిళితమైన ఈ విలక్షణమైన AI ప్లాట్ ఫాం ద్వారా తమ సొంత లివ్ ఇట్ లార్జ్ స్టోరీని రూపొందించే శక్తిని ప్రతి అభిమానికి మేము ఈ ఏడాది ఇస్తున్నాము. ద రాయల్ స్టాగ్ కోడ్ జీవితానికి మా ‘ లివ్ ఇట్ లార్జ్ ’ సిద్ధాంతాన్ని ఒక అర్థవంతమైన విధానంలో తెచ్చింది. డేటాచే ప్రోత్సహించబడే విధానం ద్వారా రోహిత్ శర్మ విజయాన్ని డీకోడింగ్ చేయడం ద్వారా, విజయానికి తమ సొంత మార్గాన్ని అనుసరించి మరియు జీవితాన్ని గొప్పగా జీవించడానికి వ్యక్తులకు మేము సామర్థ్యం కలగచేస్తున్నాము.
చైతన్యపురిలో అనుమానాస్పద స్థితిలో వాచ్ మెన్ మృతి
ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వైశ్యరాజు జువెలెర్స్ భవనంలో వాచ్ మెన్ మృతి చెందిన ఘటన చైతన్యపురిలో ఉద్రిక్తతకు దారితీసింది. కార్ పార్కింగ్ ప్రాంతంలోని లిఫ్ట్ రాడ్స్కు ఉరి బిగించుకుని వాచ్ మెన్ చామల ముత్తయ్య మృతదేహం కనిపించింది. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడు చామల ముత్తయ్య భవన యజమాని వద్ద చాలా సంవత్సరాలుగా వాచ్ మెన్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ముత్తయ్య మృతికి న్యాయం చేయాలని, యజమానులపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Minister |కొలువుదీరిన పురపాలక ‘పాలకులు…
Minister | కొలువుదీరిన పురపాలక ‘పాలకులు… Minister | ఖమ్మం, ఆంధ్రప్రభ :
17th Ward |ఎగిరిన ‘హస్తం’జెండా!
17th Ward | ఎగిరిన ‘హస్తం’ జెండా! 17th Ward | బెల్లంపల్లి,
Presidents |హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గా గెల్లి రవి నియామకం
Presidents | హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గా గెల్లి రవి నియామకం
MLA | కడియం ఆశీర్వాదం…. MLA | స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ :
హంపిలో విదేశీ మహిళపై అత్యాచారం.. ముగ్గురికి మరణ శిక్ష
బెంగళూరు: విదేశీ మహిళపై అత్యాచారం కేసులో కర్ణాటక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపి సమీపంలో గతేడాది మార్చి 6న జరిగిన ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం, అమెరికన్ పర్యాటకుడి హత్య కేసులో ముగ్గురు దోషులకు కర్ణాటకలోని గంగావతి కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఫిబ్రవరి 6న, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు.. మల్లేష్ అలియాస్ హండిమాల్, సాయి, శరణప్ప అనే ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. ఫిబ్రవరి 16న శిక్షను ప్రకటిస్తూ.. న్యాయమూర్తి సదానంద నాగప్ప నాయక్ ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించారు.
Valentine |కార్ట్స్ అండ్ లైవ్ మ్యూజిక్తో..
Valentine | కార్ట్స్ అండ్ లైవ్ మ్యూజిక్తో.. Valentine | హైదరాబాద్, ఆంధ్రప్రభ
Cherman |ఆలేరు మున్సిపాలిటీ చెర్మన్ ప్రమాణ స్వీకారం
Cherman | ఆలేరు మున్సిపాలిటీ చెర్మన్ ప్రమాణ స్వీకారం ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి
అసెంబ్లీ ఎన్నికల్లో మా విజయానికి నాంది: మంత్రి కిషన్ రెడ్డి
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ‘నాంది’ పడిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికార గర్వంతో ఎన్ని కుట్రలు పన్నినా, అక్రమాలకు పాల్పడినా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేయలేరని కరీంనగర్ ప్రజలు చాటి చెప్పారని ఆయన సోమవారం ట్వీట్ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్గా ఎన్నికైన కోలగాని శ్రీనివాస్కు, డిప్యూటీ మేయర్గా ఎన్నికైన సునీల్ రావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కోలగాని శ్రీనివాస్, సునీల్ రావు నాయకత్వంలో కరీంనగర్ నగరం అభివృద్ధిలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆయన ఆకాంక్షించారు.విజయం కేవలం ఒక పదవికి సంబంధించింది కాదని, ఇది కరీంనగర్ ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనమని, అభివృద్ధికి, నిజాయితీకి పట్టం కట్టిన నైతిక విజయమని పేర్కొన్నారు.కరీంనగర్ గడ్డపై ఎగిరిన ఈ కాషాయ జెండా, రాష్ట్రంలో రాబోయే బిజెపి సర్కారుకు బలమైన నాంది పడిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, వారి ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతూ, ప్రజల పక్షాన నిలబడే సత్తా ఒక్క బిజెపికే ఉందని ఈ ఫలితం నిరూపించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
విజయ్-రష్మిక వివాహం.. పెళ్లి పత్రిక సోషల్మీడియాలో వైరల్
హైదరాబాద్: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్లో వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయిందని సోషల్మీడియాలో కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై ఇరువురు స్పందించకపోవడంతో ఆ కథనాలకు మరింత బలం చేకూర్చినట్లైంది. అయితే ఇప్పుడు వీరిద్దరి పెళ్లి వార్త మరోసారి తెరమీదకు వచ్చింది. ఈసారి ఏకంగా వీరిద్దరి పెళ్లి పత్రిక సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం విజయ్-రష్మికల వివాహం ఫిబ్రవరి 26న జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకగా కూడా సింపుల్గా జరుగనుందట. పెళ్లి ఇరువురి కుటుంబాలు, కొందరు సన్నిహితుల మధ్య జరగనుందని టాక్. ఆ తర్వాత బంజారాహిల్స్లోని ఓ హోటల్లో ఇద్దరి రిసెప్షన్ జరగనుదంని పెళ్లి పత్రికలో ఉంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో ఇంకా క్లారిటీ లేదు. విజయ్-రష్మికలు కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందనే టాక్ ఉంది. ఇప్పుడు ఇద్దరు మరోసారి తెరపై కనిపించనున్నారు. రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ‘రణబలి’ అనే సినిమాలో ఈ జోడీ నటిస్తోంది.
సన్నవడ్ల బోనస్కు నిధులు విడుదల
రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. సన్నవడ్ల బోనస్కు నిధులు విడుదల చేసింది. రూ.514.36 కోట్లను సోమవారం విడుదల చేసింది. తెలంగాణలో సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. వానాకాలంలో సన్నవడ్లు అమ్మిన 2.17 లక్షల మంది రైతులకు ఈ బోనస్ బకాయిలను విడుదల చేసింది. ఈ బోనస్, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అదనంగా లభిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్నబియ్యం రకాలను పండించిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ధాన్యంలో తేమశాతం, గింజ నాణ్యతను బట్టి ఈ బోనస్ ఖరారు చేస్తారు. కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులకు ఈ తాజా నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. పంట పెట్టుబడి పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ అదనపు రూ.500లు తోడుగా నిలువనుంది.
ప్రాణాలను కాపాడే క్యూఆర్ కోడ్ ఎమర్జెన్సీ స్టిక్కర్లు…ఇప్పుడు అందుబాటులో #RoadSafety #QRSticker
జాయ్ అలుకాస్ జూవెల్లర్స్లో చోొరి.. కిలో బంగారం కొట్టేసిన సేల్స్మెన్
హైదరాబాద్: జాయ్ అలుకాస్ జూవెల్లర్స్లో జరిగిన చోరీ కేసును పంజాగుట్ట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కిలో బంగారు బిస్కెట్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన బంగారం విలువ రూ.1.60 కోటి రూపాయలు ఉంటుంది. ఈఘటన ఫిబ్రవరి 15వ తేదీన చోటుచేసుకుంది పోలీసుల కథనం ప్రకారం...ఎపిలోని గుంటూరు జిల్లా, తాడేపల్లి, మహానాడుకు చెందిన కారంపూడి గోపాలకృష్ణ(25) పంజాగుట్టలోని జాయ్ అలూకాస్ జూవెల్లర్స్లో సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న సమయంలో రోజు నిందితుడు షూస్, సాక్స్లో బంగారు బిస్కెట్లను పెట్టుకుని వెళ్లాడు. ఆడిట్లో బంగారం తక్కువగా రావడంతో అనుమానం వచ్చిన సిబ్బంది సిసిటివి ఫుటేజ్ను పరిశీలించారు. అందులో గోపాలకృష్ణ బంగారు బిస్కెట్లు దొంగిలించినట్లు తెలిసింది. వెంటనే జూవెల్లర్స్ నిర్వాహకులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యే బృందాలను ఏర్పాటు చేశారు. సిసిటివి, టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో నిందితుడిని 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నారు. బంగారం బిస్కెట్లు చోరీ చేయడంతో జూవెల్లర్స్లో పనిచేసే సిబ్బంది ఏమైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. జూవెల్లర్స్లో సిసిటివిలు ఉంటాయని తెలిసి కూడా నిందితుడు కిలో బంగారం చోరీ చేయడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడు గోపాలకృష్ణతో పాటు మరికొందరికి చోరీకి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. డిఐ రామకృష్ణ, డిఎస్సై సురేష్ తదితరులు దర్యాప్తు చేస్తున్నారు.
Ap Cm CBN : వనరులు ఓకే Andhra Ptabha Spot News
Ap Cm CBN : వనరులు ఓకే Andhra Ptabha Spot News
Chegunta |అగ్నిప్రమాదం స్టోర్ రూమ్ లో చెలరేగిన మంటలు Chegunta | ఆంధ్రప్రభ,
Councillor |కౌన్సిలర్ గా ప్రమాణం స్వీకారం చేసిన మల్లెల సరితా శ్రీకాంత్
Councillor | కౌన్సిలర్ గా ప్రమాణం స్వీకారం చేసిన మల్లెల సరితా శ్రీకాంత్
Vice Chairman |ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా అంగడి ఆంజనేయులు
Vice Chairman | ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా అంగడి ఆంజనేయులు
సజ్జనార్ ఆదేశాలు.. 63 మంది ఇన్స్స్పెక్టర్ల బదిలీ
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 63మంది ఇన్స్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్బిలో పనిచేస్తున్న వారిని ఎస్హెచ్ఓలుగా నియమించారు. స్పెషల్ బ్రాంచ్లో పనిచేస్తున్న రాంబాబు, రామకృష్ణ, లక్ష్మినారాయణ రెడ్డి, రుక్మిణీ, రాజగోపాల్ రెడ్డిని ఎస్హెచ్ఓలుగా నియమించారు. జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న వెంకటేశ్వర్ రెడ్డిని ఎస్బికి బదిలీ చేసి, ఆయన స్థానంలో శ్రీనివాసులు రెడ్డిని నియమించారు. మధులతను జూవైనల్ బ్యూరో యూనిట్ నుంచి ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్కు బదిలీ చేశారు. అఫ్జల్గంజ్ ఇన్స్స్పెక్టర్ నునావత్ రవిని జూవైనల్ బ్యూరో యూనిట్ ఇన్స్స్పెక్టర్గా బదిలీ చేశారు. నర్సింహులును ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్ ఇన్స్స్పెక్టర్గా, ఖైరతాబాద్ టాస్క్ఫోర్స్ ఇన్స్స్పెక్టర్గా పనిచేస్తున్న రంజిత్ కుమార్ గౌడ్ను యాంటీ ఫుడ్ అడాల్ట్రేషన్ టీంకు బదిలీ చేశారు. సుర్వే సునీతను జూబ్లీహిల్స్ పిసిఆర్ జోన్కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
Congress |ప్రజా సేవకుని కే కాంగ్రెస్ పెద్దపేట..
Congress | ప్రజా సేవకుని కే కాంగ్రెస్ పెద్దపేట.. వైరా మున్సిపల్ చైర్
100 crores |మాటల వెనుక మర్మం ఏంటి..?
100 crores | మాటల వెనుక మర్మం ఏంటి..? Nikhil 100 crores
నాగర్కర్నూల్ జిల్లా మున్సిపాలీలలో కొలువుదీరిన పాలకవర్గాలు
మూడు మున్సిపాలిటీలలో ఏకగ్రీవంగా ఎన్నిక నాగర్కర్నూల్: రాష్ట్రవ్యాప్తంగా జరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం గెలిచిన అభ్యర్థులు ప్రమాణస్వీకారం చేశారు. ఒక నాగర్కర్నూల్ జిల్లాలోని మూడు మునిసిపాలిటీలలో సోమవారం పాలకవర్గాలు కొలువుదీరాయి. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ చైర్మన్ గా తీగల సురేంద్ర, వైస్ చైర్మన్ గా బాదం రమేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ గా షేక్ రహీం పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్వకుర్తి మున్సిపల్ చైర్ పర్సన్ గా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్ గా మొహమ్మద్ షానవాజ్ ఖాన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగర్ కర్నూలు జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎన్నిక ప్రక్రియ వరకు సజావుగా సాగడం ప్రజలు మూడు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడంతో ఎక్కడ కూడా హంగ్ అవకాశాలు లేకపోవడం తో ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు.
An honor |ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆంజనేయులుకు సన్మానం
An honor | ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆంజనేయులుకు సన్మానం An
Sevalal |18న నిర్వహించే సేవాలాల్ జయంతిని విజయవంతం చేయాలి..
Sevalal |18న నిర్వహించే సేవాలాల్ జయంతిని విజయవంతం చేయాలి.. జిల్లా ఉత్సవ కమిటీ
BRS : మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కనిపించకపోవడం డానికి అసలు రీజన్ అదేనా?
తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ ను కోలుకోనివ్వకుండా చేశాయి
public |ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
public | ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించి
ఉద్యమాలను కవిత్వంగా మలిచిన కె.రా.
కాగితాల రాజశేఖర్ తెలుగు అభ్యుదయ సాహిత్యంలో కె.రా. అనేది ఒక కవి పేరు మాత్రమే కాదు; ఒక కాలానికి ప్రతినిధి అయిన స్వరం. కమ్యూనిస్టు ఉద్యమాల మధ్య జీవించాడు; వాటిని కవిత్వంగా మలిచాడు. అందుకే ఆయన కవిత్వం జీవన సమరాల్లో నుంచి ఉబికి వచ్చింది. విజయవాడ కేంద్రంగా 1970 లలో సాగిన విద్యార్థి, యువజన ఉద్యమాలు, అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వేదికలు, ప్రజానాట్యమండలి కార్యక్రమాలు, కమ్యూనిస్టు పార్టీ సభలు – ఇవన్నీ కె.రా. సాహిత్య ప్రయాణానికి […] The post ఉద్యమాలను కవిత్వంగా మలిచిన కె.రా. appeared first on Visalaandhra .
నా చుట్టూ ఉన్న లోకం విరిగినా స్వప్నాలపై పడింది.తూర్పు సూర్యుడు పడమరలో కలసిపోయినట్టుజీవితం సాగిపోయింది.పారేసుకున్నది ఏరుకోవడంలోపోగొట్టుకున్నది వెతుక్కోవడంలోబతుకంతా ‘ప్రేమను గుమ్మరించి’బంధాల్ని నిలుపుకోవడంతోనే సరిపోయింది.‘నిందలు వేలెత్తి చూపినా’ లెక్కసేయకమారని దారిలో నవ్వుతూ కొంత కాలం‘కాలమేఘం’ సృష్టించిన తుఫాన్లను,‘నమ్మకద్రోహ’ బాధల బడబాగ్నులనుఎదుర్కోవడంలో మరికొంతకాలంధిక్కారస్వరం ‘గుడ్లురిమితే’ ఉరమనీబాగుపడితే చాలనుకోవడంలోఇంకొంత కాలం, గడిచిపోయింది.ఎటువైపు చూసినాఎత్తుపల్లాలు, ఎగుడుదిగుళ్లతో సాగిన కాలం,బస్తాలకొద్దీ చేదు స్మృతులూ, గుర్తొస్తుంటేఎవరో భూకంపంలాగుండెల్ని బాదుతున్నట్టు కన్నీళ్లు ఉబికొస్తున్నాయి,అలా జరిగుండకపోతే ఎంత బాగుండునని.దాపరికపు ఒడిలోఒంటరిగా మిగిలిపోయిన నేనుఇంకేం చేయగలననుకుంటున్నసమయంలో, నే కూర్చున్న పార్కులోశతాబ్దాల […] The post గతం-అవగతం appeared first on Visalaandhra .
చింతపట్ల సుదర్శన్సెల్: 9299809212 ఇంచుక వాస్తవికత కలిగిన కల్పిత ప్రబంధం కథ అన్నాడు సి.పి.బ్రౌన్. లోకంలో తిరిగితే కానీ కథ రాదు అని వాకాటి పాండురంగారావుగారు అభిప్రాయపడ్డారు. మనకు తెలిసిన విషయాన్నే తిరిగేసి చూస్తే కొత్తకథ అవుతుంది అన్నాడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. హదయగత కల్లోలాన్ని విషాదాన్ని మాటల్లో చెప్పే ప్రయత్నం చేశాను నా కథల్లో అంటాడు ఫణిహారం వల్లభాచార్య. చిరకాలం వివిధ పత్రికల్లో సీనియర్ సబ్ ఎడిటర్గా అక్షర సేద్యం చేసిన వల్లభాచార్య ఇటీవల ప్రచురించిన కథాసంపుటి […] The post మనో సముద్రతీరం…మెరీనా appeared first on Visalaandhra .
ఆద్యంతం అలరించే సైన్స్ ఫిక్షన్
సాంఘికం, చారిత్రకం, జానపదం, సైన్స్ ఫిక్షన్ సంబంధిత అంశాలతో కథలరూపంలో, నవలలరూపంలో రచనలు చేస్తుంటారు. అయితే వీటిలో చారిత్రకం, జానపదం, సైన్స్ఫిక్షన్ నవలలుకాని, కథలుకాని రావడం ఎప్ప్పుడో తప్ప అరుదుగానే వస్తుంటాయి. అయితే అప్ప్పుడప్ప్పుడు వచ్చినా ఆ రచనలు పాఠకులకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే రీతిలో సాగుతాయి. అటువంటి రచనే సైన్స్ ఫిక్షన్ నవలల పోటీ 2024లో బహుమతి పొందిన ప్రముఖ రచయిత సలీంగారు అందించిన ‘చంద్రునికో నూలుపోగు’ నవల. ప్రారంభం నుంచి ఆద్యంతం వరకు చదువరులను […] The post ఆద్యంతం అలరించే సైన్స్ ఫిక్షన్ appeared first on Visalaandhra .
Vijay D and Rashmika have to Make it Official
The entire world is aware that actors Vijay Deverakonda and Rashmika Mandanna will tie the knot in a destination wedding this month. The news is being circulated widely and the pictures from the arrangements from their Udaipur wedding too are out. The Reception invitation is making waves across social media but Vijay Deverakonda and Rashmika […] The post Vijay D and Rashmika have to Make it Official appeared first on Telugu360 .

22 C