SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

17    C
... ...View News by News Source

రోడ్డు ప్రమాదంలో దంత వైద్యురాలు మృతి

అమరావతి: రోడ్డు ప్రమాదంలో దంతవైద్యురాలు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కారు అదుపుతప్పి ముందున్న వాహనాన్ని ఢీకొట్టి అనంతరం ఢివైడర్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాగల్లు చెందిన జోన్నకూలి లిఖిత(23) ఓ ప్రైవేటు కాలేజీలో లిఖిత డెంటల్ కోర్సు చదువుతోంది. ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉండి చదువు కొనసాగిస్తున్నారు. కారులో ఆమె తన ముగ్గురు స్నేహితులతో కలిసి రాజమహేంద్రవరం నుంచి వసతి గృహానికి కారులో వెళ్తుండగా రాజానగరం, దివాన్ చెరువు మధ్య గుర్తు తెలియని వాహనానికి కారు ఢీకొంది. అనంతరం డివైడర్ ఢీకొట్టి బోల్తా పడింది. ముందు సీట్లో కూర్చున్న లిఖిత ఘటనా స్థలంలో మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 2 Feb 2026 7:11 am

ఉక్రెయిన్ బస్సుపై రష్యా దాడి: 15 మంది మృతి

రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది, ఒక వైపు ముగిసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా మరో వైపు ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో దాడులకు తెగపడింది. నిప్రో నగరంలో బస్సుపై డ్రోన్ తో దాడి చేయడంతో 15 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడినట్టు సమాచారం. ఉక్రెయిన్ లోని అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తికి సంస్థకు చెందిన బస్సు అని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. నిప్రో పెట్రోవ్క్స్ ప్రాంతంలోని విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన డిటిఇకె గనులపై రష్యాదాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపణలు చేశారు. షిఫ్ట్ ముగిసిన అనంతరం కార్మికులు బస్సులో వెళ్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. కనిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్రెయిన్ పై దాడులను తాత్కాలికంగా ఆపేందుకు రష్యా అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపిన రోజుల వ్యవధిలో దాడి జరగడం గమనార్హం.

మన తెలంగాణ 2 Feb 2026 6:45 am

వికసిత భారతానికి 'కర్తవ్య'పథం

న్యూఢిల్లీ : ప్రపంచ డేటా సెంటర్లకు టాక్స్ హాలిడే, వ్యవసాయం, పర్యాటక రంగాలకు ప్రోత్సాహంతో పాటు., తయారీ రంగానికి పెద్దపీట వేస్తూ, దేశ అభివృద్ధిని సుస్థిరంగా ముందుకు నడిపే 2026-27 కేంద్ర బడ్జెట్ ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక ఒడుదుడుకులు నేపథ్యంలో నిలకడగా వృద్ధిని కొనసాగించే దీర్ఘకాలిక బ్లూ ప్రింట్ గా నిర్మల రూ. 53.5 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రకటించారు. లోక్ సభలో రికార్డు స్థాయిలో 9వ సారి వరుసగా బడ్జెట్ ను సమర్పించిన నిర్మలా సీతారామన్ ప్రభుత్వ మూలధన వ్యయాన్ని12.2 లక్షల కోట్లకు పెంచారు. గత సంవత్సరం ఇది రూ.11.2 లక్షల కోట్లుగా ఉంది. బడ్జెట్‌లో ఆర్థికమంత్రి పూర్తిగా ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి, ప్రజాదరణ పొందిన పథకాలను విస్మరించడం, పారిశ్రామిక వేత్తలకు నిరాశ కల్గించడంతో బడ్జెట్ స్టాక్ మార్కెట్ ను కుదిపివేసింది. ఒక్క సారిగా పలు స్టాక్స్ కుప్పకూలడం సంచలనంగా మారింది. డెరివేటివ్స్ ట్రేడింగ్ పై అధిక లావాదేవీ పన్ను సెంటిమెంట్ పై ప్రభావం చూపింది. ప్రధానంగా సామాన్య ప్రజలకు ఊరటకలిగించిన విషయాలలో 17 కేన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకం మినహాయించడం, బ్యాగేజీ నియమ నిబంధనలను సడలించడం, వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 10 శాతం తగ్గించడం ద్వారా కస్టమ్స్ విధానాన్ని సరళీకృతం చేయడం వంటివి ఉన్నాయి. ఔషధాలు, సెమీ కండక్టర్లు, అరుదైన - భూ ఖనిజాలు, రసాయనాలు, మూలధన వస్తువులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు వంటి ఏడు రంగాలలో ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థికమంత్రి తెలిపారు. ఉద్యోగ కల్పన, సాంకేతికతతో కూడిన అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. పశుసంవర్థక, మత్స్య సంపద, అధికవిలువ గల వ్యవసాయ రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించనున్నట్లు తెలిపారు. భారతదేశాన్ని బయో ఫార్మా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు వచ్చే ఐదేళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించినట్లు నిర్మల ప్రకటించారు. వస్త పరిశ్రమకు పెద్దపీట వేయనున్నారు. ఎగుమతుల ప్రోత్సాహం కోసం సమగ్ర కార్యక్రమాన్ని ప్రకటించిన ఆర్థికమంత్రి. పర్యావరణ పర్యాటకానికి ప్రోత్సాహం పర్యావరణ హితమైన పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో పర్యావరణ పరంగా స్థిరమైన పర్వత మార్గాల అభివృద్ధితో పాటు, భారతీయ ప్రాచీన సంసృ్కతికి అద్దంపట్టే 15 పురావస్తు ప్రదేశాల అభివృద్ధిని ప్రతిపాదించారు. చిన్న వ్యాపారులకు మద్దతుగా నిలిచేందుకు, ప్రమాణాలతో కూడిన సంస్థల ప్రోత్సాహానికి రూ. 10,000 కోట్లతో ఎస్‌ఎంఇ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం బడ్జెట్ సందర్భంగా ఆదాయపు పన్నువ్యవస్థలో భారీ మార్పులు, పలు ఉత్పత్తులపై జిఎస్టీ తగ్గింపు కొనసాగించడం వల్ల ప్రజలకు పెద్ద ఊరట లభించింది.అవి, మౌలిక సదుపాయాలపై ఖర్చు, కార్మక చట్టాల సవరణ, ఆర్ బిఐ వడ్డీ రేటు తగ్గింపులతో మరింత సౌకర్యంగా ఉంది. ఈ కారణంగానే భారత ఆర్థికవ్యవస్థ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై విధించింన శిక్షాత్మక 50 శాతం సుంకాన్ని తట్టుకునేందుకు సహాయ పడింది. 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ క్లిష్టమైన నేపథ్యంలో వచ్చింది. దేశంలో డిమాండ్ నిలకడగా ఉండి, 'ద్రవ్యోల్బణం కాస్త తగ్గినప్పటికీ, బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అస్థిర వస్తువుల ధరలు, ప్రధాన కేంద్ర బ్యాంకుల అసమాన ద్రవ్య సడలింపులతో ప్రపంచ అనిశ్చితుల మధ్య ఈ బడ్జెట్ రూపకల్పన చేయాల్సి వచ్చింది. అయినా ప్రభుత్వం స్వదేశంలో వినియోగాన్ని పెంచడానికి, ఉపాధి కల్పనను వేగవంతం చేసేందుకు, మూలధన వ్యయాన్ని పెంచడానికి ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఆదే సమయంలో ఆర్థికలోటు తక్కువగా ఉంచేందుకు కృషి చేస్తున్నది. అత్యంత క్లిష్ట పరిస్థితులలోనూ భారతదేశం వికసిత భారత్ వైపు వడివడిగా అడుగులు వేస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విస్తరిస్తున్న వాణిజ్యం, మూలధనం అవసరాలతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ప్రపంచమార్కెట్లతో అనుసందానం కావాలని ఆమె ఆకాంక్షించారు. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణం- జిడిపి నిష్పత్తిని 56.1 శాతం నుంచి 55.6 శాతానికి తగ్గించడం, ప్రస్తుత ఆర్థి క సంవత్సరంలో ఆర్థికలోటును 4.4 శాతం నుంచి 4.3 శా తానికి తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. 10వేల కోట్లతో బయో ఫార్మా తయారీ కేంద్రం రూ. 10,000 కోట్ల వ్యయంతో బయో ఫార్మా తయారీ కేంద్రం, సెమీ కండక్టర్ మిషన్ రెండో దశ, ఎలక్ట్రానిక్ భాగాల తయారీకి రూ. 40,000 కోట్ల వ్యయం, ఖనిజ సంపన్న రాష్ట్రాల్లో అరుదైన భూమి కారిడార్ లను ఏర్పాటు చేయడం వంటి చర్యలను ఆర్థికమంత్రి ప్రకటించారు.

మన తెలంగాణ 2 Feb 2026 6:00 am

2Feb2026 |ఆదివారం పంచాంగం |మాఘ పౌర్ణమి విశేషాలు, రాశి ఫలితాలు

2Feb2026 | ఆదివారం పంచాంగం | మాఘ పౌర్ణమి విశేషాలు, రాశి ఫలితాలు

ప్రభ న్యూస్ 2 Feb 2026 6:00 am

వెనెజువెలా చమురు కొనుగోలుకు భారత్ ముందుకొచ్చింది

` దీనికి సంబంధించిన ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాం ` చైనా కూడా మాతో చర్చలు జరిపే అవకాశం : ట్రంప్ వాషింగ్టన్(జనంసాక్షి): భారత చమురు దిగుమతుల …

జనం సాక్షి 2 Feb 2026 5:30 am

రాష్ట్రంపై సీతకన్ను

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ వి కసిత్ భారత్ లక్షానికి అనుగుణంగా రాష్ట్రం సహకరిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి అన్ని రంగాల్లో మొండి చేయి చూ పారని రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ప్రజాభవన్‌లో విలేఖరుల స మావేశంలో డిప్యూటీ సిఎం మాట్లాడారు. కేంద్రం ప్రవేశ పెట్టిన రూ.53.47 లక్షల కోట్ల బడ్జెట్‌లో రాష్ట్రం కోసం ఏదైనా ఉంటుంది అని ఆశ పడ్డామ ని ఎటువంటి కేటాయింపులు లేకపోవడం అన్యాయమన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి, ఎంపిలు పలు మార్లు ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలిసి చేసిన విజ్ఞప్తులు బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. మూసీ, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టులను గుర్తించి నిధులు ఇస్తారనుకుంటే ఏమీ ఇ వ్వలేదన్నారు. పది వేల కోట్లతో వచ్చే ఐదు సంవత్సరాల్లో కేంద్రం బయోఫార్మా అభివృధ్దిపై ఫోకస్ చేసిందని, దాంట్లో అయినా రాష్ట్రం గుర్తు రాలేదని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన ఎకో సిస్టమ్ రాష్ట్రంలో  అభివృద్ధి చెందిందని, కెమికల్ పార్క్ లకు హైదరాబాద్ ఫార్మా హబ్ గా ఉందని అందులో సైతం కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో స్పోర్ట్‌ని అభివృద్ధి చేసేందుకు విజన్ డ్యాక్యూమెంట్‌లో ప్రణాళికలు సిద్దం చేశామని, స్పోర్ట్ యూనివర్శిటీ పెట్టామని వీటి అభివృద్ధికి కూడా కేంద్ర సహకరించలేదన్నారు. ఆడియో, వీడియో, కామిక్స్, గేమింగ్స్ లాంటి ఆరెంజ్ ఎకానమీకి హైదరాబాద్ కేంద్రంగా ఉందని, తెలంగాణ ఏం తప్పు చేసిందని దాన్ని కూడా బాంబేకు తరలించారని డిప్యూటీ సిఎం ప్రశ్నించారు. ప్రపంచానికి కోవిడ్‌లో వ్యాక్సీన్ అందించిన హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఉందని, రీజినల్ మెడికల్ హబ్ అంటూ బడ్జెట్‌లో చెప్పిన కేంద్రం రాష్ట్రానికి ఎటువంటి నిధులు కేటాయించలేదని భట్టి తెలియజేశారు. మూసి ప్రక్షాళన ఊసే లేదని, యెనెస్కో గుర్తింపు పొందిన రామప్ప, మున్నూరు, కవ్వాల్ టైగర్ ఫారెస్ట్, కృష్ణా, గోదావరి మధ్య పచ్చని వాటర్ ఫాల్స్, లాంటి పర్యటక ప్రాంతాలను పట్టించుకోలేదని, ప్రపంచం గుర్తించినా, నిధులు విషయంలో కేంద్రం మాత్రం చిన్న చూపు చూసిందన్నారు. సమ్మక్క సారక్క దర్శనానికి న్యూజిలాండ్ ట్రైబ్స్ వచ్చిన విషయాన్ని డిప్యూటీ సిఎం గుర్తు చేశారు. సెమీ కండక్టర్‌ల తయారీ నేడు ప్రంపచానికి అవసరమయిన రంగమని హైదరాబాద్ లాంటి ఎకో సిస్టమ్ ఉన్న రాష్ట్రానికి సెమీకండక్టర్ల తయరీకి చేయూత ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్రం ఎస్సి, ఎస్టి, మైనార్టీ, ఇతర సంక్షేమం గురించి ఆలోచనే లేదని, ఉపాధి హామీ పథకాలనికి పేరు మార్పుతో పాటు, బడ్జెట్‌లో కూడా తూట్లు పొడిచారని భట్టి ధ్వజమెత్తారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఎర్త్ మినరల్స్ అని రాష్ట్రంలోని సత్తుపల్లి, రామగుండం, సింగణి లాంటి ప్రాంతాల్లో విలువయిన లిథియం, స్కాండియం లాంటి మినరల్స్ ఉన్నాయని వాటి కోసం రాష్ట్రానికి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఫిజికల్ డెఫిషిట్ లో రాష్ట్రానికి నాలుగు శాతం ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, కేంద్రం మాత్రం 4.3 శాతం ఫిజికల్ డెఫిషిట్ పెట్టుకుందని, రాష్ట్రానికి మాత్రం అనుమతి ఇవ్వలేదని, తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఈ బడ్జెట్ సెషన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లను కలిసి నిధులు కేటాయించాలని వినతి పత్రాలు ఇవ్వాలని కోరారు.

మన తెలంగాణ 2 Feb 2026 5:30 am

తప్పు చేస్తే విచారించొద్ద్దా?

` కేసీఆర్ చట్టానికి అతీతుడా? ` టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్(జనంసాక్షి):మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు సంబంధించిన సిట్ విచారణ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ …

జనం సాక్షి 2 Feb 2026 5:26 am

మీ ఆదేశాల‌ తోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా?

` ఐదు గంటలపాటు కేసీఆర్‌ను విచారించిన సిట్ ` నందినగర్‌లోని నివాసంలోనే మాజీ సీఎంను ప్రశ్నించిన అధికారులు ` విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డులు సేకరణ …

జనం సాక్షి 2 Feb 2026 5:25 am

సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన గౌరవం

హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో జరిగే ఏఐ పాలసీ సదస్సుకు ఆహ్వానం వర్చువల్‌గా హాజరవుతానన్న ముఖ్యమంత్రి హార్వర్డ్ విద్యార్థులతో చర్చిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్: ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ …

జనం సాక్షి 2 Feb 2026 5:22 am

వికసిత్ భారత్ లక్ష్యమట!

` సామన్యులకు లేదు ఊరట! ` మూడు కర్తవ్యాలు లక్ష్యంగా సాధనే లక్ష్యం ` ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకొస్తున్నాం ఆత్మనిర్భరత వల్లే 7 శాతం గ్రోత్ …

జనం సాక్షి 2 Feb 2026 5:20 am

కెసిఆర్‌పై ప్రశ్నలవర్షం

మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆదివారం సుదీర్ఘంగా విచారించింది. మధ్యా హ్నం 3 గంటలకు నందినగర్‌లోని కెసిఆర్ నివాసంలో సిట్ అధికారులు 4.45 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం కెసిఆర్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. విచారణ ముగిసిత తర్వాత కెసిఆర్ నివాసం నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫోన్ ట్యా పింగ్ ఆదేశాలు ఎవరి సూచనలతో జారీ అయ్యాయన్న విషయంపై, నిర్ణయ ప్రక్రియలో కెసిఆర్ పాత్రపై సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఈ విచారణలో కెసిఆర్‌కు సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించిన ట్లు తెలిసింది. గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆ ధారంగా కెసిఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించిన ట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌పై తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కెసిఆర్ సిట్ విచారణలో చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామంపై ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిస్తారని, అది వారి బాధ్యత అని చెప్పినట్లు తెలిసింది. ఆ సమాచారం ఎలా సేకరించారో సిఎంకు అవసరం లేదు కదా..? అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎప్పటినుంచి మొదలైంది..? ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారా..? అని కెసిఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులకు మీరు స్వయంగా ఆదేశాలు జారీ చేశారా..? అనే ప్రశ్నను స్పష్టంగా అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై కెసిఆర్ నుంచి స్పష్టత తీసుకునేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పటి నుంచి ప్రారంభమైందనే విషయంపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీసినట్లు సమాచారం. ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు.. అది సాధారణ భద్రత కోసమా... లేక రాజకీయ అవసరాల కోసమా..అంటూ పలు అనుబంధ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా..వారి ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారా..అంటూ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విచారణలో అత్యంత కీలకంగా మారిన ప్రశ్న ఇదేనని సమాచారం. ప్రభాకర్ రావు పదవీకాలం పొడగింపుపై విచారణ.. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారం కూడా సిట్ అధికారుల విచారణలో ప్రధాన అంశంగా మారింది. పదవీకాలం ముగిసిన ప్రభాకర్ రావుకు మళ్లీ పదవిని ఎందుకు పొడిగించారు...ఆ నిర్ణయం వెనుక కారణాలు ఏంటి..? అంటూ కెసిఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు.. పరిపాలనా నియమావళికి విరుద్ధంగా ఒకే వ్యక్తికి రెండు కీలక బాధ్యతలు అప్పగించడంపై కూడా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు అప్పగించారు.. అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉందా..? అనే కోణంలో విచారణ సాగినట్లు తెలిసింది. ఎంఎల్‌ఎ కొనుగోలు కేసులో సమాచారం ఎలా వచ్చింది..? ఎంఎల్‌ఎ కొనుగోలు కేసు సమయంలో తీసుకున్న చర్యలపై కూడా కెసిఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. మీ పార్టీ ఎంఎల్‌ఎలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసింది.. ఆ సమాచారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చిందా..?అన్న అనుమానాలతో అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. పార్టీ నిధులతో ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు చేశారా..? అని సెట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు పార్టీ నిధులు కేటాయించారా.. ప్రభుత్వ నిధులు కాకుండా పార్టీ డబ్బులు ఎందుకు ఉపయోగించారు..? అంటూ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ ఫండ్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయలేదని, ఆ అవసరం పార్టీకి లేదని చెప్పినట్లు తెలిసింది. బిఆర్‌ఎస్ పార్టీకీ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వారి ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ జాబితాలో ఎందుకు ఉన్నాయనే అంశంపై కెసిఆర్ వివరణ కోరినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు..ఎలాంటి అధికారిక ఫైళ్లు ఉన్నాయి.. భద్రతా కారణాల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ జరిగిందా..? అన్న అంశాలపై సిట్ అధికారులు సమగ్ర విచారణ జరిపినట్లు సమాచారం. కార్యకర్తలకు కెసిఆర్ అభివాదం సిట్ విచారణ ముగిసిన తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ నేతలతో భేటీ అయిన అనంతరం అధినేత బయటకు వచ్చి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు. నందినగర్‌లోని కెసిఆర్ నివాసానికి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు సహా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.పోలీసుల బారీకేడ్లు తోసుకుంటూ కెసిఆర్ నివాసానికి కార్యకర్తలు పరుగులు తీశారు.జై కెసిఆర్, సిఎం..సిఎం అంటూ నినాదాలు చేశారు. 

మన తెలంగాణ 2 Feb 2026 5:00 am

డొల్ల కేసు అని తేలింది

మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదని, తమ ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదని ఈరోజు(ఆదివారం)తో తేలిపోయిందని బి ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ అధినేతల పైశాచికానందం, ఇందులో ఏమీ లేదని సిట్ అధికారులు కూడా అర్థమైపోయిందని, దీంతో ఇక్కడితో ఈ కేసుకు ఫుల్‌స్టాప్ పడుతుందని భావిస్తున్నామని అన్నారు. సిట్ విచారణ అనంతరం కెసిఆర్ ఎర్రవెళ్లికి వెళ్లిన తర్వాత నందినగర్ నివాసంలో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు తేలేమని బిజెపి, కాంగ్రెస్ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకుందుకే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే కెసిఆర్‌ను విచారణను పిలవడంతో ఆం తర్యం అదేనని ఆయన ఆరోపించారు. కెసిఆర్ మీద బురదజల్లడం అంటే సూర్యుడిపైన ఉమ్మేసినట్లే అవుతుందని ఇప్పటికైనా  అర్థమై ఉంటుందని అన్నారు. సిట్ విచారణకు కెసిఆర్ హాజరు కావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ చట్టాన్ని గౌరవించే బాధ్యతాయుతమైన పౌరుడిగా సిట్ అధికారులకు కెసిఆర్ పూర్తిగా సహకరించారని తెలిపారు. ఆయనను అడిగిన ప్రశ్నలకు కుండబద్దలు కొట్టినట్లుగా సమాధానం చెప్పి సిట్ అధికారుల కళ్లు తెరిపించారని చెప్పారు. సిట్ ఎవరి నేతృత్వంలో నడుస్తుందని ప్రశ్నించారు. సిట్ నేతృత్వం వహించేది మహేష్‌కుమార్ గౌడ్..? అధికారులా..? అంటూ ఎద్దేవా చేశారు. చట్టం ముందు అందరూ సమానమే అని, విచారణ చేస్తే ఆందోళన చేస్తారా..? అని పిసిసి ఛీఫ్ ప్రశ్నిస్తున్నారని, మరి ఇడి కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను విచారిస్తే మీరెందుకు వెళ్లి రాజ్‌భవన్ ముందు ఆందోళనలు చేశారని నిలదీశారు. తెలంగాణ ప్రజలచేత రెండు సార్లు ఎన్నుకోబడిన పాపులర్ సిఎం, రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కెసిఆర్‌ను వేధిస్తే కాళోజీ నారాయణరావు చెప్పినట్లు ఉక్కుపాతరేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పట్టించుకునే నాయకుడే లేరని విమర్శించారు. సిఎం రేవంత్‌రెడ్డి ఛార్టెడ్ ప్లైట్లలో చెక్కర్లు కొడుతూ గాలి తిరుగుడు తిరుగుతున్నారని, ఆ డబ్బులు ఎవడి అబ్బ సొమ్మని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పట్టపగలు కోఠిలో కాల్పులు జరిగాయి, మరోవైపు గంజాయి స్మగ్లర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్‌పై కారు ఎక్కించి చంపేశారని, రెండో కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారక్క జాతర అధ్వాన్న ఏర్పాట్లతో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, వాటిని పట్టించుకునే నాథుడు లేడు, మంత్రులకు సోయి లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసులో లీకులే తప్ప ఆధారాల్లేవు ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులే తప్ప ఆధారాల్లేవు అని కెటిఆర్ తేల్చిచెప్పారు. ఈ కేసులో డొల్లతనం బయటపడిందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ అటెన్షన్‌ను దెబ్బ తీయడానికే విచారణ పేరుతో డ్రామా చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ప్రభుత్వం బాకీపడ్డ మొత్తానికి సంబంధించిన బాకీకార్డులు పంచుతూ వివరిస్తామని తెలిపారు.ఫోన్ ట్యాపింగ్‌లు, కుంభకోణాలు అంటూ రెండేళ్లుగా 1,2,3గా సిట్‌లు వేస్తూ హిట్ 1, హిట్ 2, హిట్ 3 సినిమా లాగా టైం పాస్, బక్వాస్ తప్ప ఇందులో ఏమీ లేదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే లీకులు విశ్వసించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికలపై కెసిఆర్ ఆరా..తిరిగి ఎర్రవెళ్లికి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం కెటిఆర్, హరీష్ రావు, పార్టీ ముఖ్యనేతలతో కెసిఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై చర్చించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. గ్రౌండ్ లెవల్లో పార్టీ బలంగా ఉందని, బరిలో రెబల్స్ లేకుండా చూసుకోవాలని సూచించారు. పార్టీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం నందినగర్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కెసిఆర్ బయలుదేరి వెళ్లారు.

మన తెలంగాణ 2 Feb 2026 4:30 am

సౌమ్య మృతికి బాధ్యులపై కఠిన చర్యలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబు ల్ సౌమ్య మృతికి కారణమైనవారిపై కఠిన చర్య లు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీ సు శాఖను ఆదేశించారు. విధి నిర్వహణలో సౌ మ్య ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్య క్తం చేశారు. సౌమ్య మృతిపట్ల రేవంత్‌రెడ్డి ఆదివా రం తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సౌమ్య కు టుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామ ని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. విధి నిర్వహణ లో అసాధారణ తెగువ ప్రదర్శించి అసువులు బా సిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రా ష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతికకాయానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నివాళులర్పించారు. అనంతరం సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌమ్య లేని లోటు భర్తీ చేయలేనిదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఆమె సర్వీస్ కాలం అంటే రిటైర్మెంట్ వయసు వరకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. విధి నిర్వహణలో ఆమె చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కాగా ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక్క రోజు వేతనాన్ని సౌమ్య కుంటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని, తమ సహచరిని కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది భద్రత ప్రభుత్వ కర్తవ్యమని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జోలికి వచ్చే దుండగుల వెన్ను వణికించేలా అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు ఇచ్చే నిర్ణయం తమ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల ముఠాల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి రెండు నిముషాల మౌనం పాటించి, ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఖురేషి, ఉప కమిషనర్లు జె.హరికిషన్, అంజన్ రావు, చంద్రయ్య, ప్రదీప్ రావు, కృష్ణ ప్రియ, డి.శ్రీనివాస్, నవీన్ కుమార్, అంజిరెడ్డి, సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, తెలంగాణ ప్రొహిబిషన్, ఆబ్కారీ గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.లక్ష్మణ్ గౌడ్, కార్యదర్శి చంద్ర శేఖర్, విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, భరత్, ఏడుకొండలు, ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం కృష్ణ, మధుబాబు, కానిస్టేబుల్ సంఘం అధ్యక్షుడు పి.రాజిరెడ్డి, నాగరాజు, అనంత్ రెడ్డి, మల్లేష్‌తో పాటు సుమారుగా 500 మందికిపైగా ఆబ్కారీ సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం :మహేష్ కుమార్ గౌడ్ గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి, నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా అక్రమ గంజాయి రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన సౌమ్య సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. మృతిచెందిన సౌమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో వారికి ధైర్యం చేకూరాలని ప్రార్థించారు. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద సౌమ్యకు నివాళి ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి పట్ల నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ఎక్సైజ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు ఆదివారం నివాళులర్పించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపి అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

మన తెలంగాణ 2 Feb 2026 4:00 am

సోమవారం రాశి ఫలాలు (02-02-2026)

మేషం సమాజంలో సేవ కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు సాధిస్తారు. వృషభం కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. మిధునం ఋణ పరమైన ఒత్తిడిలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలాకష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు. కర్కాటకం సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలు పురోగతిలో సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సింహం చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తుంది. చేపట్టిన వ్యవహారములలో అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కన్య ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తుల ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. వృశ్చికం సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ధనస్సు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి. మకరం సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం కలుగుతుంది. ఖర్చుకు మించిన ఆదాయం సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగమున ఆశించిన అవకాశములు అందుతాయి. కుంభం ప్రయాణాలు వాయిదాపడతాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. మీనం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు పొందుతారు.  

మన తెలంగాణ 2 Feb 2026 12:00 am

dammapeta |మందలపల్లి గురుకులంలో విద్యార్థి పరార్.

సమయస్ఫూర్తితో బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ఇంటెలిజన్స్ కానిస్టేబుల్ భార్య దమ్మపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 11:13 pm

ఉత్సాహంగా అలెన్‌ వరల్డ్‌ జూనియర్ రన్‌

అలెన్‌ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సాహంగా.. ఉల్లాసంగా జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ రన్‌లో హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ క్రీడాకారులతో సహా 180కి పైగా పాఠశాలలకు చెందిన రెండు వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. స్పాట్‌ఆన్‌ స్పోర్ట్స్‌ సంస్థ నిర్వహించిన ఈ రన్‌ను ఆసియా గేమ్స్‌ బ్రాంజ్‌ మెడలిస్ట్‌ అగసర నందిని జెండా ఊపి ప్రారంభించింది. దీనికి ముందు ఆమె మాట్లాడుతూ క్రీడల్లో అందరికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రైవేట్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌తో కలిపి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఈ రన్‌లో పాల్గొనే అవకాశం కల్పించడం గొప్ప విషయమని నిర్వాహకులు, స్పాట్‌ఆన్‌ స్పోర్ట్స్‌ సీఈఓ రోహిత్‌ మిశ్రాను నందిని అభినందించింది. పిల్లల ఉత్సాహం చూస్తుంటే వీరిలో పదేళ్ల కిందటి తన కెరీర్‌ ప్రారంభ రోజులు గుర్తు వస్తున్నాయని తెలిపింది. క్రీడలపై పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ప్రశంసించింది. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థలు ప్రోత్సహించినప్పుడే రాష్ట్రంలో, దేశంలో క్రీడారంగం అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడింది. రూ.3 లక్షల ప్రైజ్‌మనీ గచ్చిబౌలిలో స్టేడియంలో మొదలైన రన్‌, టీమ్స్‌ గేటు నుంచి గోపీచంద్‌ అకాడమీ, ఐఎస్‌బీ సర్కిల్‌ మీదగా తిరిగి స్టేడియంలో ముగిసింది. 1కే కాస్ట్యూం ర‌న్‌లో పిల్ల‌ల‌తో పాటు త‌ల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 1కే, 3కే, 5కే, 10కే విభాగాల్లో కలిపి మొత్తం రూ.3 లక్షల ప్రైజ్‌ మనీని 84 మంది క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌, అలెన్‌, డీపీఎస్‌ కొల్లూరు, పటాన్‌చెరువ్‌, అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, బిర్లా ఓపెన్‌ మైండ్స్‌, మీరుతో పాటు 180కి పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ రన్‌లో పాల్గొన్నారు.

మన తెలంగాణ 1 Feb 2026 11:00 pm

వికసిత్ భారత్ బడ్జెట్:ఎంపి ఈటల

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారని బిజెపి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ ప్రశంసించారు. అభివృద్ధి, ప్రజా రంజక బడ్జెట్ అని ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉపాధి, చేతి వృత్తుల వారికి, ఆరోగ్యానికి పెద్ద పీట వేశారని ఆయన తెలిపారు. దూరదృష్టితో దీర్ఘకాలిక నిర్ణయాల వల్ల భారత జిడిపి ఏడు శాతం పెరిగిందని ఆయన తెలిపారు. గత ఏడాది యాభై లక్షల కోట్ల రూపడాయల బడ్జెట్ ప్రవేశపెడితే ఈ ఏడాది యాభై మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారని ఆయన చెప్పారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గత ఏడాది బడ్జెట్‌లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెడితే ఈ ఏడాది కూడా పెట్టారని ఆయన తెలిపారు. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియాకు అనుగుణంగా యువశక్తి దేశ పురోగమనంలో భాగస్వాములు చేయాలని లక్షంతో బడ్జెట్ పెట్టారని ఆయన చెప్పారు. ఇంకా అనేక మందులపై దిగుమతి పన్ను తగ్గించారని, క్యాన్సర్‌తో పాటు పదిహేడు రకాల మందులపై పన్ను రాయితీ ఇచ్చి పేద రోగులకు ఉపశమనం కల్పించారని ఈటల రాజేందర్ తెలిపారు.

మన తెలంగాణ 1 Feb 2026 10:44 pm

ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 124

డబ్ల్యూపిఎల్ 2026 సీజన్ లో ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ యూపి వారియర్స్ ఆదివారం వడోదరలోని బిసిిఎ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది . టాస్ ఓడి  బ్యాటింగ్ కు దిగిన  యూపి వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పొయి 123 పరుగులు చేసింది. దీప్తి శర్మ(24), శిఖా పాండే(23), సిమ్రన్ షైక్(22) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మారిజేన్ కాప్ 3, చినెల్లీ హెన్నీ 2, శ్రీ చరణి 2, మిన్ను మణి ఒక వికెట్ తీశారు.

మన తెలంగాణ 1 Feb 2026 10:33 pm

ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

 ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ లో పెండింగ్ నిధులను నెలవారీగా విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ. 720 కోట్లు విడుదల చేసింది. జనవరి మాసానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ. 720 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత సంవత్సరం జూన్ నెలాఖరులో రూ.183 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసంగా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా విడుదల చేసిన నిధుల్లో 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్ క్యాష్‌మెంట్ పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసింది. వీటితోపాటు విడుదలైన బిల్లులో గ్రాట్యుటీ, జిపిఎఫ్, సరెండర్ లీవ్ లు,అడ్వాన్సులున్నాయి.

మన తెలంగాణ 1 Feb 2026 10:20 pm

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఇడి క్లీన్‌చిట్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎపి సిఎం చంద్రబాబుకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) క్లీన్ చిట్ ఇచ్చింది. రెండు రోజుల కిందట విశాఖపట్నంలోని పిఎంఎల్‌ఎ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో నిధుల మళ్లింపు, నేరపూరిత కార్యకలాపాల్లో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇడి స్పష్టంగా పేర్కొంది. ఇడి దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, దానికి సంబంధించిన వ్యక్తులు షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులను మళ్లించినట్లు గుర్తించింది. వికాస్ ఖన్వేల్కర్, సుమన్ బోస్ , ఇతరులు ఈ నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఇడి తేల్చింది. 2024 అక్టోబర్‌లో రూ.23.5 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. 2023 సెప్టెంబర్‌లో వైసిపి ప్రభుత్వ హయాంలో సిఐడి కూడా కేసులు పెట్టింది. ఆయనను అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలు లో పెట్టింది. కానీ ఒక్క రూపాయి ఆర్థిక లావాదేవీలను చూపించలేకపోయింది. తప్పుగా నమోదు చేసిన కేసుగా చివరికి గుర్తించి విజయవాడ లోని ఎసిబి కోర్టులో క్లోజర్ రిపోర్టును సమర్పించింది. చంద్రబాబుపై మోపిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని సిఐడి తన నివేదికలో వెల ్లడించింది. ఈ నివేదికను అంగీకరించిన కోర్టు, జనవరి 13న చంద్రబాబుతో పాటు మరో 36 మందిపై ఉన్న కేసును అధికారికంగా కొట్టివేసింది. ఈ పరిణామాలు రాజకీయంగా, న్యాయపరంగా చంద్రబాబుకు పెద్ద విజయంగా నిలిచాయి. ప్రభుత్వ నిధులను దారి మళ్లించి స్కామ్ చేశారన్న ఆరోపణలను కేంద్ర దర్యాప్తు సంస్థ, రాష్ట్ర దర్యాప్తు సంస్థ రెండూ తోసిపుచ్చడంతో ఈ సుదీర్ఘ న్యాయ వివాదానికి తెరపడింది. అడ్వకేట్ జనరల్ (ఎజి) దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ సుదీర్ఘ దర్యా ప్తు తర్వాత చంద్రబాబుతోపాటు పలువురు నేతలకు స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని కోర్టు నిర్దారించిందని వెల్లడించారు.

మన తెలంగాణ 1 Feb 2026 10:07 pm

SIT Grills Former KCR in Phone Tapping Investigation

The phone tapping case in Telangana has entered a decisive phase with the questioning of former Chief Minister K Chandrashekar Rao by the Special Investigation Team. The inquiry took place on Sunday at his residence in Nandinagar Hyderabad and lasted for more than four hours. Officials began the examination at 3 pm after making arrangements […] The post SIT Grills Former KCR in Phone Tapping Investigation appeared first on Telugu360 .

తెలుగు 360 1 Feb 2026 10:03 pm

ఆస్ట్రేలియా ఓపెన్ విజేత అల్కరాజ్

 ప్రతిష్ఠాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అత్యంత చిన్నవయసులో కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించిన ఆటగాడిగా నయా చరిత్ర సృష్టించాడు. అల్కరాజ్ 22 ఏళ్ల వయసులో నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా అల్కరాజ్‌కు ఇది ఏడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇప్పటికే వింబుల్డన్, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్‌లను రెండేసి సార్లు గెలుచుకున్నాడు. తొలిసారిగా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో అల్కరాజ్ 26, 62, 63,75తో సెర్బియా యోధుడు, నాలుగో సీడ్ నొవాక్ జకోవిచ్‌ను ఓడించాడు. కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని భావించిన నొవాక్ మరోసారి నిరాశే మిగిలింది. ఆరంభం నుంచే మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌లో నొవాక్ ఆధిపత్యం చెలాయించాడు. అల్కరాజ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ తర్వాతి సెట్‌లలో అల్కరాజ్ అనూహ్యంగా పుంజుకున్నాడు. తన మార్క్ షాట్లతో నొవాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇదే క్రమంలో రెండో, మూడో సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ నాలుగో సెట్‌లో అల్కరాజ్‌కు నొవాక్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన అల్కరాజ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్‌గా అవతరించాడు.

మన తెలంగాణ 1 Feb 2026 9:59 pm

Chandrababu Naidu and Bill Gates Join Hands to Drive Andhra Pradesh Health Revolution

Andhra Pradesh government has launched the ambitious Sanjeevani Project. The initiative aims to provide comprehensive health screening to citizens across the state. Chief Minister Chandrababu Naidu announced that nearly 72 lakh people will undergo medical tests under the Sanjeevani Project. Based on these tests, detailed digital health profiles will be created for every individual. The […] The post Chandrababu Naidu and Bill Gates Join Hands to Drive Andhra Pradesh Health Revolution appeared first on Telugu360 .

తెలుగు 360 1 Feb 2026 9:37 pm

అండర్-19 ప్రపంచకప్‌.. సెమీస్ కు చేరిన భారత్

 అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్ యువ జట్టు పాకిస్థాన్‌ యువ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసింది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. చివర్లో కనిష్క్ చౌహాన్ (35) విలువైన పరుగులు జోడించాడు. 253 పరుగుల లక్ష్య చేధనలో పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే ఈ లక్ష్యాన్ని 33.3 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంది. కానీ భారత బౌలర్ల ధాటికి వారు కనీసం గెలవలేకపోయారు. ఉస్మాన్ ఖాన్ (66) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే తన స్పిన్ మ్యాజిక్‌తో 3 వికెట్లు పడగొట్టి పాక్ నడ్డి విరిచాడు

మన తెలంగాణ 1 Feb 2026 8:58 pm

సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి మృతి

 సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి గారు శనివారం అర్థరాత్రి  తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 72 ఏళ్లు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉన్న తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించాడు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్ది నెలల క్రితమే ఆయన కుమారుడు కూడా మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. రఘునాథ రెడ్డికి భార్య అన్నపూర్ణ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.నాటక రంగం నుంచి వచ్చిన ఆయన 1991లో శోభన్ బాబు నటించిన 'సర్పయాగం' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తన విలక్షణమైన కంచు కంఠంతో, గంభీరమైన మాట తీరుతో సహాయ నటుడిగా, విలన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 370 సినిమాల్లో నటించారు. 'ఓరేయ్ రిక్షా', 'ప్రేమించు పెళ్లాడు', 'చంటి', 'శ్రీరామరాజ్యం' వంటివి ఆయనకు మంచి పేరు తెచ్చిన చిత్రాలు.కేవలం సినిమాలే కాకుండా పలు ప్రజాదరణ పొందిన సీరియల్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

మన తెలంగాణ 1 Feb 2026 8:42 pm

ఇదో గుడ్డి బడ్జెట్: రాహుల్ గాంధీ

భారతదేశ వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని గుడ్డి బడ్జెట్ ఇది. యువతకు ఒకపక్క ఉద్యోగాలు లేవు, ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. పెట్టుబడిదారులు మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ఇంటి పొదుపు తగ్గింది. రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. ఆయా రంగాల దిద్దుబాటును తిరస్కరించే బడ్జెట్ ఇది. వాటి గురించి ప్రస్తావనే లేదు. వాస్తవ సమస్యలను పక్కదారి పట్టించారు.

మన తెలంగాణ 1 Feb 2026 8:23 pm

Foundation |‘టీఏఏఎల్ఎం’ ఫౌండేషన్ శ్రమదానం

Foundation | ‘టీఏఏఎల్ఎం’ ఫౌండేషన్ శ్రమదానం Foundation | బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 8:17 pm

ఖానాపూర్‌లో చిరుతల సంచారం

ఖానాపూర్ పరిసరాల్లోని నాలుగు కిలోమీటర్ల పరిధిలో 15 నిమిషాల వ్యవధిలో రెండు చిరుతల సంచారం శనివారం రాత్రి కలకలం రేపింది. ఖానాపూర్‌ను ఆనుకునివున్న కొమురం భీమ్ చౌరస్తా నుంచి తర్లపాడు మధ్య అటవీ ప్రాంతంలో రాత్రి 8ః30 సమయంలో ఓ చిరుత రోడ్డు దాటడానికి ప్రయత్నించగా నిర్మల్ వైపు నుంచి కడెంకు వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 15 నిమిషాల వ్యవధిలోనే ఖానాపూర్ నుంచి దిలావర్‌పూర్ మీదుగా సత్తెనపల్లి వెళ్లే రహదారి ఆనుకొనివున్న పంట పొలంలో మరో చిరుత కనిపించి కలకలం సృష్టించింది. దిలావర్‌పూర్‌కు చెందిన మంగతార అనే మహిళా రైతు.. తన పంట చేలో తరుచుగా వ్యవసాయ పనిముట్లు చోరీకి గురవుతుండటంతో రక్షణ కొరకు 8 సీసీ కెమెరాలు అమర్చారు. శనివారం రాత్రి 9 గంటలలోపు మంగతార అనే రైతు పంట చేనులో చిరుత సంచరించడంతో పక్కనే ఉన్న రైతులు భయాందోళనకు గురయ్యారు. చిరుత కనిపించడంతో రాత్రిళ్లు పంట చేనుకు కాపలాలకు వెళ్లే రైతులు జంకుతున్నారు. కొమురం భీమ్ చౌరస్తా సమీపంలో చిరుత కనిపించడంతో అక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న స్టాటస్టిక్స్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. సిబ్బంది అడవిలో రోడ్డుపై టెంట్లు వేసుకొని ఎన్నికల తనిఖీ విధులు నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి చిరుతలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి సంచరిస్తున్న చిరుత పులుల ఆచూకీ కనుగొని.. వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించి ఎన్నికల సిబ్బందికి, పంట పొలాలకు కాపలా వెళ్లే రైతులకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.

మన తెలంగాణ 1 Feb 2026 8:17 pm

Cardensearch |శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్‌ సెర్చ్‌…

Cardensearch | శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్‌ సెర్చ్‌… Cardensearch | నందికొట్కూరు,

ప్రభ న్యూస్ 1 Feb 2026 8:12 pm

ఫోన్ ట్యాపింగ్ కేసు: ముగిసిన కెసిఆర్ సిట్ విచారణ..

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సిట్ విచారణ ముగిసింది. నందినగర్‌లోని నివాసంలో కెసిఆర్‌ని సిట్ అధికారులు విచారించారు. సుమారు ఐదు గంటలపాటు సిట్ అధికారులు కెసిఆర్‌ను ప్రశ్నించారు. సిట్ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి, నారాయరెడ్డి, శ్రీధర్, కెఎస్ రావు ఈ విచారణలో పాల్గొన్నారు. కెసిఆర్ విచారణను సిట్ అధికారులు ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేశారు. ఈ కేసులో కెసిఆర్ వాంగ్మూలాన్ని కూడా సిట్ అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం సిట్ అధికారులు సంబంధిత డాక్యూమెంట్లు, ఇతర ఆధారాలతో సిట్ అధికారులు నందినగర్‌లోని నివాసాన్ని విడిచి వెళ్లారు. 

మన తెలంగాణ 1 Feb 2026 8:09 pm

Forest |వికారాబాద్ జిల్లాకు భవిష్యత్తు ఉంది…

Forest | వికారాబాద్ జిల్లాకు భవిష్యత్తు ఉంది… Forest | వికారాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 8:06 pm

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం: ఎంపి మల్లు రవి

 కేంద్ర బడ్జెట్ నిరాశజనక బడ్టెట్ అని కాంగ్రెస్ ఎంపి మల్లు రవి అభివర్ణించారు. దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలను పూర్తి నిరాశకు గురి చేసిందన్నారు. ముఖ్యమంత్రి,మంత్రులు చేసిన విజ్ఞప్తులను పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ,జాతీయ ప్రాజెక్టులు, హైదరాబాద్ మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని కోరినా అవి ఏవీ ఇవ్వకపోగా, హైదరాబాద్ మెట్రో గురించి ప్రస్తావన లేనే లేదన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై బడ్జెట్‌లో మాట్లాడతారని, ప్రస్తుత భారతను గాలికి వదిలేసి 2047 ఫోకస్ చేస్తూ.. ఇప్పుడున్న సమస్యలను పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉందని, నిరుద్యోగ సమస్యను గుర్తించకపోవ డం అన్యాయం కాక మరేమిటి? అని ప్రశ్నించారు. 11 ఏళ్లుగా 22 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, 2014 నుంచి కార్పొరేట్ సంస్థలకు అనుకూల బడ్జెట్ ఇస్తున్నారని తెలిపారు. వృద్ధి రేటుకు అర్థం ఉండదని, సామాన్య ప్రజలకు ఉపయోగం లేకుండా ఉండే వృద్ధి రేటు ఉందని.. ఉన్నవారు లేని వారికి మధ్య అంతరం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సమానత్వాన్ని బిజెపి మర్చిపోయిందని విమర్శిం చారు. ఉపాధి హామీకి నిధులు పెంచారు అంటున్నారు కానీ అవి బడ్జెట్‌లో కనిపించడం లేదన్నారు. అదే విధంగా నిరుద్యోగం, నిత్యావసర ధరలు పెరగడం వల్ల పక్క దేశాల్లో యువత ఆందోళనలు చేస్తున్నాయని గుర్తు చేశారు. నిత్యవసర ధరలు తగ్గించడం లేదని, ఇది పేదలకు వ్యతి రేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలనేది రైతుల ప్రధాన డిమాండ్, దాని గురించి కూడా ప్రస్తావించలేదన్నా రు. ప్రధాన పంటలకు సంబంధించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదని, పంట నష్టం ఇన్‌పుట్ సబ్సిడీ గురించి మాట్లాడలేదని, దేశవ్యాప్తంగా ఉన్న నిరు ద్యోగం, పట్టణ ఉపాధి కల్పన, పంటలకు చట్టబద్దత గురించి మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. బ్రిటిష్ వారు ఉన్నపుడు పెట్టేలా ప్రస్తుత బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. పాలమూరురంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ లేదన్నారు. మూసి ప్రక్షాళన కు నిధులు ఇవ్వలేదని, గంగ నదికి,యమునా నదికి నిధులు ఇస్తారని, మూసి నదికి ఇవ్వడం లేదని, తెలంగాణకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు అమలు చేయాలని, తెలంగాణ వాటా నిధులు విడుదల చేయాలని, తెలంగాణ బిజెపి ఎంపిలు ప్రధాని ఆర్థిక మంత్రితో మాట్లాడి, తెలంగాణ అవసరాలు తీర్చడానికి పనిచేయాలని సూచించా రు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పార్లమెంటు లోపల బయట పోరాడుతామని ఎంపి మల్లు రవి వెల్లడించారు.

మన తెలంగాణ 1 Feb 2026 8:05 pm

Press Club |అసత్య ఆరోపణలు మానుకోవాలి…

Press Club | అసత్య ఆరోపణలు మానుకోవాలి… Press Club | చెన్నూర్,

ప్రభ న్యూస్ 1 Feb 2026 8:02 pm

వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ ఇంటికి నిప్పు

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌కు నిరసన సెగ తగిలింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిని ముట్టడించిన టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడికి దిగిన టీడీపీ శ్రేణులు ఆయన ఇంటికి నిప్పంటించారు. జోగి రమేష్ ఇంట్లో భారీగా మంటలు అలుముకుని దట్టమైన పొగ కమ్మేసింది. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మైలవరం, విజయవాడ పశ్చిమ, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు ముట్టడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు. ఆయన తండ్రి జోగి మోహనరావు, సతీమణి శకుంతల దేవి, చిన్న కుమారుడు రోహిత్ దాడి సమయంలో ఇంట్లోనే ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటి ముందు ఫ్లెక్సీలు చించేసి హంగామా సృష్టించారు. ఈ ఘటనపై వైసీపీ నాయకుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా ఇటీవల కల్తీ మద్యం కేసులో అరెస్టయ్యి బెయిల్ పై విడుదలైన జోగి రమేష్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కు చిప్ దెబ్బతిందని, కల్తీ మాటలతో టీడీపీ కల్తీ అయ్యిందని అంటూ జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చంద్రబాబు, లోకేష్ లపై జోగి రమేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ క్యాడర్ ఆయన ఇంటిపై దాడికి దిగినట్లు సమాచారం. దాడి సమాచారం తెలుసుకుని వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు జోగి నివాసంలోకి వెళ్లగా టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.

మన తెలంగాణ 1 Feb 2026 7:58 pm

School |గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

School | గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి School | కుంటాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:57 pm

కెసిఆర్ రాజ్యాంగం ముగిసింది: మంత్రి వాకిటి

బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యాంగం ముగిసిందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జోస్యం చెప్పారు. కెసిఆర్‌కు నిబద్ధత, నిజాయితీ ఉంటే కడిగిన ముత్యంలా బయటకు రావాలని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని కె. కవిత ఆరోపించారని ఆయన తెలిపారు. ధరణి పెట్టి భూములు, రియల్ ఎస్టేట్ వ్యవస్థను ఆగమాగం చేసింది మీరు కాదా? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ, లోక్‌సభ, గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పినా, ఆ పార్టీ నాయకులు మారలేదని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయమేమీ కాదన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి, వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ దేశంలోనే అత్యంత దుర్మార్గమైన చర్య అని ఈ చర్య వల్ల తెలంగాణ ప్రతిష్ట దేశవ్యాప్తంగా దిగజారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల ఫఓన్లు, వ్యాపారుల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, సినీ నటుల ఫోన్లు, చివరకు భార్య-భర్తల ఫోన్లూ ట్యాప్ చేయడం నీచమైన చర్య అని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. బిఆర్‌ఎస్ గెలిచి ఉంటే ఇప్పటికీ ఫోన్ల ట్యాపింగ్‌లు కొనసాగేవని ఆయన తెలిపారు

మన తెలంగాణ 1 Feb 2026 7:54 pm

Hostel |గురుకుల హాస్టల్‌లో విద్యార్థులకు నాసిరకం ఆహారం

Hostel | గురుకుల హాస్టల్‌లో విద్యార్థులకు నాసిరకం ఆహారం Hostel | మునుగోడు,

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:53 pm

Bee form |బీజేపీ జండా ఎగురవేయడం టార్గెట్

Bee form | బీజేపీ జండా ఎగురవేయడం టార్గెట్ Bee form |

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:49 pm

తెలంగాణకు హైస్పీడ్ రైళ్లు..

 తెలంగాణకు 3 హైస్పీడ్ కారిడార్లను కేంద్రం ప్రకటించింది. దేశంలో కొత్తగా 7 నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించగా పుణె- హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై కారిడార్లు తెలంగాణ మీదుగా వెళ్లనున్నాయి. వీటితో పాటు ముంబయి-పుణె, ఢిల్లీ- వారణాసి, వారణాసి-సిలిగుడి, చెన్నై- బెంగళూరు మధ్య కూడా కొత్త కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్‌సభలో ప్రకటించారు. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత సంవత్సరం రూ.11.2 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి స్వల్పంగా పెంచారు. వీటి ద్వారా ప్రధాన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందని అన్నారు. సుదూర ప్రయాణాల విషయంలో పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థగా ఈ కారిడార్లు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవి ప్రయాణ సమాయాన్ని కుదిస్తాయని, రహదారి మార్గం, ఇప్పటికే ఉన్న రైలు నెట్‌వర్క్‌లో రద్దీని తగ్గిస్తాయని పేర్కొన్నారు.

మన తెలంగాణ 1 Feb 2026 7:46 pm

Tapping |కక్షపూరితంగానే కేసీఆర్‌కు సిట్ నోటీసులు…

Tapping | కక్షపూరితంగానే కేసీఆర్‌కు సిట్ నోటీసులు… Tapping | కుంటాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:45 pm

సిట్.. ‘సిఎం ఇన్‌స్ట్రక్షన్ టీమ్’గా పని చేస్తోంది: హరీశ్ రావు

హైదరాబాద్: కెసిఆర్‌ను విచారించటం.. రాజకీయ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట అని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నందినగర్‌లోని కెసిఆర్ నివాసంలో ఆయన్ను సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 4 గంటలకు పైగా ఈ విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. సిట్ పేరిట ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ విచారణలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలనూ ఉల్లంఘించారని పేర్కొన్నారు. కెసిఆర్‌కు నోటీసులు ఇవ్వడంలో చట్టపర విధానాలు పాటించలేదని ధ్వజమెత్తారు. ఎర్రవెల్లిలో ఇవ్వకుండా నందినగర్‌ ఇంటి గోడలకు నోటీసులు అంటించారని అన్నారు. ఇలా నోటీసులు అంటించడం ఇది చౌకబారు రాజకీయమని విమర్శించారు. కెసిఆర్ ఎక్కడ ఉంటున్నారో ఈ రాష్ట్రానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఈ సిట్.. ‘సిఎం ఇన్‌స్ట్రక్షన్ టీమ్‌’గా పని చేస్తోందని ఎద్దేవా చేశారు. విచారణకు సహకరిస్తున్నప్పటికీ.. పోలీసులు అతి చేస్తున్నారు మండిపడ్డారు. 

మన తెలంగాణ 1 Feb 2026 7:43 pm

కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం నైజం కాదు: భట్టి విక్రమార్క

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడే నైజం కాదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ప్రజాభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్‌పై స్పందిస్తూ పారదర్శక పాలన అందించడమే ప్రధాన లక్షమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసేలో కక్ష అనుకుంటే అది వారి ఆలోచనే అని, ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని డిప్యూటీ సిఎం స్పష్టం చేశారు. దేశ రక్షణ కోసం వినియోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగత జీవితాలపై చేసే ఎలా అని ప్రశ్నించారు. కేసు విచారణ జరిగే ప్రక్రియపై కామెంట్ చేస్తే ప్రభావం చేసినట్టు అవుతుందని, విచారణ గురించి మాట్లాడడని తెలిపారు. విచారణ ఎవరి ఇష్టానుసారం జరగదని డిప్యూటీ సిఎం తేల్చి చెప్పారు.

మన తెలంగాణ 1 Feb 2026 7:41 pm

Mallanna Swamy |జాతరకు తరలి వెళ్తున్న భక్తులు

Mallanna Swamy |జాతరకు తరలి వెళ్తున్న భక్తులు Mallanna Swamy |కుంటాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:38 pm

Tension Erupts Outside Jogi Ramesh’s Residence After Controversial Remarks

Political tempers flared in Ibrahimpatnam on Saturday following provocative remarks made by YSR Congress Party leader Jogi Ramesh against Chief Minister N. Chandrababu Naidu and IT Minister Nara Lokesh. What began as verbal aggression soon spilled onto the streets, triggering unrest outside Jogi Ramesh’s residence and forcing police to step in. TDP supporters gathered in […] The post Tension Erupts Outside Jogi Ramesh’s Residence After Controversial Remarks appeared first on Telugu360 .

తెలుగు 360 1 Feb 2026 7:31 pm

Development |అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా

Development | అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా Development | మంచిర్యాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:31 pm

Medical |ఘ‌న విజ‌యం సాధిస్తాం…

Medical | ఘ‌న విజ‌యం సాధిస్తాం… Medical | మేడ్చల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:22 pm

హైదరాబాద్ డాక్టర్‌కు రూ.35.19 లక్షల ఆన్‌లైన్ ఐపీవో మోసం

వాట్సాప్‌లో సంస్థాగత ట్రేడింగ్ పేరుతో వలఇంకా డబ్బులు చెల్లించకపోవడంతో ఖాతా బ్లాక్

తెలుగు పోస్ట్ 1 Feb 2026 7:20 pm

చరిత్ర సృష్టించాడు.. ఆస్ట్రేలియా ఓపెన్ విజేత అల్కరాస్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో నొవాక్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)పై ప్రపంచ నెంబర్ 1 అల్కరాస్ విజయం సాధించాడు. హోరాహోరీగా జరిగి ఈ మ్యాచ్‌లో అల్కరాస్ 2-6, 6-2, 6-3, 7-5 తేడాతో టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో పురుషుల టెన్నిస్‌లో కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా అతడు చరిత్ర సృష్టించాడు. 22 ఏళ్ల అల్కరాస్‌కి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇది తొలి టైటిల్. ఇప్పటికే అతను ఫ్రెంచ్ ఓపెన్ (2024,2025), వింబుల్డన్ (2023, 2024), యూఎస్ ఓపెన్ (2022, 2025) టైటిళ్లు సాధించాడు. మరోవైపు జకోవిచ్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ఫైనల్‌లో ఇది తొలి ఓటమి. ఇప్పటివరకూ ఫైనల్‌కు చేరిన పదిసార్లు అతడు విజేతగా నిలిచాడు. టెన్నిస్ చరిత్రలో అత్యధిక (25) గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు సాధించాలన్న జకోవిచ్ ఆశలపై అల్కరాజ్ నీళ్లుచల్లాడు. ప్రస్తుతం 24 టైటిళ్లతో ఉన్న జకోవిచ్ 25 టైటిల్‌ కోసం తెగ కష్టపడుతున్నాడు. చివరగా 2023లో యుఎస్ ఓపెన్ గెలిచాక.. అతడు మళ్లీ గ్రాండ్‌స్లామ్ కొట్టలేకపోతున్నాడు.

మన తెలంగాణ 1 Feb 2026 7:18 pm

Budget |అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా..

Budget | అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా.. Budget | నిజామాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:17 pm

Mom’s lap | 367వ వారంకు చేరిన ‘అమ్మ ఒడి’ అన్నదానం

Mom’s lap | 367వ వారంకు చేరిన ‘అమ్మ ఒడి’ అన్నదానం Mom’s

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:04 pm

Roads |ఒకట‌వ‌ వార్డు అభివృద్ధే నా లక్ష్యం…

Roads | ఒకట‌వ‌ వార్డు అభివృద్ధే నా లక్ష్యం… Roads | స్టేషన్

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:58 pm

డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్‌తో.. భయపెడుతున్న ‘హనీ’ ట్రైలర్..

హారర్ చిత్రాలు అంటేనే వాటికి ఉండే క్రేజ్ వేరు. ఎంత భయంగా ఉన్నా సరే.. హారర్ చిత్రాలు చూడాలనే ఫాంటసీ చాలా మందిలో ఉంది. అలా హారర్ జానర్‌లో వచ్చిన చిత్రాలు దాదాపుగా ప్రేక్షకాదరణ పొందుతాయి. కొన్ని ఫెయిల్ అవుతాయి. అలా ఓ డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘హనీ’. నవీన్ చంద్ర, దీపికా పిళ్లై, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. శేఖర్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. ‘ఓ దేవత వాహనం పిల్లి’ అంటూ ట్రైరల్ ప్రారంభ అవుతుంది. ఆ తర్వాత ట్రైలర్ ఆద్యంతం భయపట్టే విధంగా ఉంది. ఆ పిల్లి ఎవరి వద్ద ఉంటే వారికి ఇతరులు దాసోహం కావడమనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించగా.. రవి పీట్లా నిర్మించారు. ఫిబ్రవరి 6వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

మన తెలంగాణ 1 Feb 2026 6:54 pm

హైదరాబాద్ వ్యక్తి రూ.58.22 లక్షల మోసం నకిలీ ‘బ్లాక్ ట్రేడింగ్’ పెట్టుబడి పేరుతో సైబర్ మోసం

5పైసా ప్రతినిధులమని నటించిన మోసగాళ్లుఅనేక బ్యాంక్ ఖాతాలు, యూపీఐలకు నగదు బదిలీదేశవ్యాప్త ఖాతాల నెట్‌వర్క్‌పై సైబర్ క్రైమ్ దర్యాప్తు

తెలుగు పోస్ట్ 1 Feb 2026 6:53 pm

Nirmala Sitharaman |దేశ గతి మారనుందా?

Nirmala Sitharaman | దేశ గతి మారనుందా? Nirmala Sitharaman | 2047

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:37 pm

MLA |గ్రామానికి సోలార్‌తో నిత్యం వెలుగులు

MLA | గ్రామానికి సోలార్‌తో నిత్యం వెలుగులు MLA | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:34 pm

Breaking : అంబటి రాంబాబు ఇంటి దాడిపై హైకోర్టు సీరియస్

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దాడిపై హైకోర్టు సీరియస్ అయింది

తెలుగు పోస్ట్ 1 Feb 2026 6:33 pm

Election |గెలుపే లక్ష్యంగా ప్రచారం….

Election | గెలుపే లక్ష్యంగా ప్రచారం…. Election | చండూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:29 pm

నకిలీ విద్యుత్ బిల్లు మెసేజ్‌తో మోసం.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఖాతా నుంచి ₹9.10 లక్షలు గల్లంతు

వాట్సాప్ మెసేజ్‌తో మొదలైన సైబర్ మోసంఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ చేయించి ఖాతాలపై పట్టు

తెలుగు పోస్ట్ 1 Feb 2026 6:28 pm

Phone tapping |సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం

Phone tapping | సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం Phone tapping

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:25 pm

KCR: మూడున్నర గంటలుగా కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్ లోని నందినగర్ లో కేసీఆర్ ను గత మూడు గంటలుగా విచారిస్తున్నారు

తెలుగు పోస్ట్ 1 Feb 2026 6:23 pm

Notice |రాష్ట్ర ప్రజల గుండెచప్పుడైనా కేసీఆర్‌కు నోటీసులా…?

Notice | రాష్ట్ర ప్రజల గుండెచప్పుడైనా కేసీఆర్‌కు నోటీసులా…? Notice | రుద్రూర్,

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:21 pm

B-forms |అభ్యర్థులకు ‘బి-ఫామ్స్’ పంపిణీ

B-forms | అభ్యర్థులకు ‘బి-ఫామ్స్’ పంపిణీ B-forms | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:17 pm

రాష్ట్రానికి మూడు హై స్పీడ్ రైళ్లు : కిషన్ రెడ్డి

మెట్రో రైలు గురించి ప్రత్యేకంగా బడ్జెట్‌లో ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మెట్రో డిపిఆర్ ఇస్తే.. పట్టణాభివృద్ధి శాఖ నిధులు ఇస్తుందని పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టుకు మంత్రివర్గ ఆమోదంతో నిధులు వస్తాయని తెలిపారు. ప్రస్తుత మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేస్తానని చెప్పిందని.. టేకోవర్ ప్రక్రియ పూర్తి చేసి డిపిఆర్ ఇస్తే కేంద్రం ఆమోదిస్తుందని అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసు ఓ టివి సీరియల్‌లా కొనసాగుతోందని విమర్శించారు. కేసు మొదలై ఇప్పటికే రెండేళ్లు అయిందని.. ఇంకా ఎన్నాళ్లో తెలియదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిజమని.. స్వయంగా కెసిఆర్ కుమార్తెనే చెప్పారని అన్నారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని స్వయంగా కవిత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని అఫిడవిట్ వేశారని.. నేతలు, జడ్జిలు, వ్యాపారులు, నటుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని అంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మూడు హై స్పీడ్ రైళ్లు రానున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. డేటా సెంటర్లకు ఉపయోగపడే నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నదని అన్నారు. డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహంతో రాష్ట్రానికి కూడా లాభం చేకూరుతుందని తెలిపారు. విదేశీ విద్యపై ఉండే పన్నును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎరువులకు రాయితీని కూడా కేంద్రం పెంచిందని తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలోని రైతులు కూడా లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్‌ను కేంద్రం ఏర్పాటు చేయనుందని.. రాష్ట్రంలో 33 జిల్లాలకు బాలికల హాస్టళ్లు మంజూరు అవుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. 

మన తెలంగాణ 1 Feb 2026 6:12 pm

Nominations |బల్దియా సమరం : 34 వార్డుల్లో అభ్యర్థులు వీరే..

Nominations | బల్దియా సమరం : 34 వార్డుల్లో అభ్యర్థులు వీరే.. Nominations

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:12 pm

Chityala |అన్ని విధాలుగా సహకారాలు అందిస్తా

Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ పరిధిలో గల శివనేని గూడెం

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:08 pm

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై చంద్రబాబు ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు

తెలుగు పోస్ట్ 1 Feb 2026 6:04 pm

Puja |గూడెంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు…

​Puja | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండెపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:04 pm

Nizamabad |ఆకట్టుకున్న ఎడ్లబండ్ల ఊరేగింపు…

Nizamabad | ఆకట్టుకున్న ఎడ్లబండ్ల ఊరేగింపు… Nizamabad | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:03 pm

TG |బోర్ల గూడెంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

TG | బోర్ల గూడెంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం TG | మహా

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:02 pm

జోగి రమేష్ ఇంటికి టీడీపీ శ్రేణుల నిప్పు.. వ్యాఖ్యలకు నిరసనగా

జోగి రమేష్ ఇంటికి టీడీపీ శ్రేణుల నిప్పు.. వ్యాఖ్యలకు నిరసనగా

తెలుగు పోస్ట్ 1 Feb 2026 5:54 pm

Bhimgal Town |ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి…

Bhimgal Town | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : తాను కాంగ్రెస్ పార్టీ

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:29 pm

TG |అన్ని వార్డుల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం…

TG | అన్ని వార్డుల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం… TG | భీమ్‌గల్‌ టౌన్,

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:25 pm

protest |వరంగల్‌లో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

protest | కరీమాబాద్, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:21 pm

Union Budget 2026: What Gets Cheaper, What Gets Costlier and Why Andhra Pradesh Gains

What gets cheaper after budget: Electronics: Components used in mobile phones and tablets will become cheaper due to customs duty relief. Solar panels and microwave ovens are also expected to cost less after the government exempted basic customs duty on selected manufacturing parts. Green Energy Lithium ion cells used in electric vehicle batteries will be […] The post Union Budget 2026: What Gets Cheaper, What Gets Costlier and Why Andhra Pradesh Gains appeared first on Telugu360 .

తెలుగు 360 1 Feb 2026 5:18 pm

టీం ఇండియా ఆలౌట్.. పాక్ టార్గెట్ ఎంతంటే..

బులవాయో: అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా పాకిస్థాన్‌ యువ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ యువ జట్టు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌ దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీలు కలిసి తొలి వికెట్‌కి 47 పరుగులు జోడించారు. కానీ, 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే డకౌట్ అయ్యాడు. ఈ దశలో కష్టాల్లో పడిన జట్టుకు వేదాంత్ త్రివేది అండగా నిలిచాడు. 98 బంతులు ఎదురుకున్న అతడు 2 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 68 పరుగులు చేశాడు. ఇక కనిష్క్ చౌహాన్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సుతో 35, అంబ్రిష్ 29, ఖిలన్ 21, విహాన్ 21 పరుగులు చేశారు. దీంతో భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్థాన్ బౌలింగ్‌లో సుభాన్ 3, సయ్యమ్ 2, రజా, హుస్సేన్, ఖమర్, హసన్ తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 1 Feb 2026 5:17 pm

Road Accident |చావుబతుకుల మధ్య సోమగూడెం యువకుడు..

Road Accident | చావుబతుకుల మధ్య సోమగూడెం యువకుడు.. Road Accident |

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:16 pm

Jukkal |గ్రామ గ్రామాన బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు…

Jukkal | గ్రామ గ్రామాన బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు… సీఎం రేవంత్ రెడ్డి

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:05 pm

BRS |నల్ల బ్యాడ్జీలతో రోడ్డుపై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా….

BRS | నల్ల బ్యాడ్జీలతో రోడ్డుపై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా…. BRS |

ప్రభ న్యూస్ 1 Feb 2026 5:03 pm

ఫారెక్స్ ట్రేడింగ్ యాప్ మోసం: హైదరాబాద్ వ్యాపారికి రూ.1.52 కోట్ల నష్టం

సోషల్ మీడియా ద్వారా వలఎల్‌బీ నగర్ కోర్టులో ఫిర్యాదు

తెలుగు పోస్ట్ 1 Feb 2026 5:00 pm

Chityala |రాజకీయాల్లో నూతన ఒరవడి

Chityala | రాజకీయాల్లో నూతన ఒరవడి Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:58 pm

TG |కేసీఆర్‌ను విచారిస్తే తప్పేంటి

TG | కేసీఆర్‌ను విచారిస్తే తప్పేంటి TG | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:57 pm

అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది: చంద్రబాబు

అమరావతి: కేంద్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ఉందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర బడ్జెట్ బాగుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ పై సిఎం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెక్నాలజీలో మనం నెంబర్ వన్ గా ఉన్నామని, ఎమ్ఎస్ఎమ్ఇ లకు ప్రోత్సాహం అందించేలా దీర్ఘకాలక లాభాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశ పెట్టారని అన్నారు. గొప్ప బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలియజేశారు. బడ్జెట్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఎపికి మూడు హై స్పీడ్ కారిడార్ లు రాబోతున్నాయని తెలియజేశారు. హైస్పీడ్ కారిడార్ లతో ఎపికి మేలు జరగుతుందని, భారత్ వేగంగా ఎఐ అందిపుచ్చుకుంటోందని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిపారని ఎన్డిబి రిపోర్టు ఇచ్చిందని, ఆ రిపోర్ట్ నే తాను చెప్పానని అన్నారు. తప్పు చేసి వైసిపి మళ్లీ ఎదురు దాడి చేస్తుందని చంద్రబాబు విమర్శించారు.    

మన తెలంగాణ 1 Feb 2026 4:56 pm

Chennur |సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం

Chennur | సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం Chennur | చెన్నూర్,

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:53 pm

కవలలు పుట్టిన వేళ.. రామ్ చరణ్ రెట్టింపు ఆనందం

హైదరాబాద్: హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. శనివారం ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. ఈ సందర్భంగా మెగా కాంపౌండ్‌లో సందడి వాతావరణం నెలకొంది. రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి శనివారం రాత్రే ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్‌మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ విషయంపై రామ్ చరణ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. రెట్టింపు ఆనందంతో ఓ పోస్ట్ పెట్టారు. ఉపాసన బేబీ బంప్‌తో ఉన్న ఫోటోని ఆయన షేర్ చేశారు. ‘‘మాకు బాబు, పాప పుట్టారని తెలుపుటకు ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని కలిగి ఉండటం ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాం. మన జీవితంలో మహిళలే అత్యంత బలం. ఎప్పుడూ మాకు అండగా నిలిచిన కుటుంబం, అభిమానులకు, శ్రేయోభిలాషులకు థ్యాంక్స్’’ అంటూ చరణ్ పేర్కొన్నారు. 

మన తెలంగాణ 1 Feb 2026 4:46 pm

Video : Special Interview with Abishan Jeevinth & Anaswara Rajan

The post Video : Special Interview with Abishan Jeevinth & Anaswara Rajan appeared first on Telugu360 .

తెలుగు 360 1 Feb 2026 4:41 pm

Jangaon |ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

Jangaon | జనగామ, ఆంధ్రప్రభ : కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:27 pm

Yendapalli |కేసీఆర్‌పై సిట్ విచారణకు వ్యతిరేకంగా ధర్నా…

Yendapalli | కేసీఆర్‌పై సిట్ విచారణకు వ్యతిరేకంగా ధర్నా… Yendapalli | ఎండపల్లి,

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:27 pm

లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి భారత్ ఎదిగింది: మోడీ

ఢిల్లీ: లోక్ సభలో కేంద్ర బడ్జెట్ లో ఆత్మనిర్భర్ భారత్ కు కీలక కేటాయింపులు జరిగాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. చరిత్రాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టామని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర బడ్జెట్ పై మోడీ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ ద్రవ్యలోటును నియంత్రిస్తుందని, కేంద్ర బడ్జెట్ భవిష్యత్ కు రోడ్ మ్యాప్ గా నిలుస్తుందని తెలియజేశారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్ త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని మోడీ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ లో మరింత ఊతమని, లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి భారత్ ఎదిగిందని కొనియాడారు. యువశక్తిని ప్రోత్సహించేలా కేంద్ర బడ్జెట్ అని..యువతకు గేమింగ్, టూరిజం, క్రీడా సౌకర్యాలు ఉంటాయని అన్నారు. వికసిత్ భారత్ ప్రయాణం వేగవంతానికి బడ్జెట్ తోడ్పాటు చేస్తుందని, భారత్ ప్రయోజనాల కోసం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ జరుగుతుందని చెప్పారు. భారత్ ను డేటా సెంటర్ హబ్ గా మార్చేందుకు ట్యాక్స్ హాలిడే అని..ఉద్యోగాల కల్పనకు బడ్జెట్ మరింత దోహదపడుతుందని మోడీ స్పష్టం చేశారు.

మన తెలంగాణ 1 Feb 2026 4:24 pm

YCP party |నుంచి అంబటిని సస్పెండ్ చేయ్…

YCP party | నుంచి అంబటిని సస్పెండ్ చేయ్… YCP party |

ప్రభ న్యూస్ 1 Feb 2026 4:23 pm