SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

నేడు వైన్ షాపులు బంద్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ ఉంటాయని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు

తెలుగు పోస్ట్ 26 Jan 2026 8:25 am

Amravathi : నేడు అమరావతిలో తొలిసారి

నేడు అమరావతిలో తొలిసారి రిపబ్లిక్‌ డే వేడుకలు నిర్వహించనున్నారు

తెలుగు పోస్ట్ 26 Jan 2026 8:20 am

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಕ್ರಿಕೆಟ್ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಮೊಹಮ್ಮದ್ ಸಿರಾಜ್ ನಮಾಜ್ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂದು ಎಐ ಚಿತ್ರ ಹಂಚಿಕೆ​

ಕ್ರಿಕೆಟ್ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಮೊಹಮ್ಮದ್ ಸಿರಾಜ್ ನಮಾಜ್ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂದು ಎಐ ಚಿತ್ರ ಹಂಚಿಕೆ​

తెలుగు పోస్ట్ 26 Jan 2026 8:20 am

యాచారంలో ఎస్‌ఐని ఢీకొట్టి... బ్యానెట్‌పై అర కిలో మీటరు తీసుకెళ్లారు

రంగారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతుండగా ఓ మందుబాబు కారును ఎస్‌ఐ ఆపుతుండగా ఎస్‌ఐపిక దూసుకెళ్లింది. ఎస్‌ఐ బ్యానెట్ పట్టుకొని ఆర కిలో మీటర్ తీసుకెళ్లిన అనంతరం బైక్‌ను ఢీకొట్టిన తరువాత కారు ఆగిపోవడంతో ఎస్‌ఐ దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎస్‌ఐ మధు తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నాడు. వేగంగా దూసుకొస్తున్న కారును ఎస్‌ఐ ఆపడానికి ప్రయత్నించాడు. అతడిపైకి తీసుకరావడంతో బ్యానెట్ పట్టుకున్నాడు. కారును ఆపాలని కారు డ్రైవర్‌ను హెచ్చరించినప్పటికు కారు అలానే అర కిలో మీటరు పోయిన తరువాత బైక్ ఢీకొట్టాడు. అక్కడి నుంచి కొంచె దూరం వెళ్లిన తరువాత కారు ఆగిపోవడంతో ఎస్‌ఐ బ్యానెట్ పైనుంచి పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. కారులో ఉన్నవారు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ శ్రీకర్‌గా గుర్తించారు. వెంటనే అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయగా మద్యం తాగినట్టు తేలింది. కారులో అతడి స్నేహితులు నితిన్ ఉన్నట్టు గుర్తించారు. 

మన తెలంగాణ 26 Jan 2026 8:14 am

నేడు దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు

నేడు దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి

తెలుగు పోస్ట్ 26 Jan 2026 8:13 am

Republic Day Celebrations : ఆగస్టు 15కు.. జనవరి 26 కు మధ్య తేడా ఏంటంటే?

జనవరి 26న జెండా ఆవిష్కరణకు.. ఆగస్ట్ 15న జెండా ఎగరేయడంలో తేడా ఉంది

తెలుగు పోస్ట్ 26 Jan 2026 8:07 am

Hyderabad : హైదారాబాద్ లో ఈరోజు ఈ రూట్లో వెళ్లేవారికి అలెర్ట్

హైదరాబాద్ లో ఈరోజు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు

తెలుగు పోస్ట్ 26 Jan 2026 7:45 am

India vs Newzealand : భారత్ కు తిరుగులేదు.. టార్గెట్ ను ఊదిపారేశారు

గౌహతిలో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది

తెలుగు పోస్ట్ 26 Jan 2026 7:38 am

వనం వైపు జనం.. వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు

 జాతర తేదీలు సమీపిస్తుండడంతో పెరుగుతున్న రద్దీ  ఆదివారం వేలాదిమంది దర్శనం భక్తులతో కిటకిటలాడుతున్న జంపన్న వాగు మేడారంలో ట్రాఫిక్ ఆంక్షలు..  ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క మన తెలంగాణ/ తాడ్వాయి: తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క, సారలమ్మ జా తర సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాలనుండి మన దేవతల దర్శనానికి వచ్చిన భక్తులతో ఆదివారం మేడారం భక్తజ న సంద్రమైంది. సాధారణంగా జాతర రోజుల్లో విపరీతమైన రద్దీ ఉంటుందని భావించే వేలాది కు టుంబాలు ముందుగానే అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో తెలుగు రాష్ట్రాల నలుమూలనుంచీ భక్తులు భారీగా తరలివచ్చారు. అశేష జనవాహినితో పులకించిన మేడారం... రాబోయే మహా జాతర రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులు ముందస్తుగా మేడారం బాట పట్టారు. ఆదివారం ఉద యం నుండే మేడారంలోని గద్దెల ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. క్యూలైన్‌లో గంటల తరబడి వేచివున్నప్పటికీ భక్తులు ఎంతో క్రమశిక్షణతో అ మ్మవార్లను దర్శించుకున్నారు. జాతర తేదీలు సమీపిస్తున్నకొద్దీ భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తమను చల్లగా చూడాలని కోరుకుంటూ వాగులో స్నానాలుచేసి గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. జంపన్నవాగులో నీటిమట్టం పెరగడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు త గిన జాగ్రత్తలు తీసుకున్నారు. నిలువెత్తు బంగారం నైవేద్యం... సమ్మక్క సారలమ్మకు భక్తులు తమ బరువుకు స మానమైన బెల్లాన్ని బంగారంగా భావించి నైవేద్యం గా సమర్పిస్తున్నారు. గద్దెలవద్దకు చేరుకున్న భక్తు లు అమ్మవార్లకు పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కలు తీర్చుకుంటున్నారు. అడవిలో విడిదిచేసి భక్తిశ్రద్ధలతో వనదేవతలను ఆరాధిస్తున్నారు. మనదేవతల దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయం నుంచి జంపన్న వాగు వెళ్లే దారిలో రోడ్డు కిరువైపు లా ఆట బొమ్మలతో షాపులు పిల్లలను ఆకట్టుకుంటున్నాయి. రకరకాల పూసల దండలతో భక్తులు పూసలను ఆకర్షణ చూస్తూ కొంటున్నారు. మేడా రం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ప్రైవేట్ వాహనాలు బారులుతీరా యి. వేల సంఖ్యలో వాహనాలు తాడ్వాయి మేడా రం మీదుగా వచ్చే వాహనాలు వీఐ పీ పార్కింగ్ వద్ద అంతరాయం ఏర్పడడంతో వీఐపీ పార్కింగ్‌లోని ఖాళీ స్థలాల్లోకి వాహనాలను పోలీసులు మళ్ళించారు. భక్తుల సంఖ్య మరింత పెరగడంతో వీఐపి పార్కింగ్ వద్ద భారీకేట్లను పోలీసులు ఏర్పాటు చేశారు.

మన తెలంగాణ 26 Jan 2026 6:50 am

13 తెలుగు పద్మాలు

తెలంగాణ నుంచి ఏడుగురికి పురస్కారం ఎపి నుంచి నలుగురికి.. ఢిల్లీ, అమెరికా కోటాలో ఇద్దరికి అవార్డులు ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పురస్కారాలు ప్రకటించిన కేంద్రం తెలుగు రాష్ట్రాల నుంచి నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, నృత్యకారిణి దీపికారెడ్డి, శాస్త్రవేత్త తంగరాజ్‌లకు పద్మశ్రీ పురస్కారం వైద్య రంగంలో గూడూరు వెంకటరావు, విజయ్ ఆనంద్‌రెడ్డి, సైన్స్‌లో జి.చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్‌లకు అవార్డులు మరణానంతరం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, మామిడి రామారెడ్డిలకు గౌరవం హస్తిన కోటాలో యుజిసి మాజీ ఛైర్మన్ జగదీష్‌కు పద్మశ్రీ విదేశీ కోటాలో క్యాన్సర్ నిపుణుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ పురస్కారం మన తెలంగాణ / హైదరాబాద్ : భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. 2026 సంవత్సరానికి గాను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం రాత్రి పద్మ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ అవార్డులు వరించాయి. ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దేశం కోసం, సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేసూ, తమ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి గౌరవించడం ఈ పురస్కారాల ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఏడాది ప్రకటించిన మొత్తం 131 అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల నుండి 11 మంది ప్రముఖులు ఎంపికవ్వడం తెలుగు వారందరికీ గర్వకారణం. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల ఎంపికలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ప్రచారం కోరుకోకుండా, మారుమూల ప్రాంతాల్లో ఉంటూ సమాజ హితం కోసం పాటుపడే ‘అన్సంగ్ హీరోస్’ (గుర్తింపు లేని వీరులు) కి పెద్దపీట వేస్తోంది. 2026 జాబితాలో కూడా ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. పారిశ్రామిక దిగ్గజాలు, కళాకారులతో పాటు, పాడి పరిశ్రమలో మహిళా సహకార సంఘాలను ప్రోత్సహించిన వారు, వైద్య రంగంలో కొత్త పుంతలు తొక్కిన శాస్త్రవేత్తలకు ఈ గౌరవం దక్కడం ఈ అవార్డుల గౌరవాన్ని మరింత పెంచింది. తెలంగాణ నుండి విశిష్ట సేవకులు తెలంగాణ నుండి సైన్స్, వైద్యం , సేవా రంగాల్లో 7 మంది నిష్ణాతులు ఎంపికయ్యారు. రామ రెడ్డి మామిడి (మరణానంతరం) పాడి పరిశ్రమ , సహకార రంగంలో ఈయన చేసిన కృషి అనన్యసామాన్యం. మహిళల నేతృత్వంలో సహకార సంఘాలను ఏర్పాటు చేసి వేల మందికి జీవనోపాధిని కల్పించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. సీసీఎంబీ లో ప్రఖ్యాత శాస్త్రవేత్తగా పనిచేస్తున్న కుమారసామి తంగరాజ్ జెనెటిక్స్ (జన్యుశాస్త్రం) లో చేసిన పరిశోధనలకు గాను అంతర్జాతీయ గుర్తింపు పొందారు. కూచిపూడి నృత్యకారిణిగా భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పినందుకు గాను దీపికా రెడ్డి కళా విభాగంలో ఎంపికయ్యారు. వైద్య , ఇతర రంగాల్లో డాక్టర్ గుడూరు వెంకట రావు , డాక్టర్ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి వైద్య సేవలకు గాను, అలాగే చంద్రమౌళి గడ్డమనుగు , కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ సైన్స్ రంగంలో చేసిన విశేష కృషికి గాను పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుండి కళా కోవిదుల్లో మాగంటి మురళీ మోహన్,గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా దశాబ్దాల పాటు సేవలు అందించిన వీరికి కళా విభాగంలో పద్మశ్రీ వరించింది. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం) అన్నమాచార్య కీర్తనలను జన బాహుళ్యంలోకి తీసుకెళ్లిన గొప్ప వాగ్గేయకారుడు , గాయకుడు. ఆయన సంగీత సేవలకు గుర్తింపుగా మరణానంతరం ఈ అవార్డు దక్కింది. వెంపటి కుటుంబ శాస్త్రికి సాహిత్యం , విద్యా రంగంలో పద్మశ్రీ లభించింది. పలువురు ప్రముఖులకు అత్యున్నత గౌరవం కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది సినీ రంగానికి చెందిన ఇద్దరు దిగ్గజ నటులకు అరుదైన గౌరవం దక్కింది. దివంగత బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ (మరణానంతరం) లభించగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను గౌరవిస్తూ కేంద్రం ఈ జాబితాను విడుదల చేసింది. పద్మ విభూషణ్ పురస్కారానికి మొత్తం ఐదుగురిని ఎంపిక చేయగా వారిలో కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్‌కు కూడా మరణానంతరం ఈ గౌరవాన్ని ప్రకటించారు. ఇక పద్మ భూషణ్ పురస్కార గ్రహీతల్లో ప్రఖ్యాత గాయని అల్కా యాగ్నిక్, తెలుగు వారికి సుపరిచితులైన క్యాన్సర్ వైద్య నిపుణులు, ఎన్నారై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఝార్ఖండ్ మాజీ సీఎం షిబు సోరెన్‌కు మరణానంతరం పద్మ భూషణ్ ప్రకటించారు. సినీ నటులకు ‘పద్మశ్రీ’ పురస్కారాలు ప్రముఖ సినీ నటులు, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌లకు ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. కళారంగంలో వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం వారిని ఈ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లతో పాటు, మరణానంతరం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం, విద్య)లకు పద్మశ్రీ లభించింది. తెలంగాణ నుంచి చంద్రమౌళి గడ్డమనుగు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), దీపికా రెడ్డి (కళలు), గూడూరు వెంకట్ రావు (వైద్యం) సహా పలువురు ఈ గౌరవాన్ని అందుకున్నారు. కళలు, సామాజిక సేవ, సైన్స్, వాణిజ్యం, వైద్యం, విద్య వంటి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఏటా ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈసారి అవార్డు గ్రహీతలలో 19 మంది మహిళలు, 6 మంది విదేశీ/ఎన్‌ఆర్‌ఐలు ఉండగా, 16 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. ఈ పురస్కారాలను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్‌కు పద్మశ్రీ భారత క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇందులో భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు పద్మశ్రీ లభించింది. క్రీడా రంగం నుంచి మరికొందరు ప్రముఖులు కూడా ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్‌కు దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ దక్కింది. అదేవిధంగా, భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి సవిత పూనియాకు కూడా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. 2026 సంవత్సరానికి గాను మొత్తం 131 పద్మ పురస్కారాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కళలు, సామాజిక సేవ, క్రీడలు, సైన్స్, వాణిజ్యం వంటి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఏటా ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈసారి క్రీడా రంగానికి చెందిన పలువురికి పద్మ పురస్కారాలు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మన తెలంగాణ 26 Jan 2026 6:40 am

హెచ్1 బి వీసాదారులకు అమెరికా మరో షాక్..

వాషింగ్టన్/న్యూఢిల్లీ : వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్న హెచ్-1బి వీసాదారులకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. ఈ ఏడాదికి సంబంధించి ఇంటర్వ్యూ స్లాట్స్ వచ్చే ఏడాదికి వాయిదాపడ్డట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి. వీసా బ్యాక్‌లాగ్స్ పెరిగిన నేపథ్యంలో ఇంటర్వ్యూ స్లాట్స్ వచ్చే ఏడాదికి మారినట్టు సమాచారం. ఇప్పటికే వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన అనేక మంది హెచ్-1బి వీసాదారులకు ఇది అశనిపాతంగా మారినట్టే. దీంతో వేలాది మంది ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. గతేడాది డిసెంబర్‌లో జరగాల్సిన వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు మొదట ఈ ఏడాది మార్చికి వాయిదాపడ్డాయి. అనంతరం ఈ ఏడాది అక్టోబర్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయన్న వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇంటర్వ్యూలు ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయన్న వార్త వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ పరిణామాలపై అమెరికాలో వలసల వ్యవహారాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 50 రోజుల్లో భారత్‌లో ఒక్క వీసా స్లాట్ కూడా అందుబాటులోకి వచ్చినట్టు తమ దృష్టికి రాలేదని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉంటున్న వారు భారత్‌కు తిరిగెళ్లొద్దని సూచించారు. 2027 వరకూ రెగ్యులర్ అపాయింట్‌మెంట్స్ లేవని ఇమిగ్రేషన్ న్యాయవాది ఒకరు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో ఇంటర్వ్యూ స్లాట్స్ పొందిన వారికి వచ్చే ఏడాదిలో కొత్త స్లాట్స్‌ను కేటాయించారని ఆయన వెల్లడించారు. 

మన తెలంగాణ 26 Jan 2026 6:40 am

నాంపల్లి ఘటనలో ఐదు మృతదేహాలు గుర్తింపు

రెండోరోజూ కొనసాగిన సహాయక చర్యలు మృతదేహాలు బంధువులకు అప్పగింత మృతుల బంధువుల ఆందోళన, స్వల్ప ఉద్రిక్తత మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం ఫర్నిచర్ షాపు యజమాని అరెస్ట్ మనతెలంగాణ/గోషామహల్: నాంపల్లి ఫర్నీచర్ సెల్లార్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన ఐదుగురికి ఉస్మానియా మార్చురీలో ఫ్రొఫెసర్ డాక్టర్ కార్తీక్ నాగుల నేతృత్వంలో వైద్యుబృందం పోస్టుమార్టం నిర్వహించి.. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఆదివారం ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం అగ్ని ప్రమాదంలో మరణించిన మహమ్మద్ ఇంతియాజ్ (28), సయ్యద్ హబీబ్ (32), బీరన్ బీ(30), అఖిల్ ( 11), ప్రణీత్ (8)ల మృతదేహాలకు సుమారు 2 గంటల వ్యవధిలో శవ పంచనామా నిర్వహించి.. మృతదేహాలను వాహనాల్లో స్వస్థలాలకు తరలించారు. ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్న మృతుల కుటుంబీకులు, బంధువులు పెద్దఎత్తున మార్చురీకి తరలిచారు. విగతజీవులైన తమవారి మృతదేహాలనుచూసి కన్నీటి పర్యంతమయ్యారు. తమ ఇద్ద రు పిల్లలు అఖిల్ (11), ప్రణీత్ (8)లు స్కూల్‌కు వెళ్లివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చిన్నారుల తండ్రి యాదయ్య చేసిన రోదనలు అక్క డున్న వారి హృదయాలను కలచివేసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ ఉస్మానియా మార్చురీకి చేరుకుని, మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ఫోరెన్సిక్ వైద్యులు డాక్టర్ కార్తిక్ నాగులతో చర్చించి త్వరితగతి పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను కుటుంబీలకు అప్పగించేలా చర్యలు తీసుకున్నారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తుండగా అఖిల్, ప్రణీత్‌ల బంధువులు వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఇక్కడికి రావాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అప్పటివరకు వాహనాలను కదలనిచ్చేది లేదని భీష్మించారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నిస్తూ, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి రావాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్సీ రెహమత్‌బేగ్, పోలీసులు మృతుల బంధువులకు నచ్చజెప్పడంతో శాంతించి ఆందోళనను విరమించి మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. హైదరాబాద్ డీఆర్వో రామకృ ష్ణ, తహశీల్దార్లు నయీముద్దీన్, నిహారిక, ప్రవీణ్, జ్యోతి ఇతర సిబ్బంది మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించడంలో సహకరించారు. శవ పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలె త్తకుండా డీసీపీ చంద్రమోహన్, అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ నూనావత్ రవి, అబిడ్స్ ఇన్‌స్పెక్టర్ గౌరేందర్ రెడ్డిలు పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. నాంపల్లి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ మాల్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ & సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు అమాయ కులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ హరి చందనకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్నిమాపక నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రాథమిక విచారణలో షాపు యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలిందని, సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

మన తెలంగాణ 26 Jan 2026 6:30 am

మా పార్టీలో చేరు..మంచి పోస్టు ఇస్తా: పిసిసి చీఫ్ కు కవిత ఆఫర్

కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ... నేనెందుకు ఆ పార్టీలో చేరతాను నేను కాంగ్రెస్‌లో చేరతానని మహేష్ గౌడ్‌కు ఏమైనా కల వచ్చిందా..? ఎన్నికల్లో జాగృతి గెలువబోతుంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనతెలంగాణ/హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తమ పార్టీలో చేరితే ఆయనకు మంచి పోస్టు ఇస్తానంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆఫర్ చేశారు. మహేశ్ కుమార్ గౌడ్‌ను జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తనను కాంగ్రెస్‌లో చేర్చుకోమని మీడియా చిట్‌చాట్‌లో మహేష్‌కుమార్ గౌడ్ అన్నట్లు తాను వార్త చూశానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ అని, తానేందుకు కాంగ్రెస్‌లో చేరతాను..? అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో జాగృతి గెలువబోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తనను బద్నాం చేసే పనిలో మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారని... తాను కాంగ్రెస్‌లో చేరతానని ఆయనకు ఏమైనా కల వచ్చిందా..? అని ఎద్దేవా చేశారు. ఆయన మానసిక పరిస్థితి చెక్ చేసుకోవాలని హితవు పలికారు. బలమైన రాజకీయ పార్టీగా జాగృతిని మార్చే ప్రయత్నం చేస్తున్నానని కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాజీ మంత్రి హరీష్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు ఇప్పించింది హరీశ్ రావు అని, సృజన్‌రెడ్డి పెద్ద తిమింగలంగా మారటానికి ఆయనే కారణం అని పేర్కొన్నారు. సృజన్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డి బావమరిది అని హరీశ్‌రావుకు అప్పుడు తెలియదా..? అని ప్రశ్నించారు. హరీష్‌రావు తవ్విన గుంతలో కెటిఆర్ పడటం బాధాకరం అని పేర్కొన్నారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మాత్రమే లేఖ రాస్తానని హరీష్‌రావు అంటున్నారని, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు లేఖ రాయనని హరీష్‌రావు అనటం దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానించటమే అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా రాష్ట్రానికి సిబిఐ ఎలా వస్తుంది..? అని ప్రశ్నించారు. 2014 నుంచి జరిగిన సింగరేణి టెండర్లపై విచారణ జరపాలని ఆయన అంటున్నారని, అంటే కెసిఆర్ పాలనపైనా హరీష్‌రావు విచారణ కోరుతున్నట్లే కదా..? అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. హరీష్‌రావు బాధ కమీషన్ల కోసమే.. హరీశ్‌రావు లేఖ రాయగానే కిషన్‌రెడ్డి మీటింగ్ పెడుతున్నారని కవిత విమర్శించారు. హరీశ్‌రావు బాధ అంతా ఆయన కమీషన్ల కోసమే అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు చెందిన కంపెనీకి సింగరేణి టెండర్ ఎలా వచ్చిందని అడిగారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బొగ్గు గనులను తెలంగాణకు కేటాయించటానికి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. బిఆర్‌ఎస్ కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడటం బాధాకరం అని పేర్కొన్నారు. జీతాలు ఇవ్వటానికి కూడా సింగరేణి వద్ద నిధులు లేవు అని చెప్పారు.సింగరేణికి చెందిన 25 టెండర్లలో ఎక్కువ బిఆర్‌ఎస్ నేతలకు చెందిన కంపెనీలకే దక్కాయని అన్నారు. ఓబీ వర్క్‌కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తీసుకురావడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల కోసం కాకుండా, సింగరేణి కార్మికుల కోసం తాము పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. మహిళా ఐఎఎస్ అధికారిపై ఇష్టానుసారంగా రాస్తే జర్నలిస్టులకు కెటిఆర్ ఎలా సహకరిస్తారని ప్రశ్నించారు. అదే కెటిఆర్ మీద ఓ ఛానల్ రాస్తే దాడి చేస్తారా..? అని అడిగారు. మహిళ మీద వార్తలు ప్రచురించిన ఛానల్ ప్రతినిదులకు ఎందుకు సహకరిస్తున్నారనేది విడ్డూరంగా ఉందని అన్నారు.

మన తెలంగాణ 26 Jan 2026 6:20 am

టీమిండియా విధ్వంసం.. కివీల విలవిల

అభిషేక్ శర్మ ఊచకోత 14 బంతుల్లో అర్ధ సెంచరీ చెలరేగిన సూర్యకుమార్ బుమ్రా మ్యాజిక్ మూడో టీ20లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం గౌహతి: న్యూజిలాండ్‌తో ఆదివారం గౌహతిలో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే 30తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముందుకు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 10 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ సంజు శాంసన్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ స్కోరును పరిగెత్తించాడు. ఇషాన్ ఈసారి కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇటు ఇషాన్ అటు అభిషేక్ దూకుడును ప్రదర్శించడంతో భారత్ స్కోరు 3 ఓవర్లలోనే 50కి చేరింది. అయితే 13 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 పరుగులు చేసిన ఇషాన్‌ను ఐష్ సోధి వెనక్కి పంపాడు. దీంతో 53 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత అభిషేక్ చెలరేగి ఆడాడు. అతనికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండగా నిలిచాడు. ఇద్దరు పోటీ పడి ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో టి20లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో యువరాజ్ 12 బంతుల్లో ఈ మార్క్‌ను సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన అభిషేక్ 20 బంతుల్లోనే ఏడు ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ 26 బంతుల్లో ఆరు ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 57 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. బుమ్రా మూడు, బిష్ణోయ్, హార్దిక్ రెండేసి వికెట్లను తీశారు. కివీస్ బ్యాటర్లలో ఫిలిప్స్ (48), చాప్‌మన్ (32) పరుగులు చేశారు.

మన తెలంగాణ 26 Jan 2026 6:00 am

26th jan 2026 |నేటి పంచాంగం

26th jan 2026 | నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:00 am

ధరణిలో లోపాల వల్లే రిజిస్ట్రేషన్ ఫీజు గోల్‌మాల్

అవకతవకలు జరిగింది కేవలం రూ.3.90 కోట్లే త్వరలో 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ భూ ఆడిట్ రాష్ట్రంలో 413 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వేకి ఆదేశం పాత పద్ధతులకు స్వస్తి.. ఆధునిక ‘రోవర్స్’తో సర్వే చేస్తాం రెవెన్యూ మంత్రి పొంగులేటి మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ధరణిలోని లోసుగుల వల్లే భూరిజిస్ట్రేషన్ ఫీజులో గోల్‌మాల్ చోటుచేసుకుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న లైసైన్స్ డ్ సర్వేయర్లకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడ్తూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఫీజు విషయంలో భూ భారతి చట్టంద్వారా అవకతవకలు జరిగినట్లు ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రతిపక్షంలో ఉండే ఒక శాసనసభ్యుడు 1000 కోట్లు అవినీతి జరిగిందని, ఇంకో మాజీ మంత్రి 1000 కోట్లు జరిగిందని,మరోమాజీ మంత్రి రూ 1500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని.. కానీ ఈ అవకతవకలు భూభారతి వచ్చిన తర్వాత జరగలేని, గత ప్రభుత్వంలోని ధరణి హయంలోనే జరిగాయని మంత్రి స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు అవకతవకలపై అనుభవం ఉన్న వారితో ఒక ప్రత్యేకమైన కమిటీని వేశామని... నిన్ననే దానిమీద రివ్యూ చేశామన్నారు. సమీక్ష తర్వాత ఏవైతే అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం అంటున్నారో దానికి ప్రధానమైన సూత్రధారుడు, పాత్రధారులు ఆనాడు ధరణిలో ఉండే లొసుగులే అనేది స్పష్టంగా తేలిందని మంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు అన్నట్టు 1000 కోట్లో, 1500 కోట్లో కాదు, నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న లెక్క వరకు కేవలం రూ.3 కోట్ల 90 లక్షల వరకు మాత్రమే అవకతవకలు జరిగాయన్నారు. త్వరలో 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ భూ ఆడిట్ ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములను కాజేశారని, దీనిపై సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్ధతో పైలట్ కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడం జరిగిందని ఇందులో అనేక అవినీతి అక్రమాలు జరిగినట్లు ప్రాధమిక నివేదికలో స్పష్టమైందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన తర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో 413 గ్రామాల్లో భూ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా నక్షాలు లేని 413 గ్రామాలలో పైలెట్ ప్రాజెక్టు క్రింద మొదటి విడత క్రింద సర్వే పనులను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.ఇందుకుగాను ప్రతి జిల్లా నుంచి 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించామని ఇప్పటికే జిల్లాల నుంచి ప్రభుత్వానికి భూనక్షలు లేని రెవెన్యూ గ్రామాల పేర్లు ప్రభుత్వానికి చేరాయన్నారు. ఇప్పటి వరకు నియమించిన లైసెన్స్ సర్వేయర్లు ద్వారా భూ సర్వే చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. భూ సర్వేను విడతల వారీగా పూర్తి చేసి భూముల మ్యాప్ తో కలిసి ప్రతి ఏకరాకు భూ దార్ నెంబర్ లను అందిస్తామన్నారు. 

మన తెలంగాణ 26 Jan 2026 5:40 am

కెనడాలో భారతీయుడి హత్య

టొరంటో : కెనడాలో భారతీయ సంతతి వ్యక్తి దిల్‌రాజ్ గిల్ హత్యకు గురయ్యాడు. గ్యాంగ్ వార్ నేపథ్యంలోనే ఈ ఘటన బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలోని బర్నబేలో జరిగింది. కాల్పుల సంఘటన వివరాల గురించి తెలియగానే స్థానిక పోలీసులు అక్కడికి చేరారు. ఇక్కడ కొన ఊపిరితో ఉన్న దిల్‌రాజ్‌ను చికిత్సకు తరలించేలోగానే చనిపోయినట్లు నిర్థారించారు. మృతుడిని వాంకోవర్ నివాసిగా గుర్తించారు. ఈ ప్రాంతంలో బిసి గ్యాంగ్ వార్ సాగుతోంది. ఈ నెల 22వ తేదీన సాయంత్రం కెనడావేలోని 3700 బ్లాక్ వద్ద కాల్పులు జరిగాయని రాయల్ కెనెడియన్ పోలీసులు తెలిపారు. ఈ హత్య తరువాత కొద్ది సేపటికి సమీపంలో ఓ రాదారిలో ఓ వాహనం తగులబడి పోతూ ఉండగా పోలీసులు గుర్తించారు. అంతకు ముందు జరిగిన హత్యకు ఈ వాహన దుర్ఘటనకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. దిల్‌రాజ్ పోలీసు రికార్డులలో ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో తరచూ జరుగుతోన్న గ్యాంగ్‌వార్ కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు వేగవంతం అయింది. ఈ ఘటనతో స్థానిక భారతీయ సంతతి వారిలో ఆందోళన వ్యక్తం అయింది. 

మన తెలంగాణ 26 Jan 2026 5:20 am

హెచ్`1బీ స్టాంపింగ్‌లో యూఎస్ జాప్యం

` ఇంటర్వ్యూలు 2027లోకి మార్పు! వాషింగ్టన్(జనంసాక్షి):భారతీయ వత్తి నిపుణులకు అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం చోటుచేసుకోనుంది. హెచ్`1బీ వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్లు 2027లోకి మారాయి. కొత్త …

జనం సాక్షి 26 Jan 2026 4:36 am

మహిళలకు అగ్రతాంబూలం

` అన్ని రంగాల్లో అతివలదే పైచేయి ` రాజ్యాంగమే జాతీయ స్ఫూర్తి, దేశ ఐక్యతకు పునాది ` రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ …

జనం సాక్షి 26 Jan 2026 4:35 am

నాంపల్లి అగ్ని ప్రమాదం..

బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ` ఘటనా స్థలం నుంచి ఐదు మతదేహాల వెలికితీత హైదరాబాద్(జనంసాక్షి): నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర …

జనం సాక్షి 26 Jan 2026 4:34 am

రెండ్రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

` అభివద్ధి, సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ` బీఆరఎస్ పదేళ్లలో చేయని అభివద్ధి.. ప్రజాప్రభుత్వం రెండేళ్లలో చేసి చూపించాం ` మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ …

జనం సాక్షి 26 Jan 2026 4:33 am

తప్పుడు ప్రచారం ఆపండి

` మీ మాటలను పట్టించుకునే పరిస్థితి లేదు ` తెలంగాణ ప్రజలు మళ్లీ మోసపోరు ` హరీశ్‌కు ఎమ్మెల్సీ దయాకర్ కౌంటర్ హైదరాబాద్(జనంసాక్షి):మాజీ మంత్రి హరీష్‌రావు చేసిన …

జనం సాక్షి 26 Jan 2026 4:31 am

బొగ్గు స్కాంలో సీఎంను కాపాడేందుకు భట్టి ప్రయత్నాలు

` సైట్ విజిట్ నిబంధన పెట్టిన అన్ని టెండర్లూ రద్దు చేయాలి ` ఈ బాగోతాన్ని బయటపెట్టిన బీఆరఎస్‌పై బురద జల్లేందుకు కుట్ర:హరీశ్‌రావు హైదరాబాద్(జనంసాక్షి): డిప్యూటీ సీఎం …

జనం సాక్షి 26 Jan 2026 4:30 am

ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ డీసీపీ చైతన్య కుమార్ చిత్రాన్ని రియాజ్‌ చేతిలో చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ గా తప్పుగా షేర్ చేస్తున్నారు

హైదరాబాద్ డీసీపీ చైతన్య కుమార్ చిత్రాన్ని రియాజ్‌ చేతిలో చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ గా

తెలుగు పోస్ట్ 26 Jan 2026 12:12 am

సోమవారం రాశి ఫలాలు (26-01-2026)

మేషం వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృషభం నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యలు పరిష్కరించుకుంటారు. మిధునం ఉద్యోగస్థులకు స్థానచలనాలు తప్పవు. ఆకస్మికంగా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబమున అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. కర్కాటకం ముఖ్యమైన పనులలో ఆటంకాలుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో మార్గవరోధాలు కలుగుతాయి. సింహం మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున సమస్యలు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. శుభ కార్యములకు ధనవ్యయం చేస్తారు. కన్య ఉద్యోగులకు ఇతరుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధు వర్గంతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం చికాకు పరుస్తుంది. ధనదాయ మార్గాలకు అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట విమర్శలు అధికమౌతాయి. తుల చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారమున నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. సమాజంలో ఉద్యోగమున సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. గౌరవ మర్యాదలకు లోటుండదు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వృశ్చికం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు. ధనస్సు ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. గృహమున చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకరం ఆప్తులు నుంచి ధన సహాయం అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్థుల కలలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభం సన్నిహితుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఇతరుల నుండి ఋణ ఒత్తిడులు అధికమౌతాయి. మీనం ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. దాయదులతో స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.  

మన తెలంగాణ 26 Jan 2026 12:10 am

శుభాన్షు శుక్లాకు అశోక్ చక్ర

గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం అత్యంత విశిష్ట అశోక్ చక్ర పురస్కారాన్ని వ్యోమగామి శుభాంశు శుక్లాకు గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు తమ అత్యంత అసాధారణ అంతరిక్ష ప్రయాణంతో విశ్వ ఖ్యాతి గాంచారు. ఆయనతో దేశ యువత మరింత స్ఫూర్తి పొందుతుందని , ఓ వైపు వాయుసేనలో కీలక పాత్రతో పాటు అంతరిక్ష రంగంలోనూ విజయంతో ఆయన సాధించిన ద్వంద్వ విజయాలకు గుర్తింపుగా పురస్కారం ప్రకటించారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుక్లా నిలిచారు. యాక్సియామ్ 4 స్పేస్‌మిషన్‌లో భాగంగా ఆయన ఇతర వ్యోమగాములతో కలిసి అత్యంత క్లిష్టమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి ప్రవేశించారు. పైగా ఐఎస్‌ఎస్‌లోనికి ప్రవేశించిన తొలి భారతీయుడిగా చరిత్ర రాశారు. 

మన తెలంగాణ 26 Jan 2026 12:00 am

మేడారం జాతర.. భక్తుల కోసం ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

మన తెలంగాణ / హైదారాబాద్ : మేడారం భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదివారం నుండి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 1వ తేదీ వరకు నడువనున్నాయి. మేడారంలో ఆర్‌టిసి తాత్కాలిక బస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నందున ఆర్‌టిసి జిహెచ్‌ఎంసి పరిధిలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా ప్రత్యేక బస్సులను ఆదివారం ప్రారంభించింది. జాతరకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 4 వేల ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్‌టిసి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు కూడా వెంటనే పెంచే విధంగా సంస్థ సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది మేడారం జాతరకు 3491 ఆర్‌టిసి బస్సులు నడిపించగా 16.82 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈసారి 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణం చేస్తారనే అంచనాతో 4 వేల బస్సులను నడిపేందుకు సంస్థ ఏర్పాట్లు చేసింది. ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సహా ఆర్‌టిసి ఉన్నతాధికారులు జాతర విజయవంతానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారు. భక్తులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా పూర్తి చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆర్‌టిసి బస్సులనే వినియోగించాలని సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. స్వంత వాహనాలతో వస్తే దూరంగా పార్కింగ్, ఎక్కువ నడక వంటి ఇబ్బందులు తప్పవని, ఆర్‌టిసి బస్సులు గద్దెలకు సమీపంలోనే దించుతాయని అధికారులు తెలిపారు. ఆర్‌టిసి ప్రయాణం భద్రతాపరంగా మరింత నమ్మదగిందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది జాతర సందర్భంగా అధిక సంఖ్యలో ఆర్‌టిసి బస్సులు ఏర్పాటు చేస్తోంది. ఈ సారి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా మేడారానికి వచ్చి రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధానంగా మేడారం వెళ్ళే రూట్లలో వరంగల్ ,హనుమకొండ , ఖమ్మం,కరీంనగర్ రూట్లలో రద్దీ ఎక్కువగా ఉండనుండడంతో రద్దీగా తగిన విధంగా బస్సులు నడపడానికి అక్కడ అధికారులు సిద్ధంగా ఉండేలా ఆర్‌టిసి ఏర్పాట్లు చేసింది.

మన తెలంగాణ 25 Jan 2026 11:21 pm

హెడ్ కానిస్టేబుల్‌కు తెలంగాణ పోలీస్ హీరోస్ గ్యాలంటరీ అవార్డు

శంకర్ పల్లి మున్సిపాలిటీ లోని సింగపూర్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డి రాష్ట్ర గ్యాలంటరీ అవార్డుకు ఎంపిక అయ్యారు.విధినిర్వహణలో భాగంగా ప్రాణాలు ఫణంగా పెట్టి ఓ దొంగను పట్టుకునేందుకు వెళ్లి బుల్లెట్ గాయాలు అయినా అతని ధైర్య సాహసలకు మెచ్చి ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది.గత సంవత్సరం గచ్చిబౌలిలోని ఒక పబ్బులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాక్కున్నడనే పక్కా సమాచారంతో సి సి ఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తో పాటు మరో కానిస్టేబుల్ వెళ్లిన విషయం తెలిసిందే.. ఇప్పుడు రాష్ట్రపతి నుంచి ఆగస్టులో ఇవ్వబోయే దేశం మొత్తం నుంచి గ్యాలన్టరీ అవార్డును వెంకటరెడ్డికి ఇవ్వన్నారు. ఈ అవార్డు రావడం శంకరపల్లి పట్టణ తో పాటు తెలంగాణ రాష్ట్ర పోలీసులకు దక్కిన గౌరవం అని అన్నారు.అవార్డుకు ఎంపిక అయినా వెంకట్ రెడ్డి కి అటు పోలీసులతో పాటు సింగపూర్ గ్రామ ప్రజలు, చిన్ననాడు కలిసి చదువుకున్న పదవ తరగతి బ్యాచ్ సహచరులు, మిత్రులు అభినందనలు తెలిపారు.జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి, చదివిన పాఠశాలకు పేరు ప్రాఖ్యాతలు తీసుకువచ్చి,, చేసిన ఉద్యోగానికి న్యాయం చేసిన వెంకట్ రెడ్డి కి ప్రతి ఒక్కరు అభినందనలు తెలుపుతున్నారు

మన తెలంగాణ 25 Jan 2026 11:20 pm

సిఎంను కాపాడేందుకు భట్టి అవాస్తవాలు..

సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు తనకు లేఖ రాస్తే.. సిఎంతో మాట్లాడుతానని భట్టి విక్రమార్క అనటం హాస్యాస్పదం ఈ స్కాం సూత్రధారి రేవంత్ రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బావమరిది సృజన్ రెడ్డి సాక్షాత్తు దొంగే రేవంత్ రెడ్డి అయినప్పుడు.. ఆయనతో మాట్లాడితే న్యాయం జరుగుతుందా..? సైట్ విజిట్ విధానం పెట్టిన అన్ని టెండర్లు రద్దు చేయాలి ఎంత మందికి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి  మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మనతెలంగాణ/హైదరాబాద్ : డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి సిఎం రేవంత్ రెడ్డిని బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు యత్నించారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్‌లో అత్యుత్తమ హోదా పొందటానికి అందరికంటే ఎక్కువ అర్హత ఉన్న నాయకుడు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అని చెప్పారు. అంతటి అనుభవం ఉన్న భట్టి విక్రమార్క.. రేవంత్‌రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం పనిచేయటం బాధాకరమని పేర్కొన్నారు. సింగరేణి ఓబీ వర్క్‌కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తెచ్చిందే కాంగ్రెస్ అని గుర్తుచేశారు. సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు అని, తనకు లేఖ రాస్తే.. ముఖ్యమంత్రితో మాట్లాడుతానని భట్టి అనటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సింగరేణి స్కాం సూత్రధారి రేవంత్ రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బావమరిది సృజన్ రెడ్డి అని, సాక్షాత్తు దొంగే రేవంత్ రెడ్డి అయినప్పుడు.. ఇక ఆయనతో మాట్లాడితే న్యాయం జరుగుతుందా..? అని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న సామెతను తలపించిందని విమర్శించారు. స్కాంను సమర్థించుకునేందుకు సంబంధం లేని కాగితాలతో మసిపూసి మారేడు కాయ చేశారని అన్నారు. సైనిక్ స్కూల్ లో బట్టలు ఆరబెట్టే మిషన్ కోసం పెట్టిన నిబంధనను తెచ్చి.. వేల కోట్ల సింగరేణి ఓబీ కాంట్రాక్టులకు ముడిపెట్టడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. జనవరిలో సైట్ విజిట్ లేకుండా 7 శాతం తక్కువకు టెండర్లు ఖరారైతే.. మే నెలలో ఆ నిబంధన పెట్టి అంచనా రేట్ల కంటే ఎక్కువకు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. సింగరేణికి వచ్చిన 6,900 కోట్ల లాభాలను దాచిపెట్టి, కార్మికుల బోనస్‌లో కోత విధించారని మండిపడ్డారు. ఆ డబ్బును రేవంత్ రెడ్డి తన సోకులకు, ఢిల్లీకి కప్పం కట్టడానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, బొగ్గు కుంభకోణం బయటపెట్టిన బిఆర్‌ఎస్‌పై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల స్వార్థ్‌ం కోసం వారికి అనుకూలంగా సింగరేణి విధనాలను మార్చారని ఆక్షేపించారు. 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉందని భట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో ఓబీ వర్క్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానమే లేదని స్పష్టం చేశారు. 2018 నుంచి 2024 వరకు అనేక ఓబీ వర్క్‌కు టెండర్లు జరిగాయని... వాటికి సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం లేదని ప్రస్తావించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ కోసం కాంట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్ ఆఫ్ ద బుక్‌ను బయట పెట్టాలని కోరారు. సింగరేణి స్కాంలో లబ్ధిదారులు ఎవరు..? నష్టం ఎంత..? ఎవరు బాధ్యులో.. భట్టివిక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిందని, నచ్చినవారికి టెండర్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. సింగరేణిలో మిగిలిన స్కామ్‌లు భయటపెడతామని వెల్లడించారు. సింగరేణి స్కామ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది సింగరేణి స్కామ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని హరీష్‌రావు అన్నారు. 2025 మే నెలలో సైట్ సర్టిఫికెట్ నిబంధన వచ్చిందని, ఆ తర్వాత అన్ని టెండర్లకు సైట్ సర్టిఫికెట్ నిబంధన పెట్టారని చెప్పారు. ప్రతి టెండర్‌కు ప్లస్ టెన్ పద్ధతి అనుసరించారని అన్నారు. స్కామ్‌లు జరగలేదని నమ్మించేందుకు భట్టి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2025 మే నుంచి ఎంతమందికి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని అనేక మంది ఫిర్యాదు చేశారని, తమకు కావాల్సిన వారికే సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. కొంతమంది సైట్ విజిట్ చేసి సెల్ఫీలు తీసుకుని మరీ సింగరేణికి మెయిల్ చేశారని, తమకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని జీసీసీ, మహాలక్ష్మి వంటి కంపెనీలు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. టెండర్ డాక్యుమెంట్‌లో సైట్ విజిట్ చేసిన వెంటనే స్థానిక జిఎం సర్టిఫికేట్ ఇవ్వాలని స్పష్టంగా ఉందని, మరి సైట్ విజిట్ చేసినప్పటికీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ ఆలస్యం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి...ఏ చీకటి ఒప్పందం ఉంది..ఎవరి వాటాలు, కమిషన్లు దాగి ఉన్నాయి..? అని నిలదీశారు. టెండర్ల నిబంధనలు మార్చేటప్పుడు కాంట్రాక్టర్లతో సమావేశం పెడతారని, టెండర్ల రింగ్ మాస్టరైన సిఎం బంధువు ఏ హోటల్‌లో మీటింగ్ పెట్టాడో కూడా తనకు తెలుసని అన్నారు. సైట్ సర్టిఫికెట్ నిబంధన తొలి లబ్ధిదారు శోధా కన్‌స్ట్రక్షన్స్ యజమాని సృజన్‌రెడ్డి అని, ఆయన స్వయానా సిఎం బావమరిది అని చెప్పారు. నైనీ కోల్ బ్లాక్ ఒక్కటే కాదని, సైట్ విజిట్ విధానం పెట్టిన అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కాంలు, కాంగ్రెస్ అరాచకాలతో సింగరేణి సంస్థపై భారం పెరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో స్కీంలు లేవు.. కానీ స్కాంలు పెరిగిపోయాయని ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి సింగరేణి స్కాంపై సిబిఐ లేదా సుప్రీంకోర్టు జడ్డితో విచారణ జరిపించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. భట్టి లబ్ధిదారుడా లేదా అనేది విచారణలో తేలుతుందని తెలిపారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు గతంలో మంత్రులు రాజీనామా చేసేవారని ప్రస్తావించారు. తాము బొగ్గు స్కాం అని భయపెట్టగానే నాలుగు పేపర్లు పట్టుకొని వచ్చి, మీడియాని సైతం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. తాను బయటపెట్టిన సోలార్ స్కామ్, పేలుడు పదార్థాల స్కామ్, ఉద్యోగుల డీ- ప్రమోషన్ వంటి కీలక అంశాలపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని అడిగారు. ఎందుకంటే సింగరేణిలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో స్కాములు జరిగిందన్నది వాస్తవం అని పేర్కొన్నారు. అడ్డగోలుగా నిబంధనలు మార్చి, రేవంత్ రెడ్డి బావమరిదికి, ఇతర అనుయాయులకు టెండర్లు కట్టబెట్టింది నిజం అని చెప్పారు. కాంగ్రెస్ అవినీతి వల్ల సింగరేణిలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లను లేకుండా చేశారని, అందుకనే రోజురోజుకి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉత్పత్తి పడిపోయిందని, బొగ్గు అమ్మకాలు తగ్గిపోయాయని అన్నారు. రేపో, మాపో మాకు మరో ప్రేమ లేఖ వస్తుంది సింగరేణి స్కాం బయటపెట్టగానే తనకు సిట్ నోటీసు వచ్చిందని హరీష్‌రావు అన్నారు. రేపో, మాపో తమకు మరో ప్రేమ లేఖ(సిట్ నోటీసు) వస్తుందని ఎద్దేవా చేశారు. తాము ఉద్యమకారులం అని, నోటీసులకు భయపడం అని మరోసారి స్పష్టం చేశారు. సింగరేణి కాలరీస్ అనేది తెలంగాణ ప్రజల ఆస్తి అని, ఇది ఏ ఒక్క మంత్రికో, ప్రభుత్వానికో, కొద్దిమంది కాంట్రాక్టర్లకో చెందిన సంస్థ కాదు అని స్పష్టం చేశారు. సింగరేణిలో పారదర్శకత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాలతో నడుస్తున్నదని, సింగరేణి టెండర్ ప్రక్రియను చూస్తే ఈ మూడు సూత్రాలకు మంగళం పాడారు అని స్పష్టమవుతున్నదని చెప్పారు.పారదర్శకత ఉంటే ఉంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన ఓబీ వర్క్, సోలార్ పవర్ ప్లాంట్స్, మిగతా అన్ని టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది..? సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిది, 49 శాతం వాటా కేంద్రానిది అని, ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. బిజెపి, కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాళా తీయించి, ప్రైవేటుపరం చేసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో ఖరారైన ఓబీ వర్క్, సోలార్ పవర్ ప్లాంట్స్ టెండర్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలి. నైనీ గోల్ బ్లాక్ టెండర్‌తో పాటు, అవినీతి జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రతి నెలా మెడికల్ బోర్డులు నిర్వహించి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, లేదంటే వేల మంది కార్మికులతో సింగరేణి భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాపాడే వరకు తాము వదిలిపెట్టం అని, సిరుల గని సింగరేణిని కాపాడుకుంటామని తెలిపారు.

మన తెలంగాణ 25 Jan 2026 11:14 pm

హిందీని దగ్గరికి రానిచ్చేది లేదు: స్టాలిన్

చెన్నై: తమిళనాడులో హిందీకి ఎప్పటికీ చోటు లేదని డిఎంకె నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్పష్టం చేశారు. హిందీ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన భాషా అమరవీరుల త్యాగాలను ఆయన కొనియాడారు. గతంలో కానీ ఇప్పుడు కానీ ఇకపై కానీ హిందీ ఇక్కడికి చేరలేదని స్టాలిన్ తెలిపారు. భాషా అమరుల దినం సందర్భంగా ఆదివారం స్టాలిన్ సందేశం వెలువడింది. తమిళ నేలలో సొంత భాషను ప్రాణంతో సమానంగా ప్రేమిస్తారు. హిందీకి వ్యతిరేకంగా సంఘటితంగా తమిళులు పోరాడారని , ప్రతిసారి ఈ ప్రతిఘటన సాగింది. దీనితోనే హిందీ ఈ రాష్ట్రం పొలిమేర దాటలేదని తెలిపారు. ఈ సందర్భంగా స్టాలిన్ రాష్ట్రంలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమ ఘట్టాలను తెలిపే సంక్షిప్త వీడియోను పొందుపర్చారు. భాషా పరిరక్షణకు ద్రవిడ దిగ్గజ నేతలు సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి వారు అందించిన సేవలను ఈ వీడియోలో చేర్చారు. ఉద్యమ ఘట్టాలను వివరించారు.

మన తెలంగాణ 25 Jan 2026 11:08 pm

అనుమానాస్పద స్థితిలో దంపతులు ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథం (58), భార్య నక్కలి లక్ష్మి(54) అనుమానస్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కలిసి శనివారం ఉదయం పొలానికివెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు. ఇంట్లోనే ఉన్న కూతురు నక్కలి సురేఖతో కలిసి భోజనం చేశారు. అప్పులున్నా, కుమార్తె పెళ్లి చేయాల్సి ఉందంటూ మాట్లాడుతున్నారు. వీరికి నలుగురు సంతానమైతే, ముగ్గురి పెళ్లిళ్లయ్యాయి. ఒక కూతురు పెళ్లికి ఉంది. చిన్న కూతురు సురేఖతో భోజనం చేసి తరువాత దశరథం ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. ఆయన పడిపోయిన వెంటనే తల్లి నక్కలి లక్ష్మి కూడా పడిపోయింది. కూతురు చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకునేసరికే ఇద్దరు మృతి చెందారు. అప్పుల బాధ తట్టుకోలేక ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్టు కొడుకు నక్కలి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నక్కలి దశరథానికి యూనియన్ బ్యాంక్‌లో రూలక్ష, నక్కలి లక్ష్మికి బంట్వారం ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో రూ.లక్ష 50 వేలు పంటపై రుణాలు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర రూ.6 లక్షలకు పైగా వడ్డీకి అప్పు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరి మృతిపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. కొడుకు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ధారూర్ సీఐ రఘురాములు, బంట్వారం ఎస్‌ఐ విమల తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకుకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 25 Jan 2026 11:07 pm

I want to work with Anil Ravipudi again & again – Chiru

Megastar Chiranjeevi and blockbuster director Anil Ravipudi have delivered an All-time Regional Industry Hit with Mana Shankara Vara Prasad Garu, for Sankranti. Sahu Garapati and Sushmita Konidela have produced the film on a lavish scale with Victory Venkatesh in a cameo role. The makers have conducted a success celebration giving shields to cast and crew […] The post I want to work with Anil Ravipudi again & again – Chiru appeared first on Telugu360 .

తెలుగు 360 25 Jan 2026 10:58 pm

டாஸ்மாக் கடைக்கு இந்தியில் பெயர்பலகை - உண்மை என்ன?

டாஸ்மாக் கடைக்கு இந்தியில் பெயர் பலகை வைக்கப்பட்டுள்ளதாக பரவும் புகைப்படம் 2 ஆண்டுகள் பழையது.

తెలుగు పోస్ట్ 25 Jan 2026 10:49 pm

మేడారంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

మేడారం జాతరకు వచ్చే లక్షలాది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టింది. ఒకవైపు సురక్షిత మంచినీటిని అందించడం, ముమ్మర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం, జంపన్న వాగులో నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టడంతో పాటు పెద్ద ఎత్తున వైద్య సదు పాయాలను కల్పించింది. మేడారం జాతర ప్రధాన వేదిక సమీపంలో టిటిడి కల్యాణ మండపంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం, 30 ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. మోత్తం జాతరలో ఏవిధమైన ఇబ్బందులు కలుగకండా ఉండేందుకు 5192 మంది మెడికల్, పారా మెడికల్ సిబ్బందిని వైద్యఆరోగ్యశాఖ రంగంలోకి దించింది. జాతర సమయంలో 24 గంటలు వైద్య సేవలందించేందుకు గాను 649 వైద్యాధికారులు, 154 మంది ఆయుష్ వైద్యాధికారులు, 673 నర్సింగ్ అధికారులు, 1905 ఆశ వర్కర్లు, 1111 పారామెడికల్ సిబ్బంది, 331 సూపర్వైజరీ స్టాఫ్, 700 ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. జాతర ముగిసిన అనంతరం కూడా స్థానిక గిరిజనులకు ఏవిధమైన ఆరోగ్య సమస్యలు కలుగకుండా 10 మెడికల్ క్యాంప్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు, మేడారం చుట్టూ పక్కలా ఉన్న ఏటూరు నాగారం, ములుగు, పస్రా, గోవిందా రావు పేట, మంగపేట సి.ఎస్.సి. ఆసుపత్రులను పటిష్ఠపరిచారు. సురక్షిత స్నానాలకు 325 మంది స్మిమ్మర్లు : మేడారం వచ్చే బీభక్తులు విధిగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ జంపన్న వాగులో ప్రమాద వశాత్తూ పడి ప్రమాదాలకు గురు కాకుండా ఉండేందుకు జంపన్న వాగు పొడుగునా సురక్షితులైన స్విమ్మర్లు, సింగరేణి, ఎస్.డి.ఆర్.ఎఫ్ సిబ్బందిని మొత్తం 325 మందిని నియమించారు. వీరిలో మత్శ్య శాఖ ద్వారా 210 స్విమ్మర్లు, 12 మంది సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులు, 100 మంది ఎస్.డీ.ఆర్.ఎఫ్ టీమ్ సభ్యులున్నారు. వీరందరికీ లైఫ్ జాకెట్లు, ప్రత్యేక టీ షరట్స్, సెర్చ్ లైట్స్, లైఫ్ సేవింగ్ పరికరాలు అందచేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా 268 సిబ్బంది : జాతర మొత్తం ప్రాంగణంలో ఏవిధమైన అగ్నిప్రమాదాలు జరుగకుండా రాష్ట్ర అగ్నిమాపక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. 15 ఫైర్ బ్రిగేడ్స్, 12 మిస్ట్ బుల్లెట్స్, రెండు ఫైర్ ఇంజన్లను జాతర ప్రాంగణంలో మోహరించారు. మొత్తం 268 ఫైర్ సిబ్బంది విధుల్లో ఉంటారు.

మన తెలంగాణ 25 Jan 2026 10:30 pm

Mass Raja |రవితేజకి ఆ ఇద్దరు బ్లాక్ బస్టర్స్ అందించేనా..?

Mass Raja | రవితేజకి ఆ ఇద్దరు బ్లాక్ బస్టర్స్ అందించేనా..? ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 25 Jan 2026 10:30 pm

ഫാക്ട് ചെക്ക്: അഫ്ഗാനിസ്ഥാനുമായി വ്യാപാര ബന്ധം നിർത്തിവെച്ചെന്ന് കേന്ദ്ര മന്ത്രി പിയുഷ് ഗോയൽ പറഞ്ഞോ? പ്രചാരണം വ്യാജം

ഇറാനിലെ ആഭ്യന്തര സംഘർഷം കണക്കിലെടുത്താണ് നടപടിയെന്നാണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 25 Jan 2026 10:28 pm

కెనడాలో భారత సంతతి వ్యక్తి హత్య

కెనడాలో భారతీయ సంతతి వ్యక్తి దిల్‌రాజ్ గిల్ హత్యకు గురయ్యాడు. గ్యాంగ్ వార్ నేపథ్యంలోనే ఈ ఘటన బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలోని బర్నబేలో జరిగింది. కాల్పుల సంఘటన వివరాల గురించి తెలియగానే స్థానిక పోలీసులు అక్కడికి చేరారు. ఇక్కడ కొన ఊపిరితో ఉన్న దిల్‌రాజ్‌ను చికిత్సకు తరలించేలోగానే చనిపోయినట్లు నిర్థారించారు. మృతుడిని వాంకోవర్ నివాసిగా గుర్తించారు. ఈ ప్రాంతంలో బిసి గ్యాంగ్ వార్ సాగుతోంది. ఈ నెల 22వ తేదీన సాయంత్రం కెనడావేలోని 3700 బ్లాక్ వద్ద కాల్పులు జరిగాయని రాయల్ కెనెడియన్ పోలీసులు తెలిపారు. ఈ హత్య తరువాత కొద్ది సేపటికి సమీపంలో ఓ రాదారిలో ఓ వాహనం తగులబడి పోతూ ఉండగా పోలీసులు గుర్తించారు. అంతకు ముందు జరిగిన హత్యకు ఈ వాహన దుర్ఘటనకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. దిల్‌రాజ్ పోలీసు రికార్డులలో ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో తరచూ జరుగుతోన్న గ్యాంగ్‌వార్ కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు వేగవంతం అయింది. ఈ ఘటనతో స్థానిక భారతీయ సంతతి వారిలో ఆందోళన వ్యక్తం అయింది

మన తెలంగాణ 25 Jan 2026 10:07 pm

తెలంగాణలో 10 మంది డిఎస్పిలు బదిలీ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పది మంది డిఎస్పిలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డిజిపి బి. శివధర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిసిఎస్,డిడి ఏసిపిగా విధులు నిర్వహిస్తున్న ఎల్.ఆదినారాయణ కొత్తగూడెం ఎస్‌డిపిఓగా, సిటిసి ఏసిపిగా ఉన్న డి.వి. ప్రదీప్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ సిటీ పరిధిలోని ఆదిబట్ల ఏసిపిగా, సిఐడి డిఎస్పి ఎం. ఆదిమూర్తిని మియాపూర్ ట్రాఫిక్ ఏసిపిగా, మల్కాజ్‌గిరి ఏసిపి ఎస్. చక్రపాణిని మల్కాజ్‌గిరి జవహర్ నగర్ ఏసిపిగా, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి బి. మోహన్ కుమార్ ను మల్కాజ్‌గిరి పరిధిలోని మేడిపల్లి ఏసిపిగా, సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ ఏసిపిగా ఉన్న బి. రవీందర్‌ను భువగిరి ఎస్‌డిపిఓగా, యాంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పిగా ఉన్న సిహెచ్. శ్రీధర్ ను హైదరాబాద్ సిటీలోని మహాంకాళి ఏసిపిగా బదిలీ చేశారు. కొత్తగూడెం ఎస్‌డిపిఓగా ఉన్న ఎస్.కె. అబ్దుల్ రహమాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎస్‌డిపిఓగా ఉన్న ఎన్. చంద్ర బాను ను నేరుగా డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో డిజిపి పేర్కొన్నారు.

మన తెలంగాణ 25 Jan 2026 10:03 pm

అభిషేక్, సూర్య ఊచకోత..10 ఓవర్లలోనే భారత్ ఘన విజయం

గువాహటి: మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశారు. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు.. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే బౌండరీల వర్షం కురిపించారు. భారీ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. దీంతో న్యూజిలాండ్ ఫీల్డర్లు ప్రేక్షకుల పాత్ర వహించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ, కివీస్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 14 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్.. మొత్తం 20 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 5 సిక్సులతో 68 పరుగు చేసి అజేయంగా నిలిచాడు. ఇక, కెప్టెన్ సూర్యకుమార్ కూడా కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సూర్య 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరులతో అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి బంతికే ఓపెనర్ సంజూ శాంసన్ డకౌట్ కాగా.. వన్ డౌన్ లో వచ్చిన ఈషాన్ కిషన్ భారీ సిక్సులతో కివీస్ బౌలర్లకు షాకిచ్చాడు. కిషన్ 13 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు చేశాడు. దీంతో భారత్ కేవలం 10 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 155 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది.

మన తెలంగాణ 25 Jan 2026 9:52 pm

Photos : Mana Shankara Vara Prasad Garu All Time Industry Hit Celebrations

The post Photos : Mana Shankara Vara Prasad Garu All Time Industry Hit Celebrations appeared first on Telugu360 .

తెలుగు 360 25 Jan 2026 9:49 pm

AV Ranganath |హైడ్రా దూకుడుగానే ముందుకు…

AV Ranganath | హైడ్రా దూకుడుగానే ముందుకు… పేదల గృహాలను కూల్చే ఉద్దేశం

ప్రభ న్యూస్ 25 Jan 2026 9:39 pm

భూగర్భ బంకర్‌లోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!

టెహ్రాన్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భూగర్భ బంకర్ లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తన భద్రతా అధికారులు, సైనిక అధికారుల నుంచి వచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆయన బంకర్‌లోకి ప్రవేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడి చేసే ప్రమాదం మరింత పెరిగిందనే హెచ్చరికల నేపథ్యంలో అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్‌లోని భూగర్భ బంకర్‌కు మారారని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది. ఈ బంకర్‌లో టన్నెల్స్ సిరీస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని టెహ్రాన్‌లోని పలు సొరంగాలకు అనుసంధానం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సుప్రీం లీడర్ తన కార్యాలయ బాధ్యతలను తన మూడో కుమారుడు మసూద్ ఖమేనీకి అప్పగించినట్లుగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కార్యనిర్వాహక వర్గంతో సమన్వయ పనులు కూడా ఆయనే చూడనున్నట్లు తెలిపాయి. అయితే, ఈ వార్తలపై ఇరాన్ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన తర్వాత ఇరాన్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. 

మన తెలంగాణ 25 Jan 2026 9:34 pm

Venkatesh |దృశ్యం 3 ఉన్నట్టా..? లేనట్టా..?

Venkatesh | దృశ్యం 3 ఉన్నట్టా..? లేనట్టా..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 25 Jan 2026 9:30 pm

రాజ్యాంగంతోనే భారతీయ ఔన్నత్యం.. రాష్ట్రపతి గణతంత్ర సందేశం

న్యూఢిల్లీ: బారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం దేశ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతిని ఉద్ధేశించి ఆమె ప్రసార సాధనాల ద్వారా సందేశం వెలువరించారు. భారత రాజ్యాంగం విశిష్ట ప్రక్రియ. మన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. మనం రాజ్యాంగ నిర్ధేశిత అంశాలతోనే ఎన్నో విజయాలను సాధించాం. ఎదురైన పలు సవాళ్లను రాజ్యాంగ స్ఫూర్తితోనే అధిగమించామని చెప్పారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందుతున్నాయి. ఈ క్రమంలో మనం రాజ్యాంగ నిర్మాతలకు రుణపడి ఉండటమే కాకుండా , వారి ఆలోచనలకు కట్టుబడి ఉండాల్సి ఉందని రాష్ట్రపతి పిలుపు నిచ్చారు. విద్యా వైద్య రంగాలలో దేశం ఉన్నత శిఖరాలకు చేరుకొంటోందని తెలిపారు. రాష్ట్రపతి ముర్ము తమ ప్రసంగంలో మహిళా సాధికారికత దిశలో దేశం ముందుకు సాగుతున్నదని తెలిపారు. ఇది బృహత్తర లక్షం. దీనిని సంపూర్ణ స్థాయిలో సాధించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దేశానికి రైతులే కీలకం. రైతాంగ సంక్షేమానికి పలు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. భారత్ సర్వదా శాంతికాముక దేశం అని , ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఘర్షణలు, యుద్ధ భయాలు నెలకొని ఉన్న దశలో భారతదేశం శాంతిస్థాపన దిశలో ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి వివరించారు. దేశంలో శాంతియుత వాతావరణంతోనే పలు కీలక రంగాలలో అభివృద్ధికి వీలేర్పడింది. డిజిటల్ రంగంలో నాయకత్వం, ఆర్థిక పురోగతి, లింగ సమానత్వం వంటి అత్యవసర అంశాలపై దృష్టి సారించేందుకు సరైన వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. 

మన తెలంగాణ 25 Jan 2026 9:28 pm

ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన తొలి భారతీయుడు.. శుభాంశు శుక్లాకు అశోక్ చక్ర

శుభాంశు శుక్లాకు అశోక్ చక్ర ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన తొలి భారతీయుడు న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం అత్యంత విశిష్ట అశోక్ చక్ర పురస్కారాన్ని వ్యోమగామి శుభాంశు శుక్లాకు గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు తమ అత్యంత అసాధారణ అంతరిక్ష ప్రయాణంతో విశ్వ ఖ్యాతి గాంచారు. ఆయనతో దేశ యువత మరింత స్ఫూర్తి పొందుతుందని , ఓ వైపు వాయుసేనలో కీలక పాత్రతో పాటు అంతరిక్ష రంగంలోనూ విజయంతో ఆయన సాధించిన ద్వంద్వ విజయాలకు గుర్తింపుగా పురస్కారం ప్రకటించారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుక్లా నిలిచారు. యాక్సియామ్ 4 స్పేస్‌మిషన్‌లో భాగంగా ఆయన ఇతర వ్యోమగాములతో కలిసి అత్యంత క్లిష్టమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి ప్రవేశించారు. అక్కడి పరిశోధనలలో పాలుపంచుకున్నారు. పైగా ఐఎస్‌ఎస్‌లోనికి ప్రవేశించిన తొలి భారతీయుడిగా చరిత్ర రాశారు. గత ఏడాది జూన్‌లో ఆయన అంతరిక్ష యాత్ర జరిగింది. 41 సంవత్సరాల శుక్లా భారతీయ వాయుసేన టెస్ట్ పైలట్‌గా ఉన్నారు. 18 రోజుల పాటు తమ అంతరిక్ష మజిలీలో ఉన్నారు. వాయుసేనలో కూడా ఆయనకు విజయవంతం అయిన రికార్డు ఉంది. పలు యుద్ధ విమానాలను నడిపించిన అనుభవంతో ఆయన రెండువేల గంటల ఫ్లెయిట్ రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యంత కీలకమైన సుఖోయ్,మిగ్ శ్రేణుల విమానాలు జాగ్వార్‌లు, హాక్, డ్రోనియర్ వంటి అత్యంత అధునాతన విమానాలకు పైలెట్‌గా వ్యవహరించారు. తమ పాటవం ప్రదర్శించారు. భారతీయుడు అయిన శుక్లా అంతరిక్ష ప్రయాణంతో భారతదేశపు ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌కు , తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసిందని కొనియాడారు. శూన్య స్థితి ప్రభావం, అంతరిక్షంలో మనుగడ వంటి అంశాలపై ఆయన తమ అధ్యయనంతో కీలక విషయాలను వెల్లడించారు.

మన తెలంగాణ 25 Jan 2026 9:19 pm

ఉత్పత్తుల నాణ్యతతోనే స్టార్టప్‌ల బలోపేతం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : అత్యున్నత ప్రమాణాలకు భారతీయ ఉత్పత్తులు మారు పేరుగా నిలవాల్సి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. మాసాంతపు ఆదివారం తమ మన్ కీ బాత్ రేడియో ప్రసంగం 130వ భాగంలో ప్రధాని ప్రత్యేకంగా భారతీయ ఉత్పత్తుల గురించి ప్రస్తావించారు. లోపాలు లేని వస్తువుల తయారీ మన విజయానికి గీటురాయి అవుతుంది. ఇందుకోసం పరిశ్రమలు, స్టార్టప్‌లు సమాయత్తం కావల్సి ఉంటుంది. భారతీయ ఉత్పత్తులు అంటే ఉన్నత స్థాయికి పర్యాయపదాలు అనే పేరు తెచ్చుకోవల్సి ఉంటుంది. మనం ఏ వస్తువు తయారు చేసినా అది నాణ్యతతో ఉండాలి. ఈ విషయంలో రాజీపడితే అది వెనుకంజకు దారితీస్తుందని ప్రధాని తెలిపారు. ఒక్కటంటే ఒక్కటి లోపం లేకుండా వినూత్న రీతిలో ఉండే ఉత్పత్తులు తీసుకురాగలిగితే అది మనకు ఖ్యాతి తీసుకువస్తుందని స్పష్టం చేశారు. మన వస్త్రాల పరిశ్రమలో కానీ, సాంకేతిక రంగంలో కానీ, ఎలక్ట్రానిక్స్, చివరికి ప్యాకింగ్‌లలో కూడా నాణ్యతనే మౌలిక లక్షణం కావల్సి ఉంటుందని ప్రధాని విశ్లేషించారు. ఇప్పుడు మనం విదేశాలతో పలు రకాల ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. అనేక వాణిజ్య ఒప్పందాల ఖరారుకు ముందు మనం విదేశాలకు ఎటువంటి ఉత్పత్తులు పంపించగల్గుతామనేది ప్రధానం. ఇందులో మరింత కీలకమైనది నాణ్యత విషయంలో రాజీ లేని ఉత్పత్తుల తయారీ అని ప్రధాని తెలిపారు. ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలతో మన స్టార్టప్ కంపెనీలకు మేలు జరుగుతంది. ఈ క్రమంలో స్టార్టప్‌ల ద్వారా లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని వివరించారు. పది సంవత్సరాల క్రితం అంకుర స్థాయిలో వెలిసిన స్టార్టప్ యాత్ర ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ అయిందని వివరించారు. యువతతోనే ఈ రికార్డు సాధ్యం అయిందని ప్రశంసించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ తమ మన్ కీ బాత్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 2026 పంవత్సరాన్ని కుటుంబ సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. యుఎఇ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు. భారతదేశ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు .జిల్లా ప్రజలు సామూహికంగా జలాశయాల ఏర్పాటుకు ముందుకు రావడం, చెట్ల పెంపకానికి చొరవ తీసుకోవడం అభినందనీయం అన్నారు. 

మన తెలంగాణ 25 Jan 2026 9:11 pm

ఫ్యాక్ట్ చెకింగ్: స్క్రిప్టెడ్ వీడియోను నిజంగా షాపు యజమాని కస్టమర్ కాళ్ల మీద పడినట్లుగా ప్రచారం చేస్తున్నారు

స్క్రిప్టెడ్ వీడియోను నిజంగా షాపు యజమాని కస్టమర్ కాళ్ల మీద పడినట్లుగా

తెలుగు పోస్ట్ 25 Jan 2026 9:07 pm

ఇద్దరు తెలుగువారికి పద్మశ్రీలు

న్యూఢిల్లీ: పలు రంగాలలో విశిష్ట సేవలను అందించిన వారికి జాతీయ స్థాయి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రిపబ్లిక్ డేకు ఒక్కరోజు ముందు ఆదివారం 2026 సంవత్సరానికి అవార్డుల విజేతలను వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవార్డులు దక్కాయి. వీరిలో తెలంగాణకు చెందిన రామారెడ్డి మామిడి పశుసంవర్థక శాఖ, పాడి పరిశ్రమకు విశేష సేవలు అందించారు. ఎపికి చెందిన కుమారస్వామి తంగరాజు సిసిఎంబి శాస్త్రవేత్త. మానవ పరిణామ క్రమం, జన్యు సంబంధ వ్యాధులపై ఆయన విశేష పరిశోధనలు చేశారు. 30 ఏళ్లుగా సాగుతున్న ఆయన రిసెర్చ్‌కు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. 

మన తెలంగాణ 25 Jan 2026 9:04 pm

ఆర్‌జెడి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వి యాదవ్

రాష్ట్రీయ జనతాదళ్‌లో కొత్త శకం ప్రారంభమైనట్టే. తాజా ఆ పార్టీకి జాతీయ కార్యనిర్వాహక అధిపతిగా మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారంనాడు నియమించారు. ‘నూతన యుగారంభం. ఆర్‌జెడి జాతీయ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా తేజస్వి యాదవ్ నియమితు లయ్యారు’ అంటూ ఆర్జేడీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆర్‌జెడి జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారంనాడిక్కడ ప్రారంభమైంది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, పార్టీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తేజస్వి నియామకాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించింది. నియామక పత్రాన్ని తేజస్వికి లాలూ ప్రసాద్ అందజేశారు. లాలూ ప్రసాద్ చిన్నకుమారుడైన తేజస్వి మొదట్నించి లాలూ వారసుడిగా ప్రచారంలో ఉన్నారు. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ గత ఏడాది పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాజాగా తేజస్వి కీలక నియామకంతో కుటుంబ వారసత్వాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లనున్నారు.

మన తెలంగాణ 25 Jan 2026 8:54 pm

తడబడిన కవీస్ బ్యాటర్లు.. భారత్ లక్ష్యం ఎంతంటే?

గువాహటి: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు రాణించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ కు భారత బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. ఆదిలోనే టాపార్డర్ బ్యాటర్లును పెవిలియన్ పంపి కివీస్ ను దెబ్బ కొట్టారు. ఆ తర్వాత ఫిలిప్స్(48), చప్ మన్(32)లు వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయితే, వీరిద్దరూ భారీ స్కోర్లు చేయకుండా టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. వీరి తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సాంట్నర్ వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో 17 బంతుల్లో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కివీస్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. దీంతో 20 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా..రవి బిష్ణోయి, హర్దిక్ పాండ్యాలు చెరో రెండు వికెట్లు తీశారు. హర్షీత్ రాణాకు ఒక వికెట్ దక్కింది.

మన తెలంగాణ 25 Jan 2026 8:51 pm

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి సజీవ దహనం

 బంగ్లాదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. మరో హిందూ యువకుడిని సజీవ దహనం చేశారు. గ్యారేజీలో నిద్రిస్తున్న యువకుడికిపై అల్లరిమూక ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన నార్సింగ్డి ప్రాంతంలో జరిగింది. శుక్రవారం రాత్రి ఓ గ్యారేజ్‌పై అల్లరి మూకలు దాడి చేశారు. షట్టర్ మూసివేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ సమయంలో గ్యారేజ్‌లో నిద్రిస్తున్న చంచల్ భౌమిక్(23) అనే యువకుడు సజీవ దహనం అయ్యాడు. చంచల్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అల్లరి మూక అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడికి తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒకరు దివ్యాంగుడు. చంచల్ తండ్రి చాలా కాలం క్రితం చనిపోయారు. ప్రస్తుతం చంచల్ సంపాదనపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. అల్లరిమూక పథకం ప్రకారమే చంచల్ ని బంధించి హత్య చేశారని గ్యారేజ్ యజమాని తెలిపాడు. సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయామంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై బంగ్లాలోని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మన తెలంగాణ 25 Jan 2026 8:50 pm

ఎబిఎన్, ఆంధ్రజ్యోతిపై బిఆర్‌ఎస్ నిషేదం

 ఎబిఎన్ , ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలను బహిష్కరిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ భవన్‌లోకి కానీ, జిల్లా పార్టీ కార్యాలయాల్లో కానీ జరిగే సమావేశాలకు ఎబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి ప్రతినిధులకు అనుమతి ఉండదని, అలాగే ఆ ఛానల్ టీవీ చర్చల్లో తమ నేతలు పాల్గొనరాదని బహిరంగంగా ప్రకటించింది. ఈ మేరకు బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు, ఎంఎల్‌సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఎబిఎన్ ఛానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే రాష్ట్ర నాయకత్వం పట్ల ఆంధ్రజ్యోతి అసభ్యకరంగా వ్యవహరించిన చరిత్ర ఉందని కూడా పార్టీ ఆరోపించారు. ఎంఎల్‌సి తక్కలపల్లి రవీందర్ రావుపై వ్యాఖ్యలపై జర్నలిస్ట్ వెంకటకృష్ణ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 25 Jan 2026 8:39 pm

Chiranjeevi’s Lavish Surprise For Anil Ravipudi

Megastar Chiranjeevi, riding high on the smashing success of Mana Shankara Vara Prasad Garu, has expressed his joy in the grandest way possible. To celebrate the film’s blockbuster run and to honour director Anil Ravipudi’s exceptional vision, Chiranjeevi gifted him a swanky Range Rover Sport. While Chiranjeevi has previously surprised his directors with special presents […] The post Chiranjeevi’s Lavish Surprise For Anil Ravipudi appeared first on Telugu360 .

తెలుగు 360 25 Jan 2026 8:19 pm

మహేశ్ కుమార్ గౌడ్‌కు కవిత ఆఫర్

 టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తమ పార్టీలో చేరితే ఆయనకు మంచి పోస్టు ఇస్తానంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆఫర్ చేశారు. మహేశ్ కుమార్ గౌడ్‌ను జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తనను కాంగ్రెస్‌లో చేర్చుకోమని మీడియా చిట్‌చాట్‌లో మహేష్‌కుమార్ గౌడ్ అన్నట్లు తాను వార్త చూశానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ అని, తానేందుకు కాంగ్రెస్‌లో చేరతాను..? అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో జాగృతి గెలువబోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తనను బద్నాం చేసే పనిలో మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారని... తాను కాంగ్రెస్‌లో చేరతానని ఆయనకు ఏమైనా కల వచ్చిందా..? అని ఎద్దేవా చేశారు. ఆయన మానసిక పరిస్థితి చెక్ చేసుకోవాలని హితవు పలికారు. బలమైన రాజకీయ పార్టీగా జాగృతిని మార్చే ప్రయత్నం చేస్తున్నానని కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాజీ మంత్రి హరీష్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు ఇప్పించింది హరీశ్ రావు అని, సృజన్‌రెడ్డి పెద్ద తిమింగలంగా మారటానికి ఆయనే కారణం అని పేర్కొన్నారు. సృజన్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డి బావమరిది అని హరీశ్‌రావుకు అప్పుడు తెలియదా..? అని ప్రశ్నించారు. హరీష్‌రావు తవ్విన గుంతలో కెటిఆర్ పడటం బాధాకరం అని పేర్కొన్నారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మాత్రమే లేఖ రాస్తానని హరీష్‌రావు అంటున్నారని, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు లేఖ రాయనని హరీష్‌రావు అనటం దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానించటమే అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా రాష్ట్రానికి సిబిఐ ఎలా వస్తుంది..? అని ప్రశ్నించారు. 2014 నుంచి జరిగిన సింగరేణి టెండర్లపై విచారణ జరపాలని ఆయన అంటున్నారని, అంటే కెసిఆర్ పాలనపైనా హరీష్‌రావు విచారణ కోరుతున్నట్లే కదా..? అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.

మన తెలంగాణ 25 Jan 2026 8:18 pm

Madaram |వనదేవతల ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధి…

Madaram | వనదేవతల ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధి… – పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని

ప్రభ న్యూస్ 25 Jan 2026 8:10 pm

భక్తజన సంద్రంగా మేడారం..

తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాలనుండి మన దేవతల దర్శనానికి వచ్చిన భక్తులతో ఆదివారం మేడారం భక్తజన సంద్రమైంది. సాధారణంగా జాతర రోజుల్లో విపరీతమైన రద్దీ ఉంటుందని భావించే వేలాది కుటుంబాలు ముందుగానే అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో తెలుగు రాష్ట్రాల నలుమూలనుంచీ భక్తులు భారీగా తరలివచ్చారు. అశేష జనవాహినితో పులకించిన మేడారం... రాబోయే మహా జాతర రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులు ముందస్తుగా మేడారం బాట పట్టారు. ఆదివారం ఉదయం నుండే మేడారంలోని గద్దెల ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. క్యూలైన్‌లో గంటల తరబడి వేచివున్నప్పటికీ భక్తులు ఎంతో క్రమశిక్షణతో అమ్మవార్లను దర్శించుకున్నారు. జాతర తేదీలు సమీపిస్తున్నకొద్దీ భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు... మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తమను చల్లగా చూడాలని కోరుకుంటూ వాగులో స్నానాలుచేసి గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. జంపన్నవాగులో నీటిమట్టం పెరగడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. నిలువెత్తు బంగారం నైవేద్యం... సమ్మక్క సారలమ్మకు భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని బంగారంగా భావించి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గద్దెలవద్దకు చేరుకున్న భక్తులు అమ్మవార్లకు పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కలు తీర్చుకుంటున్నారు. అడవిలో విడిదిచేసి భక్తిశ్రద్ధలతో వనదేవతలను ఆరాధిస్తున్నారు. మనదేవతల దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయం నుంచి జంపన్న వాగు వెళ్లే దారిలో రోడ్డు కిరువైపులా ఆట బొమ్మలతో షాపులు పిల్లలను ఆకట్టుకుంటున్నాయి. రకరకాల పూసల దండలతో భక్తులు పూసలను ఆకర్షణ చూస్తూ కొంటున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ప్రైవేట్ వాహనాలు బారులుతీరాయి. వేల సంఖ్యలో వాహనాలు తాడ్వాయి మేడారం మీదుగా వచ్చే వాహనాలు వీఐపీ పార్కింగ్ వద్ద అంతరాయం ఏర్పడడంతో వీఐపీ పార్కింగ్‌లోని ఖాళీ స్థలాల్లోకి వాహనాలను పోలీసులు మళ్ళించారు. భక్తుల సంఖ్య మరింత పెరగడంతో వీఐపి పార్కింగ్ వద్ద భారీకేట్లను పోలీసులు ఏర్పాటు చేశారు.

మన తెలంగాణ 25 Jan 2026 8:09 pm

Nagoba |నాగోబాను దర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

Nagoba | నాగోబాను దర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ Nagoba |

ప్రభ న్యూస్ 25 Jan 2026 8:01 pm

ప్రజాస్వామ్య యుద్ధంలో జయం మాదే: విజయ్

 తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకమైనవని తమిళగ వెట్రి కజగం (టివికె) నాయకుడు, సినిమా హీరో విజయ్ చెప్పారు. ఇవి కేవలం ఎన్నికల పోరే కాకుండా తీవ్రస్ధాయిలో జరిగే ప్రజాస్వామ్య యుద్ధం అని విశ్లేషించారు. తమిళనాడులోని ప్రఖ్యాత మహాబలిపురంలో ఆదివారం ఆయన తమ పార్టీ గుర్తు విజిల్ చప్పుళ్లతో భారీ సభ నిర్వహించారు. తాము ఎవరికి భయపడేది లేదని, విజయం సొంతంగా తమ పార్టీదే అవుతుందని తేల్చిచెప్పారు. ఇంతకాలం రాజకీయాధికారం చెలాయించిన శక్తులకు సమర్థవంతమైన సవాలును విసిరే స్థితిలో తాము ఉన్నామని విజయ్ చెప్పారు. ఈ సభ నుంచే ఆయన తమ పార్టీ ఎన్నికల గుర్తును ఆవిష్కరించారు. ఇంతకాలం సాగిన అవినీతి పాలనను అంతమొందించే ధైర్యం తమ పార్టీకే ఉందని చెప్పారు. అన్నాడిఎంకె బిజెపికి బహిరంగంగా సరెండర్ అయింది. పలు కారణాలతో అధికార డిఎంకె లోపాయికారిగా కాషాయ పార్టీతో కుమ్మక్కు అయింది. ఈ విషయాన్ని తమళులు గుర్తించారు. ఈ దశలో అరాచకాన్ని ఎదిరించే సైన్యం , నిజాయితీతో పనిచేయగలిగే కమాండర్ల బలం టివికెకు ఉందని, సరికొత్తగా స్వచ్ఛమైన రీతిలో ముందుకు వస్తున్న తమ పార్టీని ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఓ దుష్టశక్తి అధికారంలో ఉంది. మరో వైపు రాష్ట్రాన్ని దోచుకుని తిన్న అవినీతి బలగం తిరిగి అవకాశం కోసం ఎదురుచూస్తోందని డిఎంకె, అన్నాడిఎంకెలపై విరుచుకుపడ్డారు. ఈ రెండూ శక్తులు తమిళనాడుకు సవ్యమైన పాలన అందించలేవు. ఈ రెండింటిని ధైర్యంతో ఎదిరించి విజయం సాధిస్తామని తెలిపారు. తాను సినిమా వదిలి రాజకీయాల్లో ప్రవేశించింది తన కోసం కాదని, హానీ కల్గించే వారి నుంచి ఈ తమిళనేలను రక్షించేందుకే అన్నారు..అత్యున్నత రాజకీయ సమగ్రతా విలువలతో , కుటుంబంలో ఓ సభ్యుడిగా నిలిచే అవకాశం తనకు దక్కిందన్నారు. ఇతర పార్టీల మాదిరిగా అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదనేది ప్రజల నమ్మకం. ఇదే తన బలం , రాబోయే విజయానికి మూలం అన్నారు. ప్రజల నమ్మకాన్ని తాను నిలబెట్టి తీరుతానని, పనుల కోసం ఒక్క పైసా తీసుకోబోనని, ఒక్క అవినీతి చుక్క మరక కూడా పార్టీపై పడనివ్వబోమని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయ పార్టీలకు సరెండర్ అవుతానని, రాజకీయ ఒత్తిళ్లతో లొంగిపోతాననే వాదన పనికిరానిదని కొట్టిపారేశారు. ఈ ఎన్నికలలో తమిళనాడులో రాజకీయ అధికారం కైవసం చేసుకుని తీరుతామని ఈ సభ నుంచి విజయ్ తన కేడర్‌తో పాటు ప్రతిన తీసుకున్నారు.

మన తెలంగాణ 25 Jan 2026 7:55 pm

Adilabad |ఉట్నూర్ నూతన ఎస్సై విజయ్‌కి సన్మానం

Adilabad | ఉట్నూర్ నూతన ఎస్సై విజయ్‌కి సన్మానం Adilabad | ఉట్నూర్,

ప్రభ న్యూస్ 25 Jan 2026 7:54 pm

శ్రీ ఆంజనేయస్వామి జాతరలో ఘనంగా రథోత్సవం..

విశాలాంధ్ర – గుడిబండ..గుడిబండ మండలంలోని హిరేతూర్పి గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి జాతర మహోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ, శ్రీ ఆంజనేయస్వామి జాతరను గ్రామ ప్రజలు కులమతాలకు అతీతంగా […] The post శ్రీ ఆంజనేయస్వామి జాతరలో ఘనంగా రథోత్సవం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Jan 2026 7:50 pm

17 మంది పోలీసులకు రాష్ట్రపతి సేవా పతకాలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17 మంది రాష్ట్రపతి సేవా పతకాలకు ఎంపిక కాగా, ఐఎస్‌డబ్లూ ఇంటెలిజెన్స్ అడిషినల్ ఎస్పి ఎం.జి.ఎస్. ప్రకాష్ రావు, ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్‌పెక్టర్ అన్ను.దామోదర్ రెడ్డి లు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపిక అయ్యారు. ఇక మెడల్ ఫర్ మెరిటేరియస్ సర్వీసెస్ అవార్డుకి 14 మంది ఎంపిక కాగా వారిలో ఎస్‌ఐబి ఐజిపి సుమతి, కమాండెంట్ పి. వెంకట రాములు, అడిషనల్ కమాండెంట్ అట్లూరి బాను మూర్తి, సిఐడి డిఎస్పి ఎ. శంకర్, టిజిసిఎస్‌బి డిఎస్పి కె.వి.ఎం. ప్రసాద్, పిసిఎస్‌అండ్‌ఎస్ డిఎస్పి సి. వంశీమోహన్ రెడ్డి, పిటిసి డిఎస్పి టి.లక్ష్మి, టిజిఎస్‌పి ములుగు జిల్లా చలవాయి ఐదవ బెటాలియన్‌కు చెందిన వి. పురుషోత్తమ రెడ్డి, రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ ఎస్‌ఐగా పనిచేస్తున్న బి. ఎల్లయ్య, ఇంటెలిజెన్స్ ఎస్‌ఐ సయ్యద్ అబ్దుల్ ఖరీం, జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న బి. ఆనందం లు ఎంపియ్యారు. హోంగార్డుల విభాగం నుండి ముగ్గురు ఎంపిక కాగా, వారిలో బుర్రనోళ్ల. రేణుక, మాసరం.రవి, పిట్టకల. జంగయ్యలు ఉన్నారు. ఇక గ్యాలెంటరీ అవార్డు సైబరాబాద్ హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డికి లభించింది. అవార్డుల పొందిన అధికారులను డిజిపి బి. శివధర్ రెడ్డి అభినందించారు. పోలీస్ శాఖకు ఇన్ని పతకాలు రావడం అధికారులు వృత్తి పట్ల చూపిస్తున్న నిబద్దతకు నిదర్శనమన్నారు. భవిష్యత్తులో సైతం ఇదేవిధంగా విధులు నిర్వహించి మరిన్ని పతకాలు పొందాలని అకాంక్షించారు.

మన తెలంగాణ 25 Jan 2026 7:49 pm

Padma Awards 2026 Announced

Padma Awards: one of the highest civilian awards of the country are announced for the year today. Dharmendra is conferred with Padma Vibhushan while Mammootty and Piyush Pandey are announced for Padma Bhushan. Rajendra Prasad, Murali Mohan are announced for Padma Shri awards. The presentation event is expected to take place in New Delhi in […] The post Padma Awards 2026 Announced appeared first on Telugu360 .

తెలుగు 360 25 Jan 2026 7:46 pm

గన్ మిస్‌ఫైర్..బుల్లెట్ తగిలి కానిస్టేబుల్ మృతి

 ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లా డోన్ రైల్వే స్టేషన్‌లోని జిఆర్‌పి పోలీస్ స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే డిఎస్‌పి శ్రీనివాసాచారి వెల్లడించారు. రైల్వే డిఎస్పీ శ్రీనివాసాచారి తెలిపిన వివరాల ప్రకారం కానిస్టేబుల్ పెద్దయ్య శనివారం రాత్రి తన విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో జిఆర్‌పి అవుట్‌పోస్ట్ కార్యాలయంలో తన తుపాకీని సరెండర్ చేస్తుండగా, అది అకస్మాత్తుగా మిస్‌ఫైర్ అయింది. తుపాకీ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ తగలడంతో పెద్దయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సమీపంలోనే ఉన్న సెంట్రీ, మరో కానిస్టేబుల్ వెంటనే స్పందించి పెద్దయ్యను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే పెద్దయ్య తీవ్ర రక్తస్రావం కావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే, సివిల్ పోలీసులు, డోన్ డిఎస్‌పి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. విధి నిర్వహణలో ఉన్న భర్త ప్రాణాలు కోల్పోవడంతో పెద్దయ్య భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కలచివేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం కింద మృతుడి కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్థిక సాయాన్ని అధికారులు అందజేశారు. తుపాకీ ఏ విధంగా మిస్‌ఫైర్ అయిందనే కోణంలో పోలీసులు లోతైన దర్యాఫ్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 25 Jan 2026 7:45 pm

Rice mill |అనసూయ మృతికి నివాళులు

Rice mill | అనసూయ మృతికి నివాళులు Rice mill | చిట్యాల,

ప్రభ న్యూస్ 25 Jan 2026 7:39 pm

Viral: Pawan Kalyan Offers Prayers at Gurudwara

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan visited Maharashtra on Saturday and took part in a spiritually significant programme in Nanded. He was accompanied by Maharashtra Chief Minister Devendra Fadnavis during the visit. The two leaders paid their respects at the historic Takht Sachkhand Sri Hazur Sahib, one of the five most sacred seats of […] The post Viral: Pawan Kalyan Offers Prayers at Gurudwara appeared first on Telugu360 .

తెలుగు 360 25 Jan 2026 7:38 pm

Vijay Deverakonda’s Ranabali

Vijay Deverakonda is shooting for an expensive periodic drama directed by Rahul Sankrityan. The duo worked together for Taxiwala in the past. Rahul has done extensive pre-production work for over a year and he started the shoot recently. The film is tentatively titled VD14 and the makers will release the first look and the title […] The post Vijay Deverakonda’s Ranabali appeared first on Telugu360 .

తెలుగు 360 25 Jan 2026 7:36 pm

Prabhas |నిర్మాతకు అండగా నిలిచిన రాజాసాబ్..

Prabhas | నిర్మాతకు అండగా నిలిచిన రాజాసాబ్.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 25 Jan 2026 7:30 pm

Andhra Prabha Smart Telangana Edition|హైటెన్షన్​/ఆ టెండర్లన్నీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 25-01-2026, 4.00PM ts నాంపల్లిలో హైటెన్షన్​.. ఐదు

ప్రభ న్యూస్ 25 Jan 2026 7:14 pm

నాంపల్లి అగ్నిప్రమాద ఘటన.. షాపు యజమాని అరెస్ట్

హైదరాబాద్: నాంపల్లిలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. అఖిల్(7), ప్రణీత (11), హబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబి (43) ఈ ఘటనలో మృతి చెందినట్లు ఫైర్ డిజి విక్రమ్ సింగ్ మాన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆదివారం ఫర్నీచర్ షాపు యజమాని సతీశ్ బచానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్నిప్రమాద ఘటనలో చనిపోయిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీశ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం విషయానికొస్తే.. సెల్లార్‌లో ఫర్నీచర్, కెమికల్స్ నిల్వ ఉంచడంతో బాధితులు మెట్ల మార్గంలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించారు. ఐరన్ షట్టర్‌కు తాళం వేయడంతో బాధితులు బయటకి రావడం కష్టమైదని ఫైర్ డిజి తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 25 Jan 2026 7:10 pm

Andhra Prabha Smart AP Edition |భూమ్​ హైప్​/హెచ్​ఐవీ వైరస్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 25-01-2026, 4.00PM ap ఏపీలో భూమ్​ హైప్​.. మార్కెట్​

ప్రభ న్యూస్ 25 Jan 2026 7:09 pm

What a Lineup Allu Arjun?

Icon Star Allu Arjun has the best lineup of films among the Indian actors. It may be surprising but the actor is working with some of the craziest directors in the coming years. He has Atlee’s film in shooting mode and the makers are in plans to release it during summer 2027. Soon, he will […] The post What a Lineup Allu Arjun? appeared first on Telugu360 .

తెలుగు 360 25 Jan 2026 7:06 pm

రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ కు పద్మశ్రీ ..

భారత ప్రభుత్వం 77వ గణతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ భుల్లర్‌లను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.ఈ ఏడాది మొత్తం 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా, అందులో 8 మంది క్రీడా రంగానికి చెందిన వారు ఉన్నారు. భారత క్రికెట్‌కు అందించిన అసాధారణ సేవలకు గానూ రోహిత్ శర్మ కు పద్మశ్రీ లభించింది. ఇటీవల 2024 టీ20 ప్రపంచ కప్ అందించడం, వన్డేల్లో రోహిత్ కు ఉనన తిరుగులేని రికార్డులను కేంద్రం గుర్తించింది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ సాధించిన విజయాలకు గుర్తింపుగా పద్మశ్రీ వరించింది. ముఖ్యంగా ఆమె నాయకత్వంలో మహిళల క్రికెట్ స్థాయి పెరగడం విశేషం.

మన తెలంగాణ 25 Jan 2026 7:00 pm

Cricket |క్రికెట్ మ్యాచ్ కి సెలెక్ట్ అయిన మబ్బుల్…

Cricket | క్రికెట్ మ్యాచ్ కి సెలెక్ట్ అయిన మబ్బుల్… Cricket |

ప్రభ న్యూస్ 25 Jan 2026 6:59 pm

లేపాక్షిలో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం..

విశాలాంధ్ర–లేపాక్షి: జాతీయ ఓటరు దినోత్సవాన్ని లేపాక్షిలో ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు, ఉపాధ్యాయులు, మండల స్థాయి అధికారులు కలిసి పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా నవోదయ విద్యార్థులు, అధికారులు విద్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రసిద్ధ నంది విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటు దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాలపై నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. […] The post లేపాక్షిలో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Jan 2026 6:53 pm

తెలంగాణలో ఓటర్లు 3.39 కోట్లు

బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం భారత ఎన్నికల సంఘానికి కల్పించిన స్వతంత్రత, నిష్పక్షపాతత్వమే స్వేచ్ఛాయుత, న్యాయసమ్మత ఎన్నికలకు పునాది అని పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని, అదనపు సిఇఒ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ, ఈ ఏడాది థీమ్ నా భారత్ - నా ఓటు పౌరులే భారత ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువు అని స్పష్టంగా తెలియజేస్తోందని చెప్పారు. భారత ఎన్నికల సంఘం స్థాపనను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలవదని అన్నారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, అర్హులైన ఓటర్లకు హోమ్ ఓటింగ్, ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా ఎన్నికలు మరింత సమగ్రంగా మారాయని ప్రశంసించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను డ్రోన్ నిఘా, పోలీసు సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించిన తీరును గవర్నర్ అభినందించారు. సిఇఒ సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాల్లోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.39 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారికోసం 35,895 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఓటర్లలో 1.68 కోట్ల మంది పురుషులు, 1.70 కోట్ల మంది మహిళలు, 2,890 మంది ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారని తెలిపారు. గత జాతీయ ఓటర్ల దినోత్సవం నుంచి ఇప్పటివరకు సుమారు 3.93 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరినట్లు వెల్లడించారు. యువ ఓటర్లు, సీనియర్ సిటిజన్ల నమోదు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఓటరు జాబితా సవరణ లక్ష్యం నిజమైన ఓటర్ల తొలగింపు కాదని స్పష్టం చేశారు. ద్వంద్వ, అనర్హ నమోదుల తొలగింపే ఓటరు జాబితా సవరణ ముఖ్య ఉద్దేశమని అన్నారు.బూత్ లెవల్ అధికారులకు గౌరవ వేతనం పెంపు, ఏడాదికి నాలుగు అర్హత తేదీలు, ఈసినెట్ ద్వారా ఆన్‌లైన్ సేవలు వంటి ఎన్నికల సంఘ సంస్కరణలను వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు సిఇఒ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సిఇఒ హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 25 Jan 2026 6:48 pm

మూడో టి-20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

గువాహటి: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా బర్సాపర స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టి-20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. న్యూజిలాండ్‌ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి స్థానంలో బుమ్రా, బిష్ణాయ్ జట్టులోకి వచ్చారు. ఇక న్యూజిలాండ్ రెండో టి-20లో విఫలమైన ఫౌల్క్స్‌ని తప్పించి అతడి స్థానంలో జెమిసన్‌ని జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: భారత్: సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్టాయ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జెమిసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ

మన తెలంగాణ 25 Jan 2026 6:43 pm

Leopard |జుక్కల్ అడవి ప్రాంతంలో మరో చిరుతపులి సంచారం..

Leopard | జుక్కల్ అడవి ప్రాంతంలో మరో చిరుతపులి సంచారం.. Leopard |

ప్రభ న్యూస్ 25 Jan 2026 6:41 pm

ఎలుగుబంటి దాడి.. రైతుకు తీవ్ర గాయాలు

విశాలాంధ్ర–కళ్యాణదుర్గం టౌన్: కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన రైతు హనుమంతరాయుడుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన ఆదివారం కలకలం రేపింది. పొలంలో పనులు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఎలుగుబంటి దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన రైతును చికిత్స నిమిత్తం అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్యం అందుతున్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అటవీ ప్రాంతాలకు […] The post ఎలుగుబంటి దాడి.. రైతుకు తీవ్ర గాయాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Jan 2026 6:41 pm

ప్రియుడి కుటుంబంపై పెట్రోల్ పోసిన మహిళ.. మంటలు అంటుకొని మృతి

ప్రియుడి కుటుంబంపై పెట్రోల్ పోసే క్రమంలో మహిళకు మంటలు అంటుకున్న సంఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని సుద్దపల్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ప్రియుడిపై కోపంతో అతని కుటుంబసభ్యులపై పెట్రోలు పోసి నిప్పంటించింది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుద్దపల్లికి చెందిన మల్లేష్ కు తెనాలికి చెందిన దుర్గ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. గత కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం తెనాలిలో పంచాయతీ పెట్టగా కోపంతో ఉన్న దుర్గ సుద్దపల్లి వెళ్లి మల్లేష్ భార్యతో గొడవ పడింది. ఆ తర్వాత తెనాలి లో ఉన్న మల్లేష్ కి ఫోన్ చేసి భార్య, కొడుకు, మల్లేష్ తల్లిపై పోట్రోలు పోసి నిప్పంటించింది. పెట్రోలు పోసే క్రమంలో దుర్గపై పెట్రోలు పడడంతో ఆమెకు నిప్పంటుకుంది. వెంటనే స్థానికులు మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో ఆరుగురు స్థానికులు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన దుర్గ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

మన తెలంగాణ 25 Jan 2026 6:38 pm

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి పద్మ అవార్డులను ప్రకటించింది

తెలుగు పోస్ట్ 25 Jan 2026 6:34 pm

Temple |ఆలయ నూతన కమిటీ నియామకం…

Temple | ఆలయ నూతన కమిటీ నియామకం… Temple | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 25 Jan 2026 6:34 pm

Financial |బిక్షపతి కుటుంబానికి ఆర్థిక సహాయం …

Financial | బిక్షపతి కుటుంబానికి ఆర్థిక సహాయం … Financial | చౌటుప్పల్,

ప్రభ న్యూస్ 25 Jan 2026 6:30 pm

మంత్రి కేశవ్ ను కలిసిన జాయింట్ కలెక్టర్

విశాలాంధ్ర–ఉరవకొండ: ఉరవకొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సి. విష్ణు చరణ్ ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం ఇంచార్జ్ కలెక్టర్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న విష్ణు చరణ్‌తో జిల్లా పరిపాలనకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రి చర్చించినట్లు తెలిసింది. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, అమలులో ఉన్న పథకాల పురోగతి తదితర విషయాలపై సమీక్ష జరిపినట్లు సమాచారం. The post మంత్రి కేశవ్ ను కలిసిన జాయింట్ కలెక్టర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Jan 2026 6:29 pm

Doctor Award |బొడ్డు గంగ‌న్న‌కు డాక్ట‌ర్ అవార్డు…

Doctor Award | బొడ్డు గంగ‌న్న‌కు డాక్ట‌ర్ అవార్డు… Doctor Award |

ప్రభ న్యూస్ 25 Jan 2026 6:25 pm

నిబద్ధత కలిగిన కార్యకర్తలకే ప్రాధాన్యం: వజ్ర భాస్కర్ రెడ్డి

విశాలాంధ్ర–నంబులపూలకుంట: కార్యకర్తల సంక్షేమం, అభ్యున్నతికే ఎల్లప్పుడూ కృషి చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ఆక్టివిటీ కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక శివాలయం సమీపంలోని కమ్యూనిటీ భవనంలో మండల కన్వీనర్ కొత్త రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసులు రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ […] The post నిబద్ధత కలిగిన కార్యకర్తలకే ప్రాధాన్యం: వజ్ర భాస్కర్ రెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Jan 2026 6:22 pm

Rally | 16వ జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ…

Rally | 16వ జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ… Rally | చిట్యాల,

ప్రభ న్యూస్ 25 Jan 2026 6:21 pm