SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

Telangana : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇక వారికి మంచి రోజులు

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 22 Jan 2026 10:23 am

విశ్రాంతజీవుల ఆనంద నిలయం

మనిషి పని చేస్తూ, చేస్తూ ఎక్కడో ఓ చోట ఆగిపోయి విశ్రాంత జీవన మజిలీకి సిద్ధపడవలసిందే. వయసుతో సంబంధం లేకుండా కూడా చాలా మంది తమ విధులు కొనసాగిస్తుంటారు. కాలు, చేయి సహకరించినంతకాలం అది సాధ్యపడుతుంది. ఉద్యోగికి మాత్రం కొన్ని నిబంధనలుంటాయి. అవి చట్టం ద్వారా ఏర్పరచినవి. వాటికి ఎవరు అతీతులు కాదు. పదవీ విరమణ వయసు వచ్చిందంటే సీటు ఖాళీ చేయాల్సిందే. ఒక్కసారిగా ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక జీవితంలో ఒక కొత్త వెలితి ఏర్పడుతుంది. దినచర్య అంతా అపసవ్యంగా అనిపిస్తుంది. సమయానికి డ్యూటీకి వెళ్ళమని బెత్తంలా బెదిరించే గడియారం ముల్లు ఇప్పుడు పట్టించుకోదు. పొద్దుటే రెడీ అయి ఎటుపోవాలో తెలియదు. పోయేందుకు పని కూడా ఉండదు. సర్వీసులో ఉన్న మిత్రులను ఊసుపోనీ ముచ్చట్ల కోసం డిస్టర్బ్ చేయడానికి సభ్యత అడ్డొస్తుంది. అలా మనసు చిందరవందరై.. ఎటూ పాలుపోక కాలు, చేయి కదిలించే దానికైనా అలా తెలిసిన వీధుల్లోకి వెళ్లక తప్పదు. ఎదురైనా పరిచయస్తులతో నాలుగు మాటలు కలిపి మళ్ళీ ఇల్లు దారిపడితే అప్పుడేనా గూటికి చేరేది.. వెళ్లి చేసేదేముంది అనిపిస్తుంది. తెలియకుండానే కాళ్లు లాగే దాకా ఇంటి ముందే నిలబడిపోతారు. విశ్రాంత ఉద్యోగి అని బ్రాండ్ పడిన వారందరు ఒకే వయసువారై ఉండరు. అరవై నుండి ఎనభై పైకే లెక్కలోకి తీసుకోవచ్చు. అందరూ ఒకే నావలో పయనిస్తున్నా అనుభవాలు, ఆరాటాలు తీరొక్క మాదిరిగా ఉంటాయి. అలా విశ్రాంత జీవుల ప్రపంచమే వేరు. నవ రిటైరీలకు వృద్ధాప్యపు ఛాయలతో రాబోయే అనారోగ్య ప్రకంపనలకు ముందస్తు సమాచార దాతలు సీనియర్లే. పిఎఫ్ సొమ్మును, మిగులు పెన్షన్‌ను ఎలా కాపాడుకోవాలో అనుభవపూర్వకంగా వారే చెప్పగలరు. డబ్బును పోగొట్టుకున్న, కాపాడుకున్న తీరుతెన్నులు తెలుస్తాయి. అందుకోసమైనా ఒంటరి విశ్రాంత జీవులు ఒకరికొకరు కలవాలి. అలా కలుసుకోవాలంటే వారికంటూ ఒక గూడు, నీడ కావాలి. ఈ లోటు తీర్చేందుకే అన్నట్లుగా ఇప్పుడు చాలా పట్టణాల్లో పెన్షనర్ల సంఘాలు కొలువైతున్నాయి. పట్టణ స్థాయిలో రిటైర్ అయినవారు వందలలో ఉంటారు. పావు గంట నడక దూరంలో లేదా పది నిమిషాల టూ వీలర్ ప్రయాణమైనా సంఘం ఆఫీసులో తోటివాళ్లను కలవచ్చు. భావాలు, ఆలోచనలు, అభిరుచులు కుదిరే మనుషుల తోడు అక్కడ దొరికితే కాలం పూలతేరుపై కదిలిపోతుంది. ఒంటరితనపు జైలులోంచి బయటికి రావడంతో మానసిక, శారీరక ప్రశాంతత దరిచేరి జీవితానికి నూతన జవసత్వం అందుతుంది. బాల్యం మాదిరే మళ్ళీ కొత్తగా ప్రాణమిత్రుల సాంగత్యం దొరుకుతుంది. కొత్త రిటైరీల చేర్పు ఆనందాన్ని ఇస్తే, పాత వారి జీవితాల ముగింపు దుఃఖాన్ని పంచి కొత్త తత్వాన్ని అలవరుస్తుంది. కలెక్టర్ స్థాయి కేటాయింపుతో ప్రభుత్వ స్థలం కొంత లభిస్తే.. నేతల, దాతల చేయూతతో పెన్షనర్స్ భవన్ నిలబడుతుంది. ఒకరు టేబుల్, కుర్చీలు సమకూర్చితే, ఇంకొకరు లైట్లు, ఫ్యాన్లు అందిస్తారు. పెద్దల జ్ఞాపకార్థంగా దాతృత్వానికి సిద్ధపడేవారు ఊరికి కొందరైనా ఉంటారు. తలా ఒక చెయ్యేస్తే ఊరూరా ఒక సౌకర్యవంతమైన పెన్షనర్ల రచ్చబండ ఏర్పాటు కావడం కష్టమేమి కాదు. ఒక్కసారి నిలబడిందంటే రాలే ఆకులు రాలుతున్నా కొత్త చిగుర్లు పుట్టుకొచ్చే చెట్టులా నిరంతరం కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నిర్వహణలో సాగే పెన్షనర్స్ భవన్ ఇలాంటి చాలా విషయాల్లో ఆదర్శంగా నిలుస్తుంది. విశాలమైన రెండంతస్తుల భవనం అన్ని రకాల సమ్మేళనాలకు అనుకూలంగా ఉంది. రోజుకొక్కసారైనా అటువైపు వెళ్లకపోతే ఏదో కోల్పోయినట్లు భావించే వారెందరో ఉంటారు. తీరిగ్గా ఇంట్లోంచి బయటపడితే కాళ్లు భవన్ వైపే వారిని తీసుకెళ్తాయి. దినపత్రికలు తిరగేస్తూ ప్రధాన వార్తల చర్చలో కొందరుంటే, మరోవైపు ఊర్లోని సంగతుల ప్రస్తావనతో కొందరు బిజీగా కనబడతారు. చెస్, క్యారమ్స్ ఆటగాళ్లకు సమయమే తెలియదు. సాయంత్రం వేళ పొద్దు వాలుతున్న రీతిలో సొంత అవసరాలు, బంధు మిత్ర ముచ్చట్లతో కాలం వెళ్ళిపోతుంది. కాళ్లకు మెత్తని చెప్పులు నుంచి ఒడుపుగా ఉండే చేతి కర్ర దాకా ఏది బాగుంటుంది, అది ఎక్కడ.. ఏ ధరకు దొరుకుతుంది అనే వివరాలు చర్చకొస్తాయి. ఆరోగ్య సమస్య తలెత్తితే దాని పూర్వాపరాలేమిటి, ఊర్లో ఏ డాక్టర్ బాగు చేస్తాడు అనే ఉచిత సలహాలు ఇచ్చిపుచ్చుకుంటారు. సొంత ఊసుల నడమ పౌర బాధ్యత మరిచిపోరు. జాతీయ పండుగలు, గొప్పవారి సంస్మరణ సభలు ఘనంగా జరుపుతారు. ప్రముఖులను ఆహ్వానించి సముచితంగా గౌరవించి తమ ఉనికిని చాటిచెపుతారు. క్రమంగా సత్తువ తగ్గి, ఆరోగ్యం సహకరించక ఆఫీసు దాకా రాలేనివారితో బంధాలు తెగిపోవు. బర్త్ డే లాంటి విశేష సందర్భాల్లో వారి ఇంటి దాకా వెళ్లి వేడుకలో భాగమవుతారు. వారి సొంత పనులకు ఆసరాగా ఉంటారు. ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ద్వారా సభ్యుల పెన్షన్‌కు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహిస్తారు. ఆదాయపు పన్ను రిటర్నులు అక్కడి నుండే పంపిస్తుంటారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన డిపెండెంట్ పెన్షనర్ మహిళలకు ఒక్కసారిగా అంతా అగమ్యంగా ఉంటుంది. సంఘం బాధ్యులు వెంటనే వారికి కలిసి మేమున్నామంటూ పెన్షన్ పనులు చక్కదిద్దుతారు. వారి పేరిట పెన్షన్ మంజూరుతో పాటు ఎప్పటికప్పుడు ఎరియర్స్ లెక్కలు, టాక్స్ చెల్లింపు లాంటి విషయాల్లో కూడా బాధ్యత తీసుకుంటారు. పెన్షనర్ ఒంటరి కాదు, ఆయనకంటూ ఓ బలగముంది, అన్ని సమయాల్లో అది తోడు నిలుస్తుంది అనే ధీమా ఇచ్చే ఆశ్రయాలు ఇప్పటికే చాలా చోట్ల ఉండవచ్చు. ఎన్నో అవసరాలు తీర్చే ఈ కల్పతరువులు ఊరూరా ఉండాల్సిందే! సెకండ్ ఇన్నింగ్స్‌లో డే వన్ వీటి నీడలోనే మొదలవ్వాలి. ప్రభుత్వ పెన్షనర్ల బాధ్యత ఇంతటితో తీరిపోదు. ఉద్యోగం కాకుండా వివిధ వృత్తుల్లో జీవితాలు కొనసాగించిన వారిని కూడా తమలో కలుపుకొని పోవాలి. విశ్రాంత జీవనం ఉద్యోగికి కాదు, వయసు మీరినవారంతా విశ్రాంత జీవులే. పెన్షన్ పక్కనబెడితే వృద్ధాప్యంలో వచ్చే చాలా సమస్యలు అందరివీ ఒకేలా ఉంటాయి. సంఘం నిర్వహణపై ఎలాంటి హక్కు లేకుండా గౌరవ సభ్యులుగా పెన్షనేతరులను కలుపుకొని పోవచ్చు. ఒంటరిగా బలహీనులే కావచ్చు, సంఖ్యాపరంగా ఒక్కటైతే వారు బలవంతులే. ఏ సందర్భంలోనైనా తమ సత్తా చూపవచ్చు. తన ఉనికిని నాటవచ్చు. - బి.నర్సన్, 9440128169

మన తెలంగాణ 22 Jan 2026 10:22 am

Medaram : మేడారం దారులన్నీ ఫుల్లు

మేడారం జాతరకు భక్తుల పెద్దయెత్తున తరలి వస్తున్నారు.

తెలుగు పోస్ట్ 22 Jan 2026 10:19 am

అధికార మార్పిడే తప్ప రాష్ట్రం ఆశించినట్లుగా లేదు

 భౌగోళిక, సామాజిక, రాజకీయ తెలంగాణ రాలేదు తొలి మలి దశ ఉద్యమంలో ధిక్కార స్వరం వినిపించిన యోధుడు ముచ్చర్ల సత్తన్న జయంతి కార్యక్రమంలో వక్తల ఉద్ఘాటన మన తెలంగాణ/ నాంపల్లి : రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందే తప్ప భౌగోళిక, రాజకీయ, సామాజిక తెలంగాణ రాలేదని వక్తలు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అధిక ప్రయోజనం పొందిన లబ్దిదారులు, ఆంధ్ర టీవీ ఛానెళ్లు, పత్రికల యాజమానులేనన్నారు. ఈమేరకు మంగళవారం రాత్రి రవీంధ్రభారతిలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, తెలంగాణ సాధన దిశగా ధిక్కార స్వరం వినిపించిన ఉద్యమయోధులు ముచ్చర్ల సత్తన్న 93వ జయంతి కార్యక్రమం జరిగింది. తొలుత దివంగత నేత సత్తన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, కప్పరి ప్రసాద్, పాశం యాదగిరి, సినీ దర్శకులు శంకర్, జయధీర్ తిరుమలరావు, విమలక్క, మన తెలంగాణ దినపత్రిక సంపాదకులు దేవులపల్లి అమర్ పలువురు పాల్గొన్నారు. సభకి తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజ్ అధ్యక్షత వహించారు. తొలి, మలిదశ తెలంగాణ ప్రజా ఉద్యమంలో ముచ్చర్ల సత్తన్న కవి, రచయిత, ఉద్యమకారుడిగా ఇలా బహుముఖ రంగాల్లో తన దైన శైలిలో కీలక పాత్ర పోషించడంమే కాకుండా ఉద్యమకారులను ఉత్తేజపర్చి ముందుకు పరుగులు పెట్టించారని వారు గుర్తు చేశారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిందే తప్ప సంపూర్ణ తెలంగాణ రాలేదని ముచ్చర్ల సత్తన్న తన ధిక్కార స్వరాన్ని ఎలుగెత్తి చాటారని ఘనంగా శ్లాఘించారు. అప్పట్లోనే సత్తన్న కవిగా పాత్రికేయుడిగా పత్రికను నడిపారు. కొందరు రాజకీయ పదవి రాలేదని, మంత్రికాక పోయానన్న బాధ, భూములు దక్కలేదని, తన కుటుంబసభ్యులకు పదవులు రాలేదన్న కసితోనే ధిక్కార స్వరాన్ని వినిపించారు. కానీ సత్తన్న మాత్రం సంపూర్ణ తెలంగాణ కోసం తొలి, మలి దశ తెలంగాణ ప్రజా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిండచమే కాకుండా పదవిని తృణప్రాయంగా త్యజించిన గొప్ప నేత అని ప్రస్తుతించారు. తెలంగాణ ఏర్పడి సామాన్యులకు మేలు జరగడం లేదు. ఈ దిశగా ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక ఏర్పడాలి. సంపూర్ణ తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో తెరవెనుక ఆంధ్ర పెత్తందార్లు, పెట్టుబడుదారులు, కాంట్రాక్టర్లు ఇంకా తెలంగాణలో ఆధిపత్యం చేలాయిచడం సిగ్గుచేటని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. భద్రాచలం పక్కనే పలు మండలాలను ఆంధ్రలో విలీనం జరిగింది. అలానే తెలంగాణలో అన్నిస్థాయిలో ఆంధ్ర పెత్తనం సాగుతోందని, కాంట్రాక్టులతోపాటు అన్ని పనులూ వారే చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా పలు కళాంశాల ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మన తెలంగాణ 22 Jan 2026 10:16 am

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులుగా కామ్రేడ్ ముప్పాళ్ల నాగేశ్వరరావు

శుభాకాంక్షలు తెలియజేసిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా సిపిఐ జాతీయ సమితి సమావేశం ఖమ్మం నగరంలో 20th,21st Jan 2026 జరిగిన సమావేశాల్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన కామ్రేడ్ ముప్పాళ్ల నాగేశ్వరరావుకు పూల కుంచం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా , జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య ,జాతీయ కార్యవర్గ […] The post సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులుగా కామ్రేడ్ ముప్పాళ్ల నాగేశ్వరరావు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Jan 2026 10:16 am

Sujana Chowdhury |ఎల్వోసీ పత్రం అందజేత..

Sujana Chowdhury | ఎల్వోసీ పత్రం అందజేత.. Sujana Chowdhury, భవానిపురం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Jan 2026 10:16 am

జగన్ పై మంత్రి గొట్టిపాటి ధ్వజం

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 22 Jan 2026 10:01 am

సైకలాజికల్ హారర్ మూవీ

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. ఒవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ప్రేరణ తో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజిక్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోంది. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. వెన్నులో వణుకు పుట్టించేలా వున్న టీజర్ సినిమాపై అమాంతం ఆసక్తిని పెంచింది. దర్శకుడు కరుణ కుమార్ ఇప్పటివరకు ఎన్నడూ చూడని కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడని ఈ టీజర్ తెలియజేస్తోంది. ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉంది.

మన తెలంగాణ 22 Jan 2026 9:58 am

Weather Report : ఈసారి మార్చిలోనే మాడు పగిలిపోతుందంట.. వాతావరణ శాఖ అప్ డేట్

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత చాలా వరకూ తగ్గింది.

తెలుగు పోస్ట్ 22 Jan 2026 9:53 am

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం

ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది

తెలుగు పోస్ట్ 22 Jan 2026 9:49 am

ഫാക്ട് ചെക്ക്: ഗാന്ധി പ്രതിമ തകർത്തത് ബംഗ്ലാദേശിലല്ല, ബിഹാറിൽ

ബംഗാളിൽ നിന്നുള്ള ദൃശ്യമാണ് പ്രചരിക്കുന്നത്

తెలుగు పోస్ట్ 22 Jan 2026 9:48 am

ഫാക്ട് ചെക്ക്: ഓപ്പറേഷൻ സിന്ദൂരിൽ കരസേന മേധവിയുമായി വാഗ്വാദം? പ്രചാരണം വ്യാജം

യുഎസ് ഇടപെടൽ ഇന്ത്യയുടെ പ്രതികരണം പരിമിതപ്പെടുത്തിയെന്ന് ഉൾപ്പടെ കരസേന മേധാവി പറയുന്ന വീഡിയോ എഐ ഉപയോഗിച്ച് എഡിറ്റ് ചെയ്തതാണ്

తెలుగు పోస్ట్ 22 Jan 2026 9:47 am

నేడు ఈడీ ఎదుటకు విజయసాయిరెడ్డి

వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించనున్నారు

తెలుగు పోస్ట్ 22 Jan 2026 9:42 am

దేశభక్తి రగిలించే పాట

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ’చైనా పీస్’. మూ న్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం లో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి భగ భగ సాంగ్ రిలీజ్ చేశారు. కంపోజర్ కార్తిక్ దేశభక్తి రగిలించేలా ఈ పాటని స్వరపరిచారు. కాల భైరవ పవర్‌ఫుల్ గాత్రం సాంగ్‌ని నెక్స్ లెవల్ కి తీసుకెళ్ళింది. ఫిబ్రవరి చివరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 22 Jan 2026 9:35 am

తిరుపతిలో జల్లికట్టులో విషాదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ఎద్దు కుమ్మడంతో ఓ యువకుడు మృతి చెందాడు. పుల్లయ్యగారి పల్లెలో 16వ తేది జల్లికట్టులో ఎద్దు కుమ్మడంతో  రవి(56) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళంకు చెందిన రవి(56) ఇవాళ మృతి చెందాడు. ​సంక్రాంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన జల్లికట్టులో ఈ ఘటన జరిగింది. ​​రవి మరణంతో పుల్లయ్యగారి పల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ​ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 22 Jan 2026 9:31 am

Municipal Elections |బీజేపీ అభ్యర్థిగా కొప్పుల సత్యనారాయణ రెడ్డి..

Municipal Elections | బీజేపీ అభ్యర్థిగా కొప్పుల సత్యనారాయణ రెడ్డి.. Municipal Elections,

ప్రభ న్యూస్ 22 Jan 2026 9:28 am

Gold Price Today : ఉగాది నాటికి బంగారం ఎంత పెరుగుతుందో తెలుసా?

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

తెలుగు పోస్ట్ 22 Jan 2026 9:27 am

‘డెకాయిట్’ షూటింగ్ పూర్తి చేసుకున్న మృణాల్

వరుస బ్లాక్‌బస్టర్‌లతో దూసుకుపోతున్న అడివి శేష్ ఇప్పుడు తన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘డకాయిట్’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశ లో ఉంది. తాజాగా మృణాల్ ఠాకూర్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఒక భారీ షెడ్యూల్‌లో తన షూటింగ్ పూర్తి చేశారు. చిత్ర బృందం ఆమె కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఆమె తన పాత్రకు తెలుగు, హిందీ రెండు భాషలలో డబ్బింగ్ కూడా చెబుతున్నారు. ఇటీవల చిత్ర నిర్మాతలు రిలీజ్ చేసిన సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. శేష్ డిఫరెంట్ అవతార్, రఫ్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం, తెలుగు నూతన సంవత్సరం అయిన ఉగాది పండుగ సందర్భంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.

మన తెలంగాణ 22 Jan 2026 9:24 am

AP |స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో..

AP | స్టాప్‌ – వాష్‌ అండ్‌ గో.. AP, శ్రీ సత్యసాయి

ప్రభ న్యూస్ 22 Jan 2026 9:17 am

మోదీపై ట్రంప్ ప్రశంసలు

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు

తెలుగు పోస్ట్ 22 Jan 2026 9:08 am

Vijayawada |వైద్య కళాశాలలో దరఖాస్తులు ఆహ్వానం..

Vijayawada | వైద్య కళాశాలలో దరఖాస్తులు ఆహ్వానం.. Vijayawada, ఆంధ్రప్రభ : ప్రభుత్వ

ప్రభ న్యూస్ 22 Jan 2026 9:08 am

Tirumala : నేడు తిరుమలకు వెళ్లే భక్తులకు హై అలెర్ట్

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది.

తెలుగు పోస్ట్ 22 Jan 2026 8:53 am

Andhra pradesh |యువతకు స్ఫూర్తి..

Andhra pradesh | యువతకు స్ఫూర్తి.. Andhra pradesh, ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Jan 2026 8:53 am

MSVPG: Big Celebration on Sunday

Megastar Chiranjeevi made a strong comeback with Mana Shankara Vara Prasad Garu and the vintage looks of Chiranjeevi are enjoyed by fans and the audience. Chiranjeevi is busy with his next film discussions in Dubai and he flew to Davos to attend the World Economic Forum meeting in Davos. He is expected to return back […] The post MSVPG: Big Celebration on Sunday appeared first on Telugu360 .

తెలుగు 360 22 Jan 2026 8:51 am

నేడు కోటప్పకొండకు పవన్ కల్యాణ్

నేడు పల్నాడు జిల్లాలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు

తెలుగు పోస్ట్ 22 Jan 2026 8:42 am

Summer 2026 Tollywood Releases: A Big Mess

Sankranthi 2026 season helped Tollywood open on a grand note. Except Raja Saab, all the films performed well and the makers will make profits. The next two months in Telugu cinema are quite dull as there are no big releases and crazy films lined up. Summer 2026 is expected to be extremely packed. Movies like […] The post Summer 2026 Tollywood Releases: A Big Mess appeared first on Telugu360 .

తెలుగు 360 22 Jan 2026 8:41 am

Road Accident |ఘోర రోడ్డు ప్రమాదం.. 3 గురు మృతి..

Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 3 గురు మృతి.. Road

ప్రభ న్యూస్ 22 Jan 2026 8:35 am

Chandrababu : నేటితో ముగియనున్న చంద్రబాబు దావోస్ పర్యటన

నేటితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ముగియనుంది

తెలుగు పోస్ట్ 22 Jan 2026 8:31 am

YRCP : నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

వైసీపీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది

తెలుగు పోస్ట్ 22 Jan 2026 8:14 am

TG |ధూప దీప నైవేద్య పథకం అమలు..

TG | ధూప దీప నైవేద్య పథకం అమలు.. TG, కొత్తకోట, ఆంధ్ర

ప్రభ న్యూస్ 22 Jan 2026 8:07 am

India vs Newzealand : తొలి వన్డే మనదే.. నాగపూర్ లో గెలిచిన టీం ఇండియా

భారత్ - న్యూజిలాండ్ మధ్య నాగపూర్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది

తెలుగు పోస్ట్ 22 Jan 2026 8:04 am

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಚಿಕ್ಕಮಗಳೂರಿನಲ್ಲಿ ಹಾಸ್ಪಿಟಲ್‌ನಲ್ಲಿ ಮಹಿಳೆಯೊಬ್ಬರಿಗೆ ದೆವ್ವ ಹಿಡಿದಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ​

ಚಿಕ್ಕಮಗಳೂರಿನಲ್ಲಿ ಹಾಸ್ಪಿಟಲ್‌ನಲ್ಲಿ ಮಹಿಳೆಯೊಬ್ಬರಿಗೆ ದೆವ್ವ ಹಿಡಿದಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ​

తెలుగు పోస్ట్ 22 Jan 2026 8:00 am

అభిషేక్, రింక్‌సింగ్ ల సిక్స్‌ల వర్షం... వీడియో వైరల్

విదర్భ: టి20 సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్‌పై భారత జట్టు 48 పరుగుల తేడాతో గెలిచింది. భారత బ్యాట్స్‌మెన్లు అభిషేక్ శర్మ, రింకు సింగ్ సిక్స్‌ల వర్షం కురిపించారు. అభిషేక్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. రింకు సింగ్ 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.  Team India won by 48 runs in Nagpur #AbhishekSharma #indvsnzt20 pic.twitter.com/pSs2suTJgG — FunkyFreaks✨ (@ameer72s) January 21, 2026 खौफ अच्छा है #INDvsNZ pic.twitter.com/SzHFnNhXGt — amit (@amitkumarmawai) January 22, 2026

మన తెలంగాణ 22 Jan 2026 7:50 am

Bus Accident : ఏపీలో మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోరమైన బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

తెలుగు పోస్ట్ 22 Jan 2026 7:44 am

నంద్యాలలో బస్సు ప్రమాదం: ముగ్గురు సజీవదహనం

అమరావతి: ఓ ప్రైవేటు బస్సు టైర్ పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి అవతలి వైపు లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. రెండు వాహనాలు దహనమయ్యాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా శిరివేళ్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎఆర్‌బిసివిఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 36 మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తోందిజ శిరివెళ్లమెట్ట వద్ద రాగానే బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అనంతరం లారీని ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీ డ్రైవర్, బస్సు డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలంలో సజీవదహనమయ్యారు. ఓ డిసిఎం డ్రైవర్ బస్సు అందాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు లాగాడు. ప్రయాణికులు విండో అందాలు పగుటగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులు కిటీకిలో నుంచి బయటకు దూకడంతో కొందరు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. 

మన తెలంగాణ 22 Jan 2026 7:34 am

Nandyal Road Accident |ఘోర రోడ్డు ప్రమాదం..

Nandyal Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. Nandyal Road Accident,

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:25 am

ఇక హైదరాబాద్ 24x7

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (జిసిసి) ప్రధాన కేం ద్రంగా మారిందని, మూసీ నది పునరుజ్జీవనంతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి పెడతామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా దేశంలోనే 24 గంట లు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దావోస్ వేదికపై సిఎం రేవంత్‌రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను ప్రదర్శిస్తూ 30 వే ల ఎకరాల్లో నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మూ సీ పునరుజ్జీవనం ద్వారా హైదరాబాద్‌ను 24 గంటలు పనిచేసే నగరంగా మారుస్తామని సిఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభు త్వం ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్’, ‘నెక్ట్‌జె న్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026, -2030’లను అధికారికంగా సిఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో వినూత్న ప్రతిపాదన ఉంచారు. ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగష్టు నెలల్లో హైదరాబాద్‌లో ‘మినీ దావోస్’ తరహాలో ఫోరం ఫాలో- అప్ సదస్సును ని ర్వహించాలని సిఎం సూచించారు. పెట్టుబడి ఒ ప్పందాలు, వాణిజ్య నిర్ణయాలకు ఏడాది కాలం చాలా ఎక్కువని, అందుకే ఆరు నెలలకోసారి సమీ క్ష సమావేశం అవసరమని సిఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 250 బిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇప్పటికే రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, రానున్న రో జుల్లో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సిఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రతి ఏడాది తాము ఎంఓయూలపై సంతకాలు చేయడానికి దావోస్‌కు వస్తామని, కానీ, ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావటంతో, తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చామని ఆయన తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందులో 50 శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ లక్ష్యాలను ముఖ్యమంత్రి ప్రదర్శించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణ, చెరువులు, కుంటల పునరుజ్జీవనం వంటి గేమ్-చేంజర్ ప్రాజెక్టుల గురించి పెట్టుబడిదారులకు వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన కోర్, ప్యూర్, రేర్ అర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికల గురించి వారిద్దరూ ప్రస్తావించారు. తెలంగాణకు అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సాంకేతికత, అనుభవం, నైపుణ్యాల పరంగా గ్లోబల్ కంపెనీల సహకారం స్వీకరిస్తామని వారు పేర్కొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు చిరంజీవి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు హాజరైన ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి సినీ నటుడు చిరంజీవి విందులో పాల్గొన్నారు. సినీ నటుడు చిరంజీవి అక్కడే ఉన్న జ్యూరిక్ లో ఉన్నారని తెలుసుకున్న సిఎం రేవంత్ ఆయన్ను కూడా ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆహ్వానించారు. ఈ సదస్సులో ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను చిరంజీవి ఆసక్తిగా వీక్షించారు. అనంతరం ఆయనతో సిఎం రేవంత్ మాట్లాడుతూ కుటుంబంతో కలిసి ‘మన శంకరవరప్రసాద్’ సినిమా చూశానని, చాలా బాగుందని సిఎం రేవంత్ ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. కాగా, ప్రస్తుతం చిరంజీవి స్విట్జర్లాండ్ లో ఫ్యామిలీ ట్రిప్‌లో ఉన్నారు.

మన తెలంగాణ 22 Jan 2026 6:00 am

22nd jan 2026 |నేటి పంచాంగం

22nd jan 2026 | నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు

ప్రభ న్యూస్ 22 Jan 2026 6:00 am

గ్రీన్‌లాండ్‌ ఇవ్వాల్సిందే..

దావోస్: ఓ చిన్న మంచుగడ్డ గ్రీన్‌లాండ్‌ను అమెరికా కోరుకొంటోందని దావోస్‌లో ఆరంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లుఇఎఫ్) సదస్సులో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ ప్రాంత కీలక నైసర్గిక స్వరూపం నేపథ్యంలో ప్ర పంచ శాంతి కోసం, ప్రపంచ పరిరక్షణకు దీని ని అమెరికా కావాలనుకొంటోందని ట్రంప్ చె ప్పారు. దీనిని అమెరికాకు ఇవ్వాల్సిందే అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. బుధవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్ సమీపంలోని రిసార్ట్ సిటీలో గ్రీన్‌లాండ్‌పై ప్ర పంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏ ఇతర దేశం కూడా అమెరికా కన్నా ఈ గ్రీన్‌లాండ్‌కు భద్రత కల్పించలేదు. ఇది నిజం. దీని ని ఎవరూ కాదనలేరని తేల్చిచెప్పారు. గ్రీన్‌లాండ్‌ను ఆశిస్తున్నాం. దీనిని తాము దక్కించుకోవల్సి ఉందన్నారు. అయినా గ్రీన్‌లాండ్ ఓ చిన్న కోరిక. ఇది మంచు తునక, ఐస్ లాండ్. దీనిని స్వాధీనపర్చుకునేందుకు తాము బలప్రయోగానికి దిగాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ప్రసంగం ఎక్కువగా గ్రీన్‌లాండ్ ప్రస్తావనతోనే సాగింది. గ్రీన్‌లాండ్‌ను కంట్రోలులోకి తీసుకునేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపడం తెలివితక్కువ పని అవుతుంది. ఇదే సమయంలో గ్రీన్‌లాండ్‌ను అమెరికా వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుందని వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్ కైవసానికి తమ మార్గాలు తమకు ఉంటాయని పరోక్షంగా తెలిపారు. గ్రీన్‌లాండ్ ఐస్ ముక్కనే కావచ్చు. అయితే అది ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మక ఆయువుపట్టు. ఈ ప్రాంతం రక్షణ బాధ్యతను అమెరికానే జాగ్రత్తగా చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. గతంలోనే తెలివితక్కువతనంతోనే ఈ ప్రాంతాన్ని అమెరికా వదులకుంది. ఇందుకు కారణం ఎవరనేది ప్రస్తావించదల్చుకోలేదు. డెన్మార్క్ సొంతంగా గ్రీన్‌లాండ్‌ను రక్షించలేదు. డెన్మార్క్ బలహీనతలు డెన్మార్క్‌కు ఉండనే ఉన్నాయి. ఇక గ్రీన్‌లాండ్‌ను అమెరికా లీజుపై తీసుకుంటే ప్రయోజనం ఉండదు. లీజ్ పరిధిలో పూర్తి స్థాయి భద్రత కుదరదని తేల్చిచెప్పారు. ఈ ప్రాంతం చిన్న ఐస్‌పీస్ కావచ్చు. అయితే భౌగోళిక వ్యూహాత్మక దిశలో చూస్తే ఇది అమెరికాకు అవసరం అన్నారు. పైగా గ్రీన్‌లాండ్ ఉనికి పరిరక్షణ బాధ్యత అమెరికా చూసుకుంటుందన్నారు. గ్రీన్‌లాండ్‌కు డెన్మార్క్‌కు తరతరాలుగా అమెరికా ఇచ్చిన దానితో పోలిస్తే తాము కోరుకుఉంటున్నది తక్కువే అని ట్రంప్ అన్నారు. తమకు గ్రీన్‌లాండ్ కావల్సిందేనని స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెత్తనం ధోరణిని ఖండిస్తూ వస్తోన్న పలు ఐరోపా దేశాలకు ట్రంప్ ఈ వేదిక నుంచి ఘాటైన హెచ్చరికలు వెలువరించారు. గ్రీన్‌లాండ్‌పై అమెరికా వాదనను వ్యతిరేకించే వారిని తాము ఎప్పుడూ గుర్తుపెట్టుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. అయితే సమ్మతించే వారిని, సమ్మతించని వారిని గుర్తు పెట్టుకుంటామని ఐరోపా దేశాలకు ట్రంప్ చురకలకు దిగారు. దారి తప్పిన ఐరోపా దేశాలు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లుఇఎఫ్) కీలక సమావేశాల ఆరంభంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాలపై విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల దశలో బుదవారం ఇక్కడ జరుగుతున్న ఐదు రోజుల సదస్సులో ఆయన తమ మిత్రదేశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ సరిగ్గా తమ బాధ్యతలు నిర్వర్తించడం లేదని మండిపడ్డారు. పలు ప్రపంచ సమస్యలు రగులుకుంటున్నాయి. అయితే వీటి విషయంలో ఐరోసా దేశాల స్పందన , కనబరుస్తున్న కార్యాచరణ సరిగ్గా లేదని విమర్శించారు. అక్రమ వలసలపై ఐరోపా దేశాల్లో సరైన నియంత్రణ లేదు. దీని పరిణామాలు అంతర్జాతీయంగా దుష్పలితాలకు దారితీస్తోంది. అత్యంత కీలకమైన నిర్మాణాత్మక పాత్ర వహించాల్సిన దేశాలు ఇప్పుడు చేతలుడిగి వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తమ హయాంలో అమెరికా అభివృద్ధి పథంలో దూసుకువెళ్లుతున్నదని, రెండేళ్ల క్రితం బలహీన ఆర్థిక వ్యవస్థ లక్షణాలున్న దేశం నిర్జీవ వ్యవస్థతో ఉన్న దేశం ఈ రెండో దఫా తమ అధికారం తొలి ఏడాదిలో తిరిగి బలోపేతం అయిందని తెలిపారు. ఈ సదస్సుకు హాజరైన తన మిత్రులకు , కొందరు శత్రువులకు కూడా తన శుభాకాంక్షలు అని తెలిపిన ట్రంప్ నిజాలు పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం యూరప్ దేశాల పతనానికి దారితీసిందన్నారు. ఇప్పుడు అపార వనరులున్న దేశాలకు కూడా చైనా తన ఉత్పత్తులు అంటగడుతోందని తెలిపారు. చాలాకాలంగా ఆర్థిక నష్టాల్లో ఉన్న అమెరికా ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు తాము కొన్ని దేశాలపై విధించిన సుంకాలతో సత్ఫలితాలు దక్కుతున్నాయని ట్రంప్ చెప్పారు. తమ భారీ సుంకాలను ఈ ఆర్థిక సదస్సులో సమర్థించుకున్నారు. అమెరికా ఇప్పుడు ప్రపంచ ఆర్థిక ఇంజిన్ అయిందన్నారు. తాను ఎంతగానో ఇష్టపడే ఐరోపా దేశాల్లో కొన్నింటికి ఇప్పటికీ సరైన గుర్తింపు లేదని, ఇందుకు కారణం అవి కీలక విషయాలపై సవ్యమైన రీతిలో వ్యవహరించకపోవడమే అన్నారు.

మన తెలంగాణ 22 Jan 2026 5:30 am

రూ.100 కోట్ల వెంకటరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: అవినీతి నిరోదకశాఖకు ఇప్పటికే చిక్కిన హన్మకొండ జిల్లా అ దనపు కలెక్టర్ అర్ర మాడ వెంకట్ రెడ్డికి వంద కోట్లకు పైనే ఆస్తిపాస్తులు ఉన్నట్టు తాజాగా ని ర్వహించిన సోదాలలో బయటపడింది. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేసిన వెంకటరెడ్డి అవినీతి చిట్టా మరోసారి ఎసిబి ని ర్వహించిన సోదాలలో గుర్తించింది. బుధవా రం తెల్లవారుజామున హైదరాబాద్, రంగారె డ్డి, వరంగల్, నల్గొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లోని ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లల్లో ఎసిబి బృందాలు ఏకకాలంలో సోదా లు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఆయన ఆస్తుల విలు వ ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం వంద కోట్ల కు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఎసిబి గుర్తించింది. రిజిస్ట్రేషన్ విలువ మేరకు ఎల్బీనగర్‌లో రూ.4.6 కోట్ల విలువ చేసే భవనం, ఒక ఖరీదైన విల్లాతో పాటు అదే ప్రాంతాల్లో రూ.60 లక్షల విలువ చేసే కమర్షియల్ షాప్, రూ.65 లక్షల చొప్పున విలువ చేసే ఎనిమిది ఓపెన్ ప్లాట్‌లు, రూ.50 లక్షల విలువ చేసే 14.25 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్టు ఎసిబి గుర్తించింది. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో వంద కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటికి సంబంధించిన కీలక పత్రాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా వెంకట్ రెడ్డి ఇంట్లో, బ్యాంక్ లాకర్లలో లభించిన నగదు, బంగారం చూసి అధికారులు విస్తుపోయారు. రూ. 30 లక్షల నగదుతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ రూ.44 లక్షలుగా ఎసిబి గుర్తించింది. రూ.11 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, రూ.40 లక్షల విలువ చేసే వాహనాలు, రూ.4.35 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను ఎసిబి అధికారులు సీజ్ చేశారు. ఈ ఆస్తులన్నీ తన అధికార హోదాను అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదిం చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా, వెంకట్ రెడ్డి అవినీతి భాగోతం డిసెంబర్ 5న ఒక పాఠశాల రెన్యూవల్ కోసం లంచం అడగటంతో ఈ వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది. రెన్యూవల్ ఫైల్ క్లియర్ చేయడానికి ఆయన రూ. 60 వేలు లంచం డిమాండ్ చేయగా అతన్ని ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే వెంకట్‌రెడ్డి సస్పెండ్ కాగా. ప్రస్తుతం ఎసిబి అధికారులు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఇతర బినామీ ఆస్తులు, పెట్టుబడులపై దృష్టి సారించింది. నల్గొండ జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో కూడా వెంకట్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు సమాచారం. ఇలా ఉండగా ఈ అక్రమార్జనలో ఇతర అధికారుల పాత్రపై కూడా విచారణ జరుపనున్నట్టు ఎసిబి వర్గాల సమాచారం. ఎసిబి కేసు నమోదు హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డిపై ఎసిబి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. వెంకట్ రెడ్డిపై అవినీతి నిరోధక చట్టం 1988 (సవరణ 2018) సెక్షన్ 13(1)(b), 13(2) కింద కేసు నమోదు చేసినట్లు ఎసిబి అధికారులు తెలిపారు.

మన తెలంగాణ 22 Jan 2026 5:00 am

గాంధీభవన్‌లో జగిత్యాల జగడం

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం లో జగిత్యాల నియోజకవర్గం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.సంజయ్ ప్రత్యక్షమయ్యారు. దీంతో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మం త్రి టి.జీవన్ రెడ్డికి చిర్రెత్తింది. మన పార్టీ సమావేశానికి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎలా హాజరవుతారంటూ ఆగ్రహం వ్యక్తం చే స్తూ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇదంతా బుధవారం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమక్షంలోనే జరగడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం సాయంత్రం గాంధీ భవన్‌లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పార్టీ ముఖ్య నేతల సమావేశం మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేకూడా హాజరుకావడంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఏ మాత్రం నచ్చలేదు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈ సమావేశంలో ఉండడం వల్ల తాను బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పి బయటకు వచ్చేశారు. దీంతో అందరూ అవాక్కైయ్యారు. అయినప్పటికీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహేష్ కుమార్‌గౌడ్ ఆయనకు నచ్చజెప్పే ప్రయ త్నం చేసినా వినిపించుకోకుండా ఆగ్రహంతో బయటకు వచ్చారు. అనంతరం జీవన్ రెడ్డి గాంధీ భవన్ ఆవరణలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను తమ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఎలా కూర్చోపెడతారని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇటీవల స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టిన సమయంలోనూ తాను పార్టీ మారలేదనీ, బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని స్పీకర్‌కు అఫిడవిట్ దాఖలు చేశారని ఆయన ఉదహరించారు. పదేళ్ళు బిఆర్‌ఎస్ అఘాయిత్యాలపై తాము పోరాటం చేస్తే, ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పక్కన కూర్చోపెట్టుకోవాలా? అని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. తాను చెబుతున్న అభిప్రాయమే లక్షలాది మంది పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్నదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ఆకర్షితున్ని అయి కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పిన వ్యక్తి, మళ్లీ తాను పార్టీ మారలేదని, బిఆర్‌ఎస్‌లోనే ఉన్నానని అఫిడవిట్ ఇచ్చారని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని తాను ఇటీవల పిసిసి అధ్యక్షునికి చెప్పినా ప్రయోజనం కనిపించలేదన్నారు. ఆవేదనను అర్థం చేసుకున్నాః మహేష్‌కుమార్ ఇదిలాఉండగా సమావేశం ముగిసిన అనంతరం జీవన్ రెడ్డి వాకౌట గురించి మీడియా ప్రతినిధులు పిసిసి చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌ను ప్రశ్నించగా, ఈ విషయంలో ఇప్పుడు తాను ఏమీ మాట్లాడనని, పార్టీయే సుప్రీం అని అన్నారు. జీవన్ రెడ్డి ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని ఆయన చెప్పారు. ప్రతిష్టాత్మకంగా తీసుకోండిః మంత్రి ఇదిలాఉండగా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికలను పార్టీలో ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తక్కువ స్థానాల్లోనే గెలుపొందామని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామన్నారు. కాబట్టి ఇదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ చూపించాలని ఆయన సూచించారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించుకోవచ్చన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టిందని, వీటని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే తప్పకుండా ్ర పజలు ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మరింత ఉధృతంగా ఉద్యమించండి.. జూమ్ మీటింగ్‌లో మీనాక్షి, మహేష్ ఇదిలాఉండగా బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పార్టీ అధ్యక్షుడు బి. మహేష్‌కుమార్ గౌడ్, జిల్లా పార్టీ అధ్యక్షులతో, ఇతర ముఖ్య నాయకులతో జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని మీనాక్షి, మహేష్‌కుమార్ గౌడ్ సూచించారు. యుపిఏ హయాంలో చేపట్టిన ఈ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని వారు విమర్శించారు.

మన తెలంగాణ 22 Jan 2026 4:30 am

సింగరేణిపై విచారణకు సిద్ధం

మన తెలంగాణ/సిటీబ్యూరో: సింగరేణి టెండర్ల వ్యవహారంపై బహిరంగ చర్చకు సిద్దమని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు, బీజెపి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఓపెన్ చాలెంజ్ చే శారు. వేదికను ఎంపికచేసి చర్చకు పిలిస్తే.. ఎక్కడికైనా వస్తానని, 2014 నుండి 2025 అక్టోబర్ నాటికి మైనింగ్ టెండర్లపై చర్చిద్దాం రండీ అంటూ మంత్రి పొన్న ప్రభాకర్ సవాల్ విసిరారు. జీహెచ్‌ఎం సి కార్యాలయంలో మీడియాతో బుధవారంమాట్లాడుతూ.. టెండర్ల పై విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మీరు లేఖలు రాస్తే వి చారణకు ప్రభుత్వం కోరుతుందని మంత్రి పొన్నం స్పష్టంచేశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారని, తీరా ప్రభుత్వం సీబీఐ విచారణకు అనుమతిస్తే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావులు కలిసి వ్యూహాత్మకంగా సింగరేణి అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకే ఇప్పుడు సింగరేణిపై సీబీఐ ఎంక్వైరీ కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. 2014 నుండి 2025 వరకు 20 టెండర్లను నిర్వహిస్తే.. అందులో కేవలం 5 టెండర్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిందనీ, ఇందులో ఒక టెండర్ మాత్రమే 0.01 శాతం ప్లస్‌గా వచ్చిందే తప్ప మిగతా నాలుగు టెండర్లు మైనస్‌లోనే ఉన్నాయని మంత్రి ప్రభాకర్ వివరించారు. మిగతా టెండర్లు రిజర్వ్ బిడ్‌కన్నా.. ప్లస్‌తోనే నిర్వహించారని మంత్రి విమర్శించారు. మైనస్ శాతంతో ఇచ్చాం.. సింగరేణి అలాట్‌మెంట్స్ వివరాలను తెప్పించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కిషన్ రెడ్డి, హరీష్ రావులను మంత్రి డిమాండ్ చేశారు. ‘2014 నుంచి సింగరేణిలో ఇచ్చిన ఒకే ఒక్క కాంట్రాక్ట్ మినహా.. మిగతా కాంట్రాక్టులన్నీ ’ఎక్స్‌ట్రా’ (అదనంగా/నామినేషన్ పద్ధతిలో) గానే ఇచ్చారని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. నా సవాల్ స్వీకరించే దమ్ముందా?‘ అని ప్రతిపక్ష నేతలను ప్రభాకర్ ప్రశ్నించారు. విమర్శలకు వేదిక అయిన నైని బ్లాక్ పై +38 శాతం తో బీఆర్‌ఎస్ హయాంలో చేసిన కేటాయింపుల టెండర్ రద్దయింది..తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 నుంచి ఇచ్చిన ఓసిపికి సంబంధించి 20 ఇచ్చారు.. ఒకటి 37 శాతంతో ఎక్సెస్‌గా ఇచ్చారని మంత్రి ఆరోపించారు. పాత ప్రభుత్వంలో వెంకటేష్ ఓపెన్ కాస్ట్ కాంట్రాక్ట్ టెండర్ తీసుకున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తీసుకుంటే లేని బంధుత్వం కాంగ్రెస్ హయాంలో ఇస్తే బంధుత్వం ఎలా ఏర్పడుతుందని మంత్రి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో 35.57 ఎక్సెస్‌తో 01.05 .2017న ఒక కంపనీకి ఇచ్చారనీ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో 2025 ఏప్రిల్, మే,జూలై ,అక్టోబర్ లో ప్రాజెక్ట్ ల్లో సైట్ ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాతే టెండర్లకు వెళ్ళింది. బీఆర్‌ఎస్‌లో అదేమి లేదని విమర్శించారు. నాటకాలాపండి.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న నాటకాలను కట్టిపెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడేందుకు కలిసి రావాలని హితవు పలికారు. తెలంగాణకు కేంద్ర నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని, హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీద్దాం కలిసి రండి అని పిలిస్తే ప్రతిపక్ష నేతలెవరూ ముందుకు రావడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు సింగరేణి సంస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని, ఆ రెండు పార్టీలు కలిసే తాము సేఫ్ జోన్‌లో ఉంటామని భావిస్తున్నాయని ఆరోపించారు. సింగరేణిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు, ఎస్‌సీలు, ఎస్‌టీలు, మహిళలు మంత్రులుగా కొనసాగుతున్నారనీ, అదే బీఆర్‌ఎస్ హయాంలో కుటుంబ సభ్యులకే కీలక బాధ్యతలను అప్పగించారని మంత్రి విమర్శించారు. మీ పాలనలో మీరు, మీకొడుకు, మీ అల్లుడలకే పోస్టులు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీఅధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉన్నాయని మంత్రి విమర్శలు గుప్పించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అత్యధికంగా రేషన్ కార్డులు మంజూరు చేశాం, 200 యూనిట్లకు కరెంట్ బిల్లులు మాఫీచేశాం, నీళ్ళు అందిస్తున్నాం. 48 గంటల్లో పంటల ఉత్పత్తిలను కొనుగోలు చేస్తున్నాం.మహిళలకు వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తున్నామంటూ మంత్రి ప్రభాకర్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 22 Jan 2026 4:00 am

మతోన్మాదంపై సమైక్య పోరాటం

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: కేరళతోపాటు త్వరలో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో బలా న్ని పెంచుకుంటామని సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా తెలిపారు. ఖమ్మం నగరంలో నాలుగు రోజులుగా జరుగుతున్న సిపిఐ శతాబ్ది ఉత్సహాల్లో భాగంగా బుధవారం జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. సమావేశం అనంతరం రాజా మీడియాతో మాట్లాడుతూ.. కేరళను కాపాడుకోవడంతోపాటు త్వరలో ఎన్నికలు జరగనున్న మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కలిసివచ్చే శక్తులతో బలా న్ని పెంచుకుంటామన్నారు. దేశంలో లౌకికవాద ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని సమైక్య పోరా టం చేస్తామన్నారు. సంఘ్ పరివార్ శక్తులు కులా న్ని, మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నాయని వీటికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. సనాతన ధ ర్మం, మహిళలపట్ల వివక్ష కొనసాగుతుందన్నారు. మతతత్వ శక్తుల కారణంగా దేశంలో లౌకికవా దం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయన్నారు. విద్యారంగంలోనూ మతాన్ని చొప్పిస్తున్నారని, వి ద్యా వ్యవస్థను వ్యాపారమయంగా మార్చారని రా జా వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పథకాన్ని పో రాడి సాధించుకుంటే దానిని రద్దు చేసేందుకు బిజె పి కుట్ర చేస్తుందని, ఇందుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతునిస్తూ సమ్మె జయప్రదానికి కృషి చేస్తుందన్నారు. భారతదేశాన్ని నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మోడీ చెబుతున్నారని, కానీ దేశంలో నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని, ఆశ్రిత పెట్టుబడిదారి విధానంతో దేశం విచ్ఛిన్నం దిశగా ప్రయత్నిస్తుందని రాజా అన్నారు. అంబానీ, అదానీలాంటి కార్పొరేట్ శక్తులు శ్రామిక జనులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. మోడీకి ఈ దేశంలో రైతులు, కార్మికుల గురించి పట్టదని, ఆయన ప్రేమంతా సంపన్న వర్గాలపైనేనని దుయ్యబట్టారు. ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరిస్తున్నా కనీసం ఖండించలేని స్థితిలో భారత ప్రధాని మోడీ ఉన్నారన్నారు. ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరిస్తూ అత్యంత ప్రమాదకారిగా మారుతున్నారని ఈ సమయంలో వెనెజువెలాకు తాము మద్దతుగా నిలుస్తున్నామన్నారు. వెనెజువెలాపై దాడి కేవలం ఆయిల్ సంపద కోసమేనని ఆయన స్పష్టం చేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయవద్దని భారత్ పై ఒత్తిడి తీసుకు వస్తున్నా మోడీ స్పందించడం లేదని నోరు మెదిపే సాహసం కూడా చేయలేకపోతున్నారని రాజా ఆరోపించారు. పాలస్తీనా, వెనెజువెలాకు అంతర్జాతీయ మద్దతు పెరుగుతుందన్నారు.పార్లమెంటును నిర్వీర్యం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారని బిజెపి పాలన ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో సాగుతుందని ఆయన తెలిపారు. గవర్నర్ల వ్యవస్థను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు స్థానిక ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుందని ఆయన తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గవర్నర్ శాసించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగం నిర్వీర్యం అవుతుందని ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్‌పరం చేస్తున్నారని ఇటువంటి సమయంలో ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు, అగ్రికల్చర్, ఎలసి, అణు విద్యుత్ కేంద్రాలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని రాజా తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ఖమ్మం నగరంలో అత్యంత వైభవంగా జరిగాయని పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ప్రదర్శనను, బహిరంగ సభను విజయవంతం చేశారన్నారు. ఈ ఉత్సవాలకు వేదికగా నిలిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ శాఖలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమం అంటే త్యాగాలు, పోరాటాలేనని ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు, పోరాటాలకు సమాయత్తం అవుతామని రాజా తెలిపారు. విలేఖర్ల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శులు రామకృష్ణ పాండా, పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 22 Jan 2026 3:30 am

స్కీముల్లేవ్..అన్నీ స్కాములే

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణిలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అరోపించారు. ఎన్నికల ముందు స్కీములు అంటూ ప్రజలను మభ్యపెట్టి, అ ధికారంలోకి వచ్చాక స్కాములకే కాంగ్రెస్ పాల న పరిమితమైందని విమర్శించారు. కోల్ బెల్ట్ నుంచి వచ్చిన ప్రజలు ఈ మోసాన్ని తప్పక గు ర్తించాలని, సింగరేణి అంశమే కాంగ్రెస్ అసలుస్వరూపాన్ని బయటపెడుతోందని స్పష్టం చేశా రు. ఈ అంశంపైన మెత్తం మంత్రులు తేలు కు ట్టిన దొంగళ్ల కనీసం మాట్లాడం లేదని కెటిఅర్ అరోపించారు. ఒక్కో మంత్రి ఒక్కో దేశం పారిపోయాడన్నారు. ఈ స్కాం బయటపడగానే కో మటిరెడ్డి, భట్టి విక్రమార్క ఒకరిని మించి ఒక రు నటించారని, అయితే వారీ మాటల మోసా లు స్కాంను దాచి ఉంచలేవన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మంచిర్యాల జిల్లా అధ్యక్షు డు బాల్క సుమన్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ వైస్ ఛైర్మన్ రా జిరెడ్డి, ఆయన అనుచరులు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కెటిఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్  పాలనలో స్కీములు మాయమై స్కాములు మాత్రమే మిగిలాయని, ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని, నిజాలు బయటకు రావాల్సిందేనని డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ భారీ స్కామ్ బయటపడిందని కెటిఅర్ తెలిపారు. కేసీఆర్ పాలనలో నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తీసుకువచ్చామని, కార్మికులకు ఇచ్చిన 10 హామీల్లో 9 హామీలు అమలు చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చాక కొత్త నిబంధనల పేరుతో సింగరేణిని దోచుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ అనే కొత్త నిబంధన తీసుకువచ్చి టెండర్లను కట్టడి చేసిందని విమర్శించారు. గతంలో దేశంలో ఎక్కడున్న కాంట్రాక్టర్ అయినా ఈ-టెండర్ ద్వారా పోటీ పడే అవకాశం ఉండగా ఇప్పుడు తప్పనిసరిగా సైట్‌కు వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాల్సిందేనని చెప్పి అవినీతికి తలుపులు తెరిచారని ఆరోపించారు. దీని ద్వారా ఎవరు టెండర్ వేయాలి, ఎవరు వేయకూడదో ముందే నిర్ణయించే వ్యవస్థ ఏర్పడిందన్నారు. ఈ ప్రక్రియలో ముఖ్యమంత్రి బంధువుల పాత్రపై కెటిఅర్ తీవ్ర ఆరోపణలు చేశారు. మొదటి పెద్ద కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి కంపెనీకే దక్కిందని, రూ.250 కోట్ల కాంట్రాక్ట్ అందుకున్నారని ఆరోపించారు. గతంలో మైనస్‌లో పోయే టెండర్లు ఇప్పుడు వేల కోట్ల విలువైన డీల్స్‌గా మారాయని, ఒక్కో టెండర్‌ను వాటాలు వేసుకుని మరీ పంచుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్ కాంగ్రెస్ నేతలే వాటాల కోసం పరస్పరం కొట్టుకోవడం వల్లే బయటకొచ్చిందని తెలిపారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ వాటాల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మరో మంత్రి మధ్య విభేదాలు బయటపడ్డాయని, ఒకరిపై ఒకరు మీడియా ద్వారా ఆరోపణలు చేసుకున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించగానే ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగిందని ఆరోపించారు. సింగరేణి స్కామ్‌పై సమాధానం చెప్పాల్సిన బదులు, ఫోన్ ట్యాపింగ్ అంటూ పాత సీరియల్‌లా కేసులు లాగుతున్నారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయ బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 22 Jan 2026 3:00 am

పరుగు ఆపని పసిడి

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. గ్రీన్‌లాండ్ సంక్షోభం కారణంగా ఉద్రిక్తతలు పెరగ్గా, డాలర్ బలహీనపడుతుండడం వల్ల బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. బుధవారం ఎంసిఎక్స్ గోల్డ్ ధర 10 గ్రాములు ఏకంగా 7,774 పెరిగి రూ.1,58,339 కి చేరుకుంది. మంగళవారం రోజు ఇది రూ.150,565 వద్ద ఉంది. వెండి ధర కిలో రూ.3,34,840 కి చేరుకోగా, క్రితం రోజు ఇది రూ.3,23,672 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ 4,800 డాలర్ల కీలక మార్క్ దాటింది. ఔన్స్ వెండి ధర 95.87 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్ అంశంపై యూరోపియన్ దేశాలను బెదిరించడం వల్ల వాణిజ్య యుద్ధ భయం పెరిగింది. దీంతో పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి పెడుతున్నారు. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.91.70కి పడిపోవడంతో దేశీయంగా బంగారం ఖరీదైంది. అలాగే ఆర్‌బిఐ సహా ప్రపంచ కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. డాక్టర్ రెనిషా ప్రకారం, ఉద్రిక్తతలు పెరిగితే 2026లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.90 లక్షలకు చేరవచ్చు.

మన తెలంగాణ 22 Jan 2026 12:21 am

మరింత దిగువకు రూపాయి

` ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.91.74కు పతనం న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. …

జనం సాక్షి 22 Jan 2026 12:19 am

రాష్ట్ర అభివద్ధికి కోసం చిత్తశుద్ధితో కషి చేస్తున్నాం

` విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ` తెలంగాణలో వైద్యవిద్యకు పెద్దపీట ` అన్ని వర్గాల సంక్షేమమే మా లక్ష్యం ` డిప్యూటి సిఎం …

జనం సాక్షి 22 Jan 2026 12:18 am

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు

` జాగతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారనందునే ఈ నిర్ణయం ` కానీ మద్దతు కోరినా ఇస్తాం ` ఫోన్ ట్యాపింగ్ తుదిదశకు చేరుతుందన్న నమ్మకం …

జనం సాక్షి 22 Jan 2026 12:16 am

సస్పెండైన అదనపు కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు..

` భారీగా అక్రమాస్తులు గుర్తించిన అధికారులు హనుమకొండ(జనంసాక్షి): సస్పెన్షన్‌లో ఉన్న హనుమకొండ అదనపు కలెక్టర్(రెవెన్యూ) వెంకట్‌రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. దీంతో అవినీతి నిరోధక …

జనం సాక్షి 22 Jan 2026 12:15 am

సిట్టింగ్ జడ్జీచేత విచారణ చేయించండి

` కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాలు ఎత్తేయడం ఖాయం ` మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక సమస్యల ఆధారంగానే ప్రజల తీర్పు ` ఒకేరోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య చేసుకోవడం …

జనం సాక్షి 22 Jan 2026 12:14 am

సింగరేణిపై విచారణ జరిపించమంటారా?

` బీఆరఎస్‌కు మంత్రి పొన్నం సవాల్ ` కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్న హైదరాబాద్(జనంసాక్షి):సింగరేణిపై బీఆరఎస్ నేతలు దుష్పచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. …

జనం సాక్షి 22 Jan 2026 12:13 am

దావోస్‌లో పెట్టుబడుల వరద

` వరల్డ్ ఎననామిక్ ఫోరంకు ఫాలోఅప్ సదస్సు ఉండాలి ` అది ప్రతి యేటా హైదరాబాద్‌లో నిర్వహించాలి ` ప్రపంచ ఆర్థిక వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి …

జనం సాక్షి 22 Jan 2026 12:11 am

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్‌తో కలిసి పాల్గొన్న మెగాస్టార్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు -2026లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌లోని జూరిచ్‌లో ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆయనను సదస్సుకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ చిరంజీవి సదస్సుకు హాజరై, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ప్రతిబింబించిన ఈ ఘట్టం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా ఆహ్వానించారు. తమ కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లతో కలిసి మన శంకరవరప్రసాద్ గారు సినిమాను వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సినిమా అందించిన వినోదం పట్ల ఆయన తన అభినందనలను వ్యక్తిగతంగా చిరంజీవితో పంచుకున్నారు. చిరంజీవి కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్ర నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లిన సమయంలోనే ఈ ఆహ్లాదకరమైన సమావేశం, అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం చోటుచేసుకుంది.

మన తెలంగాణ 21 Jan 2026 11:30 pm

మాయివోస్టు పార్టీలో మిగిలింది 17 మంది నేతలే

రాష్ట్రం నుండి మావోయిస్టు పార్టీలో మరో 17 మంది కీలక వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నారని, వారంతా దేశ వ్యాప్తంగా వివిధ కేడర్లలో పనిచేస్తున్నట్లు పోలీస్ శాఖ పేర్కొంది. గతేడాది 576 మంది వివిధ క్యాడర్లలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీస్ శాఖ తెలిపింది. మిగిలిన 17 మంది పై సుమారు కోటికి పైగా రివార్డు ఉన్నట్లు చెప్పింది. రివార్డు వివరాలు పోలీస్ శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణ్ , సిసిఎం జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ లపై- రూ.25 లక్ష-ల చొప్పున రివార్డు ఉందన్నారు. ఇఆర్‌బి సభ్యులు పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, డివిజనల్ కార్యదర్శి ముప్పిడి సాంబయ్య, డికెఎస్‌జెడ్‌సి సభ్యుడు, కమ్యూనికేషన్ వింగ్ ఇంచార్జ్ వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు, కేంద్ర కమిటీ సభ్యురాలు, డికెఎస్‌జెడ్‌సి ఇంచార్జ్ జోడే రత్నబాయి అలియాస్ సుజాత, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్ రావు అలియాస్ ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, సైనిక వ్యవహారాల ఇంచార్జ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ -లపై రూ.20 లక్షలు చొప్పున రివార్డు ఉన్నట్లు చెప్పారు. డిసిఎం స్థాయి కేడర్లు నక్కా సుశీల అలియాస్ రేలా, జాడి పుష్ప అలియాస్ రాజేశ్వరి ల-పై రూ.5 లక్షల చొప్పున, ఏరియా కమిటీ స్థాయి క్యాడర్ సభ్యులు రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, బాదిషా ఉంగ అలియాస్ మంతు ఏరియా, మడివి అడుమె అలియాస్ సంగీత, కాశపోగు భవాని అలియాస్ సుగుణ, కుంజం ఇడమల్ -లపై నాలుగు లక్షల చొప్పున, పార్టీ సభ్యుడు, కంప్యూటర్ ఆపరేటర్ ఉతిమి అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్ పై లక్ష రూపాయాల రివార్డు ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. -

మన తెలంగాణ 21 Jan 2026 11:17 pm

తల్లి కళ్లెదుటే ఆరేళ్ల బాలుడి దుర్మరణం

నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక చిన్నారి విద్యార్థి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన తల్లితో కలిసి స్కూటీపై స్కూలుకు వెళ్తున్న ఎనిమిదేళ్ల బాలుడు ఆర్మీ వాహనం కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్‌మెట్ ఆఫీసర్స్ కాలనీకి చెందిన నీలాంగ్ తమాంగ్ (32) తన కుమారుడు నిజేన్ తమాంగ్ (8) ను స్కూటీపై ఆర్కే పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు తీసుకెళ్తోంది. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో వారు ఆఫీసర్స్ కాలనీ రోడ్డుపై ఆర్మీ వాహనం పక్కగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు స్కూటీ స్కిడ్ అయింది. దీంతో తల్లి, కుమారుడు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఆర్మీ అశోక్ లేలాండ్ వాహన డ్రైవర్ ఈ విషయాన్ని గమనించే లోపే కింద పడిన నిజేన్ తమాంగ్ పైనుంచి ముందు చక్రం దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో నీలాంగ్ తమాంగ్‌కు కూడా గాయాలు కాగా, ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నేరేడ్‌మెట్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తాత (నీలాంగ్ మామ) రాజు తపా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్మీ వాహనం అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలను స్కూళ్లకు వెళ్లే సమయంలో మహిళలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అజాగ్రత్త అనాలోచిత నిర్ణయాల వల్లనే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుందని రోడ్డుపై వాహనాలతో వచ్చేవారు పూర్తి జాగ్రత్తతో మసులుకోవడం అత్యంత అవసరమని పలు సిసి కెమెరాల పుటేజీలు తెలుపుతున్నాయి. విద్యాలయాలకు వెళ్లే వచ్చే సమయాలలో భారీ వాహనాలను స్కూల్లో ప్రాంగణాలలో అనుమతించకపోవడం అమల్లో ఉన్నప్పటికీ ప్రమాదం జరగడం అత్యంత విచారకరమని పలువురు భావిస్తున్నారు.

మన తెలంగాణ 21 Jan 2026 11:10 pm

టీమిండియా శుభారంభం

న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. గ్లెన్ ఫిలిప్స్ 40 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 4 ఫోర్లతో 78 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. మార్క్ చాప్‌మన్ (39), డారిల్ మిఛెల్ (28), కెప్టెన్ సాంట్నర్ (20) పరుగులు చేశారు. అభిషేక్ జోరు.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ అండగా నిలిచాడు. ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ స్కోరును పరిగెత్తించాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (8) కూడా నిరాశ పరిచాడు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అభిషేక్ జోరును కొనసాగించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ వరుస ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సూర్యకుమార్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన సూర్యకుమార్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 32 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే సమయంలో మూడో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ 35 బంతుల్లోనే 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్య 16 బంతుల్లోనే 25 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. మరోవైపు చివర్లో రింకు సింగ్ వీరవిహారం చేశాడు. కివీస్ బౌలర్లపై విరుచుకు పడిన రింకు 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 44 పరుగులు చేశాడు.

మన తెలంగాణ 21 Jan 2026 10:56 pm

వికలాంగురాలైన కూతురిని చంపి కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం

ఆర్థిక ఇబ్బందులతో వికలాంగులైన కూతుర్ని చంపి వారు ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు తో మనస్థాపానికి గురైన కుటుంబ సభ్యులు పుట్టుకతో వికలాంగురాలైన కూతురు జావళి (18)ను రెండు రోజుల క్రితం హత్య చేశారు. కూతురు మరణించిన తర్వాత రెండు రోజులుగా ఇంట్లోనే మృతదేహంతో గడిపిన కుటుంబీకులు సతీష్ కుమార్, భార్య ,కొడుకు నితిన్ కుమార్ .ఈ రోజు చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా విషయాన్ని కుమారుడు నితిన్ తన స్నేహితునికి సమాచారాన్ని తెలియజేశారు. సమాచారం మేరకు జగద్గిరిగుట్ట  పోలీసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మిగితా వారిని చికిత్స నిమిత్తం కూకట్ పల్లి రాందేవ్ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులేనా మరి ఏమైనా సమస్యల అనే కోణంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జగద్గిరిగుట్ట సీఐ వెంకటేశం తెలిపారు.

మన తెలంగాణ 21 Jan 2026 10:47 pm

ప్రయాగ్‌రాజ్‌లో కుప్ప కూలిన మిలిటరీ శిక్షణ విమానం

 ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ నగర శివారులోని చెరువులో మిలటరీ శిక్షణ విమానం కూలిపోయింది. ఇందులోని ఇద్దరు పైలట్లు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. విద్యావాహిని పాఠశాల సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ సమాచారం అందగానే ఆర్మీ ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. చెరువు నీటిలో ఎయిర్ క్రాఫ్ట్ మునిగి పోగా స్థానికులు పైలట్లను బయటకు తీశారు. సాంకేతిక లోపం కారణం గానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బురద నీటిలో ఉన్న విమాన శకలాలను వెలికి తీసే ప్రక్రియను బృందాలు ప్రారంభించాయి. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆర్మీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మన తెలంగాణ 21 Jan 2026 10:30 pm

అంతరిక్షం నుంచి చూస్తే ఈ గొడవలు చాలా చిన్న విషయాలే : సునీతా విలియమ్స్

 భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సునీతా విలియమ్స్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తొలి అంతరిక్ష యాత్రలో భూమిపై భారత దేశాన్ని, స్లోవేనియాను చూశానని తెలిపారు. స్పేస్ లోకి వెళ్లిన వెంటనే తన తల్లిదండ్రుల దేశాలు ఎక్కడ ఉన్నాయని ఆత్రుతగా గమనించానని చెప్పారు. సునీతా తండ్రి గుజరాత్ లోని ఝలసన్ గ్రామానికి చెందినవారు కాగా, తల్లి స్లోవేనియన్ అమెరికన్ మహిళ. అందుకే మొదట ఈ ప్రదేశాల గురించే వెతికాను. చివరకు భూమి అంతా ఒకటే అని తెలుస్తుందన్నారు.అంతరిక్షం నుంచి చూస్తే భూమిపై జీవితంపై అవగాహన మారుతుందని, చిన్న విషయాలపై ఎందుకు వాదించుకుంటామో ఈ గొడవలు చాలా చిన్న విషయాలు కదా అనిపిస్తుందని, ఆమె అన్నారు. వ్యక్తుల మధ్య విభేదాలపై మన అభిప్రాయం మారుస్తుంది. మనమంతా ఒక్కటే కదా, కలిసి మెలసి పనిచేయాలనే భావనను కలిగిస్తుంది. అని ఆమె అన్నారు. 

మన తెలంగాణ 21 Jan 2026 10:19 pm

దయచేసి నన్ను క్షమించండి..మరోసారి ఇలాంటి తప్పు చేయను: నటి టీనా శ్రావ్య

నటి టీనా శ్రావ్య మేడారం జాతరలో తన పెంపుడు కుక్కకు మొక్కు చెల్లించడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై ఆమె స్పందిస్తూ క్షమాపణలు కూడా చెప్పారు.కమిటీ కుర్రోళ్లు', 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి టీనా శ్రావ్య, ఇటీవల మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె తన పెంపుడు కుక్కను త్రాసులో ఒకవైపు కూర్చోబెట్టి, దానికి సమానమైన బరువుతో బెల్లాన్ని (బంగారం) మొక్కుగా చెల్లించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది.ఈ వివాదంపై శ్రావ్య స్పందించారు. తాను ఎవరినీ కించపరచాలని అలా చేయలేదని, మరోసారి ఇలాంటి తప్పు చేయనంటూ క్షమాపణలు తెలిపారు.మేడారం జాతర అత్యంత పవిత్రమైన గిరిజన పండుగ అని, అక్కడ జంతువులతో ఇలాంటి తులాభారం నిర్వహించడం ఆచారాలను కించపరచడమేనని భక్తులు మరియు నెటిజన్లు మండిపడ్డారు.ఆదివాసీల సంప్రదాయాలను గౌరవించాలని, ప్రచార పిచ్చితో ఇలాంటి పనులు చేయవద్దని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 21 Jan 2026 10:14 pm

పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొవాలి

చదువులో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద సివిఆర్ హైస్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ జి. లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: రానున్న నెల రోజులు విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయమని విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ధైర్యంగా ఎదురుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పరీక్ష ఫలితాలలో పూర్తి స్థాయి లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులు పెట్టుకున్న సమ్మకాన్ని రెట్టింపు చేసేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని, జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ సూచించారు.విద్య సంవత్సరం ముగిసి పరీక్షలు నిర్వహించే సమయం మొదలవుతున్న […] The post పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Jan 2026 10:05 pm

గణతంత్ర వేడుకలకు సిద్ధంకండి

.–ప్రజలను చైత్యవంతులను చేసేలా శకటాల ప్రదర్శన The post గణతంత్ర వేడుకలకు సిద్ధంకండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Jan 2026 10:02 pm

అటల్ పెన్షన్ యోజన మరో ఐదేండ్లు

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అటల్ పెన్షన్ యోజన (ఎపివై) 2030-31 వరకూ కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలిలో కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశం తరువాత అధికారిక ప్రకటన వెలువరించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరిట ఈ పథకాన్ని 2015 మే 9వ తేదీన ప్రారంభించారు. దీని పరిధిలో ఇప్పటికే 8.66 కోట్లకు పైగా లబ్ధిదారులను చేర్చారు. పథకం 2030 -31 ఆర్థిక సంవత్సరం వరకూ అమలులోకి ఉంటుంది. అసంఘటిత రంగంలోని కార్మికులకు వయోవృద్ధ ఆదాయ భద్రతను కల్పించే ఉద్ధేశంతో ఈ పథకం తీసుకువచ్చారు. ఈ పథకానికి మరింత ప్రోత్సాహక నిధులు, కేటాయించడం జరుగుతుంది. అసంఘటిత కార్మికుల్లో మరింత ఎక్కువ మందికి ఈ సౌకర్యం కలిగేలా చేసేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ పథకం పరిధిలో కాంట్రిబ్యూషన్ ప్రాతిపదికన రూ 1000 నుంచి రూ 5000 వరకూ కనీస పింఛన్ కార్మికులకు వారి వృద్ధాప్యదశలో అందుతుంది. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చిన్న పరిశ్రమల ప్రోత్సాహానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత సిడ్బి బ్యాంక్‌కు రూ 5000 కోట్ల మేర ఈక్విటి సపోర్టు కల్పించే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. మూడు దఫాలుగా ఈ మొత్తాన్ని ఈ స్మాల్ ఇండిస్ట్రిస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అందించడం జరుగుతుంది. దీని వల్ల ఈ బ్యాంక్‌కు అదనపు పెట్టుబడి సమకూరుతుంది. ఈక్విటి సపోర్టుతో ఇకపై ఈ బ్యాంకు ద్వారా సముచిత వడ్డీరేట్లకు వీలేర్పడుతుంది. సూక్ష్మ, చిన్నతరహా , మధ్యస్థ పరిశ్రములు (ఎంఎస్‌ఎంఇ)లకు రుణాల కల్పన సెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈక్విటి కల్పన పెంచడం వల్ల కోటికి పైగా ఉద్యోగాలకు అవకాశం ఏర్పడుతుంది. 2027 28 ఆర్థిక సంవత్సరం చివరికి 25 లక్షలకు పైగా కొత్త ఎంఎస్‌ఎంఇ లబ్ధిదారులు చేరుతారని అధికారిక ప్రకటనలో తెలిపారు.

మన తెలంగాణ 21 Jan 2026 10:02 pm

Power Star |బాబాయ్ –అబ్బాయ్ కాంబో మూవీ..?

Power Star | బాబాయ్ – అబ్బాయ్ కాంబో మూవీ..? Power Star

ప్రభ న్యూస్ 21 Jan 2026 10:00 pm

సికింద్రాబాద్ జిల్లా అడిగితే అరెస్ట్ చేయించారు: కల్వకుంట్ల కవిత

సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగిన వాళ్లను గత పదేళ్లలో అణచివేసిన బీఆర్‌ఎస్ అణచివేసిందని, ఇప్పుడు ఆ జిల్లా కావాలని కేటీఆరే అడగటం విచిత్రంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఈ సమయంలో జిల్లాల పునర్విభజన అనేది సాధ్యంకాదన్న కవిత భవిష్యత్ లో ఈ ప్రక్రియ ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ ను జిల్లాగా చేయాల్సిందేనన్నారు. బీసీ కులాల పేర్లు, ఉపకులాలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చేయాల్సిన అధ్యయనాన్ని తామే చేస్తున్నామని, గుంపు మేస్త్రీపై నమ్మకం లేకనే ఈ పని చేస్తున్నామని కవిత తెలిపారు. బుధవారం తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జాగృతి ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీగా మారలేదన్నారు. అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో తమ మద్దతు కావాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యువత, మహిళలు ఎవరు కోరినా ఇస్తామని కవిత వెల్లడించారు.రాజకీయాల్లోకి రావాలనుకునేవారంతా మున్సిపల్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత, మహిళలు,బీసీలు, ఎస్సీలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా కవిత స్పందించారు. ఈ కేసు తుది దశకు చేరుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తనలాంటి బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదని వాపోయారు. ఇక ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలని, వాటితోపాటు ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాన్ని కూడా పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఆయన బడుగు, బలహీన వర్గాల కోసం ఎంతో పోరాటం చేశారన్నారు. అలాంటి ఉద్యమ నేతలెందరికో గత ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. జాగృతి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వస్తే శ్రీకాంతాచారి జయంతి, వర్థంతిని అధికారికంగా నిర్వహిస్తామని కవిత వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణనలో బీసీల సంఖ్యను తక్కువగా చూపి ప్రజలను మోసం చేసిందని కవిత ఆరోపించారు. ఇప్పుడు కేంద్రం చేపట్టనున్న కులగణనద్వారా ఆ మోసాన్ని బయటపెట్టే అవకాశం వచ్చిందని, అందుకోసం జాగృతి ముందడుగు వేస్తోందని, బీసీ మేధావులంతా జాగృతితో కలిసిరావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కావాలనే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తీసుకొచ్చారని కవిత ఆరోపించారు. గుంపు మేస్త్రీ, గుంట నక్క కలిసే ఉన్నారని, విచారణతో జరిగేదేమీ ఉండదన్నారు. మున్సిపల్ ఎన్నికలు పట్టణాల్లో జరుగుతాయి కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే ఈ డ్రామా ఆడుతున్నారన్నారు. ప్రజల పక్షాన పోరాడుతామంటున్న బీఆర్‌ఎస్ బీసీల కోసం ఎందుకు గొంతెత్తి ప్రశ్నించడం లేదని నిలదీశారు. అధికార కాంగ్రెస్ అయితే బీసీలకు న్యాయం చేయాలన్న విషయాన్ని గురించే ఆలోచించడం లేదన్నారు. ఈ రెండు పార్టీలు కలిసే బీసీలను మోసం చేస్తున్నాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని సూచించారు.

మన తెలంగాణ 21 Jan 2026 9:54 pm

ఒప్పో ఇండియా రెనో15 సిరీస్ ఆవిష్కరణ

The post ఒప్పో ఇండియా రెనో15 సిరీస్ ఆవిష్కరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Jan 2026 9:12 pm

నన్ను హత్య చేస్తే ..ఇరాన్ మిగలదు: ట్రంప్ వార్నింగ్

ఇరాన్ తనను హత్యచేస్తే , అమెరికా ఏకంగా మొత్తం ఇరాన్‌నే తుడిచిపెట్టేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుత దశలో ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ దశలో అమెరికా అధ్యక్షులు ట్రంప్ న్యూనేషన్స్ కేటి పావ్లిచ్‌కు ఇంటర్వూ ఇచ్చారు. తనకు ఇరాన్ ఎటువంటి హాని తలపెట్టినా , ఇకపై ఇరాన్ అనేది ఈ భూమిపై ఉండకుండా పోతుందని ట్రంప్ మంగళవారం ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. ఇరాన్‌ను శిక్షించేందుకు అవసరం అయిన ఆదేశాలను తాను ప్రెసిడెంట్‌గా ఇప్పటికే ఇచ్చినట్లు వివరించారు. ఖమేనీ, అమెరికా ప్రెసిడెంట్ మధ్య పరస్పర ఘాటు హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇరాన్ అశాంతికి ట్రంప్ కారణం అని ఇటీవల ఖమేనీ విమర్శించారు. కాగా తమ దేశ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీపై ఎటువంటి చర్య తీసకుకున్నా ఊరుకునేది లేదని ఇరాన్ హెచ్చరించింది. తమ నేతపై ఎటువంటి దాడికి దిగే చేతిని అయినా తాము నరికివేయడమే కాకుండా, అటువంటి వారి ప్రపంచాన్ని పూర్తిగా తగులబెడుతామని ఇరాన్ సాయుధ బలగాల అధికార ప్రతినిధి అబోల్ఫజల్ షెకర్చి హెచ్చరించారు. అంతకు ముందు ఖమేనీ పాలన ముగియాలని, అప్పుడే ఇరాన్‌కు శాంతి అని ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఇంటర్వూలో ట్రంప్ తీవ్రస్థాయి వ్యాఖ్యలు వెలువడ్డాయి.

మన తెలంగాణ 21 Jan 2026 9:10 pm

A Huge Relief for Sithara Entertainments

Young producer S Naga Vamsi was not satisfied with the performance of his films that released in 2025. The year ended up on a disastrous note because of Kingdom and Mass Jathara. For War 2, Naga Vamsi was brutally trolled. 2025 started on a decent note with NBK’s Daaku Maharaj but the year was quite […] The post A Huge Relief for Sithara Entertainments appeared first on Telugu360 .

తెలుగు 360 21 Jan 2026 9:09 pm

Top Tamil directors looking towards Telugu Cinema

Some of the top Tamil directors are now interested and keen to do Telugu films and work with top Tollywood actors. Here is the list: Atlee: After scoring a massive blockbuster like Jawan, Atlee is directing Allu Arjun and the film is in shooting mode. The film releases in summer 2027. Nelson: Jailer is one […] The post Top Tamil directors looking towards Telugu Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 21 Jan 2026 9:04 pm

సింగరేణి కాంట్రాక్టులు బిఆర్‌ఎస్ హయాం నాటివే..!: మహేష్‌కుమార్ గౌడ్

file name: fnzb1  గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ చేసిన అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే, ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బుదవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సింగరేణి కాలరీస్‌లో కాంట్రాక్ట్ విషయంలో సృజన్‌రెడ్డికి లబ్ధి చేకూరుస్తున్నారంటూ కేటీఆర్, హరీష్‌రావు చేస్తున్న ఆరోపణలు ‘పసలేనివి‘ కొట్టిపారేశారు. సృజన్‌రెడ్డికి దక్కిన కాంట్రాక్టులన్నీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చినవని, కాంగ్రెస్ ఇచ్చినవి కావని స్పష్టం చేశారు. సృజన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బంధువు కావచ్చు, కానీ నిబంధనల ప్రకారమే ఆయనకు గతంలో టెండర్లు దక్కాయని తెలిపారు. కేవలం బంధువు అయినంత మాత్రాన కాంట్రాక్టులు చేయకూడదనే నిబంధన ఎక్కడా లేదని అన్నారు. ‘మీ దగ్గర నిజాలుంటే చర్చకు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. అనవసరంగా కాంగ్రెస్ మీద బురదజల్లి పారిపోవాలని చూడకండి‘ అని సవాల్ విసిరారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఒక భయంకర నేరం. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. కేవలం రాజకీయ నాయకులవే కాకుండా, బడా వ్యాపారవేత్తలు, సినీనటుల వ్యక్తిగత విషయాల్లోకి కూడా దూర్చి వారిని బెదిరించారని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సైతం నమ్మకుండా వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని పేర్కొన్నారు. ఈ నేరంలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టేది లేదని, ప్రభుత్వం చట్టపరంగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. తెలంగాణను ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి, రాష్ట్రాన్ని దోపిడీకి గురిచేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని శాఖల్లో పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చామని, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల లబ్ధి కోసం అడ్డగోలుగా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఖాయం.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డిలు కేవలం దేవుడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘దేవుడి పేరు, శ్రీరాముని నామం స్మరించకుండా దమ్ముంటే ఎన్నికల బరిలోకి రావాలి. కేవలం అభివృద్ధి ప్రాతిపదికన ఓట్లు అడిగితే వీరికి పదివేల ఓట్లు కూడా రావు‘ అని సవాల్ విసిరారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన జిల్లాకు స్మార్ట్ సిటీని తెచ్చుకున్నారు. నిజామాబాద్ కంటే తక్కువ జనాభా, ఆలస్యంగా మున్సిపాలిటీ అయిన కరీంనగర్ స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకుంటుంటే.. అరవింద్ ఎందుకు స్మార్ట్ సిటీని తీసుకురలేకపోతున్నారని ప్రశ్నించారు. రెండోసారి ఎంపీగా గెలిచిన అరవింద్ ఈ జిల్లాకు ఏం తెచ్చారు?‘ అని సూటిగా ప్రశ్నించారు. నిజామాబాద్ అభివృద్ధిని గాలికొదిలేసి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ప్రస్తుతం అనుభవిస్తున్న స్థాయి, హోదా అంతా కాంగ్రెస్ పెట్టిన బిక్షేనని, విమర్శలు చేసే ముందు తన గతాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. తన పుట్టుపూర్వోత్తరాలు మర్చిపోయి మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డి. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో ఉండబట్టే మీ కుటుంబానికి ఈ ఆర్థిక స్థితిగతులు, గౌరవం దక్కాయి. మీ తండ్రి కాంగ్రెస్‌లో లేకపోతే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండేవారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామక్రిష్ణ, తాహిర్ బిన్ హందాని,గడుగు గంగాధర్, శేఖర్ గౌడ్,రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 21 Jan 2026 8:53 pm

Amazon mounting Pressure on Vijay’s Jana Nayagan

Vijay’s last film Jana Nayagan is yet to clear the censor formalities and the makers are yet to get a clarity on when the film will release. The Madras High Court has reserved the order but the date was not announced. The officials of the CBFC have sought 20 more days for the Revision Committee […] The post Amazon mounting Pressure on Vijay’s Jana Nayagan appeared first on Telugu360 .

తెలుగు 360 21 Jan 2026 8:46 pm

10% Cashback |మీ రోజువారీ ఖర్చులకు సరిపోయే రివార్డ్​లు!

10% Cashback ఫోన్‌పే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లో కొత్త దిశరోజువారీ ఖర్చులపై క్యాష్‌బ్యాక్:

ప్రభ న్యూస్ 21 Jan 2026 8:44 pm

తారక్‌కు స్వల్ప అస్వస్థత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రకటించిన దగ్గర నుండి ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు ఓ చిన్న బ్రేక్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. దానికి సంబంధించిన షూటింగ్ వరుసగా జరిగింది. ఈ చిత్రీకరణ సమయంలోనే ఎన్టీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వరుసగా షూటింగ్‌లో పాలుపంచుకోవడం వల్ల, వాతావరణం సరిగా లేక ఎన్టీఆర్ కు అనారోగ్యం వాటిల్లిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అందువల్ల హీరో విశ్రాంతి తీసుకున్నాకే షూటింగ్ ఆరంభిద్దామని డైరెక్టర్ నీల్ నిర్ణయించడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే, ఈ తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా రాత్రి సమయంలో ఈ షూటింగ్ నిర్వహిస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. తొలుత 2026 జనవరి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించినా, ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా అందాల భామ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మన తెలంగాణ 21 Jan 2026 8:25 pm

ఆర్గానిక్స్ మంత్ర ఎప్సమ్ సాల్ట్ రివ్యూ.. ఒళ్లు నొప్పులకు చెక్

కండరాల నొప్పులు, కాళ్ల వాపులకు ఆర్గానిక్స్ మంత్ర ఎప్సమ్ సాల్ట్ (Organix Mantra Epsom Salt) ఒక అద్భుతమైన పరిష్కారం. వేలాది మంది భారతీయులు నమ్ముతున్న ఈ ప్రోడక్ట్ నిజంగా అంత ప్రభావవంతంగా పనిచేస్తుందా? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎలా వాడాలో ఈ రివ్యూలో వివరంగా తెలుసుకుందాం. ఎప్సమ్ సాల్ట్ అంటే ఏమిటి? చాలామంది ఎప్సమ్ సాల్ట్ అనగానే మనం రోజూ తినే ఉప్పు అనుకుంటారు. కానీ ఇది పూర్తి భిన్నమైనది. ఇది మెగ్నీషియం సల్ఫేట్ […] The post ఆర్గానిక్స్ మంత్ర ఎప్సమ్ సాల్ట్ రివ్యూ.. ఒళ్లు నొప్పులకు చెక్ appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 21 Jan 2026 8:24 pm

మంత్రుల మధ్య వాటాల పంపిణీలో తేడాలు .. వెలుగులోకి సింగరేణి కుంభకోణం

“మంత్రుల మధ్య వాటాల పంపిణీలో తేడాలు రావడంతోనే సింగరేణి కుంభకోణం వెలుగులోకి వచ్చింది..” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి, కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణ అక్రమాలపై అనేక ఆరోపణలు వచ్చినందున సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తుందని ఆయన తెలిపారు. గతంలో బిఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని బంగారు బాతులా వాడుకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. కోల్ బ్లాకులకు సంబంధించి సిబిఐ దర్యాప్తు జరిపించకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమి చేస్తున్నారంటూ కొంత మంది తనను ప్రశ్నిస్తున్నారని అన్నారు. సిబిఐ విచారణకు తప్పని సరిగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుందన్న విషయం తెలుసుకోకుండా తనను విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు.గత కొన్ని రోజులుగా సింగరేణికి సంబంధించిన ఒడిశాలోని నైనికోల్ బ్లాక్‌పై చర్చ జరుగుతున్నదని ఆయన తెలిపారు. ఎనిమిది జిల్లాలకు పైగా విస్తరించిన సింగరేణి తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు.

మన తెలంగాణ 21 Jan 2026 8:19 pm

ఎమ్మెల్యే విజయుడును కొట్టలేదు, తిట్టలేదు: ఎంపీ మల్లు రవి

“బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడును నేను కొట్టలేదు, తిట్టలేదు, అనవసరంగా నాపై దుష్ప్రచారం చేస్తున్న వారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేపడతా&” అని నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. ఎమ్మెల్యే విజయుడు తాను అన్నాదమ్ముల్ల వలే కలిసి ఉంటామని ఆయన బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు.మంగళవారం అలంపూర్ నియోజకవర్గంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉండడంతో తాను ఎమ్మెల్యే విజయుడు కలిసి పాల్గొన్నామని ఆయన తెలిపారు. విజయుడు బిఆర్‌ఎస్ నుంచి గెలుపొందినా ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ నుంచి గెలవాల్సిన అవసరం లేదన్నారు. ఇద్దరమూ గెలుపొందినప్పటి నుంచి ప్రజల కోసం పని చేయాలన్న తపనతో ఉన్నామని ఆయన చెప్పారు. కాగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో శంకుస్థాపనం చేసేప్పుడు ఎమ్మెల్యే ముందుగా కొబ్బరి కాయ కొట్టిన తర్వాతే తాను కొట్టానని అన్నారు. తాను ప్రొటోకాల్ గురించి పట్టించుకోలేదని ఆయన తెలిపారు.ఈ సమయంలో ఎమ్మెల్యే అనుచరులమని చెప్పి కొందరు వచ్చి కొబ్బరి కాయల బస్తా ను లాక్కొని ఇక్కడ ఎవరూ ఉండడానికి వీల్లేదంటూ గొడవ చేశారని ఆయన చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారమే కొబ్బరి కాయలు కొట్టిస్తానని తాను వారికి చెప్పానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం తర్వాత కూడా వారు ఇలాగే కొబ్బరి కాయలు గుంజుకున్నారని ఆయన చెప్పారు. దీంతో ఇరు పార్టీల నాయకులు ఆగలేదని, పోలీసులు కొంత దూరంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్ణణ జరుగుతుందని తాను భావించి పోలీసులను పిలిచి కొంత గట్టిగా మాట్లాడానని అన్నారు. గొడవ జరగకుండా ఉండేందుకు తాను ఎమ్మెల్యేను కాస్త పక్కకు తీసుకెళ్ళానని ఆయన తెలిపారు. అంతేతప్ప తాను విజయుడిని ఒక్క మాట అనలేదని, కొట్ట లేదని డాక్టర్ మల్లు రవి వివరించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేనే అడిగి తెలుసుకోవాలని ఆయన అన్నారు. దళితునిపై దాడి జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. తప్పుడు ప్రచారం చేసిన ఒక పత్రికకు చెందిన యజమాన్యం, బిఆర్‌ఎస్ నాయకులూ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాను పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేపడతానని డాక్టర్ మల్లు రవి హెచ్చరించారు.

మన తెలంగాణ 21 Jan 2026 8:10 pm

వీధికుక్కలను చంపడాన్ని సహించబోం: మంత్రి సీతక్క

 కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలకు విష ప్రయోగం చేసి చంపినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సంబంధిత ఘటనలపై ఇప్పటికే పోలీసు కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నారని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో అమానుషంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, మానవత్వానికి పూర్తిగా విరుద్ధమని, ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. మూగజీవాలను విషం పెట్టి చంపడం వంటి దారుణమైన చర్యలు పూర్తిగా నేరమని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొన్ని గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయం స్థానిక సర్పంచుల దృష్టికి రావడం సహజమేనని, అయితే ఆ సమస్యకు పరిష్కారం అనేది చట్టబద్ధమైన, శాస్త్రీయమైన, మానవీయమైన మార్గాల్లోనే చేయాలి తప్ప అతి దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని హితువు పలికారు. వీధి కుక్కల నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకాలు, కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్) వంటి శాస్త్రీయ పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. మూకుమ్మడిగా విషం పెట్టి చంపడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నామని. బాధ్యులపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా, వీధి కుక్కల వల్ల సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, మానవీయత, చట్టబద్ధత, శాస్త్రీయతే ప్రభుత్వ విధానం అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

మన తెలంగాణ 21 Jan 2026 8:06 pm

CM Revanth |మహిళలకు 4 వందల కోట్ల ప్రమాద భీమా

CM Revanth | మహిళలకు 4 వందల కోట్ల ప్రమాద భీమా CM

ప్రభ న్యూస్ 21 Jan 2026 8:05 pm

అదరగొట్టిన అభిషేక్.. తొలి టి-20లో అర్థశతకం..

నాగ్‌పూర్: విదర్భా క్రికెట్ అసోసియేషన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టి-20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 18 పరుగుల వద్ద సంజూశాంసన్ (10) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే ఇషాన్ కిషన్‌(8) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. ఈ క్రమంలో 22 బంతుల్లో అర్థశతకం కూడా సాధించాడు. అయితే శాంట్నర్ వేసిన 11వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్(32) ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ (67), హార్థిక్ (4) ఉన్నారు.

మన తెలంగాణ 21 Jan 2026 8:03 pm

Maruthi |అసలు ప్లాన్ ఇదే..

Maruthi | అసలు ప్లాన్ ఇదే.. Maruthi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 21 Jan 2026 8:00 pm

Nizamabad |ధిత కుటుంబాలను పరామర్శ‌

Nizamabad | ధిత కుటుంబాలను పరామర్శ‌ Nizamabad | కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Jan 2026 7:53 pm

కొడవలితో దాడి కేసు – ముద్దాయి అరెస్ట్

రౌడీయిజం చేయాలని చూస్తే తాటతీస్తాం.. డిఎస్పి హెచ్చరిక విశాలాంధ్ర – హిందూపురం:హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలం, పులమతి పంచాయతీ పరిధిలోని సడ్లపల్లి గ్రామంలో ఈ నెల 19న ఓ వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన ఘటనలో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం డీఎస్పీ కె.వి. మహేష్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో సీఐలు జనార్ధన్, రాజగోపాల్ నాయుడు, ఎస్సై నరేంద్రలతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, హిందూపురం […] The post కొడవలితో దాడి కేసు – ముద్దాయి అరెస్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Jan 2026 7:49 pm

Gurukula |గురుకులాల దరఖాస్తు గడువు పెంపు

Gurukula | గురుకులాల దరఖాస్తు గడువు పెంపు Gurukula | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Jan 2026 7:48 pm

900 ration cards |ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం చేయూత

900 ration cards | ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం చేయూత 900 ration

ప్రభ న్యూస్ 21 Jan 2026 7:43 pm

అలా చేయడం ఓ వింత అనుభవం: రోహిత్ శర్మ

2024 టి-20 ప్రపంచకప్‌లో భారత్ విశ్వ విజేతగా నిలిచిన తర్వాత టీం ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టి-20 ఫార్మాట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో ప్రారంభంకానున్న టి-20 ప్రపంచకప్‌లో రోహిత్ పాల్గొనే అవకాశం లేదు. టోర్నమెంట్‌ ప్రారంభమైన తొలిసారి దూరం కావడంపై రోహిత్ ఎమోషనల్‌ అయ్యాడు. మొదటిసారి టి-20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఇంట్లో కూర్చొని చూడటం తనకు వింత అనుభవం అవుతుందన్నాడు. ‘‘టి-20 ప్రపంచకప్ గురించి మేం ఇంట్లో మాట్లాడుకుంటున్నాం. ఇంట్లో కూర్చొని మ్యాచ్‌లను చూడటం వింత అనుభవం. ఈ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు నేను ప్రతి ప్రపంచకప్‌లో భాగమయ్యాను. కాబట్టి.. ఇది భిన్నంగా అనిపిస్తుంది. వరల్డ్ కప్‌ను మిస్ అయినప్పుడు మనం అందులో ఆడట్లేదు కదా అని గుర్తొస్తుంది’’ అని రోహిత్ పేర్కొన్నాడు. 

మన తెలంగాణ 21 Jan 2026 7:39 pm

Video : Exclusive Interview with Producer Sushmita Konidela

The post Video : Exclusive Interview with Producer Sushmita Konidela appeared first on Telugu360 .

తెలుగు 360 21 Jan 2026 7:33 pm