అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి.
New York High-Rise Explosion Kills One, Sparks Safety Concerns
A gas explosion triggered a major fire in a 17-storey residential building in New York City’s Bronx early Saturday, killing one person and injuring 14 others, as freezing temperatures added to the emergency response challenges. Firefighters were called to the building shortly before 12.30 am after reports of a gas odour on the 15th and […] The post New York High-Rise Explosion Kills One, Sparks Safety Concerns appeared first on Telugu360 .
గుంటూరులో ప్రియుడి ఇంటిని తగలబెట్టిన ప్రియురాలు
అమరావతి: ప్రియుడిపై కోపంతో అతడి ఇంటిని ప్రియురాలు తగలబెట్టిన సంఘటన ఆంధప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుద్దపల్లి గ్రామంలో ప్రియుడు గత కొన్ని రోజులుగా ప్రియురాలును పట్టించుకోవడంలేదు. దీంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో కోపంతో ప్రియురాలు రగిలిపోయింది. దీంతో ప్రియుడి ఇంటిని ప్రియురాలు తగలబెట్టింది. దీంతో ప్రియుడు, అతడి భార్య, కుమారుడితో సహా మరో పది మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
గణతంత్ర వేడుకలకు భారత్ సిద్ధం.. దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి
77వ గణతంత్ర దినోత్సవానికి ముందుగా దేశవ్యాప్తంగా పలు నగరాలు దేశభక్తి కాంతులతో వెలిగాయి
సిరీస్పై భారత్ కన్ను.. నేడు కివీస్తో మూడో టి20
గౌహతి: న్యూజిలాండ్తో ఆదివారం గౌహతి వేదికగా జరిగే మూడో టి20 మ్యాచ్కు ఆతిథ్య భారత జట్టు సిరీస్పై కన్నెసింది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్పై కైవసం చేసుకోవాలనే యోచిస్తోంది. తొలి రెండు టి20లో ఓడిన న్యూజిలాండ్కు ఈ మ్యాచ్ చాఓరేవోగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచి తిరిగి సిరీస్పై పట్టు సాధించాలనే పట్టుదలతో కివీస్ బిరలోకి దిగుతోంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగడం ఖాయం. నాగ్పూర్ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఇక రాయ్పూర్ సయితం ఇరు జట్టు పరుగుల వరదపారించాయి. ఈసారి కూడా బ్యాటింగ్పైనే రెండు జట్లు ఆశలు పెట్టుకున్నాయి. తొలి టి20లో భారత యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయినా.. రెండో టి20లో త్వరగా పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లు అసాధారణ బ్యాటింగ్తో జట్టును గెలిపించారు. ఈసారి కూడా ఈ బ్యాటింగ్ త్రయంపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే రెండో టి20 మ్యాచ్లోనూ సంజు శాంసన్ విఫలం కావడం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈసారైనా వీరు తమ బ్యాట్లకు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రింకు సింగ్, హార్దిక్ పాండ్యలు ఫామ్లో ఉండడం భారత్కు ఊరట కలిగించే అంశం. తొలి మ్యాచ్లో రింకు మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. భారత్ భారీ స్కోరు సాధించినా బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఫీల్డింగ్ చాలా పేలవంగా సాగింది. ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దు కోక తప్పదు. బౌలర్లు కూడా మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. తప్పక గెలవాల్సిందే.. మరోవైపు రెండు టి20ల్లోనూ ఓడిన న్యూజిలాండ్ గౌహతి మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో గెలిచి సిరీస్పై పట్టు సాధించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగానే ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో కివీస్ కూడా విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది.
Atchannaidu |ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం..
Atchannaidu | ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం.. Atchannaidu, శ్రీకాకుళం, ఆంధ్రప్రభ
ఆ వ్యవస్థ ఇప్పుడు మనకు అవసరమా అన్న చర్చ ప్రస్తుతం దేశంలో పెద్దయెత్తున సాగుతున్నది. ఈ చర్చ ఇవాళ కొత్తగా ప్రారంభమైంది కాదు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ అధికారం చలాయించినంత కాలం దీనిమీద పెద్ద వివాదం లేదు. జాతీయ స్థాయిలోనూ, ప్రాంతాలవారీగాను కొత్త రాజకీయశక్తులు పుట్టుకొచ్చిన దగ్గరనుండి ఈ వ్యవస్థ విమర్శలకు గురయ్యే విధంగా తయారైంది. ఇప్పుడు అసలు ఈ వ్యవస్థ అవసరమా అన్న చర్చ జరగాల్సి ఉన్నది. ఒకవేళ అవసరమైతే దీనిలో చేయవలసిన మార్పులు చేర్పులు ఏమిటి అన్న విషయంపై పార్లమెంట్ సీరియస్గా చర్చించాలి. ఆ వ్యవస్థే.. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కాకుండా ఇతర రాజకీయపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతున్న గవర్నర్ల వ్యవస్థ. కేంద్రంలో మూడోసారి వరుసగా అధికారంలోకి వచ్చిన ఎన్డిఎ కూటమి గవర్నర్లు బస చేసే రాజభవన్ల పేరును లోక్ భవన్లుగా మార్చిందే తప్ప ఆ భవన్లలో కూర్చుని పని చేసే గవర్నర్ల విధివిధానాల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది పాత సీసాకు కొత్త లేబుల్ అతికించినట్లు ఉంది తప్ప మరొక ప్రయోజనం ఏమీ లేదు. అసలు ఈ గవర్నర్ల వ్యవస్థ మన ఆలోచన కాదు. ఇతర అనేక విషయాల్ని పోతూపోతూ మన నెత్తిన రుద్దినట్టే ఈ గవర్నర్ల వ్యవస్థను కూడా బ్రిటిష్ పాలకులే మనకు అందించి పోయారు. దేశానికి స్వతంత్రం లభించిన సమయంలో, రాజ్యాంగాన్ని రాసుకునే క్రమంలో గవర్నర్లను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని ముసాయిదా పత్రంలో పేర్కొన్నారు. కానీ రాజ్యాంగ పరిషత్ మాత్రం దాన్ని మార్చి గవర్నర్లను కేంద్ర మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్రపతి నియమించే పద్ధతిని ఎంపిక చేసింది. గవర్నర్ల వ్యవస్థ మీద ఏర్పాటు చేసిన సర్కారియా కమిషన్ సూచించిన ప్రవర్తన నియమావళి ప్రకారం క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవారిని గవర్నర్లుగా నియమించకూడదు. గవర్నర్ల నియామకాల్లో ముఖ్యమంత్రిని సంప్రదించాలి. కేంద్రప్రభుత్వాలు ఈ రెండు సూచనలు తప్ప ఇంకా ఏవేవో ప్రాధాన్యతల్ని పరిగణనలోకి తీసుకొని గవర్నర్లను నియమిస్తున్నాయి. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న రాష్ట్రప్రభుత్వాలకు, కేంద్రం నియమించే గవర్నర్లకు మధ్య ఘర్షణ నేడు కొత్తగా జరుగుతున్నది కాదు. ఈ జాడ్యం కాంగ్రెస్ నుండే బిజెపి వారసత్వంగా అందుకున్నది. ఎన్డిఏయేతర పక్షాలు అధికారంలో ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇటీవల గవర్నర్లు వ్యవహరించిన తీరు మళ్లీ ఒకసారి చర్చకు తెరలేపింది అంతే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176(1) కింద శాసనసభ సమావేశాల తొలిరోజున గవర్నర్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించాలి. శాసనమండలి కూడా ఉన్న రాష్ట్రాల్లో అయితే ఉభయసభల సభ్యుల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన ప్రసంగించాలి. గవర్నర్ ప్రసంగపాఠాన్ని రాష్ట్ర మంత్రిమండలి రూపొందిస్తుంది. గవర్నర్ గారికి బయట ఏ రాజకీయాలు ఉన్నా అక్కడ మాత్రం తన ప్రభుత్వ నివేదికగానే ఆ ప్రసంగం చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో, డిఎంకె పాలనలో ఉన్న తమిళనాడులో, కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న కేరళలో గవర్నర్లు శాసనసభ్యులను ఉద్దేశించి సమావేశాల మొదటి రోజున చేసే ప్రసంగంలో తమకు నచ్చనివి చదవకుండా వదిలేయడం, మార్చుకోవడం చేస్తున్నారు. అర్ధంతరంగా శాసనసభల నుండి వాకౌట్లు కూడా చేస్తున్నారు. సాధారణంగా చట్టసభల్లో ప్రతిపక్ష సభ్యులు తమ వాదన వినిపించే అవకాశం లేకపోతేనో, తమకు అన్యాయం జరుగుతుందని భావిస్తేనో వాకౌట్లు చేస్తుంటారు. ఇప్పటి గవర్నర్లు చిత్రంగా తామే వాకౌట్ చేసి ప్రతిపక్ష సభ్యులు కూడా ముక్కున వేలేసుకునేట్టు చేస్తున్నారు. గవర్నర్లను నియమించే అధికారం కేంద్రప్రభుత్వానికి ఉన్నప్పటికీ గవర్నర్ కేంద్రానికి అధీనుడేం కాదు. కేంద్రం ఏజెంటూ కాడు. అది స్వతంత్ర రాజ్యాంగ పదవి అని 1997లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే రాజకీయ ప్రయోజనాలతో నియమితులయిన గవర్నర్లు సుప్రీంకోర్టు తీర్పును ఆసరా చేసుకుని స్వతంత్రంగా వ్యవహరిస్తారని ఆశించలేం కదా. గవర్నర్లందరూ ఇలాగే ఉంటారు అనడానికి లేదు. స్వతంత్రంగా వ్యవహరించి ఆ పదవికి వన్నెతెచ్చిన, తెస్తున్న గవర్నర్లు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి రాజకీయ ప్రయోజనాల్ని కాపాడేందుకు అహర్నిశలు శ్రమించే గవర్నర్లు మనకి ఎక్కువగా కనిపిస్తారు. పశ్చిమబెంగాల్లో గవర్నర్గా ఉన్నప్పుడు జగదీప్ ధన్కడ్ వ్యవహరించిన తీరైనా, కేరళ గవర్నర్గా అప్పట్లో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అడుగడుగునా అడ్డుపుల్లలు వేసిన ఉదంతమయినా మన కళ్ళ ముందు ఉన్నాయి. గవర్నర్ల వ్యవహారశైలి పట్ల అభ్యంతరపెడుతూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ మధ్య సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వాలు ఆమోదం కోసం పంపే బిల్లులను గవర్నర్ల దగ్గర మూడు మాసాలకు మించి పెండింగ్లో ఉన్నట్లయితే అవి ఆమోదం పొందినట్టుగానే భావించాలన్నది ఆ తీర్పు సారాంశం. అయితే సుప్రీంకోర్టు ఆ తర్వాత కాలంలో దానిని ఉపసంహరించుకోవడం గమనార్హం. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఎంపిక చేసి మరీ కొంతమందిని గవర్నర్లుగా పంపడం మామూలే. ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో గవర్నర్లకు రాష్ట్రాలను ఇబ్బందిపెట్టే అధికారాలు ఉన్నాయి. ఏ అధికారాలూ లేకపోతే ఇక గవర్నర్ల వ్యవస్థ ఎందుకు అని కూడా ఎవరైనా అనొచ్చు. గవర్నర్ల వ్యవస్థ అవసరమే, అయితే ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు పరిపాలన సాగించే క్రమంలో రాజకీయంగా వారిని ఇబ్బంది పెట్టడానికి గవర్నర్లు ఆ అధికారాలను దుర్వినియోగం చేయకుండా చూసేందుకు అవసరమైన సంస్కరణలు రావాలి. కేరళలో ఏర్పాటైన మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు గవర్నర్ పంపిన నివేదికను ఉపయోగించుకోవడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇంకా మన స్మృతిపథంలోంచి చెరిగిపోని సంఘటన 1984 లో ఎన్టి రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా గద్దె దింపి, తగినంత బలం లేకపోయినా నాదెండ్ల భాస్కరరావు చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన రామ్ లాల్ తెలుగు ప్రజల దృష్టిలో ఎప్పటికీ విలన్గానే మిగిలిపోతాడు. నెల రోజుల తర్వాత కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ పొరపాటు గ్రహించి మళ్లీ ఎన్టి రామారావుకు అధికారం అప్పగించడానికి శంకర్ దయాళ్ శర్మను గవర్నర్గా పంపించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వచ్చిన కుముద్ బెన్ జోషి గవర్నర్ గా తన బాధ్యతలకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఎన్టి రామారావును చికాకు పరచడానికి, ఇబ్బంది పెట్టడానికి రాజభవన్ నుండి సమాంతర ప్రభుత్వం నడిపారన్న విమర్శ పెద్ద ఎత్తున వచ్చింది. ఇవన్నీ ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ తానే గవర్నర్లకు స్వయంగా చెప్పి చేయించారా అంటే, వారిచ్చిన తప్పుడు నివేదికల ప్రభావంతో ఆమె నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చునని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితుల గురించి కేంద్రానికి గవర్నర్లు నివేదిక ఇవ్వడం సహజం. అయితే అవి వాస్తవాలమీద ఆధారపడినవై ఉండాలి. అలా కాకుండా కేంద్రం మెప్పు పొందడానికి లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షం యొక్క రాజకీయ ప్రయోజనాలను కాపాడటానికి నివేదికలు ఇస్తే గవర్నర్ల వ్యవస్థకు విశ్వసనీయత కొరవడుతుంది. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దశాబ్దానికి పైగా గవర్నర్గా పని చేసిన ఇఎస్ఎల్ నరసింహన్ను గుర్తు చేసుకోవాలి. యుపిఎ హయాంలో తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం తారస్థాయిలో ఉండగా గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన నరసింహన్ రాష్ట్రం విడిపోయాక ఎన్డిఎ హయాంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకూ క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు నిర్వహించి ఎప్పటికప్పుడు కేంద్రానికి వాస్తవ నివేదికలను అందించిన విషయం తెలిసిందే. పూర్తిగా రాజకీయాల్లో తలమునకలై ఉండేవారిని పునరావాసం కోసం గవర్నర్లుగా నియమిస్తే ఏం జరుగుతుందో కూడా చరిత్రలో రికార్డు అయి ఉంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రాజకీయాల్ని శ్వాసించేవారు.. శాసించేవారు కూడా. ఆయనను ఖాళీగా ఉంచలేక కాంగ్రెస్ పార్టీ తమిళనాడు గవర్నర్ గా పంపిస్తే రాజకీయంగా అత్యంత బలవంతురాలైన ఎఐఎడిఎంకే అధినేత్రి, అప్పటి ముఖ్యమంత్రి జయలలితను ముప్పుతిప్పలు పెట్టిన విషయం మరచిపోగలమా! గవర్నర్ను రీకాల్ చేయాల్సిందిగా ఆమె ప్రధానమంత్రి పివి నరసింహారావుకు, రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు విన్నవించుకునే దాకా పరిస్థితిని తీసుకుపోయారు. అప్పట్లో చెన్నారెడ్డి జనతా పార్టీ నాయకుడిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి జయలలిత మీద చేసిన అవినీతి ఆరోపణల మీద విచారణకు అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఆగ్రహించిన జయలలిత అభిమానులు, పార్టీ కార్యకర్తలు గవర్నర్ చెన్నారెడ్డి కాన్వాయ్ మీద గుడ్లు, రాళ్లు విసిరిన విషయం పత్రికలు ప్రచురించాయి. చెన్నారెడ్డి అంతకుముందు కూడా ఉత్తరప్రదేశ్ గవర్నర్గా 1974 నుంచి 77 వరకు పనిచేసి 78లో ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ (ఐ) రాష్ట్ర అధ్యక్షుడై, ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. ఇలా రాజకీయాల్ని ఇంకా వదిలిపెట్టనివాళ్లను గవర్నర్లుగా నియమిస్తే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలంగాణ గవర్నర్గా తమిళిసైని నియమించినప్పుడు చూశాం. తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసైని తెలంగాణ గవర్నర్గా నియమించి అక్కడి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టిన తర్వాత ఆమెను మళ్లీ తమిళనాడుకు తీసుకుపోయి శాసనసభకు పోటీ చేయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న కాలానికి, మళ్లీ శాసనసభ్యురాలిగా పోటీచేసే కాలానికి మధ్య స్వల్ప కాలమైనా గవర్నర్గా ఆమె రాజకీయాలను ఎలా మర్చిపోగలరు? ఇలాంటి ఉదంతాలు అనేకం. గవర్నర్ల దాష్టీకాన్ని అనుభవించిన కారణంగానే ఎన్టి రామారావు కేంద్రం మిథ్య అన్నారు, గవర్నర్ల వ్యవస్థను రద్దు చెయ్యాల్సిందేనని కూడా పలుమార్లు కోరారు. రాష్ట్రాల సమూహమే కేంద్రం. మనది ఫెడరల్ వ్యవస్థ అయినప్పటికీ స్వతంత్ర రాజ్యాలు కావు కాబట్టి కేంద్రం ఉంటుంది, తప్పదు. అయితే స్వతహాగా ఆవేశపరుడయిన ఎన్టిఆర్ గవర్నర్ల వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని సూచించలేకపోయారు. రాష్ట్రప్రభుత్వాలపట్ల గవర్నర్లు రాజకీయ కారణాలతో కక్షసాధింపు ధోరణి అవలంబించకుండా సుప్రీంకోర్టు ఒక సందర్భంలో చెప్పినట్టు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ (స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శి) గా ఉండేందుకు అనువయిన సంస్కరణలు రాకపోతే గవర్నర్ల వ్యవస్థ మరింత అపకీర్తి మూట కట్టుకోక తప్పదు. దేవులపల్లి అమర్
మన తెలంగాణ/ నాంపల్లి: నాంపల్లి స్టేషన్ రోడ్డు లో బచాస్ ఫర్నిచర్ క్యాజిల్ దుకాణం, గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తొలుత సె ల్లార్లో ఒక్కసారిగా నల్లటి పొగలు, అగ్నికీలలు వ్యాపించి క్రమంగా పైన నాలుగు అంతస్తుల వర కూ ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఫర్నిచర్, వస్తువు లు, ఇతర సామగ్రి అగ్నికీలల్లో బుగ్గిగా మారాయి. రూ.కోట్ల మేర నష్ఠం వాటిల్లినట్టు అంచనా. ఘట న శనివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంటన్న ర సమయంలో సంభవించింది. సెల్లార్లో ఇద్దరు చిన్నారులు సహా మరో నలుగురు చిక్కుకున్నారు. వారు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడటంతో.. వారి కుటుంబాల రోదనలు మిన్నంటాయి. రాత్రి సమయం వరకూ లోపలున్నవారి పరిస్థితి స్పష్ఠత లేదు. దీంతో దేవుడిపై భారం వేసి.. టెన్షన్కు గురయ్యారు. వారిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు ఫైరింజిన్, పోలీసులు, హైడ్రా ఇతర సిబ్బంది శతవిధాలా యత్నిస్తున్నారు. ఈ ఘటన ప్రమాదం గురించి స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..భవనం నిబంధనలకు విరుద్ధంగా కట్టారు. సెట్ బ్యాక్ లేదు. భద్రత పరికరాలు లేవు. దీంతో పోలీసులు, ఫైరింజిన్ సిబ్బంది గంటలపాటు శ్రమించాల్సిన పరిస్థితి.. సెల్లార్లో షార్ట్ సర్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు భావిస్తున్నారు. సెల్లార్లో మంటలతోపాటు దట్టమైన పొగ వ్యాపించాయి. అక్కడే ఉంటున్న వాచ్మెన్ యాదయ్య పిల్లలు అఖిల్(7) ప్రణిత(11) చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లి పలువురు కూడా మంటలు, ఘాటైన పొగకు ఉక్కిరిబిక్కిరై అక్కడే చిక్కుకున్నారు. ఇందులో వృద్ధురాలు సైతం ఉందని పలువురు చెబుతున్నారు. సమాచారం అందగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైరింజిన్లు, హైడ్రా వాహనాలు, అంబులెన్సులను రప్పించారు. ప్రమాదం తీవ్రత.. తీవ్రస్థాయిలో మంటలు నాలుగు వైపులా పైకి ఎగిసి పై అంతస్తులకు వ్యాపించాయి. అందులోంచి పెద్దఎత్తున దట్టమైన పొగతో కూడిన మంటలు చెలరేగాయి. అరుపులు, రోదనలతో భవనంలో మిన్నంటాయి. పై అంతస్తుల్లో ఉన్న సంతోష్ అనే యువకుడు మెట్ల ద్వారా కిందికి సురక్షితంగా వచ్చేశారు. మరికొందరు టెండర్ పేరుతో పిలిచే కుక్కను కూడా కిందికి తీసుకొచ్చారు. మంటలు, పోగలు ఆలుముకోవడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఫర్నీచర్ దుకాణంలో పలువురు మహిళలు బయటికి వచ్చేశారు. లోపల సెల్లార్లో ఐదు నుంచి ఆరు మంది వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు ఐదు కోట్ల వరకు ఫర్నీచర్లు, వస్తువులు, ఇతర పరికరాలు మంటల దాటికి కాలిపోయాయి. ఫైరింజన్లతో మంటలు ఆదుపు నగరంలో వివిధ చోట్ల నుంచి ఒకే సారిగా 15 ఫైరింజిన్లు, హైడ్రా వాహనాలను రంగంలోకి దించారు. పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది. ఇతర శాఖ అధికారులు సమన్వయంతో రెస్యూ ఆపరేషఫన్ను ప్రారంభించారు. క్రేన్ సహయంతో స్కై లిఫ్టర్తో అద్దాలు ధ్వంసం చేశారు. జేసీబీతో గోడలు బద్దలు కొట్టారు. తర్వాత ఫైరింజిన్ పైపులతో నీళ్లను పైకి అంతస్తులోకి పంపించారు. వెంటనే భయంకర మంటలు, దట్టమైన పొగలతో ఈ ప్రాంతాన్ని చుట్టాముట్టాయి. ఈ ప్రమాదం దృష్టా ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అబిడ్స్ వైపు నుంచి నాంపల్లి పబ్లిక్గార్డెన్స్ వచ్చే వాహనాలను నిలిపేశారు. సహాయ చర్యల్లో వివిద శాఖల సిబ్బంది గంటల కొద్ది శ్రమించాల్సి వచ్చింది. పక్కనే ఉన్న భవనాల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు, ఇతరులకు కిందికి వచ్చేశారు. కొన్ని దుకాణాలు మూసేశారు. మంటలు పక్కనే ఉన్న భవనాలకు వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. పక్కనే విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సహాయక చర్యలు సమీక్షించిన సజ్జనార్ ప్రమాదం తీవ్రత దృష్టా లోపలికి, పై అంతస్తులకు దారి లేక లోపల మంటలు, పొగలు వ్యాపించాయి. పైరింజిన్ సిబ్బంది లోపలికి వెళ్లడానికి దారి లేదు. దీంతో వారు రోబో ఫైర్ మిషన్, భారీ క్రేన్, జేసీబీలను ఉపయోగించారు. ఘటనా స్థలికి నగర పోలీస్ కమిషన్ సజ్జనార్ సందర్శించారు. ఆగ్ని ప్రమాదం జరగడానికి వెనకాల కారణాలు అడిగి తెల్సుకున్నారు. అక్కడే ఉండి సహయ చర్యలను సమీక్షించారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని, మంటలను త్వరితంగా అదుపులోకి తెచ్చేందుకు అధికారులు అన్నిరకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పక్కనే నూమాయిష్ జరుగుతుండటంతో సందర్శకులు ఒక రోజూ తన పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోవడం నూమాయిష్ వద్ద ట్రాఫిక్ తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, డీసీసీ శిల్పా వల్లి తదితరులు సందర్శించారు.
25th jan 2026 | నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు
25jan Rathasaptami |సప్తాశ్వరథమారూఢం.. సకల వ్యాధినాశకం!
25jan Rathasaptami | సూర్యారాధనలోని శాస్త్రీయ అర్థం వేదాలలో ఆదిత్యుడు – అరుణం
పెద్దన్న పెత్తనానికి చెల్లుచీటి
పెట్టుబడిదారీ దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, ఆ దేశాలమధ్య వైరుధ్యాలను సృష్టించింది. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ యుద్ధాలకు మద్దతు ఇస్తూ వచ్చిన నాటో కూటమి దేశాలు నేడు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. వెనెజువెలా పై అమెరికా దాడిని, గ్రీన్లాండ్ ను ఆక్రమిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనను ఇయు దేశాలు వ్యతిరేకించాయి. అమెరికా విధానాలు నాటో విచ్ఛిన్నానికి దారి తీస్తుందని పేర్కొన్నాయి. స్టాలిన్ నాయకత్వాన ఉన్న సోవియట్ యూనియన్ అన్ని రంగాల్లో దూసుకుపోవడమే కాకుండా, సైనిక శక్తిలో అమెరికాను ఢీ కొనగలిగిన సామర్థ్యం కలిగి ఉండటం, అల్బేనియా, రుమేనియా, ఉత్తరకొరియా తదితర దేశాలు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాలుగా ఉండటం, చైనాలో మావో నాయకత్వాన విప్లవం చివరి విజయానికి చేరుకోవడం, అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడి బలమైనశక్తిగా మారడంతో భయపడిన అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ తదితర 12 దేశాలతో, సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా 1949లో ‘నాటో’ (నార్త్ అట్లాంటిక్ ట్రీ టీన్) కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిలోని దేశాల ప్రధాన ఉద్దేశం వెనకబడిన దేశాల సహజ వనరుల దోపిడీలో భాగం కోసమే. నాటో సభ్యదేశాల్లోని ఏ దేశంపైనైనా మరో దేశం దాడి చేస్తే, తమపై దాడిగానే భావించి మిగిలిన సభ్యదేశాలు, ఆ దేశానికి అండగా ఉండాలన్నది నాటో ఏర్పాటు ఉద్దేశం. అంతేకాకుండా ఒక నాటో దేశం వేరొక దేశంపై దాడి చేసినా అందుకు మద్దతుగా ఉండాలి. ఇతర దేశాలపై దాడులు చేస్తున్నది అమెరికా, తదితర పెట్టుబడిదారీ దేశాలే అన్నది గమనించాలి. తన దురాక్రమణ దాడులకు మద్దతుగా నాటో దేశాలు ఉండాలన్నదే అమెరికా ఉద్దేశం. పెట్టుబడిదారీ విధానాల పునరుద్ధరణ ఫలితంగా ఏర్పడిన ఆర్థ్ధిక, రాజకీయ సంక్షోభం ఫలితంగా 1991లో సోవియట్ యూనియన్ పతనమై అనేక దేశాలుగా ఏర్పడ్డాయి. సోవియట్ పరిణామాల తర్వాత తూర్పు ఐరోపాలోని అనేక దేశాలు నాటోలో చేరాయి. వాటిల్లో సోషలిజానికి తిలోదకాలు ఇచ్చి పెట్టుబడిదారీ విధానాన్ని చేపట్టిన అల్బేనియా, బల్గేరియా, రుమేనియా, చెక్రిపబ్లిక్తోపాటు హంగరీ, పోలెండ్ తదితర దేశాలు నాటో పంచన చేరాయి. తటస్థంగా ఉన్న ఫిన్లాండ్ 2023లో, స్వీడన్ 2024లో నాటోలో చేరటం జరిగింది. ఉక్రెయిన్ నాటోలో చేరటానికి దరఖాస్తు చేసింది. అమెరికా ప్రపంచ ఆధిపత్య విధానాల్లో భాగంగా అనేక దేశాల్లోని సహజ వనరులను తరలించుకుపోవడానికి అడ్డంకిగా ఉన్న దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేసింది. 2001లో అఫ్ఘానిస్థాన్పై దాడి చేసింది. 1999లో యుగోస్లేవియా (యుగోస్లేవియా- కొసావో యుద్ధం)పై వైమానిక దాడులు చేసింది. చమురు నిల్వలు తరలించుకుపోవడానికి ఇరాక్పై దాడిచేసి సద్దాం హుస్సేన్ని ఉరితీసింది. జెలెనె స్కీని రెచ్చగొట్టి ఉక్రెయిన్ రష్యాతో యుద్ధానికి తలపడేలా చేసి ఆయుధాలు సప్లయ్ చేస్తూ యుద్ధం ఆరకుండా చేస్తున్నది. ఈ దాడులన్నీ అమెరికా ఆధిపత్య దోపిడీ విధానాల్లో భాగమే. అమెరికా దాడులకు నాటో మద్దతు ఇస్తూ వచ్చింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని సృష్టించిన అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేయరాదని నాటో దేశాలపై కూడా ఆంక్షలు పెట్టటం వల్ల అమెరికా ఎడల నాటో దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ట్రంప్ ఆంక్షలు తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని భావించాయి. వెనెజువెలాపై అమెరికా దాడితో కూటమి దేశాల్లో ఉన్న వ్యతిరేకత బయటపడింది. నాటోలోని ముఖ్య పెట్టుబడిదారీ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా మొదలైన దేశాలు అమెరికా దాడిని వ్యతిరేకించాయి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగి డెన్మార్క్ భూభాగంలో అంతర్భాగంగా ఉన్న గ్రీన్లాండ్ను అమెరికాలో కలుపుకుంటామని, తమ దేశభద్రతకు గ్రీన్ లాండ్ అవసరమని, అందుకు అంగీకరించకపోతే దాడి చేసి ఆక్రమిస్తామని, బలపరచని దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి 10% దిగుమతి సుంకం విధిస్తానని, ఆ తర్వాత కూడా ఒప్పందం కుదరకపోతే జూన్ నుంచి 25% సుంకం విధిస్తానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను నాటో దేశాలు తీవ్రంగా ఖండించాయి. తన దేశప్రయోజనాలకు విరుద్ధంగా ఏ దేశం ఉన్నా సహించని ట్రంప్ చెప్పడమే కాకుండా గ్రీన్లాండ్ విషయంలో తనకు మద్దతు ఇవ్వని నాటో కూటమి దేశాలకు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశాడు. దీన్ని గమనిస్తే నాటో కూటమి తన ప్రయోజనాలను మాత్రమే కాపాడాలని, అందుకు విరుద్ధంగా ఏ దేశం ఉన్నా సహించని ట్రంప్ హెచ్చరిక చేయడం అగ్ర రాజ్య దురహంకారానికి, నాటో దేశాల వెడల చులకన భావనికి నిదర్శనం. ట్రంప్ హెచ్చరికలను ఐరోపా సమాఖ్య దేశాలు తీవ్రంగా పరిగణించాయి. తీవ్ర పదజాలంతో ఖండించాయి. దావోస్ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశాన్ని అందుకు వేదిక చేసుకున్నాయి. ట్రంప్ సమావేశానికి రాకముందే వివిధ దేశాల నేతలు ట్రంప్ విధానాలను దుయ్యబట్టారు. అమెరికా నాయకత్వాన ఉన్న ప్రపంచ వ్యవస్థకు ముగింపు పలికి ఐక్యంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి. బలవంతుల చట్టానికి లొంగిపోకూడదని, బెదిరింపులకు బదులు గౌరవాన్ని కోరుకుంటున్నామని, గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వైఖరి నాటో కూటమికి చేటుచేస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పేర్కొన్నాడు. అమెరికా చెప్పే గాజా శాంతి బోర్డులో చేరటానికి ఫ్రాన్స్ నిరాకరించింది. ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యూరప్ స్వాతంత్య్రంపై ఏకాభిప్రాయం పెరిగిందని, ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ తెలిపాడు. బెల్జియం ప్రధాన మంత్రి బార్ట్ డి వెవర్ మాట్లాడుతూ 27 దేశాల ఐరోపా సమాఖ్య ఒక కూడలిలో ఉందని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా మద్దతు, తర్వాత ఎదుర్కొన్న దారుణ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో నిర్ణయించుకోవాలన్నాడు. సంతోషకరంగా ఉండటం ఒక విషయం కాగా, దుర్భరమైన బానిసగా ఉండటం మరొకటి అని ట్రంప్ సుంకాలపై బెదిరింపుల గురించి డి వెవల్ వ్యాఖ్యానించాడు. అమెరికా నాయకత్వంలోని ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక విచ్ఛిన్నాన్ని ఎదుర్కొంటున్నదని కెనడా ప్రధాని మార్క్ కార్నీ సూటిగా వ్యాఖ్యానించాడు. మనం పరివర్తనలో కాదు విచ్ఛిన్నంలో ఉన్నామని, అంతర్జాతీయ నియమాల ఆధారిత క్రమం పాక్షికంగా అబద్ధమని మాకు తెలుసు. బలవంతులు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు తమకు తాము మినహాయించుకుంటారు. వాణిజ్య నియమాల అమల్లో అసమానంగా వ్యవహరిస్తారు అంటూ ట్రంప్ గురించి వ్యాఖ్యానించాడు. తమ దేశసార్వభౌమత్వ అంశాన్ని ఇతరులతో చర్చించాల్సిన అవసరం లేదని డెన్మార్క్ మహిళా ప్రధాని మెటె ఫెడరిక్షన్ చెప్పారు. దావోస్లో ట్రంప్ను కలవకుండానే డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, యుకె నేతలు స్వదేశాలకు బయలుదేరారు. అమెరికా సామ్రాజ్యవాదం అణ్వస్త్రాల బూసిని చూపి ప్రపంచ పెత్తనం కోసం అర్రులు చాస్తోంది. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు కూడా చెప్పుచేతుల్లో ఉండాలని, తన ప్రయోజనాలు కాపాడాలనే విధంగా వ్యవహరిస్తున్నది. అమెరికా ఆధిపత్య విధానాల ఫలితంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మొదలైన పెట్టుబడిదారీ దేశాల దోపిడీ ప్రయోజనాలు దెబ్బ తింటూ వచ్చాయి. అమెరికాపై గుర్రుగా ఉన్నాయి. ఇవి కూడా సామ్రాజ్యవాద కాంక్షగల దేశాలు కావడమే అందుకు కారణం. తమ దేశాల్లో కూడా ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు ఏర్పడి సమస్య వలయంలో చిక్కుకున్న ప్రజలు వీధి పోరాటాలకు దిగుతున్నారు. అమెరికా దురాక్రమణ యుద్ధాలకు మద్దతు ఇవ్వరాదని ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇది తమ అధికారానికే ప్రమాదమని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలు భావించాయి. వీటన్నిటి ఫలితమే అమెరికాకు వ్యతిరేకంగా ఈ దేశాలు ముందుకు రావడం, అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ విధానాలను వ్యతిరేకిస్తూ, గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి, పూర్తి స్వాతంత్య్ర కాంక్షను అమెరికా గౌరవించాలని, గ్రీన్లాండ్ ఆక్రమణ విధానాలను మానుకోవాలని, వెనెజువెలా సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని ప్రపంచ ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. బొల్లిముంత సాంబశివరావు 9885983526
ఓటు.. ప్రజాస్వామ్యానికి గీటురాయి
‘నా దేశ ప్రజల చేతికి కత్తిని ఇవ్వలేదు, ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులే అవుతారో, అమ్ముకొని బానిసలుగా ఉంటారో వారి చేతుల్లోనే ఉంది’ అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనడాన్ని బట్టి ఓటు ప్రాముఖ్యత మనకు అవగతం అవుతుంది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) స్థాపించిన రోజును గుర్తు చేసుకుంటూ ఎన్నికల్లో ఓటర్లను భాగస్వామ్యం చేసేందుకు, ఓటింగ్ ప్రాముఖ్యతను తెలియజేసేందుకుగాను 2011 నుండి జనవరి 25న ఓటరు దినోత్సవంగా ఏటా వేడుకలు నిర్వహిస్తున్నాం. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం యువతను ఓటర్లుగా నమోదు చేయడం, వారికి ఓటరు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంపై దృష్టి పెట్టింది. మన దేశంలో మొదటిసారిగా 1920లో ఎన్నికలు జరిగాయి. అప్పటికి మనల్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటం చివరి అంకానికి చేరుకునే రోజులవి. అప్పుడు కేవలం పట్టభద్రులైన వారికి, ఐదు ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉండి భూమిశిస్తూ కట్టే వారికి, ఆస్తిపన్ను కట్టే వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. అంటే జనాభాలో కేవలం 12% మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యేవారు. అయితే ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికలే కీలకం కావున సామాన్యుడు ఓటు హక్కు కోసం సార్వత్రిక ఓటింగ్ సాధించే వరకు నిరంతరం పోరాడిన భారత భాగ్య విధాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. 1919లో భారత ప్రజలను పరిపాలనలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో బ్రిటిష్ పాలకులు సౌత్ బరో అనే రాజకీయ నిపుణుడి నాయకత్వంలో ఒక కమిటీని వేశారు. తన జాతి జనుల విముక్తి కోసమేకాక అన్నివర్గాల ప్రజల కోసం తపించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆ కమిటీకి ఇచ్చిన నివేదికలో ప్రజాస్వామ్య తాత్వికతకు పునాది వేశారు. ఆ పునాదులే రాజ్యాంగ రచనకు ఆధారమయ్యాయి. నేటి ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టడానికి సాధనాలు అవుతున్నాయి. ఆ నివేదికలో అంబేద్కర్ ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు ప్రాతినిధ్యం ఉండాలి. కానీ కొద్ది మందికి మాత్రమే ఓటు హక్కు ఉండటం నిరంకుశత్వానికి, నియంతృత్వానికి, అప్రజాస్వామ్యానికి సూచిక అవుతుంది. కావున వయోజనులైన ప్రతి భారతీయుడికీ ఓటు హక్కు కచ్చితంగా ఉండాలని ప్రతిపాదించారు. కానీ సౌత్ బరో కమిటి ఆ ప్రతిపాదనలను తోసిపుచ్చింది. ఆ కమిటీ సిఫారసులకు అనుగుణంగా బ్రిటిష్ పాలకులు 1920లో మొట్టమొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. 1928లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ జాన్ సైమన్ చైర్మన్గా మరో కమిటిని భారతదేశానికి పంపింది. దేశపర్యటన చేసి సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసే క్రమంలో ఆ కమిటికి కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 21 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడికీ ఓటు హక్కు ఉండాలంటూ తన నివేదికను సమర్పించారు. అయితే కాంగ్రెస్ సైమన్ గో బ్యాక్ అంటూ నినదించి ఆ కమిటీ సిఫారసులు అమలు కాకుండా చేసింది. 1930; 1931న లండన్లో జరిగిన రౌండ్ టేండ్ సమావేశాలలో అణగారిన వర్గాలతోపాటు అందరికీ పాలనలో భాగస్వామ్యం దక్కాలని అంబేద్కర్ పట్టుబట్టినా బ్రిటిష్ ప్రభుత్వం అందరికీ ఓటు హక్కు అనే విషయాన్ని పట్టించుకోలేదు. 1935లో మొదటిసారిగా వచ్చిన భారత చట్టంలోనూ సార్వత్రిక ఓటింగ్కు అవకాశం రాలేదు. 1937, 1946లో జరిగిన ఎన్నికల్లో కూడా గతంలో మాదిరిగానే కేవలం విద్యావంతులకు, వ్యాపారులకు, భూస్వాములకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. వాళ్ల ప్రతినిధులు మాత్రమే పార్లమెంటులో, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1947లో భారతదేశం స్వాతంత్య్రం సాధించడంతో నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకుని అవకాశం దక్కింది. అనేక దేశాల్లో వచ్చిన విప్లవ మార్పులు, పరిణామాలను అర్థంచేసుకొని ఒక రాజ్యాంగం ఆవశ్యకతను గుర్తించి దాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం అనివార్యమైంది. ఆక్రమంలోనే రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అంబేద్కర్ నాయకత్వం వహించడం, తద్వారా సార్వత్రిక ఓటింగ్ హక్కును ఆర్టికల్ 326లో ఉంచడం జరిగింది. 6వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 ద్వారా వయోజన ఓటు హక్కును 18 ఏళ్లకు తగ్గించారు. ఇది 1989 మార్చి 28 నుండి అమలులోకి వచ్చింది. 1989 లోక్సభఎన్నికల్లో 18 ఏళ్ల ఓటర్లకు మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభించింది. దేశగతిని మార్చగల శక్తి ఒక్క ఓటుకే ఉన్నది. అలాంటి ఆయుధాన్ని వృథా చేసుకోవడం లేదా ప్రలోభాలకులోనై అమ్ముకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఓటు ఒకవ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రలోభాలకు గురిచేసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. ఓటు నోటుకు లొంగిపోతే ప్రజలు బానిసత్వంలోకి వెళ్లడం ఖాయం. యువత దేశానికి వెన్నెముక. ఓటర్లు చురుకుగా ఉంటే రాజకీయ నాయకులు యువ సమస్యలపై గంభీరంగా పనిచేస్తారు. కానీ నేటి యువతలో కేవలం 60 నుండి 65% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల రోజును సెలవు దినంగా భావించడం, అలసత్వం, ఒక్క ఓటుతో ఏ మార్పు రాదన్న భావన పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉండటం వారి బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట. రాజకీయాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, భూస్వాములు ఇలా కేవలం ధనవంతులు మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాగించడం ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టు లాంటిది. ప్రజల తాత్కాలిక అవసరాలను గుర్తించి వారి ధనంతో ప్రలోభపెట్టి ఓటును కొనుగోలు చేసే దుర్మార్గపు చర్యలను ఓటర్లకు అవగతమయ్యేటట్లు తెలిపి వారు దేశ భవిష్యత్తు కోసం సరియైన నాయకులను ఎన్నుకునే విధంగా వారికి అవగాహన కల్పించడం ప్రజాస్వామిక వాదులుగా మనందరి కర్తవ్యం. ములక సురేష్ 9441327666
మన తెలంగాణ/హైదరాబాద్: టీ హబ్ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ చేసి మాట్లాడారు. టీ హబ్ను ప్రత్యేక స్టార్టప్ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్గా స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్ లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ-హబ్ లక్ష్యాన్ని నీరుగార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దేశంలోనే ఆధునాతన ఇంక్యుబేటర్గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్గా నిలిచిన ఈ కేంద్రంలోకి అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను షిఫ్ట్ చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాతో పాటు ప్రధాన పత్రికల్లో వార్తా కథనాలుగా వచ్చాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. అయితే ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో తాజాగా ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ రామకృష్ణా రావుకు ఫోన్ చేసి కీలక ఆదేశాలు జారీ చేశారు. టీ-హబ్ను ప్రభుత్వ ఆఫీసుల కోసం వాడకూడదని ఆయన సీఎస్ రామకృష్ణా రావుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టీ-హబ్’ కేవలం న్యూ ఇన్నోవేషన్స్, ప్రత్యేక స్టార్టప్లకు కేంద్రంగా మాత్రమే ఉండాలని సీఎస్కు దిశానిర్దేశం చేశారు. టీ-హబ్ అనేది ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన స్టార్టప్ హబ్ అని, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వల్ల దాని ప్రాధాన్యత, పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ ప్రాంగణం పూర్తిగా వారి కార్యకలాపాలకే కేటాయించాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1000 కోట్ల స్టార్టప్ ఫండ్ను ప్రకటించింది. 2034 నాటికి హైదరాబాద్ నుంచి కనీసం 100 యూనికార్న్ కంపెనీలు రావాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోంది.
ధరణిని అడ్డం పెట్టుకున్న భూకబ్జాకోరులను వదలిపెట్టం
` అందరి బాగోతాలను బయటపెడతాం ` ఫోరెన్సిక్ ఆడిట్తో సిద్దిపేట, సిరిసిల్లల్లో అక్రమాల గుర్తింపు ` త్వరలో 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ ` పోర్టల్ …
ఫోన్ ట్యాపింగ్ దొంగలను సాక్షులుగా పిలవడమేంటీ?
` అలా అయితే అసలు దోషులెవరు? ` కాంగ్రెస్, బీఆరఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయి ` కేసీఆర్, కేటీఆర్ నా ఛాలెంజ్కు సిద్ధమా? ` కేంద్రమంత్రి బండి …
టీ హబ్ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలి
` ఇందులో ఇతర ప్రభుత్వ కారాల్యయాలు ఉండకూడదు ` అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలి ` అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):టీ హబ్ను స్టార్టప్ కేంద్రంగా …
సైట్ విజిట్ నిబంధన కొత్తది కాదు
` 2018లో కోలిండియానే పెట్టింది ` సింగరేణి 2014 నుంచి ఇప్పటి వరకు అన్ని టెండర్లపై విచారణకు సిద్ధం ` సంస్థపై దుష్ప్రచారం చేస్తూ కట్టుకథలు అల్లుతున్నారు …
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కాంట్రాక్టులపై 2014 నుంచి విచారణకు సిద్ధమేనా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ మంత్రి హరీష్రావుకు సవాల్ విసిరారు. ఎవరెవరికో లేఖలు రాయడం కాదని, అ లేఖ ఏదో తనకే రాస్తే ఇప్పుడే కాదు గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాం 2014 నుంచి నైనీ బొగ్గు గనుల కేటాయింపుల వరకు జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరపడానికి సిద్థంగా ఉన్నామని ప్రకటించారు. ఒకరు కథ నం రాస్తే మరొకరు లేఖ రాశారని, ఇంకొకరు విచారణకు ఆదేశించార ని, ఈ ముగ్గురికీ ఉన్న సంబంధం ఏంటని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.సీఎం అమెరికా పర్యటన నుంచి వచ్చే లోగా లేఖ రాస్తే ఆయనను ఒప్పించి విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నానని భట్టి స్పష్టం చేశారు. సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బామ్మర్ది సృజన్రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన ఖండించారు. సృజన్ రెడ్డి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డికి అల్లుడు అని, ఆయన కూతురు దీప్తి రెడ్డి కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారని భట్టి వివరించారు. తాను సిఎల్పి నాయకుడిగా ఉన్న సమయంలో ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని, ఆయనకు కాంట్రాక్టుల ఆశ చూపి బిఆర్ఎస్లో చేర్చుకున్నది ఎవరని భట్టి దుయ్యబట్టారు. సింగరేణిలో 2014 నుంచి పొందిన కాంట్రాక్టుల పైనే కాకుండా తాడిచర్ల కాంట్రాక్టుపై కూడా విచారణలో చేర్చుదామన్నారు. తాను ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజకీయాల్లో రాలేదని, కార్మికుల చెమటతో సృష్టించిన సింగరేణి సంపదపై ఏ రాబందులను వాలనివ్వనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల సింగరేణి కాంట్రాక్టులు, తనపై వస్తున్న ఆరోపణలపై భట్టి తీవ్రంగా స్పందించారు. ఎవరి కళ్లలో ఆనందం చూడడానికి ఈ కథనాలు వండి వార్చుతున్నారని ఒక పత్రికాధిపతిపై భట్టి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన చిన్నపుడు ఏ నినాదం అయినా వస్తే ఆ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయోనని అనుమానించే వాడినన్నారు. పది సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన హరీష్రావు తన లేఖలో సో కాల్డ్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అని పేర్కొన్నారని, ఈ నిబంధన ఏదో తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినట్లుగా హరీష్రావు భావిస్తున్నారని, ఈ నిబంధన ఇప్పటిది కాదని, అది తమ ప్రభుత్వం తెచ్చింది కాదని , కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోనూ అమలులో ఉన్నదేనని ఆయన గుర్తు చేశారు. ఐఐటి, హెచ్పీసీఎల్, ఐఐఎం, రైల్వే, హిందుస్థాన్ కాపర్స్, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ, మహారాష్ట్ర ప్రభుత్వ టెండర్లలోనూ ఈ నిబంధన ఉందని భట్టి విలేకరుల సమావేశంలో వాటికి సంబంధించిన పత్రాలను చూపించారు. ఏ కుంభకోణం జరగకపోతే టెండర్లు ఎందుకు రద్దు చేస్తారని హరీష్రావు అంటున్నారని, అసలు ఈ నైనీ బొగ్గు గనులు టెండర్ల నోటిఫికేషన్ దాకా ఇంకా వెళ్లలేదనే విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. సింగరేణిలో డీజిల్ చోరీ జరుగుతుందని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది తామేనని పేర్కొన్నారు. ఈ సంస్థలో పనిచేసే వాహనాలకు డీజిల్ సరఫరా చేయడం తమ హయాంలో తీసుకువచ్చిన నిర్ణయం కాదని, 24 జులై 2002లోనే తీసుకువచ్చారని, అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా, బిఆర్ఎస్సా హరీష్రావు సమాధానం చెప్పాలన్నారు. తాను మండుటెండలో పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహించి సింగరేణి గనులను సందర్శించానని, సింగరేణి కార్మికుల రక్తం, స్వేదంతో బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, ఇటువంటి బొగ్గు సంపద పైన ఏ రాబందులు, గద్దలు వాలకుండా చూడడమే తన కర్తవ్యమన్నారు. సింగరేణి 105 సంవత్సరాల క్రితం స్థాపితమైందని, అది తెలంగాణ ప్రజల సంపద అని, దానిని ఎవరో దోచుకువెళతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత పదేళ్లలో కొత్త బొగ్గు గనుల అభివృద్ధిలో తగిన ప్రయత్నాలు జరగకపోవడం వల్ల భవిష్యత్తులో ఉత్పత్తి, ఆదాయం తగ్గి వేలాది కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగంలో మార్పులు, గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో, నాణ్యమైన బొగ్గు గనులను త్వరగా సొంతం చేసుకుని ఆపరేషన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సింగరేణిని కేవలం బొగ్గుకే పరిమితం చేయకుండా క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, సింగరేణి మేనేజ్మెంట్ , కార్మికులు పూర్తి అంకితభావంతో సంస్థ భవిష్యత్తును కాపాడుతామని స్పష్టం చేశారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతూ కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను వారం రోజుల క్రితం ఈ అంశంపై స్పందించి వివరాలన్నింటినీ ప్రజల ముందు ఉంచినప్పటికీ తమ తప్పు తెలుసుకుని వాస్తవాలేమిటో తెలియచేస్తారని ఆశించినప్పటికీ ఆ ప్రయత్నమే చేయలేదన్నారు. ఈ అంశంలో అడ్డగోలుగా కథనాలు వండి వారిస్తే సహించే ప్రసక్తే లేదని భట్టి హెచ్చరించారు. పెట్టుబడులు, కట్టు కథల విషపు రాతలతో ఓ పత్రికాధినేత తనపై చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవి, వాస్తవ దూరమైనవని, కనుక ఆయన రాసినవన్నీ అవాస్తవాలని స్వయంగా తిరిగి రాయాలని, లేనట్లయితే ఆయన రాతలు తన వ్యక్తిత్వ హననం కోసమే పనికట్టుకుని రాసినట్లుగా భావించాల్సి ఉంటుందని అన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 30 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న కథనాలు తనను ఆవేదనకు గురిచేశాయన్నారు. సింగరేణిలో టెండర్లు, వాటికి సంబంధించిన టెండర్లు కానీ, వాటికి సంబంధించిన ఫైళ్లు తన వద్దకు కానీ, రాష్ట్ర ప్రభుత్వం వద్దకు రావని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పారదర్శకంగా సేవలు అందించేందుకు సింగరేణి కాలరీస్ సంస్థకు ఒక బోర్డు ఉందని, అందులో సీనియర్ అధికారులు ఉంటారని, వారంతా ఒక స్వయంప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. అన్ని నిర్ణయాలు సంస్థలో అమలులో ఉన్న విధి విధానాలు, నిబంధనల ప్రకారమే స్వతంత్రంగా తీసుకుంటారని, రాజకీయ జోక్యానికి ఎక్కడా అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
25th Jan 2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
25th Jan 2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఈ Sunday Magazine
దావోస్/వాషింగ్టన్: భారత్పై విధించిన టారీఫ్లపై అమెరికా కొంత మెత్తబడినట్లుగా కనిపిస్తోంది. 50 శాతం వరకు సుంకాలను విధించి ఇప్పటికే వాటిని అమలు చేస్తోన్న అమెరికా వాటిని 25శాతానికి తగ్గిం చే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా వెల్లడించింది. ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ శుక్రవారంనాడు దావోస్లో మాట్లాడుతూ.. రష్యా నుంచి భా రత్ భారీ ఎత్తున్న చమురు దిగుమతులను తగ్గించినందున ఆ దేశంపై విధించిన 25శాతం అదనపు సుంకాలను వెనక్కి తీసుకునే యోచనలో ఉన్నామని, దానికి ఒక మార్గం ఉందని అన్నారు. భారత రిఫైనరీలు చమురు దిగుమతి తగ్గించుకోవడం మేం విధించిన టారీఫ్ల వల్లనే సాధ్యమైంది, ఇది కచ్చితంగా మాకు భారీ విజయమనే చెప్పాలని బెసెంట్ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్ మాత్రం తమ ఇంధన విధానానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. జనాభాకు తగ్గట్టుగా సరిపడ్డా చమురు నిల్వలు ఉంచుకోవాలని రిఫైనరీలకు సూచించినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై 500శాతం సుంకాలు విధించే ప్రతిపాదిత బిల్లుపై అమెరికా కాంగ్రెస్లో చర్చ జరగనున్న సమయంలో ఇరు దేశాల నుంచి తాజా ప్రకటనలు వెలువడడం విశేషం. తమకు ఆ బిల్లుపై అవగాహన ఉందని, అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు విదేశాగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైశ్వాల్ తెలిపారు.
ధరణి లొసుగులపై అన్ని జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్
మన తెలంగాణ/హైదరాబాద్: ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూ ములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లే దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములను కాజేశారన్నారు. దీనిపై సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్ధతో పైలెట్ ప్రాజెక్టు కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి అనేక అవినీతి, అక్రమాలు గుర్తించామన్నారు. ఈ ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన తర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిన ఘటనలపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. విచారణలో ఎదురైన అం శాలు, ఎవరి పాత్ర ఎంత? తెర వెనుక ఎవరైనా ఉన్నారా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉం దా? వంటి అంశాలపై కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కమిటీ ప్రాథమిక నివేదికను పరిశీలించి మరికొన్ని సలహాలు సూచనలు చేస్తూ మరింత లోతైన విచారణ జరిపి తుది నివేదికను సమర్పించాలని సూచించారు. 4,848 లావాదేవీల్లో అక్రమాలు : ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 35 లక్షల లావాదేవీలు జరిగాయని, ఇందులో ప్రాథమికంగా 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే విచారణ తర్వాత 1109 డాక్యుమెంట్లకు సంబంధించి సుమారు రూ.4 కోట్లు ప్రభుత్వానికి చెల్లింపు జరగలేదని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం అనాలోచితంగా ఎలాంటి ముందు చూపు లేకుండా ఒక కుట్ర పూరితంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ లోని లొసుగులను ఆసరాగా చేసుకుని కొంత మంది అక్రమాలకు పాల్పడితే భూ భారతి పోర్టల్ ద్వారా ఆడిట్ నిర్వహించి అక్రమాలను గుర్తించి తక్షణమే ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 9 జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలకు పాల్పడిన 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఓ నాయకుడు రూ.1000 కోట్ల అవినీతి అని, మరో నాయకుడు రూ.10 వేల కోట్లు అని, ఇంకొకరు భూ భారతి పోర్టల్ అవినీతిమయమని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. నేడు ఖమ్మంలో లైసెన్సులు అందజేత ఇప్పటికే మొదటి విడతలో నాలుగు వేల మంది శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులను జారీ చేశామని, ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో మరో రెండు వేల మందికి లైసెన్సులను జారీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ లైసెన్స్ సర్వేయర్లతో రాష్ట్రంలో నక్షా లేని 373 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తామన్నారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇంటిలిజెన్స్ అదనపు డీజీ విజయకుమార్, ఉన్నత స్ధాయి కమిటీ సభ్యులు డీఐజీ ఎం.సుభాషిణి, సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్, ఏసీబీ ఎస్పీ సింధు శర్మ, సైబర్ క్రైమ్ డీఎస్పీ ఎ.సంపత్, ఎన్ఐసీ ప్రతినిధి శ్రీనివాస్, హోంశాఖ సలహాదారు పి.శరత్ కుమార్ పాల్గొన్నారు. కేటీఆర్వి మతిలేని మాటలు సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మాట్లాడుతున్న భాష సరిగా లేదని, మతి లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగతంగా తాను రిఫరెండంగా భావిస్తున్నానని అన్నారు. శనివారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఇప్పటికే రెండు సార్లు కేటీఆర్ రిఫరెండం అన్నారని, మళ్లీ ఇప్పుడు రిఫరెండం అంటున్నారని, ఇంతకు ముందు జరిగిందే ఈ ఎన్నికల్లో జరుగుతుందన్నారు. ఆనాడు సోయి లేకుండా ఇష్టం వచ్చినట్లు జిల్లాలను ఏర్పాటు చేసి, ఇప్పుడు అగ్నిగుండం చేస్తామని మతిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో ప్రజామోదంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామన్నారు. బట్ట కాల్చి మీద వేయడమే ప్రతి పక్ష పార్టీ పని అన్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. తమ రెండేళ్ల పాలనలో ఏ తప్పు జరిగిందని మాట్లాడుతున్నారని నిలదీశారరు. వారి పాలనలో అక్రమాలు జరిగినట్లుగానే ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయని భ్రమపడుతున్నారని, ఇంకా అధికారంలో ఉన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. దావోస్ పర్యటనకు తన కొడుకు రావడంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని అన్నారు. తన కుమారుడు బిజినెస్ పనిమీదనే దావోస్ వచ్చారని చెప్పారు. తన కుమారుడు, మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకోసమే వచ్చారన్నారు. వాళ్లిద్దరికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. తన కుమారుడిపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని, తనపై భూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈడీ కేసుల గురించి మాట్లాడటం తప్ప మరొకటి ఏం లేదన్నారు. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. భూభారతిలో రూ.3.9 కోట్ల రిజిస్ట్రేషన్ టాక్స్ అక్రమాలు జరిగాయన్నారు. ప్రతి మండలాన్ని యూనిట్ గా తీసుకుని కేసులు నమోదు చేశామని చెప్పారు. ధరణి అక్రమాలపై సిద్దిపేట, సిరిసిల్లలో కేరళ సంస్థ ఆడిట్ చేస్తోందని అన్నారు. నైని కోల్ మైన్స్ టెండర్లు రాకముందే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు ఉన్నా విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు.
వార ఫలాలు (25-01-2026 నుండి 31-01-2026 వరకు)
మేష రాశి వారికి ఈవారం చాలా అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. వీరికి ఏలిన నాటి శని నడుస్తుంది శని అంతా అనుకూలంగా లేడు. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యో గాలలో చికాకులు మరింత పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అదేవిధంగా దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. ఏదైనా ఒక సోమవారం లేదా 8 సోమవారాలు శివాలయంలో రుద్రాభిషేకం జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తులు పెరుగుతాయి. ఒకచోట స్థలాన్ని అమ్మి మరొకచోట స్థలం కొనుగోలు చేస్తారు. విహారయాత్రలు దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. మీరు ఏదైనా మాట్లాడితే దానిని వక్రీకరించే వారు ఎక్కువగా ఉంటారు జాగ్రత్త వహించండి. _నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. జీవిత భాగస్వామితో ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గి అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి._మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం చేతికి ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మిధున రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డులకు పర్సనల్ లోన్లకి దూరంగా ఉండండి. విద్యార్థులు అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులు, సహాయ సహకారాలు అందుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మేధా దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతిరోజు ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి వారం చాలావరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది చాలావరకు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. దూర ప్రాంతా ప్రయాణాలు అత్యవసరమైతేనే చేయండి. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. నూతన అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారి పోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసరకులమ్మేవారికి కూరగాయల వ్యాపారస్తులకు మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. గృహమున కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి అలాగే ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఏదైనా పని మీద బయటపడేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. సింహ రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పర్సనల్ లోన్లకి క్రెడిట్ కార్డులకి స్టాక్ మార్కెట్ కి దూరంగా ఉండండి. ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన గృహం కొనుగోలు చేయాలని ఆలోచన కలుగుతుంది. విదేశాలలో ఉన్న వారికి కాస్త గడ్డుకాలంకా చెప్పవచ్చు. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 3 కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వివాహం కాని వారికి పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి. విహారయాత్రలు దేవదర్శనాలు చేసుకుంటారు. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి సుందరాకాండ పారాయణ చేయండి లేదా వినండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు బుధవారం కాని శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తులను పెంచుకుంటారు. కుటుంబ పరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి లేదా వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి కాలం ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. సంతానానికి మంచి ఉద్యోగం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతగానో మేలు చేస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నూతన ప్లాటు కొనుగోలు చేస్తారు. ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. నలుగురిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దైవచింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. దానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి కలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సహోదరీ సహోదరుల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా స్కిన్ ఎలర్జీలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి._సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిపి వచ్చే రంగు గ్రీన్. నేను పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కాలేజీకి శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మీనరాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. కోర్టు సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ప్లాటు కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుండే పొదుపు ప్రయత్నాలు చేస్తారు. సంతానం విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తొలగిపోతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. అదేవిధంగా మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతన బ్రాంచీలను ఏర్పాటు చేస్తారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని ఉంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. శని గ్రహం దగ్గర నువ్వుల నూనెతో నల్ల వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
Shirdi Sai Baba |వృక్ష ప్రసాదం పథకంపై కీలక చర్చలు
Shirdi Sai Baba | వృక్ష ప్రసాదం పథకం అమలుపై సాయిబాబా సంస్థాన్లో
అదపునపు సుంకంపై అమెరికా వెనక్కి!
భారత్పై 25శాతం టారిఫ్లను ఎత్తివేసే దిశగా అడుగులు అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెసెంట్ సూచనప్రాయ ప్రకటన రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి తగ్గించినట్లు వెల్లడి దావోస్/వాషింగ్టన్ : భారత్పై విధించిన టారీఫ్లపై అమెరికా కొంత మెత్తబడినట్లుగా కనిపిస్తోంది. 50 శాతం వరకు సుంకాలను విధించి ఇప్పటికే వాటిని అమలు చేస్తోన్న అమెరికా వాటిని 25శాతానికి తగ్గించే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా వెల్లడించింది. ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ శుక్రవారంనాడు దావోస్లో మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ భారీ ఎత్తున్న చమురు దిగుమతులను తగ్గించినందున ఆ దేశంపై విధించిన 25శాతం అదనపు సుంకాలను వెనక్కి తీసుకునే యోచనలో ఉన్నామని, దానికి ఒక మార్గం ఉందని అన్నారు. భారత రిఫైనరీలు చమురు దిగుమతి తగ్గించుకోవడం మేం విధించిన టారీఫ్ల వల్లనే సాధ్యమైంది, ఇది కచ్చితంగా మాకు భారీ విజయమనే చెప్పాలని బెసెంట్ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్ మాత్రం తమ ఇంధన విధానానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. జనాభాకు తగ్గట్టుగా సరిపడ్డా చమురు నిల్వలు ఉంచుకోవాలని రిఫైనరీలకు సూచించినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై 500శాతం సుంకాలు విధించే ప్రతిపాదిత బిల్లుపై అమెరికా కాంగ్రెస్లో చర్చ జరగనున్న సమయంలో ఇరు దేశాల నుంచి తాజా ప్రకటనలు వెలువడడం విశేషం. తమకు ఆ బిల్లుపై అవగాహన ఉందని, అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు విదేశాగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైశ్వాల్ తెలిపారు.
బిఆర్ఎస్ నేతలపై రౌడీషీట్ నమోదు చేయాలి: ఎమ్మెల్యే నాయిని
మన తెలంగాణ/హైదరాబాద్: ‘సిట్’ అధికారులను బెదిరిస్తున్న బిఆర్ఎస్ నేతలపై రౌడీ షీట్ నమోదు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రాష్ట్ర డిజిపిని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ నేతలపై జాలి చూపరాదని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తామంటూ అధికారులను బె దిరించడం ఏమి పద్ధతి అని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు కెటిఆర్ వెళుతున్నప్పుడు స్వాతంత్య్ర ఉద్యమకారునిలా బిల్డప్ ఇచ్చారని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు ఏమిటో వెలుగు చూస్తాయని అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. అబద్దపు పునాదులపై పార్టీని నడిపిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచితనం వల్లే బిఆర్ఎస్ నేతల ఆటలు సాగుతున్నాయన్నారు.
నైనీ టెండర్ రద్దు చేశారంటే స్కాం జరిగినట్టే కదా?: హరీశ్రావు
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఎన్ని సాకులు చెప్పినా బొగ్గు కుంభకోణం, అందులో సిఎం బావమరిది రింగ్మెన్ పాత్ర పోషించడం నిజం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు ఆరోపించారు. నైనీ టెండర్ రద్దు చేశారంటే.. స్కాం జరిగినట్టే కదా? అని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంపై భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రెస్మీట్పై హరీష్రావు ఎక్స్ వేదికగా స్పం దించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, భట్టి విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నైనీ టెండర్ రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ లా ఏదో చెప్పి, మసిబూసి మారేడు కాయ చేశారని విమర్శించారు. ఎన్ని సాకులు చెప్పినా కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం.. అందులో రేవంత్రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్గా పాత్ర పోషించింది నిజం అని పేర్కొన్నారు. శుక్రవారం తాను బయటపెట్టిన మరో కుంభకోణం.. సోలార్ పవర్ స్కాం గురించి ఎందుకు ఒక్క మాట కూడా భట్టి విక్రమార్క ప్రెస్మీట్లో మాట్లాడలేదు? అని నిలదీశారు. నైనీని రద్దు చేసినట్లే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బిఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్దాలు అయిపోవు... జరిగిన స్కాంలు, స్కీంలుగా మారిపోవు అని విమర్శించారు. సైట్ విజిట్ నిబంధనను 2018లోనే మొదలైందని చెప్పి, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారు..? అని అడిగారు. సైట్ విజిట్ అమలయ్యింది, నైనీ రద్దు జరిగింది అంటే.. స్కాం జరిగినట్లే కదా..? అని నిలదీశారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకు ని దక్షిణ మధ్య రైల్వే వివిధ నగరాల మధ్య వన్వే స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. ఈ నెల 26న తిరుపతిహైదరాబాద్ (07505), మచిలీపట్నంకాచిగూడ (07506) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. విశాఖపట్నంచర్లపల్లి (08517), చర్లపల్లివిశాఖపట్నం (08518) ప్రత్యేక రైళ్లు ఈ నెల 25, 26 తేదీల్లో నడుపుతున్నట్లు తెలిపిం ది. తిరుపతి సికిందరాబాద్ ప్రత్యేక రైలు రేణిగుంట, రాజంపేట్, కడప, యర్రగుంట్ల, గూటీ, గుంటకల్, ఆదోని, రాయిచూర్, సేడం, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేంగంపేట్ స్టేషన్లలో ఆగుతుంది. మచిలీపట్నంకాచిగూడ ప్రత్యేక రైలు గుడివాడ, విజయవాడ, గుంటూర్, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుం ది. విశాఖపట్నంచర్లపల్లి ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామల్కోట్, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూర్, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. వీక్లీ స్పెషల్ ట్రైన్స్ కాలపరిమితి పొడిగింపు ప్రయాణీకుల రద్దీ దృష్టా వివిధ నగరాల మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే వాటి కాలపరిమితిని మరికొంత కాలం పొడిగించింది. ప్రతి సోమవారం నడిచే కాచిగూడమధురాయి రైలును ఫిబ్రవరి 2 నుండి 23 వరకు, ప్రతి బుధవారం నడిచే మధురాయికాచిగూడ రైలు కా లపరిమితిని ఫిబ్రవరి 4 నుండి 25 వరకు, ప్రతి శనివారం నడిచే హైదరాబాద్కొల్లాం ప్రత్యేక రైలును ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 21 వరకు, ప్ర తి సోమవారం నడిచే కొల్లాంహైదరాబాద్ ప్రత్యేక రైలును ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 23 వరకు, ప్రతి బుధవారం నడుపుతున్న హైదరాబాద్కన్యాకుమారి ప్రత్యేక రైలును ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 25 వరకు, ప్రతి శుక్రవారం నడుపుతున్న కన్యాకుమారిహైదరాబాద్ ప్రత్యేక రైలును ఫిబ్రవరి 6 నుండి 27 వరకు, ప్రతి బుధవారం నడుపుతున్న నర్సాపూర్తిరువన్నమలై ప్రత్యేక రైలును ఫిబ్రవరి 4 నుండి 25 వరకు, ప్రతి గురువారం నడుపుతున్న తిరువన్నమలైనర్సాపూర్ ప్రత్యేక రైలు కాలపరిమితిని ఫిబ్రవరి 5 నుండి 26 ఫిబ్రవరి వరకు పొడిగించినట్లు ద.మధ్య రైల్వే తెలిపింది.
బండి, అరవింద్లకు కెటిఆర్ లీగల్ నోటీసులు
తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకుగానూ బిజెపి ఎంపిలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్లకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వేరువేరుగా లీగల్ నోటీసులు జారీ చేశారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వారు చేసిన వ్యాఖ్యలను కెటిఆర్ తీవ్రంగా పరిగణించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి సాక్షాధారాలు లేకుండా కేవలం దురుద్దేశం పూర్వకంగా, నిజమైన రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ, చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బండి సంజయ్, అరవింద్లకు కెటిఆర్ తన న్యాయవాదులతో నోటీసులు పంపించారు. బండి సంజయ్కు పంపిన లీగల్ నోటీసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కెటిఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కెటిఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇప్పటికే బండి సంజయ్పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ, మళ్ళీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని మండిపడ్డారు. అదేవిధంగా ఎంపి ధర్మపురి అరవింద్కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తప్పుబట్టారు. డ్రగ్స్ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు అక్షేపణీయమని పేర్కొన్నారు. కెటిఆర్ రాష్ట్ర అభివృద్ధికి, ఐటి రంగ విస్తరణకు కృషి చేసిన మాజీ మంత్రి అని, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, అటువంటి వ్యక్తిపై ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం రాజకీయ కక్ష సాధింపేనని న్యాయవాదులు నోటీసులో వివరించారు. ఈ ఇద్దరు ఎంపిలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కెటిఆర్కు బహిరంగంగా నిబంధనలు లేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశా రు. నోటీసు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షం లో సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కెటిఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కెనడాపై 100 శాతం టారీఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శనివారం హెచ్చరించారు. పొరుగుదేశం కెనడా చైనాతో బలోపేత ట్రేడ్ డీల్కు దిగుతున్నందున కెనడాకు తమ సుంకాల భారం తప్పదని తెలిపారు. కెనడా సరుకులన్నింటిపైనా వంద శాతం టారీఫ్ పడుతుందని హెచ్చరించారు. చైనా సరుకులు కెనడా మీదుగా అమెరికాకు రవాణా కాకుండా చేస్తామని ట్రంప్ తమ ట్రూత్ సోషల్ వేదికగా తెలిపారు. నేరుగా కెనడా ప్రధాని మార్క్ కార్నేకు చురకలు పెట్టారు. పైగా గవర్నర్ కార్నే అని వ్యాఖ్యానించారు. చైనా సరుకులు అమెరికాకు రావడానికి కెనడాను వాహకం చేసుకోవాలనుకుంటున్నారా? ఇది చెల్లనేరదని పేర్కొన్నారు. తప్పు చేయవద్దని హితవు పలికారు. చైనా కెనడాను అమాంతం మింగేస్తుంది. పూర్తిగా పిప్పి చేస్తుందని వ్యాఖ్యానించారు. తమ ప్రతిపాదిత గోల్డెన్ డోమ్ ఏర్పాటుతో కెనడాకే రక్షణ కల్గుతుంది. దీనిని కాదని కెనడా చైనాతో వాణిజ్య బందానికి దిగితే అర్థం ఏమిటని ప్రశ్నించారు.చైనాతో కెనడా వాణిజ్య ఒప్పందం కుదిరితే అది నార్త్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు కల్గిస్తుంది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టినట్లే అని తెలిపారు. కెనడాపై అమెరికా హక్కు నేపథ్యంలోనే ఈ దేశ ప్రధానిని గవర్నర్గా సంబోంధించినట్లు భావిస్తున్నారు.
ఈక్వెడార్ అడవుల్లో అందాల పక్షి ఆఖరి పోరాటం#Ecuador #AndesMountains #EndangeredSpecies #HummingBird
బంగ్లా బాటలోనే పాక్!.. మోషిన్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు
దుబాయ్: మరో పది రోజుల్లో జరుగనున్న టి20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ జట్టును తప్పించింది ఐసిసి. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్కు అవకామిస్తూ శనివారం తుది నిర్ణయాన్ని ప్రకటించింది. భద్రతా కారణాల దృష్టా భారత్లో పర్యటించబోమని, తమ మ్యాచ్లు శ్రీలంక వేదికగా నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బిసిబి) ఐసిసిని కోరింది. అయితే, ఈ నిర్ణయాన్ని ఐసిసి తిరస్కరించింది. భారత్లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పులేదని పేర్కొంది. అయినా బిసిసిబి ససేమిరా అనడంతో ఐసిసి ఈ చర్యకు ఉపక్రమించింది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను ఆడించేందకు ఐసిసి నిర్ణయించింది. కాగా, ఫిబ్రవరి 7 నుంచి ఈ పొట్టి టోర్నీకి ప్రారంభం కానుండగా.. స్కాట్లాండ్ గ్రూప్ సిలో ఉంది. కోల్కతా వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లండ్ తలపడనుంది. మరో మ్యాచ్ నేపాల్తో తలపడనుండగా.. ఈ మ్యాచ్ ముంబై వేదికగా జరుగనుంది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగడం తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూడనుంది. ఏకంగా 5లక్షల డాలర్లు కోల్పోవలసి వస్తుంది. మా ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే: పాక్ ఐసిసి టి20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను తప్పించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మప్ మోషిన్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీ పాక్ ఆడటం మా ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. ‘బంగ్లాను తప్పించొద్దు. ఐసిసి సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశాను. ఆ జట్టుకు అన్యాయం చేయరాదు. మా ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఆయన రాగానే ప్రభుత్వంతో చర్చించి. టోర్నీలో పాల్గొనాలా? వద్దా అనే నిర్ణయాన్ని ప్రకటిస్తాం’ అని పేర్కొన్నాడు.
తాత వయసున్న ఇద్దరు అసభ్యంగా తాకుతూ..
“హర్యానా రాష్ట్రంలోని కర్నాల్లో జరిగిన ఓ ఈవెంట్లో తాత వయసున్న ఇద్దరు అతిథులు నాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో వారిపై అసహ్యం కలిగింది” అని బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్ పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. “వేదికపైకి వెళుతుండగా ఆ ఇద్దరు, వారి కుటుంబ సభ్యులు ఫొటోల పేరుతో నా నడుముపై చేతులు వేశారు. వెంటనే ‘సర్ దయచేసి మీ చేతులు తీయండి’ అని చెప్పాను. అయినా వారి ప్రవర్తన మారలేదు. దీంతో ప్రదర్శనను అనుకున్న సమయానికన్నా ముందే ముగించాల్సి వచ్చింది. నాలాంటి వారికే ఇలా జరిగితే కొత్తగా పరిశ్రమలోకి వచ్చే అమ్మాయాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి” అని అన్నారు.
ఆహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1100కోట్ల బీమా సొమ్ము
న్యూఢిల్లీ: గత సంవత్సరం ఆహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి విమానయాన సంస్థ ఎయిరిండియాకు రూ.1100కోట్ల పరిహారం అందింది. ఈ మొత్తం వివిధ బీమా సంస్థల నుంచి ఎయిరిండియా అందుకున్నట్లు సమాచారం. గత ఏడాది జరిగిన ప్రమాదంలో విమానం ముక్కలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 241 మంది దుర్మరణం చెందగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇన్సూరెన్స్కు సంబంధించి ఎయిరిండియాకు 125 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో రూ.1100కోట్లకుపైగా అందినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు కూడా 25మిలియన్ డాలర్లు చెల్లించే ప్రక్రియ కూడా మొదలైనట్లు సమాచారం. బాధితులకు పరిహారం మరింత పెరిగే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో హాస్టల్పై విమానం కుప్పకూలడంతో అందులోని ప్రయాణికులతో పాటు విద్యార్థులు కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు కూడా పరిహారం దక్కేలా ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
టిగ్గర్ నొక్కేందుకు సిద్ధం.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
దుబాయ్: ఉద్రిక్తత మరింత రాజుకుంది. ఇరాన్ శనివారం అమెరికాను తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఇరాన్ సైనిక రెవెల్యూషనరీ గార్డు అధినేత , సుప్రీం కమాండర్ జనరల్ మెహమ్మద్ పక్పోర్ తాము అమెరికాతో యుద్థానికి సర్వం సన్నద్ధంగా ఉన్నామన్నారు. తమ చేతి వేలు ఇక ట్రిగ్గర్ నొక్కడానికి సిద్ధంగా ఉందని అరబీలో ఘాటైన సందేశం వెలువరించారు. ఫింగర్ ఆన్ ట్రిగ్గర్ అని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఇప్పుడు తాము రెడీగా ఉన్నామని చెప్పారు. మధ్య ప్రాచ్యం వైపు అమెరికా యుద్ధ నౌక ఒకటి దూసుకువస్తున్న దశలో ఇరాన్ సైనిక అధినేత హెచ్చరికలు కలకలానికి దారితీశాయి. ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలికి చెందిన వార్తా సంస్థ నౌర్న్యూస్ తమ టెలీగ్రామ్ ఛానల్ ద్వారా సుప్రీం కమాండర్ హెచ్చరికలను తెలియచేసింది. అమెరికా, ఇజ్రాయెల్లు ఎటువంటి దుస్సాహానికి పాల్పడ్డా తాము ఉరుకునేది లేదని ఇందులో తెలిపారు. ఇక ట్రిగ్గర్ నొక్కడమే తరవాయి అని తేల్చిచెప్పారు. అమెరికా తెగించి దుస్సాహానికి పాల్పడకుండా ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డు, మా ప్రియమైన ఇరాన్ దేశం సిద్ధంగా ఉంది. యుద్ధానికి అందే సర్వోన్నత ఆదేశాల గురించి ఎదురుచూస్తోందని తెలిపారు. డిసెంబర్ 28 నుంచి ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇస్లామిక్ పాలకులకు వ్యతిరేకంగా ఇరాన్లో వీధుల్లో నిరసనలకు అమెరికా మద్ధతు, దీనికి ప్రతిగా ఇరాన్ పాలకులు అణచివేత చర్యలతో పరిస్థితి దిగజారింది. ప్రతికూల పరిస్థితులతో ఇరాన్ రియాల్ కరెన్సీ పతనం అయింది. ఇరాన్లో రక్తపాతానికి ట్రంప్ కవ్వింపు చర్యలే కారణం అని ఇరాన్ అధినేత ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమేనీ పాలన అంతం అయితేనే ఇరాన్కు శాంతి అని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇరాన్ వైపు భారీ అమెరికా యుద్ధ నౌకలు: ట్రంప్ ఇరాన్లో పరిస్థితిని తాము జాగ్రత్తగా గమనిస్తున్నామని అమెరికా అధ్యక్షులు ట్రంప్ తెలిపారు. అక్కడ శాంతియుత ప్రదర్శనలపై అణచివేతలను సహించేది లేదన్నారు. అయితే తమ హెచ్చరికలతో ఇప్పుడు చాలా వరకూ బహిరంగ ఉరిశిక్షలు ఆగిపొయ్యాయని చెప్పారు. ఇక అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ వైపు దూసుకువెళ్లుతున్నాయి. వీటిని అవసరం అయితే వెంటనే దాడులకు ఉపయోగిస్తామని, అయితే చర్య అవసరం ఉండకపోవచ్చు. కానీ చర్యకు సిద్ధం అన్నారు.
న్యూయార్క్కు ఎయిరిండియా విమానాలు నిలిపివేత
అమెరికాలో మంచుతుపాన్ పరిస్థితితో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్, నెవార్క్కు ఈ నెల 25, 26 తేదీలలో వెళ్లే విమానాలను నిలిపివేశారు. ఈస్ట్కోస్ట్ ప్రాంతంలో మంచు ఉపద్రవంతో పరిస్థితిని విశ్లేషించారు. ముంబై, న్యూఢిల్లీ, నుంచి న్యూయార్క్కు రోజువారి విమానాల రాకపోకలు ఉంటాయి. వీటిని నిలిపివేయాల్సి వచ్చింది. ఆదివారం సోమవారం విమానాలు నిలిచిపోతాయని అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి నెవార్క్కు వెళ్లే రోజువారి విమానాలు ఆగిపోయ్యాయి. ప్రయాణికులకు ఈ విషయం తెలిపారు. పరిస్థితిని సమీక్షించుకుని తిరిగి ఎప్పుడు విమానాలు తిరుగుతాయనేది తెలియచేస్తారని ప్రకటన వెలువరించారు. సోమవారం వరకూ న్యూజెర్సీ, న్యూయార్క్ ఇతర ప్రాంతాల్లో మంచుతుపాన్ తీవ్రత ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానాలను రద్దు చేశామని వివరించారు.
అమెరికాలో దశాబ్ధ కాలంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయి మంచు తుపాన్ సంభవించింది. ఈస్ట్కోస్ట్లో ఇంతకు ముందెన్నడూ మంచు వర్షం, అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు లేని రాష్ట్రాలపై కూడా ఇప్పుడు ప్రభావం పడింది. ఆదివారం సోమవారం భారీ స్థాయిలో మంతుతుపాన్ ప్రభావం పడనుంది. దీనితో మొత్తం మీద దేశవ్యాప్తంగా 9000కు పైగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఈ పరిణామంతో అమెరికా అంతటా దాదాపుగా ఆదివారం , సోమవారం విమానాల సర్వీసులు ఉండవు. పలు ప్రాంతాలలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు మైనస్ 34 డిగ్రీల సెల్సియస్ స్థాయికి చేరింది. గ్రామీణ లూయిస్ కౌంటీలో ఈ పరిణామం చాలా రోజులుగా నెలకొంది. అనేక చోట్ల ఓ అడుగు లేదా 30 సెంటిమీటర్ల ఎత్తు మంచు పేరుకుపోయింది. దీనిని తొలిగించడం అతి కష్టం అవుతోంది. ఓ వైపు ట్రంప్ ఇది ఏమంత పెద్ద సమస్య కాదని కొట్టిపారేస్తూ ఉన్నా, గ్లోబల్ వార్మింగ్ కామెంట్లకు దిగుతూ ఉన్నా ఇప్పటి పరిణామం అమెరికాకు బారీ మంచు ఉపద్రవంగా మారింది. దాదాపు 40 రాష్ట్రాలు అత్యల్ప ఉష్ణోగ్రతలతో తల్లడిల్లుతున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది వరకూ ఇళ్లలో నుంచి కదలలేని స్థితిలో చిక్కారు. పలు చోట్ల రవాణా వ్యవస్థ కుంటుపడింది. పరిస్థితిని గుర్తించి ఇప్పుడు పలు రాష్ట్రాలలో సూపర్మార్కెట్లకు జనం ఎగబడి సరుకులు కొనుక్కుని వెళ్లుతున్నారు. దీనితో ఇవి దాదాపుగా ఖాళీ అయ్యాయి. ఇంతకు ముందు లేని రీతిలో ఇప్పుడు అసాధారణంగా టెక్సాస్ , ఒక్లాహామా వంటి రాష్ట్రాలపై మంచు తుపాన్ పంజా విసిరింది. శరీరం గడ్డకట్టుకుపోయే చలి, విద్యుత్ సరఫరాకు అంతరాయాలు, బ్లాకౌట్ పరిస్థితి , వాహనాలు నిలువెత్తు మంచులో కూరుకుని పోవడంతో ప్రజల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి. బారీ వర్షం, మంచు కురియడంతో పరిస్థితి దిగజారింది. గురువారం శుక్రవారం రాత్రి అంతా మంచుతుపాన్ తాకిడి ఉంది. ఇది ఎక్కువ రోజులు ఉంటుందని హెచ్చరికలు వెలువడ్డాయి. మంచుతుపాన్తో ఉపద్రవ స్థాయిలో పలు చోట్ల భారీ స్థాయిలో మంచు పడుతుందని జాతీయ వాతావరణ సేవల విభాగం తెలిపింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. చెట్లు భారీ సంఖ్యలో కూలిపోవచ్చు. అత్యంత అవసరం అయితే తప్పితే ప్రయాణాలకు దిగరాదు. దాదాపుగా వాహనాలు నడిచే పరిస్థితి లేదని అధికారికంగా ప్రకటించారు. దేశ సెంట్రల్ , ఆగ్నేయ ప్రాంతాలపై విరుచుకుపడ్డ మంచుతుపాన్ ఇప్పుడు అత్యంత జనసమ్మర్థపు మధ్య అట్లాంటిక్ , ఈశాన్య రాష్ట్రాల వైపు కూడా సాగుతుంది. దీనితో న్యూ మెక్సికో నుంచి ఈస్టర్న్ సీ బోర్డు ప్రాంతం వరకూ ప్రభావం పడుతుందని వాతావరణ విభాగం తెలిపింది. ఈ వారాంతంలో 2700 విమానాలు రద్దు అయ్యాయి. తిరిగి ప్రకటించే వరకూ దేశీయ మార్గాలలో విమానాల రాకపోకలు నిలిచిపోతాయి. పైగా ఇతర దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. న్యూయార్క్ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా మారింది. ప్రజలు ఎవరూ బయటకు గరాకూడదని గవర్నర్ కెథీ హోచుల్ తెలిపారు. ఐదారు నిమిషాలు బయట తిరిగినా అది ప్రాణాలకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ లేడీ గవర్నర్ సూచించారు. న్యూయార్క్ నూతన మేయర్ మమ్దానీకి ఇప్పుడు ఈ వైపరీత్యం పెద్ద సవాలుగా మారింది. చికాగో ఇతర ప్రాంతాల్లో పరిస్థితి గడ్డకట్టుకు పోయే విధంగా మారింది.
Within 5 Days |నిరాధార వ్యాఖ్యలపై బండి సంజయ్, ధర్మపురి అరవింద్లకు
Within 5 Days | నిరాధార ఆరోపణలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం బండి
Talented Tamil actor Suriya wants to bounce back with a bang after his recent offerings ended up as debacles. He has completed the shoot of Karuppu which will release soon. His next film with Venky Atluri is slated for May 1st release in Telugu and Tamil languages. Suriya is currently shooting for his next film […] The post Suriya’s 50th Film Updates appeared first on Telugu360 .
Arrest |బుల్లెట్ దొంగల ముఠా అరెస్ట్
Arrest | బుల్లెట్ దొంగల ముఠా అరెస్ట్ ఏడాది కాలంగా కొనసాగుతున్న వాహన
మహిళా కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టి.. గంజాయి గ్యాంగ్హల్ చల్#News #TeluguNews #viralvideo
యువత ఉపాధి అవకాశాల కోసమే ఒప్పందాలు: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశంలో యువతరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల మెరుగుకే విదేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అత్యంత జాగరూకతతో ఆలోచించుకునే స్పందించడం జరుగుతుంది. దేశాలతో ట్రేడ్, పరస్పర సంచార ఒప్పందాలకు తగు ప్రాధాన్యత ఉంటుందన్నారు. దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ మన యువతకు ఎక్కువ అవకాశాల కల్పనకే టేడ్ డీల్స్ కుదురుతాయని వివరించారు. శనివారం ప్రధాని మోడీ 18వ రోజ్గార్ మేలా సందర్భంగా 61 వేలకు పైగా పలు ప్రభుత్వోద్యోగాలు ఆన్లైన్ ప్రక్రియలో పంపించిన దశలో ప్రధాని మాట్లాడారు. దేశాల మధ్య ప్రజల పరస్పర పర్యటనలు అవసరం. యువతకకు ఇది ఉద్యోగ ఉపాధి కల్పనల పటిష్టతకు దారితీస్తుందని చెప్పారు. యువతకు విదేశాలలో అవకాశాల కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని వివరించారు. దేశంలో 45 ప్రాంతాలలో ఈ 18వ రోజ్గార్ మేలాను కార్యక్రమం నిర్వహించారు. పలు మంత్రిత్వశాఖలలో ఇప్పుడు ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని పంపించారు.
పాన్-ఇండియా బ్లాక్బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ‘స్వయంభు’తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. స్వయంభు ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. సమ్మర్ రిలీజ్ కి ఇది పర్ఫెక్ట్ డేట్. స్వయంభు విఎఫ్ఎక్స్ అద్భుతంగా వుండబోతున్నాయి. ఇండియాలో టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయి. ఇందులో తన పాత్ర కోసం నిఖిల్ పూర్తిగా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడంతో పాటు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు.
నాకు పార్టీతో కొన్ని సమస్యలు ఉన్నాయి: శశి థరూర్
కోజికోడ్: తనకు పార్టీతో కొన్ని సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తెలిపారు. అయితే వీటిని తాను పార్టీ అధినాయకత్వంతో ప్రస్తావిస్తానని చెప్పారు. కానీ తాను ఎప్పుడూ పార్టీలో నిర్ధేశిత క్రమశిక్షణా రేఖలు దాటలేదని స్పష్టం చేశారు పార్లమెంట్లో పార్టీ పేర్కొన్నట్లే వ్యవహరించినట్లు వివరించారు. పార్టీలో అంతర్గత విభేదాలు అనేవి సహజం, వీటిని చర్చలతో పరిష్కరించుకోవచ్చునని, మీడియా ద్వారా కాదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ కీలక ఉద్యమ కార్యక్రమానికి థరూర్ హాజరుకాలేదు. ఈ దశలోనే ఆయన ప్రధాన మంత్రి మోడీ తిరువనంతపురం పర్యటనపై శ్రద్ధ చూపారనే వార్తలు వెలువడ్డాయి. అంతేకాకుండా కేరళ కాంగ్రెస్ వ్యవహారాలలో తనను పట్టించుకోవడం లేదని, ఇటీవ కోచిలో కార్యక్రమాలకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ తనను చూసీచూడనట్లు ఉన్నాడని థరూర్ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే థరూర్ స్పందించారు. పార్టీతో కొన్ని అంశాలు ఉన్నాయనే చెప్పాలి. అయితే వీటిని సమస్యలుగా కూడా భావించాల్సి ఉంటుందన్నారు. తాను పార్టీ సమావేశాలకు హాజరు కాలేనప్పుడు ఎప్పటికప్పుడు ముందుగానే నాయకత్వానికి తెలియచేస్తున్నానని, వివాదాస్పదం అయితే తనకు సంబంధం లేదన్నారు.
రామగుండం సిపి ఎదుట 8మంది మావోల లొంగుబాటు
రామగుండం సిపి అంబర్ కిషోర్ ఎదుట నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 8మంది మిలీషియా, కొరియర్, సాంసృ్కతిక విభాగం, లోకల్ కమిటీ సభ్యులు లొంగిపోయారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్న వివిధ రకాల సహాయ సహాకారాలు, లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను తెలుసుకుని, తాము కూడా కుటుంబీకులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని లొంగిపోయినట్టు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులలో వెల్గటూర్ మండలం చెగ్యాంకు చెందిన ధర్మాజీ శ్రీకాంత్ (మావోయిస్టు కొరియర్), పొడియం కాములు (మిలీషియా కమాండర్), ముడియం జోగ (సాంసృ్కతిక ప్రచార కార్యకర్త), కుంజం లక్కె (పార్టీ సభ్యురాలు), మోదం భీమ (మిలీషియా సభ్యుడు), కుంజం ఉంగా (జిఎడి కమాండర్), ముడికం సుక్రం (మిలీషియా సభ్యుడు), ముడియం మంగు (మిలీషియా సభ్యుడు) ఉన్నారు. వీరిలో శ్రీకాంత్ ఒక్కడే తెలంగాణవాసి. మిగిలిన వాళ్లంతా చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గాంగేలురు పోలీస్ స్టేషన్ పరిధి గంపుర్ గ్రామానికి చెందినవారు. ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడండి: సిపి ఆయుధాలు, అజ్ఞాతం వీడి... జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు సీపీ అంబర్ కిషోర్ పిలుపునిచ్చారు. తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని, తెలంగాణ అభివద్ధికి తోడ్పడాలన్నారు. అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. వారు స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందజేయడానికి రామగుండం కమిషనరేట్ పోలీసు శాఖ ఎల్లప్పుడూ కషి చేస్తుందన్నారు. మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిందని, చదువరులెవరూ మావోయిస్టు పార్టీవైపు ఆర్షితులు కావడం లేదన్నారు. అజ్ఞాతంలో ఉన్న అదిలాబాద్, కరీంనగర్ జిల్లా మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని కోరారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఎఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్స్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, భీమేష్, ఆర్ఐ శేఖర్, ఆర్ఎస్ఐలు వెంకట్, శివ, తదితరులు పాల్గొన్నారు.
దేశంలో వాంటెడ్ అయిన ఫరారీ నేరస్తులు 70 మందికి పైగా విదేశాలలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2024 25 సంవత్సరంలో వీరి ఆచూకిని కనుగొన్నట్లు అధికారిక నివేదికలో తెలిపారు. ఇక ఇదే సమయంలో ఇతర దేశాలకు చెందిన ఫరారీదార్లు 203 మంది వరకూ భారతదేశంలో ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పర్సనల్, ప్రజా సమస్యలు, పెన్షన్ల మంత్రిత్వశాఖ వెలువరించిన వార్షిక నివేదికలో ఈ విషయం స్పష్టం అయింది. వేరే దేశాలకు పారిపోయిన నేరస్తుల సంఖ్య పది సంవత్సరాల కాలంలో ఈసారి అత్యధికంగా ఉందని తెలిపారు. ఇక గత ఏడాది భారత్కు 27 మంది ఫరారీదార్లు తిరిగి వచ్చినట్లు కనుగొన్నారు. మంత్రిత్వశాఖ గడిచిన సంవత్సరంలో సిబిఐ , ఎన్సిబి పనితీరు గురించి కూడా నివేదిక వెలుడరించింది. ఇక నేరాలకు పాల్పడి పారిపోయిన వారిని తిరిగి రప్పిందేందుకు జరిపై లెటర్స్ రోగేటరీ న్యాయపరమైన ప్రక్రియ గురించి కూడా వెల్లడించారు. గత ఏడాది మార్చి 25 నాటికి పలు దేశాలకు సిబిఐ కేసులకు సంబంధించి ఇటువంటి 74 ఎల్ఆర్ఎస్లను పంపించారు . సిబిఐ కేసుల విషయాలలో 276 ఎల్ఆర్లు పెండింగ్లో ఉన్నాయి. 257 కేసులు రాష్ట్ర పోలీసు విభాగాలు, ఇతర కేంద్ర చట్టాల అమలు సంస్ధల పరిధిలోని కేసులు ఉన్నాయి.
8 సంవత్సరాలుగా బదిలీలకు నోచుకొని ఎక్సైజ్ కానిస్టేబుళ్లు
8 సంవత్సరాలుగా సుమారుగా 2,700ల మంది కానిస్టేబుళ్లకు పదోన్నతులు, బదిలీలు లేకపోవడం, మరో 200ల మంది కానిస్టేబుళ్లను అప్గ్రేడేషన్ చేయకపోవడంతో తమ సమస్యను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక వారు సతమతమవుతున్నారు. దీంతోపాటు 2017లో అధికారులు బదిలీలు జరగ్గా, 2018లో కానిస్టేబుళ్ల బదిలీలు, 2022 ఏప్రిల్లో ఈఎస్లకు పదోన్నతి ఇచ్చి వారికి బదిలీలు, 2024లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని 130 మందిని చేసిన బదిలీలు తప్ప ఇప్పటివరకు ఈ శాఖలో పూర్తిస్థాయి బదిలీలు, పదోన్నతులు జరగలేదని ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జనవరిలో 99 మందికి పదోన్నతులు కల్పించిన ఎక్సైజ్ శాఖ అధికారులు వారికి పోస్టింగ్ ఇస్తే అనంతరం ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు కూడా పదోన్నతులు ఇచ్చి బదిలీ చేసే అవకాశం ఉంటుందని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.
అండర్19 వరల్డ్ కప్: చెలరేగిన వైభవ్, ఆయూష్.. న్యూజిలాండ్పై భారత్ విజయం
అండర్-19 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై యువ భారత్ ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 13.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. వైభవ్ సూర్యవంశీ(23 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సులు) 40 పరుగులు చేశాడు. ఆయూష్ మాత్రే (27 బంతుల్లో 2 ఫోర్లు, ఆరు సిక్సులు) 53 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ బౌండరీలు బాదుతూ చెలరేగడంతో.. ఏడు వికెట్ల తేడాతో కిస్ ను టీమిండియా(డక్వర్త్లూయిస్ పద్ధతి) ఓడించింది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాల్లో వేసుకుంది. అంతకుముందు, టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో కేవలం 135 పరుగులకే పరిమితమైంది. కివీస్ బ్యాటర్లలో కల్లమ్ సామ్సన్ 37 పరుగులు, సెల్విన్ సంజయ్ 28 పరుగులు, జాకబ్ కాటర్ 23 పరుగులు చేశారు. టాపార్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. బౌలర్లలో ఆర్ అంబ్రిష్ నాలుగు వికెట్లు, హెనిల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఖిలాన్ పేటల్, మొహమ్మద్ ఎనాన్, కనిష్క్ చౌహాన్ లు తలో వికెట్ తీశారు.
Expected Release date of Chiranjeevi’s Vishwambara
Vishwambara is one of the costliest films made in Megastar Chiranjeevi’s career. To get the best output, the team has decided to push the film’s release. Chiranjeevi’s recent offering Mana Shankara Vara Prasad Garu emerged as a major hit during Sankranthi holiday season and the discussion is now going on about the release date of […] The post Expected Release date of Chiranjeevi’s Vishwambara appeared first on Telugu360 .
మహిళపై కత్తితో దాడి చేసిన దొంగ
ప్రతిఘటించిన మహిళపై గొలుసు దొంగ కత్తితో దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలు లోని మంగమూరి రోడ్డులో ఓ కిరాణ దుకాణంలో మహిళ సరుకులు కొనుగొలు చేయడానికి వెళ్తుండగా ఓ దొంగ మహిళ మెడలో బంగారు గొలుసు తెంచుకొని పరారయ్యేందుకు యత్నించాడు. ఈ ఘటనలో మహిళ ప్రతిఘటించడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం దొంగ పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందుతుడు గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Crime |ఇళ్ళల్లో చోరీలు చేసే అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
Crime | ఇళ్ళల్లో చోరీలు చేసే అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్ Crime
సిపి సజ్జనార్ నోటీసులకు సమాధానం ఇస్తా: ఆర్ఎస్ ప్రవీణ్
నగర పోలీస్ కమిషన్ సజ్జనార్ ఇచ్చిన నోటీసులకు సమాధానంగా తన వద్ద ఉన్న సమాచారంతో జవాబు ఇస్తానని, ఆ తరువాత ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చని బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిపి సజ్జనార్ నోటీసులపై ఆయన ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను వ్యక్తిగత దూషణలు చేయనని, చిల్లర భాష వాడనని, వాస్తవాలు దాచనని, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపబోనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెటిఆర్, హరీశ్ రావుకు సంబంధం లేకున్నా నోటీసులు ఇచ్చి సిట్ గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తున్న ప్రహసనాన్ని ఖండించిన 12 గంటల్లోనే పోలీసులు ఇంటికి వచ్చిన తనకు నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఆధారాలతో సహా సమాధానం ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధం కావాలని హెచ్చరించారని తెలిపారు. ప్రజా సమస్యలు, దౌర్జన్యాలపై గొంతెత్తడం తన హక్కు అని.. వార్నింగ్లకు భయపడబోనని అన్నారు. సిట్ ఛీఫ్ సజ్జనార్ మీద ఎపిలో నమోదైన కేసులపై మరో సిట్ వేయాలని తాను డిమాండ్ చేసినట్లు నోటీసులో ఉందని, అది వాస్తవ విరుద్ధమని తోసిపుచ్చారు. తాను సిట్ ఛీఫ్ సజ్జనార్ మీద ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసుల మీద మరో సిట్ వేయాలని డిమాండ్ చేసినట్లుగా నోటీసులో ఉందని, ఇది వాస్తవ విరుద్ధం అని చెప్పారు. గతంలో ఓటుకు నోటు కేసులో లైవ్ కెమెరాలో నాటి టిడిపి ఎంఎల్ఎ, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అడ్డంగా దొరికిన తరువాత, ఆంధ్రప్రదేశ్ నాయకుల ఫోన్లు తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు ట్యాప్ చేశారని 2015 జూన్ నెలలో ఆంధ్రలో చాలా పోలీసు స్టేషన్లలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసులు నమోదయ్యాయని పత్రికల్లో చాలా వార్తలొచ్చాయని, ఆ సమయంలో ఆంధ్రలో కూడా ఒక సిట్ కూడా ఏర్పాటు అయ్యిందని తెలిపారు. ఆ కాలంలో నేటి సిపి సజ్జనార్ కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో అధికారిగా పనిచేశారు అన్న అవగాహన తనకు ఉందని, అందుకే ఆయన ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారంపై వేసిన రెండో తెలంగాణ సిట్కు ఛీఫ్గా ఉండడం నైతికంగా కరెక్ట్ కాదు అని తన అభిప్రాయం చెప్పానని వివరించారు. ఇది రాజ్యాంగం తనకు కల్పించిన హక్కు అని, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల ముందుకు ఈ మరుగున పడిన విషయాలను ప్రజల ముందుకు తీసుకరావాల్సిన కనీస బాధ్యత తనపై ఉందని వ్యాఖ్యానించారు. పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాజకీయ క్రీడలో పావులుగా మారవద్దని సలహా ఇచ్చినట్లు తెలిపారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పలు కుంభకోణాల(బొగ్గు కుంభకోణంతో సహా) మీద సిట్ వేయాలని డిమాండ్ చేశానని అన్నారు. నాటి డిజిపి, హోం సెక్రటరీ, సిఎస్ లాంటి అధికారులందరినీ విడిచిపెట్టి సిట్ అధికారులు కేవలం విశ్రాంత ఐపిఎస్ ప్రభాకర్ రావు, ఆయన కుటుంబాన్ని, ఆయనతో పనిచేసిన కానిస్టేబుళ్లు, బంధువులను వేధించడం అన్యాయమని చెప్పినట్లు వివరించారు. తాను సజ్జనార్ సహా ఏ అధికారి, ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదని... ఆ సంస్కృతి తనకు లేదని తెలిపారు.
Chhattisgarh | 28 ఏళ్ల అజ్ఞాతానికి తెర…
Chhattisgarh | 28 ఏళ్ల అజ్ఞాతానికి తెర… Chhattisgarh | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ
Marriage |ఐఏఎస్, ఐపీఎస్లు ఆదర్శ వివాహం
Marriage | ఐఏఎస్, ఐపీఎస్లు ఆదర్శ వివాహం Marriage | చౌటుప్పల్, ఆంధ్రప్రభ
Maoist |అచ్చంపేటలో కీలక మావోయిస్టుల అరెస్ట్
Maoist | అచ్చంపేటలో కీలక మావోయిస్టుల అరెస్ట్ Maoist | అచ్చంపేట, ఆంధ్రప్రభ
యువతను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమిద్దాం
ఎఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా మన తెలంగాణ / హైదరాబాద్ : యువతను మోసం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమిద్దామని అఖిల భారత యువజన సమాఖ్య(ఎఐవైఎఫ్) జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా పిలుపునిచ్చారు. ఎఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశం శనివారం హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రోషన్ కుమార్ ముఖ్య నేతగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ప్రమాధకరమని, దేశాన్ని 100 సంవత్సరాలు వెనక్కి నెట్టేలా ఆర్ఎస్ఎస్ విధానాలతో పాలించడానికి నీచ కుటిల రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. ఈ విధానాలను దేశ యువత, పౌరులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశ పౌరులకు అందించాల్సిన సంక్షేమ ఫలాలు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మోడీ అంటే కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేసి ఊడిగం చేసే ప్రధాని అని, ప్రధాని బాధ్యతను సైతం దుర్వినియోగం చేసే చరిత్రహీనుడని ధ్వజమెత్తారు. మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బలవంతంగా దేశంలో మత ఉన్మాదం అనే కాషాయ విష బీజాలను విద్యార్థులు, యువత మెదళ్లలో చొప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విధానాలను దేశ యువత అంగీకరించడానికి సిద్ధంగా లేరని అన్నారు. అందుకే ఎఐవైఎఫ్ పోరాటాలను ఉదృతం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ టి.సత్య ప్రసాద్,కొండల్ చేపూరి,బిజ్జ శ్రీనివాసులు, పేరబోయిన మహేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. బాలక్రిష్ణ, సల్మాన్ బేగ్, ఎండి. కుతూబ్, పి. శివ కుమార్, రాజ్ కుమార్, రాష్ట్ర సమితి సభ్యులు షేక్ మహమూద్, శ్రీకాంత్, ఆంజనేయులు, కళ్యాణ్, శేఖర్, వెంకటేష్, భగత్ సింగ్, మధుకర్, మహేష్, అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లిలో భారీగా ట్రాఫిక్.. ఇటువైపు రావోద్దంటూ పోలీసులు..
హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబిడ్స్, నాంపల్లి, ఎంజె మార్కెట్, ఏక్మినార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాలను ఇతర మార్గాలకు మళ్లీస్తూ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక, అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్కు ఎవరూ రావొద్దని పోలీసులు సూచించారు. ఎగ్జిబిషన్ పర్యటన వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు. కాగా, నాంపల్లిలో ఓ ఫర్నీచర్ షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టారు. ఫర్నీచర్ షోరూమ్ గోదాం భవనంలో వాచ్మెన్ కుటుంబంలో ఇద్దరు పిల్లలు, మరో కుటుంబంలోని నలుగురు పెద్దవారితో సహా ఆరుగురు చిక్కుకున్నట్లు గుర్తించారు. దాదాపు 4 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మున్సిపాలిటీల వారీగా బిఆర్ఎస్ సమన్వయకర్తల నియామకం
మున్సిపల్ ఎన్నికలకు ఇంఛార్జ్లను నియమించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రత్యేక సమన్వయకర్తలను నియమించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడిని ఎన్నికల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం ఈ సమన్వయకర్తల ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి ముగిసే వరకు వీరు నిరంతరం ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంటారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈ సమన్వయకర్తలు కీలక పాత్ర పోషిస్తారు. స్థానిక నాయకత్వంతో చర్చించి, గెలుపు గుర్రాలను గుర్తించి, నివేదికలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి సమర్పిస్తారు. అంతేకాకుండా, పార్టీ రూపొందించిన ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, బూత్ లెవల్ ఏజెంట్లను సమన్వయం చేయడం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. ఎన్నికల సరళిని, గ్రౌండ్ రిపోర్టులను ఎప్పటికప్పుడు తెలంగాణ భవన్లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు నివేదించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పార్టీ తరపున నియమించబడిన మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తల పూర్తి జాబితాను వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శనివారం అధికారికంగా విడుదల చేశారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఈ సందర్భంగా కెటిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
کیا حالیہ دنوں میں گڑگاؤں میں برفباری ہوئی؟ جانئے وائرل ویڈیو کی سچائی
حالیہ دنوں میں گڑگاؤں میں برفباری کے دعوے کے ساتھ سوشل میڈیا پلیٹ فارمس پر ایک ویڈیو وائرل ہورہا ہے۔ تحقیق میں پایا گیا کہ یہ ویڈیو مارچ 2023 کے اولوں کے طوفان کا ہے
అగ్నిప్రమాదంలో ఆరుగురు.. టెన్షన్.. టెన్షన్ #News #TeluguNews #FireAccident #BreakingNews #Emergency
చత్తీస్ ఘడ్ లో రాత్రికి రాత్రే పది టన్నుల వంతెన చోరీ
రాత్రికి రాత్రే 10 టన్నులకు పైగా బరువున్న భారీ ఇనుప వంతెన చోరీకి గురైన వింత ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈఘటన ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లా4లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కోర్బా నగరంలోని ధోధిపారా ప్రాంతంలో ఉన్న హస్డియో లెఫ్ట్ కెనాల్ పై 70 అడుగుల పొడవైన వంతెన నిర్మించారు.ఇది సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన స్టీల్ వంతెన. దీని పొడవు 70 అడుగులు కాగా, వెడల్పు 5 అడుగులు. దీని బరువు దాదాపు 10 నుండి 15 టన్నులు ఉంటుందని అధికారులు అంచనా వేశారు జనవరి 18, 2026 మధ్య రాత్రి ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. జనవరి 18 ఉదయం స్థానికులు చూసేసరికి వంతెన ఉన్న చోట కనిపించలేదు.దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జనవరి 17న రాత్రి సమయంలో దొంగలు పక్కా ప్లాన్తో గ్యాస్ కట్టర్లను ఉపయోగించి వంతెనను ముక్కలుగా కట్ చేశారు.కట్ చేసిన ఇనుప భాగాలను రాత్రికి రాత్రే ట్రక్కుల్లో లోడ్ చేసుకుని పరారయ్యారు. స్క్రాప్ (పాత ఇనుము) విక్రయించే మాఫియా ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఈ చోరీలో దాదాపు 15 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించగా, ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కాలువ లోపల దాచిన సుమారు 7 టన్నుల స్టీల్ మరియు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్నసూత్రధారులుగా భావిస్తున్న ముఖేష్ సాహు, అస్లాం ఖాన్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో బీహార్లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. అక్కడ దొంగలు నీటిపారుదల శాఖ అధికారులమని నమ్మించి మరీ కిలోమీటర్ల పొడవైన వంతెనను కట్ చేసి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అలాంటిదే రిపీట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
నైనీ టెండర్ రద్దు చేశారంటే స్కాం జరిగినట్టే కదా..?
అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయలేదు సోలార్ స్కాంపై మౌనమెందుకు డిప్యూటీ సిఎం భట్టికి హరీష్రావు కౌంటర్ మనతెలంగాణ/హైదరాబాద్ : డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఎన్ని సాకులు చెప్పినా బొగ్గు కుంభకోణం, అందులో సిఎం బావమరిది రింగ్మెన్ పాత్ర పోషించడం నిజం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు ఆరోపించారు. నైనీ టెండర్ రద్దు చేశారంటే.. స్కాం జరిగినట్టే కదా..? అని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంపై భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రెస్మీట్పై హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, భట్టి విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నైనీ టెండర్ రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ లా ఏదో చెప్పి, మసిబూసి మారేడు కాయ చేశారని విమర్శించారు. ఎన్ని సాకులు చెప్పినా కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం.. అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్గా పాత్ర పోషించింది నిజం అని పేర్కొన్నారు. ఏ స్కాం జరగకుంటే నైనీ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారని సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం తాను బయటపెట్టిన మరో కుంభకోణం.. సోలార్ పవర్ స్కాం గురించి ఎందుకు ఒక్క మాట కూడా భట్టి విక్రమార్క ప్రెస్మీట్లో మాట్లాడలేదు..? అని నిలదీశారు. నైనీని రద్దు చేసినట్లే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బిఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్దాలు అయిపోవు... జరిగిన స్కాంలు, స్కీంలుగా మారిపోవు అని విమర్శించారు. సైట్ విజిట్ నిబంధనను 2018లోనే మొదలైందని చెప్పి, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారు..? అని అడిగారు. అది తప్పు కాకుంటే నైనీ ఎందుకు రద్దు చేసినట్లు..? అని ప్రశ్నించారు. ఇదే సైట్ విజిట్ విధానం సింగరేణిలో కూడా అమలు చేసామని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు హరీష్రావు ధన్యవాదాలు తెలిపారు. సైట్ విజిట్ అమలయ్యింది, నైనీ రద్దు జరిగింది అంటే.. స్కాం జరిగినట్లే కదా..? అని నిలదీశారు. భట్టి విక్రమార్క అంటే తమకు చాలా గౌరవం అని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐ మాత్రమే చేయగలవు అన్న ఉద్దేశ్యంతోనే తాను లేఖ రాసానని హరీష్రావు పేర్కొన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి, అతని బావమరిది కుంభకోణం మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాను అని హామీ ఇస్తే మీకూ లేఖ రాయడానికి తాను సిద్దం అని భట్టి విక్రమార్కను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
షారుఖ్ ‘కింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. గ్లింప్స్ విడుదల
న్యూఢిల్లీ: పఠాన్, జవాన్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం షారూఖ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ కింగ్. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ మూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటిస్తూ చిన్న గ్లింప్స్ వదిలారు. ఈ ఏడాది చివర డిసెంబర్ 24న క్రిస్మస్ కు కానుగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా,గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా.. రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, రాఘవ్ జుయల్, అభిషేక్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఈ మూవీతో బాలీవుడ్ లోకి అరంగేట్రం చేయనుంది. ఇదిలావుంటే.. కింగ్ మూవీ రిలీజ్ కు వారం ముందే డిసెంబర్ 18న మార్వెల్స్ అవెంజర్స్: డూమ్స్డే విడుదల కానుంది. దీంతో బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్, హాలీవుడ్ సూపర్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు ఉండనుంది.
బుక్కరాయసముద్రం లో టిడిపిలో వర్గ విభేదాలు బహిర్గతం
విశాలాంధ్ర – శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో నిర్వహించిన మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు స్థానికంగా రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీశాయి. కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గం మరియు పార్టీ ద్విసభ్య కమిటీ వర్గీయుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, వేడుకల ఏర్పాట్లలో ఎమ్మెల్యే వర్గానికే ప్రాధాన్యం ఇచ్చి, ద్విసభ్య కమిటీ వర్గాన్ని పక్కన పెట్టడమే వివాదానికి కారణమైంది. ఆహ్వానాల్లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ద్విసభ్య కమిటీ […] The post బుక్కరాయసముద్రం లో టిడిపిలో వర్గ విభేదాలు బహిర్గతం appeared first on Visalaandhra .
చేనేత కార్మికులందరికి వెంటనే రుణమాఫీ వర్తింపచెయ్యాలి
మన తెలంగాణ/మోత్కూర్: రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులదరికీ రుణవిముక్తి చేస్తామని దాదాపు 18 నెలల క్రితం హామీ ఇచ్చి, ఇన్ని రోజులు కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల లబ్ధికోసం కేవలం మున్సిపాల్టీ పరిధిలోని కార్మికులకు రుణ మాఫీ వర్తింపచేయడం అన్యాయమని, ఇచ్చిన హామీమేరకు చేనేత కార్మికులందరికి రుణ మాఫీ వర్తింపచేయాలని చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోత్కూర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమత్రి స్వయంగా రాష్ట్రంలోని చేనేత కార్మికులందరినీ రుణ విముక్తి చేస్తామని చెప్పడమే కాక, 33 కోట్లు విడుదల చేస్తామని జిఓ కూడ ఇస్తున్నట్లు సభవేదిక నుండి దాదాపు 18 నెలల క్రింద ప్రకటించారని తెలిపారు. హామీని అమలు చెయ్యాలని ఎన్నోసార్లు సంబందిత మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, కమిషనర్ ని కలసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నవంబర్ 20 పెద్ద ఎత్తున చేనేత కార్మికులు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడంతో స్పందించిన ప్రభుత్వం 33 కోట్లు ఆర్ధిక శాఖకు విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసిందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చేనేత కార్మికులందరికి వెంటనే రుణమాఫి వర్తింప చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు.
Mother Tree |చెట్ల సంరక్షణపై స్టూడెంట్స్ కు అవగాహన…
Mother Tree | చెట్ల సంరక్షణపై స్టూడెంట్స్ కు అవగాహన… Mother Tree
CM Cup |సీఎం కప్ క్రీడల్లో విద్యార్థులు రాణించాలి…
CM Cup | సీఎం కప్ క్రీడల్లో విద్యార్థులు రాణించాలి… CM Cup
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
మన తెలంగాణ/మోత్కూర్: రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షానూర్ డిమాండ్ చేశారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి.కాజా పసియుద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేశ్, మోత్కూరు మండల అధ్యక్షులు సోమన్న తదితరులు పాల్గొన్నారు.
నితిన్ నవీన్ నెగ్గుకు రాగలరా !
దాదాపు రెండేళ్ల పాటు బీజేపీ అధ్యక్షుడిగా జె.పి.నడ్డాను కొనసాగించి చివరకు బిహార్కు చెందిన నితిన్ నవీన్ ను అధ్యక్షుడిగా నియమించారు. అంతకుకొద్దిరోజుల ముందే ఆయనను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఇలాంటి సంప్రదాయం బీజేపీలో ఇంతకుముందు ఎన్నడూ కనిపించలేదు. నితిన్ నవీన్ అయిదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. బిహార్లో మంత్రిగా ఉండేవారు. ఆయన వయసు 45ఏళ్లు. అంతకన్నా చిన్న వయసులో బీజేపీకి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా 1968లో ఎన్నికైనప్పుడు వాజపేయి వయసు 43 ఏళ్లే. దీన్ దయాళ్ […] The post నితిన్ నవీన్ నెగ్గుకు రాగలరా ! appeared first on Visalaandhra .
ఉత్తరప్రదేశ్లో ఐదుగురు ముస్లిం బాలికలపై ఎఫ్ఐఆర్
ఉత్తరప్రదేశ్లో 2021లో అమలులోకి వచ్చిన చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం బలవంతంగా, మోసం చేసి లేదా ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడి చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. ముఖ్యంగా మైనర్లు, మహిళలు లేదా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన వారిని మార్చడానికి ప్రయత్నిస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మొరాదాబాద్ జిల్లా బిలారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 16 ఏళ్ల హిందూ బాలికను బలవంతంగా బురఖా ధరింపజేయడానికి ప్రయత్నించారని, ఆమెను మత మార్పిడికి ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి. బాధిత బాలిక సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం-2021 సెక్షన్ 3 కింద ఐదుగురు ముస్లిం బాలికలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సంఘటన డిసెంబర్ 12, 2025న జరిగింది. అయితే శుక్రవారం బాలిక సోదరుడు దక్ష్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. నిందితులు , బాధిత బాలిక అందరూ స్నేహితులని, ఒకే కోచింగ్ సెంటర్కు వెళ్లేవారని పోలీసులు గుర్తించారు. ఆ బాలికలు రెస్టారెంట్కు వెళ్తుండగా బాధిత అమ్మాయి తన సోదరుడికి కనబడకుండా ఉండటానికి తన స్నేహితురాలి బురఖాను ధరించి ఉండవచ్చు అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిందితులుగా పేర్కొనబడిన వారు మైనర్లు 15 నుండి 17 ఏళ్ల లోపు కావడంతో, పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకోలేదు. చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనర్లను మత మార్పిడికి ప్రేరేపిస్తే కనీసం 5 ఏళ్ల నుండి 14 ఏళ్ల వరకు కఠిన జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆ బాలికల ఉద్దేశం మత మార్పిడి చేయడమా లేక కేవలం తమ సోదరుడి నుండి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నమా అనేది పూర్తి విచారణలో తేలాల్సి ఉంది.
నాలుగున్నర దశాబ్దాలు. శంకర వరప్రసాద్తో నా స్నేహం. తెర మీదే కాదు… థియేటర్ బయట కూడా. ఆ ఖైదీ చేతిలో నేను బందీ అయ్యాను. ఆ తర్వాత రెండక్షరాల టైటిల్తో వరుసగా వచ్చిన నాలుగైదు సిన్మాలు కళ్ల ముందే తుస్సు మంటే వెండితెర చింపేయాలనిపించింది ఆ పసి వయసులో. మనోడు కదా… కొడతాడులే హిట్టు అని నా భుజం మీద నా చెయ్యే వేసుకుని ధైర్యం చెప్పుకున్నాను. టెరమ్ ఫీజు కట్టేందుకు ఇంకా సమయం ఉన్నా… విజేత […] The post నేను… శంకర వరప్రసాద్… appeared first on Visalaandhra .
నేత్రపర్వంగా ప్రారంభమైన అధ్యయనోత్సవాలు
శాస్త్రోక్తంగా తిరుమంజనం మనతెలంగాణ/యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదాద్రి ఆలయ అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన శనివారం ఉదయం ఆలయంలో నిత్యారాధనల అనంతరం తిరుమంజనంను శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. సాయంత్రం నిత్యారాధనల అనంతరం తొళక్కముతో ప్రారంభించి దివ్య ప్రబంధ సేవాకాలమును పారాయణికులు వేదోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహ్మమూర్తి, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ జె.వినోద్రెడ్డితో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు అధ్యయనోత్సవాల విశిష్టతను వివరించారు. 28 నుంచి బ్రహ్మోత్సవాలు.. ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేశారు. 28న స్వస్తివాచనంతో ప్రారంభంకానున్న ఉత్సవాలు 3వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 30న రాత్రి 7.30 గంటలకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం, 31న రాత్రి 7.30 గంటలకు స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణమహోత్సవం, వచ్చే నెల 1వ తేదీన రాత్రి 8 గంటలకు దివ్యవిమాన రథోత్సవం జరగనున్నట్లు తెలిపారు. ఉత్సవాల కోసం ప్రత్యేక అధికారి.. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింస్వామి వారి అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ జి.వినోద్రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా శనివారం ప్రారంభమైన అధ్యయనోత్సవాలలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచలు చేశారు.
Minister |అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Minister | అభివృద్ధి పనులకు శంకుస్థాపన… Minister | చిట్యాల, ఆంధ్రప్రభ :
studied |బాలికల చదువు భవితకు వెలుగు….
studied | బాలికల చదువు భవితకు వెలుగు…. studied | ఊట్కూర్, ఆంధ్రప్రభ
రెండు బైకులు ఢీ ఒకరి మృతి –ఇద్దరికి గాయాలు
విశాలాంధ్ర- డుంబ్రిగుడ (అల్లూరి జిల్లా) : మండలంలోని పంతలచింత జాతీయ రహదారి మలుపులో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరి మృతి చెందిన సంఘటన దీనికి సంబంధించి స్థానిక ఎస్సై సురేష్ తెలిపిన వివరాలు కితలంగి పంచాయతీ పింపుల్గుడ గ్రామానికి చెందిన గొల్లోరి సుబ్బారావు (24) అనే యువకుడు డుంబ్రిగుడ నుంచి అరకు వైపునకు వెళ్తుండగా, అరకు నుంచి పాడేరువైపు వస్తున్న బైకు మలుపులో బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సుబ్బారావు అనే యువకుడు […] The post రెండు బైకులు ఢీ ఒకరి మృతి – ఇద్దరికి గాయాలు appeared first on Visalaandhra .
చెలరేగిన భారత్ బౌలర్లు.. 135 రన్స్ కే కుప్పకూలిన న్యూజిలాండ్
అండర్-19 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. దీంతో కివీస్ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. వర్షం కారణంగా మ్యాచ్ను 37 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. 22 పరుగులకే న్యూజిలాండ్ ఐదు కీలక వికెట్లో కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లు కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ, టీమిండియా బౌలర్ల దెబ్బకు వరుస వికెట్లు కోల్పోయిన కివీస్ 36.2 ఓవర్లలో కేవలం 135 పరుగులకే పరిమితమైంది. కివీస్ బ్యాటర్లలో కల్లమ్ సామ్సన్ 37 పరుగులు, సెల్విన్ సంజయ్ 28 పరుగులు, జాకబ్ కాటర్ 23 పరుగులు చేశారు. టాపార్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. బౌలర్లలో ఆర్ అంబ్రిష్ నాలుగు వికెట్లు, హెనిల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా..ఖిలాన్ పేటల్, మొహమ్మద్ ఎనాన్, కనిష్క్ చౌహాన్ లు తలో వికెట్ తీశారు.
బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
విశాలాంధ్ర – అనంతపురం టౌన్జా : తీయ బాలిక దినోత్సవం సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కేఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాల నందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఇన్చార్జ్ అధికారి డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ… బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ముఖ్యంగా అత్యున్నత విద్యను అభ్యసించాలని, ఉన్నత పదవులు చేపట్టాలని బాల్యవివాహాలను పూర్తిగా రూపు మాపాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవా […] The post బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి appeared first on Visalaandhra .
students |ఫలితాలే లక్ష్యంగా ప్రణాళికలు అమలు…
students | ఫలితాలే లక్ష్యంగా ప్రణాళికలు అమలు… students | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ
Manchiryala |కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజా ప్రభుత్వం..
Manchiryala | కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజా ప్రభుత్వం.. Manchiryala | మంచిర్యాల,
MLA |ఎమ్మెల్యే గడ్డం వినోద్కు ఘన సన్మానం
MLA | ఎమ్మెల్యే గడ్డం వినోద్కు ఘన సన్మానం MLA | బెల్లంపల్లి,
MLA |బెల్లంపల్లికి ‘అభివృద్ధి’ కళ..
MLA | బెల్లంపల్లికి ‘అభివృద్ధి’ కళ.. MLA | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :
School |ఆడపిల్లల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
School | ఆడపిల్లల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత School | నర్సింహులపేట,
Hyderabad : ఈరోజు నుమాయిష్ కు ఎవరూ రాకండి
నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంతో భారీగా ట్రాఫిక్ స్థంభించింది
Searches |కామారెడ్డి కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు..
Searches | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి కలెక్టరేట్లోని పౌరసరఫరా శాఖ
Field trip |పట్టణ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహకరించాలి
Field trip | పట్టణ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహకరించాలి Field trip
శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు అనుమానాస్పద పరిస్థితుల్లో తమ ఇంట్లో మృతి చెందారు. ఆ కుటుంబంలో నాలుగో సభ్యురాలైన వారి కుమార్తె ఆయేషా (6) అపస్మారక స్థితిలో పడి ఉండగా గుర్తించి, విశాఖపట్నంలోని కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిని మీనక మధు (35), అతని భార్య మీనక సత్యవతి (30), వారి కుమారుడు మోషే (4)గా గుర్తించారు.వనజ గ్రామానికి చెందిన మీనక మధు(35), సత్యవతి(30) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కూతురు మాధురి చినమేరంగి కెజిబివిలో, రెండో కూతురు మోక్ష తాతగారి ఊరు జియ్యమ్మవలస మండలం బొమ్మికలో ఉంటూ చదువు కుంటున్నారు. మిగిలిన ఇద్దరు పిల్లలు మోస్య(4), అయేషా(6) తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు.స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. జియ్యమ్మవలస సబ్-ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్, ప్రాథమిక దర్యాప్తులో చలిని తట్టుకోవడానికి రాత్రంతా గదిలో ఉంచిన బొగ్గుల కుంపటి పొగ పీల్చడం వల్ల కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఊపిరాడక మరణించారని వెల్లడైందని తెలిపారు. వారు తమ మంచం పక్కనే బొగ్గుల కుంపటిని పెట్టుకున్నారని ఆయన చెప్పారు. ఉదయం ఆలస్యమైనా కుటుంబ సభ్యులు నిద్రలేవకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా, మధు, సత్యవతి, మోషే మృతదేహాలు కనిపించాయని, ఆయేషా నేలపై అపస్మారక స్థితిలో పడి ఉందని గుర్తించారని ఆయన తెలిపారు.
RTC drivers |ఆర్టీసీ డ్రైవర్ల సేవలు గొప్పవి….
RTC drivers | ఆర్టీసీ డ్రైవర్ల సేవలు గొప్పవి…. RTC drivers |
Collector |స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన ..
Collector | ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : పరిశుభ్రత ముందుగా మన ఇంటి
Police |రిపబ్లిక్ డే రిహార్సల్స్ అదుర్స్..!
Police | రిపబ్లిక్ డే రిహార్సల్స్ అదుర్స్..! Police | గుంటూరు కలెక్టరేట్
నగరిలో టిడిపి చేసింది శూన్యం: రోజా
తిరుపతి: నగరిలో టిడిపి ఎంఎల్ఎ గాలి భాను ప్రకాశ్ చేసింది శూన్యమని వైసిపి నేత, మాజీ ఎంఎల్ఎ రోజా విమర్శించారు. నగరిలో చంద్రబాబు పర్యటిస్తుండడంతో ఆమె మీడియాతో మాట్లాడారు. కల్యాణమండపం, సబ్ స్టేషన్, పాలిటెక్నిక్ కాలేజీ, పార్కు, షాదీ మహల్ అన్నీ తామే కట్టామన్నారు. పేదవారికి ఇళ్లతో సహా తామే ఇచ్చామని, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ పార్క్ పెడతామని టిడిపి నేతలు చెబుతున్నారని, సిఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలు వినలేక ప్రజలు పారిపోయారని, నగరి నియోజకవర్గానికి ఉపయోగపడేది టిడిపి చెప్పినదాంట్లో ఒక్కటి లేదన్నారు. నగరి టిడిపికి కంచుకోట అని, సూపర్ సిక్స్ ప్రకటిస్తే అసాధ్యం అన్నారని, సూపర్ సిక్స్లను సూపర్ హిట్గా అమలు చేసి చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పెన్షన్లు, తల్లికి వందనం సహా అన్ని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో ఎపిని నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

21 C