SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

KCR : నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేడు విచారించనున్నారు

తెలుగు పోస్ట్ 1 Feb 2026 9:23 am

నేటి నుంచి నారాయణ విదేశీ పర్యటన

ఈరోజు నుంచి మంత్రి నారాయణ విదేశీ పర్యటనలో ఉండనున్నారు

తెలుగు పోస్ట్ 1 Feb 2026 9:18 am

Hyderabad |ఆ వార్తలు అవాస్తవం –సీపీ సజ్జనార్..

Hyderabad | ఆ వార్తలు అవాస్తవం – సీపీ సజ్జనార్.. Hyderabad, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Feb 2026 9:12 am

Gold Prices Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్... ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి

తెలుగు పోస్ట్ 1 Feb 2026 9:09 am

Tirumala : ఆదివారం తిరుమలకు వస్తున్నారా?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 1 Feb 2026 8:50 am

కవల పిల్లలకు జన్మనిచ్చిన రామ్ చరణ్ దంపతులు

హైదరాబాద్: సినీ నటుడు రామ్ చరణ్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబం ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఉపాసన మగ, ఆడ శిశువులకు జన్మనిచ్చారని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, తన కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం అనేది తాత నానమ్మలుగా మాకు చాలా ఆనందంగా ఉందని, ఇది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమని తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రార్థనలు, ప్రేమ, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలకు హృదయపూర్వకంగా తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాంచరణ్, ఉపాసన దంపతులకు క్లింకారా అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో రాంచరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  ఎఐ ఫొటో  

మన తెలంగాణ 1 Feb 2026 8:25 am

Ram Charan and Upasana Blessed with Twins

Mega Powerstar Ram Charan and Upasana are expecting their second child and the duo has been blessed with twins: a baby boy and a baby girl. This is a great moment to cheer up in the Mega family. Megastar Chiranjeevi took to his official social media page to announce the news. He also confirmed that […] The post Ram Charan and Upasana Blessed with Twins appeared first on Telugu360 .

తెలుగు 360 1 Feb 2026 8:25 am

Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. రెండు తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చలి తీవ్రత పూర్తిగా తగ్గలేదు.

తెలుగు పోస్ట్ 1 Feb 2026 8:24 am

Gadde Anuradha |అంబటి రాంబాబు, జగన్ క్షమాపణ చెప్పాలి..

Gadde Anuradha | అంబటి రాంబాబు, జగన్ క్షమాపణ చెప్పాలి.. Gadde Anuradha,

ప్రభ న్యూస్ 1 Feb 2026 8:10 am

Andhra Pradesh : అంబటితో ఎంత తప్పిదమో.. టీడీపీ కూడా అదే తప్పు చేసినట్లే

మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు

తెలుగు పోస్ట్ 1 Feb 2026 8:03 am

బాలీవుడ్ దర్శకుడు ఇంటి వద్ద కాల్పులు

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. జుహు ప్రాంతలో ఆదివారం ఉదయం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. స్థానికుల సమాచారం మేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. కాల్పుల సమయంలో రోహిత్ ఇంట్లో ఉన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 1 Feb 2026 7:59 am

1st FebCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

1st FebCartoon | నేడు పార్లమెంటులో బడ్జెట్: సామాన్యుల ఆశలు, వాస్తవం 1st

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:57 am

India vs Newzealand : క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే విక్టరీ.. వరల్డ్ కప్ కు ముందు సూపర్ విక్టరీ

ప్రపంచ కప్ ముందు భారత్ కు కిక్కిచ్చే విజయం లభిచింది.

తెలుగు పోస్ట్ 1 Feb 2026 7:45 am

1feb2026 ఆదివారం పంచాంగం |మాఘ పౌర్ణమి విశేషాలు, రాశి ఫలితాలు

1feb2026 |ఆదివారం పంచాంగం: మాఘ పౌర్ణమి, గ్రహ స్థితి, రాశి ఫలితాలు 1

ప్రభ న్యూస్ 1 Feb 2026 7:27 am

కొండదిగిన వెండి రూ.లక్ష క్షీణించిన కిలో ధర

రూ.21,860 తగ్గిన 10 గ్రాముల బంగారం న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో శుక్రవారం భారీ కుదుపు ఏర్పడింది. అంతర్జాతీయ విపణిలో …

జనం సాక్షి 1 Feb 2026 6:26 am

హైదరాబాద్ కోఠిలో కాల్పుల కలకలం

` ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యక్తిపై కాల్పులు ` రెండు రౌండ్లు కాల్పులు జరిపి రూ.6 లక్షలు లాక్కెళ్లిన దుండగులు హైదరాబాద్(జనంసాక్షి):ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ …

జనం సాక్షి 1 Feb 2026 6:25 am

జనం నుంచి వనంలోకి..

` మేడారంను వీడిన వనదేవతలు ` చిలుకలగుట్టకు సమ్మక, కన్నెపల్లికి సారలమ్మ పయనం ములుగు బ్యూరో(జనంసాక్షి):మేడారం మహాజాతర నాలుగో రోజు ముగిసింది. శనివారం గద్దెల వద్ద పూజల …

జనం సాక్షి 1 Feb 2026 6:23 am

అమెరికాలో మళ్లీ షట్‌డౌన్

` బడ్జెట్ ఆమోదంలో కాంగ్రెస్ మళ్లీ విఫలం వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయింది. 2026 బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు అర్ధరాత్రితో ముగియడంతో …

జనం సాక్షి 1 Feb 2026 6:22 am

బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరగాలి

` గతంలో లాగా కాకుండా కేటాయింపులు పెరగాలి ` అన్యాయం జరిగితే బీజేపీ ఎంపీలదే బాధ్యత ` మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం నేడు …

జనం సాక్షి 1 Feb 2026 6:21 am

చర్లపల్లి వద్ద విషాద ఘటన

తల్లీ ఇద్దరు పిల్లలు ఆత్మహత్య రైలుకింద పడి బలవన్మరణం హైదరాబాద్(జనంసాక్షి):నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం …

జనం సాక్షి 1 Feb 2026 6:20 am

గెలుపు గుర్రాలకే అందలం

` స్థానికంగా గెలిచే వారికే కాంగ్రెస్ టిక్కెట్లు ` రెబల్స్ బెడద లేకుండా చూసుకోండి ` కాంగ్రెస్ నేతలకు సూచించిన సీఎం రేవంత్ హైదరాబాద్(జనంసాక్షి): మున్సిపల్ ఎన్నికలను …

జనం సాక్షి 1 Feb 2026 6:19 am

ఐటీ మినహాయింపులపైనే అందరి చూపు

` నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నిర్మలాసీతారామన్ ` ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం న్యూఢిల్లీ(జనంసాక్షి): కేంద్రమంత్రి నిర్మలా సీతరామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశ …

జనం సాక్షి 1 Feb 2026 6:15 am

కేసీఆర్ లేని ఇంటికి నోటీస్ ఎలా అంటిస్తారు?

` పోలీసుల అత్యుత్సాహం ఎవరి కోసం? ` తెలంగాణ తెచ్చిన పెద్దాయననే అవమానిస్తారా! ` ఎక్స్ వేదికగా మండిపడ్డ బీఆరఎస్ నేత కేటీఆర్ ` నోటీసుల పేరుతో …

జనం సాక్షి 1 Feb 2026 6:14 am

విపక్షాల దిమ్మతిరగాలి

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మనమే గెలిచితీరాలని పార్టీ నేతలకు ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ ఫలితాలు బిఆర్‌ఎస్-, బిజెపి నేతలకు దిమ్మతిరిగేలా ఉండాలని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌రెడ్డి శనివారం ఉదయం ము న్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు, ఎంఎల్‌సి మహేష్‌కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు మంత్రు లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ నియోజకవర్గాల ఇంచార్జీలు, ముఖ్య నేతలతో జూమ్ మీ టింగ్ ద్వారా మాట్లాడారు. తొలుత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నుంచి తెప్పించిన సర్వే నివేదికలను వివరించినట్టు సమాచారం. ఈ సం దర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తొంభై శాతం స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందాలని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అందరూ సమిష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమిష్టి కృషి వల్లే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో పార్టీ అభ్యర్థి గెలుపొందారని ఆయన ఈ సందర్భంగా ఉదహరించినట్లు పార్టీ వర్గాలు తెలిపారు. ఆషా-మాషీగా తీసుకోవద్దు.. మున్సిపల్ ఎన్నికలు చిన్నవే కదా అని ఆషా-మాషీగా తీసుకోరాదని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు గెలుపొందిన వారే మనకు వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు పట్టుకొమ్మల్లా, పిల్లర్ల తరహాలో గట్టిగా నిలబడతారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, వత్తిళ్ళకు లొంగి టిక్కెట్లు ఇస్తే నష్టపోతామని ఆయన హెచ్చరించారు. బంధు-మిత్రులనో, ఎవరో ముఖ్య నేత రెకమండ్ చేశారనో టిక్కెట్ కేటాయిస్తే నష్టపోతామని, ఇలాంటి అనుభవం మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయ్యిందని ఆయన గుర్తు చేశారని పార్టీ నాయకుల భోగట్టా. మంచి అభ్యర్థులను, ముఖ్యంగా పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తే, ఓట్లు వేసే వారు కూడా పార్టీలకు అతీతంగా మన పార్టీ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తారని ఆయన చెప్పారని తెలిసింది. రెబెల్స్‌ను బుజ్జగించేందుకు కమిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ చెప్పడాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, అధికార పార్టీకి ఈ తాకిడి తప్పని సరిగా ఉంటుందన్నారు. అయితే టిక్కెట్ కోసం ముందుకు వచ్చిన ఆశావాహులందరినీ ఒక చోట సమావేశపరిచి భవిష్యత్తులో ఇంత కంటే మంచి అవకాశం కల్పిస్తామని, తొందరపడి రెబెల్స్‌గా పోటీ చేసి పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించరాదని నచ్చజెప్పాలని సూచించారు. పార్లమెంటు ఇన్‌ఛార్జిలు ఈ బాధ్యత తీసుకోవాలన్నారు. అవసరమైతే ఇందుకు ఉప కమిటీలు నియమించుకోవాలని, బి-ఫారం ఇచ్చే ముందు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బలహీనంగా ఉన్న చోట్ల.. ఇక బలహీనంగా ఉన్నామని భావించే చోట మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచన చేశారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇతర పార్టీల్లో టిక్కెట్ దక్కని వారు ఎవరైనా ముందుకు వస్తే చేర్చుకునే విషయంపైనా దృష్టి సారించాలని సూచించారు. ఇదే సమయంలో మీనాక్షి నటరాజన్ కల్పించుకుని ప్రచార ఏర్పాట్ల గురించి ప్రస్తావించారు. మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ పార్లమెంటు వారీగా నియమితులైన ఇన్‌ఛార్జి మంత్రులపైనే ప్రచార బాధ్యత పెట్టామన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే పిసిసి అధిష్టానం దృష్టికి తీసుకుని రావాల్సిందిగా తాను ఇదేవరకే ఆదేశాలు జారీ చేశానని ఆయన చెప్పారు. ప్రచారంలో పాల్గొంటా..: సిఎం తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను శనివారం (ఫిబ్రవరి ఒకటో తేదీన) హైదరాబాద్‌కు చేరుకోబోతున్నానని, వచ్చిన తరువాత ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటానని వివరించారు. గద్దర్‌కు ఘన నివాళి.. ఇదిలాఉండగా గద్దర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. గద్దర్ ఆశయాల సాధన కోసం తాము కృషి చేస్తున్నామన్నారు. గద్దర్ పేరిట కవులు, కళాకారులకు అవార్డులు ఇస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

మన తెలంగాణ 1 Feb 2026 6:00 am

1st Feb 2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

1st Feb 2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఈ Sunday Magazine

ప్రభ న్యూస్ 1 Feb 2026 6:00 am

ఇంటి గోడకు నోటీసు అతికించడం చట్ట విరుద్ధం

మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎసిపి వెంకటగిరికి మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆరు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. నంది నగర్‌లోని తన ఇంటికి నోటీసు అంటించడం ద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని అన్నారు. అయినప్పటికీ బాధ్యతాయు త పౌరుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా విచారణ కు సహకరిస్తానని, ఆదివారం (ఫిబ్రవరి 1) మధ్యాహ్నం 3 గం టలకు విచారణకు సిద్ధమని తెలిపారు.అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చని, కానీ బాధ్యతాయుత పౌరుడిగా విచారణకు హాజరవుతానని అన్నారు. నందినగర్‌లో తన ని వాసం గోడపై నోటీసు అతికించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని లే ఖలో పేర్కొన్నారు. 65ఏళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దనే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు. తన ప్రస్తుత ని వాసం ఎర్రవల్లిలో ఉందని, అక్కడే విచారించాలని ఆ లేఖలో స్ప ష్టం చేశారు. అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఎర్రవల్లిలో విచారించలేమని చెప్పడం సరికాదని అన్నారు. నోటీసు ఇ చ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అన్నదే ముఖ్యం అ ని, తాను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నానని తెలిపారు.ఎన్నికల అఫిడవిట్‌లోని చిరునామాకు, సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ కేసు తీర్పును లేఖలో ఉటంకించారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న చిరునామాకు, సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద జారీ చేసే నోటీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాలోనే విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం స్పష్టంగా చెబుతోందని తెలిపారు. వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్ధమైన పద్ధతి కాదని, చట్టం నిర్దేశించిన రీతిలోనే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. సిఆర్‌పిసి 160 నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలని..కానీ.. మీరు కావాలనే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని జూబ్లీహిల్స్ ఎసిపిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అన్నారు. భవిష్యత్తు నోటీసులన్నీ ఎర్రవల్లికే పంపాలని తాను చెప్పినప్పటికీ దానిని విస్మరించారని పేర్కొన్నారు. కావాలనే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని వీడీ మూర్తి కేసు తీర్పును లేఖలో కెసిఆర్ ప్రస్తావించారు. ఆ తీర్పు ప్రకారం ఆ పోలీసు స్టేషన్ పరిధి లేదా పొరుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే సిఆర్‌పిసి 160 కింద నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని అన్నారు. పోలీసుల చర్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను విచారించే అధికార పరిధి జూబ్లీహిల్స్ ఎసిపికి లేదు జూబ్లీహిల్స్ ఎసిపికి తనను విచారించే అధికార పరిధి లేదని కెసిఆర్ పేర్కొన్నారు. తాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ, పొరుగు పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ నివసించడం లేదని, కాబట్టి మీకు నోటీసు ఇచ్చే అధికార పరిధి లేదని జూబ్లీహిల్స్ ఎసిపిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఈ నోటీసుతో తనను కట్టడి చేసే అధికారం లేదని అన్నారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో, అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఎర్రవల్లిలో విచారించలేమని మీరు చెప్పడం సరికాదు. నోటీసు ఇచ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అన్నదే ముఖ్యం. నేను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నాను అన్నది నిర్వివాద అంశం. అక్కడే నా స్టేట్‌మెంట్ రికార్డ్ చేయవలసిన బాధ్యత మీపై ఉన్నది’ అని పేర్కొన్నారు. నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రస్తుతం నివసిస్తున్న చోట విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం చెబుతోందని అన్నారు. హరీష్ రావు అఫిడవిట్‌లో సిద్దిపేట అని చిరునామా ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. నోటీసుల విషయంలో పోలీసులు వేర్వేరు ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. ఈ తరహా చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని హెచ్చరించారు. పోలీసుల తీరు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నోటీసులన్నింటినీ ఎర్రవల్లిలోని తన చిరునామాకే పంపించాలని పోలీసులకు కెసిఆర్ సిట్ అధికారులను విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 1 Feb 2026 5:30 am

రాష్ట్ర సాధకుడిపై దుర్మార్గపు చర్యలా?

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ మాజీ సిఎం కెసిఆర్‌కు సిట్ జారీ చేసిన నోటీసులపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆగ్ర హం వ్యక్తం చేశారు. నందినగర్‌లోని కెసిఆర్ నివా సం ముందు గోడకు నోటీసులు అతికించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. గోడకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందారని సిఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంటని ప్రశ్నించారు. సిట్ అధికారులకు కెసిఆర్ స్వయంగా తన చిరునామాను అందించారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గోడకు నోటీసులు అంటించడం పైశాచిక చర్యేన ని మండిపడ్డారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటని ప్రశ్నించారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారు ఉంటున్న ఇంటికే వెళ్లి విచారించాలని ని బంధనలు చెబుతున్నాయని తెలిపారు. ఈ నిబంధనను కూడా పోలీసులు అతిక్రమిస్తున్నారని ఆ గ్రహం వ్యక్తం చేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా..లేక ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మల్లా మారి ప్రతిపక్ష నేతలను వే ధించడమే పనిగా పెట్టుకున్నారా అంటూ పోలీసులను నిలదీశారు. చట్టం మీద, న్యాయం మీద, ధ ర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మా కు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నదని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఈ అ క్రమ కేసులన్నీ చేధిస్తాం...ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని కెటిఆర్ తెలిపారు. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. విచారణకు సహకరిస్తానని చెప్పినా కక్ష సాధింపులు దేనికి?: తలసాని రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందో సర్కస్ నడుస్తుం దో ఎవ్వరికీ అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీ నివాస యాదవ్ విమర్శించారు. రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కెసిఆర్ అని, అందరినీ అక్కున చేర్చుకుని సంక్షేమ ఫలాలు అందించిన గొప్ప నేత అని పేర్కొన్నారు. ఒక్కడిగా రాష్ట్ర సాధనకు బయలుదేరి అందరినీ ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రాన్ని తెచ్చిన నేత కెసిఆర్ అని, అలాంటి సీనియర్ రాజకీయ వేత్తను కాంగ్రెస్ కక్ష సాధింపులను ప్రపంచమంతా చూస్తోందని అన్నారు. కెసిఆర్ ఎక్కడ ఉంటారో అందరికీ తెలుసు అని, మం త్రులు కూడా అక్కడికి వెళ్లారని తెలిపారు. సిట్ అధికారులు మాత్రం నందినగర్ నివాసానికి వచ్చి గోడకు నోటిస్ అతికించి వెళ్లారని మండిపడ్డారు. చట్టాన్ని గౌరవిస్తా విచారణకు సహకరిస్తానని కెసిఆర్ చెప్పినా ఈ కక్ష సాధింపులు దేనికి? అని ప్రశ్నించారు. కెసిఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే విచారణపై స్టే వచ్చేది అని, అయినా చట్టాన్ని గౌరవించి కెసిఆర్ విచారణకు హాజరవుతున్నారని చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గ్రహించాలని హితవు పలికారు. మున్సిపల్ ఎన్నికలను గందరగోళంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోంది : మధుసూదనాచారి కెసిఆర్‌కు సిట్ పేరిట నోటీసులు ఇచ్చి అత్యంత హేయమైన,దుర్మార్గమైన చర్యలకు రాష్ట్ర ప్రభు త్వం పాల్పడుతోందని బిఆర్‌ఎస్ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచా రి మండిపడ్డారు. కెసిఆర్ ఒక్క బిఆర్‌ఎస్‌కు మా త్రమే నాయకుడు కాదు అని, యావత్ తెలంగాణ సమాజానికి నాయకుడు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతిని వీరోచిత జాతిగా మార్చిన నాయకుడు కెసిఆర్ అని కొనియాడారు. తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి పరిచి చేతికిస్తే విధ్వం సం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 1 Feb 2026 5:00 am

ఉపాధికి ఊతం..తయారీకి ఏతం!

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు పార్లమెంట్ కు బడ్జెట్ సమర్పించనున్నారు. లోక్‌సభలో ఉదయం 11గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగం మొదలుకానుంది. సీతారామన్‌కు వరుసగా ఇది తొమ్మి దో బడ్జెట్ కావడం విశేషం. వృద్ధి వేగాన్ని కొనసాగించడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ, ప్రపంచంలో నెలకొన్న వాణిజ్య పరమైన ఘర్షణల నుంచి ఆ ర్థిక వ్యవస్థను బలోపేతం చేయగల సంస్కరణలను 202627 బడ్జెట్‌లో నిర్మల ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. భారీ ఆదాయపు పన్ను, జిఎస్‌టి కోతలు, మౌలిక సదుపాయాలపై ఖర్చు, ఆర్‌బిఐ వడ్డీ రేటు తగ్గింపులు ఇవన్నీ భారతీయ వస్తువులపై అమెరికా విధించిన 50శాతం ప్రతీకార సుంకాలను తట్టుకోవటానికి ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థకు సహాయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ వేగాన్ని కొనసాగించడానికి సకారాత్మక చర్యలతో ఆర్థికమంత్రి ముందుకు వస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తూ.. ఈ సారి బడ్జెట్‌లో ప్రధానంగా తయారీ రంగాలకు మరింత ఊతం, ఉపాధి కల్పనపై నిర్మల ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారని తెలుస్తోంది. ద్రవ్య లోటును తగ్గించే మార్గాన్ని అనుసరిస్తూనే వినియోగాన్ని పెంచడానికి, ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడానికి, మూలధన వ్యయాన్ని పెంచడంలో ప్రభుత్వం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నిర్మల ముందున్న అతిపెద్ద సవాలు కొత్త వృద్ధి చోదకాన్ని కనుగొనడడమేని చెబుతున్నారు. తీవ్ర అనిశ్చితి, మార్కెట్ల పతనం, వస్తువుల ధరలు నిరంతరం పెరుగుదల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యం కలవరపరుస్తోంది. అమెరికాతో భారత వాణిజ్య చర్చలపై అనిశ్చితి ఆర్థిక మార్కెట్లను అస్థిరపరిచినందున విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీలను విక్రయించడం కొనసాగించడంతో పాటు రూపాయి విలువను కనిష్ట స్థాయికి నెట్టివేయడంతో, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించే కష్టమైన పనిని కూడా సీతారామన్ ఎదుర్కొంటున్నారని ఆర్థికవేత్తలు తెలిపారు.ఆదాయాన్ని పెంచేందుకు ప్రధాన వనరులుగా చమురు ధరలను ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎక్సైజ్ సుంకం పెంచడం ద్వారా ఆదాయాన్ని సమీకరించుకునే వీలుందని పేర్కొంటున్నారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి నిబంధనలను సరళీకృతం చేయడం, నిర్మాణాత్మక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంపై ఆమె దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంలకు కొత్త పథకాలు, కేటాయింపుల వెల్లువ ఉంటుందని తెలుస్తోంది.మూలధన వ్యయం బడ్జెట్‌కు మూలస్తంభం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పట్టణ మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ పై ఖర్చును గణనీయంగా పెంచింది. వడ్డీ లేని రుణాల ద్వారా రాష్ట్ర స్థాయి మౌలిక సదుపాయాలకు నిరంతర మద్దతుతో రైల్వేలు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ ప్రసారం, రక్షణ మరియు పట్టణ రవాణాను ప్రాధాన్యత రంగాలుగా చూస్తోంది.పన్ను విషయంలో భారీ మార్పులు అసంభవంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యక్ష పన్నులలో స్థిరత్వం, అంచనాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతున్న నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్నుకు ఏవైనా సర్దుబాట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది వినియోగానికి మద్దతుగా మధ్యతరగతిపై భారాన్ని తగ్గించడం ద్వారా ఊరట కలిగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు సమచారం.కార్పొరేట్ పన్ను రేట్లు కూడా మారే అవకాశాలు లేవని, డిజిటలైజేషన్ మరియు డేటా ఆధారిత అమలు ద్వారా పన్ను ఆధారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది.ఉపాధి రంగాకలకు ప్రోత్సాహకాలతో ఉద్యోగ కల్పన ప్రముఖంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఇ) మద్దతు ఇచ్చే పథకాలు, మెరుగైన కేటాయింపులు లేదా క్రెడిట్-హామీ మద్దతును నిర్మల ప్రకటించే అవకాశాలున్నాయి. ఉత్పాదక సామర్థ్యం, ఎగుమతులు మరియు ఉపాధిపై వాటి ప్రభావాన్ని ప్రభుత్వం అంచనా వేస్తున్నందున ఉత్పత్తి- అనుసంధానిత ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకాలకు కూడా ఊతం లభించనుంది. 

మన తెలంగాణ 1 Feb 2026 4:30 am

తల్లుల వనప్రవేశం

మన తెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అదే సంబురం.. అదే ఉద్వి గ్నం.. మేళ తాళాలు.. శివసత్తుల పూనకాల మధ్య జన దేవతలు శనివారం రాత్రి వన ప్రవేశం చేశారు. సమ్మక్క తల్లి అబ్బియో...సారక్క తల్లి అబ్బి యో.. మళ్లీ రెండేళ్లకొస్తాం తల్లీ.. సల్లంగ చూడు తల్లీ అంటూ భక్తులు భక్తిపారవశ్యంతో తల్లులను సాగనంపారు. ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా సాగి న తల్లుల వన ప్రవేశం కన్నుల పండువగా సాగింది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వా త గద్దెలపై కొలువుదీరిన నలుగురిలో ఒక్కొక్కరూ తిరుగు పయనమయ్యారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతర ఈనెల 28వ తేదీనుంచి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. మేడారంలో గద్దెలపై కొలువుదీరిన పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగుండ్లకు, గోవిందరాజు ఏటూరునాగారం మండలం కొండాయికి భక్తుల జయజయ ద్వానాల మధ్య తిరుగు పయనమయ్యారు. తొలుత ఇద్దరిని తరలించిన పూజారులు సమ్మక్క, సారలమ్మను వన ప్రవేశం చేసేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సారలమ్మ గద్దె వద్ద కాక వంశీయులైన ఆదివాసీ పూజారులు తమ సంప్రదాయాలతో పూజా విధానాన్ని నిర్వహించారు. శనివారం రాత్రి 7.49 గంటలకు గద్దె నుంచి కన్నెపల్లికి సారలమ్మ తరలిస్తుండగా తీవ్ర ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకున్నది. భక్తులు పెద్దఎత్తున సారలమ్మను సాగనంపేందుకు ముందుకు కదిలారు. పోలీస్ రోప్ పార్టీలు పూజారులకు భద్రతగా ఉండి అమ్మవారిని జంపన్న వాగు మీదుగా తీసుకెళ్లారు. అదేవిధంగా సమ్మక్కను వనప్రవేశం చేసేందుకు ముందుగా ప్రధాన పూజారి కిష్టయ్యతో పాటు పూజారుల బృందం పూజలు జరిపారు. మేళ తాళాలు, సంప్రదాయ నృత్యాలతో కోలాహలం మధ్య అమ్మవారిని గద్దె నుంచి చిలుకలగుట్టకు తరలించారు. పెద్దఎత్తున వేచివున్న భక్తుల కేరింతలు, సంబరాల మధ్య వనప్రవేశం చేశారు. పోలీసుల పటిష్ట బందోబస్త్ నడుమ పూజారులు సమ్మక్క తల్లిని తీసుకెళ్లారు. గద్దెలపైకి తరలించే సమయంలో ఎలాంటి ఉద్విగ్న పరిస్థితి ఉందో దేవతల వన ప్రవేశం కూడా అంతే ఉద్విగ్నానికి తోడు కన్నుల పండువగా సాగింది. నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన జాతర దేవతల వన ప్రవేశంతో జాతర ముగిసింది. తండోపతండాలుగా భక్త జనం రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తల్లులకు తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. తల్లులు గద్దెపై కొలువుదీరడంతో మొక్కుబడుల కోసం తరలివచ్చిన భక్తులతో మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. గురువారం రాత్రి నుంచి తండోపతండాలుగా మొదలైన సమ్మక్క, సారలమ్మ దర్శనాలు శనివారం రాత్రి వన ప్రవేశం చేసే సమయం వరకు సాగాయి. శుక్రవారం భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో జాతరంతా కుంభమేళాను మించిపోయింది. నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన జాతరలో దేవతలు శనివారం రాత్రి వన ప్రవేశం చేశారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జామ్ తో భక్తుల అవస్థలు ఈసారి జాతరలో కూడా ట్రాఫిక్ సమస్య భక్తులను వెన్నాడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సరిపడా బస్సులు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శుక్రవారం దర్శనం పూర్తిచేసుకున్న భక్తులకు రాత్రి నుంచి సరిపడా బస్సులు లేకపోవడం, మరోవైపు ప్రయాణించే బస్సులు రోడ్లపై నిలిచిపోవడంతో అసహనానికి గురయ్యారు. తుస్సుమన్న ఆధునిక టెక్నాలజీ ఈసారి మేడారం జాతరలో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ఊదరగొట్టిన అధికారులు చివరకు చేతులెత్తేశారు. ఎఐ టెక్నాలజీతో ట్రాఫిక్ సమస్య రాకుండా చూస్తామని ప్రకటించినా అమలు సాధ్యం కాలేదు. జాతరలో అనుభవం లేని అధికారులు విధుల్లో ఉండడం కూడా సమస్యకు కారణభూతమైందని చెబుతున్నారు. హంగామా ఎక్కువ కావడం మినహా భక్తుల సౌకర్యాలను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయాయి. పోలీసుల తీరుపై పూజారుల ఆగ్రహం జాతరలో పోలీసుల తీరుపై భక్తులే కాదు, పూజారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతరను తమ అధీనంలోకి తీసుకున్న తమ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తరలించే సమయంలో పూజారులు నిరసన వ్యక్తం చేశారు. గద్దెపై వాలంటీర్లు మోహరించి పూజారులను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొనడంతో పోలీసులు ఒక మెట్టు దిగారు. అయితే మిగతా జాతర పూర్తిగా పోలీసుల కనుసన్నలోనే నడవడంతో సాధారణ భక్తులు ఇబ్బంది పడ్డారు. సామాన్య భక్తులను వదిలేసిన పోలీసులు మాత్రం వీఐపీల సేవలో తరించారు.

మన తెలంగాణ 1 Feb 2026 4:00 am

మున్సిపోల్స్ ముంగిట..ఫోన్ ట్యాపింగ్ ముచ్చట!

భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉండగా ప్రభుత్వంలోని పెద్దలు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసులో ఎప్పుడో ఒకసారి తప్పదు అనుకుంటున్న ఘట్టం ఎట్టకేలకు ఆవిష్కృతమైంది. ముందుగా మాజీమంత్రులు హరీశ్‌రావు, ఆ తర్వాత కె.టి. రామారావు.. ఈ ఇద్దరినీ సిట్ పిలిచి ప్రశ్నించిన అనంతరం మాజీ పార్లమెంట్ సభ్యుడు సంతోష్ రావును కూడా పిలిచినప్పుడు తర్వాత లైన్లో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఉన్నారన్న విషయం అందరికీ అర్థం అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కెసిఆర్‌కు సిట్ ఇప్పటికే రెండు నోటీసులు ఇచ్చింది. మొదటి నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల హడావిడిలో ఉన్నందున రాలేనన్నారు. అలాగే తాను నివసిస్తున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వచ్చి విచారించుకొమ్మని చెప్పారు. దానికి సిట్ రెండోసారి మరో నోటీసిస్తూ అధికారికంగా ఆయన చిరునామా హైదరాబాద్ నగరంలోని నందినగర్‌లో ఉన్నందున అక్కడే విచారణ జరుపుతామని, అక్కడికి రావాల్సిందేనని తెలిపారు. సిట్ కోరినట్టుగా నందినగర్ లోని తన నివాసంలో విచారణకు హాజరుకావాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు. అయితే తనను ఈ కేసులో విచారించే విషయంలో నోటీసులు చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆక్షేపిస్తూ ఆయన పోలీసులకు ఆరు పేజీల లేఖ రాసారు. ఇదంతా జరుగుతున్న సమయంలో కెసిఆర్ మనుమడు హిమాన్షు తన తాతగారు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులు పర్యవేక్షిస్తున్న ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అయింది. వ్యవసాయ పనుల్లో తలమునకలై ఉన్నారు కాబట్టి లేదా మునిసిపల్ ఎన్నికల పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు కాబట్టి సిట్ విచారణకు హాజరు కానని కెసిఆర్ చెప్పడానికి వీలులేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అన్నది అంతిమంగా దర్యాప్తులో తేలాల్సిన విషయం. గతంలో ఒకసారి ఎప్పుడో కెసిఆర్ స్వయంగా ఒక టివి చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.. అది రొటీన్‌గా ఇంటెలిజెన్స్ విభాగంవారు చేసుకునే పని అనీ, దానికి ముఖ్యమంత్రి దగ్గరికి అనుమతి కోసం రావాల్సిన అవసరం ఉండదని. ఇక్కడ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు జరిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగున ఉన్న కర్నాటకలో ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్నది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ ఫోన్‌నే ట్యాప్ చేస్తున్నదని బిజెపి ఆరోపిస్తున్నది. కర్నాటక శాసనసభలోనే ఆ రాష్ట్ర మంత్రి హెచ్‌కె పాటిల్ గవర్నర్‌కు న్యూఢిల్లీ నుండి ఫోన్ ద్వారా ఆదేశాలు అందుతున్నాయని వ్యాఖ్యానించారు. మరో మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇంకొంచెం ముందుకు పోయి లోక్‌భవన్‌కు ఢిల్లీ నుండి మాత్రమే కాదు, ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయంనుండి కూడా ఫోన్లు వస్తున్నాయంటూ వివాదానికి తెరలేపారు. ఆ రాష్ట్ర బిజెపి ఎంఎల్‌ఎలు ప్రభుత్వ వివరణ కోరుతూ ఆందోళన చేపట్టారు. ఇటువంటి సంఘటనల గురించి వింటుంటే అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థుల కదలికల మీద నిఘా వేసి ఉంచే ప్రక్రియల్లో ఫోన్ ట్యాపింగ్ భాగం అయిపోయిందా అన్న సందేహం కలగక మానదు. కర్నాటకలో వచ్చే ఎన్నికల తరువాత ప్రభుత్వం మారితే కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య మీద ఫోన్ ట్యాపింగ్ చేసారని దర్యాప్తు జరుగుతుందేమో. సరే, ఆ విషయం అలా ఉంచితే, ఒక ఆరోపణ వచ్చింది, దానికి సంబంధించి ప్రభుత్వం దర్యాప్తు జరుపుతున్నది కాబట్టి బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా తప్పనిసరిగా కెసిఆర్ ఎప్పుడో ఒకసారి హాజరుకాక తప్పదు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతగల భారత పౌరుడిగా దర్యాప్తునకు సహకరిస్తానని కెసిఆర్ స్వయంగా లేఖలో పేర్కొన్నాక కెసిఆర్ మీద ఆరోపణలు చెయ్యడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించినట్టని, రాష్ట్రసాధన కోసం 14 ఏళ్ళు ఉద్యమం చేసారు కాబట్టి ఆయనను దర్యాప్తుకు పిలవకూడదని, అదేదో మహా నేరమని భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆగ్రహించడంలో అర్థం లేదు. బిఆర్‌ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసారని ఆ పార్టీలో నిన్నటివరకూ ముఖ్య నాయకురాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పారు. నిజానిజాలు నిగ్గు తేలాలంటే దర్యాప్తు జరగాల్సిందే. కెసిఆర్ సహా మిగిలిన నేతలు కూడా దర్యాప్తును ఎదుర్కోవాల్సిందే. ఇక్కడ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావును జ్ఞాపకం చేసుకోవాలి. కెసిఆర్‌కు పివి నరసింహారావు అంటే అమిత గౌరవం. హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ కూడలిలో పివి మార్గ్ ఏర్పాటు చేసి, ఆయన విగ్రహాన్ని కూడా నెలకొల్పిన కెసిఆర్ పివిని ఆదర్శంగా తీసుకోవాలి. పివి నరసింహారావు అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఐదేళ్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి దేశాన్ని అప్పులనుంచి బయటపడవేసి, సంస్కరణల బాటలో నడిపించిన మహానాయకుడు. ఆయనకే తప్పలేదు కేసులు ఎదుర్కోవడం. అందరికీ గుర్తుంటే పివి నరసింహారావు జార్ఖండ్ ముక్తి మోర్చా వారికి లంచాలు ఇచ్చిన ఆరోపణల మీద కేసులు ఎదుర్కొన్నారు. ప్రధాని పదవి నుండి దిగిపోయాక ఆయన కోర్టు మెట్లెక్కక తప్పలేదు. దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు కాబట్టి, దేశాన్ని గడ్డు పరిస్థితుల్లో గట్టెక్కించారు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టడానికి వీల్లేదని ఆనాడు పివి అభిమానులో, కాంగ్రెస్ కార్యకర్తలో అనలేదు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి వారు చేస్తున్న వాదన కూడా సరైనది కాదు. ఒక్క కెసిఆరే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆరోపణలు వచ్చినప్పుడు నిలబడి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం అవసరం. సరే, ప్రస్తుత దేశ రాజకీయాలలో అధికారంనుంచి వైదొలగినవాళ్ల మీద కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కేసులు పెట్టడం, కోర్టులకు ఎక్కడం నిత్యకృత్యమైపోయింది. రాజకీయాల్లో ప్రత్యర్థులనే మాటకు అర్థం ఇప్పుడు ‘శత్రువులు’గా మారిపోయింది. సరే, మళ్లీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దగ్గరికి వస్తే బిఆర్‌ఎస్ అధికారంలో ఉండగా ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా ఉన్న ప్రభాకరరావును అమెరికానుండి పిలిపించి మరీ విచారణ జరిపారు. ఇప్పుడు కెసిఆర్ ఈ కేసులో ఏదో ఒక రోజు సిట్ ముందుకు వెళ్ళక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణల మీద రాష్ట్ర ప్రభుత్వం పి.సి. ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కెసిఆర్ ఆ కమిషన్ ముందు హాజరైన విషయం తెలిసిందే. ఆయన దగ్గరికే వెళ్లి ప్రశ్నించడానికి సిద్ధపడ్డ సిట్‌కు అది నందినగర్ అయితే ఏమి, ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ అయితే ఏమి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగాయంటున్న అక్రమాలు, అవినీతి ఆరోపణల మీద ఇప్పటికి ఫోన్ ట్యాపింగ్‌తో సహా నాలుగు కేసులు పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, ఫార్ములా ఈ కార్ రేసుల మీద, విద్యుత్ కొనుగోళ్ళు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల మీద పెట్టిన కేసుల్లో ఇప్పటికయితే ఒక్కటి కూడా పరిష్కారం పూర్తిగా జరిగి ఫలితాలయితే రాలేదు. వీటి పరిష్కారం విషయంలో రాష్ట్రప్రభుత్వానికి కూడా పెద్ద తొందర ఉన్నట్టు కనిపించదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కమిషన్ ఇచ్చిన నివేదికను కెసిఆర్ సవాలు చెయ్యడంతో హైకోర్టులో విచారణ జరుగుతున్నది. మరోవైపు ఘోష్ కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ముందుంచి సిబిఐకి అప్పగించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. ఈ వ్యవహారంలో బంతి ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉన్నది. విద్యుత్ కొనుగోళ్ళ వ్యవహారంలో జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదిక 2024 అక్టోబరులోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కెటిఆర్ విచారణకు గవర్నర్ అనుమతి పొందినా, ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో డిఒపిటి అనుమతి కోసం రాష్ట్రప్రభుత్వం ఎదురు చూస్తున్నందున ఆ కేసు పెండింగ్‌లో ఉంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగాక రాజకీయ పార్టీల బలాబలాలు బహిరంగమయ్యే మున్సిపల్ ఎన్నికల ముంగిట్లో ఉండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ నేడు సిట్ ముందు హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలకు, ఏడు కార్పొరేషన్లకు ఈ నెల 11న ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీ గుర్తుల మీద జరిగే ఈ ఎన్నికలలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నెలకొన్న ఈ పరిణామంవల్ల కెసిఆర్‌కు సానుభూతి పెరిగి బిఆర్‌ఎస్ లబ్ధి పొందుతుందా? ఇంకా మూడేళ్ళు అధికారంలో ఉండబోతున్న కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు ఉండబోతున్నాయా? పార్టీ నుండి బయటికి వచ్చి సొంతంగా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు మీద పోటీ చెయ్యబోతున్న కవిత వల్ల బిఆర్‌ఎస్‌కు నష్టమా, లాభమా అనేది ఈ మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోతుంది. బిజెపి, జనసేన కలిసి చేసే పోటీ ఎవరికీ నష్టం చేస్తుంది? కాంగ్రెస్‌తో కలిసి వెళ్ళే సిపిఐ, కోదండరాం పార్టీ ఇంకా సందిగ్ధంలో ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ లబ్ధి పొందుతుందా? కాంగ్రెస్‌ను ఓడించాలన్న ఆలోచనతో తమకు బలం లేని చోట్ల బిజెపికి పరోక్షంగా సాయపడాలని బిఆర్‌ఎస్ ఆలోచిస్తున్నట్టు వస్తున్న వార్తలు నిజమయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మరో మూడేళ్ళ తరువాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇవి రిహార్సల్‌గా భావించాలేమో! Delete Edit

మన తెలంగాణ 1 Feb 2026 12:05 am

వార ఫలాలు (01-02-2026 నుండి 07-02-2026 వరకు)

మేష రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి సాధిస్తారు. ఇంటబయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దైవానుగ్రహం తో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు. గడిచినా రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. నిరుద్యోగులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా దక్షిణామూర్తి స్తోత్రం చదవాలి. దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 2 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఒకచోట స్థిరాస్తులు అమ్మి మరొకచోట కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెడతారు. హెల్త్ కార్డు విషయంలో పర్సనల్ లోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పు ఇస్తే తిరిగి రాదు. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకొన్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బందికి గురవుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన సంబంధమైన విషయాలు వివాహ సంబంధమైన విషయాలు ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మిధున రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వచ్చిన ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. నూతన వస్తు, వాహన సౌకర్యం పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగ మారకుండా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని కొనసాగించండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి అంతా అనుకూలంగా లేదు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రే. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే లోహపు వస్తువులపై పెట్టండి మంచి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసివచ్చే కాలంగా చెప్పవచ్చు. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గడిచిన రెండు మూడు వారాల కంటే ఈవారం బాగుంటుందని చెప్పవచ్చు. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వపరంగా రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. కాంట్రాక్టులు లీజులు లైసెన్సులు లాబిస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాలలో సంత నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. ఉద్యోగంలో సహా ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. సింహ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది సాగుతాయి. కొన్ని కొన్ని విషయాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ప్రతి విషయం మనసుకు తీసుకోవడం వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సొంత ఇంటి కల ఈ వారం నెరవేరుతుంది. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రెడిట్ కార్డు కి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన విషయం. సంతానం యొక్క వివాహం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కన్య రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానంలో ఒకరికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. స్థిరాస్తులు ఏర్పరుచుకోవాలని ప్రయత్నం చేస్తారు. మీ మాటలకు వక్రభాషలు చెప్పేవారు ఎక్కువ అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. మీకున్న తెలివితేటలతో ఏదైనా సాధించగలము అనే భావన కలుగుతుంది. పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలావరకు బాగుందని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసివచ్చే రంగు కాషాయం. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. తులా రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. అన్ని వైపుల మంచి జరుగుతుంది. సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తిఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ పెరుగుతుంది. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. ఆహార నియమాలు పాటించండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 2 కలిసివచ్చే రంగు బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తొలగిపోతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ధనాధాయం పెరుగుతుంది. కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన సంబంధమైన విషయాలు విదేశాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం. శనికి తైలాభిషేకం చేయించడం అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థినీ విద్యార్థులు దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా కొన్ని చికాకులు ఏర్పడతాయి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. బంధువుల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. ఇంత కష్టపడినప్పటికీ ఫలితం ఇంతేనా అనే భావన కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు. నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రతిరోజు కూడా ఖడ్గమాల స్తోత్రం కానీ కనకధార స్తోత్రం కానీ చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుంభ రాశి వారికి వారం అదృష్ట ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలావరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. గతవారం కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. సహోదరీ సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతి కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి. స్థిరాస్లకు సంబంధించిన విష వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఇతరులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుండి అవార్డులు రివార్డులు పొందుతారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా ఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడువకుండా ప్రయత్నం చేయండి మంచి ఉద్యోగం లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దుర్వ్యసనాలకు చెడు సహవాసాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి కాలభైరవ రూపు మెడలో ధరించండి కరంగాలి మాల కూడా ధరించడం మంచిది. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ప్రేమ వివాహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.  

మన తెలంగాణ 1 Feb 2026 12:00 am

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూత

 ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇటీవల గంజా యి స్మగ్లర్ల దాడి జరిగిన సందర్భంగా తీవ్రంగా గా యపడి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన నుంచి ఆసుపత్రిలో సౌమ్య చికిత్స పొందుతుంది. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సౌమ్య మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి

మన తెలంగాణ 31 Jan 2026 11:49 pm

రష్యన్ వనితల వల్ల బిల్‌గేట్స్‌కు లైంగిక వ్యాధి

అమెరికాలో లైంగిక నేరస్థుడుగా తేలిన జెఫ్రీ ఎప్‌స్టిన్ కార్యకలాపాలకు సంబంధించి ఎప్‌స్టిన్ ఫైల్స్ పేరుతో అమెరికా న్యాయశాఖ శుక్రవారం విడుదల చేసిన వీడియోలు, చిత్రాలుతో సహా పత్రాలు సంచలనం కలిగిస్తున్నాయి. న్యాయశాఖ ఎప్‌స్టిన్ పేరుతో 3000 వీడియోలు, 1,80,000 చిత్రాలతోపాటు 30 లక్షలకు పైగా పేజీల పత్రాలను విడుదల చేసింది. ఇందులో టెస్లా అధినేత మస్క్‌పై తాజా ఆరోపణలతోపాటు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌పై కూడా సంచలన ఆరోపణలు ఉన్నాయి. ఇందులో న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మన్దూనీ తల్లి మీరా నాయర్ పేరును కూడా చేర్చడం గమనార్హం. బిల్‌గేట్స్ రష్యన్ మహిళలతో శారీరకంగా, సంబంధాలను కలిగి ఉన్నాడని, దీంతో లైంగికంగా సంక్రమించే సుఖవ్యాధి (ఎస్‌టిడి) బారిన పడ్డారని, పేర్కొంది. ఆ తర్వాత తన భార్య మెలిండా గేట్స్‌కు రహస్యంగా ఇవ్వడానికి యాంటీబయోటిక్స్ కోరాడని ఆరోపించింది. ఈ వివాదానికి కేంద్రంగా ఉన్న ఈమెయిల్స్ 2013 జులై 18 నాటివి. ఎపిస్టిన్ డ్రాఫ్ట్ సందేశాలుగా కనిపిస్తున్నాయి. కొన్ని గేట్స్ అప్పటి సలహా దారు బోరిస్ నికోలిక్ గొంతులో ఉన్నాయి. వాటిలో గేట్స్, “ రష్యన్ అమ్మాయిలతో నిద్రపోతున్నాడని, లైంగిక సంక్రమణ వ్యాధి బారిన పడ్డారని, దీంతో మెలిండా గేట్స్‌కు “ రహస్యంగా ” ఇవ్వగల యాంటీ బయోటిక్స్ కోసం అడుగుతున్నాడని ఎపిస్టీన్ ఆరోపించాడు. దీనికి సంబంధించిన ఈమెయిల్స్‌ను డిలీట్ చేయమని గేట్స్ కోరాడని కూడా ఈ మెయిల్స్ సారాంశం. తీవ్రంగా ఖండించిన బిల్‌గేట్స్ ఈ ఆరోపణలపై గేట్స్ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా వాస్తవ దూరమైనవని,అసంబద్ధమైనవని, గేట్స్ ప్రతినిధి డైలీ మెయిల్‌తో అన్నారు. ఈ ఆరోపణలు ఎప్‌స్టీన్ ఫ్రస్ట్రేషన్‌కు నిరాశకు తార్కాణమని అతని ఉచ్చులో చిక్కుకోవడానికి పరువు తీయడానికి ఎంత దూరమైనా వెళ్లాడని ఆరోపించారు. జోహ్రాన్ మమ్దానీ తల్లిపై ఆరోపణలు మరోవైపు ఈ ఆరోపణలో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి, చిత్ర నిర్మాత, మీరా నాయర్ పేరు కూడా చేర్చారు. 2009 అక్టోబరు 21 న ప్రచారకర్త పెగ్గీసిగల్ జెఫ్రీ ఎపిస్టీన్‌కు పంపిన ఇమెయిల్ , దర్శకులు మీరా నాయర్ తన సినిమా ఆఫ్టర్ పార్టీలో ఉన్నారని వెల్లడించింది. లైంగిక అక్రమ రవాణాదారు, దోషిగా తేలిన గిస్లయిన్ మాక్స్‌వెల్ ఇంట్లో జరిగిన 2009 నాటి మూవీ “ అమేలియా” ఆఫ్టర్ పార్టీకి హాజరయ్యారని ఆరోపించిం ది. ఈ పార్టీకి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కూడా హాజరయ్యారని పేర్కొంది. 

మన తెలంగాణ 31 Jan 2026 11:33 pm

చివరి టి20లోనూ భారత్ దే విజయం

న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన ఐదో, చివరి టి20లో ఆతిథ్య భారత జట్టు 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా 41తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత లక్ష ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. చెలరేగి ఆడిన ఫిన్ అలెన్ 38 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, 8 ఫోర్లతో 80 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర (30),మిఛెల్ (26), సోధి (33) మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేక పోయారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అక్షర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఇషాన్ వీర విధ్వంసం.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే మరో ఓపెనర్ సంజు శాంసన్ (6) మరోసారి నిరాశ పరిచాడు. చెలరేగి ఆడిన అభిషేక్ 16 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 30 పరుగులు చేశాడు. ఆ తకంవాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమపై వేసుకున్నారు. ఇషాన్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. అతన్ని కట్టడి చేసేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అసాధారణ బ్యాటింగ్‌తో విరుచుకు పడిన ఇషాన్ వరుస సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. కళ్లు చెదిరే షాట్లతో అభిమానులను కనువిందు చేశాడు. చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ 43 బంతుల్లోనే ఆరు ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 103 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సూర్యతో కలిసి మూడో వికెట్‌కు 57 బంతుల్లోనే 137 పరుగులు జోడించాడు. ఇక సూర్యకుమార్ 30 బంతుల్లోనే ఆరు భారీ సిక్స్‌లు, 4 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్య 17 బంతుల్లోనే (42) పరుగులు సాధించాడు. దీంతో భారత్ ప్రత్యర్థి ముందు 272 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది.

మన తెలంగాణ 31 Jan 2026 10:46 pm

ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్

 రాష్ట్రవ్యాప్తంగా సోమవారం(ఫిబ్రవరి 2) నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,440 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సిసి కెమెరాల నిఘాలో జరుగనున్నాయ. ఈ మేరకు అధికారులు అన్ని పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు ఎంపిసి విద్యార్థులు 2,74,007 మంది, బైపిసి విద్యార్థులు 1,33,415 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,18,770 మంది విద్యార్థులు హాజరునున్నారు. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు కాలేజీ లాగిన్‌లో అందుబాటులో ఉంచడంతో పాటు విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకునేలా వారికి లింక్ పంపించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. కెజిబివిలకే కాకుండా కొన్ని ప్రభుత్వ కాలేజీలకు సెంటర్లు కేటాయించలేదన్నారు. ఈ మేరకు శనివారం ఇంటర్ బోర్డు అధికారులతో కలిసి కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిర్వహించిన మీడియా సమావేశంలో పరీక్షల షెడ్యూల్‌తోపాటు కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 1440 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పెల్ 1, స్పెల్ 2గా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. పరీక్షల కోసం 7,599 మందికి ఇన్విజలేషన్ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. 34 శాతం మంది ప్రభుత్వ లెక్చరర్లు, 66 శాతం మంది ప్రైవేట్ లెక్చరర్లను ఇన్విజిలేటర్లుగా నియమించినట్లు తెలిపారు. పారదర్శకంగా పరీక్షల నిర్వహణ పారదర్శకంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని కృష్ణ ఆదిత్య అన్నారు. పాక్టికల్ పరీక్షల నిర్వహణకు ల్యాబ్ పరికరాలు సిద్ధం చేశామని తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ప్రాక్టికల్‌లో ప్రభుత్వ కాలేజీల్లో జాంబ్లింగ్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. జంబ్లింగ్ విధానాన్ని ప్రైవేట్‌లో కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ లెక్చరర్లను ఫ్లయింగ్ స్క్వాడ్స్‌గా పంపిస్తామని తెలిపారు. ప్రాక్టికల్స్ పరీక్షలలో ఒక్కో సబ్జెక్టులో 30 మార్కులకు గానూ 12 మార్కులు వస్తే విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని వెల్లడించారు. గతంలో ఫెయిల్ అయిన 400 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించారన్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులతోపాటు బ్యాక్ లాగ్ విద్యార్థులు దాదాపు 60 వేల మంది ఉన్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాని పేర్కొన్నారు.ఇంటర్ పరీక్షలకు పూర్తిగా సహకరిస్తున్న జిల్లా కలెక్టర్లకు కృష్ణ ఆదిత్య ధన్యవాదాలు తెలిపారు.

మన తెలంగాణ 31 Jan 2026 10:36 pm

శ్రీహరి అనుభవం ముందు…మేమంతా చిన్న బచ్చగాళ్లమే.!

రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్

ప్రభ న్యూస్ 31 Jan 2026 10:33 pm

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను శనివారం రాత్రి అరెస్టు చేశారు. సిఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టిడిపి నేతలు ఫిర్యాదు చేయడంతో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఆయన నివాసం వద్ద అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి అంబటి రాంబాబును నల్లపాడు పిఎస్‌కు పోలీసులు తరలించారు. అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకునే నేపథ్యంలో వైసిపి, టిడిపి నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అంబటి నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించిన టిడిపి నాయకులు మాజీ మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని నవభారతనగర్‌లోని అంబటి రాంబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తండ్రిపై అంబటి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడ్డంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. టిడిపి శ్రేణులు అంబటి ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇంట్లోని కిటికీ అద్దాలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. ఇంటివద్ద ఉన్న అంబటి వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు ఆందోళన దిగారు. దీంతో అంబటి రాంబాబు వెంటనే సిఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ టిడిపి అభిమానులు ఆందోళన చేపట్టారు. మహిళా కార్యకర్తలు, నాయకులు అంబటి నివాసం వద్దకు చేరుకుని ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. అక్కడే ఉన్న కారు, ఇతర వాహనాలను ధ్వసం చేశారు. ఘాటుగా స్పందించిన వైసిపి...డిజిపికి ఫిర్యాదు గుంటూరు నవభారత్ నగర్‌లోని అంబటి ఇంటిని ముట్టడించి కారు, ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనపై వైసిపి పార్టీ తీవ్రంగా ఖండించింది. వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ అంటిరాంబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ దాడిని ఖండించారు. కాగా ఈ ఘటనపై డీజీపీకి వైసీపీ లేఖ రాసింది. గుంటూరులో పరిస్థితి చేయి దాటిపోతోందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిందని, ఆయనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేసింది. అంబటికి వెంటనే కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాలని కోరింది. సంఘ విద్రోహ శక్తులు అంబటి ఇంటిపై దాడి చేశాయని పేర్కొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డిజిపికి ఫిర్యాదు చేశారు. అలాగే చీఫ్ సెక్రటరీ, డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.

మన తెలంగాణ 31 Jan 2026 10:32 pm

Video : High Tension At Ambati Rambabu’s House

The post Video : High Tension At Ambati Rambabu’s House appeared first on Telugu360 .

తెలుగు 360 31 Jan 2026 10:25 pm

రేపు ఎర్రవల్లి నుంచి నందినగర్‌కు కెసిఆర్

 ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు కెసిఆర్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని నివాసంలో హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన ఎర్రవెల్లి నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు తెలిసింది. సిట్ విచారణకు హాజరయ్యే ముందు కెసిఆర్ తన ముఖ్య అనుచరులు, న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఈ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. న్యాయవాదుల బృందంతో సమావేశమై, అధికారుల ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి, చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించి, మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులకు అందుబాటులోకి రానున్నారు.

మన తెలంగాణ 31 Jan 2026 9:43 pm

Fact Check: Viral video of man raising derogatory slogans against RSS is from Telangana’s Nalgonda, not Uttar Pradesh

Social media platforms have increasingly become key drivers in the rapid spread of viral videos, enabling content to reach thousands of users within minutes. Short clips are often shared through messaging apps, reposted across multiple platforms, and amplified by captions that add context or claims—sometimes without verification. This fast-paced sharing ecosystem allows videos to gain widespread attention quickly, shaping public perception even before the authenticity or origin of the content is clearly established. Amid this A video circulating widely on social media claims to show a man in Uttar Pradesh raising derogatory slogans against the Rashtriya Swayamsevak Sangh (RSS). Here you can find the archived link of the claim. Fact Check: The claim is misleading. The video is not from Uttar Pradesh. It is from Nalgonda in Telangana, where a man named Kaleem Uddin raised derogatory slogans during a rally against suspended BJP MLA Raja Singh in August 2022. News reports and verification using Google Street View confirm that the footage is from Telangana. To verify the claim, we searched the internet using relevant keywords but did not find any reports published by prominent media outlets. If such an incident had occurred in Uttar Pradesh, it would likely have been widely reported by major news organisations. As part of further investigation, we contacted an independent journalist from Uttar Pradesh, Mr. Yogesh Tiwari. He stated that the video is either old or not from Uttar Pradesh, adding that any such incident in the state would have been covered by local and national media. To verify the claim, We also searched using keywords related to the viral post, which led us to several news reports from Telangana. While publishing an article on 11 October, The Hindu mentioned that a post claiming to show protesters raising inflammatory slogans against the RSS in Uttar Pradesh, followed by swift action by the State government, has gone viral on social media. The Facebook post features two videos shown side by side—one allegedly showing protesters chanting provocative slogans against the Hindu organisation, and the other showing police taking action. The post suggests that the Yogi Adityanath government in Uttar Pradesh acted quickly against the protesters. According to an ANI report dated August 23, 2022, during a rally in Nalgonda against suspended BJP MLA Raja Singh, a man identified as Kaleem Uddin raised derogatory slogans against the RSS. Nalgonda Superintendent of Police Rema Rajeshwari confirmed that the accused was identified and arrested, and that a case was registered under Sections 153, 295(A), and 506 of the Indian Penal Code. We also found that Factly has already debunked and published that the viral video of a man making derogatory slogans against the RSS is not from Uttar Pradesh; it is from Telangana. Hence, we found the claim is misleading. The viral video is not from Uttar Pradesh but from Nalgonda in Telangana, where the incident occurred during a rally in August 2022, as confirmed by verified reports and location checks.

తెలుగు పోస్ట్ 31 Jan 2026 9:05 pm

Nikhil’s unparalleled dedication for Swayambhu

Nikhil Siddhartha has recently wrapped shoot for his magnum opus, Swayambhu. The actor worked for three years on the warrior period action film, directed by Bharat Krishnamachari and produced by Bhuvan Sagar and Sreekar in the presentation of Madhu B. He shared a throwback video from the sets when he wrapped action shoot. He shared […] The post Nikhil’s unparalleled dedication for Swayambhu appeared first on Telugu360 .

తెలుగు 360 31 Jan 2026 8:58 pm

న్యూజిలాండ్‌ టార్గెట్ 272

ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టి-20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు సాధించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ న్యూజిలాండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు.ఇషాన్ కి టి20 ల్లో తొలి సెంచరీ. ఇషాన్ కిషన్(103: 43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్ లు),కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (63: 30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్ లు) వీర విహరం చేశారు.సూర్య,ఇషాన్  మూడో వికెట్ కు 57 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒపెనర్ సంజు శాంసన్ (6) మరోసారి నిరాశపర్చాడు. పెర్గూసన్ వేసిన 2.5 ఓవర్ కు బెవన్ జాకబ్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫెర్గూసన్ వేసిన 4.6 ఓవర్ కు అభిషేక్ శర్మ(30: 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో హార్థిక్ పాండ్య (42; 17 బంతుల్లో 1 ఫోరు, 4 సిక్స్ లు) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఫెర్గూసన్ 2, డఫీ, జెమీసన్,శాంట్నర్ తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 31 Jan 2026 8:52 pm

బావిలోపడి ఆరేళ్ల బాలుడి దుర్మరణం

గాలిపటం కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ అన్నదమ్ములు బావిలో పడిన ఘటనలో తమ్ముడు మృతి చెందాడు. అన్న ప్రాణాలతో బయటపడిన ఘటన మర్పల్లి మండల పరిధిలోని కొంషెట్‌పల్లిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్తు వివరాల ప్రకారం కొంషెట్‌పల్లికి చెందిన సిజావద్దీన్ అమీరా బేగం దంపతులు కూలి చేసుకుని జీవిస్తున్నారు. వీరికి కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. సిజాహుద్దీన్ తల్లి పక్షవాతంతో బాధపడుతున్న నేపథ్యంలో.. మందుల కోసం కర్ణాటకలోని గుర్మత్కల్ గ్రామానికి వెళ్లాడు. ఇంటివద్ద కుమార్తెను, పెద్ద కొడుకు సైఫాన్, చిన్న కొడుకు సాయిల్ (6) ఇంటివద్దే ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ గ్రామంలోనే ఉర్దూ పాఠశాలలో చదువుతున్నారు. శనివారం పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్ద ఆడుకుంటూ.. గ్రామంలోని కరణం పంతులు పొలాలవైపు వెళ్లారు. బావి సమీపంలో గాలిపటం కనిపించడంతో.. ఎగురవేసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ తమ్ముడు సాయిల్ బావిలో పడిపోయారు. తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో అన్న సైఫాన్ సైతం బావిలో పడిపోయాడు. అది గమనించిన సమీపంలోని ఓ మహిళ.. పక్క పొలంలో ఉపాధి కూలీలకు సమాచారం అందించడంతో కూలీలు అన్న సైఫాన్‌ను కాపాడారు. అప్పటికే తమ్ముడు సాహిల్ నీటిలో మునిగిపోయాడు. దీంతో గ్రామస్తులు బావిలోని నీటిని మోటార్లద్వారా తోడి గాలించినా.. సాహిల్ మృతదేహం ఆచూకీ లభించలేదు. సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.

మన తెలంగాణ 31 Jan 2026 8:49 pm

Breaking: Ram Charan comes forward for Dancers’ Welfare

In an industry where the spotlight often remains on the stars, Ram Charan is ensuring that the hardworking artists behind the scenes are not forgotten. The Tollywood sensation has recently stepped forward to provide significant support to the Dancers’ Associations, addressing a long-standing need for better security within the community. Recognizing the physical demands and […] The post Breaking: Ram Charan comes forward for Dancers’ Welfare appeared first on Telugu360 .

తెలుగు 360 31 Jan 2026 8:47 pm

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ సీజ్

 శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం మధ్యాహ్నం భారీగా హైడ్రోపోనిక్ (గాంజా) మత్తు పదార్థాలను డీఆర్‌ఐ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేసిన అధికారులు.. వారినుంచి 9.5 కోట్లు విలువ చేసే27.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్‌నుండి తాయ్ ఎయిర్ లైన్స్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన నలుగురు ప్రయాణికులు.. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బయటకు రావడమేకాకుండా.. అక్రమంగా తెచ్చిన మత్తుపదార్థాలను రిసీవర్‌లకు అందిస్తూ దొరికిపోయారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా రిసీవర్‌లను పట్టుకున్న కస్టమ్స్ అధికారులు.. హైడ్రోపోనిక్‌ను అక్రమంగా తెచ్చిన నలుగురిని, రిసీవర్లు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. డీఆర్‌ఐ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మన తెలంగాణ 31 Jan 2026 8:35 pm

గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి

గాజాలో శాంతి స్థాపనకు ఒకపక్క ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో మళ్లీ గాజా సిటీపై ఇజ్రాయెల్ సైనిక దళాలు శనివారం ఉదయం విరుచుకుపడడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా నగరం లోని ఉత్తర ప్రాంతంతోపాటు, దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతం కూడా దాడులకు బలైంది. గాజా సిటీ లోని ఒక అపార్ట్‌మెంట్‌పైన, అలాగే ఖాన్ యూనిస్‌లో నిర్వాసితుల శిబిరాలపై జరిగిన దాడిలో మొత్తం 12 మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు వేర్వేరు కుటుంబాలకు చెందిన చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అక్టోబరు నెలలో దాడుల విరమణకు ఒప్పందం కుదిరినప్పటికీ, మళ్లీ ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడం అంతర్జాతీయ సమాజంలో కలకలం రేపుతోంది. అక్టోబరు 10న యుద్ధ విరమణకు ఒప్పందం కుదిరిన తరువాత 500 మంది కన్నా ఎక్కువ మంది పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ దాడులకు ఇజ్రాయెల్ ఇంతవరకు స్పందించలేదు. 

మన తెలంగాణ 31 Jan 2026 8:27 pm

రైలుకింద పడి కుటుంబం ఆత్మహత్య

 రైలు కిందపడి ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చర్లపల్లి, ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సంఘటనలో తల్లి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...బోడుప్పల్, హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతిరెడ్డి(38), భర్త సురేందర్ రెడ్డి, కూతురు చేతన రెడ్డి(18) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది, కుమారుడు విశాల్ రెడ్డి(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. విజయశాంతి రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త సురేందర్ రెడ్డి ఎపిలోని నెల్లూరులోని సిరామిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉండగా ముగ్గురు బోడుప్పల్‌లో ఉన్నారు. ముగ్గురు తెల్లవారుజామున ఎంఎంటిఎస్ డౌన్‌లైన్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మూడు మృతదేహాలు రైలు పట్టాలపై పడి ఉండడం చూసిన గూడ్స్ రైలు లోకో పైలట్ జిఆర్‌పి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల వద్ద రైల్వే టికెట్లు, విలువైన వస్తువులు లేవని జీఆర్‌పీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై జిఆర్‌పి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు, ఆర్థికపరమైన ఇబ్బందులేమైనా ఉన్నాయా, ఇంకా ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. విజయశాంతి నెలకు లక్ష రూపాయల వరకు జీతం వస్తుందని ఆర్థికంగా ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఇతర కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సురేందర్ రెడ్డిని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.

మన తెలంగాణ 31 Jan 2026 8:20 pm

ఆదివారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు బిఆర్‌ఎస్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజకీయ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని బిఆర్‌ఎస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, బాలమల్లు, కర్నె ప్రభాకర్ తదితరులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కెసిఆర్‌ను వేధిస్తోందని, రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయనను అవమానిస్తూ అమానుషంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. టెలిఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి, ఇప్పుడు సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన, నీచమైన వైఖరి అని అభివర్ణించారు. ఆదివారం చేపట్టే నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి నిరసన సెగ తగిలేలా చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ తమ సొంత జిల్లాల్లోనే ఉండి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఉండాలని, పోలీసులతో ఘర్షణలకు తావివ్వకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని కోరారు.

మన తెలంగాణ 31 Jan 2026 8:15 pm

Rattatataav from FUNKY: Mass beats and Peppy vibe

The second single RATTATATAAV from FUNKY has been unveiled, adding to the growing excitement surrounding the film. The song, composed by Bheems Ceciroleo, brings a high-energy vibe that perfectly suits the film’s quirky and entertaining tone. Ram Miriyala’s lively vocals and Dev Pawar’s playful lyrics enhance the song’s appeal, making it engaging and fun. The […] The post Rattatataav from FUNKY: Mass beats and Peppy vibe appeared first on Telugu360 .

తెలుగు 360 31 Jan 2026 7:54 pm

‘ఫంకీ’ సినిమా నుంచి అదిరిపోయే పాట.. సింగర్ ఎవరంటే..

‘మాస్‌ కా దాస్’ విశ్వక్‌సేన్ హీరోగా.. జాతిరత్నాలు ఫేమ్ కెవి అనుదీప్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. కయాదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్ని ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ని విడుదల చేశారు. ‘రట్టాటటావ్’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. ఈ పాటని రామ్ మిర్యాల పాడగా.. దేవ్ పవార్ లిరిక్స్ అందించారు. భీమ్స్ సంగీతం సమకూర్చారు. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ కామెడి ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 13న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది.

మన తెలంగాణ 31 Jan 2026 7:46 pm

సమయం కావాలని కెసిఆర్ కోరితే రెండు రోజులే ఇస్తారా..? : సబితా ఇంద్రారెడ్డి

కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమే కెసిఆర్‌కు రెండో సారి నోటీసులు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా ఆరోపించారు. ప్రజా సమస్యలు పట్టని ఈ ప్రభుత్వానికి, ఏ మాత్రం పసలేని కేసులో అంత తొందర ఏముందో..? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నారని, మరొక సమయం కావాలని కెసిఆర్ కోరితే కేవలం రెండు రోజుల వ్యవది మాత్రమే ఇస్తారా..? అని అడిగారు. రాష్టాన్ని సాధించి, తెలంగాణ వైభవాన్ని గొప్పగా చాటిన మహా నేతకు మీరిచ్చే గౌరవం ఇదేనా...? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు కెసిఆర్‌ను నోటీసులతో వేదిస్తే తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని అన్నారు. చావు నోట్లో తల పెట్టి రాష్టాన్ని సాధించిన తెలంగాణ జాతి పితకు నోటీసులా...తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన పెద్దాయనపై కక్ష సాధింపా..అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్టాన్ని వ్యతిరేకించిన శక్తులే నేడు తెలంగాణలో పాలన కొనసాగిస్తూ, కెసిఆర్ లాంటి మహనీయులపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఎప్పటికి చరిత్రహినులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

మన తెలంగాణ 31 Jan 2026 7:29 pm

హాట్రిక్ సాధించిన సామ్ కర్రన్.. శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం

పల్లెకలె: మూడు టి-20ల సిరీస్‌లో భాగంగా పల్లెకలె వేదికగా శుక్రవారం జరిగిన తొలి టి-20 మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ 11 పరుగుల (డక్‌వర్త్ లుయీస్) తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్ సామ్ కర్రన్ హ్యాట్రిక్ సాధించి జట్టు విజయంలో తనదైన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. కీపర్ కుషల్ మెండీస్ (37), పాతుమ్ నిస్సంకా(23), కెప్టెన్ దాసున్ శనక(20) పరుగులు మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్‌కే పెవిలియన్ చేరారు. సామ్ కర్రన్ 16వ ఓవర్‌ చివరి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సాధించాడు. శనక, తీక్షణ, పతిరానాలను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఫలితంగా శ్రీలంక 16.2 ఓవర్లలో 133 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక సామ్ టి-20ల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అతడితో పాటు అదిల్ రషీద్ మూడు, డాసన్ రెండు, ఓవర్టన్ రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 15 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి.. 125 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. అయితే డక్‌వర్త్ లుయీస్ ప్రకారం ఇంగ్లండ్ అప్పటికే 11 పరుగుల ముందంజలో ఉండటంతో ఆ జట్టును అంపైర్లు విజేతగా ప్రకటించారు. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆదిల్ రషీద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మన తెలంగాణ 31 Jan 2026 7:12 pm

పాక్- బలోచ్ యుద్ధంలో 47 మంది మృతి

పాక్ సైన్యం లక్ష్యంగా బలూచ్ ఆర్మీ మరోసారి భారీ దాడులకు దిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిర్వహించిన సమన్వయ దాడిలో 10 మంది పాక్ సైనికులు , 37 మంది తిరుగుబాటుదారులు మరణించారు. భద్రతా దళాలకు ,తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక చోట జరిగిన దాడి కాదు. బిఎల్ఎ ఉగ్రవాదులు బలూచిస్తాన్‌లోని పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు మరియు హైవేలపై ఏకకాలంలో సమన్వయ దాడులకు పాల్పడ్డారు. బలోచిస్తాన్ ప్రావిన్షియల్ రాజధాని అయిన క్వెట్టాతో పాటు పస్ని, మస్తుంగ్, నుష్కీ, గ్వాదర్ జిల్లాల్లోని 12 కంటే ఎక్కువ ప్రాంతాల్లో బలోచ్ వేర్పాటు వాదులు ఒకేసారి దాడులు చేశారు. ముసఖైల్ జిల్లాలో హైవేని దిగ్బంధించి, వాహనాల నుంచి ప్రయాణికులను కిందకు దించి, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి మరీ కాల్పులు జరిపారు. పాకిస్థాన్ ప్రభుత్వం తమ ప్రాంతంలోని సహజ వనరులను దోచుకుంటోందని, చైనా పెట్టుబడుల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపిస్తూ బిఎల్ఎ ఈ విధ్వంసానికి పాల్పడుతోంది.ఈ భీకర దాడులకు బాధ్యులం తామేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

మన తెలంగాణ 31 Jan 2026 7:04 pm

Chinthagattu |జాతరలో పోలీసుల సేవలు ప్రశంసనీయం

Chinthagattu | జాతరలో పోలీసుల సేవలు ప్రశంసనీయం Chinthagattu | స్టేషన్ ఘన్‌పూర్,

ప్రభ న్యూస్ 31 Jan 2026 6:51 pm

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

తిరువనంతపురం: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టి-20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతానికి ఈ సిరీస్‌లో 3-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. నాలుగో టి-20లో గెలిచిన కివీస్.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని భావిస్తోంది. ఇక ఈ చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ని 4-1 తేడాతో దక్కించుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ తిరిగి భారత జట్టులోకి వచ్చారు. న్యూజిలాండ్‌లో కూడా నాలుగు మార్పులు చేసింది. ఫిన్ ఆలెన్, లాకీ ఫెర్గసన్, కైల్ జెమిసన్, బెవన్ జాకబ్స్ జట్టులోకి వచ్చారు. తుది జట్లు: భారత్: అభిషేక్ శఱ్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(కీపర్), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ.

మన తెలంగాణ 31 Jan 2026 6:50 pm

PMJ Jewels |ఆభరణాల ప్రదర్శన

PMJ Jewels | ఆభరణాల ప్రదర్శన PMJ Jewels | తాజ్ కృష్ణలో

ప్రభ న్యూస్ 31 Jan 2026 6:45 pm

మహారాష్ట్ర డిప్యూటీ సిఎంగా సునేత్ర ప్రమాణ స్వీకారం

ఎన్‌సిపి రాజ్యసభ సభ్యురాలు,దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శనివారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. శనివారంనాడిక్కడి లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మరో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, మహాయుతి మంత్రులు, ఇతర నేతలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో రాష్ట్రంలో ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించడంతో ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం పగ్గాలను సునేత్ర చేపట్టారు.

మన తెలంగాణ 31 Jan 2026 6:32 pm

సిరిసిల్లలో రూ.10 లక్షల విలువైన 2.3 కిలోల వెండి ఆభరణాలు సీజ్

సిరిసిల్ల మున్సిపాల్టీ పరిధిలోని రగుడు చెక్‌పోస్ట్‌వద్ద శనివారం ఉదయం పోలీసులు సరైన ధృవపత్రాలులేని రూ.10 లక్షలు విలువ చేసే 2.3 కిలోల వెండి ఆభరణాలను సీజ్ చేశారు. మెట్‌పల్లి నుంచి సిరిసిల్లకు  కారులో తరలిస్తున్న రెండు కిలోల మూడు వందల గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు చెక్‌పోస్టు వద్ద వాహన తనఖీలో పట్టుకుని పంచునామ చేసి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం రూ. 20 లక్షలు కూడా ఇక్కడే పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

మన తెలంగాణ 31 Jan 2026 6:29 pm

CM |హిందాల్కో బహుళ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం

CM | హిందాల్కో బహుళ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం CM |

ప్రభ న్యూస్ 31 Jan 2026 6:19 pm

tragic incident |ఐదుగురు మృతి

tragic incident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : లారీ, బైక్ లను

ప్రభ న్యూస్ 31 Jan 2026 6:04 pm

అంబటి ఇంటిపై టీడీపీ దాడి

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు

తెలుగు పోస్ట్ 31 Jan 2026 5:57 pm

Retirement |ఘనంగా వీడ్కోలు..

Retirement | విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్.టి.ఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనరేట్

ప్రభ న్యూస్ 31 Jan 2026 5:56 pm

Oath taking |సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం..

Oath taking | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా

ప్రభ న్యూస్ 31 Jan 2026 5:47 pm

Ambati Rambabu Faces Backlash After Guntur Incident

Tension gripped parts of Guntur on Friday after comments made by Ambati Rambabu triggered a sharp political confrontation. The episode unfolded after the TDP put up a flex banner near the NTR statue in Gorantla, linking the Tirumala ghee adulteration issue to what it called a moral failure. Ambati Rambabu objected strongly to the banner […] The post Ambati Rambabu Faces Backlash After Guntur Incident appeared first on Telugu360 .

తెలుగు 360 31 Jan 2026 5:37 pm

సమస్యలకోసం పోరాటం చేస్తా

సమస్యలకోసం పోరాటం చేస్తా -10 వార్డ్ కౌన్సిల్ అభ్యర్థి మాటూరి రాజయ్య మంచిర్యాల.

ప్రభ న్యూస్ 31 Jan 2026 5:33 pm

Mantralayam |రిటైర్డ్ తహసీల్దార్ పెన్షన్ లో ఐదు శాతం కోత

Mantralayam | మంత్రాలయం, ఆంధ్రప్రభ : మంత్రాలయం మండలం కేంద్రంలో ఉన్న సర్వే

ప్రభ న్యూస్ 31 Jan 2026 5:32 pm

దేశం కోసం, ధర్మం కోసం బి జే పి

మంచిర్యాల అభివృద్ధికి ఓటు వేయండి 51 డివిజన్ బిజెపి అభ్యర్థి నల్లపు రజిత

ప్రభ న్యూస్ 31 Jan 2026 5:30 pm

Gudivada |గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ బస్టాండ్ సెంటర్ వద్ద శనివారం

ప్రభ న్యూస్ 31 Jan 2026 5:26 pm

DEAD |వ్యాపారి మృతి

DEAD | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన

ప్రభ న్యూస్ 31 Jan 2026 5:19 pm

‘ఆంధ్ర టు తెలంగాణ’.. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న మాస్ సాంగ్

స్టార్ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. ప్రతీ సినిమాలో తనదైన శైలీ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి మారి దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరీ హీరోయిన్. ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకోవడమే కాక.. రూ.100 కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. సినిమా మాత్రమే కాదు.. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ‘భీమవరం బాలమా’ అంటూ సాగే పాటను నవీన్ పొలిశెట్టినే పాడగా.. ‘ఆంధ్ర టు తెలంగాణ’ అనే పాటకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను ధనుంజయ్, సమీరా భరద్వాజ్ పాడారు. ఈ పాటలో నటి శాన్వీ మేఘన తన గ్లామర్‌తో అలరించింది. చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియో సాంగ్‌ని యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది.

మన తెలంగాణ 31 Jan 2026 5:00 pm

గిరిజన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు…

జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఐటిడిఏ నిధులు ఖర్చు చేస్తే కఠిన చర్యలు-ఐటిడిఏ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ… గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల పనులు మార్చ్,31వ తేదీ నాటికి పూర్తిచేయాలి… గిరిజనుల వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ పై చర్యలు…. ఐటిడిఏ కార్యక్రమాలను అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి… జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఐటిడిఏ నిధులు వినియోగిస్తే కఠిన చర్యలు… ఐటిడిఏ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ… జిల్లా కలెక్టర్ […] The post గిరిజన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 4:55 pm

complaint |ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీజేపీ అభ్యర్థి పిర్యాదు

complaint | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పంచదేవ్ పహాడ్ గ్రామంలో

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:55 pm

Nandyal Bureau |జిల్లాలో గంజాయి కలకలం

Nandyal Bureau | జిల్లాలో గంజాయి కలకలం Nandyal Bureau | నంద్యాల

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:51 pm

KCR |సిట్‌ విచారణపై ఉత్కంఠకు తెర

KCR | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రాష్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:48 pm

చీడ పీడల నివారణకు నిర్దిష్ట సలహాలు

-జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్ విశాలాంధ్ర-రాప్తాడు : రైతులు రబీ, ఖరీఫ్ సీజన్లలో సాగు చేసే వ్యవసాయ, వాణిజ్య పంటలకు చీడ, పీడలు ఆశించకుండా వ్యవసాయ శాఖ సిబ్బంది నిర్ధిష్ట సలహాలు అందజేస్తుందని వాటిని పాటించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.రవికుమార్ సూచించారు. రాప్తాడు మండలం రామినేపల్లి, గంగులకుంట గ్రామాల్లో రబీ పంట సాగు పొలాలను మండల వ్యవసాయ అధికారి కృష్ణచైతన్య, రైతు సేవా కేంద్రం సిబ్బంది […] The post చీడ పీడల నివారణకు నిర్దిష్ట సలహాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 4:45 pm

17వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం

విశాలాంధ్ర.రాజాం: ఈ రోజు రాజాం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు, అమ్మవారి కాలనీ 5వ లైన్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మరిపి జగన్ మోహన్, గంధి గోపి, లెంక శ్రీహరి నాయుడు, ఆనందరావుతో పాటు సచివాలయ సిబ్బంది,వార్డు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. The post 17వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 4:39 pm

నాయి బ్రాహ్మణులు సమస్యలపై సమావేశం

విశాలాంధ్ర-రాజాం( విజయనగరం జిల్లా) : నాయీబ్రాహ్మణులు ఐక్యతతో ముందుకు వచ్చి తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు టి. తిరుపతిరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. రవణమూర్తి పిలుపునిచ్చారు. రాజాంలో జరిగినరాజాం నియోజకవర్గం, జి.సిగడాం మండలాల నాయకులతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు దాటినా నాయీబ్రాహ్మణుల జీవన స్థితిలో ఆశించిన మార్పులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి […] The post నాయి బ్రాహ్మణులు సమస్యలపై సమావేశం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 4:33 pm

నల్గొండలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారై

హైదరాబాద్: నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. కేతపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ల నగేశ్ భార్య మమత (25)తో అదే గ్రామానికి చెందిన వంపు సుజాత గొడవపడింది. వాగ్వాదం పెరిగి మమతపై పెట్రోలు పోసి నిప్పంటించింది. బాధితురాలు తన ఐదు నెలల కుమారుడిని ఎత్తుకొని ఉంది. ఈ ఘటనలో మమత అక్కడిక్కడే మృతి చెందగా.. చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాబును నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సగం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మమత భర్త నగేశ్ తో అదే గ్రామానికి చెందిన సుజాతకు వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోందని, మమత భర్త నగేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని.. నిందితురాలు సుజాత పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మన తెలంగాణ 31 Jan 2026 4:33 pm

అర్జున్ సరికొత్త రికార్డు.. కాకపోతే సచిన్ కంటే తక్కువే..

టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డుల రారాజు. ఆయన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను చేరుకున్నారు. అనితర సాధ్యమైన రికార్డులు సృష్టించారు. అయితే ఆయన తనయుడిగా క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అర్జున్ టెండూల్కర్.. తాజాగా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 50 వికెట్ల క్లబ్‌లో ఈ ఆల్ రౌండర్ చేరాడు. రంజీ ట్రోఫీలో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో గోవా తరఫున ఆడుతున్న అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. 2022-23 సీజన్‌లో గోవా తరఫున తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అర్జున్ రాజస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో సెంచరీ చేయడమే కాకుండా.. బౌలింగ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు. అయితే ప్రస్తుతం అతడి ఖాతాలో ఉన్న 50 వికెట్లలో 13 వికెట్లు ఈ రంజీ ట్రోఫీ సీజన్‌లోనూ సాధించడం విశేషం. అయినప్పటికీ.. వికెట్ల విషయంలో సచిన్ కంటే అర్జున్ వెనుకంజలో ఉన్నాడు. సచిన్ ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో మొత్తం 71 వికెట్లు తీశారు. దేశవాళీ కెరీర్‌లో తొలుత ముంబై తరఫున ఆడిన అర్జున్ ఆ తర్వాత గోవాకి మారాడు. ఇక ఐపిఎల్‌లో ముంబై జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన అర్జున్.. 2026లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు ట్రేడ్ ద్వారా వెళ్లాడు.

మన తెలంగాణ 31 Jan 2026 4:26 pm

NCP |శాసనసభాపక్ష నాయకురాలిగా..

NCP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:23 pm

Andhra Prabha Smart AP Edition |ఏపీలో సంజీవని /వెండి ఢమాల్​

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 31-01-2026, 4.00PM ap వైద్య రంగంలో విప్లవం.. ఏపీలో

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:22 pm

జాకరవలస పాఠశాలలో ప్లేట్ వితరణ

విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా):మండలంలోని అరమ జాకరవలస మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రేమ బంధు ఫౌండేషన్ సభ్యులు శనివారం భోజన ప్లేట్ లను అందజేశారు. విద్యార్థులకు ఈ రకమైన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా చదువుపై ఆసక్తి పెరిగి వారు మరింత ఉత్సాహంగా విద్య అభ్యసిస్తారని ఆ సంస్థ సభ్యులు రమేష్ పట్నాయక్ తెలియజేశారు.ఈకార్యక్రమం లో పి.ఆర్.టీ.యు జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పలరాజు,జిల్లా ఉపాధ్యక్షులు మండ్యగురు శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు టీ.కృష్ణ, […] The post జాకరవలస పాఠశాలలో ప్లేట్ వితరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 4:17 pm

Andhra Prabha Smart Telangana Edition|వన ప్రవేశం/సిట్​ హాజరుపై..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 31-01-2026, 4.00PM ts జనం నుంచి వనంలోకి.. తల్లుల

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:17 pm

Kuppam |పరిశ్రమల ఒప్పందాలతో వ్యాప్తంగా కార్యక్రమాలు

Kuppam | పరిశ్రమల ఒప్పందాలతో వ్యాప్తంగా కార్యక్రమాలు Kuppam | కుప్పం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:16 pm

ప్రజల సమస్యల పై అధికారులు అప్రమత్తంగా పనిచేయాలి….

ఎమ్మార్వో నూతక్కి సురేష్ బాబు విశాలాంధ్ర నందిగామ:-కార్యాలయ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలనే పరమావధిగా భావించి పనిచేయాలని తహసిల్దార్ నూతక్కి సురేష్ బాబు అన్నారు శనివారం ఆయన కార్యాలయంలో కార్యాలయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలను అందించారు కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు కలకుండా వారి యొక్క పని ముగిసే వరకు దృష్టి సారించి పని చేయాలని సూచించారు అనవసరంగా కార్యాలయం చుట్టూ […] The post ప్రజల సమస్యల పై అధికారులు అప్రమత్తంగా పనిచేయాలి…. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 4:11 pm