SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట… ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీసీరోడ్డు

ప్రభ న్యూస్ 21 Mar 2026 3:29 pm

Telangana |హైటెన్షన్ వైర్లు తగిలి..

Telangana | హైటెన్షన్ వైర్లు తగిలి.. Telangana | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్

ప్రభ న్యూస్ 21 Mar 2026 3:27 pm

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం..

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలో రైతులకు ఊరటనిచ్చే

ప్రభ న్యూస్ 21 Mar 2026 3:24 pm

జుక్కల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు..

జుక్కల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు.. జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్

ప్రభ న్యూస్ 21 Mar 2026 3:24 pm

గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన బడ్జెట్: బీజేపీ

నిజామాబాద్, ఆంధ్రప్రభ : గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు

ప్రభ న్యూస్ 21 Mar 2026 3:22 pm

summer |వ‌డ‌దెబ్బ నుంచి త‌ప్పించుకోండి..

summer | వ‌డ‌దెబ్బ నుంచి త‌ప్పించుకోండి.. ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రోజురోజుకి ఎండ

ప్రభ న్యూస్ 21 Mar 2026 3:20 pm

కానిస్టేబుల్ విజయ్ కుమార్ ని ఆదుకుంటాం..

కానిస్టేబుల్ విజయ్ కుమార్ ని ఆదుకుంటాం.. వికారాబాద్, ఆంధ్రప్రభ : విజయ్ కుటుంబాన్ని

ప్రభ న్యూస్ 21 Mar 2026 3:17 pm

మత సామరస్యానికి ప్ర‌తీక‌గా రంజాన్…

మత సామరస్యానికి ప్ర‌తీక‌గా రంజాన్… ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : మత సామరస్యానికి రంజాన్

ప్రభ న్యూస్ 21 Mar 2026 3:12 pm

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్..

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్.. ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్

ప్రభ న్యూస్ 21 Mar 2026 3:08 pm

పార్టీలో ప్రాధాన్యం లేదు..మీకో దండం : జీవన్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలవడానికి మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డి ఇంటికి వచ్చారు. బిఆర్ఎస్ లోకి వెళ్తారంటూ తప్పుడు ప్రచారం చేశారని జీవన్ రెడ్డిని శ్రీధర్ బాబు బుజ్జగించారు. జీవన్ రెడ్డితో గంటకు పైగా మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డిని కలవడానికి వచ్చామని, జీవన్ రెడ్డితో అనేక అంశాల గురించి చర్చించామని తెలిపారు. జీవన్ రెడ్డి పద్దతిగల నాయకుడిగా 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్నారని కొనియాడారు. పార్టీ కార్యకర్తలు, నాయుకుల మనోభావాలను తెలియజేశారు. జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంత్రులతో సమావేశం అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పుపై పట్టు వీడలేదని, ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. మంత్రులు పార్టీలో కొనసాగాలని కోరారు. మీకో దండం అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ససేమిరా అని..తన నిర్ణయం లో మార్పులేదని, పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తానని జీవన్ రెడ్డి అన్నారు. వచ్చినందుకు థ్యాంక్స్ అంటూ మంత్రులకు జీవన్ రెడ్డి చెప్పారు.

మన తెలంగాణ 21 Mar 2026 2:44 pm

Sundeep Kishan Join Forces With Shambhala Makers

Fresh off the success of Shambhala, Shining Pictures reunites with director Ugandhar Muni for their next large-scale venture. Mahidhar Reddy and Rajashekhar Annabhimoju are producing this high-budget socio-fantasy thriller with Sundeep Kishan leading the cast. The announcement came with a powerful concept poster showcasing a lion and a wolf clashing head-on, split by a mythical […] The post Sundeep Kishan Join Forces With Shambhala Makers appeared first on Telugu360 .

తెలుగు 360 21 Mar 2026 2:35 pm

అందరి లక్ష్యం ఒక్కటే.. సహచరులకు విరాట్ స్ట్రాంగ్ వార్నింగ్

క్రికెట్ అభిమానులు ఎంతాగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకనంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనుంది. 18 సీజన్లుగా ట్రోఫీ కోసం పోరాడిన ఆర్‌సిబి జట్టు గత సీజన్‌లో ట్రోఫీని అందుకొని తమ కలను సాకారం చేసుకుంది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్‌సిబి.. ఈ సీజన్‌లో కూడా టైటిల్‌ని రిటైన్ చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మేరకు ఇప్పటికే చిన్నస్వామి స్టేడియంలో రజత్ పాటిదార్ సేన ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన సహచరులకు గట్టి వార్నింగ్ ఇఛ్చాడు. ‘‘గత రెండు, మూడు సీజన్లుగా మనం పడ్డ కష్టానికి ఫలితం గతేడాది దక్కింది. కానీ, ఈసారి మనకు మరిన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. అన్ని జట్లు మనల్ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ సమయాన్నివృథా చేయకండి. 100కి 120 శాతం కష్టపడాలి. ఈ టోర్నీలో సత్తా చాటేందుకు మనమంతా ఉత్సాహం ఉన్నామని మనందరి ముఖాల్లో కనిపిస్తోంది’’ అని విరాట్ పేర్కొన్నాడు.

మన తెలంగాణ 21 Mar 2026 2:32 pm

Ys Vijayamma : ఆస్తుల వివాదం.. అధికారానికి మళ్లీ దూరం చేయనుందా?

వైఎస్ విజయమ్మ తన కుమారుడు వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్ కు అడ్డుకట్ట వేసే అవకాశాలున్నాయి

తెలుగు పోస్ట్ 21 Mar 2026 2:29 pm

అంబేద్కర్ సంఘం అధ్యక్షులుగా గజ్జల సురేష్

అంబేద్కర్ సంఘం అధ్యక్షులుగా గజ్జల సురేష్ భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ : దివంగత మాజీ

ప్రభ న్యూస్ 21 Mar 2026 2:29 pm

మార్కెట్ డిమాండ్లపై అవగాహన పెంచుకున్నాకే పంటలు వేయాలి: పెమ్మసాని

అమరావతి: మిద్దె తోటల పెంపకం దారుల సమూహం ఉందని తనకు ఇప్పటి వరకూ తెలియదని, పురుగుమందులు లేకుండా వ్యవసాయం చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు ఎపి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వ్యవసాయం చేసే చాలామంది రైతులకు ఆదాయం రావట్లేదని అన్నారు. మిద్దె తోటల పెంపకం ప్రోత్సహిస్తున్న రఘోత్తమరెడ్డి, వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలియజేశారు. గుంటూరు కొర్నెపాడులో రైతు నేస్తం ఫౌండేష్ పదో వార్షికోత్సవం జరిగింది. వార్షికోత్సవంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. మిద్దెతోటలు సాగుచేస్తున్న మహిళలకు అవార్డులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఒకే పంట కాకుండా ఎక్కువ పంటలు వేయాలని, మార్కెట్ డిమాండ్లపై అవగాహన పెంచుకున్నాక పంటలు వేయాలని మనవి చేస్తున్నానని అన్నారు. వ్యవసాయంతో సరిపెట్టకుండా ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడితేనే లబ్ధి జరుగుతుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రైతులు సంఘటితమైతేనే వ్యాపారుల పెత్తనం తగ్గుతుందని, సిఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తున్నారని అన్నారు. మిద్దె తోటలకు బడ్జెట్ కేటాయింపుపైనా ప్రభుత్వంతో మాట్లాడతానని చంద్రశేఖర్ సూచించారు.  

మన తెలంగాణ 21 Mar 2026 2:22 pm

ఘనంగా రంజాన్ వేడుకలు…

ఘనంగా రంజాన్ వేడుకలు… చల్లగరిగవేడుకల్లో చిట్యాల ఎస్ఐ సతీష్… చిట్యాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Mar 2026 2:22 pm

kavya kalyanram |పొట్టిపిల్ల బ్యూటీఫుల్ పిక్స్‌

kavya kalyanram | పొట్టిపిల్ల బ్యూటీఫుల్ పిక్స్‌ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అల్లు

ప్రభ న్యూస్ 21 Mar 2026 2:19 pm

మైనార్టీల సంక్షేమానికి కేంద్రం కృషి..

మైనార్టీల సంక్షేమానికి కేంద్రం కృషి.. రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే నిజామాబాద్

ప్రభ న్యూస్ 21 Mar 2026 2:18 pm

Ration |ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ!

Ration | ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ! Ration | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 21 Mar 2026 2:12 pm

Fire on |భోజనంలో గుడ్లు ఇవ్వడం అర్థరహితమా..?

Fire on | భోజనంలో గుడ్లు ఇవ్వడం అర్థరహితమా..? Fire on |

ప్రభ న్యూస్ 21 Mar 2026 2:09 pm

మియాపూర్ లో మహిళపై కత్తితో దాడి

హైదరాబాద్:  తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మియాపూర్ లో జరిగింది. నూకరత్నం అనే మహిళపై కత్తితో ఆలీషా అలియాస్ పాండు దాడి చేశాడు. కాకినాడకు చెందిన నూకరత్నం అనే మహిళ మియాపూర్ లో హౌస్ కీపింగ్ పనిచేస్తుంది. గతంలోనే భర్తను కోల్పోయిన నూకరత్నం అనే మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.  ప్రసాద్ అనే వ్యక్తిని నూకరత్నం గతనెల 20న పెళ్లి చేసుకుంది. నూకరత్నం పనిచేసే చోట ఆలీషా అలియాస్ పాండు వంటమనిషిగా పనిచేస్తున్నాడు. తనకు చెప్పకుండా ప్రసాద్ ను పెళ్లి చేసుకోవడంతో అలీషా ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈనెల 19న తండ్రి లాలూ, స్నేహితుడు జాన్ తో కలిసి మహిళ ఇంటికి అలీషా వెళ్లాడు. తనవెంట రావాలని మహిళతో అలీషా గొడవపడ్డాడు. నూకరత్నం నిరాకరించడంతో ఆగ్రహంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. నూకరత్నం తీవ్రంగా గాయపడడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నిందితులు అలీషా, అతని తండ్రి లాలూను పోలీసులు అరెస్ట్ చేశారు.

మన తెలంగాణ 21 Mar 2026 1:56 pm

Foodstuffs |పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు

Foodstuffs | పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు Foodstuffs | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 21 Mar 2026 1:51 pm

నాణ్యతలో రాజీ పడొద్దు..

నాణ్యతలో రాజీ పడొద్దు.. నిర్ణీత సమయంలో పనులు పూర్తి కావాలి..దేవాదాయ శాఖ కమిషనర్

ప్రభ న్యూస్ 21 Mar 2026 1:47 pm

గెలిచామన్న ట్రంప్…కేవలం భ్రమ మాత్రమేనన్న ఇరాన్

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దాదాపుగా నిర్మూలించామని, యుద్ధ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ మాటలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అవి కేవలం భ్రమ మాత్రమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా ఆయన అమెరికా తీరును వియత్నాం యుద్ధంతో పోల్చారు. 1960లలో వియత్నాంలో […] The post గెలిచామన్న ట్రంప్…కేవలం భ్రమ మాత్రమేనన్న ఇరాన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 1:37 pm

అందంతో జిగేలుమంటున్న నిధి అగర్వాల్

                       

మన తెలంగాణ 21 Mar 2026 1:33 pm

వ్యవసాయ మోటర్లు, వైర్లు దొంగతనం..

వ్యవసాయ మోటర్లు, వైర్లు దొంగతనం.. రాత్రి సమయంలో పెట్రోలింగ్‌ పెంచాలంటున్న బీజేపీ నాయకులు….

ప్రభ న్యూస్ 21 Mar 2026 1:27 pm

ఘనంగా రంజాన్ వేడుకలు..

ఘనంగా రంజాన్ వేడుకలు.. కరీమాబాద్, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రజలందరూ మతసామరస్యంతో మెలగాలని

ప్రభ న్యూస్ 21 Mar 2026 1:24 pm

ఒక్క క్లిక్‌తో కూరగాయలు…

ఒక్క క్లిక్‌తో కూరగాయలు… ఇంటి ముంగటికే కే రైతుబజార్ సేవలుడిజి రైతుబజార్’తో డోర్

ప్రభ న్యూస్ 21 Mar 2026 1:22 pm

ఘనంగా రంజాన్ పర్వదినం వేడుకలు..

ఘనంగా రంజాన్ పర్వదినం వేడుకలు.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 21 Mar 2026 1:20 pm

మత సామరస్యానికి ప్రతీక ఈద్ ఉల్ ఫితర్…

మత సామరస్యానికి ప్రతీక ఈద్ ఉల్ ఫితర్… ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మత

ప్రభ న్యూస్ 21 Mar 2026 1:18 pm

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఉప సర్పంచ్

నార్సింగి, ఆంధ్రప్రభ : రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం మెదక్ జిల్లా

ప్రభ న్యూస్ 21 Mar 2026 1:16 pm

జియాగూడలో అక్రమ సమోసా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

హైదరాబాద్: పాతబస్తీలోని జియాగూడలో అక్రమ సమోసా తయారీ కేంద్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్‌ దాడి చేసింది. ఐదు లక్షల రూపాయల విలువైన అపరిశుభ్ర ఆహార నిల్వలను పోలీసులు సీజ్ చేయడంతో పాటు నిందితుడి అరెస్ట్ చేశారు. జియాగూడలోని ఎస్.బి.ఏ గార్డెన్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా సమోసా తయారీ కేంద్రా అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి(73) నిర్వహిస్తున్నాడు. కుల్సుంపురా పోలీసుల సమన్వయంతో హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ జియాగూడలోని అక్రమ సమోసా తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేశారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, కుళ్ళిపోయిన గుడ్లు, పదేపదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా సమోసాలను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అన్ని వస్తువులను సీజ్ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీజ్ చేసిన వస్తువుల విలువ ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఆహార కల్తీ, అక్రమ తయారీ కేంద్రాలపై హైదరాబాద్ సిటీ పోలీస్ నిరంతరం నిఘా ఉంచుతుందని, ప్రజలు తమ ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజారోగ్య రక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నామని సిటీ పోలీసులు తెలిపారు.  సీజ్ చేసిన పదార్థాలు:  పాడైపోయిన కోడిగుడ్లు: 500 వాడేసిన వంట నూనె: 5 కిలోలు తయారు చేసిన పదార్థాలు: ఎగ్ సమోసాలు (350), స్వీట్ కార్న్ సమోసాలు (600), ఉల్లిపాయ సమోసాలు (1000) ముడి పదార్థాలు: మైదా (50 కిలోలు), ఉప్పు (4 బస్తాలు), సమోసా పట్టీలు (2000), అపరిశుభ్రమైన స్వీట్ కార్న్ (10 కిలోలు) యంత్రాలు: ఫ్రైయర్, ఉల్లిపాయలు కోసే యంత్రం, వంట పాత్రలు.

మన తెలంగాణ 21 Mar 2026 1:15 pm

Amercia - Iran War : మధ్యప్రాచ్యంలో యుద్ధంపై అమెరికా సందిగ్దత

మధ్యప్రాచ్యంలో సైనిక చర్యలను తగ్గించే ఆలోచనలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు

తెలుగు పోస్ట్ 21 Mar 2026 1:14 pm

స్నేహానికి ప్రతీక రంజాన్….

స్నేహానికి ప్రతీక రంజాన్…. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా

ప్రభ న్యూస్ 21 Mar 2026 1:12 pm

1.10 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట డివిజన్ లోని 300 మంది లబ్ధిదారులకు 1

ప్రభ న్యూస్ 21 Mar 2026 1:11 pm

ప్రజలందరిపై అల్లా దైవం ఆశీస్సులు ఉండాలి…

ప్రజలందరిపై అల్లా దైవం ఆశీస్సులు ఉండాలి… ఏపీ ఎస్.డబ్ల్యూ.సి చైర్మన్ రావి వెంకటేశ్వర

ప్రభ న్యూస్ 21 Mar 2026 1:08 pm

ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్‌ ఉండాలి.. ‘ధురంధర్‌-2’పై జక్కన్న ప్రశంసలు

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ సినిమా ఏ రేంజ్‌ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ధురంధర్-ది రివెంజ్’ సినిమా గురువారం విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా దాదాపు 4 గంటల నిడివితో ఉంది. అదే విషయాన్ని ప్రస్తావించిన రాజమౌళి.. అంత సేపు సినిమా తీసి.. ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఉండేలా చేయడం అంటే మామూలు విషయం కాదని.. అందుకు ఎంతో గట్స్ ఉండాలని ప్రశంసించారు. ‘‘‘ధురంధర్’ నాకు బాగా నచ్చింది. కానీ, ది రివెంజ్ మొదటి భాగం కంటే ఎంతో అద్భుతంగా ఉంది. రచన, నటీనటులు, సాంకేతిక పరిజ్ఞానం, మ్యూజిక్ ఇలా వేటిలోనూ లోపాలు కనిపించలేదు. దర్శకుడు ఆదిత్యధర్ నాలుగు గంటల పాటు తన సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇలాంటి సినిమా చేయాలంటే నిజంగా ఎంతో గట్స్ ఉండాలి. చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా చిత్రాన్ని తెరకెక్కించారు. రణ్‌వీర్ సింగ్ తన నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు. జస్కిరాత్ సింగ్, హమ్జా అలీ మజారీగా రెండు పాత్రలకూ న్యాయం చేశారు. షెడ్డులో బంధించిన సోదరిని కలిసే సమయంలో ఆయన నటన మాస్టర్ క్లాస్. సినిమా మొదటి నుంచి పతాక సన్నివేశం వరకు రణ్‌వీర్ నటన అమోఘం. దేశ నిస్సహాయతను, అసహనాన్ని మాధవన్ తెరపై చక్కగా ప్రదర్శించారు. ఈ విజయం మనందరిదీ’’ అని రాజమౌళి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మన తెలంగాణ 21 Mar 2026 1:06 pm

తిరుమలలో భక్తులకు ఇక త్వరిగతిన దర్శనం

భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 21 Mar 2026 12:59 pm

పేలిన బస్సు టైర్​ –చెలరేగిన మంటలు –డ్రైవర్​ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా (Vizianagaram district)లో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది (Fire breaks out in a private bus). అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున రామభద్రపురం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ఆరెంజ్ ట్రావెల్స్‌ (Orange Travels)కు చెందిన బస్సు భువనేశ్వర్ నుంచి మల్కాన్‌గిరికి వెళ్తోంది. […] The post పేలిన బస్సు టైర్​ – చెలరేగిన మంటలు – డ్రైవర్​ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 12:56 pm

Hyderabad : ఈ సమోసాలు తిన్నారో.. ఇక మీ కడుపు మటాష్

దాడిలో సమోసాలు పెద్ద ఎత్తున అత్యంత దారుణమైన పరిస్థితుల్లో తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

తెలుగు పోస్ట్ 21 Mar 2026 12:48 pm

తొలిసారిగా 4,000 కి.మీ. దూరంలోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి

పశ్చిమాసియాకే పరిమితమైన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు హిందూ మహాసముద్రానికి విస్తరించాయి. ఏకంగా 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరం డియాగో గార్సియాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించడం అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తోంది. ఇరాన్ వద్ద ఇంతటి శక్తిమంతమైన క్షిపణులు ఉన్నాయని అంచనా వేయడంలో విఫలమయ్యామని అమెరికా భావిస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇరాన్ రెండు క్షిపణులను ప్రయోగించగా, ఒకటి సాంకేతిక లోపంతో విఫలమైంది. మరొకటి అమెరికా రక్షణ […] The post తొలిసారిగా 4,000 కి.మీ. దూరంలోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 12:45 pm

రుణమాఫీ కాకుండా..ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? : హరీష్ రావు

హైదరాబాద్: ఎంతో ముందుచూపుతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ప్రణాళికలు చేశామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తాము అన్ని సమకూర్చడం.. కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేయడం అని అన్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేట ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆయుష్ ఆస్పత్రులు తామే ఏర్పాటు చేశామని, పిహెచ్ సిలు కూడా తాను ఆరోగ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఎన్నికల కోడ్ వల్ల పిహెచ్ సిలు ప్రారంభించలేదని, బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జిల్లా జైలుకు భూసేకరణ చేసి.. నిధులు కేటాయించామని అన్నారు. జిల్లా జైలు పూర్తయి రెండేళ్ల తర్వాత.. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు వచ్చి ప్రారంభిస్తున్నారని విమర్శించారు. శ్రమ తమది..శిలాఫలకాలు వాళ్లవి అని హరీష్ రావు మండిపడ్డారు. నర్మెట్టలోనే 350 మంది రైతులకు రుణమాఫీ అవ్వలేదని, రైతుబంధు బకాయిలు వెంటనే ఇవ్వాలని రైతుల తరఫున అడుగుతున్నానని డిమాండ్ చేశారు. పంటల బీమా ఇప్పటికీ చేయించలేదని, వర్షాలు, తుఫానుల వల్ల నష్టపోయిన పంటలకు బీమా రాలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిద్ధిపేటకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని అన్నారు. మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టలేదా? అని..రుణమాఫీ పూర్తి చేశాకే సిద్ధిపేట వస్తా అన్నావు.. మరి రుణమాఫీ అయిందా? అని.. రుణమాఫీ కాకుండా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? అని హరీష్ రావు ప్రశ్నించారు. 

మన తెలంగాణ 21 Mar 2026 12:40 pm

ధురంధర్ -2 తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. రిలీజ్‌కు లైన్ క్లియర్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్ తెలుగు వెర్షన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ప్రదర్శనలు ఇవాళ‌ మధ్యాహ్నం నుంచి థియేటర్లలో ప్రారంభం కానున్నాయి. దీంతో అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వాస్తవానికి ఈ సినిమా హిందీ వెర్షన్‌తో పాటే ఈ నెల‌ 19న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కావాల్సి ఉంది. అయితే, కంటెంట్ […] The post ధురంధర్ -2 తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. రిలీజ్‌కు లైన్ క్లియర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 12:39 pm

వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణలో సొంతంగా వాహనం ఉండి, మరో కొత్త వాహనం కొనాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండో వాహనం కొనుగోలుపై ఇప్పటివరకు విధిస్తున్న 2 శాతం అదనపు జీవితకాలపు పన్నును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన ఈ నెల 23వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో వాహన కొనుగోలుదారులకు పెద్ద ఆర్థిక ఉపశమనం కలగనుంది. రాష్ట్ర రవాణా శాఖ ఈ నెల 23 నుంచి జాతీయ స్థాయి ‘వాహన్ […] The post వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 12:32 pm

మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది.

తెలుగు పోస్ట్ 21 Mar 2026 12:31 pm

ప్రపంచ మానవాళికి శాంతిని బోధించే దైవ గ్రంథం ఖురాన్

ప్రపంచ మానవాళికి శాంతిని బోధించే దైవ గ్రంథం ఖురాన్ మౌలానా అబూ హోరేరా

ప్రభ న్యూస్ 21 Mar 2026 12:27 pm

ఇంద్రకీలాద్రిపై వైభవం గా పుష్పాలంకరణ..

ఇంద్రకీలాద్రిపై వైభవం గా పుష్పాలంకరణ.. మూడవ రోజు చామంతి–గులాబీ పూలతో కనకదుర్గమ్మకు అద్భుత

ప్రభ న్యూస్ 21 Mar 2026 12:24 pm

కడియం కటౌట్ కు వినతిపత్రం అందజేత..

చిలుపూర్, ఆంధ్రప్రభ ; బిఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచిన కడియం శ్రీహరి, నేటికీ

ప్రభ న్యూస్ 21 Mar 2026 12:22 pm

ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే..

ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే.. పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణంలో శనివారం

ప్రభ న్యూస్ 21 Mar 2026 12:21 pm

వైభవంగా శ్రీ సీతారామ మందిర పునః ప్రతిష్ట..

వైభవంగా శ్రీ సీతారామ మందిర పునః ప్రతిష్ట.. నూతన విగ్రహాల ప్రతిష్టా మహోత్సవంభక్తుల

ప్రభ న్యూస్ 21 Mar 2026 12:19 pm

Chiranjeevi : చిరు చేసిన వ్యాఖ్యలు పవన్ ను ఇబ్బంది పెట్టాయా?

మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కల్యాణ్ ను ఇబ్బందుల్లోకి నెట్టినట్లే కనిపిస్తుంది

తెలుగు పోస్ట్ 21 Mar 2026 12:18 pm

భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్ధనలు..!

భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్ధనలు..! కోడూరు, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని

ప్రభ న్యూస్ 21 Mar 2026 12:16 pm

ఇంజినీరింగ్ రంగంలో నల్లమల వాసికి విశిష్ట సేవలు

ఇంజినీరింగ్ రంగంలో నల్లమల వాసికి విశిష్ట సేవలు అచ్చంపేట, ఆంధ్రప్రభ ; కిన్నెర

ప్రభ న్యూస్ 21 Mar 2026 12:16 pm

టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల

10 కీలక హామీలతో విడుదల మమత కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదలకు సిద్ధపడుతున్నాయి. ఈ ఎన్నికలకు అధికార టీఎంసీ ముందు నుంచి దూకుడును ప్రదర్శిస్తోంది. అభ్యర్ధులను ముందుగానే ప్రకటించి అందరినీ అలోచనలో పడేసింది. అదే క్రమంలో శుక్రవారం తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్రంలో వరుసగా నాలుగోసారి అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు. ప్రతి […] The post టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 12:14 pm

అవార్డు గ్రహీత దుంప నర్సయ్యకు ఘన సన్మానం

గణపురం, ఆంధ్రప్రభ ; బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ బాపూజీ

ప్రభ న్యూస్ 21 Mar 2026 12:12 pm

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు... అభిషేక్ సింగ్ అరెస్టు

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్‌ను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ రోహిత్ పార్టీకి అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేశాడు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ అభిషేక్ నుంచి డ్రగ్స్ కొన్నాడు. రోహిత్‌కు ఇప్పటివరకు అభిషేక్ 24 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు తెలుస్తోంది.  మొయినాబాద్ లోని మాజీ ఎంఎల్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌లోని డ్రగ్స్ పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే. రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌లో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో మద్యంతో పార్టీని జరుపుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందండంతో పోలీసు బృందం ఫామ్‌హౌస్  దాడి చేసి ఒక మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను సేవిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు లోపలికి వెళుతున్న క్రమంలో వారిపై కాల్పులు జరిగాయి. నిందితుల్లో పంజుగుల రోహిత్ రెడ్డి అలియాస్ పైలట్ రోహిత్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), ఏపి టిడిపి ఎంపి పుట్ట మహేష్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, తిరువీదుల అర్జున్ రెడ్డి, నల్లపనేని విజయ కృష్ణ, వరమచనేని శ్రవణ్ కుమార్, మోరవినేని రమేష్, ప్రియాంక, సిల్వేరి శరత్ కుమార్‌లు ఉన్నట్లు వెల్లడించారు. 

మన తెలంగాణ 21 Mar 2026 12:10 pm

BRS : కౌశిక్ రెడ్డిపై నేతలు తిరుగుబాటు

హుజూరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు

తెలుగు పోస్ట్ 21 Mar 2026 12:09 pm

జీవన్ రెడ్డితో మంత్రుల మంతనాలు

జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు సమావేశమయ్యారు

తెలుగు పోస్ట్ 21 Mar 2026 12:00 pm

Rajamouli Heaps Praise on Dhurandhar: The Revenge

Bollywood film Dhurandhar: The Revenge is doing wonders across the globe with its box-office numbers. The film is receiving a lot of appreciation from the circles of Tollywood. The Telugu version of the film released today all over. Top director SS Rajamouli watched Dhurandhar: The Revenge and he could not wait to appreciate the film. […] The post Rajamouli Heaps Praise on Dhurandhar: The Revenge appeared first on Telugu360 .

తెలుగు 360 21 Mar 2026 11:59 am

Shooting Update of Ram Charan’s Peddi

Ram Charan’s upcoming film Peddi is the most awaited summer release of Telugu cinema. The makers announced that the film releases on April 30th across the globe during the core summer season. There are strong speculations that the film’s release will be pushed due to the pending shoots and the extensive post-production work involved. But […] The post Shooting Update of Ram Charan’s Peddi appeared first on Telugu360 .

తెలుగు 360 21 Mar 2026 11:54 am

Harish Rao : మాది శ్రమ ఫలితం.. మీది శిలా ఫలకం

రుణమాఫీ చేయకుండానే సిద్ధిపేటకు ఎలా వస్తావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు.

తెలుగు పోస్ట్ 21 Mar 2026 11:52 am

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. 9 దేశాల గగనతలాన్ని వాడొద్దన్న డీజీసీఏ

పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భారత విమానయాన సంస్థలకు కీలక సూచనలు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్, ఇరాక్, యూఏఈ సహా 9 దేశాల గగనతలాన్ని పూర్తిగా ఉపయోగించవద్దని స్పష్టం చేసింది. ఇరాన్ భూభాగంలో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు నిర్వహించడం, దీనికి ప్రతిగా ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉండటంతో పౌర విమానయానానికి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని డీజీసీఏ తన […] The post పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. 9 దేశాల గగనతలాన్ని వాడొద్దన్న డీజీసీఏ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 11:43 am

కరీంనగర్ లో ఎస్ఐ ఆత్మహత్య

 కరీంనగర్: ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నీంనగర్ జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అత్తగారింట్లో ఉరి వేసుకుని ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఐదు రోజుల క్రితమే ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల మరణాలతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎస్ఐ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్ కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 21 Mar 2026 11:42 am

దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నాం: చంద్రబాబు

తిరుపతి: మా మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏడుకొండల వాడి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులందరం కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి వారి సేవలో తరించామన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులు, భక్తులతో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి  ముచ్చటించాను. టిటిడి సేవలు ఎలా అందుతున్నాయో భక్తులను అడిగి తెలుసుకున్నారు.   

మన తెలంగాణ 21 Mar 2026 11:36 am

తిరుమలలో సీఎం చంద్రబాబు కుటుంబం

భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించిన సీఎం విశాలాంధ్ర – తిరుమల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్లారు. తెల్లవారి జామున స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం భక్తులతో కలిసి శ్రీ వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించారు. […] The post తిరుమలలో సీఎం చంద్రబాబు కుటుంబం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 11:29 am

ఆంధ్రప్రభ ఎఫెక్ట్…

ఆంధ్రప్రభ ఎఫెక్ట్… చేవెళ్ల, ఆంధ్రప్రభ : చేవెళ్లలో “డయాలసిస్ సేవలు బంద్” అంటూ

ప్రభ న్యూస్ 21 Mar 2026 11:28 am

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగింపు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34వ వార్డు హౌసింగ్ బోర్డ్

ప్రభ న్యూస్ 21 Mar 2026 11:24 am

ఇరాన్ ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాం: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్ నౌకాదళం, వైమానిక దళాన్ని నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సైనిక పరంగా ఇరాన్ పని అయిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఖర్గ్ ద్వీపానికి సంబంధించి తమ వద్ద ఉన్న ప్రణాళికలు చెప్పలేనని, ఇరాన్ ను తీవ్రంగా దెబ్బతీస్తున్నామని తెలియజేశారు. హోర్ముజ్ జలసంధి గురించి తమకు అవసరం లేదని, యూరప్, జపాన్, చైనా, కొరియాకు అవసరం కాబట్టి వారు జోక్యం చేసుకోవాలని సూచించారు. హోర్ముజ్ జలసంధి తెరిపించేందుకు పెద్ద సంఖ్యలో నౌకలు అవసరమని, హోర్ముజ్ ను తెరిపించేందుకు నాటో సాయం చేయగలదు.. కానీ వారికి ధైర్యం లేదని ట్రంప్ విమర్శించారు. 

మన తెలంగాణ 21 Mar 2026 11:23 am

Aamir Khan’s Support Adds Momentum To Sesh’s Dacoit

With the release date nearing, Adivi Sesh’s Pan-India action drama Dacoit is steadily turning up the heat ahead of its April 10th arrival in cinemas. The film, led by Sesh and Mrunal Thakur, marks the directorial entry of Shaniel Deo, who blends an emotional core with high-intensity action. A major highlight is the Telugu debut […] The post Aamir Khan’s Support Adds Momentum To Sesh’s Dacoit appeared first on Telugu360 .

తెలుగు 360 21 Mar 2026 11:22 am

ఫార్మాకు ప్రమాద ఘటికలు

మందులపై యుద్ధం ప్రభావం*ధరలు పెరిగే అవకాశం! ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల మధ్య చెలరేగుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కాకుండా, సామాన్యుడి ప్రాణరక్షక ఔషధాల రంగాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నాయి. రవాణా మార్గాల్లో ఆటంకాలు, ముడి చమురు ధరల పెరుగుదల వెరసి భారత ఫార్మా రంగానికి ‘ప్రమాద ఘటికలు’ మోగిస్తున్నాయి. రానున్న రోజుల్లో నిత్యావసర మందుల ధరలు సామాన్యుడికి భారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ధరలు పెరిగే అవకాశం ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు పెరగడంతో, ఫార్మా […] The post ఫార్మాకు ప్రమాద ఘటికలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Mar 2026 11:21 am

నూతన ఎస్సైని కలిసిన జనసేన నాయకులు..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ లో ఇటీవల నూతన

ప్రభ న్యూస్ 21 Mar 2026 11:20 am

SI Chandrasekhar |మొన్న భార్య… ఇప్పుడు భర్త

SI Chandrasekhar | మొన్న భార్య… ఇప్పుడు భర్త SI Chandrasekhar |

ప్రభ న్యూస్ 21 Mar 2026 11:20 am

ఇస్లాం బోధనలు, సదా అనుసరణీయం..

ఇస్లాం బోధనలు, సదా అనుసరణీయం.. మౌలానా ముస్తాన్ నద్వీ ఆంధ్రప్రభ, విజయవాడ :

ప్రభ న్యూస్ 21 Mar 2026 11:17 am

మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా దుంపల పద్మారెడ్డి నియామకం

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఖాళీగా

ప్రభ న్యూస్ 21 Mar 2026 11:14 am

ముష్టిబండలో రోడ్డు ప్రమాదం

ముష్టిబండలో రోడ్డు ప్రమాదం దమ్మపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ముష్టిబండ–మొద్దులగూడెం గ్రామాల

ప్రభ న్యూస్ 21 Mar 2026 11:11 am

పోలవరం జిల్లాలోకి పులి

కాకినాడ జిల్లాలో ఇన్నాళ్లు సంచరించిన పులి ఇప్పుడు పోలవరం ప్రాంతంలోకి ప్రవేశించింది

తెలుగు పోస్ట్ 21 Mar 2026 11:10 am

మచిలీపట్నంలో అమ్మాయిపై పూజారి అత్యాచారం

అమరావతి: బాలికను పలుమార్లు బెదిరించి ఆమెపై ఇంటి యజమాని అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిజాంపేటలో పూజారి రఘు నివసిస్తున్నాడు. ఆయన ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు నివసిస్తోంది. అద్దె ఉంటున్న వారింట్లో కూతురు ఇంటర్మీడియట్ చదువుతోంది. రఘు బాలికను పలుమార్లు బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. బాలికలో మార్పులు కనిపించడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక గర్భవతి అని తెలియడంతో తల్లిదండ్రులు కూతురును నిలదీశారు. ఆమె నిజాలు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి నిందితుడు రఘును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మన తెలంగాణ 21 Mar 2026 11:08 am

ఓటర్ జాబితా సవరణపై అఖిలపక్ష సమావేశం..

చిట్యాల, ఆంధ్రప్రభ : పలు రాజకీయ పార్టీల తోటి ఓటర్ సవరణపై సమీక్ష

ప్రభ న్యూస్ 21 Mar 2026 11:06 am

అభివృద్ధికి, హామీలకు మధ్య సమతుల్యత

ఆరు రుచులతో ఉగాది పండగను చేసుకున్న మరునాడే తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది కొత్త పథకాలతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రజలను ఆకట్టుకుంటోంది. రూ. 3.24 లక్షల కోట్ల ప్రతిపాదనలతో సమర్పించిన ఈ బడ్జెట్‌లో 1. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం 2. చేయూత 3. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు 4. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం 5. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం 6. నగదు రహిత ఆరోగ్యభద్రత 7. ఉద్యోగుల ప్రమాద బీమా 8. సిఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రాం 9. ఎటిసి ట్రైనీలకు స్కాలర్ షిప్ పథకాలు చోటు చేసుకున్నాయి. సంక్షేమం, నీటిపారుదల, విద్య, ఆరోగ్యం తదితర రంగాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడమైంది. అభివృద్ధికి, హామీలకు మధ్య సమతుల్యత పాటించారు. తెలంగాణ నగరపాలక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నందున ఆ ఎన్నికల్లో ప్రత్యర్థుల నుంచి పోటీ గట్టిగా ఎదుర్కొనేలా ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండేలా ప్రవేశపెట్టిన ఈ మూడో వార్షిక బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వానికి ఒక సవాలు వంటిదే. గత ఏడాది 202526 బడ్జెట్ రూ.3.04 లక్షల కోట్లతో సమర్పించగా, ఈ ఏడాది రూ. 3.24 లక్షల కోట్ల ప్రతిపాదనలతో సమర్పించడమైంది. అంటే ఈసారి దాదాపు రూ. 20 లక్షల కోట్లు అధికంగా కేటాయించడమైందని చెప్పాలి. ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లుగా ప్రతిపాదించగా, మూలధన వ్యయం రూ. 47,267 కోట్లుగా పేర్కొనడమైంది. మూసీ రివర్ ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రెండో దశ విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులకు ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెటేతర మార్గాలద్వారా నిధులు సమకూరుస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోఉండే సంస్థలు, ప్రత్యేక బాండ్లు లేదా ఇతర మార్గాల ద్వారా నిధులు సేకరిస్తారు. వ్యయాలను నియంత్రిస్తూ ఆదాయ వసూళ్లను పెంచడంపై దృష్టి సారించారు. ప్రజా ఆర్థిక నిర్వహణ (పబ్లిక్ ఫైనాన్స్)లో దేశం మొత్తం మీద మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుందని నీతిఆయోగ్ తన నివేదికలో వెల్లడించిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. అమృత్, నగరాల మౌలిక సదుపాయాల విస్తరణకు ఉద్దేశించిన స్మార్ట్ సిటీస్, పిఎం గతిశక్తి వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని నిధులు సమకూర్చుకోవాలన్న ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. జాతీయ అభివృద్ధి రేటు 202425 లో 9.8% నుంచి 202526 లో 8 శాతానికి దిగజారగా, తెలంగాణలో 202425లో 10.6% నుంచి 202526లో 10.7 శాతానికి పెరగడం విశేషం. అలాగే జాతీయ తలసరి ఆదాయం 6.9 శాతంతో రూ.2,19,575 వరకు నిలిచిపోగా, తెలంగాణలో తలసరి ఆదాయం 2025 26 లో 10.2% వృద్ధిరేటుతో రూ. 4,18,931 వరకు ఉండడం గమనార్హం. రాష్ట్ర ఆర్థిక స్థితి ప్రస్తుతం 200 బిలియన్ డాలర్ల వరకు ఉండగా, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లు వరకు పెంపొందేలా ప్రయత్నించాలని లక్షం పెట్టుకున్నట్టు బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ లక్షాన్ని సాధించడానికి వివిధ రకాల ప్రత్యేక రంగాలవారీ ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధపడుతోంది. అనేక సవాళ్లు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ బూడిద నుంచి ఫీనిక్స్ పక్షి తిరిగి ప్రాణం పోసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి పథంవైపు దూసుకెళ్తోందని ప్రభుత్వం ఈ సందర్భంగా వెల్లడించింది. రైతు సంక్షేమం, మహళా సాధికారత, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన, నైపుణ్యంతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్య భద్రత, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూ సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు వెళ్తోందని వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో హద్దూపద్దూ లేకుండా విపరీతంగా రుణాలు తీసుకొచ్చారు. దాంతో రాష్ట్రఖజానాపై అపరిమిత ఆర్థిక భారం పడింది. అత్యధిక వడ్డీరేట్లతో గత ప్రభుత్వం రూ. 25,612 కోట్ల వరకు రుణాలు చేసింది. దీంతో ఈ రుణ ఒప్పందాలను తిరిగి తక్కువ వడ్డీ రేట్లకు సవరించుకునేలా ప్రయత్నం చేయవలసి వచ్చింది. అంతేకాక రుణాలు తిరిగి చెల్లించే గడువు పొడిగించుకోవలసి వచ్చింది. రుణాల అసలు మొత్తం చెల్లింపుల గడువు 20ఏళ్ల నుంచి 39 ఏళ్లకు పెంచుకోక తప్పలేదు. రుణ పునర్వవస్థీకరణతో రుణాలు తిరిగి చెల్లించే గడువు 202526 నుంచి 203132 లోగా చెల్లించవలసిన రుణ భారం రూ. 34,058 కోట్ల నుంచి రూ. 11,915 కోట్లకు తగ్గింది. ఫలితంగా జీతాల చెల్లింపు, ఇతర వ్యవహారాలకు చెల్లించవలసిన నగదు లావాదేవీలు రూ. 22,142 కోట్ల వరకు తగ్గింది. దాంతో నగదు కొరత కొంతవరకు తగ్గి వ్యవహారాలు సజావుగా సాగేలా ఊరట లభించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూ. 3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు చెల్లించామని, తాము తెచ్చిన అప్పుల్లో కేవలం రూ. 17 వేల కోట్లు మాత్రమే వినియోగించుకున్నామని వెల్లడించడం గమనార్హం. జాతీయ జిడిపి కంటే తెలంగాణ జిఎస్‌డిపి మెరుగ్గా ఉందని, జిఎస్‌టి వసూళ్లు గడిచిన రెండు నెలల్లో రూ. 4 వేల కోట్లు దాటాయని ముఖ్యమంత్రి వివరించారు. ఈసారి సొంత పన్నుల ఆదాయంపై నమ్మకంతోపాటు కేంద్ర పన్నుల్లో వాటా, ప్రాయోజిత పథకాల ద్వారా నిధుల సేకరణ మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ప్రభుత్వం ముందున్నాయి. అలాగే రుణాలు విపరీతంగా చేయడం కన్నా ఆర్థిక వనరుల సమీకరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం మార్గాలను ఆలోచిస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణ ద్వారా రూ. 3 వేల కోట్ల వరకు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది. 

మన తెలంగాణ 21 Mar 2026 10:51 am

ఇజ్రాయెల్ అణ్వస్త్రదాడి చేసేనా?

అంతర్జాతీయ చర్చలలో కొద్ది రోజులుగా ఆందోళనకరమైన మాట ఒకటి వినవస్తున్నది. ఇరాన్‌పై మూడు వారాల యుద్ధంలో ఏ ఒక్క లక్షాన్నీ సాధించలేకపోయిన ఇజ్రాయెల్, రాగల వారాలలో కూడా అందుకు అవకాశాలు కనిపించని స్థితిలో చివరకు అణ్వస్త్ర ప్రయోగం ‘చేసినా చేయవచ్చు’నని. ఈ మాటలు మొదటి 12 రోజుల యుద్ధం జరిగినాక నెమ్మదిగా మొదలై, క్రమంగా పెరుగుతున్నాయి. మామూలుగానైతే ఇంత తీవ్రమైన ఉహాగానాలకు విలువ ఉండకూడదు. కాని, ఆ పని ‘జరిగినా జరవచ్చు’నని అనుమానించే నిపుణుల సంఖ్య పెరుగుతుండటానికి ఏకైక కారణం ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ- స్వభావం. పాలస్తీనాపట్ల, మొత్తం పశ్చిమాసియాపట్ల, ఇరాన్‌పట్ల ఇజ్రాయెల్ మౌలిక విధానాలు మొదటినుంచి తెలిసినవే. కాని నెతన్యాహూ విధానాలే గాక, వ్యక్తిగత స్వభావం అతి ప్రమాదకరమైనది. అందుకు ప్రత్యక్ష సాక్షంగా గాజా మారణకాండ ప్రపంచం కళ్లముందు నిలుస్తున్నది. నెతన్యాహూ ఎందుకైనా తెగించవచ్చుననే భయం మెల్లమెల్లగా మొదలవుతున్నది అందువల్లనే. వాస్తవానికి ఇరాన్‌పై ప్రస్తుత యుద్ధ నిర్ణయంగాని, ఇంకా చెప్పాలంటే నిరుడు జూన్‌లో జరిపిన దాడులుగాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనంతటతాను చొరవ చేసి తీసుకున్నవి కావన్నది ప్రపంచానికి ఈసరికి స్పష్టమైంది. ట్రంప్ అంతిమ లక్షాలు ఏవైనా ఆయన చేస్తుందినది మాత్రం మధ్యవర్తి దేశాల ద్వారా ఇరాన్‌తో చర్చలు. ఇరాన్ నిరుడు జూన్ సమయంలోగాని, ఇపుడు గాని కొన్ని ముఖ్యమైన రాజీలకు సిద్ధపడిందన్నది కూడా తెలిసిన విషయమే. కాని ఎపుడు కూడా రాజీ ఇష్టం లేనిది నెతన్యాహూకు మాత్రమే. అమెరికా లక్షాలు వేరు, తన లక్షాలు వేరు. కనుక, చర్చలకు, రాజీలకు గతంలోవలెనే ఈసారి కూడా భంగం కలిగించబూనారు. ఆయన లక్షాలు ఒకవేళ ఏదో రూపంలో పాలస్తీనా ఏర్పాటుకు అమెరికా అంగీకరించినా అది ఎట్టి పరిస్థితులలో నెరవేర నివ్వకపోవటం; గాజా, వెస్ట్ బ్యాంక్‌లతోపాటు సిరియా, జోర్డాన్, లెబనాన్‌లలోని భూభాగాలు ఆక్రమించి గ్రేటర్ ఇజ్రాయెల్ ఆవిష్కారం; ఇరాన్‌ను భిన్నాభిన్నం చేసి అరాచకంగా మార్చి, అక్కడ తమ అనుకూలురు అధికారానికి వచ్చేట్లు చూడటం. పశ్చిమాసియాలో అమెరికా ప్రయోజనాలకు ఇజ్రాయెల్ అతి కీలకమన్నది అక్కడి అధ్యక్షులు మొదటి నుంచి స్వయంగా చెప్పేమాట. గత సంవత్సరం చివరిలో ట్రంప్ ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’ లోనూ ఆ విషయం తిరిగి ప్రకటించారు. కాని రెండు విషయాలు గుర్తించాలి. పశ్చిమాసియాలో గాని, ఇరాన్ విషయమై గాని అమెరికా, ఇజ్రాయెల్‌ల లక్షాలు పూర్తిగా ఒకటి కావు. అమెరికాకు కావలసింది ఆధిపత్యం, చమురు. ఇజ్రాయెల్ కోరుకునేది ఏమిటో పైన చూసాము. పోతే, తమతమ లక్షాల సాధనకు ఇరువురు అనుసరించే విధానాలు, పద్ధతులలో కొన్ని పోలికలు, కొన్ని తేడాలు ఉన్నాయి. అది కూడా పైన చూసాము. అమెరికా పని దౌత్యమార్గంలో వత్తిడులు, ఆర్థికంగా దెబ్బతీయటం, సైనికంగా బెదిరించటం, చివరకు సామంత రాజ్యంగా మార్చుకోవటం. ఇజ్రాయెల్‌కు ఇవి అక్కరలేదు. ఈ పద్ధతులతోనూ పని లేదు. వారి ఏకైక లక్షం, పద్ధతులూ పైన చెప్పుకున్నవి మాత్రమే. అందుకు తమ శక్తి చాలదు గనుక అమెరికాను, వీలైనంతవరకు యూరోపియన్ దేశాలను తోడు చేసుకోవాలి. అందుకు యథాతథంగా వారి విధానాలు కూడా సానుకూలమన్నది అట్లుంచి, దానికి అదనంగా ఇరాన్ అణ్వస్త్రాలంటూ, టెర్రిరిజం అంటూ, మరొకటి అంటూ నిజాలూ, అబద్ధాలు ప్రచారం చేయటం, అమెరికా, యూరప్‌లలోని బలమైన యూదు లాబీల ద్వారా ప్రభావితం చేయటం వంటివి సాగించాలి. ఇదంతా వాస్తవంగా జరుగుతూ వస్తున్నదే తప్ప ఊహాగానం ఎంత మాత్రం కాదు. అంతెందుకు నిరుడు జూన్‌లో గాని, ఇపుడు గాని దాడులకోసం ట్రంప్‌ను ముగ్గులోకి దింపింది నెతన్యాహూయేనని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో తదితర ఉన్నతస్థాయి అధికారులే స్వయంగా వెల్లడించారు. అందువల్లనే అమెరికా, ఇరాన్ చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వం ద్వారా దాదాపు చివరకు వచ్చిన దశలో ఇజ్రాయెల్ పన్నుగడల కారణంగా భంగపడి యుద్ధం మొదలైంది. యుద్ధం ఆరంభించింది ఇజ్రాయెల్ అని, అందుకు ఇరాన్ ఎదురుదాడులు పశ్చిమాసియాలోని తమ స్థావరాలపై కూడా జరగగలవని భావించి, ఆ ప్రకారం ఇరాన్ కూడా హెచ్చరించినందున, తాము యుద్ధంలోకి రావలసివచ్చిందన్నది కూడా రూబియో చెప్పిన మాటే. దీనంతటిలోని తెరవెనుక విషయాలేమిటో మునుముందు వెల్లడి కావచ్చుగాని ప్రస్తుతానికి కనిపిస్తున్న చిత్రం ఇది. ఇవన్నీ ఇట్లుంచి అణ్వస్త్ర ప్రయోగం విషయానికి వద్దాము. ఇరాన్‌ను వెనిజులా వలెనే భయపెట్టి లొంగ దీసేందుకు వారాల తరబడి భారీ ఎత్తున సైనిక సన్నాహాలు చేసినప్పటికీ ఇరాన్ ధిక్కరించి నిలవటం అమెరికా, ఇజ్రాయెల్‌లకు కొరుకుడు పడనిది అయింది. అయితే కొన్ని కథనాలు సూచిస్తున్న ప్రకారం, చర్చలలో తమను మరిన్ని షరతులకు అంగీకరింపజేసేందుకు సైనిక సన్నాహాల వత్తిడి (వెనిజులా సందర్భంలోవలె) జరుగుతున్నది తప్ప నిజంగా దాడులు జరగకపోవచ్చునని ఇరాన్ నాయకత్వం భావించిందేమో తెలియదు. ఆ వివరాలు ఎట్లున్నా, చివరకు ఫిబ్రవరి 28న ఆకస్మికంగా మొదట ఇజ్రాయెల్, ఆ వెంటనే అమెరికా దాడులు ప్రారంభించాయి. తమ యుద్ధ లక్షాలపై ట్రంప్ ఒక వీడియో విడుదల చేసారు. తొలి దాడులలో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న ఇరాన్ అంతలోనే తేరుకుని ఎదురు యుద్ధం ప్రారంభించింది. ఇవన్నీ తెలిసిన పరిణామాలే కాగా, అమెరికా ఇజ్రాయెల్‌లు రెండు రోజులలో తేలిపోతుందనుకున్న యుద్ధం నేడు 21వ తేదీతో మూడవవారం గడిచినా ఇరాన్ భీకర ప్రతిఘటనతో ఎటూ తేలకపోతుండటం ట్రంప్ కన్న ఎక్కువ నెతన్యాహూను ఆందోళనకు గురి చేస్తున్నదనేది పలువురు నిపుణుల అభిప్రాయం. పరిస్థితి అర్థమవుతుండటంతో అమెరికా అధ్యక్షుడు యుద్ధం నడిచేది 34 వారాలని, 6 వారాలని, ఎప్పటికి ముగిసేది చెప్పలేమని రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రకటించిన లక్షాలలో ఇంతవరకు ఒక్కటైనా సాధించలేదు. ఇపుడు కుర్దులను తిరగబడమంటున్నారు, మెరైన్ సైన్యాన్ని పంపే సన్నాహాలు మొదలుపెట్టారు. ఇరాన్ దేనికీ భయపడకపోవటం, లొంగే ప్రసక్తి లేదనటం ఒకటి కాగా, అమెరికా, ఇజ్రాయెల్‌లు మొదటి ఊహించని స్థాయిలో సాగిస్తున్న ఎదురు దాడులూ, గల్ఫ్ దేశాలతో పాటు వీరిద్దరికీ కలిగిస్తున్న తీవ్రమైన నష్టాలు ప్రధానంగా నెతన్యాహూ ఆందోళనను పెంచుతున్నట్లు కనిపిస్తున్నది. స్వయంగా పాశ్చాత్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఇజ్రాయెల్ సెన్సారింగ్ కారణంగా వివరాలు బయటకు రావటం లేదు గాని, ఇరాన్ దాడులతో అక్కడ విధ్వంసం, ప్రాణనష్టం భారీగానే జరుగుతున్నది. ఇరాన్ క్షిపణి దాడులను, డ్రోన్లను ఎదుర్కొనే ఐరన్ డ్రోన్ మిసైళ్లు విఫలమవుతున్నాయి. వాటి సంఖ్య కూడా తగ్గుతుండగా వాటిని అమెరికా గల్ఫ్ నుంచి, దక్షిణ కొరియా నుంచి అటు తరలిస్తున్నది. ఇరాన్ వద్ద గల క్షిపణులు, డ్రోన్లు ఎన్ని వేలో అంచనా రావటం లేదు. ఇంత వరకు ప్రయోగించిన వాటికి మించినవి వారు ఇంకా బయటకే తీయలేదన్నది అంచనా. ఇప్పటికే జరిగిన నష్టాలు, దరీతెన్నూ లేని పరిస్థితితో ఇజ్రాయెల్, అమెరికాలలో వ్యతిరేకతలు పెరుగుతున్నాయి. ఇదంతా దిక్కుతోచని స్థితిని సృష్టిస్తుండటంతో ఇరాన్ ఇపుడు కాకుంటే మరెపుడూ ఓడదన్న భయంతో నెతన్యాహూ వంటి లక్షణాలు గల వ్యక్తి ఆ లక్షణాలు మరింత ప్రకోపించి అణ్వస్త్రాలు ప్రయోగించవచ్చునా అన్నది ప్రశ్న. లేక అది ముందే పసికట్టి రష్యా, చైనాలు తీవ్ర హెచ్చరికలతో ఆ ప్రళయాన్ని నిరోధించవచ్చునా? చివరగా ఒకటి మాత్రం అనిపిస్తున్నది. అమెరికా, సోవియెట్ యూనియన్ రెండూ 1940 ల నుంచి అణ్వస్త్రాలు తయారు చేయటంవల్ల ‘బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్’ అనేది ఏర్పడి ప్రపంచం శాంతియుతంగా ఉన్నట్లు, ఇజ్రాయెల్ వలెనే ఇరాన్ కూడా అస్త్రాలు ఉత్పత్తి చేస్తే తప్ప పశ్చిమాసియాలో ‘బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్’ శాంతి సిద్ధించదేమో. ఇటువంటి చర్చవచ్చినపుడల్లా ఉత్తర కొరియా వద్ద అణ్వస్త్ర బలాన్ని నిపుణులు ఉదహరిస్తున్నారు. ఇరాన్‌తో పోల్చితే అతి చిన్నది అయిన ఉత్తర కొరియా 2006 లో అణ్వస్త్ర శక్తిగా మారింది. ఇపుడు వారి వద్ద 50 పైగా అస్త్రాలు ఉన్నట్లు అంచనా. ఎపుడైనా అస్త్రాల తయారీ ఎంత ముఖ్యమో వాటిని సుదూర ప్రాంతాలకు మోసుకుపోగల క్షిపణులు కూడా అంతే ముఖ్యం. ఉత్తర కొరియా తమకు సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో గల అమెరికా కూటమి దేశాలు దక్షిణ కొరియా, జపాన్, ఫిలిప్పీన్స్, ధాయ్‌లాండ్‌లపై ప్రయోగించి ధ్వంసం చేయగల క్షిపణులను ఎప్పుడో రూపొందించింది. సుమారు 6,400 మైళ్లకు దూరాన గల అమెరికా పశ్చిమ తీరాన్ని సైతం తాక గల క్షిపణులను కూడా సిద్ధం చేసినట్లు కొద్ది కాలం క్రితం ప్రకటించి తీవ్ర కలకలాన్ని రేపింది. వారు అణ్వస్త్రాలను, ఆ స్థాయి క్షిపణులను ఉత్పత్తి చేయటం సరైనదా కాదా, అణు యుద్ధం నిజంగా చేస్తారా లేదా అన్నది కాదు ప్రశ్న. అంతటి చిన్న దేశంపై దాడికి అమెరికా సాహసించలేకపోవటం, అణ్వాయుధాల కారణంగా అమెరికాకు అటువంటి భయాన్ని సృష్టించి ఆత్మరక్షణ చేసుకోగలగటమన్నవి గమనించదగ్గ విషయాలు. చాలా మంది మరిచిపోయి ఉంటారు గాని, 195053 మధ్య జరిగిన కొరియా యుద్ధంలో అక్కడి కమ్యూనిస్టు సేనలను ఓడించలేకపోవటంతో అణ్వస్త్ర ప్రయోగం ఆలోచనలు అమెరికా చేసింది. తర్వాత వియత్నాం యుద్ధం (195575), అప్ఘాన్ యుద్ధ (2020) సమయాల్లోనూ ఆ మంతనాలు సాగాయి. ప్రస్తుతానికి వస్తే, గత జనవరిలో వెనిజులాలో, ఇపుడు ఇరాన్‌పై కనిపించే చర్యలు, రేపు క్యూబాపై చేయగలమంటున్నవీ ఆయా దేశాల వద్ద అణ్వాయుధాలు ఉండినట్లయితే జరిగేవేనా? అమెరికా, ఇజ్రాయెల్ రెండింటి వద్దా అవి ఉండగా, ఇరాన్ వద్ద లేవు గనుకనే ఇటువంటి దాడి అవకాశాలు చర్చకు వస్తున్నాయి. ఇరాన్ అణ్వస్ర్త వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఎన్నడో సంతకం చేయటమే గాక, ఇప్పటికీ అందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటిస్తున్నది. ఆ విధంగా ఇరాన్ తన చేతులు తాను కట్టి వేసుకోవటాన్ని అనువుగా చేసుకున్న ఇజ్రాయెల్ ఏ విధంగా వ్యవహరిస్తున్నదో ప్రపంచమంతా చూస్తున్నది. పై చెప్పుకున్నట్లు, ఇరాన్‌ను మూడు వారాలు గడిచినా అమెరికాతో కలిసి కూడా ఓడించలేకపోవటమే గాక, ఇరాన్ ఎదురు దాడులతో భారీ నష్టాలను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్, ఎంత మాత్రం స్వీయ నియంత్రణ లేని స్వభావం కారణంగా తమ లక్షాల సాధన కోసం ఏదో ఒక రోజు పిచ్చెక్కినట్లుగా మారి అణు ఆయుధాల ప్రయోగం చేయవచ్చునా అనేది సందేహం.  - టంకశాల అశోక్ ( దూరదృష్టి) - రచయిత సీనియర్ సంపాదకులు

మన తెలంగాణ 21 Mar 2026 10:41 am

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికతల ప్రతీక రంజాన్

ప్రతి పండుగ వెనుకా పరమార్థం ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, చరిత్ర గతి మార్చిన వీరులను స్మరించుకోవడం పర్వదినాల్లో సర్వసామాన్య అంశం. వీటితోపాటు మనిషికి క్రమశిక్షణ నేర్పి, ధర్మాన్ని, దయాగుణాన్ని ప్రబోధించే పండగలు కూడా ఉన్నాయి. వాటిలో రంజాన్ ఒకటి. ముస్లింలకు అతి పెద్ద పండగ ఇది. ఇస్లాం ధర్మానికి మూలమైన ఖురాన్ రంజాన్ నెలలో అవతరించింది. ఈ పండుగ వెనక మానసిక, శారీరక వికాసం వంటి మరెన్నో ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి. నెలవంక దర్శనంతో మొదలై, మళ్లీ నెలవంక దర్శనంతోనే ముగిస్తుంది. మానవాళి అంతా.. బాగుండాలని కోరుకునే పండగనే రంజాన్. ముస్లింల పవిత్ర పండగైనప్పటికీ అందులో సమాజానికి సేవ చేయాలనే సంకల్పం ఆచరణ కన్పిస్తుంది. పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. ‘పండుగ’ మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ‘రంజాన్’ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్‌ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘రంజాన్’ మాసం. రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు, సంపన్నులైనవారు రంజాన్ నెలలో ‘జకాత్ ’ అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని ‘జకాత్’అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30% చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితోపాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ‘జకాత్’ ఉపయోగపడుతుంది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ఉపవాసవ్రతం’. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘రోజా అని అంటారు. రోజా అనే ఉపవాస దీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. సుమారు నెలరోజులకు పైగా ఉపవాస దీక్షలు చేయడం వల్ల సమాజంలో ఆకలి విలువను తెలుసుకోవడాని రోజాను పాటిస్తారు. అలాగే రంజాన్ నెల మాసంలో కుల, మత భేదాలు లేకుండా ఇఫ్తార్ విందులు. ఈ విందులు పరస్పర ఆత్మీయతకు దోహదపడేలా.. విశాల ఆలోచన దృక్పథానికి నిదర్శణం నిలుస్తుంది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ఉపవాసవ్రతం’. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘రోజా’ అని అంటారు. సౌమ్ అని పిలుస్తారు. రంజాన్ నెల అంతా పవిత్ర కార్యక్రమాలతో ముగుస్తూనే ‘షవ్వాల్’ నెలవంక ప్రత్యక్షమవుతుంది. ఈ నెలవంక దర్శనమిస్తేనే ముస్లిం సోదరులు ఉపవాస వ్రతాన్ని విరమించి మరుసటి రోజు ‘రంజాన్ ’ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, సంతోషానందాలతో జరుపుకుంటారు. ‘షవ్వాల్’ నెల మొదటి రోజున జరుపుకునే రంజాన్ పండుగను ‘ఈదుల్‌ఫితర్’ అని అంటారు. మానవహితాన్ని, పరస్పర సోదర భావాన్ని, ఎదుటి వారి బాధలను అర్థం చేసుకొని వారికి అండగా ఉండేలా మానవ సమాజహితాన్ని ఆకాంక్షిస్తుంది. అలాగే ఈ ఇఫ్తార్ విందుతో అంటరానితనం దూరం చేసే ఆలోచన.. అందరూ సమానమనే భావన ముడిపడి ఉంది. అందుకు మనం జాతీయ ఉద్యమ నాయకుడు మౌలానా హస్రత్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విప్లవం వర్ధిల్లాలి, సంపూర్ణ స్వాతంత్య్రం వంటి నినాదాలు భారత జాతియోద్యమ చరిత్రను మహత్తర మలుపు తిప్పినట్టు అందరికీ తెలుసు. వీటిని రూపొందించిన సుప్రసిద్ధ ఉర్దూ కవి, జాతియోద్యమ నాయకుడు మౌలానా హస్రత్ మోహానీ గురించి మాత్రం ఈ తరంలో చాలా మందికి తెలిసివుండకపోవచ్చు. దళిత్- ముస్లిం ఇఫ్తార్ సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది ఆయనే. అంబేడ్కర్ చేతితోఇచ్చిన నీళ్లను ముట్టుకోవడానికి కూడా జాతీయోద్యమ మహానాయకులు సైతం వెనుకాడుతున్న కాలం అది. అప్పుడు మౌలానా హస్రత్ మోహానీ ఇఫ్తార్ విందుకు అంబేద్కర్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఒకే పళ్లెంలో ఆయనతో కలిసి భోజనం ఆరగించారు. అటువంటి సమానత్వాన్ని, ఆకలి బాధలు, దాతృత్వాన్ని చాటి చెప్పే గొప్ప పండగ రంజాన్.. హస్రత్ మెహనీ చూపిన మార్గం.. ఆ సాంప్రదాయం భవిష్యత్తులో కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - సంపత్ గడ్డం, 78933 03516

మన తెలంగాణ 21 Mar 2026 10:25 am

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు..

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు.. ఘంటసాల, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని

ప్రభ న్యూస్ 21 Mar 2026 10:20 am

పర్యాటక కేంద్రాలను టార్గెట్‌ చేస్తాం: ఇరాన్

టెహ్రాన్: గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ మరోసారి హెచ్చరికలు పంపింది. గల్ఫ్‌లోని పర్యాటక కేంద్రాలను టార్గెట్‌ చేస్తామని హెచ్చరించింది. పార్కులు, వినోద కేంద్రాలు, టూరిస్ట్ డెస్టినేషన్స్‌పై దాడులు చేస్తామని ఇరాన టాప్‌ మిలిటరీ కమాండర్‌ జనరల్‌ షెకార్చి స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. మిడిల్‌ ఈస్ట్‌లో పెరుగుతున్న టూరిజంను దెబ్బకట్టే ప్లాన్ లా కనిపిస్తుంది. ఇజ్రాయెల్‌ నివాస సముదాయాలనూ టార్గెట్‌ చేసే అవకాశం ఉంది. బాగ్దాద్‌లోని అమెరికన్‌ ఎంబసిపై మరోసారి దాడులు చేశారు. ఇరాన్‌ మిస్సైళ్లతో విరుచుకుపడింది.  పశ్చిమ యుద్ధం అత్యంత భీకర రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఆయా దేశాల్లోని సైనిక, వైమానిక, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యక్తులనే లక్ష్యంగా చేసుకున్న ఇరు పక్షాలు తాజాగా ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇజ్రాయె ల్ తన కీలక సహజ వాయు క్షేత్రంపై దాడి చేసిన నేపథ్యంలో, ఇరాన్ ప్రతీకార చర్యల ను మరింత ముమ్మరం చేసింది.  గల్ఫ్ ప్రాంతంలోని పలు ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరిపింది. సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్ర తీరంలోని రిఫైనరీపై దాడి చేయగా ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ కేంద్రాల్లో, కువైట్‌లోని రెండు చమురు శుద్ధి కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఖతార్ రాజధాని దోహాకు దగ్గర్లోని రస్ లఫాన్‌లో ఉన్న అత్యంత భారీ గ్యాస్ చమురు క్షేత్రంపై దాడి చేసింది. ఇక్కడి నుంచే ఆసియా, ఐరోపా ఖండాలకు భారీ మొత్తంలో ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయు క్షేత్రంగా భావించే సౌత్ పార్స్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇరాన్ దాడులకు దారి తీసింది. ఇరాన్ విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 80 శాతం దీనిపైనే ఆధారపడటం వల్ల, ఈ దాడి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కువైట్‌లోని మీనా అల్- అహ్మది రిఫైనరీపై డ్రోన్ దాడితో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా, సమీపంలోని మీనా అబ్దుల్లా రిఫైనరీ కూడా మంటల్లో చిక్కుకుంది. సౌదీలోని అరామ్ కో రిఫైనరీపై కూడా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరానికి సమీపంలో ఒక నౌక అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 21 Mar 2026 10:16 am

బుల్లెట్ నుంచి బ్యాలెట్ వైపు..

పీపుల్స్ వార్ ప్రభావిత ప్రాంతపు గోడలపై ‘పార్లమెంట్ పందులదొడ్డి’ అనే నినాదం కనబడేది. ఎన్నికల ద్వారా కాకుండా, సాయుధ విప్లవం ద్వారానే సామాన్యుల ఆకాంక్షలు నెరవేరే పాలన దేశంలో సాధ్యపడుతుందని ఆ పార్టీ నమ్మినందువల్ల ఆ నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చింది. 2004లో మరో విప్లవ పార్టీతో కూడిన పీపుల్స్ వార్.. మావోయిస్టు పార్టీగా అవతరించినా అదే మాటపై కట్టుబడి ఉంది. దేశంలో ఎన్నికలు వచ్చిన సమయంలో ‘ఎన్నికలను బహిష్కరించండి’ అని పిలుపునిచ్చేది. అలాంటి ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం సిబ్బందికి కత్తిమీద సాములా ఉండేది. ఒడిశా రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత 11 జిల్లాల్లో 1998 నుండి 25 ఏళ్ల పాటు ఏ ఎన్నికా ప్రశాంతంగా జరగలేదు. 2024లో మాత్రమే మావోయిస్టుల చర్యలు లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా సాధ్యపడింది అని అక్కడి పత్రికలు రాశాయి. ఇవే పరిస్థితులు చత్తీస్‌గఢ్‌లోను కొనసాగాయి. రవాణా సౌకర్యం సరిగ్గా లేని అటవీప్రాంతాల్లో ఎన్నిక నిర్వహణ ఓ యుద్ధ వాతావరణాన్ని తలపించేది. 2017లో వచ్చిన న్యూటన్ అనే హిందీ సినిమాలో చత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ బహిష్కరణకు సంబంధించిన సన్నివేశాలు చూడవచ్చు. కాల మార్పును సూచించే మరో సంఘటన ఏమిటంటే చత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన తీవ్రవాద యువతకు అక్కడి ప్రభుత్వం ఉద్యోగాల్లో భర్తీ చేసుకుంది. ఓటేసినట్లు వేలుకి ఇంకు కనబడితే ఆ వేలుని నరికేస్తామని గ్రామీణులను హెచ్చరించిన వ్యక్తి ఇప్పుడు ఎన్నిక సిబ్బందిలో ఉంటూ ఆ వేలుకు ఇంకు పూయడం సమూల మార్పుకు నిదర్శనంగా భావించాలి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ప్రభుత్వాల ముందుకు వచ్చిన మావోయిస్టు నేతలు న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తమ భవిష్యత్ కార్యక్రమాల గురించి వారిని ప్రశ్నించినపుడు తమ పార్టీపై నిషేధం ఎత్తివేయాలని ముఖ్యమంత్రిని కోరామని, అదే సాధ్యపడితే చట్టపరిధిలో తమ పార్టీ పని చేసేలా చూస్తామని వారు అంటున్నారు. బుల్లెట్‌పై నమ్మకం పోయినవారు బ్యాలెట్ మార్గాన్ని ఆచరిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత అవసరం. ఎన్నికల్లో పాల్గొంటారా అని ఒకరు అడిగిన ప్రశ్నకు అది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఓటర్లకు పంచడానికి కోట్లలో ధనం వాడుతున్నారు అని సమాధానం వచ్చింది. సాయుధ పోరాటానికి స్వస్తి పలికామని చెబుతున్న వారు ఎన్నికల బహిష్కరణను కూడా విరమించుకున్నారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.ఎన్నికల విషయంలో అన్ని నక్సలైటు పార్టీలు ఒకే విధానాన్ని పాటించడం లేదు. 1980 నుండి చండ్ర పుల్లారెడ్డి ఎన్నికల్లో పాల్గొంటుంది. 1970 ప్రాంతం నుండి ఉత్తర తెలంగాణలో తమ విప్లవ కార్యకలాపాలకు నెరిపిన సిపిఐ (మార్క్సిస్టు లెనినిస్టు) పార్టీకి చండ్ర పుల్లారెడ్డి నాయకత్వం వహించేవారు. గ్రామాల్లో వేళ్లూనుకుపోయి ఉన్న వెట్టి చాకిరీ, దొరతనం పోవాలన్నా, అప్పులు ఇచ్చి లేదా బెదిరించి గుంజుకున్న భూములు విముక్తి కావాలన్నా గడీలపై దాడులు తప్పనిసరి. అందుకోసం ఊర్లలో వివిధ సంఘాలను ఏర్పరచి యువకులను సమాయత్తం చేసింది. గ్రామాల్లో నక్సలైట్ ఉద్యమ బహిరంగ కార్యకలాపాలు ఉధృతం అయ్యాక భూస్వామ్య వర్గాలు విప్లవ సంఘాల ప్రతినిధులపై దాడులకు పాల్పడ్డాయి. వాటిని తిప్పి కొట్టేందుకు వర్గ శత్రు నిర్మూలన అవసరమనే చర్చ పార్టీలో మొదలైంది. అలాంటి సైద్ధాంతిక, ఆచరణాత్మక విభేదాల కారణంగా పార్టీ 1980 ప్రాంతంలో నాయకుల పేరిట వర్గాలుగా చీలిపోయింది. పీపుల్స్ వార్ పేరిట ఏర్పడ్డ చీలిక వర్గానికి కొండపల్లి సీతారామయ్య నాయకుడు. పుల్లారెడ్డి వర్గం ఎన్నికల్లో పోటీ చేయగా కెఎస్ గ్రూపు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తూ అదే మార్గాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ముందు లొంగిపోతున్న మావోయిస్టులు నాటి కెఎస్ గ్రూపుకు చెందినవారే. ఎన్నికల్లో పాల్గొన్న సిపి వర్గం పోటీ చేసిన కొన్ని ప్రాంతాల్లో విజయం సాధించడం గొప్ప విషయమే. డబ్బుతో కూడుకున్న ఎన్నికల్లో ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడం సామాన్యమైనది కాదు. అదే గ్రూపుకు చెందిన ఎన్‌వి కృష్ణయ్య 1989 లో సిరిసిల్లా నియోజకవర్గంనుండి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. సిపిఐ (మా లె) న్యూడెమోక్రసి నుండి ఒకరు ఐదు పర్యాయాలు ఎంఎల్‌ఎగా గెలవడం నక్సలైట్ల చరిత్రలోనే ఓ మైలురాయి. ఆ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లేనందువల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గుమ్మడి నర్సయ్య 1983 నుండి (ఒక టర్మ్ మినహా) 2009 వరకు ఇల్లెందు ఎంఎల్‌ఎగా ఉన్నారు. సైకిలుపై తిరుగుతూ ప్రజలతో కలిసి ఉండే ప్రజాప్రతినిధిగా ఆయనకు ఎంతో పేరుంది. ఈయన జీవిత కథ సినిమాగా వస్తోంది. ఎన్నికలకు డబ్బే సర్వస్వం అయిన ఈ రోజుల్లో ప్రజలతో కలిసి ఉన్నవారు చట్ట సభల్లో అడుగు పెట్టచ్చు అనడానికి వీరే తార్కాణాలు. సాధారణంగా లొంగిపోయిన నక్సలైట్లు సొంత జీవితం గడుపుతుంటారు. రాజకీయాల్లో చేరాలనుకొనేవారు తక్కువే. అయితే ఇప్పుడు లొంగిపోయినవారు సారథులు. వారి రాకతో పోరుబాటకు తెర పడింది అని చెప్పవచ్చు. వందల్లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులే కాకుండా వారి కార్యకలాపాలకు రహస్యంగా సాయపడినవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. మైదాన ప్రాంతాల్లో సానుభూతిపరులు ఇంకా పార్టీ వెంటే ఉండవచ్చు. ఇంత నెట్ వర్క్ ఉన్న మావోయిస్టు నేతలు తమ కార్యకలాపాలు లీగల్‌గా కొనసాగించేందుకు అవకాశాలు మెండుగానే ఉన్నాయనిపిస్తోంది. ప్రజాభిమానం ఉంటే డబ్బు లేకుండానే ఎన్నికల్లో కూడా గెలవవచ్చని తోటి కామ్రేడ్స్ ఇప్పటికే నిరూపించారు. యాభై ఏండ్ల ప్రజాజీవితాన్ని తిరిగి ఆ ప్రజల కోసమే వెచ్చించేందుకు ఎన్నో ద్వారాలు తెరిచి ఉన్నాయి. భారీ బహిరంగ సభలను నిర్వహించిన అనుభవం వారికుంది. తమ సరికొత్త నిర్ణయాలు ప్రకటించేందుకు ప్రభుత్వ అనుమతితో ఓ సభ నిర్వహిస్తే ప్రజల స్పందన తెలిసే అవకాశం ఉంది. ఆయుధం వదిలేసినా ప్రజల్లోనే ఉండి, వారి కోసం చట్టపరిధిలో ఉద్యమాలు కొనసాగిస్తామన్నవారి మధ్య నిర్మాణాత్మకమైన సుదీర్ఘ చర్చలు జరగాలి. ప్రజల సమస్యలపై నిజాయితీగా పోరాడే శక్తుల అవసరం ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఉంది. - బి.నర్సన్, 9440128169

మన తెలంగాణ 21 Mar 2026 10:15 am

Telangana : వాహనదారులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 21 Mar 2026 10:13 am

Andhra Pradesh : జాతీయ రహదారి విస్తరణకు అడ్డు తొలగినట్లేనా?

హైద రాబాద్ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణపై అడ్డంకులు తొలిగాయి

తెలుగు పోస్ట్ 21 Mar 2026 10:06 am