SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

Andaman Sea disaster |మయన్మార్ హింస నుంచి శరణార్థుల వలసలు

Andaman Sea disaster | మయన్మార్ హింస నుంచి శరణార్థుల వలసలు Andaman

ప్రభ న్యూస్ 23 Apr 2026 6:28 am

రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టు

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని, రేవంత్‌రెడ్డి డ్రామాలు వెలుగులోకి వచ్చాయని, ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్ల మర్మమతులు పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. తీర్పు అనంతరం హరీష్‌రావు విలేకరులతో మా ట్లాడుతూ బిఆర్‌ఎస్‌పై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల లీకులు ఇస్తూ, అక్రమ కేసు లు బనాయిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు ప్రాథమిక హక్కులు, సహ జ న్యాయసూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాం టి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటని, అందులో పదుల సం ఖ్యలో ఉండే పిల్లర్లలో రెండు మాత్రమే కుంగితే, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అబద్ధాన్ని పదేపదే చెబుతూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, కాళేశ్వరమే ఈ రా ష్ట్రానికి ప్రాణాధారమని హరీష్‌రావు తెలిపారు. ఈ తీర్పు సత్యమేవ జయతే అని, హైకోర్టు తీర్పుతో ధర్మం గెలిచిందని హరీష్‌రావు పేర్కొన్నారు. 70 శాతం తెలంగాణకు తాగునీరు అందిస్తున్నది కాళేశ్వరమే హైదరాబాద్‌తో సహా 70 శాతం తెలంగాణకు త్రాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అం దించే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరమని హరీష్‌రావు తెలిపారు. నిజానికి రూ.100, రూ.200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో రెండు మూ డు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకా శం ఉందని, కానీ, రెండున్నరేళ్లుగా భూ సేకరణ కు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్‌రావు ఆరోపించారు. మోటార్లు, రిజర్వాయ ర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని, కేవలం కుట్రతోనే ఆపారని హరీష్‌రావు అన్నారు. ఎన్‌డిఎస్‌ఏ అనేది కేవలం ఇంజనీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమేనని, దాంట్లో ప్రభుత్వ నిర్ణయాలకు సం బంధం ఉండదని ఆయన అన్నారు. మళ్లీ అవే చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెబుతాయని ఆయన అన్నారు. అవినీతి బయటపెడితే నాపై రెండు ఎంక్వైరీలు వేశారు అసెంబ్లీ సాక్షిగా రెండున్నరేళ్లుగా ప్రభుత్వ వైఫల్యాలను, స్కాంలను బయటపెడుతున్నామని, స మాధానం చెప్పుకోలేక మమ్మల్ని సస్పెండ్ చేయడమే కాకుండా, తాను అవినీతిని బయటపెట్టిన 48 గంటల్లోనే తన మీద రెండు ఎంక్వైరీలు వేశారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు సరిదిద్దుకోవడం మానేసి ప్రతిపక్షాలను వేధించ డం, అక్రమ కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మన తెలంగాణ 23 Apr 2026 6:20 am

23rdaprilsplstory |ప్రపంచ దేశాల్లో తల్లిదండ్రుల సంరక్షణ చట్టాలు

23rdaprilsplstory | ప్రపంచ దేశాల్లో తల్లిదండ్రుల సంరక్షణ చట్టాలు 23rdaprilsplstory | తల్లిదండ్రులు–పిల్లల

ప్రభ న్యూస్ 23 Apr 2026 6:13 am

కెసిఆర్, హరీశ్‌కు ఊరట

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చే సిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారం గా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, అప్పటి సంబంధిత ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషిపై చర్యలు తీ సుకోవద్దని హైకోర్టు ధర్మాసనం బుధవారం కీలక తీర్పు వెలవరించింది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేయడం విశేషం. కాళేశ్వరం కమిషన్ జరిపిన విచారణ సహజ న్యా య సూత్రాలకు విరుద్దంగా జరిగిందని, సెక్షన్ 8 కింద నోటీసులు జారీ చేయకుండా విచారణకు పి లువడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమా ర్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాళేశ్వరం ప్రా జెక్టులో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్‌కున్న వి చారణ అర్హతలను సవాల్ చేస్తూ మాజీ సిఎం కెసిఆర్, అప్పటి నీటిపారుదలశాఖ మాజీగా పని చేసి న హరీశ్‌రావు, అప్పటి ఇరిగేషన్‌శాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, సిఎంఓ అధికారిణి స్మితా సబర్వాల్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిని కలిపి విచారించిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఈ సం దర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేస్తూ జారీచేసిన జీఓ 6ను సమర్థించిన హైకోర్టు, అయితే కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగకుండానే మీడియాకు విడుదల చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా ఉందని, అందులో ఎలాంటి చట్టవిరుద్ధం లేదని స్పష్టం చేసింది. కానీ విచారణ జరిపిన విధానం సహజ న్యాయ సూత్రాలు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం- 1952కు విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. ఎవరి ప్రతిష్టకైనా భంగం కలిగేలా నివేదిక ఇస్తున్నప్పుడు సెక్షన్ 8- బి కింద నోటీసు ఇచ్చి, వారి వాదన వినాలని, ఆ ప్రక్రియ పాటించలేదని ధర్మాసనం తేల్చింది. సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ఒకరిని తప్పుపడుతున్నప్పుడు, ఆ సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు కల్పించాలని, అటువంటి అవకాశం పిటిషనర్లకు ఇవ్వలేదని ధర్మాసనం తప్పుపట్టింది. ఈ తప్పిదాల కారణంగా కమిషన్ నివేదికలో మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ సిఎస్ ఎస్‌కె జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌లకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, సిఫారసులు చెల్లవని ధర్మాసనం స్పష్టం చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ఒకవేళ సిబిఐ విచారణ జరిపినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల వాదన పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందర్ వాదనలు వినిపించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం సెక్షన్ 8- బి ప్రకారం, ఒక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగే అంశంపై విచారిస్తే ఆ వ్యక్తికి ముందుగా నోటీసు ఇచ్చి, వారి వాదన వినాలని, కమిషన్ కెసిఆర్, హరీష్‌రావుకు సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకవచ్చారు. కమిషన్190 మంది సాక్షులను విచారించిందని, వారిలో ఇంజనీర్లు, అధికారుల వాంగ్మూలాలు పిటిషనర్లను కుట్రపూరితంగా ఇరికించేలా ఉన్నాయనిపేర్కొన్నారు. సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడం కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో పూర్తిగా ఉల్లంఘనలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. పిటిషన్‌దారులను కేవలం సాక్షులుగా పిలిచారని, కానీ తుది నివేదికలో నిర్దిష్ట ఆరోపణలకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండానే ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులుగా తేల్చారని పేర్కొన్నారు. అలాగే నివేదికను అసెంబ్లీలో పెట్టకముందే, ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా కీలక అంశాలను బయటపెట్టిందని, ఇది తీవ్రమైన, పరువు నష్టం కలిగించే చర్య అని, ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని పేర్కొన్నారు. విస్తృత ప్రయోజనాల దృష్టా కమిషన్ వేశామంటూ మరోకరి పరువు ప్రతిష్టలు దెబ్బతీయం సరయింది కాదని కోర్టుకు వివరించారు. ప్రభుత్వ వాదన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కమిషన్ తీర్మానాలు వ్యక్తిగత అభిప్రాయాలపై కాకుండా కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర జల సంఘం వంటి అధికారిక సంస్థల నివేదికలు, ప్రభుత్వ ఫైళ్ల ఆధారంగా ఉన్నాయని వివరించారు. నిష్పాక్షిక ప్రభుత్వ రికార్డులపై ఆధారపడినప్పుడు సెక్షన్ 8- బి, 8- సి నోటీసులు తప్పనిసరి కాదని వాదించారు. మెదట ప్రాజెక్టుల అంచనా రూ.81 వేల కోట్లుగా ఉందని, తరువాత ప్రాజెక్టు అంచనా రూ.1.47 లక్షల కోట్లకు పెరగడం అత్యంత ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశమని కోర్టుకు తెలిపారు. పిటిషనర్లు విచారణలో పాల్గొని, ఫలితాలు ప్రతికూలంగా వచ్చాక సవాలు చేయడం ఆలస్యంగా వచ్చిన ఆలోచన అని ప్రశ్నించారు. కమిషన్ పిటిషనర్లకు నోటిసులు ఇచ్చే విచారించిందని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషన్లు కొట్టివేయాలని ధర్మాసనాన్ని కోరారు.

మన తెలంగాణ 23 Apr 2026 6:00 am

23rdApril2026 | గురువారం నేటి పంచాంగం

23rdApril2026 |గురువారంనేటి పంచాంగం 23rdApril2026 |తేదీ, సంవత్సరం, ఋతువు వివరాలుసూర్యోదయం – సూర్యాస్తమయం

ప్రభ న్యూస్ 23 Apr 2026 6:00 am

కూలిన కాంగ్రెస్ కుట్రలు

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజె క్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుతో తెలంగాణ ప్రజలు, రైతు లు గెలిచారని, రాజకీయ రాబందులు, పిట్టల దొర కుట్రలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు. ఈ తీర్పుపై కెటిఆర్ హర్షం వ్య క్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో కూలింది కాళేశ్వరం కాదని, ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కు ట్రలు కూలిపోయాయని కెటిఆర్ వ్యాఖ్యానించా రు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం పెరిగిందని, నిజాన్ని ఎవరూ దాచలేరని ఈ తీర్పుతో స్ప ష్టమైందని ఆయన అన్నారు. ఇది జస్టిస్ పిసి ఘో ష్ కమిషన్ నివేదిక కాదని, పిసిసి (కాంగ్రెస్) నివేదిక అని తాము అప్పుడే చెప్పామని కెటిఆర్ గుర్తు చేశారు. మేడిగడ్డ కుంగడం వెనుక పెను కు ట్ర దాగి ఉందని, అది కచ్చితంగా కాంగ్రెస్ పనే అయి ఉంటుందని కెటిఆర్ ఆరోపించారు. మేడిగడ్డలో అసలు ఏం జరిగిందో తెలియాలంటే వి శ్రాంత జడ్జితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాం ధీని బ్యారేజీ వద్దకు తీసుకువచ్చి ఫొటోలు దిగి, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన మండిపడ్డారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను తాను మొదటి నుంచీ ‘పిసిసి రిపోర్ట్’ అని పిలుస్తున్నానని, నేడు కోర్టు తీర్పుతో అది నిజమని నిరూపితమైందని అన్నారు. నిప్పులాంటి నిజం బయటకు వచ్చింది రేవంత్‌రెడ్డి ఎవరిని తెచ్చి ఏ విధంగా వాదించినా, చివరకు సత్యమే గెలిచిందని, నిప్పులాంటి నిజం బయటకు వచ్చిందని కెటిఆర్ పునరుద్ఘాటించా రు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని, ఇది బిఆర్‌ఎస్‌కు ఏటిఎంలా మారిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టుకు అయిన మొ త్తం ఖర్చు రూ. 94 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.కాళేశ్వరం విషయంలో ఆఘమేఘాల మీద స్పం దించిన ఎన్‌డిఎస్‌ఏ, ఎస్‌ఎల్‌బిసీ కూలినప్పుడు, వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయినప్పుడు ఎక్కడకు పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ మీ ద ఉన్న వ్యక్తిగత కక్షతో రైతులను ఇబ్బంది పెట్ట డం సరికాదని ఆయన హితవు పలికారు. 2014 ముందు కెసిఆర్ పాలన ముగిసే నాటికి పెరిగిన పంట దిగుబడే కాళేశ్వరం ప్రాజెక్టు విజయానికి నిదర్శనమని కెటిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ నేలపై గోదావరి జలాలు పారినన్ని రో జులు కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరని, ఇవాళ రా ష్ట్రంలో పారుతున్న ప్రతి నీటి బొట్టుకు కారణం కెసిఆర్‌అని కెటిఆర్ కొనియాడారు. మేడిగడ్డ బ్యా రేజీపై పెట్టిన ఖర్చు కేవలం రూ. 3,800 కోట్లు మాత్రమేనని కెటిఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డ అంటే కుంగిన గడ్డ కాదని, అది తెలంగాణకు ’మే టి గడ్డ’, ‘నీటి గడ్డ’ అని ఆయన అభివర్ణించారు. ఆర్టీసి కార్మికులకు బిఆర్‌ఎస్ మద్దతు ఆర్టీసి కార్మికులకు బిఆర్‌ఎస్ పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నామని కెటిఆర్ వెల్లడించారు. ఎన్నికల ముందు ఆర్టీసి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నారని, తక్షణమే ఆర్టీసి కార్మికులకు కాం గ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 23 Apr 2026 5:40 am

ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదు

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘో ష్ కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రా యం వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. సిబిఐకి ఘోష్ కమిషన్ పంపిన రిపోర్టులో ఎవరి పేర్ల ను పేర్కొనలేదని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. హై కోర్ట్ తీర్పు వెలువడిన తరువాత సిఎం రేవంత్‌రెడ్డి తో మంత్రి ఉత్తమ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, హై కో ర్టు తీర్పుపై వారిద్దరూ చర్చించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 6ను కొట్టివేయాలని పిటీషనర్లు హై కోర్టును ఆశ్రయించారని, కానీ, జ్యుడిషియల్ క మిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుపట్టలేదని ఆయ న స్పష్టం చేశారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించిందని ఆయన తెలిపారు. కమిషన్ ఫైండింగ్‌లను కూడా హైకోర్టు తప్పుపట్టలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని సెక్షన్ 3 ప్రకారం జిఓ ఎంఎస్ నెంబ ర్ 6 ద్వారా ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగబద్ధమేనని న్యాయస్థానం స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సిబిఐకు లేఖ రాశాం కమిషన్ ఏర్పాటు అధికార పరిధిని మించింది కాదని, అసమంజసం కాదని, అక్రమం కాదని న్యాయస్థానం స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదికలో కొందరు బాధ్యులపై చేసిన నిర్దారణలపై హైకోర్టు అభ్యంతరం తెలిపిందని ఆయన చెప్పారు. పిటీషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్ర కారం నోటీసు ఇవ్వలేదన్న టెక్నికల్ అంశాన్ని హైకోర్టు తప్పుపట్టిందన్నారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దని పిటీషనర్లకు రిలీఫ్ ఇచ్చిందని మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపా లు, అవకతవకలపై సిబిఐతో విచారణ చేపట్టాలని నిర్ణయించిందని, దానిపై సిబిఐకు లేఖ రాశామని మంత్రి ఉత్తమ్ ప్రస్తావించారు. ఈ రోజు వెలువడిన హైకోర్టు తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కా దని, న్యాయస్థానం ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై ప్రభు త్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం నిజం కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ముమ్మాటికీ నిజమన్నారు. ప్రాజెక్టుకు ఎంచుకున్న సైట్ నుంచి డిజైన్‌ల నుంచి నిర్మాణాలు, నిర్వహణ అన్నిచోట్ల అవకతవకలు జరిగాయని అన్నీ లోపాలే ఉన్నాయని బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. వారికి నోటీసులు ఇవ్వలేదన్న కారణంగా, వాళ్లపై కమిషన్ చేసిన రిమార్క్ మాత్రమే ఇన్ ఆపరేటివ్‌గా ఉంటాయని హైకోర్టు తెలిపిందన్నారు. ఇది పూర్తిగా ప్రొసిజరల్, టెక్నికల్ అంశమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు సైట్ నుంచి డిజైన్లు, నిర్మాణంలో జరిగిన లోపాలను బయటపెట్టిన విజిలెన్స్ 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆ బ్యారేజీ దగ్గరకు వెళితే ఎవరికైనా కుంగిన తీరు కనపడుతుందన్నారు. లక్ష కోట్లతో కట్టిన బ్యారేజీ మూడేళ్లకే కుంగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు వాళ్ల హయంలోనే కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు కారణాలేమిటో తేల్చాల్చిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీల కుంగుబాటుకు దారి తీసిన కారణాలు, డిజైన్ల, నిర్మాణం, నిర్వహణ లోపాలపై తమ ప్రాథమిక నివేదికను బిఆర్‌ఎస్ హయాంలోనే సమర్పించిందని మంత్రి తెలిపారు. బ్యారేజీలకు ఎంచుకున్న ప్రాజెక్టు సైట్ నుంచి డిజైన్లు, నిర్మాణంలో జరిగిన లోపాలను తమ ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిషన్ బయటపెట్టిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.తీర్పు కాపీ వచ్చాక ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రెండేళ్లుగా ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు అందలేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది ఈ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు అప్పులు, వడ్డీలు భరిస్తుందన్నారు. కేవలం రెండు ఫిల్లర్లు కాదని, మొత్తం పౌండేషన్, మొత్తం మూడు బ్యారేజీల పునాదులు అనుమానాస్పదంగా ఉన్నా యని, ఇప్పటికే దేశంలో పేరొందిన సంస్థల నిపుణులందరూ అభిప్రాయపడ్డారని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

మన తెలంగాణ 23 Apr 2026 5:20 am

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు మృతి

` చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన నేత హైదరాబాద్(జనంసాక్షి): ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ …

జనం సాక్షి 23 Apr 2026 5:20 am

ఆర్టీసీ సమ్మెతో ఆగిన బస్సులు

` జనం ఇక్కట్లు.. ` డిపోల ముందు ధర్నాలతో కార్మికుల నిరసన ` నగరంలో అద్దె బస్సులను ఉచితంగా తిప్పిన ప్రభుత్వం ` చాన్నాళ్లకు ఆటోలు, క్యాబ్‌లకు …

జనం సాక్షి 23 Apr 2026 5:17 am

జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టొద్దు

` తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశం ` కేసీఆర్,హరీశ్‌లకు భారీ ఊరట ` కమిషన్ నివేదికను నిలిపివేసిన ధర్మాసనం హైదరాబాద్(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, …

జనం సాక్షి 23 Apr 2026 5:15 am

సిఎం రాజకీయ టూర్‌లో ఈయనకు ఏం పని?

మన తెలంగాణ/హైదరాబాద్: నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఏ) ఛైర్మన్ అనిల్ జైన్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చే శారు. కేంద్రానికి చెడ్డ పేరు తెచ్చేలా య త్నించిన ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ అనిల్ జైన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి బం డి సంజయ్ బుధవారం తన మంత్రివర్గ స హచరుడైన కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌కు లేఖ రాశారు. చైర్మన్ అనిల్ జైన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి మంత్రి పాటిల్‌కు రాసిన లేఖను బండి సంజయ్ కార్యాలయం రహస్యంగా ఉంచింది. కాళేశ్వరం విషయంలో అనిల్ జైన్ వ్యవహారశైలి  ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వేదికపై అనిల్ జైన్ భాగస్వామి కావడమేంటి? అని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద వెయ్యి బోర్ హోల్స్ తవ్వాలని ఎన్డీఎస్ నివేదిస్తే... అందుకు భిన్నంగా 100 బోర్ హోల్స్ తవ్వితే సరిపోతుందని చెప్పడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ సూచించిన పరీక్షలను నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బ్యారేజీల స్థితిపై భూగర్భ, భూభౌతిక పరీక్షలు నిర్వహించాని సూచించి రెండేళ్లయినా పురోగతి లేదని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డలో కేవలం 6 బోర్ హోల్స్ మాత్రమే పూర్తి చేసిందని ఆయన తెలిపారు. అన్నారం, సుందిల్లలో ఒక్క బోర్ హోల్స్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మే చివరి నాటికి బోర్ హోల్స్‌ను పూర్తి చేయాలని సూచించినా పట్టించుకోవడం లేదని, నిర్ణీత గడువులోగా బోర్ హోల్స్ పూర్తి చేయలేమని గ్రహించి ఎన్డీఏస్ ఛైర్మన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఆయన ఆరోపించారు. బోర్ హోల్స్ సంఖ్యను 100కు పరిమితం చేసి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం మేడిగడ్డను సందర్శించారని, రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ అనిల్ ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ కమిటీ నిర్ణయాలను ఒక వ్యక్తి ఎలా అధిగమిస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్రానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే చైర్మన్ అనిల్ జైన్‌పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో బ్యారేజీలకు మరింత నష్టం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్‌డిఎస్‌ఏపై నిందలు మోపే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి లోనై ముందుగా కమిటీ ఇచ్చిన సిఫార్సులను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.

మన తెలంగాణ 23 Apr 2026 5:00 am

అధికారిక పర్యటనకు రాజకీయ రంగులా?

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ ఆనకట్ట భద్రతా ప్రాధికార సంస్థ (ఎన్‌డిఎస్ ఏ) చైర్మన్ ఈ నెల 20న మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శన పూర్తిగా అధికారిక, సాంకేతిక పరమైనదేనని, దానికి రాజకీయ రంగు లేద ని సాగునీటి శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ పర్యటన ఉద్దేశ్యం ప్రస్తుత పరిశోధనల పురోగతిని సమీక్షించడం, అలాగే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బృందాలకు సాం కేతిక మార్గదర్శకత్వం ఇవ్వడమేనని పేర్కొన్నారు. ఈ పర్యటన పూర్తిగా ఎన్‌డిఎస్‌ఏ అధికారిక సాంకేతిక పర్యవేక్షణ మాత్రమేనని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ ప్రణాళికా, ప్రామాణిక ప్రమాణాలు, ఇంజినీరింగ్ పద్ధతులు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించడానికే ఉద్దేశించినదని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి అగ్రగామి సంస్థ అయిన ఎన్‌డిఎస్‌ఏ, మేడిగడ్డ బ్యారేజ్‌లో కుంగిన పిల్లర్లు ఘటన అనంతరం గతంలో తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్‌డిఎస్‌ఏ సిఫార్సుల మేరకు కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కు పరిశోధనలు, అధ్యాయన బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ అధ్యయనాల ఆధారంగా పునరుద్ధరణ డిజైన్లను సిద్ధం చేయడానికి మెస్సర్స్ ఆఫ్రె సంస్థను డిజైన్ కన్సల్టెంట్‌గా నియమించామన్నారు. సిడబ్య్లూపిఆర్‌ఎస్, ఆఫ్రె సంస్థల మధ్య సమన్వయ సమావేశాల అనంతరం సమగ్ర ప్రణాళిక రూపొందించి, గత వారం నుంచి ఫీల్ స్థాయి పరిశోధనలు ప్రారంభమయ్యాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ అధికారికంగా పర్యటించారన్నారు. ముఖ్యమంత్రి, సాగునీటి మంత్రులు మేడిగడ్డను సందర్శించినప్పుడు ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ మీడియా సమావేశాల్లో పాల్గొనలేదని శ్రీధర్ స్పష్టం చేశారు. ఇందులో చైర్మన్ పాత్ర పూర్తిగా సాంకేతిక పరిశీలన, మార్గదర్శకత్వం వరకే పరిమితమైందని, దానికి ఎలాంటి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయవద్దని కోరారు.

మన తెలంగాణ 23 Apr 2026 4:40 am

పెండింగ్ భూసేకరణ సత్వరమే పూర్తి

మన తెలంగాణ/హైదరాబాద్: పెండింగ్ భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప లు కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్య త్ అవసరాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ఆయన అధికారులకు సూ చించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటిని, ఎ స్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారుల ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సి ఎం అధికారులకు సూచించారు. పేరున్న బ్రాండ్ సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వీలైనంత త్వరగా ఎంఓయూలు  కుదుర్చుకున్న సంస్థలు తమ కార్యకలాపాలు మొదలు పెట్టేలా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని అధికారులకు సిఎం సూచించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష చేశారు. ఈ సమీక్షకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో భాగంగా దావోస్‌లో జరిగిన పెట్టుబడులకు సంబంధించి, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పలు కంపెనీలతో జరిగిన ఎంఓయూలు, వాటి పురోగతి గురించి సిఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటివరకు పనులు ప్రారంభించిన కంపెనీలు, పెండింగ్ వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఫ్యూచర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో సంస్థలకు ప్రాధాన్యతల వారీగా కేటాయించాల్సిన భూ వివరాల గురించి అధికారులు సిఎం తెలియచేశారు. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మన తెలంగాణ 23 Apr 2026 4:30 am

సమ్మె సక్సెస్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి కార్మిక సమ్మె మొదటి రోజు విజయవంతమైంది. అన్ని చోట్ల బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్థరాత్రి నుండి కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం కాగా బస్‌స్టేషన్‌లు బస్సులు లేక వెలవెల బోయాయి. డిపోల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మె కారణంగా బస్సులు తిరగక పోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణీకులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీనిని అదనుగా భావించి ప్రైవేటు వాహనాలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల అద్దె బస్సులను పోలీసు ఎస్కార్ట్‌తో తిప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 లోపు అద్దెబస్సులు మాత్రమే పోలీసు బందోబస్తుతో నడిచినట్లు ఆర్‌టిసి వర్గాలు వెల్లడించాయి. ఆర్‌టిసిలో మొత్తం 10 వేల బస్సులు ఉండగా వీటిలో మూడున్నర వేల అద్దె బస్సులు ఉన్నాయి. ఉదయం నుంచే కార్మికులు డిపోల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా వారు అడ్డుకున్నారు. హైదరాబాద్ నగరంలోనూ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల జెఎసి నాయకులు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్థూపం వద్ద నివాళు లర్పించి గురువారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. అన్ని డిపోల ముందు మహా ధర్నాకు వారు పిలుపునిచ్చారు. మరోవైపు సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రయాణీకుల శ్రేయస్సు దృష్టా కార్మికులు సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కార్మికులు మాత్రం తమ డిమాండ్లు నెరవ్చేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సమ్మెను మన్నుందు మరింత ఉధృతం చేస్తామని జెఎసి నేతలు ప్రకటించారు. సమ్మెలో పాల్గొనడం లేదు : ఆర్‌టిసి సూపర్ వైజర్ అసోసియేషన్ ఆర్‌టిసి కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఎఎస్‌ల కమిటీని సూపర్ వైజర్ అసోసియేషన్ స్వాగతించింది. ప్రజా పాలన ప్రభుత్వానికి, ఆర్‌టిసి ఎండికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వం ఆర్‌టిసి సమస్యలపై చాలా సానుకూలంగా ఉందని, త్వరలో అన్ని సమస్యలపై పరిష్కారం అవుతాయన్న విశ్వాసం ఉన్నందున సూపర్ వైజర్ అసోసియేషన్ సమ్మెలో పాల్గొనడం లేదని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.వాసుదేవ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మె నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసులు పెంపు ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా ప్రయాణీకుల సౌకర్యార్థం మెట్రో రైల్ సర్వీసులు పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. మెట్రో రైళ్ల సర్వీసుల ఫ్రీక్వెన్సీని గరిష్ట స్థాయికి పెంచాలని నిర్ణయించినట్టు పేర్కొంది. రద్దీ ఉండే సమయాలలో పీక్ అవర్స్‌లో 56 రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. నాన్-పీక్ అవర్స్‌లో మియాపూర్ - ఎల్‌బీ నగర్ కారిడార్‌లో 4 నిమిషాలు, నాగోల్ రాయదుర్గ్ కారిడార్‌లో 5 నిమిషాల నిడివితో 44 రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. మియాపూర్, - ఎల్‌బీ నగర్ కారిడార్‌లో 4 నిమిషాల గ్యాప్‌తో, నాగోల్ -, రాయదుర్గ్ కారిడార్‌లో 3 నిమిషాల గ్యాప్‌తో మెట్రో రైళ్లు నడిపిస్తోన్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు కలుగకుండా రాత్రి 11.00 గంటల తర్వాత కూడా చివరి మెట్రో రైలు సర్వీసును పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

మన తెలంగాణ 23 Apr 2026 4:20 am

తొలిసారిగా తమిళనాట త్రిముఖ పోటీ

చెన్నై ః నేడు (గురువారం) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ద్రవిడ ఓటర్ల నాడిని నిర్థారిస్తూ జరుగుతాయి. 5.73 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ హక్కు వినియోగించుకోవల్సి ఉంది. బరిలో 4023 మంది అభ్యర్థులు నిలిచారు. జాతీయ స్థాయిలో తమిళనాడులో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడి రెండు ప్రదాన ద్రవిడ రాజకీయ శక్తులు పోటీపడుతున్నాయి. డిఎంకె సారధ్యంలో లౌకిక ప్రగతిశీల కూటమి(స్పా), అన్నాడిఎంకె ఆధ్వర్యంలో ఎన్‌డిఎ పరస్పర సవాళ్లతో ఎన్నికల పరీక్షకు దిగాయి. అధికార డిఎంకె లౌకికవాదం చాటుకుంటూ తిరిగి తమ అధికారం దక్కించుకునేందుకు స్టాలిన్ నాయకత్వంలో నిలిచింది. దెబ్బతిని ఉన్న విపక్షం అన్నాడిఎంకె ఈసారి అయినా తిరిగి అధికారంలోకి రావాలని యత్నిస్తోంది. ఈసారి విశేష ఘట్టంగా తమిళ హీరో విజయ్ నాయకత్వపు టివికె కూడా ఎన్నికల బరిలోకి దూసుకువచ్చింది. దీనితో ఈసారి ఎన్నికల రణరంగం త్రిముఖపోరుకు దారితీసింది. పైగా ప్రచారానికి మరింత తళుకుబెళుకులు అమరాయి. తమిళులు తప్పుడు వ్యక్తులను అధికారం నుంచి దూరంగా ఉంచాలని అన్నాడిఎంకె నేత ఎడప్పడి కె పళనిస్వామి పిలుపు నిచ్చారు. తమ సారధ్యంలోనే తమిళనాడు దక్షిణాదిలో ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని, ఇక ఓటర్ల తీర్పు ఈసారి మరీ కీలకం అని డిఎంకె అధినేత స్టాలిన్ తెలిపారు. ఎన్నికల రంగంలోకి వస్తూనే విజయ్ రెండు స్థానాల నుంచి బరిలో నిలిచారు. పెరంబూరు, తిరుచిరాపల్లిలో ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కించారు. రెండు ప్రధాన పార్టీలూ ఇంతకాలం కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం ఎత్తుగడలకు దిగాయని, రాష్ట్రంలో మార్పు తీసుకువచ్చేది టివికెతోనే అని ప్రకటించారు. అన్నాడిఎంకె, డిఎంకె బలాలను ఏ విధంగా విజయ్ పార్టీ ప్రభావితం చేస్తుందనేది చూడాల్సి ఉంది. అన్నాడిఎంకె నేతలకు తమ సొంత జిల్లాలు దాటి వేరే చోట్ల పోటీ చేసే శక్తి లేదని విజయ్ సవాలు విసిరారు. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. మంగళవారం ఎన్నికల ప్రచారం ముగిసింది. కేంద్రంలోని బిజెపితో నేరుగా తలపడుతున్న స్టాలిన్‌కు ఈ ఎన్నికల్లో విజయం అత్యంత కీలకమైన విషయం అయింది. మే నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాలు అదే రోజు వెలువడుతాయి. జాతీయ స్థాయి బిజెపి ద్రవిడ రాజకీయాలను, భాషాపరమైన భావోద్వేగాలను , ప్రత్యేకించి హిందీ అభిమాన హోరును తట్టుకుని ఈ రాష్ట్రంలో ఏ మేరకు తమ సంఖ్యాబలం చాటుకుంటుందనేది ప్రశ్న అయింది. ఇక కాంగ్రెస్ ఎప్పటిలాగానే డిఎంకెకు అనుబంధంగా రాజకీయ బలం చాటుకునే ప్రయత్నాలలో ఉంది. ఇది సొంత బలంగా మారని వైనం నెలకొంది. తమిళనాడులో ఓటింగ్‌ను పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు స్థాయిల్లో ఓటు చైతన్యకార్యక్రమాలను చేపట్టింది. ఎన్నికలకు ముందు తమిళనాడు ఎన్నికల సంఘం ప్రధానాధికారి అర్చనా పట్నాయక్ అన్ని కంట్రోలు రూంలు సందర్శించారు. పరిస్థితి సమీక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా , పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలకు దిగారు. 

మన తెలంగాణ 23 Apr 2026 3:30 am

నేడే బెంగాల్‌లో తొలి దఫా పోలింగ్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో గురువారం (నేడు) అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతుంది. చాలా కాలంగా రాజకీయ ఘర్షణలకు వేదిక అయిన బెంగాల్‌లో ఎన్నికలు ఎన్నికల సంఘానికి సవాలుగా మారాయి. ఇక్కడ రాజకీయ అదికారంతో పాతుకుపోయిన మమత బెనర్జీ సారధ్యపు టిఎంసికి , ఈ రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని బలంగా యత్నిస్తున్న బిజెపికి మధ్య పోటాపోటీ నెలకొంది. ఎన్నికల దశ వచ్చేసరికి ఓటర్లు రెండు భిన్న ధృవాల మధ్య తమ ఓటును ఖరారు చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. బెంగాల్‌లో అధికార పక్షం టిఎంసి అవినీతి, బంధుప్రీతి, ఉద్యోగాల స్కామ్‌లు, రాజకీయ హింసాకాండపై బిజెపి దృష్టి సారించింది. ఇక బిజెపికి తొత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం మారిందని, వ్యక్తుల గుర్తింపు , ఉనికి, వారి పౌరసత్వాలను, చివరికి ఓటు హక్కును హరించి వేసిందని మమత బెనర్జీ విరుచుకుపడుతూ వచ్చారు. తీవ్రస్థాయిలో తమ రాజకీయ ఎదురుదాడితో ముందుకు సాగారు. జాతీయ స్థాయిలో బిజెపికి పూర్తి సవాలు విసురుతూ వస్తోన్న మమతకు టిఎంసి తిరిగి అధికారంలోకి రావడం అత్యంత కీలక సవాలు అయింది. సర్ ప్రక్రియతో ఓటర్ల జాబితాలను కేంద్రం హైజాక్ చేసిందనే వాదనను టిఎంసి బలీయంగా ఓటర్ల వద్దకు తీసుకువెళ్లింది. రెండు దశల పోలింగ్ జరిగే బెంగాల్‌లో తొలి రౌండ్‌లో మొత్తం 294 స్థానాల అసెంబ్లీలోని 152 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇందులో 54 వరకూ ఉత్తర బెంగాల్‌లోని ఎనిమిది జిల్లాలు, మిగిలినవి ముర్షీదాబాద్, నాడియా, బిర్బూమ్, హుగ్లీ ఇతర జిల్లాలో జరుగుతాయి. ఉత్తర బెంగాల్‌పైనే బిజెపి అత్యధిక ఆశలు పెట్టుకుంది. ఈ ప్రాంతం రాష్ట్రంలో రాజకీయ అధికారానికి ముఖద్వారంగా నిలుస్తుంది. ఇక్కడ బిజెపి ఏదైనా పట్టు సాధిస్తుందా? లేక ప్రాబల్యం పోగొట్టుకున్న ఈ ప్రాంతంలో టిఎంసి తిరిగి తన బలం చాటుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది. ఈసారి ఇంతకు ముందటితో పోలిస్తే ఓటర్ల సంఖ్య సర్ జాబితా వడబోతతో తగ్గిపోయింది 3.60 కోట్ల మందికి పైగా ఓటర్లు ఏ పక్షాన్ని ఎంచుకుంటారనేది ప్రధానంగా ఈ తొలి దఫా పోలింగ్‌తో తేలనుంది. ఈసారి దాదాపుగా 1.75 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగానికి అర్హులుగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఈసారి ఇంతకు ముందటితో పోలిస్తే మరింత పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లకు దిగింది. అత్యంత సున్నిత ఉద్రిక్తత ప్రాంతాలను గుర్తించారు. ఈ క్రమంలో 8వేలకు పైగా పోలింగ్ కేంద్రాలకు రికార్డు స్థాయిలో 2450 కంపెనీల కేంద్రీయ బలగాలను పంపించారు. అధికార టిఎంసికి బెంగాల్‌లో బిజెపి సవాలు విసురుతోంది. ప్రత్యేకించి మహిళలపై పలు చోట్ల జరిగిన ఘోరమైన అత్యాచారాలపై అధికార పార్టీ ఇంతవరకూ ఎటువంటి చర్యకు దిగలేకపోయిందని, నిందితులైన అధికార పక్షం వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు వెలువడ్డాయి. 2021లో ఈ ప్రాంతంలోని 152 అసెంబ్లీ స్థానాలలో బిజెపి 59 చట్ల గెలిచింది. బిజెపి 93 స్థానాలు గెల్చుకుంది. దీనితో తొలిదశలో తన బలం పెంచుకోవాలని బిజెపి, ఇందుకు అడ్డుకట్ట వేయాలని మమత బెనర్జీ పరస్పరం విమర్శల కత్తులు దూసుకున్నాయి. ఓటర్ల తీర్పు తొలిదశలో రిజర్వ్ అవుతుంది. ఈసారి ఎన్నికలలో గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్యకు సర్ ప్రక్రియతో దాదాపుగా 91 లక్షలకు పైగా గండిపడింది. ఈ పరిణామం ఏ పార్టీకి అనుకూలం అవుతుందనేది తేలాల్సి ఉంది. తొలి దశ పోలింగ్ విస్తృత స్థాయిలో తేయాకు తోటల ప్రాంతాల పరిధిలో ఉంది. జల్పాయ్‌గురి, అఇపూరుదూర్, డార్జిలింగ్, కలింపాంగ్ పర్వతాలు, కూచ్ బెహార్ పరిధిలో ఓటింగ్ ఉంది. సర్ ద్వారా భారీ స్థాయిలో ఓటర్లను తీసివేయడం కేంద్రం రాష్ట్రంలో అక్రమ వలసదార్లపై చేపట్టిన దిగ్బంధనం ఫలితం అని బిజెపి ప్రచారం చేసుకుంది. ఈ క్రమంలో స్థానికులైన బెంగాలీలకు న్యాయం జరుగుతుందని ఓటర్లకు తెలియచేసుకుంది. ఈ విషయం ఓటర్లు విశ్వసిస్తే బిజెపికి సర్‌తో భారీ ఓట్ల లబ్థికి అవకాశం ఉంది. ఇందుకు ప్రతిగా అధికార టిఎంసి తరచూ సర్‌తో స్థానిక బెంగాలీలు, ప్రత్యేకించి అణగారిన వర్గాలకు కేంద్రం కీడు తలపెట్టిందని ఆరోపించింది. దీనితో సర్ ఈ సారి ఎన్నికల్లో తెరవెనుక ప్రధాన అంశం కానుంది. అక్రమ వలసలు, పౌరసత్వ సవాళ్లపై సర్ ఓ రెఫరెండం అని బిజెపి ఓటర్ల వద్దకు వెళ్లింది. ఇప్పుడు ఈసారి ఎన్నికలలో ఓటరుకు మరో కీలక సమస్య ఏర్పడింది. దశాబ్తాలుగా ఓటేసిన వారిలో అత్యధికులు ఈసారి ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉందో లేదో అనే సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. చివరికి తమకు తాము పరాయి అయ్యామనే ఆవేశం వ్యక్తం అవుతోంది. బెంగాల్‌లో రెడ్ అలర్ట్ స్థానాల్లో 17 శాతం పెరుగుదల ఇప్పుడు తొలిదశ పోలింగ్ జరిగే పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తతలకు అవకాశం ఉన్న నియోజకవర్గాల సంఖ్య పెరిగింది. ఇంతకు ముందటితో పోలిస్తే ఈసారి ఈ రెడ్ అలర్డ్ స్థానాల సంఖ్య లో 17 శాతం మేర పెరుగుదల ఉందని ఎడిఆర్ నివేదికలో వెల్లడైంది. బెంగాల్‌లో చాలా కాలంగా నెలకొంటూ వచ్చిన రాజకీయ హింసాత్మకతకు ఇది అద్దం పడుతోంది. ఎన్నికలలో నిలిచిన వారిలో మొత్తం 23 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్నికల ప్రజాస్వామిక సంస్కరణల విశ్లేషణ సంస్థ ఎడిఆర్ బెంగాల్ తొలి దశ పోలింగ్ నేపథ్యంలో ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. మొత్తం 293 మంది అభ్యర్థుల రికార్డులను పరిశీలించారు. ఇందులో 208 మంది అంటే దాదాపుగా 71 శాతం వరకూ బిజెపి అభ్యర్థులకు కళంకిత చరిత్ర ఉంది. కాంగ్రెస్ 26 శాతంతో, టిఎంసి 39 శాతంతో నేరాలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారని వెల్లడైంది. ఇక సిపిఐ (ఎం) అభ్యర్థులు దాదాపుగా 47 శాతం మంది వరకూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.

మన తెలంగాణ 23 Apr 2026 3:00 am

లక్నో పై రాజస్థాన్ గెలుపు

ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఐదో విజయం నమోదు చేసింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మార్ష్ (55) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆర్చర్ మూడు, బర్గర్, బ్రిజేష్ శర్మ రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లక్నో బౌలర్లు సఫలమయ్యారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 4 ఫోర్లతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ (20) జట్టుకు అండగా నిలువలేక పోయాడు. హెట్‌మెయిర్ (22) కూడా ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోయాడు. అయితే రవీంద్ర జడేజా 29 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. ఫెరీరా (20), శుభమ్ దూబె 19 (నాటౌట్) అతనికి సహకారం అందించారు. లక్నో బౌలర్లలో షమి, మోసిన్ ఖాన్, ప్రిన్స్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

మన తెలంగాణ 22 Apr 2026 11:58 pm

ఉమ్మడి ఏపీ మాజీ సిఎం నాదెండ్ల కన్నుమూత

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు క న్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య స మస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నా దెండ్ల భాస్కరరావు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియల ను పంజాగుట్ట శ్మశానవాటికలో గురువారం సా యంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కు టుంబ సభ్యులు వెల్లడించారు. ప్రజల సందర్శనా ర్థం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ నివాసం లో ఉంచారు. నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఇ రు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. లాయర్‌గా కెరీర్ ప్రారంభించి ఆపై రాజకీయాల్లోకి ఎంట్రీ నాదెండ్ల స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి. 1935, జూన్ 23న జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన నాదెండ్ల భాస్కరరావు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ న 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతం లో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మంత్రివర్గం లో పనిచేశారు. 1982 లో తెలుగుదేశం పార్టీ ఏ ర్పాటు సమయంలో ఎన్టీ రామారావుతో కలిసి నడిచారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఎన్టీఆర్‌కు మార్గదర్శిగా తాను వ్యవహరించానని నాదెండ్ల భా స్కరరావు చెప్పుకుంటారు. -1983లో టిడిపి ఘన విజయం సాధించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఆయన మంత్రివర్గంలో నాదెండ్ల భాస్కరరావు ఆర్థిక మంత్రిగా చేరారు. 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వె ళ్ళిన సమయంలో టిడిపిలో సంక్షోభం తలెత్తింది. నాదెండ్ల భాస్కరరావు కొంతమంది ఎమ్మెల్యేల మ ద్దతుతో రాష్ట్ర సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన దాదాపు నెల (31 రోజుల) పాటు సిఎం గా కొనసాగారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో నాదెండ్ల సిఎం పదవికి రాజీనామా చే యాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ గూటి కి చేరారు. 1989లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపిగా పోటీ చేసి గెలుపొందారు. మర్రి చె న్నారెడ్డి, అంజయ్య, ఎన్టీఆర్ హయాంలో మంత్రి గా బాధ్యతలను నిర్వర్తించారు. 2019లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరా రు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వాకింగ్ విత్ డెస్టినీ పేరుతో భాస్కరరావు ఆత్మకథ రాసుకున్నారు. ఆయన జీవితం మలిదశ లో కూడా పలు ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్‌పై ఘాటై న విమర్శలు చేసేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు. మురళీధర్, మనోహర్. ఆయన భార్య పేరు లలిత. వారి వివాహం సత్యసాయి సమక్షంలో జరిగింది. నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారు. తొలుత కాంగ్రెస్‌లో కొనసాగిన నాదెండ్ల మనోహ ర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి శాసనసభకు స్పీకర్ గా వ్యవహరించారు. అలాగే, ఎపిలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. సిఎం రేవంత్ సంతాపం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నాదెండ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎపి సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ సంతాపం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఎపి సిఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. భాస్కరరావు కుమారు డు, ఎపి మంత్రి నాదెండ్ల మనోహర్‌ను సిఎం ఫోన్ లో పరామర్శించారు. నాదెండ్ల భాస్కరరావు మృ తిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఎపి మాజీ సిఎం జగన్ సంతాపం మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు.‘నాదెండ్ల భాస్కర్ రావు ఎపి రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించిన నాయకుడని పేర్కొన్నారు. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, రాజకీయ అను భవం తరతరాలకు ఆదర్శమని‘ అన్నారు. 

మన తెలంగాణ 22 Apr 2026 11:47 pm

అంగారకుడిపై జీవానికి మూలమైన సేంద్రియ అణువులు గుర్తింపు

 అంగారక గ్రహంపై జీవం ఉనికి గురించి దశాబ్దాలుగా సాగుతున్న అన్వేషణలో నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మరో కీలక ముందడుగు వేసింది. క్యూరియాసిటీ రోవర్ అంగారకుడి భూమధ్యరేఖకు సమీపంలో ఒకప్పుడు సరస్సుగా ఉండి ఎండిపో యిన ప్రాంతంలో క్యూరియాసిటీ రోవర్ ఈ పరిశోధన జరిపింది. ఇక్కడ ఏడు వేర్వేరు సేంద్రియ సమ్మేళనాలను రోవర్ గుర్తించగా, వాటిలో ఐదింటిని మార్స్‌పై కనుగొనడం ఇదే తొలిసారి. ఈ సేంద్రియ పదార్థాలు పురాతన జీవుల నుంచి వచ్చాయా?ఉల్కల ద్వారా గ్రహానికి చేరాయా? లేక భౌగోళిక ప్రక్రియల వల్ల ఏర్పడ్డాయా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఒకవేళ అంగారకుడిపై జీవం ఉండి ఉంటే, దానికి సంబంధించిన రసాయన ఆనవాళ్లు ఇప్పటికీ భద్రంగా ఉండే అవకాశం ఉందని ఈ ఆవిష్కరణ సూచిస్తోంది. ఈ ప్రయోగానికి నేతృత్వం వహిం చిన ఫ్లోరిడా యూనివర్సిటీ ఆస్ట్రోజియాలజిస్ట్ ప్రొఫెసర్ అమీ విలియమ్స్ మాట్లాడుతూ ‘మేము 350 కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై భద్రపరచబడిన సేంద్రియ పదార్థాలను చూస్తున్నామని భావిస్తున్నాం. అయితే ఇది జీవానికి సంబంధించినదేనా? అన్నది ప్రస్తుత సమాచారంతో చెప్పలేం‘ అని వివరించారు. కొన్ని వందల కోట్ల ఏళ్ల కిందట మార్స్‌పై జీవం వృద్ధి చెందడానికి అనువైన వాతావరణం ఉండేదని, కానీ నేడు తీవ్రమైన రేడియేషన్, అతి శీతల పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘ఇంతటి కఠినమైన రేడియేషన్ వాతావరణంలో సేంద్రియ పదార్థాలు మనుగడ సాగించడం నిజంగా ఆశ్చర్యకరం‘ అని అమీ విలియమ్స్ అన్నారు. గుర్తించిన సమ్మేళనాల్లో డీఎన్‌ఏ నిర్మాణంలో పాలుపం చుకునే నైట్రోజన్ సమ్మేళనం వంటి నిర్మాణం ఒకటి ఉన్నప్పటికీ, అవి కేవలం ‘ఇటుకలు మాత్రమే, ఇల్లు కాదు‘ అని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆవిష్కరణలతో 2028లో ప్రయోగించనున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రోసలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్‌పై అంచనాలు పెరిగాయి. ఈ రోవర్ ఉపరితలం కింద రెండు మీటర్ల లోతు వరకు డ్రిల్ చేసి, రేడియేషన్ నుంచి మరింత సురక్షితంగా ఉన్న నమూనాలను విశ్లేషించగలదు.

మన తెలంగాణ 22 Apr 2026 11:23 pm

CM Revanth Orders Real-Time Dashboard to Track Every investment deal

CM A. Revanth Reddy on Wednesday directed officials to fast-track the implementation of investment agreements signed by the state with major companies and remove all pending obstacles without delay. At a high-level review meeting on investments and infrastructure, the CM said MoUs signed at global platforms such as Davos, the Telangana Rising Global Summit and […] The post CM Revanth Orders Real-Time Dashboard to Track Every investment deal appeared first on Telugu360 .

తెలుగు 360 22 Apr 2026 11:23 pm

కాళేశ్వరం పై సిబిఐ విచారణకు సిద్ధమా?: మంత్రి పొంగులేటి

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని పదే పదే చెబుతున్న బిఆర్‌ఎస్ నాయకులు నిజంగా నిర్దోషులైతే, వెంటనే స్వయంగా సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవార ఓ ప్రకటనలో సవాల్ విసిరారు. కాళేశ్వరం అంశంపై హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తీవ్రంగా విమర్శించారు. నిజంగా ఎలాంటి అవకతవకలు జరగలేదంటే, స్వతంత్ర సంస్థ ద్వారా విచారణకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విచారణ జరిగితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే బిఆర్‌ఎస్ నాయకత్వం వెనుకడుగు వేస్తోందని, భారీ ఆర్థిక దోపిడీ, కమీషన్ల వ్యవహారం, కాంట్రాక్టుల లోపాలు అన్నీ బహిర్గతమవుతాయనే భయమే వారిని వెంటాడుతోందని మంత్రి ఆరోపించారు. ఇదే భయంతో బిజెపితో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని, విచారణను తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యతపై ఇప్పటికే తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మేడిగడ్డ వంటి కీలక నిర్మాణాలు కుంగిపోవడం, పంప్ హౌజ్‌లు దెబ్బతినడం వంటి సంఘటనలు యాదృచ్ఛికం కాదని స్పష్టం మంత్రి చేశారు. ఇవన్నీ ప్రాజెక్టులో జరిగిన పెద్ద ఎత్తున అవినీతికి నిదర్శనాలేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యత దెబ్బతిందని, అదే విధంగా నిర్మించిన చెక్ డ్యాములు కూడా కుప్పకూలిన ఘటనలు ప్రజల ముందు ఉన్న వాస్తవాలేనని మంత్రి గుర్తు చేశారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదన్నట్టుగా గ్లోబల్ ప్రచారానికి దిగడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆయన విమర్శించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయి పారదర్శక విచారణ జరగడం ప్రజాస్వామ్యంలో కనీస బాధ్యత అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన రోజు దగ్గరలోనే ఉందని, ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారు.

మన తెలంగాణ 22 Apr 2026 10:50 pm

కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల దాడులు

కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. 10 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం ఆకస్మికదాడి చేశారు. అనంతరం ఆసుపత్రిలోని డ్యూటీ చార్ట్ ప్రకారం ఉండాల్సిన వైద్యులు విధుల్లో ఉన్నారా లేదా అని బయోమెట్రిక్ యంత్రాలు, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొందరు వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ కోసం ప్రభుత్వ విధులకు డుమ్మా కొడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశామన్నారు. ఆసుపత్రిలో ఉచితంగా జరగాల్సిన ల్యాబ్ పరీక్షల ప్రక్రియ పరిశీలన చేయడం జరిగిందన్నారు. రోగులను బయట ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపిస్తున్నారా అనే కోణంలో రికార్డుల తనిఖీ, ఫార్మసీలో స్టాక్ రిజిస్టర్ పరిశీలన చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత మందులు రోగులకు అందుతున్నాయా లేదా బయట మెడికల్ షాపులకు రాసిస్తున్నారా అన్నది తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారం నాణ్యతను, క్యాంటీన్ నిర్వహణ పరిశీలన, వార్డులలో పారిశుధ్యలోపాల గుర్తిచడం జరిగిందన్నారు. తనిఖీల్లో భాగంగా కొన్ని కీలక రికార్డులను, రిజిస్టర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, సిబ్బంది ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. 

మన తెలంగాణ 22 Apr 2026 10:40 pm

బైక్‌ను ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి

కారు బైక్ ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందిన విషాధ ఘటన గుర్రంపోడు మండలం చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చింతగూడెంకు చెందిన మారెడ్డి బాల్‌రెడ్డి (70) , భార్య అలివేలమ్మ, పాల్వాయి గ్రామానికి చెందిన మాలె, వెంకటమ్మ, మాలె మంజుల కారులో నల్లగొండలో తమ సమీప బంధువుల నిశ్చితార్థ వేడుకకు హాజరై తిరిగి స్వస్థలానికి వెళుతున్న క్రమంలో కనగల్ మండలానికి చెందిన మధుబాబు, నర్సింగ్ ధనుంజయ బైక్‌పై పాల్వాయి ధాన్యం మిల్లు నుంచి ధాన్యం అమ్మిన డబ్బులు తీసుకుని తిరిగి దేవరకొండ వైపు వెళుతుండగా చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద కారు బలంగా బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సింగ్ మధుబాబు (38), ధనుంజయగౌడ్ (45) కారులో ప్రయాణిస్తున్న మారెడ్డి బాల్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు కారులోని మిగతా వారికి గాయాలు కాగా 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను తెలుసుకున్నారు. వెంటనే ప్రమాద స్థలికి దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరావు,కొండమల్లేపల్లి సిఐ నవీన్‌కుమార్,గుర్రంపోడు ఎస్‌ఐ వెంకన్న చేరుకుని ప్రమాద ఘటనను పరిశీలించి పూర్తి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మన తెలంగాణ 22 Apr 2026 10:05 pm

GG’s Palleturu Song: Feel the Vibe & Warmth

Sumanth Prabhas’ rural love-and-family entertainer Godari Gattupaina, directed by debutant Subash Chandra and featuring Nidhi Pradeep as the heroine, has already made a positive impression with its glimpses and songs. As part of its musical promotions, the makers have released the fourth single, Nenu Na Palleturu. The song, scored by Naga Vamshi, carries a breezy, […] The post GG’s Palleturu Song: Feel the Vibe & Warmth appeared first on Telugu360 .

తెలుగు 360 22 Apr 2026 10:05 pm

Too Many Speculations on Peddi Item Song

Ram Charan’s Peddi is postponed from April 30th release and the team is focused on the post-production work. The patch work of the film too is happening currently and an item song will be shot soon in a special set. From the past one week, there have been a lot of speculations about the actress […] The post Too Many Speculations on Peddi Item Song appeared first on Telugu360 .

తెలుగు 360 22 Apr 2026 10:02 pm

లక్నో సూపర్ జెయింట్స్ లక్ష్యం 160

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఎకనా స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 43, శుభమ్ దూబె 19 నాటౌట్ గా నిలిచారు. యశస్వి జశ్వాల్ 22,రియాన్ పరాగ్ 20, శిమ్రాన్ 22 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో మహ్మద్‌ షమీ ,ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

మన తెలంగాణ 22 Apr 2026 10:00 pm

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వత్సవాయి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో ఒక

ప్రభ న్యూస్ 22 Apr 2026 9:41 pm

తృటిలో తప్పిన ప్రాణాపాయం

తృటిలో తప్పిన ప్రాణాపాయం ఎ. కొండూరు, ఆంధ్రప్రభ: గ్యాస్ లీక్ కారణంగా పూరిళ్లు

ప్రభ న్యూస్ 22 Apr 2026 9:33 pm

మరణానంతరం మహాదానం…

మరణానంతరం మహాదానం… ఐదుగురికి ప్రాణం పోసిన యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికూకట్‌పల్లి మెట్రో వద్ద

ప్రభ న్యూస్ 22 Apr 2026 9:27 pm

పసిపిల్లలే టార్గెట్.. మాయమాటలతో బురిడీ కొట్టించి!

పసిపిల్లలే టార్గెట్.. మాయమాటలతో బురిడీ కొట్టించి! ముగ్గురు నిందితుల అరెస్ట్కిడ్నాపర్ల నుంచి మరో

ప్రభ న్యూస్ 22 Apr 2026 9:14 pm

ఖర్గేకు ఇసి నోటీసు

ప్రధాని మోడీని ఉగ్రవాదిగా పేర్కొనడంపై కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం బుధవారం తీవ్రస్థాయి నోటిసు వెలువరించింది. తమిళనాడు , పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. చెన్నైలో విలేకరుల సమావేశం దశలో ఖర్గే ప్రధాని మోడీ టెర్రరిస్టు వంటి వారని విమర్శించారు. ప్రతిపక్షాల అణచివేతకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికార యంత్రాంగాలను వాడుకొంటోందని, ఈ క్రమంలో ఆయన టెర్రరిస్టు వంటి వారేనని ఖర్గే తెలిపారు. దీనిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఖర్గేకు నోటిసు ఇస్తూ దీనికి 24 గంటల్లో సమాదానం ఇచ్చుకోవల్సి ఉందని హెచ్చరించింది. ప్రజలను, పార్టీలను తన చర్యలతో భయభ్రాంతులను చేస్తున్న వ్యక్తి టెర్రరిస్టు కాక మరెవ్వరు అని ఖర్గే ఆ తరువాత వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈసికి ఆయన ఎటువంటి జవాబు ఇస్తారనేది చూడాల్సి ఉంది. 

మన తెలంగాణ 22 Apr 2026 9:02 pm

విద్వేషాలను తిప్పికొట్టడమే దేశ విధానం: కాంగ్రెస్

 దేశం ఎప్పుడూ విద్వేషాలు, హింసాత్మక చర్యలకు తలొగ్గేది లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడుల ఏడాది నేపథ్యంలో పార్టీ అప్పటి మృతులకు బుధవారం నివాళులు అర్పించింది. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసింది. జాతి యావత్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా నిలుస్తుందని, విద్వేషాన్ని ఏ కోణంలో ప్రచారానికి తీసుకువవ్చినా తిప్పికొడుతుందని పార్టీ తెలిపింది. ప్రస్తుత గల్ఫ్ యుద్ధం దశలో దేశ విదేశాంగ విధానం పూర్తిగా విఫలం చెందిందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ విధానాలే కారణం అని పార్టీ విమర్శించింది. ముంబై ఉగ్రదాడుల తరువాత ప్రపంచ స్థాయిలో పాకిస్థాన్ ఏకాకి అయింది. అన్ని దేశాలూ ఉగ్రవాదం ముద్రతో వేలెత్తి చూపాయి. అయితే ఇప్పుడు పాకిస్థాన్ ఇరాన్, అమెరికా మధ్య దౌత్యానికి దిగుతూ ప్రపంచ స్థాయి ఆదరణను పొందుతోందని, మరి ప్రధాని మోడీ తరఫున వ్యాప్తి చెందిన విశ్వగురు వాదనకు ఏమైందని కాంగ్రెస్ ప్రశ్నించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమ సందేశంలో దేశం అంతా కలిసి ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది. సంఘటితంగా స్పందిస్తుందని తెలిపారు. ఇండియా ఏ దశలో కూడా ఉగ్రవాద బాధిత కుటుంబాల త్యాగాలను విస్మరించబోదు. ఉగ్రవాద పిరికిపంద చర్యలకు దిగే వారిని జాతి క్షమించబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు , వారి వెనుక ఉన్న ప్రేరక శక్తులను క్షమించేది లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు పర్యాటక కేంద్రంలో అమాయకుల ప్రాణాలు తీసిన వైనం మనను ఈరోజుకీ కలిచివేస్తుంది. బాదిత కుటుంబాల గుండోకోత మనమంతా పంచుకోవల్సి ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తమ ప్రకటనలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీయ స్ఫూర్తి చెక్కుచెదరకుండా నిలుస్తుందని తెలిపారు. బాధితులకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ తమ ప్రకటనలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశ విదేశాంగ విధానం పునర్వించుకోవల్సి ఉంది. అయితే ప్రధాని మోడీ దీనిపై కదలరు మెదలరని విమర్శించారు.  

మన తెలంగాణ 22 Apr 2026 8:56 pm

ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి బీజేపీ డిమాండ్ చెన్నూర్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్

ప్రభ న్యూస్ 22 Apr 2026 8:55 pm

ప్రభుత్వోద్యోగులకు ప్రధాని లేఖలు

పౌరులే దేవుళ్లు అనే ప్రాతిపదిక భావనతోనే సేవలు అందించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వోద్యోగులకు సందేశం వెలువరించారు. కోటి మందికి పైగా సివిల్ సర్వెంట్స్‌కు బుధవారం ప్రధాని మోడీ తరఫున ఈ మేరకు లేఖలు పంపించారు. నాగరిక్‌దేవోభవ అనేది సివిల్ సర్వెంట్స్ ఉద్యోగ ఆచరణ నినాదం కావల్సి ఉందని ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై గురుతర బాధ్యత ఉంటుంది. పౌరుడి సేవలే కీలక లక్షంగా ప్రతి నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ శక్తివంచన లేకుండా ఈ దిశలో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రధాని తమ లేఖలలో తెలిపారు. సుపరిపాలనను పూర్తి స్థాయి సంయమనంతో నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రజా సేవకు బాధ్యత వహించే వారు జీవితాంతం అధ్యయనశీలులుగా నిలుస్తారు. వారి అనుభవం వారి సేవలు ప్రజానీకానికి మేలు చేస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. మీ నిర్ణయాలు, పౌరుల పట్ల అంకితభావపు కర్తవ్య పాలనతోనే పరిపాలనా వ్యవస్థ సక్రమం అవుతుందని ప్రధాని మోడీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు. మరాఠా, గుజరాతీ , బెంగాలీ వంటి దాదాపు 12 భాషలలో ఈ లేఖలను పంపించారు. 21వ శతాబ్థం అత్యంత సవాళ్ల కాలం, ఇదే దశలో మన ముందుకు పలు సదవకాశాలు వస్తాయి. దేనిని ఎంచుకుంటామనేది ప్రధాన విషయం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు దృక్పథాలు మారుతున్నాయి. నూతన సాంకేతికలు అనూహ్య రీతిలో ముందుకు వస్తున్నాయి. వినూత్న సృజనాత్మకతలు ఆవిష్కృతం అవుతున్నాయని ప్రధాని తెలిపారు. వివిధ భాషలలో ప్రధాని లేఖలు పలు మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల సివిల్ సర్వెంట్స్‌కు చేరాయి. 

మన తెలంగాణ 22 Apr 2026 8:52 pm

మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మొగుళ్లపల్లి,

ప్రభ న్యూస్ 22 Apr 2026 8:47 pm

100%increasing |యువతను మింగేస్తున్న డ్రగ్స్ మాఫియా

100%increasing | యువతను మింగేస్తున్న డ్రగ్స్ మాఫియా 100%increasing | భయానక స్థాయికి

ప్రభ న్యూస్ 22 Apr 2026 8:44 pm

రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగించడం సబబు కాదు

రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగించడం సబబు కాదు తహసీల్దార్ కి బిఆర్ఎస్ నాయకుల

ప్రభ న్యూస్ 22 Apr 2026 8:38 pm

ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు సుర్వి యాదయ్యగౌడ్ చౌటుప్పల్, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 22 Apr 2026 8:27 pm

అతి వేగంతో వెళ్తూ బైక్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

గుర్రంపోడు: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాకాజిపురానికి చెందిన మారెడ్డి బాల్‌రెడ్డి, అలివేలు, పాల్వాయి గ్రామానికి చెందిన మాలె మంజుల, మాలె వెంకటమ్మ నల్గొండలో ఓ శుభకార్యానికి హాజరై కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వద్దిరెడ్డిగూడెం సమీపంలో వీరి కారు అతి వేగంతో ఓ బైక్‌ను ఢీకొట్టి ఆ తర్వాత చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న కనగల్‌కు చెందిన రైతులు నర్సింగ్ మధుబాబు, నర్సింగ్ ధనుంజయ, కారులో ఉన్న బాల్‌రెడ్డి మృతి చెందారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 22 Apr 2026 8:23 pm

చోరీలు, నీటి ప్రమాదాలపై ఎస్పీ హెచ్చరిక

చోరీలు, నీటి ప్రమాదాలపై ఎస్పీ హెచ్చరిక గద్వాల, ఆంధ్రప్రభ: వేసవి సెలవులు మొదలయ్యాయి

ప్రభ న్యూస్ 22 Apr 2026 8:20 pm

మాలేగావ్ 2006 పేలుళ్ల కేసులో బొంబాయి హైకోర్టు కీలక తీర్పు

మహారాష్ట్రలోని మాలేగావ్ 2006 పేలుళ్ల కేసులో బొంబాయి హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై అభియోగాలు మోపుతూ ప్రత్యేక న్యాయస్థానం ఇంతకు ముందు వెలువరించిన ఆదేశాలను కొట్టివేసింది. హైకోర్టు ప్రదాన న్యాయమూర్తి చంద్రశేఖర్ , న్యాయమూర్తి శ్యామ్ చంద్రక్‌తో కూడిన ధర్మాసనం ఈ మలుపు తిప్పే తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులైన నలుగురు వ్యక్తులు రాజేంద్ర చౌదరి, ధన్‌సింగ్, మనోహర్ రామ్ సింగ్ నర్వారియా, లోకేష్ శర్మలు ఇప్పుడు కేసు నుంచి విముక్తి పొందారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పెట్టుకున్న దరఖాస్తులను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 2006 సెప్టెంబర్ 8వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న మాలేగావ్ పట్టణంలో పేలుళ్లు జరిగాయి. అక్కడి హమిదియా మసీద్ , బడా ఖబ్రస్థాన్ ఆవరణలలో నమాజ్ తరువాత మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. తరువాత నాలుగో పేలుడు అక్కడి ముషావరత్ చౌక్‌లో సంభవించింది. ఈ ఘటనలలో మొత్తం 31 మంది దుర్మరణం చెందారు. 312 మంది వరకూ గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్త సంచలనానికి దారితీసింది. దీనిపై రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) తొలుత దర్యాప్తు జరిపింది. కేసుకు సంబంధించి తొమ్మండుగురు ముస్లింలను అరెస్టు చేశారు. తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) రంగంలోకి దిగింది. ఇది హిందూత్వ ఉగ్రవాద చర్యల ఫలితం అని పేర్కొంటూ ఇప్పుడు నిర్దోషులు అయిన వారిని నిందితులుగా చేర్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రత్యేక కోర్టు వీరిపై కేసులు నమోదు చేసింది. దీనికి వ్యతిరేకంగా వారు హైకోర్టును ఆశ్రయించారు. తమకు వ్యతిరేకంగా ఎన్‌ఐఎ ఎటువంటి సాక్షాదారాలు చూపలేకపోయిందని, అయినా తమను నిందితులుగా చూపారని వీరు తెలియచేసుకున్నారు.

మన తెలంగాణ 22 Apr 2026 8:20 pm

Amazon |అమెజాన్ డెలివరీ బాయ్..

Amazon | అమెజాన్ డెలివరీ బాయ్.. Amazon | ఇబ్రహీంపట్నం రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Apr 2026 8:20 pm

వివరాలను పక్కగా నమోదు చేయాలి

వివరాలను పక్కగా నమోదు చేయాలి కొత్తూరు తహసీల్దార్ ఎస్కే ముంతాజ్ కొత్తూరు, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 22 Apr 2026 8:08 pm

రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్యపై మహిళల నిరసన…

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా… విశాలాంధ్ర – రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.గత నెల రోజులుగా కొత్తగా బోరు బావిలో నీరు ఉన్నప్పటికీ, పైపులైన్ సక్రమంగా లేకపోవడం వల్ల కాలనీకి త్రాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు […] The post రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్యపై మహిళల నిరసన… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 8:08 pm

ఇరాన్ వైఖరిపై భారత్ ఆందోళన

హార్మూజ్ జలసంధిలో తాజా ఉద్రిక్తతల మధ్య, గత వారం కూడా రెండు భారత నౌకలు ఇరాన్ నౌకాదళ దాడులకు గురైన విషయం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. స్నేహపూర్వక దేశాలకు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని టెహ్రాన్ హామీ ఇచ్చినప్పటికీ ఈ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ జెండాతో ప్రయాణిస్తున్న ‘జాగ్ అర్నవ్’ అనే బల్క్ క్యారియర్ సౌదీ అరేబియా నుంచి భారత్‌కు వస్తుండగా దాడికి గురైంది. అలాగే ‘సాన్‌మార్ హెరాల్డ్’ అనే మరో నౌక ఇరాక్ నుంచి భారత్‌కు చమురు రవాణా చేస్తుండగా లక్ష్యంగా మారింది. ఏప్రిల్ నెలలో సుమారు పది భారత నౌకలు ఈ కీలక సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లు సమాచారం. ఈ ఘటనలతో ఇరాన్‌లో అసలు అధికార నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రభావం పెరిగి, రాజకీయ నాయకత్వాన్ని పక్కన పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి తన ఆందోళనను తెలియజేస్తూ ఇరాన్ రాయబారిని భారత ప్రభుత్వం పిలిపించి వివరణ కోరింది.

మన తెలంగాణ 22 Apr 2026 8:01 pm

15yrsgirl |ఆశ్రమంలో గిరిజన బిడ్డ మృతికి బాధ్యులెవరు?

15yrsgirl | ఆశ్రమంలో గిరిజన బిడ్డ మృతికి బాధ్యులెవరు? 15yrsgirl | జ్వరంతో

ప్రభ న్యూస్ 22 Apr 2026 7:57 pm

ఈడీ దాడి సమయంలో ఐ-ప్యాక్ కార్యాలయంలోకి వెళ్లిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఈ ఏడాది జనవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన దాడి సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్‌వీ అంజారియా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఈడీ కోరింది.ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులు ఇప్పటికే అసాధారణంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు కూడా అత్యంత అసాధారణమైనదిగా భావిస్తున్నామని తెలిపింది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దర్యాప్తు జరుగుతున్న సమయంలో నేరుగా అక్కడికి వెళ్లి జోక్యం చేసుకోవడం సమంజసం కాదు. ఇలాంటి చర్య ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుంది. ఆ తరువాత దీనిని రాష్ట్రం-, కేంద్రం మధ్య వివాదంగా మార్చొద్దని చెప్పడం సరైంది కాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేసిన చర్య. అలాంటి వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టినట్లే.. అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో జనవరి 8న ఈడీ నిర్వహించిన దాడితో ఈ వివాదం ప్రారంభమైంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ దాడులు చేపట్టినట్లు ఈడీ తెలిపింది. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లి కీలక ఆధారాలను తొలగించారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ ఆరోపణలతో ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ నిపుణులు హెచ్.ఎం. సీర్వాయ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు కూడా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక సజీవ దర్యాప్తులో జోక్యం చేసుకునే పరిస్థితిని ఊహించి ఉండరని ధర్మాసనం పేర్కొంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ విచారణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రతిపక్ష బీజేపీ నుంచి గట్టి సవాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ కేసు రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, ఈడీ వంటి సంస్థలకు ప్రాథమిక హక్కులు ఉండవని తెలిపారు. అందువల్ల తమ హక్కులు ఉల్లంఘించబడ్డాయని ఆ సంస్థ వాదించలేదన్నారు. గత తీర్పులను ఉదహరిస్తూ, ఈడీ ఒక ప్రత్యేక న్యాయబద్ధ సంస్థ కాదని, దర్యాప్తు నిర్వహించేందుకు ప్రాథమిక హక్కులు కలిగిన స్వతంత్ర సంస్థగా దానిని పరిగణించలేమని సింఘ్వీ కోర్టుకు వివరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరఫున సీనియర్ న్యాయవాది మేనక గురుస్వామి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని రిట్ అధికార పరిధి కేవలం న్యాయబద్ధ వ్యక్తుల(జ్యూరిస్టిక్ పర్సన్స్)కు మాత్రమే వర్తిస్తుందని ఆమె తెలిపారు. పౌరులను ప్రభుత్వ అక్రమ చర్యల నుంచి రక్షించేందుకే ప్రాథమిక హక్కులు ఉద్దేశించబడ్డాయని, ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలే తమ హక్కులు ఉల్లంఘించబడ్డాయని చెప్పలేవని ఆమె వాదించారు.ఇప్పటికే స్థిరపడిన రాజ్యాంగ సూత్రాలను కేంద్ర ప్రభుత్వం మార్చేందుకు ప్రయత్నిస్తోందని మేనక గురుస్వామి ఆరోపించారు. ఈ సందర్భంగా కేశవానంద భారతి కేసు సహా పలు కీలక తీర్పులను ఆమె ప్రస్తావించారు.ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక కొనసాగుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడం వల్ల కలిగే ప్రభావాలపై పదేపదే ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశం సంస్థల అధికార పరిమితులు, న్యాయపాలన వంటి కీలక రాజ్యాంగ సూత్రాలపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఐ-ప్యాక్ కేసు ఏమిటి? జనవరి 8న కోల్‌కతాలోని ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ నిర్వహించిన దాడితో ఈ కేసు మొదలైంది. సోదాలు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లడంతో రాజకీయ, న్యాయపరమైన వివాదం చెలరేగింది.దాడి జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ అక్కడి నుంచి కొన్ని పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లారని ఈడీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను మమత ఖండించారు. తాను తీసుకెళ్లిన పత్రాలు 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఐ-ప్యాక్‌తో నిర్వహించిన రాజకీయ కార్యకలాపాలకు సంబంధించినవేనని, మనీ లాండరింగ్ దర్యాప్తుతో వాటికి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసును రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈడీ ముందుకు తీసుకెళ్తోందని కూడా మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే వ్యాపారవేత్త అనూప్ మజీకి సంబంధించిన కోల్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ నెట్‌వర్క్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ దాడులు నిర్వహించామని ఈడీ చెబుతోంది. ఇటీవలి నెలల్లో ఈ కేసు మరింత విస్తరించింది. కోల్ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్‌ను ఈడీ అరెస్టు చేసింది.

మన తెలంగాణ 22 Apr 2026 7:57 pm

విడపనకల్లు మండలంలో కల్తీ ఆహార దందా బహిర్గతం…

అధికారుల మౌనం.. కల్తీ రాయుళ్లకు వరం! విశాలాంధ్ర – విడపనకల్లు: పసిపిల్లలు నోటిలో వేసుకునే మిఠాయిలే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. మండలంలో విక్రయిస్తున్న కొన్ని మిఠాయిలు నిప్పు అంటిస్తే కొవ్వొత్తిలా కరుగుతున్న ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కల్తీ దందా తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ ముద్రించడం చట్టరీత్యా తప్పనిసరి అయినప్పటికీ, ఇక్కడ విక్రయించే ప్యాకెట్లపై ఆ వివరాలు కనిపించడం లేదు. తనిఖీలను తప్పించుకునేందుకు తాత్కాలికంగా తేదీలు […] The post విడపనకల్లు మండలంలో కల్తీ ఆహార దందా బహిర్గతం… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 7:56 pm

రాష్ట్రంలో ఆరుగురు సీనియర్ ఐపిఎస్‌లకు డిజి హోదా

హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపిఎల్ అధికారులకు డైరెక్టర్ జనరల్‌(డిజి)గా పదోన్నతులు కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో అదనపు డిజిలు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వివి శ్రీనివాస రావు, చారు సిన్హా, అనిల్ కుమార్, విసి సజ్జనార్ ఉన్నారు. మహేశ్ భగవత్ ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదనపు డిజిగా ఉండగా.. స్వాతి లక్రా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజిగా ఉన్నారు. వివి శ్రీనివాస రావు తెలంగాణ పోలీసు నియామక మండలి ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. సిఐడి, మహిళ భద్రతా విభాగం, ఎసిబి ఎడిజిగా చారు సిన్హా విధులు నిర్వర్తిస్తున్నారు. అనిల్ కుమార్ గ్రే హౌండ్స్ ఎడిజిగా ఉండగా.. విసి సజ్జనార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్నారు. ఈ ఆరుగురు ఐపిఎల్ అధికారులు.. పదోన్నతి పొందినా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ అదే స్థానాల్లో విధులు నిర్వర్తించనున్నారు.

మన తెలంగాణ 22 Apr 2026 7:52 pm

చేనేత రంగాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

చేనేత రంగాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఆప్కో డైరెక్టర్ కర్నాటి వెంకటేశం

ప్రభ న్యూస్ 22 Apr 2026 7:51 pm

రూ. 90 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డుల ఏర్పాటు మన తెలంగాణ/సిటీబ్యూరో : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం, గ్రామంలోని 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. ఈ భూమి విలువ రూ. 90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అధికారుల వివరాల ప్రకారం సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిపోగా అక్కడ 9.05 ఎకరాల ప్రభుత్వ భూమి మిగిలింది. ఖస్రా పహాణీ (గ్రామ పాత రికార్డుల) ప్రకారం మొత్తం 176.05 ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదై ఉంది. అందులోని 9.05 ఎకరాలను సీఎస్ 14 (నిజాంలకు చెందిన) భూములుగా పేర్కొంటూ కొంతమంది హక్కులు క్లైమ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వివాదం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. తుది తీర్పు వచ్చే వరకూ ఈ భూమి స్వరూపాన్ని మార్చరాదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు స్టే ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్‌ను పట్టించుకోకుండా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి అభూమిని చదును చేసి లే ఔట్‌గా మార్చినట్టు రంగరెడ్డి కలెక్టర్‌తో పాటు.. శంషాబాద్ మున్సిపల్ అధికారులకు ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ 9.05 ఎకరాల భూమిని చదును చేసి.. ప్రీకాస్ట్ గోడల ద్వారా అక్రమించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. భూ అక్రమణ చట్టం 1905 ప్రకారం అక్రమణలను తొలగించాలని మొయినుద్దీన్‌కు అధికారులు సూచించారు. అవేవీ పట్టించుకోకుండా.. అక్కడ కొన్ని ఇంటి స్థలాలు అమ్ముకున్నట్టు కూడా తెలుసుకున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇదే విషయాన్ని హైడ్రాకు చెబుతూ.. ఆక్రమణలు తొలగించాలని లేఖ రాశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పిర్యాదుతో బుధవారం హైడ్రా ఆపరేషన్ చేపట్టి.. 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమణలను తొలగించింది. ఆభూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వం భూమి అని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో ప్రభుత్వంలోని ఆక్రమణలను హైడ్రా తొలగించింది.

మన తెలంగాణ 22 Apr 2026 7:49 pm

5 months |వృద్ధ దంపతుల బలవన్మరణం..

5 months | వృద్ధ దంపతుల బలవన్మరణం.. 5 months | కంచికచర్ల,

ప్రభ న్యూస్ 22 Apr 2026 7:47 pm

మంత్రి అజహరుద్దీన్ పదవిపై ఉత్కంఠ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై దాఖలైన పిటిషన్ల కేసు విచారణను సుప్రీం కోర్టు జూలై 22వ తేదీకి వాయిదా వేయడంతో మంత్రి అజహరుద్దీన్ మంత్రి పదవిపై ఉత్కంఠత నెలకొంది. అజర్ మంత్రి పదవి ఉంటుందా? లేక ఊడుతుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. అందుకు కారణం ఈ నెలాఖరుతో మంత్రి పదవి గడువు ముగియనున్నది. ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ కాకుండానే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజర్ ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అలా జరగకపోతే రాజ్యాంగంలోని ఎన్నికల నియమావళి ప్రకారం ఆరు నెలలు దాటగానే సదరు మంత్రి ‘మాజీ’ అవుతారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీల (అజర్, ప్రొఫెసర్ కోదండరాం) నియామకాన్ని సవాల్ చేస్తూ బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్‌తో పాటు మరి కొందరు వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో బుధవారం కోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. మైనారిటీ కోటాలో మంత్రివర్గంలో అజర్‌ను తీసుకుంటే ఇప్పుడు ఈ సమస్య రావడంతో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌తో సమావేశమై పరిస్థితిని అధిగమించడానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైలును క్లియర్ చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. కాగా కేసు సుప్రీం కోర్టులో ఉన్నదని గవర్నర్ సలహాదారుల సూచన మేరకు ఆయన నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. మరోసారి మంత్రిగా ప్రమాణం.. మంత్రి అజర్ పదవీ కాలం గడువు ఈ నెలాఖరుతో ముగియగానే ఆయన ‘మాజీ’ అయితే మైనారిటీలంతా అసంతృప్తికి గురవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే అజర్ మాజీ కాగానే ఒక రోజు విరామం ఇచ్చి ఆ మర్నాడు మళ్లీ మంత్రిగా ప్రమాణం చేయించడానికి అవకాశం ఉంది. ఈ మార్గాన్నే ముఖ్యమంత్రి అనుసరిస్తారా? ఆని పార్టీ వర్గాలు భావిస్తాయి. ఆ విధంగా రెండో సారి అజర్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే మళ్లీ ఆరు నెలల వరకూ గడువు ఉంటుంది.

మన తెలంగాణ 22 Apr 2026 7:46 pm

సీనియర్ ఐపీఎస్ లకు ప్రమోషన్లు

సీనియర్ ఐపీఎస్ లకు ప్రమోషన్లు అడిషనల్ డీజీ నుండి డీజీ గా పదోన్నతి

ప్రభ న్యూస్ 22 Apr 2026 7:43 pm

కాళేశ్వరం నుంచే హైదరాబాద్‌తో సహా 70 శాతం తెలంగాణకు త్రాగునీరు

హైదరాబాద్‌తో సహా 70 శాతం తెలంగాణకు త్రాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరమని హరీష్‌రావు తెలిపారు. రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయని, కానీ, రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి రాజకీయాలు చేయకూడదని ఆయన పేర్కొన్నారు. నిజానికి రూ.100, రూ.200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో రెండు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని, కానీ, రెండున్నరేళ్లుగా భూ సేకరణకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్‌రావు ఆరోపించారు. మోటార్లు, రిజర్వాయర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని, కేవలం కుట్రతోనే ఆపారని హరీష్‌రావు అన్నారు. పర్ఫార్మెన్స్ మీద రాజకీయాలు జరగాలని, తమకంటే మంచి సంక్షేమ పథకాలు, ఆరు గ్యారంటీలు, 420 హామీల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఎన్‌డిఎస్‌ఏ అనేది కేవలం ఇంజనీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమేనని, దాంట్లో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఉండదని ఆయన అన్నారు. మళ్లీ అవే చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెబుతాయని ఆయన అన్నారు. ఆర్టీసి కార్మికుల న్యాయమైన సమ్మెకు బిఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది, తక్షణమే వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 22 Apr 2026 7:42 pm

నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు..

నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు.. ఆందోళనకు దిగిన ఇంటి ఓనర్లు.. చెన్నూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Apr 2026 7:35 pm

బజాజ్ పల్సర్ NS400Z వర్సెస్ కేటీఎం 390 డ్యూక్.. ఏది కొంటె బెస్ట్..?

కొత్త జీఎస్టీ శ్లాబ్ ప్రయోజనాన్ని పొందడానికి బజాజ్ మోటార్‌సైకిల్స్ తమ ఇంజిన్‌ల పరిమాణాన్ని తగ్గించడం ప్రారంభించింది. ఈ శ్లాబ్ ప్రకారం 350 cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే, కంపెనీ ఇటీవల తమ బజాజ్ NS400Z చిన్న వేరియంట్‌ను విడుదల చేసింది. ఇక అంతకుముందు బజాజ్ యాజమాన్యంలోని కేటీఎం, కేటీఎం 390 డ్యూక్ 349 cc వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో ఈ రెండు మోటార్‌సైకిళ్లలో ఒకదాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, బజాజ్ NS400Z, KTM 390 డ్యూక్‌  లో ఏది కొంటె బెటర్ గా ఉంటుందో ఈ ఆర్టికల్ ద్వారా పూర్తిగా తెలుసుకుందాం.  బజాజ్ పల్సర్ NS400Z vs కేటీఎం 390 డ్యూక్: ఇంజిన్, పనితీరు బజాజ్ పల్సర్ NS400Z, KTM 390 డ్యూక్ రెండూ కొత్త 349.13 cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తాయి. ఇది మునుపటి 373 cc ఇంజిన్ స్థానంలో వచ్చాయి. బజాజ్ NS400Z ఇప్పుడు 9,000 rpm వద్ద 40 హార్స్‌పవర్, 7,500 rpm వద్ద 33.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మునుపటి కంటే కొద్దిగా తక్కువ. మరోవైపు..కొత్త 350 cc ఇంజిన్‌తో వచ్చిన కేటీఎం 390 డ్యూక్, 41.5 hp గరిష్ట శక్తిని, 33.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది NS400Z కంటే కొద్దిగా మెరుగైనది. బజాజ్ పల్సర్ NS400Z vs కేటీఎం 390 డ్యూక్: ఫీచర్లు బజాజ్ NS400Zలో రైడర్-అసిస్ట్ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ఎంచుకోదగిన రైడ్ మోడ్‌లు ఉన్నాయి. మెరుగైన స్థిరత్వం కోసం ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా అందించారు. బ్లూటూత్ కనెక్టివిటీ, ఒక స్మార్ట్ ఫోర్-వే సెలక్షన్ కంట్రోల్ స్విచ్ ఈ ఫంక్షన్లను సులభంగా, సౌకర్యవంతంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తాయి. కేటీఎం 390 డ్యూక్ ఫీచర్ల విషయానికి వస్తే..ఇందులో 5-అంగుళాల TFT డాష్ డిస్‌ప్లే ఉంది. మోటార్‌సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ (MTC), స్ట్రీట్, రెయిన్ రైడ్ మోడ్‌లు, ట్రాక్ స్క్రీన్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, రైడ్-బై-వైర్, క్విక్‌షిఫ్టర్+, సూపర్‌మోటో ఏబీఎస్, ఒక టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. బజాజ్ NS400Zలో 43mm USD ఫ్రంట్ సస్పెన్షన్, నైట్రాక్స్ రియర్ మోనోషాక్ ఉన్నాయి. కంపెనీ అద్భుతమైన గ్రిప్, నియంత్రణ కోసం, దీనికి ముందువైపు 110/70, వెనుకవైపు 140/70 సైజులో 17-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చింది. ఇది 168mm గ్రౌండ్ క్లియరెన్స్, 1,344mm వీల్‌బేస్, 807mm రైడర్ సీట్ ఎత్తును కలిగి ఉంది. దీనికి 12-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 174kg కర్బ్ వెయిట్ ఉన్నాయి. మరోవైపు..కేటీఎం 390 డ్యూక్ శక్తివంతమైన బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో రేడియల్ కాలిపర్‌తో కూడిన 320mm ఫ్రంట్ డిస్క్, ఫ్లోటింగ్ కాలిపర్‌తో కూడిన 240mm రియర్ డిస్క్ ఉంటాయి. దీని సస్పెన్షన్, ఛాసిస్ 183 mm గ్రౌండ్ క్లియరెన్స్, 800 mm నుండి 820 mm వరకు సర్దుబాటు చేయగల సీట్ ఎత్తును అందిస్తాయి. ఇది వివిధ రైడర్‌లకు అనుకూలంగా ఉంటుంది. 15-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ మరియు 168.3 kg కర్బ్ వెయిట్‌తో, 390 డ్యూక్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది.  బజాజ్ పల్సర్ NS400Z vs కేటీఎం 390 డ్యూక్: ధర వాహనాల పవర్, పనితీరులో కొద్దిగా తేడా ఉన్నప్పటికీ, ఈ రెండు పెర్ఫార్మెన్స్ బైక్‌ల మధ్య అతిపెద్ద తేడా వాటి ధర. బజాజ్ NS400Z ప్రారంభ ధర రూ.1.94 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త 350 cc ఇంజిన్‌తో వచ్చే కేటీఎం 390 డ్యూక్ ధర రూ.2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్). 

మన తెలంగాణ 22 Apr 2026 7:35 pm

Kaleshwaram Case Far From Over: High Court Validates Commission, CBI Probe Back in Focus

The Telangana government on Tuesday said the High Court verdict on the Justice P.C. Ghose Commission report on the Kaleshwaram Lift Irrigation Project (KLIP) has not given a clean chit to anyone linked to alleged irregularities in the project. The case was filed by petitioners seeking to quash Government Order Ms. No.6, through which the […] The post Kaleshwaram Case Far From Over: High Court Validates Commission, CBI Probe Back in Focus appeared first on Telugu360 .

తెలుగు 360 22 Apr 2026 7:27 pm

కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి.

కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .

ప్రభ న్యూస్ 22 Apr 2026 7:16 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఎకనా స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగులున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలు కాగా.. లక్నో వరుసగా మూడు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో లక్నో రెండు మార్పులు చేయగా.. రాజస్థాన్ గత మ్యాచ్‌లోని జట్టుతో బరిలోకి దిగుతోంది. తుది జట్లు: ఎల్‌ఎస్‌జి: మిచెల్ మార్ష్, ఆయుష్ బదోనీ, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఐయిడెన్ మార్క్‌రమ్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, మయాంక్ యాదవ్. ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, డొనావాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, నాండ్రే బర్గర్.

మన తెలంగాణ 22 Apr 2026 7:15 pm

దొడ్డు వడ్లు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వినతి

దొడ్డు వడ్లు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వినతి భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 22 Apr 2026 7:11 pm

మున్సిపల్ కో ఆప్షన్ ఆశావహులు వీరే…ఎంపిక అయ్యేది ఎవ్వరో..?

మున్సిపల్ కో ఆప్షన్ ఆశావహులు వీరే…ఎంపిక అయ్యేది ఎవ్వరో..? ఎమ్మెల్యే సామెల్ కి

ప్రభ న్యూస్ 22 Apr 2026 7:06 pm

22apriltoon |యుద్ధం అక్కడ.. దోపిడీ ఇక్కడ!

22apriltoon| యుద్ధం అక్కడ.. దోపిడీ ఇక్కడ! 22apriltoon |యుద్ధం సాకు.. అసలు గేమ్

ప్రభ న్యూస్ 22 Apr 2026 7:02 pm

ఇన్చార్జి అధికారులే శరణ్యం…..

ఇన్చార్జి అధికారులే శరణ్యం….. బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయం. దుస్థితి…… బిచ్కుంద. (కామారెడ్డి)

ప్రభ న్యూస్ 22 Apr 2026 7:02 pm

Saty’s Jetlee Trailer: Fun Fest

After teasing audiences with promos and quirky visuals, Jetlee finally drops its Trailer- and it leans fully into madness. Reuniting actor Satya with director Ritesh Rana, the film appears to throw convention out the window, embracing absurdity as its biggest strength. The Trailer starts with an unusual premise- Satya’s character is dealing with memory loss, […] The post Saty’s Jetlee Trailer: Fun Fest appeared first on Telugu360 .

తెలుగు 360 22 Apr 2026 7:02 pm

గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులకు సన్మానం

గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులకు సన్మానం ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్

ప్రభ న్యూస్ 22 Apr 2026 7:01 pm

‘కల్కి సీక్వెల్’ఇంటర్వెల్ కోసం భారీ సెట్ — ప్రభాస్, అమితాబ్, కమల్ కలిసి షూట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా రూపొందుతున్న ‘కల్కి 2’ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలువడింది. కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్ నిర్మించనున్నారని, ఆ సెట్‌లో సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ కీలకమైన షూట్‌లో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కూడా పాల్గొంటారని సమాచారం. గత షెడ్యూల్‌లో అమితాబ్ బచ్చన్ మరియు […] The post ‘కల్కి సీక్వెల్’ ఇంటర్వెల్ కోసం భారీ సెట్ — ప్రభాస్, అమితాబ్, కమల్ కలిసి షూట్! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 22 Apr 2026 7:00 pm

నిఘా నీడలో కేసముద్రం 11వ వార్డు..

నిఘా నీడలో కేసముద్రం 11వ వార్డు.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినరూ. 1లక్ష

ప్రభ న్యూస్ 22 Apr 2026 6:58 pm

పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం

పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం పరకాల, ఆంధ్రప్రభ: పరకాల పట్టణంలోని లలిత

ప్రభ న్యూస్ 22 Apr 2026 6:56 pm

కూలింది కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్ చేసిన కుట్రలు: కెటిఆర్

హైదరాబాద్: కెసిఆ‌ర్‌పై దుష్ప్రచారం చేసిన వారి చెంపచెల్లుమనిపించే తీర్పు హైకోర్టు ఇచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై పిసి ఘోష్ ఇచ్చిన కమిషన్‌ను నిలిపివేయాలని తెలంగాణ హై కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కృషి చేసిన ఇంజినీర్లు గెలిచారని తెలిపారు. మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. కూలింది కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్ చేసిన కుట్రలు కూలాయని ఎద్దేవా చేశారు. ఎవరు తప్పుడు పని చేసినా ఊరుకునేది లేదని హైకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. ఇవాళ తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టు కెసిఆర్ కృషే అని కెటిఆర్ పేర్కొన్నారు. ‘‘భూమిపై గోదావరి పారినన్ని రోజులూ కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపివేయలేరు. అది పిసి ఘోష్ కమిషన్ కాదు.. పిసిసి నివేదిక అని నేను అప్పుడే చెప్పాను. హైకోర్టు తీర్పుతో అందరికీ ఇవాళ జ్ఞానోదయం కలిగి ఉంటుంది. కాళేశ్వరం కచ్చితంగా తెలంగాణకు వరప్రదాయని. రూ.94 వేల కోట్లు ఖర్చు అయితే.. రూ.లక్ష కోట్లు అని దుష్ప్రచారం చేశారు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజీ కాదు.. మూడు బ్యారేజీలు. మేడిగడ్డ బ్యారేజీపై చేసిన ఖర్చు రూ.3800 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ కుట్రల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని మరోసారి చెప్తున్నా. కుంగిన ఒక్క బ్లాక్‌ను పునర్నిర్మిస్తామని ఎల్ అండ్ టి సంస్థ ముందుకొచ్చింది. అది మేడిగడ్డ కాదు.. మేటిగడ్డ అని నిరూపితమవుతుంది’’ అని కెటిఆర్ అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలోనూ ఎలాంటి అక్రమాలు జరగలేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ‘‘తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు నీరు ఎత్తిపోస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్రంలోని చెక్‌డ్యామ్‌లను బాంబులు పెట్టి పేలుస్తున్నారు. చెక్‌డ్యామ్‌లను పేలుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. మేడిగడ్డలో ఏం జరిగిందో విశ్రాంత జడ్జీతో మళ్లీ విచారణ జరిపించాలి’’ అని కెటిఆర్ డిమాండ్ చేశారు. 

మన తెలంగాణ 22 Apr 2026 6:50 pm

మంచి సమాజం కోసం పోరాటం చేద్దాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి: మానవ జాతిపై దోపిడి, పీడన లేని మంచి సమాజం కోసం పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్య భవన్ లో బుధవారం ప్రపంచ విప్లవ వీరుడు, సోవియట్ యూనియన్ స్థాపకుడు కామ్రేడ్ వ్లాదిమిర్ లెనిన్ 156వ జయంతి వేడుకలను సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా […] The post మంచి సమాజం కోసం పోరాటం చేద్దాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 6:42 pm

Revanth Reddy : మూడేళ్లు గడ్డు కాలమే..రేవంత్ ఎలా బయటపడతారో?

తెలంగాణ కాంగ్రెస్ కు రానున్న మూడేళ్లు కష్టకాలమే

తెలుగు పోస్ట్ 22 Apr 2026 6:42 pm

ఏఐటీయూసీ రాష్ట్ర 18 వ మహాసభలను జయప్రదం చేయండి

రుపతికి వేలాదిగా తరలిరండి కార్మికుల హక్కుల రక్షణ కోసం మహాసభ వేదికగా ఉద్యమ రూపకల్పన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లు పి హరినాథ్ రెడ్డి ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. 26వ తేదీ తిరుపతిలో జరిగే కార్మిక మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలువైపుల నుండి వేలాదిగా తరలి రావాలని కోరారు. మహాసభ జయప్రదం కోసం […] The post ఏఐటీయూసీ రాష్ట్ర 18 వ మహాసభలను జయప్రదం చేయండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 6:37 pm

దోసకాయ తినడం వల్ల ఇన్ని ఆరోగ్య లాభాలున్నాయా..?

దోసకాయ దాని తాజా రుచికి, పోషక గుణాలకు ప్రసిద్ధి చెందింది. సాధారణంగా దీనిని సలాడ్లలో భాగంగా ఉపయోగిస్తారు. దోసకాయ శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. అంతేకాదు, శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. ఈ క్రమంలో ప్రతిరోజూ దోసకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా దోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దోసకాయలో ఉండే మూలకాలు శరీర నీటి సమతుల్యతను కాపాడతాయి. వేసవిలో అలసట, నీరసాన్ని నివారిస్తాయి. బరువు తగ్గడంలో  ఇప్పటికే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిరోజూ దోసకాయ తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దోసకాయ కడుపును ఎక్కువసేపు నింపిన భావన కలిగిస్తుంది. దోసకాయలలోని ఉండే నీరు, ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  చర్మ ఆరోగ్యం దోసకాయలలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పోషించి, మృదువుగా చేస్తాయి. అంతేకాకుండా, దోసకాయ చర్మం నీటి సమతుల్యతను కాపాడుతూ, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా దోసకాయలు తినడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ దోసకాయలలోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా, దోసకాయలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరిచి, ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా దోసకాయలు తినడం వల్ల ప్రేగులు శుభ్రపడతాయి. తద్వారా శరీరం నుండి విష పదార్థాలను తొలగించే సామర్థ్యం పెరుగుతుంది. గుండెకు ప్రయోజనకరం దోసకాయలు తినడం గుండెకు చాలా ప్రయోజనకరం. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, దోసకాయ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరిచి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

మన తెలంగాణ 22 Apr 2026 6:37 pm

పట్టణ సిఐ గా బాధ్యతలు చేపట్టిన…అశోక్ కుమార్.

పట్టణ సిఐ గా బాధ్యతలు చేపట్టిన…అశోక్ కుమార్. నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు

ప్రభ న్యూస్ 22 Apr 2026 6:21 pm

పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యతనివ్వాలి

పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యతనివ్వాలి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Apr 2026 6:19 pm

నెమలి దేవస్థాన చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి…

నెమలి దేవస్థాన చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి… ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును కలిసిన

ప్రభ న్యూస్ 22 Apr 2026 6:16 pm

KTR : అబద్ధానికి ఆడంబరం ఎక్కువ.. ఆయుష్షు తక్కువ

కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

తెలుగు పోస్ట్ 22 Apr 2026 6:13 pm

ప్రేమ పేరుతో దారుణం.. కళ్లకు గంతలు కట్టి.. నిప్పంటించి,,

బెంగళూరులో ప్రేమ పేరుతో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంటకి పిలిచిన ఓ యువతి అతడి నమ్మడంచి హత్య చేసింది. ప్రియుడు కిరణ్ కళ్లకు గంతలు కట్టి, కుర్చీకి కట్టేసి కిరోసిన్‌ పోసి సజీవదహనం చేసింది ప్రియురాలు ప్రేమ. బెంగళూరు శివారులోని బైదరహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అంజనానగర్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. పథకం ప్రకారమే యువతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఏం జరిగింది అని అడగ్గా.. తాను బాత్‌రూమ్‌లో ఉన్నానని.. పొగ రావడంతో గమనించి బయటకు వచ్చే సరికి కిరణ్ కుర్చిలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పథకం ప్రకారం ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

మన తెలంగాణ 22 Apr 2026 6:12 pm

విజయవంతంగా ముగిసిన జనగణన శిక్షణ

విజయవంతంగా ముగిసిన జనగణన శిక్షణ భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: జనగణన 2027లో భాగంగా

ప్రభ న్యూస్ 22 Apr 2026 6:11 pm

పైప్‌లైన్ పనులు వేగవంతం చేయండి

పైప్‌లైన్ పనులు వేగవంతం చేయండి అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం ఎ.కొండూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Apr 2026 6:10 pm

డిజిటల్ జనగణన పై అవగాహన కార్యక్రమం

డిజిటల్ జనగణన పై అవగాహన కార్యక్రమం ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : డిజిటల్ జనగణన

ప్రభ న్యూస్ 22 Apr 2026 6:07 pm

ప్రతిభకు వేదికగాశాప్ లీగ్స్ ..

ప్రతిభకు వేదికగాశాప్ లీగ్స్ .. అన్ని ప్రాంతాలలో సమ్మర్ క్యాంపులుజిల్లావారీ ప్రత్యేక కమిటీలు

ప్రభ న్యూస్ 22 Apr 2026 6:03 pm

4వ తరగతి పార్ట్ టైం వర్కర్ల వేతనాలు పెంచాలి

4వ తరగతి పార్ట్ టైం వర్కర్ల వేతనాలు పెంచాలి పీఓపీ విన్నవించిన సంఘ

ప్రభ న్యూస్ 22 Apr 2026 6:02 pm

‘కొరియన్ కనకరాజు’లేటెస్ట్ అప్డేట్ — స్పెషల్ కామెడీ ఎపిసోడ్ సిద్ధం!

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ పై తాజా అప్డేట్ వెలువడింది. యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక స్పెషల్ కామెడీ ఎపిసోడ్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలవనుందట. మేర్లపాక గాంధీ సిగ్నేచర్ మేకింగ్ స్టైల్‌లో రూపొందనున్న ఈ సీక్వెన్స్ ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తుందని చిత్ర యూనిట్ చెప్తోంది. కొరియన్ […] The post ‘కొరియన్ కనకరాజు’ లేటెస్ట్ అప్డేట్ — స్పెషల్ కామెడీ ఎపిసోడ్ సిద్ధం! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 22 Apr 2026 6:00 pm

ప్రభుత్వం ఏకకాలంలో రైతు భరోసా ఇవ్వాలి

ప్రభుత్వం ఏకకాలంలో రైతు భరోసా ఇవ్వాలి ఉట్నూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు

ప్రభ న్యూస్ 22 Apr 2026 6:00 pm

RTC Strike : కార్మికులందరూ స్వచ్ఛందంగానే సమ్మెలో

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు

తెలుగు పోస్ట్ 22 Apr 2026 5:54 pm

మోటరోలా ఎడ్జ్ 70 ప్రో వచ్చేసింది!..ధర, ఫీచర్లు ఇలా..!

మోటరోలా భారత టెక్ మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. కంపెనీ దీని మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో పేరిట తీసుకొచ్చింది. ఎడ్జ్ సిరీస్‌లోని ఈ సరికొత్త ఫోన్ మూడు రంగుల ఎంపికలలో లభించనుంది. ఇందులో 6.8-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, బిగ్ 6500mAh బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ధర, లభ్యత భారత టెక్ మార్కెట్లో ఈ సరికొత్త ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999. కాగా, 12GB + 256GB వేరియంట్ ధర రూ.41,999గా ఉంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లతో చేసే చెల్లింపులపై రూ.2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్‌లు పాంటోన్  టీ, పాంటోన్ లిల్లీ వైట్, పాంటోన్ టైటాన్ రంగులలో లభిస్తాయి. ఏప్రిల్ 29, 2026న కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.  ఈ స్మార్ట్ ఫోన్లతో పోటీ? పోటీ పరంగా, మోటరోలా ఎడ్జ్ 70 ప్రో స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 13R 5G, షియోమి 14 సివి, శాంసంగ్ గెలాక్సీ A55 5G, వన్‌ప్లస్ నార్డ్ 5 5G, ఒప్పో రెనో10 ప్రో 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ఫీచర్లు  ఈ ఫోన్‌లో 6.8-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K రిజల్యూషన్ మరియు 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. మోటరోలా కంపెనీ ఈ తాజా ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌ను ఉపయోగించింది. IP68, IP69 రేటింగ్‌లతో వచ్చే ఈ హ్యాండ్‌సెట్‌కు 3 సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయి. ఇక కెమెరా విషయానికి వస్తే..ఈ ఫోన్‌లో వెనుకవైపు 50-మెగాపిక్సెల్ OIS ప్రైమరీ కెమెరా సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్/మాక్రో కెమెరా, అలాగే సెల్ఫీ వీడియో కాల్స్ కోసం ముందువైపు 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ పరంగా ఇందులో 90W టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన శక్తివంతమైన 6500 mAh బ్యాటరీ అందించారు.

మన తెలంగాణ 22 Apr 2026 5:52 pm

Chandrababu : మెడికల్ కళాశాలల నెలరోజుల్లో పనులు పూర్తి కావాల్సిందే

రాష్ట్రంలో మెడికల్ కళాశాలల పనులు నెలరోజుల్లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు

తెలుగు పోస్ట్ 22 Apr 2026 5:45 pm