బుధవారం రాశి ఫలాలు (08-04-2026)
మేషం స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. వృషభం చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. మిధునం ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. కర్కాటకం వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సింహం నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు నుండి బయట పడతారు. తుల నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో అధికారూలతో జాగ్రత్తగా వ్యవహారించాలి. వృశ్చికం ఆదాయ మార్గలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనస్సు సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. మకరం ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కుంభం నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. మీనం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులుతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.
ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసిన వ్యోమగాములు తిరిగి భూమి వైపు తమ ప్రయాణం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే చంద్రుని అవతలి వైపు నుంచి వ్యోమగాములు తీసిన భూమి ఫోటోను నాసా విడుదల చేసింది. తిరుగు ప్రయాణంలో మిషన్ కమాండర్ రీడ్ వైస్మాన్ ఈ ఫోటో తీసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్ సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. “ జాబిల్లి అవతలి వైపు నుంచి తీసిన మొదటి భూమి ఫోటో ఇది ” అని పేర్కొంది. ఈ యాత్రలో భాగస్వాములైన ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడా వాసి, చందమామపై కాలు పెట్టకుండా సుదూరం నుంచే జాబిల్లిని చుట్టి వస్తుండడం విశేషం. ఈ వ్యోమగాములు సూర్యగ్రహణాన్ని వీక్షించారు. చంద్రుడికి అతి సమీపం నుంచి సూర్యగ్రహణాన్ని వీక్షించడం చరిత్రలో ఇదే మొదటిసారి. అలాగే చంద్రుడి భ్రమణ సమయంలో అనూహ్యమైన సూర్యాస్తమయాన్ని వీక్షించారు. అంతరిక్షంలో ఉన్న అన్ని గ్రహాలను ఫోటో తీశారు. భూమి, మెర్యూరీ, వీనస్,మార్స్, శని గ్రహాల ఫోటో తీశారు. అనేక శాస్త్రీయ పరిశోధనలు చేపట్టారు. సుమారు ఏడు గంటల పాటు చంద్రుడి ఉపరితలాన్ని వ్యోమగాములు పరిశీలించ గలిగారు. కొత్తగా రెండు అగాధాలను గుర్తించారు. వాటికి గతంలో వెళ్లిన స్పేస్క్రాఫ్ట్ ఇంటిగ్రిటీ పేరును ఒకదానికి, కారల్ అని మరో దానికి పేరు పెట్టారు. కమాండర్ రీడ్వైజ్మాన్ భార్య కారల్ ఇటీవల క్యాన్సర్తో మృతి చెందింది. అందుకే ఆమె పేరు పెట్టారు. వీరు 10న భూమిపై ల్యాండ్ అవుతారు.
40 Dead Iran Us Israel War : అడ్వాన్స్ వార్ Andhra prabha News
40 Dead Iran Us Israel War : అడ్వాన్స్ వార్ Andhra
దేశ భక్తి, పౌరుల బాధ్యత, విలువల గురించి కళ్ళకు కట్టినట్లు చక్కగా చూపించిన “ధురంధర్-2” సినిమాను దేశంలోని ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. ధురంధర్- సినిమాను మంగళవారం రాంచందర్ రావు తన పార్టీ కార్యవర్గంతో పాటు ముఖ్య నాయకులు, మీడియా ప్రతినిధులతో కలిసి చూశా రు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్ సౌజన్యంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓడియన్ మల్టీప్లెక్స్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనకు పార్టీ నాయకు లు గౌతం రావు, చంద్రశేఖర్, ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, మాజీ మేయర్ కార్తీక రెడ్డి, మీడియా సె ల్ డాక్టర్ స్వాతి తదితరులు హాజరయ్యారు. చిత్ర ప్రదర్శ న అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడు తూ మన దేశాన్ని రక్షించడంలో సరిహద్దుల్లో పోరాడే సై నికులే కాకుండా, గూఢచారులు కూడా ఎంతటి త్యాగా లు చేస్తారో ఈ సినిమాలోని అనేక సన్నివేశాలు స్పష్టంగా ప్రతిబింబించించాయని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో భారత గూఢచారులు దేశ సమగ్రత, భద్రత కోసం పనిచేస్తూ, శతృ దేశాల కుట్రలను వెలికి తీసే విధంగా సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా దేశభక్తి మాత్రమే కాదు, దేశ రక్షణపై బాధ్యతను కూడా పెంపొందిస్తుందన్నారు. ప్రత్యేకంగా, ఈ చిత్రంలో డీ-మానిటైజేషన్ (నోట్ల రద్దు) వెనుక ఉన్న కారణాలను స్పష్టంగా వివరించడమే కాకుండా, అ ప్పటి నిర్ణయం ఎంత సరైనదో మళ్లీ నిరూపించిందని ఆ యన చెప్పారు. పాకిస్తాన్ నుంచి భారీ స్థాయిలో నకిలీ నో ట్లను పంపించి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయాలనే కుట్రలను, అలాగే చిన్న పిల్లలను దుర్వినియోగం చేస్తూ దేశంలో అశాంతిని సృష్టించాలనే ప్రయత్నాలను ఈ సిని మా బలంగా ప్రతిబింబించిందని ఆయన తెలిపారు.
లిబియా తీరంలో పడవ మునిగి 80 మందికి పైగా గల్లంతు
లిబియా తీర ప్రాంతం నుంచి బయలుదేరిన ఓ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోవడంతో 80 మందికిపైగా వలసదారులు గల్లంతైనట్లు ఐక్యరాజ్య సమితి వలస సంస్థ (ఐఓఎం) మంగళవారం తెలిపింది. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉత్తర పశ్చిమ లిబియాలోని తజౌరా పట్టణం నుంచి సుమారు 120 మంది ప్రయాణికులతో ఈ పడవ బయలుదేరింది. వాతావరణ పరిస్థితులు బాలేకపోవడంతో పడవలోకి నీరు చేరడంతో అది మునిగిపోయినట్లు ఐఓఎం పేర్కొంది. సంఘటన అనంతరం ఒక వాణిజ్య నౌక, టగ్బోట్ కలిసి 32 మందిని రక్షించగా, ఇటలీ తీర రక్షక దళం వారిని దక్షిణ ఇటలీలోని లాంపెడూసా దీవికి తరలించింది. లిబియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి యుద్ధం, పేదరికం నుంచి తప్పించుకునే వలసదారులకు ప్రధాన మార్గంగా మారింది. ఈ ఘటనకు వారం రోజుల ముందే, లాంపెడూసా సమీపంలో మరో పడవను వెలికి తీసింది ఇటలీ తీరరక్షక దళం. ఈ ఘటనలో 58 మందిని రక్షించింది. ఈ ప్రమాదంలో19 మంది చనిపోయారు. మధ్యధరా సముద్రం ద్వారా ఉత్తర ఆఫ్రికా నుంచి యూరప్కు చేరే ప్రయత్నంలో లాంపెడూసా దీవి ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉంది. ఈ ప్రమాదకర ప్రయాణంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, ముఖ్యంగా ట్యునీషియా, లిబియా తీరాల నుంచి బయలుదేరే చిన్న పడవలే ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఎన్నికల కేసులు కొట్టేయాలని హైకోర్టులో సిఎం పిటిషన్
ఉప ఎన్నిక సందర్భంగా తనపై నమోదయిన కేసులు కొట్టేయాలని కోరుతూ సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని నేరేడు చర్ల, మఠంపల్లి, పాలకీడు, హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇవి ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతున్నాయి. ఈ క్రమంలో తనపై నమోదయిన కేసులు కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ఫిర్యాదు చేసిన ఎన్నికల అధికారులకు, కేసు నమోదు చేసిన పోలీసులకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణను ఈ నెల 21వ తేదీన చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
బాంబు దాడికి ఇద్దరు చిన్నారులు మృతి
మణిపూర్ లోని బిష్ణుపూర్ జిల్లాలో మంగళవారం బాంబు దాడికి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, ఆ పిల్లల తల్లి గాయపడింది. మోయిరాంగ్ ట్రోంగ్లావోబి ప్రాంతం లోని ఒక ఇంటిపై అనుమానిత ఉగ్రవాదులు బాంబులు విసరడంతో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల బాలిక మరణించారని సీనియర్ అధికారి తెలిపారు.అర్ధరాత్రి దాటాక ఒంటి గంట ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి ఖేమ్చంద్ ఈ దాడి అనాగరిక చర్య అని, దీనికి పాల్పడిన నేరస్థులను గుర్తించి చట్టప్రకారం శిక్షిస్తామని అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ సంఘటనకు స్థానికులు ఉదయం నిరసన చేపట్టి ఆ ప్రాంతం లోని పెట్రోల్ పంప్ సమీపాన గల రెండు ఆయిల్ ట్యాంకర్లకు , ఒక ట్రక్కుకు నిప్పు పెట్టారు. మొయిరాంగ్ పోలీస్ స్టేషన్ ముందు టైర్లను తగులబెట్టి తాత్కాలిక అవుట్ పోస్టును ధ్వంసం చేశారు. ఇంఫాల్ తూర్పు జిల్లా లోని పాంగై, ఖురాయ్లో వాహనాలను అడ్డుకున్నారు. లాంగ్తబాల్లో నడిరోడ్డుపై టైర్లను తగుల బెట్టారు. పరిస్థితిని అదుపు లోకి తేడానికి భద్రతా దళాలు రంగం లోకి దిగాయి. ఇంఫాల్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పిల్లల తల్లిని ముఖ్యమంత్రి ఖేమ్చంద్ పరామర్శించారు.
దాడులను రెట్టింపు చేస్తాం.. ట్రంప్ కు ఇరాన్ కౌంటర్
టెహ్రాన్: డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన అల్టీమేటంకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. తాము ఏమాత్రం వెనుకాడబోమని, దాడులను రెట్టింపు చేస్తామని పేర్కొంది. ట్రంప్ తాజా బెదిరింపుల నేపథ్యంలో అన్ని దౌత్య మార్గాలు, పరోక్ష చర్చలు నిలిపివేశామని కూడా ఇరాన్ తెలిపింది. హార్మూజ్ తరహాలో బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని కూడా మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా ఉగ్రవాద సైన్యం హద్దులు దాటితే, మా ప్రతిస్పందన ఈ ప్రాంతానికి ఆవల ఉంటుంది. మేము పౌరయేతర లక్ష్యాలపై దాడులు ప్రారంభించలేదు, ప్రారంభించబోము. అయితే, పౌర సౌకర్యాలపై జరిగే నీచమైన దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి మేము వెనుకాడబోము అని ఇరాన్ ఉన్నత దళమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి) తెలిపింది.
లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన సిఐ
భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ సిఐ ఎసిబికి చిక్కిన ఉదంతమిది. వివరాల్లోకి వెళితే శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో సిఐ (ఎస్హెచ్ఒ) కనకయ్య లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. స్టేషన్ బెయిల్ కోసం బాధితుడి నుంచి పెద్ద మొత్తంలో సిఐ కనకయ్య లంచం డిమాండ్ చేశారు. దీంతో అవాక్కయిన బాధితుడు ఈ విషయమై ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నందుకున్న ఎసిబి అధికారులు రంగంలోకి దిగారు. స్టేషన్ బెయిల్ కోసం రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా కనకయ్యను రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు అధికారులు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చారు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా పోలీస్ స్టేషన్లోనే కనకయ్యను అధికారులు పట్టుకున్నారు. స్టేషన్లో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన ఎసిబి అధికారులను గమనించిన కనకయ్య అక్కడి నుంచి పరుగులు పెట్టినట్లు సమాచారం. ఎట్టకేలకు అతనిని అదుపు లోకి తీసు కున్న అధికారులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Naga Vamsi’s Big Satire on Supriya
Young producer Naga Vamsi is known for his aggressive speeches. He is very outspoken and is known for spilling out facts. During the pre-release event of Adivi Sesh’s Dacoit, Naga Vamsi took a big dig against Supriya Yarlagadda, the producer of Dacoit. He also had a big satire against her. “Supriya garu is known for […] The post Naga Vamsi’s Big Satire on Supriya appeared first on Telugu360 .
ఇరాన్లోని భారతీయులకు హెచ్చరిక
ఇరాన్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత్ ప్రభుత్వం సూచించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి సమయం దగ్గరపడుతున్న వేళ, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం సాయంత్రం అత్యవసర సూచనలు జారీ చేసింది. భారతీయులు వచ్చే 48 గంటలు తమ ప్రస్తుత ప్రదేశాల్లోనే ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని సూచించింది. బహుళ అంతస్తుల భవనాల్లో ఉండకూడదని కూడా సూచనలు చేశారు. వైమానిక దాడులను దృష్టిలో ఉంచుకుని ఈ జాగ్రత్తలు తీసుకోవాలని రాయబార కార్యాలయం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఇంట్లోనే ఉండాలని, ముఖ్యంగా హైవే మార్గాల్లో ప్రయాణాలు చేయాల్సివస్తే రాయబార కార్యాలయం మార్గదర్శకత్వంలోనే చేయాలని సూచించారు.రాయబార కార్యాలయం ఏర్పాటుచేసిన హోటళ్లలో ఉన్న భారతీయులు తప్పనిసరిగా గదుల్లోనే ఉండాలని, అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని పేర్కొంది. పరిస్థితులపై అధికారిక సమాచారాన్ని నిరంతరం గమనించాలని, అత్యవసర సహాయం కోసం ఇచ్చిన ఫోన్ నంబర్లు (989128109115, 989128109102, 989128109109, 989932179359) పనిచేస్తున్నాయని వెల్లడించింది. అవసరమైతే ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చని సూచించింది. ట్రంప్ బెదిరింపులు ఇదిలా ఉండగా ట్రంప్ ఇరాన్పై తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ రాత్రి ఇరాన్ నాగరికత అంతరించిపోతుంది అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే తుది నిర్ణయం పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని, అవసరమైతే చివరి క్షణంలో దాడిని నిలిపివేయవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ సంక్షోభాన్ని ప్రపంచ చరిత్రలో అత్యంత కీలక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. హార్మూజ్ జలసంధిపై తుది హెచ్చరిక హార్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలే ఈ పరిణామాలకు కారణమవుతున్నాయి. ఈ కీలక సముద్ర మార్గాన్ని ఇరాన్ తెరవకపోతే తీవ్ర దాడులు చేస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. మొదట 48 గంటల గడువు ఇచ్చినా, తరువాత దానిని పలుమార్లు పొడిగించి మొత్తం 408 గంటలకు చేర్చారు. గడువులు మారుతున్న నేపథ్యంలో అమెరికా చర్యలపై అనిశ్చితి కొనసాగుతుండగా, పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన పెరుగుతోంది.
పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి: మహేష్కుమార్ గౌడ్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోసం కాంగ్రెస్ పోరాటాలు చేస్తుందని, విభజన హామీలను అమలుచేయాలని కొట్లాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం రోజు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో సంఘటన్ సోచన్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సాగు, తాగునీటికి పెద్దపీట వేస్తూ ఏర్పాటు చేసిన ప్రాజెక్టు అని, ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని మోదీ సర్కార్కు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. రైతుల మేలు చేకూర్చే ప్రయోజనాలు అంటే బీజేపీ పట్టవన్నారు. అదానీ, అంబానీలకు తప్ప బీజేపీకి పేద ప్రజలకు న్యాయం చేయడం తెలియదన్నారు. కుల సర్వేతోనే సీఎం రేవంత్ బీసీలకు రిజర్వేషన్ల ఆవశ్యకతను గుర్తించారని, అందులో భాగంగానే 52 శాతం మున్సిపాలిటీలలో బీసీలకు సీట్లు కేటాయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అన్నివర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించడమే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. రెండేండ్లలో 70 వేల ఉద్యోగాల కల్పన, ఉచిత రవాణా, సన్న బియ్యం వంటి పథకాలను కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు గోదావరిలో పోసిందన్నారు. 2028-29 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. బావాబామ్మర్దులు సీఎం కావాలని పోటీపడుతున్నారని, కేసీఆర్ కుటుంబానికి డబ్బుల పంపకాల కొట్లాటలే సరిపోయాన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో క్రూడాయిల్ ధర 153 డాలర్లు ఉంటే పెట్రోల్ రూ.60కి మించలేదన్నారు. ప్రస్తుతం మార్కెట్లో 45 డాలర్లకు క్రూడాయిల్ దొరుకుతున్నా పెట్రోల్ మాత్రం రూ.110కి చేరిందని విమర్శించారు. 2014లో జూటా మాటలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అందుకే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేవిధంగా, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్షంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ కూచకుల్లా రాజేష్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు వంశీచందర్ రెడ్డిలు ప్రసంగించగా, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మీనాక్షి నటరాజన్, ఇందిరా శర్మన్, కేతూరి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, జడ్పీ, మాజీ వైస్చైర్మన్ ఠాకూర్ బాలాజీసింగ్ లతోపాటు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఎయిర్ ఇండియా విమాన ఛార్జీల పెంపు
ప్రపంచ మార్కెట్లో విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమాన కంపెనీలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. తాజాగా టాటాకు చెందిన విమాన సంస్థ ఎయిర్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ విమాన చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుండి ఈ కొత్త చార్జీలు అమలులోకి వస్తాయి. దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారు దూరం ప్రకారంగా రూ.299 నుండి రూ.899 వరకు అదనపు ఇంధన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఈ భారం మరింత ఎక్కువగా ఉంది. అమెరికా, కెనడా వంటి సుదూర దేశాలకు వెళ్లే వారు సుమారు 280 డాలర్లు అంటే రూ.23,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విమాన నిర్వహణ ఖర్చులో ఇంధనమే 40 శాతం వరకు ఉంటుందని, అందుకే ఈ పెంపు తప్పలేదని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్ ఇండియా సీఈఓ రాజీనామా ఎయిర్ ఇండియా సిఇఒ క్యాంప్బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఈ ఏడాది సెప్టెంబర్లో బాధ్యతల నుండి వైదొలగనున్నారు. గత వారం జరిగిన బోర్డు సమావేశంలో ఆయన రాజీనామాను ఆమోదించారు. విల్సన్ 2022లో బాధ్యతలు చేపట్టారు, అయితే ఆయన ఒప్పందం 2027 వరకు ఉంది. సంస్థ ప్రస్తుతం రూ.20,000 కోట్ల నష్టాల్లో ఉండటం, గత ఏడాది జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటి సవాళ్ల మధ్య ఈ మార్పు చోటుచేసుకుంది. కొత్త సిఇఒ కోసం అన్వేషణ ఇప్పటికే ప్రారంభమైంది.
పినరాయి విజయన్ హయాం ముగిసింది: సిఎం రేవంత్
కేరళ: పినరాయి విజయన్ వైదొలిగే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కోవలం యూడీఎఫ్ ఎన్నికల ప్రచారంలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థ విజయం సాధించిందని.. దానిని అభినందిస్తున్నామని అన్నారు. కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీలది అని చెప్పారు. ఎక్కడైనా మంచి జరిగితే తాము అభినందిస్తామన్నారు. పినరాయి విజయన్ హయాం ముగిసిందని..120 నెలల విజయన్ పాలన కాలం వైఫల్యానికి ప్రతీకగా నిలిచిందని సిఎం రేవంత్ విమర్శించారు. మూడింట రెండొంతుల మెజారిటీతో మేం గెలవబోతున్నాం.. ఊమెన్చాందీ తరహా పాలన అందిస్తాం. కేరళంలో సరైన అవకాశాలు లేకపోవడంతో యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారు. యువత వలస వెళ్లడంతో కేరళంలో వృద్ధులు... చిన్నపిల్లలే కనిపిస్తున్నారు.ఇది దురదృష్టకరం. పినరాయి విజయన్తో పాటు కేరళం కమ్యూనిస్టు మహిళా నాయకులను నేను తెలంగాణకు ఆహ్వానిస్తున్నా.. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు మేం చేస్తాం. తెలంగాణలోని ఏ మూలకైనా వెళ్లి మేం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారు పరిశీలించవచ్చు... ఈ విషయంలో నేను విజయన్కు సవాల్ విసురుతున్నా. మేం 67 వేల ఉద్యోగాలు ఇచ్చాం... 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ. 20,670 కోట్ల రుణమాఫీ చేశాం. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం.. 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నాం. మేం హామీలన్నీ అమలు చేస్తున్నాం... విజయన్ తెలంగాణకు వచ్చి అన్నీ పరిశీలించుకోవచ్చు. ఎన్నికలు కేరళం.. తెలంగాణ మధ్య కాదు యూడీఎఫ్.. ఎల్డీఎఫ్ మధ్య జరుగుతున్నాయి. మేం ఏం చేస్తున్నామో అది చెబుతున్నాం.. మా సవాళ్లకు విజయన్ సమాధానం ఇవ్వాలి అని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
Iran Rejects : రెడ్ లైన్ దాటొద్దు Andhra Prabha News
Iran Rejects : రెడ్ లైన్ దాటొద్దు Andhra Prabha News (
Iran Rejects : హోర్ముజ తెరవం Andhra Prabha News
Iran Rejects : హోర్ముజ తెరవం Andhra Prabha News ( ఆంధ్రప్రభ,
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు.. భారత పౌరులకు కీలక సూచనలు
టెహ్రాన్: ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో పశ్చిమ ఆసియాలో ఘర్షణ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం.. భారత పౌరులకు కీలక సూచనలు చేసింది. భారతీయులు రాబోయే 48 గంటల పాటు ఇళ్లలోనే ఉండాలని తెలిపింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు, బహుళ అంతస్తుల భవనాల పై అంతస్తులకు దూరంగా ఉండాలని రాయబార కార్యాలయం పౌరులను హెచ్చరించింది. గతంలో ఇచ్చిన సలహాలకు కొనసాగింపుగా, ఇప్పటికీ ఇరాన్లో ఉన్న భారత పౌరులు రాబోయే 48 గంటల పాటు వారు ఉన్నచోటనే ఉండాలి. అన్ని విద్యుత్, సైనిక స్థావరాలు, బహుళ అంతస్తుల భవనాల పై అంతస్తులకు దూరంగా ఉంటూ, ఇళ్లలోనే ఉండాలి. రహదారులపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలి అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన వసతి గృహాలలో ఉంటున్న భారతీయులు తమ గదులను విడిచి వెళ్లవద్దని, ఆ హోటళ్లలో ఉన్న రాయబార కార్యాలయ బృందాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు. భారత పౌరులందరూ అధికారిక ప్రకటనలను నిశితంగా గమనించాలని.. సూచనలను ఆలస్యం చేయకుండా పాటించాలని కూడా రాయబార కార్యాలయం చెప్పింది.
తమిళనాడు స్టార్ క్యాంపెయినర్ గా సిఎం రేవంత్ రెడ్డి
తమిళనాడు రాష్ట్ర ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెనియర్లుగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ మంగళవారం నలభై మందితో జాబితాను విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేరళ రాష్ట్రానికి ఎన్నికల స్టార్ క్యాంపెనియర్గా నియమించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రచారం వల్ల పార్టీకి మేలు జరిగిందని అధిష్టానం విశ్వసిస్తున్నది. కేరళలో కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, తాము చేపట్టిన పథకాలను తెలుసుకోవడానికి తమ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా రేవంత్ రెడ్డి కేరళ ప్రచారంలో ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి తమిళనాడులో కూడా ప్రచారం చేయిస్తే పార్టీకి మరింత మేలు జరుగుతుందని, తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని పార్టీ నాయకత్వం భావించి స్టార్ క్యాంపెనియర్గా నియమించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కూడా తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీనియర్ అబ్జర్వర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు రాష్ట్రానికి ఈ నెల 23న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకెతో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
అల్-ఫలాహ్ ఛైర్మన్ రూ. 39 కోట్ల ఆస్తుల జప్తు
అల్-ఫలాహ్ గ్రూప్ ఛైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దిఖీ, ఆయనకు చెందిన చారిటబుల్ ట్రస్ట్పై కొనసాగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా రూ. 39 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం వెల్లడించింది. ఢిల్లీ జామియా నగర్ (ఒఖ్లా)లోని నివాస గృహం, ఫరీదాబాద్లోని వ్యవసాయ భూమి, అలాగే పలు బ్యాంక్ డిపాజిట్లు ఈ జప్తులో భాగమని ఈడీ తెలిపింది. హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న అల్-ఫలాహ్ యూనివర్సిటీపై 2025 నవంబర్ 10న రెడ్ ఫోర్ట్ పరిసరాల్లో జరిగిన పేలుడుకు సంబంధించిన ‘వైట్ కాలర్’ ఉగ్రవాద మాడ్యూల్ దర్యాప్తు సమయంలో విచారణ సంస్థల దృష్టి పడింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. ఈ కేసులో భాగంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేసి ఆస్తులను ఫ్రీజ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. జప్తు చేసిన ఆస్తుల్లో సిద్దిఖీకి చెందిన జామియా నగర్ నివాస గృహం, ఫరీదాబాద్లోని ఢౌజ్ గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమి (అల్-ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో), డీమ్యాట్ హోల్డింగ్స్, బ్యాంక్ బ్యాలెన్సులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అల్-ఫలాహ్ చారిటబుల్ ట్రస్టుకు చెందిన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ. 39.45 కోట్లుగా ఈడీ వెల్లడించింది. 61 ఏళ్ల సిద్దిఖీ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయనను మొదటగా 2025 నవంబరులో విద్యాసంస్థల గుర్తింపు, అంగీకారం విషయంలో విద్యార్థులను మోసం చేసిన కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం గత నెలలో ఢిల్లీలో రూ. 45 కోట్ల విలువైన భూమిని మోసపూరితంగా స్వాధీనం చేసుకున్న కేసులో మరోసారి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో న్యాయ పరిరక్షణలో ఉన్నారు. తాజా ఆస్తుల జప్తు మొదటి మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా చేపట్టిన చర్యగా ఈడీ తెలిపింది.
సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ… కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి
ఏ షరతులు లేకుండా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలి
ఏ షరతులు లేకుండా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలి -సిపిఎం మండల కార్యదర్శి మునిగెల
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది : హరీష్రావు
రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు మండిపడ్డారు. నాడు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం అన్నారని, నేడు ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు..ఇప్పుడు రైతులను కలవకుండా నిర్బంధాలు పెడుతున్నారని అన్నారు. మంగళవారం బిఆర్ఎస్ నేతలతో పరిగి ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న హరీష్రావును అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. వారిని శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బిఆర్ఎస్ కార్యకర్తలు పోలీసు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు అదనపు బలగాలను తరలించారు. మధ్యాహ్నం హరీష్రావుతో పాటు అరెస్టు చేసిన బిఆర్ఎస్ నేతలను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్రావు మీడియాతో మాట్లాడుతూ, రైతులను కలిసేందుకు వెళ్తుంటే అరెస్టులు చేయడం దౌర్జన్యం అంటూ ధ్వజమెత్తారు. ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బందాల పాలన అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. రెండు మూడు పంటలు పండే భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమని అన్నారు. భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదు అని తేల్చిచెప్పారు. రైతులకు ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే తమ గొంతు నొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి పాలన అంతా బోగస్ మాటలు, బోగస్ గ్యారెంటీలు అని ఘాటు విమర్శలు చేశారు.
ఫుడ్ సేఫ్టీ బృందానికి ఉత్తమ సేవా పురస్కారం…
ఫుడ్ సేఫ్టీ బృందానికి ఉత్తమ సేవా పురస్కారం… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :
ఖర్గ్ దీవిపై అమెరికా మళ్లీ దాడులు
ఇరాన్కు అత్యంత కీలకమైన చమురు కేంద్రంగా భావించే ఖర్గ్ దీవిపై అమెరికా మళ్లీ దాడులు జరిపింది. రహదారులతో పాటు ఓ రైల్వే వంతెనను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. వైట్ హౌస్కు చెందిన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి అనధికారికంగా ఈ సమాచారం వెల్లడించారు ఇరాన్ కూడా దీనిని ధ్రువీకరించింది. మంగళవారం అమెరికా దళాలు దీవిలోని కనీసం 50 సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయని చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు విధించిన గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు ఈ దాడులు జరగడం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఖర్గ్ దీవి ఆర్థిక ఆయువుపట్టు. ఇక్కడి నుంచే చమురు ఎగుమతులను ఇరాన్ 90 శాతం నిర్వహిస్తుంటుంది. ఇరాన్ తమ డిమాండ్లను అంగీకరించకపోతే భారీ దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఖర్గ్ దీవిలోని కీలక చమురు మౌలిక వసతులను స్వాధీనం చేసుకోవడానికి భూసేనలను వినియోగించే అవకాశాన్ని కూడా ట్రంప్ సూచించినప్పటికీ, అలాంటి చర్య అమెరికా సైనికుల ప్రాణనష్టానికి దారితీస్తుందని, యుద్ధానికి తుది పరిష్కారం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ దీవిపై అమెరికా పలు దాడులు జరిపినట్లు శాటిలైట్ విశ్లేషణలు వెల్లడించాయి. వీటిలో గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, విమానాశ్రయం, హోవర్క్రాఫ్ట్ స్థావరాలు లక్ష్యాలుగా ఉన్నాయని ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్’, ‘అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్’కు చెందిన క్రిటికల్ థ్రెట్స్ ప్రాజెక్ట్ పేర్కొంది. ఇదే సమయంలో మంగళవారం ఉదయం ఖర్గ్ దీవిలో పలు పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అర్థ ప్రభుత్వ వార్తా సంస్థ మెహర్ నివేదించింది. మరోవైపు, టెహ్రాన్కు వాయువ్యంగా ఉన్న అల్బోర్జ్ ప్రావిన్స్పై జరిగిన వైమానిక దాడిలో కనీసం 18 మంది మరణించగా, మరో 24 మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ దాడి లక్ష్యం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు. టెహ్రాన్ నగరంలో కూడా పర్వత ప్రాంతాల్లోని ఆయుధ గిడ్డంగులు, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వైమానిక దాడులు జరిగినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఇరాన్పై దాడులను కొనసాగిస్తోంది. షిరాజ్లోని పెట్రోకెమికల్ కేంద్రాన్ని వరుసగా రెండో రోజూ లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అలాగే ఇరాన్ ప్రజలు రైల్వే మార్గాలను దూరంగా ఉంచాలని ఫార్సీ భాషలో హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం రైల్వే వంతెనలు, స్టేషన్లు, హైవే వంతెనలపై దాడులు జరిగినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ఖొర్రమాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా మరో దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడులకు అమెరికా లేదా ఇజ్రాయెల్ బాధ్యత వహించలేదు. మరోవైపు, మంగళవారం ఉదయం టెహ్రాన్ నుంచి సౌదీ అరేబియాపై ఏడు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించగా, వాటికి అడ్డుకట్ట వేసినప్పటికీ ఇంధన కేంద్రాల సమీపంలో అవశేషాలు పడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో సౌదీ అరేబియా బహ్రెయిన్తో కలిపే కింగ్ ఫహద్ కాజ్ దారిని తాత్కాలికంగా మూసివేసింది. ఇరాన్ ఇజ్రాయెల్పైన క్షిపణి దాడులు జరిపినట్లు, టెల్ అవీవ్, ఎయిలాట్ ప్రాంతాల్లో హెచ్చరికలు వినిపించినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో 1,900 మందికిపైగా మరణించగా, లెబనాన్లో ఇజ్రాయెల్హిజ్బుల్లా ఘర్షణల్లో 1,400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ సైన్యంలో 11 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. పరిస్థితి రోజురోజుకూ విషమంగా మారుతూ ఉండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా చూడండి…
గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా చూడండి… ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామాల్లో వేసవి కాలంలో
బీఆర్ఎస్ పార్టీ నాయకుడి మృతి విచారకరం…
బీఆర్ఎస్ పార్టీ నాయకుడి మృతి విచారకరం… మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్
పెద్దపోర్లకు బస్సు సౌకర్యం కల్పించాలని డిఎంకు వినతి….
పెద్దపోర్లకు బస్సు సౌకర్యం కల్పించాలని డిఎంకు వినతి…. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట
విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి…
విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి… ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు విద్యార్థి దశ
ఎసిబి వలలో అగ్రికల్చరల్ యూనివర్సిటీ డిన్
సీడ్ వ్యాపారికి ఫేవర్ చేసేందుకు లంచం తీసుకుంటుండగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిన్ను ఎసిబి అధికారులు మంగళవారం రెడ్హ్యాడెడ్గా పట్టుకున్నారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం. గోవర్దన్ అగ్రోనమి కాలేజీ ఆఫ్ అగ్రికల్చర్కు డీన్గా పనిచేస్తున్నాడు. సీడ్ వ్యాపారం చేసే వ్యక్తి వ్యవసాయ శాఖ నుంచి సీడ్ లైసెన్స్ తీసుకునేందుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందుగానే డీన్ గోవర్దన్ను కలిశాడు, లంచడం డిమాండ్ చేయడంతో గతంలో రూ.25,000 ఇచ్చాడు. అయినా కూడా మరో లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు డీన్ గోవర్దన్కు లక్ష రూపాయలు ఇస్తుండగా అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టు హాజరుపర్చారు. కోర్టు ప్రొఫెసర్కు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు.
Trump Final Warning : ఇదే ఆఖరి రాత్రి Andhra Prabha Bews
Trump Final Warning : ఇదే ఆఖరి రాత్రి Andhra Prabha Bews
One more Postponement for Akhil’s Lenin
The team of Ram Charan’s Peddi will announce that the film will not hit the screens as per the plan on April 30th. The film is expected to have a release in the last week of June during the holiday weekend. Akhil Akkineni’s Lenin was initially planned for May 1st release and it was pushed […] The post One more Postponement for Akhil’s Lenin appeared first on Telugu360 .
ఈ రాత్రే ఇరాన్ నాగరికత అంతరించిపోతుంది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మరోసారి ఇరాన్ కు హెచ్చరికలు చేశారు. ఇది ఇరాన్పై ఇప్పటివరకు చేసిన అత్యంత కఠిన హెచ్చరికల్లో ఒకటి. ఈ రోజు ముగిసేలోపు ఇరాన్ నాగరికత పూర్తిగా అంతం అయిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రే ఒక నాగరికత పూర్తిగా అంతరించిపోతుంది, మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు. అది జరగకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. అయితే పరిస్థితులను బట్టి చివరి క్షణంలో దాడిని నిలిపివేసే అవకాశమూ ఉందని చెప్పిన ఆయన, ఈ రాత్రిని ప్రపంచ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అభివర్ణించారు. ఇరాన్లో పూర్తి స్థాయి పాలన మార్పు జరిగి, మరింత వివేకవంతమైన నాయకత్వం వస్తే విశేషమైన మార్పులు సంభవించవచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. 47 సంవత్సరాలుగా కొనసాగుతున్న దోపిడీ, అవినీతి, మరణాల పాలనకు ఇది ముగింపు కావచ్చు. ఇరాన్ ప్రజలకు దేవుని ఆశీస్సులు ఉండాలి అని ఆయన అన్నారు. ఇదే సమయంలో ఇరాన్ హార్మూజ్ జలసంధిని భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం వరకు తిరిగి తెరవకపోతే, దాని ఇంధన మౌలిక సదుపాయాలపై తీవ్రమైన దాడులు జరుగుతాయని ట్రంప్ పునరుద్ఘాటించారు. మొదటగా ఇరాన్కు 48 గంటల గడువు ఇచ్చిన ట్రంప్, ఆ గడువును పలుమార్లు పొడిగించారు. తాజా నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 7ను కొత్త గడువుగా నిర్ణయించారు. మొదటి గడువు ఐదు రోజులు కొనసాగగా, మార్చి చివర్లో మరో 10 రోజులు చేర్చారు. మొత్తం గడువు 48 గంటల నుంచి 408 గంటలకు పెరిగింది. అయితే ఈ గడువులు వరుసగా పొడిగించడం వల్ల అమెరికా స్పందనపై అనిశ్చితి నెలకొంది. హార్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం కావడంతో, దాని మూసివేత అంతర్జాతీయ ఇంధన భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళనలను పెంచింది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి వేగంగా మారుతూ ఉండగా, అమెరికా తదుపరి చర్యలపై ప్రపంచ దృష్టి కేంద్రీకృతమై ఉంది.
ముంబై vs రాజస్థాన్... టాస్ ఆలస్యం
గౌహతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా 13వ లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడబోతున్నాయి. మరికాసేపట్లో గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు ప్రారంభం కానుంది. అయితే, వర్షం పడటంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. స్టేడియం పరిసరాల్లో వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది. ప్రస్తుతం వర్షం నిలిచిపోయినా మైదానం తడిగా ఉంది. దీంతో గ్రౌండ్ సిబ్బంది స్టేడియాన్ని రెడీ చేసే పనిలో ఉన్నారు.
రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు
రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ :
‘మత్తు’ కు బానిసలు కావద్దు…! మాక్లూర్, ఆంధ్రప్రభ : మత్తు పదార్థాలకు బానిసలుగా
Film Postponements: New Stress for Producers
Tollywood producers are investing big money on pan-Indian films and those featuring stars. The film’s release date can be defined by various factors and the shoot has to conclude as per the plan to release a film on time. The OTT platforms are dictating the release date and they are finalizing the theatrical release plan. […] The post Film Postponements: New Stress for Producers appeared first on Telugu360 .
కట్ట మైసమ్మకు ఘనంగా బోనాల సమర్పణ….
కట్ట మైసమ్మకు ఘనంగా బోనాల సమర్పణ…. మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ ప్రిన్సిపల్
షెడ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతి..
షెడ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతి.. జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం
నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు పెండింగ్ కేసు పరిష్కరించాలిసీపీ అంబర్ కిషోర్ ఝా
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆయుబ్ పాషా…
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆయుబ్ పాషా… ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల
ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..!
ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..! నర్సంపేట. ఆంధ్రప్రభ : ప్రజా పాలన
ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
-సీపీఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి: తిరుపతి నగరంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఏఐటీయూసీ మహాసభలు జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్యభ భవన్ లో మంగళవారం సీపీఐ కార్యవర్గ సభ్యులు , ఏఐటియుసి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం చిన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా […] The post ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
చైర్మన్చే సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
చైర్మన్చే సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ జైనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ
ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుంది.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. మంగళవారం గడువులోగా ఒక ఒప్పందానికి రావాలని.. అలా చేయకపోతే.. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. దాన్ని మళ్లీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేము. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అదే జరుగుతుంది. ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఈ రాత్రి అత్యంత కీలకం. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి అంతమవుతాయి అంటూ తన ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్, ఇరాన్ ను తీవ్రంగా హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలు.. ఇప్పుడు పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతను మరింత పెంచాయి.
ఎమ్మెల్యేను సత్కరించిన ఆలయ అర్చకులు
ఎమ్మెల్యేను సత్కరించిన ఆలయ అర్చకులు బాసర( నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : మొదలు
Thalaivar 173 joins Sankranthi 2027 Race
Superstar Rajinikanth is busy completing the shoot of Nelson’s Jailer 2 and the film is aimed for August release this year. The film is high on expectations and is made on a record budget. Rajinikanth will soon kick-start the shoot of Thalaivar 173, one of the most-awaited films. Don fame Cibi Chakaravarthi is the director […] The post Thalaivar 173 joins Sankranthi 2027 Race appeared first on Telugu360 .
సుకేష్ చంద్రశేఖర్ కు బెయిల్ మంజూరు..
న్యూఢిల్లీ: ఏఐఏడీఎంకే 'రెండు ఆకులు' ఎన్నికల గుర్తుకు సంబంధించిన కుంభకోణం ఆరోపణల కేసులో, అనేక మందిని మోసం చేసిన కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద మంగళవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు, సుకేష్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్ లభించినప్పటికీ, చంద్రశేఖర్ జైలులోనే కొనసాగుతారు. వివిధ న్యాయ పరిధులలో అతనిపై 31 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 26 కేసులలో అతనికి బెయిల్ లభించగా, ఐదు కేసులు ఇంకా అతనిపై పెండింగ్లో ఉన్నాయి. కాగా, పార్టీ ఎన్నికల గుర్తు కేటాయింపును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, అలాగే ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ పీఎంఎల్ఏ కేసు నమోదైంది. ఏఐఏడీఎంకే నాయకుడు టీటీవీ దినకరన్కు మధ్యవర్తిగా వ్యవహరించారని, వీకే శశికళ నేతృత్వంలోని వర్గం పార్టీకి రెండు ఆకుల గుర్తును కేటాయించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని చంద్రశేఖర్పై ఆరోపణలు ఉన్నాయి.
Telangana : విస్తరణ అంత సులువా? రేవంత్ రెడ్డికి ఈజీ మాత్రం కాదట
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది
నూతన రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీ…
నూతన రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీ… కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు రూరల్
పరిశ్రమల స్థాపన పనులు వేగవంతం చేయాలి…
పరిశ్రమల స్థాపన పనులు వేగవంతం చేయాలి… కర్నూలు, ఆంధ్రప్రభ : జిల్లాలో ఏర్పాటు
రూ.20 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన
కుబీర్, ఆంధ్రప్రభ : రాజకీయాలకతీతంగా ముధోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన దేయమని
బాల్య వివాహాలు, కౌమార గర్భాల నిరోధానికి ప్రచార రథం…
బాల్య వివాహాలు, కౌమార గర్భాల నిరోధానికి ప్రచార రథం… – జిల్లాలో కళాజాతలతో
నరసరావుపేట ఐలా బజారులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్#Narasaraopet #CricketBetting
Israel - America - Iran War : ఇరాన్ పై వరస వైమానిక దాడులు.. ట్రంప్ డెడ్ లైన్ కు ముందే ఎటాక్
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై మంగళవారం వరుస వైమానిక దాడులు జరిగాయి
ఉప్లూర్లో పశు వైద్య శిభిరం ప్రారంభం…
ఉప్లూర్లో పశు వైద్య శిభిరం ప్రారంభం… కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్
నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది
నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది గోదావరిఖని, ఆంధ్రప్రభ ; నిరుపేద వర్గాలకు
ఎన్ఎస్ఎస్ శిభిరంలో బాగంగా సామాజిక సేవపై దృష్టి సారించాలి
ఎన్ఎస్ఎస్ శిభిరంలో బాగంగా సామాజిక సేవపై దృష్టి సారించాలి ఎస్ఆర్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్
బహదూర్ పేటలో వైద్య శిబిరం ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు
వైసీపీ ఓటమిపై బొత్స హాట్ కామెంట్స్
వైసీపీ ఓటమి పై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు
Andhra Pradesh : ఆరోగ్య శ్రీ సమ్మెకు బ్రేక్
ఆరోగ్య శ్రీ సేవల సమ్మెకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించాయి
మూడు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం ముగిసింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం టీఆర్ఎస్ పార్టీ కుటుంబ
పేదలకు సత్వరమే సీఎంఆర్ఎఫ్… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ను పోలీసులు అరెస్టు చేశారు. సిడ్నీలో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వార్నర్ అరెస్టైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పాల్గొంటున్న వార్నర్.. తన ఫ్రాంచైజీ కరాచీ కింగ్స్ మ్యాచ్ల మధ్య విరామం రావడంతో పీఎస్ఎల్ మధ్యలోనే ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళాడు. ఈ క్రమంలో సిడ్నీలో మద్యం తాగి వాహనం నడిపినట్లు అభియోగాలు మోపబడ్డాయి. సిడ్నీలోని మరూబ్రాలో పోలీసులు బ్రీత్ టెస్ట్ చేస్తుండగా.. టెస్టింగ్ ప్రదేశానికి చేరుకోవడానికి ముందే వార్నర్ తన వాహనాన్ని ఆపి పార్క్ చేశారని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారులు అతని వద్దకు వెళ్లి పరీక్షించగా, బ్రీత్ టెస్ట్లో పాజిటివ్గా తేలింది. దీంతో పోలీసులు వార్నర్ ను అదుపులోకి తీసుకుని మరూబ్రా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
Khammam | పలువురికి గాయాలు.. Khammam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
ఎల్లమ్మ పట్నాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే
ఎల్లమ్మ పట్నాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే జన్నారంరూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
రైతుల కోసం ప్రశ్నిస్తే కేసులా..?భయబ్రాంతులకు గురి చేస్తారా..?
రైతుల కోసం ప్రశ్నిస్తే కేసులా..?భయబ్రాంతులకు గురి చేస్తారా..? స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ :
దేశం కోసం ప్రాణ త్యాగానికై ఇరానీయులు సిద్ధంగా ఉన్నారు:ఇరాన్ అధ్యక్షుడు
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించుకోవడానికి 14 మిలియన్లకు పైగా ఇరానీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాను కూడా దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంతకుముందు, ఇరాన్ క్రీడల ఉప మంత్రి అలీరెజా రహీమీ మాట్లాడుతూ.. అమెరికా జరపబోయే వైమానిక దాడులను అడ్డుకునేందుకు, విద్యుత్ ప్లాంట్ల చుట్టూ మానవ గొలుసులు ఏర్పాటు చేయాలని దేశ క్రీడాకారులకు, కళాకారులకు పిలుపునిచ్చారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇరాన్కు ట్రంప్ అల్టిమేటమ్ విధించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రంప్, ఇరాన్ కు గడువు విధించారు. ఈ లోపు, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించకపోతే.. ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున, ఏకకాలంలో బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ హెచ్చరించారు. కేవంల 4 గంటల సమయంలోనే వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూపు
మద్దూర్, ఆంధ్రప్రభ : పదవిలో ఉన్నప్పుడు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్#DavidWarner #CricketNews #BreakingNews #Sydney
రాష్ట్ర ఉత్తమ అవార్డు అందుకున్న అంబులెన్స్ ఉద్యోగులు
రాష్ట్ర ఉత్తమ అవార్డు అందుకున్న అంబులెన్స్ ఉద్యోగులు జన్నారం రూరల్, ఆంధ్రప్రభ :
తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత…
జూలూరుపాడు, ఆంధ్రప్రభ : కుల వృత్తిదారులు, నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషిస్తే
Finally, Rana Daggubati signs a Film
Tollywood Hunk Rana Daggubati is extremely talented and he is active in various crafts of Indian cinema. He maintains great bond with some of the top digital giants and is collaborating with them. He is active as a producer in the recent years but he hasn’t signed any film as an actorr. A couple of […] The post Finally, Rana Daggubati signs a Film appeared first on Telugu360 .
From the past few months, there are rumors that Bollywood Superstar Shah Rukh Khan will feature in a cameo in Superstar Rajinikanth’s upcoming film Jailer 2. The shoot of the film reached the final stages and SRK had to join the sets. The latest update says that the top Bollywood actor has declined the opportunity […] The post Did SRK walk out of Jailer 2? appeared first on Telugu360 .
ఉన్నత ప్రమాణాలతో దగ్గరవుతున్న ఇగ్నో దూరవిద్య
ఉన్నత ప్రమాణాలతో దగ్గరవుతున్న ఇగ్నో దూరవిద్య ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ మధుమూర్తి
పార్థివా దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం నిండిగొండ గ్రామ ఉప సర్పంచ్ గంగిడి
ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్పై యుఎస్ఎ మెక్విన్ గ్రూప్ సహకారంతో రూపొందించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా దర్శకుడు, -నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ “విడుదలకు ముందే మా సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడటం గర్వకారణం. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి”అని అన్నారు.
Liquor Scam |లిక్కర్ స్కామ్ కేసులో…
Liquor Scam | లిక్కర్ స్కామ్ కేసులో… Liquor Scam | ఆంధ్రప్రభ,
మెడిసిటి (MIMS)లో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
మేడ్చల్, ఆంధ్రప్రభ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడిసిటి ఇన్స్టిట్యూట్ ఆఫ్
గుండె జబ్బులపై అవగాహన… పాయకాపురం, ఆంధ్రప్రభ : నడక ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా
10grams|బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..
10grams| బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : పసిడి ప్రియులకు
స్లీపర్ బస్సులను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాశాం: మండిపల్లి
అమరావతి: బస్సుల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని ఎపి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కర్నూలు, మార్కాపురం, మారేడుమిల్లి ఘటనలకు మానవ తప్పిదమే కారణం అని అన్నారు. బస్సుల్లో ప్రమాదాల నివారణపై మంత్రుల సమీక్ష ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 16 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీ చేస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై నిబంధనలు ఉల్లంఘించే వాటిని సీజ్ చేశామని తెలియజేశారు. 10 రోజుల్లో 10 వేల వాహనాలు తనిఖీ చేశామని, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రైవేట్ ట్రావెల్స్ కు ఆదేశించామని మండిపల్లి పేర్కొన్నారు. త్వరలో బస్సు సీట్లపై టాక్సేషన్ తగ్గించేలా చర్యలు చేపట్టామని, 300 కి.మీ.కు పైగా వెళ్లే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలని సూచించారు. డ్రైవర్ల పర్యవేక్షణకు ఎఐ ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని, స్లీపర్ బస్సులను ఎందుకు బ్యాన్ చేయకూడదనే విషయమై చర్చిస్తున్నామని అన్నారు. స్లీపర్ బస్సులను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాశామని, అవసరమైతే భవిష్యత్తులో స్లీపర్ బస్సులను రద్దు చేస్తామని అన్నారు. జాతీయ, రాష్ట్ర రోడ్లపై స్పీడ్ గన్ ల ఏర్పాటుకు రూ. 40 కోట్లు కేటాయించామని, స్పీడ్ గన్ ల ఏర్పాటు కోసం త్వరలో టెండర్లు పిలుస్తామని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
అమరావతికి చట్టబద్ధత.. ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక అభివృద్ధి,ఆర్థిక స్థిరత్వాలకు స్పష్టత : ప్రత్తిపాటిరాష్ట్ర శాశ్వత
4 Dead 12 Hurt : అర గంట ఆగలే…Andhra Prabha Top News
4 Dead 12 Hurt : అర గంట ఆగలే…Andhra Prabha Top
పశుసంపద రక్షణతో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం…
పశుసంపద రక్షణతో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం… నరసరావుపేట, ఆంధ్రప్రభ : రైతు
రేవంత్ రెడ్డి.. నువ్వు మళ్లీ గెలుస్తా అనేది పగటి కల: హరీస్ రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని.. పరిగిలో అన్యాయానికి గురైన రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకొని, అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, పలువురు బిఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ రావు పరిగి వెళ్తుండగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపటిక్రితం వారిని స్టేషన్ నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని ఫైరయ్యారు. కష్టాల్లో ఉన్న రైతులను పలకరించడానికి కూడా వెళ్లనివ్వడం లేదని.. రాష్ట్రంలో ఎక్కడికక్కడ దళిత, గిరిజన, బలహీనుల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నువ్వు మళ్లీ గెలుస్తా అనేది పగటి కల.. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది రామ రాజ్యం, కెసిఆర్ రాజ్యం అని హరీష్ రావు అన్నారు.
Is Andhra Pradesh Being Pulled Back into Old Faultlines?
Fresh remarks by Dharmana Prasada Rao have once again pushed Andhra Pradesh into a debate it can ill afford. Instead of focusing on development, the narrative is shifting back to regional imbalance and division. The bigger concern is consistency. From opposing Amaravati to promoting the MAVIGUN concept and now raising regional disparities, the messaging lacks […] The post Is Andhra Pradesh Being Pulled Back into Old Faultlines? appeared first on Telugu360 .
ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…
ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రజాహితమే కూటమి
శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలింపు
శంషాబాద్, ఆంధ్రప్రభ : ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించడానికి
అమరావతికి రాజముద్ర.. కేక్ కట్ చేసి సంబరాలుఎంపీ ఆధ్వర్యంలో వేడుకలు విజయవాడ, ఆంధ్రప్రభ

27 C