Iran - Israel War : చర్చలంటూనే...అదనపు సైన్యం తరలింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజూ అదే మాట పునరుద్ఘాటించారు
25marchspecialstory |ఆంధ్రప్రభలో నేటి ప్రత్యేక వ్యాసం
25marchspecialstory | ఆంధ్రప్రభలో నేటి ప్రత్యేక వ్యాసం 25marchspecialstory | తమిళనాడులో ద్రవిడ
Tamilnadu Elections |ముగ్గురూ ముగ్గురే..
Tamilnadu Elections | ముగ్గురూ ముగ్గురే.. Tamilnadu Elections | ఆంధ్రప్రభ వెబ్
గ్రామ దేవతలు ప్రాధాన్యం.. ఉగాది ముందు నుంచి, కొన్ని రోజుల వరకు చాలా
America Vs iran war |ఈరోజు ఆంధ్రప్రభ ఎడిటోరియల్..
America Vs iran war | ఈరోజు ఆంధ్రప్రభ ఎడిటోరియల్.. America Vs
మన తెలంగాణ/హైదరాబాద్: జనాభా ఆధారంగా లోక్సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. యాభై శాతం సీట్లు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం వెనుక కుట్రపూరితమైన దురుద్దేశం ఉందని ఆయన విమర్శించారు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు ఐక్యం గా ఉండాలని, నియోజకవర్గాల పునర్విభజనపై పోరాటానికి సన్నద్ధం కావాలని ఆ యన పిలుపునిచ్చారు. మంగళవారం సా యంత్రం ఢిల్లీలో ఓ టివీ ఛానల్ నిర్వహించిన సమ్మిట్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు ము ఖ్యమంత్రి ఘాటైన సమాధానలిచ్చారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు హయాంలో దక్షిణాది రా ష్ట్రాల పట్ల వివక్ష చాలా స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికే యాభై శాతం సీట్లు పెంచాలని కేంద్రం కుట్ర చే సిందని ఆయన విమర్శించారు. ఒక్క ఉత్తర్ ప్రదేశ్లోనే సీట్లు పెరగనున్నాయని ఉదహరించారు. కాబట్టి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఆయన వివరించారు. కేరళ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేయనున్నారా? అని ప్రశ్నించగా, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా ప్రచారానికి వెళ్లి చెబుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుని, ఇప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పడంలో అర్థం లేదని ఆయన విమర్శించారు. వెంకయ్యను రాష్ట్రపతి చేయలేదు.. కేంద్ర మంత్రివర్గంలో నిర్మలా సీతారామన్ తప్ప ముఖ్యమైన పదవుల్లో దక్షిణాది రాష్ట్రాలకు స్థానం కల్పించలేదని ఆయన విమర్శించారు. కేంద్ర హోం శాఖను దక్షిణాదికి ఎందుకు కేటాయించలేదని ఆయన ఎదురు ప్రశ్నించారు. అంతేకాకుండా ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్న ఎం. వెంకయ్య నాయుడును రాష్ట్రపతి చేయకుండా హైదరాబాద్కు వెనక్కి ఎందుకు పంపించారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభ స్పీకర్, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులు ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. దక్షిణాదిని ఆరవ వేలుగా చూస్తున్నారని, ఈ రాజకీయ వివక్ష బిజెపిలో ఉందని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీ దేశానికి బ్రాండ్.. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి బ్రాండ్ అంబాసిడర్ కావాలే తప్ప కేవలం గుజరాత్కే ఉండరాదన్నారు. గుజరాత్ను ఆదర్శంగా తీసుకుని పాలన చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి కదా? అని ప్రశ్నించగా, ఎక్కడ మంచి నిర్ణయాలు జరిగితే వాటిని ఆచరించడంలో తప్పేమి లేదన్నారు. బ్రిటీషు వాళ్ళు మన దేశానికి స్వాతంత్య్రం అప్పగించి వెళ్ళిపోయినా భూ సేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నామని ఆయన ఉదహరించారు. అదేవిధంగా సబర్మతి రివర్ ఫ్రంట్ పరిశీలనకు తమ రాష్ట్రం నుంచి పలువురు ఎంపీలను, అధికారులను పంపించానని ఆయన చెప్పారు.మూసీ రివర్ ఫ్రంట్ను బిజెపి వ్యతిరేకిస్తున్నదని ఆయన విమర్శించారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబు చెబుతారా? అని ఆయన ప్రశ్నించారు. మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు సుమారు డ్బ్బై అయిదు కోట్ల రూపాయల వ్యయం అవుతున్నదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పేదల కష్టాలు నాకు తెలుసు.. ఎన్నికలకు ముందు తాను పాదయాత్ర చేశానని, ఈ సందర్భంగా ఆదివాసీలు, పేదల కన్నీళ్ళు, కష్టాలు చూశానని ఆయన తెలిపారు. వారి కష్టాలు తీర్చే విధంగా తమ ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి, తమకు అప్పగించిందన్నారు. ఇప్పుడు ఆ అప్పులు తీర్చేందుకు తాము శ్రమిస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మూడు బుల్లెట్ రైళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విలన్ వల్లే తనకు గుర్తింపు.. తాను నాయకుడిని కాదు కార్యకర్తనని ఆయన తెలిపారు. కార్యకర్తలతో మిత్రుడిలా ఉంటానని, అందుకే వారంతా తానంటే ఇష్టపడతారని ఆయన చెప్పారు. రావణుడు ఉన్నందుకే రామునికి గుర్తింపు వచ్చిందని, ధుర్యోధనుడు ఉన్నందుకే పాండవులకు గుర్తింపు వచ్చిందని, అదే విధంగా రాష్ట్రంలో విలన్లు ఉన్నందుకే తనకు గుర్తింపు వచ్చిందని ఆయన వివరించారు. తెలంగాణ ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఆయన తెలిపారు. గతంలో బిఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉన్నట్లు ఇప్పుడు తామూ పదేళ్ళు అధికారంలో ఉంటామని, ఇంకా ఎనిమిదేళ్ళు అధికారంలో ఉంటామని ఆయన చెప్పారు. ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ప్ర జల జీవితాల్లో మార్పు కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శాసనసభలో బడ్జెట్ క్లారిఫికేషన్ సందర్భంగా ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతుబంధు నిధు లు విడుదల చేసేదని విమర్శించారు. వారిలా మాది ఎలక్షన్ భరోసా కాదని స్పష్టం చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలను, ఉద్యోగులను నిర్బంధించిన వారు, ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వినే ఓపిక లేక సభ నుంచి వెళ్ళిపోవడం వారి అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న తనకు జరిగిన అవమానాలు రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయన్నారు. ప్రజల సమస్యల కోసం మైక్ అడిగితే ఇవ్వని వారు, నేడు మేము ప్రతి అంశానికి సమాధానం ఇస్తామన్నా వినకుండా పారిపోతున్నారు అని వ్యాఖ్యానించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, తమ ఆలోచనలన్నీ ప్రజల అవసరాల చుట్టూనే తిరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ఏదైనా కారణంతో ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకూడదన్న ఉద్దేశంతో రూ. 1.20 కోట్ల ప్రమాద భీమా కల్పించామని, దీనివల్ల 7.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. గతంలో ఉద్యోగులను హౌస్ అరెస్టులు చేసి, భయం భయంగా బతికించిన బిఆర్ఎస్ నేతలకు ఈ సంక్షేమం ఇష్టం లేకే సభను వీడారని విమర్శించారు. పేద విద్యార్థులు ఖాళీ కడుపుతో బడికి రావద్దన్న ఆలోచనతో పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగిజావ అందించాలని నిర్ణయించామన్నా రు. అంతేకాకుండా, ఇంటర్ విద్యార్థులకు కూడా మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయబోతున్నామని, ఈ అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్షం బడ్జెట్ కాగితాలు చించి చెవిలో పెట్టుకుని వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు. వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని చెబుతూ, ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ. 14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని, గత ప్రభుత్వంలాగా ఓట్ల కోసం ఔటర్ రింగ్ రోడ్డును కుదువబెట్టి డబ్బులు పంచే సంస్కృతి తమది కాదని హితవు పలికారు. సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. మత, ప్రాంత భేదం లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల ప్రమాద భీమా కల్పించామని, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాల కోసం రూ. 50 వేల కోట్లు కేటాయించామని వివరించారు. వ్యక్తులుగా తాము చిన్నవాళ్ళం కావచ్చు కానీ, తాము చేపట్టిన ప్రజాస్వామ్య ప్రక్రియను మన్నించి చర్చలో పాల్గొనాల్సింది పోయి, ‘ఆడలేక మధ్యలో ఓడు’ అన్నట్టుగా బిఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తనకు మంచి మిత్రుడు సుదీర్ఘ కాల స్నేహం ఒకే భావజాలంతో పనిచేసిన వాళ్ళం. ఆయన తెలంగాణ రాష్ట్రం వాడిని అని మర్చిపోయి పక్క రాష్ట్రం వాడిని అన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ యూనిట్ ధరను పది రూపాయలకు పెంచామని బిజెపి నేతలు ఆరోపించారు.. అది వాస్తవం కాదు మేం అధికారంలోకి వచ్చాక కరెంటు చార్జీలు పెంచలేదు. మాకు ప్రజల పట్ల అంకితభావం చిత్తశుద్ధి ఉందన్నారు. విద్యుత్ సబ్సిడీలు ఎత్తివేయాలి, విద్యుత్తు ఉత్పత్తికి ఎంత ఖర్చు అయితే అంత వసూలు చేయాలి, విద్యుత్ రేట్లు పెంచకపోతే కేంద్రం నుంచి కావాల్సిన ప్రయోజనాలు ఇవ్వం అని పది సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రానికి ప్రయోజనాలు ఇవ్వడం లేదు. ఏం సబ్సిడీలు ఎత్తివేయం, 200 యూనిట్ల విచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తా మని స్పష్టం చేశారు. మహేశ్వర్ రెడ్డి చీటింగ్ బడ్జెట్ అంటున్నారు మేము ఎవరిని చీట్ చేశాం ఆయన చెప్పాలన్నారు. ఒకాయన బడ్జెట్ పుస్తకాలను చించి చెవిలో పెట్టుకుని పోతే.. మరొకరు చీటింగ్ బడ్జెట్ అంటారు ఇది ఎక్కడి న్యాయం? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి బిజెపి నేతలు తమతో కలిసి పోరాడడానికి ముందుకు రావాలన్నారు. కేంద్రానికి రూపాయి పంపితే 30 పైసలు తిరిగి ఇస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రూపాయి కడితే 62 పైసలు, తమిళనాడుకు 26 పైసలు, కేరళకు 60 పైసలు ఇస్తున్నారు, అదే బీహార్కు రూపాయి కడితే 6.69 రూపాయలు ఉత్తరప్రదేశ్ కు 1.96, మధ్యప్రదేశ్ కు 1.87 రూపాయలు చెల్లిస్తున్నారన్నారు. తెలంగాణ ఏం పాపం చేసింది. తెలంగాణ రాష్ట్రం దేశంలో భాగం కాదా మేం డబ్బులు కడితే తీసుకుపోయి ఎక్కడో ఖర్చు పెడుతున్నారన్నారు.. బిజెపి నేతలు తెలంగాణ పై స్వారీ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని బిజెపి నేతలు గాలి మేడలు అన్నారని, మేము చెప్పడం లేదు ప్రధానమంత్రి 2047 కల్లా 30 త్రిలియన్ డాలర్ల ఎకానమీ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు అందులో భాగంగా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధాని మోడీ చెప్పింది కరెక్ట్ కాదు అని బిజెపి నేతలు చెప్పదలుచుకున్నారా? అని ప్రశ్నించారు.
సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సర్వర్ డౌన్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం ఉదయం సబ్రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కారణంగా సుమారు మూడు నుంచి నాలుగు గంటల పాటు సబ్ రిజిస్ట్రేష న్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్, చలాన్ల చె ల్లింపులు, భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు ఆ గిపోయాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర వినియోగదారులు ఇబ్బందు లు పడ్డారు. సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసుల దగ్గర క్ర య, విక్రయదారులు పడిగాపులు కాశారు. ఆధార్, ఈ కేవైసీ, థంబ్ ఇంప్రెషన్ వెరిఫికేషన్కు సంబంధించిన సర్వర్ డౌన్ కావడం తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ఉదయం రిజిస్ట్రేషన్లు మొదలైనప్పటి నుంచే ఈ సమస్య తలెత్తింది. స్లాట్ బుక్ చేసుకున్న భూములు, ఇళ్ల అమ్మకందారులు, కొనుగోలుదారులు గంటల త రబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతమంది మధ్యా హ్నం వరకు వేచి చూసి ఇళ్లకు వెళ్లిపోయా రు. సర్వర్ డౌన్ కారణంగా క్రయ, విక్రయదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. రిజిస్ట్రేష న్ కోసమని ఉద్యోగాలు, ఇతర పనులు మా ని ఆఫీసులకు వచ్చిన వారు ఇబ్బందులు ప డ్డారు. చాలా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కనీస వ సతులు లేకపోవడంతో దూరప్రాంతాల నుం చి వచ్చినవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగా రు. రిజిస్ట్రేషన్ల శాఖ కు చెందిన ప్రధాన స ర్వర్లలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఈ స మస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. అధికారులు సాంకేతిక బృందాలను రంగంలోకి దించి సర్వర్ వ్యవస్థను పునరుద్ధరించారు. గ్రేటర్ పరిధిలో పనిచేసే ఒక డిస్టిక్ రిజిస్ట్రార్ అవినీతిపై గ్రేటర్ పరిధిలో పనిచేసే ఒక డిస్టిక్ రిజిస్ట్రార్ అవినీతిపై సిఎంఓకు భారీగా ఫిర్యాదులు అందాయి. ఆయన మహిళా ఉద్యోగినులను వేధిస్తున్నారని, రియల్ఎస్టేట్ వ్యాపారం చే స్తున్నారని ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు లు అందినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఆయ న సాయంత్రం వరకు తన ఆఫీసులో ఉండకుండా బయట రియల్దందా చేస్తూ సా యంత్రం ఆఫీసుకు వస్తున్నారని తనకు వేరే జిల్లాలో ఇన్చార్జీ పదవి కూడా ఉండడంతో తనిఖీలు వెళ్లినట్టుగా ఉన్నతాధికారులకు త ప్పుడు సమాచారం ఇచ్చి రియల్వ్యాపారం చేస్తున్నారని సిఎంఓకు కొందరు ఫిర్యాదులు చేసినట్టుగా తెలిసింది.
మన తెలంగాణ/హైదరాబాద్: ఆరు గ్యారెంటీల కు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్పై బిఆర్ఎ స్ తెస్తున్న ప్రైవేటు బిల్లు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఫార్ములా ఈ -కార్ రేస్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్ ఆరోపించారు. సిఎం సంతకం చేసిన తొలి ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బిఆర్ఎస్ బ యటపెట్టడంతో సర్కారు పూర్తిగా ఇరకాటంలో పడిందన్నారు. తాను మొదటినుంచి చెబుతున్నట్లుగానే ఇది ముమ్మాటికీ లొట్ట పీసు కేసే అని పే ర్కొన్నారు. ఇందులో ఏమీ లేదని ప్రభుత్వమే చ ర్జిషీట్లో ఒప్పుకుందని వ్యాఖ్యానించారు. ఇక్కడి బ్యాంకు నుంచి పంపిన 45 కోట్ల నిధులు అక్కడి బ్యాంకు ఖాతాలో భద్రంగా ఉన్నాయని, తెలంగాణ నుంచి పంపిన నిధులు ఎక్కడా దారి మళ్లలేదని తెలిపారు. ప్రభుత్వం గోరంతలను కొండంత లు చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఇక్కడి నుంచి 45 కోట్లు పంపితే రూ.600 కోట్ల నుంచి - రూ.700 కోట్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని, ఇలాంటి అభూత కల్పనలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పారు. ఈ కేసులో ఎవరికి అనుచిత లబ్ధి చేకూరిందని ప్రభుత్వం ఆరోపిస్తుందో వారి పేరే చార్జిషీట్లో లేదని అన్నారు. సంస్థ ఖాతాలో భద్రంగా ఉన్న నిధులను ప్రభుత్వం వెనక్కి తెప్పించవచ్చు కదా...? అని పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో మంగళవారం కెటిఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి, ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రతిష్టాత్మక రేసును నగరానికి తీసుకువచ్చామని తెలిపారు. ఈ కారు రేసు వల్ల ఆ వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 700 కోట్ల ఆర్థిక ప్రయోజనం రాష్ట్రానికి కలిగిందని నీల్సన్ అనే సంస్థ స్పష్టం చేసిందని చెప్పారు. అందాల పోటీలు పెట్టడం వల్ల తెలంగాణకు పైసా ప్రయోజనం జరగలేదని, పైగా అంతర్జాతీయంగా తెలంగాణ అప్రతిష్ట పాలైందని విమర్శించారు. తనను లైంగికంగా వేధించారని మిస్ యుకె చేసిన ఆరోపణలతో రాష్ట్రం పరువు పోయిందని అన్నారు. అంత దారుణం జరిగినా ప్రభుత్వం ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. సిఎం సరదా కోసం ఆడిన ఫుట్ బాల్ మ్యాచ్ కోసం ప్రభుత్వం 100 కోట్లు వృధా చేసిందని ఆరోపించారు. సింగరేణి సంస్థ నుంచి 10 కోట్లు దుర్వినియోగం చేసిందని, ఈ రెండు వ్యవహారాల్లో ఎవరిపైన కూడా ఎలాంటి కేసు పెట్టలేదని అన్నారు. ఎలాంటి తప్పు జరగని ఫార్ములా రేసు కేసు కోర్టులో నిలబడదని, ఇదంతా దృష్టి మళ్లించడానికి మళ్లీ రాద్ధాంతం చేస్తున్నారని ప్రజలకు అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో న్యాయపోరాటం చేస్తామని.. తమకు న్యాయస్థానాలపై సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. ఈ కేసులో చివరికి న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనపై రాజకీయ కక్షతో అధికారులను వేధించడం సరైనది కాదని, కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని పేర్కొన్నారు. తొలిసారి నిర్వహించిన ఫార్ములా రేసు వల్ల తెలంగాణకు రూ.700 కోట్ల లాభం జరిగిందని, రెండోసారి దురుద్దేశంతో ముఖ్యమంత్రి రద్దు చేయడం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని అటెన్షన్ డైవర్షన్ కుట్రలు చేసినా ఆరు గ్యారెంటీలకు చట్ట బద్దత కల్పించే అంశాన్ని వదిలిపెట్టం అని స్పష్టం చేశారు. ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ మూసీ అభివృద్ధి పైన ప్రణాళిక లేకుండా ముందుకు పోతున్నదని కెటిఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి డబ్బులు లేవు, ప్రణాళిక లేదు అని, కేవలం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా నిధుల కోసం ప్రయత్నిస్తున్నారని, ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదని అన్నారు. వాళ్లకు అవసరమైన డీటెయిల్ ప్లానింగ్ రిపోర్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదని ఆరోపించారు. అందుకే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి తమ పార్టీ అభిప్రాయాన్ని ఇటీవల గండిపేటలో జరిగిన పబ్లిక్ పాయింట్ ప్రజంటేషన్లోనే సమగ్రంగా చెప్పామని తెలిపారు. కానీ మంత్రులు, ప్రభుత్వం చేయాల్సిన చర్చలు ఫైవ్ స్టార్ హోటల్ లోనో, సెక్రటేరియట్లో కాకుండా మూసీ బాధితులతో జరగాలని అన్నారు. ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసేవాళ్ళు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు సైతం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని, మేధా పాట్కర్, గంటా చక్రపాణి లాంటి వారు కూడా ఈ మూసీ ప్రాజెక్టు ప్రజల అభీష్టం మేరకు జరగాలని కోరుతున్నారని పేర్కొన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలకి నష్టం జరగకుండా డీలిమిటేషన్ చేయాలి డీలిమిటేషన్ అనేది రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2014లోనే జరగాలని, అయితే ఇప్పుడు జరిగినా స్వాగతిస్తామని కెటిఆర్ వ్యాఖ్యానించారు. 12 ఏళ్ళ కింద జరగాల్సిన డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలైనా సంతోషమే అని పేర్కొన్నారు. అయితే, జనాభా ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన కాకుండా గతంలో 1971 జనాభా లెక్కల ప్రకారం ఏ విధంగా చేశారో, అదే విధంగా ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలోనే డీలిమిటేషన్ చేస్తే బాగుంటుందని తెలిపారు. దక్షిణ భారతదేశం అంతా కలిసి దేశంలోని 24 శాతం రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఉందని, దానికి నష్టం రాకుండా కొనసాగించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంపును స్వాగతించారు. అసెంబ్లీ సీట్లు పెంచితే ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు ఉండటం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు. అశ్వారావుపేట లాంటి దగ్గర లక్షా ముప్పై వేల ఓట్లే ఉంటే, శేరిలింగంపల్లి దగ్గర తొమ్మిది లక్షల ఓట్లు ఉన్నాయని, కాబట్టి ఇంత భారీ వ్యత్యాసం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలు అన్నీ ఆర్థిక సూచికలలో అగ్రభాగాన ఉన్నాయని చెప్పారు. దక్షిణ భారత రాష్ట్రాలకి నష్టం జరగకుండా డీలిమిటేషన్ చేస్తే స్వాగతిస్తామని తెలిపారు. టిడిఆర్ అతి పెద్ద కుంభకోణం టిడిఆర్ అనేది అతి పెద్ద కుంభకోణం అని కెటిఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు టిడిఆర్ను అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ భారీ స్కామ్కి తెరలేపబోతున్నారని సంవత్సరంన్నర క్రితమే తాను చెప్పానని గుర్తు చేశారు. బలవంతంగా టిడిఆర్లు కొనుగోలు చేసేలా రియల్ ఎస్టేట్ సంస్థలకు నిర్దేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రియల్ ఎస్టేట్ నిబంధనలను తీసుకువచ్చిందని అన్నారు.తమ ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత టిడిఆర్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపిస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి టిడిఆర్ను తన కుటుంబానికి ఒక ఎటిఎంలా మార్చుకున్నారని, త్వరలోనే టిడిఆర్ స్కామ్ను పూర్తిగా బయటపెడతామని వెల్లడించారు.
న్యూఢిల్లీ: మధ్య ప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితుల వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న పరిస్థితులపై ఇరువురు నేతలూ చర్చించారు. ప్రపంచ నౌకాయానానికి కీలకమైన హార్మూ జ్ జలసంధిని తెరిచి, భద్రంగా ఉంచడంపై చర్చించినట్లు అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాదిలో ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్ సంభాషణ జరపడం ఇది రెండోసా రి. అయితే ఈ సంభాషణను ట్ర ంప్ ప్రారంభించినట్లు సమాచారం. ఇరాన్ హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని అమెరికా ఇచ్చిన గడువును ఐదు రోజులు పొడిగించిన ఒకరోజు తర్వాత ఈ చర్చలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్లో సంభాషించినట్లు ప్రధా ని మోదీ ట్వీట్ చేశారు. మధ్యప్రాచ్య పరిస్థితులపై ఉపయోగకరమైన చర్చలు సాగాయన్నారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గిం చి, శాంతి పునరుద్ధరించేందుకు భారత్ మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, రక్షణ కల్పించడం, అందరికీ అందుబాటు లో ఉండటం యావత్ ప్రపంచానికి అ త్యవసరమని పేర్కొన్నారు. శాంతి, స్థిరత్వం కోసం కొనసాగుతున్న ప్రయత్నాలకు భారత్ సహకారం ఉంటుందని తెలిపారు.
విజయవాడలో ఉగ్రవాద ముఠా గుట్టురట్టు
మన తెలంగాణ/హైదరాబాద్ : విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్వర్క్ గుట్టు రట్టయింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్ఐఎస్, ఆఖిస్ (ఎక్యూఐఎస్)లతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని మహమ్మ ద్ రహమతుల్లా షరీఫ్, ఎండి. డానిష్, మీర్జా సో హైల్ బేగ్లుగా గుర్తించారు. అరెస్టయిన యువకులు అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే పేరుతో ఒక రహస్య సంస్థను ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం దేశంలోని 7 రాష్ట్రాలకు చెందిన సుమారు 42 మంది యువకులతో ఒక రహస్య సోషల్ మీ డియా గ్రూప్ నడుస్తోంది. ఈ గ్రూప్ ద్వారా ఐఎస్ఐఎస్ (ఐఎస్ఐఎస్), కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేస్తున్నారు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ వంటి దేశాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థలతో వీరు నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారు. వీరిపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న యువకుల వద్ద నుంచి ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, కొన్ని అనుమానాస్పద పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసు కున్న మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో కీలకమైన ఆడియో క్లిప్పింగ్లు, జిహాదీ మెసేజ్లు లభించాయి. ప్రస్తు తం 42 మంది సభ్యుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
మనతెలంగాణ/హైదరాబాద్: ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడిందన్న భయం ప్రజల్లో నెలకొంది. పలు పెట్రోల్బంక్ల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడమే ఇందుకు కారణం. అయితే, నోస్టాక్ పేరుతో కొందరు బంక్ల యజమానులు పెట్రోల్, డీజిల్ను బ్లాక్లో విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే నోస్టాక్ ప్రస్తుతం కొన్ని మండలాలు, గ్రామాల్లో రెండు, మూడు పెట్రోల్ బంక్లు ఉంటే అందులో ఒక పెట్రోల్బంక్లో మాత్రమే డీజిల్, పెట్రోల్ లభ్యం అవుతుండడంతో వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ కొరత లేదని, ప్రజలు భయాందోళనలతో పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేయవద్దని, గ్యాస్ సిలిండర్ను అవసరం మేరకు మాత్రమే బుకింగ్ చేసుకోవాలని ప్రజలకు పౌర సరఫరాల శాఖ విజ్ఞప్తి చేస్తున్నా వాహనదారులు, ప్రజలు మాత్రం యుద్ధం భయాన్ని వీడడం లేదు. దీంతోపాటు పెట్రోల్బంక్ల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో వాహనదారులు మరింత ఆందోళన చెందుతునన్నారు. మూడు బంక్ల్లో బ్లాక్ దందా ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్బంక్ల్లోనూ బ్లాక్ దందా నడుస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శాఖ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలో మూడు బంక్లు ఉండగా అక్కడ పనిచేసే సిబ్బంది ఈ దందా నడిపిస్తున్నారని వారిని పౌర సరఫరాల శాఖ అధికారులు వెనుకుండి నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దందాతో ఇప్పటికే పౌర సరఫరాల శాఖకు కోట్లలో నష్టం వాటిల్లిందని, అయినా సివిల్ సప్లయ్ కమిషనర్కు లెక్కలు చూపకుండా కొందరు ఉద్యోగులు తప్పుదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బుధవారం రాశి ఫలాలు (25-03-2026)
మేషం కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవచింతన పెరుగుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృషభం అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. మిధునం స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కర్కాటకం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వ్యాపారమున మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సింహం ఇంటాబయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ధన పరంగా చికాకులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కన్య ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారమున ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. నూతన వాహన యోగం ఉన్నది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. తుల చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృశ్చికం దూరప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ధనస్సు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మకరం గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కుంభం ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీనం ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
petrol |పెట్రోల్.. పుకార్లు.. పెట్రోల్ అయిపోతుంది దొరకదనే వదంతులు.. వాహనదారులతో కిటకిటలాడుతున్న పెట్రోల్
అమెరికా లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు
టెక్సాస్ లోని పోర్ట్ ఆర్థర్లో గల వాలెరో రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. రిఫైనరీ లోని ఓ ఇండస్ట్రియల్ హీటర్ పేలడంతో ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలోఈ ప్రమాదం సంభవించింది. పేలుడు సమయంలో భారీ శబ్దం వచ్చినట్టు స్థానికులు తెలిపారు. కొన్ని మైళ్ల దూరం వరకు భూమి కంపించినట్టు వెల్లడించారు. అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులను షెల్టర్లకు తరలిస్తున్నారు. అమెరికా లోని కీలకమైన చమురు శుద్ధి కేంద్రాల్లో వాలెరో రిఫైనరీ ఒకటి. ఇందులో రోజుకు 3,80,000 బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ను రిఫైన్ చేస్తుంటారు.
వాంటెడ్ మావోయిస్టు శుక్రు లొంగుబాటు
ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు శుక్రు కంధమాల్ జిల్లా పోలీసుల ఎదుట మంగళవారంనాడు లొంగిపోయారు. మరో నలుగురు మావోయిస్టు సభ్యులతో కలిసి శుక్రు లొంగిపోయినట్టు డిజిపి వైబి ఖురానియా తెలిపారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడైన శుక్రు ఏకే-47 రైఫిల్తో లొంగిపోయినట్టు చెప్పారు. శుక్రుపై రూ.55 లక్షల రివార్డు కూడా ఉంది. మల్కాన్గిరి జిల్లాకు చెందిన శుక్రు కెకెబిఎన్ డివిజన్ పేరిట కొత్తగా దళాన్ని ఏర్పాటు చేసి కంధమాల్ జిల్లాలో మావోయిస్టు కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తున్నారు. మార్చి 31వ తేదీలోగా మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్రం గడువు విధించిన నేపథ్యంలో తాజా లొంగబాటు చోటు చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పలు జిల్లాల్లో గాలింపు చర్యలను కూడా పోలీసులు ముమ్మరం చేశారు.
ట్రాన్స్జెండర్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కులు, రక్షణకు సంబంధించిన చట్టంలో సవరణలు చేయడానికి తీసుకొచ్చిన బిల్లును లోక్సభ మంగళవారం ఆమోదించింది. అయితే, ఈ బిల్లులో గే, లెస్బియన్ వంటి లైంగిక అభిరుచులను చట్ట పరిధి నుంచి మినహాయించడం పై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) సవరణ బిల్2026పై జరిగిన చర్చకు స్పందించిన సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్, ఈ చట్టం జీవ వైజ్ఞానిక కారణాల వల్ల సామాజికంగా బహిష్కరణకు గురయ్యే వ్యక్తులకు మాత్రమే రక్షణ కల్పించడం లక్ష్యమని తెలిపారు. ఈ సవరణతో ట్రాన్స్జెండర్ వ్యక్తులకు చట్టపరమైన గుర్తింపు, రక్షణ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. 2019 చట్టంలో గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష ఉండగా, కొత్త సవరణ బిల్లులో గరిష్టంగా 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం కల్పించినట్లు మంత్రి వివరించారు. బిల్లు ఆమోదానికి ముందు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలను సభ వాయిస్ ఓటుతో తిరస్కరించింది. ప్రభుత్వం ఈ బిల్లు లక్ష్యం ట్రాన్స్జెండర్ వర్గానికి రక్షణ కల్పించడం మాత్రమేనని చెబుతుండగా, ప్రతిపక్షం మాత్రం ఈ చట్టం వ్యక్తిగత లైంగిక గుర్తింపు నిర్ణయించే హక్కును దూరం చేస్తోందని విమర్శించింది. ముఖ్యంగా గే, లెస్బియన్ వ్యక్తులను ఈ చట్ట పరిధి నుంచి తప్పించడం సరికాదని పేర్కొంటూ, బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేసింది. ఈ బిల్లు ట్రాన్స్జెండర్ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని ప్రతిపాదిస్తూ, ‘లైంగిక అభిరుచులు, స్వీయ లైంగిక గుర్తింపులు’ చట్ట పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా పరిగణించబడే వర్గంలో ఇవి ఎప్పటికీ చేరవని బిల్లులో పేర్కొంది. సమాజంలో తీవ్రమైన వివక్షకు గురయ్యే ట్రాన్స్జెండర్ వర్గాన్ని రక్షించడమే ఈ చట్టం ఉద్దేశమని, అన్ని రకాల లైంగిక గుర్తింపులు లేదా జెండర్ ఫ్లూయిడిటీ కలిగిన వర్గాలకు ఇది వర్తించదని బిల్లు వివరిస్తోంది.ట్రాన్స్జెండర్ వ్యక్తులను ఖచ్చితంగా గుర్తించి వారికి చట్ట ప్రయోజనాలు అందేలా స్పష్టమైన నిర్వచనం అవసరమని బిల్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒక అధికారం (అథారిటీ) నియామకం కోసం కూడా నిబంధనలు కల్పించింది. అవసరమైతే నిపుణుల సలహా తీసుకునే అధికారం దీనికి ఉంటుంది. ఈ అథారిటీగా ప్రధాన వైద్యాధికారి లేదా ఉప ప్రధాన వైద్యాధికారి ఆధ్వర్యంలో ఉన్న మెడికల్ బోర్డును కేంద్రం, రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం నియమించవచ్చని బిల్లులో పేర్కొంది.ట్రాన్స్జెండర్ చట్టం అమలు సమయంలో నిర్వచన పరిధిపై సందేహాలు తలెత్తిన నేపథ్యంలో ఈ సవరణలు తీసుకొచ్చినట్లు బిల్లు వివరిస్తోంది. ‘కిన్నర్’, ‘హిజ్రా’, ‘అరవాణి’, ‘జోగ్తా’ వంటి సామాజిక-సాంసృ్కతిక గుర్తింపులు కలిగిన వ్యక్తులు, యూనక్స్, ఇంటర్సెక్స్ వేరియేషన్స్ ఉన్న వారు లేదా జనన సమయంలో లింగ లక్షణాల్లో సహజ భిన్నత్వం ఉన్నవారిని ట్రాన్స్జెండర్గా నిర్వచించేలా కొత్త ఉపవిభాగాన్ని చేర్చింది. అలాగే నేరాల తీవ్రత, గాయాల ప్రభావం, ముఖ్యంగా బాలలపై జరిగే నేరాల దృష్ట్యా వేర్వేరు శిక్షలను విధించే విధానాన్ని కూడా బిల్లు ప్రతిపాదించింది.
ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశం పాకిస్థాన్
ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో బాధపడుతున్న దేశంగా పాకిస్థాన్ తొలి స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్, తజికిస్తాన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయని తాజా నివేదిక వెల్లడించింది. భారత్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్కు చెందిన గాలి నాణ్యత సాంకేతిక సంస్థ ‘ఐక్యూఏయిర్’ విడుదల చేసిన 2025 ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్’ ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక 143 దేశాలు, ప్రాంతాలు, భూభాగాల్లోని 9,446 నగరాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 40,000కు పైగా మానిటరింగ్ స్టేషన్లు, తక్కువ ఖర్చు సెన్సర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తీసుకున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, పౌర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. కాలుష్య దేశాల జాబితాలో చైనా 20వ స్థానంలో ఉండగా, అమెరికా 120వ స్థానంలో, యునైటెడ్ కింగ్డమ్ 110వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన వార్షిక సగటు పీయం2.5 ప్రమాణాలను కేవలం 13 దేశాలు లేదా ప్రాంతాలు మాత్రమే పాటించగలిగినట్లు నివేదిక పేర్కొంది. ఫ్రెంచ్ పోలినీషియా, ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ దీవులు, బార్బడోస్, న్యూ కాలెడోనియా, ఐస్లాండ్, బెర్ముడా, రీయూనియన్, ఆండోరా, ఆస్ట్రేలియా, గ్రెనడా, పానామా, ఎస్టోనియా ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 143 దేశాల్లో 130 దేశాలు (91 శాతం) డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన పీయం2.5 పరిమితులను మించాయని నివేదిక స్పష్టం చేసింది. అత్యంత కాలుష్య దేశాలుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, తజికిస్తాన్, చాద్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో ఉన్న 25 నగరాలు భారత్, పాకిస్థాన్, చైనా దేశాల్లోనే ఉండగా, అత్యధికంగా భారత్లోనే ఉన్నట్లు నివేదిక తెలిపింది. అత్యంత పరిశుభ్రమైన నగరంగా దక్షిణాఫ్రికాలోని న్యూవౌడ్విల్ నిలిచింది. నగరాల వారీగా ఉత్తరప్రదేశ్లోని లోనీ అత్యంత కాలుష్య నగరంగా నిలవగా, చైనాలోని హోటాన్, మేఘాలయ రాష్ట్రంలోని బైర్నిహాట్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ నాలుగో స్థానంలో ఉండగా, పాకిస్థాన్లోని ఫైసలాబాద్ ఐదో స్థానంలో ఉంది. 2025లో అటవీ అగ్నిప్రమాదాలు గాలి నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపినట్లు నివేదిక పేర్కొంది. గతంలో తక్కువ కాలుష్య స్థాయులు ఉన్న ప్రాంతాల్లో కూడా పీయం2.5 స్థాయిలు పెరిగాయి. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా కేవలం 14 శాతం నగరాలు మాత్రమే డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను అందుకోగలిగాయి. 2024లో ఇది 17 శాతంగా ఉండటం గమనార్హం.
ఇప్పపువ్వు సారా తాగిన వాళ్లు 115 ఏళ్లు బ్రతుకుతారు: ఎంఎల్ఎ అనిరుధ్ రెడ్డి
ఇప్పపువ్వు సారాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని, తనకు ఇప్పపువ్వు సారాపై పూర్తి అవగాహన ఉందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇప్పుపువ్వు సారాపైన తాను అవగాహనా లేకుండా మాట్లాడడం లేదని, నేడు అసెంబ్లీలో ఇప్పపువ్వు సారాపై మాట్లాడుతానని, అన్ని వివరాలు వెల్లడిస్తానని అనిరుధ్ రెడ్డి చెప్పారు. ఎవరైతే తనను సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తున్నారో వారు అసెంబ్లీలో తన ప్రసంగం వినాలని ఆయన సూచించారు. గతంలో ఇప్పపువ్వు సారా తాగిన వాళ్లు 115 ఏళ్లు బ్రతికారని, కానీ, ప్రస్తుతం కల్తీ బ్రాండ్లు తాగిన వారు కేవలం 60 ఏళ్లు మాత్రమే బ్రతుకుతున్నారని ఆయన తెలిపారు. విదేశాల్లో అనేక కల్తీ బ్రాండ్లు ఉన్నాయని వాటికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎస్టీ సోదరులు ఆర్థికంగా ఎదగాలంటే ఇప్ప పువ్వు సారాకు ప్రాధాన్యత కల్పించాలని తాను ప్రభుత్వాన్ని కోరుతానన్నారు. తెలంగాణలో ఇప్ప పువ్వు సారతో లక్ష కోట్ల రెవెన్యూ వచ్చే విధంగా మార్కెట్ ఎక్స్పోర్ట్ కూడా చేయవచ్చని ఆయన అన్నారు.
TN Polls 2026: ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న కమల్ హాసన్ పార్టీ..
న్యూఢిల్లీ: కమల్ హాసన్ పార్టీ 'మక్కల్ నీది మయ్యం' (MNM) రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదని కమల్ ప్రకటించారు. అయితే అధికారంలో ఉన్న 'ద్రవిడ మున్నేట్ర కజగం' (DMK) నేతృత్వంలోని కూటమికి తమ మద్దతు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్తో కమల్ హాసన్ సమావేశమయ్యారు. అనంతరం కమల్ మీడియాతో మాట్లాడుతూ.. మేము DMK కూటమికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం. మేము విజయం సాధిస్తాం... నా దార్శనికత గురించి పార్టీ కార్యకర్తలకు బాగా తెలుసు. వారు నా ఆశయాలను అనుసరిస్తారు. మేము మధ్యేవాదులం (centrists). మేము ఏ వైపుకూ మొగ్గు చూపమని మాకు తెలుసు అని అన్నారు. కాగా.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న కమల్ హాసన్, జూన్ 12న DMK కూటమి మద్దతుతో ఏకగ్రీవంగా రాజ్యసభలో అడుగుపెట్టారు. అవినీతి నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తూ.. MNM వ్యవస్థాపకుడు కమల్ హాసన్ 2017లో తన పార్టీని ప్రారంభించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కమల్ పార్టీ మొత్తం ఓట్లలో సుమారు నాలుగు శాతం వాటాను దక్కించుకుని, తమిళనాడు రాజకీయాల్లో తన తొలి అడుగులను బలంగానే వేసింది. తర్వాత, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుండి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక, 2024 లోక్సభ ఎన్నికల సమయంలో MNM పోటీకి చేయకుండా DMK కూటమికి మద్దతును ప్రకటించింది. ఇదిలావుంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే దశలో జరగనున్నాయి, ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు.
రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్ష సూచన
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, మంగళవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురవగా హైదరాబాద్లో వడగండ్ల కూడిన వర్షం కురిసింది. ఉదయం వరకు విపరీతమయిన ఎండ ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వరుణుడు షాక్ ఇచ్చాడు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షకురవగా, జూబ్లీహిల్స్, బజారాహిల్స్, ఫిల్మ్నగర్లో మాత్రం కుంభ వృష్టి కుసిరింది. మణికొండ, గచ్చిబౌలి ప్రాంతాల్లో వడగండ్లు పడటంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరం వెలుపల ప్రాంతాలయిన సూరారం, కొంపల్లి, దుండిగల్ ప్రాంతాల్లోనే వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. కుండపోతగా కురిసిన వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వరద నీరు రోడ్లపైకి చేరింది. ప్రధానంగా ఐటి కారిడార్లో రోడ్లు చెరువులను తలపించాయి. ప్రజలు ఉద్యోగ, ఉపాధి, కూలీ పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వర్షం దాటికి నిలిచిన ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బుధవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్క వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో రంగు హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ల పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు మరియు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామ సమీపంలో జరిగింది. నర్సిపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి వెంకటేశ్వర్లు (31) అనే యువకుడు మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లేందుకు రైల్వే పట్టాలు దాటుతున్నాడు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న రైలును గమనించలేదు దీంతో వేగంగా వచ్చిన రైలు అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.ఆర్.పి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై రైల్వే హెడ్ కానిస్టేబుల్ రత్నకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి స్థానిక ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.వెంకటేశ్వర్లు మృతితో నర్సిపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మద్యం సేవించి వాహనం నడిపితే.. రెండు రోజుల జైలు శిక్ష
మద్యం సేవించి వాహనం నడిపితే.. రెండు రోజుల జైలు శిక్ష చిట్యాల, ఆంధ్రప్రభ
ఐపీఎల్ 2026 నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్..
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 నుండి ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెన్ డకెట్ తప్పుకున్నాడు. కేఎల్ రాహుల్తో పాటు డకెట్ ఓపెనర్ గా ఎంపికవుతాడని భావించారు. అయితే, టోర్నమెంట్కు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కు డకెట్ షాకిచ్చాడు.రాబోయే సీజన్లో తాను ఆడటం లేదని డకెట్ అధికారికంగా ప్రకటించాడు. ఇప్పుడు తన ఏకైక లక్ష్యం జాతీయ జట్టు కోసం రాణించడమేనని తెలిపాడు. “ఇది చాలా కష్టమైన నిర్ణయం. నేను రాలేకపోతున్నందుకు ఢిల్లీలోని ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను వేలంలో పాల్గొన్నప్పుడు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించాను. ఢిల్లీ లాంటి ఫ్రాంచైజీ నన్ను ఎంపిక చేసుకోవడం అద్భుతంగా అనిపించింది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన అత్యుత్తమ పోటీ. ఈ టోర్నీ ఒక అద్భుతమైన అనుభవం అయ్యేది” అని డకెట్ పేర్కొన్నాడు. అయితే, యాక్షన్లో ఎంపికైన తర్వాత టోర్నీ నుంచి తప్పుకునే ప్లేయర్లను బ్యాన్ చేయాలని గతేడాది బిసిసిఐ కొత్త రూల్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో డకెట్ పై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది.
No Relief from the Supreme Court for Peddireddy
In a significant legal development, senior YSRCP leader and former minister Peddireddy Ramachandra Reddy has faced a setback in the Supreme Court. The case revolves around pending payments linked to road works carried out during the previous government in Andhra Pradesh. The petition was filed in his wife’s name. It sought directions from the state […] The post No Relief from the Supreme Court for Peddireddy appeared first on Telugu360 .
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి..
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి.. దివ్యాంగులను విస్మరిస్తున్న ప్రభుత్వంఇది ప్రజా పాలన కాదు..ప్రజా వ్యతిరేక
అమిత్ షా ముందుకు సిక్కోలు వరద సమస్యలు
అమిత్ షా ముందుకు సిక్కోలు వరద సమస్యలు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ
Sanjay Dutt Meets Chandrababu Naidu, Signals Big Push for Film Industry in Andhra Pradesh
Bollywood actor Sanjay Dutt met Chief Minister Nara Chandrababu Naidu in Amaravati, in a meeting that is being seen as a strong signal for the growth of the film industry in the state. The meeting took place at the Secretariat in Velagapudi. Sanjay Dutt was accompanied by his team, including Gaurav Dubey, Kunal Patel, and […] The post Sanjay Dutt Meets Chandrababu Naidu, Signals Big Push for Film Industry in Andhra Pradesh appeared first on Telugu360 .
క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం..
క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : క్షయ(టీబీ) వ్యాధిని సమూలంగా
మద్యం సేవించి వాహనాలు నడపరాదు..
మద్యం సేవించి వాహనాలు నడపరాదు.. సరైన పత్రాలు లేని 10 వాహనాలకు 1500,
నేరేడ్మెట్ లో నకిలీ దంత వైద్యుడు అరెస్ట్
పదవ తరగతి పాస్ కాకుండానే డెంటల్ డాక్టర్ గా అవతారం ఎత్తి 20 ఏళ్లుగా నగరం నడిబొడ్డులో దంత వైద్యునిగా చలామణి అవుతున్న వ్యక్తి బండారం మంగళవారం మధ్యాహ్నం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని నేరేడ్మెట్ పోలీసులు ఓ వ్యక్తి ఫిర్యాదుతో బట్టబయలు చేశారు. నేరేడ్మెట్ సత్య ఆదిత్య టవర్స్ లో అంజాలికా డెంటల్ ఆస్పత్రి పేరుతో గత 20 ఏళ్లుగా రమేష్ కుమార్ గుప్తా అమాయక రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఓటి పోలీసులు అతని ఆసుపత్రిని పరిశీలించి సర్టిఫికెట్లను కోరడంతో అసలు విషయం బయటపడింది. పదవ తరగతి మాత్రమే చదివిన యూపీ కి చెందిన రమేష్ కుమార్ గుప్తా నగరంలో నకిలీ డాక్టర్ గా అవతారం ఎత్తి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ అంది వచ్చిన సొమ్మును దండుకున్నాడని గుర్తించారు. బిడిఎస్ చేశానని చెప్పి తప్పుడు సర్టిఫికెట్లతో వైద్యం అందిస్తున్న రమేష్ కుమార్ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము వరకు మాత్రమే ఇతని సేవలు ఉండడం అతని సేవలపై అనుమానించిన వ్యక్తి ఎస్ ఓ టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రమేష్ గుప్తాను అదుపులోకి తీసుకుని తీసుకున్న ఎస్ఓటి పోలీసులు నేరేడ్మెట్ పీఎస్ లో అప్పగించారు.
చిత్తూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రికార్డులు సీజ్
చిత్తూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రికార్డులు సీజ్ ఏసీబీ కానిస్టేబుల్ పై డాక్యుమెంట్
మళ్లీ చెప్తున్నా.. ఫార్ములా ఈ-కార్ రేస్ ఒక లొట్టపీసు కేసు: కెటిఆర్
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు లొట్టపీసు కేసు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో కెటిఆర్ చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేస్ కేసు ముమ్మాటికీ ఒక లొట్టపీసు కేసు మాత్రమే అన్నారు. ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదు, లేని కేసును ఉన్నట్టుగా చూపి మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని నిన్న స్పీకర్ను అవకాశం ఇవ్వాలని కోరాం. ప్రైవేట్ మెంబర్ బిల్లు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎవరికీ లబ్ధి జరిగిందో ఆ కంపెనీ పేరును కనీసం చార్జ్షీట్లో కూడా చేర్చలేదు. నా వల్ల ఒక్క పైసా ఎవరికైనా వెళ్లిందా అన్న అంశాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు ప్రస్తావించలేదు. ఇప్పటికీ డబ్బులు అక్కడే ఉన్నాయి. తప్పుడు చార్జ్షీట్ తీసుకొచ్చి అక్రమ కేసు పెడుతున్నారు. బ్యాంక్ టు బ్యాంక్ డబ్బు ట్రాన్స్ఫర్ జరిగినట్టు ఉంది...అయితే రికవరీ ఎందుకు చేయడం లేదు ప్రభుత్వం?. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు, ఎలక్ట్రిక్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఫార్ములా ఈ నిర్వహించాం....దాని వల్ల సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రూ.200 కోట్లు ఖర్చు చేసి మిస్ వరల్డ్ పోటీ పెట్టి రాష్ట్ర, దేశ పరువు పోయేలా చేశారు. నన్ను వేశ్యలా చూసారని మిలా మ్యాగీ స్వయంగా ఇంటర్వ్యూలు ఇచ్చింది...ఈ అంశంపై ఎలాంటి విచారణ చేశారు?. అక్రమ కేసులపై మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం...మాకు న్యాయం జరుగుతుంది. మేము భయపడము. రేవంత్ రెడ్డి లాగా చట్టాలను, న్యాయస్థానాలను చేతుల్లోకి తీసుకోము. ఫార్ములా ఈలో క్విడ్ ప్రో కో జరగలేదు...అయితే అందులో ఆ కంపెనీ పేరు ఎందుకు చేర్చలేదు? అని కెటిఆర్ ప్రశ్నించారు.
రేషన్కార్డుదారులకు ఉచితంగా రిఫ్రిజిరేటర్లు
త్వరలో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా రిఫ్రిజిరేటర్లు పంపిణీ చేస్తామని ఎఐఎడిఎంకె ప్రకటించింది. అదే విధంగా కేజీ పప్పుతో పాటు కిలో వంటనూనె కూడా ఉచితంగా సరఫరా చేస్తామని హామీనిచ్చింది. మంగళవారంనాడిక్కడ ఎఐడిఎంకె ప్రధాన కార్యదర్శి, మాజీ సిఎం పళనిస్వామి మేనిఫెస్టో విడుదల చేశారు. రిఫ్రిజిరేటర్లను పంపిణీ చేయడమంటే గృహిణులపై పని భారాన్ని తగ్గించడమేనని పళనిస్వామి అన్నారు. ప్రతి ఏటా మూడు వంటగ్యాస్ సిలిండర్లను కూడా ఉచితంగా అందజేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. జల్లికట్టు క్రీడలో ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇంకా మహిళా ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు వారికి ప్రతి నెలా రూ.2000 ఆర్థిక సాయం, ఐదు లక్షల మంది మహిళలకు అమ్మ ద్విచక్రవాహనాలను సబ్సిడీపై అందజేస్తామని పళనిస్వామి ప్రకటించారు. పింఛన్లను రూ.2000కు పెంచుతామన్నారు. మహిళలకు బస్సులో ఉచితంగా ఇప్పటికే ప్రయాణ వసతి కల్పిస్తున్నారని, దాన్ని పురుషులకు కూడా వర్తింప జేస్తామన్నారు. అధికారంలోకి రాగానే డిఎంకె హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరుపుతామన్నారు. మేనిఫెస్టోలోమొత్తం 297 హామీలను అన్నాడిఎంకె ప్రకటించింది. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీకి వచ్చే నెల 23న పోలింగ్ జరగనుంది.
గుంతల రోడ్డుతో ఇబ్బందులు చిన్నపాటి వర్షానికి గుంతల్లో నీరుఇబ్బంది పడుతున్న వాహనదారులు టేకుమట్ల,ఆంధ్రప్రభ
మొండి బకాయిల వసూళ్ల పై భారీ అవగాహనా ర్యాలీ
మొండి బకాయిల వసూళ్ల పై భారీ అవగాహనా ర్యాలీ సిర్పూర్ (యు ),
అక్రమంగా నిల్వచేసిన… 8గ్యాస్ సిలిండర్లు సీజ్
అక్రమంగా నిల్వచేసిన… 8గ్యాస్ సిలిండర్లు సీజ్ చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రం
11 నంబర్ జెర్సీతో బరిలో దిగనున్న ఆర్సిబి
ఐపిఎల్ సీజన్ 2026 ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) ఆటగాళ్లు 11 నంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్తో మార్జి 28న చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు తన తొలి మ్యాచ్ను ఆడనుంది. ఈ మ్యాచ్లో జట్టు సభ్యులు 11వ నంబర్ జెర్సీని ధరించనున్నారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సిఇఓ రాజేశ్ మేనన్ మంగళవారం వెల్లడించారు. కిందటి ఏడాది బెంగళూరు టీమ్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వారికి నివాళిగా బెంగళూరు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే వారి మృతికి సంతాప సూచకంగా స్టేడియంలో 11 సీట్లను రిజర్వ్ చేసి పెట్టనున్నట్టు తెలిసింది. చిన్నస్వామి స్టేఇయడంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్లతో సహా, ఇతర కార్యక్రమాల సమయంలో కూడా ఈ 11 సీట్లు ఖాళీగానే ఉంటాయని సమాచారం. అంతేగాక ఆరంభ మ్యాచ్కు ముందు స్టేడియం ప్రవేశ ద్వారం దగ్గర ఒక స్మారక ఫలకాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆర్సిబి యాజమాన్యం నిర్ణయించింది. కాగా, ఈ సీజన్లో ఆర్సిబి బెంగళూరులో ఐదు మ్యాచ్లను ఆడనుంది. రెండు మ్యాచ్లు రాయ్పుర్లో జరుగుతాయి.
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి..
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి.. ఇందిరమ్మ ఇళ్లకు నిధులు తగ్గించడం దారుణం..ఆటో డ్రైవర్లనూ
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికీ గాయాలు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికీ గాయాలు కల్లూరు సాయిబాబా టెంపుల్ సమీపంలో రోడ్డు
బైంసాలో నో స్టాక్ పెట్రోల్ భైంసా పట్టణంలోని గీత పెట్రోల్ బంక్ లో
సెక్రటేరియట్ వద్ద ప్రమాదకర స్టంట్లు..ఇద్దరు యువకుల అరెస్టు
తెలంగాణ సెక్రటేరియట్, లుంబినీ పార్క్ వద్ద బైక్లతో ప్రమాదకర స్టంట్లు చేసిన ఇద్దరు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ముషీరాబాద్, బోలక్పూర్కు చెందిన మహ్మద్ అఖీల్ కొరియర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు, నాంపల్లికి చెందిన మహ్మద్ అతీక్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో రీల్స్ కోసం సెక్రటేరియట్, లుంబినీ పార్క్ వద్ద బైక్లతో స్టంట్లు చేశారు.నిందితులు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు తమ మోటారు సైకిళ్లపై బాధ్యతారహితంగా స్టంట్లు చేస్తున్నారు. సెక్రటేరియట్ వంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతాల్లో వీరు స్టంట్లతో సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. వీరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సైఫాబాద్ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. బైక్లు, వీడియోలు,మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు.సైఫాబాద్ ఇన్స్స్పెక్టర్ సీతయ్య, ఎస్సై వి. పరమేశ్వరి, పోలీసు సిబ్బంది, ఎల్. సంపత్ కుమార్, బి. విజయ్ కుమార్, జె. లింగస్వామి, ఎస్. మహేష్ అరెస్టు చేశారు.
4,473 ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విడుదల
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల విడుదలకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా 4,473 మంది లబ్ధిదారులకు రూ.48.79 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ విపి గౌతం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి వారం ఇండ్ల నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారులకు బిల్లులను విడుదల చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో గత వారానికి సంబంధించి రూఫ్ లెవల్ వరకు నిర్మాణాలు పూర్తి చేసిన 1,969 మంది లబ్ధిదారులకు రూ.17.23 కోట్లు, స్లాబు పూర్తి చేసిన 2,504 మందికి రూ.31.56 కోట్లు విడుదల చేశామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లక్ష ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశలో ఫలితాలు సాధిస్తున్నామని, ఇప్పటి వరకు రూ.5,376.22 కోట్ల లబ్దిదారులకు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇంటి నిర్మాణపు పురోగతిని బట్టి విడతల వారీగా లబ్ధిదారులకు ఐదు లక్షలను అంద చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు బేస్ మెంట్ నిర్మాణం పూర్తి అయిన వాటికి రూ. 2,125.98 కోట్లు, గోడలు పూర్తి అయి రూఫ్ లెవల్ వరకు వచ్చిన ఇండ్లకు రూ.1,518.51 కోట్లు, స్లాబ్ పూర్తి అయిన వాటికి రూ.1,731.73 కోట్లు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల ఇండ్ల పనులు ప్రారంభంగా కాగా, వాటిలో ఇంతవరకు 1,13,365 ఇండ్ల స్లాబు పూర్తి అయ్యిందని, 34,552 ఇండ్లు రూఫ్ లెవల్ (గోడల నిర్మాణం పూర్తి) దశలో ఉన్నాయని, మరో 61 వేల ఇండ్ల బేస్ మెంట్ నిర్మాణాలు పూర్తి అయ్యాయని ఆయన వివరించారు.
వ్యవసాయ మార్కెట్ ల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వ్యవసాయ మార్కెట్ ల అభివృద్ధికి నిధులు కేటాయించాలి మంత్రిని కోరిన పాలకుర్తి ఎమ్మెల్యే
సినిమా థియేటర్లో ఆకస్మిక తనిఖీలు …
సినిమా థియేటర్లో ఆకస్మిక తనిఖీలు … పలు విభాగాలు ,ఆహార పదార్థాలను క్షుణ్ణంగా
జనగణన మరింత సులభం మీ వివరాలను మీరే నమోదు చేసుకోవచ్చుకమిషనర్, ప్రిన్సిపల్ సెన్సెస్
పురుషులకూ ప్రీ బస్సు.. తమిళ ప్రజలపై అన్నాడిఎంకె హామీల వర్షం
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ప్రజలపై ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) హామీల వర్షం కురిపించింది. మంగళవారం అన్నాడిఎంకె తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే..రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఉచిత రిఫ్రిజిరేటర్లు ఇస్తామని.. మహిళలతోపాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్నికల్పిస్తామని హమీ ఇచ్చింది. మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు.. రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు, 1 కిలో పప్పు, 1 లీటరు వంట నూనె. సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు. ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం. వృద్ధులు , ఇతర లబ్ధిదారుల సామాజిక భద్రతా పింఛన్లను రూ. 2,000కు పెంపు. జల్లికట్టు కళాకారుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం. కాగా, తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్నాయి, ఫలితాలు మే 4న ప్రకటించనున్నారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీలు అందచేత…
ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీలు అందచేత… భవానిపురం,ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గానికి
యువకుడు మిస్సీంగ్…. కాల్వలో దూకినట్లు అనుమానం మాచర్ల, ఆంధ్రప్రభ : ఓ యువకుడు
పేదలకు రెండుసెంట్ల స్థలం ఇవ్వాలని సీపీఐ ఆందోళన
పేదలకు రెండుసెంట్ల స్థలం ఇవ్వాలని సీపీఐ ఆందోళన కర్నూలు, ఆంధ్రప్రభ : పేద
విజిలెన్స్ అధికారులు ముమ్మర తనిఖీలు
విజిలెన్స్ అధికారులు ముమ్మర తనిఖీలు అక్రమంగా నిల్వ ఉంచిన 40 సిలిండర్ల సీజ్గ్యాస్
ప్రమాద రహిత జిల్లాగా చేయటమే లక్ష్యం
ప్రమాద రహిత జిల్లాగా చేయటమే లక్ష్యం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లారహదారి భద్రత
ప్రపంచంలోనే 25 కాలుష్య నగరాలు ఇండియాలోనే…
ప్రపంచంలోనే 25 కాలుష్య నగరాలు ఇండియాలోనే… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రపంచంలో అత్యంత
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన ఆశిష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ’దేత్తడి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ ఆదిత్య రావు గంగసాని దర్శకత్వం వహిస్తున్నాడు. ఆశిష్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. మంగళవారం సాయంత్రం ఈ మూవీ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. జునైద్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ను అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్ప్లే, డైలాగ్స్తో పాటు క్రియేటివ్ హెడ్గా కూడా పని చేస్తున్నారు.
on6guarantees |అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం
on6guarantees | అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం on6guarantees | ఆరు గ్యారెంటీలు…
రాష్ట్రంలో గ్యాస్ కొరతపై బిఆర్ఎస్ వాయిదా తీర్మానం
రాష్ట్రంలో గ్యాస్ కొరతతో సామాన్యులు, చిరు వ్యాపారులు, వృద్ధాశ్రమాలు,హాస్టళ్లు, హోటల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సకాలంలో గ్యాస్ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టేందుకు శాసనసభ, శాసన మండలిలో దీనిపై తక్షణమే చర్చ జరగాలని మంగళవారం బిఆర్ఎస్ శాసనసభా పక్షం వాయిదా తీర్మానాలు ఇచ్చింది. ఈ మేరకు గన్పార్క్ వద్ద బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు ఆందోళన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆపండి వెంటనే గ్యాస్ ఇవ్వండి..కేంద్ర చెబుతోంది కొరత లేదు, రాష్ట్ర చెబుతుఓంది సప్లై లేదు..ఏదీ నిజం..? అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.ఈ నిరసనలో బిఆర్ఎస్ ఎంఎల్ఎలు కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్రెడ్డి, సుధీర్రెడ్డి, మదుసూదనాచారితో పాటు పార్టీ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు బలైనట్లు సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా ఎల్పిజి డిస్టిబ్యూషన్ దగ్గర ప్రజలు పెద్ద ఎత్తున్న క్యూ లైన్లో ఉంటున్నారని పేర్కొన్నారు. గ్యాస్ కొరత లేదు..సరిపడా నిల్వలు ఉన్నాయి అని కేంద్రం చెబుతుది..పెట్రోలియం, గ్యాస్ కేంద్ర పరిధిలో ఉన్నాయి, గ్యాస్ కొరత ఉందని రాష్ట్రం చెబుతుందని అన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 4 నుంచి కేంద్రం సిలిండర్ సైజ్ తగ్గించే ప్రయత్నం చేయబోతుందని, 14 కిలోల సిలిండర్ను 10 కిలోలు కాబోతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఇరాన్లో ఇబ్బంది ఉంటే వేరే చోట నుండి తెప్పించాలని డిమాండ్ చేశారు. ప్రతీ ఇంట్లో సిలిండర్ల గురించి చర్చ జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఇదే విషయంపై శాసనసభలో, శాసనమండలిలో వాయిదా తీర్మానం ఇచ్చామని, ప్రజల గొంతుకుగా అసెంబ్లీలో మాట్లాడుతామని తెలిపారు.
Big Troubles for Puri Jagannadh Ahead
Sensational director Puri Jagannadh has delivered two massive duds like Liger and Double iSmart. Both these films left the buyers and exhibitors in huge losses. Puri Jagannadh has been responsible for the repayment and the issues reached the Film Chamber long ago. The distributors and other parties involved are waiting with patience as Puri Jagannadh […] The post Big Troubles for Puri Jagannadh Ahead appeared first on Telugu360 .
మంత్రి పదవి లేకున్నా నా బ్రాండ్ ఇమేజ్ తగ్గదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రి పదవి ఉన్నా లేకున్నా తన బ్రాండ్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు ముగియగానే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత కొంత కాలానికే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుని రావాలని కెసి వేణుగోపాల్ చెప్పారని ఆయన తెలిపారు. ఆ హామీ ఇప్పటికీ ఉందన్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదనడం భావ్యం కాదన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చేప్పుడు తెలియదా తాము అన్నదమ్ములమని అని ఆయన ప్రశ్నించారు. తమ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు లేరా? అని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి రానంత మాత్రాన తన బ్రాండ్ ఇమేజ్ ఇలాగే ఉంటుందన్నారు. మంత్రి పదవి వచ్చినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని, మార్పు ఏమీ ఉండదని ఆయన తెలిపారు. మంత్రి పదవి కోసం పాకులాడడం లేదన్నారు. మంత్రి పదవి ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చాలి…
పేదలకు ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చాలి… సీపీఐ డిమాండ్ నరసరావుపేట, ఆంధ్రప్రభ రాష్ట్ర
మతం మార్చుకుంటే ఎస్సీ కోటా రద్దు: సుప్రీంకోర్టు
మతం మార్చుకున్న తరువాత అట్రాసిటీ చట్టం కేసులపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులను పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, సిక్కులు, బౌద్ధులు మాత్రమే ఈ హక్కులు పొందుతారని పేర్కొంది. ఈ వ్యవహారంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపి, నేడు తుది ఉత్తర్వులను జారీ చేసింది.బాపట్ల జిల్లా పిట్టలవాని పాలెంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చిని నిర్వహించడంపై అక్కల రామిరెడ్డితో పాటు స్థానికులు అభ్యంతరం తెలిపారు. వారిపై అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఆనంద్ కేసు పెట్టారు. ఆ కేసును కొట్టివేయాలంటే రామిరెడ్డి, స్థానికులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చింతాడ ఆనంద్ పాస్టర్గా పనిచేస్తున్నందు వల్ల క్రైస్తవుడవుతారని, రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలకు సంబంధం ఉండదని రామిరెడ్డి తరపు న్యాయవాది తన వాదనను వినిపించారు. పుట్టుకతో హిందువు అయినా.. క్రైస్తవం స్వీకరించడంతో అతను షెడ్యూల్ కులానికి చెందరని కోర్టుకు విన్నవించుకున్నారు. అట్రాసిటీ చట్టం లోని సెక్షన్లు ఆయనకు వర్తించవని, ఫిర్యాదు చట్ట వ్యతిరేకమని.. తమపై పెట్టిన కేసుకు విచారణ అర్హత లేదని వాదించారు. రామిరెడ్డి తరపు న్యాయవాదుల వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. క్రైస్తవ మతంలో కులవ్యవస్థ లేదని కోర్టు పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికే ఎస్సీ హక్కులు పొందే అర్హతఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. న్యాయమూర్తులు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని స్పష్టం చేసింది. అలా కాకుండా మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. పైగా చింతాడ ఆనంద్ దశాబ్దానికి పైగా క్రైస్తవం ఉన్నారని నిరూపణ అయిందని ధర్మాసనం పేర్కొంది. ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇలాంటి కేసులకు మార్గదర్శకంగా నిలవనుంది.
గుడిసెలు వేసిన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలి
గుడిసెలు వేసిన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలి భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ ; భూ
ఇండో-ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ మీట్లో పాల్గొన్న మేఘా రెడ్డి..
మునుగోడు, ఆంధ్రప్రభ : న్యూఢిల్లీలోని ఫిన్లాండ్ రాయబారి కార్యాలయంలో నిర్వహించిన ఇండో-ఫిన్లాండ్ ఎడ్యుకేషన్
మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
చిట్యాల, ఆంధ్రప్రభ ; మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు
జైనూర్ పంచాయతీలో వారపు సంతల వేలంపాట
జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ప్రతి
Ram’s Action Thriller on Cards
Energetic Star Ram is occupied with debacles. He was super confident on his last film Andhra King Taluka but the film ended up as a disappointment. Ram is on a break and he is personally working on a couple of scripts. His next film has been finalized and it will be announced next week. Logi […] The post Ram’s Action Thriller on Cards appeared first on Telugu360 .
lpg |గ్యాస్ కొరత.. నష్టాల ఊబిలోకి హోటల్స్
lpg | గ్యాస్ కొరత.. నష్టాల ఊబిలోకి హోటల్స్ మూసివేత దారిలో యజమానులుఖర్చు
Jeevan Reddy : జీవన్ రెడ్డి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? ఫ్యూచర్ ప్లాన్ అదేనట
కాంగ్రెస్ తో సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రయాణానికి నేటితో ముగిసింది
7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు…
7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు… కుప్పానికి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను
పిల్లలకు విద్య, ఆహారం, ఆరోగ్యాన్ని అందిస్తున్నాం…
పిల్లలకు విద్య, ఆహారం, ఆరోగ్యాన్ని అందిస్తున్నాం… పటమట, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో
ఇప్పగూడెం వద్ద నిలిచిపోయిన పెట్రోల్ బంక్లు..
ఇప్పగూడెం వద్ద నిలిచిపోయిన పెట్రోల్ బంక్లు.. -ఏడాది నుంచి భారత్ పెట్రోల్ బంక్
ఎస్సీ ఎస్టీ వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీ
ఎస్సీ ఎస్టీ వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు
రెండోవ రోజు ఘనంగా ఉర్సు గంధ మహోత్సవం…
రెండోవ రోజు ఘనంగా ఉర్సు గంధ మహోత్సవం… ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మండలంలోని
బిజ్వార్ లోఉల్లాసంగా కొనసాగుతున్నజిల్లాస్థాయిభజన పోటీలు.
బిజ్వార్ లోఉల్లాసంగా కొనసాగుతున్నజిల్లాస్థాయిభజన పోటీలు. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని
గ్యాస్, పెట్రోల్ పై ప్రధాని క్లారిటీ
దేశంలో గ్యాస్, పెట్రోల్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ క్లారిటీ ఇచ్చారు
Ashish DeThadi Glimpse: Hits Like Thunder
Producers Dil Raju and Shirish of Sri Venkateswara Creations continue their legacy with their new film DeThadi. Ashish of Rowdy Boys and Love Me fame plays the lead in the movie directed by newcomer Aditya Rao Gangasani. After receiving warm appreciation for the first look, the makers have now unveiled the First Glimpse that hits […] The post Ashish DeThadi Glimpse: Hits Like Thunder appeared first on Telugu360 .
Telangana : ప్రభుత్వోద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
గురుకుల పాఠశాలలో విద్యార్థికి పాము కాటు..
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల
ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవ్వండి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుపొందుగల గ్రామంలో ‘రైతన్నా మీకోసం’
వార్డు అభివృద్ధే లక్ష్యం -ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను-అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు
కన్నతండ్రి కాలయముడయ్యాడు.. సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : భార్యాభర్తల కుటుంబ కలహాలకు ఘోర
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన…
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన… మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకనిమెర్లతండాలో హెల్త్
సాకరమైన పేదల దశాబ్దాల కల… పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే వసంత
జనసేన ఎమ్మెల్యేల అసంతృప్తిని విన్న పవన్ కల్యాణ్
సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు
పాత వాహనాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం… #Telangana #VehicleScrappage #Hyderabad #GreenTax
మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ…
మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ… విద్యార్థులతో కలిసి భోజనం చేసిన గద్దె
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలలో సాయంత్రం
మూడుచింతలపల్లిలో జంతర్ మంతర్… మూడు చింతలపల్లి, ఆంధ్రప్రభ : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ
చిరంజీవి సినిమాకు సంగీతం అందించాలనేది నా డ్రీమ్
యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ తన 8 ఏళ్ల సంగీత ప్రస్థానంలో 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించా రు. వాటిలో నాగార్జున నటించిన ది ఘోస్ట్, ప్రియదర్శి మల్లేశం, తేజ సజ్జ జాంబీరెడ్డి, తాప్సీ మిషన్ ఇంపాజిబుల్, నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన చిత్రాలున్నాయి. తాజాగా దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు మార్క్ కె రాబిన్. ఈ సందర్భంగా సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని, తన ప్రయాణంలోని విశేషాల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ “దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్ దక్కడం సంతోషంగా ఉంది. గద్దర్ అవార్డ్ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. డైరెక్టర్ మురళి చాలా క్లారిటీగా దండోరా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని కథాంశమే నన్ను మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రేరణనిచ్చింది. కులాల మధ్య ఉన్న అడ్డుగోడలు, చివరకు చనిపోయాక అంతిమ సంస్కారాలు కూడా చేయకుండా అడ్డుకోవడం, ఒక బ్రిడ్జి మీద నుంచి శవాలను నీటిలోకి దింపడం వంటివి దర్శకుడు చెప్పాక నా మనసు చలించింది. భావోద్వేగం నిండిన మనసుతోనే దండోరా సినిమాకు సంగీతాన్ని అందించాను. ఇక నాని తను నిర్మించిన అ..! సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం కల్పించారు. ఆ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. అలా టాలీవుడ్లో సంగీత దర్శకుడిగా నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 8 ఏళ్ల ప్రయాణంలో 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించాను. - మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాకు మ్యూజిక్ చేయాలనేది నా డ్రీమ్. - ప్రస్తు తం కథాకళి అనే ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ప్రశాంత్ వర్మతో రెండు మూవీస్ చేస్తున్నాను”అని అన్నారు.
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : తాగునీటి నాణ్యత పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంగళవారం ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ ఇంజనీర్లకు, కార్యదర్శులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రవి ప్రసాద్,మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఐజయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఫీల్డ్ టెస్ట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి నాణ్యతను నిరంతరం పరీక్షించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించవచ్చని వివరించారు. […] The post తాగునీటి నాణ్యతపై అవగాహన appeared first on Visalaandhra .
హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే!
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలో భరత్ గ్యాస్ కార్యాలయం నిర్వాహణపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు, తరచూ కార్యాలయం మూసివేయబడుతుండటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.గ్యాస్ బుకింగ్ కోసం కార్యాలయానికి వచ్చే వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండి, చివరకు నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు సాధారణంగా మారాయి. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలతో కలిసి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన […] The post హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే! appeared first on Visalaandhra .

24 C