Election campaign | 9 వార్డు రూపు రేఖలు మారుస్తా
Election campaign | 9 వార్డు రూపు రేఖలు మారుస్తా Election campaign
MLA |ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించిన చల్లా ధర్మారెడ్డి..
MLA | ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పరకాల మాజీ
9th Ward |అభివృద్ధే లక్ష్యం..మీ ఆశీస్సులే బలం
9th Ward | అభివృద్ధే లక్ష్యం..మీ ఆశీస్సులే బలం 9th Ward |
Vanaparthi |మార్నింగ్ వాక్ లో ఎన్నికల ప్రచారం
Vanaparthi | వనపర్తి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు
AP | 50 వేల శివలింగాలు సమర్పణ..
AP | 50 వేల శివలింగాలు సమర్పణ.. AP | ఘంటసాల, ఆంధ్రప్రభ
Exams | పరీక్షా కాలం.. Exams | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : విద్యార్థులకు
Zaheerabad |తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ
Zaheerabad | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : డీడీఎస్ –కృషి విజ్ఞాన కేంద్రం
S. KOTA |వంద పడకల ఆస్పత్రి భవనం ప్రారంభం..
S. KOTA | వంద పడకల ఆస్పత్రి భవనం ప్రారంభం.. ప్రారంభించిన ఆరోగ్య
Campaign | 34వ వార్డులో అనంతలక్ష్మి ప్రచారం
Campaign | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34 వార్డు
రోజురోజుకూ వైసిపి నిజస్వరూపం బయటపడుతోంది: చంద్రబాబు
అమరావతి: ప్రజల సాధికారత, సేవే కేంద్రంగా తమ పాలన ఉందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వైసిపి పాలనలో అరాచకత్వం, చట్టాల ఉల్లంఘనలు మైలురాయిగా నిలిచాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024 నుంచి రాష్ట్రంలో చట్ట పాలనను పునరుద్ధించామని తెలియజేశారు. రోజురోజుకూ వైసిపి నిజస్వరూపం బయటపడుతోందని, వైసిపి నేతలు మరింత అసహనం, అసంతృప్తికి లోనవుతున్నారని, ఒకప్పుడు ధ్వంసం చేసిన వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. చట్టమే అత్యున్నతం అనేది కూటమి పాలనలో సుస్పష్టం చేసిందని సిఎం పేర్కొన్నారు. తాము నెలకొల్పిన శాంతిభద్రతలను కాపాడటం తమ బాధ్యత అని.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని, చట్టపాలనకు విరుద్ధంగా వ్యవహరించే ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని చంద్రబాబు హెచ్చరించారు.
తల్లిదండ్రులు, సోదరిని చంపి... ఇంట్లోనే పాతి పెట్టిన కుమారుడు
బెంగళూరు: కుమారుడు కన్నతల్లిదండ్రులు, చెల్లిని చంపి అనంతరం వారి మృతదేహాలను ఇంట్లోనే పాతి పెట్టారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం విజయనగర జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిత్రదుర్గ జిల్లాకు చెందిన భీమరాజ్, జయలక్ష్మీ అనే దంపతులు కొట్టూరులో నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు అక్షయ్ కుమార్, కుమార్తె అమృత ఉంది. అమృత యువకుడితో ప్రేమలో పడి గర్బం దాల్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెతో గొడవ పడ్డారు. అమృతను అబార్షన్ చేయించాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. అబార్షన్ కోసం తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తల్లి, సోదరి హత్య చేశాడు. అనంతరం తండ్రిని చంపి ఇంట్లో గుంత తీసి మూడు మృతదేహాలను పాతిపెట్టాడు. తండ్రి కాళ్లు పొడవుగా ఉండడంతో రెండు కాళ్లు నరికి పక్కన పెట్టాడు. అనంతరం టైల్స్ వేసి బెంగళూరుకు వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు, సోదరి కనపడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ దర్యాప్తు అనుమానాలు రావడం అక్షయ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పరువు కోసం హత్య చేశాడా? లేక డబ్బు కోసమే తల్లిదండ్రులను చంపాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం భీమ్ రాజ్ పొలం విక్రయించగా వచ్చిన డబ్బును తనకు ఇవ్వాలని అక్షయ్ తన తల్లిదండ్రులతో గొడవకు దిగుతున్నాడు.
ఉపాధ్యాయులకు ఉచితంగా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సర్వీసులు
– ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బికే ముత్యాలప్ప విశాలాంధ్ర ధర్మవరం: ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఉచిత సేవలను ప్రారంభించడం ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బి కే ముత్యాలప్ప తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం జోన్ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 2025 – 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఉచితంగా చేసి ఇవ్వబడునని ఉపాధ్యాయుల పూర్తిగా ఉచితంగా సంఘాలతో నిమిత్తం లేకుండా అందించబడునని తెలిపారు. ధర్మవరం పట్టణంలో, ఎన్జీవో […] The post ఉపాధ్యాయులకు ఉచితంగా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సర్వీసులు appeared first on Visalaandhra .
AP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : లారీని కారు ఢీకొనడంతో మెడికో
బగ్గు అన్న నిరసన జ్వాల నిరసన జ్వాల
దండేపల్లి ఫిబ్రవరి 2( జనం సాక్షి) ఫోన్ టాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు …
సిట్ నోటీసులపై భగ్గుమన్న బిఆర్ఎస్
అడుగడుగున నిరసన జ్వాల.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం హత్నూర, ఫిబ్రవరి 2 (జనం సాక్షి)ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, …
జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ బాల బాలికల జిల్లా జట్టు ఎంపికలు విజయవంతంగా నిర్వహించామని శ్రీ సత్య సాయి జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సి. శీను, జిల్లా కార్యదర్శి జింక ఉదయ్ కిరణ్ తెలిపారు. వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల మైదానం నందు నిర్వహించడం జరిగింది అని, ఈ సెలక్షన్స్ కూ దాదాపుగా 80 మంది బాల బాలికలు పాల్గొనడం జరిగింది అని […] The post జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక appeared first on Visalaandhra .
Injuries |గీత కార్మికుడికి గాయాలు..
Injuries | చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి
died |బ్రిడ్జి పై నుంచి వాగులో పడి…
died | బ్రిడ్జి పై నుంచి వాగులో పడి… died | ధారూర్,
మతిబ్రమించి మాట్లాడుతున్న అంబటి రాంబాబు
–టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) అంబటి రాంబాబు మతిబ్రమించి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు . ఆదివారం పెద్దకడబూరులోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై అసభ్యకరంగా, బాధ్యతారహిత్యంగా అంబటి రాంబాబు మాట్లాడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. తిరుమల […] The post మతిబ్రమించి మాట్లాడుతున్న అంబటి రాంబాబు appeared first on Visalaandhra .
protest |బెల్లంపల్లిలో కార్మికుల నిరసన..
protest | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రైల్వే కార్మికుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం
అరకు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
ఉత్తరాంధ్రలో డోలి రహిత గ్రామాలు:మంత్రి గుమ్మడి సంధ్యారాణి విశాలాంధ్ర – డుంబ్రిగుడ : గిరిజన ప్రాంతాల అభివృద్ధి పర్యటక రంగ విస్తరణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. అరకు ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం అరకు ఫై నరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అరకు సంస్కృతిని, కళాలను ప్రపంచవ్యాప్తం చేసేందుకు అరకు మండలం చంపి గ్రామంలో […] The post అరకు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట appeared first on Visalaandhra .
Jammu Kashmir | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : జమ్మూకశ్మీర్ లో ఇవాళ
Tekumatla |క్రీడా సామాగ్రి అందజేత
Tekumatla | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వేలంపల్లి
“ఇది నా బిడ్డ పని చేసే చోటా?” తల్లి రియాక్షన్ చూస్తే! #ViralVideo #USA #FamilyLove #Heartwarming
Hyderabad : ఎస్.బి.ఐ వద్ద కాల్పుల ఘటన.. నిందితులు తప్పుదోవ పట్టించారా?
హైదరాబాద్ లోని కోఠి ఎస్.బి.ఐ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు
TG |మున్సిపల్ ఎన్నికల్లో మాదే విజయం –బండి సంజయ్
TG | మున్సిపల్ ఎన్నికల్లో మాదే విజయం – బండి సంజయ్ TG
Vijay Devarakonda |విజయ్ కి టర్నింగ్ పాయింట్ కానుందా…?
Vijay Devarakonda | విజయ్ కి టర్నింగ్ పాయింట్ కానుందా…? Vijay Devarakonda
‘లగ్గం టైం’ని చూసి థియేటర్ నుంచి నవ్వుతూ వెళ్తారు
రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా కె. యశ్వంత్ కుమార్ సమర్పణలో 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కె. హిమ బిందు నిర్మించిన చిత్రం ‘లగ్గం టైం’. ఈ మూవీకి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. నిర్మాత కె. హిమబిందు మాట్లాడుతూ .. ‘ఎన్నో కష్టాలు, ఎంతో ఖర్చు పెట్టి ‘లగ్గం టైం’ని నిర్మించాం. ’లగ్గం టైం’ని చూసి థియేటర్ నుంచి మనస్ఫూర్తిగా నవ్వుతూ వెళ్తారని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను” అని అన్నారు.దర్శకుడు ప్రజోత్ కె వెన్నం మాట్లాడుతూ .. “లగ్గం టైం’ మూవీని టీం అంతా కలిసి చాలా బాగా తీశాం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా, అందరూ చూసి మెచ్చుకునేలా మా సినిమా ఉంటుంది’ అని తెలిపారు.ఈ కార్యక్రమం లో హీరో రాజేష్ మేరు, కృష్ణ ప్రసాద్, విశ్వనాధ్ కూచనపల్లి, పవన్ తదితరులు పాల్గొన్నారు.
T20 World Cup : వరల్డ్ కప్ లో భారత్ విజయావకాశాలు ఎన్నంటే?
టీ20 వరల్డ్ కప్ మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది
నల్లగొండలో దొంగల కలకలం! వైన్ షాపు షట్టర్ పగలగొట్టి దొంగతనం #Crime #Nalgonda #Chityala #Police
Accident | అదుపు తప్పిన లారీ.. Accident | వికారాబాద్ క్రైం, ఆంధ్రప్రభ
రాజమండ్రి ప్రాంతంలో పులి... స్కూళ్లకు సెలవులు
రాజమండ్రి ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతుంది
బార్డర్ భద్రతకు భారీగా నిధులు #Budget2026 #Security #HomeMinistry #BorderForces #Census2026 #India
రీజినల్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ను కలిపే ప్రాజెక్టులకు నిధులు హుళక్కి గోదావరి మూసీ అనుసంధానానికి నిధులు ఇవ్వని కేంద్రం బడ్జెట్లో అడుగు ముందుకు పడని కీలక ప్రాజెక్టులు కేంద్ర కేటాయింపులపై తెలంగాణ ఆశలు ఆవిరి మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేంద్ర మూడోసారీ రిక్తహస్తం చూపింది. విభజన చట్టంలోని హామీలతో పాటు దాదాపు 12 కీలక శాఖలకు సంబంధించిన 47 అంశాల చిట్టా ఇప్పటికే కేంద్రం ముందు ఉంచిన తెలంగాణ ప్రభుత్వం ఈసారైనా వాటికి మోక్షం లభిస్తుందని భావించినా ఆశించిన ప్రయోజనం లేకుండా పోయింది. హైదరాబాద్ విశ్వ నగర విస్తరణకు మౌలిక సదుపాయాలకు భారీ ఊతమిచ్చే కీలక ప్రాజెక్టుల పైన కేంద్రానికి కీలక ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో వాటి పైన ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని భావించింది. మొత్తం 34 వేల 367 కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన రీజినల్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ను కలిపే 45 వేల కోట్ల విలువైన రేడియల్ రోడ్ల ప్రాజెక్టులకు నిధుల కోసం కేంద్రాన్ని కోరుతున్న తెలంగాణ ఈ బడ్జెట్లో కేటాయింపులపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. హైదరాబాద్ మెట్రో రెండవ దశ విస్తరణకు, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రై నేజీ, 17 వేల కోట్లతో నిర్మించే గ్రీన్ఫీల్డ్ హైవే, గోదావరి మూసీ అనుసంధానానికి 6 వేల కోట్లు, అనే క కీలక ప్రాజెక్టుల పైన ఆశలు పెట్టుకుంది. అంతే కాకుండా విభజన హామీ అయిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, 8 కొత్త రైల్వే లైన్ల మంజూరు పైన తెలంగాణ ఆశగా ఎదురుచూసినా నిష్ప్రయోజనమే మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలోని విమానాశ్రయాలతో పాటు, తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. కొత్తగా ఐఐ ఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల వంటి సంస్థలు మంజూరవుతాయని ప్రభుత్వం ఆశించినా ఎలాంటి ప్రకటనా రాలేదు. గత కొన్నేళ్లుగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణకు తక్కువగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో విఫలమవుతున్నారు. గత ఏడాది బడ్జెట్లో ఏపీకి రూ.9,417 కోట్ల నిధులు కేటాయిస్తే, తెలంగాణకు మాత్రం రూ. 5,337 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. 2023 -24 నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో రాష్ట్రానికి తీవ్ర అన్యా యం జరుగుతోంది. పుష్కరకాలమైనా అరకొర నిధులే తెలంగాణ రాష్ట్రం దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. నీతి ఆయోగ్ రిపోర్ట్లు, ఆర్థిక సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. పైగా జీడీపీకి (స్థూల దేశీయోత్పత్తి) 5 శాతం సమకూరుస్తు న్న రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ నామమాత్రంగా ఉండ టం గమనార్హం. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్వర్క్ విస్తీర్ణం 69 వేల కిలోమీటర్ల పైనే. అయితే తెలంగా ణ రాష్ట్రంలో మాత్రం అది 2,014.61 కిలోమీటర్లే. ఇది దేశ రైల్వే నెట్వర్క్లో 3 శాతమే. ప్రత్యేక రా ష్ట్రంగా ఏర్పడి దాదాపు పుష్కరకాలం అవుతున్నప్పటికీ రైల్వే మౌలిక సదుపాయాల లోటును పూడ్చేందుకు కేంద్ర బడ్జెట్లో సరిపడా నిధులను కేటాయిస్తున్న పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. కొత్త ప్రాజెక్టులపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించాక, వాటి మంజూరులో రైల్వే శాఖ ఏళ్ల తరబడి జాప్యం చేస్తోంది. వీటిని అధిగమించాక టెండర్లు పిలిచేందుకూ ఏళ్లు పడుతోంది. అయితే భూసేకరణలో జాప్యం, అంతర్రాష్ట్ర సమన్వయలోపం, రాష్ట్ర వాటా నిధుల్లో ఆలస్యం తదితర అం శాలూ కారణాలుగా ఉన్నట్లుగా రైల్వేశాఖ వర్గాలు వివరిస్తున్నాయి. రూ.23 వేల కోట్లు నిధులు అవసరం తెలంగాణలో ప్రస్తుతం 6 కొత్త లైన్లు, 14 డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు రూ.23 వేల కోట్లు ని ధులు కావాలి. సర్వే దశలో ఉన్నటువం టి ప్రతిపాదిత ప్రాజెక్టుల విలువ రూ. 49 వేల కోట్లకు పైమాటే. అయితే 2025- 26 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ.5,336 కోట్లు మాత్రమే కేటాయించింది. 2014 సంవత్సరానికి ముందుతో పోల్చితే తమ హయాంలో నిధుల కేటాయింపు తెలంగాణ రాష్ట్రానికి పెరుగుతోందని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నా యి. అయితే దశాబ్దాలుగా కొనసాగుతున్న లోటును భర్తీ చేయాలంటే మా త్రం నిధుల కేటాయింపు భారీగా పెరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి 2,343 హెక్టార్ల భూ సేకరణకు 1,580 హె క్టార్లను మాత్రమే సేకరించారు. 2016-17లో మం జూరైన మనోహరాబాద్- కొత్తపల్లి ప్రాజెక్టు (151.36 కి.మీ.) పనులు పుష్కరకాలమైనా సగ మే పూర్తయ్యాయి. 130.28 కిలోమీటర్లు వికారాబాద్- కృష్ణా కొత్త ప్రాజెక్టు మంజూరుకు కేంద్రం అ నాసక్తి చూపగా భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. 126 కి లోమీటర్ల కల్వకుర్తి-మాచర్ల ప్రాజెక్టును మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా ఎ లాంటి ప్రకటన ఈ బడ్జెట్లో లేకపోవడం విశేషం.
2ndFebCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
2ndFebCartoon | జాతీయ, అంతర్జాతీయ సవాళ్ల నడుమ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2ndFebCartoon |
Weather Report : చలి తగ్గిందనుకుంటుంటే.. మళ్లీ పెరుగుతుందిగా
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదు
మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదు
మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసు కేసు నమోదయింది.
చెన్నై: ఇంటర్ చదువుతున్న బాలికకు బలవంతంగా గర్భస్రావం చేయడంతో ఆమె మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం వేళచ్చేరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెంగల్పట్ట ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తన బాయ్ ఫ్రెండ్ తో శృంగారంలో పాల్గొంది. ఆమె గర్భం దాల్చడంతో ఒక్కసారిగా ఇంట్లోనే బాలిక పడిపోయింది. వెంటనే ఆమెను తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పది వారాల గర్భంతో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు ఆమెకు గర్భస్రావం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో బలవంతంగా గర్భస్రావం చేస్తుండగా బాలికకు తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో చెంగల్పట్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నారు.
Janasena : నేడు జనసేన పార్టీ కీలక సమావేశం
జనసేన పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది
ఎవరివో కానీ దారిలో నలిగిపికిలినట్లున్నావు రా! ఇటు రా! మెల్లగా ఈ పక్కకు నా కడకు - చెట్టు నీడ అనో, నదీ తీరం అనో అనుకో గొప్ప పూల తోట కాకపోయినా అమ్మ జోల పాట అవకపోయినా ఆగిపోవడానికి కాదులే మనశ్శరీరాలు ఒకింత సేద దీరడానికే రా, కూర్చో, ఇప్పటికిప్పుడు మాట పెకలట్లేదా పెకిలించాలని పెనుగులాడకు మరింత పికిలి పోకు నీ మౌనాన్ని తర్జుమా చేసుకుంటానులే స్థిరంగా కూర్చోనూ లేవా, ఫర్వాలేదు వాలిపో నా మీదకు ఒక స్తంభం అనుకో లేక పందిరో అనుకో ఆనుకో, అల్లుకుపో అలసట పడక తెప్పరిల్లాక విప్పాలనిపిస్తే పెదవి విప్పు విప్పుతూ కుదుట పడు, అది ఉప్పస నీ దారి కథను వినడానికే ఇక్కడ నేనున్నాననుకో కనులు ధారగా కురుస్తే కురవనీ, నిలవరించకు లోపలి బరువు ఖాళీ అవనీ, అది ఊరట తేటపడ్డ చూపులకు నేను చదువరినవుతాను పెనుగాలీ తుఫానూ గురు తుకొస్తే ఉలికిపడి వణికిపోకు కూలిపోకు నీ లోనా బయటా కుదురుకునేదాకా ఇదే నీకు చిరునామా నిమ్మళ పడు నిశ్చింతగా - వెయ్యేళ్ళ వ్యూహాలెందుకు ఇప్పటికీ విరామమే జీవితం, విశ్రమించు కొత్త కలలకు ఇదే అదను, శయనించు సత్తువ చేకూరాక చిత్తం కుదుట పడ్డాక మళ్ళీ నీ దారిలోకి ఇష్టమైతే వెళ్ళవచ్చు దూర తీరం పిలుపుకు దగ్గరయేందుకు- మరిచిపోకు, మళ్లీ దారి పట్టాక డస్సినట్లనిపించినపుడల్లా పక్కకు జరుగు అక్కడ నేను వుంటాను కాకపోతే మరొకరు తప్పక మనిషొకడుంటాడు ఆసరాకు - అసలు, మనిషి అంటేనే ఆసరా ప్రియ బాటసారీ! ఒక సమయంలో నీకు మరొకరు మరొక వేళలో మరొకరికి నువ్వూ! - దర్భశయనం శ్రీనివాసాచార్య
Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు కూడా తగ్గిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.
అలా జరగకపోతే రెండు రోజుల్లో తేలుస్తాం ఖమేనీ: ట్రంప్
టెహ్రాన్: ఇరాన్- అమెరికా మధ్య రోజు రోజుకు పచ్చి గడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఇరాన్ పై అమెరికా దాడి చేస్తే పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించిన విషయం తెలిసిందే. అమెరికా యుద్ధ నౌకలను రంగంలోకి దించిన తరువాత ఖమేనీ హెచ్చిరించడం ఇదే తొలి సారి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నౌకలు ఇరాన్ కు దగ్గరలోనే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. రెండు రోజుల్లో ఒప్పందం కుదరకపోతే ఖమేనీ చెప్పింది నిజం అవుతుందో కాదో తెలుస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నేను మీ కవి యాకూబ్ను.. నేను నా సాహితీ యాత్ర
మా నాన్న మహమ్మద్ మియా- చింతపండు, మిరపకాయలు తలమీద పెట్టుకుని ఊరూరూ అమ్ముకుంటూ ఖమ్మం జిల్లా కారేపల్లి వచ్చాడు. ఆ తర్వాత చిన్నప్పటి నుండి తెలిసిన తాపీ పని చేసిండు మా నాయిన కారేపల్లిలో. ఆ తరువాత పక్కనే ఉన్న కోయవాళ్ళ ‘రొట్టమాకురేవు’ అనే చిన్న పల్లెటూరు చేరిండు. అక్కడ ఉంటూ పక్కన ఉన్న ఊళ్లు తిరిగి కావిడిలో తినే దినుసులు, బెల్లం, ఉప్పు, పప్పు, పువ్వాకు, చిల్లర సరుకులు అమ్మేవాడు. ఆ తర్వాత చిన్నచిన్నగా ఎగసాయం మొదలుపెట్టిండు కౌలుకు తీసుకుని. చదువుకున్న పూర్వీకులు ఎవరూ లేరు. అంతా జీతగాళ్లే. దాశరథి పుట్టిన ఊరు వరంగల్ జిల్లా చినగూడూరు మా నాన్న పుట్టిన ఊరు. బాల్యం కనాకష్టం. అతి సాధారణమైన, కడుపేద బాల్యం. ఆయమన్న తిండి, ఆయమన్న గుడ్డలు లేని బాల్యం. చదువు ఎట్లాగో జీవితంలోకి ప్రవేశించింది. అది కూడా పంతుళ్ళ దయతో, దోస్తుల సహకారంతో సాగింది. కొత్త పలక, కొత్త పుస్తకాలు కొనుక్కోలేని చదువు. ఎవరో పాత పుస్తకాలు దానం చేసేవాళ్ళు. ఎవరో నోటు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. పేద పిల్లలకు ఇచ్చే పుస్తకాలు స్కూళ్లకు వస్తే, అవి నాక్కూడా చేరేవి. చదువు ఒంటపట్టినందు వల్ల బతుకు ఒక గాడిలో పడిందేమో. చదువు అన్ని కష్టాలనుంచి దారి చూపిస్తుందని ఆశ పడ్డానేమో. పదో తరగతి పాసైనంక చదువే ఇక దారి అని నమ్మకం కుదిరింది. ఊరునుంచి కాలు బయటపెట్టాను. ఇంటర్ కోసం కొత్తగూడెంలో అడుగుపెట్టాను. అదే విశాలమైన లోకంలోకి పెట్టిన తొలి అడుగు. మొదటి కవిత ప్రజాశక్తిలో ‘నేను’ పేరుతో 1983 అచ్చయింది. అంతకుమునుపు పాటలు రాసాను- పాటలు పాడాను. కంజీర కొట్టుకుంటూ ఎన్నెన్ని ఊళ్ళు తిరిగి పాటలు పాడుకుంటూ విద్యార్థి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నానో లెక్కచెప్పలేను. 1980 ప్రాంతాల్లో ఇంటర్ ఫెయిలై కొత్తగూడెం సింగరేణి కాలరీస్ యూనియన్ ఆఫీసు బాయ్ గా, పేపర్ బాయ్ గా ఉన్నప్పుడు, గోదావరిఖనిలో ఐస్ క్రీమ్ అమ్ముతున్నపుడు బతుకును అతి దగ్గరగా గమనించాను. కవిత్వం రాయడం వైపుకు మళ్లింది డిగ్రీ కాలంలోనే. కారణం అఫ్సర్, ప్రసేన్, సీతారాంల సాంగత్యం. తర్వాత వంశీకృష్ణ జతయ్యాడు. పాటలు రాయడం, పాడటం, విద్యార్థి ఉద్యమాల నుంచి కవిత్వం వైపుకి వచ్చాను. ఒక ఔట్లెట్ వెదుక్కోవడం, నన్ను నేను వ్యక్తీకరించుకోవడంకోసం కవిత్వం దరిచేరాను. పల్లె నుంచి పట్నం వైపుకు ప్రయాణిస్తున్నప్పుడు నన్ను అతలాకుతలం చేస్తున్న భయం, అభద్రత, నిస్పృహల నుండి కవిత్వం కాపాడింది. తొలి కవితల్లో, ప్రవహించే జ్ఞాపకం సంపుటిలో ఈ తొట్రుపాటు భావన స్పష్టంగానే కనపడుతుంది. కవిత్వం సాధించదగిన అంశాలలో నేను విశ్వసించేది మానవీయత. దానిని మనుషుల్లో పాదుకొల్పేందుకు కవిత్వం మంచి ఉపకరణం అని నా విశ్వాసం. డిగ్రీ చదువు దుర్గమ్మ గారి, కె.ఎల్.గారి సౌజన్యం. ఆ సౌజన్యమే లేకపోయుంటే నా జీవితమేమై ఉండేదో ఊహించడం కష్టం. నా జీవన సహచరి శిలాలోలిత, కవయిత్రి. పరిశోధకురాలు. నా సహాధ్యాయి. అసలు పేరు పురిటిపాటి లక్ష్మి. నా జీవితంలోకి ఆమె ప్రవేశం నన్నో సుస్థిరగమ్యం వైపునకు నడిపించిందనే కృతజ్ఞత నాకు ఆమెపై ఉంది. సాహిత్య జీవితానికి బాసటగా, ఆటుపోటుల జీవితానికి ఆమె తెరచాపగా నిలబడింది. కవిత్వాన్ని మునుపటికంటే విస్తృతంగా ప్రజలకు చేరువచేయడంలో కృషి కొంత చేసాననిపిస్తోంది. నేను 2012లో సోషల్ మీడియాలో ఆరంభించిన ‘కవి సంగమం’ నాకు గర్వకారణం. ఇవాళ 18,000 మందికి పైగా కవిత్వ ప్రేమికులు అందులో ఉన్నారు. అప్పుడే కలం పట్టిన వాళ్లకు నేనో యారోమార్కులా వారి మార్గంలో నిలబడ్డాను. ఆత్మీయ నేస్తంలా మారాను. ఆకలి దప్పుల ప్రయాణంలో ఆసరాగా సాధ్యమైనంత మేరకు ఉండగలిగాను. నిరంతరంగా మూడు తరాల కవి సంగమం, రెండు తరాల కవిసంగమం, ఊరూరా కవి సంగమం కార్యక్రమాలు, పోయెట్రీ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ కొత్త కవులకు దారులు నిర్మిస్తున్నాను. మా ఊరు రొట్టమాకురేవులో ప్రారంభించిన గ్రంథాలయం Give back to the society భావనలో భాగం. లౌకిక ప్రజాస్వామిక వేదికల నిర్మాణంలో పాలుపంచుకున్నాను. 2002 గుజరాత్ మారణ హోమం తర్వాత నేను కన్వీనర్గా ఉన్న ఒక టీమ్ గుజరాత్కు వెళ్లి వచ్చాక, ఇక్కడ విస్తృతంగా సభలు చేయడంలో, పుస్తకాలు వేసి ప్రచారం చేయడంలో ముందున్నాను. ఇప్పటి ‘సమూహ’ వేదిక కన్వీనర్గా భిన్నత్వంలో ఏకత్వపు భావనను నిలపడం అనే దృక్పథంతో పనిచేస్తున్నాను. లౌకిక స్వప్నం గురించే మాట్లాడడం, అదే ఈ దేశపు అవసరమని అప్పుడూ, ఇప్పుడూ నమ్ముతున్నాను. ‘మొహబ్బత్ కా దుకాన్’ల అవసరం ఈ దేశానికి చాలా చాలా అవసరం. ‘ప్రవహించే జ్ఞాపకం’ నుండి ‘మనుషుల్రా మనుషులు’ కవితా సంపుటాల వరకు... సమాజ ప్రతిఫలనాల్ని నా జీవిత నేపథ్యపు అనుభవాలను మేళవించి కవిత్వం చేయడానికి ప్రయత్నించాను. నా కవిత్వంలోని ‘నేను’ నేను మాత్రమే కాదు, సమాజంలోని అనేక నేనులు. సంఘర్షణాత్మక జీవితానుభవపు సారాన్ని కవిత్వంగా మలిచాను. అంతర్లీనంగా భారతీయ ముస్లిం వేదనను వినిపించాను. సెక్యులరిజం అవసరాన్ని, ప్రాధాన్యతను కవిత్వంలో నిరంతరంగా రాస్తున్నాను. సరళంగా కవిత్వ వ్యక్తీకరణ ఉండాలని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించాను. ‘నా కవిత్వమే నా ఆత్మకథ’ అని ఒకచోట రాసుకున్నాను. అదే కవిత్వంలో ప్రతిఫలించే నిజం. ప్రవహించే జ్ఞాపకం నుండి వరుసగా సరిహద్దురేఖ, ఎడతెగని ప్రయాణం, నదీ మూలం లాంటి ఆ ఇల్లు, తీగల చింత, ‘మనుషుల్రా మనుషులు’ ఈ సంకలనాల పేర్లు నా కవిత్వ పరిణామపు సంకేతాలుగా అనుకుంటాను. వ్యక్తి, సమాజం, అంతశ్చేతన, సంఘర్షణ.. ఈ అంశాలు సూత్రప్రాయంగా ఈ పేర్లలో ధ్వనించడం గమనించవచ్చేమో!పరిశోధనలో తెలుగు సాహిత్య విమర్శ అంశంగా తీసుకుని ప్రత్యేకంగా కృషిచేసాను. నాలుగు పుస్తకాలు ప్రచురించాను. కవిత్వ సృజనగురించిన అనేక అంశాలతో ‘సృజనానుభవం’గా రాసాను. బీహార్, పాట్నా నుండి అందుకున్న ‘నయీ ధార నేషనల్ అవార్డు’ జాతీయ స్థాయిలో ప్రసిద్ధమైనది. దానితోపాటు తెలుగు నేలపై అందుకున్న ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, మఖ్దూమ్ అవార్డు, సి.నారాయణరెడ్డి అవార్డు, రావెళ్ల వెంకటరామారావు అవార్డు, ఆలూరి బైరాగి అవార్డు, ఎదిరెపల్లి మశమ్మ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, ATA అమెరికా అవార్డు వంటివి ప్రముఖమైనవి. ఐదేళ్లు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు అడ్వైజరీ బోర్డు మెంబరుగా ఉన్నాను. 2019లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యాను. 2024 నుండి హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను. కవిత్వం కవిత్వంగా చూసే దృష్టికంటే అది సమాజంలోని మనిషిని మనిషిగా తీర్చిదిద్దే, రూపుదిద్దే ప్రక్రియగా ఉండాలని నా ఆకాంక్ష. అభిమతం. మనుషుల్ని హ్యాండిల్ విత్ కేర్ అన్నానందుకే. మనిషిని మనిషిగా చూడలేని సమాజం ఎంత ప్రగతి సాధించింది అని గొప్పలు చెప్పుకున్నా అది ప్రగతి కాదు. ప్రగతి అంటే మనుషులు మనుషులుగా మారడం. చూడబడటం. ప్రేమించబడటం. ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగలగడం. దానికోసం కవిత్వం ఒక ఉపకరణంగా మారాలని నా తాపత్రయం. అదే నిజమైన మానవ వికాసం. “నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతటవే వచ్చి వాలేను!” పచ్చని చెట్లలాంటి మనుషుల్ని కలగంటూ జయహోలు.
Uri, Dhurandhar, Now Nikhil’s The India House
Nikhil Siddhartha starrer ambitious film The India House, directed by Ram Vamsi Krishna, tells the story of the historic London building that once powered India’s early 20th-century revolutionary movement. The film team is racing ahead with a large-scale production led by Abhishek Agarwal Arts, V Mega Pictures, and presented by Ram Charan. Music director Shashwat […] The post Uri, Dhurandhar, Now Nikhil’s The India House appeared first on Telugu360 .
Municipal Elections |బీఆర్ఎస్ విజయం ఖాయం..
Municipal Elections | బీఆర్ఎస్ విజయం ఖాయం.. Municipal Elections, వికారాబాద్, ఆంధ్రప్రభ
వరల్డ్ కప్ లో పాక్ నిర్ణయం సరైంది కాదు: ఐసిసి
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ లు ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయంపైన ఐసిసి అందోళన వ్యక్తం చేసింది. ఇది క్రీడా నియమాలకు విరుద్దమని తెలిపింది. ఐసిసితో పాకిస్థాన్ ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని ఐసిసి పేర్కొంది. టోర్నమెంట్ లో ఎంపిక చేసిన మ్యాచ్ ల్లో మాత్రమే ఆడుతామనడం, భారత్ తో ఆడబోమనడం మంచిది కాదని ఐసిసి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు పాక్ నిర్ణయం షాక్ కలిగించిందని, ఈ మ్యాచ్ ఆ దేశపు క్రికెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఐసిసి హెచ్చరించింది. రెండు దేశాల మధ్య వివాదాలను క్రీడల్లోకి తీసుకరావడం మంచిది కాదని హితువు పలికింది. ప్రపంచ క్రికెట్ లోనే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ బలే క్రేజ్ ఉంటుంది. గత 14 సంవత్సరాల ఇరు దేశాల మధ్య ప్రత్యక్షంగా సిరీస్ లు లేనప్పటికి ఐసిసి, ప్రధాన టోర్నమెంట్లలో తలపడుతున్నాయి. ఒకవేళ పాక్ మ్యాచ్ ను బహిష్కరిస్తే 2010 తరువాత రెండు దేశాల మధ్య జరగని మ్యాచ్ గా నిలిచిపోతుంది.
Telangana : హైదరాబాద్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు
Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా? అయితే గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది
Ambati Rambabu Sent to Remand, Wife Knocks on High Court Doors Seeking Protection
The remand of former minister Ambati Rambabu has added another layer of tension to Andhra Pradesh politics. According to the remand report submitted by the police, Ambati Rambabu repeatedly used abusive language against Chief Minister N. Chandrababu Naidu and made statements that could provoke confrontation between political groups. The report states that his remarks were […] The post Ambati Rambabu Sent to Remand, Wife Knocks on High Court Doors Seeking Protection appeared first on Telugu360 .
హైదరాబాద్: ప్రముఖ బౌద్ధ, టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు దక్కింది. 90 ఏళ్ల వయసులో అరుదైన గౌరవాన్నిదలైలామా పొందారు. గ్రామీ విజేతగా ఆయన నిలువడంతో ప్రపంచ వ్యాప్తంగా దలైలామా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1న జరిగిన 68వ గ్రామీ అవార్డుల ప్రీ సెరిమనీ కార్యక్రమంలో 'మెడిటేషన్: ది రిఫ్లెక్షన్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ది దలైలామా' అనే ఆడియో బుక్ కు గాను ఉత్తమ ఆడియో బుక్, నరేషన్ స్టోరీ టెల్లింగ్ విభాగంలో ఆయనకు ఈ అవార్డు వరించింది.
Earth Quake : జమ్మూకాశ్మీర్ లో భారీ భూకంపం
జమ్మూకాశ్మీర్ లో భారీ భూకంపం సంభవించింది.
Ambati Rambabu : రాజమండ్రి జైలుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు
మాజీ మంత్రి అంబటి రాంబాబును రాజమండ్రి జైలుకు తరలించారు
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం 5.35 నిమిషాలకు శ్రీనగర్ కు నైరుతి మూలంలో 20 కిలో మీటర్ల దూరంలో బద్గాం జిల్లాలోని సోయిబుగ్ లో భూకంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.మళ్లీ భూమి కంపింస్తుందనే భయంతోనే ప్రజలు భయటనే ఉండిపోయారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. హిమాలయ పర్వతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో జమ్ము కశ్మీర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Union Budget : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఏమిచ్చింది..? భవిష్యత్ లో ప్రయోజనమేనా?
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు కొంత భవిష్యత్ లో మేలు చేకూర్చేలా ఉంది
రోడ్డు ప్రమాదంలో దంత వైద్యురాలు మృతి
అమరావతి: రోడ్డు ప్రమాదంలో దంతవైద్యురాలు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కారు అదుపుతప్పి ముందున్న వాహనాన్ని ఢీకొట్టి అనంతరం ఢివైడర్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాగల్లు చెందిన జోన్నకూలి లిఖిత(23) ఓ ప్రైవేటు కాలేజీలో లిఖిత డెంటల్ కోర్సు చదువుతోంది. ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉండి చదువు కొనసాగిస్తున్నారు. కారులో ఆమె తన ముగ్గురు స్నేహితులతో కలిసి రాజమహేంద్రవరం నుంచి వసతి గృహానికి కారులో వెళ్తుండగా రాజానగరం, దివాన్ చెరువు మధ్య గుర్తు తెలియని వాహనానికి కారు ఢీకొంది. అనంతరం డివైడర్ ఢీకొట్టి బోల్తా పడింది. ముందు సీట్లో కూర్చున్న లిఖిత ఘటనా స్థలంలో మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉక్రెయిన్ బస్సుపై రష్యా దాడి: 15 మంది మృతి
రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది, ఒక వైపు ముగిసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా మరో వైపు ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో దాడులకు తెగపడింది. నిప్రో నగరంలో బస్సుపై డ్రోన్ తో దాడి చేయడంతో 15 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడినట్టు సమాచారం. ఉక్రెయిన్ లోని అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తికి సంస్థకు చెందిన బస్సు అని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. నిప్రో పెట్రోవ్క్స్ ప్రాంతంలోని విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన డిటిఇకె గనులపై రష్యాదాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపణలు చేశారు. షిఫ్ట్ ముగిసిన అనంతరం కార్మికులు బస్సులో వెళ్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. కనిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్రెయిన్ పై దాడులను తాత్కాలికంగా ఆపేందుకు రష్యా అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపిన రోజుల వ్యవధిలో దాడి జరగడం గమనార్హం.
న్యూఢిల్లీ : ప్రపంచ డేటా సెంటర్లకు టాక్స్ హాలిడే, వ్యవసాయం, పర్యాటక రంగాలకు ప్రోత్సాహంతో పాటు., తయారీ రంగానికి పెద్దపీట వేస్తూ, దేశ అభివృద్ధిని సుస్థిరంగా ముందుకు నడిపే 2026-27 కేంద్ర బడ్జెట్ ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక ఒడుదుడుకులు నేపథ్యంలో నిలకడగా వృద్ధిని కొనసాగించే దీర్ఘకాలిక బ్లూ ప్రింట్ గా నిర్మల రూ. 53.5 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రకటించారు. లోక్ సభలో రికార్డు స్థాయిలో 9వ సారి వరుసగా బడ్జెట్ ను సమర్పించిన నిర్మలా సీతారామన్ ప్రభుత్వ మూలధన వ్యయాన్ని12.2 లక్షల కోట్లకు పెంచారు. గత సంవత్సరం ఇది రూ.11.2 లక్షల కోట్లుగా ఉంది. బడ్జెట్లో ఆర్థికమంత్రి పూర్తిగా ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి, ప్రజాదరణ పొందిన పథకాలను విస్మరించడం, పారిశ్రామిక వేత్తలకు నిరాశ కల్గించడంతో బడ్జెట్ స్టాక్ మార్కెట్ ను కుదిపివేసింది. ఒక్క సారిగా పలు స్టాక్స్ కుప్పకూలడం సంచలనంగా మారింది. డెరివేటివ్స్ ట్రేడింగ్ పై అధిక లావాదేవీ పన్ను సెంటిమెంట్ పై ప్రభావం చూపింది. ప్రధానంగా సామాన్య ప్రజలకు ఊరటకలిగించిన విషయాలలో 17 కేన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకం మినహాయించడం, బ్యాగేజీ నియమ నిబంధనలను సడలించడం, వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 10 శాతం తగ్గించడం ద్వారా కస్టమ్స్ విధానాన్ని సరళీకృతం చేయడం వంటివి ఉన్నాయి. ఔషధాలు, సెమీ కండక్టర్లు, అరుదైన - భూ ఖనిజాలు, రసాయనాలు, మూలధన వస్తువులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు వంటి ఏడు రంగాలలో ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థికమంత్రి తెలిపారు. ఉద్యోగ కల్పన, సాంకేతికతతో కూడిన అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. పశుసంవర్థక, మత్స్య సంపద, అధికవిలువ గల వ్యవసాయ రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించనున్నట్లు తెలిపారు. భారతదేశాన్ని బయో ఫార్మా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు వచ్చే ఐదేళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించినట్లు నిర్మల ప్రకటించారు. వస్త పరిశ్రమకు పెద్దపీట వేయనున్నారు. ఎగుమతుల ప్రోత్సాహం కోసం సమగ్ర కార్యక్రమాన్ని ప్రకటించిన ఆర్థికమంత్రి. పర్యావరణ పర్యాటకానికి ప్రోత్సాహం పర్యావరణ హితమైన పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో పర్యావరణ పరంగా స్థిరమైన పర్వత మార్గాల అభివృద్ధితో పాటు, భారతీయ ప్రాచీన సంసృ్కతికి అద్దంపట్టే 15 పురావస్తు ప్రదేశాల అభివృద్ధిని ప్రతిపాదించారు. చిన్న వ్యాపారులకు మద్దతుగా నిలిచేందుకు, ప్రమాణాలతో కూడిన సంస్థల ప్రోత్సాహానికి రూ. 10,000 కోట్లతో ఎస్ఎంఇ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం బడ్జెట్ సందర్భంగా ఆదాయపు పన్నువ్యవస్థలో భారీ మార్పులు, పలు ఉత్పత్తులపై జిఎస్టీ తగ్గింపు కొనసాగించడం వల్ల ప్రజలకు పెద్ద ఊరట లభించింది.అవి, మౌలిక సదుపాయాలపై ఖర్చు, కార్మక చట్టాల సవరణ, ఆర్ బిఐ వడ్డీ రేటు తగ్గింపులతో మరింత సౌకర్యంగా ఉంది. ఈ కారణంగానే భారత ఆర్థికవ్యవస్థ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై విధించింన శిక్షాత్మక 50 శాతం సుంకాన్ని తట్టుకునేందుకు సహాయ పడింది. 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ క్లిష్టమైన నేపథ్యంలో వచ్చింది. దేశంలో డిమాండ్ నిలకడగా ఉండి, 'ద్రవ్యోల్బణం కాస్త తగ్గినప్పటికీ, బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అస్థిర వస్తువుల ధరలు, ప్రధాన కేంద్ర బ్యాంకుల అసమాన ద్రవ్య సడలింపులతో ప్రపంచ అనిశ్చితుల మధ్య ఈ బడ్జెట్ రూపకల్పన చేయాల్సి వచ్చింది. అయినా ప్రభుత్వం స్వదేశంలో వినియోగాన్ని పెంచడానికి, ఉపాధి కల్పనను వేగవంతం చేసేందుకు, మూలధన వ్యయాన్ని పెంచడానికి ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఆదే సమయంలో ఆర్థికలోటు తక్కువగా ఉంచేందుకు కృషి చేస్తున్నది. అత్యంత క్లిష్ట పరిస్థితులలోనూ భారతదేశం వికసిత భారత్ వైపు వడివడిగా అడుగులు వేస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విస్తరిస్తున్న వాణిజ్యం, మూలధనం అవసరాలతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ప్రపంచమార్కెట్లతో అనుసందానం కావాలని ఆమె ఆకాంక్షించారు. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణం- జిడిపి నిష్పత్తిని 56.1 శాతం నుంచి 55.6 శాతానికి తగ్గించడం, ప్రస్తుత ఆర్థి క సంవత్సరంలో ఆర్థికలోటును 4.4 శాతం నుంచి 4.3 శా తానికి తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. 10వేల కోట్లతో బయో ఫార్మా తయారీ కేంద్రం రూ. 10,000 కోట్ల వ్యయంతో బయో ఫార్మా తయారీ కేంద్రం, సెమీ కండక్టర్ మిషన్ రెండో దశ, ఎలక్ట్రానిక్ భాగాల తయారీకి రూ. 40,000 కోట్ల వ్యయం, ఖనిజ సంపన్న రాష్ట్రాల్లో అరుదైన భూమి కారిడార్ లను ఏర్పాటు చేయడం వంటి చర్యలను ఆర్థికమంత్రి ప్రకటించారు.
2Feb2026 |ఆదివారం పంచాంగం |మాఘ పౌర్ణమి విశేషాలు, రాశి ఫలితాలు
2Feb2026 | ఆదివారం పంచాంగం | మాఘ పౌర్ణమి విశేషాలు, రాశి ఫలితాలు
వెనెజువెలా చమురు కొనుగోలుకు భారత్ ముందుకొచ్చింది
` దీనికి సంబంధించిన ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాం ` చైనా కూడా మాతో చర్చలు జరిపే అవకాశం : ట్రంప్ వాషింగ్టన్(జనంసాక్షి): భారత చమురు దిగుమతుల …
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ వి కసిత్ భారత్ లక్షానికి అనుగుణంగా రాష్ట్రం సహకరిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి అన్ని రంగాల్లో మొండి చేయి చూ పారని రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ప్రజాభవన్లో విలేఖరుల స మావేశంలో డిప్యూటీ సిఎం మాట్లాడారు. కేంద్రం ప్రవేశ పెట్టిన రూ.53.47 లక్షల కోట్ల బడ్జెట్లో రాష్ట్రం కోసం ఏదైనా ఉంటుంది అని ఆశ పడ్డామ ని ఎటువంటి కేటాయింపులు లేకపోవడం అన్యాయమన్నారు. సిఎం రేవంత్రెడ్డి, ఎంపిలు పలు మార్లు ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలిసి చేసిన విజ్ఞప్తులు బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. మూసీ, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టులను గుర్తించి నిధులు ఇస్తారనుకుంటే ఏమీ ఇ వ్వలేదన్నారు. పది వేల కోట్లతో వచ్చే ఐదు సంవత్సరాల్లో కేంద్రం బయోఫార్మా అభివృధ్దిపై ఫోకస్ చేసిందని, దాంట్లో అయినా రాష్ట్రం గుర్తు రాలేదని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన ఎకో సిస్టమ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందని, కెమికల్ పార్క్ లకు హైదరాబాద్ ఫార్మా హబ్ గా ఉందని అందులో సైతం కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో స్పోర్ట్ని అభివృద్ధి చేసేందుకు విజన్ డ్యాక్యూమెంట్లో ప్రణాళికలు సిద్దం చేశామని, స్పోర్ట్ యూనివర్శిటీ పెట్టామని వీటి అభివృద్ధికి కూడా కేంద్ర సహకరించలేదన్నారు. ఆడియో, వీడియో, కామిక్స్, గేమింగ్స్ లాంటి ఆరెంజ్ ఎకానమీకి హైదరాబాద్ కేంద్రంగా ఉందని, తెలంగాణ ఏం తప్పు చేసిందని దాన్ని కూడా బాంబేకు తరలించారని డిప్యూటీ సిఎం ప్రశ్నించారు. ప్రపంచానికి కోవిడ్లో వ్యాక్సీన్ అందించిన హైదరాబాద్ మెడికల్ హబ్గా ఉందని, రీజినల్ మెడికల్ హబ్ అంటూ బడ్జెట్లో చెప్పిన కేంద్రం రాష్ట్రానికి ఎటువంటి నిధులు కేటాయించలేదని భట్టి తెలియజేశారు. మూసి ప్రక్షాళన ఊసే లేదని, యెనెస్కో గుర్తింపు పొందిన రామప్ప, మున్నూరు, కవ్వాల్ టైగర్ ఫారెస్ట్, కృష్ణా, గోదావరి మధ్య పచ్చని వాటర్ ఫాల్స్, లాంటి పర్యటక ప్రాంతాలను పట్టించుకోలేదని, ప్రపంచం గుర్తించినా, నిధులు విషయంలో కేంద్రం మాత్రం చిన్న చూపు చూసిందన్నారు. సమ్మక్క సారక్క దర్శనానికి న్యూజిలాండ్ ట్రైబ్స్ వచ్చిన విషయాన్ని డిప్యూటీ సిఎం గుర్తు చేశారు. సెమీ కండక్టర్ల తయారీ నేడు ప్రంపచానికి అవసరమయిన రంగమని హైదరాబాద్ లాంటి ఎకో సిస్టమ్ ఉన్న రాష్ట్రానికి సెమీకండక్టర్ల తయరీకి చేయూత ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్రం ఎస్సి, ఎస్టి, మైనార్టీ, ఇతర సంక్షేమం గురించి ఆలోచనే లేదని, ఉపాధి హామీ పథకాలనికి పేరు మార్పుతో పాటు, బడ్జెట్లో కూడా తూట్లు పొడిచారని భట్టి ధ్వజమెత్తారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఎర్త్ మినరల్స్ అని రాష్ట్రంలోని సత్తుపల్లి, రామగుండం, సింగణి లాంటి ప్రాంతాల్లో విలువయిన లిథియం, స్కాండియం లాంటి మినరల్స్ ఉన్నాయని వాటి కోసం రాష్ట్రానికి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఫిజికల్ డెఫిషిట్ లో రాష్ట్రానికి నాలుగు శాతం ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, కేంద్రం మాత్రం 4.3 శాతం ఫిజికల్ డెఫిషిట్ పెట్టుకుందని, రాష్ట్రానికి మాత్రం అనుమతి ఇవ్వలేదని, తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఈ బడ్జెట్ సెషన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లను కలిసి నిధులు కేటాయించాలని వినతి పత్రాలు ఇవ్వాలని కోరారు.
` త్వరితగతిన పూర్తి చేయండి ` నిర్మాణంలో ఎలాంటి అలసత్వాన్ని ఉపేక్షించం ` నిరంతరం పనుల సమీక్షపై రూట్ మ్యాప్ ` భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దష్టి …
` కేసీఆర్ చట్టానికి అతీతుడా? ` టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్(జనంసాక్షి):మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్కు సంబంధించిన సిట్ విచారణ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ …
సీఎం రేవంత్రెడ్డికి అరుదైన గౌరవం
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో జరిగే ఏఐ పాలసీ సదస్సుకు ఆహ్వానం వర్చువల్గా హాజరవుతానన్న ముఖ్యమంత్రి హార్వర్డ్ విద్యార్థులతో చర్చిస్తున్న సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్: ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ …
` సామన్యులకు లేదు ఊరట! ` మూడు కర్తవ్యాలు లక్ష్యంగా సాధనే లక్ష్యం ` ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకొస్తున్నాం ఆత్మనిర్భరత వల్లే 7 శాతం గ్రోత్ …
మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆదివారం సుదీర్ఘంగా విచారించింది. మధ్యా హ్నం 3 గంటలకు నందినగర్లోని కెసిఆర్ నివాసంలో సిట్ అధికారులు 4.45 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం కెసిఆర్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. విచారణ ముగిసిత తర్వాత కెసిఆర్ నివాసం నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫోన్ ట్యా పింగ్ ఆదేశాలు ఎవరి సూచనలతో జారీ అయ్యాయన్న విషయంపై, నిర్ణయ ప్రక్రియలో కెసిఆర్ పాత్రపై సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఈ విచారణలో కెసిఆర్కు సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించిన ట్లు తెలిసింది. గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆ ధారంగా కెసిఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించిన ట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్పై తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కెసిఆర్ సిట్ విచారణలో చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామంపై ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిస్తారని, అది వారి బాధ్యత అని చెప్పినట్లు తెలిసింది. ఆ సమాచారం ఎలా సేకరించారో సిఎంకు అవసరం లేదు కదా..? అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎప్పటినుంచి మొదలైంది..? ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారా..? అని కెసిఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులకు మీరు స్వయంగా ఆదేశాలు జారీ చేశారా..? అనే ప్రశ్నను స్పష్టంగా అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై కెసిఆర్ నుంచి స్పష్టత తీసుకునేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పటి నుంచి ప్రారంభమైందనే విషయంపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీసినట్లు సమాచారం. ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు.. అది సాధారణ భద్రత కోసమా... లేక రాజకీయ అవసరాల కోసమా..అంటూ పలు అనుబంధ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా..వారి ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారా..అంటూ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విచారణలో అత్యంత కీలకంగా మారిన ప్రశ్న ఇదేనని సమాచారం. ప్రభాకర్ రావు పదవీకాలం పొడగింపుపై విచారణ.. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారం కూడా సిట్ అధికారుల విచారణలో ప్రధాన అంశంగా మారింది. పదవీకాలం ముగిసిన ప్రభాకర్ రావుకు మళ్లీ పదవిని ఎందుకు పొడిగించారు...ఆ నిర్ణయం వెనుక కారణాలు ఏంటి..? అంటూ కెసిఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు.. పరిపాలనా నియమావళికి విరుద్ధంగా ఒకే వ్యక్తికి రెండు కీలక బాధ్యతలు అప్పగించడంపై కూడా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు అప్పగించారు.. అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉందా..? అనే కోణంలో విచారణ సాగినట్లు తెలిసింది. ఎంఎల్ఎ కొనుగోలు కేసులో సమాచారం ఎలా వచ్చింది..? ఎంఎల్ఎ కొనుగోలు కేసు సమయంలో తీసుకున్న చర్యలపై కూడా కెసిఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. మీ పార్టీ ఎంఎల్ఎలు ఇతర పార్టీలకు వెళ్తున్నారని మీకు ఎలా తెలిసింది.. ఆ సమాచారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చిందా..?అన్న అనుమానాలతో అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. పార్టీ నిధులతో ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు చేశారా..? అని సెట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు పార్టీ నిధులు కేటాయించారా.. ప్రభుత్వ నిధులు కాకుండా పార్టీ డబ్బులు ఎందుకు ఉపయోగించారు..? అంటూ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ ఫండ్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయలేదని, ఆ అవసరం పార్టీకి లేదని చెప్పినట్లు తెలిసింది. బిఆర్ఎస్ పార్టీకీ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వారి ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ జాబితాలో ఎందుకు ఉన్నాయనే అంశంపై కెసిఆర్ వివరణ కోరినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు..ఎలాంటి అధికారిక ఫైళ్లు ఉన్నాయి.. భద్రతా కారణాల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ జరిగిందా..? అన్న అంశాలపై సిట్ అధికారులు సమగ్ర విచారణ జరిపినట్లు సమాచారం. కార్యకర్తలకు కెసిఆర్ అభివాదం సిట్ విచారణ ముగిసిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ నేతలతో భేటీ అయిన అనంతరం అధినేత బయటకు వచ్చి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు. నందినగర్లోని కెసిఆర్ నివాసానికి బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు సహా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.పోలీసుల బారీకేడ్లు తోసుకుంటూ కెసిఆర్ నివాసానికి కార్యకర్తలు పరుగులు తీశారు.జై కెసిఆర్, సిఎం..సిఎం అంటూ నినాదాలు చేశారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదని, తమ ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదని ఈరోజు(ఆదివారం)తో తేలిపోయిందని బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ అధినేతల పైశాచికానందం, ఇందులో ఏమీ లేదని సిట్ అధికారులు కూడా అర్థమైపోయిందని, దీంతో ఇక్కడితో ఈ కేసుకు ఫుల్స్టాప్ పడుతుందని భావిస్తున్నామని అన్నారు. సిట్ విచారణ అనంతరం కెసిఆర్ ఎర్రవెళ్లికి వెళ్లిన తర్వాత నందినగర్ నివాసంలో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు తేలేమని బిజెపి, కాంగ్రెస్ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకుందుకే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే కెసిఆర్ను విచారణను పిలవడంతో ఆం తర్యం అదేనని ఆయన ఆరోపించారు. కెసిఆర్ మీద బురదజల్లడం అంటే సూర్యుడిపైన ఉమ్మేసినట్లే అవుతుందని ఇప్పటికైనా అర్థమై ఉంటుందని అన్నారు. సిట్ విచారణకు కెసిఆర్ హాజరు కావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ చట్టాన్ని గౌరవించే బాధ్యతాయుతమైన పౌరుడిగా సిట్ అధికారులకు కెసిఆర్ పూర్తిగా సహకరించారని తెలిపారు. ఆయనను అడిగిన ప్రశ్నలకు కుండబద్దలు కొట్టినట్లుగా సమాధానం చెప్పి సిట్ అధికారుల కళ్లు తెరిపించారని చెప్పారు. సిట్ ఎవరి నేతృత్వంలో నడుస్తుందని ప్రశ్నించారు. సిట్ నేతృత్వం వహించేది మహేష్కుమార్ గౌడ్..? అధికారులా..? అంటూ ఎద్దేవా చేశారు. చట్టం ముందు అందరూ సమానమే అని, విచారణ చేస్తే ఆందోళన చేస్తారా..? అని పిసిసి ఛీఫ్ ప్రశ్నిస్తున్నారని, మరి ఇడి కేసులో సోనియాగాంధీ, రాహుల్గాంధీలను విచారిస్తే మీరెందుకు వెళ్లి రాజ్భవన్ ముందు ఆందోళనలు చేశారని నిలదీశారు. తెలంగాణ ప్రజలచేత రెండు సార్లు ఎన్నుకోబడిన పాపులర్ సిఎం, రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కెసిఆర్ను వేధిస్తే కాళోజీ నారాయణరావు చెప్పినట్లు ఉక్కుపాతరేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పట్టించుకునే నాయకుడే లేరని విమర్శించారు. సిఎం రేవంత్రెడ్డి ఛార్టెడ్ ప్లైట్లలో చెక్కర్లు కొడుతూ గాలి తిరుగుడు తిరుగుతున్నారని, ఆ డబ్బులు ఎవడి అబ్బ సొమ్మని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పట్టపగలు కోఠిలో కాల్పులు జరిగాయి, మరోవైపు గంజాయి స్మగ్లర్ను పట్టుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్పై కారు ఎక్కించి చంపేశారని, రెండో కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క సారక్క జాతర అధ్వాన్న ఏర్పాట్లతో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, వాటిని పట్టించుకునే నాథుడు లేడు, మంత్రులకు సోయి లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసులో లీకులే తప్ప ఆధారాల్లేవు ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులే తప్ప ఆధారాల్లేవు అని కెటిఆర్ తేల్చిచెప్పారు. ఈ కేసులో డొల్లతనం బయటపడిందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ అటెన్షన్ను దెబ్బ తీయడానికే విచారణ పేరుతో డ్రామా చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ప్రభుత్వం బాకీపడ్డ మొత్తానికి సంబంధించిన బాకీకార్డులు పంచుతూ వివరిస్తామని తెలిపారు.ఫోన్ ట్యాపింగ్లు, కుంభకోణాలు అంటూ రెండేళ్లుగా 1,2,3గా సిట్లు వేస్తూ హిట్ 1, హిట్ 2, హిట్ 3 సినిమా లాగా టైం పాస్, బక్వాస్ తప్ప ఇందులో ఏమీ లేదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే లీకులు విశ్వసించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికలపై కెసిఆర్ ఆరా..తిరిగి ఎర్రవెళ్లికి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం కెటిఆర్, హరీష్ రావు, పార్టీ ముఖ్యనేతలతో కెసిఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై చర్చించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. గ్రౌండ్ లెవల్లో పార్టీ బలంగా ఉందని, బరిలో రెబల్స్ లేకుండా చూసుకోవాలని సూచించారు. పార్టీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం నందినగర్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కెసిఆర్ బయలుదేరి వెళ్లారు.
సౌమ్య మృతికి బాధ్యులపై కఠిన చర్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబు ల్ సౌమ్య మృతికి కారణమైనవారిపై కఠిన చర్య లు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోలీ సు శాఖను ఆదేశించారు. విధి నిర్వహణలో సౌ మ్య ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్య క్తం చేశారు. సౌమ్య మృతిపట్ల రేవంత్రెడ్డి ఆదివా రం తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సౌమ్య కు టుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామ ని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. విధి నిర్వహణ లో అసాధారణ తెగువ ప్రదర్శించి అసువులు బా సిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రా ష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతికకాయానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నివాళులర్పించారు. అనంతరం సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌమ్య లేని లోటు భర్తీ చేయలేనిదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఆమె సర్వీస్ కాలం అంటే రిటైర్మెంట్ వయసు వరకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. విధి నిర్వహణలో ఆమె చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కాగా ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక్క రోజు వేతనాన్ని సౌమ్య కుంటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని, తమ సహచరిని కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది భద్రత ప్రభుత్వ కర్తవ్యమని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జోలికి వచ్చే దుండగుల వెన్ను వణికించేలా అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు ఇచ్చే నిర్ణయం తమ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల ముఠాల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి రెండు నిముషాల మౌనం పాటించి, ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఖురేషి, ఉప కమిషనర్లు జె.హరికిషన్, అంజన్ రావు, చంద్రయ్య, ప్రదీప్ రావు, కృష్ణ ప్రియ, డి.శ్రీనివాస్, నవీన్ కుమార్, అంజిరెడ్డి, సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, తెలంగాణ ప్రొహిబిషన్, ఆబ్కారీ గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.లక్ష్మణ్ గౌడ్, కార్యదర్శి చంద్ర శేఖర్, విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, భరత్, ఏడుకొండలు, ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం కృష్ణ, మధుబాబు, కానిస్టేబుల్ సంఘం అధ్యక్షుడు పి.రాజిరెడ్డి, నాగరాజు, అనంత్ రెడ్డి, మల్లేష్తో పాటు సుమారుగా 500 మందికిపైగా ఆబ్కారీ సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం :మహేష్ కుమార్ గౌడ్ గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి, నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా అక్రమ గంజాయి రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన సౌమ్య సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. మృతిచెందిన సౌమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో వారికి ధైర్యం చేకూరాలని ప్రార్థించారు. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద సౌమ్యకు నివాళి ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి పట్ల నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ఎక్సైజ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు ఆదివారం నివాళులర్పించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపి అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
సోమవారం రాశి ఫలాలు (02-02-2026)
మేషం సమాజంలో సేవ కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు సాధిస్తారు. వృషభం కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. మిధునం ఋణ పరమైన ఒత్తిడిలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలాకష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు. కర్కాటకం సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలు పురోగతిలో సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సింహం చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తుంది. చేపట్టిన వ్యవహారములలో అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కన్య ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తుల ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. వృశ్చికం సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ధనస్సు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి. మకరం సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం కలుగుతుంది. ఖర్చుకు మించిన ఆదాయం సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగమున ఆశించిన అవకాశములు అందుతాయి. కుంభం ప్రయాణాలు వాయిదాపడతాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. మీనం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు పొందుతారు.
యూపి వారియర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
యూపి వారియర్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూపి వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా 123 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.4 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(34), ఫెఫాలీ వర్మ(29), వోల్వార్ట్(47) పరుగులు చేశారు. యూపి బౌలర్లలో దీప్తి శర్మ2, శిఖా పాండే, డాటిన్, ఎక్లిస్టన్ తలో వికెట్ పడగొట్టారు.
dammapeta |మందలపల్లి గురుకులంలో విద్యార్థి పరార్.
సమయస్ఫూర్తితో బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ఇంటెలిజన్స్ కానిస్టేబుల్ భార్య దమ్మపేట, ఆంధ్రప్రభ
వికసిత్ భారత్ బడ్జెట్:ఎంపి ఈటల
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ బడ్జెట్ను ప్రవేశ పెట్టారని బిజెపి లోక్సభ సభ్యుడు ఈటల రాజేందర్ ప్రశంసించారు. అభివృద్ధి, ప్రజా రంజక బడ్జెట్ అని ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉపాధి, చేతి వృత్తుల వారికి, ఆరోగ్యానికి పెద్ద పీట వేశారని ఆయన తెలిపారు. దూరదృష్టితో దీర్ఘకాలిక నిర్ణయాల వల్ల భారత జిడిపి ఏడు శాతం పెరిగిందని ఆయన తెలిపారు. గత ఏడాది యాభై లక్షల కోట్ల రూపడాయల బడ్జెట్ ప్రవేశపెడితే ఈ ఏడాది యాభై మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారని ఆయన చెప్పారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గత ఏడాది బడ్జెట్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెడితే ఈ ఏడాది కూడా పెట్టారని ఆయన తెలిపారు. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియాకు అనుగుణంగా యువశక్తి దేశ పురోగమనంలో భాగస్వాములు చేయాలని లక్షంతో బడ్జెట్ పెట్టారని ఆయన చెప్పారు. ఇంకా అనేక మందులపై దిగుమతి పన్ను తగ్గించారని, క్యాన్సర్తో పాటు పదిహేడు రకాల మందులపై పన్ను రాయితీ ఇచ్చి పేద రోగులకు ఉపశమనం కల్పించారని ఈటల రాజేందర్ తెలిపారు.
ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 124
డబ్ల్యూపిఎల్ 2026 సీజన్ లో ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ యూపి వారియర్స్ ఆదివారం వడోదరలోని బిసిిఎ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది . టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన యూపి వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పొయి 123 పరుగులు చేసింది. దీప్తి శర్మ(24), శిఖా పాండే(23), సిమ్రన్ షైక్(22) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మారిజేన్ కాప్ 3, చినెల్లీ హెన్నీ 2, శ్రీ చరణి 2, మిన్ను మణి ఒక వికెట్ తీశారు.
టాలీవుడ్లో విషాదం.. నటుడు రఘునాథరెడ్డి మృ*తి #Tollywood #RaghunathaReddy #FilmNews #Hyderabad
ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ లో పెండింగ్ నిధులను నెలవారీగా విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ. 720 కోట్లు విడుదల చేసింది. జనవరి మాసానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ. 720 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత సంవత్సరం జూన్ నెలాఖరులో రూ.183 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసంగా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా విడుదల చేసిన నిధుల్లో 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్ క్యాష్మెంట్ పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసింది. వీటితోపాటు విడుదలైన బిల్లులో గ్రాట్యుటీ, జిపిఎఫ్, సరెండర్ లీవ్ లు,అడ్వాన్సులున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఇడి క్లీన్చిట్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎపి సిఎం చంద్రబాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) క్లీన్ చిట్ ఇచ్చింది. రెండు రోజుల కిందట విశాఖపట్నంలోని పిఎంఎల్ఎ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో నిధుల మళ్లింపు, నేరపూరిత కార్యకలాపాల్లో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇడి స్పష్టంగా పేర్కొంది. ఇడి దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, దానికి సంబంధించిన వ్యక్తులు షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులను మళ్లించినట్లు గుర్తించింది. వికాస్ ఖన్వేల్కర్, సుమన్ బోస్ , ఇతరులు ఈ నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఇడి తేల్చింది. 2024 అక్టోబర్లో రూ.23.5 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. 2023 సెప్టెంబర్లో వైసిపి ప్రభుత్వ హయాంలో సిఐడి కూడా కేసులు పెట్టింది. ఆయనను అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలు లో పెట్టింది. కానీ ఒక్క రూపాయి ఆర్థిక లావాదేవీలను చూపించలేకపోయింది. తప్పుగా నమోదు చేసిన కేసుగా చివరికి గుర్తించి విజయవాడ లోని ఎసిబి కోర్టులో క్లోజర్ రిపోర్టును సమర్పించింది. చంద్రబాబుపై మోపిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని సిఐడి తన నివేదికలో వెల ్లడించింది. ఈ నివేదికను అంగీకరించిన కోర్టు, జనవరి 13న చంద్రబాబుతో పాటు మరో 36 మందిపై ఉన్న కేసును అధికారికంగా కొట్టివేసింది. ఈ పరిణామాలు రాజకీయంగా, న్యాయపరంగా చంద్రబాబుకు పెద్ద విజయంగా నిలిచాయి. ప్రభుత్వ నిధులను దారి మళ్లించి స్కామ్ చేశారన్న ఆరోపణలను కేంద్ర దర్యాప్తు సంస్థ, రాష్ట్ర దర్యాప్తు సంస్థ రెండూ తోసిపుచ్చడంతో ఈ సుదీర్ఘ న్యాయ వివాదానికి తెరపడింది. అడ్వకేట్ జనరల్ (ఎజి) దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ సుదీర్ఘ దర్యా ప్తు తర్వాత చంద్రబాబుతోపాటు పలువురు నేతలకు స్కామ్తో ఎలాంటి సంబంధం లేదని కోర్టు నిర్దారించిందని వెల్లడించారు.
SIT Grills Former KCR in Phone Tapping Investigation
The phone tapping case in Telangana has entered a decisive phase with the questioning of former Chief Minister K Chandrashekar Rao by the Special Investigation Team. The inquiry took place on Sunday at his residence in Nandinagar Hyderabad and lasted for more than four hours. Officials began the examination at 3 pm after making arrangements […] The post SIT Grills Former KCR in Phone Tapping Investigation appeared first on Telugu360 .
రూ.10,000 కోట్లతో కంటైనర్ పథకం
వచ్చే ఐదేళ్లలో కంటైనర్ తయారీని ప్రోత్సహించేందుకు రూ. 10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఒక పథకాన్ని ఆర్థికమంత్రి నిర్మల ప్రతిపాదించారు. పర్యావరణ పరంగా స్థిరమైన కార్గో తరలింపును ప్రోత్సహించేందుకు, అధికంగా విలువైన, ఆధునిక సాంకేతిక విలువలతో కలిగిన కంటైనర్ లను దేశీయంగా తయారీకి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ఆదివారం బడ్జెట్ ప్రతిపాదనల సందర్భంగా చెప్పారు.రానున్న ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం 20 కొత్త జలమార్గాలను (ఎన్ డబ్ల్యూ) అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తల్చేర్ , అంగుళ్ ఖనిజ సంపన్న ప్రాంతాలను, కళింగ నగర్ వంటి పారిశ్రామిక కేంద్రాలను పరదీప్, ధమ్రా ఓటరేవులకు అను సంధానించడానికి ఒడిశా లోని ఎన్ డబ్ల్యూ -5 నుంచి జలమార్గాల ఏర్పాటు మొదలవుతుంది.వారణాశి, పట్నా లో లోతట్టు జలమార్గాల కోసం ఓడల మరమ్మతు వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు .2047 కల్లా లోతట్టు జలమార్గాలు, తీర ప్రాంత షిప్పింగ్ వ్యవస్థ వాటాను 6 నుంచి 12 శాతానికి పెంచేందుకు, కోస్టల్ కార్గో ప్రమోషన్ పథకం ప్రారంభించాలని మంత్రి ప్రతిపాదించారు.జలమార్గాలను సమర్థంగా నిర్వహించేందుకు నావికుల శిక్షణ సంస్థలను, ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. జలమార్గాల అంతటా యువత శిక్షణ పొందేందుకు, నైపుణ్యాల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది.
ఆస్ట్రేలియా ఓపెన్ విజేత అల్కరాజ్
ప్రతిష్ఠాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అత్యంత చిన్నవయసులో కెరీర్ గ్రాండ్స్లామ్ సాధించిన ఆటగాడిగా నయా చరిత్ర సృష్టించాడు. అల్కరాజ్ 22 ఏళ్ల వయసులో నాలుగు వేర్వేరు గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్గా అల్కరాజ్కు ఇది ఏడో గ్రాండ్స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇప్పటికే వింబుల్డన్, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్లను రెండేసి సార్లు గెలుచుకున్నాడు. తొలిసారిగా ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ను కూడా సొంతం చేసుకున్నాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో అల్కరాజ్ 26, 62, 63,75తో సెర్బియా యోధుడు, నాలుగో సీడ్ నొవాక్ జకోవిచ్ను ఓడించాడు. కెరీర్లో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించాలని భావించిన నొవాక్ మరోసారి నిరాశే మిగిలింది. ఆరంభం నుంచే మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్లో నొవాక్ ఆధిపత్యం చెలాయించాడు. అల్కరాజ్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ సెట్ను దక్కించుకున్నాడు. కానీ తర్వాతి సెట్లలో అల్కరాజ్ అనూహ్యంగా పుంజుకున్నాడు. తన మార్క్ షాట్లతో నొవాక్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇదే క్రమంలో రెండో, మూడో సెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ నాలుగో సెట్లో అల్కరాజ్కు నొవాక్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన అల్కరాజ్ సెట్తో పాటు మ్యాచ్ను గెలిచి ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్గా అవతరించాడు.
అండర్-19 ప్రపంచకప్.. సెమీస్ కు చేరిన భారత్
అండర్-19 ప్రపంచకప్లో భాగంగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్ యువ జట్టు పాకిస్థాన్ యువ జట్టుతో జరిగిన మ్యాచ్లో 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియా సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసింది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. చివర్లో కనిష్క్ చౌహాన్ (35) విలువైన పరుగులు జోడించాడు. 253 పరుగుల లక్ష్య చేధనలో పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే ఈ లక్ష్యాన్ని 33.3 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంది. కానీ భారత బౌలర్ల ధాటికి వారు కనీసం గెలవలేకపోయారు. ఉస్మాన్ ఖాన్ (66) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే తన స్పిన్ మ్యాజిక్తో 3 వికెట్లు పడగొట్టి పాక్ నడ్డి విరిచాడు
సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి మృతి
సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి గారు శనివారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 72 ఏళ్లు. హైదరాబాద్లోని కుషాయిగూడలో ఉన్న తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించాడు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్ది నెలల క్రితమే ఆయన కుమారుడు కూడా మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. రఘునాథ రెడ్డికి భార్య అన్నపూర్ణ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.నాటక రంగం నుంచి వచ్చిన ఆయన 1991లో శోభన్ బాబు నటించిన 'సర్పయాగం' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తన విలక్షణమైన కంచు కంఠంతో, గంభీరమైన మాట తీరుతో సహాయ నటుడిగా, విలన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 370 సినిమాల్లో నటించారు. 'ఓరేయ్ రిక్షా', 'ప్రేమించు పెళ్లాడు', 'చంటి', 'శ్రీరామరాజ్యం' వంటివి ఆయనకు మంచి పేరు తెచ్చిన చిత్రాలు.కేవలం సినిమాలే కాకుండా పలు ప్రజాదరణ పొందిన సీరియల్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఇదో గుడ్డి బడ్జెట్: రాహుల్ గాంధీ
భారతదేశ వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని గుడ్డి బడ్జెట్ ఇది. యువతకు ఒకపక్క ఉద్యోగాలు లేవు, ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. పెట్టుబడిదారులు మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ఇంటి పొదుపు తగ్గింది. రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. ఆయా రంగాల దిద్దుబాటును తిరస్కరించే బడ్జెట్ ఇది. వాటి గురించి ప్రస్తావనే లేదు. వాస్తవ సమస్యలను పక్కదారి పట్టించారు.
Foundation |‘టీఏఏఎల్ఎం’ ఫౌండేషన్ శ్రమదానం
Foundation | ‘టీఏఏఎల్ఎం’ ఫౌండేషన్ శ్రమదానం Foundation | బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ
ఖానాపూర్ పరిసరాల్లోని నాలుగు కిలోమీటర్ల పరిధిలో 15 నిమిషాల వ్యవధిలో రెండు చిరుతల సంచారం శనివారం రాత్రి కలకలం రేపింది. ఖానాపూర్ను ఆనుకునివున్న కొమురం భీమ్ చౌరస్తా నుంచి తర్లపాడు మధ్య అటవీ ప్రాంతంలో రాత్రి 8ః30 సమయంలో ఓ చిరుత రోడ్డు దాటడానికి ప్రయత్నించగా నిర్మల్ వైపు నుంచి కడెంకు వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 15 నిమిషాల వ్యవధిలోనే ఖానాపూర్ నుంచి దిలావర్పూర్ మీదుగా సత్తెనపల్లి వెళ్లే రహదారి ఆనుకొనివున్న పంట పొలంలో మరో చిరుత కనిపించి కలకలం సృష్టించింది. దిలావర్పూర్కు చెందిన మంగతార అనే మహిళా రైతు.. తన పంట చేలో తరుచుగా వ్యవసాయ పనిముట్లు చోరీకి గురవుతుండటంతో రక్షణ కొరకు 8 సీసీ కెమెరాలు అమర్చారు. శనివారం రాత్రి 9 గంటలలోపు మంగతార అనే రైతు పంట చేనులో చిరుత సంచరించడంతో పక్కనే ఉన్న రైతులు భయాందోళనకు గురయ్యారు. చిరుత కనిపించడంతో రాత్రిళ్లు పంట చేనుకు కాపలాలకు వెళ్లే రైతులు జంకుతున్నారు. కొమురం భీమ్ చౌరస్తా సమీపంలో చిరుత కనిపించడంతో అక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న స్టాటస్టిక్స్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. సిబ్బంది అడవిలో రోడ్డుపై టెంట్లు వేసుకొని ఎన్నికల తనిఖీ విధులు నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి చిరుతలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి సంచరిస్తున్న చిరుత పులుల ఆచూకీ కనుగొని.. వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించి ఎన్నికల సిబ్బందికి, పంట పొలాలకు కాపలా వెళ్లే రైతులకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.
Cardensearch |శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్…
Cardensearch | శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్… Cardensearch | నందికొట్కూరు,
బడ్జెట్ ఓ అవకాశాల హైవే: పిఎం మోడీ
బడ్జెట్ చరిత్రాత్మకమైనది.140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేసి, వికసిత్ భారత్ కోసం స్పష్టమైన రోడ్మ్యాప్ రూపొందిస్తుంది. నిర్మల ప్రతిపాదించిన బడ్జెట్ ఓ అవకాశాల హైవే. బడ్జెట్ మహిళల బలం..శక్తివంతమైన ఉనికికి ప్రతిరూపం. ఈ బడ్జెట్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు కొత్త ఊపును ఇస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణానికి ఈ బడ్జెట్ పునాది. అదే విధంగా సంస్కరణలకు కొత్త శక్తిని, కొత్త వేగాన్ని ఇస్తుంది. ప్రపంచంలో భారతదేశం పాత్రను మరింత బలోపేతం చేస్తుంది. భారతదేశంలోని 1.4 బిలియన్ పౌరులు కేవలం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థపై సంతృప్తి చెందలేదు. త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేదుకు బడ్జెట్ దోహదకారిగా ఉంటుంది. ఈ బడ్జెట్ విశ్వాసం ఆధారిత పాలన, మానవ-కేంద్రీకృత ఆర్థిక చట్రం యొక్క దృక్పథాన్ని కలిగి ఉంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు: ముగిసిన కెసిఆర్ సిట్ విచారణ..
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సిట్ విచారణ ముగిసింది. నందినగర్లోని నివాసంలో కెసిఆర్ని సిట్ అధికారులు విచారించారు. సుమారు ఐదు గంటలపాటు సిట్ అధికారులు కెసిఆర్ను ప్రశ్నించారు. సిట్ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి, నారాయరెడ్డి, శ్రీధర్, కెఎస్ రావు ఈ విచారణలో పాల్గొన్నారు. కెసిఆర్ విచారణను సిట్ అధికారులు ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేశారు. ఈ కేసులో కెసిఆర్ వాంగ్మూలాన్ని కూడా సిట్ అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం సిట్ అధికారులు సంబంధిత డాక్యూమెంట్లు, ఇతర ఆధారాలతో సిట్ అధికారులు నందినగర్లోని నివాసాన్ని విడిచి వెళ్లారు.
Forest |వికారాబాద్ జిల్లాకు భవిష్యత్తు ఉంది…
Forest | వికారాబాద్ జిల్లాకు భవిష్యత్తు ఉంది… Forest | వికారాబాద్, ఆంధ్రప్రభ
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం: ఎంపి మల్లు రవి
కేంద్ర బడ్జెట్ నిరాశజనక బడ్టెట్ అని కాంగ్రెస్ ఎంపి మల్లు రవి అభివర్ణించారు. దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలను పూర్తి నిరాశకు గురి చేసిందన్నారు. ముఖ్యమంత్రి,మంత్రులు చేసిన విజ్ఞప్తులను పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ,జాతీయ ప్రాజెక్టులు, హైదరాబాద్ మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని కోరినా అవి ఏవీ ఇవ్వకపోగా, హైదరాబాద్ మెట్రో గురించి ప్రస్తావన లేనే లేదన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై బడ్జెట్లో మాట్లాడతారని, ప్రస్తుత భారతను గాలికి వదిలేసి 2047 ఫోకస్ చేస్తూ.. ఇప్పుడున్న సమస్యలను పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉందని, నిరుద్యోగ సమస్యను గుర్తించకపోవ డం అన్యాయం కాక మరేమిటి? అని ప్రశ్నించారు. 11 ఏళ్లుగా 22 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, 2014 నుంచి కార్పొరేట్ సంస్థలకు అనుకూల బడ్జెట్ ఇస్తున్నారని తెలిపారు. వృద్ధి రేటుకు అర్థం ఉండదని, సామాన్య ప్రజలకు ఉపయోగం లేకుండా ఉండే వృద్ధి రేటు ఉందని.. ఉన్నవారు లేని వారికి మధ్య అంతరం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సమానత్వాన్ని బిజెపి మర్చిపోయిందని విమర్శిం చారు. ఉపాధి హామీకి నిధులు పెంచారు అంటున్నారు కానీ అవి బడ్జెట్లో కనిపించడం లేదన్నారు. అదే విధంగా నిరుద్యోగం, నిత్యావసర ధరలు పెరగడం వల్ల పక్క దేశాల్లో యువత ఆందోళనలు చేస్తున్నాయని గుర్తు చేశారు. నిత్యవసర ధరలు తగ్గించడం లేదని, ఇది పేదలకు వ్యతి రేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలనేది రైతుల ప్రధాన డిమాండ్, దాని గురించి కూడా ప్రస్తావించలేదన్నా రు. ప్రధాన పంటలకు సంబంధించి బడ్జెట్లో ప్రస్తావించలేదని, పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడలేదని, దేశవ్యాప్తంగా ఉన్న నిరు ద్యోగం, పట్టణ ఉపాధి కల్పన, పంటలకు చట్టబద్దత గురించి మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. బ్రిటిష్ వారు ఉన్నపుడు పెట్టేలా ప్రస్తుత బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. పాలమూరురంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ లేదన్నారు. మూసి ప్రక్షాళన కు నిధులు ఇవ్వలేదని, గంగ నదికి,యమునా నదికి నిధులు ఇస్తారని, మూసి నదికి ఇవ్వడం లేదని, తెలంగాణకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు అమలు చేయాలని, తెలంగాణ వాటా నిధులు విడుదల చేయాలని, తెలంగాణ బిజెపి ఎంపిలు ప్రధాని ఆర్థిక మంత్రితో మాట్లాడి, తెలంగాణ అవసరాలు తీర్చడానికి పనిచేయాలని సూచించా రు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పార్లమెంటు లోపల బయట పోరాడుతామని ఎంపి మల్లు రవి వెల్లడించారు.
Press Club |అసత్య ఆరోపణలు మానుకోవాలి…
Press Club | అసత్య ఆరోపణలు మానుకోవాలి… Press Club | చెన్నూర్,
వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ ఇంటికి నిప్పు
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్కు నిరసన సెగ తగిలింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిని ముట్టడించిన టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడికి దిగిన టీడీపీ శ్రేణులు ఆయన ఇంటికి నిప్పంటించారు. జోగి రమేష్ ఇంట్లో భారీగా మంటలు అలుముకుని దట్టమైన పొగ కమ్మేసింది. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మైలవరం, విజయవాడ పశ్చిమ, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు ముట్టడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు. ఆయన తండ్రి జోగి మోహనరావు, సతీమణి శకుంతల దేవి, చిన్న కుమారుడు రోహిత్ దాడి సమయంలో ఇంట్లోనే ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటి ముందు ఫ్లెక్సీలు చించేసి హంగామా సృష్టించారు. ఈ ఘటనపై వైసీపీ నాయకుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా ఇటీవల కల్తీ మద్యం కేసులో అరెస్టయ్యి బెయిల్ పై విడుదలైన జోగి రమేష్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కు చిప్ దెబ్బతిందని, కల్తీ మాటలతో టీడీపీ కల్తీ అయ్యిందని అంటూ జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చంద్రబాబు, లోకేష్ లపై జోగి రమేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ క్యాడర్ ఆయన ఇంటిపై దాడికి దిగినట్లు సమాచారం. దాడి సమాచారం తెలుసుకుని వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు జోగి నివాసంలోకి వెళ్లగా టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.

24 C