వేంకటేశ్వర ఆలయంలో చోరీ.. ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : కరీంనగర్
గుండేరులో పడి యువకుడు మృతి.. ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండల పరిధిలోని
LPG Gas : గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు.. జాగ్రత్తగా లేకపోతే అంతే
గ్యాస్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సరికొత్త సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు
చిన్నస్వామి స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్లకు గ్రీన్ సిగ్నల్
బెంగళూరు: త్వరలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లను నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిపుణుల కమిటీ భద్రత తదితర అంశాలపై ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటక హోం శాఖ మంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో బెంగళూరులో ఐపిఎల్ మ్యాచ్ల నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగి పోయాయి. మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, మాజీ విజేత సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య సీజన్ ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఆరంభ వేడుకలు కూడా ఇక్కడే జరుగనున్నాయి. కాగా, 2025లో ఆర్సిబి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లను నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
LPG Gas : భారత ప్రజలకు గుడ్ న్యూస్.. గ్యాస్ కొరత ఇక లేనట్లే
భారత ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. హార్ముజ్ ద్వారా నౌకలు సురక్షితంగా భారత్ కు చేరుకుంటున్నాయి
ముంబై: అతి చిన్న వయసులోనే అసాధారణ బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో అభిమానులతో పంచుకున్నాడు. బిసిసిఐ నమన్ అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యత హర్షా భోగ్లేతో వైభవ్ ముచ్చటించాడు. ఈ క్రమంలో తన కెరీర్కు సంబంధించి పలు విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం తన దృష్టంతా ఆటపైనే ఉందన్నాడు. బయట జరిగే చర్చ గురించి అసలు పట్టించుకోనని స్పష్టం చేశాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగడమే లక్షంగా పెట్టుకున్నట్టు తెలిపాడు. రానున్న రోజుల్లో టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదగాలనేది ప్రధాన ఆశయమన్నాడు. అవకాశం లభిస్తే సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు. భవిష్యత్తులో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టడమే లక్షంగా పెట్టుకున్నట్టు వివరించాడు. టి20 ఫార్మాట్లో గేల్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు తిరగరాసేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. రానున్న ఐపిఎల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. ప్రతి మ్యాచ్లో జట్టుకు అండగా నిలువడమే లక్షంగా పెట్టుకున్నానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు సర్వం ఒడ్డుతానని వైభవ్ స్పష్టం చేశాడు.
వేములవాడలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు..
వేములవాడలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు.. వేములవాడ, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన
కులవివక్షను దునుమాడిన కుసుమ ధర్మన్న
ఈ దేశంలో జరుగుతున్న చాలా ప్రేమ వివాహాలు కులాంతర వివాహాలే. ప్రేమికులలో ఒకరు దళితులైతే జరిగే పరిణామాలేమిటో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తక్కువగా, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వార్తల రూపంలో గమనిస్తూనే ఉన్నాం. కులం పేరుతో మనుషులను చంపడానికి సైతం వెనుకడుగు వేయటం లేదంటే ఈ కులం ఎంత ప్రమాదకర స్థాయిలో మనిషిని నడిపిస్తున్నదో అర్థమవుతుంది. ఇది శాస్త్ర సాంకేతికత తెచ్చిన విప్లవాల యుగం. ఇప్పుడే ఇలా ఉంటే అంబేద్కర్ కాలంలో, కుసుమ ధర్మన్న లాంటి కవులు జీవించిన 1884-1946 మధ్యకాలంలో కులం ఎంత క్రూరంగా కోరలు సాచి ఉంటుందో ఊహించటం కష్టం కాదు. కుసుమ ధర్మన్న ఆనాటి దళిత జీవితంలోని సకల అంశాలను తన సాహిత్యంలో ప్రతిభావంతంగా రికార్డు చేశాడు. ఆయన కాలం నాటి కవులందరు అగ్రవర్ణాల వాళ్లే. ఆనాటికి దళితుల్లో చదువుకున్నవాళ్ళు తక్కువ. కిందికులాలు చదువుకోకూడదనే శాసనాలు ఆనాటికింకా సడలిపోలేదు. ఎలాగోలా కష్టపడి చదువుకున్నప్పటికీ కులంపోటులు మాత్రం తప్పేవికావు. అందుకే అగ్రవర్ణాల వాళ్ళ కవిత్వానికి, దళితుడైన ధర్మన్న కవిత్వానికి చాలా వ్యత్యాసం కన్పిస్తుంది. వాళ్ళ రచనల్లో ఎక్కడా కనిపించని జీవితం ధర్మన్నలో కనిపిస్తుంది. పాండిత్య ప్రదర్శన కోసం రాసిన కవిత్వం కాదు కాబట్టి భాష కూడా సరళంగా ఉంటుంది. బాధలో ఉన్నవాడు తన భాషలో మాట్లాడుతాడు, కానీ పండిత భాషలో మాట్లాడడు. అందుకే ధర్మన్న గేయం రాసినా, పద్యం రాసినా ఇంకొకటి రాసినా ఆనాడు ప్రచారంలో ఉన్న గ్రాంథిక భాషలో కాకుండా సామాన్యుల భాషలోనే రాశాడు. ఇదికూడా ఆనాటికొక విప్లవమే. కుసుమ ధర్మన్న తెలుగులో తొట్టతొలి దళితకవి. అంతకుముందు దళిత జీవితాలలోని దైన్యానికి చలించిన కొందరు అగ్రవర్ణాలవాళ్ళు సానుభూతితో కూడిన రచనలు చేశారు. కానీ ఎవరి నొప్పిని వారు చెప్తేనే స్పష్టత వస్తుంది. ఈ క్రమంలో ధర్మన్న, జాషువా లాంటివాళ్ళు ముందుకువచ్చి కులరక్కసి దళిత జీవితాలను ఎలా పీల్చిపిప్పి చేస్తుందో చెప్పేదాకా దాని తాలూకు చర్చ సాహిత్య సాంస్కృతికరంగాలలో పెద్దగా లేదు. తెలంగాణ కేంద్రంగా అప్పటికే తీవ్రమైన దళితోద్యమాన్ని నడిపిస్తున్నాడు భాగ్యరెడ్డి వర్మ. దేశం మొత్తమ్మీద అంబేద్కర్ దళితుల హక్కుల కోసం, రాజకీయంగా దక్కవల్సిన ప్రాతినిధ్యం కోసం గంభీరమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ ఉద్యమాల ప్రభావం కుసుమ ధర్మన్న మీద ఉంది. అంబేద్కర్తో సహా అప్పటి దళితోద్యమకారులందరినీ కలిసి విస్తృతంగా చర్చలు చేపట్టి తన గమ్యాన్ని, గమనాన్ని స్పష్టంగా నిర్వచించుకున్నవాడాయన. ఈ క్రమంలో ధర్మన్నను అర్థం చేసుకోవడంలో కేవలం సాహిత్య రంగానికి మాత్రమే పరిమితం కాకూడదు. సామాజికంగా ఆయన సాగించిన ఉద్యమాలు, ఇతర రంగాలలో ఆయన చేసిన సేవలు విస్తృతమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవన్నింటి ఫలితంగా సాగిన కృషి ఆయన సాహిత్యరంగాన్ని బలోపేతం చేసింది. 1921లో ‘మాకొద్దీ తెల్లదొరతనమూ’ అంటూ గరిమెళ్ళ సత్యనారాయణ రచించిన ప్రసిద్ధ గేయం అందరికీ తెలుసు. అదే సంవత్సరంలో కుసుమ ధర్మన్న‘మాకొద్దీ నల్లదొరతనమూ’ అనే గేయాన్ని రాసి తెల్లదొరల నుంచి స్వాతంత్య్రం నల్లదొరల చేతిలోకి వెళ్లినంత మాత్రాన దళితుల జీవితాల్లో ఏ మార్పు ఉండదని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. ఇదే కాలంలో రాజకీయరంగంలో అంబేద్కర్ ఇదే ప్రధాన విషయంగా పోరాటం చేస్తున్నాడు. అంబేద్కర్ ఆలోచన సాహిత్యంలో కుసుమ ధర్మన్న ద్వారా ఇలా ప్రతిఫలించింది. ఈయన సాహిత్య జీవితంలో ప్రధానమైన రచన ఇది. దళితునిగా ఆయన వేదననంతా అత్యంత మర్యాద పూర్వక గొంతుతో వినిపించాడిందులో. ‘మీ తల్లిదండ్రులు మిమ్ము గన్నట్టూల/ మా వారు మమ్మూ గనలేద?/ మీకు మాకు పుట్టుక వకటే కాద?/రక్తమాంసాలు ఒకటి గాద?/కష్ట సుఖము మీకె మాకు లేద?/మీకు మాకు దేవుడొకడు గాడ?/మతము మీకు మాకు ఒకటి గాద?/యీ వాదా భేదమేల యిది మీకు మర్యాద?’ అన్న ప్రశ్నలు ఆనాటి కాలానికి ఎంతో విప్లవాత్మకమైనవి. దళితునిగా తాను, తన సమాజం అనుభవించిన వివక్ష తాలూకు ప్రస్తావన, అభ్యర్థన పూర్వకమైన గొంతు ‘మా కొద్దీ నల్లదొరతనం’లో కనిపిస్తే 1933లో వచ్చిన ‘హరిజన శతకం’లో ఆయన స్వరంలో కొంచెం తీవ్రత కనిపిస్తుంది. ఆలోచనల్లో తాత్విక గాఢతతోపాటు సిద్ధాంతబలం కూడా తోడయ్యింది. ఉద్యమాలతో కలిసిపోవడం వల్ల కనిపించిన చేర్పు ఇది. అందుకే హరిజన శతకానికి రాసిన హెచ్చరికలో-‘ప్రియ హరిజన సోదరా! నీవు హీనజాతి వాడివా? బానిసవా? పరులకు దాస్యము జేయుటకు భగవంతుడే నిన్నిట్లు విధించినాడా? ఆహా! ఏమి యీ నిరంకుశత్వము? స్వార్థపరుడైన నరుడే నీకీ విషయము ఉగ్గుపాలతోబోసి. మోసపుచ్చి. నిన్ను తన దాసానుదాసునిగా జేసికొని బంధించి యున్నాడని నేటికైనను గ్రహించితివా?’ అని ఆలోచించమని చెప్పగలిగాడు. కులం వెనకున్న రాజకీయాల గురించి మాట్లాడగలిగాడు. గాంధీ ప్రభావంతో హరిజన శతకం రాశాడు కానీ తదనంతరం కాలంలో ఆ పదాన్ని వ్యతిరేకించాడు. ఇవేకాక ‘అసుర పురాణం’, ‘అంటరాని వాళ్ళా?’ మొదలైన రచనలు కూడా దళిత దృష్టికోణం నుంచే రచించాడు. తన సంపాదకత్వంలో నడిపించిన ‘జయభేరి’ పత్రికను కూడా దళితోద్యమ ప్రచారానికే వాడుకున్నాడు. ఇన్ని రకాలుగా తన కాలంనాటికి దళిత స్వరాన్ని ఇంత బలంగా వినిపించిన మరొకకవి తెలుగులో లేరు. వందేళ్ల కిందటివే అయినప్పటికీ ఆయన రచనలకు కాలదోషం పట్టలేదు. భారత సామాజిక నిర్మాణంలో కులం పోనంత కాలం, కుల దాష్టీకాలు సమసిపోనంత కాలం కుసుమ ధర్మన్న రచనల ఆవశ్యకత నిలిచే ఉంటుంది. తోకల రాజేశం 96767 61415 - నేడు కుసుమ ధర్మన్న జయంతి
Weather Report : వానలు.. ఈ ప్రాంతంలో దంచి కొడతాయట.. ఎక్కడంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్నరెండు రోజులపాటు వర్షాలు పగతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
కాచిగూడ రైల్వే స్టేషన్ లో 2 కిలోల గంజాయి పట్టివేత
నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన రైల్వే పోలీసులు.. మన తెలంగాణ/కాచిగూడ : హైదరాబాద్ నగరంలో మరోసారి మత్తు పదార్థాల రవాణా బయటపడింది. గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని కొనుగోలు చేసి నగరంలో అమ్మడానికి తీసుకొచ్చిన ఓ పాత నేరస్థుడిన్ని కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సోమవారం కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే పోలీస్ ఇన్స్ స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప, ఆర్పిఎఫ్ ఎస్ఐ రజిత వివరాలు వెల్లడించారు. పాతబస్తీలోని యాకుత్ పురకు చెందిన మహ్మద్ అబ్దు ల్ హసన్ (32) పాత నేరస్థుడు. గతంలో నాలుగైదు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరం చేసినట్టు కేసులు నమోదయ్యాయి. నాందేడ్ లో 2కిలో ల గంజాయిన కొనుగోలు చేసి హైదరాబాద్ లో అమ్మడానికి తీసుకొచ్చాడు. దీని విలువ దాదాపు రూ.1లక్ష వరకు ఉంటుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ లో 3వ ప్లాట్ ఫాంపై అనుమానస్పదంగా తిరుగుతుండగా రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. మహ్మద్ అబ్దుల్ హసన్ వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా అందు లో 2కిలోల గంజాయి ఉంది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
రంజాన్ పండగ కోసం.. నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : రంజాన్ పండగ రోజు
Breaking : మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది
AP Liquor Scam: Explosive Claims by Avinash Reddy
The liquor scam linked to the tenure of former Chief Minister YS Jagan Mohan Reddy is gaining fresh momentum, with new revelations emerging from the SIT investigation. Muppidi Avinash Reddy, who was taken into custody, was grilled for nearly seven hours. Officials reportedly asked over 80 questions, focusing on the alleged money laundering network. During […] The post AP Liquor Scam: Explosive Claims by Avinash Reddy appeared first on Telugu360 .
సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన తిలక్ వర్మ
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమ్ ఇండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. టి20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన తర్వాత హైదరాబాద్కు చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుని ముఖ్యమంత్రి కలిశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Breaking : పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు
పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది
పోలీసు బందోబస్తును పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ..
పోలీసు బందోబస్తును పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ.. నిర్మల్, ఆంధ్రప్రభ : జగ్నీకి రాత్
Gold Prices Today : భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?
బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి.
కూకట్పల్లిలో నడిరోడ్డుపై కళ్లలో కారం పొడి చల్లి.... రూ.1 కోటి బంగారం ఎత్తుకెళ్లారు
కూకట్పల్లి: బైక్పై వెళ్తుండగా కళ్లలో కారం పొడి చల్లి కోటి రూపాయల విలువల గల బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బహదూర్పూరాకు చెందిన ఎండి ఖస్రూ, ఎండి ఖైసర్ అనే వ్యక్తులు బంగారం బ్యాగ్తో ఎపి 12 విజి 1207 అనే నంబర్ గల స్కూటీపై రాత్రి పది గంటల సమయంలో వెళ్తున్నారు. కూకట్పల్లిలో మెట్రో పిల్లర్ 837 వదకు రాగానే ఖస్రూ, ఖైసర్ కళ్లలో గుర్తు తెలియని నలుగులు వ్యక్తులు కారం పొడి చల్లారు. అనంతం వాళ్ల చేతిలో ఉన్న గోల్డ్ బ్యాగ్ను లాక్కొని రెండు బైక్లపై పారిపోయారు. వెంటనే ఖస్రూ, ఖైసర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. బంగారం విలువ కోటి రూపాయలు వరకు ఉంటుందని చెప్పారు.
Hyderabad : కూకట్ పల్లిలో కోటి రూపాయల భారీ దోపిడీ
కూకట్ పల్లిలో భారీ దోపిడీ జరిగింది. కోటి రూపాయలను చోరీ చేశారు
డ్యాన్సింగ్ మిస్సైల్’… ఇరాన్ తొలిసారి వినియోగం#Iran #Missile #Defense #WarUpdate #Ballistic
బ్యాంకులకు వరుస సెలవులు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మార్చి నెల అంటే..
Andhra Pradesh : ఏపీలో ఆస్తిపన్ను వడ్డీ రాయితీ ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను విషయంలో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.
Tirumala : తిరుమలకు వెళ్లే వారికి అలెర్ట్.. క్యూ లైన్ లో వేచి ఉండాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
అప్ఘాన్లో ఆస్పత్రిపై పాక్ దాడి... 400 మంది మృతి
కాబూల్: అప్ఘానిస్తాన్-పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్ఘాన్లోని ఓ ఆస్పత్రిపై పాక్ వైమానికి దాడికి పాల్పడింది. దీంతో 400 మంది మృతి చెందారని ఆప్ఘాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడిలో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్లోని ఓ ఆస్పత్రిలో మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స అందిస్తున్నారు. ఆ ఆస్పత్రిపై పాక్ వైమానిక విభాగం దాడి చేసిందని అప్ఘాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాట్ తెలిపారు. భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఆస్పత్రి లక్షంగా తాము దాడులు చేయలేదని పాక్ తీవ్రంగా ఖండించింది. అప్ఘాన్ సైనిక స్థావరాలు, ఉగ్రవాద మౌళిక సదుపాయాలే లక్ష్యంగా తాము దాడులు చేస్తున్నామని పాక్ సమాచార మంత్రిత్వశాఖ వివరించింది. అప్ఘాన్ పౌరులు, ఆస్తులకు ఎలాంటి నష్టం లేకుండా దాడులకు పాల్పడుతున్నామని ప్రకటించింది.
ఆస్తి పన్ను వడ్డీ పై 50% రాయితీ..
ఆస్తి పన్ను వడ్డీ పై 50% రాయితీ.. విజయవాడ (కార్పోరేషన్), ఆంధ్రప్రభ :
Heart Attack : గుండెపోటు ఇలా వస్తుంది.. నిపుణుల హెచ్చరిక ఇదే
నిండా నలభై ఐళ్లు లేవు. అయితే ఆ మహిళ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయింది.
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. వారికి పక్కా ఇళ్లు
పట్టణ ప్రాంత పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
అంగన్ వాడి కేంద్రంలో.. సర్పంచ్
అంగన్ వాడి కేంద్రంలో.. సర్పంచ్ ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలం జగన్నాధపురం
Hyderabad : 24 ఏళ్ల తర్వాత కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధరెడ్డి
సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్ధార్ధరెడ్డి న్యాయస్థానంలో లొంగిపోయారు
ఎల్ బి నగర్ లో ‘వైట్ కప్ కేఫే’ సెంటర్ పై పోలీసుల దాడి... పలువురు విద్యార్థులు అరెస్టు
ఎల్ బి నగర్: రంగారెడ్డి జిల్లా ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ‘వైట్ కప్ కేఫే’ పేరుతో నడుస్తున్న హుక్కా పార్లర్పై పోలీసులు దాడి చేశారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో *“వైట్ కప్ కేఫే” పేరుతో అక్రమంగా నడుస్తున్న హుక్కా పార్లర్పై ఎసిపి ఏ కృష్ణయ్య ఆధ్వర్యంలో పోలీస్ బృందం దాడి చేపట్టింది. ఈ సందర్భంగా ఎసిపి ఎ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం... దాడి సమయంలో అక్కడ ఉన్నవారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండగా, వారు ప్రధానంగా సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, ఉప్పల్ సమీప ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. అక్రమంగా హుక్కా సేవలు నిర్వహిస్తున్నందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
400 Dead Kabul Hospital : మారణహోమం Andhra Prabha News
400 Dead Kabul Hospital : మారణహోమం Andhra Prabha News (
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు
తహశీల్దార్ జ్యోతి మన తెలంగాణ/మోత్కూర్: మతసామారస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని తహశీల్దార్ పి. జ్యోతి అన్నారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని డ్రైవర్ కాలనీ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో మతసామరస్యాన్ని ఐక్యతను పెంపొదించి పరమావధిగా సాగే పవిత్ర మాసం రంజాన్ అని అన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా మండుతుండటంతో ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహాశీల్దార్ వెంకటేశ్వర రెడ్డి, ఆర్ఐ సుమన్, మార్కెట్ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు , వైస్ ఛైర్మన్ లింగాల నర్సిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న, వైస్ చైర్మెన్ పల్లెర్ల వెంకన్న గుప్తా, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం లక్ష్మీనరసింహారెడ్డి, అవిశెట్టి ఆవిలిమల్లు , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంధ్రు, మార్కెట్ డైరెక్టర్ మహమ్మద్ సమీర్ , ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Pak - Afghanisthan War : మూడో వారంలోకి ఆప్ఫనిస్తాన్ - పాక్ సరిహద్దు ఘర్షణలు
ఆఫ్ఘనిస్తాన్ - పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించింది
Israel - Iran War : మధ్యప్రాచ్యంలో యుద్ధం.. పెరిగిన దాడులు
ఇజ్రాయిల్ - ఇరాన్ యుద్ధం మధ్య యుద్ధం రెండో వారానికి చేరుకున్నా ఇంకా ఉద్రిక్తతలు తగ్గలేదు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. సోమవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులనుద్ధేశించి చేసిన ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శాసనమండలి, శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బిఏసి) సమావేశాలు వేర్వేరుగా జరిగాయి. ఈ సందర్భంగా సమావేశాలను ఈ నెల 30వ తేదీ వరకూ కొనసాగించాలని నిర్ణయించారు. 20న రాష్ట్ర ఆర్ఖిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదిస్తారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రి కౌన్సిల్లో బడ్జెట్ ప్రతిపాదిస్తారు. ఇదిలాఉండగా ఈ నెల 19న ఉగాది, 21న రంజాన్, 27న శ్రీ రామ నవమి సందర్భంగా సెలవులుగా నిర్ణయించారు. అయితే రంజాన్ మర్నాడు ఆదివారం కూ డా సభను నిర్వహించాలన్న అంశం చర్చకు రాగా, ఈ అం శంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సెలవులు అధికంగా ఉన్నందున, ప్రస్తుతం సమావేశాలను ప్రతి రోజూ ఉదయం పది గంటలకు కాకుండా, ఉదయం తొమ్మిది గం టలకే ప్రారంభించాలని బిఆర్ఎస్ చెప్పడంతో అందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు అంగీకరించలేదని తెలిసింది. ఈ నెల 30వ తేదీన కూడా ఉభయ సభలనూ నిర్వహించాలని విపక్షాల సభ్యు లు కోరడంతో, ఆలోచిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 30న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం ఇంకా వివిధ శాఖలకు సంబంధించిన పద్దులు (డిమాం డ్లు), ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ఆమోదించుకుంటుంది. ఆరు రోజుల పాటు చర్చ జరిగే 30వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపుతుంది. ఇంకా మూసీ నదీ ప్రక్షాళన, గోదావరి నదీ జలాల వివాదం, గిగ్ వర్కర్స్కు కొత్త చట్టం, విద్యా రంగంలో కొత్త విధానాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ మౌనం, సోషల్ మీడియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ప్రధానం గా చర్చించనున్నారు. హైడ్రాతో ప్రజలకు కలిగిన మేలు, తదితర అంశాలపై చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ లాబీల్లో మీడియాపై ఆంక్షలు ఇదిలాఉండగా అసెంబ్లీ లాబీల్లో మీడియాపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ లాబీల్లో విధి నిర్వహణలో ఉండే విలేకరులు ఎక్కువగా మంత్రుల ఛాంబర్లలో బైఠాయించడం వల్ల మంత్రులకు వ్యక్తిగత స్వేచ్చకు భంగం వాటిల్లుతున్నదని, ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బా బు దృష్టికి వచ్చింది. ఈ విషయమై విలేకరులు మంత్రి శ్రీధర్ బాబును ప్రశ్నించగా, లాబీల్లో ఉండే సెంట్రల్ హాలు వరకు పరిమితమైతే ఇబ్బంది లేదన్నారు. ఇప్పటి వరకు ఆంక్షలు ఏమీ పెట్టలేదన్నారు. అయితే అసెంబ్లీకి పక్కనే కౌన్సిల్ సమావేశాలూ ప్రారంభమైనందున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వ్యక్తిగత సిబ్బందితో లాబీలు సందడిగా మారాయి.
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సమ గ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధి స్వప్నాన్ని సా కారం చేసుకోవడానికి ఐకమత్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్న ర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలను అందించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర అసెం బ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రపాత్ శుక్లా సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్ర జా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లు, సాధించిన విజయాలు, ఆశయాలు, భవిష్య త్తు లక్ష్యాలను సవివరంగా సభ ముందు ఆవిష్కరించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయసభలను ఉద్దేశించి కొద్దిసేపు తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్నారు. బడ్జెట్ సమావేశాలకు హాజరైన సభ్యులందరికీ గవర్నర్ హృదయపూర్వక స్వాగ తం పలుకుతూ... ప్రపంచంలోనే గుర్తింపు పొం దిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగా ణ రైజింగ్ -2047 విజన్తో ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రతిపౌరుడు అభివృద్ధిలో భా గస్వామిగా ఉండేలా బడ్జెట్ను రూపొందించిన ట్లు తెలిపారు. ఆవిష్కరణల్లో అగ్రగామిగా, బలహీన వర్గాలకు భరోసాగా, ప్రపంచానికి ఆదర్శం గా తెలంగాణను నిర్మించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. అందుకోసం బలమైన పునాదులు వేసేందుకు ఏడాది కాలం లో ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాల ను చేపట్టిందని చెప్పారు. సమున్నతమైన ఆశయంతో 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గడిచిన రెండేండ్లుగా ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, నీటి పారుదల వ్యవస్థలను మెరుగుపరిచి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతు సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్ర, సమతుల్య, సమ్మిళిత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా అంచెలంచెలుగా వికేంద్రీకృత వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరించిందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వ్యాఖ్యానించారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను పునర్వవస్థీకరించి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిందని వివరించారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారం, పౌర సేవలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో పునర్వవస్థీకరణకు శ్రీకారం చుట్టిందని అన్నారు. దీనికి తోడుగా కోర్ అర్బన్ రీజియన్లో హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లగా మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని పునర్వవస్థీకరించామని పేర్కొన్నారు. హైడ్రా ద్వారా రూ.60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం కోర్ అర్బన్ ప్రాంతంలో సరస్సులు, చెరువులు, ట్యాంకులను పునరుద్ధరించడానికి ప్రజా ప్రభుత్వం నడుం బిగించిందని గవర్నర్ చెప్పారు.హైడ్రా ఏర్పాటు ద్వారా దాదాపు 60 వేల కోట్ల విలువైన 1,045 ఎకరాలకు పైగా ఆక్రమణలు, కబ్జాలకు గురైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఆధునాతన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంతో 55 కి.మీ. మేరకు మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రాజెక్టును చేపట్టిందని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యన ఉన్న ప్రాంతంలో (పెరి-అర్బన్ రీజియన్) మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఎకో-ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్ కంపెనీలతో మౌలిక సదుపాయాల హబ్గా తీర్చిదిద్దాలని సంకల్పించామని పేర్కొన్నారు. ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే 7వ స్థానం ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత కీలక గమ్యస్థానంగా నిలిచిందని గవర్నర్ శుక్లా వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సమ్మిట్ నిర్వహించడమే కాకుండా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల్లోని ప్రముఖులతో 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించిందని తెలిపారు. ఎగుమతుల్లో దేశంలోనే 7వ స్థానంలో తెలంగాణ నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, నెట్ జీరో ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య అనుసంధానంగా రేడియల్ రోడ్లు, శంషాబాద్ను బుల్లెట్ రైలు కేంద్రంగా, భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం, హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణె నగరాలకు హైస్పీడ్ బుల్లెట్ రైళ్లతో రాష్ట్రం ఆర్థిక వృద్ధి సాధిస్తుందని వివరించారు. తెలంగాణ పురోభివృద్ధికి 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని గ్రీన్ఫీల్ స్మార్ట్ సిటీ కోసం దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇంధన రంగంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 23,187 మెగావాట్లకు పెరిగిందని, ఇందులో 44.55 శాతం పునరుత్పాదక వనరుల నుంచి రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. రైతులను వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను చేపట్టిందని చెప్పారు. 20,616 కోట్ల రూపాయల పంట రుణాల మాఫీ, సన్నరకం వరి ధాన్యానికి 500 రూపాయల చొప్పున బోనస్, పెట్టుబడి సహాయంగా రైతు భరోసా, గిట్టుబాటు ధరలకు ధాన్యం సేకరణ, సౌర శక్తితో నడిచే పంప్ సెట్లకు తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం భూమి సంబంధిత సమస్యల శాశ్వత పరిష్కారానికి తెలంగాణ భూ భారతి చట్టం అమలులోకి తేవడమే కాకుండా సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలిపారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, పునరావాస ప్రక్రియను కొన్ని నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో జీవించాలని ప్రతి కుటుంబానికి సంక్షేమంతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టిందని, కొన్నేండ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేసిందని అన్నారు. రాష్ట్రంలో 3.38 కోట్ల మందికి ప్రతి లబ్దిదారుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తోందని వెల్లడించారు. 22,500 కోట్ల రూపాయలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక బృందాలను వ్యాపారస్తులుగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరుగా తీర్చిదిద్దే మహాత్తర చర్యలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. మహిళలకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యం కోసం ఇప్పటివరకు 269.68 కోట్ల జీరో టికెట్లు జారీ చేయగా, తద్వారా రూ. 9,222 కోట్లకు పైగా మహిళలు ఆదా చేసుకున్నారన్నారు. మహాలక్ష్మి పథకంలో 42.90 లక్షల కుటుంబాలకు సబ్సిడీపై 500 రూపాయలకు ఎల్పిజి సిలిండర్ అందిస్తున్నామని, గృహజ్యోతి కింద పేదల గృహాలకు 200 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్న కార్యక్రమంవల్ల 53.09 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయని చెప్పారు. విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి నూతన విద్యా విధానానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని గవర్నర్ వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల్లో డైట్, కాస్మెటిక్ ఛార్జీలను 212 శాతం పెంచామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని అన్నారు. యువతలో నైపుణ్యతను పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపించడం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను ఎటిసిలుగా మార్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాలన్న లక్ష్యంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తోందని చెప్పారు. వైద్య రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి 11 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, వరంగల్ హెల్త్ సిటీ, సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా కొత్త ఆసుపత్రి నిర్మాణం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం వంటివి ఈ ఏడాది చివరి నాటికి సేవలను అందుబాటులోకి తేవాలన్న కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల చెంతకు తీసుకెళ్లడానికి ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణను ప్రారంభించిందని, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాడనికి ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ప్రజావాణిలో ఇప్పటివరకు 64,697 అర్జీలు అందగా, డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 47,670 విజ్ఞప్తులను పరిష్కరించామని వెల్లడించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా, సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించామన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించడంలో ముందడుగు వేసి 59 ఎస్సీ కులాలను రిజర్వేషన్ వర్గీకరణ పూర్తి చేసిందని తెలిపారు. రికార్డ్ సమయంలో 67,763 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మాదక ద్రవ్యాల ముప్పు నుంచి విముక్తి కల్పించాలన్న దృఢనిశ్చయంతో ఈగల్ ఏర్పాటు చేశామని గవర్నర్ శుక్లా పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత కోసం పీఎస్సీని పునరుద్ధరించడమే కాకుండా రికార్డు సమయంలో 67,763 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని వ్యాఖ్యానించారు. సినిమా రంగంలో ప్రతిభను గుర్తించడానికి గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రారంభం, తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వ సంరక్షణలో భాగంగా దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పుణ్య క్షేత్రాల అభివృద్ధి, వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఒక చారిత్రక మార్పు దశలో నిలబడిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక చారిత్రక మార్పు దశలో నిలబడిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఎంచుకునే ప్రతి పాలసీ, అమలు చేసే ప్రతి కార్యక్రమం, చేపడుతున్న ప్రతి సంస్కరణ ఈ ప్రాంత ప్రజలకు అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. సమ్మిళిత వృద్ధి దిశగా వారిని నడిపించి మరింత శక్తివంతులుగా తయారు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధిపై ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని, అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరు అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. సభలో బిఆర్ఎస్ నిరసన శాసనసభలో బిఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సిల ఆందోళన మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఆరుగురు ఎమ్మెల్యేలపై సిఎం ఆగ్రహం
మనతెలంగాణ/హైదరాబాద్:చిట్చాట్లు మానే సి సభకు ప్రిపేర్ అయి రావాలని సొంత పార్టీ ఎ మ్మెల్యేలకు సిఎం రేవంత్రెడ్డి క్లాస్ తీసుకున్నారు. సిఎల్పీ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేపై సీరియస్ అయ్యారు. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని ఆయన ఎ మ్మెల్యేలకు హెచ్చరించారు. సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావే శం జరిగింది. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సం దర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అ సెంబ్లీ స మావేశాల్లో అనుసరించాల్సిన వ్యూ హాంపై సభ్యులకు సిఎం రేవంత్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాలని, తాను టైమ్ ఇస్తానని, ఎమ్మెల్యేలు సమస్యలపై స్పందించాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. సీఎల్పీ సమావేశానికి ఆరుగురు సభ్యులు ఎందు కు రాలేదని సిఎం ఆరా తీశారు. సీఎల్పీకి రాలేనంగా బిజీగా ఎమ్మెల్యేలు ఉన్నారా అని సిఎం రే వంత్ ప్రశ్నించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే స రే కానీ, అవకాశం ఉండి కూడా రానివారి తీరుపై సిఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల అటెండెన్స్ మస్ట్గా ఉండాలని, అందరూ కంటెంట్పై అవగాహనతో రావాలని సిఎం సూచించారు. సభలో మాట్లాడే అంశాలపై ప్రభుత్వ విప్ల మధ్య సమన్వయం ఉండాలని సిఎం ఆదేశించారు. సభలో మాట్లాడే అంశాల మధ్య సమన్వయం ఉండాలని సభలో చర్చ పక్కదారి పట్టకుండా, సభా సమయం వృధా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాలని సిఎం సూచించారు. అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేస్తాం గవర్నర్ ప్రసంగం ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదని భవిష్యత్ ప్రణాళికపై దృష్టి పెట్టాలని సిఎం పేర్కొన్నారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా చూడాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు సమయం ఇవ్వలేదని, భట్టి, జానారెడ్డికి కనీసం మైక్ ఇవ్వలేదని సిఎం గుర్తు చేశారు. నాడు తనను సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దని సిఎం హెచ్చరించారు. మహిళా శాసనసభ్యుల హాజరుతో పాటు చర్చల్లో పాల్గొనాలని సభా చర్చల్లో మహిళా సభ్యుల భాగస్వామ్యం అవసరం అని సిఎం చెప్పారు. పూర్తి స్థాయిలో అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందని, ఇక మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామన్న దానిపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వంలో మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో వివరించారని ఆయన చెప్పారు. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాలపై అధ్యయనం చేయాలన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదని ఆది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందని తెలిపారు. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందని పార్టీ, ప్రభుత్వ పరమైన లైన్లోనే అందరూ స్పందించాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. ఇది మన ప్రభుత్వం, ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాప్ వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుందన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై సభ్యులు ఫోకస్ పెట్టాలని, 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్ష పార్టీ సభ్యుల ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇవ్వాలి: పిసిసి బడ్జెట్ సమావేశంలో సభ్యులు సకాలంలో విధిగా సభలకు హాజరు కావాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సూచించారు. సీఎల్పీ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ సభలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు దీటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు సరైన విధంగా సమాధానాలు ఇవ్వాలన్నారు. ఆరు గ్యారంటీల విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను మంత్రులు ధీటుగా తిప్పికొట్టాలని ఆయన సూచిం చారు. మన ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లెక్కలతో సహా ప్రజలకు అర్థం అయ్యే విధంగా చెప్పాలని, అన్ని శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి అందరూ సభ్యులు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ప్రతిసారి ఎత్తిచూపుతున్నామని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాప క్ష ఉపనేత హరీష్రావు అన్నారు. గోదావరి, కృష్ణా జలాల హక్కుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం టిడి పి చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆక్షేపించారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం బిఆర్ఎస్ ఎంఎల్ఎలతో కలిసి హరీష్రావు మీడియాతో మాట్లాడారు. సిడబ్ల్యూసి మీటింగ్కు వెళ్లటం లేదంటూనే.. ఎపి డిమాండ్లకు సంతకం చేసి వస్తున్నారని విమర్శించారు.ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ ఎజెండా మొదటి అంశం... పోలవరం -నల్లమలసాగర్ ప్రాజె క్టు అని, ఎజెండాలో నల్లమల సాగర్ లేకపోతేనే మీటింగ్కు వస్తామని చెప్పి, తర్వాత వెళ్లి తెలంగాణ ను మోసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య గో దావరి జలాల పంపిణీయే జరగలేదని సీడబ్ల్యూసీ సమావేశంలో జీఆర్ఎంబీ చెప్పిందని చెప్పారు. జ లాల పంపిణీ జరగలేదని జీఆర్ఎంబీ ఎలా చెబుతుంది..? అని ప్రశ్నించారు. గోదావరిలో నీటి కేటాయింపులు జరగకపోతే.. ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇస్తున్నారని అడిగారు. గోదావరి బేసిన్లో వివిధ రాష్ట్రాలు చేపట్టిన 76 ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. చేతకాని, బాధ్యతలేని, ముందుచూపు లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి వల్ల కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మొద్దు నిద్రను వదిలించేందుకే బిఆర్ఎస్ పక్షాన పదేపదే నిలదీస్తున్నామని తెలిపారు. తాము ప్రతిపక్షంగా నిలదీసిన ప్రతిసారీ ఉలిక్కిపడి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాస్తోందని విమర్శించారు. తాను ఇప్పుడు మీడియా సమావేశం నిర్వహించాను కాబట్టి మళ్లీ ఏదైనా లేఖ రాసే డ్రామా ఆడుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు గతంలో చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశారో, ఎన్ని లేఖలు రాశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు బిల్లుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరాం : హరీష్రావు చిట్చాట్ ఆరు గ్యారెంటీల అమలుపై ప్రైవేటు మెంబర్ బిల్లుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరామని బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ తరపున ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరామని తెలిపారు. తాము మాట్లాడుతుంటే సిఎం,సంబంధిత శాఖా మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి మాత్రమే మాట్లాడాలని చెప్పామని పేర్కొన్నారు. సిఎంపై బిఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఇస్తే పట్టించుకోవడం లేదని స్పీకర్కు చెప్పామని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం హరీష్రావు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ నెల 30 వ తేదీ వరకు అసెంబ్లీని నడుపుతామని ప్రభుత్వం చెప్పిందని, అందులో రెండు ఆదివారాలు, రెండు పండుగలు పోతే అసెంబ్లీని ఎన్ని రోజులు నడుపుతారని అడిగారని అన్నారు. కచ్చితంగా అసెంబ్లీ పని దినాలు పెంచాలని చెప్పామని తెలిపారు.అలాగే ఆదివారాలు అసెంబ్లీ పెట్టాలని కోరామని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ వరకు సభ నడుపుతామని అన్నారని, తాము కనీసం ఈనెల 31వ తేదీ వరకు సభ పెట్టాలని అడిగితే, సిఎంతో మాట్లాడి చెప్తామని అన్నారని చెప్పారు. ఈనెల 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్పిందని, 22వ తేదీ ఆదివారం అసెంబ్లీ ఉంటుందని అన్నారు. హౌస్ కమిటీలు ఆలస్యం అయ్యాయని చెబితే, త్వరలోనే హౌస్ కమిటీలు వేస్తామని చెప్పారని తెలిపారు. మంగళవారం(మార్చి 17) అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేకపోవడంపై ప్రశ్నించామని చెప్పారు. అన్ స్టార్డ్ క్వశ్చన్స్, జీరో అవర్ ప్రశ్నలకు సమాధానం ఇప్పటివరకు రాలేదని అన్నారు. 19 అంశాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని బిఆర్ఎస్ తరపున అడిగామని పేర్కొన్నారు. అసెంబ్లీని ఉదయం 9 గంటలకు పెట్టాలని బిఎసి సమావేశంలో డిమాండ్ చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ను పెట్టలేదని అడిగామని అన్నారు. ప్రివిలేజ్ మోషన్స్ తీసుకునేది డిప్యూటీ స్పీకర్ అని, ప్రివిలేజ్ మోషన్స్ విషయంలో స్పీకర్ భాద్యత తీసుకోవాలని అడిగామని తెలిపారు.
న్యూఢిల్లీ ః యుద్ధ తాకిడి హర్మూజ్ జలసంధి మార్గం దాటుకుని భారతదేశపు చమురు ట్యాంకర్ నౌక శివాలిక్ సోమవారం గుజరాత్ తీరపు ముంద్రారేవుకు చేరింది.ఇరాన్ అధికారిక, ముందస్తు అనుమతితో ఈ నౌక అత్యంత భద్రతాయుతంగా ఇక్కడికి చేరుకుందని అధికారులు తెలిపారు. దేశంలో వంటగ్యాసు కొ రత లేకుండా చేసేందుకు ఈ చమురు ట్యా ంకర్ రాక ఉపయోగపడుతుంది. ఇక మరో చమురు నౌక భారతీయ పతాకపు నందాదేవి కూడా ఈ జలసంధి మీదుగా బయలుదేరింది. మంగళవారం కాండ్లాకు చేరుతుంది. . ఇప్పు డు ఈ రెండు నౌకలు హర్మూజ్ మీదుగా భారత్ కు చేరడానికి ఇరాన్ అనుమతి పొందాయి. సోమ , మంగళవారాలలో ఈ రెండు నౌకలు భారత్ తీరానికి చేరుతాయని శనివారమే భారత నౌకాయాన మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా ప్రకటించారు. భారతీయ నావికులు అంతా కూడా ఈ ఉద్రిక్తతల మార్గంలో క్షేమంగా ఉన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 24వరకూ భారతీయ జెండా చమురు నౌకలు ఉన్నాయి. వీటి ప్రయాణానికి కూడా భారతదేశం పెద్ద ఎత్తున దౌత్యయత్నాలకు దిగింది. . ఇప్పుడు ముంద్రా, కాండ్లా రే వులకు వచ్చే నౌకల ద్వారా దాదాపుగా మొత్తం మీద 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పిజి లోడ్ ఉంది. టెహరాన్లోని ఉన్నత స్థాయి అధికారులతో నేరుగా చర్చించడం ద్వారానే జలసంధి మీదుగా భారత్కు భద్రంగా చేర్చగలమని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. తమ దేశ ఇంధన భద్రతకు ఈ మార్గంలో సరైన హమీ అవసరం అని భారత్ పేర్కొంది.భారతీయ చమురు నౌకలకు ఈ జలసంధి ద్వారా పూర్తి స్థాయిలో అనుమతి ఇస్తామని ఇటీవలే ఇరాన్ అధికారికంగా తెలిపింది. భారత్ తమకు అత్యంత మిత్రదేశం అని ప్రకటించింది. సౌదీ ఫుజైరా నుంచి భారత్కు నౌక జగ్ లాడ్కి రాక నేడు సౌదీ అరేబియాలోని ఫుజైరా రేవు నుంచి ముడిచమురుతో కూడిన భారతీయ ట్యాంకర్ క్షమంగా సోమవారం బయలుదేరింది. మంగళవారానికి ఈ జగ్ లాడ్కి నౌక 80,800 టన్నుల ముర్బన్ క్రూడాయిల్తో తీరానికి వస్తుంది. యుఎఇలోని ఈ రేవు టర్మినల్పై ఇటీవలే ఇరాన్ భీకరదాడులకు దిగింది. ఈ క్రమంలో ఇక్కడి రవాణా నౌకలక ముప్పు ఏర్పడింది. అయితే ఈ దాడుల భయాలు ఉన్నప్పటికీ ఈ చమురు నౌక మంగళవారానికి ముంద్రాకు చేరుకుంటుందని నౌకాయాన మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. జగ్ లాడ్కి కాకుండా జగ్ ప్రకాశ్ నౌక కూడా ముందుగానే భారత్కు చేరింది.
మనతెలంగాణ/హైదరాబాద్:దేశంలోనే అద్భుతమైన వరల్డ్ క్లాస్ సౌకర్యాలు కలిగిన హైదరాబాద్కు అంతర్జాతీయ సంస్థలు జై కొడుతున్నాయి. ఇదివరకు ఐటీ కంపెనీలు, బయో సంబంధిత సంస్థలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఆసక్తి చూపగా, తాజాగా విద్యా సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పె ట్టేందుకు క్యూ కడుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు చెందిన 13 ప్రఖ్యాత పాఠశాలలు హైదరాబాద్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. ఈ మేరకు యూకే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ అందింది. అందులో భాగంగా యూకే డిపార్టుమెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రేపు (మార్చి 18వ తేదీ న) రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా స్థానిక ఉన్నతాధికారులతో యూకే ప్రతినిధులు కీలక సమాలోచనలు జరుపనున్నారు. రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ మేరకు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలోకి ఆహ్వానించేందుకు ప్రజా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంలో 13 యూకే స్కూళ్లకు సంబంధించిన రిప్రజేంటెటివ్స్, యూకే ప్రభుత్వ అ ధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలోకి రానున్న ప్రైవేటు విద్యా సంస్థలు, కేజీ టు ప్లస్ 2 కరికులం లో అగ్రగామిగా పేరొందాయి. స్థానికంగా విద్యా శాఖ ఉన్నతాధికారులు, వివిధ శాఖలు మున్సిపల్, విద్య, ఐటీ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అ థారిటీకి చెందిన అధికారులు చర్చించనున్నారు. ఈ విషయంలో మ రింత సమన్వయం, యూకే విద్యా సంస్థలు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే వాటికి ఏ విధమైన టైమ్లైన్ను నిర్దేశించుకొని వెళ్లాలో చర్చలు సాగనున్నాయి. అయితే, యూకెకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు సైతం తెలంగాణలో వారి క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలన్నీ ఒక కీలక దశకు చేరుకున్న విషయం తె లిసిందే. ఈ క్యాంపస్లు ఎక్కడ పెట్టాలన్న దానిపై తెలంగాణ ప్రభు త్వ ఉన్నతాధికారులు సమగ్రంగా చర్చలు చేస్తున్పటికీ, మరోవైపు భార త్ ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే ప్రత్యేకంగా ఒక ఎడ్యుకేషన్ జోన్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగులు పడుతున్నాయి.
మంగళవారం రాశి ఫలాలు (17-03-2026)
మేషం శుభకార్యాల నిమిత్తం ఆహ్వానాలు అందుతాయి. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృషభం కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సహోద్యోగులతో వివాదాలుంటాయి. మిధునం ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలు వ్యవహారాలు మందగిస్తాయి. కర్కాటకం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లబిస్తుంది. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సేవాకార్యక్రమాలు పాల్గొంటారు. సింహం ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. కన్య చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. తుల దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృశ్చికం గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనస్సు ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. మకరం జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. కుంభం దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. విద్యార్థులు పోటీపరీక్షలలో మరింత కష్టపడాలి. మీనం వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.
ఆఖరి అస్త్రంగా జ్ఞానేశ్పై ఇంపీచ్మెంట్ నోటీసు
అరుణ్ శ్రీవాస్తవ లోక్సభ్ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్షాలు ప్రతిపాదించిన తీర్మానం మూజువాణీ ఓటుతోనే వీగిపోయింది. అయినా ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా రాజ్యసభ, లోక్సభకు చెందిన 193 మంది గత 13వ తేదీన ఇంపీచ్మెంట్ నోటీసు ఇచ్చారు. ప్రతిపక్షాల ఈ ప్రయత్నం నెగ్గుతుందనుకోలేం. కానీ ఇదీ ఒక రకమైన అభిశంసనే. ఇది రాజకీయ చర్చకు దారి తీసింది.ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి “పక్షపాత ధోరణి” అనుసరిస్తున్నారని, “ఓట్ చోరీకి సహకరిస్తున్నారు” అని ప్రతిపక్షాలు […] The post ఆఖరి అస్త్రంగా జ్ఞానేశ్పై ఇంపీచ్మెంట్ నోటీసు appeared first on Visalaandhra .
సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు మూడు ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. అనవసర అంశాలను తెరపైకి తెచ్చి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం. తిరుమల “కల్తీ”లడ్డు తిని ఎందరు చనిపోయారో తెలియదు. పాలకుల దృష్టిలో అది సర్వజన సంహారిణి. ఆహార ముడి పదార్థాల, హోటళ్ళలో ఆహార కల్తీలను, భూజల, వాయు, శబ్ద పర్యావరణ కాలుష్యాలను పట్టించుకోరు. గుడి గోడలు కూలి, దర్శనాల క్యూలో తోపుళ్ళకు ప్రాణాలు పోగొట్టుకున్న భక్తులు కనపడరు. రోడ్ల ప్రమాదాల్లో రోజూ […] The post రాష్ట్రంలో భావజాల విధ్వంసం! appeared first on Visalaandhra .
చింతపట్ల సుదర్శన్ అర్ధరాత్రి దాకా దోమలతో ఫైట్ చేసి అలసిపోయిన డాంకీకి తెల్లవారుఝామున చల్లగాలికి కునుకు పట్టింది. తాను ఒకటి తలిస్తే డాగీ ఇంకొకటి తలుస్తుంది కదా. ఉండి ఉండి ‘భౌభౌ’లు మొదలుపెట్టింది. దీని కూసే టైం మొదలైందన్నమాట. ఎవడైనా అరుగు పక్కనించి నడుస్తూ కనపడ్డాడో, ఎదురుగ్గా ఉన్న వేపచెట్టు కొమ్మ ఏదైనా గాలికి ఊయల్లూగిందో. ఇక ఇది అరుపులు మొదలు పెట్టిందంటే అసెంబ్లీ సమావేశాలు మొదలైనట్టే అనుకుని కళ్ళు గట్టిగా ఒత్తి పట్టుకుంది. కళ్లయితే మూయగలిగింది […] The post హ్యాపీ ఉగాది appeared first on Visalaandhra .
హోర్ముజ్కు యుద్ధనౌకల్ని పంపట్లేదని వెల్లడిసిడ్నీ/టోక్యో: ఇజ్రాయిల్తో కలిసి ఇరాన్పై భీకర దాడులకు తెగబడుతున్న అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పరిధిలోని కీలక హోర్ముజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపా లని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచనను అనేక అమెరికా మిత్ర దేశాలు తిరస్కరించినట్లు సమాచారం. వీటిలో కొన్ని దేశాలు ఆచితూచి స్పందిస్తుండగా, ఇంకొన్ని దేశాలు కుదరదని తెగేసి చెబుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది […] The post అమెరికాకు మిత్రదేశాల షాక్ appeared first on Visalaandhra .
యుద్ధరంగంలో ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్
ఒట్టావా(కెనడా): ఇజ్రాయిల్, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ తొలిసారిగా డ్యాన్సింగ్ మిస్సైల్గా పిలువబడే ‘సెజ్జిల్-2’ ని వినియోగించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణిని అషౌరా అనే పేరుతో కూడా పిలుస్తారు. సుదూరప్రాంతాల్లోని లక్ష్యాలను ఇది సమర్థంగా ధ్వంసం చేయగలదు. దీని ప్రత్యేకత ఏంటంటే… ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ డ్యాన్సింగ్ మిసైల్ పరిధి 2,000 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఏకంగా 700 కిలోల […] The post యుద్ధరంగంలో ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్ appeared first on Visalaandhra .
వాషింగ్టన్: పశ్చిమాసియాలో అంతకంతకూ యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యూరోపియన్ మిత్రదేశాలపై నిప్పులు చెరిగారు. నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్ (నాటో) భవిష్యత్తుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ… ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అడ్డంకుల వల్ల మూతపడిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు తమతో కలిసి రావాలని నాటో కూటమిని ఆయన డిమాండ్ చేశారు. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు తమ […] The post నాటో దేశాలకు ట్రంప్ హెచ్చరిక appeared first on Visalaandhra .
ఇజ్రాయిల్ దాడిలో13 మంది పలస్తీనియన్ల మృతి
గజా: ఇజ్రాయిల్ వైమానిక దళం గజాపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 13 మంది పలస్తీనియన్లు మృతి చెందారు ఇద్దరు బాలురు, ఓ గర్భిణీ మహిళ, 9మంది పోలీసు అధికారులతో సహా 13 మంది చెందినట్లు తాజాగా గజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఆదివారం రాత్రి సెంట్రల్ గాజాలోని నుసెయిరాత్ పట్టణ శరణార్ధి శిబిరంలోని ఒక ఇంటిపై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో నలుగురుమతిచెందారు. వీరిలో 30 ఏళ్ల వయసున్న జంట, వారి పదేళ్ల కుమారుడు […] The post ఇజ్రాయిల్ దాడిలో13 మంది పలస్తీనియన్ల మృతి appeared first on Visalaandhra .
కనుల పండువగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం
‘వన్ బ్యాటిల’ ఉత్తమ చిత్రంతో పాటు 6 అవార్డులులాసఏంజెల్స్: 98వ ఆస్కార్ (2026) అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో కనుల పండువగా జరిగింది. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర’ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచి సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా 6 విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలను కైవసం చేసుకుంది. రికార్డు స్థాయిలో 16 నామినేషన్లు పొందిన ‘సిన్నర్స’ చిత్రం కేవలం నాలుగు అవార్డులతోనే సరిపెట్టుకుంది.పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించిన […] The post కనుల పండువగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం appeared first on Visalaandhra .
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం
లాసఏంజెల్స్: ప్రతిష్టాత్మక 98వ అకాడమీ (ఆస్కార్) అవార్డుల వేడుకలో తెలుగు సినీ పరిశ్రమ గర్వపడే క్షణం ఆవిష్కృతమైంది. గతేడాది దివంగతులైన సినీ ప్రముఖులకు నివాళులర్పించే ‘ఇన్ మెమోరియం’ విభాగంలో విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నివాళి కార్యక్రమంలో ఆయన పేరును స్మరించుకోవడం తెలుగు సినిమాకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది.లాస్ ఏంజెల్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో కోటతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, సీనియర్ నటి సరోజాదేవి, ప్రముఖ నటుడు మనోజ్ […] The post ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం appeared first on Visalaandhra .
ఈనెల 25న బిఆర్ఎస్లో చేరనున్న జీవన్రెడ్డి ?
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఏర్పాటు చేసిన పాత ఫ్లెక్సీలు అన్నింటినీ ఆయన అనుచరులు తొలగించి కొత్తగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశా రు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ కలర్ లేకుండా, ఆ పార్టీ నేతల ఫోటోలు లేకుండా కేవలం జీవన్ రెడ్డి ఫోటోతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. గత 42 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జీవన్ రెడ్డి గత రెండేళ్లుగా పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో తనకు గౌరవం దక్కకపోవడంతో పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. ఆయనను కాంగ్రెస్ పార్టీని వీడొద్దంటూ రెండు రోజుల క్రితం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన ససేమిరా ఒప్పుకోనట్లు తెలిసింది. పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చిన జీవన్ రెడ్డి తన అనుచరులు, సన్నీహితులతో చర్చించి ఈనెల 25న స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేసుకొని పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడానికి జీవన్ రెడ్డి సమాయత్తమవుతున్నారు. సోమవారం తన అనుచరులు, అభిమానులు, రైతులతో కలిసి బైక్ ర్యాలీతో కలెక్టరేట్ కు చేరుకొని ప్రజావాణిలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించడంతో పాటు వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అకాల వర్షాలతో వంటలు నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల విలేకరుల సమావేశం నిర్వహించి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని, అందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు ఆయన వేస్తున్న అడుగులను బట్టి చూస్తే పక్కా కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం అవుతోంది. పార్టీని వీడిన తర్వాత పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఇప్పుడే ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేదని, కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఉండదలుచుకోలేదని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.
విరాట్, రోహిత్ వివాదంపై గంభీర్ కీలక వ్యాఖ్యలుకోల్కతా: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్… భారత సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయని … వారి మధ్య ఏదో జరుగుతోందని గత కొంతకాలంగా అనేక పుకార్లు షికార్లు చేసిన సంగతి విదితమే. కొన్ని సార్లు అది బహిర్గతం కూడా అయ్యింది. అయితే, విరాట్, రోహిత్తో తన సంబంధాలపై గంభీర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంలో తాను కూడా కొన్ని తప్పులు […] The post నేనూ తప్ప్పులు చేశానేమో… appeared first on Visalaandhra .
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు అనుమతి
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించుకోవడానికి అనుమతించింది. గత సంవత్స రం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధాన సౌధలో హోంమంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ హోమ్ […] The post చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు అనుమతి appeared first on Visalaandhra .
మనం ఐసీసీ ట్రోఫీలుదొంగతనం చేయాల్సిందేనా?
పాక్ వరుస ఓటములపై మాజీ క్రికెటర్ కమ్రాన్ ఫైర్ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ రోజురోజుకూ పతనం అవుతోంది. ఇటీవల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరడంలో విఫలమైన పాక్, తాజాగా బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ను కోల్పోయింది. దీంతో పాక్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో సిరీస్ ఓటమిపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సొంత జట్టుపైనే తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. పాకిస్థాన్ క్రికెట్ పూర్తిగా పతనం అవుతుందని, ఇది ఇలాగే కొనసాగితే నెదర్లాండ్స్పైనా ఓటమి ఎదుర్కోవాల్సిన […] The post మనం ఐసీసీ ట్రోఫీలుదొంగతనం చేయాల్సిందేనా? appeared first on Visalaandhra .
బుక్ చేసిన రెండోరోజే డెలివరీ . సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు. ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు అధిక ప్రాధాన్యత. గ్యాస్ నిల్వలు, సరఫరాపై చంద్రబాబు సమీక్ష. ఇండక్షన్ స్టవ్స్ వంటి ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని సూచన విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: గృహ వినియోగానికి సంబంధించిన వంట గ్యాస్పై యుద్ధ ప్రభావం ఏమాత్రం పడకుండా… సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అధికారు లను ఆదేశించారు. ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు ఇబ్బంది […] The post నిరంతర గ్యాస్ సరఫరా appeared first on Visalaandhra .
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎసిబి దాడులు
కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ చేపట్టిన సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం 10 గంటలకు మొదలైన సోదాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. ముఖ్యంగా శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖలపై వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. పట్టణంలో అక్రమ నిర్మాణాలు ప్రభుత్వానికి రూ.కోటికి పైగా నష్టం జరిగిందన్నారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు న్నాయి. ఎప్పటి నుంచో వస్తున్న అధికారుల్లో చలనం కనిపించలేదని, పైగా అక్రమ నిర్మాణాల్లో కమీషన్లు తీసుకుని అనుమతులిచ్చారన్న ఆరోపణలున్నాయి. ఏసీబీ తనిఖీల్లో కూడా ఈ విషయం స్పష్టమైంది. 2025-26 సంవత్సరంలో అనధికార నిర్మాణాలపై 47 ఫిర్యాదులు వచ్చిన నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి చర్య తీసుకోలేదని ఏసీబీ తనిఖీల్లో తేలింది. పట్టణంలోని కమర్షియల్ షాపుల లైసెన్సులపై ఆరోపణలున్నాయి. 400కు పైగా వాణిజ్య షాపుల ట్రేడ్ లైసెన్స్, రెన్యువల్స్ పెండింగ్లో ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వానికి రూ.కోటికి పైగా నష్టం: అధికారుల తీరుతో ప్రభుత్వానికి సుమారు రూ. కోటి బకాయిలు ఏర్పడ్డాయని ఏసీబీ పేర్కొంది. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లలో తేడాలు గుర్తించారు. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మున్సిపల్ అధికారుల ఫ్యుయెల్ ఛార్జీలలో చేతివాటం ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. నెలకు రూ.12.40 లక్షలు కేటాయించిన, సరైన రికార్డులు లేవని అధికారులు గుర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో భారీ వ్యత్యాసం బయటపడింది. కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గైర్హాజరుగా మార్క్ చేసిన పూర్తి నెల జీతం చెల్లించారు. పూర్తి జీతం చెల్లింపుల విషయంలో కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలు గతంలో వినిపించిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. భవన నిర్మాణాల అనుమతులలో జాప్యం ఉందని ఏసీబీ తనిఖీల్లో బట్టబయలయ్యాయి. డిసెంబర్ 2025 నుండి 169 బిల్డింగ్ పర్మిషన్ దరఖాస్తుల్లో 18 ఆలస్యంగా ప్రాసెస్ అయ్యాయని తేలింది. తనిఖీల రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించి తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తామని అధికారులు తెలిపారు.
. పనిగంటలు పెంచి శ్రమదోపిడీ. మున్సిపల్ కార్మికుల క్రమబద్ధీకరణకు పోరాటం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపు. కార్మికద్రోహి మోదీ: రాధాకృష్ణన్. రాజమహేంద్రవరంలో మున్సిపల్ కార్మికుల భారీ ర్యాలీ విశాలాంధ్ర- రాజమహేంద్రవరం: పాలకులు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కష్టజీవులకు అండగా ఎర్రజెండా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య భరోసా ఇచ్చారు. స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్రమహాసభల సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య […] The post కార్మికులకు అండ ఎర్రజెండా appeared first on Visalaandhra .
రంగంలోకి ‘డ్యాన్సింగ్ మిస్సైల్’
ఇరాన్ దాడులు తీవ్రతరం . అమెరికా, ఇజ్రాయిల్కు దడ. ఇంధన ట్యాంక్పై డ్రోన్ దాడి. దుబాయ్ విమానాశ్రయం మూసివేత. తెలఅవీవ్ను తాకిన క్షిపణులు… విధ్వంసం. తెహ్రాన్పై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్. కీలక విమానం, సైనిక స్థావరాలు నేలమట్టం తెహ్రాన్/టెలఅవీవ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో బాంబులు మోతలు, మిసైళ్ల వర్షం కొనసాగుతున్నాయి. యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. యుద్ధం మొదలై పదిహేడు రోజులవుతున్నా… ఇటు అమెరికా, ఇజ్రాయెల్ గానీ.. అటు ఇరాన్ గానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకు పడుతున్నాయి. […] The post రంగంలోకి ‘డ్యాన్సింగ్ మిస్సైల్’ appeared first on Visalaandhra .
పార్సల్ పంపాలా… రైల్వేవాళ్లు ఇంటికే వస్తారు #IndianRailways#RailParcel#DoorDelivery#TeluguStates
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సోమవారం భారత రూపాయి 10 పైసలు పడిపోయి డాలర్కు 92.40 వద్ద ముగిసింది. రూపాయి చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయి ఇదే. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 92.44 వద్ద ప్రారంభమై రోజులో 92.47 వరకు పడిపోయింది. గత సెషన్లో 92.30 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకోవడజం వల్ల ఒత్తిడి పెరిగిందని నిపుణులు తెలిపారు. దేశీయ షేర్ మార్కెట్లు కోలుకోవడం వల్ల మరింత పతనం కొంతవరకు తగ్గిందని ట్రేడర్లు తెలిపారు.
గ్రూప్ ఫోటో దిగుతూ మృత్యు ఒడిలోకి
ఖమ్మం నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన ఒక మహిళ బంధువులతో కలిసి గ్రూప్ ఫోటో దిగుతుండగా ఒకేసారి గుండెపోటుకు గురై అక్కడికక్కడే కూప్పకూలిన సంఘటన పుట్టకోటలో చోటుచేసుకుంది. ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత (43) అనే మహిళ ఖమ్మం నగరంలోని పుట్టకోట ప్రాంతంలో గల తన బంధువుల ఇంట్లో సోమవారం ఉదయం జరిగిన గ్రహ ప్రవేశం శుభకార్యంలో పాల్గొనేందుకు వెళ్లింది. ఈ సందర్భంగా బంధువులతో కలిసి గ్రూఫ్ ఫొటో దిగుతుండగా అకస్మాత్తుగా సుస్మిత కుప్పకూలింది. అప్రమత్తమైన బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకుండాపోయింది.గుండెపోటుకు గురైన సుస్మిత అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు .అప్పటి వరకు కళ్ళ ముందు ఎంతో సంతోషంగా నవ్వుతూ ఫోటో దిగుతు విగత జీవిగా మారిన సుస్మిత ప్రేమ వివాహం చేసుకుంది.ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త వ్యాపారం నిర్వహిస్తుంటగా ఆమె తండ్రి పత్రికయాడ్ ఏజెన్సీ నిర్వహించేవారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు
. ఉద్యోగులు, కార్మికుల తొలగింపులతో కుట్ర. మొండిగా ముందుకెళుతున్న కేంద్రం. తిప్పకొడతామన్న పోరాట కమిటీ విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులు, కార్మికుల తొలగింపు లతో ఈ కుట్రను అమలు చేస్తోంది. స్టీల్ప్లాంట్ను నూరు శాతం అమ్మాలని 2021 జనవరి 21 న నిర్ణయించింది. కానీ ఐదేళ్ల నుంచి నిరవధికంగా జరుగుతున్న పోరాట ఫలితంగానే నేటికీ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక్క శాతం కూడా […] The post విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు appeared first on Visalaandhra .
శామీర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర ప్రమాదం
ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారును వెనుక నుంచి అశోక్ లేలాండ్ లారీ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన హృదయ విదారకమైన సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శామీర్పేట సీఐ శ్రీనాథ్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ ( 51), షేక్ పేటకు చెందిన మొహమ్మద్ హుస్సేన్ ( 48), లు టీఎస్ 09 ఈడీ 3303 నంబర్ గల ఆడి కారులో ఈసీఐఎల్ నుండి తూప్రాన్ వైపు ఓ ఆర్ ఆర్ మార్గం ద్వారా వెళ్తున్నారు. మార్గమధ్యంలో శామీర్ పేట ఎగ్జిట్ 7 దిగ చొట కారును రోడ్డు పక్కన నిలిపి భోజనం భోజనం చేస్తున్నారు. అదే సమయంలో ఎమ్ఎచ్ 12 పి క్యు 2337 నంబర్ గల అశోక్ లేలాండ్ లారీ వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న శామీర్పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ ( డిడి ) పరీక్ష నిర్వహించగా అతను మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలింది. ఈ ఘటనపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ పోరు కీలక మలుపు తిరిగింది. ట్రంప్ , నెతన్యాహులు ఇప్పుడు ఇరాన్ అత్యంత కీలకమైన చమురు వనరులపై పట్టుకు సైనిక వ్యూహాలకు దిగుతున్నారు. ఇరాన్కు చమురు వ్యాపారం, ఉత్పత్తి కేంద్రం అయిన ఖర్గ్ దీవిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా స్వాధీనం చేసుకునేలా సైనిక వ్యూహాలు సిద్ధం చేయాలని తమ సైనిక సలహాదారులకు ట్రంప్ సూచించారు. ఇటీవల ఖర్గ్ దీవిపై అమెరికా విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దాడుల సమయంలో అక్కడి వైమానిక, సైనిక స్థావరాలను లక్షంగా చేసుకున్న అమెరికా చమురు క్షేత్రాల జోలికి వెళ్లలేదు. అయితే ఈ చమురు దీవి ఇరాన్కు ప్రముఖమైన వ్యాపార కేంద్రం అనే విషయాన్ని గుర్తించిన ట్రంప్ ఇప్పుడు వచ్చే కొద్దిరోజుల్లోనే ఈ దీవిని ఇక్కడి చమురు క్షేత్రాలతో పాటు స్వాదీనం చేసుకుని, తద్వారా ఇరాన్కు ఆర్థిక నష్టం కల్గించాలని సంకల్పించారు. ఇదే సమయంలో ఇరాన్ ప్రపంచ స్థాయిలో ఇంధన మార్కెట్ను నిశ్చేష్టపరుస్తూ హర్మూజ్ జలసంధి మీదుగా చమురు నౌకల కదలికలను అడ్డుకుంది. దీనితో అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధరలు వంద డాలర్లు మించి పోయాయి. పలు దేశాలలో ఎల్పిజి, పెట్రోలు డీజిల్, ప్రత్యేకించి కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయి. ఇరాన్ చమురు దెబ్బతోనే ఇజ్రాయెల్, అమెరికాపై ప్రపంచవ్యాప్త తీవ్ర నిరసనలు వెలువడేలా చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు మిత్రదేశాలని పేర్కొంటూ భారత్ వంటి అతి కొద్ది దేశాలకు చమురు రవాణాకు మార్గం కల్పించింది. మరో వైపు గల్ఫ్ దేశాలు అమెరికాకు సైనిక స్థావరాలు కావడంతోనే తమ దేశానికి కీడు జరిగిందని, ప్రత్యేకించి అరబ్ దేశాలలోని యుఎస్ సైనిక కేంద్రాల బలంతోనే అమెరికా అధ్యక్షుడు రెచ్చిపోయాడని గ్రహించింది. దీనితో గత కొద్దిరోజులుగా ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్పై తన వద్ద ఉన్న అత్యంత అధునాతన క్షిపణులను ప్రయోగిస్తోంది. మరోవైపు గల్ఫ్లోని అమెరికా స్థాదరాలతో పాటు కొన్ని దేశాల ఇతరత్రా వ్యాపార వాణిజ్య కేంద్రాలను కూడా లక్షంగా ఎంచుకుని దాడులకు దిగింది.
Big news:Pawan’s UBS Smart Move In Ticket Pricing
Watching star-hero movies in the first week has become an expensive affair lately due to increased ticket rates. But that’s not the case with Power Star Pawan Kalyan’s Ustaad Bhagat Singh. Bookings for this Harish Shankar directorial have begun in the Nizam region, and what truly stands out is the makers’ decision to maintain regular […] The post Big news:Pawan’s UBS Smart Move In Ticket Pricing appeared first on Telugu360 .
పశ్చిమాసియాలో అమెరికాఇజ్రాయెల్ సంయుక్త బలగాలు, ఇరాన్ నడుమ సోమవారంనాడు పరస్పర దాడులు కొనసాగాయి. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది.దక్షిణ లెబనాన్లోని ఓ గ్రామంపై జరిపిన దాడిలో ముగ్గురుమృత్యువాత పడ్డారు.మృతుల్లో ఇద్దరు పారామెడిక్ సిబ్బంది ఉన్నారు. తాజా దాడుల ద్వారా లెబనాన్లో క్షేత్రస్థాయి దాడులకు ఇజ్రాయెల్ తెరతీసింది. ఇప్పటి వరకు ఇరాన్కు చెదిన 70శాతం మిలిటరీ లాంఛర్లను దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అబుదాబి లక్షంగా ఇరాన్ జరిపిన దాడిలో పాలస్తీనాకు చెందిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు. మరోవైపు ఇరాన్ జరిపిన దాడులలో సోమవారం దుబాయ్ దద్దరిల్లింది. ఇరాన్ డ్రోన్ ధాటికి ఓ ఇంధన ట్యాంకర్ దెబ్బతింది. దీనితో అక్కడికి సమీపంలోని దుబాయ్ ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ఇరాన్ క్షిపణి దాడులతో దుబాయ్ అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ నుంచి ఎటువంటి క్షిపణి లేదా డ్రోన్ల దాడులు తలెత్తకుండా దెబ్బకు దెబ్బతీస్తామని యుఎఇ రక్షణ శాఖ తెలిపింది. తూర్పు ప్రాంతంలో 35 వరకూ ఇరాన్ డ్రోన్లను దెబ్బతీశామని సౌదీ అరేబియా తెలిపింది. సౌదీకి చెందిన అత్యంత కీలకమైన ఫుజైరా చమురు క్షేత్ర ప్రాంతంపై ఇరాన్ సోమవారం దాడికి దిగింది. ఈ డ్రోన్ల దాడిలో ఇక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అబూధాబిలో ఇరాన్ దాడిలో ఓ పాలస్తీనియన్ మృతి చెందారు. ఇక బహ్రెయిన్ కూడా తమ దేశంపై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. అయితే దానిని తమ ఎయిర్డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుందని తెలిపింది. మరోవైపు తమపై దాడులకు ఎర్రసముంద్రం నుంచి తన వంతు పాత్ర పోషిస్తున్న అమెరికా నౌక జెరాల్డ్ ఫోర్డ్కు సాయం అందిస్తున్న వ్యవస్థలను లక్షంగా ఎంచుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు తమ అధికారిక వార్త సంస్థ ప్రెస్ టివిలో ప్రకటన చేసింది.
వాట్సాప్ ద్వారా టికెట్ల బుకింగ్కు ప్రాధాన్యం
వాట్సాప్ ద్వారా టికెట్ల బుకింగ్కు ప్రాధాన్యం దేవాలయాల్లో అమలు చేయాల్సిందే50 శాతం టికెట్లు
200 children killed : యద్ధం ఆగదు Andhra Prabha News
200 children killed : యద్ధం ఆగదు Andhra Prabha News (
వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ సమాచారం ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,685 తగ్గి రూ.1.56 లక్షలకు చేరింది. మార్చి 13న ఇదే బంగారం ధర రూ.1.58 లక్షలుగా ఉంది. ఒక కిలో వెండి ధర కూడా రూ.11,777 తగ్గి రూ.2.48 లక్షలకు చేరింది. శుక్రవారం ఇది రూ.2.60 లక్షలుగా ఉండింది. అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావంతో రెండు రోజుల్లో బంగారం రూ.4,589, వెండి రూ.19,590 తగ్గాయి. మార్చి 12న బంగారం రూ.1.60 లక్షలు, వెండి రూ.2.68 లక్షలుగా ఉన్నాయి.
ప్రత్యూష మృతి కేసు.. నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి
సుప్రీంకోర్టు తీర్పుననుసరించి టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో దోషి సిద్ధార్థరెడ్డి నాంపల్లి కోర్టులో సోమ వారం లొంగిపోయాడు. సిద్ధార్థరెడ్డి అమెరికా నుంచి వచ్చి న్యాయస్థానంలో లొంగిపోయాడు. 2022 ఫిబ్రవరి 24న ప్రత్యూష మృతి చెందారు. కూల్ డ్రింకులో పురుగుల మందు కలుపుకుని ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి తాగారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెంద గా, సిద్ధార్థరెడ్డి కోలుకున్నాడు. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థరెడ్డి ప్రేరేపించాడని ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ప్రత్యూ ష మృతి కేసులో ఇటీవల సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డి వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని న్యాయ స్థానం పేర్కొంది. బెయిల్ కోసం సిద్ధార్థరెడ్డి వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ప్రత్యూష హత్య కేసులో సిద్ధార్థరెడ్డికి విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. సిబిఐ విచారణ తర్వాత సిద్ధార్థరెడ్డిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద చార్జిషీట్ వేసింది. దీంతో 2004లో హైదరాబాద్ మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్షను ఖరారు చేసింది. ఆపై రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే 2011లో జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ సిద్ధార్థరెడ్డికి అనుకూలంగా తీర్పు రావడంతో కాస్త ఊరట దక్కింది. సుప్రీంకోర్టు కూడా రెండేళ్ల జైలు శిక్ష సబబే అని తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి న్యాయస్థానం సూచించింది. తన కుమార్తె నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సరోజినీ దేవి స్పందిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నానని, కానీ తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని పేర్కొన్న సంగతి విదితమే. ఘటన జరిగిందిలా..! 1993వ సంవత్సరంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఓ కాలేజీలో ప్రత్యూష, సిద్ధార్థరెడ్డిలు ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమలో పడ్డారు. ఇంటర్ పూర్తయిన తర్వాత సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్కు వెళ్లగా, ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లారు. ఇద్దరి వివాహానికి ప్రత్యూష తల్లి తొలుత వ్యతిరేకించినా తర్వాత అంగీకరించారు. సిద్ధార్థరెడ్డి తల్లి మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడం వారి వివాహానికి అడ్డంకిగా మారింది. ఆ విషయాన్ని సిద్ధార్థరెడ్డి 2002 ఫిబ్రవరి 23న ఫోన్ ద్వారా ప్రత్యూషకు చెప్పాడు. సాయంత్రం 5 గంటల సమయంలో పంజాగుట్టలో బ్యూటీపార్లర్లో ఉన్న ప్రత్యూషను వెంటబెట్టుకుని కారులో బయటికి వెళ్లాడు. రాత్రి 7.308 గంటల సమయంలో ఇద్దరూ ప్రాణాపాయస్థితిలో బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి వచ్చి చేరారు. ప్రత్యూష 24వ తేదీన కన్నుమూశారు. సిద్ధార్థరెడ్డి మార్చి 9న డిశ్చార్జి అయ్యారు.
ఇక, ట్రాన్స్జెండర్లకూ ఫ్రీ బస్సు..
న్యూఢిల్లీ: ట్రాన్స్జెండర్లకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళల మాదిరిగానే ఆర్టీసి బస్సుల్లో ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రకటించారు. ఢిల్లీలో నివసిస్తున్న అర్హత కలిగిన ట్రాన్స్జెండర్ లు కూడా మహిళల లాగానే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ సందర్బంగా సిఎం రేఖ గుప్తా మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు గౌరవంగా, సమానత్వంతో ప్రజా సేవలను పొందాలి. సామాజిక న్యాయం, అందరికీ సమాన అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆమె అన్నారు. ఈ పథకం ద్వారా ట్రాన్స్జెండర్లు ఆర్థిక పరిమితులు లేకుండా నగరం అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం త్వరలో అమలు కానుందని, మహిళలకు ప్రస్తుతం ఉన్న ఉచిత బస్సు ప్రయాణ వ్యవస్థ మాదిరిగానే విధానాలను అనుసరిస్తుందని, లబ్ధిదారులకు సజావుగా అమలు జరుగుతుందని అధికారులు తెలిపారు.
ప్రైవేట్ కంపెనీల కుట్రలను తిప్పికొడతాం
ప్రైవేట్ కంపెనీల కుట్రలను తిప్పికొడతాం ఆయిల్ ఫామ్ రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర
సిఎం రేవంత్ని కలిసిన టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ
టి 20 ప్రపంచ కప్ -2026 గెలుచుకుని టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా సిఎం రేవంత్రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి సిఎం రేవంత్రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎస్ఎటిజి చైర్మన్ శివసేనారెడ్డి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండి సోనీ బాలాదేవిలు పాల్గొన్నారు.
నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా
నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా హితాన్ని బోధించే పండుగ రంజాన్11వ వార్డులో, నిరుపేద
రైలు నిర్వహణలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత
రైలు నిర్వహణలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్
శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 27వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతా ఏర్పాట్లు, రవాణా, భక్తులకు సౌకర్యాలు, వసతి తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని మంత్రి తుమ్మల ఆదేశించడంతో దానికి తగ్గట్టుగానే అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ పనులకు శంకుస్థాపన.. భద్రాచలం ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.300 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలోనే తొలి విడతలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భద్రాద్రి ప్రాకారం నిర్మాణ పనులకు సిఎం రేవంత్ రెడ్డి ఈనెల 27వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు డివైడర్లు,సెంటర్ లైటింగ్, పూల మొక్కలు సుందరీకరణ పనులు ఉగాది నాటికి పూర్తి చేసేలా అధికారులు ముమ్మరంగా చేపట్టాలన్నారు.
17thMarchCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
17thMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 17thMarchCartoon | హర్మూజ్ వద్ద ట్రంప్
నిజాంసాగర్ కెనాల్ లో పడి వృద్ధుడు మృతి
నిజాంసాగర్ కెనాల్ లో పడి వృద్ధుడు మృతి ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి
తెలంగాణ భవన్లో ఘనంగా ఇఫ్తార్ విందు..హాజరైన కెటిఆర్
బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సోమవారం ఘనంగా దావత్ -ఎ -ఇఫ్తార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పాల్గొని మైనారిటీ సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా కెటిఆర్ విమర్శించారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రకటించిన డిక్లరేషన్ను అమలు చేయకుండా వారిని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ మైనారిటీలను ఏ విధంగా వంచించిందో శాసనసభ సమావేశాల్లో సాక్ష్యాధారాలతో సహా ఎండగడతామని చెప్పారు. అపరిష్కృతంగా ఉన్న ప్రతి హామీ పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని భరోసా ఇచ్చారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం కుల మతాలకు అతీతంగా, గంగా-జమునా తెహజీబ్ సంస్కృతితో అద్భుతంగా ముందుకు సాగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ మత సామరస్యానికి పెద్దపీట వేసిందని తెలిపారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ ఆశయాలను పక్కన పెట్టడం బాధాకరమని అన్నారు. ఇఫ్తార్ విందులో కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సామెల్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే సామెల్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలి మోత్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ
ఆర్టీసీ చైర్ పర్సన్గా ఎంఎల్ఎ పద్మావతి ?
దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఆర్టీసీ చైర్ పర్సన్ పదవి త్వరలో రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి సతీమణి, సీనియర్ ఎమ్మెల్యే ఎన్. పద్మావతికి దక్కబోతున్నదని తెలిసింది. గతంలో ఆమెకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామన్నా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ తర్వాత ఎస్టిమేట్స్ కమిటీ చైర్ పర్సన్గా నియమిస్తే ఆమె బాధ్యతలు స్వీకరించలేదు. తాజాగా పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి ఇస్తామన్నా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఆర్టీసీ చైర్ పర్సన్గా పద్మావతిని నియమించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది.
పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలి ప్రతిష్టమైన పోలీసు బందోబస్తురామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా
రేపు 2వ నేషనల్ మొబిలిటీ సమ్మిట్
రాష్ట్ర రవాణా శాఖ, ఎలెట్స్ టెక్నోమీడియా సంస్థ భాగస్వామ్యంతో, హైదరాబాద్ మెట్రో రైల్ సహ భాగస్వామ్యంతో ఈ నెల 17 మంగళవారం నోవోటెల్, హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో ‘2వ నేషనల్ మొబిలిటీ సమ్మిట్ -2026’ నిర్వహించనుంది. ‘యాక్సిలరేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ’ అనే థీమ్తో నిర్వహించనున్న ఈ సమ్మిట్లో విధాన నిర్ణేతలు, రవాణా అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు, స్టార్టప్లను, సాంకేతిక సంస్థలు పాల్గొని దేశంలో స్థిరమైన సమగ్ర మొబిలిటీ భవిష్యత్తుపై చర్చించనున్నారు. సమ్మిట్ ప్రారంభ సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాస రాజు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా కమిషనర్ డా. కె. ఇళంబరితి, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొననున్నారు.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మర్ కిట్స్ పంపిణీ
రాష్ట్రంలోని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు సచివాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఫార్మర్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ సంచాలకు గోపి సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 61,125 మంది రైతులను 489 క్లస్టర్లలో, ప్రతి క్లస్టర్ కు 125 మంది చొప్పున జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో ఎంపిక చేస్తామన్నారు. సేంద్రియ వ్యవసాయం పై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా కృషి సఖిలను క్లస్టర్ కు ఇద్దరు చొప్పున ఎంపిక చేసి వారికి శిక్షణను ఇచ్చి వారి ద్వారా క్లస్టర్లో 125 మంది రైతులకు సేంద్రీయ సాగు పద్ధతులపై నిరంతరం అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులకు సర్టిఫికేషన్, ప్రోత్సాహం అందించడం, జీవ ద్రావణాలు తయారు చేసే కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 క్లస్టర్లలో, ప్రతి క్లస్టర్కు 125 మంది చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందజేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, గుర్తింపు కోసం ఈ కిట్లో క్లాత్ బ్యాగ్, క్షేత్ర దర్శిని డైరీ, గుర్తింపు కార్డు, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ను, చిన్న ప్యాకెట్ డైరీ వంటి వస్తువులు ఉంటాయని వివరించారు. సచివాలయంలో మంత్రి ప్రారంభించిన అనంతరం, ఆయా జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు ఈ కిట్లను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
45crore Release : అన్ని మతాలను గౌరవిస్తా Andhra Prabha News
45crore Release : అన్ని మతాలను గౌరవిస్తా Andhra Prabha News (
విశారదన్ అరెస్ట్ ను కండిస్తూ జేఏసీ ఆందోళన
విశారదన్ అరెస్ట్ ను కండిస్తూ జేఏసీ ఆందోళన నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ :
మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే జన్నారం,ఆంధ్రప్రభ : ఖానాపూర్
శామీర్ పేట ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం
శామీర్ పేట ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే
కడియం మహిళపై సామాహిక అత్యాచారం..నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష
ఎపిలో సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నర్సరీలో పనిచేసే మహిళపై అత్యాచారాయత్నానికి పాల్పడి, ఆపై హత్య చేసిన నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసు 2024 అక్టోబర్లో చోటు చేసుకుని ఎపి వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి నిందితులపై ఉన్న ఆధారాలు, పోలీసుల దర్యాప్తు నివేదికలను పరిశీలించిన అనంతరం ఈ సంచలన తీర్పును ప్రకటించారు. నిందితులు అందరూ 19 ఏళ్ల నుంచి 26 సంవత్సరాల మధ్య యువకులని పోలీసులు వెల్లడించారు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలం బుర్రిలంక గ్రామ పరిధిలోని ఓ నర్సరీలో చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న 43 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు దారుణంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మహిళ ప్రతిరోజు మాది రిగానే నర్సరీ పనులకు వెళ్లిన సమయంలో నిందితులు ఆమెపై దాడి చేసి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. అనంతరం తమ నేరాన్ని దాచేందుకు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిళల భద్రతపై కూడా పెద్ద చర్చ జరిగింది.
తెలంగాణకు వర్ష సూచన.. ఎన్ని రోజులంటే?
తెలంగాణకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. . పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం సోమవారం చెప్పింది. రాష్ట్రంలో వానలు పడే చాన్స్ ఉండటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, నిన్న పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. కాగా..వంట కోతకు వచ్చే సమయంలో వర్షాలు పడే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

26 C