ViratKohli|ఫేమస్ కోసం ఇంత దిగజారాలా..?
ViratKohli| ఫేమస్ కోసం ఇంత దిగజారాలా..? ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : నెట్టింట్లో ఫేమస్
ఇంటితో పాటు గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలి…
ఇంటితో పాటు గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలి… రాప్తాడు, ఆంధ్రప్రభ : మన ఇళ్లతోపాటు
టీటీడీకి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ రూ.10లక్షల విరాళం…
టీటీడీకి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ రూ.10లక్షల విరాళం… హైదరాబాద్, ఆంధ్రప్రభ : తిరుమల
పుట్టపర్తి నారాయణాచార్యుల జన్మదిన వేడుకలు…
పుట్టపర్తి నారాయణాచార్యుల జన్మదిన వేడుకలు… కర్నూలు, ఆంధ్రప్రభ : సరస్వతీ పుత్రులు పద్మశ్రీ
భక్తులకు చలువ పందిర్లు ఏర్పాటు చేయాలి..
భక్తులకు చలువ పందిర్లు ఏర్పాటు చేయాలి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకూడదు..శ్రీశైలం దేవస్థానంలో
Young People |ఫోటోగ్రాఫర్లపై దాడి, అరెస్టులు
Young People | ఫోటోగ్రాఫర్లపై దాడి, అరెస్టులు Young People | ఆంధ్రప్రభ,
7th Ward |ప్రజా సమస్యల పరిష్కారంలో స్పీడ్..!
7th Ward | ప్రజా సమస్యల పరిష్కారంలో స్పీడ్..! -7వ వార్డులో ఎమ్మెల్యే,
తాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మనుమడు
తాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మనుమడు ఘంటసాలలో అడుగు పెట్టిన అంబేద్కర్ వారసుడు
YSRCP : వైసీపీది రాంగ్ డెసిషన్? రైట్ వే నేనా?
ysrcp-assembly-boycott-amaravati-capital-resolution
అదుపు తప్పిన బస్సు… కర్నూలు జిల్లా, ఆంధ్రప్రభ : మండల కేంద్రం నందవరం
జిల్లాలో జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్కు శ్రీకారం..
జిల్లాలో జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్కు శ్రీకారం.. ప్రభుత్వ సంస్థల్లో చెత్త నిర్వహణకు సమగ్ర
తిరుపతిలో చడ్డీ గ్యాంగ్ కలకలం ఇంట్లోకి చొరబడి చోరీకి ప్రయత్నం #Tirupati #CrimeAlert #ChaddiGang
అన్న హీరో, చెల్లి నిర్మాత.. ‘బరి’ ప్రపంచాన్ని చూశారా..
వరుణ్ తేజ్ హీరోగా.. నిహారికా నిర్మిస్తున్న చిత్రం ‘బరి’. ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. పవర్స్టార్ పవన్కల్యాణ్ ఈ సినిమా షూటింగ్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ‘ది వరల్డ్ ఆఫ్ బరి’ పేరుతో ఓ ప్రత్యేకమైన వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో బట్టి చూస్తే.. ఈ సినిమా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కుతుందని అర్థమవుతోంది. వాలీబాల్ క్రీడాకారుడిగా వరుణ్ తేజ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి యదు వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది.
ఈ ప్రాజెక్టు డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధికి ఓ ఉదాహరణ : మోడీ
ఉత్తర్ ప్రదేశ్: నొయిడా సెమీకండక్టర్ ఫ్యాక్టరీ శిలన్యాస్ చేశాం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నోయిడా ఎయిర్ పోర్టును, మీరట్ మెట్రో విస్తరణ ప్రారంభించాం అని అన్నారు. ఈ సందర్భంగా నొయిడా లో మోడీ ప్రసంగించారు. 2003 లో దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలోనే ఈ ఎయిర్ పోర్టు మంజూరైందని, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు అని విమర్శించారు. ఈ విమానాశ్రయం మల్టీమోడల్ కనెక్టివిటి కలిగి ఉంది అని తెలియజేశారు. ఈ కష్టకాలంలో దేశమంతా ఒక్కటై పోరాడాలి అని.. ఈ కష్టకాలంలో దేశం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలి అని సూచించారు. ప్రతి రెండు నిముషాలకు ఓ విమానం ఇక్కడి నుంచి ఎగురుతుంది అని.. సంవత్సరాల నుంచి ఈ ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందకుండా విపక్షం అడ్డుకుంది అని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులన్నీ ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తాయి అని.. నొయిడా ఎయిర్ పోర్టు వల్ల యూపీ రైతులకు చాలా లబ్ధి చేకూరుతుంది అని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఓ ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు. ఈ ఎయిర్ పోర్టు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో భాగం అని.. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ స్థానంలో ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం అని.. ఇథనాల్ వాడకం పెరిగితే, రైతులకు ఆదాయం పెరుగుతుంది అని అన్నారు. దేశంలో చిన్నచిన్న నగరాలకు విమాన సర్వీసులు విస్తరిస్తున్నాయి అని.. సామాన్య భారతీయుడు విమాన ప్రయాణం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. 85 శాతం విమానాల తయారీ, ఓవర్ హాలింగ్ విదేశాల్లోనే జరుగుతోంది అని.. ఆ పరిస్థితి మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. రూ. 29,560 కోట్లతో నొయిడా ప్రోజెక్టు నిర్వహణ అని.. యమున ఇంటర్నెల్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నాం అని అన్నారు. వికసిత్ భారత్ కోసం అందరూ కలిసి శ్రమించాలి అని.. పశ్చిమాసియా యుద్ధాన్ని నిశింతగా పరిశీలిస్తున్నాం అని మోడీ స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. పామర్రు, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం గోపువానిపాలెంలో
10GramsGold|కొనుగోలు దారులకు మళ్లీ షాక్
10GramsGold| కొనుగోలు దారులకు మళ్లీ షాక్ ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : భారత్లో బంగారానికి
కడెంలో ప్రశాంతంగా పది పరీక్షలు..
కడెం, ఆంధ్రప్రభ ; మండల కేంద్రమైన కడెం లో ని జిల్లా పరిషత్
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం రాంపల్లి–మారేడుగొండ శివారులోని శ్రీ రేణుక
44 years |ఉద్యమంలో చురుకైన పాత్ర..
44 years | ఉద్యమంలో చురుకైన పాత్ర.. 44 years | చిత్తూరు,
Amaravathi : అమరావతి రైతులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోండి.. ప్రజా ప్రతినిధులకు బండి పిలుపు
కరీంనగర్: రాష్ట్రంలోని వార్డు మెంబర్ మొదలు సర్పంచ్ దాకా.. కౌన్సిలర్ మొదలు కార్పొరేటర్ దాకా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తమ తమ ఇండ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కోటి ఇండ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే మోడీ సర్కార్ లక్ష్యమన్నారు. అందుకోసం రూ.75 వేల కోట్లకుపైగా నిధులను కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ సోలార్ వ్యవస్థపై పూర్తిస్తాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన నివాసంపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకున్నారు. శనివారం ఉదయం టీజీరెడ్కో అధికారులు, డిస్ట్రిబ్యూటర్ తో కలిసి సోలార్ వ్యవస్థ పనితీరును పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులు రూపొందించిన ‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’’ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పిలుపు మేరకు నా ఇంటిపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిత్యం ఈ దేశాన్ని కాపాడాలి. దేశ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే మహానేత మోడీ. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం... ముఖ్యంగా చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలనే అంత్యోదయ సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. అందులో భాగంగానే దేశంలోని కోటి ఇండ్లపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యుత్ ను అందించాలనే లక్ష్యంతో ‘‘PM సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన’’ పథకాన్ని 2024 ఫిబ్రవరి 15న ప్రవేశపెట్టాం. ఈ సోలార్ ప్యానల్ ద్వారా ఒక్కో ఇంటికి నెలకు 300 యూనిట్లు వరకు ఉచితంగా విద్యుత్ ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం 75 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాం. తొలుత ప్రజాప్రతినిధులంతా తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలవాలని మోడీ పిలుపునిచ్చారు. కాబట్టి వార్డ్ మెంబర్ మొదలు సర్పంచ్ దాకా, కౌన్సిలర్ మొదలు కార్పొరేటర్ దాకా ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నా. సోలార్ వ్యవస్థపై అవగాహన కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమవుతోంది. ఎందుకంటే 2024లో ఈ పథకం ప్రవేశపెట్టినా ఇంతవరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 5 నుండి 7 వేల కుటుంబాలు సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకునేందుకు సరిపడా కేంద్రం నిధులు కేటాయించింది. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా... ఒక్కో ఇంటిపై సోలార్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకుంటే... అందుకయ్యే వ్యయంలో 30 వేల నుండి 78 వేల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తోంది. నా ఇంటి విద్యుత్ బిల్లులు ప్రతినెలా 25 నుండి రూ.30 వేలు ఖర్చు వస్తోంది. ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటు ద్వారా ఇకపై బిల్లులు రూ.5 వేలలోపే వచ్చే అవకాశముంది. అందుకే ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్ ను కొనుగోలు చేసే స్థాయి నుండి అమ్మే స్థాయికి రావాలన్నది మోదీ ఆకాంక్ష. రైతులు, సామాన్య ప్రజలంతా ఈ సోలార్ వ్యవస్థను వాడుకుని కరెంట్ ను కొనే స్థాయి నుండి అమ్మే స్థాయికి రావాలని కోరుతున్నా. పేద ప్రజలకు కూడా భారం కాకుండా సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకుంటే... 80 శాతం వరకు లోన్ వస్తుంది. అది కూడా వాయిదాల పద్దతిలో చెల్లించే అవకాశముంది. కాబట్టి ఏ మాత్రం భారం కాకుండా సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లాగే వ్యవసాయంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించి ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో PM-KUSUM (ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తాన్ మహాభియాన్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తెలంగాణలో 1800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని TG-REDCO సంస్థ లక్ష్యం పెట్టుకుంది. రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, గ్రామ మండల సమాఖ్యలు ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటి వరకు కరీంనగర్ లో 46, సిరిసిల్లలో 17 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 63 ఆమోదం ఆమోదం పొందాయి. రైతులు తమ పొలాలకు అవసరానికి మించి అదనపు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తే డిస్కంలకు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చు. పెద్ద ఎత్తున రైతులు ముందుకొచ్చి ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నా అని పేర్కొన్నారు.
నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి
నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి కామారెడ్డి, ఆంధ్రప్రభ ; నిర్మల్ పట్టణానికి చెందిన
NARA LOKESH |జగన్ ‘సినిమా’ 11 రోజులు కూడా ఆడదు
NARA LOKESH | జగన్ ‘సినిమా’ 11 రోజులు కూడా ఆడదు NARA
భారతి, రామ్కో సిమెంట్స్కు నోటీసులు
భారతి, రామ్కో సిమెంట్స్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది
మరోసారి చిక్కుల్లో యువరాజ్ సింగ్ తండ్రి.. ఈసారి మహిళలపై వ్యాఖ్యలు
టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మహిళలు, పిల్లలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఆటగాడు రిటైర్ కావడానికి అతడి ఇంట్లో ఉండే మహిళలు, పిల్లలే కారణం అని ఆయన అన్నారు. రిటైర్మెంట్కు ఫిట్నెస్తో సంబంధం ఉండదని, ఆటగాడి కెరీర్కు మహిళలు అడ్డుపడరాదని పేర్కొన్నారు. ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘40 ఏళ్లు దాటిన తర్వాత మాకు వయసైపోతుందని చాలా మంది అనడం గమనిస్తున్నా. 30 ఏళ్ల తర్వాత మహిళలు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు’’ అని అన్నారు. ఓ జిమ్ డైరెక్టర్గా తన జిమ్కు వచ్చే మహిళలకు, సీనియర్ సిటిజన్లకు ఫిట్నెస్పై దృష్టి సారించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘‘క్రీడల్లో మాత్రం ఆటగాళ్ల రిటైర్మెంట్కు అతడి ఇంట్లోని మహిళలే కారణమని చెప్పగలను. ఒక ఆటగాడికి ఫిట్నెస్ సమస్యలు మొదలైన తర్వాత అతడి భార్య సలహాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. మీరు రిటైర్ కావాల్సిన సమయం వచ్చిందని.. కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోవాల్సిన సమయం వచ్చిందని చెబుతారు. కానీ, నా దృష్టిలో ఒక గొప్ప అథ్లెట్ కెరీర్ విషయంలో మహిళలు తలదూర్చకూడదన్న విషయాన్ని గట్టిగా నమ్ముతాను. క్రీడాకారులకు ఫిట్నెస్తో సంబంధం లేదు. శక్తి ఉన్నంతవరకు ఆడాలన్నది నా అభిప్రాయం’’ అని యోగరాజ్ పేర్కొన్నారు.
19th Season |తొలి పోరులో సన్రైజర్స్తో ఆర్సీబీ ఢీ
19th Season | తొలి పోరులో సన్రైజర్స్తో ఆర్సీబీ ఢీ 19th Season
ఊట్కూర్లో ఘనంగా జిల్లా స్థాయి భజన పోటీలు
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని
సుప్రీం లీడర్ ఇక లేరంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు
“విరాట్ కోహ్లీ వల్ల గర్భవతిని అయ్యాను”… యువతి వ్యాఖ్యలపై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్ #ViratKohli
Raghu Rama : రఘురామ ఇలాకాలో ఈ కాంట్రవర్సీలేంటి గురూ?
ఆంధ్రప్రదేశ్ ఉప శాసనసభాపతి రఘురామ కృష్ణరాజు ఇలాకాలో నిత్యం వివాదాలు పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి
Telangana |కవిత పార్టీపై కాంగ్రెస్ స్పందన
Telangana | కవిత పార్టీపై కాంగ్రెస్ స్పందన Telangana | ఆంధ్రప్రభ, వెబ్
Nayanthara locked for Salman Khan’s Film
Top South Indian actress Nayathara was seen in Shah Rukh Khan’s Jawan and the actress played a crucial role in Yash’s Toxic that is due for release. The actress has been approached to play the lead role beside Salman Khan in his upcoming film that will be helmed by Tollywood director Vamshi Paidipally. The actress […] The post Nayanthara locked for Salman Khan’s Film appeared first on Telugu360 .
ఘనంగా ఎంవీ కృష్ణారావు శత జయంతి వేడుకలు…
ఘనంగా ఎంవీ కృష్ణారావు శత జయంతి వేడుకలు… అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఉమ్మడి
ధోనీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..
ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSKకు బిగ్ షాక్ తగిలింది. కండరాల గాయంతో బాధపడుతున్న మాజీ కెప్టెన్ ధోనీ మొదటి 2 వారాలు మ్యాచ్లకు దూరం కానున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది. న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ షాక్ తగిలింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. పిక్క కండరాల గాయంతో ధోనీ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియాను వేదికగా తెలియజేసింది. ప్రస్తుతం ధోనీ చికిత్స పొందుతున్నాడని.. దీంతో ఈ సీజన్లోని మొదటి రెండు వారాల మ్యాచ్లకు దూరం కానున్నట్లు వెల్లడించింది. చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. మార్చి 30న గువహటిలోని బర్సపరా స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, మొదటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ లకు ధోనీ దూరం కానున్నాడు. ఎప్పుడు తిరిగి జట్టులోకి అడుగుపెడతాడు అన్న విషయాలను గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది. కాగా, టీమిండియాకు వీడ్కోలు పలికిన తర్వాత గత కొన్నేళ్లుగా ధోనీ కేవలం IPLలో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. మోకాలి గాయాలు వేధిస్తున్నప్పటికీ తరచుగా మ్యాచ్లు ఆడుతూ.. జట్టుకు అవసరమైన ప్రతిసారీ అండగా నిలిచాడు. 2023లో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి జట్టుకు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
గొంది మురళికి ప్రముఖుల సన్మానం
దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జ్ కం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్
CM Chandrababu |రైతుల సహకారంతో రాజధాని నిర్మాణం
CM Chandrababu | రైతుల సహకారంతో రాజధాని నిర్మాణం CM Chandrababu |
rcb vs srh |కొన్నిగంటల్లో ఐపీఎల్ వార్
rcb vs srh |కొన్నిగంటల్లో ఐపీఎల్ వార్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ ఢీరాత్రి
అల్ఖైదా లింక్ అనుమానంతో బంకూరా వ్యక్తిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు #TelanganaPolice
AP |నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయలు విరాళం..
AP | నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయలు విరాళం.. AP |
Why did Rishab Shetty Unfollow Rukmini Vasanth?
Kannada actor Rishab Shetty emerged as a pan-Indian star with Kantara. The second installment is a huge success and Rishab Shetty has several feature films lined up in various languages. Rishab Shetty recently unfollowed Hombale Films, the producers of Kantara. There are strong speculations that there are financial differences between the Kantara star and his […] The post Why did Rishab Shetty Unfollow Rukmini Vasanth? appeared first on Telugu360 .
Peddi Release: Ram Charan strict on his Stand
Mega Powerstar Ram Charan’s upcoming movie Peddi is slated for April 30th release across the globe. The film’s shoot is yet to be wrapped up and the team is working round the clock to meet the deadlines. The shoot will continue till the mid of April. At this time, Ram Charan suffered a minor injury […] The post Peddi Release: Ram Charan strict on his Stand appeared first on Telugu360 .
Thieves |అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి..
Thieves | అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి.. Thieves | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
పంచాయితీ కార్మికులకు దుస్తులు పంపిణీ
దమ్మపేట, ఆంధ్రప్రభ : పంచాయితీ పారిశుధ్య కార్మికులకు దమ్మపేట మాజీ వైస్ ఎంపీపీ
ఇది దేవుడి నిర్ణయం.. ఓంకారేశ్వర ఆలయానికి సిఎం రేవంత్ శంకుస్థాపన
మూసీ ప్రక్షాళన అత్యవసరమని ముఖ్యమంత్రి రేవ్ంత్ రెడ్డి అన్నారు. మంచిరేవులలో పర్యటన సందర్భంగా శనివారం సిఎం రేవంత్రెడ్డి.. మూసీ ఒడ్డున ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉందని.. ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించడం భగవత్ కార్యంగా భావిస్తున్నామని అన్నారు. మంచిరేవులలో ఈ కార్యక్రమం దేవుడి నిర్ణయమని చెప్పారు. హైదరాబాద్ నుంచి కాలుష్యం మూసీ నదిలో కలిసి.. నల్గొండ వరకూ వెళ్తోంది. మూసీ కాలుష్యంతో నల్గొండ ప్రజలు చాలా బాధపడుతున్నారు. పుట్టిన ఊరి నుంచి పిల్లలను బయటకు పంపే దుస్థితి ఈ ప్రాంతంలో ఉంది. గోదావరి నుంచి 20 టీఎంసీలు తరలిస్తున్నాం. మూసీ దుస్థితి ప్రకృతి తప్పిదం కాదు, మానవ తప్పిదం. మూసీ నదిని బాగుచేయాలని గతంలో అనేకమంది ప్రయత్నించారు. ఈ అవకాశం మా ప్రభుత్వానికి దక్కడం మా అదృష్టం అని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణంతోపాటు ఆధునిక గోశాల నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రూ.700 కోట్ల వ్యయంతో 8 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించనున్నారు. వంద అడుగులతో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.
Rushya Datta debut with an entertainer Don Bosko: Shoot Completed
Radha Krishna Entertainments, a rising banner recognized for its strong distribution network across overseas markets and Telugu states, is now stepping into production with the comedy entertainer Don Bosko. Backed by producer Venkat Upputuri, the film marks an exciting new chapter for the banner. The film introduces successful producer Naga Vamsi’s Brother in law Rushya […] The post Rushya Datta debut with an entertainer Don Bosko: Shoot Completed appeared first on Telugu360 .
ఆధునిక ప్రపంచ వాణిజ్యంలో 80% నుండి 90% వరకు నిత్యావసర సరకులు సముద్రమార్గం ద్వారానే రవాణా అవుతుంటాయి. ఇంధనం, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆహార పదార్థాలు, కాఫీగింజలు ఇవన్నీ ఒక దేశం నుంచి మరో దేశానికి నౌకల ద్వారానే రవాణా అవుతుంటాయి. రోడ్లు, విమానాలద్వారా కన్నా నౌకలద్వారా రవాణాకు తక్కువ ఖర్చు అవుతుంది. ప్రపంచ జిడిపిలో సముద్ర వాణిజ్యం సుమారు 60% వాటాను కలిగి ఉంది. అంతర్జాతీయ వాణిజ్యానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సముద్ర రవాణా వెన్నెముక వంటిది. హోర్ముజ్, ఎర్రసముద్రం, సూయెజ్ కాలువల ద్వారా జరిగే సముద్ర వాణిజ్య నౌకల రవాణాలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా అది ప్రపంచం మొత్తంమీద వాణిజ్యంపై విపరీత ప్రభావం చూపిస్తుంది. కొన్ని నౌకలపై దాడులు జరిగినా మొత్తం సముద్ర రవాణా మార్గాల మూసివేతకు దారి తీస్తుంది. ఇప్పుడు హోర్ముజ్ జలసంధిద్వారా జరిగే వాణిజ్య నౌకల రవాణా ఎలాంటి సంక్షోభంలో అల్లాడుతోందో మనం చూస్తున్నాం. ఇరాన్, ఉక్రెయిన్, అమెరికా దేశాలు వాణిజ్య నౌకలను టార్గెట్ చేసుకుని దాడులు సాగిస్తుండడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమైన పరిణామంగా మారుతోంది. ఇరాన్ యుద్ధం మొదటి రెండు వారాల్లోనే ఆయిల్ టాంకర్లతోసహా మొత్తం 16 సరకుల రవాణా నౌకలు దాడికి గురయ్యాయి. ఇవి కాక వందలాది నౌకలు గల్ఫ్ జలసంధిలో చిక్కుకున్నాయి. దీంతో చమురు, గ్యాస్, ఎరువులు, అల్యూమినియం, సల్ఫర్, హీలియం తదితర అనేక సరకులు కరువైపోతున్నాయి. ఇరాన్ తన వ్యూహం మార్చుకుని భూతల, గగన దాడుల కన్నా సముద్ర వాణిజ్య నౌకలపైనే దాడులు సాగిస్తూ సముద్ర వాణిజ్యాన్ని మొత్తం తన గుప్పిటలో బందీగా చేసుకుంటోంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యా వాణిజ్య నౌకలపై దాడులు ప్రారంభించింది. రష్యా చమురు ఎగుమతి యంత్రాంగంలో 40 శాతాన్ని స్తంభింపచేసింది. రేవులపైన, పైపులైన్లపైనా ఉక్రెయిన్ దాడులు కొనసాగిస్తుండడంతో రష్యా నుంచి చమురు సరఫరా దెబ్బతింటోంది. రోజువారీ సరఫరాలో 2 మిలియన్ బ్యారెళ్ల వరకు తగ్గిపోతోంది. ఇది భారత్ రోజువారీ వినియోగంలో మూడో వంతు కన్నా ఎక్కువ. దీనికి తోడు రష్యా రహస్య నౌకాదళం ట్యాంకర్లను ఐరోపా ముట్టడించడంతో సరఫరా మరింత దెబ్బతింది. ప్రపంచ వాణిజ్యంపై ఈ ప్రభావం ఎంతో ఇప్పుడు చెప్పడం కష్టం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం సైనిక కార్యకలాపాలతో సంబంధం లేని వాణిజ్య నౌకలపై ఎలాంటి దాడులు చేయకూడదు. ఈ వాణిజ్య నౌకలు సైనిక కార్యకలాపాలకు సహాయం చేసినా, ఆయుధాలను రవాణా చేసినా లేదా శత్రువుకు మద్దతుగా పనిచేసినా అప్పుడు వాటిని సైనిక లక్షాలుగా భావించి దాడిచేసే అవకాశం ఉంటుంది. సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలు సాధారణ పౌర ఆస్తులుగా పరిగణించబడతాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్, సముద్ర చట్టాల కన్వెన్షన్ ప్రకారం సాధారణ పరిస్థితుల్లో వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడం ముఖ్యమైన కర్తవ్యం. పశ్చిమాసియా యుద్ధం బీభత్సంగా మారడంతో తన వాణిజ్య నౌకల రక్షణ కోసం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం భారత్ నౌకాదళం యుద్ధ నౌకలను మోహరింప చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించని వాణిజ్య నౌకలపై దాడులు చేయడం యుద్ధ నియమాల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఇప్పుడు హోర్ముజ్ జలసంధి సంక్షోభం మాదిరిగానే రెండేళ్ల క్రితం ఎర్రసముద్ర రవాణా మార్గం లోనూ సంఘర్షణ జరిగింది. రష్యా నుంచి చమురు తీసుకుని వస్తున్న బ్రిటన్కు చెందిన మార్టిన్ లువాండా అనే నౌకపై ఎర్రసముద్ర మార్గంలో హోతీలు దాడులు చేయడంతో మంటలు చెలరేగి పెను ప్రమాదం సంభవించింది. దాంతో భారత్కు చెందిన ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌక అప్రమత్తమై ఆ నౌకను మంటల నుంచి రక్షించింది. దీంతో రవాణా సంస్థలన్నీ తమ సముద్ర మార్గాలను మార్చుకోవలసి వచ్చింది. ఇది జరిగి రెండేళ్లయినా ఎర్రసముద్ర రవాణా మార్గం ఇంకా సాధారణ స్థితికి రాకపోవడం గమనార్హం. యుద్ధంలో వాణిజ్య నౌకలపై దాడులు చేయడం వల్ల వచ్చే అనర్థాలను మనం మరిచిపోయినట్టుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ 2426, అమెరికా 1768 వాణిజ్య నౌకలను కోల్పోయాయి. ప్రపంచంలోనే మూడో అతిభారీ ప్యాసింజర్, కార్గో నౌకలను సమకూర్చుకున్న జపాన్ ఈ రెండో ప్రపంచ యుద్ధంలో 2346 వాణిజ్య నౌకలను కోల్పోయింది. ఈ యుద్ధం పూర్తయ్యేసరికి కనీసం 1000 టన్నులకు మించి సామర్థం కలిగిన ఒక్క నౌకను కూడా దక్కించుకోలేకపోయింది. ఆ రోజుల్లో యుద్ధాలన్నీ కేవలం మిలిటరీ సామర్ధాల బట్టే జరిగేవి. భారీ నౌకలను మిలిటరీయే ధ్వంసం చేసేది. కానీ ఇప్పుడు అలా కాదు, సాంకేతికంగా ఎన్నో వ్యూహాలు రూపొందుతున్నాయి. ఒక్క బటన్ నొక్కితే టార్గెట్ ప్రకారం అంతా ధ్వంసమైపోతోంది. ఇరాన్, ఉక్రెయిన్, హోతీ దళాలు ఇప్పుడు యుద్ధంలో విధ్వంసానికి భారీ క్షిపణులను వినియోగించడం లేదు. కేవలం కొన్ని వేల డాలర్ల ఖర్చుతో తయారయ్యే అత్యల్ప డ్రోన్లతోనే లక్షాలను సాధించుకుంటున్నాయి. ప్రభుత్వాల మద్దతుతో దుండగులు సృష్టించగల విధ్వంసం ఎలా ఉంటుందో స్పష్టంగా కనిపిస్తోంది. భూతల, గగనమార్గాలు కాకుండా సముద్ర మార్గాలే రణరంగాలుగా మారుతున్నాయి. ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్నాయి. అందువల్ల సముద్రమార్గాలను సురక్షితంగా అందరికీ అందుబాటులో ఉంచేలా కొత్తగా దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని పెంపొందించడానికి తగిన చర్యలు చేపట్టే అవసరం ఏర్పడింది. ఈ విషయంలో అమెరికాయే చొరవ తీసుకుంటుందన్న అభిప్రాయం వినిపించినా నమ్మకం కుదరడం లేదు.
Hyderabad : హైదరాబాద్ లో గంట సేపు నేడు లైట్లు ఆఫ్
హైదరాబాద్ వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నేడు అలర్ట్ చేసింది
అక్రమ ఇసుక రవాణాపై ఆందోళన వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని అక్లూర్
పగటి నాటకాలకు, సాయంత్రం నాటకాలకు తేడా ఏమిటి? నాటకం అదే అయినా పగలు వేస్తే ప్రజలు తమ పనుల్లో ఉంటారు గనుక తీరిక ఉండే కొద్ది మంది తప్ప రారు. సాయంత్రమైతే చాలా మంది వెళతారు. ఇరాన్ యుద్ధం విషయమై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం చేసిన ప్రతిపాదనలు పగటి నాటకం వంటివే. ఎందుకంటే, వాటిని అమెరికన్లతో సహా ఎవరూ విశ్వసించటం లేదు గనుక. అందువల్లనే, తన జీవితంలో టివి షో మ్యాన్ పాత్ర కూడా వహించిన ఆయన పగటి నాటకానికి ఎవరూ పోవటం లేదు. తన ధోరణికి పరాకాష్ఠ అన్నట్లు ట్రంప్ ఈ నెల అన్న మాటలను గమనించండి. ఇరాన్లో నాయకత్వ లోటు ఏర్పడినందున తనను సుప్రీం లీడర్గా రావలసిందని కోరుతున్నారట. తాను ఒప్పుకోవటం లేదట. ఇది హాస్యం కోసం అన్నదని ఎవరైనా కొట్టి వేయవచ్చు. కాని, వెనిజువెలాను ఇక తానే నడపనున్నానని, క్యూబాను చేతిలోకి తీసుకోగలనని, పనామా కాల్వను, కెనడాను, గ్రీన్లాండ్ను ఆక్రమించగలనని ఆ దిశలో ప్రయత్నాలు కూడా చేసిన వ్యక్తికి మనసులో అటువంటి ఆలోచనలు ఉన్నాయన్న మాట. తన స్వభావమే అదన్నమాట. అందుకే ఆయన తనకు ఎటువంటి అంతర్జాతీయ చట్టాలన్నా లెక్కలేదని, తన మనసుకు తోచిందే చేస్తానని బాహాటంగా ప్రకటించారు. దీనంతటిని బట్టి అనిపించేదేమిటి? ఇరాన్ విషయమై తను, ఇజ్రాయెల్ ప్రధాని కలిసి ఒక లక్షంగా ప్రకటించిన రాజ్య వ్యవస్థ మార్పు (రెజీమ్ ఛేంజ్) ఒకవేళ నిజంగా జరిగినట్లయితే, అపుడు ట్రంప్ ఆ దేశానికి తనను తానే సుప్రీం లీడర్గా ప్రకటించుకుంటే ఆశ్చర్యపడవలసింది ఉండదు. ఈ రహస్య ఉద్దేశంతోనే కావచ్చు, ఇరాన్లో నాయకత్వ శూన్యత ఏర్పడిందని, మాజీ రాజవంశానికి చెందిన రెజా పహ్లవీకి దేశంలో తగినంత మద్దతు లేదని ఆయన ఈ మధ్య అంటున్నారు. ట్రంప్ వంటి వ్యక్తి ఎందుకైనా తగును. ఇతర విషయాలలోకి వెళ్లే ముందు, ఇరాన్తో చర్చల కోసం షరతులంటూ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన వాటిని, తన షరతులంటూ ఇరాన్ ముందు పెట్టిన వాటిని గమనించండి. వాటిలో అత్యధికం రాజీకి వీలుపడనివే. ఎపుడైనా చర్చలంటే ఇరుపక్షాలు మొదట కొన్ని షరతులు పెట్టడం, చర్చల క్రమంలో కొన్ని రాజీలు కుదరటం సాధారణంగా జరిగేదే. కాని, ఉభయులకూ వారి మౌలిక ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. వాటిపై రాజీ అన్నది అసంభవం. అటువంటి అంశాలు ప్రస్తుతం అమెరికా, ఇరాన్లు రెండింటి జాబితాలలో ఉన్నాయి. అమెరికా 15 షరతులలో 4 విధాలైనవి ఉన్నాయి. ఒకటి, అణుశక్తి. రెండు, క్షిపణులు. మూడు, హెజ్బొల్లా, హూతీ వంటి అనుబంధ మిలిటెంట్ సంస్థలు. నాలుగు, హర్మూజ్ జలసంధి. అమెరికా ఈ నాలుగింటిని షరతులుగా మార్చిందంటేనే రెండవ వైపు నుంచి చూసినపుడు ఇరాన్కు అవి అంత కీలకమైనవి అన్నమాట. బయటి వారుగా ఆలోచించినట్లయితే మనకు అనిపించేది కూడా అదే. అటువంటపుడు ఇరాన్ ఎట్లా రాజీ పడగలదు. ఇరాన్లోని అణుశుద్ధి కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయాలని, ఇప్పటికే శుద్ధి అయిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించాలని, భవిష్యత్లో ఎన్నడు కూడా అణ్వస్త్రాలు తయారు చేయబోమంటూ ఒప్పుకోవాలని అమెరికా అంటున్నది. ఇందుకు ఇరాన్ గతం నుంచే చెప్తూ వస్తున్న దేమిటో తెలిసిందే. సామూహిక మానవ హననం చేసే అణ్వస్త్రాల తయారీ ఇస్లాం మతానికే విరుద్ధమన్న గత సుప్రీం లీడర్ ఖమేనీయే వాటి ఉత్పత్తిని నిషేధిస్తూ ఫత్వా జారీ చేశారు. దేశ రక్షణకు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ముప్పు పెరుగుతున్నందున ఆ నిషేధాన్ని సడలించాలంటూ అంతర్గతంగా ఒత్తిడులు పెరుగుతుండినా అంగీకరించిలేదు. అదే ఫత్వాకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నందున అణ్వస్త్రాల తయారీ ప్రసక్తే లేదు. కనుక ఆ షరతును ఇప్పుడు కొత్తగా అంగీకరించవలసిన అవసరం లేదు. అదట్లుండగా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై తాము 1970 లోనే సంతకం చేశాము. ఆ ఒప్పందంలో సభ్యులైన దేశాలకు యురేనియంను శాంతియుత వినియోగం కోసం శుద్ధి చేసుకునే హక్కు పూర్తిగా ఉంటుంది. అటువంటి శుద్ధిని పర్యవేక్షించే అధికారం అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఉంటుంది. అదే ప్రకారం జరుగుతూ వస్తున్నది కూడా. అణ్వస్త్రాల కోసం 90 శాతం శుద్ధి అవసరం కాగా, తాము ఎప్పుడూ 60 శాతానికి మించలేదు. దానిని అంతకన్న కూడా తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు, ప్రస్తుత యుద్ధానికి ముందు అమెరికాతో ఒమన్ మధ్యవర్తిత్వం ద్వారా జరుగుతుండిన చర్చలతో సూచించాము. అదే మాట అమెరికన్ ప్రతినిధులూ అన్నారు. అటువంటపుడు, మేమసలు అణుశుద్ధి చేయరాదని, శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేయాలని షరతులు విధించటంలో ఉద్దేశమేమిటి? అది మాకెట్లా ఆమోదయోగ్యమవుతుంది? ఎన్పిటి సంతకందారులుగా, ఒక స్వతంత్ర దేశంగా మా అవసరాల రీత్యా, మా హక్కుల మాటేమిటి? అసలు మాకు ఈ షరతులు విధించటానికి అమెరికా గాని, మరొకరు గాని ఎవరు? అన్నది ఇరాన్ గతం నుంచి చేస్తున్న వాదన. ఈ సూటి ప్రశ్నలకు అమెరికా సూటి సమాధానాలు ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ ఇప్పుడు తిరిగి చర్చలు జరిగినా చెప్పగలగటం అనుమానమే. ఇందులోని విచిత్రమేమంటే, ఇజ్రాయెల్ అణ్వాయుధాల తయారీకి పాశ్చాత్య దేశాలు స్వయంగా సహకరించాయి. ఆ దేశం ఎన్పిటిపై సంతకం నేటికీ చేయకపోయినా అందుకు ఒత్తిడి చేయటం లేదు. ఈ ద్వంద్వ నీతిలో రహస్యమేమీ లేదు. పశ్చిమాసియాలో ఇరాన్ ఒక స్వతంత్ర విధానం గల దేశం కాగా, ఇజ్రాయెల్ తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం నమ్మినబంటుగా వ్యవహరిస్తున్నది. అది ఏ మాత్రం దాపరికం లేకుండా వారే చెప్తున్న మాట. ఈ వివరాలన్నీ చూసిన మీదట, ఇపుడు అమెరికన్ల అణు సంబంధ షరతులకు ఇరాన్ అంగీకరించేదీ లేనిదీ ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు. ఆ తర్వాత అంశం క్షిపణులు. యుద్ధాలలో గాని, ఆత్మరక్షణకు గాని ఒకప్పుడు పదాతి దళాలు, నావికా బలం, ట్యాంకులు, సాయుధ శకటాలు, వైమానిక బలం ప్రధానంగా ఉండేవి. క్రమంగా క్షిపణులు, వార్హెడ్స్, సైబర్ నైపుణ్యాలు మొదటి వరుసలోకి వస్తున్నాయి. డ్రోన్స్ కూడా. ప్రస్తుతం ఇరాన్ ఆత్మరక్షణ యుద్ధం క్షిపణులు, వార్హెడ్స్, డ్రోన్లపై ఆధారపడి అసమతుల వ్యూహం (అసిమ్మెట్రిక్గా) సాగుతున్నది. అటువంటప్పుడు, ఇరాన్ తన క్షిపణి శక్తిని పరిమితం చేయాలని, తాము నిర్ణయించిన శక్తి మాత్రమే ఉండాలని అమెరికా షరతు విధించడమంటే అర్థమేమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఆ తర్వాత డ్రోన్ల ఉత్పత్తినీ పరిమితం చేయాలంటారు. వరుస దాడులతో సైనిక స్థావరాలను, వైమానిక, నౌకా స్థావరాలను, ఆయుధ కర్మాగారాలను ఇప్పటికే ధ్వంసం చేస్తున్నారు. ఇక ఇరాన్కు మిగిలేదేమిటి? ట్రంప్ తనతో ఒక మాట అన్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వెల్లడించారు. తాము ఏ లక్షాలనైతే యుద్ధం ద్వారా సాధించాలనుకుంటున్నామో వాటినన్నింటిని యుద్ధ విరమణ ఒప్పందం ద్వారా నెరవేర్చజూస్తున్నామని. అందుకు నెతన్యాహూ సంతృప్తి చెందారట. ఇటువంటి షరతులకు ఇరాన్ నాయకత్వం అంగీకరించటమంటే ఆత్మహత్య చేసుకోవటమే. ఆ తర్వాత ఇరాన్ జాతి అమెరికాకు సామంత జాతిగా మారటమే. ఇక పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, యూరప్లకుగాని, ఇప్పటికే వారి సామంతులుగా మారిన గల్ఫ్ షేక్లకు గాని ఇక ఎదురులేకపోవటమే. అంతే ముఖ్యంగా, ఇక పాలస్తీనా ఎప్పటికీ స్వతంత్ర దేశం కాకపోవటం, గ్రేటర్ ఇజ్రాయెల్ అవతరణకు మార్గం సుగమం కావటమే. బహుళ ధ్రువ ప్రపంచ లక్షం సాకారం కావటంలో ఒక ప్రధాన శక్తి అయిన ఇరాన్ పరిస్థితి అట్లా కావడమంటే, ఆ లక్ష సాధన ఆ మేరకు దెబ్బతిని సామ్రాజ్యవాదం బలపడినట్లే. ఇటువంటి స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అమెరికా ప్రతిపాదించిన ఈ సోకాల్డ్ శాంతి ప్రతిపాదనలలో చివరి ఎత్తు గత, ఇరాన్ భౌగోళిక సమగ్రతలో భాగమైన హర్మూజ్ జలసంధిపై హక్కును వదలుకోవాలనటం. ఆ జలసంధి, అందులోని ఖర్గ్ తదితర దీవులు ఇరాన్కు భౌగోళిక సమగ్రత, ఆర్థిక ప్రయోజనాల కోసం అతి కీలకమైనవి. వాటన్నింటిని వదలుకోవాలన్న ట్రంప్ చాలా తెలివికలవాడే కావచ్చుగాని, ఆ షరతులను అంగీకరించేందుకు ఇరాన్ నాయకత్వం తెలివి తక్కువదని భావించగలమా? అంతేకాదు, అసమతల యుద్ధ వ్యూహాలతో నెల రోజుల పాటు ధిక్కరించి ఎదురు నష్టాలు చేస్తూ, ఏవో కొన్ని రాజీలకు సమ్మతించవచ్చుగాని, ఆత్మహత్యాసదృశమైన వాటికి కూడానా? చర్చలకోసం ట్రంప్ షరతులు 15 కాగా, ఇరాన్ 5 మాత్రమే ప్రతిపాదించింది. శాంతియుత ప్రయోజనాల కోసం అణుశుద్ధి హక్కు తమకు ఉండాలి. క్షిపణి పరిమితులను అంగీకరించబోము. హర్మూజ్ తమది మాత్రమే. తమ అనుబంధ మిలిటెంట్ సంస్థలపై దాడులు జరపరాదు. తమపై గల ఆంక్షలు పూర్తిగా ఎత్తి వేయాలి. చివరన కీలకమైనది, గల్ఫ్ దేశాలలోని సైనిక స్థావరాలన్నీ రద్దు చేయాలి. వీటికి ట్రంప్ అవునంటారని భావించగలమా? దీనంతటి అర్థం స్పష్టమే. ఏవైనా అరకొరగా తప్ప ప్రధానమైన అంశాలపై రాజీలు కుదిరే అవకాశాలు కన్పించవు. యుద్ధం ఇదే విధంగా కొనసాగితే ఎవరికి కలిగే నష్టాలు ఎంత? ప్రపంచానికి నష్టాలేమిటి? చివరకు యుద్ధం ఏ విధంగా ముగియవచ్చునన్నది ఊహించలేని విషయం. ఆలోగా ఒత్తిడి మాత్రం అందరిపైనా పెరగనున్నది. అమెరికా, ఇజ్రాయెల్ అంచనా ప్రకారం ఇరాన్ కుప్పకూలిపోలేదన్నది మాత్రం ఈ మొదటి నెల యుద్ధం తర్వాత కనిపిస్తున్న వాస్తవం. - టంకశాల అశోక్ ( దూరదృష్టి) - రచయిత సీనియర్ సంపాదకులు
Andhra Pradesh : రాజధానికి సహకరిస్తారనుకున్నా : అయ్యన్నపాత్రుడు
ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వం కొనసాగించిన విధానాలను కొనసాగించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు
Fire Accident |కాటన్ గోడౌన్లో మంటలు…
Fire Accident | కాటన్ గోడౌన్లో మంటలు… Fire Accident | నందిగామ,
Chittoor | ముగ్గురు దుర్మరణం Chittoor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
RGIAను భూతాల ప్రదేశంగా చూపించిన యూట్యూబ్ వీడియోలు… యూట్యూబర్లపై పోలీసులు కేసులు #HyderabadAirport
Revanth Reddy : మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే శివతాండవమే
ఏది ఏమైనా మూసీ నది ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
TG | ఇప్పగూడెం శివారులో..! ప్రాణాలకు ముప్పుగా మారిన ట్రాన్స్ఫార్మర్దాసుకుంట వద్ద చెట్ల
ఎంఎల్ఎలు పెరిగితే ఎవరికి లాభం?
పార్లమెంట్, శాసనసభల్లో సభ్యుల సంఖ్య పునర్విభజన ఎప్పుడెప్పుడా అని ఎదిరిచూస్తున్న వారిని తృప్తిపరిచే వార్తను హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎం పి, ఎంఎల్ఎ స్థానాలను గంపగుత్తగా 50% పెంచాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లు ఉభయసభల్లో ఆమోదానికి మూడొంతుల మెజారిటీ కావాలి కాబట్టి అన్ని విపక్ష పార్టీలతో సమావేశాలకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని చట్టబద్ధత కల్పిస్తుంది. 2029లో జరగబోయే సాధారణ, శాసనసభ ఎన్నికల నుండి ఈ మార్పు వర్తిస్తుంది. ఈ పెంపుదలతో దేశంలో ఉన్న 4123 అసెంబ్లీ స్థానాలు 6186కి చేరుతాయి. 543 ఉన్న లోక్సభ స్థానాలు 816 కు పెరుగుతాయి. దక్షిణాదికి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో జనాభా ప్రాతిపదికన కాకుండా సమన్యాయం కోసం అన్ని ప్రాంతాలకు 50% సీట్లు పెంచడం జరుగుతుందని కేంద్రం అంటోంది. దేశంలో ఇంతకు క్రితం 1952, 1962, 1972, 2002 లలో చట్ట సభల సీట్ల సర్దుబాటు కోసం డీలిమిటేషన్ కమిషన్ల ఏర్పాటు జరిగింది. జనాభా నియంత్రణ మూలంగా వివిధ రాష్ట్రాల్లో మారిన జనాభా వృద్ధి వ్యత్యాసం సభల్లో ప్రజాప్రాతినిధ్యానికి అడ్డంకి కావద్దని 2001 జనగణన తర్వాత ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు ముందుకు రాలేకపోయింది. అయితే కాలం గడిచినా కొద్దీ జనాభా పెరుగుదల, వలసల కారణంగా ఒకచోట 30లక్షల ఓటర్లు ఉంటే, మరోచోట ఆ సంఖ్య 50వేలకు పడిపోయింది. దీని వల్ల సీట్ల సర్దుబాటు అనివార్యమైంది. అయితే చట్టసభ సీట్ల పెంపుదలకు ఇంతవరకున్న జనసంఖ్య సూత్రం ఇప్పుడు పనికిరాదు. ఆ లెక్కన సీట్ల పునర్విభజన జరిగితే జనాభా పెరగని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అందుకే ఈ విధానాన్ని దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు పూర్తిగా వ్యతిరేకించాయి. అదే జరిగితే జనాభా పెరుగుదల గల ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగి కేంద్ర పాలనలో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. దక్షిణ ప్రాంతంలో సీట్లు రాకున్నా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆధిక్యతతో ఏ పార్టీ అయినా దేశాన్ని ఏలవచ్చు. విపులంగా చెప్పాలంటే దక్షిణాదిలో పట్టులేని బిజెపి కేవలం ఉత్తరాదిలోని నాలుగు, అయిదు రాష్ట్రాల్లో ఆధిక్యత సాధించి ఢిల్లీ గద్దెను ఎక్కవచ్చు. ఇలా జరిగితే దక్షిణ రాష్ట్రాలు అభివృద్ధిని సాధించలేవు. ప్రతి దానికి కేంద్రంలోని పార్టీ దయ దాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తుంది. సీట్ల సవరణ చేపట్టి 24 ఏళ్ళు దాటుతున్నందువల్ల పాలనా సౌలభ్యం, ప్రజలకు అందుబాటు కోసం ఏదో లెక్కన ఓ అడుగువేయక తప్పనిస్థితి ప్రభుత్వానిది. అయితే ఏ శాస్త్రీయ దృక్పథం లేకుండా ఉన్న సీట్లను 50% పెంచేద్దామనడం ప్రయోజనశూన్య ఆలోచనే అవుతుంది. ఇంతవరకు జరిగిన పునర్విభజనలకు జన సంఖ్య, భౌగోళిక మార్పులు తదితర అంశాలు ప్రాతిపదికగా ఉండేవి. 1952లో జరిగిన డీలిమిటేషన్లో అప్పటివరకున్న లోక్సభ సీట్లలో 5 పెంచి 494కి స్థిరీకరించారు. రెండోసారి 1963 లో ఆ సంఖ్య 28 సీట్లు పెరిగి 522 కి చేరింది. 1973లో చేపట్టిన పునర్విభజనలో 21 సీట్లు పెరిగి లోక్సభ స్థానాలు 543 అయ్యాయి. 2002 లోని డీలిమిటేషన్ కమిషన్ కేవలం అసెంబ్లీ స్థ్థానాలను పెంచింది. చివరి పునర్విభజన 2001 నాటి జనగణన ఆధారంగా జరిగింది. ఇప్పటి సీట్ల సవరణకు జనగణన -2011 ప్రాతిపదికన జరగాలి. 2001 2011 మధ్య కాలంలో దేశజనాభా 18 కోట్లు పెరిగింది. ప్రస్తుత జనాభా 145 కోట్లు అంటున్నారు. కాబట్టి 2011 నుండి 2026 నాటికి మరో 24 కోట్లు పెరిగినట్లు. 1952 నుండి 2001 మధ్యకాలంలో అంటే యాభై ఏళ్లకు పెరిగిన ఎంపిల సంఖ్య 54 మాత్రమే. 25 ఏళ్ల కాలానికి ఏకంగా 273 పెరగడం అశాస్త్రీయమే. ఏ లెక్కన చూసినా ఒకేసారి సగం సీట్లు పెంచేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా నష్టకారకమే. ప్రస్తుతం ఎంపిల నెల జీతభత్యాలు కలిపితే రూ. 3 లక్షల దాకా ఉంటోంది. మాజీలకు నెలకు రూ. 31 వేల పెన్షన్ లభిస్తోంది. వారి సంఖ్య 50% పెరిగితే ఏడాదికి మరో వంద కోట్లు వారి ఖర్చులకు కేటాయించాలి. ఇలా దేశవ్యాప్తంగా ఎంఎల్ ఎల లెక్క తీస్తే అన్ని రాష్ట్రాల్లో కలిపి వేయి కోట్లయినా ఉంటుంది. వారందరికీ రాజధానుల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయ తదితర వసతుల కల్పన ఎంతో వ్యయభారాలతో కూడుకున్నది. దీనికోసం ప్రజలపై పన్నుల భారం మోపడమే తప్ప ఆ ప్రజాప్రతినిధులతో ప్రజలకు కలిగే మేలు ఏమీ ఉండదు. ఇప్పుడున్న పాలనా స్థితిగతుల్లో పెద్దగా మార్పేమీ ఆశించలేం. సీట్ల పెంపువల్ల పార్టీ టికెట్ కోసం రాజకీయ పార్టీలపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. చట్ట సభలో ‘అధ్యక్షా!’ అని మైకులో అనాలని తపించేవారికి మార్గం సుగమమవుతుంది. అయితే ఈ ప్రతిపాదనను అన్ని రాజకీయ పక్షాలు అంత తేలిగ్గా ఒప్పుకుంటాయనుకోం. ఇప్పటికైతే ఎన్డిఎ మిత్రపక్షాలతో చర్చలు జరిగాయి. విపక్షాలతో సంప్రదింపుల పర్వం మొదలుకానుంది. ఇందులోని సానుకూల అంశమేమిటంటే అన్నిరాజకీయ పార్టీలకు ఈ పెంపు సంబరమే. బిజెపి ప్రభుత్వ ప్రతిపాదనను అంత తేలిగ్గా ఒప్పుకోవద్దని కాంగ్రెస్ బెట్టు చేయవచ్చు. కానీ మొదటికే వ్యతిరేకించదు. భారమంతా ప్రజలపైనే కాబట్టి ఉభయసభల ఆమోదం కూడా సాధ్యమే. - బి. నర్సన్, 94401 28169
బస్సు, లారీ ఢీకొని… 25మందికి గాయాలు వైరా, మార్చి 28 (ఆంధ్రప్రభ )
Ram Charan’s Peddi Pehlwan transformation shocks everyone
Mega Powerstar Ram Charan has been director’s actor doing whatever is asked from him by the directors for a character. He proved yet again with his beastly transformation for Peddi Pehlwan portions. The actor worked doubly hard to achieve the physique in the guidance of renowned experts. When the director Buchi Babu Sana narrated the […] The post Ram Charan’s Peddi Pehlwan transformation shocks everyone appeared first on Telugu360 .
భారత బడా బూర్జువా వర్గం, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలక ప్రభుత్వాలు సామ్రాజ్యవాదంతో రాజీపడి దేశ సహజ వనరులను కట్టబెట్టటమేకాక, దేశ కరెన్సీ అయిన రూపాయి విలువను కూడా అమెరికా సామ్రాజ్యవాదుల దయకు వదిలివేశారు. దాని ఫలితమే రూపాయి విలువ పతనమై నేడు డాలర్కి 94.84 రూపాయలుగా ఉంది. ఇది అమెరికా డాలర్ ఆధిపత్యానికి నిదర్శనం. అధికార మార్పిడి జరిగిన తర్వాత 1947లో ఒక డాలర్తో రూపాయి మారకం విలువ 3.50 ఉంది. 1948 నుండి 1980 వరకు కొంచెం అటుయిటుగా ఉంది. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనతర్వాత రూపాయి విలువ పతనం ఎక్కువగా జరిగింది. అధికార మార్పిడి దగ్గర నుంచి 2022 వరకు రూపాయి విలువ 79 సార్లు పడిపోయింది. ప్రపంచ చమురు వినియోగించే దేశాల్లో 3వ స్థానంలో ఉన్న భారత్కు 85% చమురు దిగుమతిగా ఉంది. చమురే కాకుండా ఫార్మా, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ తదితర రంగాలకు అవసరమైన ముడిసరుకులు, వంటనూనెలు, ఆహారధాన్యాలు, పప్పులు, లోహాలను భారతదేశం దిగుమతి చేసుకుంటున్నది. ఈ దిగుమతులకు చెల్లింపులు డాలర్ల లోనే జరపాలి. రూపాయి విలువ తగ్గిన ప్రతిసారి దిగుమతుల కోసం చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూ ఉంటుంది. రూపాయి విలువ పడిపోవటంవల్ల దిగుమతి అయ్యే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ధరల పెరుగుదల భారం ప్రజలపైనే పడుతుంది. డీజిల్ ధరలు పెరిగితే రవాణా చార్జీలు పెరిగి ఉప్పు, పప్పు, ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. అంతేకాకుండా ప్రయాణ ఖర్చులు, ఆటో చార్జీలు, బట్టలు, పిల్లల స్కూలు ఫీజులు, ఫోన్లు, టివిలు, ల్యాప్ టాపుల, వాహనాల ధరలు పెరుగుతాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతుంది. రూపాయి పతనం ఫలితంగా బడ్జెట్ లెక్కలు, అంచనాలు మారిపోతాయి. విదేశాలకు ఎగుమతి చేసే వారికి మాత్రం ఆదాయం పెరుగుతుంది. ప్రపంచ దేశాలపై ఏ దేశ పెత్తనం ఉంటుందో, ఆ దేశ కరెన్సీ ఆధిపత్యం చలాయిస్తుంది. 1947 దాకా ప్రపంచ ఆధిపత్యం బ్రిటన్ చేతుల్లో ఉంది. దాని ఫౌండ్ కరెన్సీ, ఇతర దేశాల కరెన్సీపై ఆధిపత్యం చలాయించింది. బ్రిటన్ బలహీన పడిన తర్వాత అమెరికా ప్రపంచ పోలీసుగా వ్యహరిస్తూ, తన డాలర్ కరెన్సీ ఆధిపత్యాన్ని ఇతర దేశాలపై నెలకొల్పింది. చమురును డాలర్లలో చెల్లించాలనే ఒప్పందం కుదరటానికి ముందు అమెరికా కరెన్సీ విలువ ఆ దేశం వద్ద నున్న బంగారం నిల్వలతో ముడిపడి ఉంది. 1974లో సౌదీ అరేబియా తదితర దేశాలు చమురు ఉత్పత్తిని పరిమితం చేయటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. దీంతో అమెరికా రంగంలోకి దిగింది. సౌదీ అరేబియా డాలర్ల లోనే చమురు అమ్మకాలు జరపాలని, మిగులు ఆదాయాన్ని అమెరికా ప్రభుత్వ బాండ్లలో మదుపు చేయాలని, దానికి బదులుగా సైనిక, ఆర్థిక సహాయం అందిస్తామని ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియాను తన వ్యూహంలో అమెరికా ఇరికించింది. అప్పటి నుండి చమురు ఉత్పత్తి దేశాల్లో డాలర్లలోనే చమురు విక్రయం కొనసాగింది. ముడి చమురుకు ఉన్న ప్రాధాన్యత రీత్యా ఈ ఒప్పందం తర్వాత డాలరు ప్రాధాన్యత బాగా పెరిగింది. ముడి చమురుకు అన్నిదేశాలు డాలర్లలో చెల్లించాల్సి వచ్చింది. ఫలితంగా ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ప్రాచుర్యం పొందింది. వాణిజ్యంలో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాఫ్రికా దేశాలు బ్రిక్స్ దేశాల కూటమిగా ఏర్పడ్డాయి. ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ ఎమిరేట్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇంకా 30 దేశాలు బ్రిక్స్లో చేరాలనే ఆలోచన చేస్తున్నాయి. ఐఎంఎఫ్కు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ దీని ఏర్పాటు లక్ష్యం. అంతర్జాతీయ వాణిజ్యం ఆయా దేశాల కరెన్సీలలోనే జరగాలనే డిమాండ్ ను బ్రిక్స్ ముందుకు తెచ్చింది. బ్రిక్స్ దేశాల జనాభా 310 కోట్లకు పైగా ఉంది. ఇది ప్రపంచ జనాభాలో 41%, ప్రపంచ వ్యవసాయంలో 45% కలిగి ఉన్నాయి. బ్రిక్స్ దేశాలు, తమ ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకోని, సమానత్వంతో కూడిన, పరస్పర ప్రయోజనాల ఆధారంగా నిర్వహించు కుంటాయి. అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రత్యేక అభివృద్ధి బ్యాంకును నెలకొల్పేందుకు బ్రిక్స్ దేశాలు సన్నద్ధ మవుతున్నాయి. వీటి ప్రయోజనాలు వీటికి ఉన్నా, అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని అడ్డుకోగలిగితే ప్రపంచ వాణిజ్యంలో మార్పులు సంభవిస్తాయి. డాలర్ ఆధిపత్యాన్ని సహించని రష్యా, చైనాలు డాలర్కి ప్రత్యామ్నాయంగా ఆ దేశాల కరెన్సీలోనే చెల్లింపులు జరపాలని నిర్ణయించాయి. బ్రిక్స్ వేదికగా సమర శంఖం పూరించాయి. పెట్రోల్ విక్రయంలో డాలర్కు సౌదీ అరేబియా స్వస్తి చెప్పటం బ్రిక్స్కి బలం చేకూరుతుంది. ఇక నుంచి డాలర్లతో పాటు చైనా యువాన్, ఐరోపా సమాఖ్య (ఇయు) యూరో, జపానీస్ యెన్లలోను చెల్లింపులు స్వీకరిస్తామని చెప్పింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కలసి ఉమ్మడి కరెన్సీ వెలువరించే ప్రయత్నంలో ఉన్నాయి. ఆ కరెన్సీ స్వభావం గురించి ఉమ్మడి అభిప్రాయ రావాల్సి ఉంది. డాలర్ ప్రమేయం లేకుండా అంతర్జాతీయ వాణిజ్యం జరగాలన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, అలా వ్యతిరేకిస్తున్న దేశాలను బెదిరించటానికి ట్రంప్ పూనుకున్నాడు. అమెరికాకు ఆ దేశాలు ఎగుమతి చేసే సరుకులపై 100% సుంకాన్ని విధిస్తామనే బెదిరింపులు చేస్తున్నాడు. ట్రంప్ బెదిరించగానే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ‘ఆర్థిక’ వ్యవస్థగా చెప్పుకుంటున్న భారతదేశం డాలర్ రహిత వాణిజ్యంపట్ల ఆసక్తి లేదని ప్రకటించటం అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ లొంగుబాటును వెల్లడి చేస్తున్నది. భారత రూపాయి విలువ పతనానికి అధికార మార్పిడి జరిగిన దగ్గర నుంచి నేటి వరకు పాలక ప్రభుత్వాలు అనుసరించిన, అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాలతో, డాలర్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించకపోవటం, దేశం స్వయం సమృద్ధిని సాధించే విధానాల అనుసరించకపోవటం, పెద్ద ఎత్తున చేసిన విదేశీ అప్పులకు డాలర్ల రూపంలో చెల్లించటమే కారణం. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించటం ద్వారానే రూపాయి పతనం ఆగుతుంది. - బొల్లిముంత సాంబశివరావు 98859 83526
చిత్తూరు జిల్లా హైవేపై ఘోర ప్రమాదం, ముగ్గురు మృ*తి #Chittoor #RoadAccident #HighwayCrash
పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వరుణ్, నిహారిక మూవీ ప్రారంభం..
మెగా డాటర్ నిహారకి కొణిదెల మరో క్రేజీ ప్రాజెక్టును ప్రకటించారు. కమిటీ కుర్రాళ్లు సినిమాతో నిర్మాతగా మారి తొలి మూవీతో మంచి విజయం సాధించిన నిహారిక.. ప్రస్తుతం తన రెండో చిత్రం రాకాస మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే తన మూడో సినిమాను అనౌన్స్ చేశారు. తన సోదరుడు, హీరో వరుణ్ తేజ్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు నిహారిక. శనివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చేతుల మీదుగా ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ మూవీకి బరి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు కమిటీ కుర్రాళ్లు డైరెక్టర్ యదువంశీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
IraqWarning |వాళ్లని వదలం Andhra PrabhaDetailed Report
IraqWarning | వాళ్లని వదలం AndhraPrabha Detailed Report IraqWarning | హోటళ్లపైనా
Amaravathi : నేడు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం... అమరావతికి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం నేడు జరగనుంది
నేటి బందుకు సంపూర్ణ మద్దతు.. జిల్లా మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేరెళ్ల
Telangana : నేడు నిర్మల్ పట్టణం బంద్
నేడు నిర్మల్ పట్టణంలో బంద్ జరగనుంది
సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం.. కొత్తగూడ, ఆంధ్రప్రభ : పేద మధ్య తరగతి కుటుంబాలకు
నేడు భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేకం
నేడు భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేకం జరగనుంది
లోయలో పడిపోయిన టూరిస్ట్ బస్సు.. ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదవంలో ఐదుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన నయాగఢ్ జిల్లాలోని దసపల్ల తకరఘాటీ దగ్గర చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకుని గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సుల్లో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.
Telangana : మంచిరేవులలో వంద అడుగుల శివుడి విగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేశారు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత
‘సిద్ధార్థ్ రాయ్’ చిత్రంలో హీరోగా అరంగేట్రం చేసి ఆకట్టుకున్న బాలనటుడు, హీరో దీపక్ సరోజ్, ఇప్పుడు హరి హరన్ గోధగాని దర్శకత్వంలో తన రెండవ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హరి తన్నిరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపక్ సరోజ్ సరసన అనైరా గుప్తా, దీప్సిక నటిస్తున్నారు. పవిత్రమైన శ్రీరామ నవమి సందర్భంగా, చిత్ర బృందం టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ’శ్రీమహా విష్ణు’ అనే టైటిల్తో వస్తున్న ఈ రొమాంటిక్ ఫస్ట్ లుక్, హీరో హీరోయిన్ మధ్య ఒక లవ్లీ మూమెంట్ ని చూపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది, పోస్ట్-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు హరి హరన్ గోధగాని మాట్లాడుతూ ఈ సినిమా ప్రేమను వేడుకలా చూపిస్తూ, కుటుంబ విలువల ప్రాముఖ్యతను కూడా సున్నితంగా తెలియజేస్తుందని అన్నారు. ఈ ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను మేకర్స్ మే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Road Accident : రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
ఐపిఎల్ 2026: నేడు బెంగళూరుతో సన్ రైజర్స్ ఢీ..
బెంగళూరు: ఐపిఎల్ సీజన్ 2026కి సర్వం సిద్ధమైంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగ ళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఈ టోర్నమెంట్ కు ప్రారంభం కాబోతోంది. ఇక ఇటు హైదరాబాద్.. అటు బెంగళూరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాయి. రజత్ పటిదార్ సారథ్యంలోని బెంగళూరు భారీ ఆశలతో టోర్నీలోకి అడుగుపెడుతోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెర తెరదించుతూ 2025లో బెంగళూరు తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే.ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిం చాలనే పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లి, జితేశ్ శర్మ, పడిక్కల్, టిమ్ డేవిడ్, ఫిలిప్ సాల్ట్, బెథెల్, భువనేశ్వర్ కుమార్, జోర్డాన్, డఫీ, కృనాల్ పాండ్య, షెఫర్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు బెంగళూరులో ఉన్నారు. ఇక ఈ టోర్నీకి కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా మారాడు. మరోవైపు హైదరాబాద్ లోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు.హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. దీంతో సన్ రైజర్స్ కూడా విజయమే లక్ష్యంగా పోరుకు సిద్ధమైంది.
వరంగల్లో కల్తీ కారం తయారీ బట్టబయలు #Warangal #FoodSafety #Adulteration #ChilliPowder
మార్కెట్ రేటుకు మూడు రేట్లు పరిహారం ఇవ్వాలి..
మార్కెట్ రేటుకు మూడు రేట్లు పరిహారం ఇవ్వాలి.. భూములు కోల్పోతున్న రైతులుఎమ్మెల్సీ నెలికంటి
Summer Effect : పగటి వేళ బయటకు వస్తే మటాష్.. సాయంత్రం వానలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది
రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల క్యాచి ట్యూన్గా కంపోజ్ చేసి న ఈ పాటని వెటరన్ సింగర్ రమణ గోగుల పాడిన తీరు కట్టిపడేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకున్నా యి. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ “అనుమాన పక్షి సినిమా కంటెంట్ చాలా నచ్చింది. రాగ్ మయూర్ చాలా టాలెంటెడ్. ఈ సినిమా కంటెంట్ కొంత చూశాను, చాలా ఫన్ వుంది. ఈ సినిమాని మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు”అని అన్నా రు. డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ “ఇది మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. దీంతోపాటు చిన్న సైకాలజికల్ సస్పెన్స్ ఉం టుంది”అని తెలిపారు. కార్యక్రమంలో రాగ్ మయూర్, రాశి, మెరీన్, రాజీవ్ చిలకా, భరత్, శ్రీచరణ్ పాకాల పాల్గొన్నారు.
కలకత్తా ఉగాది వేడుకకు బుద్ధప్రసాద్..
కలకత్తా ఉగాది వేడుకకు బుద్ధప్రసాద్.. ఉగాది విశిష్ట పురస్కారం అందుకోనున్న ఎమ్మెల్యేకలకత్తా వేదికగా
పహారి గోడ నిర్మాణానికి భూమి పూజ..
పహారి గోడ నిర్మాణానికి భూమి పూజ.. ప్రభుత్వ పాఠశాల పహరి గోడ నిర్మాణానికి
Farmers |విద్యుత్ శాఖ నిర్లక్ష్యం..
Farmers | విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. ప్రాణాలపై వేలాడుతున్న కరెంట్ స్తంభాలు…!విద్యుత్ శాఖ
Gold Prices Today : గుడ్ న్యూస్...బంగారం, వెండి ఇప్పుడు కొంటే లాభమేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర భారీగా తగ్గింది
TG |త్రీఫేస్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో సతమతమవుతున్న రైతులు
TG | త్రీఫేస్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో సతమతమవుతున్న రైతులు కేవలం 2
28thMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
28thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 28thMarchCartoon | ట్రంప్ విరామం
28marcheditorial |ఆంధ్రప్రభలో నేటి సంపాదకీయం
28marcheditorial | ఆంధ్రప్రభలో నేటి సంపాదకీయం 28marcheditorial | ట్రంప్ అత్యుత్సాహం –
Mega Prince Varun Tej will feature for the first time in a film that is produced by his sister Niharika Konidela. Yadhu Vamsi of Committee Kurrollu fame is the director and the film is all set for a grand launch today with a pooja ceremony. The film is set in the backdrop of Volleyball and […] The post Varun Tej’s Bhari appeared first on Telugu360 .
Mega Prince Varun Tej will feature for the first time in a film that is produced by his sister Niharika Konidela. Yadhu Vamsi of Committee Kurrollu fame is the director and the film is all set for a grand launch today with a pooja ceremony. The film is set in the backdrop of Volleyball and […] The post Varun Tej’s Bari appeared first on Telugu360 .
lPl 2026: నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు
నేటి నుంచి ఐపీఎల్ 19 వ సీజన్ ప్రారంభం కానుంది.
28marchchintana |విశ్వనాథ కల్పవృక్షంలో రావణుడు
28marchchintana | విశ్వనాథ కల్పవృక్షంలో రావణుడు 28marchchintana | రావణుడు కాముకుడా? సాధకుడా?సీతాదేవి
Tirumala : తిరుమలకు శనివారం వెళ్లేవారికి తీపికబురు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
'Gen Z' నిరసనల్లో హింస.. నేపాల్ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి అరెస్టు
నేపాల్ మాజీ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి అరెస్టు అయ్యారు. గత ఏడాది జరిగిన 'Gen Z' నిరసనల్లో ఓలి పాత్ర ఉందన్న ఆరోపణలపై నేపాల్ పోలీసులు ఆయనను శనివారం అరెస్టు చేశారు. భక్తపూర్ జిల్లాలోని గుండులో ఉన్న ఓలి నివాసం నుండి నేపాల్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఓలితో పాటు, ఆయన హయాంలో హోం మంత్రిగా పనిచేసిన రమేష్ లేఖక్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గత సెప్టెంబర్లో జరిగిన 'Gen Z' నిరసనలను అణచివేసే క్రమంలో హత్య జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఓలిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఇవాళ ఉదయం వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు, తదుపరి ప్రక్రియ చట్టం ప్రకారం ముందుకు సాగుతుందని కాఠ్మండు లోయ పోలీసుల ప్రతినిధి ఓం అధికారి తెలిపారు. 'Gen Z' నిరసనల సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో విద్యార్థులు మరణించడంపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన ఒక కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. కమిషన్ సమర్పించిన నివేదికలో ఈ ఇద్దరు నాయకులను బాధ్యులుగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి బలేన్ షా అధ్యక్షతన జరిగిన మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలోనే, విచారణ కమిషన్ నివేదికను అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయి. విచారణ కమిషన్ నివేదికలో నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు దళం (Armed Police Force) మరియు సైన్యంలోని కొంతమంది అధికారుల ప్రవర్తనపై కూడా ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ, ప్రస్తుతానికి ఆ భద్రతా దళాలపై ఎటువంటి ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదు.

35 C