SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

IPL 2026 :ఐపీఎల్ లో నేడు మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్

. చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది

తెలుగు పోస్ట్ 30 Mar 2026 9:16 am

Chandrababu :తిరుపతి జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

తిరుపతి జిల్లాలో నేడు చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 9:08 am

1 Indian Dead : కువైట్​లో భారతీయుడు…​ Andhra Prabha Latest News

1 Indian Dead : కువైట్​లో భారతీయుడు…​ Andhra Prabha Latest News

ప్రభ న్యూస్ 30 Mar 2026 9:03 am

ఆసిఫ్ నగర్‌లో అగ్ని ప్రమాదం..

ఆసిఫ్ నగర్‌లో అగ్ని ప్రమాదం.. ఆంధ్రప్రభ వెబ్‌ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని

ప్రభ న్యూస్ 30 Mar 2026 9:00 am

Gold Prices Today : పది రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గుతాయా?

ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

తెలుగు పోస్ట్ 30 Mar 2026 8:58 am

బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం..

బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఐడీఏ

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:47 am

వచ్చే నెల ఏప్రిల్ 3న బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 3వ తేదీన బ్యాంకులకు సెలవులున్నాయి

తెలుగు పోస్ట్ 30 Mar 2026 8:35 am

RBI : ఏప్రిల్ 1 నుండి కొత్త బ్యాంకింగ్ రూల్స్.. వీరికి మాత్రం ఇక పండగే

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్యాంకింగ్ నిబంధనలను అమలులోకి తేనుంది.

తెలుగు పోస్ట్ 30 Mar 2026 8:28 am

కడియం శ్రీహరికి.. కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..

కడియం శ్రీహరికి.. కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ శాసనసభలో

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:26 am

నిర్మల్ జిల్లాలో విషాదం.. నీటి కుంటలో పడి ఇద్దరు మృతి

నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది.

తెలుగు పోస్ట్ 30 Mar 2026 8:18 am

తిరుమలలో వసంతోత్సవాలు..

తిరుమలలో వసంతోత్సవాలు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తిరుమలలో నేటి నుంచి వసంతోత్సవాలు

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:14 am

Pic: Nani’s Candid Moment With Son Junnu

Hero Nani’s son Junnu celebrates his birthday yesterday .The young boy turns 9.On the special occasion, Nani wished his son, and shared a candid moment. Junnu, with the most infectious, ear-to-ear smile sits on a wooden indoor swing, while his dad Nani rests his head lovingly on the boy’s lap, eyes closed in a peaceful, […] The post Pic: Nani’s Candid Moment With Son Junnu appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 8:04 am

స్నేహితురాలిని ఇంటికి పిలిచి... ముక్కలు ముక్కలుగా నరికిన నేవీ అధికారి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలిని ఇంటికి పిలిచి అనంతరం ఆమెను ముక్కలు ముక్కలు నరికి ప్రీజులో శరీర భాగాలను దాచిపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయనగరం జిల్లా రాజాముకు చెందిన చింతాడ రవీంద్ర(35) నేవీలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వైజాగ్‌లోని ఎల్ వి నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో తన భార్యతో కలిసి ఉంటున్నాడు. రవీంద్ర భార్య తన పుట్టింటికి పోవడంతో తన స్నేహితులు మౌనికను(29) ఇంటికి రమ్మని కబురు పంపాడు. మౌనికను చంపేసి అనంతరం ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. వెంటనే పోలీసులు సదరు అపార్ట్‌మెంట్ చేరుకొని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. తల భాగం కనిపించలేదని సమాచారం. డబ్బుల కోసం యువతి వేధించడంతో తాను హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 30 Mar 2026 8:03 am

IPL 2026 : ముంబయిదే విజయం.. సులువుగా అతి పెద్ద టార్గెట్ ఛేదన

ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఓడించింది.

తెలుగు పోస్ట్ 30 Mar 2026 7:53 am

America - Iran war : అమెరికా - ఇరాన్ మధ్య చర్యలు పాకిస్తాన్ లో?

అమెరికా–ఇరాన్ మధ్య చర్చలకు త్వరలో తాము వేదిక కానున్నామని పాకిస్థాన్ ఆదివారం ప్రకటించింది

తెలుగు పోస్ట్ 30 Mar 2026 7:34 am

Haiti : వీధుల్లో మృతదేహాలు.. ఇళ్లకు నిప్పంటించిన గ్యాంగ్

కరీబియన్ దేశం హైతీ పట్టణంలో రక్తపాతం సృష్టించారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 7:22 am

North Korea : కిమ్ ఆయుధ పరీక్షలు... అప్రమత్తంగా ఉండాల్సిందేనా?

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికా లక్ష్యంతో ఆయుధ పరీక్షలను నిర్వహిస్తున్నారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 7:09 am

రాఘవపై రచ్చరచ్చ.. బిఆర్‌ఎస్ సభ్యులపై వేటు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ నుంచి బిఆర్‌ఎస్ శాసన సభ్యులను స్పీకర్ ప్రసాద్‌కుమార్ రెండు రోజుల పాటు లేదా బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. బడ్జెట్ పై చర్చకు పదే పదే అడ్డుపడుతున్నారన్న కారణం తో సస్పెండ్ చేశారు. సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశెడ్డి, కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యా దవ్, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్‌రావు, ప ద్మారావు, పల్లా  రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజ య్, కాలేరు వెంకటేశ్, విజయుడు, కె.పి.వివేకానంద్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్‌జాదవ్, కోవ లక్ష్మి ఉన్నారు. శాసనసభలో రెండో రోజు ఆదివారం కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ సభ ప్రారంభం నుంచి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేల వైఖరితో తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ సభ్యులు తీరు మార్చుకొని బిల్లులపై చర్చకు సహకరించాలని లేదంటే సస్పెన్షన్ ఎదుర్కొవాలని సూచించారు. అయినప్పటికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టేందుకు వెళ్లేందుఎకు ప్రయత్నించి గందరగోళం సృష్టించారు. అప్రమత్తమైన మార్షల్స్ బీఆర్‌ఎస్ సభ్యులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. దాదాపు అర్ధగంట ఇదే పరిస్థితి కొనసాగగా బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్‌ఎస్ సభ్యులను రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. అనంతరం స్పీకర్ బడ్జెట్ పై చర్చకు అడ్డు పడుతున్నందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆధారాలు ఉంటే సిబిసిఐడికి ఇవ్వండి బిఆర్‌ఎస్ శాసనసభ్యులను సస్పెండ్ చేయకముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష బిఆర్‌ఎస్ సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్రమ మైనింగ్ విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి కుటుంబమైనా ఇందులో ఎవరున్నా ఆధారాలు ఉంటే సిబిసిఐడి ముందుకు వచ్చి ఇవ్వండి విచారించి చర్యలు తీసుకుంటారని అన్నారు. ఆధారాలుంటే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని బిఆర్‌ఎస్ సభ్యులు పదే పదే డిమాండ్ చేయడంపై ముఖ్యమంత్రి మండిపడుతూ మీరు చెప్పింది వినకపోతే పొంగులేటి రాజీనామా చేయాలా? అంటూ ప్రశ్నించారు. మీ తాతలు దిగొచ్చినా అది జరగదని గట్టిగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే పదేళ్ల నుంచి ఇప్పటి వరకు జరిగిన ఖనిజ సంపద దోపిడీ, అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా సీబీసీఐడీ అధికారులకు అందించాలని హరీష్ రావు, కేటీఆర్, ఇతర సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుందని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారని సిఎం చెబుతూ హౌస్ కమిటీ వల్ల జరిగేది ఏముంటుందని అన్నారు. కమిటీ నివేదిక ఇస్తుందని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని మళ్లీ పోలీస్ శాఖనే ఆదేశించాల్సి ఉంటుందని అన్నారు. అదే పని ఇప్పుడు సిబిసిఐడికి ఇచ్చామని, అక్కడ మీ దగ్గర ఆధారాలు ఇవ్వాలని చెబుతున్పప్పుడు ఇక హౌస్ కమిటీ ఎందుకని సిఎం ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి రాజీనామా ప్రసక్తే లేదు హౌస్ కమిటీ వేస్తే మంత్రిని బెదిరించి లొంగదీసుకుని తమ అక్రమాలను బయటపడకుండా చూడాలని ప్రయత్నించడం తప్ప మరేమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మూడు హౌస్ కమిటీలు వేసి బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారని, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి రాజకీయ లబ్ది పొందారని సిఎం గుర్తు చేశారు. అలా తాము హౌస్ కమిటీ వేసి రాజకీయ లబ్ది పొందాలని చూడడం లేదని అన్నారు. ఒకవేళ సీబీసీఐడీపై నమ్మకం లేకపోతే సీబీఐకి విచారణ అప్పగించాలా చెప్పాలని సిఎం తెలిపారు. బ్లాక్ మెయిల్ చేయడానికే హౌస్ కమిటీ కోరుతున్నారని, ఇక్కడ మీ పప్పులు ఉడకవని ఘాటుగా వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మీరు చెప్పింది వినకపోతే రాజీనామా చేయాలా? మీ తాతలు దిగొచ్చినా అది జరగదని సిఎం తేల్చి చెప్పారు.

మన తెలంగాణ 30 Mar 2026 6:00 am

30thMarch2026 |సోమవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

30thMarch2026 | సోమవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 30thMarch2026 |

ప్రభ న్యూస్ 30 Mar 2026 6:00 am

ధరణి కుంభకోణాలపై హౌస్ కమిటీ వేస్తాం

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్ర భుత్వం ధరణిని అడ్డం పెట్టుకుని తెరలేపిన భూ కుంభ కోణాలపై హౌస్ కమిటీ వేస్తామని, వాటికి ఒప్పుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి అన్నా రు. ఆదివారం శాసన సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా బా లానగర్ లో ప్రయివేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్ రావు తమ్ముడు మహేశ్ రావు ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారని ఆరోపించారు. హరీ శ్‌రావు ఒప్పుకుంటే దీనిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని సిఎం స్పష్టం చేశారు. భూ కుంభ కోణంలో సొంత బంధువు ను తప్పించాలని సంబంధిత మంత్రిని హరీశ్ రావు కోరారని, వాటికి మంత్రి ఒప్పుకోకపోవడంతో ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలపై కూడా సిబిసిఐడి విచారణ చేయిస్తామని చెప్పడంతో సభ అయిపోయిన తరువాత హరీ శ్‌రావును ఆ కుంభకోణంలో ఉన్న బంధువులు తిట్టారని, హరీష్ రావు పరిస్థితి కుడితిలోపడ్డ ఎ లుకలా తయారయ్యిందని సిఎం ఎద్దేవా చేశా రు. మంత్రి శ్రీనివాస్ రెడ్డిపై బురద చల్లడానికే బిఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని, భూ కుం భకోణంపై నిర్ధష్టమయిన ఆరోపణలు చేస్తున్నా ని, దీనిపై హౌస్  కమిటీకి సిద్ధమా అని హరీశ్‌రావుకు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అంతకుముందు కామారెడ్డి ఎంఎల్‌ఏ కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ప్రభుత్వానికి సూచనలు చేయడం పట్ల సిఎం ఆక్షేపించారు. బిజెపి నేతలకు సూచలు ఇవ్వడం, పారిపోవడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో కెసిఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని సాక్షాత్తు దేశ ప్రధాని, హోం శాఖ మంత్రి అమిత్ షా అన్న విషయాన్ని సిఎం గుర్తు చేశారు. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో కెసిఆర్, హరీష్ రావును జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి మాటలు నమ్మి కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించామని, ఎనిమిది నెలలు గడిచినా ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పంచుకున్నారని సిఎం ఆరోపించారు. కాళేశ్వరం కేసులో కెసిఆర్, హరీష్‌రావు ను జైల్లో పెట్టిన తరువాత బిజెపి నేతలు సూచనలు చేస్తే బాగుంటుందని సిఎం స్పష్టం చేశారు. హరీష్ రావు నిజాయితీపరుడని కెటిఆర్, వెంకటరమణా రెడ్డి నమ్మితే హౌస్ కమిటీ వేయడానికి ఒప్పుకోవాలన్నారు. సభా సాంప్రదాయాలు పట్టించుకోని బిఆర్‌ఎస్ : డిప్యూటీ సిఎం భట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రజల అవసరాలు తీర్చేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సభలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు రాద్ధాంతం చేయడం సరైనది కాదని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు. సభా సాంప్రదాయాలను గాలికి వదిలేసి బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న చేష్టలు రాష్ట్రం మొత్తం గమనిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఏలుగా 2014 నుంచి 2023 వరకు ఈ సభలో ఉన్నామని, బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడూ బడ్జెట్ కాపీలను చింపి చెవిలో పెట్టుకుని వెళ్లడం కానీ, డిమాండ్లపై చర్చ జరిగినప్పుడు అల్లరి చేయడం కానీ జరగలేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం మానవీయ కోణంలో బిల్లు ప్రవేశపెట్టి చర్చకు పెడితే, ఆ చర్చ జరగనీయకుండా, సభా సంప్రదాయాలు, పార్లమెంటరీ భాష, సభ నిబంధనలు తెలిసిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు చప్పట్లు కొట్టడం, నినాదాలు చేయడం సరైనది కాదన్నారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా సభలో మంత్రి పేరును వెల్లడించకూడదని తెలిపారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు మంత్రిపై లేవనెత్తిన అంశాలపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2014 నుంచి 2026 మార్చి 28 వరకు మైనింగ్ రంగంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సిబి సిఐడితో విచారణ జరిపిస్తానని ప్రకటించినట్లు డిప్యూటి సిఎం గుర్తు చేశారు. ఈ నిర్ణయాన్ని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు స్వాగతించకుండా, కావాలనే సభను నడవనీయకుండా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ హయాంలో మూడు హౌస్ కమిటీలు ఏర్పాటు చేశారని, వాటి ద్వారా ఏమి సాధించారు? ఆ హౌస్ కమిటీలలో సభ్యుడిగా ఉండి సమావేశాలు నిర్వహించాలని కోరినప్పటికీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని డిప్యూటి సిఎం వివరించారు. హౌస్ కమిటీలను అడ్డంగా పెట్టుకుని ఆరోపణలు ఎదుర్కొన్న ఎంఎల్‌ఏలను బ్లాక్‌మెయిల్ చేసి బిఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవడం తప్ప ఒక్క కమిటీ నివేదికను కూడా బయట పెట్టలేదని ఆయన తెలిపారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగకుండా కుట్రపూరిత కార్యక్రమాలకు తెరలేపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం బిఆర్‌ఎస్‌కు తగదని హితవు పలికారు. బిజెపి శాసనసభ్యులు ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇస్తామని అంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ వారు ఏమి చేస్తున్నారని , బిజపి, బిఆర్‌ఎస్ ఎప్పుడో కలిసిపోయాయని ఆరోపించారు. సభ సజావుగా నడవకూడదు, ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వెల్ఫేర్ పథకాలపై చర్చ జరగకూడదు, విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన బ్రేక్‌ఫాస్ట్ పథకంపై చర్చ జరగకూడదు, బిఆర్‌ఎస్‌కు తప్ప ఎవరికి మేలు జరగకూడదనే ఆలోచనతోనే బిఆర్‌ఎస్ సభ్యులు సభకు వచ్చినట్టుగా కనిపిస్తోందని భట్టి ధ్వజమెత్తారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూములను గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి పార్ట్- బిలో పెట్టి తమకు అనుకూలమైన వ్యక్తుల పేరిట పట్టాలు ఇచ్చిందనే విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. ధరణి ద్వారా జరిగిన భూ అక్రమాలు, బాలానగర్‌లో అక్రమ పద్ధతిలో జరిగిన భూ బదిలీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హౌస్ కమిటీ వేయాలని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు . బిఆర్‌ఎస్ శాసనసభ్యులకు హౌస్ కమిటీపై పూర్తి విశ్వాసం ఉంటే సిఎం ప్రకటించిన హౌస్ కమిటీ కి అంగీకరించాలని సవాల్ చేశారు. నా కుటుంబ సభ్యుల భూములు కెటిఆర్ లాక్కున్నారు: దానం కెటిఆర్ నా కుటుంభ సభ్యుల భూములు లాక్కున్నారని ఎంఎల్‌ఏ దానం నాగేందర్ ఆరోపించారు. శాసన సభలో మాట్లాడిన దానం నాగేందర్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ కెటిఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. బిఆర్‌ఎస్ హాయంలో వేల ఎకరాల భూ కుంభకోణం జరిగిందని దానం ఆరోపించారు. మా సొంత భూమిని సైతం కెటిఆర్ వదల్లేదని ఆయన చేసిన పనికి మా బాధ ఎవరికి చెప్పుకోలేక ఆ రోజు నోరు మూసుకు కూర్చున్నామని తీవ్ర ఆరోపణలు చేశారు. నా తండ్రి కష్టార్జితమయిన మా సొంత భూమిని కెటిఆర్ ఓ ప్రయివేట్ కంపెనికీ అప్పగించారని, హైదరాబాద్‌లో పుట్టి పెరిగి మౌనంగా ఉండిపోవాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయని కావాలంటే రికార్డులు చూపిస్తానన్నారు. ఎంత నష్టపోయామో మా కుటుంబానికి తెలుసని, బాధలు ఎవరికి చెప్పుకోలేకపోయామని వాపోయారు. దొంగతనం చేసిన వారు దొంగ అంటూ అరుస్తున్నారని, తప్పు చేయకపోతే నిజాయతీయిగా హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు, దోపిడి జరిగింది: కడియం కడియంపై కౌశిక్ రెడ్డి అసభ్యకర సంజ్ఞలు మండిపడ్డ సభ్యులు గత ప్రభుత్వంలో ధరణిని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు, దోపిడిలు జరిగాయని, వాటిపై విచారణ చేయించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. దొంగతనం చేసిన వ్యక్తులు సిగ్గులేకుండా అరుస్తున్నారని, నిజాయితీ ఉంటే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇవి సభా సాంప్రదానికి విరుద్దమని అన్నారు. ఈ దశలో కడియం శ్రీహరిని ఉద్దేశించి ఎంఎల్‌ఏ పాడి కౌషిక్ రెడ్డి చేసిన సంజ్ఞలు తీవ్ర దుమారం రేపాయి. కడియం మాట్లాడుతున్న సమయంలో బిఆర్‌ఎస్ నేతలు చోర్ చోర్ అంటూ నినదించారు. కౌశిక్ రెడ్డితో పాటు పలువురు సభ్యులు ఏ పార్టీ ఎంఎల్‌వి, ఏ పార్టీ నుంచి గెలిచావో చెప్పాలంటే నినాదాలు చేశారు. ఈ దశలో కౌశిక్ రెడ్డి ఆవేశంతో బెదిరించారని, గన్ తో కాల్చిపడేస్తాననే, ఇతర చెప్పడానికి వీలు లేని సైగలు చేశారని కాంగ్రెస్ సభ్యులు కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. వీడియోలు పరిశీలించి ఆయన సభత్వాన్ని శాశ్వతంగా తొలగించాలని స్పీకర్‌ను కోరారు.

మన తెలంగాణ 30 Mar 2026 5:30 am

ప్రతిపక్షం లేకుండానే నేడు బడ్జెట్‌కు ఆమోదం

మన తెలంగాణ/హైదరాబాద్: ఈసారి అసెంబ్లీ బడ్జెట్ స మావేశాలను అక్రమ మైనింగ్ అంశం సభను కుదుపేసింది. రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థ అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీకి డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ సభా కార్యకలాపాలను అడ్డుకుంది. రెండు రోజులుగా ఇదే అంశం తో సభ ను బీఆర్‌ఎస్ సభ్యులు స్తంబింబిం చేయడంతో వారిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు (సోమవారం వరకు) సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఆమోదించారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు లేకుండానే సోమవారం ప్రవేశపెట్టనున్న ద్రవ్యవిబిల్లు ఆమోదం పొందనున్నది.ఇలా ఉండగా ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేసిన హౌస్ కమిటీకి ససేమిరా అంగీకరించని ప్రభుత్వం, ధరణి చట్టం పేరిట గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై హౌస్ కమిటీకి అంగీకరిస్తారా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి సవాల్ విసిరి రెండు రోజులుగా సభలో జరిగిన చర్చను మరో మలుపు తిప్పారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరిని ఉద్దేశించి బీఆర్‌ఎస్ సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి సంజ్ఞలతో చేసిన అనుచిత ప్రవర్తన చివరకు ఎథిక్స్‌కు కమిటికి సిఫారసుకు దారితీసింది. ఈ కమిటీ పాడి కౌశిక్‌రెడ్డి శాసనసభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దుకు సిఫారసు చేస్తుందా? లేక మరేదైన చర్యకు సిఫారసు చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ఎథిక్స్ కమిటీ చేయబోయే సిఫారసు భవిష్యత్‌లో మరే సభ్యుడు కూడా పాడి కౌశిక్‌రెడ్డి మాదిరిగా ప్రవర్తించకుండా కఠినంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. దీంతో గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసన సభ్యత్వాన్ని రద్దు చేసిన మాదిరిగానే చర్యలు ఉండే అవకాశం ఉంది. కాగా అక్రమ మైనింగ్ వ్యవహారం సభలో చివరకు దళిత సామాజిక వర్గం సభ్యుడికి జరిగిన అవమానంగా కొత్త రంగు పులుముకుంది.

మన తెలంగాణ 30 Mar 2026 5:00 am

తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు అసెంబ్లీ ఓకే..

మన తెలంగాణ/హైదరాబాద్ : తల్లిదండ్రులను చూసుకోలేని వా రిని సమాజం బహిష్కరిం చాలని, ఇది ఒక సామా జిక బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నా రు. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి వేతనం నుంచి.. రూ.10 వేల వరకు నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ య్యేలా సభలో బిల్లు పెట్టి చట్టం తీసుకవస్తున్నామని సీఎం వివరించారు. తల్లి దండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు ఆమోదం తెలుపాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్ని పక్షాలకు పిలుపుఇచ్చారు. అసెంబ్లీలో ఆదివారం ఈ బిల్లుపై చర్చ అనంతరం సభ ఆ మోదించింది. ఇది కేవలం ప్రభు త్వ ఉద్యోగులకే కాకుండా ప్రజాప్రతినిధులను కూడా దీని పరిధిలోకి తీసుకవస్తున్నామని సీఎం తెలిపారు. పిల్లల హక్కుల కోసం, మహి ళల భద్రత కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణలో ఇంకా నిర్లక్ష్యం కొనసాగుతోం దని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదని అన్నారు. తల్లిదం డ్రులను చూసుకోని పిల్లల్లో భయం కలిగించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నామని అన్నారు. తల్లిదండ్రుల బాగోగులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరిం చాలని, ఇది కేవలం చట్టం మాత్రమే కాదు, ఒక సామా జిక బాధ్యత అని సీఎం పిలుపు నిచ్చారు. అడ్డాల నాడే బిడ్డలు తప్ప గడ్డాల నాడు కాదు. అనే సామెత నిజం కాకూడదని, బతికున్నప్పుడు గుప్పె డు మెతుకులు పెట్టని బిడ్డలు చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం కన్నా ఘోరం మరొకటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పురాణాలలో మాతృ పితృ భక్తికి శ్రవణ కుమారుడి కథ అద్దం పడుతోందని, అయితే ప్రఖ్యాత ‘రేమండ్స్’ బ్రాండ్ మాజీ అధినేత విజయ్ పథ్ సింఘానియా (87) మరణంపై స్పందిస్తూ ఒక పారిశ్రామికవేత్తగా వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన, చివరి రోజుల్లో అనామికుడిగా తనువు చాలిం చడం అత్యంత విషాదకరమన్నారు. తన ఆస్తి మొత్తాన్ని గిఫ్ట్ డీడ్ ద్వారా కుమారుడు గౌతమ్ సింఘానియాకు అప్పగించిన తర్వాత, కన్న తండ్రి ని ఇంటి నుండి బయటకు పంపేయడం, కారు, డ్రైవర్ సౌకర్యాలను కూడా తొలగిం చడం ఆధునిక సమాజపు క్రూరత్వానికి అద్దం పడు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశానని ఆయన తన ఆత్మకథలో రాసుకోవడం ప్రతి తల్లిదండ్రులకూ ఒక హెచ్చరిక అని వెల్లడిం చారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, ఈరోజుల్లో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. కుటుంబ నియంత్రణతో ఒక్కరో ఇద్దరికో పరిమితం అయ్యామని అన్నారు. ఆడ బిడ్డలకు తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నా మెట్టినింటి బాధ్యతలతో ఏమీ చేయలేకపోతున్నారని వివరి ంచారు. తనకు తెలిసిన ఒక ప్రజాప్రతినిధి తండ్రికి క్యాన్సర్ వస్తే ఆయనను చూసుకోకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఇటీవలే ఆ తండ్రి మరణిం చారని విచారించారు. తల్లిదండ్రులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఏ తల్లిదండ్రులు అనాథలుగా ఉండకూ డదన్నదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. తాము తెచ్చిన చట్టం ప్రభుత్వ ఉద్యోగు లకే కాదని, ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్తిని సామాజికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తల్లిదం డ్రులను చూసు కోలేనోడు - సమాజంలో బతకడానికి వీల్లేదని అన్నారు. సామాజిక బాధ్యతగా ఈ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ చట్టంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కాదు, ఈచట్టంతో వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే తమ ప్రయత్నం అని చెప్పారు.

మన తెలంగాణ 30 Mar 2026 4:30 am

హౌస్ కమిటీ కాదు..సిబిసిఐడి కాదు.. సిట్టింగ్ జడ్జితో విచారణకు సై

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి కి బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు సవాల్ విసిరారు. అవినీతి ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. త న బావమరిది, తమ్ముడిపై సిఎం ఆరోపణలు చేశారని, అయితే, సిఎం తమ్ముడు, బావమరిదిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. తన బావమరిది, తమ్ముడిపై వచ్చిన ఆరోపణలపై వి చారణకు సిద్ధం అని ప్రకటించారు. సిఎం తమ్ము ళ్లు, బావమరిదిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. హౌస్ కమిటీ కాదు, సిబిసిఐడి కాదు, నేరుగా హైకోర్టు సి ట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధం అని, సిఎం సిద్ధమా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. 20 అంశాలపై విచారణ చేయించాలని తాము స్పీకర్‌కు లేఖ ఇచ్చామని, వీటిపైన సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నేతలతో కలి సి హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటిని కాపాడేందుకు వంద అబద్ధాలు ఆడి సిఎం రేవంత్ రెడ్డి దొరికిపోయారని పేర్కొన్నారు. ఏ పని కోసం తానెప్పుడూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేయలేదని స్ప ష్టం చేశారు. పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని అందరికీ అర్థమైందని చెప్పారు. తప్పు జరిగిందని సిఎం, మైనింగ్ శాఖ మంత్రి అసెంబ్లీలోనే ఒప్పుకున్నారని తెలిపారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది కాబట్టి ముఖ్యమంత్రి ఎదురు దాడి చేస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. సమాధా నం లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. పొంగులేటి మంత్రిగా ఉంటే విచారణ సజావుగా సాగదు అని, అందుకే మంత్రికి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రికి రూ.28 లక్షల జరిమానా వేశారని, ఆ జరిమానా కట్టలేదని, అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. సభలో ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి పది తప్పులు చేశారని విమర్శించారు. మీటర్లు లేకపోవడంతో డీజిల్ జనరేటర్లతో నడుపుకోమని అనుమతి ఇచ్చామని అన్నారని పేర్కొన్నారు. ప్రశ్నిస్తున్నందుకే మాపై కక్షగట్టారు హుజూరాబాద్ ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డిపై పగబట్టి సిఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్‌రెడ్డిపై కక్ష గట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నోటితో చెప్పలేని భాష మాట్లాడిన రేవంత్ రెడ్డిని ఎథిక్స్ కమిటీకి ముందు నిలబెట్టాలని ఘాటు విమర్శించారు. ప్రశ్నించే గొంతుకైన కౌశిక్ రెడ్డిని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. మొదటి నుంచే కౌశిక్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిగ్గు తేల్చుతూ ప్రశ్నిస్తున్నారని, గట్టిగా మాట్లాడుతున్నందుకే ఆయనపై కక్షతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పెట్టి ఇంటిపై దాడులు చేయించారని, సిబిసిఐడి విచారణలు పెట్టారు, అనేక అక్రమ కేసులు నమోదు చేశారని అన్నారు. కానీ, కోర్టులే ఆ కేసుల్లో నిజం లేదని గుర్తించి పలుమార్లు బెయిల్ ఇచ్చాయని గుర్తు చేశారు. ఇది కౌశిక్ రెడ్డి మీద దాడి కాదు..ప్రశ్నించే గొంతుల మీద దాడి..ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు.

మన తెలంగాణ 30 Mar 2026 3:40 am

మంత్రుల నియోజకవర్గాలకేనా నిధులు?

మన తెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వ డం లేదని, మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదని, ఎమ్మెల్యేలు కూడా భాగమని ఆయన తెలిపారు. తాము నిధుల కోసం మంత్రుల చుట్టూ తిరగాలా? అని ఆయన ఆందోళన వ్య క్తం చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ము గ్గురు మంత్రులు ఉన్నారని, ప్రభుత్వం ఏం చేసినా, నిధులైనా ఖమ్మం జిల్లాకే వెళుతున్నాయని బయట టాక్ నడుస్తోందని అన్నారు. మంత్రులు, సిఎం నియోజకవర్గాల్లోనే పనులు జరుగుతున్నాయని కాంట్రాక్టర్‌లకు డబ్బులు అందుతున్నాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. రిజర్వాయర్ల కోసం ఎంతోమంది రైతులు భూములిచ్చారని రిజర్వాయర్లు కడితే సరిపోదని కాల్వలు తవ్వించాలని ఆయన డి మాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కొడంగల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు తాము కూడా మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి న్యాయం జరగనప్పుడు పదవిలోఉండి కూడా వేస్ట్ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మునుగోడులో ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లిఫ్ట్‌లన్నీ హుజూర్‌నగర్‌కే.. మరోవైపు లిఫ్ట్‌లన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌కు తరలిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. నిర్ణయాలు, క్రమశిక్షణలో కరెక్ట్‌గా ఉందని ఆయన అన్నారు. అలాగే, నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంతో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. లక్షల కోట్లు ఖర్చు చేస్తే మనకు చుక్క నీరు రాలేదన్నారు. గత ప్రభుత్వం పదేండ్లు ప్రజాధనం వృధా చేసిందన్నారు. కెసిఆర్ ఓ నియంతలా పాలించారని, నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ పేరుతో వివక్ష చూపారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ఎన్నో ప్రాజెక్టులను రూపకల్పన చేసిందని ఆయన అన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేవలం కాంట్రాక్టర్ల కోసం ఇంజనీర్లు చెప్పిన వినకుండా కెసిఆర్ ఇంజనీర్‌గా మారి మేడిగడ్డకు బ్యారేజీను మార్చారన్నారు. ఇది కూలిపోయే స్థితికి వచ్చిందన్నారు. కాలువలు పూర్తి చేసి పొలాలకు నీరు అందించాలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రూ.714 కోట్లతో లక్ష ఎకరాల నీటిని అందించే విధంగా బ్రాహ్మణ వెల్లెంలా ప్రాజెక్టును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. 2004 నుంచి 2014ల మధ్య 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయన్నారు. 2014 నుంచి బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఒక పని కూడా చేయలేద న్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగతా పనులు పూర్తి చేసి బ్రాహ్మణ వెల్లెంలా రిజర్వాయర్‌లోకి నీటిని నింపామని ఆయన తెలిపారు. అయితే, కాలువలు పూర్తికాకపోవడంతో పొలాలకు నీరు రావడం లేదని, తొందరగా కాలువలు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లోని ఎక్కువ మంది విద్యార్థులు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విద్య, వైద్యాన్ని గాలికి వదిలేసిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరిపడా మౌలిక సదుపాయాలు లేవని, ఒక విద్యార్థి ఉన్నచోట ఎక్కువ మంది టీచర్లు ఉన్నారని, 100 విద్యార్థులు ఉన్నచోట ఒక టీచరే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోని ఎక్కువ మంది విద్యా ర్థులు చదువుతున్నారని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40 శాతం మెస్ చార్జీలు పెంచినప్పటికీ ఆహారంలో నాణ్యత లేదని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మన తెలంగాణ 30 Mar 2026 3:20 am

ఇక భూతల పోరు?

దుబాయ్/వాషింగ్టన్: ఇరాన్‌పై భీకర భూతల దాడులకు అమెరికా రం గం సిద్ధం చేసుకొంటోంది. ఇందులో భాగంగా ఆదివారం అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక యుఎస్‌ఎస్ ట్రిపోలీ పశ్చిమాసియాకు చేరింది. అయితే ఇది ఏ ప్రాంతంలో ఉందనేది వెల్లడికాలేదు. ఈ యుద్ధ నౌకలో 2,500 మంది వరకూ మెరైన్ సైనికులు ఉన్నారు. ఇ ప్పటికే ఇక్కడున్న సైన్యంతో కలిపితే ఇప్పుడు ఇక్కడ అమెరికా నావికాదళం బలం 3,500కు చేరుకుంది. ఇక్కడికి అమెరికా మెరైన్స్ చేరుకున్న విషయాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ సోషల్ మీడియా ద్వారా ప్ర కటించింది. ఇక్కడికి చేరిన ట్రిపోలీ అధునాతన ఉభయచర దాడుల సా మర్థపు యుద్ధనౌకగా పేరొందింది. అంతకు ముందు చైనాకు సవాలు విసురుతూ కొంతకాలం జపాన్ తీరంలో మొహరించుకుని ఉంది. అతి కొద్దిరోజుల్లోనే పశ్చిమాసియాకు అత్యంత సుశిక్షితులైన పదివేల మంది వివిధ స్థాయిల సైనికులను పంపిస్తుందని ట్రంప్ ఇటీవల తెలిపారు. చర్చల్లో పురోగతి ఉందని చెపుతూనే ఇరాన్‌పై ఇకపై దాడి తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తూ వస్తున్నారు. గత 20 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా అమెరికా సేనలు ఇప్పుడు అత్యధిక సంఖ్యలో పశ్చిమాసియాకు చేరాయి. ఇంతవరకూ వైమానిక,క్షిపణుల దాడులలో ఇరాన్ సైన్యం ఎప్పటికప్పుడు శక్తివంతంగా ఉండటం, మరో వైపు అమెరికా సైనిక స్థావరాల ఉన్నాయనే కారణంతో అత్యంత కీలకమైన గల్ఫ్ దేశాలను దెబ్బతీస్తూ ఉండటంతో వెంటనే తీవ్ర కార్యాచరణలో భాగంగా ట్రంప్ ఆదేశాలతోనే భూతలపోరుకు అమెరికా సేనలు సిద్ధం అయినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఇప్పుడున్న బలగాలతోనే ఇరాన్ లోని అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాల్లోకి ఇరాన్ సైనికులు చేరుకుని దాడులకు ,స్వాధీనప్రక్రియకు దిగుతారని వెల్లడైంది. అయితే తక్షణ రీతిలో భూతల దాడులకు అమెరికా దిగుతుందా? లేక మరింత అదును కోసం వేచి చూస్తుందా? అనే విషయంపై స్పష్టత రాలేదు. అమెరికా సేనలొస్తే తగులబెట్టేస్తాం శవపేటికలే భూతల దాడుల హెచ్చరికలపై ఇరాన్ స్పీకర్ స్పందన అమెరికా భూతల దాడులకు సిద్ధం అవుతుందనే వార్తలపై ఇరాన్ స్పీకర్ మెహమ్మద్ బఘెర్ ఖాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరిక సేనలు ఇరాన్ నేలపైకి వచ్చే ఘడియల కోసం చూస్తున్నాం. వారు చేరుకోగానే మా మంటల్లో వారు మాడిపోవల్సిందే. వారినే కాకుండా వారి ప్రాంతీయ స్థాయి వాటాదార్లను కూడా తగు విధంగా శిక్షిస్తామని ఆయన ఘాటైన పదజాలంతో మండిపడ్డారు. అమెరికాకు ధైర్యముంటే ఇరాన్‌పై పదాతిదళ దాడులకు దిగమనండి చూద్దాం అని సవాలు విసిరారు. వారు ఇక్కడికి వస్తే తమ ప్రతీకారం ఎంతతీవ్రంగా ఉంటుందనేది వారికే కాకుండా వారి మిత్ర దేశాల వారికి కూడా తెలిసివస్తుందన్నారు. ఇక అమెరికా నుంచి వెలువడుతున్న చర్చల ప్రతిపాదన గురించి మాట్లాడుతూ వారి షరతులకు తలొగ్గేది లేదన్నారు. అమెరికా నుంచి 15 అంశాల ఫార్మూలా అందింది. దీనిని పాకిస్థాన్ ద్వారా పంపించారు. బలప్రయోగం ద్వారా ఏదో చేయాలనుకున్న ట్రంప్ విఫలం చెంది, ఇప్పుడు ఇటువంటి ప్రతిపాదనలతో లాభం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. అమెరికా ఎప్పటివరకైతే ఇరాన్ సరెండర్‌ను కోరుతూ ఉంటుందో అప్పటివరకూ తమ చేతిలో చావు దెబ్బలు తప్పవని కూడా ఇరాన్ స్పీకర్ వ్యాఖ్యానించారు. ఇక టెహరాన్ టైమ్స్‌లో తొలిపేజీలో అమెరికా సైనికులను ఉద్ధేశించి వెల్‌కమ్ టు హెల్ అని పెద్ద ప్రకటన వెలువరించారు. ఇక్కడ భూతల దాడులకు వచ్చే అమెరికా సైనికుడు ప్రతి ఒక్కరూ శవపేటికలలో తిరిగి వెళ్లేలా చేస్తామని వ్యాఖ్యానిస్తూ వార్తలు వెలువరించారు. సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణిదాడులు అమెరికా నిఘా విమానం అవాక్స్ ధ్వంసం దుబాయ్ ః సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఆదివారం ఇరాన్ సౌదీలోని అత్యంత కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై దాడికి దిగింది. అమెరికా నిర్వహణలో ఉండే ఈ ఎయిర్‌బేస్‌ను ఎంచుకుని జరిపిన దాడిలో అమెరికా శక్తివంతమైన నిఘా విమానం అవాక్స్ దెబ్బతింది. అక్కడి ఆయుధ వ్యవస్థ విధ్వంసం జరిగిందని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెరికాకు చెందిన అనేక రిఫ్యూయలింగ్ ప్లేన్లు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. ఇరాన్ ప్రెస్ టీవీ సంబంధిత ఫోటోలను విడుదల చేసింది. ఇందులో నిఘా యుద్ధ నౌక దెబ్బతిని పడి ఉన్న విషయం స్పష్టంగా ఉంది, ఇందుకు ఇరాన్ ఆరు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను వాడింది. 29 డ్రోన్లను కూడా ప్రయోగించారు. ఇప్పుడు దెబ్బతిన్న అమెరికా విమానాన్ని యుఎస్‌ఇ3 సెంట్రీ అవాక్స్ విమానంగా పిలుస్తారు. ఇప్పటి ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు. ఆదివారం తమ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ దాడులలో అమెరికాకు చెందిన యుఎస్ ఎంక్యూ 9 డ్రోన్ , ఎఫ్ 16 ఫైటర్ జెట్‌ను దెబ్బతీశారు. అయితే ఈ విషయాన్ని ఇతర వర్గాలు ధృవీకరించలేదు. అబూధాబిలో దాడులలో భారతీయులకు గాయాలు అరబ్ ఏమిరేట్స్‌పై ఇరాన్ ఆదివారం క్షిపణిదాడులకు దిగింది. ఈ క్రమంలో ఆదివారం అబూధాబిలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారని నిర్థారణ అయింది. ఇరాన్ క్షిపణి దాడులను తిప్పికొట్టినట్లు యుఎఇ రక్షణ శాఖ తెలిపింది. శకలాల ధాటిలో ఈ ప్రాంతంలోని కెజాద్‌లో కొందరుగాయపడ్డారని వివరించారు.భారతీయులు కూడా గాయపడ్డ వారిలో ఉన్నారని వారిని చికిత్సకు ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. ఇరాన్‌కు మద్దతుగా హౌతి మిలిటెంట్లు కూడా రంగలంలోకి దిగారు. వీరికి అత్యంత శక్తివంతమైన క్షిపణులు సమకూరుతున్నాయి. యెమెన్ నుంచి హౌతీ బలగాలు తమ సైన్యంపై దాడులకు దిగిన విషయాన్ని ఇజ్రాయెల్ ఆదివారం నిర్థారించింది. .ఇస్లామాబాద్‌లో ఆశ ..గల్ఫ్ చర్చలు ఆరంభం ఇరాన్ నుంచి షరతులతో తాజా ప్రతిపాదన? గల్ఫ్ యుద్ధం నివారణ దిశలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఆదివారం ఈజిప్టు, టర్కీ విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు. ఇక్కడ ఈజిప్టు, పాకిస్థాన్ మధ్యవర్తులుగా చర్చలు వేగవంతం అయ్యాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్ వేదికగా చర్చలకు ముందు ఈజిప్టు , టర్కీ విదేశాంగ మంత్రులతో డార్ మాట్లాడారు. సౌదీ అరేబియా , ఈజిప్టు విదేశాంగ మంత్రులు కూడా ఈ చర్చలలో పాల్గొంటారు. అమెరికా ఫార్మూలాను ఇప్పటికే పాకిస్థాన్ ఇరాన్‌కు పంపించింది. అయితే దీనిని ఇరాన్ తోసిపుచ్చింది. తాజాగా ఇరాన్ నుంచి అతి కొద్ది షరతులతో కూడిన ప్రతిపాదనను పాకిస్థాన్‌కు పంపించినట్లు వెల్లడైంది. వీటిపై ఇస్లామాబాద్‌లో విదేశాంగ మంత్రుల సమావేశంలో సమీక్షించుకుని తరువాతి కార్యాచరణకు దిగుతారని వెల్లడైంది. అయితే ఇరాన్ తాజా ప్రతిపాదనలోని అంశాలు వెంటనే వెలుగులోకి రాలేదు . 

మన తెలంగాణ 30 Mar 2026 3:00 am

సోమవారం రాశి ఫలాలు (30-03-2026)

మేషం గడిచిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుంటారు. గృహమున సొంత ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృషభం బంధువులతో అకారణ మాట పట్టింపులు ఉంటాయి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. మిధునం బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. కర్కాటకం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సింహం ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో అవరోధాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలు పని ఒత్తిడి అధికమవుతుంది. కన్య ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది. తుల సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు అందుకుంటారు. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృశ్చికం భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించినట్టు అవకాశాలు లభిస్తాయి. ధనస్సు స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితుల మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి సమస్యలు తప్పవు. మకరం చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి. కుంభం భూవివాదాల పరిష్కారమౌతాయి. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంకాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థుల విదేశీ యత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున భాగస్థుల తో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.  

మన తెలంగాణ 30 Mar 2026 12:10 am

కోల్‌కతాపై ముంబై ఘన విజయం

 ఐపిఎల్ సీజన్ 2026లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. ఆదివారం కోల్‌తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగుర వేసింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్, రోహిత్ శర్మలు అద్భుత బ్యాటింగ్‌తో ముంబైని ఆదుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 38 బంతుల్లోనే ఆరు సిక్సర్‌లు, మరో 6 ఫోర్లతో 78 పరుగులు చేశాడు. చెలరేగి బ్యాటింగ్ చేసిన రికెల్టన్ 8 సిక్స్‌లు, 4 బౌండరీలతో 43 బంతుల్లోనే 81 పరుగులు సాధించాడు. దీంతో ముంబై అలవోక విజయం అందుకుంది. శుభారంభం.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు అజింక్య రహానె, ఫిన్ అలెన్‌లు శుభారంభం అందించారు. అలెన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. రహానె కూడా మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు. ఇటు రహానె అటు అలెన్‌లు జోరుగా ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఈ జోడీని విడగొట్టేందుకు ముంబై బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. అలెన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. అయితే 17 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 18 పరుగులు చేసిన అతన్ని శార్దూల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. దీంతో 69 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన వేలం పాట కింగ్ కామెరూన్ గ్రీన్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రహానె 40 బంతుల్లో ఐదు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 67 పరుగులు చేసి వెనుదిరిగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అంగ్‌క్రిస్ రఘువంశీ 29 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. రింకు సింగ్ 4 ఫోర్లతో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

మన తెలంగాణ 29 Mar 2026 11:27 pm

రెడ్‌మి 15ఎ 5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్

 షియోమి ఇండియా అధునాతన ఫీచర్లతో రెడ్‌మి 15ఎ 5జి ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో 6300 ఎంఎహెచ్ సామర్థ్యంతో భారీ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు పనిచేస్తుంది. దీని 6.9 అంగుళాల స్క్రీన్, 120 హెరట్జ్ వేగం వినియోగదారులకు మంచి అనుభూతిని ఇస్తాయి. దీని ప్రారంభ ధర రూ.12,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ నాలుగేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లతో లభిస్తుంది. ఏప్రిల్ 3 నుండి ఆన్‌లైన్, ఇతర స్టోర్లలో ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

మన తెలంగాణ 29 Mar 2026 10:59 pm

IPL 2026..పొలార్డ్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన నరైన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ నయా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా ప్లేయర్ సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్ నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.  2012లో లీగ్‌లోకి అరంగేట్రం చేసినప్పటి నుండి నరైన్ నైట్ రైడర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. 2012లో కేకేఆర్‌లో చేరిన అతను, తన మిస్టరీ స్పిన్‌తో తక్షణమే తనదైన ముద్ర వేశాడు. 2012, 2014లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. పొదుపైన బౌలింగ్, విధ్వంసకర బ్యాటింగ్ తో రాణిస్తూ కెకెఆర్ కు కీలకంగా మారాడు. ఈ క్రమంలో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్ అతనికి 190వ మ్యాచ్. దీంతో ఐపిఎల్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. పొలార్డ్ 189 మ్యాచ్ లు ఆడి ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్(184), డేవిడ్ వార్నర్(184), డీజే బ్రావో(161)లు ఉన్నారు.

మన తెలంగాణ 29 Mar 2026 10:58 pm

హీరో విజయ్ అసెంబ్లీకి రెండు చోట్ల పోటి

 పినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన హీరో విజయ్ ఆదివారం తమ తమిళగ వెట్రికజగం (టివికె) పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఎప్రిల్ 23వ తేదీన జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. సొంతంగా ఆయన పార్టీ మొత్తం 234 అసెంబ్లీ స్థానాల నుంచి పోటికి దిగుతుంది. కాగా తాను ఇప్పటి తమిళనాడు రాజకీయాలలో ప్రత్యామ్నాయ శక్తిని అవుతానని చెప్పిన విజయ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటికి దిగుతారు. ఎన్నికల రంగంలో తొలిసారి రంగ ప్రవేశం చేసే విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి, చెన్నైలోని పెరంబూర్ నుంచి బరిలో నిలుస్తారు. ఈ రెండు స్థానాలలో డిఎంకె తమ బలీయమైన అభ్యర్థులు ఆర్‌డి శేఖర్, ఇనిగో ఇరతయరాజ్‌ను ఇప్పటికే నిలిపింది. చెన్నైలోని ఓ ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ తమ పార్టీ జాబితాను విడుదల చేశారు. రెండు స్థానాల నుంచి సి జోసెఫ్ విజయ్ నిలుస్తున్నారని అభిమానులు , పార్టీ నేతల చప్పట్ల మధ్య ప్రకటించారు. ఈ సందర్బంగానే పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. ఇందులో తన అత్యంత ప్రధాన విశ్వసనీయ వ్యక్తుల బృందంలోని వారు కూడా ఉన్నారు. ఇటీవల అన్నాడిఎంకె నుంచి పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి కు ప కృష్ణన్‌కు లాల్గూడి సీటు కేటాయించారు. అదే విధంగా డిఎంకె ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్లు దక్కాయి. ఇప్పుడు తాము ప్రకటిస్తున్నది అభ్యర్థులను కాదని, ప్రజా పరిరక్షకులను అని తెలిపారు. యువతరం కదలాల్సి ఉందని, జన్ జడ్‌తోనే సరికొత్త విజిల్ వెలువడుతుందని తమ పార్టీ గుర్తును ప్రదర్శించారు. యువతకు ప్రత్యేకంగా అజెండాను వెలువరించారు. గ్యారంటీగా ప్రకటించారు. తమిళనాడును డ్రగ్స్ రహితం చేస్తామని, సరళరీతిలో రుణాలు ఇస్తామని విద్యావకాశాల కోసం ఇంటర్ నుంచి పిహెచ్‌డి వరకూ రూ 20 లక్షల వరకూ రుణాలు అందిస్తామని వివరించారు. 

మన తెలంగాణ 29 Mar 2026 10:50 pm

సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణిదాడులు

సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఆదివారం ఇరాన్ సౌదీలోని అత్యంత కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై దాడికి దిగింది. అమెరికా నిర్వహణలో ఉండే ఈ ఎయిర్‌బేస్‌ను ఎంచుకుని జరిపిన దాడిలో అమెరికా శక్తివంతమైన నిఘా విమానం అవాక్స్ దెబ్బతింది. అక్కడి ఆయుధ వ్యవస్థ విధ్వంసం జరిగిందని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెరికాకు చెందిన అనేక రిఫ్యూయలింగ్ ప్లేన్లు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. ఇరాన్ ప్రెస్ టీవీ సంబంధిత ఫోటోలను విడుదల చేసింది. ఇందులో నిఘా యుద్ధ నౌక దెబ్బతిని పడి ఉన్న విషయం స్పష్టంగా ఉంది, ఇందుకు ఇరాన్ ఆరు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను వాడింది. 29 డ్రోన్లను కూడా ప్రయోగించారు. ఇప్పుడు దెబ్బతిన్న అమెరికా విమానాన్ని యుఎస్‌ఇ3 సెంట్రీ అవాక్స్ విమానంగా పిలుస్తారు. ఇప్పటి ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు. ఆదివారం తమ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ దాడులలో అమెరికాకు చెందిన యుఎస్ ఎంక్యూ 9 డ్రోన్ , ఎఫ్ 16 ఫైటర్ జెట్‌ను దెబ్బతీశారు. అయితే ఈ విషయాన్ని ఇతర వర్గాలు ధృవీకరించలేదు. 

మన తెలంగాణ 29 Mar 2026 10:18 pm

కోల్ కతాపై రోహిత్ శర్మ విధ్వంసం..

ఐపిఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీ షాట్లతో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ మెగా టోర్నమెంట్ లో భాగంగా జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్(కెకెఆర్) నిర్దేశించిన 221 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి అదిరిపోయే ఆరంభం లభించింది. రోహిత్ కేవలం 23 బంతుల్లో 5 సిక్సులు, మూడు ఫోర్లతో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో రికల్టన్ కూడా భారీ షాట్లతో కోల్ కతా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. దీంతో ముంబై జట్టు పవర్ ప్లే ముగిసే సరికి 80 పరుగులు చేసింది. ముంబై విజయానికి 14 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టి కోల్ కతా బ్యాటర్స్ అదరగొట్టారు. ఓపెనర్లు అజింక్యా రహానె(67), ఫిన్ అలెన్(37)లు శుభారంభాన్ని అందించారు. తర్వాత రఘువంశీ(51) అర్ధ శతకంతో మెరుపులు మెరిపించాడు. చివర్లలో రింకూ సింగ్(33 నాటౌట్)కూడా ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.

మన తెలంగాణ 29 Mar 2026 10:15 pm

కేరళలో కాంగ్రెస్ కూటమిదే విజయం: మంత్రి పొంగులేటి

కేరళలో కాంగ్రెస్ కూటమి (యూడిఎఫ్) విజయం ఖాయమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార అండ్ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో వచ్చే నెల 9వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడిఎఫ్) స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పతనంతిట్ట జిల్లా లోని అడూర్ అసెంబ్లీ నియోజకవర్గం యూడిఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి శాంతకుమార్ (కాంగ్రెస్ పార్టీ) మద్దతుగా వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమి పట్ల ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి సాధించిన విజయాలు దీనికి నిదర్శనమన్నారు. గత దశాబ్దంగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, ప్రజలకు అందిన ఫలితాలు తక్కువగా ఉన్నాయని ఆయన విమర్శించారు. పదేళ్ల పాలన తర్వాత కూడా నిరుద్యోగం పెరుగుతుంటే, ప్రజలపై ఆర్థిక భారాలు అధికమవుతుంటే - అది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సెక్యులర్ విలువలను కాపాడే శక్తి కాంగ్రెస్‌కే ఉందని, ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పుతో కాంగ్రెస్ కూటమికి విజయం అందిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 29 Mar 2026 10:13 pm

గోదావరి పుష్కరాలు సిఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు పలు సూచనలు

తెలంగాణలో గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపాల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2027 జూన్ లో గోదావరి పుష్కరాలు జరగనుండటంతో పూర్తి చేయాల్సిన పనులపై.. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ క్రమంలో అధికారులకు సిఎం రేవంత్ పలు సూచనలు చేశారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి 15 లేదా 20 రోజుల్లోగా నివేదికను అధికారుల కమిటీకి అందజేయాలని చెప్పారు. ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి పంపాలని సూచించారు.కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తరువాత ప్రణాళికలకు సంబంధించిన నివేదికపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్ లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న సిఎం చెప్పారు. రోడ్లు, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు.

మన తెలంగాణ 29 Mar 2026 9:51 pm

IPL 2026: చెలరేగిన కోల్ కతా బ్యాటర్లు.. ముంబైకి భారీ టార్గెట్

ఐపిఎల్ 2026లో భాగంగా జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు కోల్ కతా నైట్ రైడర్స్ 221 పరుగుల భారీ లక్ష్క్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టి కోల్ కతా బ్యాటర్స్ అదరగొట్టారు. ఓపెనర్లు అజింక్యా రహానె(67), ఫిన్ అలెన్(37)లు శుభారంభాన్ని అందించారు. తర్వాత రఘువంశీ(51) అర్ధ శతకంతో మెరుపులు మెరిపించాడు. చివర్లలో రింకూ సింగ్(33 నాటౌట్)కూడా ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.

మన తెలంగాణ 29 Mar 2026 9:24 pm

స్పోర్ట్స్‌ హ్యాకథాన్‌ ప్రారంభం

 తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌ హ్యాకథాన్‌ ఘనంగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీఐటీఏ) నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్‌ శనివారం నుంచి రెండ్రోజులు పాటు జరగనుంది. టీఐటీఏ అధ్యక్షుడు మక్తాల సందీప్‌ కుమార్‌ మాట్లాడుతూ బాస్కెట్‌బాల్‌, ఫెన్సింగ్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌, పవర్‌లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌తో పాటు మొత్తం 24 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఫిట్‌నెస్‌, శారీరక, సాంకేతిక సమస్యలను విశ్లేషిస్తూ వాటికి టెక్నాలజీ ఎలాంటి పరిష్కారం చూపించగలదో తెలియజేసేందుకు ఈ స్పోర్ట్స్‌ హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో పాల్గొనేందుకు రెండు వేల మందికి పైగా నమోదు చేసుకున్నారని, ధరఖాస్తులను మదింపు చేసిన అనంతరం 20 మంది ఆవిష్కర్తల కాన్సెప్ట్స్‌ను ఒక నిమిషం పాటు జ్యూరీ ముందు ప్రదర్శించేందుకు ఎంపిక చేశామని చెప్పారు. స్పోర్ట్స్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలపాలనేది తమ లక్ష్యమని తెలిపారు.

మన తెలంగాణ 29 Mar 2026 8:57 pm

మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం ?: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

రిజర్వాయర్లకోసం ఎంతోమంది రైతులు భూములిచ్చారని రిజర్వాయర్లు కడితే సరిపోదని కాల్వలు తవ్వించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు తాము కూడా మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి న్యాయం జరగనప్పుడు పదవిలోఉండి కూడా వేస్ట్ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మునుగోడులో ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 29 Mar 2026 8:45 pm

ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్రారం గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపర్లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. ఆదివారం ఉదయం ధర్మారం గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు మూడుకే లక్ష్మిరాజం (58), కుమ్మం మొండయ్య (50)లు గొర్రెలకు నీరు తాగించేందుకు చెరువులోకి తీసుకువెళ్లారు. చెరువులోపలికి వెళ్లిన మూడు గొర్రెలను బయటకు తీయడానికి వెళ్లిన కాపర్లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేశాలను వెలికి తీశారు. ఈ మేరకు కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు గొర్రెల కాపరుల ఆకస్మిక మృతితో ధర్మారంలో తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాల రోదనలు పలువురికి కన్నీళ్లు తెప్పించాయి.

మన తెలంగాణ 29 Mar 2026 8:40 pm

మొగుళ్ళపల్లి మండలంలో దొంగల హల్చల్

మొగుళ్ళపల్లి మండలంలో దొంగల హల్చల్ ఒక బైక్. 15 వేల రూపాయల నగదుకరెంటు

ప్రభ న్యూస్ 29 Mar 2026 8:20 pm

సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్..పిపిసిఎం సభ్యుడు మృతి

ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్లాటూన్ నంబర్ 31 సెక్షన్ కమాండర్ మృతి చెందాడు. పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఎదురు కాల్పుల్లో కమాండర్ ముచాకి కైలాస్ మృతి చెందాడు.ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నాయి .ఎదురు కాల్పుల విషయాన్ని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. సంఘటనా ప్రాంతం నుంచి మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక ఆయుధాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతిచెందిన మావోయిస్టు ఐఇడీలు పేల్చడం , బలగాలపై దాడులు వంటి నేరాల్లో పాల్గొన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇతనిపై ఐదు లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు. మావోయిస్టులు లొంగిపోయేందుకు చివరి అవకాశం కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని,హింసా మార్గాన్ని వీడాలని బస్తర్ ఐ జి సుందర్ రాజ్ మరోసారి విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 29 Mar 2026 8:20 pm

మణికొండలోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మణికొండలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రిద్దీస్ గ్రాండియర్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లోని వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. ఫ్లాట్‌లోని వాషింగ్ మెషీన్‌కు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన యజమాని తన భార్య, ఇద్దరు పిల్లల్ని వెంటనే బయటకు తీసుకెళ్లడంతో వారికి ప్రమాదం తప్పింది.

మన తెలంగాణ 29 Mar 2026 8:20 pm

సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

గేదెల మేపేందుకు వెళ్లి ఈత కోసం నీటి గుంటలో దిగి ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి పట్టణ శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఒంటిపూడి దేవా (12) సంవత్సరాలు స్థానిక ఎన్టీఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుండగా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామానికి చెందిన వంగూరి నాగబాబు (12) తన అమ్మమ్మ ఎన్టీఆర్ నగర్లో ఉండగా వారి ఇంటి దగ్గర ఉంటూ ఆదివారం కావడంతో సత్తుపల్లి మున్సిపాలిటీ సమీపంలోని గేదలు మేపేందుకు వెళ్లి సరదాగా నీటి గుంటలో దిగి ఇద్దరి విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటినా రంగంలోకి దిగిన అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లను రంగంలోకి దించి నీటి గుంటలో పడి మృతి చెందిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 4 గంటలకు పైగా గాలింపు చేపట్టాగ ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను శవ పంచనామా పరీక్ష కోసం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఓకే కాలనీకి చెందిన ఇద్దరు బాలురు మృతి చెందటంతో ఎన్టీఆర్ నగర్లో విషాదఛాయలు అలుపుకున్నాయి.

మన తెలంగాణ 29 Mar 2026 8:12 pm

ఇంద్రకీలాద్రి పై ధ్వజారోహణం

ఇంద్రకీలాద్రి పై ధ్వజారోహణం.. చైత్ర బ్రహ్మోత్సవాలకు వైభవ ప్రారంభంశ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో వేదఘోషల

ప్రభ న్యూస్ 29 Mar 2026 8:12 pm

రాష్ట్రస్థాయి ఉత్తమ ఏపీఎంగా కుంట గంగాధర్…

రాష్ట్రస్థాయి ఉత్తమ ఏపీఎంగా కుంట గంగాధర్… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 29 Mar 2026 8:06 pm

ఘనంగా మట్టల ఆదివార వేడుకలు

ఘనంగా మట్టల ఆదివార వేడుకలు పురవీధులు గుండా బహిరంగ ప్రదర్శనలుఆర్సిఎం విచారణ పాదర్లు

ప్రభ న్యూస్ 29 Mar 2026 8:04 pm

ఘనంగా మట్టల ఆదివార వేడుకలు..

ఘనంగా మట్టల ఆదివార వేడుకలు.. పురవీధుల గుండా బహిరంగ ప్రదర్శనలుఆర్సిఎం విచారణ పాదర్లు

ప్రభ న్యూస్ 29 Mar 2026 8:02 pm

లోవోల్టేజీ సమస్యను పరిష్కరించిన సర్పంచ్…

లోవోల్టేజీ సమస్యను పరిష్కరించిన సర్పంచ్… కుభీర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుబీర్

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:58 pm

నేపాల్‌లో మాజీ మంత్రి అరెస్టు

నేపాల్‌లో దేశ మాజీ ఇంధన మంత్రి , నేపాలీ కాంగ్రెస్ నేత దీపక్ ఖడ్కాను ఆదివారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసు సంంధిత అవినీతి వ్యవహరంలో నూతన ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. కీలక మంత్రిత్వ శాఖను నిర్వహించిన ఖడ్కాపై దేశ దర్యాప్తు సంస్థ సిఐబి ప్రాధమిక విచారణ జరిపింది. ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకుందని సంస్థ అధికార ప్రతినిధి శివకుమార్ శ్రేష్ట చెప్పినట్లు స్థానిక మీడియా హిమాలయన్ తెలిపింది. సిఐబి ఆదేశాల మేరకు పోలీసులు అరెస్టుకు దిగారు. గత ఏడాది నేపాల్‌లో జరిగిన యువత నిరసన ప్రదర్శనలు, అవినీతి వ్యతిరేక ఉద్యమం దశలో అప్పటి ప్రభుత్వ అవినీతి విషయాలు ప్రధానంగా వెలుగులోకి వచ్చాయి. ఖడ్కా, మాజీ ప్రధానులు షేర్ బహదూర్, పుష్ప కమల్ దహల్ నివాసాలలో కాలిపోయిన నోట్ల కట్టలు కన్నించాయని పేర్కొంటూ ఫోటోలను, వీడియోలను నిరసనకారులు ప్రదర్శించారు. దీని ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది. 

మన తెలంగాణ 29 Mar 2026 7:57 pm

రోడ్డు భద్రతను మెరుగుపరచడమే పోలీసుల లక్ష్యం

రోడ్డు భద్రతను మెరుగుపరచడమే పోలీసుల లక్ష్యం అలైవ్ అరైవ్ కార్యక్రమంలో కుభీర్ ఎస్సై

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:57 pm

కర్నూలులో విహెచ్‌పీ అవగాహన సదస్సు…

కర్నూలులో విహెచ్‌పీ అవగాహన సదస్సు… ముసాయిదా చట్టంపై విస్తృత చర్చలుహిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:54 pm

కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సర్పంచుల చేరిక

కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సర్పంచుల చేరిక అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలో చేరిక

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:50 pm

జిల్లాలో గ్యాస్ నిల్వలు ఉన్నాయి….

జిల్లాలో గ్యాస్ నిల్వలు ఉన్నాయి…. వినియోగదారులు సంయమనం పాటించాలి…ఓటిపి మరొకరితో పంచుకోకండి..కంట్రోల్ రూమ్

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:29 pm

ఆత్మగౌరవమే తెలుగుదేశం ఆవిర్భావం…

ఆత్మగౌరవమే తెలుగుదేశం ఆవిర్భావం… ప్రజల కోసం పోరాటమే మా లక్ష్యంఎన్టీఆర్ ఆశయాల సాధనలో

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:25 pm

Breaking: Peddi Postponed: Announcement Coming

The makers of Ram Charan’s Peddi are working round the clock to complete the shoot of the film on time and release the film on April 30th as per the plan. But the deadlines are tough and there is a big rush to complete the post-production work. A crucial meeting took place today and the […] The post Breaking: Peddi Postponed: Announcement Coming appeared first on Telugu360 .

తెలుగు 360 29 Mar 2026 7:23 pm

AR Murugadoss Lands into Trouble

Tamil director AR Murugadoss who has delivered some of the biggest super hits has been struggling to deliver a decent product. His last film was Madharaasi featuring Sivakarthikeyan and the film ended up as a debacle. The producers of the film have filed a complaint against AR Murugadoss. The complaint said that the director promised […] The post AR Murugadoss Lands into Trouble appeared first on Telugu360 .

తెలుగు 360 29 Mar 2026 7:19 pm

నిధులన్ని మంత్రులు… సీఎంలకేనా…

నిధులన్ని మంత్రులు… సీఎంలకేనా… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:18 pm

Chandrababu Sets Clear Line in TDP: Performance Over Position as Party Marks 44 Years

At a time when political messaging often gets diluted, N. Chandrababu Naidu chose clarity. Addressing party leaders and cadres at the 44th foundation day celebrations of the Telugu Desam Party, he sent out a firm message. Leaders who ignore grassroots workers have no place in the party. Recognition and responsibility will go only to those […] The post Chandrababu Sets Clear Line in TDP: Performance Over Position as Party Marks 44 Years appeared first on Telugu360 .

తెలుగు 360 29 Mar 2026 7:16 pm

అమెరికాపై ఉత్తరకొరియా శక్తివంతమైన క్షిపణి ఇంజిన్ పరీక్ష

ప్రస్తుత ప్రపంచ స్థాయి పరస్పర ఘర్షణల దశలో ఉత్తర కొరియా ఆదివారం అత్యంత శక్తివంతమైన ‘ ఘన ఇంధన క్షిపణి ఇంజిన్‌ను ’పరీక్షించింది.అమెరికా టార్గెట్‌గా ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఛోదక శక్తిగా ఈ ఇంజిన్ నిలుస్తుంది. గుర్తు తెలియని ప్రదేశం నుంచి జరిగిన క్షిపణి ఇంజిన్ పరీక్షను ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ వీక్షించారు. దేశ అత్యంత కీలకమైన సైనిక సామర్థం , శత్రు లక్షాల ఛేదనకు వీలుగా ఉండే ఈ ఇంజిన్ తయారు అయిందని ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ తెలిపింది. అమెరికా, అమెరికా మిత్రదేశాలను లక్షంగా ఎంచుకుని మరిన్ని శక్తివంతమైన సుదూర దాడి సమర్థవంతపు ఆయుధ వ్యవస్థ నిర్మాణానికి కిమ్ వెలువరించిన ఆదేశాల మేరకు ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు కీలక పరీక్షలకు దిగుతోంది. ఇప్పుడు పరీక్షించిన ఇంజిన్ శక్తి గరిష్టంగా 2500 కిలోటన్నులవరకూ ఉంటుంది. దీనిని పూర్తి స్థాయి కాంపోజిట్ కార్బన్ ఫైబర్ తో నిర్మించారు. ఉత్తరకొరియా క్షిపణుల వార్‌హెడ్ ను వేగంగా నిర్థిష్టంగా తీసుకువెళ్లగలిగే థ్రస్ట్‌ను ఈ ఇంజిన్ సంతరించుకుందని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా చర్యల క్రమంలో దేశానికి అత్యంత కీలకమైన సైనిక చర్యల నిరోధక శక్తి అవసరం అని కిమ్ భావిస్తూ వస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు శక్తివంతమైన క్షిపణుల పరీక్షలు జరుగుతున్నాయి. ఐదేండ్ల ఆయుధ వ్యవస్థ బలోపేత కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ ఇంజిన్ సమర్థతను పరీక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్‌ఎ) తెలిపింది. ఇప్పటి ఇంజిన్ పరీక్ష దేశ అత్యంత వ్యూహాత్మక సైనిక బలోపేతానికి ఆయువుపట్టు అని కిమ్ స్పందించినట్లు ఈ వార్తా సంస్థ తెలిపింది. పరీక్ష ఎప్పుడు? ఎక్కడ జరిగిందనేది అధికారికంగా వెల్లడికాలేదు. 

మన తెలంగాణ 29 Mar 2026 7:16 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్ ముంబైకి 300వ టి-20 మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నమెంట్‌ను విజయంతో ఆరంభించాలని ముంబై భావిస్తోంది. మరోవైపు కోల్‌కతా కూడా ముంబైని చిత్తు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తుది జట్లు: కెకెఆర్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామరూన్ గ్రీన్, అంగక్రిష్ రఘువంశీ(కీపర్), రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజర్బానీ. ఎంఐ: రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్(కీపర్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా(కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధిర్, షార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్ఖండే, ఎఎం గజాన్ఫర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

మన తెలంగాణ 29 Mar 2026 7:16 pm

కెటిఆర్ సిఎం రేవంత్ మధ్య కుదిరిన ‘డీల్’: బండి సంజయ్

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుమ్కక్కు ఆయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అందుకే కెటిఆర్‌పై ఉన్న అవినీతి కేసుల జోలికి పోవడం లేదని అన్నారు. కెటిఆర్‌కు, కవితకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. కేవలం హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తూ కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పారు. కాళేశ్వరంలో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరిపితే మొత్తం బండారం బయపటపడుతుందనే భయంతోనే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణను పరిమితం చేశారని ఆయన ఆరోపించారు. హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కెటిఆర్‌కు సీఎం సలహా ఇస్తున్నారని ఆయన అన్నారు. కాళేశ్వరంపై హరీష్‌పై ఉన్నంత పగ కెటిఆర్‌పై ముఖ్యమంత్రికి లేదన్నారు. భవిష్యత్తులో బిఆర్‌ఎస్ తో కలిసి పోటీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వంద శాతం కెటిఆర్, రేవంత్ రెడ్డి ఒక్కటేనని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 29 Mar 2026 7:09 pm

Devotees Turn to Free Meals in Tirumala as Gas Shortage Hits Hotels

The sacred town of Tirumala is witnessing a clear shift in how devotees are meeting their food needs. With private hotels struggling due to a sudden shortage of commercial gas, more pilgrims are now turning towards the free meal services provided by Tirumala Tirupati Devasthanams. The crisis began after gas supplies dropped sharply due to […] The post Devotees Turn to Free Meals in Tirumala as Gas Shortage Hits Hotels appeared first on Telugu360 .

తెలుగు 360 29 Mar 2026 7:08 pm

చిత్తూరు రాజకీయ పటంలో భారీ మార్పులు…

చిత్తూరు రాజకీయ పటంలో భారీ మార్పులు… 3 కొత్త అసెంబ్లీలు, మరో లోక్‌సభ

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:04 pm

వెండి పల్లకీ పై దుర్గా మల్లేశ్వరులు …

వెండి పల్లకీ పై దుర్గా మల్లేశ్వరులు … ఊరేగింపులో దుర్గామల్లేశ్వరుల దర్శన భాగ్యం..భక్తుల

ప్రభ న్యూస్ 29 Mar 2026 7:01 pm

చందాపురంలో అతిసార కేసులపై అప్రమత్త..

చందాపురంలో అతిసార కేసులపై అప్రమత్త.. ఇంటింటి వైద్య పరిశీలనపరిస్థితి అదుపులోనే డీఎంహెచ్‌ఓ డా.

ప్రభ న్యూస్ 29 Mar 2026 6:58 pm

సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న ఆనవాళ్లు బైటపడ్డాయని అటవీ ప్రాంతానికి ఆనుకొని వున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుంటూ జాగ్రత్త చర్యలు పాటించాలని ఆర్మూర్ సబ్ డివిజనల్ ఫారెస్టు అధికారి భవాణి శంకర్ కోరారు. ఆదివారం ఆయన సిరికొండ, కమ్మర్‌పల్లీ రెంజ్ అధికారులు నర్సింగ్‌రావు,రవీంధర్‌లు సిబ్బందితో కలిసి జినిగ్యాల అటవీ ప్రాంతంలో పర్యటించారు. పెద్దపులి సంచారంపై అనావాళ్ల గురించి క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. జినిగ్యాల ఫారెస్టు కంపార్టుమెంటులో పులి అడుగులు కనబడ్డాయి. అవి పెద్దపులి అడుగులాగా నిర్ధారించుకున్నారు. అనంతం ఎస్‌డిఎఫ్‌ఒ భవాణి శంకర్ సిబ్బందితో సమావేశమయ్యారు. పులి సంచారం నిర్ధారణ అయిన దృష్టా అటవీ సరిహద్దు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.పొద్దుకుంగిన తర్వాత,తెల్లవారు జామున, రాత్రి సమయంలో అటవిలోకి వెల్ల వద్దని సూచించారు.అడవులకు ఆనుకొని వున్న పంటపోలాల వద్ద విద్యత్ తీగలు అమర్చవద్దని,అడవి జంతువుత వల్ల ఏవైనా జీవాలకు ప్రాణ నష్టం జరిగితే అటవీ శాఖ అధికారుల దృష్టికి తేవాలని అలా చేస్తే నష్టపరిహారం పొందవచ్చుచనిని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దపులి ప్రాణానికి నష్టం చేసే చర్యలకు పూనుకోవద్దని ప్రజలకు తెలిపారు. ఆయన వెంట సిరికొండ డిఆర్‌ఓ గంగారాం,సెక్షన్ అధికారులు,బీట్ అఫీసర్లు వున్నారు.

మన తెలంగాణ 29 Mar 2026 6:57 pm

అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే…

అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే… ఎన్టీఆర్‌ సర్కిల్‌లో తెలగుదేశం పార్టీ

ప్రభ న్యూస్ 29 Mar 2026 6:55 pm

Handri-Neeva |ఒకే కుటుంబంలో ఇద్దరు…

Handri-Neeva | ఒకే కుటుంబంలో ఇద్దరు… Handri-Neeva | సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 29 Mar 2026 6:51 pm

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి

కామరెడ్డి జిల్లాలోని గాంధారి మండలం రాంపూర్ గడ్డ గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనం అదుపు తప్పగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గడ్డ గ్రామ సమీపంలోని భావన రైస్ మిల్లులో పనిచేస్తున్న బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన లాల్తూ ర్ ముఖియా (21), రాహుల్ (21), జావీద్ అంసారి (22) అనే ముగ్గురు కార్మికులు ద్విచక్ర వాహనంపై గాంధారి వైపు వస్తుండగా రాంపూర్ గడ్డ గ్రామ సమీపంలో బైక్  అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించగా అప్పటికే ముగ్గురు యువకులు మృతి చెందారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్టలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం బాన్స్ వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మన తెలంగాణ 29 Mar 2026 6:48 pm

హోటల్ గదిలో విగతజీవులుగా..

హోటల్ గదిలో విగతజీవులుగా.. ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా నరసరావుపేటలో తీవ్ర

ప్రభ న్యూస్ 29 Mar 2026 6:40 pm

విచారణకు సిద్ధమా.. సిఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. తన తమ్ముడు, బావమరిదిపై సిఎం ఆరోపణలు చేశారని.. సిఎం తమ్ముడు, బావమరిదిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని హరీశ్ అన్నారు. తన తమ్ముడు, బావమరిదిపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని.. సిఎం తమ్ముడు, బావమరిదిపై విచారణకు రేవంత్ సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. హౌసింగ్ కమిటీ కాదు.. సిబిసిఐడి కాదు.. సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని.. సిఎం సిద్ధంగా ఉన్నారా.. అని అడిగారు. ‘‘మంత్రి పొంగులేటిని కాపాడేందుకు వంద అబద్ధాలు ఆడి రేవంత్ దొరికిపోయారు. ఏ పని కోసం నేనెప్పుడు పొంగులేటికి ఫోన్ చేయలేదు. పొంగులేటి కంపెనీ అవినీతి పాల్పడిందని అందరికీ అర్థమైంది. తప్పు జరిగిందని సిఎం, మంత్రి అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు. సిఎం, పొంగులేటి మధ్య లావాదేవీలు ఉంటాయి. వాళ్లు భూములను చెరిసగం పంచుకుంటారు. సభా సంఘం వేస్తే అన్నీ బయటకు వస్తాయని భయపడుతున్నారు. కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చి బేరం కుదిరితే తొలగిస్తున్నారు’’ అని హరీశ్ రావు ఆరోపించారు.

మన తెలంగాణ 29 Mar 2026 6:40 pm

30 ఏళ్ల సుదీర్ఘ పోరాటమే ఏబీసీడీ వర్గీకరణ…

30 ఏళ్ల సుదీర్ఘ పోరాటమే ఏబీసీడీ వర్గీకరణ… జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి…

ప్రభ న్యూస్ 29 Mar 2026 6:14 pm

సీఎం రేవంత్ రెడ్డి సిద్దమా…

సీఎం రేవంత్ రెడ్డి సిద్దమా… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి

ప్రభ న్యూస్ 29 Mar 2026 6:09 pm

టెలాపూర్‌లో టెనా కార్నివల్‌కు భారీ స్పందన

70 గేటెడ్ కమ్యూనిటీల నుంచి భారీగా పాల్గొనడంసామాజిక సేవల్లో టెనా ముందంజ అని ప్రశంసలు

తెలుగు పోస్ట్ 29 Mar 2026 6:06 pm

అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది: హరీష్ రావు

రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ వ్యవహారంపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో తప్పు జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగ దొరికిపోయిందని.. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పది తప్పులు చేస్తోందని విమర్శించారు.  రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇసుక దోపిడీ, అక్రమాలు చేస్తుందని ప్రతిపక్షం కాదు ప్రభుత్వమే కనుక్కుందని అందుకే వారికి నోటీసులు ఇచ్చామని సిఎం రేవంత్ చెప్పారని.. డైవర్షన్‌ కోసమే రేవంత్‌ రెడ్డి ఎదురుదాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రి అవినీతికి పాల్పడితే.. సీబీసీఐడీ విచారణ సరిపోతుందా? అని హరీష్ రావు ప్రశ్నించారు. కాగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చేస్తున్న అక్రమ మైనింగ్ పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజులపాటు అసెంబ్లీ నుండి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు.

మన తెలంగాణ 29 Mar 2026 6:02 pm

ఎంపీజే సమావేశానికి తరలివెళ్లిన నాయకులు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; హైదరాబాద్ లో నిర్వహించిన ఎంపీజే సమావేశానికి నారాయణపేట జిల్లా

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:59 pm

‘తల్లిదండ్రుల సంరక్షణ’ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం

హైదరాబాద్: ‘తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారు. పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చాం’’ అని సభలో తెలిపారు. ‘‘వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చింది. కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదు. సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారు. ఆత్మీయతకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావడం బాధాకరం. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్ిని సామాజికంగా బహిష్కరించాలి. తల్లిదండ్రులను చూసుకోలేనివాడు సమాజంలో బతకడానికి వీల్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. ప్రజా ప్రతినిధులకు కూడా చట్టం వర్తిస్తుంది’’ అని సిఎం అన్నారు.

మన తెలంగాణ 29 Mar 2026 5:59 pm

చరిత్రను తిరగరాసిన విశాఖపట్నం పోర్ట్

చరిత్రను తిరగరాసిన విశాఖపట్నం పోర్ట్ విశాఖపట్నం, ఆంధ్ర‌ప్ర‌భ : 92 ఏళ్ల ఘన

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:54 pm

జైనూర్‌లో ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షలు విజయవంతం

జైనూర్, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ఆదేశాల మేరకు జైనూర్

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:51 pm

ఉరవకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

ఉరవకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:50 pm

మక్తల్ సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా సుమిత్రమ్మ

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండల సర్పంచుల సంఘం నూతన

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:48 pm

తెలుగు ప్రజలకు అండ పసుపు జెండా….

తెలుగు ప్రజలకు అండ పసుపు జెండా…. ఏపీ సమగ్రాభివృద్ధి, పేదల అభ్యున్నతే టీడీపీ

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:48 pm

Sharwa’s Ripped & Ruthless Rise For Biker

It came as a big surprise when the first look of Biker was released. Charming Star Sharwa underwent a complete transformation to play the role of a biker. The glimpse, teaser, and trailer clearly showcased the immense effort he poured into the film. Now, the makers have released a transformation video, highlighting Sharwa’s inspiring journey […] The post Sharwa’s Ripped & Ruthless Rise For Biker appeared first on Telugu360 .

తెలుగు 360 29 Mar 2026 5:37 pm

లయోలా కళాశాలలో జాతీయ సదస్సు…

లయోలా కళాశాలలో జాతీయ సదస్సు… వాణిజ్య,నిర్వహణ విద్యలో నూతన ధోరణులపై సదస్సు ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:26 pm

అప్పుడు ‘లెజెండ్’ సినిమాతో హీరోగా.. ఇప్పుడు ‘లీడర్’గా మరోసారి..

చెన్నై: ప్రముఖ వస్త్రదుకాణం శరవణన్ స్టోర్స్ యజమాని లెజెండ్ శరవణన్.. నాలుగేళ్ల క్రితం తన పేరుతోనే తీసిన చిత్రం ‘లెజెండ్’. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలోనే ఘోరంగా ట్రోలింగ్‌కి గురైంది. ఇక థియేటర్లలో వచ్చిన తర్వాత సినిమాపై విమర్శలు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత శరవణనన్ మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సారి ఆయన ‘లీడర్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ మూవీకి ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించగా.. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించింది. ఆండ్రియా, శ్యామ్, లాల్ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏప్రిల్ 3వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఆదివారం ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా యాక్షన్ ట్రైలర్‌ని విడుదల చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఈ ట్రైలర్‌లో భారీ తనం కనిపిస్తుంది. మరి ఈ మూవీ అయినా శరవణన్‌కి సక్సెస్ ఇస్తుందో.. లేదో చూడాలి..

మన తెలంగాణ 29 Mar 2026 5:24 pm

అమ్మవారిని దర్శించుకున్న బాల బ్రహ్మానంద సరస్వతి….

అమ్మవారిని దర్శించుకున్న బాల బ్రహ్మానంద సరస్వతి…. పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:24 pm

నివాళులర్పించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..

నివాళులర్పించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:21 pm

వరి పంటల్లో పాముల సంచారం..

వరి పంటల్లో పాముల సంచారం.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని పలు గ్రామాల్లో

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:17 pm

పన్ను చెల్లింపులకు మార్చి 31 చివరి రోజు..

పన్ను చెల్లింపులకు మార్చి 31 చివరి రోజు.. విజయవాడ నగర పాలక సంస్థ

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:16 pm

మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతికి ఘన సన్మానం

మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతికి ఘన సన్మానం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 29 Mar 2026 5:15 pm