కాకినాడలో ప్రేమికుడి దారుణ హత్య
కాకినాడలో ప్రేమికుడి దారుణ హత్య హైదరాబాద్, ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాకినాడ
బీజేపీ వల్లే బీసీలకు అన్యాయం
బీజేపీ వల్లే బీసీలకు అన్యాయం గోదావరిఖని, ఆంధ్రప్రభ : బీసీ వర్గాలకు న్యాయం
పాడేరు సంతలో 8 అడుగుల దుంప #paderu #alluridistrict #NagaliDumpa #farmers #deepavali #latestnews
శ్రీ జ్ఞాన సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు
శ్రీ జ్ఞాన సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు బాసర, ఆంధ్రప్రభ : విజయ
బీసీ బంద్ ర్యాలీలో వీహెచ్కు అస్వస్థత
బీసీ బంద్ ర్యాలీలో వీహెచ్కు అస్వస్థత హైదరాబాద్, ఆంధ్రప్రభ : సీనియర్ కాంగ్రెస్
YSRCP : జగన్ పార్టీకి గ్రౌండ్ లెవెల్ లో క్రేజ్ పెరిగిందా?
వైసీపీకి పదహారు నెలల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో కొంత ఊపు కనిపిస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు
బాంబులతో పేల్చేస్తామంటూ .. తిరుపతి కలెక్టరేట్కు బెదిరింపు మెయిల్..
తిరుపతి కలెక్టరేట్ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఇమెయిల్లు అందాయి.ఈ నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కలెక్టరేట్లోని వివిధ విభాగాలు, చుట్టుప్రక్కల ప్రాంతాలను సవివరంగా తనిఖీ చేశాయి.కలెక్టర్ ఆఫీసులోని వివిధ శాఖల గదులు, కలెక్టర్ ఛాంబర్ మానితీరిగా పరిశీలించిన తరువాత ఏ విధమైన పేలుడు పదార్థాలు లేవని తేలింది.ప్రత్యేకంగా, తిరుపతి కలెక్టర్ అధికారిక ఇమెయిల్కు తమిళనాడులోని వ్యక్తుల నుండి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.గత 15 రోజులుగా ఈ […] The post బాంబులతో పేల్చేస్తామంటూ .. తిరుపతి కలెక్టరేట్కు బెదిరింపు మెయిల్.. appeared first on Visalaandhra .
Delhi : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది.
సైబర్ నేరాలు విచ్చలవిడిగా సాగుతుండడం, లక్షలు, కోట్ల రూపాయలు దోపిడీ కావడం ప్రభుత్వానికి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు తీరని సమస్యగా పరిణమిస్తోంది. అనేక రూపాల్లో ఇవి చాపకిందనీరులా సాగుతున్నాయి. అంతా జరిగిపోయాకనే బాధితులకు వీటి మోసం బయటపడుతోంది. ఈ పరిణామాలకు కొందరు బాధితులు ఆర్థికంగా, మానసికంగా కృశించి వ్యాధిగ్రస్థులు కావడమేకాక, కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు జరిగాయి. ఇటీవల కొన్ని నెలలుగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ నేరాలు బాధితులను భయకంపితులు చేస్తున్నాయి. ఇడి, సిబిఐ, ఆర్బిఐ సంస్థల పేర్లనే కాదు చివరికి సుప్రీం కోర్టు పేరు చెప్పి కూడా నకిలీ అరెస్టు వారెంట్లు బాధితులకు పంపుతున్నారు. ఈ సమస్యపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సుమోటోగా తీసుకున్న ఓ డిజిటల్ అరెస్టు కేసు విచారణ సందర్భంగా కేంద్రం, సిబిఐలకు తమ స్పందన తెలపాలని ఆదేశించింది. హర్యానా లోని అంబాలాకు చెందిన 73 ఏళ్ల ఓ మహిళ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్కి సైబర్ నేరగాళ్ల బెదిరింపులపై ఫిర్యాదు చేసింది. తనను ‘డిజిటల్ అరెస్టు’ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు ఉన్న ఒక పత్రాన్ని నేరగాళ్లు తనకు చూపించారని ఆమె పేర్కొంది. రూ. కోటి ఇస్తే ఈ అరెస్టు నుంచి బయటపడవచ్చని బెదిరించారని వివరించింది. సాక్షాత్తు సుప్రీం కోర్టే ఆదేశాలు జారీ చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించి నేరగాళ్లు బెదిరిస్తుండడం సుప్రీంకోర్టు ధర్మాసనానికి మింగుడు పడడం లేదు. శుక్రవారం (17.10. 2025) దీనిపై ధర్మాసనం విచారణ నిర్వహించడం గమనార్హం. దీనివల్ల ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. ఇవి సాధారణ మోసాలుగా భావించకూడదని, వీటిని బయటపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడింది. ఈ ఏడాది జూన్లో డిజిటల్ పేమెంట్స్ అవార్డ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ అరెస్టుల మోసాలను అరికట్టేందుకు సరైన పరిష్కారాలతో ముందుకు రావాలని ఫిన్టెక్, స్టార్టప్లకు పిలుపునిచ్చారు. తాజాగా హైదరాబాద్లో ఓ వృద్ధురాలిని మోసగించి రూ. 35 లక్షలు కాజేసిన సంఘటనపై శుక్రవారం (అక్టోబర్ 17) సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు అందడం గమనార్హం. లండన్ ఎయిర్ పోర్టులో మీ అబ్బాయికి ప్రమాదంలో తలకు పెద్ద గాయాలయ్యాయని, ఆస్పత్రిలో చికిత్స కోసం అర్జెంట్గా చేర్చాలని నమ్మించి ఆమె దగ్గరనుంచి డాక్టరు పేరుతో ఓ వ్యక్తి రూ. 35.23 లక్షలు కాజేశాడు. ఆమె నేరుగా తన కుమారుడితోనే మాట్లాడడంతో అసలు మోసం బయటపడింది. హైదరాబాద్లోనే గత ఏడాది నవంబర్లో 48 ఏళ్ల మహిళను లక్షంగా చేసుకుని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి మోసాలకు పాల్పడిన ముఠాలోని కీలక వ్యక్తిని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పోలీస్ అధికారులుగా నటించి మనీలాండరింగ్తో సంబంధాలు ఉన్నాయని, ఆమె ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారు రుణాలు, తదితర వ్యక్తిగత రుణాల నుండి పెద్ద మొత్తంలో డబ్బు పంపాలని ఈ ముఠా ఒత్తిడి తెచ్చింది. ఆధార్, ఇతర వ్యక్తిగత వివరాలు సేకరించి డిజిటల్ అరెస్టుకు పాల్పడ్డారు. చివరకు బాధితురాలి ఫిర్యాదుతో మొత్తం ఐదుగురు నిందితులను సైబర్క్రైమ్ యూనిట్ అరెస్టు చేయగలిగింది.ఈ ఏడాది సెప్టెంబరులో హైదరాబాద్ మధురానగర్కు చెందిన 76 ఏళ్ల మహిళను బెంగళూరు పోలీసుల వేషంలో నేరగాళ్లు మానవ అక్రమ రవాణా కేసు నమోదైందని బెదిరించారు. సుప్రీం కోర్టు జారీ చేసినట్టు నకిలీ పత్రాలను చూపించి డిజిటల్ అరెస్టు చట్రంలో బంధించారు. దీంతో బాధితురాలు సెప్టెంబర్ 6న తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 6.6 లక్షలను సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి జమ చేసింది. అంతటితో సైబర్ నేరగాళ్లు ఆగలేదు. డిజిటల్ అరెస్టు పేరుతో వేధించేసరికి ఆమె గుండెపోటుతో మృతి చెందింది. ఆ తరువాత ఈ మోసం కుటుంబీకులకు తెలిసింది. ఈ ఏడాది మార్చిలో ముంబైకి చెందిన 86 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల మోసం వల్లనే ఏకంగా రూ. 20 కోట్లు పోగొట్టుకుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఢిల్లీలో జరిగింది. సౌత్ ఢిల్లీకి చెందిన రిటైర్డ్ బ్యాంకర్ నరేష్ మల్హోత్రా అనే 75 ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు. తన ల్యాండ్లైన్ నెంబర్ హ్యాక్ అయిందని, ఆధార్ నెంబర్ ఉపయోగించి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారని బెదిరించారు. ఈ ఖాతాల ద్వారా పుల్వామా కేసులో ఉగ్రవాదులకు రూ. 1300 కోట్ల నిధులు సమకూర్చారని, అందుకని ఎన్ఐఎ అరెస్టు తప్పదని బెదిరించారు. ఇడి, సిబిఐ, సుప్రీం కోర్టు పేరులు చెప్పి ఆ వృద్ధుడిని నెలరోజుల పాటు డిజిటల్ అరెస్టు చేసి, రూ. 23 కోట్లు కాజేశారు. దీనిపై పోలీసులు రంగం లోకి దిగి ఈ డబ్బు విదేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. ఇందులో రూ. 12.11 కోట్లను సీజ్ చేయగలిగారు. డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం కేసులో దేశంలోనే మొట్టమొదటిసారిగా పశ్చిమబెంగాల్లో 9 మందికి యావజ్జీవ శిక్షలు విధిస్తూ ఈ ఏడాది జులైలో తీర్పు వెలువడడం సంచలనాత్మకం. పార్థకుమార్ ముఖర్జీ అనే రిటైర్డు సైంటిస్టును ఆర్థిక నేరాల పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరించి, డిజిటల్ అరెస్టు చూపించి ఏకంగా రూ. కోటి గుంజారు. దీనిపై 2024 అక్టోబర్లో ఫిర్యాదు అందగా, కేవలం నాలుగున్నర నెలల్లోనే పోలీసులు నిందితులు 13 మందిని పట్టుకోగలగడం విశేషం. వీరిలో తొమ్మిది మందిపై ఫోర్జరీ, కుట్ర తదితర కేసులు నమోదయ్యాయి. వీరికి యావజ్జీవ శిక్షవిధిస్తూ నడియా జిల్లా కల్యాణి కోర్టు తీర్పు చెప్పడం మైలురాయిగా నిలిచిపోయింది.
సోలార్ పథకం పై అవగాహన నకరికల్లు, ఆంధ్రప్రభ : విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో
దీపావళి అన్ని పండుగల కన్నా ప్రత్యేకమైనది. ఇది ఇల్లును, పల్లెను, పట్నాన్ని, నగరాలను దీపాలతో, రంగురంగుల వెలుగులతో నింపి వేస్తుంది. దీపావళి అంటే దీపాల వరుస. ఇది దేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల సాంప్రదాయాలతో, రకరకాల కథల నేపథ్యంతో జరుపుకోవడం ఆనవాయితీ. అయితే కొన్ని రకాల కథలు ప్రహసనంగా నిలిచిపోయాయి. మరి కొన్ని మరుగున పడిపోయాయి. మన దేశంలో దీపావళి జరుపుకోవడానికి వివిధ సాంప్రదాయాలకు వివిధ కథలు ఉన్నాయి. వివిధ మతాలకు ప్రత్యేకించి ఈ దేశంలో ఆవిర్భవించిన మతాలకు మతాలకు వివిధ నేపథ్యాలున్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం నరకాసురుడు అనే రాక్షసున్ని కృష్ణుడి భార్య హతమారిస్తే దానిని పండుగగా జరుపుకుంటున్నామని మనం వింటున్నాం. చదువుతున్నాం. మరి కొన్ని చోట్ల శ్రీరాముడు లంకలో రావణున్ని చంపి అయోధ్యకు చేరుకున్న రోజునే ఈ దీపావళి జరుపుకుంటున్నామని చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఇవి ప్రజల జీవితాల్లో ఎక్కడ మనకు కనిపించదు. రామాయణ, భారతాల్లో చదివాం కాబట్టి నమ్ముతున్నాం. అయితే మరొక సాంప్రదాయం ఇప్పటికే ప్రజలు అనుసరిస్తున్నారు. అది బౌద్ధ సాంప్రదాయం. గౌతమ బుద్ధునికి ఆయన జీవించిన కాలంలో ఎంతో మంది శిష్యులున్నారు. అందులో ఆనందుడు ఆయనకు నిత్యం అందుబాటులో ఉండేవాడు. అయితే ఆనందుని కన్నా చాలా ప్రతిభావంతంగా ఉన్న ఇద్దరు ఉన్నారు. వారి పేర్లు సారిపుత్త, మొగ్గల్లన్న (మౌద్గాలమన) వారిద్దరిని గౌతమ బుద్ధుడు ఎంతో ప్రేమతో చూసేవాడు. ఎందుకంటే వాళ్లిద్దరు ఆయన బోధనలను చాలా శీఘ్రంగా అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా, ఎంతో శక్తివంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేవారు. ఇందులో మొగ్గలన్న మరింత సమర్థవంతంగా వ్యవహరించేవాడు. అయితే వాళ్లిద్దరు బుద్ధుని కన్నా ఆరు నెలల ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆ సందర్భంలో గౌతమ బుద్ధుడు బుద్ధ సంఘంతో మాట్లాడుతూ, ‘సారిపుత్త, మొగ్గలన్నలేని సంఘం వెలితిగా కనపడుతున్నది. వాళ్లిద్దరూ సంఘానికి పునాదిలాంటి వాళ్లు. వాళ్లిద్దరినీ మనం భౌతికంగా కోల్పోవడం ఒకింత శక్తిని తీసేసినట్టుంది’ అంటూ తన మనోవేదనను ప్రకటించారు. ఇందులో సారిపుత్త సహజంగా మరణిస్తే, మొగ్గలన్నను ప్రత్యర్థులెవరో హత్య చేసినట్టు బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తున్నది. ఇక్కడ వీరిద్దరినీ స్మరించుకోవడం ఎందుకంటే దీపావళి సాంప్రదాయానికి మొగ్గలన్నకు సంబంధం ఉంది. ఒక రోజు బుద్ధుడు సంఘంతో సంభాషిస్తూ, మొగ్గలన్న లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాడు. తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్లు తమ తల్లిదండ్రుల జ్ఞాపకాలను వదిలించుకోలేకపోతున్నారని, వారి కోసం ఏదైనా చేబుతారా అంటే గౌతమ బుద్ధుడు “తల్లిదండ్రులను జీవించిన కాలంలో గౌరవించాలి. ఆదరించాలి. వాళ్లు మరణించిన తర్వాత వారి ప్రేమను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసంలో బౌద్ధ బిక్కులకు సంఘం దానం చేయాలి. పూలు, పండ్లు సమర్పించి, కొవ్వొత్తుల దీపాలు వెలిగించి వారిని గుర్తు చేసుకోవాలి. ఇది మరణించిన తల్లిదండ్రులను సద్గతిలోకి పంపినట్లు అవుతుంది” అని ముగించారు ఇది ఉల్లంభవ సూత్రంలో పేర్కొన్నారు. మన దేశంలోనే కాదు, చైనాలో, తైవాన్, కొరియా, జపాన్ లాంటి దేశాల్లో కూడా చాలా ప్రముఖంగా జరుపుకుంటారు. వెలుగు జ్ఞానానికి చిహ్నం. జీవితమంటే చీకటి కాదు వెలుగుల సమాహారంగా భావిస్తుంటారు. అయితే ఇప్పటికీ తెలంగాణలో పూర్వీకుల తల్లిదండ్రుల సమాధుల దగ్గర దీపాలు వెలిగించి, పూలు పండ్లు పెట్టి భక్తిశ్రద్ధలతో పూర్వీకులను గౌరవించుకోవడం ఆనవాయితీ. నేను మొదటగా దీనిని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో చూశాను. కాని దీని గురించి విచారిస్తూ పోతుంటే తెలంగాణ అంతటా విస్తరించి ఉందని తెలుస్తున్నది. అన్ని జిల్లాల్లో సమాధులున్న చోట ఇది మనకు కనిపిస్తున్నది. అయితే హిందూ సాంప్రదాయానికి ప్రతీకగా ఉన్న బ్రాహ్మణులలో ఈ సాంప్రదాయం లేదు. ఎందుకంటే బ్రాహ్మణులు భౌతిక కాయాన్ని దహనం చేస్తారు. ఖననం చేయరు. అందువల్ల ఇది హిందువులలో కనిపించదు. అంతేకాకుండా, ఆశ్వీయుజ మాసం బౌద్ధ సాంప్రదాయంలో మరొక ప్రత్యేకతను కలిగి ఉన్నది. ఎందుకంటే బౌద్ధులు వర్షాకాలం నాలుగు నెలలు వర్షావాసంలో ఉంటారు. అంటే నాలుగు నెలలు సంచారం చేయరు. ఏదో ఒక చోట ఉండి బోధనలు చేస్తూ, నేర్చుకుంటూ తమ కాలాన్ని గడుపుతారు. అయితే వర్షాహను నుంచి బయటకు వచ్చేది ఈ నెలలోనే. వారు ఈ నెలలో బయటకు వచ్చినప్పుడు ప్రజలు సంతోషంతో ప్రతి ఊరిలో దీపాలు వెలిగించి స్వాగతాలు పలికేవారు. అంతేకాకుండా, గౌతముడు జ్ఞానంపొంది బుద్ధుడిగా మారిన 18 ఏళ్ల తర్వాత తన తండ్రి, ఆ పట్టణ ప్రజలు ఆహ్వానిస్తే వెళ్లాడు. ప్రజలంతా సంతోషంతో ఊరంతా దీపాలతో అలంకరించి స్వాగతం పలికారు. అది అమావాస్య రోజు. చిమ్మ చీకటి నూనె దీపాలు తప్ప మరొక వెలుగు లేదు. అందుకే ప్రతి ఇంటా దీపాలు వెలిగించారు. ఆ తర్వాత ఇది ఒక సాంప్రదాయంగా మారింది. ప్రతి సంవత్సరం వర్షావాసం ముగించుకొని వస్తున్న బౌద్ధ బిక్కులకు ఇంటింటా స్వాగతం పలికారు. అంటే దీపావళిగా మారిందని కూడా బౌద్ధ సాహిత్యం చెబుతున్నది. జైన మతంలో కూడా దీపావళికి ఒక స్థానమున్నది. జైన తీర్థంకరులలో 24వ గురువు మహావీరుని మహా పరినిర్యాణం. ఇదే రోజున జరిగింది. ఆయన ప్రాణం మనకు వెలుగును అందించిందని, ఆయన దీపమై నిలిచాడని భావిస్తూ, జైనులు దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. దీపావళిని తమ వ్యాపార వాణిజ్యాలకు ఆరంభ దినంగా కూడా భావిస్తారు. బౌద్ధ, జైన బోధనలను వారి ఆచార సాంప్రదాయాలను కనుమరుగు చేయడానికి వారి వ్యతిరేకులు దీపావళిని జరుపుకోవడం మొదలైందని చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. సమత, మమత, కరుణ, సమానత్వం, సత్యం లాంటి ఆలోచనలను ఆచరణను అందించిన బౌద్ధం మనకు ధమ్మ దీపోత్సవాన్ని కూడా ఇచ్చింది. అందుకే దీపావళి బౌద్ధుల, జైనుల పండుగగా మొదలై ఇప్పుడు అందరూ జరుపుకుంటున్నారు. బౌద్ధులు సామాజిక బాధ్యత కలిగిన వాళ్లు. దీపావళి రోజున మన పూర్వీకులను బుద్ధుడు, మొగ్గలన్న, సారిపుత్త లాంటి ఎందరో మహానుభావులను, మన పూర్వీకులను వారి కృషిని, త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరమున్నది. మనుషులందరూ సమానమేననే భావనను అందించిన బౌద్ధాన్ని అందించిన ధమ్మ దీపావళిని ఒక పండుగగా జరుపుకుందాం. మల్లేపల్లి లక్ష్మయ్య దర్పణం
116 అడుగుల సాయి విగ్రహం #kakinada #saibaba #temple #AndhraPradesh #devotional #tourism
బిసి రిజర్వేషన్లకేదీ శాస్త్రీయ పరిష్కారం?
ఇటీవల సామాజిక న్యాయంపైన తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఇది బిసి రిజర్వేషన్లతో ముడిపడిన అంశంగా మారింది. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో స్పష్టం చేసింది. దీని కనుగుణంగా 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును అసెంబ్లీలో తీర్మానించి గవర్నర్ ఆమోదానికి పంపారు. ఇది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండడంతో ప్రత్యేకంగా జిఒ తీసుకువచ్చారు. ఈ జిఒను ఇటీవల కొందరు కోర్టులో సవాల్ చేశారు. 42 శాతం బిసి రిజర్వేషన్ జిఒపై హైకోర్టు స్టే విధించింది. మరోవైపు సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి సవాల్గా నిలువగా, మిగతా రాజకీయ పార్టీలు సైతం మొసలికన్నీరు కారుస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు అయినప్పటికీ బిసిలు ఇంకా తమకు దక్కాల్సిన న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉందని బిసి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు సంపూర్ణంగా దక్కడం లేదని, బిసిల జనాభాకు అనుగుణంగా వారికి రిజర్వేషన్లు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీంతో అగ్రకులాలు అదనపు హక్కుల పొందుతుండగా, బిసిలు హక్కులు కోల్పోతున్నారు. ఇంకా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ వివక్ష అనుభవిస్తున్నారు. మధ్యప్రదేశ్లో డా. బిఆర్ అంబేద్కర్ సోషల్ సైన్స్ యూనివర్శిటీ వారు 2023లో చేసిన ఒక అంతర్గత సర్వే ఒబిసిల కుల వివక్ష ఏ స్థాయిలో ఉన్నదో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల గ్రామీణ కుటుంబాలను సర్వే చేశారు. ఇందులో 5.578 ఒబిసిల కుటుంబాలు (దాదాపు 56%)ఇండ్లవద్ద నుంచి అగ్రకులాలు వెళ్తుంటే మంచంలో నుంచి లేచి నిలబడుతున్నారని పేర్కొన్నది. 3,763 కుటుంబాలతో కలిసి భోజనం చేసేందుకు ఇతర కులాల వాళ్లు అంగీకరించరని వివరించింది. కులాన్ని కారణంగా చూపుతూ 3,238 మంది ఒబిసిల ఇంటికి పూజలు చేసేందుకు పూజారులురాకుండా అస్పృశ్యత పాటిస్తున్నారని వివరించింది. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, రాజకీయ సాధికారతే దీనికి పరిష్కారం. ఈ క్రమంలో కులగణన, రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే 75 వసంతాలు పూర్తయినప్పటికీ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ప్రతి పార్టీకి కూడా వెనకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పినలో చిత్తశుద్ధి లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారు. ఇప్పుడు బిసి రిజర్వేషన్ అంశం కూడా దీనికి నిదర్శనమే. కోర్టులు బిసి రిజర్వేషన్పై ఆంక్షలు విధించడంతో తెలంగాణలో అక్టోబర్ 18న బిసి రిజర్వేషన్ సాధనకు బిసి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్యర్యంలో బంద్ ప్రకటించారు. దీనికి మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ బంద్కు మద్దతు పలికాయి. బిసిలకు రిజర్వేషన్ విషయంలో పార్టీల బంద్ ఎవరిపైన? అనేది ప్రశ్నార్థకంగా మారింది. బిసి ఐకాస బంద్కు బిఆర్ఎస్ పూర్తిగా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ బిసి రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల సాధనకై బంద్కు మద్దతిచ్చింది. బిసి ఐకాస కలిసి పని చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బిజెపి విమర్శిస్తోంది. ఇక చివరగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించినది.ఈ సందర్భంగా కాంగ్రెస్ బిసి రిజర్వేషన్లు బిజెపి బిఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం వల్ల్లే నిలిచిపోయిందని ఆరోపించింది. మొత్తంగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు పరస్పర విమర్శలతో బిసిల హక్కుల పేరుతో రాజకీయ ఆరోపణల యుద్ధరంగంగా మారింది. అసలు బిసి రిజర్వేషన్కు చట్టపరమైన పరిష్కారం చూపకుండానే బంద్కు మద్దతు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? పొలిటికల్ మైలేజ్ కోసం రాజకీయ పార్టీల ప్రయాణం సాగుతుందని అనిపిస్తుంది. చిత్తశుద్ధి కనబడడం లేదు. రిజర్వేషన్ విషయంలో భారత రాజ్యాంగంలో ఆంక్షలు విధించలేదు. కోర్టుల ద్వారా 50% పరిమితిని విధించారు. ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు తలుచుకుంటే ఈ పరిమితిని తొలగించలేమా? అసలు అడ్డుకునేది ఎవరు? న్యాయ స్థానాలా? న్యాయ బద్ధత లేని విధానాలా? ఆలోచన చేయాలి. 1980 సంవత్సరంలో మండల్ కమిషన్ ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. వీటి అమలుకై ఢిల్లీ బోట్స్ క్లబ్ ముందు 48 రోజుల పాటు ధర్నా చేశాడు. కాన్షీరాం బిసి రిజర్వేషన్ ఉద్యమం దేశంలో విప్లవానికి కారణమైనది. విప్లవం అంటే రేషన్ కార్డు, పెన్షన్ కోసం వంటి సంక్షేమ పథకాల కోసం ఉద్యమాలు, ధర్నాలు చేయడం కాదు. వేల సంవత్సరాల నుంచి దోపిడీ చేస్తున్న అగ్రకులాలు మాకు న్యాయం కావాలని రోడ్లపైకి రావడమే విప్లవం. ఇదీ భారతదేశ చరిత్రలో రెండు సందర్భాల్లో జరిగింది. మొదటిది రాజ్యాంగం అమలైన తరువాత, అగ్రకులాలు అదనపు హక్కులు కోల్పోతున్నామని ఎన్డి తివారి నాయకత్వంలో వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి రాజ్యాంగాన్ని కాల్చి ధర్నా చేశారు. రెండోది 1990లో మండల్ కమిషన్కు వ్యతిరేకంగా రోడ్లపైన ధర్నా చేస్తూ న్యాయాన్ని అభ్యర్థించారు. ఇలాంటి అనివార్యతను సృష్టించిన అధినాయకుడు కాన్షీరాం. ఇప్పుడు మనం కూడా ఆ సందర్భాలు సృష్టించి బిసి రిజర్వేషన్ల సాధనలో విప్లవం సృష్టించాలి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఉమ్మడి ఎపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు, బాలరాజుగౌడ్, బిసి, ఎస్సి, ఎస్టి జెఎసి రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజు నాయకత్వంలో బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటు అయ్యింది. ఈ సమితి బిసి కేటగిరీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, తమిళనాడు తరహాలో వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నది. ఇది బిసి రిజర్వేషన్లకు శాస్త్రీయ పరిష్కారంగా నిలుస్తున్నాయి. ఈ రిజర్వేషన్లను విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అమలు చేయాలని పటిష్టమైన ఉద్యమం చేపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఇతర బిసి సంఘాలు వీరికి తోడైతే బిసిలకు సామాజిక న్యాయం దక్కుతుంది. సంపతి రమేష్ మహారాజ్ 79895 79428
రాష్ట్రంలో 27న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మొత్తం 10,700 మంది సిబ్బందితో ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు.ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై చర్చించేందుకు మంత్రి శుక్రవారం విజయవాడలో రాష్ట్ర రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఆయన ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వ లక్ష్యాన్ని అందించేందుకు మిల్లర్ల […] The post రాష్ట్రంలో 27న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం appeared first on Visalaandhra .
సనాతన ధర్మానికి అపచారం పేరుతో ఈ మధ్య దేశంలో అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై షూ విసిరిన ఘటన సంచలనం అయింది. అలాంటి ఘటన జరగడం ప్రపంచంలో ఇదే మొదటి సారికాదు. 2008 లో బాగ్దాద్ లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యు బుష్ పై ఇరాకీ జర్నలిస్ట్ షూ విసిరిన ఘటన పెను సంచలనమే అయింది. అయితే రెండు వేర్వేరు సందర్భాలు. ప్రజాస్వామ్యం పేరుతో వ్యూహాత్మక చమురు క్షేత్రాలపై పట్టుకోసం ప్రాచీన నాగరికత దేశాల దోపిడీపై జరిగిన నిరసన అది. శక్తివంతమైన పశ్చిమ దేశాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించాయి. ఇరాక్ పాలకులు ఒకప్పుడు వారి అనుయాయులు ప్రస్తుతం టెర్రరిజం స్పాన్సర్ గా ముద్రపడ్డారు. ఏమైనా షూ విసిరిన ఘటన రెండు సందర్భాల్లోనూ సంచలనమే. భారతదేశంలో అణగారిన వర్గాలు పేద దళితులు, ఆదివాసీలకు, ముఖ్యంగా మహిళలకు చాలాకాలం వారు హద్దు మీరకుండా చూపిన ఆయుధం షూ (చెప్పులు). దశాబ్దాలపాటు వారిని అవమానించినా, వేధించినా ఎవరికీ పట్టలేదు. ఆ ఘటనలు నమోదు కాలేదు. అది వారి ఖర్మ, దురదృష్టంగా వదిలేశారు. అధికార స్థానంలో ఉన్న వారిపై షూ విసిరితే దేశవ్యాప్తంగా గగ్గోలు చెలరేగింది. తాజా సందర్భంలో సనాతన ధర్మ రక్షణ కోసం అదీ దళితునిపై ఓ న్యాయవాది షూ విసరడం అన్నది అర్థం లేనిది. భారత దేశంలో చాలా గ్రామాలలో ఇప్పటికీ అగ్రకులాలకు చెందినవారు దళితులైన వంటవారు వండిన మధ్యాహ్న భోజనం ముట్టడం లేదు. దళితులకు మధ్యాహ్న భోజనం వంట పని అప్పగించినందుకు నిరసనలు జరిగిన సందర్భాలు ఎన్నో. ఏ మతం ఈ వైఖరిని ఖండించలేదు. అలాగే సమర్థించలేదు. ఇటీవలి కాలంలో సనాతన ధర్మం కొత్త యుద్ధ నినాదంగా మారింది. సంప్రదాయం పేరుతో మహిళలను జీన్స్ ధరించరాదని ఆంక్షలు పెడుతున్నారు. పితృస్వామ్య వ్యవస్థ తాబేదారులుగా మారినవారు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ, తమ స్వేచ్ఛకు తామే అడ్డుపడుతున్నారు. సనాతన ధర్మ సంసృ్కతి అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ, జీన్స్ ధరించిన పురుషులే ఈ చర్యలకు దిగుతున్నారు. సనాతన ధర్మ పురుషులు జీన్స్ ధరించవచ్చని బోధించిందా.. మహిళలు జీన్స్ ధరిస్తే భయం ఎందుకు? స్వాతంత్య్ర పోరాటం జరిగిన రోజులలో బ్రిటీష్ పాలకులనుంచి స్వరాజ్యం కోసమే కాదు. కుల, మత, జాతి, వర్ణ వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం సాగింది. సంకుచిత భావాలు సమసిపోయాయి. ఇప్పుడు ఆ విశాల భావాలు, ఆశయాలు చెదరిపోయాయి. ప్రస్తుతం సామాజిక న్యాయం పేరుతో పోరాటం సాగుతున్నా గౌరవం, గుర్తింపు, రాజకీయపరమైన గుర్తింపు, హక్కుల కోసమే సాగుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది తన కులాన్ని గొప్పగా ప్రదర్శించుకోవడానికి తంటాలు పడుతున్నారు. వారి దృష్టిలో సామాజిక సమానత్వానికి విలువలేదు. వివక్ష చూపడం, ఆధిపత్యం తన హక్కుగా ప్రవర్తిస్తున్నారు. సామాజికంగా అణచివేతకు గురైనవారికి రాజ్యాంగాన్ని ఆశ్రయించడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది. దీంతో అగ్రకులాలు సనాతన ధర్మంపై దాడి జరుగుతోందని గగ్గోలు చేస్తున్నాయి. సనాతన ధర్మం అంటే ఏమిటి? వేదాలలో ధర్మపై ఖచ్చిత మైన, విస్తృతమైన నిర్వచనం ఏమీ లేదు. అయితే రుగ్వేదంలో (10/ 190/11) ధర్మంను సత్యంతో కూడినదిగా పేర్కొంది. బృహదారణ్యకోపనిషత్తు, ధర్మం అంటేనే సత్యం అని నిర్వచించింది. సత్యమే గొప్పది. సత్యం కన్నా మరేమీ లేదు. యోగ వాసిష్టం కూడా సత్యమే ధర్మంగా పేర్కొంటుంది. ధర్ అన్న వ్యుత్పత్తి నుంచి ధర్మ అన్న పదం పుట్టింది. ధర్ అంటే కలిగి ఉండునది, భరించునది, సత్య శోధకులు సత్యం అంటే ధర్మం కోసం చేసే కృషిగా పేర్కొన్నారు. అంటే ధర్మం ఎవరికీ వ్యతిరేకం కాదు. ధర్మం విషయంలో ఎవరూ గొప్పకాదు. అది అనుసరించే అందరూ గౌరవింపబడతారు. ధర్మానికి పునాది అహింస. అహింస ద్వారానే సత్యం మనుగడ సాగిస్తుంది. భిన్న పద్ధతులలో జనం వ్యవహరించేందుకు అహింస తగిన స్థైర్యాన్ని ఇస్తుంది. అయితే, తమ మతం లేదా వ్యవహారంపై ఎవరైతే అహంకారంతో వ్యవహరిస్తారో అక్కడ సత్యం తన గొప్పతనాన్ని కోల్పోతుంది. అందుకే అహింస ధర్మానికి పునాది అయింది. విష్ణు పురాణంలో (సంపుటి 1, అధ్యయనం 7)లో అహింసను సత్యంతో విడదీయరానిదిగా పేర్కొంది. అహింస అంటే హింసకు వ్యతిరేకమైనది. ఈ నేపథ్యంలో ధర్మం పేరుతో షూ విసరడం అహింసను కాలరాయడమే. మొత్తం వివాదానికి సనాతన ధర్మం కేంద్ర బిందువైంది. నిజానికి సనాతనం అంటే ఏమిటన్నదే ప్రశ్న? అథర్వణ వేదం (10/8,/201) చక్కటి నిర్వచనం ఇచ్చింది. సనాతనం అనేది శాశ్వతమైన, కాలాతీతమైన, ప్రారంభం కానీ, ముగింపు కానీ లేదని సూచిస్తుంది. పగలు, రాత్రి అనేది లేదనిగా, మార్పు లేనిదిగా పేర్కొంటుంది. అంటే సనాతనం సంప్రదాయాలకు అతీతమైనది. అంటే అది షూ విసరడానికి కానీ, జీన్స్ ధరించకుండా నిరోధించడానికి కానీ, అనుమతించదు. సనాతన అంటే ఉపనిషత్తులలో పేర్కొన్న నలుగురు సనత్ బంధువుల వంటిది. అహంకారానికి కానీ, అజ్ఞానానికి కానీ తావులేనిది. కాలానుగుణంగా పునర్నిర్వచించుకోగలిగినది. సనాతనం స్ఫూర్తిదాయకమైనది. శాస్త్రీయ విజ్ఞానం, సత్యాన్వేషణలో ఎదురయ్యే సవాళ్లను ప్రశ్నించేది. అలాంటి సనాతన ధర్మం పేరుతో షూ విసరడం దారుణాతి దారుణం. సత్యానికి తావులేని నాడు ధర్మం లేదు. సనాతనం కూడా లేనట్లే. అటువంటి దారుణాలకు పాల్పడడం ధర్మం కాదు. మీనాక్షి నటరాజన్ (తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్)
అరేబియా సముద్రంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలకు అవకాశం
ఏపీలో వర్షాలు పుంజుకోనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈ నెల 19 నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో, 20 నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు ఉద్ధృతమవుతాయని అంచనా వేసింది.కేరళ, కర్ణాటక తీరాలకు సమీపంలో అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం శనివారం నాటికి అల్పపీడనంగా మారనుంది. రాబోయే రెండు రోజుల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వాతావరణ […] The post అరేబియా సముద్రంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలకు అవకాశం appeared first on Visalaandhra .
Nara Lokesh : రేపటి నుంచి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ రేపటి నుంచి ఆస్ట్రేలియా లో పర్యటించనున్నారు
నెల రోజుల్లోనే ఒటిటిలోకి పవర్స్టార్ ‘ఒజి’
పవర్స్టార్ పవన్కళ్యాణ్ నటించి గ్యాంగ్స్టర్ యాక్షన్ చిత్రం ‘ఒజి’. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. అయితే నెల రోజులు గడవక ముందే ఈ సినిమా ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 23వ తేదీ నుంచి ‘ఒజి’ ప్రముఖ ఒటిటి సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఒటిటి సంస్థ పోస్టర్ని విడుదల చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఒక సినిమా విషయానికొస్తే.. సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ా నటించగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్గా నటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
సింగరాయకొండలో స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర
సింగరాయకొండలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండిమంత్రి
బాల్క సుమన్కు కేటీఆర్ శుభాకాంక్షలు
బాల్క సుమన్కు కేటీఆర్ శుభాకాంక్షలు హైదరాబాద్, ఆంధ్రప్రభ : తమ్ముడు.. జన్మదిన శుభాకాంక్షలు
మద్యం టెండర్లకు బంద్ ఎఫెక్ట్ బ్యాంకులు బంద్ కావడంతో టెండర్లు వేయలేకపోతున్న ఆశావహులు
ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లతో 50 శాతం దాటినప్పుడు బిసి రిజర్వేషన్లకు అడ్డంకి ఎందుకు: మంద
హైదరాబాద్: బిసి రిజర్వేషన్ల అంశం బలహీనవర్గాల డిమాండ్ అని మంద కృష్ణ మాదిగ తెలిపారు. బిసి రిజర్వేషన్లు తెలంగాణ పౌర సమాజం అంగీకరిస్తున్న అంశమని, తెలంగాణ సంపూర్ణ బంద్తో దేశానికి సంకేతం పంపినట్లుగా ఉందని పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్ల కోసం చేసిన ధర్నాలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రకులాల పేదల పేరుతో ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు చేశారని, ఇడబ్లుఎస్ రిజర్వేషన్లలో భాగంగా పది శాతం అమలు చేస్తున్నారని, అగ్రకులాల పేదల జనాభాకు మించి రిజర్వేషన్ల అమలు జరుగుతోందని మండిపడ్డారు. ఇడబ్లుఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడే 50 శాతం రిజర్వేషన్లు దాటిపోయాయని, 50 శాతం రిజర్వేషన్లు నిబంధన బిసి ప్రజలకు మాత్రమేనా? అని ప్రశ్నించారు. ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లతో 50 శాతం దాటినప్పుడు బిసి రిజర్వేషన్ల కోసం అడ్డంకి ఎందుకు అని అడిగారు. ఇడబ్లుఎస్ రిజర్వేషన్లకు రాని అడ్డుంకులు బిసి రిజర్వేషన్లకు ఎందుకు అని నిలదీశారు. రాష్ట్రానికి ఒకతీరుగా రిజర్వేషన్ల అంశం ఉండొద్దని, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అన్ని పార్టీలు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పండిందన్నారు. తమిళనాడులో అడ్డుకోనప్పుడు తెలంగాణలో అడ్డుకోవడం న్యాయమా? అని మంద కృష్ణ ప్రశ్నించారు.
Kerala : కేరళలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతుంది.
నల్లగొండలో కొనసాగుతున్న బంద్
నల్లగొండలో కొనసాగుతున్న బంద్ నల్లగొండ, ఆంధ్రప్రభ : రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు
బంద్తో ప్రధానికి కనువిప్పు కలగాలి: మహేశ్కుమార్ గౌడ్
హైదరాబాద్: బిసి రిజర్వేషన్ల విషయంలో ఇదే చిత్తశుద్ధితో కేంద్రం వరకు వెళ్దామని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అన్ని పార్టీలు అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బిసి ఐకాస నిర్వహించిన ధర్నాలో మహేశ్కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిసి సంఘాల బంద్కు అన్ని వర్గాల నుంచి మద్ధతు లభిస్తుందని అన్నారు. ఈ బంద్కు ఇతర పార్టీల మద్ధతును స్వాగతిస్తున్నామని తెలిపారు. బిసి రిజర్వేషన్లను తమిళనాడులో అడ్డుకోనప్పుడు తెలంగాణలో అడ్డుకోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్ల అంశం కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని ప్రజలకు తెలుసని అన్నారు. కేంద్రం తలుచుకుంటే ఒక్కరోజులో చట్టరూపం దాల్చుతుందని పేర్కొన్నారు. సంపూర్ణ బంద్ వల్ల ప్రధానికి కనువిప్పు కలుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా బిసి రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మునుగోడులో బంద్ ప్రశాంతం మునుగోడు, ఆంధ్రప్రభ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
సీబీఐ తనిఖీలు.. డీఐజీ అరెస్టు #cbi #PunjabDIG #cashseized #crimenews #cbiraid #Arrested
సంగారెడ్డిలో… అన్ని పార్టీల మద్దతుతో సంగారెడ్డి బంద్ సంపూర్ణంమద్దతు ప్రకటించిన డిసిసి అధ్యక్షురాలు
తెలంగాణలో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ
తెలంగాణలో మరో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెళ్లిపోయినా, ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్పంలోకి ప్రవేశించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత వర్షాలు పడే అవకాశం ఉంది.హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, ఈ నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ను ఆ జిల్లాలకు జారీ చేసింది.వర్షాలతో పాటు […] The post తెలంగాణలో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ appeared first on Visalaandhra .
భీమ్గల్లో బంద్ భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్
TDP : అన్ని సందేహాలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా? బాబు స్ట్రాటజీ వర్కవుట్ అయినట్లేనా?
కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ సభ సక్సెస్ కావడంతో చంద్రబాబు నాయుడు హ్యాపీ ఫీలవుతున్నారట.
బీసీలకు మద్దతు ప్రకటింకిన మంత్రి అడ్లూరి
బీసీలకు మద్దతు ప్రకటింకిన మంత్రి అడ్లూరి గొల్లపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర
ప్రాణాల మీదకు తెచ్చిన రీల్స్ పిచ్చి#TeluguPost #telugu #post #news
Kavitha : కవిత కుమారుడు వచ్చేశాడటగా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కుమారుడు ఆదిత్యను రాజకీయ ప్రవేశం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు
టపాసుల విక్రయదారులకు ఏఎస్పీ సూచన
టపాసుల విక్రయదారులకు ఏఎస్పీ సూచన అక్రమంగా టపాసులు విక్రయిస్తే 112, లేదా 100కు
బంగారం ధర తగ్గిందోచ్ (ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్) : హమ్మయ్య దంతేరాస్ రోజున
రామ్ గోపాల్ వర్మపై రాజమండ్రిలో కేసు నమోదు
వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను ఆయనతో పాటు సదరు కార్యక్రమ యాంకర్పై కూడా రాజమండ్రిలో కేసు నమోదైంది. హిందూ ఇతిహాసాలు, దేవతలు, భారత సైన్యంతో పాటు ఆంధ్రులను కించపరిచేలా వర్మ మాట్లాడారని ఆరోపిస్తూ ఈ ఫిర్యాదు దాఖలైంది.వివరాల్లోకి వెళితే, రాజమండ్రికి చెందిన న్యాయవాది, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా […] The post రామ్ గోపాల్ వర్మపై రాజమండ్రిలో కేసు నమోదు appeared first on Visalaandhra .
హైదరాబాద్లో హరియాణా పంజాబ్ ల దున్నల సందడి #hyderabad #sadarfestival #bulls #haryana #punjab
బిసి బిల్లు బిజెపి చేతిలో ఉంది: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బిసిల బిల్లుకు మద్దతు తెలపడంతో పాటు పాస్ చేసుకోవడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడంతో తదుపరి చర్యలు తీసుకోపోవడంతో బిసి బిల్లు అమలులో జాప్యం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించామని, శాసన సభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం పొందలేదని, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందన్నారు. న్యాయ స్థానాల్లో పోరాటాలు చేస్తున్నామని, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నామన్నారు. తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పడి మాదిగ దండోరా, మాల మహానాడు, బిసి సంఘాలు ఐక్య సమితిగా బంద్ కి పిలునిచ్చినందుకు వారికి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. బిసి రిజర్వేషన్ల కోసం తెలంగా బంద్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రవాణా శాఖ మంత్రిగా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా బంద్ చేసుకోవడం జరిగిందని పొన్నం వివరించారు. ప్రజలకు అసౌకర్యం అయినప్పటికీ బంద్ ప్రభావం ప్రభుత్వాలపై పడడంలేదని, ముఖ్యంగా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు, బిజెపి ఎంపిలంత తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు కేంద్రానికి చెప్పే ప్రయత్నాలు చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా బిజెపి నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో బిసి బిల్లు కోసం కాంగ్రెస్ బాధ్యత నిర్వహించిందని, కేంద్రంలో బిజెపిపై ఉందన్నారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ న్యాయ స్థానంలో అయినా తాము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. బిసి రిజర్వేషన్ల బంద్ లో పాల్గొన్న ప్రజలకు పొన్నం అభినందనలు తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో మన పోరాటం కొనసాగాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి జెఎసి పోరాటాలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు రాక ఇబ్బందులు పడుతున్నారని పొన్నం మండిపడ్డారు.
కలెక్టర్ బస ఉదయం యోగాసనంఅనంతరం అల్పాహారంయోగక్షేమాలపై ఆరా శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్ట్ విడుదల
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్ జాబ్ చార్ట్ అమలు పర్యవేక్షణ బాధ్యత జిల్లా కలెక్టర్లకువిధులు నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకే సమయంలో పలు శాఖలు వేర్వేరు పనులు అప్పగించడం వల్ల సిబ్బందికి కలుగుతున్న ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ప్రభుత్వం నిర్దిష్టమైన జాబ్ చార్ట్ను విడుదల చేసింది. ఏ శాఖ అయినా ఈ ఆదేశాలకు విరుద్ధంగా […] The post గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్ట్ విడుదల appeared first on Visalaandhra .
Telangana Bandh Over BC Reservation Demand Brings Public Transport to a Standstill
A statewide bandh called by BC organizations demanding 42% reservations brought Telangana to a standstill, with public transport heavily affected. In Hyderabad, RTC buses remained confined to depots, especially at Uppal, Chengicherla, and Kukatpally, where nearly 125 buses were stopped. Roads that are usually bustling with traffic appeared empty, as BC leaders blocked buses and […] The post Telangana Bandh Over BC Reservation Demand Brings Public Transport to a Standstill appeared first on Telugu360 .
ఉమ్మడి వరంగల్లో మూత పడిన దుకాణాలు
ఉమ్మడి వరంగల్లో మూత పడిన దుకాణాలు ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: బీసీలకు 42
Andhra Pradesh : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. పండగకు ముందే నోరు తీపి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు దీపావళికి తీపి కబురు అందించింది
బీసీ బంద్ ప్రభావం నడవని బస్సులు ఇబ్బందులు పడిన ప్రయాణికులుఉట్నూర్లో కొనసాగుతున్న బంద్
బీసీ బంద్కు మద్దతుగా కవిత మానవహారం
ఆటోలో వచ్చి ఖైరతాబాద్ చౌరస్తాలో ధర్నాబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కావాలని డిమాండ్ బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న బంద్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత… కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీల హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతూ అవే పార్టీలు బంద్లో పాల్గొనడం హంతకులే నివాళులు అర్పించినట్లు ఉందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.ఖైరతాబాద్ చౌరస్తాలో బీసీ బంద్కు మద్దతుగా ఏర్పాటు చేసిన మానవహారంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కవిత తన జాగృతి కార్యకర్తలు, […] The post బీసీ బంద్కు మద్దతుగా కవిత మానవహారం appeared first on Visalaandhra .
ఊట్కూర్లో బైక్ ర్యాలీ ఊట్కూర్, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ) : బీసీ రిజర్వేషన్
Dude Turning Out To Be A True Diwali Hit
While several Diwali releases have struggled to make an impact, Pradeep Ranganathan’s latest release, Dude, has raced ahead as the festive frontrunner, impressing both critics and audiences with a stellar opening. Helmed by debutant Keerthiswaran and produced by Mythri Movie Makers, Dude made a remarkable impression with 235.64K tickets sold on BookMyShow on Day 1, […] The post Dude Turning Out To Be A True Diwali Hit appeared first on Telugu360 .
భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. శనివారం బులియన్ మార్కెట్లో పసిడి, వెండి రేట్లు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా ఇటీవల రికార్డులు సృష్టిస్తూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన వెండి ధర, అనూహ్యంగా ఒక్కరోజే కిలోపై ఏకంగా రూ. 13,000 తగ్గడం గమనార్హం. ఈ పరిణామంతో పండగ సీజన్లో కొనుగోళ్లు చేయాలనుకుంటున్న వారికి పెద్ద ఊరట లభించింది. హైదరాబాద్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఇలా..హైదరాబాద్ మార్కెట్లో శనివారం నాటి […] The post భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు appeared first on Visalaandhra .
నిజాయితీ లేకపోవడంతో రిజర్వేషన్లు అమలు కావడంలేదు: ఈటెల
హైదరాబాద్: బిసి రిజర్వేషన్లు అమలు కావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పారని బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ తెలిపారు. అన్నీ తెలిసి కూడా బిసిలను సిఎం రేవంత్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 42% రిజర్వేషన్ల కోసం జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఎంపి ఈటెల రాజేందర్, బిజెపి శ్రేణులతో కలిసి తెలంగాణ బంద్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. బిసిలు 52 శాతం ఉంటే 42 శాతమని కాకి లెక్కలు చెబుతున్నారని బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. తాను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తాను మాట్లాడిన మాటలపై ఎక్కడైన చర్చకు సిద్ధంగా ఉన్నామని, బిసిలు యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో ఉన్నారన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబాలకే అధికారం ఉంటుందని ఈటెల ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా ఒక్క బిసి సిఎం కాలేకపోయారని, బిజెపి నిజాయితీ ఎవరూ శంకించలేదని, స్థానిక సంస్థల్లోనే కాదు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రం ఒక్కటే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బిసి కమిషన్ వేసినా నిజాయితీ లేకపోవడంతో అమలు కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బిసి పేరుతో కమిషన్లు వేసినా నిజాయితీ లేకపోవడంతో అమలు కావడంలేదన్నారు.
భావదేవునికి ప్రత్యేక పూజలు బాపట్ల టౌన్, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ ) :
తండ్రి స్టార్ కోచ్, కుమారుడు సైబర్ స్కామ్ మాస్టర్! #RishiArothe #cybercrime #hyderabadpolice
Telangana : మరో తెలంగాణ ఉద్యమం తప్పదు : కవిత
బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం నిర్వహించారు.
నల్లగొండలో బంద్ ప్రశాంతం తెరుచుకోని వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు గట్టుప్పల, అక్టోబర్ 18
యువ క్రికెటర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగిసింది: రషీద్ ఖాన్
కాబూల్: పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లతో పాటు మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. ఆప్ఘానిస్థాన్ లోని ప్రావిన్స్లో పాకిస్తాన్ వైమానిక దాడి చేయడంతో ఎనిమిది మంది చనిపోయారు. పాక్, శ్రీలంకతో ట్రైసిరీస్ ఆడేందుకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మృతి చెందిన క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్గా ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. విమానంలో క్రికెటర్లు ఉర్ఘున్ నుంచి షారానా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై ఆప్ఘానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ వైమానిక దాడిలో కన్నుమూసిన పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆఫ్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్ తెలిపారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని, పాకిస్థాన్ చేసిన దాడి అత్యంత హేయమైన, అనాగరిక చర్య అని మండిపడ్డారు. ఈ దాడిలో మహిళలు, పిల్లలు, క్రికెటర్లు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయమన్నారు. యువ క్రికెటర్ల లక్ష్యం నెరవేరకుండా జీవితం ముగిసిందని బాధను వ్యక్తం చేశారు. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. పాకిస్థాన్తో తలపడబోయే ట్రై సిరీస్తో తాము పాల్గొనబోమని వెల్లడించారు. ఆట కంటే దేశ సమగ్రత ముఖ్యమని రషీద్ ఖాన్ చెప్పారు.
తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం #telugu #post #news
కొనసాగుతున్న బంద్ తెరుచుకోని వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు మహబూబ్ నగర్, అక్టోబర్ (ఆంధ్రప్రభ)
వేములవాడలో బంద్ ప్రశాంతం బీసీల ఆందోళనలో పాల్గొన్న ప్రభుత్వ విప్ శ్రీనివాస్ వేములవాడ,
పంజాబ్లో గరీబ్రథ్ రైలులో షాట్ సర్క్యూట్ కారణంగా కోచ్ నెం.19లో భారీగా మంటలు చెలరేగాయి
దుర్గమ్మకు కానుకగా రూ.2 కోట్ల ఆభరణాలు#vijayawada #kanakadurgatemple #templedonation #telugupost
Video : Mood Of Telangana : Chennur Election Survey 2025
The post Video : Mood Of Telangana : Chennur Election Survey 2025 appeared first on Telugu360 .
బీసీ బంద్ ఎఫెక్ట్ (ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్) : కాకతీయ విశ్వవిద్యాలయం (KakatiyaUniversity)లో
ఆ రెండు పార్టీలు బిసిలను మోసం చేస్తున్నాయి: కవిత
హైదరాబాద్: పదేపదే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు బిసిలను మోసం చేస్తున్నాయని ఎంఎల్ సి కవిత మండిపడ్డారు. రాజకీయ పార్టీలు చేసిన మోసాలతో బిసిలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా మోసాలకి అడ్డుకట్ట వేయాలని సూచించారు. బిసిల బంద్ కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్మించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆటోలతో ర్యాలీగా బయల్దేరారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. ఆర్ టిసి బస్సులు హైదరాబాద్లో డిపోలకే పరిమితమయ్యాయి. రాజేంద్రనగర్, దిల్సుఖ్నగర్, బండ్లగూడ, హయత్నగర్, బర్కత్పురా, ఇబ్రహీంపట్నం సహా ఆర్టీసీ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఎంజిబిఎస్ ముందు బిసి సంఘాల నేతల ఆందోళన చేపట్టారు. జూబ్లీ బస్ స్టేషన్లో బిసి సంఘాల బైఠాయించారు. జెబిఎస్ దగ్గర బంద్లో ఎంపి ఈటెల రాజేందర్, బిజెపి నేతలు పాల్గొన్నారు. బిసి బంద్తో కాకతీయ విశ్వవిద్యాలయంలో పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు.
Big Target for Rashmika’s Bollywood Outing
Rashmika Mandanna has big hopes on her upcoming Bollywood film Thamma. The film is slated for October 21st release in theatres and Ayushmann Khurrana is the lead actor in this horror comedy. Maddock Films has delivered some of the biggest hits in Hindi in the recent years and they are backing Thamma. After blockbusters like […] The post Big Target for Rashmika’s Bollywood Outing appeared first on Telugu360 .
Telangana : తెలంగాణలో కొనసాగుతున్న బంద్
తెలంగాణలో జరుగుతున్న బంద్ విజయవంతంగా కొనసాగుతుంది
AI టాయిలెట్ల కొత్త యుగం” #technology #ai #healthtech #japan #usa #medicalinnovation
Rain Alert : నైరుతి పోయింది.. ఈశాన్యం వచ్చింది... వానలు మామూలే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
Did Jack Impact Telusu Kada Openings?
Siddhu Jonnalagadda emerged as a star after the franchise of Tillu was released. The actor’s last film Jack ended up as a huge embarrassment for the actor and he was focused on Telusu Kada. The film struggled to generate the needed buzz and it opened on a poor note. For an actor like Siddhu Jonnalagadda, […] The post Did Jack Impact Telusu Kada Openings? appeared first on Telugu360 .
Telangana : మూడు రోజుల వరస సెలవులు
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. వరసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి
Dhanteras : ధన్ తెరాస్ ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు ఏం చేయాలంటే?
దీపావళి పండగ నాడు ధన్ తెరాస్ జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది.
చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిపై టిడిపి శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనాన్ని టిడిపి వర్గీయులు అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళ్తుండగా తమ వాహనాలపై టిడిపి శ్రేణులు దాడికి పాల్పడ్డారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన మరది వైసిపి ఎంపిపి వెంకట రామిరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారన్నారు. వైసిపి నాయకులు గ్రామంలోకి అడుగు పెట్టొద్దని టిడిపి కార్యకర్తలు కెఇ చంద్ర, శ్రీధర్ గౌడ్, నక్క రాజు, మరి కొంతమంది రాళ్లతో, కర్రలతో దాడికి పాల్పడ్డారు. మహిళా నాయకురాలు అని చూడకుండా దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి గుండాలు గ్రామంలో రెచ్చిపోతూ భయబ్రాంతులకు గురిచేశారని శ్రీదేవి దుయ్యబట్టారు. తమపై దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు బయటకు రావాలంటే ప్రాణభయంతో వణికిపోతున్నారన్నారు.
ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెల
ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెల మంథని ఆంధ్రప్రభ బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో
Gold Price Today : రికార్డులను బ్రేక్ చేస్తున్న గోల్డ్.. షేక్ చేస్తున్న సిల్వర్
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది.
రాంగోపాల్ వర్మ, యాంకర్ స్వప్నలపై కేసు నమోదు
అమరావతి: దర్శకుడు రాంగోపాల్ వర్మ, యాంకర్ స్వప్నలపై కేసు నమోదైంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లను, ఇండియన్ ఆర్మీని, ఆంధ్రులను దూషించినట్లు ఆరోపణల పేరుతో ఫిర్యాదు చేశారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో దూషించినట్లు వీడియోలు ఉన్నాయని మేడా శ్రీనివాస్ తెలిపారు. రాంగోపాల్ వర్మతో పాటు యాంకర్ స్వప్నపై చర్యలు తీసుకోవాలని పోలీసులను శ్రీనివాస్ కోరారు. ఇద్దరుపై బిఎన్ఎస్ యాక్టు కింద 487/2025, యు/ఎష్ 196 (1), 197(1) 353, 354,299 ఆర్/డబ్యు (3) పోలీసులు కేసు నమోదు చేశారు.
కదలని ఆర్టీసీ బస్సుల చక్రాలు నర్సంపేట, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ): బీసీ రిజర్వేషన్
ఉగ్రవాదుల దాడి - ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి
పాకిస్తాన్ – శ్రీలంకలతో వచ్చే నెల జరగాల్సిన దేశీయ క్రికెట్ సిరీస్ నుంచి అఫ్ఘానిస్తాన్ వైదొలిగింది
K-Ramp Review – Humor Sparks in Second Half, but Story Runs Out of Fuel
K-Ramp Movie Review Telugu360 Rating: 2/5 Story: Kiran Abbavaram plays Kumar, a spoiled brat who performs miserably in EAMCET. His wealthy father pays a hefty donation to get him admitted into an engineering college in Kerala, where he goes along with his friend. There, Joy Mercy (Yukti) saves him from an accident, and their friendship […] The post K-Ramp Review – Humor Sparks in Second Half, but Story Runs Out of Fuel appeared first on Telugu360 .
Tirumala : తిరుమలలో నేటి రద్దీ ఎలా ఉందో తెలుసా?
తిరుమలలో భక్తుల భక్తుల రద్దీ కొనసాగుతుంది.
Exclusive: Prabhas lines up 7 New Films
Prabhas is the biggest and busiest pan-Indian actor of the country. He is juggling between the sets of some of the biggest projects and he has a heap of films lined up. The actor is shooting for Maruthi’s Raja Saab and the film releases in January 2026. He is also shooting for Hanu Raghavapudi’s Fauji […] The post Exclusive: Prabhas lines up 7 New Films appeared first on Telugu360 .
Bigg Boss Telugu 9: Dual Captaincy, and Fun Chaos Inside the House
This week’s Bigg Boss Telugu 9 episode was a rollercoaster — full of intensity, emotion, and laughter. The continuation of the captaincy task brought unexpected twists, emotional breakdowns, and light-hearted bonding moments, leaving audiences both entertained and surprised. Captaincy Task: Two Captains, One Tough Battle Bigg Boss announced a major twist — the house would […] The post Bigg Boss Telugu 9: Dual Captaincy, and Fun Chaos Inside the House appeared first on Telugu360 .
Andhra Pradesh : నేడు ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ
నేడు ఉద్యోగ సంఘ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది
Telangana : బీసీ రిజర్వేషన్ల కోసం.. నేడు రాష్ట్ర బంద్
బీసీ రిజర్వేషన్ల కోసం నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది
పాక్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లు మృతి
కాబూల్: పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి చెందారు. పాక్టికా ప్రావిన్స్లో పాకిస్తాన్ వైమానిక దాడి జరిపింది. ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ల సహా 8 మంది చనిపోయారు. పాక్, శ్రీలంకతో ట్రైసిరీస్ ఆడేందుకువెళ్తుండగా ఈ దాడి జరిగింది. మృతి చెందిన క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్గా ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. విమానంలో క్రికెటర్లు ఉర్ఘున్ నుంచి షారానా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గత వారం రోజుల నుంచి పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో రెండు దేశాల సైనికులు కాల్పులు జరుపుకోవడంతో వందల మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో సైనికులు కూడా ఉన్నారు.
Andhra Pradesh : అనకాపల్లిలో మద్యం దుకాణాలు మూసివేత
మద్యం వ్యాపారం చేయలేమని యజమానులు అనకాపల్లి జిల్లాలో నిరసన తెలియజేశారు
హైదరాబాద్: తెలంగాణలో బిసి సంఘాల బంద్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ టిసి డిపోల ముందు బిసి సంఘాలు ఆందోళన చేపట్టాయి. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఆర్ టిసి బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. బిసి సంఘాలు, రాజకీయ పార్టీల పిలుపు మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలన్నీ మూసివేయాలని నిర్ణయించాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సైతం స్వచ్ఛందగా బంద్కు మద్దతు ప్రకటించి పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదిలావుండగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, వామపక్షాలతో పాటు తెలంగాణ ఉద్యోగుల జెఎసి బంద్ లో పాల్గొన్నాయి.
Hyderabad : హైదరాబాద్ - గోరఖ్ పుర్ రైలు రద్దు
హైదరాబాద్ - గోరఖ్ పుర్ మధ్య నడిచే రైలు రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు
Telangana Bandh : నేడు తెలంగాణ బంద్
తెలంగాణ వ్యాప్తంగా నేడు బంద్ ప్రారంభమయింది
ఛత్తీస్గఢ్లోని జగదల్పూరులో శుక్రవారం అత్యధిక సంఖ్యలో అజ్ఞాత నక్సలైట్లు లొంగిపొయారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఎదుట ఆయుధాలతో పాటు ఆత్మసమర్పణం చేసుకున్న వారిలో పలువురు కీలక సీనియర్ మావోయిస్టులు ఉన్నారు. ఇప్పుడు సరెండర్ అయిన వారిలో పార్టీ సీనియర్ సెంట్రల్ కమిటీ సభ్యులు తక్కెళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ అలియాస్ సతీష్ కూడా ఉన్నారు. దాదాపు కోటి రూపాయలకు పైగా రివార్డు ప్రకటితం అయి ఉన్న ఆశన్నతో పాటు మొత్తం 210 మంది వివిధ కేడర్స్కు చెందిన నక్సల్స్ ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారుల ముందు లొంగిపోయి, జనజీవన స్రవంతిలోకి తాము వస్తున్నట్లు ప్రకటించడం సంచలనాత్మకం , ఇదే దశలో మావోయిస్టుల ప్రాబల్య ఉద్యమం బీటలు స, తీవ్రస్థాయి బలహీనతకు అద్దం పటింది. అడవుల నుంచి వీరి తిరోగమనం సంకేతం అయింది. ఇప్పుడు లొంగిపోయిన వారిలో 110 మంది మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారు. 98 మంది పురుషులు వరుసగా వారి వారి పేర్లను అధికారులు పిలుస్తూ ఉండగా వచ్చి ఆయుధాలు వదిలి సరెండర్ అయ్యారు. మొత్తం 153 ఆయుధాలు వదిలిపెట్టారు. వీటిలో 19 ఏకె 47 రైఫిల్స్, 17 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 23 ఇన్సాస్లు, 303 రైఫిల్స్ 17 ఎన్ఎల్ఆర్ రైఫిళ్లు, 41 బోర్ షాట్గన్లు, పిస్టల్స్, నాలుగు కార్బైన్లు ఉన్నాయి ఇప్పటి వరకూ రాష్ట్రంలో నక్సల్స్ చరిత్రలో ఇది సామూహిక సరెండర్ ఘట్టం అయిందని అధికారులు తెలిపారు. కాగా ఈ శుక్రవారం ఓ చారిత్రక దినం అని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ స్పందించారు. ఇప్పటి సరెండర్లతో రాష్ట్రంలో గత మూడురోజులలో లొంగిపోయిన నక్సలైట్ల సంఖ్య 238కి చేరుకుంది. బుధవారం వేర్వేరు చోట్ల 28 మంది వరకూ లొంగిపోయారు. ఇప్పటి లొంగుబాట బస్తర్ ప్రాంతానికే కాకుండా యావత్తూ ఛత్తీస్గఢ్కు తద్వారా మొత్తం దేశానికి ఒక కీలక మైలురాయి అవుతుందని తెలిపారు. బస్తర్ జిల్లా ప్రధాన కేంద్రపట్టణం జగదల్పూరులో నక్సల్స్ తమ ఆయుధాలను పోలీసులు, పారామిలిటరీ దళాల అధికారులకు అప్పగించారు. సరెండర్ ప్రక్రియ వేదిక వెనుక బ్యానర్లో అడవిబాట నుంచి జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులకు స్వాగతం అని స్థానిక గిరిజన భాషలో రాసి ఉంచారు. దేశంలో వామపక్ష తీవ్రవాదం పూర్తి స్థాయి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో సాగిస్తున్న పోరులో ఈ సరెండర్ ముఖ్య అధ్యాయం అయింది. లొంగిపోయిన నక్సల్స్ బృందంతో స్థానిక గిరిజనుల తెగల నేతలు, కొండదేవతల పూజారులు కూడా నిలబడి ఫోటోలు దిగారు. వారికి గులాబీలు అందించారు. నూతన ఆరంభానికి, శాంతియుత జీవిత ఆకాంక్షలతో స్వాగతం పలికారు. ఆ తరువాత సీనియర్ పోలీసు అధికారులు , పారామిలిటరీ అధికారులతో కలిసి గిరిజన తెగలతో కలిసి మరో ఫోటో దిగారు. నక్సలైట్ల లొంగుబాటు కోసం బస్తర్ పోలీసు అధికార యంత్రాంగం చాలారోజుల క్రితమే పునరావాస కార్యక్రమం పునామార్గెంను చేపట్టింది. ఈ పథకం పరిధిలో లొంగిన వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలకు హామీ ఇచ్చారు. లొంగుబాట్ల తరువాత సిఎం విష్ణుదేవ్ ఇక్కడనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ లొంగిపోయిన కేడర్కు సాధారణ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానం అని ప్రకటించారు. ఇంతకాలం తప్పుడు బాట పట్టిన వీరు సమాజానికి దూరం అయ్యారని, ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి రావడం సంతోషకరం అని తెలిపారు.రాజ్యాంగం పట్ల విధేయతను, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అవలంభించేందుకు ముందుకు వచ్చారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునారావాస, లొంగుబాట్ల పథకంలో లోంగిన వారికి పలు విధాలుగా మేలు జరుగుతుంది. వారికి ఆర్థిక సాయం ఉంటుంది. భూమి కల్పిస్తారు. నూతన పారిశ్రామిక విధానం పరిధిలో చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఉపాది కల్పన ఏర్పాట్లు కూడా జరుగుతాయని, సరెండర్ అయిన వారికి తమ నుంచి పూర్తి స్థాయి ఆసరా ఉంటుందని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో మరింతగా నక్సల్స్ దళాలు సరెండర్ అవుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. లొంగిపోయిన సీనియర్ నేతల పేర్లు ఇప్పుడు లొంగిపోయిన నక్సల్స్లో అగ్రస్థాయి నక్సల్స్లో ఆశన్నతో పాటు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ (డికెఎస్జడ్సి) సభ్యులు భాస్కర్ అలియాస్ రాజ్మన్ మండవి, రణిత , రాజు సలాం, ధనూ వెట్టి అలియాస్ సంతూ ఉన్నారు. ఇక ఈ సీనియర్ల జాబితాలోనే ప్రాంతీయ కమిటీ సభ్యులు రతన్ ఎలామ్ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పుడు లొంగిపోయిన నక్సల్స్ బృందం తమకు తాముగా 11 బారెల్ గ్రెనెడ్ లాంఛర్లను కూడా అప్పగించారు. దేశంలో నక్సలిజం సమస్యను పూర్తి స్థాయిలో 2026 మార్చి 31 నాటికి నిర్మూలించి తీరుతామని హోం మంత్రి అమిత్ షా ఇటీవలి కాలంలో పదేపదే చెపుతూ వస్తున్నారు.ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో ఇటీవలే పెద్ద ఎత్తున నక్సల్స్ అగ్రనాయకులు కేడర్తో పాటు సరెండర్ అవుతున్నారు. రెండు రోజుల క్రితం అత్యంత కీలక నక్సల్స్ నేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, అలియాస్ భూపతి 60 మందికి పైగా నక్సల్స్తో కలిసి మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్ ఎదుట గడ్చిరోలిలో లొంగుబాట పట్టారు. ఇప్పుడు రెండు మూడు రోజుల తీవ్ర ఉత్కంఠత నడుమ ఇప్పుడు ఆశన్న ఇతర కీలక కేడర్తో కలిసి సరెండర్కు దిగారు. బస్తర్ దాదాపుగా నక్సల్స్ విముక్తం అయిందని, ఇక మిగిలిన నక్సల్స్ ఎవరైనా ఉంటే లొంగిపోవల్సి ఉంటుంది. లేదా వారు ఇప్పటికీ గన్తోనే తిరుగుతూ ఉంటే తమ భద్రతా బలగాల తూటాలకు బలి కావడం తథ్యమని అమిత్ షా చెపుతూ తీవ్రస్థాయి హెచ్చరికలకు దిగుతూ వస్తున్న దశలోనే ఇప్పుడు ముందుగా మహారాష్ట్ర సిఎం ఎదుట అగ్రస్థాయి నేత, ఛత్తీస్గఢ్ సిఎం ముందు మరో టాప్ లీడర్ సరెండర్ కావడం కేంద్ర హోం శాఖ కీలక వ్యూహాత్మక కార్యాచరణ, ప్రత్యేకించి మావోయిస్టుల్లో తీవ్రస్థాయి భయాందోళనల దిశలో ముందుకు సాగే ప్రక్రియ అని వెల్లడైంది. లొంగుబాట ఆశన్నది తెలంగాణలోని ములుగు ప్రాంతం వరంగల్ ఫాతిమా కాలేజీ, ఆర్ఎస్యూ పూర్వరంగం నక్సల్స్ బలగం తరఫున పలు భీకర దాడులకు వ్యూహరచన సాగించిన ఇప్పుడు లొంగిపోయిన ఆశన్న స్వస్థలం తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. దాదాపు 60 సంవత్సరాల వయస్సున్న ఆశన్న 40 ఏండ్ల క్రితం అంటే తన 20 ఏండ్ల వయస్సులోనే పీపుల్స్ వార్ ఉద్యమం వైపు ఆకర్షితులు అయి అడవిబాట పట్టారు. తక్కెళ్లపల్లి వాసుదేవరావు అనబడే ఈ ఆశన్న విద్యాభ్యాసం ఎక్కువగా లక్ష్మిదేవిపేట ప్రభుత్వ స్కూల్లో సాగింది. తరువాత హన్మకొండ కాజీపేటలోని ఫాతిమా స్కూల్లో ఆ తరువాత వరంగల్లో కాకతీయ వర్శిటీలో చదివారు. ఎక్కువగా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కు నాయకత్వం వహించారు. తరువాతి క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. వరంగల్ కాలేజీల్లోనే ఆయనపై ఎక్కువగా విప్లవోద్యమ ప్రభావం పడింది, ఓ దశలో దండకారణ్య జోనల్ కార్యదర్శిగా రూపేశ్ పేరిట వ్యవహరించినప్పుడు ఆయన నిర్వహించిన దాడులు సంచలనాత్మకం అయ్యాయి. 999లో ఐపిఎస్ ఉమేశ్ చంద్ర , మరుసటి సంవత్సరం హోం మంత్రి మాధవరెడ్డి హత్య ఘటనల ప్రధాన వ్యూహకర్తగా , ప్రత్యేకించి జిలెటిన్ల ద్వారా పేలుళ్లకు దిగడంతో మెరుపుదాడుల కర్తగా పేరొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అంతకు ముందు నేదురుమల్లి జనార్దన రెడ్డిలపై భారీ స్థాయి పోలీసు బందోబస్తు , అత్యంత నిశిత నిఘా నడుమ కూడా బాంబులు పేల్చి హత్యాయత్నం జరిగిన ఘటనల్లో కూడా ఆశన్నదే కీలక పాత్ర అని నిర్థారణ అయింది. దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఆశన్న కోసం భద్రతాబలగాలు గాలిస్తూ ఉన్నాయి. ఇటివలికాలంలో మావోయిస్టుల్లో తనకు పైన ఉండే అగ్రస్థాయి నాయకుల వైఖరితో విసిగి వేసారి ఆయన సరెండర్కు నిర్ణయించుకున్నట్లు, ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో అణచివేతలు, పైగా తనకు కొన్ని వర్గాల నుంచి అందిన లొంగుబాటు దౌత్యం దశలోనే ఆయన ఇప్పుడు అదునుచూసుకుని ఇతరులతో పాటు లొంగుబాటుకు దిగినట్లు వెల్లడైంది.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర స్థానిక సం స్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామాలు చో టుచేసుకుంటున్నాయి. తాజాగా హైకోర్టులో మ రో పిటిషన్ దాఖలైంది. స్థానిక ఎన్నికలపై రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని సురేంద ర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న సిజె జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ను ప్రశ్నించింది. దీంతో బిసి రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ప్రభుత్వానికి లేఖ రాశామని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాది విద్యాసాగర్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహణపై స మాధానం చెప్పేందుకు ధర్మాసనం రెండు వారాల సమయం ఇచ్చింది. అనంతరం విచారణను 2 వా రాలకు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ వాదనలు వినిపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గత విచారణ సందర్భంగా ఆదేశించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని కోర్టు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను నిలుపుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వం మరోసారి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సైతం ఎన్నికలకు వెళ్లాలని సూచించింది కదా అని ధర్మాసనం గుర్తు చేసింది. దీంతో సుప్రీం కోర్టు మౌకికంగా చెప్పిందని, ఎక్కడా ఉత్తర్వుల్లో పేర్కొనలేదని ఇసి తరపు న్యాయవాది కొర్టుకు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి మూడు వారాల సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి రెండు వారాల గడువు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించి, తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 9 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీఓ ప్రకారమే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే హైకోర్టు ఈ జీఓని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టకుండానే అత్యున్నత న్యాయస్థానం సైతం రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేయడంతో రిజర్వేషన్ల పంచాయితీ అగమ్యగోచరంగా మారింది. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అటు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రాకపోతే పార్టీ పరంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వంలోని ప లు శాఖల్లో భారీగా బోగస్ ఉద్యోగులు ఉన్న ట్లు అధికారుల విచారణలో బయటపడింది. బో గస్ ఉద్యోగుల పేరుతో నెలనెల జీతాలు తీసుకుంటూ వేల కోట్లు ప్రభు త్వ ఖజానాకు గండి కొట్టినట్లుగా తేలింది. వారి వల్ల ఏటా రూ.1,500 కోట్ల జీతాలు దుబారా అయ్యాయని ప్రభుత్వం గుర్తించింది. గడిచిన పదేండ్లలో ఈ బోగస్ ఉద్యోగుల పేరిట రూ.15 వేల కోట్లు ప్రభుత్వ ఖ జానాకు గండిపడినట్టుగా అధికారిక వర్గా లు పేర్కొంటున్నాయి. గత ప్రభుత్వంలో ఔ ట్ సోర్సింగ్ ఏజెన్సీలను, కాంట్రాక్టు మ్యాన్ పవ ర్ కంపెనీలను ఏర్పాటు చేసిన కొందరు నాయకులు, బడాబాబులు బోగస్ ఉద్యోగుల పేరుతో దోచుకున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. దీంతో బోగస్ ఉద్యోగుల జీతాలను ఈ నెల (అక్టోబర్) నుంచి నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. మా జీ సిఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో వేసిన త్రిస భ్య కమిటీ రిపోర్టులో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్న ట్లు తేల్చిన కమి టీ అందులో కేవలం రెం డు లక్షల మంది పూర్తిస్థాయిలో ఉన్నట్లుగా గుర్తించారు. సెప్టెంబర్ 30 వరకు సగం మంది ఉద్యోగులు మాత్రమే బ్యాం క్ ఖాతాలు, తమ ఆధార్ వివరాలను ఇచ్చారు. మిగిలిన వారు ఈనెల 25వ తేదీ వరకు ఆధార్ వివరాలివ్వాలని కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటివరకు వారి వివరాలు అందకపోవడం విశేషం. అయితే, ఈ కుంభకోణం పదేళ్ల బిఆర్ఎస్ సర్కార్ హయాంలోనే చోటుచేసుకుందని, అప్పటినుంచి ఇది కొనసాగుతుందని ప్రభు త్వం గుర్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుంభకోణంపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందా యి. ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్రెడ్డికి శాఖల వారీగా వివరాలు కావాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రస్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం సేకరించింది. దీంతోపాటు ఒక కమిటీని ప్రభుత్వం నియమించి పూర్తిస్థాయిలో దీనిపై నివేదిక తెప్పించుకుంది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమల్లోకి తీసుకొచ్చిన ఫేస్ రికగ్నేషన్ సిస్టంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుంభకోణంపై ప్రభుత్వానికి మరింత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. జిహెచ్ఎంసిలోనే 6వేల మంది బోగస్ బోగస్ ఉద్యోగుల జీతాల విషయంలో ఈనెల 25వ తేదీ తరువాత ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని, ఈ కుంభకోణంలో పాత్రదారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కమిటీ ఇచ్చిన రికార్డుల ప్రకారం ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో (జిహెచ్ఎంసి) 21 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. అసలు పని చేస్తున్న ఉద్యోగులు 15 వేలు మాత్రమేనని, మిగతా 6 వేలు బోగస్ అని అధికారులు పేర్కొంటున్నారు. ఇలా పలు శాఖల్లో కాగితాలపై చూపిన లెక్కలకు పనిచేస్తున్న వారికి పొంతన లేదని ప్రభుత్వం గుర్తించింది. వివరాలు ఇవ్వని 2,18,976 మంది రాష్ట్ర ప్రభుత్వం 31 శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమాచారాన్ని ఇప్పటికే డేటాబేస్లో పొందుపరిచింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యా ప్తంగా 5,21,692 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా అందులో 2,22,376 మంది ఉద్యోగులు మాత్రమే తమ డేటాబేస్ను ప్రభుత్వానికి అందించారు. వీరితో పాటు 4,93,820 మంది తాత్కాలిక ఉద్యోగులకు గాను 2,74,844 మంది ఉద్యోగులు మాత్రమే తమ వివరాలను ప్రభుత్వానికి అందించారని మిగతా 2,25,462 మంది వివరాలు ఇవ్వలేదని ప్రభుత్వానికి అందించిన నివేదికలో కమిటీ పేర్కొన్నట్టుగా తెలిసింది. అయితే, ఈనెల 25వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు, టెంపరెరీ ఉద్యోగుల వివరాలు ప్రస్తుతం ప్రభుత్వానికి అందాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శాఖల వారీగా వివరాలు ఇలా.... అగ్రికల్చర్ అండ్ కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు 8,477 మంది ఉండగా ఇప్పటివరకు 7,464 మంది డేటా అప్లోడ్ కాగా, 2,545 టెంపరరీ ఉద్యోగులకు గాను 4,574 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ కావడం విశేషం. ఇక, పశుసంవర్ధకశాఖ, డైరీ డెవలప్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు 5,218 మంది ఉండగా ఇప్పటివరకు 216 మంది డేటా అప్లోడ్ కాగా, 3,803 టెంపరరీ ఉద్యోగులకు గాను 2,872 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. బిసి వెల్ఫేర్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 7,093 మంది ఉండగా ఇప్పటివరకు 1,039 మంది డేటా అప్లోడ్ కాగా, 4,983 టెంపరరీ ఉద్యోగులకు గాను 5,135 మంది ఉద్యోగుల డేటా ప్రభుత్వానికి అందింది. సివిల్ సప్లయ్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 1,099 మంది ఉండగా ఇప్పటివరకు 558 మంది డేటా అప్లోడ్ కాగా, 857 టెంపరరీ ఉద్యోగులకు గాను 60 మంది ఉద్యోగుల డేటా ప్రభుత్వానికి అందింది. విద్యుత్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 73,171 మంది ఉండగా ఇప్పటివరకు 44 మంది డేటా అప్లోడ్ కాగా, 22,223 టెంపరరీ ఉద్యోగులకు గాను 9 మంది ఉద్యోగుల డేటా అందింది. పర్యావరణ, అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీలో రెగ్యులర్ ఉద్యోగులు 4,629 మంది ఉండగా ఇప్పటివరకు 2,755 మంది డేటా అప్లోడ్ కాగా, 860 టెంపరరీ ఉద్యోగులకు గాను 32 మంది ఉద్యోగుల డేటా అందింది. ఆర్థికశాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 2,672 మంది ఉండగా ఇప్పటివరకు 2,933 మంది డేటా అప్లోడ్ కాగా, 540 టెంపరరీ ఉద్యోగులకు గాను 326 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. జిఏడిలో రెగ్యులర్ ఉద్యోగులు 1,862 మంది ఉండగా ఇప్పటివరకు 2,345 మంది డేటా అప్లోడ్ కాగా, 1600 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 764 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. వైద్య, ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 35,903 మంది ఉండగా ఇప్పటివరకు 14,876 మంది డేటా అప్లోడ్ కాగా, 60,934 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 62,801 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ చేశారు. ఉన్నత విద్యా శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 16,177 మంది ఉండగా ఇప్పటివరకు 11,213 మంది డేటా అప్లోడ్ కాగా, 13,894 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 3,365 మంది ఉద్యోగుల డేటాను అధికారులు అప్లోడ్ చేశారు. హోంశాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 82,424 మంది ఉండగా ఇప్పటివరకు 29,789 మంది డేటా అప్లోడ్ కాగా, 21,765 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 19,594 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. హౌజింగ్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 444 మంది ఉండగా, 289 మంది టెంపరరీ ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. పరిశ్రమల శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 965 మంది ఉండగా ఇప్పటివరకు 472 మంది డేటా అప్లోడ్ కాగా, 1,264 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 77 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 64 మంది ఉండగా ఇప్పటివరకు 11 మంది డేటా అప్లోడ్ కాగా, 668 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 23 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 12,494 మంది ఉండగా ఇప్పటివరకు 9,381 మంది డేటా అప్లోడ్ కాగా, 1,524 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 742 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. కార్మిక, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 3,062 మంది ఉండగా ఇప్పటివరకు 1,840 మంది డేటా అప్లోడ్ కాగా, 1,312 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 1,056 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. లా డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు 9,373 మంది ఉండగా ఇప్పటివరకు 2,474 మంది డేటా అప్లోడ్ కాగా, 2,304 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 505 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. లేజిస్లేటర్లో రెగ్యులర్ ఉద్యోగులు 249 మంది ఉండగా 166 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 126 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు 1,17,167 మంది... వీటితో పాటు మైనార్టీ వెల్ఫేర్ శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 4,439 మంది ఉండగా ఇప్పటివరకు 144 మంది డేటా అప్లోడ్ కాగా, 20,903 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 16,903 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. పురపాలక శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 17,436 మంది ఉండగా ఇప్పటివరకు 3,267 మంది డేటా అప్లోడ్ కాగా, 62,913 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 35,203 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు 27,266 మంది ఉండగా ఇప్పటివరకు 18,014 మంది డేటా అప్లోడ్ కాగా, 94,179 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 26,337 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు 944 మంది ఉండగా ఇప్పటివరకు 667 మంది డేటా అప్లోడ్ కాగా, 184 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను72 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. పబ్లిక్ ఎంటర్ప్రైజేస్లో రెగ్యులర్ ఉద్యోగులు 04 మంది ఉన్నారు. 04 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 04 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. రెయిన్ షాడో ఏరియా డెవలప్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు 01 ఒక్కరూ ఉండగా ఇప్పటివరకు 01 ఒక్కరి డేటా అప్లోడ్ కాగా, 02 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 02 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు 25,006 మంది ఉండగా ఇప్పటివరకు 10,090 మంది డేటా అప్లోడ్ కాగా, 12,843 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 8,764 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు 8,339 మంది ఉండగా ఇప్పటివరకు 1,326 మంది డేటా అప్లోడ్ కాగా, 5,928 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 897 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు 1,17,167 మంది ఉండగా ఇప్పటివరకు 93,992 మంది డేటా అప్లోడ్ కాగా, 78,146 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 20,258 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖలో రెగ్యులర్ ఉద్యోగులు 43,757 మంది ఉండగా ఇప్పటివరకు 2,345 మంది డేటా అప్లోడ్ కాగా, 7,822 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 601 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. ట్రైబల్ వెల్ఫేర్లో రెగ్యులర్ ఉద్యోగులు 8,375 మంది ఉండగా ఇప్పటివరకు 2,396 మంది డేటా అప్లోడ్ కాగా, 6,555 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 3,045 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. ఉమెన్, చిల్డ్రన్స్, డిసెబుల్డ్ అండ్ సీనియర్ సిటీజన్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు 2,801 మంది ఉండగా ఇప్పటివరకు 2,045 మంది డేటా అప్లోడ్ కాగా, 60,492 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 59,375 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది. యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగులు 781 మంది ఉండగా ఇప్పటివరకు 679 మంది డేటా అప్లోడ్ కాగా, 2,336 మంది టెంపరరీ ఉద్యోగులకు గాను 1,322 మంది ఉద్యోగుల డేటా అప్లోడ్ అయ్యింది.