SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
...

TG |ఆ విషయంలో.. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి..

TG | ఆ విషయంలో.. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. TG, హసన్

ప్రభ న్యూస్ 22 Feb 2026 10:29 am

Tirumala |శ్రీవారి సన్నిధిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి..

Tirumala | శ్రీవారి సన్నిధిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి.. Tirumala, చౌటుప్పల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Feb 2026 10:17 am

అమ్మకానికి మానవ మేధస్సు

మానవ చరిత్రలో పేదరికం ఇప్పటివరకు కేవలం సామాజిక, ఆర్థిక సమస్యగానే పరిమితమైంది. కానీ, ’వంశవాహిక సవరణ’ వంటి సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్న వేళ.. అసమానతలు సరికొత్త ’జీవశాస్త్ర’ రూపం దాల్చవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఆస్తులు, సంపద మాత్రమే వారసత్వంగా అం దేవి, కానీ రేపు సంపన్నులు తమ సంతానం కోసం కృత్రిమంగా మేధస్సును, ఆరోగ్య లక్షణాలను ’కొనుగోలు’ చేసే స్థాయికి చేరితే, అవకాశాల సమానత్వం అనేది ఒక అందమైన భ్రమగా మిగిలిపోతుంది. అయితే, మేధస్సు అనేది కేవలం వంశవాహికల వల్ల మాత్రమే సిద్ధించదు. వ్యక్తి పెరిగే వాతావరణం, పోషణ, నాణ్యమైన విద్య, సామాజిక పరిస్థితులే అసలైన మేధో వికాసానికి గీటురాళ్లు. విజ్ఞానశాస్త్రం విచక్షణ కోల్పోకుండా, సాంకేతికతను మానవత్వపు పరిధుల్లోనే నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మేధస్సు మార్కెట్ సరుకుగా మారకముందే మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వంశవాహిక సవరణ రంగంలో విప్లవాత్మక పరిశోధనలు చేసినందుకు గాను శాస్త్రవేత్తలు ఇమ్మాన్యుయేల్ చార్పెంటియర్, జెన్నిఫర్ డౌడ్నాలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. జీవకణాల్లోని వంశవాహిక భాగాలను అత్యంత ఖచ్చితత్వంతో సవరించే ’క్రిస్పర్’ విధానాన్ని వీరు పరిచయం చేశారు. ఈ ఆవిష్కరణ ప్రధానంగా జన్యుపరమైన వ్యాధులను నయం చేయడానికి ఉద్దేశించబడినప్పటికీ, దీని ద్వారా ’రూపకల్పన శిశువులను’ (డిజైనర్ బేబీస్) సృష్టించవచ్చనే చర్చలు తలెత్తాయి. అయితే, మేధస్సు లేదా వ్యక్తిత్వ లక్షణాలను కృత్రిమంగా మార్చాలనేది నైతికంగా, చట్టపరంగా ఆమోదయోగ్యం కావని అంతర్జాతీయ శాస్త్ర సమాజం స్పష్టం చేసింది. 2018లో చైనా శాస్త్రవేత్త హీ జియాన్కుయ్ వంశవాహిక సవరణ ద్వారా శిశువులను సృష్టించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అంతర్జాతీయ నైతిక విలువలను ఉల్లంఘించినందుకు ఆయన కఠిన కారాగార శిక్షకు గురయ్యారు. ఈ ఉదంతం విజ్ఞానశాస్త్రం ప్రకృతి సిద్ధమైన వైవిధ్యాన్ని దెబ్బతీయకూడదనే బలమైన హెచ్చరికను ఇచ్చిం ది. ఏకరీతి జన్యు లక్షణాలున్న సమాజం భవిష్యత్తులో కొత్త వ్యాధులకు లేదా పర్యావరణ మార్పులకు సులభంగా చితికిపోయే ప్రమా దం ఉంది. ఈ నేపథ్యంలో, భారతదేశం ’సహాయక పునరుత్పత్తి సాం కేతికత (నియంత్రణ) చట్టం, 2021’ ద్వారా మానవ పిండాలపై అనధికారిక జన్యు ప్రయోగాలను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. ప్రతి వ్యక్తి సహజ జన్యు హక్కులను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. శాస్త్రీయ పరిశోధనలు వ్యాధి నివారణ, ఆరోగ్య రక్షణ వంటి మానవహిత లక్ష్యాలకే పరిమితమైనప్పుడే సమాజానికి మేలు జరుగుతుంది. ఒకవేళ వంశవాహిక సాంకేతికతలు భవిష్యత్తులో కేవలం ధనిక వర్గాలకు మాత్రమే అందుబాటులోకి వస్తే, ఆరోగ్య పరంగా కొత్త అసమానతలు పెరగవచ్చు. అయితే మేధస్సు పూర్తిగా వంశవాహికల వల్లనే నిర్ణయించబడుతుందనే భావన శాస్త్రీయంగా సరైంది కాదు. పోషణ, పాఠశాల విద్య, కుటుంబ మద్దతు, సామాజిక వనరులు మేధస్సు అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పేదరికాన్ని వంశవాహిక శాపంగా చూడటం తప్పు. సమాన విద్యా అవకాశాలు, నాణ్యమైన ఆరోగ్య సేవలు, సామాజిక న్యాయం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మేధస్సు అనేది కేవలం వంశవాహికల్లో నిక్షిప్తమైన సమాచారం కాదు, అది వ్యక్తి పెరిగే వాతావరణం, పడే కష్టం, పొందే సంస్కారం, విద్యా విలువల కలయిక. రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడే ప్రతి బిడ్డ తన ప్రతిభను నిరూపించగలడు. ‘డబ్బున్న వాడికే తెలివైన బిడ్డ‘ అనే భావన కేవలం ఒక ఊహాజనిత ప్రశ్నగా మిగిలిపోవాలి తప్ప, అది సామాజిక వాస్తవం కాకూడదు. విజ్ఞాన శాస్త్రం అందించే సాంకేతికత మనుషుల మధ్య అంతరాలను పెంచకూడదు; ఉన్న అంతరాలను తొలగించి అందరికీ సమానత్వాన్ని అందించే వారధిగా మారాలి. మానవత్వాన్ని మించిన మేధస్సు, నైతికతను మించిన విజ్ఞానం లేదని చాటిచెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. - ఫిరోజ్ ఖాన్, జర్నలిస్ట్ 96404 66464

మన తెలంగాణ 22 Feb 2026 10:17 am

AGRO SHOW |శిక్షణలో ఉట్నూర్ రైతులు..

AGRO SHOW | శిక్షణలో ఉట్నూర్ రైతులు.. AGRO SHOW, ఉట్నూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Feb 2026 10:10 am

India vs South Africa : భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేడు భీకర పోరు..పిచ్ రిపోర్ట్ ఏంటంటే?

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేడు భీకర పోరు జరగనుంది

తెలుగు పోస్ట్ 22 Feb 2026 10:05 am

Narendra Modi : నేడు ఉత్తర్ ప్రదేశ్ లో మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 22 Feb 2026 10:01 am

Let the Investigation Conclude: Why Ram Mohan Naidu Should Not Be Politically Targeted

The growing demand for the resignation of K. Ram Mohan Naidu reflects a troubling trend in contemporary politics. Tragic incidents understandably trigger emotion and public concern. However, governance cannot be conducted on the basis of outrage alone, nor can individual accountability be assigned in the absence of verified findings. Ram Mohan Naidu, among the youngest […] The post Let the Investigation Conclude: Why Ram Mohan Naidu Should Not Be Politically Targeted appeared first on Telugu360 .

తెలుగు 360 22 Feb 2026 9:57 am

Chandrababu : నేడు గుంటూరు జిల్లాకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 22 Feb 2026 9:53 am

Weather Report : ఈ జిల్లాల్లోనే వానలు.. మిగిలిన చోట్ల ఎండలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది

తెలుగు పోస్ట్ 22 Feb 2026 9:45 am

Sujana foundation |మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన..

Sujana foundation | మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన.. Sujana foundation,

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:43 am

సిద్ధిపేటలో..లారీని ఢీకొన్న ఆర్టిసి బస్సు

హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వెళ్తున్న లారీని వెనుక నుంచి అదుపు తప్పి ఆర్టిసి బస్సు ఢీకొంది. ఈ బస్సు కరీంనగర్ కు డిపోకు చెందిన బస్సు. డ్రైవర్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 22 Feb 2026 9:41 am

Revanth Reddy : నేడు ములుగు జిల్లాకు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 22 Feb 2026 9:41 am

AP |మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎంఎల్ఎ కృష్ణప్రసాద్..

AP | మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎంఎల్ఎ కృష్ణప్రసాద్.. AP, కృత్తివెన్ను,

ప్రభ న్యూస్ 22 Feb 2026 9:33 am

Gold Prices Today : షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న పసిడి.. ధర ఎంతో తెలుసా?

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వెండి కూడా బంగారంతో పాటు పరుగులు పెడుతుంది

తెలుగు పోస్ట్ 22 Feb 2026 9:23 am

Tirumala : తిరుమలలో హెవీ రష్... దర్శనం సమయం ఎంతో తెలిస్తే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది

తెలుగు పోస్ట్ 22 Feb 2026 9:09 am

Andhra Pradesh : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నలుగురు పోలీస్ అధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది

తెలుగు పోస్ట్ 22 Feb 2026 8:50 am

విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. ఇస్రోలోనే శిక్షణ

విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 27 నుంచి ఇస్రో ‘యువికా’ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి

తెలుగు పోస్ట్ 22 Feb 2026 8:43 am

మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

సతీష్ నీనసాం కథానాయకుడిగా ’కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. కన్నడ, తెలుగు,తమిళ భాషలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వినోద్.వి.దుండలే దర్శకుడు. వృద్ది క్రియేషన్స్, సతీష్ పిక్చర్ హౌస్ పతాకంపై వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నీనసాం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కళాసృష్టి ఇంటర్నేషనల్ పతాకంపై రవిశంకర్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణి చేస్తున్నారు. ఈ నెల 27న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. కాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కథానాయకుడు సత్యదేవ్ ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ “కన్నడ సినిమాలు రూటెడ్‌గా ఉన్నా వాటికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ది రైజ్ ఆఫ్ అశోక్ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో సతీష్ నీనసాం మాట్లాడుతూ “ఇది కేవలం మాస్ కమర్షియల్ సినిమానే కాదు. ఎంతో డిఫరెంట్ ఫిలిం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సప్తమి గౌడ, రవిశంకర్ పాల్గొన్నారు.  

మన తెలంగాణ 22 Feb 2026 8:40 am

Amaravathi : సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలివే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు

తెలుగు పోస్ట్ 22 Feb 2026 8:33 am

ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం

వర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వం లో, తన సోదరి పూజా శర త్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన మంచి సినిమా ఇదని తెలిపారు. డైరెక్టర్, హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ “ఈ సినిమా ఫిమేల్ కంటెంట్ అని మరీ సందేశాత్మకంగా ఉండదు. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ బాస్, ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, నిర్మాత పూజా శరత్ కుమార్ పాల్గొన్నారు. 

మన తెలంగాణ 22 Feb 2026 8:27 am

Afghanistan : ఆప్ఘనిస్థాన్ సరిహద్దు వెంట పాకిస్థాన్ దాడులు.. టెన్షన్ టెన్షన్

ఆప్ఘనిస్థాన్ సరిహద్దు వెంట దాడులు జరిపినట్లు పాకిస్థాన్ ఆదివారం తెల్లవారుజామున వెల్లడించింది

తెలుగు పోస్ట్ 22 Feb 2026 8:09 am

శ్రీశైలం దేవస్థానం అబ్బూరు కాటేజీలో అగ్నిప్రమాదం

అమరావతి: నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం అబ్బూరు కాటేజీలో అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ తో అబ్బూరు కాటేజీలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం సమయంలో కాటేజీలో 20 మంది భక్తులు బస చేస్తూండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు గమనించి కాటేజీ నుంచి భక్తులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 22 Feb 2026 7:58 am

22 Feb2026 |తిరుమల సమాచారం..

22 Feb2026 | తిరుమల సమాచారం.. తిరుమలలో పెరిగిన భక్తుల

ప్రభ న్యూస్ 22 Feb 2026 7:44 am

నేడు సిఎం రెడ్యాల, దేవాదుల పర్యటన

మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, ఓ ఛానెల్ చైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి సోదరుల తండ్రి రాఘవేందర్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం రెడ్యాల గ్రా మంలో పర్యటించి వెన్నం సోదరులను పరామర్శించినున్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల కు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు రెడ్యాల చేరుకుంటారు. అక్కడ వెన్నం రాఘవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, మధ్యాహ్నం 3 గంటలకు రెడ్యాల నుంచి బయలుదేరతారు. మధ్యాహ్నం 3.30కు దేవాదుల ప్రాజెక్టు కు చేరుకుని, ప్రాజెక్టు ను సందర్శించి, ఇంజనీర్లతో సిఎం సమీక్ష నిర్వహిస్తారు.

మన తెలంగాణ 22 Feb 2026 6:30 am

పైరవీలకు పదవులు రావు

మన తెలంగాణ/హైదరాబాద్/వికారాబాద్ బ్యూరో: “కాంగ్రెస్‌లో పైరవీలు పని చేయవు.. కష్టపడిన వారికే గుర్తింపు, పదవులు ఇస్తాం..” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బాగా ప ని చేసిన డిసిసి అధ్యక్షులకు లోగడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. వికారాబాద్, అనంతగిరిలో ఏర్పాటైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల జిల్లా పార్టీ అధ్యక్షుల శిక్షణా తరగతులను శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఈ శిక్షణ డిసిసి అధ్యక్షులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వారి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు దీ నిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ విధానాలు, ప్రజల సమస్యలపై చర్చించేందు కు ఈ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనే కుట్ర జ రుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని ముఖ్యమంత్రి అ న్నారు. గాంధీ సిద్ధాంతాలను విశ్వసించే పార్టీ కాంగ్రెస్ అని ఆయన గుర్తుచేశారు. గాంధీజీపై లాఠీలు ఎత్తడానికి బ్రిటిషర్లు భయపడ్డారని, దేశభక్తులమని అనుకునే కొందరు తూటాలతో గాంధీని చంపారని విమర్శించారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, గాంధీ ఆలోచనలపై కూడా భిన్నాభిప్రాయాలు చెప్పినవారు ఉన్నారని తెలిపా రు. ‘భిన్నాభిప్రాయాలు చెప్పిన వారిని తరిమేస్తే మనకే నష్టం.. అందరూ కలిసి పని చేస్తే అనుకున్నది సాధించవచ్చు పార్టీ అధ్యక్షుల శిక్షణా తరగతులను శనివారం ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించా రు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఈ శిక్షణ డిసిసి అధ్యక్షులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వారి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ విధానాలు, ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఈ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనే కుట్ర జరుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని ముఖ్యమంత్రి అన్నారు. గాంధీ సిద్ధాంతాలను విశ్వసించే పార్టీ కాంగ్రెస్ అని ఆయన గుర్తుచేశారు. గాంధీజీపై లాఠీలు ఎత్తడానికి బ్రిటిషర్లు భయపడ్డారని, దేశభక్తులమని అనుకునే కొందరు తూటాలతో గాంధీని చంపారని విమర్శించారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, గాంధీ ఆలోచనలపై కూడా భిన్నాభిప్రాయాలు చెప్పినవారు ఉన్నారని తెలిపారు. ‘భిన్నాభిప్రాయాలు చెప్పిన వారిని తరిమేస్తే మనకే నష్టం.. అందరూ కలిసి పని చేస్తే అనుకున్నది సాధించవచ్చు’ అని అన్నారు. రెండున్నర శాతం ఓట్ల నుంచి 40 శాతం వరకు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చామన్నారు. డిజిటల్ మెంబర్‌షిప్‌పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వ్యతిరేకించిన వాళ్ళను అణిచి వేసే ప్రయత్నం చేయొద్దు.. నేను పీసీసీ అధ్యక్షుడిని అయ్యాక ప్రతి ఇంటికి వెళ్లి కలిసి మద్దతు అడిగాను..కలిసికట్టుగా పనిచేయడం వల్లనే రెండున్నర శాతం ఉన్న కాంగ్రెస్ 40 శాతం ఓట్లు తెచ్చుకొని అధికారంలోకి వచ్చింది. 119 నియోజక వర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేయించామని, పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చామని, డిసిసి అధ్యక్షుల ప్రతి చర్యనూ గమనిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు. పార్టీలో ఏ కోటా లేదని, మెరిట్ ప్రకారమే పదవులు ఇస్తామన్నారు. డిసిసి అధ్యక్షులు తమ పదవిని దుర్వినియోగం చేసుకోరాదన్నారు. కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్య్రం, ఇచ్చిన రాజ్యాంగం ను ఉపయోగించుకొని పుట్టిన పార్టీ లు ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ అంటు న్నాయని, దేశ ఆత్మ గౌరవం గ్రామాల్లో ఉందని నమ్మే పార్టీ కాంగ్రెస్..అని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని,సమూలంగా మార్చాలని కుట్ర జరుగుతున్న సమయం లో ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతోందని, డిసిసి అధ్యక్షులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. షర్మిలపై పొగడ్తలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కష్టపడుతున్నారంటూ పొగిడారు. ఆమె వారసత్వంగా పదవులు పొందే అవకాశం ఉన్నా తీసుకోలేదన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, రెండింటిలోనూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు. పార్టీలో అంతర్గతంగా కొట్లాడుకుంటే ప్రత్యర్థి పార్టీలకు మేలు జరుగుతుందని ఆయన సూచించారు. గాంధీ, ఇందిరా, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని ఆయన తెలిపారు. దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు ఇచ్చారని, దేశ సమగ్రత కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేశారని ఆయన వివరించారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం సోనియా గాంధీ సర్వం త్యాగం చేసి కాంగ్రెస్ కు అండగా నిలిచారని, .కష్టం తెలియకుండా పదవులు పొందే అవకాశం ఉన్నా, త్యాగాల చరిత్ర ఉన్నా రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, ప్రత్యర్ధి పార్టీకి ఉన్న తేడా 2 శాతం ..అది పార్లమెంట్ ఎన్నికల కు 4 శాతానికి పెరిగింది..మునిసిపల్ ఎన్నికల్లో 12 శాతానికి పెరిగింది. పార్టీ కార్యకర్త లు, ప్రజల్లో ఉన్న నమ్మక వల్లనే ఇది జరిగిందన్నారు. దేశాన్ని, కాంగ్రెస్‌ను విడదీయలేరు.. దేశం ఆత్మనే కాంగ్రెస్ అని ఆయన తెలిపారు. ఆత్మపైన బిజెపి కుట్ర చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ని మాట్లాడనివ్వకుండా బిజెపి కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. సోనియా, రాహుల్ పై కేసులు పెట్టి అవమానిస్తున్నదని ఆయన విమర్శించారు. మూడు తరాలు ప్రాణ త్యాగం చేసిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరమా? రాజకీయంగా గాంధీ కుటుంబాన్ని అడ్డు తొలగించుకోవడం కోసంబిజెపి కుట్ర చేస్తున్నదని ఆయన విమర్శించారు. దళితులు,మైనార్టీ లు,బడుగు బలహీన వర్గాలు, పేదల గొంతును నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని ఆయన తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో 49.83 శాతం బీసీలు సర్పంచ్ లు అయ్యారని, మున్సిపల్ ఎన్నికల్లో 63 శాతం మంది ఓబీసీ లు ఎన్నికయ్యారని, ఇది కాంగ్రెస్ వల్లనే సాధ్యం అయిందన్నారు. పైరవీలు చేయకపోతే నాయకుల గౌరవం పెరుగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలి అని ముఖ్యమంత్రి సూచించారు.

మన తెలంగాణ 22 Feb 2026 6:00 am

22ndFeb2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

22ndFeb2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక. ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో

ప్రభ న్యూస్ 22 Feb 2026 6:00 am

సుంకాలపై తగ్గేదేలే..

వాషింగ్టన్: సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు కీల క అసాధారణ తీర్పు తరువాత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరింత రెచ్చిపోయారు. అమెరికాకు దిగుమతులపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రకటించిన 10 శాతం టారీఫ్‌లను గంటల వ్యవలోనే 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేర కు శనివారం ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. కొన్ని దేశాలు దశాబ్దాలుగా టారీఫ్‌ల మినహాయింపులతో అమెరికాను దగా చేస్తున్నాయని మండిపడ్డారు. 150 రోజుల పాటు టారీఫ్‌ల పెంపుదల చట్టబద్ధం అవుతుంది.ఈ చట్టబద్ధ టారీఫ్‌లను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, పెంచుతూ పోతామని ట్రంప్ హెచ్చరించారు. విదేశీ శక్తుల ప్రోద్బలంతోనే సుప్రీంకోర్టు ఏకంగా ప్రెసిడెంట్ నిర్థారిత టారీఫ్‌లను చెల్లనేరనివిగా పేర్కొందని తీర్పు వెంటనే ట్రంప్ స్పందించారు. తీర్పును పూర్తిగా సమీక్షించుకుని తమ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సుప్రీం తీర్పుతో ఇప్పు డు తమ టారీఫ్‌లకు మరింత చట్టబద్ధత దక్కిందని వ్యాఖ్యానించారు. అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విసృ్తతంగా సుంకా లు విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఇచ్చిన తీర్పు భారత దేశానికి మేలు చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో అమెరికాలోకి దిగుమతి అయ్యే భారతీయ వస్తువులపై ట్రంప్ కొత్త లెవీ రేట్లను ప్రకటించారు. ఫలితంగా, భారతదేశం ఇప్పుడు 18 శాతం నుంచి 10 శాతం తక్కువ సుంకం రేటును ఎదుర్కొంటోంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన ప్రకటనలో ప్రాథమిక అంతర్జాతీయ చెల్లింపుల సమస్యలను పరిష్కరించడానికి తాత్కాలిక దిగుమతి సర్ చార్జ్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త లెవీ రేట్లు ఫిబ్రవరి 24 నుంచి అమలులోకి వస్తాయి. అంటే, ఫిబ్రవరి 24 నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 150 రోజుల పాటు 10 శాతం యాడ్ వాలోరెమ్ తత్కాలిక దిగుమతి సర్ చార్జి విధిస్తున్నట్లు తెలిపారు. అమెరికాకు దిగుమతి అయ్యే భారతీయ వస్తువులపై ఇక సుంకాలు 18 శాతం ఉండబోవు. 10 శాతం మాత్రమే ఉంటాయి. భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్యంపై తాత్కాలిక ఒప్పందం కోసం ఒక ఫ్రేమ్ వర్క్ ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ గా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి ఇష్టంవచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్న డోనాల్డ్ ట్రంప్ కు తొలిసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా సుప్రీంకోర్టు, చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ ఆధ్వర్యంలో ఇచ్చిన 6-3 తీర్పు లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై ట్రంప్ ఏకపక్షంగా విధిస్తున్న సుంకాలు చట్ట విరుద్ధమని, ప్రెసిడెంట్ తన అధికారాలను మించి వ్యవహరిస్తూ, భారీ సుంకాలను విధించారని తీర్పు ఇచ్చింది.ఫిబ్రవరి నెల ప్రారంభంలో అమెరికా - భారతదేశం వాణిజ్యంపై మధ్యంతర ఒప్పందానికి సంబంధించి ఓ ఫ్రేమ్ వర్క్ చేరుకున్నట్లు ప్రకటించడంతో, రష్యానుంచి చమురు కొనుగోలు చేసుకున్నందుకు భారతదేశం పై విధించిన 25 శాతం శిక్షాత్మక సుంకాలను తొలగిస్తూ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన జారీ చేసింది. రష్యా నుంచి ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా చమురు దిగుమతులు మానుకొని అమెరికన్ ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు భారతదేశం సంసిద్ధమైందని అమెరికా ప్రెసిడెంట్ గుర్తించారు. వాణిజ్య ఒప్పందం పై సూత్రప్రాయంగా అంగీకారం కుదరగానే, అమెరికా భారతదేశంపై విధించిన సుంకాన్ని 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం, ప్రెసిడెంట్ ట్రంప్ 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 కింద తనకు లభించిన అధికారాలను ఉపయోగిస్తున్నారు. ఇది సర్ చార్జీలు, ఇతర ప్రత్యేక దిగుమతి పరిమితుల ద్వారా కొన్ని ప్రాథమిక అంతర్జాతీయ చెల్లింపు సమస్యలను పరిష్కరించడానికి ప్రెసిడెంట్ కు అధికారం ఇస్తుందని పేర్కొంది. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై 150 రోజుల పాటు 10 శాతం యాడ్ వాలోరెమ్ దిగుమతి సుంకాన్ని విధిస్తుంది.  

మన తెలంగాణ 22 Feb 2026 5:30 am

నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెలాఖరు వరకు పత్తి కొ నుగోళ్లను కొనసాగించాలని (సిసిఐ) అంగీకరించినట్లు వ్య వసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్ అండ్ టె క్స్‌టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. రైతుల ప్రయోజనాలను ప్రా ధాన్యంగా తీసుకొని కొనుగోళ్ల గ డువును పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం, సిసిఐ దృష్టికి  తీసుకెళ్లగా, వారు సానుకూలంగా స్పందించారని మంత్రి తుమ్మల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో పత్తి సాగు ఆలస్యంగా ప్రారంభ కావడంతో దిగుబడులు ఆలస్యంగా మార్కెట్‌కు వస్తున్నాయని, ఈ వాస్తవ పరిస్థితిని కేంద్రానికి వివరిస్తూ కొనుగోళ్ల గడువును పొడిగించాలని మంత్రి తుమ్మల కోరారు. అలాగే, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో రాష్ట్ర పరిస్థితిని వివరించి, రైతులకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 45.32 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా, 28.29 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటివరకు 8,80,053 మంది రైతుల నుంచి రూ.12,823 కోట్ల విలువైన 16.15 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సిసిఐ కొనుగోలు చేసింది. అదేవిధంగా మార్కెట్ ద్వారా 2.24 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యత ప్రమాణాలు లేని పత్తిని కొనుగోలు చేసింది. అయినా, రాష్ట్రంలో ఇంకా 9.99 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి రైతుల వద్ద ఉందని మార్కెటింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మొబైల్ యూరియా బుకింగ్ యాప్‌తో ఎరువుల పంపిణీ కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్‌పై మొదటగా రైతులు జిన్నర్ల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌కి రాష్ట్ర ప్రభుత్వం సపోర్టు చేసిన విషయాన్ని మంత్రి తుమ్మల గుర్తుచేశారు. దీంతో ఈ యాప్ ద్వారా రైతులు క్యూలో నిలబడే అవకాశం లేకుండా సమయపాలన పాటిస్తూ రైతులకు దగ్గరలోని పత్తి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునే అవకాశం కలగడంతో పాటు, పత్తి కొనుగోళ్లను రెగ్యులేట్ చేస్తూ, పారదర్శకంగా కొనుగోళ్లను చేపట్టే వెసులుబాటు కలిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రైతులకు సమయానికి ఎరువుల పంపిణీకి తమ ప్రభుత్వం మొబైల్ యూరియా బుకింగ్ యాప్‌ను తీసుకొచ్చిందన్నారు. తద్వారా యూరియా బ్లాక్ మార్కెటింగ్ అరికట్ట డంతో పాటు అధిక నిల్వలను నియంత్రిస్తూ పారదర్శక పంపిణీ వ్యవస్థ అమల్లోకి వచ్చిందన్నారు. పంట పూర్తిగా మార్కెట్‌కు రాకముందే సిసిఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తారన్న సమాచారంతో రైతుల్లో ఆందోళన నెలకొందని, నాణ్యమైన పత్తిని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందన్న భయం రైతుల్లో ఉన్న నేపథ్యంలో, మరో 30 రోజులు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని సిసిఐను ప్రత్యేకంగా కోరినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పత్తి రైతు తన పంటను పూర్తిగా విక్రయించే వరకు కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సిసిఐ సిఎండి లలిత్ కుమార్ గుప్తా, కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్‌లకు మంత్రి తుమ్మల ఆదేశాలతో శుక్రవారం కేంద్ర వ్యవసాయశాఖ సెక్రటరీకి లేఖ రాశారు. దీంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనుగోళ్ల గడువును పొడిగిస్తూ సిసిఐ నిర్ణయం తీసుకుంది. పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకొని రైతులు సమీపంలోని సిసిఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని మంత్రి తుమ్మల కోరారు.

మన తెలంగాణ 22 Feb 2026 5:00 am

కామారెడ్డిలో హైటెన్షన్

మన తెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి: సవాళ్లు ప్ర తి సవాళ్ల మధ్య కామారెడ్డిలో శనివారం హై టె న్షన్ వాతావరణం నెలకొంది. కళాశాల ఆస్తులలో భాగంగా గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న సవాళ్లకు ప్రతి సవాల్‌గా ఇటు బిజెపి నాయకులు, అటు కాంగ్రెస్ నాయకుల మధ్య ఉద్రిక్తత కు దారితీసింది. కళాశాల వద్ద కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎమ్మెల్యే సూచన మేరకు కార్యకర్తలు ఎవరూ క్యాంప్ కార్యాలయం వైపు రాలేదు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోసానిపేట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి పోలీసుల కళ్లుగప్పి తన కారులో క్యాంప్ కార్యాలయం  వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. క్యాంప్ ఆఫీసుకు కాంగ్రెస్ నాయకుడు రావడంపై బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు .మొదట మహేందర్ రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దాంతో షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులను తోసుకుంటూ వెళ్లి కారును ఎత్తి పడేశారు. దాంతో స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి క్యాంప్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాసేపటికి పోలీసులు కారును తరలించేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. మహేందర్ రెడ్డి ఇక్కడికి రావాలని, క్యాంప్ కార్యాలయానికి ఎందుకు వచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో మరోసారి పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకోగా కొందరు కార్యకర్తలు మహేందర్ రెడ్డి కారుకు నిప్పుపెట్టారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు కార్యకర్తలను పక్కకు తరలించి నీళ్లతో మంటలను ఆర్పివేసి కారును తరలించారు. ఈ క్రమంలో ఓ బీజేపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేయగా ఎమ్మెల్యే రమణారెడ్డి బయటకు వచ్చి అరెస్ట్ చేసిన తమ కార్యకర్తను పంపించాలని పోలీసులకు సూచించారు. ఉదయం నుండి రాత్రి వరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్త పోలీసుల కళ్లుగప్పి ఎలా వస్తాడని బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సూచన మేరకు తాము శాంతియుతంగా ఎలాంటి ఆందోళన చేయకుండా ఉన్నామని బీజేపీ నాయకులు తెలిపారు. ఇది కచ్చితంగా పోలీసుల నిఘా వైఫల్యమేనని ఆరోపించారు. ఇది ట్రైలర్ మాత్రమే : షబ్బీర్ అలీకి వెంకటరమణా రెడ్డి హెచ్చరిక కామారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవినీతిలో కింగ్ అన్నారని.. తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కామారెడ్డి వేదికగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి ఓడిపోయిన కామారెడ్డిలో షబ్బీర్ అలీ అన్నీ తానే అంటున్నారని చెప్పుకొచ్చారు. తనను కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్, జడ్పీటీసీ చేశామని అన్నారని.. ఆయన కామారెడ్డికి చేసిందేమీ లేదని విమర్శించారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇచ్చిన అవకాశంతో తాను కాంగ్రెస్ నుంచి గతంలో గెలిచానని ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి ప్రస్తావించారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి నా రాజకీయ గురువు. నువ్వు మా తండ్రి వద్ద చేతులు కట్టుకుని నిలబడ్డావ్. నువ్వు కట్టిన ఐదు అంతస్తుల భవనానికి మున్సిపల్ అనుమతి లేదు. ఈ నియోజకవర్గం నీ సొంతం కాదు. నీవల్లే నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాను. అసెంబ్లీలో హుందాగా ఉండాలని మాట్లాడిన నన్ను ఇలా చీప్గా మాట్లాడేలా చేశారు. నాపై నిందలేస్తే ఎలా ఉంటుందో ఈ రోజు చూశారు. ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది. నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశా. మా వాళ్లు ఎవరూ రావద్దని నేను చెబితే మీరు వేలాదిగా తరలిరావాలని మెసేజ్‌లు పెట్టారు. రేపటి నుంచి గ్రామాలకు వస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా. బాన్సువాడలో గొడవ జరిగితే మేం మాట్లాడి సద్దుమణిగేలా చేశాం’ అని ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి తెలిపారు. 263 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎలాంటి అక్రమాలు లేవు. నేను ఒక్క గజం అమ్మినా నిరూపించాలని వెంకటరమణా రెడ్డి సవాల్ విసిరారు. ‘దొంగలెవరో ప్రజలకు తెలుసు. నాకేం జరిగినా సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత. రేపటి నుంచి యుద్ధమే. ఇది సీఎంకు, నాకూ మధ్య యుద్ధం. కలెక్టర్ వద్ద కూర్చుందాం. కాలేజీ కమిటీ పేరిట ఎఫ్డీలు ఉన్నాయి. అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన అక్రమాలపై పోరాడాం. తెలంగాణ యూనివర్సిటీని కామారెడ్డిలో పెట్టమని కోరాం. అప్పుడు మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ ఏం చేశారు. తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోం. సోమవారం కలెక్టర్ వద్దకు వెళ్దాం. నాపై ఒక్క తప్పు తేలినా కాళ్లు పట్టుకుంటా, పదవి వదులుకుంటా. రమ్మంటే సీఎంఓకు వస్తా’ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

మన తెలంగాణ 22 Feb 2026 4:30 am

అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు

మన తెలంగాణ/హైదరాబాద్: యూత్ కాం గ్రెస్ సభ్యులు తమ అ ల్ప రాజకీయ నాటకా ల కోసం ‘ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ను వేదికగా ఎంచుకోవడం అ త్యంత విచారకరం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఇలాంటి అం తర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, ప్రపంచ దేశాల ముం దు మన దేశం ప్రతిష్ట దెబ్బతింటుందని ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ అసమ్మతిని వ్య క్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయని, ఎ ఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వంటి అంతర్జాతీయ సదస్సు కచ్చితంగా దానికి వేదిక కా దన్నారు. వారి సొంత పార్టీ సిఎం అదే ఎఐ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటన అని కెటిఆర్ విమర్శించారు.

మన తెలంగాణ 22 Feb 2026 4:00 am

మేడ్ ఇన్ ఇండియా చిప్‌తో వికసిత భారత్

న్యూఢిల్లీ : భారత్ , బ్రెజిల్ మధ్య వచ్చే ఐదేండ్లలో 20 బిలయన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్య లక్షం ఖరారు అయింది. ఏఐ సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన బ్రెజిల్ అధ్యక్షులు లూలా డ సిల్వా, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య శనివారం విస్తృత చర్చల తరువాత ఈ మేరకు వ్యాపార వాణిజ్య లక్షం ఖరారు అయింది. దీనితో పాటు ఇరుదేశాల మధ్య అత్యంత కీలకమైన ఖనిజాల రంగంలో పరస్పర సహకారం దిశలో కూడా అంగీకారం కుదిరింది. ఇరుదేశాల మధ్య చిరకాల సత్సంబంధాలు మరింతగా ముందుకు సాగేందుకు వీలేర్పడిందని ప్రధాని మోడీ సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించారు. ఉగ్రవాదం ప్రపంచానికి శత్రువు అయింది. టెర్రరిజం మద్దతుదార్లు మానవాళికి ముప్పుగా మారుతున్నారనే అంశంపై భారత్ , బ్రెజిల్ దేశాలది ఒకటే మాట అని ప్రధాని తెలిపారు. ప్రపంచ స్థాయి సవాళ్లను ఎదుర్కొనే రీతిలో ప్రపంచ స్థాయి సంస్థల సంస్కరణ అవసరం అని మోడీ, లూలా అభిప్రాయపడ్డారు. టఇరుదేశాలు రక్షణ, భద్రత, ఇంధన, ఆరోగ్య పరిరక్షణ, డిజిటల్ ప్రజా మౌలిక సాధనాసంపత్తుల విషయంలో పటిష్ట బంధం దిశలో చర్చలు సాగాయి. విభజిత భౌగోళికరాజకీయ వాతావరణంలో ఇరుదేశాలు వ్యూహాత్మక ముందడుగు గురించి ఎప్పటికప్పుడు సంప్రదింపుల ప్రక్రియ సాగిస్తూ ఉండాలని కూడా ఇరువురు నేతల మధ్య అంగీకారం కుదిరిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 18 నుంచి లూలా భారత పర్యటనలో ఉన్నారు. ఏఐ సదస్సుకు హాజరుకావడంతో పాటు, మోడీతో కీలక చర్చలు జరిపారు. 

మన తెలంగాణ 22 Feb 2026 3:30 am

రాష్ట్రాభివృద్ధిలో రాజకీయాల్లేవు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు. తెలంగాణానే కాదు ఏ రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేసి రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారం భారత పురోగతికి ఎంతో అవసరమని ఆకాంక్షించారు. ‘ఆర్థిక అక్షరాస్యత, స్థితిస్థాపకతపై జాతీయ స్థాయి సమావేశం, 25వ కేంద్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం శనివారం నాడిక్కడ ఒక హోటల్‌లో జరిగింది. ఈ సమావేశానికి శివరాజ్ సింగ్ చౌహాన్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ది కోసం రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వ కలిసి వస్తుందని, ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి అభినంనలు తెలుపుతున్నానని అన్నారు. దేశవ్యాప్తంగా లక్ పతి దీదీ కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరుస్తున్నామని శివరాజ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే కోట్లాది మహిళలు ఎస్‌హెచ్‌జిల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములయ్యారన్న కేంద్రమంత్రి బ్యాంకర్లు కేవలం రుణదాతలుగా కాకుండా భాగస్వాములుగా మారాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇవ్వడమంటే దేశానికి అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించడమేనని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. వికసిత భారత్ దార్శనికతకు మహిళా సంఘాలు గణనీయంగా దోహదపడుతున్నాయని అభినందించారు. మూడు ప్రధాన జాతీయ కార్యక్రమాలు ప్రారంభం హైదరాబాద్ వేదికగా జరిగిన సమావేశంలో మూడు ప్రధాన జాతీయ స్థాయి కార్యక్రమాలను ప్రారంభించారు. స్వయం సహాయ బృంద సభ్యుల కోసం వ్యక్తిగత ఎంటర్‌ప్రైజెస్ బ్యాంకు రుణ విధానం, స్వయం సహాయ బృంద సభ్యుల కోసం యుపి ఐ ఆధారిత క్రెడిట్ లైన్లు, స్వయం సహాయ బృంద సభ్యుల కోసం ఆర్థిక అక్షరాస్యతపై డిజిటల్ మాడ్యూల్స్ ఈ వేదికగా ప్రారంభమయ్యా యి. ఈ మూడింటి ద్వారా క్రెడిట్ డెలివరీని సులభతరం చేయడం, డిజిటల్ ఫైనాన్స్ స్వీకరణను ప్రోత్సహించడం, గ్రామీణ మహిళల్లో ఆర్థిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమావేశంలో గ్రామీణాభివృద్ధి కార్యదర్శి శైలేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. మహిళా సాధికారతే దేశ ప్రగతికి పునాది: మంత్రి సీతక్క ఈ సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ మహిళా సాధికారతే దేశ ప్రగతికి పునాది అని స్పష్టం చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని అన్నా రు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనల ఆధారంగా మహిళల అభివృద్ధినే సమాజ అభివృద్ధిగా భావిస్తున్నామని తెలిపారు. దేశంలోనే అతి చిన్నవయసు రాష్ట్రమైన తెలంగాణ సగటున 12.9 శాతం వార్షిక వృద్ధి రేటుతో వేగంగా అభివృద్ధి చెందుతోందని, పేదరికాన్ని తగ్గించడంలో నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకుందని గుర్తు చేశారు. 

మన తెలంగాణ 22 Feb 2026 3:00 am

వార ఫలాలు (22-02-2026 నుండి 28-02-2026 వరకు)

మేష రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ధనాన్ని సాధ్యమైనంత వరకు పొదుపు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి .వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదవాల్సిన సమయం. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. శని గ్రహ స్తోత్రం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గృహారంభం చేయగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని ముందుకు వెళ్తారు. ప్రభుత్వపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఈ రాశి వారు ప్రతి రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి. డాక్యుమెంట్ రైటర్స్ కి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గోల్డ్ కలర్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మిధున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా కొంత చికాకు ఏర్పడుతుంది. మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి . వృత్తి వ్యాపారములలో నష్టాలు వచ్చే సూచనలున్నవి. ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచడం వలన లాభపడతారు. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తను వింటారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొన్ని ఒడిదొడుకులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం లేదు అనే భావన కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి . పదిమందిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఎక్కువగా కష్టపడతారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సింహ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అస్తమ శని నడుస్తుంది. రాబడి బాగుంటుంది. సహోదరీ సహోదరుల మధ్య కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది జాగ్రత్త వహించండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. కొద్దికాలం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. ఏదో ఒక శనివారం శనికి డైలాగు శకం చేయించండి సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయండి. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెడు అలవాట్లకు స్నేహితులకు దూరంగా ఉండటం మంచిది చదువుపై శ్రద్ధ వహించండి. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ సంబంధిత విష వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఎంతోకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయ. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి కష్టపడి చదవాలి. చదువుపై శ్రద్ధ వహించండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదవండి. ఋణాలు తీర్చగలుగుతారు. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం రోజున ఎరుపు వత్తులతో సుబ్రహ్మణ్య స్వామి వారికి దీపారాధన చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తులా రాశి వారికి ఈ వార మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యక్తి ఉద్యోగాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా వస్తుంది. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కొన్ని అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారి పోతాయి. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. క్రెడిట్ కార్డులకి పర్సనల్ లోన్లకి దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మంచి లాభాలు అందుకుంటారు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. నలుగురిలో మీ ప్రతిభపాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి దుర్ వ్యసనాలకు దూరంగా ఉండాలి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రం చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని మొదలుపెట్టిన వెనక్కి లాగే వారు ఎక్కువగా ఉంటారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి. ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. మంగళవారం శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థాయిని సంపాదించుకోగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు._ప్రతి విషయంలో కూడా గోప్యత అవసరం. వ్యాపారంలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టపడతారు. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి లేదా వినండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. భూ వివాదాలు తీరుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదవండి మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడుతాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుంభం రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు తక్కువగా ఉంటాయి ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ప్రతి విషయంలో క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక సమస్యలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. పునర్ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మీన రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తోంది. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి హోటల్ వ్యాపారస్తులకు మంచినీటి వ్యాపారం చేసేవారికి అంచు లాభాలు ఉంటాయి. ఆర్ధిక విషయంలో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. అహంకారపూరితమైన ధోరణి అవలంబించవద్దు. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనయోగం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి లేదా వినండి. శనికి తైలాభిషేకం చేయించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  

మన తెలంగాణ 22 Feb 2026 12:20 am

జాగృతీ.. జర జాగ్రత్త!

తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత పార్టీ ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టమైపోయింది. ఆమె ఒక పార్టీ పెట్టబోతున్నారన్నమాట కొంతకాలం క్రితమే ఖాయమైనా ఎప్పుడు పెడతారనే విషయం మాత్రం గురువారంనాడు స్పష్టమైంది. మే నెలలో రాజకీయ పార్టీ ప్రారంభానికి ముహూర్తం పెట్టుకున్నానని తానే పత్రికల వారితో చెప్పారు. ఇది ఎవరికీ ఆశ్చర్యం కలిగించే విషయం కానీ, దిగ్భ్రాంతి గొలిపే విషయం కానీ కాదు. తండ్రి అధ్యక్షుడిగా ఉన్న భారత రాష్ట్ర సమితి నుండి సస్పెండ్ అయిననాడే ఆ ఛాయలు గోచరించాయి.వచ్చే మే మాసంలో కవిత ప్రారంభించబోయే రాజకీయ పార్టీ పేరు బహుశా తెలంగాణ జాగృతి పార్టీ అయి ఉంటుంది. ఆమె తన పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందన్నారు కాబట్టి, జాగృతి పేరిట చేసిన కార్యక్రమాలతో ఆమె తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఎంతో గుర్తింపు పొంది ఉన్నారు కాబట్టి తెలంగాణ, జాగృతి.. ఈ రెండు పదాలు పార్టీ పేరులో ఉండేట్టు చూసుకుంటారని అర్థం అవుతున్నది. ప్రస్తుతానికి ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరు తెలంగాణ జాగృతి పార్టీ (టీజేపీ) అనుకుందాం. భారత పౌరురాలిగా రాజకీయ పార్టీని పెట్టుకునే హక్కు, స్వేచ్ఛ కవితకు పూర్తిగా ఉన్నాయి. ఆమె మొన్నటి పత్రికాగోష్ఠిలో ఒక మాట అన్నారు. పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన మగవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు అని. పార్టీ ఇంకా ప్రారంభించక ముందే పాస్, ఫెయిల్ లెక్కలు ఎందుకు గాని, మగ అయినా ఆడ అయినా ఒక రాజకీయ పార్టీ పెట్టడం అంటే చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని, జేబుల్లో చేతులు పెట్టుకొని బజారుకు వెళ్లి వచ్చినంత సులభమే కావచ్చు, కానీ, వాటిని నిలబెట్టడం, అంతిమ లక్ష్యమైన అధికారానికి చేరుకోవడం అన్నది అందరి వల్ల అయ్యే పని కాదు.దేశమంతటా ఎందుకు, మనం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అయినా, విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయినా కనీసం వేళ్ళ మీద లెక్కబెట్ట గలిగినంతమంది పార్టీలు పెట్టారు కదా, ఏమయ్యారు వాళ్లంతా? ఒక నాయకుడి మీద కోపంతోనో, ఒక రాజకీయ పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదన్న దుగ్ధతోనో లేదా గ్లామర్ ను ఉపయోగించుకుని అప్పనంగా అధికారంలోకి వచ్చేద్దామనుకునో పార్టీలు పెట్టినంత మాత్రాన అవి నిలబడవు. మన రాష్ట్రంలో, దేశంలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, వాటి మనుగడ, కొనసాగింపు గురించి త్వరలో మరో ప్రాంతీయ పార్టీకి ప్రాణం పోయనున్న కవిత అధ్యయనం చేసే ఉండాలి. లేదా అటువంటి విషయాలలో సంపూర్ణ అవగాహన కలిగినవారితో సంప్రదింపులు, చర్చలు జరిపి ఉండాలి. రాజకీయాల్లో మగవాళ్ళ ఫెయిల్యూర్ గురించిన ప్రస్తావన ఆమె ఎందుకు తీసుకొచ్చారంటే బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ పార్టీ పెట్టి ఫెయిల్ అయినందున ఆమెతో తనను పోల్చుతున్నారనే ఆలోచనతో ఆ మాట అంటూ ఉండవచ్చు. ఇందులో లింగ వివక్ష ఏమీ ఉండదు. పార్టీలు పెట్టేవాళ్ళు ఆడ అయినా, మగ అయినా అవి దీర్ఘకాలం మనుగడ సాగిస్తాయా, పుబ్బలో పుట్టి మఖలో మాడిపోతాయా అన్నది ఆనాటి రాజకీయ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.1982 లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టేనాటికి ఆయనకు రాజకీయాల్లో ఏబిసిడిలు తెలియవు. కానీ ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ మైదానంలో ఫుట్బాల్ ఉందిగానీ ఆడేవాళ్లే లేరు. గ్రౌండ్ అంతా ఆయనదే. అంతకుముందు జాతీయస్థాయిలో శ్రీమతి ఇందిరాగాంధీ చారిత్రక కాంగ్రెస్ పార్టీని చీల్చి కొత్త పార్టీ పెట్టినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో అదే పరిస్థితి. ఆ పార్టీ చేసిన తప్పుల వల్ల ఐదేళ్లలోనే మైదానం ఖాళీ అయింది ఎన్టీఆర్ కు అవకాశం వచ్చింది. ఆ తర్వాతి కాలంలో నాదెండ్ల భాస్కరరావు, లక్ష్మీపార్వతి, మధ్యలో జానారెడ్డి , వసంత నాగేశ్వరరావు, కేఈ కృష్ణమూర్తిత్రయం, తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పార్టీని చీల్చి పార్టీలు పెట్టుకున్నారు. ఈ జాబితాలో ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప అందరూ ఫెయిల్ అయిన మగవాళ్లే, ఒక్క లక్ష్మి పార్వతిని మినహాయిస్తే. తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టుకుని గాని, ఉన్న రాజకీయ పార్టీల్లోనే పనిచేస్తూ గానీ పెద్దగా రాణించిన మహిళలు తక్కువ. ఇప్పుడు తానంత తీవ్రంగా విమర్శిస్తున్న తన మాజీ పార్టీలో కూడా ఒక మంత్రివర్గంలో కేసీఆర్ మహిళలకు స్థానం కల్పించకపోగా రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారోత్సవ సమయంలో విలేకరులు ఒక మగ మంత్రిని ‘మీ మంత్రివర్గంలో మహిళలు కనిపించడం లేదేమిటి?’ అనడిగితే ఇంట్లో ఉన్నారని చెప్పి తీవ్ర విమర్శలకు గురయిన విషయం తెలిసిందే. కవిత అప్పటికి ఆపార్టీలోనే ముఖ్య నాయకురాలుగా ఉన్నారు.మహాపర్వతాల్లాంటి రాజకీయ పార్టీలను ఢీకొట్టి నిలిచి గెలిచిన మహిళలు మనకు కనిపిస్తారు. ఇందిరాగాంధీ, ఆమె పార్టీలోనే రాజకీయాలు నేర్చుకున్న మమతా బెనర్జీ, పొరుగున తమిళనాడులో జయలలిత, ఉత్తరాదిన మాయావతి వంటి వాళ్ళు ఈ దేశ రాజకీయాల్లో కచ్చితంగా తమదైన, బలమైన ముద్ర వేశారు. కాబట్టి కవిత మహిళ కాబట్టి ఆమె రాజకీయాల్లో ఫెయిల్ అవుతారని ఎవరూ అనుకోవాల్సిన అవసరం లేదు. షర్మిల కూడా మహిళ కాబట్టి ఫెయిల్ కాలేదు. ఆమె రాజకీయాలకోసం ఎంచుకున్న ప్రాంతం కానీ సమయం కానీ ఆ వైఫల్యానికి కారణం. పత్రికల వాళ్ళు రాసేవన్నీ నిజమే అనుకుని కూడా రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి షర్మిల పెద్ద ఉదాహరణ. షర్మిల ఫెయిల్యూర్ లీడరేం కాదు, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు అని కవిత సర్టిఫికెట్ ఇచ్చినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి అధ్యక్షురాలిగా షర్మిలను నియమించాలన్న పనికిమాలిన ఆలోచన ఎవరిదైనా అదెంత వృథాప్రయాసో ఆరాష్ట్ర రాజకీయాల్ని పరిశీలిస్తున్న వాళ్ళందరికీ అర్థం అవుతున్నది. ఇక పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన మగవాళ్ళని గురించి కూడా చాలా మాట్లాడుకోవచ్చు. ఇప్పటి తరానికి గుర్తుందో లేదో కానీ, ఇలాంటివన్నీ గుర్తుండాలంటే చరిత్ర చదవాలి. రాజకీయాల గత చరిత్రను తెలుసుకునే అంత ఆసక్తి ప్రస్తుత తరానికి ఉందో లేదో తెలియదు కానీ, ఏవీఎస్ రెడ్డి అని ఒక అత్యంత సమర్థవంతుడైన ఐఏఎస్ అధికారి ఉండేవారు. ఆయనకు ఎందుకు వచ్చిందో ఆలోచన హఠాత్తుగా సర్వీస్ కి రాజీనామా చేసి ‘భారతదేశం’ పేరిట రాజకీయ పార్టీ ప్రారంభించారు. అది అడ్రస్ లేకుండా పోయింది. అదృష్టం కొద్దీ ఆయనకు తన ఉద్యోగం మళ్ళీ లభించింది. 2009 కి ముందు ప్రముఖ సినీ హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అధికారంలోకి రావడానికి అది సరైన సమయం కాకపోయినా ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజికవర్గం రా జకీయంగా ప్రాధాన్యత లభించడం లేదన్న అ సంతృప్తితో రగిలిపోతున్న కాలం కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 స్థానాల్లో ఓ 18 స్థానాలు గెలుచుకోగలిగారు. ఓర్పు చాలా అవసరం. రాజకీయాల్లో కోరిక అనే గుర్రం ఎక్కాలని అందరికీ ఉంటుంది. ఎక్కుతారు కూడా. కానీ ఆ గుర్రం మన అదుపులో ఉందో లేదో చూసుకోవాలి. గుర్రాన్ని అదుపులో పెట్టే యుక్తి, ఓపిక చిరంజీవికి లేకపోయింది. చాలా కొద్దికాలం ఓపిగ్గా పార్టీ నడిపి ఉంటే, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగి వచ్చే అవకాశం ఉండేది. అంటే, ఆ తర్వాత జనసేన పేరిట ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టలేదా, నూటికి నూరు శాతం గెలిచి 2024లో 21 స్థానాలు సంపాదించలేదా అనొచ్చు ఎవరైనా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ముక్కు పచ్చలారని పసిపిల్లలను అడిగినా చెప్తారు పవన్ కళ్యాణ్ కానీ, ఆయన పార్టీ గానీ అక్కడ ఏ స్థితిలో ఉందో. అలాగే మరికొందరు మగధీరులు కత్తులు పట్టుకొని, గుర్రాలు ఎక్కి రాజకీయరంగంలోకి దూకి తాము పట్టినవి కత్తులు కావు అట్టముక్కలని అర్థం అయ్యాక తోకముడిచిన విషయం తెలిసిందే. ఏవీఎస్ రెడ్డి బాటలోనే మరికొందరు ప్రముఖ సివిల్ సర్వీస్ అధికారులు తెలుగునాట రాజకీయాల్లోకి వచ్చారు. వారంతా అరవింద్ కేజరీవాల్, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ లాగా విజయం పొందలేదు. డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ముగ్గురూ ఏమయ్యారు? డాక్టర్ జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి మంచిపేరు తెచ్చుకొని, దాన్ని రాజకీయ పార్టీగా మార్చాక ఒకేఒక్కసారి కూకట్ పల్లి నుంచి శాసనసభకు తాను ఒక్కడే ఎన్నికై ఆ తర్వాత కాలంలో ఆ పార్టీని ఏం చేశారో అందరికీ తెలుసు. జెడి లక్ష్మీనారాయణ ఐపీఎస్ అధికారి. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో ఆరోపణలు వస్తే విచారించి జైల్లో పెట్టినందుకు వచ్చిన పలుకుబడి, ప్రచారం తనను రాజకీయాల్లో ఎక్కడికో తీసుకుపోతుందనుకున్నారు, ఎక్కడికీ తీసుకు పోలేదు. ఆయనను చివరికి మేఘ ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేర్చింది. కవిత ఏం చింతించాల్సిన అవసరం లేదు. ఈ వరుసలో ఇంకా చాలామంది ఉన్నారు. ఆమె వదిలి వచ్చిన భారత రాష్ట్ర సమితి మీద ఇప్పుడు ఈగ కూడా వాలనివ్వని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతో ప్రజాదరణ పొందిన ఐఏఎస్ అధికారి. ప్రాంతీయ పార్టీ పెడితే పప్పులు ఉడకవన్న విషయం అర్థమై మాయావతి పార్టీ బహుజన సమాజ్ లో చేరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉచ్చరించలేని భాషలో నిందించి, ఇది మనవల్ల అయ్యే పని కాదని అదే పార్టీ పంచన చేరారు. కవిత చెప్పినట్టుగా ఇంకా కొంతమంది మగ రాజకీయ నాయకులు రాజకీయ గుర్రాల మీద స్వారీ చేయాలని ఉవ్విళ్ళు ఊరుతున్న మాట నిజమే. అందులో రెండు మూడుసార్లు పార్టీలు అటు ఇటు మార్చిన, మంత్రి పదవి రానందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు కావచ్చు. పురుషులైనా స్త్రీలైనా రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీలు పెట్టుకున్న వాళ్ళందరూ విఫలమవుతారని ఏం లేదు. రాజకీయాల్లో అద్భుతంగా రాణించిన పురుషులు కూడా ఉన్నారు. అందరికన్నా పెద్ద ఉదాహరణ కెసిఆర్. ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించి, అందునా ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ కాలం ఉద్యమం నడిపి, విజయం సాధించి పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటికింకా తెలంగాణ రాజకీయాల మీద, భారత రాష్ట్ర సమితి మీద ఎవరు కాదన్నా ఆయనది చెరగని ముద్ర. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వంటి ఒక మహా పర్వతాన్ని ఢీకొట్టి , సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టుకొని , కేసులపాలై జైలుకు వెళ్లి కూడా విజయం సాధించిన యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మహారాష్ట్రలో శరద్ పవర్ కాంగ్రెస్ ను ఎదిరించి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన, అలాగే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ జనతాదళ్ చీలిక పార్టీ బిజెడిని సమర్థవంతంగా కొన్ని దశాబ్దాలపాటు నడిపించిన చరిత్ర మన కళ్ళ ముందుంది.ఇక ప్రస్తుతానికి వస్తే కవిత ప్రారంభించబోయే కొత్త రాజకీయ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరగడానికి ఇంకా దాదాపు మూడు సంవత్సరాలు సమయం ఉన్నది. ఆనాటికి పరిస్థితులు ఎలా మారతాయన్న విషయం ఇప్పుడే జోస్యం చె ప్పడం సరైనది కాదు. కానీ రాజకీయ పరిశీలకులు ఎవరై నా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేరీజు వేసి, ఆయా రాజకీయపక్షాల బలాబలాలను అంచనా వేసి ఎన్నికలలో ఏం జరగవచ్చో ఊహాగానం చేస్తూ ఉంటారు, అంచనాలకు వ స్తూ ఉంటారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మై దానం కవిత ఫుట్బాల్ ఆడుకోవడానికి ఖాళీగా ఉన్నదా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. పదేళ్లు ప్రభుత్వం మాదేనన్న ఆత్మవిశ్వాసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో చెక్కుచెదరటం లేదు. ఇంకో పక్కన పైకి ఏం చెబుతున్నా బిఆర్‌ఎస్‌ను మింగేసి, సాధ్యపడకుంటే లొంగదీసి తెలంగాణలో అధికారం ఛేజిక్కించుకో చూస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ.. వీటి మధ్య కవిత అయినా ఇంకెవరయినా పెట్టే కొత్త పార్టీకి వచ్చే ఎన్నికలనాటికి చోటు ఏర్పడుతుందా? కన్నతండ్రితో సహా కుటుంబంలో అందరినీ కాదనుకుని చేయబోయే రాజకీయంలో కవిత గెలుస్తారా? మహిళలు రాజకీయాల్లో నిలిచి గెలవాలనే కోరుకుందాం.  Delete Edit

మన తెలంగాణ 22 Feb 2026 12:11 am

డిఎంకె కూటమిలోకి పన్నీర్‌సెల్వం చేరిక?

బహిష్కరణకు గురై న ఎఐఎడిఎంకె నాయకుడు ఒ పన్నీర్ సెల్వం డిఎంకె కూటమి లో చేరతారని ఎండిఎంకె చీఫ్ వై కో సంకేతాలిచ్చారు. చెన్నైలో ఫిబ్రవరి 20న సిఎం ఎంకె స్టాలిన్‌తో సెల్వం సమావేశం కావ డం ఈ ఊహాగానాలను బలపరుస్తోందని వైకో చెప్పారు. నిన్న నే ఆయన చేరారని వైకో తెలిపారు. స్టాలిన్‌తో సమావేశమైన తరువాత ప న్నీర్‌సెల్వం మాట్లాడుతూ రాను న్న అసెంబ్లీ ఎన్నిక ల్లో డిఎంకె వచ్చే అవకాశం ఉం దని, రెండోసారి కూడా స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ప్రజ లు సాధారణంగా అనుకుంటున్నారని వైకో పేర్కొన్నారు. తమిళనాడులో కూటమి ప్రభుత్వంవచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ద్రవిడియన్ నాయకులే స్వయంగా అసాధారణ మెజార్టీతో తిరిగి అధికారం లోకి వస్తారని చెప్పారు. రానున్న అసెం బ్లీ ఎన్నికలు డిఎంకెకు పెద్ద బలపరీక్షేమీ కాదని, చాలా సీట్లు డిఎం కె గెల్చుకుంటుందని వైకో చెప్పా రు. కూటమి ప్రభుత్వం మాత్రం ముమ్మాటికీ రాదని నిర్ధారిస్తున్నానని తెలిపారు. 

మన తెలంగాణ 21 Feb 2026 11:30 pm

మార్చి 31లోగా దేశంలో నక్సలిజం నిర్మూలన: అమిత్‌షా

ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31 లోగా దేశంలో నక్సలిజం పూర్తిగా నిర్మూలించబడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రంలో మొట్టమొదటిసారి నిర్వహించిన 87 వ సిఆర్‌పిఎఫ్ డే పెరేడ్‌ను ఉద్దేశించి అమిత్‌షా ప్రసంగించారు. దేశంలో 12 రాష్ట్రాల్లో, లెక్కలేనన్ని జిల్లా ల్లో విస్తరించిన నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సీఆర్‌పిఎఫ్, కో బ్రా ఫోర్స్ అధికారులు తమ సామర్థంతో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారని ప్రశంసించారు. ఇంతభారీ, సంక్లిష్ట, కష్టతరమైన టాస్క్ కేవలం మూడేళ్ల లోనే పూర్తి చేయడమైందన్నారు. సీఆర్‌పిఎఫ్ దళాల సామర్థం వల్ల నే మార్చి 31 నాటికి దేశం మొత్తం నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందగలదని చెప్పగలుగుతున్నామని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దు లోని కర్రెగుట్ట కొండల్లో 2025 ఏప్రిల్‌- మే మధ్యకాలంలో అసాధారణ భౌగోళిక పరిస్థితులు, భరించలేని ఉష్ణోగ్రతల్లో కూడా 21 రోజుల పాటు సిఆర్‌పిఎఫ్ నిర్వహించిన ఆపరేషన్‌లో 31 మంది నక్సల్స్ హతమయ్యారని గుర్తు చేశారు. ‘ఎర్ర ఉగ్రవాదం’ నుంచి దేశానికి విముక్తి కల్పించడంలో సీఆర్‌పిఎఫ్, కోబ్రా దళాలు చెప్పుకోతగిన కార్యక్రమాలు చేపట్టారని ఉదహరించారు.14 సిఆర్‌పిఎఫ్ జవాన్లు శౌర్యసాహసాల అవార్డులు సాధించగా, వీరిలో ఐదుగురు విశిష్ట సేవ చేసినందుకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ గ్రహించారని, మరోఐదు బెటాలియన్లు అత్యుత్తమ పనితీరుకు అవార్డులు పొందినట్టు అమిత్‌షా చెప్పారు. దేశం సురక్షితంగా ఉండేందుకు మొత్తం 2270 సీఆర్‌పిఎఫ్ జవాన్లు తమ జీవితాలను త్యాగం చేశారని, వారికి యావత్తు దేశం కృతజ్ఞలతో నివాళి అర్పించుకుంటుందని అమిత్‌షా తెలిపారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ,సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జిపి సింగ్ ,ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మన తెలంగాణ 21 Feb 2026 11:21 pm

హీలింగ్ క్యాపిటల్‌గా హైదరాబాద్

 ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను హీలింగ్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్‌ను... డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో అనుసంధానించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. లండన్ కే.ంద్రంగా పనిచేసే (పిహెచ్‌యుఎస్‌ఇ(ఫుస్) ఆధ్వర్యంలో పిహెచ్‌యుఎస్‌ఇ ఎపిఎసి కనెక్ట్ 2026 పేరిట శనివారం హెచ్‌ఐసిసిలో నిర్వహించిన సదస్సులో క్లినికల్ రీసెర్చ్, డేటా సైన్స్ అనుసంధానంపై దేశ, విదేశాల నిపుణులు మేధోమథనం చేశారు. ఈ కాన్ఫరెన్స్ ముగింపు వేడుకకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హెల్త్ కేర్ భవిష్యత్తు రాబోయే రోజుల్లో క్లినికల్ సైన్స్, ఎఐ, రియల్ వరల్డ్ ఎవిడెన్స్ మేళవింపుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ముఖ్యంగా క్లినికల్ రీసెర్చ్‌లో విప్లవాత్మక మార్పులొస్తాయని, టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుందని చెప్పారు. ఇలాంటి తరుణంలో అందుకు అవసరమైన ఎకో సిస్టంను ఇప్పటి నుంచే తెలంగాణలో అభివృద్ధి చేసేలా దార్శనికతతో కూడిన అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగానే... ఎఐ సిటీ, యంగ్ ఇండియన్ స్కిల్స్ వర్సిటీ, జీనోమ్ వ్యాలీ విస్తరణ, డేటా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైలింగ్, మెడికల్ టూరిజం పాలసీ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్‌కు శ్రీకారం చుట్టామన్నారు. సైన్స్, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేసినప్పుడే సమాజానికి నిజమైన మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. అందుకోసం... పరిశోధకులు, వైద్యులు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పరిశోధకులను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో పిహెచ్‌యుఎస్‌ఇ బోర్డు ఛైర్మన్ స్టీఫెన్ బాఫోర్డ్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ సర్వేష్ సింగ్, ఐటీ అడ్వైజర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

మన తెలంగాణ 21 Feb 2026 11:18 pm

లిక్కర్ స్కామ్ కేసువాసుదేవరెడ్డి అరెస్టు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గతంలో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. వైసీపీ […] The post లిక్కర్ స్కామ్ కేసువాసుదేవరెడ్డి అరెస్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 11:15 pm

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యామండలి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల కోసం1,537 కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ భాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, క్రమశిక్షణతో కూడిన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,57,312 మంది […] The post రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 11:12 pm

నేడు జీడీఎస్మహా సమ్మేళనం

విశాలాంధ్ర- దాచేపల్లి: కేంద్ర తపాలా శాఖకు సంబంది ంచిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) సమావేశం ఆదివారం గుంటూరులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఈ సభకు బీపీఎం, ఏబీపీఎంలు దాదాపు 8 వేల మంది హాజరుకా నున్నట్లు శాఖ ఉన్నతాధికారుల తెలి పారు. సంక్షేమం కోసం కేంద్ర ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్న సభకు ముఖ్య మంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రు లు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మ సాని, సీపీఎంజీ, పీఎంజీ తదితరులు […] The post నేడు జీడీఎస్మహా సమ్మేళనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 11:10 pm

జహీరాబాద్‌లో వివాహిత అదృశ్యం

 జహీరాబాద్ పట్టణంలోని కాంత రెడ్డి కాలనీకి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి జహీరాబాద్ టౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె. వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కాంత రెడ్డి కాలనీలో నివసించే మొహమ్మద్ ముస్తఫా (26), స్థానిక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నారు. ఆయన భార్య ఆసియా (19) గురువారం (ఫిబ్రవరి 20) రాత్రి అదృశ్యమయ్యారు.ఆ రోజు రాత్రి 10:00 గంటలకు దంపతులిద్దరూ నిద్రపోయారు. అయితే, అర్ధరాత్రి 12:00 గంటల సమయంలో ముస్తఫా నిద్రలేచి చూడగా, భార్య ఇంట్లో కనిపించలేదు. వెంటనే కంగారుపడిన ఆయన బంధువులు, స్నేహితులు మరియు తెలిసిన వారి వద్ద అన్ని చోట్లా వెతికినప్పటికీ ఆసియా ఆచూకీ లభించలేదు. దీంతో ముస్తఫా జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సబ్ ఇన్‌స్పెక్టర్ కె. వినయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మరో ఘటనలో... కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గత 15 రోజులుగా తన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం.. కోహిర్ మండల్ సజ్జపూర్ గ్రామానికి చెందిన మేతర సామెల్ కుమారుడైన మేతర రాజు (35) అనే వ్యక్తి తన భార్య రాణమ్మతో గత కొంతకాలంగా కుటుంబం విషయంలో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 05/02/2026 తేదీన భార్యతో మరోసారి గొడవపడి, ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. రాజు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరియు తెలిసిన వారందరి వద్ద గాలించారు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో, శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాజు ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని కోహిర్ ఎస్ ఐ నరేష్ కోరారు.

మన తెలంగాణ 21 Feb 2026 11:10 pm

లంచం తీసుకుంటూబీజేపీ ఎమ్మెల్యే అరెస్టు

బెంగళూరు: ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ కర్నాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చంద్రూ లమానీ పోలీసులకు పట్టుబడ్డారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఇద్దరు పీఏలనూ అదుపులోకి తీసుకున్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ నిర్మాణ పనుల కేటాయింపు కోసం ఎమ్మెల్యే… క్లాస్-1 కాంట్రాక్టర్ విజయ్‌పూజార్ నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా లక్ష్మీశ్వర పట్టణంలో మొదటి విడతగా రూ.5 లక్షలు తీసుకుంటుండగా ధార్వాడ్ పరారయ్యారు. […] The post లంచం తీసుకుంటూబీజేపీ ఎమ్మెల్యే అరెస్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 11:09 pm

ఉగ్రముప్ప్పు –అప్రమత్తం

హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో కుట్రదేశవ్యాప్త దాడులకు లష్కరే తోయిబా ప్రణాళికనిఘా వర్గాల హెచ్చరిక ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశరాజధాని దిల్లీ, హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లో ఉగ్రకుట్రకు పథక రచన జరిగినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. న్యూదిల్లీ/హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో కుట్రకు […] The post ఉగ్రముప్ప్పు – అప్రమత్తం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 11:03 pm

థాయ్‌లాండ్‌లో వైరస్ సోకి 72 పులులు మృతి

 థాయ్‌లాండ్ లోని చియాంగ్ మాయ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్‌యానిమల్ పార్కులో72 పులులు అంతుచిక్కని వైరస్ కారణంగా మరణించాయి. ఫిలైన్ పార్వోవైరస్ , బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల వల్ల శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతిని ఈ మరణాలు సంభవించినట్టు అధికారులు 20 తేదీన ప్రాథమిక పరీక్షల్లో గుర్తించారు. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో సంచలనం కలిగించింది. ఈ వైరస్ ప్రభావం అడవి జంతువుల సంరక్షణపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ప్రభావాన్ని ఆలస్యంగా గుర్తించడంతో ఈ ముప్పు సంభవించిందని చెబుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చనిపోయిన పులులకు మరిన్ని పరీక్షలు చేస్తున్నారు. 

మన తెలంగాణ 21 Feb 2026 10:55 pm

వామపక్ష సాహిత్యంప్రపంచానికి అవసరం

. సామ్రాజ్యవాదం అభివృద్ధి నిరోధకం. కమ్యూనిస్టులు లేరనే వారికి భవిష్యత్తే సమాధానం. రెడ్‌బుక్ డే సభలో వక్తలు విశాలాంధ్ర-విజయవాడ:సామ్రాజ్యవాద దోపిడీదారుల నియంతత్వ పోకడలను అడ్డుకునేందుకు వామపక్ష సాహిత్యం ప్రపంచానికి అత్యవసరమని వక్తలు స్పష్టంచేశారు. విజయవాడలోని లెనిన్ విగ్రహం వద్ద విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్త అధ్వర్యంలో రెడ్‌బుక్ డే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు వీక్షకులను ఆలోచింపజేశాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, […] The post వామపక్ష సాహిత్యంప్రపంచానికి అవసరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:55 pm

ప్రజా సమస్యలు ‘గోవిందా’

లడ్డూ పైనే గొడవలు. భక్తికి, రాజకీయానికి మధ్య నలుగుతున్న సామాన్యుడు. ఏపీలో ముదురుతున్న దైవ రాజకీయం విశాలాంధ్రసచివాలయం : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం ఒక వింత పరిస్థితి నెలకొంది. సామాన్యుడి ఆకలి కేకలు, పెరిగిన ధరలు, నిరుద్యోగం వంటి ‘నిజమైన’ సమస్యలు పక్కకు వెళ్లిపోయాయి. ఇప్ప్పుడు రాష్ట్రమంతా ‘నెయ్యికొవ్వు`క్షమాపణలు’ అనే మూడింటి చుట్టూనే తిరుగుతోంది. భక్తిని అడ్డం పెట్టుకుని ఈ ‘ప్రాయశ్చిత్త’ రాజకీయాలు సాగుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా […] The post ప్రజా సమస్యలు ‘గోవిందా’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:51 pm

ఆదాయం పెంచి ఆనందం పంచుతాం

. పేదలకు సంక్షేమంలో దేశంలో ఏపీయే టాప్. మార్చి నెలాఖరుకు అన్ని పంచాయతీల్లో 100 శాతం చెత్త సేకరణ. కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై నిందలు. వినుకొండ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర`వినుకొండ : పేద ప్రజల ఆదాయాన్ని పెంచి, ప్రతి ఒక్కరికి ఆనందం పంచేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు ఆదాయం పెంచే మార్గాన్ని నేర్పించి వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో […] The post ఆదాయం పెంచి ఆనందం పంచుతాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:49 pm

فیکٹ چیک: دیوریہ کی معصوم لڑکی کے ساتھ زیادتی و قتل کا اصل ملزم ودیا ساگر ہے، محمد اکرم نہیں

وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ محمد اکرم نے اپنی بھتیجی کو ریپ کے بعد قتل کیا۔ تحقیق سے واضح ہوا کہ اصل ملزم ودیا ساگر ہے۔

తెలుగు పోస్ట్ 21 Feb 2026 10:48 pm

బడ్జెట్ సెషనా…లడ్డ్డూ సెషనా?

అసెంబ్లీ సమావేశాలపై రామకృష్ణ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ […] The post బడ్జెట్ సెషనా…లడ్డ్డూ సెషనా? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:39 pm

ప్రభాస్ సినిమాలపై గందరగోళానికి తెర

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆయన షూటింగ్ షెడ్యూల్స్‌పై నెలకొన్న సందిగ్ధతకు శనివారం ఒక స్పష్టత వచ్చింది.కల్కి 2: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సీక్వెల్ షూటింగ్ శంకర్‌పల్లిలో ప్రారంభమైంది. అయితే ఈరోజు కేవలం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కాంబినేషన్ సీన్స్‌ను మాత్రమే చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ త్వరలోనే ఇందులో పాల్గొంటారు.ఫౌజీ: హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాకు ప్రభాస్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని […] The post ప్రభాస్ సినిమాలపై గందరగోళానికి తెర appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:27 pm

జూన్ తర్వాతే అల్లు అర్జున్, లోకేశ్ సినిమా

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఏఏ23’ గురించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ థీమ్ మ్యూజిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ రీల్స్ మార్కును దాటి రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రం జూన్ 2026 తర్వాత పట్టాలెక్కనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అట్లీ, లోకేష్ కనగరాజ్ ఇద్దరూ తమిళ డైరెక్టర్లే. అట్లీ మూవీ కూడా వరల్డ్‌వైడ్‌గా మంచి బిజినెస్ చేసినట్లు సమాచారం. లోకేష్ […] The post జూన్ తర్వాతే అల్లు అర్జున్, లోకేశ్ సినిమా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:22 pm

ఓటీటీలో రాబోయే కొత్త సినిమాలివే

అక్యూజ్డ్: కొంకణా సేన్ శర్మ, ప్రతిభా రత్న నటించిన ఈ హిందీ వెబ్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇది ఒక లెస్బియన్ కపుల్ చుట్టూ తిరిగే కథ. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.కార్తీక దీపం 2: బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న ఈ సీరియల్ నేటితో 600 ఎపిసోడ్‌ల మైలురాయి చేరుకుంది. ఈరోజు ఎపిసోడ్‌లో ‘దీప’ తన సొంత కూతురే అని దశరథకు తెలిసే ఎమోషనల్ సీన్ హైలైట్‌గా నిలిచింది.అర్జున్ అంబటి: బిగ్ బాస్ ఫేమ్ […] The post ఓటీటీలో రాబోయే కొత్త సినిమాలివే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:21 pm

ఆంథ్రోపిక్ ఒక్క పోస్ట్.. స్టాక్ మార్కెట్ ఢమాల్

 కృత్రిమ మేధ స్టార్టప్ ఆంథ్రోపిక్ వరుస సంచలనాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా సైబర్ సెక్యూరిటీ సర్వీస్‌లు అందించే కంపెనీలకు షాకిచ్చింది. కొన్ని గంటల క్రితం ఆంథ్రోపిక్ చేసిన ఒక్క పోస్ట్ పది బిలియన్ డాలర్ల నష్టాన్ని మోసుకొచ్చింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్‌లో సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు కుప్పకూలాయి. సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్ ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ తీసుకొస్తున్నట్టు ఆంథ్రోపిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లను స్కాన్ చేయడమే కాకుండా అందులోని లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దే పరిష్కారాలను సిఫారసు చేస్తుంది. దాంతో కోడింగ్ సమయంలోనే డెవలపర్లు భదత్రా పరమైన లోపాలను గుర్తించి పరిష్కరించుకోవచ్చు. సాంప్రదాయబద్దంగా గుర్తించలేని లోపాలను కూడా ఈ టూల్ ద్వారా సులభంగా కనిపెట్టవచ్చని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌తో అమెరికా స్టాక్ మార్కెట్‌లోని సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. క్రౌడ్‌స్ట్రైక్, క్లాడ్‌ఫ్లేర్, స్కేలార్, సెయిల్ పాయింట్, ఓక్టా తదితర సంస్థల షేర్లు 5 నుంచి పది శాతం మేర పడిపోయాయి. సైబర్ సెక్యూరిటీతో సంబంధం ఉన్న ఐటీ షేర్లు కూడా పడిపోయాయి. అలాగే గ్లోబల్ ఎక్స్ సైబర్ సెక్యూరిటీ ఈటీఎఫ్ 5 శాతం నష్టపోయింది.  

మన తెలంగాణ 21 Feb 2026 10:20 pm

ప్రాక్టీసులో సిరాజ్‌కు గాయం

. హార్దిక్ పాండ్యా షాట్‌కు కిందపడ్డ బౌలర్. నేడు దక్షిణాఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్ శ్రీలంక x ఇంగ్లండ్మద్యాహ్నం 3 గంటలకుఇండియా x సౌతాఫ్రికారాత్రి 7 గంటలకు ముంబై: భారత క్రికెట్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా షాట్‌కు తన సహచరుడు మహమ్మద్ సిరాజ్‌కు గాయమైంది. ప్రాక్టీసులో పాండ్యా కొట్టిన షాట్ అతని మోకాలికి తగిలింది. భారతజట్టు ఆదివారం దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్‌లో పాల్గొనాల్సిన భారత క్రికెట్ జట్టు […] The post ప్రాక్టీసులో సిరాజ్‌కు గాయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:18 pm

ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు నాడు బుర్జ్ ఖలీఫాపై ఆయన చిత్రాన్ని డిస్ప్లే చేయలేదు

పాత వీడియో. 2021 అక్టోబర్ నెలలో చిత్రీకరించిన వీడియో

తెలుగు పోస్ట్ 21 Feb 2026 10:16 pm

ఏఎఫ్‌సీ ఉమెన్స్ ఆసియా కప్ టీమిండియా ఇదే

ముంబై: ఏఎఫ్‌సీ ఉమెన్స్ ఆసియా కప్ గ్రూప్ సీలో ఉన్న భారత్ మార్చి 4న పెర్త్ రెక్టాంగులర్ స్టేడియంలో వియత్నాంతో తన తొలి మ్యాచ్‌ను ఆడబోతున్నది. ఆ తర్వాత మార్చి 7న అదే వేదికలో జపాన్‌తో తలపడుతుంది. చివరి గ్రూప్ దశ మ్యాచ్ మార్చి 10న వెస్ట్రన్ సిడ్నీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు చైనీస్ తైపీతో జరుగుతుంది. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు, అలాగే ఉత్తమ మూడవ స్థానంలో నిలిచిన రెండు జట్లు […] The post ఏఎఫ్‌సీ ఉమెన్స్ ఆసియా కప్ టీమిండియా ఇదే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:16 pm

గోవింద ధ్వనుల మధ్య జంటనగరాలని పరవశింపచేసిన గరుడసేవ..!

గోవింద ధ్వనుల మధ్య జంటనగరాలని పరవశింపచేసిన గరుడసేవ..! పాల్గొన్న సుచిత్రా ఎల్లా, ఆకట్టుకున్న

ప్రభ న్యూస్ 21 Feb 2026 10:08 pm

పరువు నష్టం కేసులో కోర్టుకు రాహుల్

2014 నాటి పరువు నష్టం దావాలో కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ శనివారం భివాండి మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఈ పందర్భంగా తనకు కొత్త గ్యారంటీర్‌గా కాంగ్రెస్ మహారాష్ట్ర పిసిసి అధ్యక్షులు హర్షసప్కాల్‌ను సిఫార్సు చేశారు. థానే జిల్లా కోర్టుకు వెళ్లుతున్నప్పుడు మార్గమధ్యలోములుండ్ టోల్ ప్లాజా వద్ద రాహుల్‌కు బిజెపి కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఏఐ సమ్మిట్‌లో యువజనకాంగ్రెస్ కార్యకర్తలు షర్టులు తీసేసి, నిరసనకు దిగడం, దేశ ప్రతిష్టను మంటగలిపే చర్య అని, ఇందుకు కారణం రాహుల్ గాంధీ ఆలోచనలే అని పేర్కొంటూ బిజెపి వర్గాలు ఆందోళనకు దిగాయి. వీరిని దాటుకుని రాహుల్ వాహనం కోర్టుకు చేరుకుంది. ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ పిఎం కోల్సే రాహుల్ పై పరువునష్టం దావా విచారణ ఆరంభించి, కొత్త ష్యూరిటీ ప్రక్రియను పూర్తి చేశారు. తరువాత కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 4వతేదీకి వాయిదా వేశారు. మహాత్మా గాంధీ హత్యకు వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచార దశలో రాహుల్ గాంధీ సోనాలే గ్రామంలో ఆరోపించడం వివాదాస్పదం అయింది. ఈ వ్యవహారంపై ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకుడు రాజేష్ కుంటే పరువు నష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణ వాయిదాలకు దారితీస్తోంది.ఈ కేసులో రాహుల్‌ను వ్యక్తిగత హాజరీ నుంచి ఇప్పటికే మినహాయింపు ఇచ్చింది. అయితే ఇంతకు ముందటి ష్యూరిటీ వ్యక్తి మృతితో కొత్త ష్యూరిటీ అవసరం ఏర్పడింది. ఇందు కోసం రాహుల్ న్యాయస్థానానికి వ్యక్తిగతంగా హాజరుకావల్సి వచ్చింది.

మన తెలంగాణ 21 Feb 2026 10:07 pm

హైడ్రా కాపాడిన 7 ఎకరాలు.. భూమి విలువ రూ. 1400 కోట్లు

హైదరాబాద్ మహానగర శివారులోని కొండాపూర్‌లో పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు సుమారు 7 ఎకరాలను హైడ్రా శనివారం కాపాడింది. వీటి విలువ సుమారు రూ. 1400ల కోట్ల వరకూ ఉంటుందని అధికారుల అంచనా. రంగారెడ్డి జిల్లా పేర లింగంపల్లి మండలం కొండాపూర్ విలేజ్ లోని సర్వే నంబరు 78 నుంచి 93 వరకున్న రాజరాజేశ్వర నగర్ కాలనీ పేరుతో 2059 ప్లాట్లను 1993లో గ్రామపంచాయితీ లే ఔట్ వేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 5 ఎకరాలు కేటాయించారు. పాఠశాలకు దాదాపు ఎకరా స్థలం, పార్కుల కోసం ఎకరాకు పైగా కేటాయించారు. పాఠశాలకు కేటాయించిన స్థలంలో 1000 చ.గజాల మేర అపార్టుమెంటును నిర్మించేశారు. కమ్యూనిటీ హాల్ కోసం 2181 చ.గజాలను కేటాయించారు. ఇలా కేటాయించిన భూములు ఆక్రమణలకు గురౌతున్నాయని వెంటనే కాపాడి రాజరాజేశ్వరి నగర్ నివాసం ఉంటున్న 5 వేల కుటుంబాలకు ఉపయోగపడేలా చూడాలని హైడ్రా ప్రజావాణిలో కాలనీ సంక్షేమ సంఘం కోరింది. ఈ భూముల అక్రమణల వెనుక బడాబాబులున్నారని పిర్యాదు చేసింది. ఎల్‌ఆర్‌ఎస్ ఎలా అయ్యాయి..! పలు రకాల షోరూంలతో పాటు.. కిరాణా జనరల్ స్టోర్లు ఆభూముల్లోకి వచ్చాయని, రహదారులు కూడా అక్రమణలకు గురవుతున్నాయని కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదులో పేర్కొంది. యూఎల్సీ భూములలోని లే ఔట్‌లో ప్లాట్లు ఎల్‌ఆర్‌ఎస్ అయ్యాయి. పార్కులు, ప్రజావసరాల స్థలాలు ఎల్‌ఆర్‌ఎస్ లేకుండానే అక్రమణదారులకు ఎలా సొంతం అవుతాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. అవి పార్కులని, ప్రజావసరాల స్థలాలుగానే ఉపయోగపడాలని కోరారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో హైడ్రా పరిశీలించింది. లే ఔట్ ప్రకారం పార్కుతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా నిర్ధారించుకుంది. పార్కు స్థలంలో ఇప్పటికే వెయ్యి గజాల మేర అపార్టుమెంట్ వచ్చిందనీ... కమ్యూనిటీ స్థలంలో ప్రైవేటు పాపులు, పిడ్డులు వేసినట్టు గుర్తించింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు.. అక్కడి నివాసితులకే చెందాలనే ఉద్దేశంతో ఆక్రమణలు తొలగించి సెన్సింగ్ వేసింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో రాజరాజేశ్వరి నగర్ నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య హైడ్రాతో పరిష్కారమయ్యిందని స్థానికులు దన్యవాదాలు తెలిపారు.

మన తెలంగాణ 21 Feb 2026 10:04 pm

20 ఏళ్ల మైలురాయికి చేరిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా

న్యూదిల్లీ: గ్లోబల్ లీడర్ సన్ లైఫ్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ అయిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ (bస్bల్‌జీbస్) ఇండియా కార్యాలయం దేశంలో పరివర్తన కలిగించే 20 సంవత్సరాల మైలురాయిని సూచిస్తుంది. 2006లో కార్యకలాపాలు, అప్లికేషన్ నిర్వహణపై దష్టి సారించే డెలివరీ సెంటర్‌గా ప్రారంభమైనది. డిజిటల్ పరివర్తన, ప్రాసెస్ ఇన్నోవేషన్, bక్సలెన్స్, స్కేల్డ్ ఆపరేషన్‌లు, స్థిరమైన వద్ధిని ప్రారంభించే సమగ్ర ప్రపంచ సామర్థ్య కేంద్రంగా అభివద్ధి చెందింది. గత రెండు దశాబ్దాలుగా, bస్bల్‌జీbస్ సన్ లైఫ్ గ్లోబల్ […] The post 20 ఏళ్ల మైలురాయికి చేరిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:04 pm

సక్రా వరల్డ్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ బ్లడ్ డిజార్డర్స్ ప్రారంభం

బెంగళూరు: భారతదేశంలో మొట్టమొదటి 100% bఫ్‌డీఐ నిధులతో కూడిన తతీయ సంరక్షణ ఆసుపత్రి అయిన సక్రా వరల్డ్ హాస్పిటల్, శనివారం తన ఇంటిగ్రేటెడ్, అధునాతన ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ బ్లడ్ డిజార్డర్స్‌ను ప్రారంభించింది. ఇది ఖచ్చితత్వంతో నడిచే, సాంకేతికతఆధారిత, రోగికేంద్రీకత క్యాన్సర్, హెమటాలజీ సంరక్షణను ఒకే పైకప్ప్పు క్రింద అందించే లక్ష్యంతో ఉన్న ఒక ప్రత్యేక కేంద్రం. ‘శరీరానికి సహాయం చేయడంఆత్మను నయం చేయడం’ అనే తత్వశాస్త్రం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఈ సంస్థ, […] The post సక్రా వరల్డ్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ బ్లడ్ డిజార్డర్స్ ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 10:02 pm

నగరంలో ఉగ్రకుట్రకు ప్లాన్..?

 ఫిబ్రవరి 21. దిల్‌సుక్‌నగర్ బాంబు పేలుళ్లు జరిగి పదమూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉగ్ర కుట్ర జరగనుందన్న వార్తలు నగరంలో తీవ్ర కలకలం లేపాయి. చంచల్‌గూడ జైలులోనే ఈ ఉగ్రకుట్రకు పథకం రచించారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్‌సుక్‌నగర్, సైదాబాద్, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి సోదాలు నిర్వహించారు. అయితే అలాంటి కుట్రలు ఏమి జరగలేదని, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు కొట్టిపారేశారు.2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6.50 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్ థియేటర్ వద్ద రెండు బాంబులు పేలాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలయ్యాయి. ఇండియన్ ముజాహిద్దీన్ అనే సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడింది. బాబ్రీ మజీద్ కూల్చివేతకు ప్రతీకారంగా ఇండియన్ ముజాహిద్దీన్ బాంబు పేలుళ్లకు తెగబడింది. ఈ పేలుళ్లలో ప్రధాన నిందితుడు ఇండియన్ ముజాహిద్దీన్ కీలకనేత యాసిన్ భత్కల్, మరో ఐదు మందితో పేలుళ్లకు పాల్పడ్డాడు. అబ్ధుల్లాపూర్‌మెట్‌లోని ఓ ఇంట్లో ఉండి బాంబు పేలుళ్లకు కుట్రపన్నారు. రెండు పాతసైకిళ్లు, రెండు కుక్కర్లను కొనుగోలు చేసిన ఉగ్రవాదులు.. రెండు అత్యంత శక్తివంతమైన ఐఈడీ బాంబులను మార్చారు. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పేలుళ్లకు భత్కల్ ప్లాన్ చేయగా.. దిల్‌సుఖ్‌నగర్‌లో రెండు సైకిళ్లను పార్క్ చేయడంతో కొద్దిసేపటికే రెండు బాంబులు పేలాయి. నిందితులను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ కోర్టులో ప్రవేశపెట్టడంతో 2016లో ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా ఉగ్రముప్పు ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు చేయడంతో హైదరాబాద్ పోలీసులు దిల్‌సుక్‌నగర్‌తోపాటు ముసారంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ తదితర ప్రాంతాలతోపాటు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ములాఖత్‌కు వచ్చిన వ్యక్తులతో ఉగ్రదాడులపై సంభాషణలు చేసినట్లు తెలిసింది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది నగరంలో బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సమాచారం. ఉగ్రకుట్ర పథకం అవాస్తవమని జైళ్ల శాఖ డిఐజి శ్రీనివాస్ తెలిపారు.

మన తెలంగాణ 21 Feb 2026 10:01 pm

చిన్నారి మృతదేహంతో రాస్తారోకో..

చిన్నారి మృతదేహంతో రాస్తారోకో.. రెండు నెలల పసికందు మృతికి కారణమైన నిందితులను వెంటనే

ప్రభ న్యూస్ 21 Feb 2026 9:42 pm

ఆర్చరీలో దమ్మపేట మండల యువతికి గోల్డ్ మెడల్

ఆర్చరీలో దమ్మపేట మండల యువతికి గోల్డ్ మెడల్ దమ్మపేట ,ఆంధ్రప్రభః ఖమ్మం సర్దార్

ప్రభ న్యూస్ 21 Feb 2026 9:15 pm

cbn affection : వావ్​.. ప్యూచర్​ మీదే  Andhra Prabha News

cbn affection : వావ్​.. ప్యూచర్​ మీదే Andhra Prabha News నవ.జాత

ప్రభ న్యూస్ 21 Feb 2026 9:14 pm

AP Liquor Scam: Arrest of A2 Vasudeva Reddy

In a significant development in the alleged Andhra Pradesh liquor scam linked to the previous YSRCP regime, the CID has arrested Vasudeva Reddy, former Managing Director of AP Beverages Corporation and named A2 in the case. A1 in the case is Raj Kesireddy. Investigators believe Vasudeva Reddy played a central role in the policy design […] The post AP Liquor Scam: Arrest of A2 Vasudeva Reddy appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 9:06 pm

అగ్రికల్చర్ ఏడీ కిరణ్ కుమార్ ఆస్తులు 50 కోట్లు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సుందరి కిరణ్ కుమార్ ఇల్లు, మరో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో కళ్లు చెదిరే ఆస్తులు వెలుగు చూశాయి. కిరణ్ కుమార్ సొంతూరు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంతో పాటు సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు జరిపి వివరాలు సేక రించారు. అగ్రికల్చర్ ఏడీ కిరణ్ కుమార్ కు 100 ఎకరాల వ్యవసాయ భూమి, పది విలువైన ప్లాట్లు, ఐదు ఫోర్ వీలర్ వాహనా లు, ఐదు ట్రాక్టర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ. 15 కోట్లు అని చెబుతున్నప్పటికీ మార్కెట్ విలువ ప్రకారం రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఏకకాలంలో ఏడు చోట్ల దాడులు : సూర్యాపేట జిల్లాలో గతంలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన సుందరి కిరణ్ కుమార్ ప్రస్తుతం ఆయన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ శాఖలో ఏడీఏ గా పనిచేస్తున్నారు. అయితే ఆయన స్వస్థలమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లోని పొనుగోడు గ్రామంలో ఏసీబీ అధికారులు ఉదయం దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఏసీబీ డి.ఎస్.పి బాలకృష్ణ తెలిపారు. కిరణ్ కుమార్ ఇంటితోపాటు ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఏడు చోట్ల దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆయనకు పార్ట్నర్ షిప్ ఉన్న నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి గ్రామ శివారులోని అవని రైస్ మిల్లులో కూడా అధికారులు దాడులు నిర్వహించారు. పొనుగోడు, నేరేడుచర్ల తో పాటు కల్వకుర్తిలో ఆయన పనిచేస్తున్న ఆఫీస్ తో పాటు గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామంలోని ఆయన అత్తగారింట్లో, అనంతగిరి మండలంలోని అమీనాబాద్, అలాగే సూర్యాపేటలోని ఆయన నివాసం ఉంటున్న కిరాయి ఇంట్లో, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని కిరాయి ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు చెప్పారు. తనిఖీలు చేస్తోన్న సమయంలో కిరణ్ కుమార్ పోనుగోడులోనే ఉన్నారు. దర్యాప్తు కోసం ఏసీబీ అధికారులు ఏడిఏ కిరణ్ కుమార్‌ను వెంట తీసుకువెళ్లారు. దర్యాప్తు పూర్తి అయ్యాక వివరాలన్నీ మీడియాకు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.

మన తెలంగాణ 21 Feb 2026 8:50 pm

Ex mp |బుట్టా కుటుంబంపై ఆర్థిక ఉక్కుపాదం..

Ex mp | బుట్టా కుటుంబంపై ఆర్థిక ఉక్కుపాదం.. రూ. 782 కోట్ల

ప్రభ న్యూస్ 21 Feb 2026 8:44 pm

విద్యార్థుల మొబైల్ నంబర్‌కు ఇంటర్ హాల్‌టికెట్లు

రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు మొబైల్ ఫోన్ల ద్వారా కూడా పొందే సదుపాయాన్ని ఇంటర్ బోర్డు కల్పించింది. ఈ మేరకు విద్యార్థుల మొబైల్ నెంబర్లకు ఇంటర్ బోర్డు లింక్ పంపించింది.అలాగే వెబ్‌సైట్‌లో అందుబాటులో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు కాలేజీ లాగిన్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉండగా, తాజాగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ఇంటర్ బోర్డు వద్ద విద్యార్థులు నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు నేరుగా హాల్ టికెట్ డౌన్ లోడ్ లింక్‌ను పంపించినట్లు బోర్డు తెలిపింది. బోర్డు వెబ్‌సైట్ లేదా బోర్డు పంపించిన లింకు ద్వారా విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉన్నట్టు గుర్తిస్తే... వెంటనే ప్రిన్సిపాళ్ల ద్వారా బోర్డు దృష్టికి తీసుకొచ్చి, తప్పులను సరిదిద్దుకోవాలని అధికారులు తెలిపారు. ఈసారి హాల్ టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజవుతున్నట్టు పేర్కొంది. ఫిబ్రవరి 25 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 25 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 25న మొదటి సంవత్సరం, 26వ తేదీన రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల టైం టేబుల్ ఇంటర్ బోర్డు ఇదివరకే విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్లు తీసుకురావాలని అదికారులు తెలిపారు.

మన తెలంగాణ 21 Feb 2026 8:42 pm

వినూత్న నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. సిటీ పోలీసు విభాగంలో 25 ఏళ్లలోపు డిగ్రీ, పిజి విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్‌లో అవకాశం కల్పించనున్నారు. ఆధునిక పోలీసింగ్‌లో విద్యార్థులను పోలీసులు భాగస్వామ్యం చేయనున్నారు. డేటా అనాలిసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికేట్లు జారీ చేయనున్నారు. ఎస్ఎంఐటి సెల్‌ పర్యవేక్షణలో పోలీసులు దీన్ని అమలు చేయనున్నారు. ప్రొఫెషనల్ నిపుణులు వాలంటీర్లుగా సేవ చేసే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

మన తెలంగాణ 21 Feb 2026 8:21 pm

Vishwak Sen gifts expensive Rolex watch to Ravi Basrur

Mass ka Das Vishwak Sen has showcased his multifaceted talents as an actor, writer and director. Post delivering cult films like Falknuma Das and Das ka Dhamki as a director, he is now back as a director with #CULT. The movie is produced by Sandeep Kakarala and teaser has been released today with a huge […] The post Vishwak Sen gifts expensive Rolex watch to Ravi Basrur appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 8:21 pm

Bhimgal |మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం

Bhimgal | మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం Bhimgal | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Feb 2026 8:15 pm

Rs.1180 cr |ఎన్‌జీజీవో హోమ్ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం…

Rs.1180 cr | ఎన్‌జీజీవో హోమ్ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం… Rs.1180 cr |

ప్రభ న్యూస్ 21 Feb 2026 7:54 pm

అదరగొట్టిన అమ్మాయిలు.. ఆసీస్ గడ్డపై టి-20 సిరీస్ కైవసం

అడిలైడ్: భారత మహిళ జట్టు మరో చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన.. అతిథ్య జట్టును చిత్తు చేసి టి-20 సిరీస్‌ని కైవసం చేసుకుంది. అడిలైడ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ని 2-1 తేడాతో దక్కించుకుంది. మూడో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో స్మృతి 82, జెమీమా 59, రిచా 18 పరుగులు చేశారు. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఆసీస్‌ను భారత బౌలర్లు 159 పరుగులకే కట్టడి చేశారు. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆసీస్ 159 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటింగ్‌లో ఆష్లే గార్డ్‌నర్ 57, లిచ్‌ఫీల్డ్ 26 పరుగులు చేయగా.. మిగితా వారందరూ స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. భారత బౌలింగ్‌లో శ్రేయాంక, శ్రీ చరణి చెరి మూడు, అరుంధతి 2, రేణుక 1 వికెట్ తీశారు. బ్యాట్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మన తెలంగాణ 21 Feb 2026 7:52 pm

Photos : Cult Movie Teaser Launch Event

The post Photos : Cult Movie Teaser Launch Event appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 7:46 pm

General |మెరుగైన వైద్య సేవ‌లు…

General | మెరుగైన వైద్య సేవ‌లు… General | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ :

ప్రభ న్యూస్ 21 Feb 2026 7:43 pm

Fact check: Viral video claiming Shashi Tharoor praised Pakistan Cricket Board is fake

The original footage shows Tharoor advocating for keeping politics separate from sports, not endorsing any cricket board.

తెలుగు పోస్ట్ 21 Feb 2026 7:42 pm

నిరుపేద కుటుంబానికి మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ చేయూత..

నిరుపేద కుటుంబానికి మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ చేయూత.. రూ.18000,క్వింటా బియ్యం అందజేత

ప్రభ న్యూస్ 21 Feb 2026 7:40 pm

సమిష్టి కృషి వల్లే పార్టీ ఓటింగ్ శాతం పెరిగింది: సిఎం రేవంత్

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మెజార్టీ 2 శాతమే తేడా అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్నెళ్ల తర్వాత జరిగిన ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 4 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ 12 శాతమని తెలిపారు. కార్యకర్తల కృషి, ప్రజల నమ్మకం వల్లే కాంగ్రెస్ ఓటు శాతం పెరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కుటుంబంలో 3 తరాలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి సొంత ఇళ్లు కూడా లేదని తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన రాహుల్ గాంధీ కుటుంబంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే కాంగ్రెస్‌ను కనుమరుగు చేయాలని కుట్ర జరుగుతోందని అన్నారు. తాను పిసిసి అధ్యక్షుడు అయ్యే నాటికి పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని.. పార్టీలోనూ కొందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నానని సిఎం రేవంత్ అన్నారు. నేతలందరినీ కలిసి తన ఆలోచనలు చెప్పి.. అందరినీ ఒప్పించానని తెలిపారు. సమిష్ట కృషితో పార్టీ ఓటింగ్ 2.5 శాతం నుంచి 40 శాతానికి చేరిందని అన్నారు. డిసిసి అధ్యక్షులుగా బాగా పని చేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే టికెట్లు పొందలేని వారికి ఎమ్మెల్సీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన మరో 60 మందిని కార్పొరేషన్ ఛైర్మన్లుగా చేశామని అన్నారు. పార్టీలో అందరి పని తీరు మీద నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. మెరిట్‌లో ఉన్న వారికి పార్టీలో కచ్చితంగా న్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 21 Feb 2026 7:34 pm

ప్రమాదాల నివారణకు చర్యలు..

ప్రమాదాల నివారణకు చర్యలు.. రోడ్డుకి ఇరువైపుల పారిశుద్ధ్య పనులు.. పిచ్చి మొక్కలు తొలగింపు

ప్రభ న్యూస్ 21 Feb 2026 7:33 pm

మంత్రి వివేక్ ను విమర్శిస్తే సహించేది లేదు..

మంత్రి వివేక్ ను విమర్శిస్తే సహించేది లేదు.. చెన్నూర్ ఆంధ్రప్రభ : గత

ప్రభ న్యూస్ 21 Feb 2026 7:29 pm

ఎంపీ ఈటల రాజేందర్‌ను హౌస్ అరెస్ట్

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను శనివారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో, ఆయన్ను పరామర్శించేందుకు ఈటల రాజేందర్ కామారెడ్డికి బయల్దేరారు. అయితే, ఆయన వెళ్తే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యగాఆయన్ను మేడ్చల్‌లోని తన నివాసంలోనే అడ్డుకుని గృహనిర్బంధం చేశారు.మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు ఈటల నివాసానికి చేరుకుని ఆయన్ను బయటకు రాకుండా నిలిపివేశారు. ఈ హౌస్ అరెస్ట్‌ను ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తోందని, పోలీసులను అడ్డం పెట్టుకుని గుండాయిజం చేస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

మన తెలంగాణ 21 Feb 2026 7:27 pm

అనుమతులు లేకుండా ఇసుక తరలింపు..

అనుమతులు లేకుండా ఇసుక తరలింపు.. ఊట్కూర్, ఆంధ్రప్రభః ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా

ప్రభ న్యూస్ 21 Feb 2026 7:17 pm

ఢిల్లీలో హైఅలర్ట్..

ఢిల్లీలో ఎర్రకోటతోపాటు దేశ వ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్రమూక దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) దాడులకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐఈడీ బాంబు దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫిబ్రవరి 6న పాక్ రాజధాని ఇస్లామాబాద్ లోని మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా ఎల్‌ఈటీ ఈ దాడులను ప్లాన్ చేస్తోంది. ఇస్లామాబాద్ దాడిలో 31 మంది మరణించగా, 160 మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. గత ఏడాది నవంబర్ 10 న ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు దాడిలో 12 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇంతకు రెండింతల మంది గాయాలపాలయ్యారు. అల్ ఫలాహ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పేలుడు పదార్ధాలున్న కారుతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా అతడిని గుర్తించారు. అంతకు ముందు పోలీస్‌లు హర్యానా లోని ఫరీదాబాద్‌లో ఏకంగా 2900 కేజీల పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకుని భారీ ఉగ్ర కుట్రను ఆదిలోనే భగ్నం చేశారు. దీంతో తమ ప్లాన్ గురించి పోలీసులకు తెలిసిందన్న కంగారులో ఉమర్ మొహమ్మద్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ అదిల్ రాథర్‌తోపాటు మరికొందరిని అదుపు లోకి తీసుకున్నారు. 

మన తెలంగాణ 21 Feb 2026 7:16 pm

అమెరికాతో ఒప్పందాల వల్ల మన రైతులకు నష్టం: హరీష్‌రావు

కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఇటీవల చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులతో పాటు దేశంలోని రైతులు తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభపక్ష ఉపనేత హరీష్‌రావు వ్యాఖ్యానించారు. అమెరికాలో సాగవుతున్న జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటలను భారతదేశంలోకి ఎలాంటి టాక్స్ లేకుండా అనుమతించడం వల్ల మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న రైతులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ప్రమాదంలో పడతారని తెలిపారు. మన దేశంలో కూడా అన్నదాతలు మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, పత్తి పంటలని ఎక్కువగా పండిస్తూ జీవనం సాగిస్తున్నారని వివరించారు. అమెరికా దేశం నుంచి ఈ పంటలను దిగుమతి చేసుకోవడం వల్ల తెలంగాణలో ఉన్న రైతులంతా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఎన్‌టిఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బడి అగ్రి షో కార్యక్రమానికి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయం చేస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న యాంత్రిక పరికరాలను ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రైతులకు ఇంకా రైతు భరోసా రాలేదని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో రైతు భరోసా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేవలం 12 గంటల పాటే విద్యుత్ సరఫరా ఇస్తున్నారని, ఎరువులు సకాలంలో అందడం లేదని చెప్పారు.

మన తెలంగాణ 21 Feb 2026 7:08 pm

చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటన : కెటిఆర్

రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటన అని కెటిఆర్ విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినవారిని కనీసం చివరిచూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలకు మానసిక క్షోభకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం గడుస్తున్నా మృతదేహాల వెలికితీతలో కానీ సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనం అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై పెట్టే శ్రద్ధ, ఇకనైనా కార్మిక సంక్షేమం మీద, ప్రజా శ్రేయస్సు మీద పెడితే ఇటువంటి విషాదాలు పునరావృతం కావు అని పేర్కొన్నారు.

మన తెలంగాణ 21 Feb 2026 7:01 pm