మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆంధప్రదేశ్..
మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణ రావు సహా తొమ్మిది మంది ఎపి డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని డిజిపి ప్రకటించారు. లొంగిపో యిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ డంప్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేత, ఆంధ్రాఒడిశా సరిహద్దు (ఏవోబి) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణ రావు తలపై రూ.25 లక్షల భారీ రివార్డు ఉందంటేనే ఆయన ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఆయనతో పాటు కర్తం లచ్చు (రూ.5 లక్షల రివార్డు), పోడియం రాజే, ముచ్చిక మాస, మడవి జోగి, కర్తం అడామే(తలో రూ. 4 లక్షల రివార్డు), మాదివి అడా మా, ముచ్చిక లక్ష్మణ్, కడితి హుర్రే (తలో రూ.1 లక్ష రివార్డు) వంటి ముఖ్య నేతలు లొంగిపోయారు. వీరికి ప్రభుత్వం తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ. 20,000 అందజేసి, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు భరోసా కల్పించింది. పభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గ్రామాలకు కూడా చేరుతుండటం, ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పు రావడంతో ఉద్యమ ఉనికి తగ్గుతోందని, అందుకే సాయుధ పోరాటాన్ని వీడి లొంగిపోయినట్లు సోమన్న వివరించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నారాయణరావు దాదాపు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. 1989లో పీపుల్స్ వార్ గ్రూప్లో చేరిన ఆయన, క్రమంగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మిలిటరీ ఆపరేషన్లలో ఆరితేరిన నేతగా గుర్తింపు పొందాడు. గత ఏడాది అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేతలు గాజర్ల రవి, అరుణ మరణించిన తర్వాత, ఏవోబీ బాధ్యతల్ని సోమన్న చేపట్టారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశాలో పలు కేసులు నమోదయ్యాయి. ఎపి ప్రభుత్వం భారీ రివార్డును కూడా ప్రకటించింది. ఉద్దానం ప్రాంతం నుంచి వచ్చిన సోమన్న లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కు కోల్పోయినట్లయింది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు పరిస్థితులు మారాయని, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు వెళ్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సాయుధ పోరాటం ద్వారా సాధించేదేమీ లేదని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లొంగుబాటు ఏవోబి ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి విఘాతంగా మారుతుందని భద్రతా దళాలు భావిస్తున్నాయి. గతంలో అగ్రనేతగా ఉన్న గణపతి వంటి వారు ప్రస్తుతం రాష్ట్రంలో లేరని, ఇతర రాష్ట్రాల విషయాల గురించి మాట్లాడలేమని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు పూర్తి శాంతి నెలకొందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోయిన వారిపై చట్టపరమైన ప్రక్రియ యథావి ధిగా జరుగుతుందని, అదే సమయంలో వారి పునరావాసానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. హింస వల్ల సాధించేదేమీ లేద ని, అభివృద్ధి పథంలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ఇవాళ సత్ఫలితాలను ఇచ్చింది. నక్సలిజం కోరల్లో చిక్కుకుని నలిగి పోయిన మారుమూల గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి వెలుగులు ప్రసరించనున్నాయి. ఎపి పోలీసుల తెగువ, కేంద్ర ప్రభుత్వ దృఢ నిశ్చయం కలిసి రాష్ట్రాన్ని నక్సల్స్ ఫ్రీ స్టేట్గా నిలబెట్టాయి.
ഫാക്ട് ചെക്ക്: സൌദി രാജകൊട്ടാരത്തിൽ വെടിവെപ്പ്? പ്രചാരണത്തിൻ്റെ വസ്തുതയെന്ത്
ഇറാൻ ആക്രമണത്തിനെതിരെ സൌദി രംഗത്തെത്തിയതിന് പിന്നാലെയാണ് പ്രചാരണം
Palnadu Family Suicide : పల్నాడు గుండె చెరువు Andhra Prabha News
Palnadu Family Suicide : పల్నాడు గుండె చెరువు Andhra Prabha News
కాంగ్రెస్ పాలనలోనూ ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదు: విజయశాంతి ఆవేదన
ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ తప్పనిసరి బాధ్యత నిర్లక్ష్యం చేస్తే అది చారిత్రక తప్పిదమే మండలిలో ఎంఎల్సి విజయశాంతి ఆవేదన మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమంపై శాసనమండలిలో ఎంఎల్సి విజయశాంతి తన గళం వినిపించారు. ప్రభుత్వంపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సోమవారం ఆమె సభలో మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే, ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఉండేవారా? అని ప్రశ్నించారు. పదవుల కంటే ముందు వారి త్యాగాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలతో పాటు వివిధ సందర్భాల్లో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పనిసరిగా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను ఆదుకోవడమనేది ప్రభుత్వ తప్పనిసరి బాధ్యత అని అన్నారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తిస్తే అది చరిత్రగా నిలుస్తుంది. లేని పక్షంలో వారిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా ఇంకా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు సైతం అమలు కాలేదన్నారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఆయా కుటుంబాలకు నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ సైతం ఇచ్చామని ప్రభుత్వానికి వివరించారు. ఉద్యమకారులకు మనం తొలి ప్రాధాన్యం ఇస్తామని భరోసా కూడా ఇచ్చామన్నా . ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు తమను ప్రశ్నిస్తున్నారని శాసనమండలి వేదికగా ఎంఎల్సి విజయశాంతి వివరించారు. ఉద్యమ కారులపై పెట్టిన కేసులు ఎత్తి వేసి జూన్ 2వ తేదీ నాటికి వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చామని అది కూడా ఇంకా నెరవేరలేదని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన గౌరవం, పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని విజయశాంతి ప్రభుత్వానికి ఆమె సూచించారు.
ఆడబిడ్డలకు శానిటరీ ప్యాడ్స్ అందించలేని దుస్థితిలో ప్రభుత్వాలు..
ఎస్సి, ఎస్టి సంక్షేమ హాస్టళ్లు, కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు కనీసం శానిటరీ ప్యాడ్స్ అందించలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఎక్స్ వేదికగా కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పీఎం శ్రీ పథకం కింద ఇతర స్కూళ్లలో ఇస్తున్నట్టే ఎస్సి, ఎస్టి సంక్షేమ హాస్టళ్లు, కెజిబివిల్లో చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతినెలా విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని ఆమె కోరారు.
గెట్ అవుట్.. బిఆర్ఎస్ ఎంఎల్సిలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్తో శాసనమండలి కార్యకలాపాలకు అడ్డుతగిలిన ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీకి చెందిన 11 మంది ఎంఎల్సిలను సభ నుంచి చైర్మన్ గత్తా సుఖేందర్రెడ్డి సస్పెండ్ చేశారు.పెద్దల సభ గౌరవాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాల్సిందిగా శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్బాబు మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైర్మన్ ఆమోదిస్తూ వారిని సభ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. అయితే సస్పెండ్ చేసినట్టు ప్రకటించినప్పటికీ బయటికి వెళ్లడానికి నిరాకరించిన ఎమ్మెల్సీలపై ఒకదశలో ‘గెటవుట్’ అంటూ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘మీలాంటి వారు సభకు రావడం దురదృష్టకరం&పెద్దల సభ గౌరవాన్ని దిగజార్చారు’ అని చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. శాసన మండలిలో సోమవారం బీఆర్ఎస్ సభ్యులు, రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఛైర్మెన్ పోడియం దగ్గరికి దూసుకెళ్లారు. బిఆర్ఎస్ ఎంఎల్సిల ఆందోళన మధ్యనే తల్లిదండ్రుల సంరక్షణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఛైర్మన్ పోడియం వద్ద కు చేరుకుని ప్లకార్డులు పట్టుకుని బిఆర్ఎస్ ఎంఎల్సిలు నిరసన తెలిపారు. దీంతో మంత్రి శ్రీధర్బాబు స్పందిస్తూ ఈ అంశంపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లుగా శాసనసభలో స్పష్టం చేశామన్నారు. సభ సజావుగా సాగేందుకు బిఆర్ఎస్ సహకరించాలని కోరారు. మరో వైపు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కూడా సభా కార్యక్రమాల నిర్వహణకు సహకరించాలని బిఆర్ఎస్ ఎంఎల్సిలను పదే పదే కోరారు. సభ్యుల ప్రవర్తన సభా నియమావళికి విరుద్ధమని చెప్పినప్పటికీ వినిపించుకోకపోవడంతో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బిఆర్ఎస్ ఎంఎల్సిలు 11 మందిని సభ నుండి సస్పెండ్ చేస్తోన్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మార్షల్స్కు, బిఆర్ఎస్ ఎంఎల్సిలకు మధ్య తోపులాట జరిగింది. సస్పెన్షన్ వేటు వేసిన తరువాత సైతం సభలోనే ఉండి బిఆర్ఎస్ ఎంఎల్సిలు చైర్మన్ పోడియం చుట్టుముట్టే ప్రయత్నం చేయడం, నిరసనకు దిగడంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సస్పెండ్ అయిన బిఆర్ఎస్ ఎంఎల్సిలు : మధుసూదన్ చారీ, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, నవీన్ కుమార్ రెడ్డి, వంటేర్ యాదవ రెడ్డి, శంబీపూర్ రాజు, దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ, కోటి రెడ్డి, వాణీ దేవి, తాతా మధు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.****
ప్రధాని మోడీ ఫొటో పెడతాం: సిఎం రేవంత్
హైదరాబాద్: సన్న బియ్యం పథకానికి తమకు ఏటా రూ.14,500 కోట్ల రూపాయల వ్యయం అవుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తే.. పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెడతామని సిఎం చెప్పారు. సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. సన్న బియ్యం పథకం బాగుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని తాను ఇదివరకే కేంద్రాన్ని కోరానని తెలిపారు. రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ సన్న బియ్యం పండించాలని రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నామని సిఎం అన్నారు. 3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఇది 90 శాతం కూడా కావచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
స్పోర్ట్స్ హ్యాకథాన్లో 2,132 వినూత్న ఆవిష్కరణలు
హైదరాబాద్: క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన స్పోర్ట్స్ హ్యాకథాన్ ఘనంగా ముగిసింది. గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న హ్యాకథాన్లో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, క్రీడాకారులు, స్టార్టప్లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలు రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయేశ్ రంజన్, ఐఏఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (క్రీడలు), తెలంగాణ ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ యువతలో సృజనాత్మకతను వెలికితీసే ఇలాంటి వేదికలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్, గౌరవ ఉప సభాపతి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ హ్యాకథాన్లో ప్రత్యేకత ఏమిటంటే, కరాటే, వాలీబాల్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, పవర్లిఫ్టింగ్, చెస్, కేరంలు వంటి మొత్తం 24 క్రీడలు భాగస్వామ్యం కావడం. పాల్గొన్న వారు క్రీడల్లో పాల్గొంటూనే వాటిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి వినూత్న పరిష్కారాలను ఆవిష్కరించారు. ఈ ఆలోచనలను “పిచ్ అరేనా” వేదికపై నిపుణులు, అధికారులు, పెట్టుబడిదారుల ముందు ప్రదర్శించారు. ఈ హ్యాకథాన్లో వచ్చిన ఆవిష్కరణలు క్రీడల పనితీరు మెరుగుదల, శిక్షణ విధానాలు, ఫ్యాన్ ఎంగేజ్మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులను చూపిస్తున్నాయి. ఈ 2,132 ఆవిష్కరణలను ప్రత్యేక స్మారక గ్రంథంగా (Souvenir) ప్రచురించేందుకు నిర్వాహకులు ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా హ్యాకథాన్ బ్రాండ్ ఓనర్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ.. “క్రీడలు కేవలం ఆటలకే పరిమితం కావు — అవి ఆవిష్కరణలకు కూడా మార్గం చూపుతాయి. ఈ హ్యాకథాన్ ద్వారా యువతలో ఉన్న అపార సృజనాత్మకత వెలుగులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మా లక్ష్యం” అని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడం ద్వారా తెలంగాణ రాష్ట్రం క్రీడలు మరియు ఆవిష్కరణల రంగంలో ముందంజలో ఉందని మరోసారి రుజువైంది.
జిఒ 317 బాధితులకు న్యాయం చేయండి: సిఎంకు కవిత లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: జిఒ 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వన్ టైం రిలీఫ్ కింద ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అప్పటికే వివిధ ఉమ్మడి జిల్లాలు, జోన్లలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రాతిపాదికన కొత్త జిల్లాలు, జోన్లలో పోస్టింగ్స్ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగుల సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఎనిమిదేళ్లు, అంతకన్నా తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు, టీచర్లు ఆయా ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏదో ఒక జిల్లాకు అలాట్ అయ్యారని గుర్తు చేశారు. ఇలా ఉద్యోగులను కొత్త జిల్లాలు, జోన్ల వారీగా సర్దుబాటు చేయడానికి అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం 2021 డిసెంబర్ 6న జిఒ నంబర్ 317 జారీ చేసిందని తెలిపారు. కానీ, ఆ జిఒలోనూ స్థానికతపై స్పష్టత లేకపోవడంతో వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. జిఒ 317తో ఉద్యోగులు, టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అప్పటి సిఎం కెసిఆర్కు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
రేవంత్ సర్కార్పై కాగ్ అక్షింతలు: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కాగ్ అప్పులు తెచ్చారు..కానీ ఆస్తులు పెంచలేదు కాగ్ రిపోర్టుతో అయినా కళ్లు తెరవండి బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు మనతెలంగాణ/హైదరాబాద్: రెండేళ్ల మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్ధిక క్రమశిక్షణ గాడి తప్పిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్(కాగ్) నివేదిక స్పష్టం చేసిందని బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు అన్నారు. కాగ్ రిపోర్టు రేవంత్ సర్కార్కు చెంప పెట్టు లాంటిదని విమర్శించారు. తాము ఈ ప్రభుత్వ పని తీరుపై నిలదీస్తున్న అంశాలనే కాగ్ ప్రస్తావించిందని ఒక ప్రకటలో పేర్కొన్నారు. సంక్షేమ రంగానికి, సాగునీటి రంగానికి ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో భారీగా నిధులు పెట్టి ఖర్చు పెట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందిన విషయాన్ని కాగ్ తప్పుపట్టిందని చెప్పారు. అంకెల్లో గోల్ మాల్.. ఆచరణలో అంతకన్నా గోల్ మాల్ ఉందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టిందని విమర్శించారు. తెచ్చిన అప్పులను రాష్ట్రానికి ఆస్తులుగా మలచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ తేల్చి చెప్పిందని, రాష్ట్రాన్ని భారీ రెవెన్యూ లోటు దిశగా తీసుకెళ్తుతున్నారని కాగ్ చెప్పకనే చెప్పిందని పేర్కొన్నారు. మాటలు మూరెడు-చేతలు చారెడు కూడా లేవని ఈ చేవ లేని సర్కార్కు కాగ్ అక్షింతలు వేసిందని తెలిపారు. తాము ప్రభుత్వాన్ని తప్పుబడితే పెడబొబ్బలతో తమ మీద దాడి చేస్తారని, కాగ్ రిపోర్టు తర్వాత కూడా ఇంకా ఆవే అబద్దాలను కొనసాగిస్తారా..? అని ప్రశ్నించారు. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన రిపోర్టులోనే కాగ్ అనేక ప్రభుత్వ లోపాలను తప్పు పట్టిందని, 2025 -26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభుత్వం లెక్కలేనన్ని తప్పులు చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్లు కూడా డొల్ల అని కాగ్ రిపోర్టు 2024 -25 కుండబద్దలు కొట్టిందని విమర్శించారు. మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప దాటదు అనడానికి కాగ్ రిపోర్టు మరో ఉదాహరణ అని, ఈ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు అని చెప్పడానికి కాగ్ రిపోర్టు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. అప్పులు తెచ్చి కూడా ఆరు గ్యారంటీలను అమలు చెయ్యలేని అసమర్ధ సర్కార్ ఇది అని కాగ్ పరోక్షంగా తప్పుపట్టిందని పేర్కొన్నారు. కాగ్ నివేదికతోనైనా కళ్ళు తెరవాలని, పిచ్చి కూతలు మాని ప్రజలకు పనికొచ్చే విషయాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. బలంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పునాదులు ధ్వంసం చేసి తెలంగాణను దివాలా రాష్ట్రంగా మార్చొద్దని, ప్రతీకార రాజకీయాలు, రాష్ట్ర పరపతిని దెబ్బతీసే విధానాలకు స్వస్తి పలికి పాలన మీద దృష్టి సారించాలని హితవు పలికారు.
వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. తల్లి, కుమారుడి మృతి
తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడిన తల్లి.. కుమారుడు మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ వేడుకకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు’పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లును పౌర స్వేచ్ఛను హరించే ఒక ‘క్రూరమైన ఆయుధం’గా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు సోమవారం కెటిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించేందుకే ఇటువంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత అస్పష్టంగా ఉన్నాయని విమర్శించారు. అమలు యంత్రాంగం ఆధారాల కంటే అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఈ బిల్లు రూపకల్పన జరిగిందని, ఇది కచ్చితంగా దుర్వినియోగానికి దారితీస్తుందని పేర్కొన్నారు. బిల్లులో ఉపయోగించిన ‘వ్యతిరేక భావాలు ప్రేరేపించడం’, ‘సామాజిక సమగ్రతను దెబ్బతీయడం’ వంటి పదాలకు స్పష్టమైన న్యాయ పరిమితులు లేవని ఎత్తిచూపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పదజాలాన్ని పొందుపరిచారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తే వాటిని ‘ఫేక్ న్యూస్’గా ముద్రవేసి జైలుకు పంపే ప్రమాదం పొంచి ఉందన్నారు. శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తుచేశారు. కేవలం ప్రత్యక్ష హింసకు ప్రేరేపించే మాటలపైనే నియంత్రణ ఉండాలని, విమర్శ లేదా వ్యంగ్యం శిక్షార్హం కాదని న్యాయస్థానం స్పష్టం చేసిందని తెలిపారు. ఈ పరిమితిని మించి చట్టాలు చేయడం ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. ఏడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షలను ప్రతిపాదించడం ద్వారా ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించాలని ప్రభుత్వం చూస్తోందని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, విద్యార్థులు, సామాన్యులు తమ అభిప్రాయాలను పంచుకోవాలంటేనే భయపడేలా ఈ శిక్షలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే దేశంలో హేట్ స్పీచ్పై తగినన్ని చట్టాలు ఉండగా, అదనంగా ఈ చట్టం తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి..? అని ప్రశ్నించారు. వెంటనే ఈ బిల్లును పునర్విమర్శించాలని, ప్రజాస్వామ్య విలువులను గౌరవిస్తూ అణచివేత ధోరణిని వీడాలని కెటిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్తోనే భవిష్యత్ మార్పు: పొంగులేటి
పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనకు ముగింపు పలకాలి కేరళలో మార్పు కోసం యూడిఎఫ్ను గెలిపించాలి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: కేరళ ప్రజలారా మీ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. పది సంవత్సరాల ఎల్డీఎఫ్ అసమర్ధ పాలనకు ముగింపు పలకండి, అవినీతి పాలనను అంతం చేయండి, విభజన రాజకీయాలను తిరస్కరించండి, అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన కోసం యూడిఎఫ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వ మార్పు కోసం కాదు, కేరళ భవిష్యత్ కోసమని ఆయన అన్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించి, యూడిఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కేరళలోని పత్తనం తిట్ట జిల్లాలోని ఆడూరు, అరుణ్ ముల నియోజకవర్గాల్లో కెఎస్ఆర్టీసి జంక్షన్ వద్ద జరిగిన ఏఐసిసి అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. అవినీతి పాలనకు కేరాఫ్ ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కేరళలో పది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎల్డీఎఫ్ పాలన ప్రజలను పూర్తిగా నిరాశ పరిచిందని ఆయన ఆరోపించారు. పది సంవత్సరాలుగా కేరళను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం అవినీతి పాలనకు ప్రతీకగా మారిందని, యువతకు ఉద్యోగాలు లేవని, పెట్టుబడులు రావడం లేదని, సంక్షేమం కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైందని మంత్రి విమర్శించారు. దేశవ్యాప్తంగా విభజన రాజకీ యాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచే బిజెపికి కేరళలో స్థానం లేదని ప్రజలు ఇప్పటికే పలుమార్లు తీర్పు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రత్యామ్నాయం యూడిఎఫ్ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలనను ఉదాహరణగా చూపుతూ, తాము ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చుతున్నామో దేశం చూస్తోందని, అదే విధంగా కేరళలో కూడా ప్రజా పాలన తీసుకురాగలిగేది కాంగ్రెస్ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు.. లబ్దిదారులకు గుడ్ న్యూస్
మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తుది విడత బిల్లుల విడుదలకు ఉన్న నిబంధనల్లో కొన్నిమార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లబ్దిదారుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, త్వరగా గృహ ప్రవేశాలు చేసేందుకు వీలుగా ఈ మేరకు కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. ఇంటి నిర్మాణపు పనులు సమగ్రంగా పూర్తయిన తరువాతనే క్షేత్ర స్థాయి సిబ్బంది ఫొటోలను అప్లోడ్ చేసి తుది బిల్లుల విడుదలకు ప్రతిపాదనలు పంపాలని గతంలో నిర్ధేశించగా, లబ్దిదారులు తాము నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశం చేసుకున్న తరువాత కూడా కొన్ని పనులను చేపట్టేందుకు కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా ఇళ్లలో నివసించేందుకు అనువైన వసతులు, పరిస్థితులుంటే చాలు తుది విడత బిల్లులు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయి నివాసయోగ్యంగా ఉన్నప్పటికీ, చిన్న పనులు కాకపోవడంతో బిల్లుల విడుదల కాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన సూచనలు, లబ్ధిదారుల ఇబ్బందులు మొదలైన అంశాలపై నిశితంగా అధ్యయనం చేసిన తరువాత కొన్ని అంశాల్లో సడలింపు ఇస్తున్నట్లు ఎండి పేర్కొన్నారు. అందులో ప్రధానంగా లోపలి వైపు ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, తలుపులు(దర్వాజాలు), పూర్తి స్థాయి విద్యుత్ వైరింగ్, ప్లబింగ్ వంటి పనులను లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసుకున్న తరువాత వీలును బట్టి పూర్తి చేసుకోవచ్చన్నారు. ఈ సడలింపుల వల్ల ఇందిరమ్మ లబ్దిదారులకు తుదివిడత బిల్లు రూపేణా చెల్లించాల్సిన మొత్తం విడుదలై, వారికి ఆర్ధికంగా వెసులు బాటు కలుగుతుందని ఆయన వివరించారు. ఈ మేరకు, సవరించిన మార్గదర్శకాల ప్రకారం గ్రామ స్థాయి నుంచి బిల్లుల ప్రతిపాదనలు ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎండి ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలు ఇలా... కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్లాస్టరింగ్ ఇంటి వెలుపలి వైపు పూర్తి కావాలి.(లోపలి వైపు ప్లాస్టరింగ్ గృహ ప్రవేశం తరువాత కూడా చేసుకోవచ్చు.) ఫ్లోరింగ్ తప్పనిసరి కాదు (ఆయా లబ్దిదారుల ఆర్థిక స్థితిగతులను బట్టి ఫ్లోరింగ్ చేసుకునే వెసులుబాటు) కల్పించారు. కలరింగ్ - వెలుపలి భాగంలో చేయాల్సి ఉంటుంది. (రెండో కోట్ కలరింగ్ను ఇంటిలో నివసిస్తూ, వినియోగిస్తూ కూడా చేసుకోవచ్చు). ఇంటి వెలుపలి దర్వాజాలు ఏర్పాటు చేసుకోవాలి. (లోపలి వైపునవి ఇంటిలో నివసిస్తూ కూడా వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు), విద్యుత్ వైరింగ్ తుది బిల్లు విడుదలకు తప్పనిసరి కాదు. (వైరింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ పాత ఇంటి కనెక్షన్ ద్వారా విద్యుత్ను వినియోగించుకోవచ్చు). ప్లంబింగ్ - పనులు ఇంటిలో నివసిస్తూ చేసుకోవచ్చు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా తుది విడత బిల్లుల విడుదలకు ప్రతిపాదనలు పంపించాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి మేనేజింగ్ డైరక్టర్ విపి గౌతం ఉత్తర్వులు జారీ చేశారు.
హ్యాకథాన్లో 2,132 వినూత్న ఆవిష్కరణలు..
హ్యాకథాన్లో 2,132 వినూత్న ఆవిష్కరణలు.. హైదరాబాద్, ఆంధ్రప్రభ : క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను
ప్రభుత్వ ఉర్దూ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలు
ప్రభుత్వ ఉర్దూ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలు 50 ఏళ్ల పాఠశాలలో సీనియర్ విద్యార్థులందరి
చిట్యాలలో రెచ్చిపోతున్న ఫోన్ మాఫియా…
చిట్యాలలో రెచ్చిపోతున్న ఫోన్ మాఫియా… చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణంలో గత
AA25: Allu Arjun’s Superhero Films Loading
Icon Star Allu Arjun is currently shooting for his 22nd film directed by Atlee. The film is slated for summer release. The actor is in talks for several films. He is in talks with Malayalam actor and director Basil Joseph for a film and the discussion has been going on from a long time. Allu […] The post AA25: Allu Arjun’s Superhero Films Loading appeared first on Telugu360 .
పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి…
పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి… అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
అమెరికా విమానాలకు గగనతలాన్ని మూసేసిన స్పెయిన్
అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. ఇరాన్తో జరుగుతోన్న యుద్ధంలో పాలు పంచుకొనే విమానాలను అనుమతించమని ఆ దేశ రక్షణ మంత్రి మార్గెరెటా రొబెల్స్ సోమవారం వెల్లడించారు. ఇరు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక స్థావరాలను పశ్చిమాసియా ఘర్షణల కోసం వినియోగించడాన్ని ఇప్పటికే స్పెయిన్ నిరాకరించింది. ‘‘ఇరాన్ యుద్ధానికి సంబంధించిన కార్యకలాపాల కోసం మిలిటరీ స్థావరాలు లేక గగనతలాన్ని వియోగించడానికి అనుమతి ఇవ్వబోం. ఏక పక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ప్రారంభించిన యుద్ధంలో సహకరించకూడదని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే తాజా ప్రకటన వచ్చింది’’ అని రక్షణ, ఆర్థిక మంత్రులు స్థానిక మీడియాలో వెల్లడించారు.
సోషల్ మీడియాలో నకిలీ ఐడీలు ఖమ్మం, ఆంధ్రప్రభ : సాంకేతికతను వినియోగించుకొని కొందరు
ఆస్తి పన్ను చెల్లించని డిస్కవరీ కంపెనీ సామాను జప్తు
ఆస్తి పన్ను చెల్లించని డిస్కవరీ కంపెనీ సామాను జప్తు ఆస్తిపన్ను చెల్లించని వారిపై
ఉద్యమకారులను ముందస్తు అరెస్టు చేయడం తగదు..
ఉద్యమకారులను ముందస్తు అరెస్టు చేయడం తగదు.. తెలంగాణ ఉద్యమకారుడు జన్నె యుగేందర్, చిట్యాల,
అక్రమ అరెస్టులు ఖండించిన ఉద్యమకారులు..
అక్రమ అరెస్టులు ఖండించిన ఉద్యమకారులు.. మునుగోడు, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల
మలబార్ గోల్డ్ నూతన నగల షోరూమ్ ప్రారంభం…
మలబార్ గోల్డ్ నూతన నగల షోరూమ్ ప్రారంభం… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :
బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలి,
బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలి, జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేసిన నవాబుపేట రైతులు,
రోస్టర్ పాయింట్లలో మాలలకు తీవ్ర అన్యాయం
రోస్టర్ పాయింట్లలో మాలలకు తీవ్ర అన్యాయం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ
కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణం: కేంద్ర మంత్రి
హైదరాబాద్: కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణమని, దీనివల్ల లక్ష కోట్ల ప్రజాధనం వృథాగా నీటి పాలయ్యిందని కేంద్ర జల్శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ సోమవారం లిఖిత పూర్వకంగా పలు అంశాలను వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలంటూ రాజ్యసభలో కేంద్రాన్ని బిఆర్ఎస్ ఎంపి సురేశ్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై ఎన్డీఎస్ఏ నివేదికను ఈ సందర్భంగా ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను కేంద్ర బృందం అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జల్ జీవన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ వద్ద జల్జీవన్ మిషన్ నిధులు రూ.873 కోట్లు ఉన్నా ఈ మూడేళ్లలో రూ.194 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పిఎంకెఎస్వై) కింద మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్త సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలు అందలేదని సిఆర్ పాటిల్ వెల్లడించారు. 99 ప్రాజెక్టుల్లో 71 పనులు చాలాకాలంగా నిలిచిపోయాయని ఆయన తెలిపారు. తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులను పిఎంకెఎస్వై కింద చేర్చడం జరిగిందని, వాటిలో అర్హత ఉన్న వాటికి కేంద్రం సహాయంగా రూ. 1,129.80 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ. 981.49 కోట్లను ఇప్పటివరకు కేంద్ర సహాయంగా అందించిందని ఆయన వెల్లడించారు
Video : Director Abhilash Reddy Kankara Exclusive Interview
The post Video : Director Abhilash Reddy Kankara Exclusive Interview appeared first on Telugu360 .
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
గువాహటి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. బర్సాపరా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది రవీంద్ర జడేజా చెన్నై నుంచి రాజస్థాన్కి, సంజూ శాంసన్ రాజస్థాన్ నుంచి చెన్నైకి ట్రేడ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్లో వాళ్ల మాజీ జట్టుపై ఈ ఆటగాళ్లు ఎలా ప్రదర్శిస్తారా..? అనే ఆసక్తి నెలకొంది. తుది జట్లు: సిఎస్కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, మ్యాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్. ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురేల్(కీపర్), షిమ్రాన్ హెట్మైర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేశ్ శర్మ.
పేదరికం నిర్మూలించడమే లక్ష్యం..
పేదరికం నిర్మూలించడమే లక్ష్యం.. స్వర్ణాంధ్ర లక్ష్యంగా పి4 పథకం…ఉరవకొండలో ఘనంగా వార్షికోత్సవం ఉరవకొండ
ఆ ఆడియోపై విచారణ జరిపించండి: సిపిఎం
హైదరాబాద్: ఎంఎల్ఎ దానం నాగేందర్ 2 కోట్ల లంచం అడిగినట్లు మాట్లాడిన ఆడియోపై విచారణ జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది. బిల్డింగ్ పర్మిషన్ కోసం బిల్డర్ దగ్గర రూ.2 కోట్లు లంచం అడిగినట్లు ఖైరతాబాద్ ఎంఎల్ఎ దానం నాగేందర్ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి దోషులను చట్ట ప్రకారం కటినంగా శిక్షించాలని సిపిఎ గ్రేటర్ హైదరాబాద్ సెంటురల్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎంఎల్ఎ దానం నాగేందర్ తనకు ఇప్పటికే 25 లక్షలు ముట్టినట్టు మాట్లాడారని, ఇందులో కొంతమంది ప్రభుత్వ అధికారులకు డబ్బులు ఇచ్చినట్టు అంటున్నారని ఆయనన్నారు. ఈ అంశంలో ఎవరి పాత్ర ఎంత ఉన్నది అనేది బయటికి రావాలన్నారు.
డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి:
డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచే నక్సలిజం అభివృద్ధి చెందింది: అమిత్ షా
న్యూఢిల్లీ: చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం సాధ్యమని.. తుపాకులతో కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ.. మాట్లాడితే ప్రజాస్వామ్యం అంటారు కానీ హింసను ఎలా సమర్థిస్తారు అని ప్రశ్నించారు. కాంబోడియా, పెరూ, కొలంబియాలో భయంకర రక్తపాతం జరిగిందని పేర్కొన్నారు. ‘‘దేశాభివృద్ధికి మావోయిస్టు సిద్ధాంతాలు, విధానాలు తీవ్ర ఆటంకం. మావోయిస్టుల రక్తపాత సిద్ధాంతాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. బస్తర్లో నక్సల్స్ అనేక ఏళ్లపాటు సమాంతర ప్రభుత్వం నడిపారు. ఆయుధాలు వీడాలని బస్తర్ వెళ్లి పలుసార్లు కోరాం’’ అని అన్నారు. నక్సలిజం నశించాలని గిరిజనులు కూడా కోరుకుంటున్నారని అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘నక్సలిజంపై పోరులో ప్రజలు కూడా మాకు అండగా నిలిచారు. వేల మంది సైనిక బలగాలు, పోలీసులను నక్సల్స్ చంపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అభివృద్ధినే కోరుకుంటున్నారు.. హింస కాదు. బస్తర్ యువకులను కలిశా.. వాళ్లందరూ నక్సలిజాన్ని వ్యతిరేకించారు. ప్రస్తుత సమాజంలో నక్సలిజానికి తావు లేదు. ఎన్డిఎ పాలనలో మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరుగుతోంది. నక్సలైట్ల ఎజెండాలో అభివృద్ధి అన్నది లేదు. నక్సలైట్లు తమ ఉనికి కోసమే పోరాడుతున్నారు. నక్సలైట్లు.. భగత్సింగ్, బిర్సాముండా కారు. వాళ్లతో నక్సలైట్లను పోల్చకూడదు. ప్రజలను చంపేవారు దేశభక్తులు ఎలా అవుతారు? నక్సలైట్లు తమ సిద్ధాంతాన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు’’ అని అమిత్ షా తెలిపారు. నక్సలైట్లకు ఆదర్శం భారతీయులెవరూ కాదు.. వారికి మావో ఆదర్శమని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘రోడ్లు, విద్యుత్ వంటి సదుపాయాలు లేకుండా గిరిజన ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయి. నక్సల్స్.. చిన్న పిల్లలకు తుపాకులు, ఆయుధ సామాగ్రి ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల యువత జీవితాలను నక్సల్స్ నాశనం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. విద్య, వైద్య, మౌలిక వసతులను కూడా నక్సల్స్ ధ్వంసం చేస్తున్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం.. రాజ్యాంగాన్ని స్వీకరించాం. ఆయుధాలు చేపట్టి ప్రజల ప్రాణాలు తీయాలని ఏ సిద్ధాంతాలు చెప్పాయి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని నక్సల్స్ గ్రహించాలి. స్కూళ్లు, బ్యాంకులు, ఆస్పత్రులు తగలబెట్టేవారి వల్ల అభివృద్ధి ఎలా సాధ్యం? ఆయుధాలు చేతుల్లోకి తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచే నక్సలిజం అభివృద్ధి చెందింది. ఇందిరా గాంధీ వల్లే మావోయిస్టు పార్టీ అన్ని ప్రాంతాలకు విస్తరించింది’’ అని అమిషా ధ్వజమెత్తారు.
Hyderabad : హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతుంది
ప్రహరీ గోడను కూల్చివేసిన దుండగులు
జనగామ, ఆంధ్రప్రభ : జనగామ పట్టణములోని సూర్యాపేట రోడ్డులో ఇంటి స్థలం పై
పేపర్ ప్లేట్లో తినటం ఇంత డేంజరా? డాక్టర్ చెప్పిన విషయాలు వింటే షాక్ #telugupost #cancer #plates
dark circles |కళ్ల కింద నల్లటి చారలు: కారణాలు, పరిష్కారాలు
dark circles | కళ్ల కింద నల్లటి చారలు: కారణాలు, పరిష్కారాలు dark
వెం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
వెం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి :
Telangana : టార్గెట్ పొంగులేటి.. బీఆర్ఎస్ లక్ష్యమదేనా?
బీఆర్ఎస్ టార్గెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయ్యారు
బంగారు గని వద్ద కాల్పులు.. 70 మందికి పైగామృతి
దక్షిణ సూడాన్ మరోసారి మృత్యుఘోషతో విలవిలలాడిపయింది. రాజధాని జుటా శివార్లలోని ఓ బంగారు గని వద్ద తలెత్తిన వివాదంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా.. 70 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ‘‘ఓ బంగారు గనిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో 70 మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు’’ అని పోలీసులు తెలిపారు. దక్షిణ సూడాన్ ప్రతిపక్ష పార్టీ ‘సూడన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ అపోజిషన్’ ఈ దాడిని ఖండించింది. ప్రభుత్వ బలగాలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని ఆరోపించింది.
గ్రామసభలు నిర్వహణకు సిద్ధం కావాలి
గ్రామసభలు నిర్వహణకు సిద్ధం కావాలి భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : 99 రోజుల
ఆశా వర్కర్ల ఆగ్రహం.. జీతాలు బకాయిలపై ధర్నా, పోలీసుల అరెస్ట్.. వనపర్తి టౌన్,
హనుమాన్ విజయోత్సవ ర్యాలీ.. కడెం, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద బెల్లాల్ జిపి
అఖిలపక్ష నాయకుల సమావేశం.. లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం
దేవాలయల పునర్నిర్మాణానికి భూమి పూజ..
దేవాలయల పునర్నిర్మాణానికి భూమి పూజ.. భువనగిరి, ఆంధ్రప్రభ : భువనగిరి మున్సిపల్ పట్టణంలోని
Naga Chaitanya’s Vrushakarma Updates
Akkineni youngster Naga Chaitanya has spent over a year on his upcoming film Vrushakarma. The shoot of the film is currently in the final stages. The first glimpse received terrific response and the makers have closed the non-theatrical and the theatrical rights of the film. The team is now heading to Rajasthan to shoot for […] The post Naga Chaitanya’s Vrushakarma Updates appeared first on Telugu360 .
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు సామాన్య ప్రజలపై భారం పడొద్దని
సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ : రేవంత్ రెడ్డి
సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
Chandrababu : 2029 నాటికి అందరికీ ఇళ్లు
2029 నాటికి అందరికీ ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు
డ్రగ్స్ కేసుతో కుంగిపోయా… చనిపోవాలనిపించిందన్న నటి హేమ #Hema #MeetThePress #DrugsCase #Tollywood
1chance |సినీ హీరోలు రాజకీయాల్లోకి..
1chance | సినీ హీరోలు రాజకీయాల్లోకి.. 1chance | విజయ్, పవన్ కేల్యాణ్
పోగొట్టుకున్న మొబైల్ను గుర్తించి బాధితురాలికి అప్పగింత..
లింగాపూర్, ఆంధ్రప్రభ ; సిర్పూర్ (యు) మండలానికి చెందిన ఓ మహిళ తన
పేదవాడి సొంతింటి కల సాకారం.. జిల్లాలో ఘనంగా గృహప్రవేశాలు.పాల్గొన్న మంత్రి టీ.జీ. భరత్
జీజీహెచ్లో అద్భుత శస్త్రచికిత్స..
జీజీహెచ్లో అద్భుత శస్త్రచికిత్స.. ఏడు సంవత్సరాల బాలుడికి కొత్త జీవితంఅరుదైన ‘నాసోఫారింజియల్ ఆంజియోఫైబ్రోమా’పై
కార్మికుల పట్ల శ్రద్ధ వహించాలి…
కార్మికుల పట్ల శ్రద్ధ వహించాలి… ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న
చెరువుపల్లి మాల్యాద్రి సేవలకు గుర్తింపు
20సంవత్సరాలు మండలపార్టీ బాధ్యతలు ఘనంగా సన్మాణించిన ఎమ్మెల్యే ఇంటూరి విశాలాంద్ర -వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు చెరువుపల్లి మాల్యాద్రిని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వదలకుండా […] The post చెరువుపల్లి మాల్యాద్రి సేవలకు గుర్తింపు appeared first on Visalaandhra .
ముదిగుబ్బకు నియోజకవర్గ హోదా ఇవ్వాలి – సిపిఐ డిమాండ్
పునర్విభజనలో పక్కన పెడితే ఉద్యమాలు తప్పవు – సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు హెచ్చరిక విశాలాంధ్ర, ముదిగుబ్బ,శ్రీ సత్యసాయి జిల్లా : మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణాన్ని ప్రత్యేక నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ముదిగుబ్బను తిరిగి కదిరి నియోజకవర్గంలో విలీనం చేసే అవకాశాలపై వస్తున్న వార్తలు మండల ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.ముదిగుబ్బ మండలం విస్తీర్ణం, జనాభా పరంగా జిల్లాలోనే […] The post ముదిగుబ్బకు నియోజకవర్గ హోదా ఇవ్వాలి – సిపిఐ డిమాండ్ appeared first on Visalaandhra .
వాటర్ ట్యాంక్ ఎక్కి తెలంగాణ ఉద్యమకారుల నిరసన
గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎన్టీవీ సి వద్ద తెలంగాణ
రైతులకు పంటతో పాటు పశుసంపద ఆర్థిక బలం
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు పంటలతో పాటు పాటు పశుసంపద కూడా ఎంతో లాభం చేకూరుతుందని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ తెలిపారు.సోమవారం మంత్రాలయం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆర్థిక సహకారంతో మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో పశు వైద్య అధికారి డాక్టర్ దినకర్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని తిక్కన్న కార్తికేయ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధి పశు […] The post రైతులకు పంటతో పాటు పశుసంపద ఆర్థిక బలం appeared first on Visalaandhra .
పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన టీవీకే పార్టీ దళపతి విజయ్ #tvk #tvkvijay #vijay #tamilnadu
నటుడు బ్రహ్మానందంను కలిసిన చిత్రకారుడు రాయబోస్
కడెం, ఆంధ్రప్రభ : తెలుగు సినీ పరిశ్రమలో తన అద్భుతమైన హాస్యంతో ప్రేక్షకులను
రెన్యువల్స్ గురించి భయపడొద్దు..
రెన్యువల్స్ గురించి భయపడొద్దు.. డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ శ్రీవాస్ నూపూర్ అజయ్
అర్ధాంతరంగా నిలిచిపోయిన అంగన్వాడీ భవనం పూర్తి చేయాలి: సిపిఐ డిమాండ్…
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ): నార్పల మండల కేంద్రంలోని ఉయ్యాలకుంట కాలనీలో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన అంగన్వాడీ భవనాన్ని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అంగన్వాడీ భవనాలకు అనుమతులు మంజూరైనప్పటికీ పనులు పూర్తికాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఈ అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో అంగన్వాడీ భవనాల సమస్యను ప్రస్తావించినప్పటికీ, […] The post అర్ధాంతరంగా నిలిచిపోయిన అంగన్వాడీ భవనం పూర్తి చేయాలి: సిపిఐ డిమాండ్… appeared first on Visalaandhra .
Cancer |మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్
Cancer | మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ Cancer | ఆంధ్రప్రభ వెబ్
హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ఏలేటి
హైదరాబాద్: హేట్ స్పీచ్ బిల్లు అత్యంత ప్రమాదకరమని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాజకీయ కక్షసాధింపులకే హేట్ స్పీచ్ బిల్లు అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ ప్రివెన్షన్ బిల్లును సెలక్ట్ కమిటీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ రిఫర్ చేశారు. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఆధారాలు లేకున్నా అరెస్ట్ చేసేలా బిల్లు ఉందని, చట్టాలు ప్రజల రక్షణ కోసం ఉండాలి.. ప్రజల గొంతు నొక్కడానికి కాదని విమర్శించారు. ఇలాంటి చట్టం చేసేముందు హౌస్ కమిటీ వేయాలని.. చర్చ సాగాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 4 అనేది ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్ అని.. హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు.
వాటర్ స్పోర్ట్స్ జిల్లా సాయి ఎంపికలు..
జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్విశాలాంధ్ర ధర్మవరం;; వాటర్ స్పోర్ట్స్ జిల్లా స్థాయి ఎన్నికలు పుట్టపర్తి లోని సాయి ఆక్వా బోటింగ్ చిత్రావతి నది వద్ద ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ తెలిపారు. వారు మాట్లాడుతూ అండర్- 15 సబ్ జూనియర్, అండర్- 18 జూనియర్ విభాగాల్లో జరిగే పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు ఏప్రిల్ 11 నుంచి 12వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి వాటర్ […] The post వాటర్ స్పోర్ట్స్ జిల్లా సాయి ఎంపికలు.. appeared first on Visalaandhra .
కెసిఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది..: సిఎం రేవంత్
హైదరాబాద్: మీడియా చిట్చాట్లో సిఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వల్లే తన గొప్పతనం ఏంటో తెలంగాణ సమాజానికి తెలిసిందని రేవంత్ అన్నారు. అసలు కెసిఆర్ లేకపోతే.. తాను లేనంటూ చెప్పుకొచ్చారు. ‘కెసిఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. కెసిఆర్ లేకపోతే నేను లేను. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసింది. కెసిఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కానీ, ఆయన్ను గృహ నిర్భందం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీశ్ రావు ప్రమాదం’ అని సిఎం పేర్కొన్నారు.
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ బెల్లంపల్లిలో డీఈ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికుల ధర్నా
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి..
క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం ఉంటుందని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 121వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి వెంకటేశులు (చిట్టి) మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి […] The post పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి.. appeared first on Visalaandhra .
యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం;; యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రం నందు ఏప్రిల్ 1న పుట్టపర్తిలో నిర్వహించే రణభేరి 3.0 ను జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సేట్టిపి జయచంద్ర రెడ్డి, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద […] The post యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
దేశంలో నియంత పాలన రాకూడదన్నదే నా ఉద్దేశం: రేవంత్
హైదరాబాద్: నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల పునర్వవస్థీకరణ పార్టీల సమస్యకాదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా దక్షిణాదిలో కార్యాచరణ ఉండాలని, 50 శాతం సీట్ల పెంపుపై విస్తృతంగా చర్చ జరగాలని అధికారులకు సూచించారు. దేశంలో నియంత పాలన రాకూడదన్నదే తన ఉద్దేశం అని తెలియజేశారు. దక్షిణాదికి బలం లేదని పెత్తనం చేస్తామంటే అది ఎంత కాలమో కొనసాగదని అన్నారు. జాతీయ పార్టీ అయినా అన్యాయంపై మాట్లాడే స్వేచ్ఛ తమకు ఉందని, 50 శాతం సీట్లు పెంచితే దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం చేస్తుందని, దక్షిణాదిలో ఒక్క సీటు రాకున్నా కేంద్రం సర్కారు ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. రాష్ట్రాల సీట్ల మధ్య అంతరం.. పెంచిన తర్వాత కూడా అంతే ఉండాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Megastar’s Vishwambara: What’s Happening?
With years of delay in a film, the audience will lose interest and a project becomes stale. Chiranjeevi has signed the biggest ever film in his career, Vishwambara, a fantasy adventure directed by Vassishta. It all started after the first teaser received poor response. The VFX work was badly trolled and the entire unit stepped […] The post Megastar’s Vishwambara: What’s Happening? appeared first on Telugu360 .
ఆంధ్రప్రదేశ్ ఇక నక్సల్స్ రహిత రాష్ట్రం #AndhraPradesh #NaxalsFree #NarayanSurrender #APPolice
ఎల్పీజీ బ్లాక్ మార్కెట్పై దాడి… 400 సిలిండర్లు స్వాధీనం #telugupost #lpgcrisis #hyderabad #news
కమర్షియల్ సిలిండర్లను బ్లాక్లో విక్రయిస్తున్న ముఠా అరెస్టు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏర్పడిన గ్యాస్ కొరతను అధిమించేందుకు ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలను సంరక్షించుకోవాలని కోరుతున్నాయి. అయితే కొందరు మాత్రం అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు తప్పు పనులకు పూనుకుంటున్నారు. అలా బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాగా ఏర్పడి కమర్షియల్ సిలిండర్లను అక్రమంగా మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హోటళ్లు, రెస్టారెంట్లకు అధిక ధరలకు గ్యాస్ విక్రయిస్తున్నట్లు కనిపెట్టారు. 300 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. డీలర్ అమీర్ ఒక్కో సిలిండర్ను రూ.6 వేలకు విక్రయిస్తున్నట్లు తేలింది. డీలర్తో పాటు 10 మందిని అరెస్టు చేశారు.
మోత్కూర్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి…
మోత్కూర్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి… గ్రీవిన్స్ లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు
ఆలేరులో అలరించిన పౌరాణిక నాటకాలు..
ఆలేరులో అలరించిన పౌరాణిక నాటకాలు.. ఆలేరు, ఆంధ్రపభ : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
గర్భగుడిలో వేసవి కాలంలో ప్రత్యేక పూజలు..
గర్భగుడిలో వేసవి కాలంలో ప్రత్యేక పూజలు.. శ్రీ రామలింగేశ్వర ఆలయానికి రూ.50 వేల
పేదల సొంతింటి కల నెరవేరుతుంది..
పేదల సొంతింటి కల నెరవేరుతుంది.. ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వేముల
Andhra Prabha Smart Edition |AP|ఎండ్ కార్డ్|ఎండ్ కార్డ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 30-03-2026, 4.00PM ap మావోయిస్టులకు ఎండ్ కార్డ్..
విద్యార్థిని మృతి ఘటన లో ఉపాధ్యాయుల తొలగింపు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల
అదుపులో అతిసార పరిస్థితి… ఇంటింటి సర్వేలు పూర్తిపరిస్థితి నియంత్రణలోనే నందిగామ, ఆంధ్రప్రభ :
Andhra Prabha Smart Edition |TS|భూ కబ్జాలు..|ఎండ్ కార్డ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 30-03-2026, 4.00PM ts ప్రజాపాలనలో భూ కబ్జాలు..
లేబర్ కోడ్స్ రూల్స్ ప్రతులు దగ్ధం
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ ; 4 లేబర్ కోడ్స్ రూల్స్ ప్రతులను ట్రేడ్
ఎయిర్పోర్టుల్లో తక్కువ ధరకే స్నాక్స్ #telugupost #UdanYatriCafe #AirportFood #India #AffordableFood
ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ : రేవంత్
హైదరాబాద్: దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థ తీసుకొస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈగల్, హైడ్రా తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ తీసుకొస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పంటకు ధర నిర్ణయించే అవకాశం రైతులకు లేకుండా పోయిందని, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తెచ్చామని తెలియజేశారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Vijayawada Terror Case Reveals Alarming Social Media Radicalisation Network
Disturbing details are emerging from the Vijayawada terror case, exposing how vulnerable individuals were drawn into extremist networks through social media. Investigators say foreign handlers targeted people from economically weak backgrounds and slowly pushed them towards radical ideas. One of the key findings showed how online platforms became the main tool for recruitment. A woman […] The post Vijayawada Terror Case Reveals Alarming Social Media Radicalisation Network appeared first on Telugu360 .
నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే అధ్యక్షుడు విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వరుసగా మూడుసార్లు కొళత్తూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందని అన్నారు. ఈసారి గొప్ప విజయాన్ని అందుకోబోతున్నామని కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన […] The post నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్ appeared first on Visalaandhra .
ప్రతిపక్షాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు: కెటిఆర్
హైదరాబాద్: రాఘవ కన్స్ట్రక్షన్స్ అంశంలో సభా సంఘం వేయాలని కోరితే సిఐడిని అడ్డం పెట్టుకొని మంత్రి పొంగులేనటి రక్షించే ప్రయత్నం చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ప్రతిపక్షన్ని ప్రభుత్వం బెదిరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పార్టీ నేతలతో కలిసి లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కెటిఆర్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి అవినీతికి పాల్పడుతున్నారని కెటిఆర్ విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేశామని.. స్వతంత్ర విచారణకు ఆదేశించాలని కోరినట్లు చెప్పారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కోరామని అన్నారు

29 C