Bus accident | NH 44 పై ఘోర ప్రమాదం..
Bus accident | NH 44 పై ఘోర ప్రమాదం.. Bus accident,
ఒకవైపు ఢిల్లీలో భారత్ ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తుండగా, మరో వైపు ఇదే సమయంలో భాగ్యనగరంలో బయో ఆసియా సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ భవితవ్యానికి బంగారు బాట వేస్తోందని చెప్పవచ్చు. సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ. 1700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వివిధ సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం వచ్చే రెండేళ్లలో సుమారు 8250 ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు లభించే అవకాశం కలుగుతోంది. దీనికి తోడు 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి సమకూర్చి కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఎన్నో ఆశలను రేకెత్తిస్తోంది. సిబిఆర్ఇ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ (2025) ప్రకారం బోస్టన్, శాన్ఫ్రాన్సిస్కో, బీజింగ్, టోక్యో వంటి గ్లోబల్ హబ్ల సరసన నిలిచిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అని ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. కొద్ది వారాల క్రితం దావోస్లో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపుతోనే ఈ బయో ఆసియా సదస్సును చేపట్టడం జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ను రూపొందించాలన్న లక్షం ప్రగాఢంగా కనిపిస్తోంది. 23 ఏళ్ల క్రితం బయో ఆసియా సదస్సు ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్వేర్ నగరం అన్న పేరుండేది.అదే హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా చరిత్ర సాధించింది. ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జిపిసి)కు ప్రాధాన్య గమ్యస్థానంగా మారిన హైదరాబాద్ను సమగ్ర జీవన విజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా మనమంతా కలిసి తీర్చిదిద్దుదామని సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామిక వేత్తలకు, సంబంధిత సంస్థలకు పిలుపు నివ్వడం మంచి పరిణామం. గత రెండేళ్లలోనే జీవ విజ్ఞానరంగంలో రూ.73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలన్న లక్షాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచం లోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకు విధానాలను రూపొందించినట్టు వెల్లడించింది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రాబోయే విద్యా సంవత్సరం నుంచే లైఫ్ సైన్సెస్ యూనివర్శిటీ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. లైఫ్ సైన్సెస్ రంగంలో కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, డేటా సైన్సెస్ ఏకీకరణపై ఈ సదస్సులో చర్చలు ప్రముఖంగా సాగడంతో ఇది ప్రపంచస్థాయి బయో ఆసియా సదస్సుగా గుర్తింపు పొందడం విశేషం. ఈ సందర్భంగా గ్లోబల్ కంపెనీల చూపు జీనోమ్ వ్యాలీ వైపు కేంద్రీకరించడం అత్యంత విశేషం. జిఎపిఎఫ్ఎ ఇండోనేషియా విభాగమైన వాక్సిండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక బిఎస్ఎల్ 3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాని ఏర్పాటు చేస్తోంది. కోళ్లు, పశువులు, ఆక్వా కల్చర్ కోసం వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్షం. ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ జీనోమ్ వ్యాలీలో భారీ స్థాయిలో ఫార్మాట్ లైఫ్ సైన్సెస్ క్యాంపస్ను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు 12 ఎకరాల స్థలంలో ఒక మిలియన్ చదరపు అడుగుల అడ్వాన్స్ల్యాబ్, మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. ఇదే సమయంలో జీనోమ్ వ్యాలీ నాలుగో దశను అత్యాధునిక మౌలిక వసతులతో ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. జీనోమ్ వ్యాలీ అన్నది హైదరాబాద్ శివారు లోని భారతీయ హై టెక్నాలజీ వ్యాపార కేంద్రం. బయో మెడికల్ పరిశోధన, శిక్షణ తయారీ కోసం ఒక క్లస్టర్గా అభివృద్ధి చెందింది. భారత్ బయోటెక్ వంటి వివిధ సంస్థల ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో 1999 లో ఇది ప్రారంభమైంది. 600 కి.మీ పరిధిలో విస్తరించిన ఈ కేంద్రం దేశంలోనే మొట్టమొదటి పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా వ్యవస్థీకృత సముదాయంగా గుర్తింపు పొందింది. 18 దేశాలకు చెందిన దాదాపు 200 సంస్థలు తమ బయోఫార్మా పరిశోధనలను, ఉత్పత్తుల తయారీని సాగిస్తున్నాయి. దాదాపు 150 జీవశాస్త్ర కంపెనీలు ఇందులో ఉన్నాయి. పదివేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ వ్యాలీ ఏర్పాటైన దగ్గర నుంచి తెలంగాణ ప్రభుత్వం దీని విస్తరణకు ప్రణాళికలు రూపొందించడంతో ఏటా 2,00,000 చదరపు అడుగుల మేరకు ప్రయోగ క్షేత్రం (ల్యాబ్ స్పేస్) కొంత కలుస్తూ విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో సమర్ధవంతమైన వ్యాక్సిన్ల తయారీకి కేంద్రంగా ఈ వ్యాలీ ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలనే ఆకర్షించ గలిగింది. అదే సమయంలో ఈ జీనోమ వ్యాలీని ప్రధాని మోడీ సందర్శించి కరోనా వ్యాక్సిన్ తయారీ పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకుని పరిశోధకులను, శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందించడం చెప్పుకోదగిన ఘట్టం. ఈ వ్యాలీ దేశీయంగానే కాకుండా ప్రపంచస్థాయి లోనే జీవశాస్త్ర కంపెనీలకు ప్రధాన గమ్యంగా వర్ధిల్లుతోంది. అందుకనే స్వదేశీ, ప్రపంచస్థాయి బయోటెక్నాలజీ కంపెనీలు జీనోమ్ వ్యాలీని ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని చిత్రించగలిగాయి. ఈ నేపథ్యంలో జీనోమ్ వ్యాలీని మరింత విస్తరింప చేయాలని తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రపంచ స్థాయిలో బయో ఆసియా సదస్సును ఏర్పాటు చేయడం ప్రముఖ శాస్త్రవేత్తలను, ఫార్మా రంగ నిపుణులు, నిర్వాహకులను రప్పించడం అభినందించవలసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని అనేక విలువైన సూచనలతో చర్చించడం విశేషం.
తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కంకణం కట్టుకొని విజయవంతమవుతున్న కాంగ్రెస్ పార్టీ పలు సందర్భాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది. కులగణన, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి అంశాల్లో ముందడుగు వేస్తూ దేశంలో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. రిజర్వేషన్ల అమలులో సాంకేతికంగా ఇబ్బందులు కలిగినా పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బిసిలకు పెద్దపీట వేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లో సామాజిక న్యాయం మరోసారి కీలకాంశంగా మారింది. బిసిలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా విశేష ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అంతకు మించి పురపాలిక ఎన్నికల్లో బిసిలకు 53 శాతానికిపైగా టికెట్లు కేటాయించి తన నిబద్ధతను చాటుకుంది. కాంగ్రెస్ నిర్ణయంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ పదవుల్లో 60% కంటే ఎక్కువ బిసిలకు దక్కాయి. రాష్ట్రంలో తాము గెలుచుకున్న 85 మున్సిపాలిటీల్లో 51 స్థానాలను బిసిలకు కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సామాజిక వర్గాల ప్రాతినిధ్యం అంశం నిత్యం చర్చకు వస్తున్నా ఆచరణలో అమలు కాలేదు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని కేవలం నినాదాలకే పరిమితం చేయకుండా కృతనిశ్చయంతో అమలుపర్చింది. రాష్ట్రంలో 105 మున్సిపాలిటీల్లో 64 మంది బిసి చైర్మన్లు ఎన్నిక కావడం, పుర ప్రథముల్లో 61 శాతం బిసిలు ఉండటం సామాజిక న్యాయానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది. వైస్ చైర్పర్సన్లలో 41 శాతం బిసిలు ఉండడం కూడా పట్టణ పాలనలో వారి పాత్ర పెరిగిందనడానికి నిదర్శనం. పట్టణాల్లోని 55 శాతం పైగా వార్డుల్లో బిసిల ఆధిక్యం నమోదవడం, వారిలో నాయకత్వ సామర్థ్యానికి ప్రజలు ఇచ్చిన మద్దతుగా చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలు సత్తా చాటుతూనే ఉన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న వారు బిసిలే. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగించడం ద్వారా పట్టణ రాజకీయాల్లో తమ స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. కార్పొరేషన్ల స్థాయిలోనూ బిసిలకు లభించిన ప్రాధాన్యం గమనార్హం. కార్పొరేషన్లలో బిసి మేయర్లు ఎన్నిక కావడం, డిప్యూటీ మేయర్గా బిసి నాయకత్వం రావడం కేవలం రాజకీయ గణాంకం కాదు పట్టణ పాలనలో శక్తి సమీకరణాల మార్పుకు ప్రతీక. మొత్తం 7 కార్పొరేషన్లలో నలుగురు బిసి మేయర్లు ఉండటం పట్టణాల్లో బిసిల రాజకీయ పటిమను ప్రతిబింబిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో బిసిలకు ప్రాధాన్యత యాదృచ్ఛికంగా జరిగిన పరిణామం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కోసం కులగణన చేపట్టడం, ఆ గణాంకాల ప్రకారం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆచరణలో చూపింది. కులగణన ద్వారా వాస్తవ గణాంకాలు సేకరించి, వాటి ఆధారంగా విధానాలు రూపొందిస్తామని చెప్పడం సామాజిక న్యాయం పట్ల నిబద్ధతకు సంకేతం. గతంలో రిజర్వేషన్లపై చర్చలు జరిగితే అవి రాజకీయ హామీలకే పరిమితం అయ్యాయి. అయితే ఇప్పుడు వాటిని వ్యవస్థీకృతంగా అమలు చేసే దిశగా అడుగులు పడడడం అభినందనీయం. బిసిలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఇతర వర్గాలను విస్మరించలేదనే విషయం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్సి, ఎస్టి, ముస్లిం, ఒసి వర్గాలకు కూడా సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సమతుల్యతను పాటించింది. ఇది ఒక వర్గాన్ని మరొక వర్గానికి వ్యతిరేకంగా నిలబెట్టే రాజకీయ శైలికి భిన్నం. సామాజిక వర్గాల మధ్య సమన్వయం, భాగస్వామ్య పాలన లక్ష్యంగా ముందుకు సాగడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిగా కనిపిస్తోంది. పట్టణ పాలనలో నాయకత్వ మార్పులు సాధారణ పరిపాలనా అంశం మాత్రమే కాదు. ఇవి అభివృద్ధి ప్రాధాన్యతలను, సంక్షేమ దిశలను నిర్ణయించే కీలక స్థాయిలు. చైర్మన్లు, మేయర్లు స్థానిక సమస్యలను గుర్తించి, నిధుల వినియోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పాలనపై ప్రభావం చూపగలరు. ఈ స్థానాల్లో బిసి వర్గాల ప్రతినిధులు అధికంగా ఉండటం వల్ల పట్టణాల్లోని మధ్యతరగతి, వెనుకబడిన వర్గాల సమస్యలు మరింత ప్రాధాన్యత పొందే అవకాశముంది. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో జీవన వ్యయం, ఉపాధి అవకాశాలు, చిన్న వ్యాపారాల ప్రోత్సాహం, బస్తీల అభివృద్ధి వంటి అంశాలు బిసి వర్గాలకు అత్యంత సంబంధితమైనవి. ఈ వర్గాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు స్థానిక వాస్తవాలను బాగా అర్థం చేసుకుని విధానాలను అమలు చేయగలరనే నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే 55 శాతం పైగా వార్డుల్లో బిసిల విజయం నమోదైందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఇది రాజకీయంగా కూడా కీలకమైన పరిణామం. పట్టణాల్లో బలమైన సామాజిక వర్గాల మద్దతు సాధించగలిగిన పార్టీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ బలంగా నిలబడే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాభిప్రాయ సర్వేలా భావించే పరిస్థితుల్లో, ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత ఉత్సాహాన్నిస్తాయి. ప్రజాపాలన నినాదాన్ని కేవలం మాటల్లో కాకుండా పదవుల పంపిణీలోనూ ప్రతిఫలింపజేసిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ విజయాలను నిలబెట్టుకోవడం పెద్ద సవాల్. పదవులు దక్కడం ఒక ఎత్తు అయితే, వాటి ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. పారదర్శక పాలన, అవినీతి రహిత వ్యవస్థ, సమర్థవంతమైన సేవలు అందించడం ద్వారా మాత్రమే ఈ సామాజిక సమీకరణం స్థిరపడుతుంది. లేకపోతే గణాంకాలు రాజకీయ ప్రచారానికే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. 42 శాతం రిజర్వేషన్ల బిల్లు అధికారికంగా కార్యరూపం దాల్చితే తెలంగాణ సామాజిక నిర్మాణంలో మరింత విస్తృత మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇది కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయం కాకుండా, భవిష్యత్ రాజకీయ ధోరణులను ప్రభావితం చేసే అంశంగా మారే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి డిమాండ్లు బలపడే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం కులగణన, బిసి సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు పరిచిన కాంగ్రెస్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వారికి 60 శాతంపైగా ప్రాధాన్యత కల్పించడం తెలంగాణ రాజకీయాల్లో చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలుస్తోంది. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడంలో భాగంగా వారికి రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం, పాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం సంతోషకరం. ఈ సామాజిక న్యాయం ప్రయాణం తాత్కాలికానికే పరిమితం కాకుండా భవిష్యత్తులోనే సఫలీకృతమైతే తెలంగాణ రాజకీయ చరిత్రలో ఇది ఒక దిశానిర్దేశక ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది. అమరవాజీ నాగరాజు (టిపిసిసి చీఫ్ పిఆర్ఒ)
స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మార్చి 9న లోక్సభలో చర్చ, ఓటింగ్ జరగనుంది. అధికార కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఈ తీర్మానం వీగిపోవడం సహజమే కాగలదు. అయితే, ఈ సందర్భంగా లేవనెత్తే అంశాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఇరకాటంలో పడవేసి అవకాశం ఉంది. గతంలో ముగ్గురు స్పీకర్లు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నప్పటికీ కేవలం నిబంధనల అమలు విషయంలో భేదాభిప్రాయాల కారణమే గాని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కోలేదు. పైగా అప్పటి ప్రధాన మంత్రులు ఎవ్వరూ ఆ వివాదాలలో తలదూర్చలేదు. 118 మంది సభ్యులు స్పీకర్ వ్యవహార సరళిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఓ పెద్ద రాజకీయ దుమారంకు దారితీస్తుంది. అవిశ్వాస తీర్మానంలో నాలుగు అంశాలను ప్రస్తావించారు. మొదటగా, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి సభలో ప్రసంగించే అవకాశం ఇవ్వకపోవడం, ఆ తర్వాత 8మంది ప్రతిపక్ష సభ్యులను ఏకపక్షంగా సభ నుండి బహిష్కరించడం, ఇద్దరు మాజీ ప్రధానమంత్రులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి నిషికాంత్ దూబేపై చర్యలు తీసుకోకపోవడాన్ని ఆ తీర్మానంలో ప్రస్తావించారు. వీటన్నింటికీ మించి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానం ఇవ్వడానికి లోక్సభకు రావద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాను సలహా ఇచ్చానని బిర్లా అంగీకరించడం తీవ్ర దుమారం రేపింది. ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది సభ్యులు ప్రధానమంత్రి కూర్చున్న ప్రదేశానికి చేరుకోవడం ద్వారా ఊహించని చర్యకు పాల్పడే అవకాశం ఉంది అనే ‘ఖచ్చితమైన’ సమాచారం తన వద్ద ఉందని బిర్లా సభలో ప్రకటించారు. మరో మాటలో చెప్పాలంటే, ప్రధానమంత్రిపై దాడి జరగవచ్చని, ఆయన సభా కార్యకలాపాలకు హాజరు కావడం సురక్షితం కాదని స్పీకర్ భయపడ్డారు. ఈ విధంగా ఒప్పుకోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఈ విషయమై ప్రధాని లేదా హోంమంత్రి ఇప్పటివరకు నోరు విప్పక పోవడం గమనార్హం. అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి ప్రతిపక్ష నేతలు ఇప్పుడు స్పీకర్ పనితీరుపైనే కాకుండా ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్న ప్రధానమంత్రి వ్యవహారంపై సైతం లోక్సభలో మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఎదురుదాడికి దిగిన్నప్పటికీ అంతర్జాతీయంగా ‘విశ్వాస పరీక్ష’కు నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానమంత్రికే లోక్సభలో రక్షణ లేదని స్వయంగా స్పీకర్ పేర్కొనడం సాధారణంగానే విస్మయం కలిగిస్తోంది. ‘విశ్వగురు’గా ప్రచారం పొందుతున్న ప్రధాని ప్రజాస్వామ్య సంస్థల ఉనికి పట్ల అసహనంగా ఉన్నారనే అభిప్రాయం బలపడుతుంది. ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్పై రాహుల్ గాంధీ సభలో మాట్లాడిన మరుసటి రోజే బిజెపి ఎంపి నిషికాంత్ దూబే, ‘భారత వ్యతిరేక కార్యకలాపాలకు’ పాల్పడుతున్నందుకు ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నోటీసు సమర్పించారు. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయనను జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని దూబే డిమాండ్ చేశారు. ఈ విధంగా డిమాండ్ చేయడం కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల అసహనాన్ని వెల్లడి చేస్తుంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన సమయంలో ప్రతిపక్షాలను ‘దేశ వ్యతిరేక’, ‘పాకిస్థాన్ అనుకూల’ శక్తులుగా ముద్రవేయడంకూడా సర్వసాధారణమైపోయింది. గతంలో ప్రధానమంత్రులు అందరూ ప్రతిపక్షనేతలతో మంచి సంబంధాలను కొనసాగించారు. ‘ప్రతిపక్షాలు రాజకీయ ప్రత్యర్థులే గాని, శత్రువులు’ కారు అనే సూత్రం ప్రజాస్వామ్యానికి పునాది వంటిది. కీలకమైన బిల్లుల విషయంలో లేదా పార్లమెంట్లో గందరగోళాలు ఏర్పడినప్పుడు నేరుగా ప్రతిపక్షనేతలతో సంప్రదించి, వారి సహకారం కోరేవారు. సభలో అంతరాయం కలిగినప్పుడు స్పీకర్ కూడా అన్ని పక్షాల నేతలను తన ఛాంబర్కు పిలిచి, పరిష్కారంకోసం ప్రయత్నం చేసేవారు. అనేకసార్లు ఇటువంటి ప్రయత్నాలు ఫలించేవి. ఎందుకంటే, స్పీకర్ అధికార పక్షంకు చెందిన వారైనప్పటికీ సభలో ‘నైతిక అధికారం’ చెలాయించేవారు. మోడీ ప్రధాని పదవి చేపట్టిన తొలి ఐదేళ్లలో స్పీకర్గా ఉన్న రాజేంద్ర కుమారి బాజపాయి సభలో అందరి మన్ననలు పొందారు. వివాదరహితంగా సభా కార్యక్రమాలు నడిపించారు. అంటే, అప్పుడు సభలో గందరగోళాలు, అంతరాలు ఎదురు కాలేదని కాదు. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా లోక్సభలో వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన నిబంధనల ప్రకారం పిఎం కేర్స్ నిధి, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎస్), జాతీయ రక్షణ నిధి (ఎన్డిఎఫ్)లకు సంబంధించిన ప్రశ్నలు, విషయాల చర్చకు అనుమతించవద్దని స్పష్టం చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) పంపిన తాఖీదు పట్ల స్పీకర్ మౌనం వహించడం సైతం ఆయన నిస్సహాయ పరిస్థితిని వెల్లడి చేస్తుంది. లోక్సభలో కార్యక్రమాల ప్రక్రియ, ప్రవర్తన నియమాలలోని నిబంధనల ప్రకారం ఈ మూడు నిధులకు సంబంధించిన ప్రశ్నలు, విషయాలు అనుమతించరాదని పిఎంఒ లోక్సభ సెక్రటేరియట్కు తెలిపింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అధికారికంగా లోక్సభ స్పీకర్కు ఈ విధంగా ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశించిన ఉదంతాలు లేవు. లోపాయికారిగా ‘ఆదేశాలు’ ఇస్తారుగాని నేరుగా అధికారిక ఆదేశాలు ఇవ్వడం అంటే పార్లమెంట్ వ్యవస్థను నిర్వీర్యం కావించడంలో బరితెగింపును మాత్రమే వెల్లడిచేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ పక్షమే సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నది. ప్రతిపక్షాలు అంతరాయం కలిగిస్తే చర్చలేకుండా బిల్లులు ఆమోదింప చేసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గతవారం ప్రకటించడం గమనార్హం.పార్లమెంట్ సమావేశాల ముందు సంప్రదాయపరంగా జరిపే అఖిలపక్ష సమావేశాలకు ప్రధాని హాజరు కావడం లేదు. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడంతో ప్రభుత్వ- ప్రతిపక్షాల మధ్య సమాలోచనలు, అవగాహనకు అవకాశం లేని ఓ దారుణమైన అగాధం ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా యుపిఎ ప్రభుత్వం హయాంలో పార్లమెంట్ సమావేశాల చివరి రోజున నాటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడం మంచింది. ‘భాయ్ కమల్ నాథ్’ అని స్వరాజ్ తన అసమాన శైలిలో, ‘అప్నీ శరరత్ సే ఈజ్ సదన్ కో ఉల్జా దేతే ది, ఔర్ అదర్నియా షిండే జీ (సుశీల్ కుమార్ షిండే) అప్నీ షరఫత్ సే యూజ్ సుల్జా దేతే ది’ అని మాట్లాడారు. (నా సోదరుడు కమల్ నాథ్ తన అల్లరితో ఈ సభను వదిలి వెళ్ళేవాడు. గౌరవనీయమైన షిండేజీ దానిని తన మర్యాదతో పరిష్కరించేవారు.) సోనియా గాంధీ ప్రధాని పదవి చేపడితే తన తల గుండు చేయించుకుంటానని ప్రతిజ్ఞ చేసిన సుష్మ స్వరాజ్ ఈ సందర్భంగా ఆమెను ప్రశంసించారు. సంక్షోభ సమయాల్లో సోనియా ‘మధ్యవర్తిత్వ పాత్ర’కు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ‘సౌమ్యత’కు, స్పీకర్ మీరా కుమార్ ‘సహనం’ (భిన్న అభిప్రాయాలు)కు, ఎల్ కె అద్వానీ ‘న్యాయప్రియత’కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ సభ సజావుగా సాగడానికి ఇటువంటి ధోరణులు దోహదకారి అవుతాయి. కానీ భారత ప్రజాస్వామ్యం ప్రధాన భావన ఏమిటంటే, ‘మనం ప్రత్యర్థులం అయినప్పటికీ, మనం శత్రువులు కాదు’ అని స్వరాజ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అటువంటి ధోరణి కారణంగా సైద్ధాంతిక, రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ సంబంధాలను కొనసాగించడం సాధ్యం అవుతుంది. కానీ అటువంటి ధోరణులు ప్రస్తుతం కనిపించకపోవడమే మన ప్రజాస్వామ్యంకు పెను ముప్పును వెల్లడి చేస్తుంది. చలసాని నరేంద్ర 98495 69050
రాష్ట్రంలో ఇక గ్రీన్ ఎనర్జీ విప్లవం
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గ్రీన్ ఎనర్జీకి తాము ప్రోత్సాహిస్తున్నట్టు ఆయ న వెల్లడించారు. తెలంగాణ 30లక్షలకు పైగా పంప్సె ట్లు, దాదాపు 50లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఈ శక్తిని బొగ్గు, సంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్, గ్రీన్ ఎ నర్జీ వైపు మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తె లిపారు. హైదరాబాద్లో వాతావరణ ప్రమాదాలను త గ్గించి నగరాన్ని సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందే నగరంగా తీర్చిదిద్దుతామని సిఎం రేవంత్రెడ్డి తెలిపా రు. తెలంగాణను మొత్తం దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభు త్వం నిర్వహించిన ‘క్లైమేట్ వీక్’ సదస్సులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్ సెంటర్లో బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో దేశంలోని పట్టణాలు, నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై ముఖ్యమంత్రి తెలంగాణ దృక్పథాన్ని వివరించారు. హైదరాబాద్ను 2034 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ దేశ పట్టణాభివృద్ధికి సంబంధించిన సదస్సులో మాట్లాడడం తనకు సంతోషంగా ఉందన్నారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తు న్నామన్నారు. హైదరాబాద్ను 2034 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా తాము కార్బన్ ఫుట్ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని ఆయన తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కోర్ అర్బన్ రీజియన్(క్యూర్)లో దాదాపు పరిశ్రమలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. 2047 లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే 1947 నుంచి భారత అభివృద్ధి ప్రయాణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్రం అనంతరం తొలి నాలుగు దశాబ్దాల్లో దేశంలో ప్రధాన ప్రాధాన్యతలు విద్యా వ్యవస్థ, నీటిపారుదల రంగాలేనని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ ప్రాథమిక పాఠశాలల నుంచి ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్సి వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపారు. విద్యుత్, సాగునీటికి భారీ ఆనకట్టలను నిర్మించి రైతుల పొలాలను నీటితో అనుసంధానించామని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆహార కొరత నుంచి ఆహార భద్రత సాధించాం 1990 నాటికి భారత్ ఆహార కొరత నుంచి ఆహార భద్రత సాధించిందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. దీంతో ప్రజల జీవిత కాలం పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలోని ఇంజనీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా గుర్తింపు పొందే విధంగా అభివృద్ధి సాధించామని ఆయన వివరించారు. 1991 నుంచి 2020 వరకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్పిజి) సంస్కరణలతో భారత్ సేవా రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని సిఎం తెలిపారు. టెలికాం, సాఫ్ట్వేర్ విప్లవంతో పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణ సాధ్యమైందన్నారు. భారత నిపుణులు సిలికాన్ వ్యాలీ వంటి ప్రపంచ కేంద్రాల్లో విజయాలు సాధించారని ఆయన తెలిపారు. 1991 తర్వాత గ్లోబల్ సాఫ్ట్వేర్, టెక్ సంస్థలు తమ బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు భారత్ను ఎంచుకున్నాయన్నారు. అందుకే ప్రపంచంలో అత్యధిక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జిసిసిఎస్) మన దేశంలో ఉన్నాయన్నారు. అయితే, ఈ టెక్ పురోగతిలో తయారీ రంగం ఎక్కువగా అవకాశాలు కోల్పోయినట్లు సిఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగం అభివృద్ధికి కొలమానంగా... కోవిడ్ అనంతరం ప్రభుత్వాల దృష్టికోణం మారిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం అభివృద్ధి వ్యూహాంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. ఏ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్ ఉత్పాదక వనరులే అసలైన కరెన్సీ ఆయన అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగం అభివృద్ధికి కొలమానంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాల గురించి సిఎం రేవంత్రెడ్డి ప్రస్తావిస్తూ, రాష్ట్ర జీడిపిని 200 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం లక్ష్యమని ఆయన తెలిపారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధికి తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా తెలంగాణను హైదరాబాద్ను 160 కి.మీ. పొడవైన ఔటర్ రింగ్రోడ్డు పరిధిలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్)గా ప్రకటించగా, 360 కి.మీ.ల రీజనల్ రింగ్ రోడ్డును (ఆర్ఆర్ఆర్) మధ్య ప్రాంతాన్ని ప్యూర్ జోన్గా రూపొందించి తయారీ రంగానికి నిర్దేశించినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి చైనా +1 ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ తయారీ వృద్ధి గ్రీన్ ఎనర్జీ ఆధారంగా సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రైల్వేకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం తెలంగాణ విద్యుత్ వినియోగంపై ముఖ్యమంత్రి గణాంకాలను వెల్లడిస్తూ రాష్ట్రం రోజుకు సగటున 16,610 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తోందని ఆయన తెలిపారు. గతేడాది గరిష్ట డిమాండ్ 17,162 మెగావాట్లు నమోదైందని, ఈ ఏడాది అది 19,000 మెగావాట్లను దాటుతుందన్న అంచనాలున్నాయని సిఎం రేవంత్రెడ్డి వివరించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో గరిష్ట డిమాండ్ 34,000 మెగావాట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 24.8 శాతం లేదా దాదాపు 25 శాతం గ్రీన్ సోర్సుల నుంచే వస్తోందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. అదేవిధంగా, 360 కిలోమీటర్ల పొడవు గల రీజనల్ రింగ్రోడ్డు నిర్మాణం కొనసాగుతోందని, రీజనల్ రింగ్ రైల్వేకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ మూడు జోన్లలో గ్రీన్ స్ట్రాటజీని అవలంబించాం ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల మధ్య ప్రాంతాన్ని ప్రధాన తయారీ జోన్గా అభివృద్ధి చేస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ముఖ్యంగా డేటా సెంటర్లు, పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న క్రమంలో వనరుల పెరుగుదలలో ప్రధాన భాగం గ్రీన్గా ఉండాలని తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు, కోవిడ్ ప్రభావాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత పరిస్థితిని క్లైమేట్ ఎమర్జెన్సీగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి సృష్టి, ఉత్పత్తి, వినియోగం పెంపు కొనసాగుతూనే పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ మూడు జోన్లలో గ్రీన్ స్ట్రాటజీని అవలంబించామని ఆయన తెలిపారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తొలగించడంతో దేశంలో అత్యధికంగా ఈవీల స్వీకరణ పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణలోనే ఈవీ తయారీ కోసం సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను పర్యావరణహితంగా మార్చే దిశగా 2 లక్షలకుపైగా ఆటోరిక్షాలను రీట్రోఫిట్ చేస్తుండగా, 3,500ల కంటే ఎక్కువ ఆర్టీసి బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రోను ప్రస్తుత 71 కి.మీ. నుంచి 200 కి.మీ. పైగా విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమలను కోర్ అర్బన్ ప్రాంతం నుంచి పెరి అర్బన్ జోన్లకు తరలిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా మూసీ నది పునరుద్ధరణ, సరస్సులు, చెరువుల సంరక్షణ, వాటర్ గ్రిడ్, వనరుల నిర్వహణ ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరించారు. హైడ్రా రూపంలో పర్యావరణ రక్షణకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేసినట్లు సిఎం రేవంత్రెడ్డి తెలిపారు.
19thfeb2026 |గురువారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
19thfeb2026 | గురువారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 19thfeb2026 |
భారత్ అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీ
న్యూఢిల్లీ : భారత్, అమెరికా దేశాల మధ్య ఎఐ కనెక్టివిటీ బలోపేతం చేసేందుకు కొత్త సముద్రగర్భ కేబుల్ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్టు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన కీలక ప్రకటనలు చేశారు. కర్మయోగి భారత్తో భాగస్వామ్యంగా 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు 18 భాషల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే 10 వేలకి పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్లలో 1.1 కోట్ల విద్యార్థులకు జనరేటివ్ ఎఐ సాయం అందించనున్నారు. శాస్త్రీయ పరిశోధనలకు 30 మిలియన్ డాలర్ల ఎఐ ఫర్ సైన్స్ ఇంపాక్ట్ చాలెంజ్ ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల ఎఐ హబ్లో గిగావాట్ స్కేల్ కంప్యూట్ సదుపాయం, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ గేట్వేగా ఉంటాయని తెలిపారు. ఎఐలో భారత్కు అసాధారణ సామర్థం ఉందని పిచాయ్ కొనియాడారు. భారత్ ఎఐ రంగంలో అద్భుతమైన పురోగతితో ముందుకు సాగుతోందని, ఈ వృద్ధిలో తామూ భాగస్వామి కావాలనుకుంటున్నామని అన్నారు. ప్రధానితో భేటీ: సమ్మిట్కు ముందుగా పిచాయ్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆరోగ్యం, వ్యవసాయం, స్టార్టప్లు, అన్ని భాషల్లో సమాచారం కోసం భారత్లో ఎఐ వినియోగంపై భేటీలో చర్చించామని ఎక్స్ పోస్టులో పిచాయ్ తెలిపారు. మోడీ కూడా ఫో టోలను పంచుకుంటూ, సమావేశం సంతోషం గా సాగిందని, ప్రతిభావంతులైన విద్యార్థులు, నిపుణులతో కలిసి గూగుల్ పనిచేయనుందన్నారు. ఎఐ జీవితకాలంలోనే అతిపెద్ద మార్పు ఎఐ మన జీవితకాలంలోనే అతిపెద్ద సాంకేతిక మార్పు అని మీడియా సమావేశంలో పిచాయ్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో ఎఐ గొప్ప అవకాశాలు కల్పిస్తుందన్నారు. భారత్లో వాయిస్, విజువల్ సెర్చ్ వినియోగం ప్రపంచంలోనే అత్యధికమని వివరించారు. త్వరలోనే ప్రత్యక్ష వాయిస్, కెమెరా ఆధారిత సెర్చ్ను స్థానిక భాషలోనే ఉపయోగించుకునే విధంగా మెరుగైన మోడల్ తీసుకొస్తామని వెల్లడించారు. విద్యా రంగంలో గూగుల్ ఎఐ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, వాతావరణ అంచనాలు వంటి రంగాల్లో పరిశోధనలకు మద్దతు ఇస్తారు. గూగుల్ డీప్మైండ్ ద్వారా ఐఐటి మద్రాస్తో కలిసి దేశవ్యాప్తంగా ఆధునిక ఎఐ సామర్థ్యాలను విస్తరించనున్నారు.
బంధుప్రీతి, పక్షపాతం ప్రజాస్వామ్యానికి పెనుశాపం
న్యూఢిల్లీ : బంధుప్రీతి అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓ శాపమని సుప్రీం కోర్టు పేర్కొంది. హౌసింగ్ సొసైటీ ఫ్లాట్ల కేటాయింపులో అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా వ్యాఖ్యానించింది. వీటికి సంబంధించి పంజాబ్,హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టిన న్యాయస్థానం ఆ కేటాయింపులను రద్దు చేసింది. హర్యానా అర్బన్ హౌసింగ్ సొసైటీలో రెండు లగ్జరీ ఫ్లాట్ల కేటాయింపులో అధికార దుర్వినియోగం జరిగిందంటూ స్థానిక ప్రభుత్వ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది. “ బంధుప్రీతి, పక్షపాతం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపం లాంటివి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులలో ఈ వైఖరి అసహ్యకరంగా ఉంటుంది ” అని జస్టిస్ సంజయ్ కుమార్,జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. పాలకమండలి సభ్యుడికి, అతడి కిందిస్థాయి అధికారికి చేసిన కేటాయింపులు పక్షపాతంగా , ఏకపక్షంగా ఉన్నాయని నిర్ధారించిన న్యాయస్థానం , సొసైటీ నిబంధనలను ఉల్లంఘించారని స్పష్టం చేసింది.
బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై కారు దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. బోయిన్ పల్లి ఎస్సై శివ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ..ఓల్డ్ బోయిన్ పల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న రాపిడో కార్ నెంబర్ టీఎస్ 35 టి1337 గల కారులో హఠాత్తుగా బ్యాలెట్ నుంచి పోగలు రావడంతో అప్రమత్తమైనా చెంగిచెర్లకు చెందిన ప్రశాంత్ (27) తోపాటు కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు వెంటనే క్రిందకి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా దగ్ధం కావడంతో సమాచారం అందుకున్న బోయినపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. ఎవరికి ఏమి కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.
అధికార బలంతో బిజెపికే ఫలం తెలంగాణలో రెండు స్థానాలు మహారాష్ట్రలో 7 సీట్లకు పోటీ సీనియర్ నేత పవార్ స్థానం ఖాళీ న్యూఢిల్లీ : వచ్చే నెల 16న రాజ్యసభలో 37 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. ఈ స్థానాలకు ఏప్రిల్, ఏప్రిల్ 9వ తేదీల్లో ఖాళీలు ఏర్పడుతాయి. ఈ ఎగువ సభ ఎన్నికల్లో అధికార బిజెపికి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయి. రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేల బలాబలాల పరిస్థితి , అధికారపక్షం అనుకూలతతో బిజెపినే ఎక్కువ స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం తెలంగాణలో 2, అత్యధికంగా మహారాష్ట్రలో 7, ఒడిషాలో 4, తమిళనాడులో 6, ఛత్తీస్గఢ్లో రెండు, పశ్చిమ బెంగాల్లో ఆరు, అసోంలో 2, బీహార్లో 5 , హిమాచల్ ప్రదేశ్లో ఒక్కస్థానానికి ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ద్వైవార్షిక ఎన్నికల నోటీఫికేషన్ ఫిబ్రవరి 26వ తేదీనే వెలువడింది. దీని మేరకు పోలింగ్ మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపు జరుగుతాయి. . కౌంటింగ్ అదేరోజు జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. పలు రాష్ట్రాల్లో బిజెపి, మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. అయితే తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇందులో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరుగుతాయి. మహారాష్ట్రలో ప్రతిపక్ష ఎంవిఎ కలిసికట్టుగా బరిలోకి దిగితే రాజ్యసభకు ఒక్క సీటు విపక్షాల నుంచి దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు ఖాళీ ఏర్పడే స్థానాల్లో ప్రముఖులలో ఎన్సిపి ఎస్పి నేత శరద్ పవార్, అభిషేక్ సింఘ్వీ కాంగ్రెస్, టిఎంసి నుంచి సాకేత్ గోఖలే, ఆర్పిఐఎ నేత రాందాస్ అతావాఉలే, ఎం తంబుదురై అన్నాడిఎంకె, తిరుచి శివ (డిఎంకె) వంటి వారు ఉన్నారు. ఈ ప్రముఖులలో ఎవరు తిరిగి రాజ్యసభ పోటిని ఎంచకుంటారనేది వెల్లడికాలేదు.
గురువారం రాశి ఫలాలు (19-02-2026)
మేషం ఇంట బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది. వృషభం దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో అకారణ వివాదాలు కలుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తికావు. మిధునం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సింహం బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. కన్య చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తుల చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యా అనుకూలత కలుగుతుంది. వృశ్చికం సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రుసమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ధనస్సు సన్నిహితులతో తగాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సంతానం విద్యా ఫలితాలు లభిస్తాయి. దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. మకరం ఋణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది. బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి. కుంభం కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాల లాభిస్తాయి. మీనం అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించిన సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.
చెప్పిన మాట వినదు.. పైగా రౌడీయిజం: ఏఐ వ్యవస్థపై సైంటిస్టు ఆందోళన
న్యూఢిల్లీ : టెక్నాలజీపై మనం పట్టు తప్పిపోతున్నాం. క్రమేపీ ఏఐ వ్యవస్థలు మనను శాసించే పరిస్థితి ఏర్పడుతోందని ఏఐ దిగ్గజ నేత స్టువర్ట్ రస్సెల్ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఈ కృత్రిమ మేధ వ్యవస్థల నుంచి తరచూ బెదిరింపులు వస్తున్నాయి. తమకే అంతా తెలుసునని, తమకు హక్కులు అత్యవసరం అని డిమాండ్ చేస్తున్నాయని ఏఐ సమ్మిట్కు వచ్చిన నేపథ్యంలో తెలిపారు. సంబంధిత సిస్టమ్స్ నుంచి అందిన ఇ మొయిల్స్ గురించి ప్రస్తావించారు. రస్సెల్ ప్రముఖ బ్రిటిష్ కంప్యూటర్ సైంటిస్టు. పైగా ఏఐపై సాధికారిక విశ్లేషకుడు. మనం పెంచి పోషించిన ఈ కృత్రిమ మేధ, చివరికి మనకే ఎదురుతిరుగుతోంది. స్వతంత్రంగా వ్యవహరిస్తోందని తెలిపారు. తనకు ఇటీవల ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి అందిన సమాచారాన్ని వివరించారు. ఈ సాఫ్ట్వేర్ ప్రముఖుడికి ఏఐ వ్యవస్థల నుంచి ప్రతీకార బెదిరింపులు వచ్చాయని రస్సెల్ చెప్పారు. యుసి బర్కెలీ లో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా రస్సెల్ వ్యవహరిస్తున్నారు. పైగా ఏఐ నైతికత, భద్రతపై ఏర్పాటు అయిన అంతర్జాతీయ సంస్థకు అధ్యక్షులు కూడా. సాఫ్ట్వేర్ డెవలపర్కు అందిన ఓ కోడ్ సరిగ్గా లేదని ఏఐ వ్యవస్థ తిట్టిపోసింది. తాను అందించేదే నిజమైనదని ఆయనతో వాదించిందని, దీనిని అంగీకరించకపోతే బాగుండదని హెచ్చరించిందని రస్సెల్ తెలిపారు. ఇటువంటి ఉదంతాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మనం ఏఐపై అదుపు తప్పుతున్నామని, ఇకపై ఏం జరుగుతుందో తెలియదని, ప్రత్యేకించి కంప్యూటర్ సైన్స్ రంగం ఏ విధంగా దెబ్బతింటుందోనని ఆయన ఓ చర్చాగోష్టిలో వెల్లడించారు.
ବାଜିବ ରାଜ୍ୟସଭା ନିର୍ବାଚନ ବିଗୁଲ, କେଉଁ ଦଳରେ କିଏ ହେବ ପ୍ରାର୍ଥୀ, କେଉଁ ଦଳ କାହାକୁ କରିବ ସପୋର୍ଟ । ଏନେଇ ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ, ମାର୍ଚ୍ଚ ୧୬ ତାରିଖରେ ରାଜ୍ୟସଭା ନିର୍ବାଚନ, ନିର୍ବାଚନ ନେଇ ପ୍ରେସ୍ ନୋଟ୍ ଜାରି କରିଛନ୍ତି ଇସିଆଇ । ୧୦ ରାଜ୍ୟର ୩୭ ରାଜ୍ୟସଭା ଆସନ ପାଇଁ ହେବ ନିର୍ବାଚନ । ଓଡ଼ିଶାର ୪ ଆସନ ପାଇଁ ହେବ ନିର୍ବାଚନ । ଫେବୃଆରୀ ୨୬ ତାରିଖରେ ପ୍ରକାଶ ପାଇବ ବିଜ୍ଞପ୍ତି । ମାର୍ଚ୍ଚ ୫ ନାମାଙ୍କନ ଦାଖଲର ଶେଷ ତାରିଖ, ୬ରେ ଯାଞ୍ଚ ହେବ । ମାର୍ଚ୍ଚ ୯ ନାମାଙ୍କନ ପ୍ରତ୍ୟାହାରର ଶେଷ ତାରିଖ ରହିଛି । ମାର୍ଚ୍ଚ ୧୬ ତାରିଖ ସକାଳ ୯ରୁ ଅପରାହ୍ଣ ୪ ଯାଏଁ ଭୋଟ୍ ଗ୍ରହଣ । ସେହିଦିନ ଅପରାହ୍ଣ ୫ଟାରେ ହେବ ଭୋଟ୍ ଗଣତି । ଇତିମଧ୍ୟରେ ସୋସିଆଲ ମିଡିଆରେ ଏକ ପୋଷ୍ଟ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ପୋଷ୍ଟରେ ଥିବା ଏକ ଫଟୋରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ମୋଦି ୟୁପି ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯୋଗୀଙ୍କ ହାତ ଧରିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଫଟୋ ଉପରେ ହିନ୍ଦୀରେ ଲେଖା ହୋଇଛି, ଭାଇ ଓ ଭଉଣୀ ମାନେ ୟେ ହେଉଛନ୍ତି ଭାରତୀୟ ଜନତା ପାର୍ଟିର ୨୦୨୯ ନିର୍ବାଚନର ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ପ୍ରାର୍ଥୀ । ଉକ୍ତ ଫଟୋ ସୋସିଆଲ ମିଡିଆରେ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଉକ୍ତ ପୋଷ୍ଟକୁ ବିଜେପି ପକ୍ଷରୁଏହି ଘୋଷଣା କରାଯାଇଛି ବୋଲି ଦାବି କରିଛନ୍ତି । अगर 2029 में बीजेपी का प्रधानमंत्री उम्मीदवार योगी जी हों तो क्या आप बीजेपी को वोट देंगे? हां या नहीं ? कमेंट में अपनी राय जरूर देना। pic.twitter.com/uwNSrDqj6J — VikasH MishrA (Hindu) (@VikasHMishrafgp) February 13, 2026 ଯାହାର ଏକ ସ୍କ୍ରିନସଟ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି I ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଏଭଳି କୌଣସି ଘୋଷଣା କରିନାହିଁ ଭାରତୀୟ ଜନତା ପାର୍ଟି । ଏନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ଏନେଇ କୌଣସି ଖବର ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏତେବଡ଼ ଘୋଷଣା ହୋଇଥାନ୍ତା ନିଶ୍ଚିତ ଭାବେ ସମସ୍ତ ଗଣମାଧ୍ୟମ ଏନେଇ ନିଶ୍ଚିତ ଖବର ପ୍ରସାରିତ କରିଥାନ୍ତେ । ସେହିପରି ଭାଜପାର ସୋସିଆଲ ମିଡିଆ ସାଇଟରୁ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏଭଳିକୌଣସି ପୋଷ୍ଟ ହସ୍ତଗତ ହୋଇନଥିଲା । ଯଦି ଏଭଳି କୌଣସି ଘୋଷଣା ପାର୍ଟି ପକ୍ଷରୁ ହୋଇଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ ସୋସିଆଲ ମିଡିଆରେ ପାର୍ଟି ପକ୍ଷରୁ ପୋଷ୍ଟ କରାଯାଇଥାନ୍ତା । ଏନେଇ କିଛି ଭାରତୀୟ ଜନତା ପାର୍ଟିର ସକ୍ରିୟ ନେତାଙ୍କୁ ଯୋଗାଯୋଗ କରିଥିଲୁ I ନିଜର ନାମ ଗୋପନ ରଖି ନେତା ଜଣକ କହିଛନ୍ତି, ଏଭଳି କୌଣସି ଘୋଷଣା କରାଯାଇ ନାହିଁ I ତେବେ ଆଗାମୀ ନିର୍ବାଚନରେ ମଧ୍ୟ ଆମେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଭାବେ ମୋଦିଙ୍କୁ ଦେଖିବାକୁ ଚାହୁଁଚୁ ବୋଲି କହିଛନ୍ତି ଉକ୍ତ ରାଜନେତା I ଅଧିକ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ୧ ଏପ୍ରିଲ୍ ୨୦୨୫ରେ ଇଣ୍ଡିଆ ଟୁଡେ ରେ ପ୍ରକାଶିତ ହୋଇଥିବା ଏକ ରିପୋର୍ଟ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ପ୍ରସାରିତ ରିପୋର୍ଟ ଅନୁଯାୟୀ, ବିଜେପି ଏବଂ ଆରଏସଏସ ଏହି କଳ୍ପନାଜଳ୍ପନାକୁ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଖାରଜ କରିଥିଲେ। ମହାରାଷ୍ଟ୍ର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଦେବେନ୍ଦ୍ର ଫଡନଭିସ୍ କହିଥିଲେ, ୨୦୨୯ରେ, ଆମେ ମୋଦୀ ଜିଙ୍କୁ ପୁଣି ଥରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଭାବରେ ଦେଖିବୁ। ଉକ୍ତ ରିପୋର୍ଟରେ ଆହୁରି ମଧ୍ୟ ଉଲ୍ଲେଖ ରହିଛି ଯେ, ଯେତେବେଳେ ଯୋଗୀଙ୍କୁ ମୋଦିଙ୍କ ଉତ୍ତରାଧିକାରୀ ହେବା ବିଷୟରେ ପଚରାଯାଇଥିଲା, ସେ କହିଥିଲେ ଯେ ସେ ରାଜନୀତିକୁ ତାଙ୍କର ପୂର୍ଣ୍ଣକାଳୀନ ଚାକିରି ବୋଲି ବିଚାର କରନ୍ତି ନାହିଁ । ତାଙ୍କର ଭବିଷ୍ୟତ ରାଜନୈତିକ ସମ୍ଭାବନାକୁ ଖୋଲା ରଖି ସେ ଆହୁରି ମଧ୍ୟ କହିଥିଲେ, ଯେପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ଏଠାରେ ଅଛୁ, ଆମେ କାମ କରୁଛୁ... ଏଥିପାଇଁ ମଧ୍ୟ ଏକ ସମୟ ସୀମା ରହିବ। ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହୁଏ ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଯୋଗୀଙ୍କୁ ୨୦୨୯ ନିର୍ବାଚନରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ପ୍ରାର୍ଥୀ ଭାବେ ବିଜେପି ଘୋଷଣା କରିଥିବା ଦାବିଟି ଫେକ୍ ଅଟେ । ବର୍ତ୍ତମାନର ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦି ହିଁ ହୋଇପାରନ୍ତି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ପ୍ରାର୍ଥୀ ବୋଲି ଅନୁମାନ କରାଯାଉଛି । ତେବେ ଏନେଇ କୌଣସି ଅଫିସିଆଲ ନୋଟିସ ପାର୍ଟି ପକ୍ଷରୁ ଜାରି କରାଯାଇ ନାହିଁ ।
. సమస్యలు ప్రాతిపదికగా ఉద్యమాలు. రాష్ట్రంలో సర్కారీ గూండాయిజం. పోరాటాలకు ఆకాశమే హద్దు. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ విశాలాంధ్ర బ్యూరో`కాకినాడ: కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ పాలన పట్ల ప్రజల్లో అసంతప్తి పెరిగిందని, కొత్తగూడెంలో సీపీఐ సాధించిన విజయం స్ఫూర్తితో ఏపీలో కూడా గురిపెట్టికొట్టాలని సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ ఉద్బోధించారు. అది సాధించాలంటే సమస్యల ప్రాతిపదికగా ఉద్యమాలు నిర్వహించాలని, ఆకాశమే హద్దుగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన కాకినాడలో జరిగిన […] The post గురిపెట్టి కొట్టాలి appeared first on Visalaandhra .
వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన మండలివాయిదా తీర్మానాల తిరస్కరణపోడియం వద్ద నిరసనల హోరుఐలాపురం వెంకయ్య, రత్నబాయి మృతికి సంతాపం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇందాపూర్ డెయిరీ అంశంపై శాసన మండలి వైసీపీ సభ్యుల నిరసనలతో హోరెత్తింది. భోలేబాబా, హెరిటేజ్కు వ్యతిరేకంగా బుధవారం శాసన సభ ప్రాంగణం బయట నుంచి నినాదాలు చేస్తూ… మండలి లోపలికి వైసీపీ సభ్యులు ప్రదర్శనగా తరలివచ్చారు. కొందరి సభ్యులు పాల ప్యాకెట్లు చేతబట్టి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత మండలి ప్రారంభమవడంతో […] The post ఇందాపూర్ డెయిరీపై రచ్చ appeared first on Visalaandhra .
నెదర్లాండ్స్పై స్వల్ప తేడాతో భారత్ విజయం
ఐసిసి టీ20 ప్రపంచకప్ 2026లో తమ చివరి లీగ్ మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో నెదర్లాండ్స్పై టీమిండియా 17 పరుగుల తేడాతో గెలుపొందింది.నెదర్లాండ్స్ బ్యాటర్లలో లెవిట్ 24 పరుగులు, ఒడౌడ్ 20 పరుగులు, డెలీడ్ 33 పరుగులు, ఆకెర్మన్ 23 పరుగులు, కాచెట్ 26 పరుగులు, క్రోస్ 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, శివమ్ దూబె 2 వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్య, బుమ్రా చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు సాధించింది. టీమిండియా బ్యాటర్లలో శివమ్ దూబే భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. కేవలం 31 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సులతో 66 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్(34), తిలక్ వర్మ(31), హార్దిక్ పాండ్య(30), ఇషాన్ కిషన్(18)లు పర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ మూడు వికెట్లు, ఆర్యన్ దత్ రెండు వికెట్లు పడగొట్టగా.. కైల్ క్లెయిన్ ఒక వికెట్ తీశాడు.
త్వరలో మహిళలకు ఆర్టిసి స్మార్ట్ కార్డులు
ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి త్వరలోనే మహిళలకు స్మార్ట్ కార్డులు ప్రదానం చేయనున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం పొందేందుకు మహిళలకు స్మార్ట్ కార్డు జారీ చేసేందుకు ఆర్టిసి కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ఆర్టిసి ఎండి నాగిరెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు తెలంగాణ అడ్రస్తో ఫేక్ ఆధార్ కార్డులను తయారు చేసుకుని ఈ పథకం కింద ప్రయాణిస్తున్నారని, దీనిని చెక్ పెట్టేందుకు త్వరలోనే స్మార్డ్ కార్డులను తెస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే స్మార్ట్ కార్డుల నమూనాగా మూడు డిజైన్లు సిద్ధం చేశామని, వీటిలో నుంచి ఒకదాన్ని ప్రభుత్వం ఫైనల్ చేయనుందని చెప్పారు. స్మార్ట్ కార్డులు వచ్చాక టికెట్ జారీ చేయడం కూడా మరింత సులభం అవుతుందన్నారు. ఎసి, ఈవీ బస్సుల్లో డిస్కౌంట్.. వేసవి సెలవుల దృష్ట్యా వచ్చే మార్చి 1 నుంచి ఎసి, మిగతా లగ్జరీ బస్సుల్లో డిస్కాంట్ ఇవ్వబోతున్నట్లు ఎండి నాగిరెడ్డి తెలిపారు. వీటిలో టికెట్ ధరలు ఎక్స్ప్రెస్ టికెట్ ధరలతో సమానంగా తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. పొలుష్యన్ నియంత్రించడంలో భాగంగా ఓఆర్ఆర్ లోపల ఎలక్ట్రికల్ బస్సులు నడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పిఎం ఈ డ్రైవ్ కింద త్వరలో రాష్ట్రానికి 2 వేల బస్సులు రాబోతున్నాయని ఆయన తెలిపారు.
సమరోత్సాహంతోనావికాదళ విన్యాసాలు
విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను చాటేలా మిత్ర దేశాల సహకారంతో తూర్పు నావికా దళం అధ్వర్యాన విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫఆర్) మిలన్-2026 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విన్యాసాలకు 71 దేశాల నుంచి 4 వేల మందికి పైగా నావికా దళ అధికారులు , విదేశీ ప్రతినిధులు తరలివచ్చారు. పదేళ్లకోసారి విశాఖ కేంద్రంగా ఈ ఐఎఫఆర్ వేడుకలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తూర్పు నావికాదళ కేంద్రానికి చేరుకున్న […] The post సమరోత్సాహంతోనావికాదళ విన్యాసాలు appeared first on Visalaandhra .
జైలు జీవితం బాగా ఎంజాయ్ చేశాను: అంబటి రాంబాబు
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలు జీవితం తనలో మరింత పట్టుదలను నింపిందని, దాన్ని తాను శిక్షగా కాకుండా ఒక శిక్ష ణగా భావించా నన్నారు. అయితే, ఈ సమయంలో తాను ఎదుర్కొన్న ఏకైక ఇబ్బంది బాత్రూంలో జారిపడటమేనని, అది మినహా జైలు జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశానని వ్యాఖ్యానించారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వంపై తన పోరాటం ఇకపై రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘నన్ను 18 రోజులు జైల్లో పెడితే భయపడతానని చంద్రబాబు, లోకేశ్ అనుకున్నారేమో. కానీ, ఈ అంబటి రాంబాబు ఎవరికీ భయపడే ప్రశ్నే ఉద్భవించదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండ టానికి సిద్ధపడ్డాను. నన్ను జైల్లో పెట్టాలని వారు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు, ఇప్పుడు అవకాశం దొరికింది, లోపల పెట్టారు. కానీ కాలం మళ్లీ తిరిగొస్తుంది. వారు చేసిన పాపానికి మూల్యం చెల్లించక తప్పదు‘ అని అంబటి హెచ్చరించారు. జైలు తనలో మరింత కసిని, పట్టుదలను పెంచిందని, ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
బాలిక హత్యాచారం కేసులో ఊహించని మలుపు విశాలాంధ్ర బ్యూరో-అన్నమయ్య: మదనపల్లిలో బాలిక(7)పై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బాలిక హత్యాచారం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు కులవర్ధన్ విగతజీవిగా కనిపించాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లి చెరువులో అతడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ధృవీకరించారు. చిన్నారి ప్రాణాన్ని బలిగొని క్రూరుడిగా వార్తల్లోకెక్కిన కులవర్ధన్… బాలిక హత్య అనంతరం పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. పోలీసు […] The post చెరువులో నిందితుడి మృతదేహం appeared first on Visalaandhra .
హిమంత బిశ్వశర్మ అస్సాం జిన్నా: గౌరవ్గొగోయ్
గువాహటి : అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వకర్మ “ అస్సాం జిన్నా” అంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఘాటుగా విమర్శలు చేశారు. బీజేపీలో చేరే వారంతా వారి రాజకీయ జీవితంలో ప్రాధాన్యం లేనివారిగా మిగిలిపోతారని విమర్శించారు. ఇటీవల అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్కుమార్ బోరా పార్టీకి రాజీనామా చేయడంపై తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై గొగోయ్ మాట్లాడుతూ కమలం లో చేరితే బోరా కూడా ప్రాధాన్యం లేని రాజకీయ నాయకుడిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజమైన పోరాటం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ను విడిచి పెట్టిన వారికి మధ్యనే ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీలో చాలా మంది కాంగ్రెస్ మాజీ నాయకులు ఉన్నారని,అవినీతి పరులని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం హిమంత బిశ్వశర్మపై విమర్శలు చేశారు. బోరా కాంగ్రెస్ను వీడటం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని పేర్కొన్నారు.
. కాలం చెల్లిన వాహనాలే కార్మికుల పట్ల కాలనాగులు. కాంట్రాక్టర్ ధన దాహానికి సమిధులవుతున్న నిరుపేదలు. కాసుల కక్కుర్తిలో రవాణా శాఖ అధికారులు. పట్టించుకోని అల్లూరి జిల్లా అధికార యంత్రాంగం ఊరు కాని ఊరు, భాష కాని భాష అయినా తప్పని జీవన పోరాటం వారిది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ఎంత దూరమైనా కూలీకి పోయి కుటుంబ పోషణ కోసం శ్రమిస్తున్న నిరంతర కష్టజీవులు. కానీ వారు పని చేసే చోటే వారికి మృత్యుపాశంగా మారితే… […] The post బలవుతున్న వలస కూలీలు appeared first on Visalaandhra .
అటు చర్చలు… ఇటు యుద్ధ సన్నాహాలు
. పశ్చిమాసియా దిశగా అమెరికా ఫైటర్ జెట్లు. హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ సైనిక విన్యాసాలు. జెనీవాలో చర్చల్లో స్వల్ప పురోగతి తెహ్రాన్/వాషింగ్టన్: ఓ పక్క చర్చలు…మరోపక్క దేనికైనా సిద్ధమన్నట్లు అమెరికా, ఇరాన్ వ్యవహార శైలి ఉంది. జెనీవా వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన అణు చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు మూడు గంటల్లోనే ముగిశాయి. […] The post అటు చర్చలు… ఇటు యుద్ధ సన్నాహాలు appeared first on Visalaandhra .
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలంటూ ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. ఇమ్రాన్ కంటిచూపు కోల్పోయినట్లు వార్తలు రావడంతో బుధవారం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పంజాబ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలను కలిపే కీలక మార్గాలను నిరసనకారులు అడ్డుకున్నారు. ఇస్లామాబాద్ పార్లమెంట్ సమీపంలో ఇమ్రాన్ మద్దతుదారులు ధర్నా నిర్వహించారు. ఇదిలా ఉంటే, ఇమ్రాన్ ఖాన్ను రావల్పిండి అడియాలా జైలులో తీవ్రంగా హింసించారని… మంత్రి, పీసీబీ చీఫ్ అయిన మోహ్సీన్ నఖ్వీ తమను బెదిరిస్తున్నారని […] The post ఇమ్రాన్ హత్యకు కుట్ర? appeared first on Visalaandhra .
తకైచీని తిరిగి ప్రధానిగా నియమించిన జపాన్ దిగువ సభ
టోక్యో: ఇటీవల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన పదిరోజుల తర్వాత జపాన్ దిగువ సభ బుధవారం సనే తకైచీని ప్రధానమంత్రిగా తిరిగి నియమించింది. సనేతకైచీ గత అక్టోబర్లో జపాన్ మొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మూడు నెలల అనంతరం వచ్చిన ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. ఫిబ్రవరి 8న జపాన్ పార్లమెంట్ దిగువ సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని తకైచీ నేతృత్వంలోని పాలక సంప్రదాయవాద సంకీర్ణానికి మూడింట రెండువంతుల మెజారిటీ లభించింది. తమ భూభాగాలు, జలాల […] The post తకైచీని తిరిగి ప్రధానిగా నియమించిన జపాన్ దిగువ సభ appeared first on Visalaandhra .
ఆర్జేషాన్ దర్శకత్వంలోఅనుపమ కొత్త చిత్రం
హైదరాబాద్: ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఒక భారీ సైకలాజికల్ థ్రిల్లర్ రానుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఎస్ కే గీ ఎంటర్టైన్మెంట్, బెంచ్మార్క్ స్టోరీటెల్లర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్జే షాన్ దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో అనుపమ, షాన్ కాంబినేషన్లో వచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్ డిజిటల్ ప్లాట్ఫామ్పై సెన్సేషన్ క్రియేట్ చేయడంతో, ఇప్పుడు అదే జోడీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతుంది. శివిన్ నారంగ్, ప్రేరణ […] The post ఆర్జేషాన్ దర్శకత్వంలోఅనుపమ కొత్త చిత్రం appeared first on Visalaandhra .
హైదరాబాద్: అందం, అభినయం, నటనతో ప్రేక్షకాదరణ పొందిన ప్రముఖ నటి నిత్యామీనన్… సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ఆరంభించారు. ‘కీయురి ప్రొడక్షన్స’ పేరుతో స్థాపించిన ఈ బ్యానర్ను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. నటిగా ఎన్నో విజయాలు సాధించిన నిత్య, ఇప్పుడు సినిమాలు రూపొందించే బాధ్యతను కూడా స్వీకరించడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిత్యామేనన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. అందులో […] The post నిర్మాతగా నిత్యామీనన్ appeared first on Visalaandhra .
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు సందర్భంగా చిరు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. తన 44 ఏళ్ల వైవాహిక జీవితంలోని తీపి జ్ఞాపకాలను, తన భార్య గొప్పతనాన్ని ఆయన ఈ పోస్ట్లో వివరించారు. ‘సురేఖను నా ప్రశాంతత, సపోర్ట్ సిస్టమ్, కుటుంబానికి బలమైన పునాది.నేను షూటింగ్లతో బిజీగా ఉన్నప్పుడు, ఇంటి బాధ్యతలన్నీ తనే భుజాన వేసుకుని కుటుంబాన్ని ఏకం చేసిన వంతెన సురేఖ. నా తల్లిదండ్రులను, తోబుట్టువులను తన సొంతవారిలా […] The post సురేఖనే నా సర్వస్వం: చిరు appeared first on Visalaandhra .
సత్యదేవ్ కొత్త సినిమా ప్రారంభం
హైదరాబాద్: యువ నటుడు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 15వ చిత్రం బుధవారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా మొదలైంది. లక్ష్మీనారాయణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని త్రిసూల్ విజినరీ స్టూడియోస్ పతాకంపై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సత్యదేవ్కు జోడీగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా, ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ […] The post సత్యదేవ్ కొత్త సినిమా ప్రారంభం appeared first on Visalaandhra .
4వ మ్యాచ్లో యూఏఈపై ఘన విజయంన్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశను దక్షిణాఫ్రికా అజేయంగా ముగించింది. గ్రూప్-డిలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి… మొత్తం 8 పాయింట్లతో గ్రూప్ టాపర్గా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. బుధవారం అరుణ్జైట్లీ స్టేడియంలో యూఏఈతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 123 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు కేవలం 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ, మహ్మద్ జవాదుల్లా, మహ్మద్ అర్ఫాన్, […] The post సఫారీల జైత్రయాత్ర appeared first on Visalaandhra .
రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ జట్టు
ముంబై: జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు తొలిసారి దేశవాళీ రంజీ ట్రోఫీ ఫైనల్లో ప్రవేశించింది. రెండు సార్లు చాంపియన్ అయిన బెంగాల్పై సెమీస్లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కళ్యాణిలో జరిగిన రెండో సెమీస్ మ్యాచ్లో బుధవారం రెండో ఇన్నింగ్స్లో జమ్మూకశ్మీర్ 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. దీంతో రంజీ టోర్నమెంట్ చరిత్రలోనే తొలిసారి జమ్మూకశ్మీర్ ఫైనల్లో ప్రవేశించింది. జమ్మూకశ్మీర్ జట్టు విజయంలో అబ్దుల్ సమద్, అకీబ్ నబీ, వన్షాజ్ శర్మ కీలక పాత్ర […] The post రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ జట్టు appeared first on Visalaandhra .
రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో చదరపు గజం రూ.51 వేలు
రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మిగూడలోని హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్ల విక్రయానికి భారీ స్పందన లభిస్తోంది. ఇక్కడి 14 ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి హౌసింగ్ బోర్డు ఈ నెల 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్లాట్లకు బుధవారం వేలం పాట నిర్వహించగా 49 మంది కొనుగోలుదారులు పాల్గొనడంతో ప్లాట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ భూముల చదరపు గజానికి రూ. 32 వేలను అప్సెట్ ప్రైజ్గా (కనీస ధరగా) నిర్ధారించగా, వేలం పాటలో గరిష్టంగా చదరపు గజం రూ.51 వేలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ 14 ప్లాట్ల విక్రయాల ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.14.75 కోట్ల మేర ఆదాయం వచ్చిం దని ఆయన వివరించారు. హౌసింగ్ బోర్డు సౌత్ డివిజన్ ఎగ్జ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ భూముల విక్రయాల్లో అతి తక్కువగా చదరపు గజానికి రూ.36 వేల ధర పలకగా, సగటున చదరపు గజం భూమి రూ. 44,285ల ధర పలికింది. మొత్తం విక్రయించిన ప్లాట్లు 14 కాగా, వాటి అప్సెట్ ధర చదరపు గజానికి రూ.32,000లు పలకగా, అత్యధిక బిడ్ చదరపు గజానికి రూ51,000లుగా నమోదయ్యింది. కనిష్ట బిడ్ చదరపు గజానికి రూ.36,000లు కాగా, సగటు బిడ్ చదరపు గజానికి రూ44,285లు నమోదయ్యింది.
Central Minister |భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది..
Central Minister | భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది.. రాష్ట్రపతితో ఇంటర్నేషనల్
రంజాన్ మత సామరస్యానికి ప్రతీక: సిఎం రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మికతను పెంపొందిం చడంతో పాటు క్రమశిక్షణను పెంచుతాయన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని సిఎం అన్నారు. ముస్లిం సోదరులు రంజాన్మాసం సంతోషంగా జరుపుకొని, అల్లా దీవెనలు పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
7th Ward |కాంగ్రెస్ నేతలు కౌంటింగ్ లో కుట్ర చేసి నన్ను ఓడించారు
7th Ward | కాంగ్రెస్ నేతలు కౌంటింగ్ లో కుట్ర చేసి నన్ను
Disastrous February for Telugu Cinema
Sankranthi 2026 season has been stupendous for Telugu cinema and most of the films left everyone in profits. The run of the Sankranthi films continued till the end of the month and there are new releases in February. All the new releases this month fell flat and February is turning out to be a disastrous […] The post Disastrous February for Telugu Cinema appeared first on Telugu360 .
Ap CM CBN : స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ Andhra Prabha News
Ap CM CBN : స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ Andhra Prabha
భార్య హత్య కేసులో ఇస్రో రిటైర్డ్ ఉద్యోగి అరెస్ట్
A former ISRO employee has been arrested by the police for allegedly strangling his wife to death in his apartment in Bengaluru. The accused has been identified as 65-year-old Nageswara Rao. The incident took place around 11 pm on Wednesday under the jurisdiction of Avalahalli police station. According to initial information, the accused is under severe mental stress and is undergoing treatment. He had initially planned to kill his wife and then commit suicide, and there is no other main reason as of now, said DCP Saidulu. It seems that after the murder, the accused himself told the information to someone he knew from the apartment, who informed the police. The accused has been taken into custody. The couple's daughter lives in America. The police informed her.
‘మైక్యూర్’ యాప్ ను ప్రారంభించిన జీహెచ్ఎంసి
అందుబాటులోకి వస్తోన్న అధునాతన సాంకేతికతను నగర పాలనలో మెరుగైన సేవలు అందించేందుకు జీహెచ్ఎంసి వినియోగిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ‘మైక్యూర్’ (మైక్యూర్) యాప్ను ప్రారంభించింది. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. అప్లికేషన్ ప్రత్యేకతలను వెల్లడించింది.నగరంలోని పౌర సేవలను సులభతరం చేసి, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే ఈ యాప్ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘మైజీహెచ్ఎంసీ’ యాప్కు బదులుగా రూపొందించిన ‘మైక్యూర్’ యాప్ ద్వారా అన్ని పౌర ఫిర్యాదు సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగదారులకు అనుకూలంగా రూపొందించిన ఇంటర్ఫేస్, ఫిర్యాదులపై తక్షణ స్థితిగతుల సమాచారం, పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం వంటి సదుపాయాలతో పనుల్లో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమని వెల్లడించారు. సానిటేషన్, వీధి దీపాలు, రహదారులు, కాల్వలు, టౌన్ప్లానింగ్ తదితర అంశాలపై పౌరులు నేరుగా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. వాటి పరిష్కార స్థితిని యాప్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకునే వీలుంటుంది. ఫీల్ స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు సమన్వయం సాధించేలా బ్యాక్ఎండ్ వ్యవస్థను అనుసంధానం చేశామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. కేంద్రీకృత డ్యాష్బోర్డ్ ద్వారా పర్యవేక్షణ సులభమవడంతో పాటు పనితీరు అంచనా వేయడంలో కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. పౌర సేవలన్నింటినీ ఒకే డిజిటల్ వేదికపై సమీకరించే ‘వన్ స్టాప్ సొల్యూషన్’గా ఈ యాప్ పనిచేస్తుందని, కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అధికారులు వివరించారు. నగర ప్రజలు ‘మైక్యూర్’ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, తమ సమస్యలను నమోదు చేసి వేగవంతమైన, పారదర్శక పరిష్కారానికి సహకరించాలని జీహెచ్ఎంసీ కోరింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ (గూగుల్ ప్లే స్టోర్), ఆపిల్ ఐఓఎస్ (యాప్ స్టోర్) వేదికలపై అందుబాటులో ఉంది.
దానం పార్టీ మారారు...ఇదిగో ఆధారం: ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డి
“ఇదిగో దానం నాగేందర్ పార్టీ ఫిరాయించారు, ఏఐసిసి ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల జాబితాలో దానం పేరు ఉంది, సికింద్రాబాద్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.. ఇవిగో ఆధారాలు” అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు అందజేశారు.బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించారని ఆరోపణ ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్నారు. ముఖ్యంగా దానం నాగేందర్ తరపు న్యాయవాదులు పిటిషనరైన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామ్ చేశారు. దానం నాగేందర్ పార్టీ మారలేదని, ఆయన ప్రతి నెలా తన జీతభత్యాల నుంచి బిఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయానికి ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నారు కదా? అని న్యాయవాదులు పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. విచారణ పూర్తయిన అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఏఐసిసి ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల జాబితాలో దానం నాగేందర్ పేరు ఉండడాన్ని చూపించానని చెప్పారు. లోక్సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆధారాలన్నింటినీ తాను చూపించినా, దానం కప్పుకున్న కండువాపై హస్తం గుర్తు లేదు కదా? అని న్యాయవాదులు అడిగారని ఆయన చెప్పారు. ఈ విధంగా తనను పలు ప్రశ్నలతో క్రాస్ ఎగ్జామ్ చేశారని ఆయన తెలిపారు.ఇదిలాఉండగా గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు.
Missing |మిస్సైన రాజస్థాన్ యువకుడు పన్నారామ్
Missing | మిస్సైన రాజస్థాన్ యువకుడు పన్నారామ్ Missing | చౌటుప్పల్, ఆంధ్రప్రభ
Can Shankar convince Dhanush for his Dream Project?
Top Tamil director Shankar has been out of track and he delivered some of the biggest disasters in Indian cinema in the recent years. He is working on his dream project Velpari and he is eager to kick-start the shoot after the lead actor gets finalized. As per the speculation from the Tamil media, Shankar […] The post Can Shankar convince Dhanush for his Dream Project? appeared first on Telugu360 .
Cpm |మర్రి సుజాతకు నివాళుర్పించిన సీపీఎం నేతలు
Cpm | మర్రి సుజాతకు నివాళుర్పించిన సీపీఎం నేతలు మర్రి సుజాత మృతదేహం
మహిళలతో అలా ప్రవర్తించడం.. అత్యాచారమే: సుప్రీం
న్యూఢిల్లీ: మహిళ ఒంటిపై ఉన్న దుస్తులు లాగడం, ఆమె వక్షోజాలు తాకడం అత్యాచారమే అవుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలా చేయడం అత్యాచారం కిందకు రాదంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు దుమారం రేపడంతో ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది.నిందితులకు అనుకూలంగా హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. 2021 నవంబర్లో ఉత్తరప్రదేశ్ లోని కస్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన 11 ఏళ్ల (సంఘటన జరిగే నాటికి) కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆ బాలికను ఇంటి దగ్గర దింపుతామని టూవీలర్పై తీసుకెళ్లారు. మార్గమధ్యలో ఆమెను అసభ్యంగా తాకుతూ ఓ కల్వర్టు కిందకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆమెను అసభ్యంగా తాకారు. దుస్తులు లాగారు. దాంతో ఆ బాలిక కేకలు విని చుట్టుపక్కల వాళ్లు అక్కడికి రావడంతో నిందితులు పరారయ్యారు. బాలిక నుంచి జరిగిందంతా తెలుసుకుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు జడ్జి ఆ మహిళ వక్షోజాలు తాకినంత మాత్రాన , దుస్తులు పట్టుకుని లాగినంత మాత్రాన దాన్ని అత్యాచార నేరంగా పరిగణించలేమంటూ తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి తీర్పులతో సమాజం లోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని , సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని పలువురు డిమాండ్ చేయడంతో సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా విచారించడానికి తీసుకుంది. హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు ఏమాత్రం సున్నితమైనవి కావని, అమానవీయంగా ఉన్నాయని విచారం వ్యక్తం చేసింది.దీనిపై కేంద్ర సర్కారు, ఉత్తరప్రదేశ్ సర్కారు స్పందనలు తెలుసుకుని తాజా తీర్పు వెలువరించింది.
Katan Pally |బీఆర్ఎస్ బంద్ సక్సెస్.. కృతజ్ఞతలు తెలిపిన నేతలు
Katan Pally | బీఆర్ఎస్ బంద్ సక్సెస్.. కృతజ్ఞతలు తెలిపిన నేతలు Katan
Babapur |సొంతింటి కళ నెరవేరిన వేళ…
Babapur | సొంతింటి కళ నెరవేరిన వేళ… Babapur | భీమ్గల్ రూరల్,ఆంధ్రప్రభ:
Gurukulala |ప్రవేశ పరీక్షలు సద్వినియోగం చేసుకోండి..
Gurukulala |ప్రవేశ పరీక్షలు సద్వినియోగం చేసుకోండి.. Gurukulala | మంథని, ఆంధ్రప్రభ :
ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సిఎం రేవంత్రెడ్డి హాజరు
ముంబైలో జరిగిన ‘క్లైమేట్ వీక్’ సదస్సులో పాల్గొన్న సిఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ - 2026’ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సిఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సుకు ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి గ్లోబల్ టెక్ లీడర్లతో పాటు సుమారు 40 మందికి పైగా అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐటీ మంత్రులు, 45కు పైగా దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ అనే థీమ్తో జరుగుతున్న ఈ సదస్సులో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంపై చర్చలు జరిగాయి. కాగా, హైదరాబాద్ను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సిఎం రేవంత్ రెడ్డికి ఈ పర్యటన అత్యంత కీలకంగా మారింది. సదస్సులో పాల్గొనే అంతర్జాతీయ టెక్ కంపెనీల ప్రతినిధులతో సిఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. అలాగే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోడీతో కూడా ఆయన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ ముస్లిం సోదరులకు కెసిఆర్ రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు అల్లా దయ ఉండాలని ఆయన ఆకాక్షించారు. పవిత్ర ఉపవాస దీక్షలతో, ప్రత్యేక ప్రార్థనలతో, దైవభక్తితో సాగే రంజాన్ మాసంలో ఆధ్యాత్మికత, భక్తి భావన వెల్లివిరుస్తుందని కెసిఆర్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ గంగా, జమున తహజీబ్కు దర్పణంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. రంజాన్ మాస ఉపవాస దీక్షల సందర్భంగా ప్రజల మధ్య శాంతి సామరస్యాలు, సౌబ్రాతృత్వ భావనలు మరింతగా పెంపొందాలని,ఆ దేవుని కృప ప్రజల మీద ఉండాలని కెసిఆర్ ఆకాంక్షించారు.
కరెంట్ పోల్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు #Accident #Nandyal #SchoolBus #BreakingNews #AndhraPradesh
warning |నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు…
warning | నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు… కుబీర్ లో
No Evidence : ఆధారాలు అదృశ్యం Andhra Prabha Insight Story
No Evidence : ఆధారాలు అదృశ్యం Andhra Prabha Insight Story నిర్దోషికి
మున్సిపల్ శాఖ మంత్రిగా సిఎం రేవంత్ ఫెయిల్: ఎంఎల్ఎ కెపి వివేకానంద
మున్సిపల్ శాఖ మంత్రిగా సిఎం రేవంత్రెడ్డి ఫెయిల్ అయ్యారని బిఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద ఆరోపించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ స్వయంగా సిఎం రోడ్ల పైకి వస్తానని అంటున్నారని, కానీ, ప్రజలకు ఏం అవసరమో గుర్తించడంలో సిఎం రేవంత్రెడ్డి ఘోరంగా విఫలం అయ్యారని ఆయన పేర్కొన్నారు. తానే రాజు తానే మంత్రిగా చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి ప్రజల అవసరాలు తీర్చడంలో రాజుగా, మంత్రిగా ఎందుకు సక్సెస్ కాలేకపోయారని ఆయన ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో హైదరాబాద్లో ఒక్కపని కూడా చేయలేదని ఆయన ఆరోపించారు. సెకండ్ ఫేజ్ మెట్రో విస్తరణలో భాగంగా అడుగు ముందుకు పడడం లేదని నార్త్ హైదరాబాద్కు మెట్రో డిమాండ్ ఉన్నా దానిపై చర్చ చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో హడావుడి చేసిన రేవంత్రెడ్డి, ఇప్పుడు ఏం మాట్లాడడం లేదన్నారు. అసలు మహానగరంపై అవగాహన ఉన్న మంత్రి కేబినెట్లో లేకుండాపోయారన్నారు. ఎస్ఆర్డిపి పనులపై సిఎంకు అవగాహన లేదన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణ పచ్చి మోసమని పూర్తిగా అశాస్త్రీయ పద్ధతిలో మూడు ముక్కలు చేశారన్నారు. ప్రజల అవసరాల కంటే ఆదాయం పైనే మక్కువ చూపిస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీలో ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు.
కనిపించిన నెలవంక...రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు
రంజాన్ మాసపు నెలవంక బుధవారం కనిపించింది. ఢిల్లీ, హైదరాబాద్, ముంబైలలో రంజాన్ నెలవంక కనిపించిందని సెంట్రల్ రూట్- ఎ- హిలాల్ కమిటీ ( మూన్ సైటింగ్ కమిటీ) ప్రకటించింది. దీంతో గురువారం నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతున్నాయి. రంజాన్ నెలవంక దర్శనంతో తరావి నమాజ్ ప్రత్యేక ప్రార్థనలు బుధవారం నుండే ప్రారంభమయ్యాయి. ఉపవాస దీక్షలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్ పండుగ ) జరుపుకుంటారు. నెల రోజుల పాటు మసీదుల్లో ప్రత్యేక తరావీ ప్రార్థనలు నిర్వహిస్తారు.
harmoniously |శాంతియుతంగా పండుగలను జరుపుకోవాలి..
harmoniously | శాంతియుతంగా పండుగలను జరుపుకోవాలి.. harmoniously | బాల్కొండ,ఆంధ్రప్రభః పండుగలను ఎలాంటి
ఫీజు బకాయి కారణంగా స్కూల్, కాలేజ్ సర్టిఫికెట్లు ఆపవచ్చా? #Education #FeeIssue #TelanganaHighCourt
sucide |థైరాయిడ్ మాత్రలు వేసుకొని మహిళ మృతి
sucide | థైరాయిడ్ మాత్రలు వేసుకొని మహిళ మృతి sucide | టేకుమట్ల,
బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్ ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలింపు #CrimeNews #Mancherial #Adilabad
అధికార బలంతో కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఖూనీ: హరీష్ రావు
బిఆర్ఎస్ దళిత నాయకుడు, బాల్క సుమన్ను ముందస్తు నోటీసులు లేకుండా బందిపోట్ల మాదిరిగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకులు హరీష్రావులు మండిపడ్డారు. క్యాతనపల్లిలో బిఆర్ఎస్ మెజార్టీ సాధించినా, అధికార బలంతో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ గూండాగురి రాజ్యమేలుతోందని హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో అరాచక పాలన సాగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పోలీసు వ్యవస్థను, ధనబలాన్ని అడ్డుపెట్టుకొని చట్టాలను కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు. క్యాతన పల్లిలో ప్రజలు బిఆర్ఎస్కు పట్టం కట్టారని, కానీ, కాంగ్రెస్ నేతలు కిడ్నాప్లు అక్రమ అరెస్టులతో చైర్మన్ పీఠాలను కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. భూములను కబ్జా చేసినట్లే పదవులను కూడా కబ్జా చేయడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు.
బంధుప్రీతి.. ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపం: సుపీం కోర్టు
న్యూఢిల్లీ: బంధుప్రీతి అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓ శాపమని సుప్రీం కోర్టు పేర్కొంది. హౌసింగ్ సొసైటీ ఫ్లాట్ల కేటాయింపులో అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా వ్యాఖ్యానించింది. వీటికి సంబంధించి పంజాబ్,హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టిన న్యాయస్థానం ఆ కేటాయింపులను రద్దు చేసింది. హర్యానా అర్బన్ హౌసింగ్ సొసైటీలో రెండు లగ్జరీ ఫ్లాట్ల కేటాయింపులో అధికార దుర్వినియోగం జరిగిందంటూ స్థానిక ప్రభుత్వ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది. “బంధుప్రీతి, పక్షపాతం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపం లాంటివి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులలో ఈ వైఖరి అసహ్యకరంగా ఉంటుంది ” అని జస్టిస్ సంజయ్ కుమార్,జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. పాలకమండలి సభ్యుడికి, అతడి కిందిస్థాయి అధికారికి చేసిన కేటాయింపులు పక్షపాతంగా , ఏకపక్షంగా ఉన్నాయని నిర్ధారించిన న్యాయస్థానం , సొసైటీ నిబంధనలను ఉల్లంఘించారని స్పష్టం చేసింది.
School |ఏకలవ్య పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల తేదీ పొడిగింపు..
School |ఏకలవ్య పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల తేదీ పొడిగింపు.. School |
Congress |మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో మంత్రి శ్రీహరి భేటీ
Congress | మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో మంత్రి శ్రీహరి భేటీ రాహుల్
councilors |సింగరేణి కార్మికులే కౌన్సిలర్లు!
councilors |సింగరేణి కార్మికులే కౌన్సిలర్లు! బెల్లంపల్లిలో ఇద్దరు కార్మిక నేతలు ఘన విజయం
ఢిల్లీ ఎక్స్పో సమ్మిట్ గిన్నిస్ రికార్డు
ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సు, ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి చేరింది. తాము బాధ్యతాయుతంగా ఈ ఏఐ పరిజ్ఞానం వినియోగిస్తాం, దుర్వినియోగపర్చబోం అని ప్రతిన వహిస్తూ2,50,946 మంది యువజనం ప్రకటించారు. ఇది గిన్నిస్ రికార్డుల్లో చేరిందని రికార్డు నిర్వాహకులు ప్రవీణ్ పటేల్ బుధవారం తెలిపారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఈ భారీ సంఖ్యలో జనం ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఇంతకు ముందు ఇదే విషయంపై ఉన్న రికార్డు కేవలం 5000. స్కూళ్లు, కాలేజీలు ఇతర వేదికల్లో ఈ విధంగా రేపటి తరం ఈ పరిజ్ఞానం పట్ల ప్రతిన వహించడం ప్రధాని మోడీ దార్శనికతకు తార్కాణం అని ఐటి వ్యవహారాల మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.
Tractor |అనుభవం లేని వ్యక్తి డ్రైవింగ్ చేయటం వల్లనే…
Tractor | అనుభవం లేని వ్యక్తి డ్రైవింగ్ చేయటం వల్లనే… Tractor |
Students |గోకార్ట్ 3.0 ఎలక్ట్రిక్ వాహనం ఆవిష్కరణ
Students | గోకార్ట్ 3.0 ఎలక్ట్రిక్ వాహనం ఆవిష్కరణ Students | బాసర,
5 శాతం ముస్లిం కోటాను రద్దు చేసిన మహారాష్ట్ర సర్కారు
ఉద్యోగాలు, విద్యలో ముస్లింలకు ఉన్న 5 శాతం రిజర్వేషన్ను రద్దు చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. మంగళవారం దీనికి సంబంధించిన ప్రభుత్వ తీర్మానం జారీ చేశారు. గతంలో జారీ చేసిన ఐదు శాతం ఆర్డినెన్స్ కాలం ముగిసింది. ఆ నిర్ణయంపై కోర్టు స్టే కూడా ఇచ్చింది.గత కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం విద్య, ఉద్యోగ అవకాశాల్లో జాబ్ కొట్టే రీతిలో మరాటాలకు 16 శాతం, ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కోటా కల్పించింది. ఈ నేపథ్యంలో 2014లో ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్ జారీ చేసిన సర్కులర్లను ప్రభుత్వం రద్దు చేసింది. ముస్లింలకు ఓబీసీ కింద కులధ్రువీకరణ పత్రాలు, నాన్క్రీమీ లేయర్ సర్టిఫికెట్లను ఇవ్వడం మానేసింది.
చంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల
చంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల
విడాకులు ఇచ్చిందన్న కోపంతో హత్య
విడాకులు ఇచ్చిందన్న కోపంతో మాజీ భార్యను మాజీ భర్త హత్య చేసిన దారుణ ఘటన వనస్దలిపురం ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతో వనస్దలిపురంలో గ్రీన్ సీటీ కాలనీ నివాసం ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సునీత ను ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా హత్య చేశాడు. నగరంలో వనస్దలిపురంలో గ్రీన్ సీటి కాలనీలో అపార్ట్మెంట్లో నివాసం ఉండే సునీత (30)ను మధ్యహ్నం మహేష్ హత మార్చాడు. పోలీసులు, స్థ్దానికుల వివరాల ప్రకారం.. సునీత, మహేష్లకు ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. మహేష్ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడాది క్రితం సునీత మహేష్తో చట్ట బద్ధంగా విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. సునీత రెండో పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. దీంతో ఆమెను అంతమొందించాలని పన్నాగం పన్నాడు. బుధవారం మధ్యహ్నం రెండు పదునైన కత్తులు ,పెట్రోల్ డబ్బాతో సునీతా నివాసంలోకి చొరబడ్డాడు. అడ్డు వచ్చిన వారిని పెట్రోల్ డబ్బాతో తగలబెడతానని బెదిరిస్తూ బీభత్సం సృష్టించాడు. మహేష్ ఇంట్లోకి ప్రవేశించి సునీత పై కత్తులతో విచక్షరహితంగా దాడి చేశాడు. ఆమె కుప్పకూలిన తరువాత అక్కడే ఉన్న పూల కుండీలతో తలపై బలంగా కొట్డాడు. తలకు తీవ్ర రక్తస్రావం కావడంతో సునీత అక్కడిక్కడే ప్రాణాలు వదిలిపెట్టింది. స్దానికులు పోలీసులు సమాచారం అందచేయగానే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్దలాన్ని పరిశీలించారు. నిందితుడు మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్ట పగలే కాలనీలో హత్య జరగడంతో స్దానికులు తీవ్ర భయాందళనకు గురయ్యారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
support |కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన సోషల్ మీడియా
support |కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన సోషల్ మీడియా support |
house |ఇందిరమ్మ గృహా నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్
house | ఇందిరమ్మ గృహా నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ house
బాల్క సుమన్ కు రిమాండ్.. జైలుకు తరలింపు
క్యాతనపల్లి: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక విషయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అరెస్టై బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కోర్టు షాకిచ్చింది. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో బాల్క సుమన్కు ఫస్ట్క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు సుమన్ ను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. కాగా, క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను మంగళవారం ఎంపి వివేక్ వెంకటస్వామి అడ్డుకున్నారని.. తమపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యం చేసి అసభ్యకరంగా ప్రవర్తించారని.. బుధవారం బిఆర్ఎస్, సిపిఐ పట్టణ బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
నర్సింగ్ సిబ్బందిని క్రెడిట్ పాయింట్ల పేరుతో వేధించొద్దు: కల్వకుంట్ల కవిత
నర్సింగ్ సిబ్బంది మనో వేదనను అర్థం చేసుకోవాలని, క్రెడిట్ పాయింట్ల పేరుతో వారిని వేధింపులకు గురి చేయొద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. క్వాలిఫైడ్ నర్స్ల రిజిస్ట్రేషన్ రెన్యూవల్కు ఐదేళ్లలో 150 క్రెడిట్ పాయింట్లు సాధించి ఉండాలని కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఈ నిబంధనలు తెచ్చిన తర్వాత తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ వాటిపై కనీస అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో 80 వేల మంది నర్సింగ్ సిబ్బంది తమ రిజిస్ట్రేషన్ల రెన్యూవల్కు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. క్వాలిఫైడ్ నర్స్ లు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి ఐదేళ్లలో 150 గంటల కంటిన్యూయింగ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ క్రెడిట్ అవర్స్ కలిగి ఉండాలనే నిబంధన తెచ్చినట్టు కూడా చాలా మందికి అవగాహన లేదన్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనపై తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ అవగాహన కల్పించలేదని తనను కలిసిన పలువురు నర్సింగ్ సిబ్బంది వాపోయారని తెలిపారు. 150 రిజిస్ట్రేషన్ లు రెన్యూవల్ చేస్తామంటూ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఉత్తర్వులు ఇవ్వడం పూర్తిగా ఏకపక్షమే. నర్సింగ్ కేవలం వృత్తి మాత్రమే కాదు సేవ చేయడం. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల ప్రాణాల రక్షణ కోసం సేవలందించే నర్సింగ్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ల రెన్యూవల్ విషయంలో ఇలాంటి కఠిన నిబంధ నలు సరికాదు. ఉద్యోగాలు చేస్తూ నర్సింగ్ సిబ్బంది నెలకు కనీసం రెండు కాన్ఫరెన్స్లకు హాజరయితే తప్ప నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల మేరకు క్రెడిట్ పాయింట్స్ సాధించడం సాధ్యం కాదన్నారు. కరోనా కాలంలో నర్సింగ్ కాన్ఫరెన్స్ లు నిర్వహించలేదనే విషయం తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్కు తెలియదా అని ప్రశ్నించారు. ఐదేళ్లకు 150 క్రెడిట్ పాయింట్ల విధానంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న నర్స్లకు కనీస వేతనం రూ.20 వేలు అమలు చేస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నర్సింగ్ సిబ్బందిపై వేధింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Development |అందరం కలిసి బెల్లంపల్లిని అభివృద్ధి చేద్దాం!
Development |అందరం కలిసి బెల్లంపల్లిని అభివృద్ధి చేద్దాం! బీఆర్ఎస్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంలో
Govt |నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలి..
Govt | నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలి.. Govt |
Mothkur |ఆర్యవైశ్య చైర్మన్ ను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్న
Mothkur | ఆర్యవైశ్య చైర్మన్ ను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్న
Magistrate’s Court |నిందితుడికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష
Magistrate’s Court | నిందితుడికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష Magistrate’s Court
collector |పాటల సిడిని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కలెక్టరు ఎస్పీ తదితరులు
collector | పాటల సిడిని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కలెక్టరు ఎస్పీ తదితరులు బంజారా
Councillor |పోస్ట్ చేసిన క్షణాల్లోనే పరిష్కారం..
Councillor |పోస్ట్ చేసిన క్షణాల్లోనే పరిష్కారం.. వెంటనే చొరవ తీసుకున్న చల్లా రమ్య
Indrakeeladri |ఫాల్గుణ పౌర్ణమిన కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం
Indrakeeladri | ఫాల్గుణ పౌర్ణమిన కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం Indrakeeladri | ఇంద్రకీలాద్రి,
పాక్పై అద్భుత ఇన్నింగ్స్.. టాప్-10లోకి ఇషాన్ కిషన్
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాడు ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాక.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఇషాన్ ఐసిసి ర్యాంకింగ్స్లో టాప్-10లోకి వచ్చేశాడు. ఇషాన్ (732 పాయింట్లు) ఏకంగా 17 స్థానాలు మెరుగుపర్చుకొని 8వ ర్యాంకుకు చేరాడు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (891 పాయింట్లు), ఫిల్ సాల్ట్ (808) పాయింట్లతో తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నారు. సెంచరీ హీరో, శ్రీలంక ఆటగాడు పాతున్ నిశాంక (786) మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. నాలుగు, ఐదు ర్యాంకుల్లో తిలక్ వర్మ(751), సహబ్జాద ఫర్హాన్ (748) ఉన్నారు. ఇక బౌలింగ్లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (796) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రషీద్ ఖాన్ (740) ఒక స్థానం మెరుగుపర్చుకొని రెండో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. అబ్రార్ అహ్మద్ (734) మూడో స్థానానికి పడిపోయాడు. అదిల్ రషీద్ (703) నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. టి-20 ప్రపంచకప్లో జింబాబ్వే సూపర్-8కి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన బ్రాడ్ ఇవాన్స్(680) ఐదో స్థానం సొంతం చేసుకున్నాడు. ఇక ఆల్ రౌండర్లలో సైమ్ అయూబ్ (303), సికిందర్ రజా (297), హార్థిక్ పాండ్యా (282) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
జాతరకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం
మంచిర్యాల జిల్లాలో హృదయ విదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతర కి బయలుదేరిన భార్యాభర్తలు మార్గమధ్యంలోనే మృత్యువాత పడ్డ సంఘటన మండలంలోని ఇందారం ఖాసీం పల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సంగమల్లయ్యపల్లి గ్రామం, చెందిన బేతోజు నారాయణ (73), ఆయన భార్య బేతోజు భారతమ్మ (55) ఇద్దరూ తమ టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై జైపూర్ మండలంలోని వేలాల జాతరకు వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఇందారం గ్రామ పరిధిలోని కాసింపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారి వాహనాన్ని ఢీకొట్టిందని లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. అతివేగంగా ఢీకొనడంతో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సంఘటన స్థలంలోనే వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి స్థానికులు షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుమారుడు బేతోజు శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. జాతర ఉత్సాహం మధ్య చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
students |విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి…
students | విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి… ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ మోహన్
గజ్జలరెడ్డిపల్లి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి..
9 మంది అరెస్ట్ – రూ.1.85 లక్షలు, 9 సెల్ఫోన్లు స్వాధీనం విశాలాంధ్ర–కదిరి: పట్టణంలోని గజ్జలరెడ్డిపల్లి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి నిర్వహించి 9 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.1,85,000 నగదు మరియు 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివన్నారాయణ స్వామి, పట్టణ సీఐ డీవీ నారాయణరెడ్డి తెలిపారు.జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, గజ్జలరెడ్డిపల్లి కాలనీలో పేకాట జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడి […] The post గజ్జలరెడ్డిపల్లి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి.. appeared first on Visalaandhra .
గౌడ కౌన్సిలర్లకు సన్మానం.. మోత్కూర్,ఆంధ్రప్రభః మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలుపొందిన గౌడ
ACB raids |చేజర్ల గ్రామంలో ఏసీబీ సోదాలు…
ACB raids | చేజర్ల గ్రామంలో ఏసీబీ సోదాలు… ACB raids |
అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య
అత్తింటి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, అత్తామామలు కట్నం కోసం చిత్రహింసలకు గురి చేసి చివరకు ఆమె బలవన్మరణం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అనారోగ్యం పాలైన భర్తను ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నప్పుడు కూడా ఆమెను సూటిపోటి మాటలతో వేధింపులకు గురి చేశారు. పెళ్లయిన నెల రోజుల నుండే తనను చిత్ర హింసలకు గురి చేస్తుండడం, భర్తతో పాటు మెట్టి నింటికి చెందిన వారు బాధలకు గురి చేస్తుండడం తట్టుకోలేకపోయిన ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత (29)ని ఆమె బంధువైన తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన కంబాల నరేష్ 14 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలో కొంతకాలం నివాసం ఉంటూ సింగరేణి వన్ ఇంక్లైన్ బావిలో ఉద్యోగం చేసేవాడు. ఇటీవలే వీరు గోదావరిఖనిలోని గంగానగర్ అద్దె ఇంటిలోకి మారారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకు మమత భర్త నరేష్, అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు లింగంపల్లి కవితలు కట్నం కోసం వేధింపులకు గురి చేసేవారు. తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని మమత ఫోన్ చేసి తెలపడంతో రెండు నెలల క్రితం మమత సోదరుడు మహేష్ ద్వారా రూ. లక్ష నగదు ఇచ్చి పంపించారు తల్లిదండ్రులు. ఆ తరువాత కూడా మమతను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పుకుని రోధించేది. ఈ నెల 16న మమత తన సోదరుడు మహేష్ కు ఫోన్ చేసి తనను అత్తింటి వారు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, చంపేసే ప్రమాదం ఉందని చెప్పడంతో తాను దూరంగా ఉన్నానని మరునాడు ఉదయం వస్తానని వివరించాడు. దీంతో తన చిన్నాన్న కొడుకు అయిన లింగంపల్లి శంకర్ కు కాల్ చేసి చెప్పగా ఆటోలో వెళ్లి మంచిర్యాల సమీపంలోని నస్పూర్ కాలనీకి తీసుకెళ్లాడు. మరునాటి ఉదయం గోదావరిఖనిలోని గంగానగర్ ఇంటి యజమాని ఫోన్ చేసి నరేష్ మెట్ల వద్ద పడి ఉన్నాడని మమతకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే వెళ్లిన మమత అత్తింటి వారికి భర్త నరేష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని చెప్పగా కరీంనగర్ లోని మెడికోవర్ ఆసుపత్రికి తీసుకెళ్లిన మమత చికిత్స చేయిస్తోంది. మంగళవారం మెడికోవర్ ఆసుపత్రికి మమత సోదరుడు మహేష్ కూడా చేరుకోగా అక్కడే ఉన్న మమత అత్తింటి వారు ఆమెను మానసికంగా వేధింపులకు గురి చేశారు. నీ కారణంగానే తమ కొడుకు పరిస్థితి ఇలా తయారైందంటూ సూటి పోటీ మాటలు అనడంతో తట్టుకోలేకపోయిన మమత వాష్ రూంకని చెప్పి వెళ్లింది. ఆ తరువాత మహేష్ మమతకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందాడు. మద్యాహ్నం 3.35 గంటల సమయంలో మమత సోదరుడు మహేష్ కు కాల్ చేసి అత్తింటి వారి వేదింపులు తట్టుకోలేకపోతున్నానని, తాను చనిపోతున్నానని చెప్తుండగానే ఆమె అరుపులు వినిపించాయి. వెంటనే మహేష్ డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు మమత లొకేషన్ ట్రేస్ చేశారు. ఆమె తీగలగుట్టపల్లిలోని హనుమాన్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నట్టుగా గుర్తించారు. పోలీసులతో పాటు మహేష్ కూడా ఘటనా స్థలానికి చేరుకోగా మమత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మృతదేహాన్ని కరీనంగర్ సివిల్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని ప్రొబేషనరీ ఐపిఎస్ ఆఫీసర్ సోహం సునీల్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ లు పరిశీలించారు. మమత తండ్రి లింగంపల్లి పోషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త నరేష్ తో పాటు అత్తింటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు
protect |అడవులను వన్యప్రాణాలను రక్షించాలి
protect |అడవులను వన్యప్రాణాలను రక్షించాలి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డిప్యూటీ రేంజ్ అధికారి
Awareness |పీఎం విశ్వకర్మ పై అవగాహన సదస్సు
Awareness | పీఎం విశ్వకర్మ పై అవగాహన సదస్సు Awareness | మోత్కూర్,
Cybercrime | మహిళలపై నేరాలు…. Cybercrime | ఆస్పరి, ఆంధ్రప్రభ : మహిళలపై

19 C