Hyderabad : కిలాడీ లేడీ అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని అనేక ఆసుపత్రుల్లో డాక్టర్ గా నటిస్తూ రోగులను దోచుకుంటున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు
పశ్చిమ ఆసియాలో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుదుపునకు గురవుతోంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ప్రతిష్టంభన కేవలం ప్రాంతీయ ఉద్రిక్తత మాత్రమే కాదు, అది గ్లోబల్ ఎనర్జీ సంక్షోభానికి ప్రధాన హేతువుగా మారుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య కొనసాగుతున్న పోరు అంతర్జాతీయ చమురు మార్కెట్ను అతలాకుతలం చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో బ్యారెల్కు 60 డాలర్లుగా ఉన్న ముడిచమురు ధర, సోమవారం నాటికి ఏకంగా 120 డాలర్లకు చేరుకోవడం ఆందోళనకరం. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ధరలు రెట్టింపు కావడం, 2022 నాటి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సృష్టించిన ప్రకంపనలను గుర్తుకు తెస్తోంది. ఇరాన్, ఒమన్ దేశాల మధ్య కేవలం 33 కిలోమీటర్ల వెడల్పున్న ఈ సన్నని జలమార్గం గుండానే ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో 20 శాతం సాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఏర్పడిన అడ్డంకుల వల్ల కువైట్, ఇరాక్, యుఎఇ వంటి దేశాలు తమ చమురు ఎగుమతులను నిలిపివేయాల్సి వచ్చింది. సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో సంస్థ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతోంది. గ్యాస్ సరఫరాకు గ్రహణం చమురుతోపాటు ఎల్ఎన్జి సరఫరాపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి ఎగుమతి కేంద్రమైన ఖతార్లోని రాస్ లఫ్ఫాన్ ప్లాంట్పై డ్రోన్ దాడులు జరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఫలితంగా ఒక్క వారంలోనే గ్యాస్ దిగుమతులు 26% పడిపోయాయి. వేసవి సమీపిస్తున్న తరుణంలో ఆసియా దేశాలకు, నిల్వలు పెంచుకోవాల్సిన ఐరోపా దేశాలకు ఇది పెద్ద దెబ్బ. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు గ్యాస్ కొరతను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, సరఫరా గొలుసు తెగిపోవడంతో అవి ఎంతవరకు సఫలమవుతాయో వేచిచూడాలి. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నది. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెంపు మన దేశ దిగుమతి బిల్లుపై సుమారు 12 నుండి 15 బిలియన్ డాలర్ల భారాన్ని మోపుతుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉండదు. చమురు ధరలు పెరిగితే స్టాక్ మార్కెట్లు కుదేలవడం సహజం. ఈ యుద్ధం మొదలైనప్పటి నుండి భారత సెన్సెక్స్ సుమారు 5,100 పాయింట్లు నష్టపోవడం పెట్టుబడిదారుల్లో ఉన్న భయాందోళనలకు నిదర్శనం. కంపెనీల నిర్వహణ వ్యయం పెరగడం వల్ల వాటి లాభాలు తగ్గుతాయి, తద్వారా షేర్ల ధరలు పడిపోతాయి. అయితే, గతంలో సంభవించిన యుద్ధాలు, మహమ్మారుల నుంచి మార్కెట్లు పుంజుకున్న చరిత్ర ఉంది. అందుకే ఇన్వెస్టర్లు ఆందోళనతో పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా ఓపిక పట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. హర్మూజ్ జలసంధి తెరుచుకోవడంపైనే ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉంది. యుద్ధం త్వరగా ముగిస్తే ధరలు 65 డాలర్లకు దిగిరావచ్చు, లేదంటే 150 డాలర్లకు చేరినా ఆశ్చర్యం లేదు. అంతర్జాతీయ సమాజం సమష్టిగా స్పందించి ఈ ఉద్రిక్తతలను తగ్గించకపోతే, ప్రపంచం మరో భారీ ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉంది. చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఈ పరిస్థితి కత్తిమీద సాములా మారింది. అయితే, భారత ప్రభుత్వం దౌత్యనీతిని ప్రదర్శించి ఇరాన్ పాలకులతో జరిపిన చర్చలు కొంత ఫలితాన్నిచ్చాయి. భారత్ను మిత్రదేశంగా పరిగణిస్తూ హర్మూజ్ గుండా భారత నౌకలను అనుమతించడం కొంత ఊరటనిచ్చే అంశం. అయినప్పటికీ, భవిష్యత్తులో యుద్ధ తీవ్రత పెరిగితే ఈ వెసులుబాటు ఎంతవరకు కొనసాగుతుందన్నది సందేహమే. చమురు సంక్షోభం కేవలం పెట్రోల్, డీజిల్కే పరిమితం కాలేదు. గ్యాస్ కొరత, ఎరువుల ధరల పెరుగుదల భారత పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా దేశంలో వంటగ్యాస్ కొరత కనిపిస్తుండటం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గ్యాస్ ఏజెన్సీల ముందు కనిపిస్తున్న బారులు దేనికి సంకేతం? బ్లాక్ మార్కెట్ ముఠాలు ఈ అస్తవ్యస్త పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా చక్కబడలేదు. రష్యా, వెనెజువెలా వైపు భారత్ చూపు.. ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి భారత్ ఇప్పుడు రష్యా, వెనెజువెలాల వైపు మొగ్గు చూపుతోంది. రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా తన అభ్యంతరాలను పక్కనబెట్టడం గమనార్హం. వెనెజువెలాలో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నా, అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత, చమురు శుద్ధిలో ఉన్న సాంకేతిక ఇబ్బందులు భారత్కు సవాల్గా మారాయి. ఈ గందరగోళానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండివైఖరే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలను అంచనా వేయకుండా, ఆధిపత్య పోరులో భాగంగా దాడులకు దిగడం అమెరికా స్వయంకృతాపరాధమే. ఇరాన్లో మార్పు కోసం అమెరికా వేసిన ఎత్తుగడలు ఫలించకపోగా, యుద్ధం మరింత కాలం కొనసాగేలా కనిపిస్తోంది. అంతర్జాతీయ శక్తి సంస్థ (ఐఇఎ) అత్యవసర నిల్వల నుంచి చమురును విడుదల చేసినప్పటికీ ధరలు 100 డాలర్ల మార్కును దాటాయి. యుద్ధం ముగిసి, సరఫరా వ్యవస్థలు పునరుద్ధరించబడే వరకు ప్రపంచానికి ఇంధన గండం పొంచే ఉంటుంది. అగ్రరాజ్యాలు తమ పంతాలను వీడి శాంతి మార్గంలో పయనించకుంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బ తినడం ఖాయం. పసుపులేటి శ్రీలక్ష్మి 91003 65111
అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు
Assembly |బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
Assembly | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన Assembly | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Iran |అగ్రనేత లారీజానీ మృతిపై..
Iran | అగ్రనేత లారీజానీ మృతిపై.. Iran | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
డ్రగ్స్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సిద్దిపేటలో స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ
సిద్దిపేట: స్కూల్ పిల్లలను తీసుకొని వెళ్తున్న బస్సును సిమెంట్ లారీ ఢీకొట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇబ్రహాంనగర్లో జరిగింది. పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సిద్దిపేటలో రావూస్ స్కూల్ బస్సు పలు గ్రామాలలో విద్యార్థులను పిక్ అప్ చేసుకొని స్కూల్కు వెళ్తోంది. ఇబ్రహీంనగర్ స్టేజీ వద్దకు రాగానే బస్సును వెనుక నుంచి సిమెంట్ లారీ ఢీకొట్టింది. సిద్దిపేట వైపు ఉన్న బస్సు ఒక్కసారిగా కరీంనగర్ వైపు తిరిగింది. బస్సులో ఉన్న పిల్లలు భయంతో కేకలు వేశారు. వెంటనే గ్రామస్థులు పిల్లలను బస్సులో నుంచి బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిమెంట్ లారీ డ్రైవర్ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. లారీ, బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు.
Kavitha : మా పోరాటమే వెలుగుమట్ల బాధితులకు పట్టాలు
తమ పోరాటంతోనే రేవంత్ సర్కార్ దిగివచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు
Telangana |అనుమానాస్పద రీతిలో….
Telangana | అనుమానాస్పద రీతిలో…. Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
నేడు విజయవాడ ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్
విజయవాడలో ఈ రోజు ముస్లిం సోదరులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది
బోరబండలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టు రట్టు చేసిన పోలీసులు #HyderabadPolice #Borabanda
అందుకు.. వాకింగ్ ఎంతో దోహదపడుతుంది..
అందుకు.. వాకింగ్ ఎంతో దోహదపడుతుంది.. నిర్మల్ టౌన్ ఆంధ్రప్రభ : మానసిక ఒత్తిడి,
మెదక్ జిల్లాలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు #Medak#LightningStrike#Koudipalli#RainAlert#Telangana
ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు ఆపాలి : సిపిఐ డిమాండ్
బచ్చన్నపేట మార్చి 18 ( జనం సాక్షి): గత కొన్ని నెలలుగా అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ పై జరుపుతున్న దాడులను తక్షణమే ఆపాలని సిపిఐ మండల …
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉదేశ్యం అధికారులు నేరుగా గ్రామాలు వెళ్ళి విద్యుత్ సమస్యలను …
పాక్ లో ఆ నగరానికి వెళ్లకండి.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు హెచ్చరికలు
ఇస్లామాబాద్: మార్చి 26 నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు మ్యాక్స్వెల్, లబుషేన్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఆడుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు టీమ్ ఫైన్, గిలెస్పీ పలు జట్లకు కోచ్లుగా వ్యవహరిస్తున్నారు. అప్ఘానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త్త పరిస్థితులు నెలకొనడంతో లీగ్ నిర్వహణ ప్రమాదంలో పడింది. అప్ఘాన్లోని ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడికి పాల్పడడంతో 400 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెటర్లు పాక్లో క్రికెట్ ఆడటానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ పెషావర్ సిటీకి వెళ్లకండని తమ క్రికెటర్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచనలు చేసింది. మార్చి 28న పెషావర్లోని ఇమ్రాన్ ఖాన్ స్టేడియంలో జల్మీ-రావల్పిండిజ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. రెండు జట్లలో ఆస్ట్రేలియా క్రికెటర్లు సభ్యులుగా ఉండడంతో ఆ దేశం హెచ్చరికలు జారీ చేస్తోంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆసీస్ ఆటగాళ్లను ప్రైవేటు విమానాల్లో స్వదేశానికి తరలిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పింది. మరో వైపు సూపర్ లీగ్ 11 వ ఎడిషన్ నుంచి అప్ఘాన్ ఆటగాళ్లు తొలిగిన విషయం తెలిసిందే.
Nithiin Lines up Three Projects
Tollywood actor Nithiin is having a tough time. All his recent films ended up as massive disasters. Nithiin has to bounce back soon. He is on a break from the past one year and he has lined up three new films. The first one was announced and it will be directed by VI Anand. Srinivasaa […] The post Nithiin Lines up Three Projects appeared first on Telugu360 .
చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ అధికార ప్రతినిధిగా అందె అశోక్
చేర్యాల (జనంసాక్షి) మార్చి 17 :చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన అందే అశోక్ చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ అధికార ప్రతినిధిగా నియామకమయ్యారు. ఈ మేరకు …
గన్మెన్ కుటుంబానికి సీఐ పరామర్శ..
గన్మెన్ కుటుంబానికి సీఐ పరామర్శ.. చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల సీఐ కార్యాలయంలో
ఆ విషయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..
ఆ విషయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. కుంటాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం
ఆత్మహత్య చేసుకోవడం అంటే చనిపోవాలని కోరుకోవడం కాదు.. లోపల ఉన్న బాధను అణచివేయడం అనే మాట మనిషికి ఆక్సిజన్. భూమిపై జీవించడమనే అసాధారణమైన ధైర్యసాహసంలో దాగొనే అత్యంత విలువైన కాలాన్ని అమృతయమం చేసుకొనే తరం. నేటి రోజుల్లో మానసిక బలహీనతతో ఊగిసలాడుతున్న ఓ బలహీన క్షణం లో ఆత్మహత్యల వైపు ప్రయాణం చేయడం ఓ విషాద పరిణామం. కఠిక పేదరికం నుండి కోటీశ్వరుడు వరకు, నిరక్షరాస్యుడి నుండి విజ్ఞానవేత్త వరకు, సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు ఈ మానసిక ఒత్తిడిలో తలొగ్గి బలవన్మరణాలకు పాల్పడటం వెనుక జరుగుతున్న మానసిక తంతు నేటి సమాజం తనకు తానుగా చేసుకుంటున్న ఆత్మహత్యా సదృశం. ఇటీవల హైదరాబాద్కు చెందిన విజయారెడ్డి అనే ఐటి ఉద్యోగిని తన ఇద్దరు పిల్లలతో ఒంటరితనమనే డిఫ్రెషన్తో రైలుకు ఎదురెళ్లి మృత్యువును కౌగిలించుకొంది. ఎంతటి విషాదం. మాతృమూర్తే తనతోపాటు తన పిల్లలకు రాసిన మరణ శాసనం ఎందరి హృదయాలను కలచివేసింది. విజయారెడ్డి ఉన్నతంగా చదువుకొంది. తన కాళ్ల మీద తాను నిలబడి ఒకవైపు టీమ్ మేనేజర్గా పనిచేస్తూ, మరోవైపు గృహిణిగా, మాతృమూర్తిగా గడుపుతున్న జీవితానికి తనకు తానుగా రాసిన మరణ శాసనానికి ఏ చదువు అక్కరకు వచ్చింది..? భర్త దూరంగా ఉండటం, ఒంటరితనమనే భయం, తాను లేకపోతే పిల్లల భవిష్యత్లో బతకలేరనే ఆందోళనా..? మరే ఇతర కారణాలో తెలియదుగానీ.. పదిమందికి ఆదర్శప్రాయంగా నిలబడాల్సిన విజయారెడ్డి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. తన ఇద్దరి పిల్లల జీవితాలను ముగించేసింది. అతిచిన్న వయస్సులో వ్యాపార రంగంలో కోట్లకు పడగలెత్తి 36 సంవత్సరాల వయస్సుకే సొంత విమానం, 12 రోల్స్ రాయిస్ కార్లతో సహ వందల ఎకరాలకు యజమానియైన బెంగళూరుకు చెందిన సిజె రాయ్ ఒత్తిడి తట్టుకోలేక చివరికి గన్తో కాల్చుకొని సగం జీవితం కూడా నిండకముందే ఆత్మహత్యకు పాల్పడటం ఇటీవల కాలంలో సంచలనం కలిగించింది. వ్యాపారంలో ఆటుపోటులకు తట్టుకొని ఎదిగిన క్రమంగానీ, ధనంగానీ, విలాసవంతమైన జీవితం గానీ అతని ఆత్మహత్యను ఆపలేకపోవడానికి కారణాలేంటి..? మానసిక బలహీనతనే నిరాశ ముందు మనిషి ఓడిపోవడం విషాదకర పరిణామం. ఆత్మహత్య ఆలోచనలకు మానసిక సమస్యలతోపాటు అనారోగ్యం, ప్రేమ, కుటుంబ, వైవాహిక, ఆర్థిక, మత్తు పదార్థాల వినియోగం, ఒంటరితనం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మన దేశంలో ప్రధానంగా యువతతో పాటు 45 సంవత్సరాలు లోపు ఉన్నవారు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. విద్యార్థులల్లో పరీక్షల ఆందోళన, ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు, రైతులకు వ్యవసాయంలో తగులుతున్న ఎదురు దెబ్బలు, మహిళల్లో గృహహింస ఎక్కువ శాతం బలవన్మరణాలకు కారణమవుతున్నది. 2019 సంవత్సరంలో గత 25 సంవత్సరాల కాలంలో జరగనన్ని ఆత్మహత్యలు విద్యార్థులు విషయంలో జరిగాయి. అత్యధికంగా 10,335 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లమంది మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా వేసింది. యువత మరణాలకు అత్యధికంగా ఆత్మహత్యలే కారణమని, చనిపోవడానికి ముందు ప్రతి ఒక్కరూ కనీసం 20 సార్లు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని నివేదిక చెబుతుంది. ప్రతి 150 మందిలో ఒకరు వరుసగా స్కిజోఫ్రినియా, బైపోలార్ డిజార్డర్లతో బాధపడుతున్నారు. మానసిక బాధితులకు మెరుగైన చికిత్స, కౌన్సిలింగ్ చేసేందుకు ప్రభుత్వాలు మరింతగా గట్టి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, మహిళలకు సహాయం చేయడానికి మానసిక స్థితిలో మెరుగైన మార్పులు చేయడానికి హెల్ఫ్ లైన్లు, మనస్తత్వ శాస్త్ర వైద్యులు సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద చేపడుతున్న కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలి. అన్ని దేశాలు తమ ఆరోగ్య బడ్జెట్లో మానసిక ఆరోగ్యం కోసం మరిన్ని నిధులను కేటాయించాలి. సగటున లక్షమంది మానసిక అనారోగ్య బాధితులకు 13 మంది మాత్రమే వాలంటీర్లు ఉన్నారు. ఈ పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఉందని డబ్ల్యుహెచ్ఒ సూచిస్తుంది. మానసిక సమస్యలతో ఉన్నవారికి ప్రభుత్వాలు ఇచ్చే చేదోడు కంటే వారివారి కుటుంబాలు, చుట్టుపక్కల ఉన్నసమాజం ఇచ్చే మనోధైర్యం, పెంపొందించే ఆత్మస్థైర్యమే అన్నిటికంటే మనిషి శ్వాసను నిలబెట్టే ఆక్సిజన్. ఆత్మహత్య చేసుకోవాలనే చివరి అంచువరకు వెళ్లిన వారు ఒక్కసారి కుటుంబం, స్నేహితులు, తమను నిలబెట్టగలిగే వైద్యుల చేదోడు కోసం ఒక్క క్షణం ఆలోచన చేస్తే జీవితం ఎంతటి అద్భుతమైన కాలాన్ని పరిచయం చేస్తుందో జోనాథన్ అనే ఒక యువకుడి మాటల్లో.. నేను ఆఫీసుకు తిరిగి కారులో వెళుతుండగా.. నిటారుగా ఉన్న కొండపైకి కారులో వెళ్తుండగా, నేను బ్రేక్ నుండి నా కాలుతీసివేస్తే ఎదురుగా వస్తున్న ట్రాఫిక్లోకి దూసుకెళ్లి ఆత్మహత్య చేసుకోగలను అని అనుకున్నా.. పరిస్థితి విషమంగా ఉందని అర్థమైంది. ఒక్క క్షణం ఆలోచించా.. ఆఫీస్కు తిరిగి వెళ్లడానికి బదులుగా నేను ఎడమవైపు తిరిగి ఆసుపత్రికి వెళ్లాను. అంతే నా జీవితంలో కోలుకునే ప్రయాణంలో కీలమైన దశలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. అడపా దుర్గ 90007 25566
'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీరిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్పై కేసు #UstaadBhagatSingh#PreReleaseEvent
పేలిన ఎలక్ట్రిక్ కారు... ఏడుగురు సజీవదహనం
భోపాల్: ఎలక్ట్రిక్ కారుకు ఛార్జీంగ్ పెట్టి ఓ వ్యక్తి నిద్రపోయాడు. వాహనం పేలిపోవడంతో అగ్ని ప్రమాదం సంభవించి ఏడుగురు మృతి చెందారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బ్రిజేశ్వరి అనెక్స్ అనే బహుళ అంతస్థు భవనానికి మనోజ్ పుగాలియా అనే వ్యక్తి యజమానిగా ఉన్నాడు. అతడు ఆ భవనంలో పాలిమర్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి వరండాలో ఎలక్ట్రిక్ కారుకు ఛార్జీంగ్ పెట్టి నిద్రపోయాడు. ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించడంలో మంటలు చేలరేగాయి. పాలిమర్స్ కు మంటలు అంటుకోవడంతో భవనం అంతటా మంటలు వ్యాపించాయి. ఇంట్లో నిల్వ ఉంచిన పదికి పైగా గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. ఒకదాని తరువాత ఒకటి పేలడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ మంటల్లో ఏడుగురు సజీవదహనమయ్యారు. ముగ్గురిని స్థానికులు కాపాడారు. పోలీసులు, ఎన్డిఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి.
Employment Guarantee Scheme : ఉపాధిహామీ కూలీలూ ఈ నిబంధనలు పాటించాల్సిందే.. లేకుటే డబ్బులు రావంతే
ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది
BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి ప్రదర్శనగా వచ్చారు
ഇസ്രായേലിൻ്റെ ഗ്രേറ്റർ ഇസ്രായേൽ പദ്ധതിയെ പിന്തുണയ്ക്കുമെന്ന് നരേന്ദ്ര മോദി പറയുന്നതായാണ് വീഡിയോയിലുള്ളത്
ഫാക്ട് ചെക്ക്: ഇന്ത്യൻ സൈന്യം വംശീയ ശക്തയായെന്ന് മുൻ കരസേന മേധാവി പറഞ്ഞോ?
ഇസ്രായേലിനെ പിന്തുണയ്ക്കുന്നതിലൂടെ ധാർമിക സേനയായ ഇന്ത്യൻ സൈന്യം വംശീയമാകുകയാണെന്ന് ജനറൽ മനോജ് പാണ്ഡെ പറഞ്ഞെന്നാണ് പ്രചാരണം
చెరువులో అస్థిపంజరం లభ్యం.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని బూర్నపల్లి శివారులో ఓ
Weather Report : రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు...మండుటెండల్లో ఉపశమనం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చల్లని వాతావరణం ఏర్పడింది
మహిళ రైతు కంట కన్నీరు.. చిట్యాల, ఆంధ్రప్రభ : అరక పట్టి ఆరుగాలం
Vijay and Trisha to get Married?
Tamil actor Vijay is completely occupied with politics and his last film Jana Nayagan is stuck with censor hurdles. The actor made it clear that he is in a close relationship with Trisha after they made their public appearance recently. Tamil Nadu circles strongly speculate that Vijay and Trisha will soon get married and they […] The post Vijay and Trisha to get Married? appeared first on Telugu360 .
18thMarchCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
18thMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
SRH కెప్టెన్ గా ఇషానే ఎందుకు?#IshanKishan#SRH#IPL#SRHCaptain#AbhishekSharma#CricketNews
కాకినాడ జిల్లాలో పులి చాలా తెలివైనదట
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే పెద్దపులి కదలికలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి
ఘనంగా ఈదమ్మ తల్లి దేవత కళ్యాణం..
ఘనంగా ఈదమ్మ తల్లి దేవత కళ్యాణం.. చిట్యాల, ఆంధ్రప్రభ : ఉరుమడ్ల పల్లపు
సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ద్వారా సంజయ్ విశ్వనాథ్ అనే పాత్ర యొక్క ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భావోద్వేగాలతో నిండిన, ఆసక్తికరమైన సినీ అనుభూతిని అందించనుందని టీజర్ హామీ ఇస్తోంది. టీజర్లో సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను చూపించారు. 40 ఏళ్ల వయసులో కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగుతున్న వ్యక్తిగా అతడిని పరిచయం చేశారు. సూర్య ఈ సినిమాలో తండ్రి ప్రేమ, భావోద్వేగ లోతు రెండూ కలిసిన ఒక గాఢమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన తెరపై కనిపించిన తీరు, వెంకీ అట్లూరి రాసిన ప్రభావవంతమైన సంభాషణలు.. సూర్య సినీ ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయిన అద్భుతమైన ప్రదర్శనలను గుర్తు చేస్తున్నాయి. కథకు కొత్తదనాన్ని జోడించే పాత్రలో మమితా బైజు కనిపిస్తున్నారు. ఆమె పాత్ర సినిమాలో ఉత్సాహం, చురుకుదనం తీసుకొస్తుందని టీజర్ సూచిస్తోంది. వయస్సు అంతరం ఉన్న అసాధారణ ప్రేమకథను కూడా ఈ సినిమా చూపించబోతున్నట్టు టీజర్లో చూచాయగా తెలిపారు. సున్నితమైన భావోద్వేగాలతో అందమైన కథ చెప్పడం వెంకీ అట్లూరి శైలి. తనదైన ప్రత్యేక శైలి రచనతో.. ఈ అంశాన్ని కూడా లోతుగా, భావోద్వేగ పరిపక్వతతో మధురానుభూతిని కలిగించేలా చూపిస్తారు అనడంలో సందేహం లేదు. బలమైన భావోద్వేగాలతో కూడిన భారీస్థాయి కుటుంబ కథా చిత్రంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెరకెక్కుతోంది. ‘లక్కీ భాస్కర్’, ‘వాతి/సార్’ చిత్రాల విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు వెంకీ అట్లూరి, మరో చిరస్మరణీయ చిత్రాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ సినిమా విజయవంతంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
Gold Price Today : షాకింగ్ న్యూస్...చెప్పలా.. చెప్పలా.. మళ్లీ బంగారం ధరలు పెరిగాయిగా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
నవోదయ ఫలితాలు విడుదల.. కుంటాల, ఆంధ్రప్రభ : నవోదయ ఫలితాలు విడుదల కావడంతో
Andhra Pradesh : దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
మోత్కూర్ గ్రంథాలయ చైర్మన్ గా కోమటి మత్స్య గిరి..
మోత్కూర్ గ్రంథాలయ చైర్మన్ గా కోమటి మత్స్య గిరి.. మోత్కూర్, ఆంధ్రప్రభ :
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మీద ఇరాన్ మిస్సైల్ దాడులంటూ ప్రచారం చేస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయం పై రైతులు దృష్టి పెట్టాలి.
ప్రకృతి వ్యవసాయం పై రైతులు దృష్టి పెట్టాలి. కుంటాల, ఆంధ్రప్రభ : తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో వడగండ్ల వానలు #FarmersLoss #RainImpact #TeluguStates #Agriculture
Andhra Pradesh : నేడు ఏపీలో దివ్యాంగ శక్తి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు మరో ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించనుంది
ప్రమాదాలకు కారణం అదే.. చిలుపూర్, ఆంధ్రప్రభ : వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణించడం
Cyber Crime : ఒంటరిగా ఉన్న వాళ్లే టార్గెట్.. సైబర్ నేరగాళ్లు కొత్త దారులు
సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు
Dhurandhar: The Revenge: Tension for Premiere Shows
Dhurandhar: The Revenge has created new records with the advance sales of the paid premieres that are scheduled today. The film is all set to open on a super strong note but there are last minute hurdles. The second half content is yet to be delivered by the team to the digital service providers. The […] The post Dhurandhar: The Revenge: Tension for Premiere Shows appeared first on Telugu360 .
వరంగల్ లో తండ్రి, కూతురు సజీవదహనం
హనుమకొండ: అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలిపోయి తండ్రి, కూతురు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కడిపికొండ రాజీవ్ గృహకల్పలో తండ్రి రాజశేఖర్(54) కూతురు రాజశ్రీ, అల్లుడు నివాసం ఉంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున తండ్రి రాజశేఖర్ మంటల్లో కాలిపోతున్నాడు. కూతరు మంటలార్పాడినికి వెళ్లి ఆమె కూడా కాలిపోయింది. వెంటనే అల్లుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి కేకలు వేశాడు. ఇద్దరు తీవ్ర గాయాలతో చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతిపై అనుమానాలు ఉన్నట్టు సమాచారం.
తనపై ఉన్న ప్రేమను జగన్ నిరాకరించడం లేదు : విజయమ్మ
షర్మిలకు తాను బినామీని కాదని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు
అలా చేస్తే.. కఠిన చర్యలు తప్పవు..
అలా చేస్తే.. కఠిన చర్యలు తప్పవు.. రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ పోలీస్
Chandrababu : పుట్టా మహేష్ వ్యవహారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంఛార్జి మంత్రితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
Andhra Pradesh : నేడు చంద్రబాబుతో పవన్ భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబును ఈరోజు మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలవనున్నారు
ఆదేశాలు ఇవ్వడమే కాకుండా.. -డ్రైనేజ్ కాల్వలను శుభ్రం చేయించిన ఒకటో వార్డు కౌన్సిలర్-ఆలస్యం
ముంబై: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాపై సౌతాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం ఎబి డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్లోనే బుమ్రా మెరుగైన బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో అతన్ని మించిన బౌలర్ ఎవరూ లేరన్నాడు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా ఒక్క బుమ్రాకి మాత్రమే ఉందన్నాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మెరుగైన ప్రదర్శన చేయడం బుమ్రా ప్రత్యేకత అన్నాడు. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్కప్లో భారత్ను విజేతగా నిలుపడంలో అతని పాత్ర చాలా కీలకమని పేర్కొన్నాడు. రానున్న ఐపిఎల్లో బుమ్రా చెలరేగి పోవడం ఖాయమని డివిలియర్స్ జోస్యం చెప్పాడు.
EU Trade Deal : ప్రపంచంలో అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాలకు మార్గం సుగమం
పరాగ్వే మంగళవారం మెర్కోసూర్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన కీలక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలిపింది
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్ అభిమానులను కనువిందు చేసిన సంగతి తెలిసిందే. ఈ మెగా సంగ్రామం ముగిసిన కొన్ని రోజులకే మరో క్రికెట్ పండగ అలరించేందుకు సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026కి మార్చి 28న తెరలేవనుంది. తొలి విడత షెడ్యూల్ ఇప్పటికే విడుదల అయ్యింది. మరి కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయి షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి కూడా పది జట్లు అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ విజేతలు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ టీమ్లు ఈ సీజన్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాయి. అన్ని జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. స్వదేశీ, విదేశీ క్రికెటర్లతో ఆయా టీమ్లు చాలా బలంగా మారాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లు అన్ని జట్లలోనూ ఉన్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, డేవిడ్ మిల్లర్, విల్ జాక్స్, క్వింటన్ డికాక్, ఫిలిప్ సాల్ట్, డెవోన్ కాన్వే, స్టోయినిస్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఐపిఎల్ చెలరేగేందుకు సిద్ధమయ్యారు. ఈ సీజన్లో అందరి కళ్లు అభిషేక్ శర్మ, శాంసన్, ఇషాన్ కిషన్లపైనే నిలిచాయి. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్కప్లో ఇషాన్ కిషన్, శాంసన్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన సంగతి తెలిసిందే. ఐపిఎల్లోనూ వీరు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లతో సన్రైజర్స్ బ్యాటింగ్ చాలా బలంగా మారింది. గతంలో హెడ్, అభిషేక్లు అసాధారణ బ్యాటింగ్తో సన్రైజర్స్కు చారిత్రక విజయాలు సాధించి పెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక సూర్యకుమార్, శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శుభ్మన్ గిల్, గ్లెన్ ఫిలిప్స్, జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, మాథ్యూ షార్ట్ తదితరులు ఆయా జట్ల తరఫున ఐపిఎల్ బరిలో దిగనున్నారు. ఇక ప్రపంచ స్థాయి బౌలర్లు, ఆల్రౌండర్లు కూడా తమ సత్తాను చాటేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ రోజుల పాటు సాగే ఐపిఎల్ అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయమని చెప్పాలి.
Iran - Israel War : ఇరాన్కు భారీ దెబ్బ: కీలక భద్రతాధికారుల మృతి
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం రెండో వారంలోకి చేరుకుంది.
కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య
హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ విద్యార్థిని విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. క్యాంపస్లో చోరీ చేసినట్టు తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన పెద్దమళ్ల శ్రీవిద్య (22) ఎమ్మెస్సీ చదువుతుంది. శ్రీవిద్యపై ల్యాప్ టాప్, బంగారం చోరీ చేసిందంటూ క్యాంపస్లోని కొందరు విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ నిందను భరించలేక ఈ నెల 8వ తేదీన స్వగ్రామం వెళ్లి ఇంట్లో ఎలుకలకు పెట్టే పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. చికిత్స పొందుతూ శ్రీవిద్య మృతి చెందింది. తమ కూతురు చోరీ చేయలేదని, సీనియర్లే కావాలని ఆరోపణలు చేసి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయడంతోనే శ్రీవిద్య ప్రాణాలు తీసుకుందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
జామియా మస్జీదులో ఇఫ్తార్ విందు..
జామియా మస్జీదులో ఇఫ్తార్ విందు.. అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ ఏడో వార్డులోని
ఆ.. నలుగురు నిందితులు అరెస్టు..
ఆ.. నలుగురు నిందితులు అరెస్టు.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని పంతంగి
అప్పుడు దానకర్ణ..ఇప్పుడు కుంభకర్ణ
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ‘దానకర్ణుడి’లా సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయకుండా ‘కుంభకర్ణుడి’లా నిద్రపోతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎ మ్మెల్యే కెటిఆర్ విమర్శించారు. పాలకులు ప్రజలకు ఇచ్చిన మాటను నెలబెట్టుకోవాలని కెటిఆర్ తెలిపారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం, అసెంబ్లీలో గవర్న ర్ ప్రసంగానికి విలువ ఉండాలని కెటిఆర్ అన్నారు. కానీ, గవర్నర్ ప్రసంగానికి విలువ లేకుండా చేస్తున్నారని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కెటిఆర్ సభలో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకు చెప్పాలని కెటిఆర్ ప్రశ్నించారు. రైతులు, వితంతువులు, వృద్ధులు, నిరుద్యోగులు ఎవరు ధన్యవాదాలు చెప్పాలని కెటిఆర్ నిలదీశారు. గ్యారంటీ కార్డులను భద్రపరచుకోవాలని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మోసం చేయలేదా అని కెటిఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు దాటుతున్నా హామీలు నెరవేరలేదని ఆయన ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారని,కానీ, నేడు ఆ సంతకానికి, ఆయన చేసిన డిక్లరేషన్లకు జనం దృష్టిలో ‘జీరో వాల్యూ’ ఉందన్నారు. సిఎం సంతకం చేసిన ఫైల్కు దిక్కులేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్ముతారని కెటిఆర్ ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు సంబంధించి తొలి సంతకం చేసిన ఫైల్ ఎక్కడికి పోయిందని కెటిఆర్ ప్రశ్నించారు. మాయమైన ఫైల్ కోసం సిట్ ఏర్పాటు చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చింది ‘అభయహస్తం’ అని చెప్పుకుంటున్నా, అమల్లో అది ‘భస్మాసుర హస్తం’గా మారిందని కెటిఆర్ విమర్శించారు. రెండేళ్లు గడుస్తున్నా ప్రతి కుటుంబానికి రావాల్సిన రూ. 2.50 లక్షల లబ్ధి అందిన ఒక్క కుటుంబమైనా రాష్ట్రంలో ఉందా అని కెటిఆర్ ప్రశ్నించారు. ఇటీవల ఇండియా టీ20 వరల్డ్కప్ గెలిచిందని, ఒకవేళ ‘420 వరల్డ్ కప్’ పెడితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా గెలుస్తుందంటూ కెటిఆర్ విమర్శించారు. 420 హామీల మేనిఫెస్టో రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ప్రజల గొంతుకగా అసెంబ్లీలో నిజాలను ప్రస్తావిస్తా గల్లీల్లో చెత్త కుప్పలు పేరుకుపోతుంటే, పాలకులు మాత్రం ఢిల్లీకి విమానయాత్రలు చేస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు ‘నిల్’ లూటిఫికేషన్లు ‘ఫుల్’ అని కెటిఆర్ ఆరోపించారు. పెన్షనర్లకు టిఏ, డిఏలు రాక నరకయాతన పడుతున్నారని, గ్యారంటీ కార్డులు కాస్త ఇప్పుడు ‘బాకీ కార్డులుగా’ మారి వెక్కిరిస్తున్నాయని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని కెటిఆర్ ఖండించారు. జార్జ్ ఆర్వెల్ మాటలను గుర్తు చేస్తూ మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవమని, తాము కూడా ప్రజల గొంతుకగా అసెంబ్లీలో నిజాలను ప్రస్తావిస్తున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు. ప్రజల సొమ్ము పక్క రాష్ట్రాల్లో ఉగాదులు, ఉషస్సులు వస్తున్నాయ్. పోతున్నాయ్ అని, ప్రజల జీవితాల్లో వెలుగులేవని ఎమ్మెల్యే కెటిఆర్ అన్నారు. ప్రభుత్వం డిజాస్టర్ పాలన సాగిస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనను మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు’ అన్న చందంగా ఉందని కెటిఆర్ విమర్శించారు. ఎగనామాలు, పంగనామాలు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని కెటిఆర్ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల కోసం కోటి 25 లక్షల మంది చేసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం చారాణా పని చేసి బారాణా చేసినట్లుగా చెప్పుకుంటుందని కెటిఆర్ అన్నారు. నేనే రాజు నేనే మంత్రి అని మిడిసి పడితే మూటకట్టుకుని పోతారని కెటిఆర్ వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే కర్ణుడిని అని చెప్పుకుంటున్నారని, ఆయన ఎన్నికల ముందు దానకర్ణ, ఇప్పుడు కుంభకర్ణ అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. డిక్లరేషన్ల కోసం ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చారని, కానీ, వాటిని అమలు మాత్రం చేయడం లేదన్నారు. ఇక తెలంగాణ ప్రజల సొమ్మును పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రచారం కోసం వాడుకుంటున్నారని కెటిఆర్ మండిపడ్డారు.
18thMarch2026 |బుధవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
18thMarch2026 | బుధవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 18thMarch2026 |
మొయినాబాద్ డ్రగ్స్ కేసు..విచారణకు సిట్
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్: రంగారెడ్డి జి ల్లా మొయినాబాద్లోని బీఆర్ఎస్ నేత పైలట్ రో హిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. దీనికి చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ నే తృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కేసును విచారణ చేయడానికి 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ సుధీర్బాబు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేయనున్నట్లు తెలిపింది. 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ వ్యవహారంపై సిట్ విచారణ చేయనుంది. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నమిత్ శర్మ రియల్ వ్యాపారాలు తదితర అంశాలపై సిట్ విచారణ జరపనుంది. మరోవైపు రోహిత్రెడ్డి ఫాంహౌస్పై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిందితులను కస్టడీకి ఇవ్వండి : పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేశ్రెడ్డి గన్ లైసెన్స్ రద్దు చేయాలని సిట్ సిఫారసు చేసింది. ఫామ్హౌస్లో సోదాలకు వెళ్లిన పోలీసులపై రియల్టర్ నమిత్ శర్మ, రితేశ్ రెడ్డి లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్పులు జరిపాడు. తుపాకీ లైసెన్స్ దుర్వినియోగం చేశారని సిట్ అధికారులు సీపీకి లేఖ రాశారు. మరోవైపు ముగ్గురు నిందితులను 7 రోజులు కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లోని ఫాంహౌస్లో ఈ నెల 14న రాత్రి జరిగిన విందుపై తెలంగాణ ఈగల్, మొయినాబాద్ పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ డ్రగ్స్, మద్యం పార్టీకి ప్రధాన సూత్రధారిగా తేలింది. కొన్నిరోజులుగా రోహిత్రెడ్డి తన ఫాంహౌస్లో వారాంతపు పార్టీ చేద్దామనే గట్టి ఆలోచనలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన స్నేహితుడు, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి బిజినెస్ మీటింగ్లో భాగంగా శిమ్లా వెళ్లినప్పుడు ఓ వ్యక్తి దగ్గర రూ.15 వేలకు కొకైన్ను కొనుగోలు చేశాడు. పార్టీలో మొత్తం 11 మంది : ఈ విషయం పైలట్ రోహిత్ రెడ్డితో చెప్పగా ఈ నెల 14న సాయంత్రం తన ఫాంహౌస్లో పార్టీ చేద్దామనే ఆలోచనకు వచ్చి నిర్ణయించుకున్నాడు. దీనికి తన స్నేహితుడు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్తో సహా ఇతరుల్ని ఆహ్వానించాడు. కౌశిక్ రవి డ్రగ్స్తో నేరుగా ఫాంహౌస్లో జరిగే పార్టీకి వచ్చాడు. మొత్తం 11 మంది పాల్గొన్న పార్టీలో మహేశ్ కుమార్, రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నమిత్ శర్మ తదితరులంతా మద్యంలో కొకైన్(డ్రగ్స్) కలిపి సేవించారు. గన్తో శర్మ కాల్పులు : ఈ ఫాంహౌస్లో మద్యం, డ్రగ్స్ పార్టీ కేసులో ఒక్కోక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫాంహౌస్లోకి పోలీసులు రావడాన్ని చూసిన నమిత్శర్మ తప్పించుకొని పారిపోవాలనే ఉద్దేశంతోనే గన్తో కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు ఫాంహౌస్లోకి ప్రవేశించే సమయంలోనే తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో తాము ఫ్యూచర్సిటీ పోలీసులమని, పక్కా సమాచారంతో సోదాలకు వచ్చామంటూ వారు గట్టిగా చెప్పారు. దీన్ని లెక్క చేయకుండా నమిత్ పోలీసు అధికారిని టార్గెట్గా చేసుకుని ఒక రౌండు కాల్పులు జరిపాడు. పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి ఇద్దరూ వాళ్లను కాల్చెయ్, తర్వాత మొత్తం మేం చూసుకుంటాం అంటూ నమిత్ శర్మను రెచ్చ గొట్టినట్లు సమాచారాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు అప్రమత్తతతో అందర్నీ చుట్టుముట్టడంతో తుపాకీ కాల్పులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే పైలట్ రోహిత్రెడ్డి, నమిత్ శర్మ, రితేశ్ రెడ్డిపై కొత్తగా అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్లను జోడించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు చంచల్గూడ జైలు రిమాండ్లో ఉన్నారు. ఈ డ్రగ్స్ కేసులో వీటిని ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు? ఈ పార్టీలో పాల్గొనేందుకు వచ్చిన వ్యాపారులు ఎవరు? వారికి మీకు ఉన్నా లింకులు, దుబాయ్ లింకులు తదితర అంశాలపై పలు కోణాల్లో విషయాలను రాబట్టేందుకు ఈ సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి సిట్ నివేదికను అందించనుంది. మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్పై ఆదివారం పోలీసులు అకస్మికంగా దాడి చేశారు. ఈ సమయంలో న్యూఢిల్లీకి చెందిన నమిత్ శర్మ.. కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వారిని చుట్టిముట్టారు. ఈ సందర్భంగా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. వారిలో పలువురికి పాజిటివ్ వచ్చింది. వారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సైతం ఉన్నారు. ఆయనకు కూడా డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. అలాగే పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి వారి వారి పార్టీల నుంచి నోటీసులు అందాయి. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ వారికి ఆయా పార్టీలు స్పష్టం చేశాయి. అప్పటి వరకు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నాయి. పలు అంశాలపై ఆరా : రోహిత్ రెడ్డి పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు? డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేశారు? డ్రగ్స్తో పాటు అసలు ఫాంహౌస్లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి? గతంలో ఎవరైనా ప్రముఖులు ఇక్కడికి వచ్చారా? వస్తే వారికి ఎలాంటి పార్టీ ఇచ్చారు? ఇదే తరహాలో ఎన్ని పార్టీలు జరిగాయి? అన్న కోణంలో సిట్ విచారణ చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ దందాతో పాటు దుబాయ్కు ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీయనుంది. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో నిందితులకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా? అన్న లింకులపైనా సిట్ బృందం ఫోకస్ చేయనుంది. సిట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఈ కేసులో మరికొంతమంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? అన్న ఉత్కంఠ నెలకొంది.
మన తెలంగాణ/హైదరాబాద్: హ్యామ్(హెచ్ఎ ఎం) రోడ్ల పేరిట రాష్ట్రంలో సుమారు రూ.18వేల కోట్ల స్కాంకు తెరలేపారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు సంచలన ఆరోపణలు చేశారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (ఆర్అండ్బి)లో రూ.12వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో రూ.6వేల కోట్లు కలిపి భారీ స్థాయి లో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి వద్దు అని గొడవ పెట్టారని, ఇప్పుడు అదే ప్రభుత్వం 10శాతం మొబిలైజేషన్ ఇస్తోందని పేర్కొన్నారు. ఇందులో కమిషన్లు తీసుకుని ఎన్నికల ఖర్చు కోసం పంపబోతున్నారని, ఈ వ్యవహారం పెద్ద స్థాయి స్కాంగా మారే ప్రమాదం ఉందని ఆరోపించారు. అసెంబ్లీలో మంగళవారం మాజీ మంత్రులు హరీష్రావు, వేముల ప్రశాంత్రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశం మొత్తం జాతీయ రహదారులు సాధారణంగా 20 నుంచి 30 శాతం వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయని..కానీ, ఇప్పుడు 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయని..తేడా 50 శాతం వస్తోందని తెలిపారు. ఈ టెండర్లకు సిఒటి అనుమతి కూడా అవసరం లేకుండా, శాఖాపరమైన కమిటీ ఆమోదించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల మధ్య కుమ్మక్కుతో 20 నుంచి 30 శాతం వరకు అధిక ధరలకు టెండర్లు వేయించారని ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రజల డబ్బును కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్ల విధానాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. నాడు జలయజ్ఞంలో 3 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉంటే... ఇప్పుడు పది శాతం పెట్టారని అన్నారు. మొత్తం 34లో ఇప్పటి వరకు తెరిచిన 24 టెండర్ల సాంకేతిక బిడ్లు చూస్తే దాదాపు 16 టెండర్లలో ఇద్దరు మాత్రమే వేశారని, ముందే రింగ్ అయ్యారని ఆరోపించారు. కుమ్మక్కై ముందే మాట్లాడుకొని అధికంగా టెండర్ వేసేలా చేశారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖలోని 12 పనులను కూడా ఇప్పటికే మాట్లాడి పంపకాలు చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు టెండర్ ధరలో ఐదు శాతం మాత్రమే ఎక్కువకు వెళ్లేలా సీలింగ్ ఉండేదని, ఇప్పుడు హ్యాం రోడ్లకు ఎత్తివేయడంతో ఎంత ఎక్కువకు అయినా వేసుకోవచ్చని చెప్పారు. హ్యాం రోడ్ల టెండర్లలో పెద్ద కుంభకోణం జరిగిందని, నల్గొండలో రెండు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయని అన్నారు. నల్గొండ జిల్లా టెండర్లు మూడు బృందా కంపెనీకి,ఒకటి వేరే కంపెనీకి ఇచ్చారని, రాష్ట్రం మొత్తం 34 టెండర్లలో 24 టెండర్లలో 16 టెండర్లు ఇద్దరు మాత్రమే వేశారని తెలిపారు. టెండర్లలో కుమ్మక్కు అయ్యారని, సివేట్, సరళ, బృందా, బి.వి.ఎస్.ఆర్ కంపెనీలు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. పంచాయతీ రాజ్ శాఖలో 7 వర్క్లు సివేట్కు 3 వర్కులు జె ఇన్ఫ్రా కంపెనీకి, చెరో ఒక టెండర్ సివేట్,బృందాకు ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో టెండర్ యక్సెస్కు 5 శాతం సీలింగ్ ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత యాక్సెస్ ఎత్తివేశారని తెలిపారు. టెండర్లలో అవినీతి జరిగిందని, ఆ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు, రిజర్వ్ బ్యాంకుకు, అన్ని విచారణ సంస్ధలకు ఫిర్యాదు చేస్తామని వెల్లడింంచారు. టెండర్లలో పాలు పంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లపై తమ ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేసి, పారదర్శంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సిఒటి అనుమతి, ఐదు శాతం సీలింగ్ తప్పనిసరి చేయాలని, మొబిలైజేషన్ అడ్వాన్స్లు రద్దు చేయాలని అన్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి పద్దులు చర్చకు వచ్చినపుడు బిఆర్ఎస్ తరపున మరిన్ని ఆధారాలు బయటపెడతామని, హైకోర్టు విచారణకు పట్టుబడతామని వెల్లడించారు. సింగరేణి శ్రీరాంపూర్ టెండర్ వ్యవహారాన్ని తాము బయటపెట్టిన తర్వాత తక్కువకు పోయిందని పేర్కొన్నారు.
కళ్లల్లో కారం కొట్టి..రూ.కోటి కొట్టేశారు
మన తెలంగాణ/కూకట్పల్లి: కూకట్పల్లిలో సోమవారం ఆర్ధరాత్రి హవాలా డబ్బు కలకలం సృష్టించింది. రూ.కోటి నగదుతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తులను నిందితులు సినీ ఫక్కీలో వెంటాడి కూకట్పల్లి పిల్లర్ నెం.837 వద్దకు చేరుకోగానే కళ్లలో కారం కొట్టి కోటి రూపాయల నగదుతో పారిపోయారు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది సంఘటను గుర్తించేలోగా నిందితులు పారిపోయారు. బాధితుడు మహమ్మద్ అజీముద్దీన్ను కూకట్పల్లి సిఐ వద్దకు తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు బాలానగర్ సిసిఎస్ తో సమన్వయంగా రంగంలోకి దిగారు. అయితే ఈ కేసులో మొత్తం 9 మంది ఉండగా 24 గంటలు కూడా గడవక ముందే అందులోని ప్రధాన నిందితులైన నలుగురుని అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదును, విమానం టికెట్లను, సెల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురిని పట్టుకోగాకోగా మరొకరి కోసం గాలిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిసిపి రితిరాజ్ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్లోని బహదూర్పురాలోగల సిద్రా ఎంటర్ప్రైజెస్ యజమాని వివిధ వ్యక్తుల నుంచి నగదు వసూలు చేయడానికి ఖుసృద్ధీన్ అతని సహ ఉద్యోగి అయిన మహమ్మద్ అజీముద్దీన్ (ఫిర్యాదుదారుడు) ను నియమించాడు. టోకెన్ చూపించి రహస్యంగా వసూలు చేసిన సొమ్ముపై కన్నేసిన ఖుసృ ద్దీన్ పలువురితో కమ్మక్కై పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేసిన డబ్బుతో పరారీకి ప్రయత్నించాడు.
ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడి..400 మంది మృతి
ఇస్లామాబాద్ : అఫ్గానిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని సోమవారం రాత్రి పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. అయితే కాబూల్లోని డ్రగ్స్ రిహాబిటేషన్కు సంబంధించిన ఆస్పత్రిపై పాకిస్థాన్ సోమవారం రాత్రి వైమానిక దాడులు సాగించడంతో ఆస్పత్రి భవనం చాలావరకు ధ్వంసమైందని, 400 మంది వరకు మరణించారని, సుమారు 250 మంది గాయపడ్డారని అఫ్గానిస్థాన్ వెల్లడించింది. ఫిబ్రవరి 26న పాకిస్థాన్ ప్రారంభించిన ఆపరేషన్ ఘజాబ్ లిల్ హక్లో భాగంగానే తాజా వైమానిక దాడులు కొనసాగాయని పాకిస్థాన్ సమాచార మంత్రిత్వశాఖ వెల్లడించింది. అఫ్గాన్ తాలిబన్ దళాలు సరిహద్దులోని 2600 కిలోమీటర్ల పొడవునా సాగించిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ ఈ ఆపరేషన్ను ప్రారంభించింది. కాబూల్, నంగర్హర్లోని తాలిబన్ల నిర్వహణలోని మిలిటరీ స్థావరాలపై ఈ దాడులు చేపట్టినట్టు పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తాయుల్లా తరార్ ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు. కాబూల్లోని రెండు ప్రాంతాల్లో సాంకేతిక వ్యవస్థ, పేలుడు పదార్థాల గిడ్డంగులను, నంగర్హర్లోని ఉగ్రవాద శక్తులకు అండగా ఉన్న మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. అయితే అఫ్గాన్ తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిట్రాట్ ఈ దాడులపై వివరిస్తూ సోమవారం రాత్రి అఫ్గాన్ రాజధాని కాబూల్లో డ్రగ్ రీహేబిలిటేషన్ సెంటర్పై పాక్ వైమానిక దాడులు కొనసాగాయని, 400 మంది చనిపోయారని, మరో 250 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. శిధిలాల నుంచి మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీస్తున్నాయని చెప్పారు. ఇంకా శిథిలాల కింద మరో 50 మృతదేహాలు చిక్కుకుని ఉండి ఉండవచ్చని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆఫ్ఘాన్పై దాడి పిరికిపంద చర్య: భారత్ న్యూఢిల్లీ : అఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. అత్యంత అమానుష ఘటనగా అభివర్ణించింది. ఇది పిరికిపంద చర్య అని మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మారణహోమాన్ని సైనిక ఆపరేషన్గా కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. ఇది ఒక దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి. ఇలాంటి చర్యల వల్ల ప్రాంతీయ అస్థిరతకు ముప్పు వాటిల్లుతుంది. దేశ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సరిహద్దుకు ఆవల దాడులకు దిగడం పాకిస్థాన్ బాధ్యతారాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని చాటుతుంది’ అని విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటి వరకు చూడని క్లైమాక్స్: నాగచైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వృషకర్మ. దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ కూడా సినిమాపై ఆసక్తి మరింత పెంచింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి నాగచైతన్య చేసిన లేటెస్ట్ కామెంట్స్.. అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని చివరి 25 నిమిషాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ఆయన తెలిపారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడని సరికొత్త అంశాన్ని ఈ క్లైమాక్స్ లో చూపించబోతున్నామని చెప్పారు. దీంతో క్లైమాక్స్ లో బిగ్ సర్ప్రైజ్ ఉంటుందనే చెప్పాలి. వృష కర్మలో నాగచైతన్య ఇప్పటి వరకు చేయని విధంగా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సుల్లో కనిపించబోతున్నారని సమాచారం. లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నాగచైతన్య, ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. అర్జున్ అనే పాత్రలో ఆయన నటిస్తున్నారని, ఇది చైతూ కెరీర్ లోనే అత్యంత పవర్ ఫుల్ క్యారెక్టర్ గా నిలుస్తుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. సినిమాలో నాగచైతన్య ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో ఆయన సరసన మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్నారు. స్పర్ష్ శ్రీవాస్తవ విలన్ గా కనిపించనున్నారు. జయరామ్, సత్య అక్కళ్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ బ్యానర్స్ పై ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.
నైజీరియా మైడుగురి సిటీపై ఆత్మాహుతి బాంబుల దాడి ..23 మంది మృతి
ఈశాన్య నైజీరియా లోని మైడుగురి సిటీని టార్గెట్ చేస్తూ సోమవారం రాత్రి ఆత్మాహుతి బాంబుల దాడికి 23 మంది ప్రాణాలు కోల్పోవగా, 108 మంది గాయపడ్డారు. సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న ఈ నగరంలో అత్యంత ప్రాణాంతక దాడి ఇదేనని చెబుతున్నారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైడుగురిలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్, యూనివర్శిటీ ఆఫ్ మైడుగురి టీచింగ్ ఆస్పత్రి ప్రవేశ ద్వారం వద్ద పేలుళ్లు జరిగాయని స్థానికులు చెప్పారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఎవరూ ప్రకటించక పోయినప్పటికీ, బొకో హరామ్ జీహాదీ గ్రూప్ ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇస్లామిక్ సిద్ధాంతాన్ని బలవంతంగా అమలు చేయడానికి బోకో హరామ్ జీహాదీ గ్రూప్ 2009 నుంచి తిరుగుబాటు చేస్తోంది. అందులోని భాగమే ఈ దాడులని అనుమానిస్తున్నారు.
రోగులను దోచుకుంటున్న దంపతుల అరెస్టు
ఆస్పత్రుల్లో రోగులకు మత్తుమందు ఇచ్చి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న మహిళ, సహకరించిన భర్తను సికింద్రాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, మార్కెట్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...వికారాబాద్ జిల్లా, నవాబ్పేట మండలానికి చెందిన గౌండ్ల శిరీష డి ఫార్మసీ చదువుతోంది, ఎడులపల్లి సాయికుమార్ గౌడ్ వ్యాపారం చేస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడడంతో దంపతులు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా వైద్యురాలిగా నటిస్తూ ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు మత్తు మందు ఇచ్చి బంగారు ఆభరణాలు దోచుకోవాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే డాక్టర్ ఆప్రాన్ ధరించి ఆస్పత్రిలోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న ’డయాజెపామ్’ అనే మత్తు ఇంజక్షన్ను బాధితులకు ఇచ్చేది. వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పరారైంది. మార్చి 11న సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రి , అలాగే చందానగర్లోని సిటిజన్ ఆస్పత్రిలో రోగులకు మత్తు మందు ఇచ్చి బంగారు ఆభరణాలు చోరీ చేసింది. దొంగిలించిన సొమ్మును విలాసాలకు, షాపింగ్కు ఖర్చు చేసేవారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.
ప్రముఖ నటి నయనతారపై తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీ ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతపై నిర్వహించిన నిరసన సభలో పాల్గొంటూ నటి నయనతార గురించి ఎంపీ చేసిన అవమానకర వ్యాఖ్యల కారణంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. తమిళనాడు సిఎం స్టాలిన్పై విమర్శ చేయాలనే ఉద్దేశంతో చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసాయి. “మీ కలలను మాకు చెప్పండి. వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అంటూ ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.దీన్ని ఉద్దేశించి అన్నాడీఎంకే నేత, రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగం మాట్లాడుతూ అబ్దుల్ కలాం మనల్ని కలలు కనమన్నారు. మన కలల్ని తనతో పంచుకోమని ఆయన (స్టాలిన్) అడుగుతున్నారు. నాకు నయనతార కావాలి.. దాన్ని ఆయన నెరవేరుస్తారా? నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉంది. నాలాగే ఎవరో నయనతారతో పెళ్లి చేయమని స్టాలిన్ను అడిగితే ఆ కలను నెరవేర్చుతారా? అని ఆయన వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైంది. మహిళల భద్రత నిరసన సభలోనే వివాదం ఈ వ్యాఖ్యల వివాదాన్ని మరింత పెంచిన అంశం ఏమిటంటే.. మహిళల భద్రత, గౌరవం కోసం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో షణ్ముగం ఒక మహిళ(నయనతార) గురించి అవమానకరంగా మాట్లాడటం. అక్కడే ఉన్న పార్టీ నాయకులు కూడా ఈ వ్యాఖ్యలపై నవ్వుతూ స్పందించడం విమర్శలకు మరింత కారణమైంది. సోషల్ మీడియాలో ఆగ్రహం షణ్ముగం చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో వివిధ వర్గాల నుంచి తీవ్ర ప్రతికూల స్పందనలు వచ్చాయి. రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా వినియోగదారులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, కొందరు తమిళనాడు పోలీసులను ఈ అంశంపై కేసు నమోదు చేయాలని కోరగా, ఆ ఎంపీపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.మా విధానాలను విమర్శించండి. కానీ మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయకండి. నయనతారను అవమానించడం ద్వారా మహిళలందరినీ అవమానించారు. ఈ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమెదయోగ్యం కాదు అని డీఎంకే పార్టీ తీవ్రంగా స్పందించింది. షణ్ముగం అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మహిళల ప్రస్తావన తెచ్చి తీవ్ర విమర్శల పాలయ్యారు.
పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ సలహాదారు, నితీశ్ సన్నిహితుడు కేసీ త్యాగి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన మరుసటి రోజే త్యాగి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. జేడీయూ జాతీయ కార్యదర్శి, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన త్యాగి…ఆ పార్టీ అవతరించినప్పటి నుంచి కొనసాగుతున్నారు. నితీశ్ కుమార్తో దాదాపు 50 ఏళ్లు కలిసి రాజకీయాల్లో పనిచేశారు. తాజాగా జేడీయూ సభ్యత్వాన్ని […] The post జేడీయూకు కేసీ త్యాగి రాజీనామా appeared first on Visalaandhra .
మరో 15 రోజుల వరకు ఢోకా లేదుప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నాంముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మరికొన్ని మెట్రిక్ టన్నులు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు […] The post సరిపడా గ్యాస్ నిల్వలు appeared first on Visalaandhra .
விமான நிலையத்தில் விஜய் கைப்பையில் மதுபாட்டில் பறிமுதல் செய்யப்பட்டதா?
விமான நிலையத்தில் விஜய் கைப்பையில் மதுபாட்டில் பறிமுதல் செய்யப்பட்டதாக தவறான தகவல் பகிரப்படுகிறது.
కాల్పుల విరమణ ప్రసక్తే లేదు ` ప్రతీకారం తప్పదుశుత్రువులు ఓటమి అంగీకరించే వరకు పోరు ఆగదుఅధినేత ముజ్తబా ఖామేనీ స్పష్టీకరణ తెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేలా కాల్పుల విరమణకు చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ తిరస్కరించారు. శాంతికి ఇది సరైన సమయం కాదని అన్నారు. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, అమెరికాఇజ్రాయిల్పై ప్రతీకారం తప్పదని అన్నారు. అమెరికాఇజ్రాయిల్ విషయంలో అధినేత చాలా కఠిన వైఖరితో ఉన్నట్లు ఇరాన్ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయిల్అమెరికా తమ […] The post శాంతికి సమయం కాదు appeared first on Visalaandhra .
నేడు ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం
. రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 40 శాతానికిపైగా వైకల్యముంటే వర్తింపు. 12.76 లక్షల మందికి లబ్ధి విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో ప్రారంభించనున్నారు. నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం […] The post నేడు ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం appeared first on Visalaandhra .
కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన న్యూదిల్లీ: ఈపీఎఫ్ చందాదారులు పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్కు సంబంధించి పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995 కింద ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్ట్స్టైల్స్, స్కిల్డెవలప్మెంట్పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 15వ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఈపీఎస్ […] The post ఈపీఎఫ్ కనీసపింఛను పెంచాలి appeared first on Visalaandhra .
. పేదల సొంతింటి కల నెరవేరేదెన్నడు?. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఎప్పుడు?. మూడు బడ్జెట్లయినా కేటాయింపులు నిల్. సామాన్య, మధ్యతరగతిపై ఇంటి అద్దెల భారం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: పేదలకు గృహ భద్రత కల్పించడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకమైన సామాజిక బాధ్యత. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా ముందుకు సాగకపోవడంతో వేలాది పేద కుటుంబాలు అనిశ్చితిలో […] The post గూడు ఘోష appeared first on Visalaandhra .
గల్ఫ్పై ఇరాన్ దాడులు ఊహించలేదు: ట్రంప్
వాషింగ్టన్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుందని తాము ఊహించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దీనిని హఠాత్పరిణామంగా వర్ణించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైత్పై ఇరాన్ ప్రతిదాడులు తమను షాక్కు గురిచేశాయని ట్రంప్ చెప్పారు. పశ్చిమాసియాలోని ఈ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుందని ఏ మాత్రం ఊహించలేదని, ఆ ఆలోచన కూడా రాలేదని అన్నారు. తమ దాడులను ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిఘటించిందని తెలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను […] The post గల్ఫ్పై ఇరాన్ దాడులు ఊహించలేదు: ట్రంప్ appeared first on Visalaandhra .
అఫ్గాన్ ఆసుపత్రిపై పాక్ దాడిలో 400కు పెరిగిన మృతులు
కాబూల్: అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ మెరుపు దాడి చేసింది. ఆ దేశ రాజధాని కాబూల్పై విరుచుకుపడింది. అక్కడి ఆసుపత్రిపై వైమానిక దాడి చేయగా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని అధికారులు వెల్లడించారు. అఫ్గాన్, పాక్ మధ్య సరిహద్దు ఘర్షణ చాలా కాలంగా సాగుతున్నది. కాబూల్లోని 9వ పోలీస్ డిస్ట్రిక్ట్లో ఉన్న డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని లక్ష్యంగా పాకిస్థాన్ చేసిన తాజా […] The post అఫ్గాన్ ఆసుపత్రిపై పాక్ దాడిలో 400కు పెరిగిన మృతులు appeared first on Visalaandhra .
టీ20ల్లో అత్యుత్తమ ఆటగాడు బుమ్రానే: డివిలియర్స్
న్యూదిల్లీ: టీ20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు జస్ప్రిత్ బూమ్రాయేనని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. తనతో పాటు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి దిగ్గజ బ్యాటర్లు రేసులో ఉన్నప్పటికీ డివిలియర్స్ ఒక బౌలర్ను ఎంచుకోవడం విశేషం. ఈ ఎంపిక వెనుక ఉన్న కారణాలను డివిలియర్స్ వివరిస్తూ… “కొత్త బంతి అయినా, పాత బంతి అయినా, ఆఖరికి సూపర్ ఓవర్ అయినా సరే.. బుమ్రా చేతికి బంతి ఇస్తే మ్యాచ్ గెలిపిస్తాడు. ఏ […] The post టీ20ల్లో అత్యుత్తమ ఆటగాడు బుమ్రానే: డివిలియర్స్ appeared first on Visalaandhra .
దెబ్బతిన్న పైప్లైన్ పునరుద్ధరించిన థింక్ గ్యాస్
అనంతపురం: అనంతపురంలోని శ్రీ నగర్ కాలనీలో, ఎంజీ షోరూమ్ వెనుక, ఒక దుకాణ యజమాని విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం గుంత తవ్వేందుకు సమాచారం ఇవ్వకుండా చేతితో తవ్వకాలు జరుపుతుండగా, థింక్ గ్యాస్ (గతంలో ఏజీ అండ్ పీ ప్రథమ్) వేసిన నగర గ్యాస్ పైప్లైన్ దెబ్బతింది. థింక్ గ్యాస్ అత్యవసర ప్రతిస్పందన బృదం వెంటనే స్పందించి, ప్రభావిత ప్రాంతాన్ని వేరుచేసి, తక్కువ సమయంలో గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది. తద్వారా ప్రజల భద్రతను నిర్ధారించి, నివాసితులకు కలిగే […] The post దెబ్బతిన్న పైప్లైన్ పునరుద్ధరించిన థింక్ గ్యాస్ appeared first on Visalaandhra .
దక్షిణాదిన ఈవీలవైపు మొగ్గుః ఫ్లిప్కార్ట అధ్యయనం
బెంగళూరు: భారతదేశానికి చెందిన స్వదేశీ ఈకామర్స్ మార్కెట్ప్లేస్ ఫ్లిప్కార్ట తాజాగా “లాస్ట్మైల్ లీప్: భారతదేశపు ఎలకిక్ మొబిలిటీ పరివర్తనను వేగవంతం చేయడానికి డెలివరీ ఫ్లీట్లను బలోపేతం చేయడం” అనే వైట్పేపర్ను విడుదల చేసింది. ఈ నివేదిక దేశవ్యాప్తంగా 6,000 మందికి పైగా విష్ మాస్టర్స్, అంటే, డెలివరీ భాగస్వాములపై నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందింది. ఈ అధ్యయనం ప్రకారం, దాణ భారతదేశంలోని డెలివరీ భాగస్వాములు ఎలకిక్ వాహనాలకు మారడానికి గట్టి ఆసక్తి చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్న దక్షిణ […] The post దక్షిణాదిన ఈవీలవైపు మొగ్గుః ఫ్లిప్కార్ట అధ్యయనం appeared first on Visalaandhra .
మిరపలో నల్ల తామర పురుగు నియంత్రణకు కొర్టేవా
హైదరాబాదః మిరప రైతులు బ్లాక్ త్రిప్స్ తీవ్రమైన ముట్టడికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇది దిగుబడి తగ్గించి, నాణ్యత నష్టాలకు దారితీసేందుకు కారణమవుతుంది. ఒకే విధమైన చర్యతో పురుగుమందులను పదేపదే ఉపయోగించడం ద్వారా పేలవమైన నియంత్రణ లభిస్తుండగా, మిరపలో పురుగుమందుల అవశేషాల స్థాయి పెరుగుతోంది. కొర్టేవా అగ్రిసైన్స్ ఈ సవాలును చురుకుగా పరిష్కరిస్తోంది. స్థిరమైన ఉత్పాదకతను, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు సైంటిఫిక్ ఆధారిత, ఇంటిగ్రేటెడ్ తెగులు నిర్వహణ (ఐపీbం) వ్యూహాల ద్వారా రైతులకు సాధికారత కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ […] The post మిరపలో నల్ల తామర పురుగు నియంత్రణకు కొర్టేవా appeared first on Visalaandhra .
women play key role in politics : పదవులు మహిళలవి Andhra Prabha News
women play key role in politics : పదవులు మహిళలవి Andhra
కేరళ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది.మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గానూ మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వీరిలో వి.డి. సతీశన్ పరవూరు నియోజకవర్గం నుండి పోటీ చేయనుండగా, రమేష్ చెన్నితలను హరిపాడ్ నుండి నామినేట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్ను పుత్తుపల్లి నియోజకవర్గం నుండి బరిలోకి దింపారు. ఇతర కీలక అభ్యర్థులలో వట్టియూర్కావు నుండి కె. మురళీధరన్, చిరాయిన్కీజు నుండి రమ్య హరిదాస్ ఉన్నారు. కాగా, 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) గెలిచి అధికారాన్ని దక్కించుకుంది.
మే 3న పరీక్ష టిజిఆర్జెఎసి సెట్
రాష్ట్రంలో 35 తెలంగాణ గురుకుల(రెసిడెన్షియల్) జూనియర్ కళాశాలల్లో, 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇంటర్మీడియేట్ మొదటి ప్రవేశాల కోసం నిర్వహించే టిజిఆర్జెసి సెట్కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 3వ తేదీన టిజిఆర్జెఎసి సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
జెమినీలో సరికొత్త కామెడీ షో ‘మాస్ జాతర’
హైదరాబాద్: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు జెమినీ టీవీ సిద్ధమైంది. ‘మాస్ జాతర’ పేరుతో రూపొందించిన ఈ మెగా వీకెండ్ కామెడీ షోను హైదరాబాద్లోని నెక్సస్ మాల్లో సినీ తారలు, కమెడియన్ల సందడి మధ్య ఘనంగా ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, jట్యూబర్లు, కళాకారులతో కూడిన ఈ వినూత్న స్కిట్ కాంపిటీషన్ ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కానుంది. జానీ మాస్టర్, నవదీప్, బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ […] The post జెమినీలో సరికొత్త కామెడీ షో ‘మాస్ జాతర’ appeared first on Visalaandhra .
ఖర్గేతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ
ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గేతో చర్చించినట్టుగా సమాచారం. దీంతోపాటు పార్టీ పదవులు, తదితర అంశాల గురించి సిఎం రేవంత్రెడ్డి ఖర్గేతో మాట్లాడినట్టుగా తెలిసింది. ఏఐసిసి నూతన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు కెసి వేణుగోపాల్కు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లుగా సమాచారం.
Jana Nayagan Censor Issue: No Relief
Vijay’s last film Jana Nayagan is packed with hurdles. The Censor officials referred the film to the Revising Committee but the screening for the film was pushed several times. The Revising Committee has pushed the screening for today but it was delayed due to undisclosed reasons. The officials did not watch the film and this […] The post Jana Nayagan Censor Issue: No Relief appeared first on Telugu360 .
సీపీఐ పోరాటాల ఫలితమే లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు
ఈ నెల 24న అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం దోనేపూడి శంకర్, జి కోటేశ్వరరావు వెల్లడివిశాలాంధ్ర`విజయవాడ: ఉగాదికి టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందజేస్తామని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించటాన్ని కమ్యూనిస్టు పార్టీ స్వాగతించింది. ఈ మేరకు సీపీఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో పార్టీ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు నేతత్వంలో సీపీఐ బందం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం జక్కపూడి, వేమవరం ప్రాంతంలో లబ్దిదారులకు అందించేందుకు సిద్ధం చేస్తున్న టిడ్కో ఇళ్లను […] The post సీపీఐ పోరాటాల ఫలితమే లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు appeared first on Visalaandhra .

23 C