SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

22    C
... ...View News by News Source

బుధవారం రాశి ఫలాలు (28-01-2026)

మేషం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృషభం వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మిధునం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాల నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. మిత్రులతో ఆర్థిక విషయంలో విబేధాలు కలుగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. కర్కాటకం భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారమున నష్టాలు భర్తీ అవుతాయి. సింహం సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. బందు మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. స్థిరస్తి వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది. కన్య ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించటం మంచిది. చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. తుల వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు అధికమౌతాయి. వృశ్చికం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘ కాలిక వివాదాల నుండి బయట పడతారు. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనస్సు కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మకరం ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలసివస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగమున ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభం నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. మీనం విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.  

మన తెలంగాణ 28 Jan 2026 12:20 am

మోగిన పుర నగారా

. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. 11న పోలింగ్… 16న కౌంటింగ్ విశాలాంధ్ర – హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల కోలాహలం మొదలయింది. తెలంగాణా మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం విడుదలయింది. 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదుని తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బుధవారం నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందని, 31 న నామినేషన్ల పరిశీలన […] The post మోగిన పుర నగారా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:46 pm

కొత్తగూడెం కార్పొరేషన్‌పై సీపీఐ పట్టు

. 50, 43 డివిజన్ల నుంచి 110 కుటుంబాలు పార్టీలో చేరిక. అభివద్ధికి ప్రజల సహకరిస్తే కార్పొరేషన్ సీపీఐ కైవసం: జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా విశాలాంధ్ర – కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో సీపీఐ రోజు రోజుకు పట్టు సాధిస్తోంది. మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చడంలో విజయం సాధించిన స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై ప్రజల్లో అభివృద్ధి ప్రదాతగా నమ్మకం పెరిగింది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీపీఐలో చేరికలు భారీగా పెరిగాయి. గడిచిన మునిసిపల్ ఎన్నికల్లో […] The post కొత్తగూడెం కార్పొరేషన్‌పై సీపీఐ పట్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:42 pm

అత్యుత్తమ సేవలే లక్ష్యంగారెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు

. కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు. నేడు పఠాన్‌చెరువులో ఇంటిగ్రేటెడ్ భవనానికి శంకుస్థాపన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా అత్యుత్తమ సేవలు అందిం చాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత పదేళ్లలో ఆనాటి పాలకుల స్వార్థపూరిత నిర్ణయాల వల్ల రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. […] The post అత్యుత్తమ సేవలే లక్ష్యంగారెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:40 pm

సింగరేణి కార్మికులసంక్షేమానికి పెద్దపీట

. అధికారులతో సమానంగా కార్మికులకు సౌకర్యాలు. ఉద్యోగుల పేరు మార్పుల సమస్యకు పరిష్కారం. కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేస్తాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విశాలాంధ్ర-హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా ప్రభుత్వం అధ్వర్యంలో సింగరేణి కార్మికుల కోసం తాజాగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సింగరేణి ఉద్యోగుల […] The post సింగరేణి కార్మికులసంక్షేమానికి పెద్దపీట appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:38 pm

స్తంభించిన బ్యాంకు సేవలు

వారానికి ఐదు పనిదినాల సాధనకు నిర్విరామ పోరు: యూఎఫ్‌బీయూ విశాలాంధ్ర – హైదరాబాద్ : బ్యాంకు ఉద్యోగుల” వారానికి ఐదు రోజుల పని విధానం సాధించేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తామని ఏఐబీఈఏ కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. ఐదు రోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు బ్యాంక్ ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్ కోఠిలోని […] The post స్తంభించిన బ్యాంకు సేవలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:35 pm

దర్యాప్తు నివేదిక వచ్చాకే…

జస్టిస్ వర్మ అభిశంసనపై రిజిజు న్యూదిల్లీ: అల్లాహాబాద్ హై కోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన త్రిసభ్య దర్యాప్తు కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ఈ వ్యవహారంలో నిర్ణయం ఉంటుందన్నారు. రిజిజు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ‘జస్టిస్ వర్మ వ్యవహారాన్ని సముచిత కమిటీకి సిఫార్సు చేశారు… ప్రక్రియ కొనసాగుతోంది. దర్యాప్తు నివేదిక వచ్చాక ఏ విధంగా ముందుకెళ్లాలో […] The post దర్యాప్తు నివేదిక వచ్చాకే… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:25 pm

ఆ దేశాలకు ఇండిగో సర్వీసులు రద్దు

న్యూదిల్లీ: ఇరాన్‌లో ఉద్రిక్తతలతో సెంట్రల్ ఆసియాకు ఇండిగో విమాన సేవలు రద్దు అయ్యాయి. ఈ మేరకు ఆ సంస్థ తాజాగా ఒక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 11 వరకు తబిలిసి (జార్జియా), అల్మాటీ (కజకిస్థాన్), బకు (అజర్ బైజాన్), తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్ )కు తమ విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణాల దష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అసౌకర్యానికి చింతిస్తున్నామని వెల్లడించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ప్రధానమని […] The post ఆ దేశాలకు ఇండిగో సర్వీసులు రద్దు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:23 pm

ఔటర్ రింగ్ రోడ్ పై కారు దగ్ధం..

ఔటర్ రింగ్ రోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అకాడమీ వద్ద కారు దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. కారు ముందు భాగం నుంచి మంటలను గమనించిన డ్రైవర్ కారును పక్కకు ఆపి కిందకు దిగి  పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. తుక్కుగూడ నుంచి నార్సింగి వస్తున్న నిఖిల్ అనే వ్యక్తి అప్ప జంక్షన్ సమీపంలోకి రాగానే కారు లో నుంచి పొగలు రావడాని గమనించాడు. సమాచారం మేరకు ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే కారు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 27 Jan 2026 11:22 pm

బడ్జెట్ హల్వా సిద్ధం

న్యూదిల్లీ: కేంద్ర బడ్జెట్‌కు వేళయ్యింది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. దీంతో సంప్రదాయం ప్రకారం బడ్జెట్ హల్వా సిద్ధమైంది. ఈ వేడుక ఆర్థిక శాఖ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌధరీ పాల్గొన్నారు. ఆర్థిక శాఖ పరిధిలోని అన్ని విభాగాల కార్యదర్శులు, బడ్జెట్ రూపకల్పనలో భాగమైన అధికారులు హాజరయ్యారు. అనంతరం సీతారామన్ బడ్జెట్ ప్రతుల ముద్రణ, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం […] The post బడ్జెట్ హల్వా సిద్ధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:19 pm

మహా ఆర్థిక బంధం

. ట్రంప్ హెచ్చరికలు బేఖాతర్. భారత్`ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు. చారిత్రక ఒప్పందం: మోదీ. కొత్త శిఖరాలకు సహకారం: కోస్టా. ఇటు నైపుణ్యం, అటు టెక్నాలజీతో అద్భుత ఫలితాలు: ఉర్సులా న్యూదిల్లీ: భారత్-ఈయూ (యురోపియన్ యూనియన్) మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స’గా చర్చించుకుంటున్నారని నేతలు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్, […] The post మహా ఆర్థిక బంధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:15 pm

బ్యాంకు ఉద్యోగుల రణభేరి

. స్తంభించిన బ్యాంకు సేవలు. దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు, ధర్నాలు. ఐదు రోజుల పని దినాలు అమలు చేయాల్సిందే. ఒప్పందం అమలు చేయకుంటే ఆందోళన ఉధతం. హెచ్చరించిన బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నేతలు. సమ్మెకు సంఘీభావం తెలిపిన ఏఐటీయూసీ. నిర్లక్ష్యం దుర్మార్గం: రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వారానికి ఐదు రోజుల పని దినాలు ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం రాష్ట్రంలో చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె […] The post బ్యాంకు ఉద్యోగుల రణభేరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:10 pm

ఉపాధి హామీ, ఎస్ఐఆర్, యూజీసీపైచర్చించాల్సిందే

అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షం డిమాండ్బడ్జెట్‌పైనే దృష్టి పెట్టాలి: ప్రభుత్వం న్యూదిల్లీ: ఎంజీఎనఆరఈజీఏ తిరిగి అమలుతో పాటు ఎసఐఆర్, యూజీసీ నిబంధనలపై పార్లమెంటులో చర్చించాలని మంగళవారం అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వ ప్రతినిధులు ససేమిరా అన్నారు. బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. దీంతో సంప్రదాయం ప్రకారం ఒక రోజు ముందు అఖిలపక్షం భేటీ అయింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. అధికార`విపక్ష కీలక నేతలు హాజరయ్యారు. ప్రతిపక్ష సభ్యుల […] The post ఉపాధి హామీ, ఎస్ఐఆర్, యూజీసీపైచర్చించాల్సిందే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 11:06 pm

శరవవేగంగా ’ఉస్తాద్ భగత్ సింగ్’ నిర్మాణాంతర కార్యక్రమాలు

తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ’ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. తన శక్తివంతమైన రచన, మాస్ మెచ్చే సంభాషణలకు పేరుగాంచిన హరీష్ శంకర్ ను అభిమానులు ముద్దుగా ’కల్ట్ కెప్టెన్’ అని పిలుస్తారు. ఆ పేరుకి తగ్గట్టుగానే ’ఉస్తాద్ భగత్ సింగ్’ను కల్ట్ చిత్రంగా మలచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను దర్శకుడు హరీష్ శంకర్ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సినిమా అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లేలా.. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే, ప్రేక్షకుల చేత ఈలలు వేయించే సంభాషణలకు ఈ చిత్రం హామీ ఇస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇది అభిమానులలో, సినీ ప్రేమికులలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది. ’గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం కావడంతో ’ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ’దేఖ్ లేంగే సాలా’ గీతం శ్రోతలను ఉర్రూతలూగించింది. ’ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

మన తెలంగాణ 27 Jan 2026 11:01 pm

ఈ ఏడాదే వెలిగొండ

. గాలేరు`నగరి ద్వారా కడపకు కృష్ణా జలాలు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఉద్యానరంగ అభివృద్ధిపై సీఎం సమీక్ష విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రకాశంతోపాటు, రాయలసీమ ప్రాంతంలోని మొత్తం 10జిల్లాల పరిధిలోని 20 సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని, దానికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. అలాగే రాయలసీమ, […] The post ఈ ఏడాదే వెలిగొండ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 10:59 pm

భారత్`ఈయూ ఎఫ్‌టీఏలో కీలక అంశాలు

2026 చివరికి అమల్లోకి ఒప్పందం న్యూదిల్లీ: భారత్`27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందా(ఎఫ్‌టీఏ)నికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియల పూర్తికి, ఒప్పందం డాక్యుమెంట్లను ఐరోపా దేశాల 24 అధికారిక భాషల్లోకి అనువాదం చేయించడానికి దాదాపు 6 మాసాల సమయం పట్టనుంది. 2026 చివరికల్లా ఒప్పందంపై భారత్, ఈయూ లాంఛనంగా సంతకాలు చేస్తాయి. 2027లో మొదటి రెండు నెలల్లోగా ఎఫ్‌టీఏపై భారత ప్రభుత్వ మంత్రిమండలి, ఐరోపా పార్లమెంటు ఆమోదముద్ర వేస్తాయి. ఆ […] The post భారత్`ఈయూ ఎఫ్‌టీఏలో కీలక అంశాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 10:54 pm

సమరోత్సాహంతో భారత్.. నేడు విశాఖలో కివీస్‌తో పోరు

విశాఖపట్నం: హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా బుధవారం విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే నాలుగో టి20 మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా ఈసారి కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడైన ప్రదర్శన చేస్తున్న భారత్ క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. ఇషాన్ కిషన్ కూడా దూకుడు మీద ఉన్నాడు. భారత్ విజయాల్లో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషిస్తున్నారు. కిందటి మ్యాచ్‌లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ కళ్లు చెదిరే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ చెలరేగితే కివీస్ బౌలర్లకు మరోసారి ఇబ్బందులు ఖాయం. ఇషాన్ కిషన్ కూడా జోరుమీదున్నాడు. అతను కూడా విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచుల్లోనూ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. విశాఖలోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని తహతహలాడుతున్నాడు. హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రింకు సింగ్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి తదితరులతో బౌలింగ్ కూడా బాగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు న్యూజిలాండ్ కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని లక్షంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగానే ఉన్నా కివీస్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. ఈసారైన గెలుస్తుందా లేదా వేచి చూడాల్సిందే.

మన తెలంగాణ 27 Jan 2026 10:39 pm

లాసెట్, ఇసెట్ షెడ్యూల్ విడుదల

 రాష్ట్రంలో న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించే టిజిలాసెట్, పిజిఎల్‌సెట్, లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిజిఇసెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. లాసెట్, ఇసెట్ నిర్వహణకు మంగళవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఆయా సెట్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయా సెట్ల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు పురుషోత్తం, మమమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఒయు వైస్ ఛాన్స్‌లర్ మొలుగరం కుమార్, లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మి, ఇసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. లాసెట్, ఇసెట్ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. లాసెట్ ప్రవేశ పరీక్షకు ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి,10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి ఆలస్యం రుసుం లేకుండా దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 1 చివరి తేదీ. మే 18వ తేదీన ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2 వరకు మూడేళ్ల ఎల్‌ఎల్‌బి, సాయంత్రం 4 నుంచి 5.30 వరకు ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష జరుగనున్నది. అలాగే లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిజి ఇసెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 5న నోటిఫికేషన్ విడుదల చేసి, 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 18 వరకు విద్యార్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 15న ఇసెట్ పరీక్ష జరుగనున్నది. టిజి లాసెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ తేదీ : ఫిబ్రవరి 8 అన్‌లైన్ దరఖాస్తులు : ఫిబ్రవరి 10 నుంచి ఏప్రిల్ 1 వరకు(ఆలస్య రుసుం లేకుండా) పరీక్ష తేదీ : మే 18 టిజి ఇసెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 5 ఆన్‌లైన్ దరఖాస్తులు : ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 18 వరకు (అలస్య రుసుం లేకుండా) పరీక్ష : మే 15

మన తెలంగాణ 27 Jan 2026 10:30 pm

సంబంధాలతో మార్పు కోసం బ్రిటన్ ప్రధాని చైనా వైపు

లండన్: అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో చైనాతో సంబంధాలను మెరుగుపరచేందుకు ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ చైనాకు వెళుతున్నారు. బుధవారం నుంచి ఆయన బీజింగ్, షాంఘైలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్, ప్రధాని లి కియాంగ్ లను కలుసుకుని చర్చలు జరుపుతారు. బ్రిటన్ చైనీస్ టెక్నాలజీ, పెట్టుబడిని కోరుతూ, బ్రిటన్ ఆర్థిక సేవలు, కార్లు, స్కాచ్ విస్కీ చైనాకు అందించేందుకు సిద్ధమైంది. బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్ తో పాటు, బ్రిటీష్ వాణిజ్య వ్యవహారాల శాఖమంత్రి పీటర్ కైల్ పలువురు కార్పొరేట్ చీఫ్ లు ఈ పర్యటనలో పాల్గొంటారు. బ్రిటీష్ ప్రధాని చైనా పర్యటన వల్ల దేశంలో చైనా వ్యతిరేకుల నుంచి నిరసన వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆగ్రహించే అవకాశం, మిత్రపక్షం అన్నది కూడా చూడకుండా అధికంగా సుంకాలు విధించే ప్రమాదం ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విధానాలు వల్ల నెలకొన్న అస్తవ్యస్థ నేపథ్యంలో అటు చైనా, ఇటు బ్రిటన్ కూడా స్థిరమైన సంబంధాలకోసం చూస్తున్నాయి.

మన తెలంగాణ 27 Jan 2026 10:26 pm

సిఎం అంటే కోల్ మాఫియా: కెటిఆర్

సిఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సిఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందని కెటిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తాము ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదని విమర్శించారు. ఈ విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతూ, విదేశాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.సిఎం ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఏ పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ ఫోజులు కొడతా ఉన్నారని విమర్శించారు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని, చదువుకోవాల్సిన సమయంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తదో ఒకసారి సిఎం కూడా ఆలోచించుకోవాలని సూచించారు. పది కోట్ల సింగరేణి నిధులు దుర్వినియోగం చేసి సిఎం ఫుట్ బాల్ ఆటకి వినియోగించుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలతో సిఎం ఎలాగో ఫుట్ బాల్ ఆడుతున్నారని.. కానీ, సింగరేణి సంస్థతో కూడా ఫుట్ బాల్ ఆడుతూ పది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఆ సంస్థకి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఒక్క స్కామ్‌కి సంబంధించి అన్ని ఆధారాలు బయటపెడితే కూడా ఇప్పటివరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదని విమర్శించారు.

మన తెలంగాణ 27 Jan 2026 10:25 pm

రాష్ట్రంలో ఐదుగురు డిఎస్పిలు బదిలీ

రాష్ట్ర పోలీస్ శాఖలో ఐదుగురు డిఎస్పిలు బదిలీ చేస్తున్నట్లు డిజిపి బి.శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పోలీస్ అకాడమీ స్టాండ్స్ డిఎస్పి, ఇల్లందు ఎస్‌డిపిఓగా విధులు నిర్వహిస్తోన్న ఎస్.సారంగపాణి వైరా ఏసిపిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసిలో డిఎస్పిగా ఉన్న పద్మనాభుల శ్రీనివాస్ జిహెచ్‌ఎంసి అదనపు ఎస్పిగా, ఇంటెలిజెన్స్ డిఎస్పిగా విధులు నిర్వహిస్తున్న యు. వెంకన్నబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎస్‌డిపిఓగా, సైబరాబాద్ ఎస్‌బి ఏసిపిగా ఉన్న బి. ప్రకాష్ నిజామాబాద్ ఏసిపిగా బదిలీ చేశారు. నిజామబాద్ ఏసిపిగా ఉన్న ప్రకాష్‌ను డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

మన తెలంగాణ 27 Jan 2026 10:22 pm

సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడు ఆత్మహత్య

తిమ్మాపూర్ మండలం కొత్తపెల్లి గ్రామంలోని స్మశాన వాటిక వద్ద సోమవారం రామంచ గ్రామానికి చెందిన నాగేల్లి వెంకటేష్ రెడ్డి(29) అనే యువకుడు తన చావుకు కుటుంబ సభ్యులే కారణమంటూ కంటతడి పెట్టించి సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్య. చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన నాగేల్లి వెంకటేష్ రెడ్డి కి రెండు నెలల క్రితమే మనీషా అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన కుటుంబ సభ్యులు అయిన అన్నదమ్ములతో కలిసి చిన్న ముల్కనూర్ గ్రామంలో లక్షల పెట్టుబడి పెట్టి మహాదేవ్ సూపర్ మార్కెట్ ను నడిపిస్తున్నారు. సూపర్ మార్కెట్ ఆర్థిక లావాదేవీలలో తన తోడ బుట్టిన అన్నదమ్ములే మోసం చేయడం,తన తల్లిదండ్రులు,అన్నదమ్ములు తనను తన భార్యను అవమానపరిచి,ఆర్థికంగా దెబ్బతీసి వెలివేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన నాగేల్లి వెంకటేష్ రెడ్డి నేను చనిపోయిన తనను నమ్ముకున్న భార్యకు న్యాయం చేయాలని వేడు కుంటూ సెల్ఫీ వీడియో తీసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న హృదయ విధాకరమైన ఘటన కంట తడి పెట్టించింది. నా మరణానికి నా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములే కారణమని, నన్ను నమ్ముకుని వచ్చిన నా భార్యకు న్యాయం చేయని బ్రతుకు నాకు ఎందుకు అని భావించి, నేను పురుగుల మందు త్రాగి చచ్చిపోతున్నా, నీవు మంచిగా బ్రతకమని భార్యను ఓదారుస్తూ, నా భార్య అమాయకురాలు అని వేడుకొంటూ..నేను చనిపోయిన తదనంతరము భార్యకు నా కుటుంబ సభ్యుల నుండి కనీసం 10 లక్షల రూపాయలు ఇప్పించాలని ఎస్‌ఐకి వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసి,చనిపోతున్నా అని తన భార్యకు తెలియజేసి,పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే భార్య తన తోటి స్నేహి తులు ఘటన స్థలానికి వెళ్లి చూసే సరికి నాగేల్లి వెంకటేష్ రెడ్డి అపస్మారక స్థితిలో కింద పడి ఉండగా, వెంటనే కరీంనగర్ లోని ప్రవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మంగళ వారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్న ట్టు ఎల్‌ఎండి ఎస్‌ఐ తెలిపారు.

మన తెలంగాణ 27 Jan 2026 10:17 pm

దేశాన్నిరాజుల యుగానికి నెట్టేస్తున్న మోడీ సర్కార్: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: మోదీ సర్కార్ మహాత్మాగాంధీ ఎన్‌ఆర్ ఇజిఏ నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో వ్యవహిస్తున్నదని, కార్మికుల వేతనాలపై చర్చించే హక్కును తొలగించడం, పంచాయతీల అధికారాలను కుదించడం వంటి చర్యలకు పాల్పడుతున్నదని లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు ఆరోపించారు. ఈ చర్యల ద్వారా ప్రధాని మోదీ దేశాన్ని రాజుల యుగానికి తిరిగి నెట్టివేస్తున్నారని ఆయన విమర్శించారు. అధికారం కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీ కృతమయినట్లు అన్పిస్తోందన్నారు. ఎంజిఎన్‌ఆర్ ఇజి ఏ పై కార్మికులతో తాను జరిపిన సంభాషణ వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేశారు. ఉపాధి హామీ పథకం వారి జీవితాలను ప్రకటించిన కార్మికులు ఇప్పుడు మోదీ సర్కార్ కార్మికులను బానిసలుగా మారుస్తోందని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంజిఎన్‌ఆర్ ఇజిఏ ను మార్చడం వెనుక మోదీ అసలు ఉద్దేశ్యం ఏమిటి. కార్మికుల రోజువారీ వేతనాలను చర్చించే హక్కు తొలగించడం, పంచాయతీల అధికారాన్ని తొలగించి వారి చేతులు కట్టివేయడం, రాష్ట్రాల అధికారాన్ని తొలగించి, కేంద్రమే అధికారాలను హస్తగతం చేసుకోవడం దేనికి సంకేతం అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేద కార్మికుల జీవితాలలో విప్లవాత్మక మార్పు తెచ్చిందని,ఆ మార్పు రావడానికి దశాబ్దాల కాలం పట్టిందని ఆయన అన్నారు. ఆ పథకం వల్ల కనీస వేతనాలు, ఏడాది పొడవునా పనికి హామీ, స్వేచ్ఛ, గౌరవంతో పనిచేసేహక్కు లభించాయని లక్షలాది మంది కార్మికులు చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. విబి- జి-రామ్ జి పథకాన్ని వెనక్కి తీసుకుని మహాత్మాగాంధీ ఉపాధి హామీ గ్యారంటి పథకాన్నే అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. కాంగ్రెస్ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. యుపిఏ ప్రవేశపెట్టిన ఎంజిఎన్‌ఆర్ ఇజిఏ రద్దుకు వ్యతిరేకంగా జనవరి 10 నుంచి 45 రోజులపాటు దేశవ్యాప్త ప్రచారాన్నికాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది.

మన తెలంగాణ 27 Jan 2026 9:40 pm

U19 World Cup.. యువ భారత్ ఘన విజయం

బులవయో: జింబాబ్వే వేదికగా జరుగుతున్న అండర్19 ప్రపంచకప్‌లో యువ భారత జట్టు వరుస విజయాలతో అదరగొడుతోంది. మంగళవారం జింబాబ్వేతో జరిగిన సూపర్ సిక్స్ (గ్రూప్2) మ్యాచ్‌లో భారత్ 204 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరును సాధించింది. విహాన్ మల్హోత్రా అద్భుతసెంచరీతో చెలరేగి పోయాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన విహాన్ 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్లు అరోన్ జార్జ్ (23), వైభవ్ సూర్యవంశీ (52) జట్టుకు శుభారంభం అందించారు. చెలరేగి ఆడిన వైభవ్ 30 బంతుల్లోనే 4 సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో 52 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 61 పరుగులు సాధించాడు. ఖిలాన్ పటేల్ 12 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. దీంతో భారత్ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత లక్షఛేదనకు దిగిన జింబాబ్వే యువ జట్టు 37.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. కియాన్ (37), లిరాయ్ (62), టటెండా (29) పరుగులు రాణించారు. మిగతా వారు విఫలం కావడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో మోహన్, అయుష్ మాత్రె మూడేసివికెట్లను పడగొట్టారు.

మన తెలంగాణ 27 Jan 2026 9:26 pm

మెగాస్టార్ మూవీకి రికార్డు కలెక్షన్స్..

మెగాస్టార్ చిరంజీవి పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు బుక్‌మైషోలో, ప్రపంచవ్యాప్త వసూళ్లలో సంచలనాత్మక మైలురాళ్లను సాధించింది. మన శంకరవరప్రసాద్ గారు బుక్‌మైషోలో ఆల్‌టైమ్ నంబర్ 1 రీజినల్ ఫిల్మ్ గా నిలిచింది. 15వ రోజుకే 3.6 మిలియన్ టికెట్లు అమ్ముడై, ఇప్పటివరకు రికార్డు కలిగిన సంక్రాంతికి వస్తున్నాం (3.5 మిలియన్)ను అధిగమించింది. ఈ ఘనతను సాధించిన ఫాస్టెస్ట్ రీజినల్ ఫిల్మ్‌గా ‘మన శంకరవరప్రసాద్ గారు’ రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం 15 రోజుల్లో రూ.358 కోట్లకు పైగా వసూలు చేసి రీజినల్ ఇండస్ట్రీ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఉత్తర అమెరికాలో ఈ చిత్రం 3.5 మిలియన్ డాలర్ల మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే భారీ రికార్డులు నమోదు అవుతున్నాయి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని అత్యున్నతంగా నిర్మించారు.

మన తెలంగాణ 27 Jan 2026 9:17 pm

హైదరాబాద్ లో గ్లోబల్ కాపబిటిలి సెంటర్ ప్రారంభించిన వెస్ట్రన్ యూనియన్

హైదరాబాద్: HCLTech సహకారంతో భారతదేశం, హైదరాబాద్ లో తమ గ్లోబల్ కాపబిటిలి సెంటర్ ప్రారంభోత్సవాన్ని ద వెస్ట్రన్ యూనియన్ కంపెనీ (NYSE: WU) ఈరోజు ప్రకటించింది. ఈ ఆధునిక సౌకర్యం AI- ఆధ్వర్యంలోని ఆవిష్కరణ, ప్లాట్ ఫాం ఆపరేటింగ్ మోడల్ మరియు ఇంజనీరింగ్ శ్రేష్టత ద్వారా వెస్ట్రన్ యూనియన్ యొక్క పరివర్తనను వేగవంతం చేయడానికి రూపొందించబడింది, ఇది రెండు కంపెనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని శక్తివంతం చేస్తుంది. సెంటర్ ను, HCLTech CEO మరియు మేనేజింగ్ డైరెక్టర్ విజయ కుమార్, మరియు రెండు సంస్థలకు చెందిన సీనియర్ నాయకులతో కలిసి వెస్ట్రన్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ మరియు CEO, డెవిన్ మెక్ గ్రనహన్ ప్రారంభించారు. పూణె టెక్ సెంటర్ తో పాటు, GCC టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు ఆపరేషన్స్ కోసం అంతర్జాతీయ వేదికగా పని చేస్తుంది. ఆధునిక చెల్లింపుల మౌళిక సదుపాయాలను ప్రోత్సహిస్తుంది, డిజిటల్ వినియోగదారుల అనుభవాలను మెరుగుపరుస్తుంది మరియు ప్రపంచ స్థాయికి చెందిన సామర్థ్యాలను రూపొందిస్తుంది. సెంటర్ AI Force™ సహా HCLTech యొక్క AI పవర్డ్ పరిష్కారాలను ఉపయోగిస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వెస్ట్రన్ యూనియన్ ప్రెసిడెంట్ మరియు CEO డెవిన్ మెక్ గ్రనహన్ ఇలా అన్నారు, “ ఈ సెంటర్ వెస్ట్రన్ యూనియన్ వారి పరివర్తనా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను మరియు భారతదేశంలో విస్తరణను సూచిస్తుంది. HCLTechతో మా వ్యూహాత్మకమైన భాగస్వామ్యం ద్వారా, చెల్లింపులకు మించి, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కస్టమర్లకు సజావుగా, సురక్షితమైన అనుభవాలను అందించడానికి మేము లోతైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఆధునిక AI సామర్థ్యాలతో కలుపుతున్నాము. ” సి. విజయకుమార్, HCLTech CEO & MD, ఇలా అన్నారు, “ వెస్ట్రన్ యూనియన్ తో మా విలువైన భాగస్వామ్యంలో ఈ మైలురాయి గణనీయమైన ముందడుగును సూచిస్తోంది. ఇది ఆర్థిక సేవలు మరియు GCCల కోసం వ్యాపారం మరియు టెక్నాలజీ పరివర్తను వేగవంతం చేయడంలో HCLTech యొక్క శక్తివంతమైన డిజిటల్, క్లౌడ్ మరియు AI సామర్థ్యాలను సూచిస్తోంది. కలిసికట్టుగా మేము వెస్ట్రన్ యూనియన్ యొక్క బియాండ్ స్ట్రాటజి (వ్యూహానికి మించి)కి అనుగుణంగా నిర్దిష్టమైన, కొలవదగిన ఫలితాలను అందించడం, డిజిటల్-ఫస్ట్ వ్యాపార మోడల్ ను అభివృద్ధి చేయడం, చెల్లింపులకు మించి వినియోగదారు సేవలను విస్తరించడం మరియు ఆధునిక తరానికి చెందిన చెల్లింపుల మౌళికసదుపాయాలను నవీకరించడంపై దృష్టి కేంద్రీకరించాము.”

మన తెలంగాణ 27 Jan 2026 9:10 pm

Will Jana Nayagan makers Compromise with CBFC?

Jana Nayagan is the last attempt of Vijay as an actor as he decided to take a full time career in Tamil politics. Jana Nayagan is made on a budget of Rs 500 crores and the film is stuck with censor hurdles. The film’s grand release during Sankranthi season has been put on hold and […] The post Will Jana Nayagan makers Compromise with CBFC? appeared first on Telugu360 .

తెలుగు 360 27 Jan 2026 9:00 pm

జిల్లాలో తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

క్లోరినేషన్ క్లీనింగ్ టెస్టులు సకాలంలో చేయండి కలెక్టర్ జి. లక్ష్మీశ.విశాలాంధ్ర`విజయవాడ: జిల్లా వ్యాప్తంగా రక్షిత తాగునీటి సరఫరా పై నిరంతర పర్యవేక్షణ చేయాలని క్లోరినేషన్ క్లీనింగ్ బైలాజికల్ టెస్టులు నిర్వహించిన అనంతరం మాత్రమే తాగునీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణ సురక్షిత మంచినీటి సరఫరా గ్రామీణ నీటి సరఫరా పథకాల పనుల ప్రగతి పై మంగళవారం ఆయన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా […] The post జిల్లాలో తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 8:59 pm

తారకరామ ఎత్తిపోతల పథకంపై తీవ్ర నిర్లక్ష్యం

రైతులు నష్టపోతున్న పట్టించుకోని ప్రభుత్వం తక్షణమే రూ.5కోట్లు కేటాయించి నిర్వహణ పనులు చేపట్టాలి రైతు సంఘాల నేతలు డిమాండ్ విశాలాంధ్రవిజయవాడ: వేలాది ఎకరాలకు సాగునీరు అందించే తారకరామ ఎత్తిపోతల పథకం గత 10సంవత్సరాల నుంచి ఎటువంటి మరమ్మతులు నోచుకోకపోవడం దారుణమని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. అమరావతి రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ పథకం మరమత్తులకు, మెయింటినెన్స్ కు నిధులు లేవని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నం, జి.కొండూరు,విజయవాడ రూరల్ […] The post తారకరామ ఎత్తిపోతల పథకంపై తీవ్ర నిర్లక్ష్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 8:52 pm

మా తండ్రి, తాత గోవాలోనే పుట్టారు: యురోపియన్ కౌన్సిల్ చీఫ్

న్యూఢిల్లీ: భారతదేశం- యురోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం ప్రకటన సందర్భంగా అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయి డా కోస్టా... భారతదేశంలోని గోవాతో నాకు చక్కటి అనుబంధం ఉంది. నా తండ్రి, తాతా గోవాలో పుట్టిన వాళ్లే.. అంటూ భారతదేశంతో తనకు గల అనుబంధాన్ని వివరిస్తూ తన ఓసిఐ కార్డు తీసి చూపారు. ఇయు అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ప్రధాని నరేంద్రమోదీ లను ఆశ్చర్యానికి గురిచేస్తూ, కోస్టా తన గోవా అనుబంధాన్ని వివరించారు. గతంలో పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవాలో ఆంటోనియో కోస్టా తండ్రి పుట్టి పెరిగారు. గోవా విముక్తి తర్వాత ఆయన 18 ఏళ్ల వయస్సులో పోర్చుగల్ కు వలస వెళ్లారు. ఆంటోనియో కోస్టా తన చిన్నప్పటి కొంకణి పేరు బాబుష్ అని మంగళవారం ఉమ్మడి సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం యురోపియన్ కౌన్సిల్ చైర్మన్ అయినా, తాను కూడా విదేశీ భారతీయ పౌరుడినే అని తన జేబులోంచి ఓసిఐ కార్డును చూపుతూ కోస్టా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన 1015 నుంచి 2024 వరకూ పోర్చుగీస్ ప్రధానమంత్రిగా పని చేశారు. పోర్చుగీస్ ప్రధాని హోదాలో 2017లో భారతదేశంలో పర్యటించినప్పుడు గోవాలో తమ పూర్వీకులు ఉన్న ఇళ్లను కూడా సందర్శించారు. అప్పుడు కవి, రచయిత అయిన తన తండ్రి ఓర్లాండో కోస్టా రాసిన నాటకం ఆంగ్ల అనువాదాన్ని విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కోస్టా 1961లో నిస్బన్ లో జన్మించినా, తల్లిదండ్రులతో కలిసి తన టీనేజ్ లో గోవాను సందర్శించినట్లు చెప్పారు. తన తా మార్గోవాలో పుట్టి ఎక్కువకాలం అక్కడే జీవించారన్నారు. తన తండ్రి లిస్బన్ వెళ్లినా గోవాను మరచిపోలేదని, గోవా పై రచనలు చేసేవారని పేర్కొన్నారు. గోవా లోని మార్గావ్ లో అబాదే ఫారియా రోడ్ లో 200 ఏళ్లనాటి తన పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉందని, తమ బంధువుల కుటుంబాలు ఇప్పటికీ అక్కడ నివసిస్తున్నట్లు తెలిపారు. 2017లో తాను ఆ ఇంటిని చూసి, తన కుటుంబసభ్యులతో మాట్లాడిన విషయం గుర్తు చేసుకున్నారు. 64 ఏళ్ల కోస్టా కు గోవా వారసత్వం, ప్రశాంచ చర్చల శైలి కారణంగా ఆయనను లిస్బన్ గాంధీ అని పిలుస్తారు. కోస్టా ప్రస్తుతం బ్రస్సెల్స్ నుంచి ఇయు కౌన్సిల్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నా...ఆయన ప్రసంగంలో గోవా ఓ భాగం అయింది.

మన తెలంగాణ 27 Jan 2026 8:50 pm

గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్‌ కలకలం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్ట్

హైదరాబాద్‌: డ్రగ్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ పట్టబడుతునే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసినా.. డ్రగ్స్ పెడ్లర్లు తమ దందాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గచ్చిబౌలిలో మాదాపూర్‌ ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎండిఎంఎ డ్రగ్స్‌ విక్రయిస్తున్న సాయికిరణ్ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తోపాటు మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొచ్చి విక్రయిస్తుండగా ముగ్గురిని అందుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

మన తెలంగాణ 27 Jan 2026 8:22 pm

సిఎం రేవంత్‌రెడ్డికి సంతోష్ గూఢచారి : కవిత సంచలన వ్యాఖ్యలు

ఉద్యమకారులకు ఉద్యమనేతను దూరం చేసిందే సంతోష్‌రావు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డికి సంతోష్‌రావు గూఢచారి అని విమర్శిస్తూ ఆయన పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.సంతోష్‌రావు వల్లే గద్దర్‌లాంటి వాళ్లు ప్రగతిభవన్ గేట్ బయట ఉండాల్సి వచ్చిందని, ఈటల రాజేందర్‌ను బిఆర్‌ఎస్ సస్పెండ్‌కు కారణం కూడా ఆయనని ఆరోపించారు. ఉద్యమకారులను, పేద ప్రజలకు కేసీఆర్‌ను దూరం చేశారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి అనుకూలంగా కెటిఆర్, హరీష్ రావులు ట్వీట్‌లు పెట్టడాన్ని బిఆర్‌ఎస్ కేడర్ గమనించాలన్నారు. సిట్ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కవిత డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 27 Jan 2026 8:21 pm

Madaram |మేడారం జాత‌ర సంద‌ర్భంగా….

Madaram | మేడారం జాత‌ర సంద‌ర్భంగా…. Madaram | మేడారం, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 27 Jan 2026 8:16 pm

‘మున్సి’ పోల్స్‌లో కాంగ్రెస్-బిజెపి మధ్యే పోటీ: మహేష్‌కుమార్ గౌడ్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-బిజెపి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, బిఆర్‌ఎస్ పని ఖతం అయ్యిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాలపై ఏఐసిసి ముఖ్య నేతలతో చర్చించేందుకు సోమవారం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.రాష్ట్రంలో బిజెపి ఎన్ని పోరాటాలు చేసినా అధికారంలోకి రాలేదన్నారు. కర్నాటక, తెలంగాణలో బిజెపికి మనుగడ ఉండబోదని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ పని కూడా అయిపోయిందని, రకరకాల కేసులతో ఆ పార్టీ నేతలు సతమతమవుతున్నారని అన్నారు. ప్రజలు ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సోషల్ మీడియాను పట్టుకుని పాకులాడుతున్నారని ఆయన విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తమ పార్టీ సునాయసంగా కైవసం చేసుకుంటుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. బిసిలకు యాబైకి పైగా స్థానాల్లో టిక్కెట్లు ఇవ్వాలని వస్తున్న డిమాండ్ గురించి ప్రశ్నించగా, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు. నైనీ-కోల్ కుంభకోణం గురించి ప్రశ్నించగా, ఇదంతా మీడియా సృష్టేనని ఆయన దాట వేశారు. తాను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పుడు కూడా నైనీ-కోల్ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. నిజామాబాద్‌లో బిఆర్‌ఎస్ ఉనికి పూర్తిగా కోల్పోయిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్-బిజెపి మధ్యే పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని ఆయన చెప్పారు. అదేవిధంగా మహిళా అధ్యక్షురాలిని కూడా నియమించాల్సి ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత కొత్తగా పార్టీని స్థాపించి పోటీ చేసే ఆలోచనలో ఉందని అన్నారు. కాంగ్రెస్‌లో కవితను చేర్చుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా, ఆ ఆలోచన తమకు లేదన్నారు. తనకు ఉన్న సమాచారం మేరకు కవిత పార్టీ స్థాపించబోతున్నారని అన్నారు. --==--

మన తెలంగాణ 27 Jan 2026 8:08 pm

Warangal |ఇప్పగూడెం చింతగట్టు జాతరకు సర్వం సిద్ధం

Warangal | ఇప్పగూడెం చింతగట్టు జాతరకు సర్వం సిద్ధం Warangal | స్టేషన్

ప్రభ న్యూస్ 27 Jan 2026 8:05 pm

Temple |ఆధ్యాత్మిక దైవచింతన అలవర్చుకోవాలి

Temple | ఆధ్యాత్మిక దైవచింతన అలవర్చుకోవాలి Temple | ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:53 pm

Jana Sena’s Credibility Put to Test as Disturbing Allegations Rock the Party

Barely hours after the Jana Sena Party issued a firm statement calling for restraint and responsibility in public discourse, the party has been jolted by a controversy of its own. A fresh serious allegation against one of its MLAs has triggered sharp political reactions and uncomfortable questions. The accusations are against Arava Sreedhar, the sitting […] The post Jana Sena’s Credibility Put to Test as Disturbing Allegations Rock the Party appeared first on Telugu360 .

తెలుగు 360 27 Jan 2026 7:47 pm

అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడి సజీవదహనం

తీసుకున్న అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడిని అతి కిరాతంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతరామరాజు జిల్లాలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే.. అల్లూరి జిల్లా పాడేరు మండలం అయినాడ గ్రామపంచాయతీ పరధిలోని చింతలపాలెం గ్రామానికి చెందిన సోమన్న అదే గ్రామానికి చెందిన రామారావుకు రూ. 5.600 నగదు అప్పుగా ఇచ్చాడు. ఈ క్రమంలో సోమన్న రామారావును అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ఆగ్రహించిన రామారావు సోమన్నపై దాడి చేసి ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటనలో సోమన్న సజీవదహనమయ్యాడు.స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రామారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 27 Jan 2026 7:42 pm

Nominations |నామినేషన్ల స్వీకరణకు 6 కేంద్రాలు ఏర్పాటు

Nominations | నామినేషన్ల స్వీకరణకు 6 కేంద్రాలు ఏర్పాటు Nominations | భీమ్‌గల్‌

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:37 pm

Electricity |మేడారం జాతరకు విద్యుత్ శాఖ సర్వం సిద్ధం

Electricity | మేడారం జాతరకు విద్యుత్ శాఖ సర్వం సిద్ధం Electricity |

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:32 pm

Vijay Devarakonda |రణబాలి ఎలా ఉండబోతుందో తెలుసా..?

Vijay Devarakonda | రణబాలి ఎలా ఉండబోతుందో తెలుసా..? Vijay Devarakonda |

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:30 pm

Cricket |రాష్ట్రస్థాయి క్రికెట్ బహుమతుల ప్రధానోత్సవం

Cricket | రాష్ట్రస్థాయి క్రికెట్ బహుమతుల ప్రధానోత్సవం Cricket | దంతాలపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:22 pm

అత్యాచారం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తూ మేడ్చల్ ఒకటవ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్, మహేంద్ర నగర్ కాలనీకి చెందిన బిట్ల వెంకట్ సాయి (28)కి స్థానికంగా ఉంటున్న యువతిని నాలుగేళ్లు ప్రేమించాడు. వివాహం చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. జనవరి 30,2017న నిందితుడు యువతితో గొడవపెట్టుకుని వివాహం చేసుకోనని చెప్పాడు. దీంతో బాధితురాలు మూడు అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. యువతి తల్లి 2017 ఫిబ్రవరి 8 న బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు తనను లైంగికంగా వేధించడమే కాకుండా తన ఫోటోలు బయటపెడతానని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను హత్య చేస్తానని బెదిరించాడని పోలీసులకు తెలిపింది. దర్యాప్తు చేసిన పోలీసులు సాక్షాలను సేకరించి కోర్టుకు సమర్పించడంతో వాటిని పరిశీలించిన కుషాయిగూడలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఒకటవ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి బి. తిరుపతి నిందితుడిని దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు.

మన తెలంగాణ 27 Jan 2026 7:21 pm

20th Ward |మౌనం వీడిన ‘బొర్రా’ కుటుంబం.. వైరా మున్సిపల్ ఎన్నికలో ఉమాదేవి ఎంట్రీ!

20th Ward | వైరా మున్సిపల్ ఎన్నికలో బొర్రా ఉమాదేవి దరఖాస్తుచైర్మన్ రేసులోకి

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:17 pm

water |శాశ్వత మంచినీటి సమస్య ప‌రిష్కారం…

water | శాశ్వత మంచినీటి సమస్య ప‌రిష్కారం… water | చిట్యాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:16 pm

Hundi |నాగదేవుతా హుండి ఆదాయం రూ. 8,93,797

Hundi | నాగదేవుతా హుండి ఆదాయం రూ. 8,93,797 Hundi | ఇంద్రవెల్లి,

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:12 pm

బెంగళూరులో హార్టీకనెక్ట్ ఇండియా ఎక్స్‌పో 2026

హార్టీకనెక్ట్ ఇండియా ఎక్స్‌పో 2026 ఎడిషన్ అక్టోబర్ 1 నుంచి 3 వరకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (BIEC) లో నిర్వహించబడుతుంది. ఈసారి ఎక్స్‌పో పరిధి మరింత విస్తరించనుండగా, భారతదేశంలోని విస్తృత వ్యవసాయ రంగంతో మరింత ప్రత్యక్షంగా అనుసంధానమయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ట్రేడ్ ఫెయిర్‌ను మెస్సే మ్యూనిచెన్ ఇండియా, బెంగళూరులో ఉన్న హార్టీకనెక్ట్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంగా సహ-ఆయోజనం చేస్తుంది. ప్రారంభంలో అంతర్జాతీయ స్థాయి ఉద్యానవన కేంద్రిత ట్రేడ్ ఫెయిర్‌గా స్థాపితమైన హార్టీకనెక్ట్ ఇండియా, ఇప్పుడు పంట రంగాల మధ్య పెరుగుతున్న సమన్వయాన్ని ప్రతిబింబిస్తోంది. నిర్వాహకుల ప్రకారం, రక్షిత సాగు వ్యవస్థలు, ప్రిసిషన్ నీటిపారుదల, వాతావరణాన్ని తట్టుకునే ఇన్‌పుట్లు మరియు పంటతర్వాత మౌలిక సదుపాయాలు వంటి సాంకేతికతలు మొదట ఉద్యానవనంలో వినియోగించబడ్డాయి; ఇప్పుడు అవే ఫీల్డ్ క్రాప్స్ మరియు మిశ్రమ వ్యవసాయ విధానాల్లో కూడా విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి. మెస్సే మ్యూనిచెన్ ఇండియా సీఈఓ మరియు మెస్సే మ్యూనిచెన్ అధ్యక్షుడు (భారత్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా) భూపిందర్ సింగ్ అన్నారు.“ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన వ్యవస్థను ప్రాంతీయ బలాలతో అనుసంధానిస్తుంది. కర్ణాటక మరియు దక్షిణ భారతదేశం ఫ్లోరికల్చర్, ప్రిసిషన్ ఫార్మింగ్ మరియు ఎగుమతుల కోసం ఉత్పత్తిలో ఉద్యానవన వ్యాపారానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. హార్టీకనెక్ట్ ఈ బలాల ఆధారంగా వ్యాపారానికి కొత్త అవకాశాలు ఏర్పడే వేదికను అందిస్తుంది.” హార్టీకనెక్ట్ గ్లోబల్ సభ్యుడు మరియు ఫ్లోరెన్స్ ఫ్లోరా చైర్మన్ ఎస్.కే. గుట్గుటియా అన్నారు..“రంగం ఎలా అభివృద్ధి చెందుతోందో దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. ఉద్యానవనంలో ముందుగా స్వీకరించిన ఆధునిక సాంకేతికతలు ఇప్పుడు మొత్తం వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి, ఆ మార్పునే ఈ ప్రదర్శన ప్రతిబింబిస్తుంది.” 2026 ఎడిషన్‌లో రక్షిత సాగు, స్మార్ట్ నీటిపారుదల, వాతావరణాన్ని తట్టుకునే ఇన్‌పుట్లు మరియు పంటతర్వాత నిర్వహణ వంటి ప్రధాన అభివృద్ధి రంగాలపై దృష్టి ఉంటుంది. ఇవి దేశీయ సరఫరా గొలుసు మరియు వ్యవసాయ ఎగుమతుల రెండింటికీ ఎంతో కీలకమైనవి.

మన తెలంగాణ 27 Jan 2026 7:10 pm

Drugs |డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడ‌దాం….

Drugs | డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడ‌దాం…. Drugs | కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 27 Jan 2026 7:06 pm

దివ్యాంగుల సంక్షేమానికి వంద కోట్లు వెచ్చించాం: భట్టి విక్రమార్క

దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం పదేళ్ళలో చేయలేని పనులని, ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే చేసిందని, అందులో భాగంగానే ఈ రెండేళ్లలో దివ్యాంగుల కోసం 100 కోట్ల రూపాయలు వెచ్చించిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. బుధవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ చదువుకుంటున్న దివ్యాంగులకు ఐపాడ్లు, కంప్యూటర్లు ట్యాబ్స్ ప్రజా ప్రభుత్వం అందిస్తోందన్నారు. తమది ప్రజల గురించి ఆలోచన చేసే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వమన్నారు. దివ్యాంగులకు ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తామని, వారికి అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందన్నారు. దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారిని కూడా సమాజంలో మనతోపాటు ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దివ్యాంగుల గురించి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. దివ్యాంగులు కూడా అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. సమాజంలో ఇతరులకన్నా ఎక్కువ అవకాశాలను, ఆసరాను దివ్యాంగులకు మనం అందించాలన్నారు. అంగవైకల్యంతో ఉన్నామన్న బాధ వారికి రాకుండా వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఈ ఆలోచన దిశగానే ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా పి. శ్రీజ, ఇర్రిగేషన్ ఎస్‌ఇ వాసంతి, విద్యుత్ ఎస్‌ఇ శ్రీనివాస చారి, ఆర్ అండ్ ఎస్‌ఇ యాకుబ్, జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారావు, వ్యవసాయ శాఖ ఏడి విజయ చందర్, మధిర తహసీల్దార్ రాంబాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 27 Jan 2026 7:06 pm

భారతదేశం- ఈయూ మధ్య మదర్ ఆప్ ఆల్ డీల్స్

ఇరోపియన్ యూనియన్ మంగళవారం గొప్ప స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం చుట్టాయి. దీనిని అన్ని ఒప్పందాల తల్లిగా ఉభయపక్షాల నేతలు అభివర్ణించారు.ప్రధాని నరేంద్రమోదీ, యురోపియన్ యూనియన్ అగ్ర నాయకత్వం కల్లోల ప్రపంచ క్రమంలో భారతదేశం, ఇయు మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు విసృ్తత రంగాలకు విస్తరించే వాణిజ్యం, రక్షణ పరమైన ఎజెండాతో కూడిన ఒప్పందాన్ని ఆవిష్కరించారు.ప్రధాని నరేంద్రమోదీ ఈయు నాయకులు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఆంటోనియో కోస్టాలకు శిఖరాగ్రసమావేశాలకు చక్కటి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఇరు పక్షాలనేతలు రెండు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఒకటి భద్రత, రక్షణ పరమైన ఒప్పందం కాగా, మరొకటి యురోపియన్ యూనియన్ దేశాలలో భారతీయ సాంకేతిక ప్రతిభ విస్తరణకు సంబంధించినది. నియమాల ఆధారంగా గొప్ప దార్శనికతతో కూడిన ఒప్పందం ఇది.భారతదేశం, 27 దేశాల కూటమి రానున్న ఐదేళ్లలో ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక ఎజెండా అమలుకు సిద్ధమయ్యాయి. సమగ్ర వాణిజ్య ఒప్పందం చర్చల ముగింపు నేపథ్యంలో 13 కీలక ఒప్పందాలను ధ్రువీకరించాయి. ప్రధాని మోదీ తన ప్రారంభోపన్యాసంలో ప్రపంచ వ్యవస్థ గొప్పగందరగోళంలో ఉన్న సందర్భంలో భారతదేశం, ఇయూ మధ్య భాగస్వామ్యం అంతర్జాతీయ వ్యవస్థ స్థిరీకరణకు, బలోపేతానికి దోహదపడుతుందని అన్నారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛా ఒప్పందం సాకారమైందని ఆయన అన్నారు. భారతీయ రైతులు, చిన్నపరిశ్రమలకు యురోపియన్ మార్కెట్ అందుబాటులో ఉండేలా ఇది వీలుకల్పిస్తుంది, తయారీ, సేవా రంగాలలో కొత్త అవకాశాలు సృష్టిస్తుందని మోదీ ఒక మీడియా ప్రకటనలో తెలిపారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశం, యురోపియన్ యూనియన్ మధ్య పెట్టుబడులు పెంచడంతో పాటు కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు సృష్టిస్తుందని మోదీ అన్నారు. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు.. ఇరు పక్షాల పురోభివృద్ధికి కొత్త బ్లూప్రింట్ అన్నారు మోదీ. ఇరుపక్షాలు చర్చలు ప్రారంభించిన 18 ఏళ్ల తర్వాత సమగ్ర వాణిజ్య ఒప్పందం రూపుదిద్దుకుంది. విపులంగా చర్చల అనంతరం ఇరు పక్షాలు ధృవీకరించిన అనంతరం అధికారికంగా ఒప్పందంపై సంతకాలకు కనీసం మరో ఆరు నెలలు పట్టవచ్చు. మెగా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యురోపియన్ యూనియన్ అధ్యక్షురాలు వాన్ డెర్ లేయన్ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశం,ఇయు భాగస్వామ్యం ప్రపంచ సవాళ్లకు దీటైన సమాధానాన్ని బలమైన సందేశాన్ని పంపుతుందని ఆమె ఆకాంక్షించారు. యూరప్, అమెరికా మధ్య సంబంధాలలో పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయన్నారు. భారతదేశం, ఇయు - మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ - సాధించాయి. ఈ మెగా ఒప్పందంతో 200 కోట్ల ప్రజల మార్కెట్ ను సృష్టిస్తున్నాం అని ఆమె అన్నారు. ఇది రెండు ప్రపంచ దిగ్గజాలు రచించిన కథ. ప్రపంచంలో రెండో, నాల్గో అతి పెద్ద ఆర్థికవ్యవస్థలు - విన్ -విన్ - పద్ధతిలో భాగస్వామ్యాన్ని ఎంచుకుని, ప్రపంచానికి ఇస్తున్న బలమైన సందేశం ఇది అని వాన్ డెర్ లేయన్ అన్నారు. ఇయు,ఒక కూటమిగా భారతీయ ఉత్పత్తులకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25లో ఇరు పక్షాల మధ్య వాణిజ్యం 136 బిలియన్ అమెరికా డాలర్లమేరకు జరిగింది. దీనిలో ఎగుమతులు 76 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 60 బిలియన్ డాలర్లు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ టిఏ) వల్ల భారతీయ నైపుణ్యాలు, సేవలు, యూరప్ సాంకేతికత, మూలధనం ఆవిష్కరణలతో ఎంతో రెట్లు వాణిజ్యం పెరుగుతుందన్నారు.వాణిజ్యం ఎన్నోరెట్లు పెరిగే క్రమంలో ఇయు వ్యూహాత్మకంగా ఇతరులపై ఆధారపడడం తగ్గిస్తామని, పరోక్షంగా అమెరికా , ట్రంప్ సుంకాలను, పాలనా విధానాలను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. రక్షణ భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, యూరప్, భారతదేశం ఒకదానికొకటి నమ్మకమైన భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమెచెప్పారు.ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్యాలు మొట్టమొదటి భద్రత, రక్షణ భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి అని ఆమె ప్రకటించారు.యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు కోస్టా తన వ్యాఖ్యలలో రెండు పక్షాలు సంతకాలు చేసి కీలక ఒప్పందాలు నియమాలు ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేస్తాయన్నారు. మంగళవారం కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగి ఉందని అన్నారు. భవిష్యత్ లో యురోపియన్ యూనియన్, భారతదేశాలు పరస్పర శ్రేయస్సు కోసం కృషి చేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ప్రపంచ సమస్యలపై సమగ్ర చర్చ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా ఉక్రెయిన్, పశ్చిమాసియా, ఇండో - ఫసిఫిక్ పరిస్థితితో సహా అనేక ప్రపంచ సమస్యలపై ఉరు పక్షాలు వివరంగా చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అంతర్జాతీయ నిబంధనల పట్ల గౌరవం తమ ఉమ్మడి ప్రాధాన్యత అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ సంస్థల సంస్కరణలు అవసరమని ఏకగ్రీవంగా తాము అంగీకరించినట్లు మోదీ తెలిపారు. ఉక్రెయిన్ పై యూరప్ దీర్ఘకాల వైఖరిని యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు పునరుద్ఘాటించారు.

మన తెలంగాణ 27 Jan 2026 6:58 pm

Yadadri |జేఏసీ జిల్లా అధ్యక్షునిగా గోపినాధ్

Yadadri | జేఏసీ జిల్లా అధ్యక్షునిగా గోపినాధ్ Yadadri | మోత్కూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:54 pm

Video : Sri Chidambaram Garu Movie Team Interview

The post Video : Sri Chidambaram Garu Movie Team Interview appeared first on Telugu360 .

తెలుగు 360 27 Jan 2026 6:51 pm

students |విద్యార్థులకు ట్రాక్ సూట్స్ అందజేత…

students | విద్యార్థులకు ట్రాక్ సూట్స్ అందజేత… students | జన్నారం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:47 pm

U19 ప్రపంచ కప్.. టీమిండియా భారీ స్కోరు

బులవాయో (జింబాబ్వే): U19 ప్రపంచ కప్ 2026లో భాగంగా యువ భారత్, జింబాబ్వే జట్టుతో తలపడుతోంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఆయుష్ మాత్రే సారథ్యంలోని టీమిండియా భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ విహాన్ మల్హోత్రా సెంచరీతో రాణించాడు. విహాన్ 107 బంతుల్లో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అర్ధ సెంచరీతో చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులతో 52 పరుగులు చేశాడు. తర్వాత కీపర్ అభిజ్ఞాన్ కుండు కూడా 61 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో స్పిన్నర్ ఖిలాన్ పటేల్ మెరుపులు మెరిపించాడు. కేవలం 12 బంతుల్లోనే వేగంగా 30 పరుగులు రాబట్టాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 11 ఓవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది.

మన తెలంగాణ 27 Jan 2026 6:36 pm

workers |గ్రామ పంచాయతీ కార్మికులకు దుస్తుల‌ పంపిణీ…

workers | గ్రామ పంచాయతీ కార్మికులకు దుస్తుల‌ పంపిణీ… workers | వాంకిడి,

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:35 pm

Nominations |రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ

Nominations | రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ Nominations | మోత్కూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:21 pm

Madaram |సమ్మక్క తల్లి అంగరక్షకురాలు గట్టమ్మ తల్లి

Madaram | సమ్మక్క తల్లి అంగరక్షకురాలు గట్టమ్మ తల్లి Madaram | మేడారం

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:15 pm

చిన్నారిపై వీధికుక్క దాడి.. ముఖంపై గాయాలు

హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని శ్రీనివాస్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో మల్లికార్జున్, రేవతిల కుమార్తె శార్వి (4) ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు చిన్నారిని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని కాకపోతే శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో నమోదయ్యాయి. 

మన తెలంగాణ 27 Jan 2026 6:11 pm

ఏపీలో ఉద్యమానికి శ్రీకారం : వైఎస్ షర్మిల

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి భేటీ అయ్యారు.

తెలుగు పోస్ట్ 27 Jan 2026 6:09 pm

Development |మురికి కాలువను జేసీబీతో తొలగింపు

Development | మురికి కాలువను జేసీబీతో తొలగింపు Development | రెంజల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:08 pm

కారుతో ఢీకొట్టి స్నేహితుడిన చంపాడు.. లైటర్ కోసం?

సిగరెట్ లైటర్ కోసం గొడవతో ఘర్షణకు దారితి స్నేహితుడిని కారుతో ఢీకొట్టి హతమార్చిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది

తెలుగు పోస్ట్ 27 Jan 2026 6:03 pm

TG |పీడీఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా….

TG | పీడీఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా…. TG |ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Jan 2026 6:00 pm

Rudrur |డిఎంహెచ్వో ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ…

Rudrur | డిఎంహెచ్వో ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ… Rudrur | రుద్రూర్,

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:58 pm

Award |ఉత్తమ అవార్డు గ్రహీతకు సన్మానం…

Award | ఉత్తమ అవార్డు గ్రహీతకు సన్మానం… Award | జైనూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:56 pm

Diarrhea |డయేరియా కేసులు కలక‌లం…

Diarrhea | డయేరియా కేసులు కలక‌లం… Diarrhea | మోతె, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:52 pm

AP |సిక్కోలు బృందానికి డిల్లీలో సన్మానం…

AP | సిక్కోలు బృందానికి డిల్లీలో సన్మానం… AP | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:48 pm

Adilabad |నూతన ఎస్ ఐ, ఏఎస్ ఐలకు సన్మానం…

Adilabad | నూతన ఎస్ ఐ, ఏఎస్ ఐలకు సన్మానం… Adilabad |

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:46 pm

TG |మంచిర్యాల మున్సిపల్ కురుక్షేత్రం..

TG | మంచిర్యాల మున్సిపల్ కురుక్షేత్రం.. TG | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:45 pm

49 బంతుల్లో శతకం.. విండీస్ క్రికెటర్ విధ్వంసం..

వరల్డ్ లెజండ్స్ ప్రొ టి-20 లీగ్ ఘనంగా ప్రారంభమైంది. భారత్‌లో ఈ లీగ్ ప్రారంభమైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ప్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్‌గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పుఱె పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి. కాగా, ఈ లీగ్‌లో 10 రోజుల పాటు 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. లీగ్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్ తలపడ్డాయి. ప్రారంభ మ్యాచ్‌లో విండీస్ విధ్వంసకర ఆటగాడు చాడ్విక్ వాల్టన్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని వారియర్స్ జట్టు సునాయాసంగా చేధించింది. వాల్టన్ 62 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సులతో 128 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో 16.3 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచింది.

మన తెలంగాణ 27 Jan 2026 5:33 pm

Municipal Elections Set the Political Pulse Racing in Telangana

The State Election Commission has announced the schedule for elections to seven municipal corporations and 116 municipalities across the state. With this announcement, the Model Code of Conduct has come into effect. State Election Commissioner Rani Kumudini held a detailed review meeting with district collectors, SPs, and police commissioners to assess preparedness. Soon after the […] The post Municipal Elections Set the Political Pulse Racing in Telangana appeared first on Telugu360 .

తెలుగు 360 27 Jan 2026 5:29 pm

పవన్ తనయుడు అకీరా నందన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట

పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌పై డీప్‌ఫేక్ సినిమాఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన అనుమతి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో రూపొందించిన డీప్‌ఫేక్ సినిమాపై అకీరా దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం స్టే విధించింది. ఈ సినిమాను వెంటనే అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.తన పేరు, ఫొటోలు, స్వరం, వ్యక్తిత్వాన్ని వాడుకుని […] The post పవన్ తనయుడు అకీరా నందన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 5:29 pm

TG |పరకాల మున్సిపాలిటీకి చేరిన పోలింగ్ బాక్స్

TG | పరకాల మున్సిపాలిటీకి చేరిన పోలింగ్ బాక్స్ TG | పరకాల,

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:28 pm

MLA |కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి

MLA | కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి MLA | ఇబ్రహీంపట్నం,

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:26 pm

AP |ఎస్‌హెచ్‌జి మహిళలకు నైపుణ్యాభివృద్ధి..

AP | ఎస్‌హెచ్‌జి మహిళలకు నైపుణ్యాభివృద్ధి.. AP | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:22 pm

sanitation in 2026 |మేడారం జాతరలో ప్లాస్టిక్ ముప్పు.. నివారణకు తెలంగాణ ప్రభుత్వ కఠిన చర్యలు

sanitation in 2026 | సమ్మక్క–సారలమ్మ జాతరలో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలుప్లాస్టిక్ నివారణకు

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:22 pm

AP |రాష్ట్ర ప్రజలందరి పైన జగజ్జనని అనుగ్రహం, ఆశీస్సులు..

AP | రాష్ట్ర ప్రజలందరి పైన జగజ్జనని అనుగ్రహం, ఆశీస్సులు.. AP |

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:19 pm

Deputy CM |పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా…

Deputy CM | పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా… Deputy CM |వెబ్

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:15 pm

Nandyala |అధికారులపై మరింత బాధ్యత పెరిగింది…

Nandyala | అధికారులపై మరింత బాధ్యత పెరిగింది… Nandyala | నంద్యాల బ్యూరో,

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:08 pm

Treasury |లంచంతో పట్టుబడ్డ.. ట్రెజరీ ఉద్యోగులు

Treasury | లంచంతో పట్టుబడ్డ.. ట్రెజరీ ఉద్యోగులు Treasury | వెబ్ డెస్క్,

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:06 pm

Dandepalli |ఉపాధి హామీ కూలీలతో సంతకాల సేకరణ….

Dandepalli | ఉపాధి హామీ కూలీలతో సంతకాల సేకరణ…. Dandepalli | దండేపల్లి,

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:05 pm

Telangana : తెలంగాణలో నేటి నుంచి ఎన్నికల కోడ్.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది

తెలుగు పోస్ట్ 27 Jan 2026 5:03 pm

Kurnool |న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

Kurnool | న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Jan 2026 5:02 pm

ఎమ్మెల్సీ నాగబాబుతో గెడ్డం శివ రత్న గణపతి భేటీ

విశాలాంధ్ర – కడియం : ఎచ్చెర్ల నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును కడియం మండలం బుర్రిలంక చిరు సేవా సమితి అధ్యక్షులు మరియు జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు గెడ్డం శివ రత్న గణపతి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరు సేవా సమితి 25 సంవత్సరాల సేవా ప్రస్థానంలో ఇటీవల ఘనంగా నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల వివరాలను నాగబాబుకు తెలియజేశారు. వేడుకల సందర్భంగా […] The post ఎమ్మెల్సీ నాగబాబుతో గెడ్డం శివ రత్న గణపతి భేటీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 4:59 pm

విద్యాశాఖ అధికారికి ఘన సత్కారం..

విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): రిపబ్లిక్ డే దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతులు మీదుగా ఉత్తమ విద్యాశాఖ అధికారిగా ఎస్ సుందర్ రావు అవార్డు అందుకున్నారు. ఉత్తమ విద్యాశాఖ అధికారిగా అవార్డు అందుకోవడంతో పి ఆర్ టి యు నాయకులు ఆయనకు పూల బొకేలు అందించి ఘనంగా దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా పిఆర్టియు నాయకులు మాట్లాడుతూ ఆయన అందించిన సేవలను జిల్లా స్థాయి అధికారులు గుర్తించి ఆయనకు అవార్డు అందించడం […] The post విద్యాశాఖ అధికారికి ఘన సత్కారం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 4:56 pm

Ys Jagan : ఓటమి తర్వాత జగన్ లో ఇంతటి మార్పు వచ్చిందా?

గత ఎన్నికలలో తెచ్చిన ఓటమి వైసీపీ అధినేత జగన్ లో మార్పు తెచ్చినట్లు కనపడుతుంది

తెలుగు పోస్ట్ 27 Jan 2026 4:51 pm

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రెండు వాటర్ ఫిల్టర్ బహుకరణ..

తాత లింగం చంద్రశేఖర్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గాంధీ నగర్ లో గల 18వ వార్డులోని ప్రభుత్వ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని సేవించేందుకుగాను దాతలు తాత లింగం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులైన అభిలాష్, శ్రావణి కుమారుడు సంవేద్ ప్రధమ జన్మదిన వేడుకల సందర్భంగా రెండు వాటర్ ఫిల్టర్ లను (విలువ 25, 000రూ.లు) దాతల చేతుల మీదుగా హెడ్మాస్టర్ రాజకుమారుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ మా మనవడు సంవేద్ పుట్టినరోజు సందర్భంగా […] The post ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రెండు వాటర్ ఫిల్టర్ బహుకరణ.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 4:50 pm

ఉచిత కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

యువర్స్ ఫౌండేషన్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నిర్వహించే ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా స్వాతి క్లినిక్ లో శిబిరమునకు సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా శీలం […] The post ఉచిత కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 4:47 pm

వందలసంఖ్యలో ఉచిత కంటి చికిత్స శిబిరాలను నిర్వహించాము

లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి చికిత్స అందించడమే మా లక్ష్యము అని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి ఉలవల నాగేంద్ర, కోశాధికారి కొత్తపాలెం వెంకటేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని వారు నిర్వహించారు. అనంతరం అధ్యక్ష ,కార్యదర్శులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా […] The post వందలసంఖ్యలో ఉచిత కంటి చికిత్స శిబిరాలను నిర్వహించాము appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Jan 2026 4:43 pm