SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

Ugadi 2026: Chandrababu Naidu Signs CMRF File

Ugadi began on a meaningful note in Andhra Pradesh as Chief Minister N. Chandrababu Naidu marked the festival with a strong welfare decision. On the first day of the Telugu New Year, he signed the Chief Minister’s Relief Fund file and approved financial assistance for thousands of needy families across the state. With this decision, […] The post Ugadi 2026: Chandrababu Naidu Signs CMRF File appeared first on Telugu360 .

తెలుగు 360 19 Mar 2026 12:29 pm

chahal |ఇప్పుడు ఆట పైనే ఫోక‌స్‌

chahal | ఇప్పుడు ఆట పైనే ఫోక‌స్‌ chahal |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 19 Mar 2026 12:26 pm

కవిత కొత్త పార్టీ... ఢిల్లీ హైకోర్టులో ఊరట

ఢిల్లీ: పార్టీ నమోదు వ్యవహారంలో మాజీ ఎంఎల్‌సి కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇసికి సూచించింది. 'తెలంగాణ ప్రజా జాగృతి' పై వీలైనంత త్వరంగా నిర్ణయం తీసుకోవాలని ఇసికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో కోర్టుకు ఇసి చెప్పిన విషయం తెలిసిందే. లోపాలన్నీ సరి చేశామని కోర్టుకు కవిత తరఫు న్యాయవాదులు తెలిపారు. సాంకేతిక తప్పులు సరి చేసి ఇసికి మళ్లీ దరఖాస్తు చేశామని కవిత లాయర్లు తెలిపారు. కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు ఎన్నికల సంఘం తెలపడంతో విచారణ ముగిసింది. 

మన తెలంగాణ 19 Mar 2026 12:24 pm

ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు..

ఖమ్మం, ఆంధ్రప్రభ : పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర

ప్రభ న్యూస్ 19 Mar 2026 12:24 pm

Ustad Bhagath Singh : ఉగాది రోజున ఉస్తాద్ అలరించాడా?

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది

తెలుగు పోస్ట్ 19 Mar 2026 12:21 pm

Balakrishna |బ్లాక్ బస్టర్ సాధించేనా..?

Balakrishna | బ్లాక్ బస్టర్ సాధించేనా..? Balakrishna | బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోపై

ప్రభ న్యూస్ 19 Mar 2026 12:18 pm

ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ‘ధురంధర్ 2’కు ఎక్కువ స్క్రీన్లు?

తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది

తెలుగు పోస్ట్ 19 Mar 2026 11:58 am

kohli |అత‌నిలాంటోడిని చూడ‌లే..

kohli |అత‌నిలాంటోడిని చూడ‌లే.. తన ఉనికితో శక్తిని నింపుతాడుఅత్యుత్తమ వర్క్ ఎథిక్ కోహ్లీదే..ఆర్‌సీబీ

ప్రభ న్యూస్ 19 Mar 2026 11:53 am

Wishes |తెలుగు ప్రజలకు మోడీ శుభాకాంక్షలు

Wishes | తెలుగు ప్రజలకు మోడీ శుభాకాంక్షలు Wishes | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 19 Mar 2026 11:42 am

Chandrababu : ఉగాది నాడు చంద్రబాబు పేదలకు గుడ్ న్యూస్

ఉగాది నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు

తెలుగు పోస్ట్ 19 Mar 2026 11:36 am

చెన్నూరులో ఉగాది వేడుకలు..

చెన్నూర్, ఆంధ్రప్రభ : పరాభనమ సంవత్సరం ఉగాది వేడుకలను చెన్నూరు పట్టణ ప్రజలు

ప్రభ న్యూస్ 19 Mar 2026 11:34 am

కవిత కొత్త పార్టీ పేరు 'తెలంగాణ ప్రజా జాగృతి'?

హైదరాబాద్: 'తెలంగాణ ప్రజా జాగృతి' పేరిట కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసి గుర్తు కేటాయించాలని ఇసికి కవిత దరఖాస్తు చేసుకున్నారు. తన పార్టీ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత దరఖాస్తులో లోపాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కవిత పిటిషన్‌పై ఇవాళ మరోసారి ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. 

మన తెలంగాణ 19 Mar 2026 11:32 am

ఉగాది రోజు ఇలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది..

ఊర్కొండ, ఆంధ్రప్రభ : నాడు తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగను జరుపు

ప్రభ న్యూస్ 19 Mar 2026 11:31 am

Ugadi : ఉగాది వేడుకల్లో చంద్రబాబు.. పంచాగ శ్రవణం.. సత్కారాలు

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి

తెలుగు పోస్ట్ 19 Mar 2026 11:29 am

Ugadi 2026: Wishes from Leaders, and a Big Job Calendar Boost

Ugadi marks the beginning of a new year for Telugu people. On March 19, 2026, people across Andhra Pradesh and Telangana welcomed the Sri Parabhava Nama Samvatsaram with devotion and joy. On this special occasion, several national and state leaders extended their heartfelt wishes. Prime Minister Narendra Modi greeted Telugu people and said Ugadi brings […] The post Ugadi 2026: Wishes from Leaders, and a Big Job Calendar Boost appeared first on Telugu360 .

తెలుగు 360 19 Mar 2026 11:28 am

'మాయి ముంత' అద్భుతమైన కథ: కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ జన జీవన ఆరాట పోరాటాలను కథలుగా మలుస్తున్న గొప్ప రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందనలు తెలిపారు. ​ఇటీవలే ఆయన రాసిన 'మాయి ముంత' కథలను చదివానని, అందులో మాయి ముంత, సావు దప్పు, జిద్దు వంటి కథలు తనని లోతుగా కదిలించాయని, అవి కేవలం కథలు కావు, మన అస్తిత్వపు వేదనలు అని అశోక్ ను ప్రశంసించారు. భారతీయ సాహిత్యంలో కలకాలం నిలిచిపోయే అద్భుతమైన రచనలివి అని కొనియాడారు. ​మట్టి పరిమళాల రచయిత అశోక్ కుమార్ కు కెటిఆర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

మన తెలంగాణ 19 Mar 2026 11:24 am

Ugadi : పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు ఇలా

పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు ఇలా ఉంటాయి

తెలుగు పోస్ట్ 19 Mar 2026 11:17 am

పాకిస్థాన్‌లో వర్షం బీభత్సం.. 20 మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని కరాచీలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు కురవడంతో పాటు ఈదురుగాలులతో 20 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ మీడియా తెలిపింది.  టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కింద కూర్చుని టీ తాగుతున్న వారిపై పైకప్పు, గోడ కూలిపోవడంతో 12 మంది మరణించారు. సయీదాబాద్ ప్రాంతంలోని మావచ్ గోత్ తో బలమైన గాలులు, ఉరుములు, వర్షాల కారణంగా రెండంతస్తుల భవనం కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాలను తొలగిస్తున్నాయని, శిథిలాల కింద మరికొంతమంది ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కరాచీలో గంటలకు 80 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో కరాచీలోని 60 శాతం ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరాచీ మేయర్ నగరంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. పాక్ లోని జంషోరో, హైదరాబాద్, తట్టా, సుజావల్, బాడిన్, మతియారీ, తండో ముహమ్మద్ ఖాన్, తండో అల్లా యార్, ఉమర్‌కోట్, థార్‌పార్కర్, సంఘర్, మీర్‌పుర్‌ఖాస్, నౌషాహ్రో ఫిరోజ్, షహీద్ బెనజీరాబాద్, దాదు ప్రాంతాలలో బలమైన గాలులు వీయడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

మన తెలంగాణ 19 Mar 2026 11:16 am

Good news | 10,060 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్

Good news | 10,060 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ Good news |

ప్రభ న్యూస్ 19 Mar 2026 11:15 am

Dhurandhar 2,Ustaad |పబ్లిక్ టాక్ ఇదే..

Dhurandhar 2,Ustaad | పబ్లిక్ టాక్ ఇదే.. Dhurandhar 2,Ustaad | ఉస్తాద్

ప్రభ న్యూస్ 19 Mar 2026 11:11 am

19thMarchCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

19thMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 19thMarchCartoon | ఆంధ్రప్రభ ఉగాది శుభాకాంక్షలునగరీకరణతో

ప్రభ న్యూస్ 19 Mar 2026 11:00 am

వైఎస్ జగన్ ఉగాది వేడుకలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.

తెలుగు పోస్ట్ 19 Mar 2026 10:56 am

మున్సిపల్ చైర్మన్ కు ఉగాది సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన

ప్రభ న్యూస్ 19 Mar 2026 10:51 am

కుటుంబం కోసం వలస వెళితే..

కుటుంబం కోసం వలస వెళితే.. -తండ్రిని కోల్పోయి తల్లి పోషణకు వలస వెళ్లి

ప్రభ న్యూస్ 19 Mar 2026 10:50 am

ఉగాది శుభాకాంక్షలతో గ్రామాభివృద్ధికి పిలుపు

ఉగాది శుభాకాంక్షలతో గ్రామాభివృద్ధికి పిలుపు నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలంలోని మేడపల్లి

ప్రభ న్యూస్ 19 Mar 2026 10:49 am

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం పొందిన ఉగాది పండుగ

ప్రభ న్యూస్ 19 Mar 2026 10:45 am

గిరిజన హాస్టల్‌లో మెనూ గందరగోళం

గిరిజన హాస్టల్‌లో మెనూ గందరగోళం స్టేషన్ ఘనపూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్

ప్రభ న్యూస్ 19 Mar 2026 10:41 am

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనుంది. యువగళం పాదయత్రలో మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకున్న సందర్భంగా గురువారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. కూటమి ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయుల పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో 9 వేల పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉందని తన సోషల్ మీడియా ఖాతాలో లోకేష్ పోస్టు చేశారు. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామని ప్రకటించారు. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తామని, సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామన్నారు. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందాలని సూచించారు. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుందని, తన మాట నేను నిలబెట్టుకున్నానని, ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసిందని, ఇక నిరుద్యోగులు పోటీప‌రీక్ష‌ల‌కు సిద్ధం కావాలని, తెలుగు ప్రజలంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. 

మన తెలంగాణ 19 Mar 2026 10:12 am

2026ugadi |పరాభవ నామ సంవత్సర రాశిఫలాలు – శుభ, అశుభ ఫలితాలు &శని పరిహారాలు

2026ugadi | రాశిఫలాలు: శని ప్రభావం, జాగ్రత్తలు & శుభఫలితాలు పూర్తి వివరాలు

ప్రభ న్యూస్ 19 Mar 2026 9:52 am

వేడెక్కిన బెంగాల్ రాజకీయాలు

పట్టు కోసం బీజేపీ వ్యూహాలుప్రతి వ్యూహాలతో దూకుడు మీదున్నతృణమూల్ కోల్‌కతా: ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భాజపా మధ్యే గట్టి పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇరు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో తలమునకలవుతున్నాయి. పట్టు నిలబెట్టుకోవడానికి తణమూల్ కాంగ్రెస్, పట్టు సాధించడం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కమలదళం మరోసారి ప్రధానంగా హిందుత్వ ఎజెండాతో బరిలో దిగుతోంది. ముస్లిం అనుకూల వైఖరిని ప్రదర్శిస్తుందంటూ సీఎం మమతకు […] The post వేడెక్కిన బెంగాల్ రాజకీయాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 9:49 am

నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం..

నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం.. చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడంలో

ప్రభ న్యూస్ 19 Mar 2026 9:43 am

Rain Alert : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. నేడు కూడా వానలే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వానలపై వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది

తెలుగు పోస్ట్ 19 Mar 2026 9:38 am

అక్షర్ అలా చేస్తేనే ఢిల్లీ గెలుస్తుంది: పుజారా

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా పలు కీలక సూచనలు చేశాడు. రానున్న ఐపిఎల్ సీజన్‌లో ఢిల్లీ ముందుకు సాగాలంటే కెప్టెన్ అక్షర్ పటేల్ తన పద్ధతిని మార్చుకోక తప్పదన్నాడు. అక్షర్ మైదానంలో చాలా ప్ర శాంతంగా ఉంటాడన్నాడు. అయితే ఐపిఎల్ వంటి తీవ్ర ఒత్తిడి ఉండే టోర్నీలో ఇలా ఉం డడం సరికాదన్నాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తూ సహచరుల్లో కొత్త ఉత్సాహం నింపాల్సిన బాధ్యత కెప్టెన్‌పై ఉంటుందన్నాడు. అక్షర్ మాత్రం ప్రశాంతంగా ఉంటూ ఆటగాళ్లలో ఎలాంటి ఉత్సాహం నింపడం లేదన్నాడు. ఇది జట్టుపై బాగానే ప్రభావం చూపుతుందన్నాడు. దీనికి కిందటి సీజన్‌లో ఢిల్లీ ప్రదర్శనే నిదర్శనమని పుజారా పేర్కొన్నాడు.

మన తెలంగాణ 19 Mar 2026 9:36 am

ఖతార్ చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడి

ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధపడుతున్న సౌదీ ఖతార్: ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు బుధవారం అర్ధరాత్రి దాడులు జరిపింది. తమ నేతలు లారిజానీ, నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా దాడులు చేపట్టింది. ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ ఆర్థికవ్యవస్థకు పునాది. ఈ దాడిలో భారీస్థాయిలో ఇది దెబ్బతిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. […] The post ఖతార్ చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 9:35 am

నేటి నుంచి భద్రాద్రిలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి

తెలుగు పోస్ట్ 19 Mar 2026 9:35 am

వేగవంతంగా నేవీ రాడార్ పనులు..

వేగవంతంగా నేవీ రాడార్ పనులు.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలో నేవీ

ప్రభ న్యూస్ 19 Mar 2026 9:24 am

Gold Prices Today : ఉగాది నాడు తీపి కబురు.. తగ్గిన బంగారం, వెండి ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

తెలుగు పోస్ట్ 19 Mar 2026 9:17 am

రోడ్డుపై పొంగి ప్రవహిస్తున్న మురుగునీరు..

రోడ్డుపై పొంగి ప్రవహిస్తున్న మురుగునీరు.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని

ప్రభ న్యూస్ 19 Mar 2026 9:03 am

ఉగాది పచ్చడి ఉన్నత జీవనానికి సంకేతం

సమస్త ప్రజానికం నూతన వస్త్ర ధారణ చేసి, భగవధ్యానం లో భాగంగా నూతన సంవత్సరాది స్తోత్ర పూజ చేస్తారు. దేవుని గదిలో మంటపాన్ని మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో నిర్మించి, అందులో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను ఇష్టదేవతారాధనతో బాటు పూజించి, తదనంతరం సూర్యభగవానుడికి మనస్పూర్తిగా నమస్కారం చేసుకుంటారు. తదనంతరం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి, రకరకాల పిండి వంటలు తయారు చేసి దేవతామూర్తులకు నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరిస్తారు. ఇలా ప్రతి సంవత్సరాదికీ పాటించి నిష్టగా పూజ చేస్తారు. మన పూర్వీకులు ఉగాది కార్యక్రమాలలో ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరాదికీ నిర్వహించేవారు. ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించాలి. ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతారని సంవత్సరాది స్తోత్ర పూజలోని భావం

మన తెలంగాణ 19 Mar 2026 9:02 am

ఉగాది ఎలా మొదలైందంటే...!

బ్రహ్మ ప్రళయం పూర్తైన తరువాత తిరిగి సృష్టి ప్రారంభమయ్యే సమయాన్ని ’బ్రహ్మకల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయాన్ని ‘ఉగాది‘ గా వ్యవహరిస్తారు. ’ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణిస్తాం. పురాణాల ప్రకారం ఉగాదికి అసలు పేరు యుగాది. అంటే యుగానికి ఆరంభమని అర్థం. ఉగాది అనే పేరులో ‘ఉగ‘ అనగా నక్షత్ర గమనం అని అర్థం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అనగా ఈ సృష్టి ఆరంభమైన దినమే ఉగాది పర్వదినంగా పరిగణించబడింది. యుగము అంటే ద్వయము లేక జంట అని కూడా అర్ధం వస్తుంది. వేదాలను హరించిన కారణంగా సోమకుడనే రాక్షసుడిని వధించిన మత్యావతారుడైన విష్ణువు, ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభ తరుణాన్ని పురస్కరించుకుని ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చింది. అదేరోజైన చైత్రశుక్ల పాడ్యమి నాడు ఈ విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. చారిత్రక వృత్తాంతం ప్రకారం చైత్రశుక్లపాడ్యమి అయిన ఉగాదినాడు శాలివాహన చక్రవర్తి పట్టాభిషిక్తుడై శాలివాహన యుగకర్తగా వర్థిల్లిన కారణం కూడా ఉగాది ఆచరించడానికి ప్రధాన కారణమంటారు. నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి: ధర్మసింధు కారులు పంచవిధులు సూచించిన విధంగా ఇప్పటికీ భారతీయులు ఉగాది ఆచరణ విధానం శాస్త్రోక్తంగా పాటిస్తారు. ప్రతీ ఒక్కరూ తమ తమ ఇళ్ళు శుబ్రపరుచుకుని తోరణాలతో అలంకరించుకుని, మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో ఇంటిని అలంకరిస్తారు. ఉగాది రోజున వేకువజామునే ప్రతి ఒక్కరూ తైలంతో, కుంకుడితో అభ్యంగన స్నానం చేస్తారు., నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధిగా భావిస్తారు. మహాలక్ష్మిదేవిని నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి స్నానం చేసినట్లైతే లక్ష్మి, గంగా మాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. మనిషికి చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు.. ప్రాణులన్నీ కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.

మన తెలంగాణ 19 Mar 2026 8:59 am

Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది

తెలుగు పోస్ట్ 19 Mar 2026 8:59 am

శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు

మార్చి 19 ఉగాది (శ్రీపరాభవ నామ సంవత్సరాది) 21 -డోలా గౌరీవ్రతం, రంజాన్ 23 మత్స్య జయంతి, లక్ష్మీపంచమి 27 సర్వేషాం శ్రీరామనవమి 29 సర్వేషాం ఏకాదశి ఏప్రిల్ 02 హనుమద్విజయోత్సవం 05 సంకష్టహర చతుర్థి 13 సర్వేషాం ఏకాదశి 15 మాస శివరాత్రి 19 పరుశురామ జయంతి 20 అక్షయతృతీయ, డోలా గౌరీవ్రతం 21 శంకర జయంతి 22 రామానుజ జయంతి 26 వాసవీ జయంతి 27 సర్వేషాం ఏకాదశి 30 నృసింహ జయంతి మే 01 మేడే (కార్మికుల దినోత్సవం) 01 వ్యాస పౌర్ణమి 04 వాస్తు కర్తరీ ప్రారంభం 05 సంకష్టహర చతుర్థి 11 హనుమజ్జయంతి అగ్ని కర్తరీ ప్రారంభం 13 సర్వేషాం ఏకాదశి 15 మాస శివరాత్రి వృషభ సంక్రమణం 25 అగ్ని కర్తరీ త్యాగ: 27 సర్వేషాం ఏకాదశి 29 వాస్తు(డొల్లు) కర్తరీ త్యాగ: జూన్ 03 సంకష్టహర చతుర్థి 11 సర్వేషాం ఏకాదశి 13 మాస శివరాత్రి శని త్రయోదశి 15 మిథున సంక్రమణం 16 బౌద్ధ, కల్కీ జయంతీలు 25 సర్వేషాం ఏకాదశి 27 శని త్రయోదశి 29 ఏరొక్క పూర్ణిమ వట సావిత్రీ వ్రతం జూలై 03 సంకష్టహర చతుర్థి 10 స్మార్తానామేకాదశి 11 మాధ్వ శ్రీవైష్టవానామేకాదశి 12 మాస శివరాత్రి 16 జగన్నాథస్వామి రథయాత్ర 17 కర్కాటక సంక్రమణం దక్షిణాయన పుణ్యకాలం 25 సర్వేషాం తొలికాదశి చాతుర్మాస్య వ్రతారంభ: 29 వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి ఆగష్టు 02 సంకష్టహర చతుర్థి సికింద్రాబాద్ మహంకాళి జాతర 09 సర్వేషాం ఏకాదశి హైదరాబాద్ మహంకాళి జాతర 11 మాస శివరాత్రి 12 చుక్కల అమావాస్య 16 నాగచతుర్థి 17 గరుడ, నాగ పంచమీలు సింహ సంక్రమణం 21 వరలక్ష్మీ వ్రతం 23 సర్వేషాం ఏకాదశి 26 ఋగ్వేదోపాకర్మ 28 రాఖీ పౌర్ణమి 31 సంకష్టహర చతుర్థి సెప్టెంబర్ 04 సర్వేషాం శ్రీకృష్ణాష్టమి 07 సర్వేషాం ఏకాదశి 09 మాసశివరాత్రి 10 పిఠోరీ వ్రతం 11 పోలాల అమావాస్య 13 సామోపాకర్మ 14 వినాయక చతుర్థి 15 ఋషి పంచమీ వ్రతం 17 కన్యా సంక్రమణం 18 జ్యేష్ఠాష్టమీ 22 సర్వేషాం ఏకాదశి 25 అనంత పద్మనాభ వ్రతం 26 ఉమా మహేశ్వర వ్రతం 27 మహాలయ పక్షారంభం 29 సంకష్టహర చతుర్థి అక్టోబర్ 06 సర్వేషాం ఏకాదశి 09 మాస శివరాత్రి 10 మహాలయ అమావాస్య 11 దేవీ శరన్నవరాత్రారంభం కలశస్థాపన 16 సరస్వతీ పూజ (మూలా) 17 త్రిరాత్ర కలశస్థాపన 18 దుర్గాష్టమి బతుకమ్మ పండుగ తులా సంక్రమణం 19 మహర్నవమి సుహాసినీ పూజ 20 విజయ దశమి (దసరా) మబలిదానములు 21 రాజ్ఞాం పట్టాభిషేకం 22 సర్వేషాం ఏకాదశి 24 శని త్రయోదశి 29 సంకష్టహర చతుర్థి నవంబర్ 05 సర్వేషాం ఏకాదశి 07 శని త్రయోదశి మాస శివరాత్రి నరక చతుర్దశీ స్నానం (తెల్లవారితే ఆదివారం అనగా) 08 దీపావళి పండుగ ధనలక్ష్మీ పూజలు 09 కేదార వ్రతం 10 బలి పాఢ్యమి ఆకాశ దీప వ్రతం ఆరంభం భగినీహస్త భోజనం 13 నాగచతుర్థి 17 వృశ్చిక సంక్రమణం 20 సర్వేషాం ఏకాదశి 21 చిల్కుద్వాదశి తులసీ వ్రతం ప్రారంభ: 24 వ్యాస పౌర్ణమి జ్వాలా తోరణం 27 సంకష్టహర చతుర్థి డిసెంబర్ 04 సర్వేషాం ఏకాదశి 07 మాస శివరాత్రి 15 సుబ్రహ్మణ్య షష్ఠి 16 ధనస్సంక్రమణం 20 సర్వేషాం వైకుంఠైకాదశి గీతా జయంతి 22 హనుమద్వ్రతం 23 దత్తాత్రేయ జయంతి 27 సంకష్టహర చతుర్థి 31 కాలభైరవాష్టమి జనవరి-2027 03 సర్వేషాం ఏకాదశి 06 మాస శివరాత్రి 14 భోగి మకర సంక్రమణం (రాత్రి 3:12) 15 -మకర సంక్రాంతి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం 16 కనుమ 16 కోనసీమ ప్రభల తీర్థం 17 ముక్కనుమ 18 స్మార్తా ఏకాదశి 19 మాధ్వ శ్రీవైష్ణవానాం ఏకాదశి 25 సంకష్టహర చతుర్ధి ఫిబ్రవరి - 2027 02 సర్వేషాం ఏకాదశి 04 మాస శివరాత్రి 11 వసంత పంచమి (శ్రీపంచమి) 13 రథ సప్తమి కుంభ సంక్రమణ 15 మధ్వ నవమి 17 సర్వేషాం ఏకాదశి 20 వ్యాస పౌర్ణమి 24 సంకష్టహర చతుర్థి మార్చి 04 సర్వేషాం ఏకాదశి 06 మాస శివరాత్రి శని త్రయోదశి 15 మీన సంక్రమణం 18 సర్వేషాం ఏకాదశి 20 దాక్షిణాత్యానాం కామదహనం శని త్రయోదశి 22 ళికోత్సవ: 25 సంకష్టహర చతుర్థి ఏప్రిల్ 02 సర్వేషాం ఏకాదశి 05 మాస శివరాత్రి 07 చైత్ర శుద్ద ఉగాది (శ్రీ ప్లవంగ నామ సంవత్సరాది)

మన తెలంగాణ 19 Mar 2026 8:54 am

Dhurandhar: The Revenge Movie Review:

Dhurandhar The Revenge Movie Review Dhurandhar is the biggest Indian hit of the year and the sequel titled Dhurandhar: The Revenge is releasing in just three months. The expectations are big and the advance sales are stupendous. Dhurandhar: The Revenge released with special paid premieres on March 18th evening. The film features Ranveer Singh in […] The post Dhurandhar: The Revenge Movie Review: appeared first on Telugu360 .

తెలుగు 360 19 Mar 2026 8:47 am

ఆ రెండు రాశుల వారు మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది

మేషరాశి ఆదాయం: 11 వ్యయం: 05 రాజ: 02 అవ: 04 అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదముల యందు జన్మించిన వారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుం ది. ఈ రాశి వారికి తృతీయంలో గురువు, చతుర్థంలో కేతువు, లాభస్థానంలో రాహువు, వ్య యంలో శని అలాగే జూన్ 2వ తేదీన గురువు తృతీయం నుండి చతుర్థంలోకి, డిసెంబర్ 5న రాహువు కేతువుల మార్పు, రాహువు దశమ స్థానంలో, కేతువు చతుర్థం స్థానంలో ఉంటారు. ఈ ప్రధాన గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగానే కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు ఊహించని విధంగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు ఉంటా యి. మీరు కష్టపడితేనే దానికి తగినట్టు విజయాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఏలిననాటి శని నడుస్తుంది. ఈ ఏలిననాటి శని కాలంలో ఫిజికల్గా యాక్టివ్ గా ఉండండి. శనికి బద్ధకస్తులు అంటే నచ్చదు. మీరు కష్టపడితేనే దానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తాడు. అదష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దు. గృహ యోగం, వాహన యోగం ఏర్పడుతుంది. అక్టోబర్ 30వ తేదీ తర్వాత గురువు నాల్గవ ఇంటి నుండి 5వ ఇంటిలోకి సంచరిస్తాడు. కెరియర్ పరంగా మంచి అభి వద్ధి, గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా శక్తి, ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి. మేష రాస్యాధిపతి బలం కలిగి ఉండటం వలన ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ ఇదే సమయంలో తొందర పాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాల పైన కుటుంబ విషయాలు పైన దష్టి పెట్టవలసి ఉంటుంది. సోదరి సోదరుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోయి రక్తసంబంధీకులతో సఖ్యత అనేది ఏర్పడు తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అవుతాయి. సంతానం యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరాశి వారికి ఏలిననాటి శని కొనసాగుతుంది కాబట్టి శనికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు కానీ వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అవివాహితులకు వివాహ కాలంగా చెప్పవచ్చు కానీ వివాహ నిశ్చయానికి, పెళ్ళికి సమయం కొంత ఎక్కువగా వుండవచ్చు. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు కొంత అభివృద్ధి సాధిస్తారు. ప్రజలలో ఆదరణ పొందుతారు. చేసే వ్యాపారాలు అభివృద్ధి పథంలో ఉంటాయి. విదేశాలలో ఉన్నవారికి వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాలతో పాటు బరువు బాధ్యతలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశాలున్నాయి. సినీకళా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా నూతన బాధ్యతలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగ, వ్యాపారాలు ఊపందు కుంటాయి. విద్యార్థినీ విద్యార్థులు కొంత శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో కొద్దిపాటి ఇబ్బందులు తప్పక పోవచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. తల్లిదండ్రుల సహకారంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళగలరు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. హెచ్1 బి వీసా, పి.ఆర్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకం ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తి స్తాయి. ఆరోగ్యం విషయంలో, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం మంచి అభివృద్ధిలోకి రావాలని మీరు ఎంత ప్రయత్నించినా సంతానం మీ మాట వినకపోవడం వలన మీరు వారి కోసం ఎంత శ్రమించినా అది వృథా అవుతుంది.అయితే వారిని దారిలో పెట్టడానికి ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది.ఈ రాశి వారికి ఓర్పు, సహనం చాలా అవసరం.వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అత మంచిది. విహార యాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందానికి, సంతోషానికి కారణం అవుతాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. స్వయం ఆర్థిక పురోగతి సాధిస్తారు. మీరు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. కళా, సాహిత్య రంగాలలోని వారు పేరుప్రఖ్యాతలు పెంచుకోగలుగు తారు. చార్టెడ్ అకౌంటెంట్స్, బ్యూటీపార్లర్ నిర్వాహకులు, వైద్యరంగంలో ఉన్నవారు, సాఫ్ట్‌వేర్ రంగంలోని వారు, అడ్మినిస్ట్రేషన్ రంగంలోని వారు బాగా రాణిస్తారు. స్వయం కృషితో మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐ.ఎ.ఎ స్., ఐ.పి.యస్. వంటి సివిల్ సర్వీస్‌లకు అతికష్టం మీద ఎంపిక అవుతారు. వివాహం విషయంలో జాతక పరిశీలన అలాగే కుటుంబ ప రంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిరోజు దుర్గస్తుతి పఠించడం, ఎరుపు వత్తులతో దీపారాధన చేయడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించడం, క్రీడారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వృశ్చికరాశి ఆదాయం: 11 వ్యయం: 05 రాజ: 02 అవ: 06 విశాఖ 4వ పాదము, అనూరాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదముల యందు పుట్టినవారు. వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశివారికి చతుర్థంలో రాహువు, పంచమంలో శని, అష్టమంలో గురువు, దశమంలో కేతువు ఉన్నారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది. సంవత్సర ప్రథమార్థంలో ఖర్చులు అధికంగా ఉంటాయి కావున ఈ రాశి వారు ఖర్చుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గురువు అష్టమ స్థానంలో ఉండటం మంచిది కాదు. ఆర్థికపరంగా అప్పులు చేయవలసి రావచ్చు. నూతన పెట్టుబడుల విషయాలలో కూడా ఈ రాశి వారు సంవత్సర ప్రథమార్థం వరకు దూరంగా ఉండటం మంచిది. ఛాయాగ్రహమైన రాహువు మాత స్థానంలో ఉంటాడు కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు అపార్థాలు వచ్చే అవకాశాలున్నాయి. జూన్ రెండవ తేదీ తర్వాత ద్వితీయ పంచమాధిపతియైన గురువు భాగ్య స్థానంలో ఉండటం వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రుణాలు చాలా వరకు తీర్చగలుగు తారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ పరంగా పదోన్నతి లభిస్తుంది. బదిలీలు కూడా ఉంటాయి. విదేశీ అవకాశాలు కలిసివస్తాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులకు, హోటల్‌మేనేజ్‌మెంట్, హోల్‌సేల్ రిటేల్ వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు సకాలంలో ప్రారంభించి మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థికలావాదేవీలు బాగుంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. నూతన గృహం, వాహనం, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ శ్రమకుతగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో వాతావరణం చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలను సవ్యంగా నడపగలుగుతారు. ఖర్చులకు తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ పొంతనలు చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ మీద బరువు బాధ్యతలు పెరుగుతాయి. డిసెంబర్ 5వ తేదీన రాహువు చతుర్థం నుండి తృతీయ స్థానంలోకి కేతువు దశమంనుండి భాగ్యస్థానంలోకి మారడం వలన చిన్నచిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. ఎన్నడూ లేని విధంగా అదృష్టం మీకు తోడవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చికరాశి వారు అదృష్టవంతులు. గురుగ్రహ అనుగ్రహంతో అన్నింటిలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. రాజకీయ పరమైనటువంటి చిక్కులు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. స్థిర చరాస్తుల విలువ పెరుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్నిజాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. థైరాయిడ్, బి.పి., షుగర్, ఇండైజిషన్, ఉదర సంబంధిత సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తుంది.ఈ రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. విద్యా పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు విదేశీ అవకాశాలు కలిసివస్తాయి.ద్వితీయార్థంలో వీసాకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తె అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంకోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలం- గా ఉంది. సివిల్ సర్వీస్‌లకు ఎంపిక అవుతారు. ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. పదిమందిలో మెచ్చుకోలుగా ఉంటారు. విద్యార్థినీ విద్యార్థులకు కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. ఏకాగ్రతను నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి. వైద్య విద్యను అభ్యసిస్తున్నవారు, సాఫ్ట్‌వేర్, మెకానికల్, కళాసాంస్కృతిక రంగంలో ఉన్నవారికి, బ్యూటీపార్లర్స్, కాస్మోటిక్స్, ఇ.ఎన్.టి, డెంటిస్ట్, గైనకాలజీ, ఆంకాలజీ మొదలైన రంగాలలో ఉన్న వారు మంచి అబివృద్ధి సాధిస్తారు. ప్రథమార్థంలో మరియు ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం, అలాగే రాహుకేతువులకు జప, దాన, తర్పణాలు చేయించడం అనేది చెప్పదగిన సూచన. స్త్రీలకు ప్రత్యేకం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎన్నో విషయాలు కలిసివస్తాయి. పాడి పరిశ్రమలో లాభాలు బాగుంటాయి. విద్యా సాంస్కృతిక విషయాలలో మార్పులు వస్తాయి. మీ వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, మనసులోని కొన్ని కోరికలు అనుకోకుండా నెరవేరడం జరుగుతుంది. వత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాభవం పెరుగుతుంది. శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉన్నప్పటికీ వత్తి, ఉద్యోగాలపరంగా బరువు బాధ్యతలు పెరగడం, ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి. కొన్ని విషయాలలో మీ శ్రమకి తగిన ఫలితం లభించదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బాగానే ఉంటాయి. నిర్మాణ రంగంలో రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు, నీటికి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి, ఐ.వి.ఎఫ్ కోసం వెళ్ళేవారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది, వాటి విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తి స్తారు. ఆర్భాటాలకు, పొగడ్తలకు దూరంగా ఉండటం చెప్పదగినది. దూరప్రయాణాలు కలిసివస్తాయి. ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చతుర్థాధిపతియైన రాహువు డిసెంబర్ 5న తృతీయ స్థానంలోకి రావడం వలన సోదరసోదరీమణుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం లేకపోలేదు.ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చెప్పదగినది. ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.  

మన తెలంగాణ 19 Mar 2026 8:46 am

ఉస్తాద్ భగత్ సింగ్ మానియా..

ఉస్తాద్ భగత్ సింగ్ మానియా.. విజయవాడలో అభిమానుల హోరు..థియేటర్ల వద్ద హద్దుల దాటిన

ప్రభ న్యూస్ 19 Mar 2026 8:42 am

Ugadi : తెలుగు ఏడాది ప్రారంభమయ్యే పండగ ప్రత్యేకత ఏంటంటే?

తెలుగు సంవత్సరాదిని ఉగాది అంటారు

తెలుగు పోస్ట్ 19 Mar 2026 8:39 am

విద్యానిలయంలో.. ఉగాది వేడుకలు..

విద్యానిలయంలో.. ఉగాది వేడుకలు.. కుంటాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కుంటాల శాంతి

ప్రభ న్యూస్ 19 Mar 2026 8:35 am

Telangana : చీఫ్ సెక్రటరీ పదవీ కాలం పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది

తెలుగు పోస్ట్ 19 Mar 2026 8:34 am

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యమే మహాభాగ్యం..

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యమే మహాభాగ్యం.. కుంటాల, ఆంధ్రప్రభ : ప్రకృతి వ్యవసాయం ద్వారా

ప్రభ న్యూస్ 19 Mar 2026 8:27 am

Ugadi : ఉగాది అంటే పచ్చడి.. దాని ప్రత్యేకతలు తెలుసా?

ఉగాది... యుగానికి ఆది అని అర్థం

తెలుగు పోస్ట్ 19 Mar 2026 8:25 am

ఆదర్శ పాఠశాల్లో ఉగాది వేడుకలు..

ఆదర్శ పాఠశాల్లో ఉగాది వేడుకలు.. కుంటాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కుంటాల

ప్రభ న్యూస్ 19 Mar 2026 8:14 am

LPG Gas : ఎల్.పి.జి గ్యాస్ ఏటీఎంలు... తెలుగు రాష్ట్రాల్లో త్వరలో

పెట్రోలియం శాఖ భారత్ లో ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్ల ఏటీఎంలను ప్రారంభించింది

తెలుగు పోస్ట్ 19 Mar 2026 8:11 am

డాక్టర్ టి జీవన్ రావుకు సన్మానం..

డాక్టర్ టి జీవన్ రావుకు సన్మానం.. కుంటాల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర

ప్రభ న్యూస్ 19 Mar 2026 8:05 am

Ugadi : పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుందంటే?

ఈ ఉగాది వచ్చే ఏడాదిని పరాభవ నామ సంవత్సరం గా పిలుస్తున్నారు

తెలుగు పోస్ట్ 19 Mar 2026 8:05 am

Telangana : తెలంగాణ డీజీపీ నియామకానికి తుది రూపు

తెలంగాణలో కొత్త డీజీపీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది

తెలుగు పోస్ట్ 19 Mar 2026 7:56 am

ఆస్తిపై ఆశ... అక్కను చంపేసి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి చెరువులో పడేశాడు

రంగారెడ్డి: అండగా ఉండాల్సిన సోదరుడు అక్క ఆస్తిపై కన్నేసి ఆమెను హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో పడేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాజస్థాన్‌కు చెందిన లీలాదేవీ (40) అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తోంది. రంగారెడ్డి జిల్లా ఎల్‌బి నగర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. 2018లో లీలా దేవి భర్త చనిపోవడంతో బాధ్యతలు ఆమెపై పడ్డాయి. ఆమెకు అండగా ఉంటానంటూ వరసకు సోదరుడు అయ్యే పుష్పరామ్ ముందుకు వచ్చాడు. లీలా దేవి వద్ద డబ్బులు ఉండడంతో తన సోదరుడు పుష్పరామ్‌తో కలిసి అబ్దుల్లాపూర్‌మెంట్ మండలం బాటసింగారంలో 120 గజాల ఇల్లు కొనుగోలు చేశాడు. పుష్పరామ్ తెలివిగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. బాట సింగారంలో లీలాదేవి కిరణాషాపు నిర్వహిస్తున్నారు. తన సోదరుడు పుష్పరామ్ కుటుంబంతో కలిసి లీలాదేవి కలిసి ఉంటుంది. ఆస్తిపై కన్నేసిన పుష్పరామ్ తన సోదరిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. దుకాణంలో పని చేసే రాజేశ్ కుమావత్, సునీల్ కుమార్‌లతో కలిసి లీలాదేవిని హత్య చేశారు. మృతదేహాన్ని ఇంట్లో గుట్టుగా దాచారు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన ఆమె పిల్లలు తన తల్లి ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఆమె ఎవరితోనే వెళ్లిపోయిందని నిందలు వేశారు. రెండో రోజుల తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి చెరువు, తూములో పడేశారు. తన సోదరి లీలాదేవి కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. వెంటనే అనుమానంలో పుష్పరామ్, రాకేశ్ కుమావత్, సునీల్‌కుమార్‌లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. నిందితులు నిజాలు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మన తెలంగాణ 19 Mar 2026 7:50 am

Ugadi 'పరాభవ' నామ సంవత్సరం ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా?

ఉగాది పండుగ నేడు అందరూ జరుపుకుంటారు.

తెలుగు పోస్ట్ 19 Mar 2026 7:37 am

పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్..

కారకులైన నలుగురి ఉపాధ్యాయుల సస్పెన్షన్ ఆర్మూర్, మార్చి 18(జనంసాక్షి): విద్యార్థులను పరీక్షల్లో గట్టెక్కించి పాస్ చేయించాలన్న ఆతృత కాస్త ప్రభుత్వ ఉపాధ్యాయుల సస్పెండ్ కు దారితీసింది. వివరాల్లోకి …

జనం సాక్షి 19 Mar 2026 7:35 am

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు..

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రారంభమవుతోంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు. గత సంవత్సరం ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించామని సిఎం గుర్తు చేశారు. ఈ ఏడాదిలో రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా అందరూ ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సిఎం అన్నారు.

మన తెలంగాణ 19 Mar 2026 7:10 am

ఉగాది పర్వదిన శుభాకాంక్షలు..

ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.. ములకలపల్లి, ఆంధ్రప్రభ : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ

ప్రభ న్యూస్ 19 Mar 2026 7:05 am

2029లో కూడా బరాబర్ తొక్కేస్తా

 హిల్ట్, టిడిఆర్‌పై ఏ విచారణకైనా సిద్ధం ఏ విచారణ కావాలో ప్రతిపక్ష నాయకులు లేఖ ఇవ్వాలి విచారణకు వెనకాడినా, వెనక్కి తగ్గినా క్షమాపణ చెబుతాం విపక్ష నేత సమయం, సందర్భం లేకుండా నచ్చినట్లు మాట్లాడుతున్నారు ఎంతో కష్టపడి కెసిఆర్‌ను మహబూబ్ నగర్ ఎంపిగా గెలిపించాం ఆరు గ్యారంటీల్లో ఒక్కటి మినహా అన్నీ అమలు చేస్తున్నాం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సిఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాల తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం.. వాయిదా మనతెలంగాణ/హైదరాబాద్: నన్ను తొక్కాలనుకున్న వారిని తొక్కుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అలాగే, 2029లో కూడా మళ్లీ బరాబర్ తొక్కుకుంటూ మళ్లీ అధికారంలోకి వస్తామని, 2034 వరకు తామే అధికారంలోకి ఉంటామని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను వారసత్వంగా పదవిలోకి వచ్చిన వ్యక్తిని కాదన్నారు. మీ మాదిరిగా ఎవరి దయాదాక్ష ణ్యాలతో ఈ స్థాయికి రాలేదన్నారు. కనీసం వార్డుమెంబర్‌గా కూడా గెలవని వ్యక్తిని వైఎస్‌ఆర్ దయవల్ల ఏకంగా మత్రి అయ్యారని హరీష్‌రావును దెప్పిపొడుస్తూ, సిరిసిల్లలో కెటిఆర్ చంద్రబాబు దయతో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నేను ఎంతో కష్టపడి కెసిఆర్‌ను మహబూబ్‌నగర్ ఎంపిగా గెలిపించానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు ఇప్పటికే ఎన్నోసార్లు బుద్ధిచెప్పారని సిఎం అన్నారు. ప్రజలు తమ తీర్పుతో ఎన్నిసార్లు బుద్దిచెప్పినా బిఆర్‌ఎస్ నేతల తీరు మారడం లేదన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు పరివారం, పలహారం అన్నట్టుగా సాగిందని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాత్రి సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పైన ముఖ్యంగా కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావుల వైఖరిలను ఎండగడుతూ సిఎం రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. జీతభత్యాలపై సభలో చర్చ జరగాలి జీతభత్యాలపై సభలో చర్చ జరగాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉంటూ ఇప్పటివరకు కెసిఆర్ డిసెంబర్ 1, 2023 నుంచి 1 కోటి 6 లక్షల 56 వేల 674 రూపాయలు జీతభత్యాలు పొందారని, విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కెసిఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని, విధులకు హాజరుకాకుండా ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో తీసుకునే వారిపై సభలో చర్చ జరగాలని ఆయన అన్నారు. దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీపై సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తులతో విచారణకు సిద్ధం హిల్ట్, టిడిఆర్‌లపై ఏ విచారణకైనా సిద్ధమని అసెంబ్లీలో సిఎం రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. పారిశ్రామిక బదలాయింపులపై 2014 నుంచి ఇప్పటివరకు హిల్ట్ పాలసీపై విచారణకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై ఏ విచారణ కావాలో ప్రతిపక్ష నాయకులు లేఖ ఇవ్వాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. హిల్ట్ పాలసీపై సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తులతో విచారణ చేయించడానికి సిద్ధమని, కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలకు పంపించేందుకే హిల్ట్ పాలసీ తెచ్చామని సిఎం తెలిపారు. దీంతోపాటు టిడిఆర్ పాలసీపై కూడా విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విచారణకు వెనకాడితే, వెనక్కి తగ్గితే క్షమాపణ చెబుతామన్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా తెలంగాణ ‘పాలసీ డాక్యుమెంట్’ను ఆవిష్కరించామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అసెంబ్లీలో చేసిన ప్రసంగం చారిత్రాత్మకమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు పోలేదని బిఆర్‌ఎస్ పార్టీ తీరుపై సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షం కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుందనుకున్నానని, కానీ, వారు నియంత పోకడలతో బిఆర్‌ఎస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. విపక్షనేత సమయం, సందర్భం లేకుండా నచ్చినట్లు మాట్లాడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులని ఆయన తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి, అధికారం పీకేసినా అదే అహంకారంతో వ్యవహారిస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షం నియంతృత్వ ధోరణితో అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారనుకున్నామని, కొత్త గవర్నర్‌ను కలవడానికి ప్రతిపక్ష నేత కెసిఆర్ వస్తారనుకున్నామని, ఆయన రాకపోగా సభ సంప్రదాయాలను గౌరవించకపోడం తెలంగాణ సంస్కృతికి పూర్తి విరుద్ధమని సిఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. విపక్షాల తీరు 4 కోట్ల తెలంగాణ ప్రజలను నిరాశపరిచేలా ఉందన్నారు. విపక్ష నేత తీరు రాష్ట్రానికి మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్షం నియంతృత్వ ధోరణితో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని సిఎం ధ్వజమెత్తారు. కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభను తప్పుదోవ పట్టించడమే విపక్షాల పనిగా మారిందని ఆయన ఫైర్ అయ్యారు. ఏఐ సంక్షోభం ముంచుకొస్తుంది ఏఐ సంక్షోభం ముంచుకొస్తుందని, ఏఐ ద్వారా లక్షలాది ఉద్యోగాలు పోయి నిరుద్యోగ సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా విజన్ డాక్యుమెంట్‌ను సభలో ప్రవేశపెట్టామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఏ ప్రణాళికలోనైనా రాజకీయం, స్వార్థం, అధికారం కోల్పోయామన్న బాధనే విపక్షాల మాటల్లో కనిపిస్తోందని ఆరోపించారు. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047లో తెలంగాణను మూడు భాగాలుగా విభజించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడిదారులు ఎక్కువగా హైదరాబాద్ వైపు చూస్తున్నారని, అందుకు తగ్గట్టుగానే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. క్యూర్‌ను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ అర్బన్ ప్రాంతం క్యూర్‌ను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లోని పరిస్థితులు మనకు కనువిప్పు కావాలన్నారు. ముందుచూపులో భాగంగానే హైదరాబాద్‌లో చెరువులను పునరుద్ధరిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చెరువులను కబ్జాల చెర నుంచి విడిపించి పునరుజ్జీవనం చేస్తున్నామని, బతుకమ్మకుంట, నల్లచెరువు, బుమ్రుఖ్‌ఉద్దౌలా చెరువులను పునరుద్ధరించామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు హైదరాబాద్‌లో నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని గతంలో కెసిఆర్ ప్రకటించారని ముఖ్యమంత్రి తెలిపారు. నాలాలపై నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చాలని గతంలో కెటిఆర్ ఆదేశాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ కార్యాచరణనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. గతంలో వాళ్లు చెప్పిన మాటలనే ఇవాళ తప్పుపడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బిజెపి నేతలు సబర్మతి, గంగానది, యమున ప్రాజెక్టులను సమర్థించి మూసీ ప్రాజెక్టును ఎందుకు తప్పుపడుతున్నారని సిఎం ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ముంపు, కాలుష్యం సమస్యను పరిష్కరించాలని నిర్ణయించినట్లు సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే భారీ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. భవిష్యత్ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు భవిష్యత్ ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. విద్య, సాగునీటి రంగాలకు కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే దేశంలో అనేక భారీ ప్రాజెక్టులు, ప్రముఖ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు వెలిశాయని ఆయన పేర్కొన్నారు. నాడు దొరల ఆధీనంలో ఉన్న భూములను సైతం ఇందిరాగాంధీ పేదలకు పంచిపెట్టారని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. హరిత విప్లవం ద్వారా ఆకలి తీర్చడమే కాదు, దేశంలో సరిపడా ఆహార ఉత్పత్తి జరిగేలా చేశారన్నారు. ఫలితంగా ఇతర దేశాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరిందని ఆయన వివరించారు. ఇందిరాగాంధీ పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారని, ఆమె హయాంలో గరీబీ హఠావో, 20 సూత్రాల పథకం వంటివి మైలురాళ్లుగా నిలిచాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం మత కల్లోలాలతో ఉందని ఆయన కేవలం వారసత్వంగా ప్రధాని కాలేదని రేవంత్ అన్నారు. విద్య, సాగునీటితోనే దేశం ముందుకు వెళ్తుందని నెహ్రూ నమ్మారని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1950 నుంచి 1990 వరకు నెహ్రూ, ఇందిరా గాంధీల సేవలు దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయని, 1990 తర్వాతే భారత్ ప్రపంచంతో పోటీ పడే స్థాయికి చేరుకుందని ఆయన తెలిపారు. అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదని, తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి అని ఆయన అన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళికగా ఆయన తెలిపారు. అటువంటి గొప్ప సంకల్పాన్ని, పవిత్ర శాసన సభ వేదిక నుంచి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శుక్లాకు ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు. అప్పట్లో అక్రమం, ఇప్పుడు సక్రమం ఎలా అయ్యిందో చెప్పాలి గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై సభలో కెసిఆర్, కెటిఆర్‌లు మాట్లాడిన మాటలను సభకు సిఎం రేవంత్‌రెడ్డి వినిపించారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయాలని వారు మాట్లాడారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అప్పుడు సక్రమం అని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయ్యిందని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మీరు మాట్లాడిన మాటలను ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకున్నారా? మూసీ ఉప్పల్ భగాయత్ లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూసొద్దాం రండి, ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసే వారికి పన్ను మినహాయించామని ఆయన తెలిపారు. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నామని, మన నగరాన్ని మనం పరిరక్షించుకోకపోతే, చెరువులను పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరం మనల్ని క్షమించదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నందునే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని సిఎం అన్నారు. 1,200 మంది యువత బలిదానాలతో తెలంగాణ వచ్చిందని, పేద యువత కష్టపడి గ్రూప్-1 ఉద్యోగాలు సాధిస్తే వాటిపై కూడా కేసులు వేశారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 13 లక్షల కొత్త రేషన్‌కార్డులు ఇచ్చి, సన్నబియ్యం కూడా ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌కు మూడు బుల్లెట్ రైళ్లు ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ రహదారి నంబర్ కూడా కేటాయించారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.హైదరాబాద్‌కు మూడు బుల్లెట్ రైళ్లు రానున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నగరానికి పరిశ్రమలు తీసుకురావడానికి రేడియల్ రోడ్లు వేస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వేసే రోడ్లను కూడా తప్పు పడుతున్నారన్నారు. రైతును రాజుగా చేసేందుకే రూరల్ అగ్రికల్చరల్ రీజియన్‌పై దృష్టి సారించామన్నారు. టాటా సంస్థతో కలిసి ఐటీఐలను ఏటిసిలుగా అభివృద్ధి చేసి యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారం సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని గతంలో కెసిఆర్ స్వయంగా శాసనసభలోనే చెప్పారన్నారు. మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల రుణాలు ఇచ్చామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ కోసం రూ.1,900 కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వేసే రోడ్లను కూడా తప్పు పడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నగరానికి పరిశ్రమలు తీసుకురావడానికి రేడియల్ రోడ్లు వేస్తున్నామని సిఎం అన్నారు. దేశంలో 9వ స్థానానికి హైదరాబాద్ మెట్రో అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ లేదని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు మెట్రో విస్తరణను పట్టించుకోలేదని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మెట్రోను విస్తరించేందుకు తాము ఎంతో కష్టపడుతున్నామన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ మెట్రో ఢిల్లీ తర్వాత రెండోస్థానంలో ఉండేదని, హైదరాబాద్ మెట్రో ఇప్పుడు దేశంలో 9వ స్థానానికి పడిపోయిందన్నారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటే బిఆర్‌ఎస్ వాళ్లు ఓఆర్‌ఆర్‌ను అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఈనెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. 20వ తేదీన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనుంది. ఇలా ఉండగా శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు.

మన తెలంగాణ 19 Mar 2026 7:00 am

కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు

కాకరేపుతున్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఎమ్మెల్యేగా గెలవని జగ్గారెడ్డి వంద సీట్లు గెలిపిస్తాడా? మొన్న నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిపై విమర్శలు తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు పార్టీలో బీసీ నేతల పట్ల అక్కసు ఎందుకని మండిపాటు కాంగ్రెస్ వర్గాలలో అసెంబ్లీ లాబీలలో దీనిపైనే చర్చ పార్టీ పెద్దలు కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం మన తెలంగాణ/ హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చిచ్చుకు, చర్చకు దారితీసాయి. పీసీసీ అధ్యక్షునిగా మహేష్‌కుమార్‌గౌడ్ స్థానంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నియమిస్తే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీగా సమీకరణలు ఉపందుకున్నాయి. ఇటు పార్టీ వర్గాలలో, అటు అసెంబ్లీ లాబీలలోనూ బుధవారం ఈ అంశంపైనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లడమే కాకుండా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో పార్టీపరంగా 56 శాతం అవకాశం కల్పించిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీకి సారధ్యం వహిస్తోన్న బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నాయకత్వాన్ని తక్కువ చేసే విధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీలో బీసీల మనోవభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆ సామాజివర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు మండిపడుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పున్నా కైలాష్ నియమాకాన్ని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఒక కార్యక్రమంలో బహిరంగ సభలో అవమానించిన ఉదంతాన్ని తాజా వ్యాఖ్యల నేపథ్యంలో గుర్తు చేస్తున్నారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలువలేని జగ్గారెడ్డి, రాష్ట్రంలో వందసీట్లు ఎలా గెలిపిస్తారని బీసీ నాయకులు మంత్రి వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షునిగా నియామకం అయిన బీసీ నేత, పొన్నాల లక్ష్మయ్యను నల్లగొండ జిల్లా ప్రచారానికి రావద్దని అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు ఆ జిల్లాకు చెందిన రెడ్డి నాయకులు సహాయ నిరాకరణ చేశారని పార్టీలో బీసీ నేతలు గుర్తు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షునిగా మహేశ్‌కుమార్‌గౌడ్ ,సీఎం రేవంత్‌రెడ్డి వీరిద్దరూ సమన్వయం తో పని చేస్తూ ప్రతి ఎన్నికలలోనూ వరుస విజయాలు సాదించినప్పటికీ, కొత్త పీసీసీ అధ్యక్షునిగా జగ్గారెడ్డిని నియమించాలని బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలలోకి, ముఖ్యంగా బీసీ సామాజికవర్గలోకి తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా ఉన్నాయని పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. మంత్రి కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన రోజు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో సమావేశం కావడంతో ఈ వ్యాఖ్యల విషయంపై కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. గతంలో పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి నియామకం అయినప్పుడు కూడా పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా కోమటిరెడ్డి ఇదే మాదిరిగా తీవ్ర ఆరోపణలు చేసిన విషయాన్ని పార్టీ పెద్దలవద్ద ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. తన శాఖకు సంబంధించి జీవోలు తనకు తెలియకుండానే వస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. మంత్రి క్రమశిక్షణారిహిత్యాన్ని అధిష్టాన పెద్దలు కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

మన తెలంగాణ 19 Mar 2026 6:50 am

వడగండ్లు.. కడగండ్లు

వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలు భారీ వర్షానికి 150 మేకల మృత్యువాత దెబ్బతిన్న కూరగాయలు, మొక్కజొన్న, వరి ఈదురుగాలులకు నేలరాలిన మామిడి హైదరాబాద్‌లోనూ వర్షం 22 వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక  రాష్ట్రంలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన అకాల వర్షాలు అపార నష్టాన్ని కలిగించాయి. వడగండ్ల వానలు అన్నదాతకు కడగండ్లనే మిగిల్చాయి. వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో అనేక చోట్ల మొక్కజొన్న నేలకొరిగింది. మామిడి నేలరాలింది. కూరగాయల సాగు దెబ్బతినింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి మూగజీవాలు బలయ్యాయి. వికారాబాద్ జిల్లా పుడూరు మండలంలో 150 మేకలు చనిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, వనపర్తి, గద్వాల తదితర జిల్లాల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. మన తెలంగాణ / న్యూస్ నెట్‌వర్క్ : అకాల వర్షంతో రైతులకు అపారనష్టం కలిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన వివిధ రకాల పంట చేతికొచ్చే దశలోనే ప్రకృతి కన్నెర్ర చేసింది. వడగండ్లు, ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షం రైతులకు శాపంగా మారింది. హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున పంటనష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, మంగపేటల్లో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలరాలింది. వీణవకంలోన అపర పంట నష్టం జరిగింది. నర్సింగాపూర్‌లో మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. కొన్ని చోట్ల మామిడి పిందెలు రాలిపోవడంతో రైతులు ఆవేన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వడగండ్ల వానకు చేతికి వచ్చిన పంట నేల రాలింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో అకాల వర్షానికి మిర్చి రైతులు విలవిలలాడారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో మంగళవారం రాత్రి సమయంలో పిడుగు పడి ఆవు మృతి చెందింది. అకాల వర్షానికి, ఈదురు గాలులకు మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. వడగండ్ల వానకు సదాశివపేట మండల పరిథిలోని నాగులపల్లిలోని ప్రాథమిక పాఠశాల గోడ కూలింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మార్కెట్ యార్డులో రైతుల కంది పంట తడిసి ముద్దయింది. 150 మేకలు మృత్యువాత వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని నిజాంపేట్‌మేడిపల్లి గ్రామ శివార్‌లో నియోజకవర్గంలోని చౌడాపూర్ మండలం కొత్తపల్లిలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులకు మేకలు మృతి చెందాయి. పరిగి మండల పరిధిలోని ఆయా గ్రామాలలో తీవ్రంగా పలు రకాల పంటలు, కూరగాయలు నేలమట్టమై నష్టం వాటిల్లింది. పాల్కంపల్లి, నర్సయ్యగూడ, రాపోల్, తదితర గ్రామాల్లో వేసిన పంట పూర్తిగా దెబ్బతింది. నర్సయ్యగూడలో పిడుగు పడి గ్రామంలో ప్యాట శ్రీనివాస్‌కు చెందిన రూ. 60 వేల విలువ చేసే ఆవు మృతి చెందింది. షాద్ నగర్ నియోజకవర్గంలో మామిడి తోట, వరి, మొక్కజొన్న, టమాట మిరపకాయ వంటి పంటలు దెబ్బతిన్నాయి.

మన తెలంగాణ 19 Mar 2026 6:40 am

ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి హతం బషెర్ అణు కేంద్రంపై దాడులు గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ దాడుల్లో ఖతార్ చమురు క్షేత్రం ధ్వంసం కువైట్ యువరాజుతో ప్రధాని మోడీ చర్చలు హర్మూజ్ జలసంధి భద్రతకే ప్రాధాన్యమని స్పష్టీకరణ జెరూసలెం: ఇజ్రాయెల్ సైనిక దాడులలో బుధవారం ఇరాన్ ఇంటలిజెన్స్ వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. టెహరాన్ వద్ద ఇజ్రాయెల్ తెల్లవారుజామున భీకర దాడులకు దిగింది. ఈ క్రమంలో ఇంటలిజెన్స్ మంత్రి హతులయాయరని వివరించారు. ఇది ఇరాన్‌కు అత్యున్నత స్థాయి నష్టం అని విశ్లేషించారు. తమ దాడులు మరింత విస్తృతం అవుతా యి. శత్రుపక్షాలు విస్తుపోయ్యేలా దెబ్బతీస్తామని ఇజ్రాయెల్ మంత్రి తెలిపారు. ఇరాన్ అత్యున్నత స్థాయి భద్రతా సంబంధిత వ్యక్తులు హతులు కా వడం వరుసగా రెండురోజుల్లో ఇది రెండో ఘటన అయింది. అయితే ఖ తీబ్ మృతిని ఇరాన్ అధికారికంగా నిర్థారించలేదు. ఇరాన్ బలగాలు బుధవారం పర్షియన్ గల్ప్, ఇజ్రాయెల్‌పై దాడులను ఉధృతం చేశాయి. వరుసగా మూడోరోజు కూడా ఇరాన్ విరుచుకుపడింది. టెల్ అవీవ్ వద్ద జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఇరాన్ అత్యంత అధునాతన మిస్సైల్స్‌ను ఈ క్రమంలో ప్రయోగించింది. ఇవి అన్ని కూడా ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులను తట్టుకుంటూ, తప్పించుకుంటూ ముందుకు సాగాయి. పరస్పర దాడుల తీవ్రతతో ఇప్పటి పోరు ఎప్పటిలోగా ఆగిపోతుందో తెలియని స్థితి నెలకొంది, మరో వైపు ఇజ్రాయెల్ లెబనాన్‌లో తమ దాడులను ముమ్మరం చేశాయి. ఇరాన్ మద్దతుగల హెజ్‌బోల్లా మిలిటెంట్లను గురిచేసుకున్నాయి. బీరూట్ ఇతర ప్రాంతాలో బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసం అయ్యాయి. ఇరాన్‌లో బషేర్ అను విద్యుత్ కేంద్రం ఆవరణపై ఓ క్షిపణి దాడి జరిగింది. ఈ క్రమంలో ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం అణు ధ్వంసం జరగలేదని వెల్లడైంది. అణు ప్రమాదాలు జరగకుండా వ్యవహరించాలని ఇరుపక్షాలకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) చీఫ్ రాఫెల్ గ్రాసీ విజ్ఞప్తి చేశారు, ఇరాన్ నుంచి అందిన సమాచారంతో ఆయన స్పందించారు. ఇరాన్‌లో ఇజ్రాయెల్ తరఫున వేగు చర్యలకు పాల్పడుతున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తికి మరణశిక్ష అమలు చేశారు. ఇజ్రాయెల్ మోసాద్ సంస్థకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడని పేర్కొంటూ కైరోష్ కెవ్యానిని చంపివేశారు. ఇరాన్‌కు చెందిన కీలక ప్రాంతాలను మోసాద్ గూఢచార సంస్థకు అందించాడనే విషయాన్ని నిర్థారించుకుని శిక్ష అమలు చేశారు. కోర్టు కాంప్లెక్స్‌పై దాడులు.. పౌరులు సిబ్బంది మృతి బుధవారం మధ్యాహ్నం ఇరాన్‌లోని లారెస్తన్‌లో ఓ కోర్టు కాంప్లెక్స్‌పై ఇజ్రాయెల్, అమెరికా సేనలు దాడులకు దిగాయి. కార్యాలయం పనిచేస్తున్న సమయంలో దాడులు జరిగాయి. ఈ దాడులలో పౌరులు, సిబ్బంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారని తెలిపారు. అమెరికా సైనిక స్థావరాలతో ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణుల దాడులు నిర్ణీత ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సౌదీలోని విస్తారిత తూర్పు ప్రాంతంపై ఇరాన్ దాడి జరిపింది. అక్కడి చమురు క్షేత్రాలపై , కువైట్, బహరైన్ లోని సైనిక కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. సౌదీ అరేబియా పలు బాలిస్టిక్ క్షిపణులను నేల కూల్చింది. ప్రత్యేకించి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ వైపు దూసుకువచ్చిన క్షిపణులను దెబ్బతీశారు. ఇక్కడ అమెరికా సైనిక బలగాలు, ఓ యుద్ధ విమానం ఉంటుంది. రియాద్‌లో ఓ దౌత్య సిబ్బంది క్వార్టర్స్‌పై దాడి జరిగింది. ఇక్కడ అమెరికా ఎంబసీ వారు, ఇతర విదేశీ దౌత్య సిబ్బంది నివాసం ఉంటున్నారు. లారిజనీ హత్యకు ప్రతీకారం మరో వైపు బుధవారం ఇరాన్ ఇజ్రాయెల్‌పై పలు ప్రతీకార దాడులకు దిగింది. తమ దేశ అత్యంత శక్తివంతమైన జాతీయ భద్రతా మడలి కార్యదర్శి లారిజనిని ఇజ్రాయెల్ దాడులలో చంపివేయడంపై భగ్గుమంటూ దాడులు జరిగాయి. సెంట్రల్ ఇజ్రాయెల్‌పై తాము పలు వార్‌హెడ్స్‌తో దాడికి దిగినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులలో మృతి చెందిన లారిజనీ, ఖతీబ్‌లపై అమెరికా ఇప్పటికే అమెరికా నుంచి నిషేధిత వ్యక్తుల కఠిన చర్యలు ప్రకటించింది. బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ మరోసారి దాడులకు దిగింది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ వివరాల ప్రకారం ఇప్పటివరకూ జరిగిన దాడులలో 1300 మందికి పైగా ఇరానీయన్లు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. నిర్వాసితులు అయ్యారు. ఇజ్రాయెల్ సైనిక దాడులు..  ఇరాన్, ఖతార్ చమురు క్షేత్రంలో మంటలు దుబాయ్: ఇరాన్, ఖతార్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న సముద్ర తీర సహజవాయువు ఉత్పత్తి కేంద్రం సౌత్ పార్స్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ బుధవారం దాడులకు దిగింది. ఈ ఘటనపై ఖతార్ తీవ్రంగా మండిపడింది. ఇజ్రాయెల్ చర్యను ఖండిస్తున్నామని ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ ప్రకటన వెలువరించారు. ఈ ఫీల్డ్‌కు చెందిన ఇరాన్ వైపు ఉన్న భాగం దగ్ధం అయిందని తెలిపారు. ప్రస్తుత విస్తారిత ఉద్రిక్తతల దశలో ఇటువంటి దాడుల ఘటన అత్యంత ప్రమాదకరం అని అల్ అన్సారీ విమర్శించారు. ప్రపంచ ఇంధన వ్యవస్థకు ఇది పెను ముప్పు కల్గిస్తుంది. బాధ్యతారహిత ఘటన అని తెలిపారు. ఇరాన్ జరిపిన దాడులలో దుబాయ్ వద్ద ఉన్న తమ స్థావరంలో కొద్దిగా మంటలు చెలరేగాయని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనెస్ వెల్లడించారు. అయితే ఎటువంటి నష్టం జరగలేదన్నారు. పశ్చిమ దేశాలకు మార్గమధ్యపు మజిలీ అయిన అల్ మిన్హాద్ ఎయిర్ బేస్ వద్ద పేలుళ్లు జరిగాయి. సౌదీ అరేబియాకు చెందిన సమ్రేఫ్ రిఫైనరీ, జుబాలీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన అల్ హసన్ గ్యాస్ ఫీల్డ్ , ఖతార్‌లోని రిఫైనరీ, పెట్రో కెమికల్ విభాగాలను దెబ్బతీస్తామని ఇరాన్ హెచ్చరించింది. కువైట్ యువరాజుతో ప్రధాని మోడీ చర్చలు న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం కొనసాగుతున్న నేపథ్యంలో కువైట్ యువరాజు షేక్ అల్ ఖలేద్ తో టెలిఫోన్ ద్వారా ప్రధాని నరేంద్రమోడీ సంభాషించారు. పశ్చిమాసియాలో యుద్ధం మూడు వారాల క్రితం ప్రారంభమైన తరువాత కువైట్ యువరాజుతో మోడీ మాట్లాడడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సురక్షితంగా,స్వేచ్ఛగా సాగడమే తమ ప్రథమ ప్రాధాన్యతగా మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవల ఎదురవుతున్న సవాళ్లపై ఇరువురు నేతలు తమ ఆందోళన పంచుకున్నారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం దౌత్యపరమైన చర్చలు, నిరంతరం కొనసాగడం అత్యంత అవసరమని ఇరువురు ఏకీభవించారు. ఇదే క్రమంలో కువైట్‌లో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రత, సంక్షేమం కోసం కువైట్ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతుకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈద్ పండగను పురస్కరించుకుని కువైట్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ , రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం సాగుతున్న యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాకు చెందిన సౌదీ అరేబియా, బహ్రయిన్, యుఏఇ, ఒమన్, జోర్డాన్, ఇజ్రాయెల్, ఇరాన్ తదితర అనేక దేశాల నాయకులతో ప్రధాని మోడీ చర్చలు జరిపారు. 

మన తెలంగాణ 19 Mar 2026 6:40 am

వచ్చేవి జమిలి ఎన్నికలే!

మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ ఏర్పాటు చేశాం ఏలూరు ఎంపి బెయిల్ విషయంలో మా ప్రమేయం లేదు రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్షం డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైనా సరే, ఉక్కుపాదంతో అణిచివేస్తాం ఢిల్లీలో విలేకరులతో సిఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సిఎం భేటీ మన తెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదని, జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన లాంటి అంశాల నేపథ్యంలో 2029లోనే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై మాట్లాడుతూ ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పటికే 9 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేసులో ఏలూరు ఎంపి (పుట్టా మహేష్ కుమార్) పట్టుబడ్డారని, ఆయన స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారని, ఆయన బెయిల్ విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైనా సరే, ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. డ్రగ్స్ రవాణా, వినియోగం విషయంలో ఎంతటి వ్యక్తులనైనా వదిలిపెట్టబోమని సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు ముందే వస్తే తనకు సంతోషమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రెండోరోజూ బిజీబిజీ ఢిల్లీ టూర్‌లో భాగంగా రెండోరోజూ సిఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ గడిపారు. అంతకముందు పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని వారికి పరిచయం చేశారు. ఆప్యాయంగా పలకరించుకున్న సిఎం రేవంత్‌, మాజీ మంత్రి రోజా పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో సిఎం రేవంత్‌రెడ్డి వైసిపి నేత, మాజీ మంత్రి రోజా ఎదురుపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి రోజా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు.

మన తెలంగాణ 19 Mar 2026 6:30 am

పారిశ్రామిక ప్రగతికి ‘భవ్య’ పథకం

రూ.33,600 కోట్లతో కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్  చిన్నతరహా జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.2,585 కోట్లు ఉత్తరప్రదేశ్‌కు మరో జాతీయ రహదారి న్యూఢిల్లీ ః కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన(భవ్య) పథకాన్ని ఆవిష్కరించింది. రూ 33,600 కోట్ల ఈ పథకానికి కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ తరువాత విలేకరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో పారిశ్రామిక వాడలను చేపట్టి, ప్రారంభించేందుకు ఈ పథకం తీసుకువచ్చారు. ప్రత్యేకించి పారిశ్రామిక ప్రపంచ స్థాయి మౌలిక సాధనాసంపత్తి నెలకొల్పేందుకు , ఉత్పత్తి సామర్థం పెంచేందుకు , దేశ ప్రగతి పథం సక్రమ గతికి ఈ పథకం రూపొందించారని మంత్రి తెలిపారు. భవ్య స్కీంతో దేశవ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల వరకూ ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా కూడా ఉపాధికి అవకాశం ఉంది. వంద ఎకరాల నుంచి వేయి ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రీయల్ పార్క్‌ల ఏర్పాటుతో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది. ఒక్కో పార్క్‌కు వాటి స్థాయి బట్టి రూ కోటి వరకూ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని స్కీం గురించి మంత్రి తెలిపారు. రూ 2585 కోట్లతో చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి దేశంలో జలవిద్యుత్ ఉత్పాదన సంబంధిత చిన్న తరహా హైడ్రో పవర్ డెవలప్‌మెంట్ స్కీంను రూ 2585 కోట్లతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీం ద్వారా 1500 మైక్రోవాట్స్ మేర పునరుత్థాన ఇంధన ఉత్పత్తి లక్షం ఖరారు చేసుకున్నారు. దేశ పర్యావరణ పరిరక్షణ దిశలో ఈ స్కీంకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రజలు నిర్వాసితులు కాకుండా చేస్తూ, డ్యామ్‌ల నిర్మాణం లేకుండానే నదులపై ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారని మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఒక్కో జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా 1 మైక్రోవాట్ నుంచి 25 మైక్రోవాట్స్ మేర విద్యుత్ ఉత్పాదక సామర్థం ఉంటుంది. ఈ పధకాన్ని ఐదేళ్ల పాటు 203031 ఆర్థిక సంవత్సరం వరకూ అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పత్తి సేకరణ సామర్థం పెంపుదలకు చర్యలు తీసుకునే నిర్ణయానికి ఆమోదం తెలిపింది. దీని మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)కు రూ 1,718 కోట్లు కేటాయింపుల నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. యుపికి నాలుగులేన్ల రహదారి..హైవే 927 ఉత్తరప్రదేశ్‌కు ఉపయుక్తంగా ఉండేలా రూ 6969 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల జాతీయ రహదారినెంబరు 927 నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రహదారి ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి నుంచి బహరైచ్ వరకూ నిర్మిస్తారు. 101 కిలోమీటర్లకు పైగా ఉండే ఈ రోడ్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక, అత్యంత కీలక సంస్థల కేంద్రీకృత ప్రాంతాలకు మరింత రవాణా అనుసంధానత ఏర్పడుతుంది. 

మన తెలంగాణ 19 Mar 2026 6:20 am

why2fight |పంచాంగ శ్రవణంలో ట్రంప్ కి పంచ్.

why2fight |పంచాంగ శ్రవణంలో ట్రంప్ కి పంచ్. why2fight | అధ్యక్షుడి ఆత్మశోధనకిదే

ప్రభ న్యూస్ 19 Mar 2026 6:00 am

ugadi2026 |బాబుగారి కవిసమ్మేళనం-ఏపీ విజన్ సాక్షాత్కారం

ugadi2026 | బాబుగారి కవిసమ్మేళనం-ఏపీ విజన్ సాక్షాత్కారం ugadi2026 | ముఖ్యమంత్రే కవి…

ప్రభ న్యూస్ 19 Mar 2026 6:00 am

April23 |మోడీగారి ధ్యేయం-తమిళనాట కమల వికాసం

April23 | మోడీగారి ధ్యేయం-తమిళనాట కమల వికాసం April23 | దక్షిణాదిలో కమలానికి

ప్రభ న్యూస్ 19 Mar 2026 6:00 am

1ToAll |గ్యాస్ కోసం గుబులు… తీరేనా వంటింటి కష్టాలు?

1ToAll | గ్యాస్ కోసం గుబులు… తీరేనా వంటింటి కష్టాలు? 1ToAll |

ప్రభ న్యూస్ 19 Mar 2026 5:30 am

ఉమ్మడి పౌర స్మృతి సందడి

ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడానికి గుజరాత్ శాసనసభలో బుధవారం బిల్లు ప్రతిపాదించారు. ఈ బిల్లు వివాహం, విడాకులు, వారసత్వం, పెళ్లి చేసుకోకుండానే స్త్రీ పురుషుల సహజీవనం లాంటి అంశాలలో ఏక రీతి తీసుకురావడానికి ఉద్దేశించింది. అంటే కులం, మతం, జాతీ, స్త్రీ-పురుష భేదంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వివాహ చట్టం అమలుచేయడం గుజరాత్ బిల్లు మౌలిక లక్ష్యం. అంతకుముందు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ […] The post ఉమ్మడి పౌర స్మృతి సందడి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 12:13 am

భారత్ దౌత్యం పై విమర్శలు

అసద్ మిర్జా అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేసిన దాడులు భారతదేశాన్ని క్లిష్టపరిస్థితిలోకి నెట్టేశాయి. దౌత్యపరంగా కూడా భారత్ ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. ఒకవైపు ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు భారత్ వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. “వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి “ అంటూ గొప్పలు చెప్పుకున్న భారత్ ఈ సంక్షోభం సమయంలో మాత్రం స్పష్టమైన వైఖరి చూపలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ శక్తిగా నిలవాలంటే, భారత్ మరింత స్పష్టతతో సమగ్ర విధానంతో ముందుకు వెళ్ళాలి. కానీ భారత్ అలా చేయడం […] The post భారత్ దౌత్యం పై విమర్శలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 12:13 am

ఆధునిక వ్యవసాయంలో ఆశలు, అగాధాలు

డా॥ సూర్యదేవర రామకృష్ణ ఒకప్పుడు రైతు అంటే తన పొలంలో పండిన పంటలో ఒక భాగాన్ని పవిత్రంగా దాచుకుని, వచ్చే కాలానికి విత్తనంగా వాడుకునే స్వయం శక్తిపరుడు. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. తెల్లవారుజామున విత్తనాల దుకాణం ముందు క్యూ కట్టే రైతు కనిపిస్తున్నాడు. సమకాలిక వ్యవసాయ రంగంలో విత్తన కంపెనీలు కేవలం విక్రేతలుగా మాత్రమే కాకుండా, వ్యవసాయ గమనాన్ని శాసించే శక్తులుగా ఎదిగాయి. అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత వంటి ఆకర్షణీయమైన మాటలతో విత్తన […] The post ఆధునిక వ్యవసాయంలో ఆశలు, అగాధాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 12:12 am

భవన నిర్మాణ కార్మికులబానిసత్వం ఇంకెన్నాళ్లు ?

భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం నిర్మాణరంగం. ఈ నిర్మాణ రంగంలో కొన్ని కోట్ల మంది పనులు నిర్వహిస్తున్నారు. కన్‌స్ట్రక్షన్ రంగంలో కార్మికులకు పని ప్రదేశాలలో జరిగే ప్రమాదాల నివారణకు వారి సామాజిక భద్రతకు చట్టాన్ని రూపొందించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేశాయి. 1990లో ఏఐటియుసి నాయకత్వాలు భవన నిర్మాణ కార్మికుల రక్షణకు, ప్రమాదాల నివారణకు చట్టం అవసరమంటూ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆందోళనలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం […] The post భవన నిర్మాణ కార్మికులబానిసత్వం ఇంకెన్నాళ్లు ? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 12:12 am

నియంత పోకడలతో ప్రజాస్వామ్యం అపహాస్యం

కేసీఆర్ సభకు రావాలిగవర్నర్ ప్రసంగం అభివృద్ధికి మార్గదర్శిభవిష్యత్‌లో ఏఐ సునామీ: సీఎం రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్ : రాజులు… రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు మాత్రం పోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇప్ప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారని తెలిపారు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని, ప్రజలే తప్ప్పు చేశారని అనుకుంటున్నారని పేర్కొన్నారు. శాసనసభను ఉద్దేశించి బుధవారం ఆయన మాట్లాడుతూ నియంత పోకడలను […] The post నియంత పోకడలతో ప్రజాస్వామ్యం అపహాస్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 12:00 am

పోలీసులకు టీఏ బకాయిలు చెల్లించండి

కూనంనేనివిశాలాంధ్ర- హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవులు, టీఏ బకాయిలను పోలీసులకు త్వరితగతిన చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో బుధవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఖమ్మం జిల్లాలో కొంత వరకు బకాయిలు చెల్లించినప్పటికీ, కొత్తగూడెం జిల్లాలోని పోలీసులకు మాత్రం ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని, బకాయిలను ఎందుకు చెల్లించలేదో అర్ధం కాలేదన్నారు. కొత్తగూడెం పరిధిలోని 6వ బెటాలియన్‌లో సుమారు 450 మంది సిబ్బంది ఉన్నారని, […] The post పోలీసులకు టీఏ బకాయిలు చెల్లించండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:58 pm

‘ఎస్‌ఎల్‌బీసీ’ పూర్తి చేయండి : నెల్లికంటి

విశాలాంధ్ర- హైదరాబాద్ : నల్లగొండ జిల్లాపై చిన్న చూపు కూడకుండా రైతాంగానికి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు జీవనాడి అయిన ఎసఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనమండలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో కీలక ప్రాజెక్టులు నత్తనడకన సాగాయని, కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందనే భ్రమలో గత ప్రభుత్వం ఉండిపోయిందన్నారు. దీనివల్ల నల్లగొండ జిల్లాలోని […] The post ‘ఎస్‌ఎల్‌బీసీ’ పూర్తి చేయండి : నెల్లికంటి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:52 pm

యుద్ధం ఆపండి

వ్యతిరేక కమిటీ ఏర్పాటువిశాలాంధ్ర- హైదరాబాద్ : ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్‌ల యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దుంభవన్‌లో ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన బుధవారం యుద్ధ వ్యతిరేక కమిటీ ఏర్పడింది. పశ్చిమాసియా మధ్య- ప్రాచ్యంలో ఈ యుద్ధం వల్ల తీవ్రస్థాయిలో ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా భారతదేశంలో తీవ్రమైన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వంట గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక నగరాలు పట్టణాల్లో […] The post యుద్ధం ఆపండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:47 pm

నిర్వాసితుల త్యాగ ఫలమే పోలవరం

మూడోవిడతగా రూ.226 కోట్ల చెక్కు అందించిన సీఎం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వారి త్యాగ ఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతోందని అన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమయ్యారు. భూసేకరణ పునరావాస, పరిహార ప్యాకేజీ కింద మూడో విడతలో రూ.226.61 కోట్ల చెక్కును నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మూడో […] The post నిర్వాసితుల త్యాగ ఫలమే పోలవరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:31 pm

ప్రైవేట్ట్రావెల్స్ దందా

. భారీగా పెంచిన రవాణా చార్జీలు. సామాన్య ప్రయాణికుల ఇక్కట్లు. రవాణాశాఖ చోద్యం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వరుస పండగలు, వారాంతపు సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే సామాన్య ప్రయాణికులపై ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు నిర్దాక్షిణ్యంగా భారాలు మోపుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి నగరాలు, పల్లెలకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, టికెట్ ధరలను అమాంతం పెంచేస్తూ పండగ ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల నుంచి రాష్ట్రంలోని […] The post ప్రైవేట్ట్రావెల్స్ దందా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:27 pm

28, 29 తేదీల్లో ఐజేయూ 11వ ప్లీనరీ

. 34 ఏళ్ల తర్వాత విజయవాడలో. ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీ సమావేశం ఈ నెల 28, 29 తేదీలలో విజయవాడ (అమరావతి)లో జరగనుంది. ఈ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి బల్వీందర్ సింగ్ జమ్ము, కార్యదర్శి డి సోమసుందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలకు చెందిన […] The post 28, 29 తేదీల్లో ఐజేయూ 11వ ప్లీనరీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:24 pm

దివ్యాంగుల సాధికారతకు అండ

. ఆత్మగౌరవం పెంచేలా సంక్షేమ కార్యక్రమాలు. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు బస్సు ప్రయాణం. దివ్యాంగులకు సీఎం ఆత్మీయ విందు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా ఆత్మ స్థైర్యంతో పని చేసేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దివ్యాంగులు సాధికారత సాధించడానికి… వారి గౌరవాన్ని మరింత పెంచడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం […] The post దివ్యాంగుల సాధికారతకు అండ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:08 pm

తమిళనాట సీపీఐకి ఐదు స్థానాలు

23 సీట్లలో కాంగ్రెస్ పోటీ చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ ఐదు స్థానాల్లో పోటీ చేయనున్నది. ఈ మేరకు డీఎంకేతో ఒప్పందం కుదిరింది. సీట్ల సర్దుబాటుపై చర్పోచర్చల అనంతరం ఏకాభిప్రాయం కుదిరింది. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి భారత కమ్యూనిస్టు పార్టీ అంగీకరించింది. సీట్ల పంపకం ఒప్పందంపై డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్ సంతకాలు చేశారు. ఈ మేరకు డీఎంకే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అనంతరం […] The post తమిళనాట సీపీఐకి ఐదు స్థానాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:05 pm

23న సామ్రాజ్యవాద వ్యతిరేక దినం: సీపీఐ

ఉపాధి హామీ పునరుద్ధరణకు ఏపీలో పాదయాత్ర: రామకృష్ణ న్యూదిల్లీ: బ్రిటిష్ పాలకులను గడగడలాడించి, ఉరికంబాన్ని ముద్దాడిన అమర వీరులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ త్యాగాన్ని స్మరించుకుంటూ ‘షహీద్ దివన’ సందర్భంగా ఈనెల 23న సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని పార్టీ శ్రేణులకు సీపీఐ జాతీయ కార్యవర్గం పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వెనిజులా, ఇరాన్, పలస్తీనాపై అమెరికా యుద్ధోన్మాదాన్ని, ప్రపంచాన్ని శాశించాలనే ధోరణిని ఎండగట్టింది. ఈ విధానాలను ప్రతిఘటించడం అవసరమని […] The post 23న సామ్రాజ్యవాద వ్యతిరేక దినం: సీపీఐ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 10:58 pm

ఏటా రూ.20 వేల కోట్ల బిసిల బడ్జెట్ ఏమైంది: తలసాని

ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామన్న కామారెడ్డి బిసి డిక్లరేషన్ పరిస్థితి ఏమిటి బిసి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజుల బకాయిలు పది వేల కోట్లు ఎప్పుడు ఇస్తారు 42 శాతం బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం కండితుడుపుగా వ్యవహరించింది శాసనసభ జీరో అవర్‌లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గడచిన ఎన్నికలకు ముందు కామారెడ్డి బిసి డిక్లరేషన్‌లో తాము అధికారంలోకి రాగానే ప్రతి ఏటా రూ.20 వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను బిసిల కోసం కేటాయిస్తామని ఇచ్చిన వాగ్ధానం మేరకు ఇప్పటి వరకు ఎన్ని కోట్లు కేటాయించారో స్పష్టం చేయాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇలా ప్రతి ఏడాది బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు. శాసనసభలో బుధవారం జరిగిన జీరో అవర్‌లో సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న బిసిలకు మీరిచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని కోరారు. బిసి విద్యార్థులకు ఫీజులు అందక బకాయిలు పడి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. దాదాపు పది వేల కోట్లు ఫీజు బకాయిలు ఉన్నాయని తెలిపారు. తాను బిసిల ప్రతినిధిగా చెప్పే ఈ అంశం చాలా గంభీరమైందని పదే పదే చెబుతూ బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్దత లేకుండా బిసి రిజర్వేషన్లు ఎలా సాధ్యపడతాయని గతంలోనే తాము ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. చివరకు బిసిలంతా దగాపడి 42 శాతం రిజర్వేషన్లుకు నోచుకోని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో బిసిలకు ఎక్కువ కేటాయింపులు చేయడంతో పాటు బిసిలకు ఏటా రూ.20 వేల కోట్ల నిధుల కేటాయింపుపై ఇప్పుడైనా ప్రభుత్వం శాసనసభ వేదికగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిసిల పట్ల చులకన భావన వద్దని తలసాని కోరారు. సభ్యుడు తలసాని ప్రస్తావించిన అంశాలపై సభలో ఉన్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ సీనియర్ సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన అంశాలను తప్పకుండా సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళతానని అన్నారు. సీనియర్ సభ్యుడైన తలసానికి జీరో అవర్ అంటే తెలియనిది కాదని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం, సంబంధిత దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. 

మన తెలంగాణ 18 Mar 2026 10:55 pm

శత్రువును సమర్థంగా ఎదుర్కొంటాం

. మా రాజకీయ వ్యవస్థను అస్థిరపర్చలేరు. గల్ఫ్ చమురు క్షేత్రాలపై గురి పెడతాం. లారిజానీ, సులేమానీ హత్యకు తీవ్రస్థాయిలో ప్రతీకారం. అమెరికా, ఇజ్రాయిల్‌కు ఇరాన్ హెచ్చరిక. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిని చంపేశాం: ఇజ్రాయిల్. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై అమెరికా దాడులు తెహ్రాన్: అగ్ర నాయకత్వాన్ని కోల్పోయినాగానీ అత్యాధునిక యుద్ధ తంత్రంతో శత్రువులను సమర్థంగా ఎదుర్కోగలమని, వ్యక్తులను కాదు పటిష్ట వ్యవస్థలను నమ్ముకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రాజకీయ వ్యవస్థను అస్థిరపర్చడం అంత సులువు కాదని ఆ దేశ […] The post శత్రువును సమర్థంగా ఎదుర్కొంటాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 10:53 pm