SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

బెయిల్ రద్దు పిటిషన్: కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నందున ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కాకాణిని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూమిలో క్వార్ట్జ్ ఖనిజాన్ని […] The post బెయిల్ రద్దు పిటిషన్: కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 11:24 am

తెలంగాణలో భారీ వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు మొదలయ్యాయి

తెలుగు పోస్ట్ 31 Mar 2026 11:23 am

Andhra Pradesh : వారం రోజులు మాసం విక్రయాలపై నిషేధం

నందిగామ శివారు గ్రామంలో డయేరియా ప్రబలుతోంది

తెలుగు పోస్ట్ 31 Mar 2026 11:19 am

Zodiac Signs : మీ రాశిని చూసి దినఫలాలు తెలుసుకోవాలనుందా?

మంగళవారం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉండనుంది

తెలుగు పోస్ట్ 31 Mar 2026 11:11 am

వేలానికి ముందే అక్రమ ఇసుక రవాణా యత్నం విఫలం

నార్సింగి, ఆంధ్రప్రభ ; మండలంలో అక్రమ ఇసుకను బహిరంగ వేలానికి నిర్ణయించిన నేపథ్యంలో,

ప్రభ న్యూస్ 31 Mar 2026 11:11 am

Challapalli Ps Blast : చల్లపల్లి పీఎస్ లో పేలుడు Andhra Prabha Latest News

Challapalli Ps Blast : చల్లపల్లి పీఎస్ లో పేలుడు Andhra Prabha

ప్రభ న్యూస్ 31 Mar 2026 11:09 am

HYD |పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ చర్య

HYD | పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ చర్య HYD | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 31 Mar 2026 11:06 am

Vijay |నియమావళి ఉల్లంఘన ఆరోపణలు

Vijay | నియమావళి ఉల్లంఘన ఆరోపణలు Vijay | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 31 Mar 2026 11:04 am

కర్నూల్ జిల్లాలో బాలికపై ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చి

అమరావతి: ఆటో, ట్రాక్టర్ డ్రైవర్ కలిసి 14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేశారు. సదరు బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కర్నూలు జిల్లాలో ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ఆటో డ్రైవర్ బోయ మహేంద్ర ప్రతి రోజు తన ఆటోలో స్కూల్‌కు తీసుకెళ్లేవాడు. ఆమెకు మాయమాటలు చెప్పి బాలికను మహేంద్ర లొబరుచుకున్నాడు. అనంతరం అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ తెలుగు శివ కుమార్ కూడా మహేంద్ర ఈ విషయం చెప్పడంతో అతడు కూడా బాలికను బెదిరించి అత్యాచారం చేశారు. ఇద్దరు పలుమార్లు బాలికను బెదిరించి అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించారు. బాలిక ఒంట్లో నలతగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. బాలిక తల్లిదండ్రులను నిందితుల కుటుంబ సభ్యులు బెదిరించే అవకాశం ఉండడంతో నవజాత శిశువు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో వారిని ఉంచారు.

మన తెలంగాణ 31 Mar 2026 10:57 am

విమర్శలను పక్కన పెట్టి ముందుకు సాగుతా: నిహారిక

హైదరాబాద్: విమర్శలు వస్తున్నాయని ఆగిపోతే అక్కడే ఉంటాం. తాను ఏం చేసినా కొందరు విమర్శిస్తున్నారు. అటువంటి విమర్శలను, అలాంటివారిని పట్టించుకోవడం మానేసినట్లు నిర్మాత నిహారిక చెప్పారు. ఆమె సొంత బ్యానర్‌పై వస్తోన్న చిత్రం ‘రాకాస’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీమ్ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిహారిక పాల్గొని మాట్లాడుతూ… నిర్మాతగా కెరీర్ ప్రారంభించగానే తనకు […] The post విమర్శలను పక్కన పెట్టి ముందుకు సాగుతా: నిహారిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 10:57 am

ఇది ఆదర్శమే కాదు అవసరమే

తల్లిదండ్రుల సంరక్షణకు తెలంగాణ చారిత్రాత్మక చట్టం అమలులోకి తెచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాను ప్రత్యక్షంగా గమనించిన సంఘటనలను ఆయనే స్వయంగా చెబుతుంటే వృద్ధులైన తల్లిదండ్రులు ఎంత నిర్లక్షానికి గురవుతున్నారో తెలుస్తుంది. ‘ఒకాయన ప్రజాప్రతినిధిగా చాలా పైకి ఎదిగిండు, ఆయన తండ్రికి క్యాన్సర్ వస్తే అప్పుడు ఆయన మంత్రిగా ఉండి, తండ్రిని కనీసం పట్టించుకోలే.. తండ్రిని బజారుకు తీసుకెళ్లి పండ్లు కూడా కొనివ్వలేని పరిస్థితి ఆయనది.. ఇంట్లో తిండి పెట్టీ పెట్టక భార్య భయానికి తండ్రి యోగక్షేమాలు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఆయన చనిపోతే నాయకులంతా ఆ మాజీమంత్రిని పరామర్శ చేశారే తప్ప ఆ తండ్రి ఎలా చనిపోయాడో ఎవరూ తెలుసుకోలేదు.’ ఇలాంటి వాస్తవ సంఘటనలే తెలంగాణ ప్రభుత్వం తల్లిదండ్రుల సంరక్షణ చట్టం తీసుకురావడానికి దోహదం చేశాయి. తల్లిదండ్రుల భరణం, వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2007లో అమలులోకి తెచ్చింది. కానీ ఈ చట్టం అమలు కాగితాలకే పరిమితమైంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ప్రత్యేకత ఏమంటే ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, ఎంఎల్‌ఎలు వంటి ప్రజాప్రతినిధులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఉద్యోగుల జీతాల్లోంచి 15 శాతం లేదా రూ. 10 వేలు వంతున ఏది తక్కువ మొత్తం అయితే దానినే తల్లిదండ్రుల సంక్షేమం కోసం బదిలీ చేస్తారు. ఈమేరకు సమర్ధంగా నిర్వహించడానికి ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ప్రతిపాదించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. మాతృదేవోభవ, పితృదేవోభవ అనే ఆదర్శాన్ని తరచుగా ప్రస్తావించే మన దేశంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్య ఒక అత్యవసరాన్ని ప్రతిబింబిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తల్లిదండ్రుల సంక్షేమ చట్టం ఎందుకు సరిగ్గా అమలు కావడం లేదన్న ప్రశ్న ఎదురవుతోంది. అంటే అమలు చేసే యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించడమే. 2021లో దేశంలో నిర్వహించిన దీర్ఘకాలిక వృద్ధాప్య అధ్యయనం ప్రకారం 2020లో దేశంలో 5.2 శాతం మంది వృద్ధులు తమ కుటుంబీకుల నుంచే లేనిపోని మాటల వేధింపులకు గురయ్యారని తేలింది. ఇలాంటి వేధింపులు సర్వసాధారమైపోతున్నాయి. తెలంగాణలో ఇలాంటి మాటల వేధింపుల బాధితుల సంఖ్య 2.1 శాతం వరకు ఉందని అధ్యయనంలో బయటపడింది. బాధితులైన వయోవృద్ధుల్లో సగానికి పైగా తమను కుటుంబం నిర్లక్షం చేసిందని నివేదించారు. ఇప్పుడు ఆ వేధింపులు తెలంగాణలో 68% వరకు పెరిగిపోవడం విడ్డూరం. ఇవన్నీ ఆయా వృద్ధులు ఫిర్యాదులు చేస్తేనే తెలిశాయి. మరి వాస్తవానికి చాలావరకు ఫిర్యాదులు చేయలేని సంఘటనలు ఎన్నో ఉన్నా వెలుగు లోకి రావడం లేదు. దీనికి కారణం కుటుంబం పరువు పోతుందనే సామాజిక ధర్మం పాటించి సహనం వహించడం, అలాగే బయటకు చెప్పకూడదని ఒత్తిళ్లు రావడం అని తెలుస్తోంది. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సహజంగా ఉండవలసిన అనుబంధంలో చట్టం జోక్యం చేసుకోవలసిరావడం దురదృష్టకరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను ఎవరైతే నిర్లక్షం చేస్తున్నారో వారు సామాజిక వ్యతిరేకతను ఎదుర్కొంటే తప్ప వారికి గుణపాఠం రాదని ముఖ్యమంత్రి సీరియస్‌గా చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోక తప్పదు. తల్లిదండ్రులను, పెద్దలను దైవంతో సమానమైన ఉన్నత పీఠంపై మన భారత దేశ నాగరికతా సంస్కృతి పట్టంకట్టి ఆరాధిస్తోంది. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా నేడు చాలా మంది వృద్ధులు భావోద్వేగపరమైన వేధింపులను ఎదుర్కొంటుండడం అత్యంత శోచనీయం. తాము పెంచి పోషించిన పిల్లలే తమ సొంత ఆస్తిని గుప్పిటలో పెట్టుకుని తమకు పిడికెడు మెతుకులైనా పెట్టకుండా పీడించడం లేదా స్వంత ఇంటిలోనే నిలువనీడనీయకుండా చివరికి ఊరవతల శ్మశాన వాటికకు బతికి ఉండగానే తరలించడం వంటి దారుణాలు జరుగుతున్నాయి. ఈ అమానవీయ, నైతిక సంక్షోభం ఈ చట్టం వల్ల సమసిపోతుందా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. కేంద్రం 2021లో తల్లిదండ్రుల సంరక్షణ చట్టం ఎప్పుడైతే అమలులోకి తెచ్చిందో ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ తల్లిదండ్రుల సంరక్షణ చట్టాలు అమలులోకి వచ్చాయి. కానీ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటోంది. అయినప్పటికీ ఈ చట్టాన్ని సమస్య తీవ్రత దృష్టా పకడ్బందీగా అమలు చేయడం ప్రభుత్వాల కర్తవ్యం. ఈ చట్టంపై విస్తృత అవగాహన కల్పించి సజావుగా అమలయ్యేలా మద్దతు ఇవ్వాలి. ఎవరికి వారు సొంతంగా బతుకుదామని, ఎంతో కొంత సంపాదించుకుందామని స్వతంత్రంగా నిర్ణయించుకోవడంతోనే ఉమ్మడి కుటుంబాలు చిన్నచిన్న పరిమిత కుటుంబాలుగా చీలిపోతున్నాయి. ఈ కుటుంబాలు బాగా అభివృద్ధి సాధించాలని తాపత్రయం పడడంలో తప్పులేదు. కానీ తల్లిదండ్రులు తాము పంచి ఇచ్చిన ఆస్తులను తిరిగి అప్పచెప్పాలని అడగడం లేదు. కుటుంబంలో తమ స్థానాన్ని అడుగుతున్నారు. జీతం ఇచ్చే యజమానికోసం కొన్ని గంటలు పనిచేస్తాం. కానీ జీవితం ఇచ్చే తల్లిదండ్రుల కోసం ఒక్క నిమిషమైనా వెచ్చించలేమా? చట్టం పేరిట కుటుంబాలను బలవంతంగా మెడలు వంచినంత మాత్రాన తల్లిదండ్రులకు సంరక్షణ కల్పించినట్టు కాదు. విస్తృతమైన నాగరికతా సాంస్కృతిక పునరుద్ధరణ పుట్టుకు రావాలి. 

మన తెలంగాణ 31 Mar 2026 10:55 am

Young Actors missing Summer 2026

Several young actors of Telugu cinema have aimed to release their films in summer this year but most of them are missing the deadlines. Actors like Nani and Naga Chaitanya are occupied with big-budget films like The Paradise and Vrushakarma. Both these films were aimed for summer release but they were pushed because of the […] The post Young Actors missing Summer 2026 appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 10:54 am

Train |రాకపోకలకు తీవ్ర అంతరాయం

Train | రాకపోకలకు తీవ్ర అంతరాయం Train | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 31 Mar 2026 10:53 am

అకాల వర్షం.. భారీ నష్టం..

అకాల వర్షం.. భారీ నష్టం.. పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సోమవారం రాత్రి,

ప్రభ న్యూస్ 31 Mar 2026 10:51 am

Tragedy |భార్య, కుమారుడు మృతి.. కుమార్తె పరిస్థితి విషమం

Tragedy | భార్య, కుమారుడు మృతి.. కుమార్తె పరిస్థితి విషమం Tragedy |

ప్రభ న్యూస్ 31 Mar 2026 10:46 am

నిరుద్యోగ యువతకు అవకాశాలు..

నిరుద్యోగ యువతకు అవకాశాలు.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : సిద్దిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో

ప్రభ న్యూస్ 31 Mar 2026 10:45 am

పోచంపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సిద్ధం

రూ. 859.25 లక్షల బడ్జెట్‌తో పోచంపల్లి అభివృద్ధికి బాటలు భూదాన్ పోచంపల్లి, మార్చి 31 (జనం సాక్షి): పోచంపల్లి పురపాలక సంఘం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. …

జనం సాక్షి 31 Mar 2026 10:43 am

ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఆ.. ఇద్దరు పిల్లలు..

ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఆ.. ఇద్దరు పిల్లలు.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్

ప్రభ న్యూస్ 31 Mar 2026 10:35 am

బంగ్లాతో బంధం బలోపేతం కావాలి

బంగ్లాదేశ్‌లో 2026 సాధారణ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ మార్పులు భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. ఈ దశలో భావోద్వేగాల కంటే ఆచితూచి తీసుకునే వ్యవహారిక దృక్పథమే ప్రాధాన్యం పొందుతోంది. ప్రధానమంత్రి తారిక్ రెహ్మాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) తిరిగి అధికారంలోకి రావడం ఢాకా రాజకీయ పరిస్థితిని మార్చినప్పటికీ, ఇరుదేశాల మధ్య సహకారానికి ఉన్న ప్రాథమిక తర్కాన్ని మార్చలేదు. బదులుగా, పరస్పర అవసరాల ఆధారంగా మరింత మౌనంగా, లావాదేవీలకు దగ్గరగా ఉండే సంబంధం రూపుదిద్దుకుంటోంది. గత దశాబ్దానికి పైగా భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు షేక్ హసీనా, అవామీ లీగ్‌తో ఉన్న సన్నిహిత భాగస్వామ్యంపై ఆధారపడ్డాయి. భద్రత, కనెక్టివిటీ రంగాల్లో విశ్వాసం, సహకారం అత్యున్నత స్థాయికి చేరాయి. భారత వ్యతిరేక తిరుగుబాటుదారులపై హసీనా ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు, ఆర్థిక మౌలిక వసతుల బలోపేతానికి చూపిన సంసిద్ధత, న్యూఢిల్లీ దృష్టిలో ఈ సంబంధాలను దక్షిణాసియాలో ఆదర్శంగా నిలిపాయి. అయితే ఆ రాజకీయ వ్యవస్థ అకస్మాత్తుగా ముగియడం, అనంతరం హసీనా భారత్‌లో ఉండటం, దౌత్య సమీకరణాలను క్లిష్టతరం చేశాయి. బిఎన్‌పి తిరిగి అధికారంలోకి రావడంపై మొదట న్యూ ఢిల్లీలో ఆందోళనలు ఉన్నప్పటికీ.. భారత్‌పట్ల గతంలో చూపిన సందిగ్ధత, వ్యతిరేక వైఖరి (కొన్నిసార్లు) కారణంగా.. ఇప్పుడు అవి సమతుల్య అంచనాలకు మారుతున్నట్లు కనిపిస్తోంది. గత అనుమానాలు, ప్రస్తుత సంబంధాలను ప్రభావితం చేయనివ్వకూడదనే భావన ఇరువైపులా స్పష్టమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తారిక్ రెహ్మాన్‌ను సంప్రదించడం, దానికితోడు ఢాకా నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, సందేశాలు, భౌగోళికఆర్థిక వాస్తవాలు విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని ఇరుదేశాల అవగాహనను సూచిస్తున్నాయి. భారత్ స్పందన గమనించదగ్గ రీతిలో మితమైనదిగా ఉంది. ఆర్భాట నిర్ణయాల కంటే, క్రమంగా ముందుకు సాగే చర్యలను న్యూఢిల్లీ ఎంచుకుంది. ఇంధనం వంటి కీలక సరఫరాల పునరుద్ధరణ, వీసా ప్రక్రియల సడలింపు, చర్చల సంస్థాగత మార్గాల పునఃప్రారంభం వంటి చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయ సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకుని, సంబంధాలను స్థిరపరచడమే లక్ష్యంగా నిశ్శబ్ద దౌత్యాన్ని అమలు చేస్తోంది. ఇది భారత్ పొరుగు దేశాల విధానంలో చోటుచేసుకుంటున్న మార్పును ప్రతిబింబిస్తుంది. ఈ విధానం ఆదర్శాల కంటే కొనసాగింపు, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తుంది. బిఎన్‌పి ప్రభుత్వానికి ప్రధాన సవాలు దేశీయ రాజకీయ అవసరాలు, అంతర్జాతీయ వాస్తవాల మధ్య సమతుల్యత సాధించడం. తారిక్ రెహ్మాన్ బంగ్లాదేశ్ విదేశాంగాన్ని విభిన్న దిశల్లో విస్తరించాలనే సంకేతాలు ఇచ్చారు. ఇది భారత్ వ్యతిరేక ధోరణిగా భావించాల్సిన అవసరం లేదు. చైనా, పాశ్చాత్యదేశాలు, ఇతర ప్రాంతీయ భాగస్వాములతో సంబంధాలు పెంచుతూ, న్యూఢిల్లీతో ప్రామాణిక సంబంధాలను కొనసాగించాలనే వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని ఇది సూచిస్తుంది. ఆర్థిక సంబంధాలు ఇరుదేశాల మధ్య బలమైన ఆధారం. వాణిజ్యం, ఇంధన సహకారం, కనెక్టివిటీ ప్రాజెక్టులు పరస్పర ఆధారిత వ్యవస్థను ఏర్పరిచాయి. భారత్ బంగ్లాదేశ్‌కు ముఖ్య ఇంధన సరఫరాదారుగా కొనసాగుతుండగా, బంగ్లాదేశ్ భారత ఈశాన్య రాష్ట్రాలకు కీలక రవాణా మార్గాలను అందిస్తోంది. ఈ పరస్పర ఆధారిత వ్యవస్థను భంగం కలిగించడం ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో సహకారాన్ని పునర్నిర్మించుకోవడం అవసరమే. బంగ్లాదేశ్‌కు ఇంధన భద్రత, ఎగుమతుల విస్తరణ వంటి లక్ష్యాల సాధనకు భారత్‌తో స్థిరమైన సంబంధాలు అవసరం. భారత్‌కు కూడా బంగ్లాదేశ్ పొరుగు ప్రాంతానికే మొదటి ప్రాధాన్యత విధానంలో కీలక భాగస్వామి మాత్రమే కాకుండా, ఆగ్నేయాసియాతో అనుసంధాన లక్ష్యాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే, షేక్ హసీనా భారత్‌లో ఉండటం అత్యంత సున్నిత అంశంగా నిలుస్తోంది. ఒకవైపు ఆమె భారతదేశానికి అత్యంత సమీప మిత్రురాలు కాగా, మరోవైపు ఢాకాలోని కొత్త ప్రభుత్వం ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది. ఇలాంటి పరిస్థితిలో భారత్ తీసుకునే నిర్ణయం దౌత్య చాతుర్యానికి పరీక్షగా మారుతుంది. హసీనాను అప్పగిస్తే పాత భాగస్వామ్యానికి ద్రోహం చేసినట్లు అవుతుంది; తిరస్కరిస్తే ప్రస్తుత ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి తాత్కాలికంగా స్పష్టత లేని, సమతుల్య విధానాన్ని అనుసరించే అవకాశమే ఎక్కువ. భద్రతా అంశాలు కూడా ఈ సంబంధాల్లో కీలకంగా ఉన్నాయి. గతంలో భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాదేశ్‌లో స్థలం లభించిన అనుభవం న్యూఢిల్లీ వ్యూహాత్మక ఆలోచనలను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించకపోయినా, భారత్ అప్రమత్తంగా గమనిస్తోంది. ఉగ్రవాద నిరోధం, గూఢచారి సమాచార పంపకం వంటి రంగాల్లో సహకారం, విశ్వాసాన్ని పెంచడం అవసరం. భారత్ ఈశాన్య ప్రాంతానికి ఈ సంబంధాల ప్రాధాన్యం మరింత ఎక్కువ. బంగ్లాదేశ్ పోర్టులకు ప్రవేశం, రహదారి రైల్వే కనెక్టివిటీ, ఆర్థిక కారిడార్ల అవకాశాలు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డాయి. సంబంధాలు బలహీనపడితే తిరుగుబాట్లు, అక్రమ వలసలు, ఆర్థిక ఒంటరితనం వంటి పాత సమస్యలు మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది. విస్తృత భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతున్నాయి. బంగ్లాదేశ్ చైనాతో పెంచుకుంటున్న సంబంధాలు భారత్‌కు సవాలుగా మారుతున్నాయి. ఇవి పోటీని పెంచినా, ఆర్థిక దౌత్యం, మౌలిక వసతుల పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాల్లో భారత్ మరింత చురుకుదనం చూపాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. మొత్తంగా చూస్తే ఇది విభేదం కాదు, పునర్వ్యవస్థీకరణ. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు భావోద్వేగ దశ నుంచి వ్యావహారిక దశకు మారుతున్నాయి. ఈ మార్పు వేడి తగ్గించినప్పటికీ, దీర్ఘకాలంలో మరింత స్థిరత్వాన్ని అందించే అవకాశముంది. దక్షిణాసియాలో రాజకీయ మార్పులు ఒక్కసారిగా విదేశాంగ విధానాలను మార్చే పరిస్థితుల్లో, ఇరుదేశాలు సంయమనంతో, దూరదృష్టితో ఈ మార్పును నిర్వహించడం గమనార్హం. ప్రభుత్వాలు మారినా భౌగోళిక వాస్తవాలు మారవని ఇది మరోసారి రుజువు చేస్తోంది. రానున్న నెలలు రెండు దేశాలకూ కీలకం. షేక్ హసీనా అంశం వంటి సున్నిత విషయాలను సమర్థంగా పరిష్కరించగలిగితే, భద్రతా సహకారం కొనసాగితే, ఆర్థిక బంధాలు మరింత బలపడితే, ఈ దశ స్థిరమైన భాగస్వామ్యంగా మారే అవకాశం ఉంది. లేకపోతే పాత అనుమానాలు మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. ఈ పునర్నిర్మాణం గతంతో విరామం కాదు.. కొత్త రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా తీసుకున్న సమతుల్య అడుగు. అంతర్జాతీయ సంబంధాల్లో అవసరాలు చాలా సార్లు సిద్ధాంతాలను మితిమీరకుండా కట్టడి చేస్తాయని స్పష్టం చేస్తోంది. - గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు

మన తెలంగాణ 31 Mar 2026 10:30 am

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.20 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.20 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేసి ఈగల్ టీమ్ కు సమాచారం ఇచ్చారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఓ ప్రయాణికుడి వద్ద చెక్ చేయగా భారీ మొత్తంలో గంజాయి బయటపడింది. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎవరెవరికి సరఫరా చేస్తున్నారని అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. 

మన తెలంగాణ 31 Mar 2026 10:28 am

Tirumala |స్వర్ణరథంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..

Tirumala | స్వర్ణరథంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం.. Tirumala | ఆంధ్రప్రభ వెబ్

ప్రభ న్యూస్ 31 Mar 2026 10:25 am

స్వర్ణరథంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..

స్వర్ణరథంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తిరుమలలో జరుగుతున్న

ప్రభ న్యూస్ 31 Mar 2026 10:25 am

Amaravathi : రాజధానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చే అవకాశం లేదా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణాలను ప్రారంభించలేదు

తెలుగు పోస్ట్ 31 Mar 2026 10:20 am

నియోజకవర్గాల పునర్విభజనలో సమన్యాయమే శ్రేయస్కరం

కేంద్రం ప్రభుత్వం 543/545 పార్లమెంట్ ఎంపి స్థానాలను 816కు (పెరిగేవి 273), 4123 అసెంబ్లీ స్థానాలను 6185కు (పెరిగేవి 2062) పెంచి 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘావాల్ ఇటీవల ప్రకటించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు తెచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందాక ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసి చట్టసభల సీట్ల పెంపు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. 2023 సెప్టెంబర్‌లో ఆమోదం పొందిన మహిళ బిల్లు (నారీశక్తి వందన్ అదినియమ్-2023) ప్రకారం చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లను కూడా అమలు చేయాలని భావించడం శుభపరిణామం. ఎందుకంటే మొట్టమొదట 1993లో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామ పంచాయతీలో మహిళలకు 33% రిజర్వేషన్ ఆమోదం పొంది, 1996లో హెచ్‌డి దేవెగౌడ ప్రభుత్వం 81వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని బిల్లు ఆమోదం పొందక, 1998, 1999, 2003 లో ఎన్‌డిఎ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి ఏకాభిప్రాయం లేక పెండింగ్‌లో ఉండి, 2010లో యుపిఎ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించినప్పటికీ లోక్‌సభలో ఆమోదం పొందక కునారిల్లి 2023 సెప్టెంబర్ 20న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఉభయ సభల్లో ఆమోదింపజేసి ఆచరణలోకి తేవడం ఆకాశంలో సగమన్న మహిళలకు, యావత్తు దేశ ప్రజానీకానికి శుభదాయకం. ప్రజాస్వామ్యానికి ప్రధాన ఆధారం సాధారణ ప్రజలే, ప్రజాస్వామ్యంలో ఓటు తూటా కంటే శక్తివంతమైనది. 50 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల పెంపు సంతోషించదగ్గ పరిణామమే. ఎందుకంటే ప్రజల ప్రాతినిధ్యాన్ని పెంచి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేయడమే. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెరగడం అంటే చట్టసభలలో జరిగే చర్చల్లో ఎక్కువ మంది ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం. 1952, 1963, 1979 లలో చట్టసభల స్థానాల పునర్విభజన మూడుసార్లు జరిగినప్పటికీ 1976 లోని ఇందిరా గాంధీ నిలిపివేసింది. 2002 పునర్విభజన చేసినప్పటికీ స్థానాల సంఖ్య మాత్రం పెరగలేదు. లోక్‌సభలో ఎస్‌సిలకు ప్రస్తుతము ఉన్న 84 స్థానాల నుండి 126 కు, ఎస్‌టిలకు 47 స్థానాల నుండి 70 కి పెరుగుతాయి. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించకుండా చట్టసభలలో స్థానాల పెంపు అనేది అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా అన్నిరాష్ట్రాలతో చర్చించి పెంచాలి. జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడానికి అధికారిక ‘జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం’ ప్రపంచంలోనే మొదట 1952లో మన దేశంలో ప్రారంభించారు. ఈ పథకాన్ని అమలు పరచడంలో దక్షిణాది రాష్ట్రాలు గణనీయమైన పురోగతిని సాధించి జనాభా పెరుగుదల నెమ్మదింపజేసాయి. అదే ఉత్తరాది రాష్ట్రాలను పరిశీలించినట్లయితే జనాభా పెరుగుదల రేటు గణనీయంగా ఉన్నది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లలో జనాభా అధికం. ఈ 6 రాష్ట్రాల పెరిగే ఎంపి స్థానాలు 50% ప్రామాణికతతో పెంచితేనే సుమారు 396 స్థానాలు అవుతాయి. పెరిగిన జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే ఈ రాష్ట్రాలలో మరిన్ని ఎంపి స్థానాలు పెరుగుతాయి. అదే విధంగా దక్షిణాది రాష్ట్రాల ఎంపి స్థానాలు తగ్గిపోతాయి. ఇప్పటికే దక్షిణాది ఉత్తరాది మధ్య ఉన్న అంతరం మరింత పెరుగుతుంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో పార్టీ అయినా కేంద్రంలో సునాయాసంగా అధికారంలోకి రావచ్చు. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే అంతిమంగా అది బిజెపికి లాభిస్తుందని కాంగ్రెస్ భయపడుతుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం ఇప్పటికే వివక్ష చూపుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టసభల స్థానాల పెంపుపై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికే కేంద్రం మంత్రి పదవులను దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత లేని శాఖలిస్తున్నారని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. ఒకసారి దక్షిణాదికి కేటాయించిన మంత్రిత్వ శాఖలను పరిశీలిస్తే కేవలం నిర్మలా సీతారామన్ మాత్రమే ప్రాధాన్యత శాఖను నిర్వహిస్తున్నారు. మిగతా కీలక ప్రాధాన్యత శాఖలన్నీ ఉత్తరాది చేతుల్లోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో చట్టసభ సీట్లను పరిశీలిస్తే 50 శాతం పెంపుదల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ స్థానాలు 179కి, 17 లోక్‌సభ స్థానాలు 26 కు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ స్థానాలు 263కు, 25 లోక్‌సభ స్థానాలు 38కి పెరుగుతున్నాయి. చట్టసభల స్థానాల పెంపుదల అనేది ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా మనం రాజ్యాంగలో చెప్పుకున్న ‘సమన్యాయం’ ప్రతిపాదికన ఉత్తరాది రాష్ట్రాల, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి అన్యాయం జరగకుండా చట్టసభల స్థానాలను పెంచితే ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచినట్లు అవుతుంది.

మన తెలంగాణ 31 Mar 2026 10:16 am

సింహ వాహన సేవలో లక్ష్మీ నరసింహ స్వామి..

సింహ వాహన సేవలో లక్ష్మీ నరసింహ స్వామి.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలో

ప్రభ న్యూస్ 31 Mar 2026 10:14 am

Israel - Iran War :ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు… గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతిదాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌మీడియాలో చేసిన పోస్టులో ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు

తెలుగు పోస్ట్ 31 Mar 2026 10:12 am

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇల్లును సీజ్ చేసిన జిహెచ్ఎంసి అధికారులు

హైదరాబాద్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని ఇల్లును జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ భవనంపై ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సుమారు రూ.1.60 కోట్ల మేర ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ విషయంపై పలుమార్లు జయలలిత కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో చివరికి భవనాన్ని సీజ్ చేసినట్లు వివరించారు. గతంలో ఈ భవనాన్ని వ్యాపారవేత్త విజయ్ మాల్యా లీజ్‌కు తీసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఆస్తి పన్ను బకాయి ఉన్నట్టు  తెలిసింది.

మన తెలంగాణ 31 Mar 2026 10:11 am

2 Mn Bbl Oil Tanker Fired : కువైట్​ ట్యాంకర్​ ధ్వంసం

2 Mn Bbl Oil Tanker Fired : కువైట్​ ట్యాంకర్​ ధ్వంసం

ప్రభ న్యూస్ 31 Mar 2026 10:10 am

అత్తాపూర్ లో రెచ్చిపోయిన పోకిరీలు..

అత్తాపూర్ లో రెచ్చిపోయిన పోకిరీలు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పోలీసుల‌ ముందే

ప్రభ న్యూస్ 31 Mar 2026 10:08 am

దళిత క్రైస్తవుల దారెటు?

భారత సర్వోన్నత న్యాయస్థానం 24 మార్చిన క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు ఎస్‌సి హోదా వర్తించదని తీర్పుచెప్పిన విషయం తెలుగు ప్రజలకు విదితమే. ప్రచార మాధ్యమాలు ఇదే విషయాన్ని ప్రధాన వార్తగ ప్రచారం చేశాయి. తెలుగునేలపై ఇప్పటికీ ఇదే చర్చ జరుగుతుంది. కొన్ని సంఘాలు సుప్రీం తీర్పును తప్పుపడుతున్నవి. మరికొన్ని ఈ తీర్పును స్వాగతీస్తున్నట్టు ప్రకటనలు ఇస్తున్నవి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆనందపాల్, రామిరెడ్డిలకు చెందిన కేసులో ఈ తీర్పు రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి నాయకులకు ముఖ్యంగా దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆంధ్ర శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు లాంటివారికి ఇది ఒక ఆయుధంగా దొరికింది. సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇవ్వడాన్ని దళిత మేధావి వర్గం నుండి సాధారణ ప్రజలవరకు తప్పుపడుతున్నారు. ఈ తీర్పు అనేక మంది దళిత క్రైస్తవుల జీవితాలను ప్రభావితం చేస్తుందన్నది సందేహం లేదు. కానీ ఇక్కడ సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి ఆధారమైన రాష్ట్రపతి ఉత్తర్వు 1950, ఆ ఉత్తర్వు రాజ్యాంగంలో ఉన్న కారణంగా హైకోర్టులు మొదలు సుప్రీం కోర్టు ఈ తీర్పులు వెలువరిస్తున్నవి. ఈ తీర్పు మొదటిసారి వచ్చిందేమీ కాదు. గతంలో అనేక కేసులల్లో సుప్రీం ఇదే విషయాన్ని చెప్పింది. రాష్ట్రపతి (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు 1950 పేర మూడులో చూచించిన ప్రకారం హిందూ మతం పాటించని దళితులు ఎస్‌సి జాబితాలోకిరారు అనేదిదాని సారంశం. కాలనుగుణంగా 1957లో సిక్కుమతం ఆచరిస్తున్న దళితులకు, 1990లో బౌద్ధమతం స్వీకరించిన దళితులకు ఎస్‌సి రిజర్వేషన్ వర్తించేలా భారత పార్లమెంట్ రాష్ట్రపతి ఉత్తర్వుకు సవరణ చేయడం జరిగిందీ. ప్రస్తుతం క్రైస్తవం, ఇస్లాం స్వీకరించిన దళితులకు రాష్ట్ర పతి ఉత్తర్వు ప్రకారం ఎస్‌సి రిజర్వేషన్ వర్తించదు. ఇదే విషయాని సుప్రీం కోర్టు చెప్పింది. వివిధ రాష్ట్రాల నుండి సిఫారసు చేయబడిన దళితులను ఎస్‌సిలుగా గుర్తించి ఆ కులాలను ఎస్‌సి రిజర్వేషన్ జాబితాలో చేర్చే అధికారం ఆర్టికల్ 341 ప్రకారం భారత రాష్ట్రపతికి ఉన్నది. ఆనాడు మొదటి ఎస్‌సి జాబితాను ఈ దేశ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ 10 ఆగస్టు 1950 నాడు రాష్ట్రపతి ఉత్తర్వు ఇవ్వడం జరిగినది. సెక్యులర్ అనే పేరుతో క్రైస్తవులను ఓటు బ్యాంకుగా మార్చుకుని దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ దళిత క్రైస్తవులకు తీరని మోసం చేసింది. ఆనాడు ఈ రాష్ట్రపతి ఉత్తర్వును అన్యాయంగా రాజ్యాంగంలో చేర్చిన నాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ నెహ్రూ ప్రభుత్వమే. 1956లో దళిత సిక్కులకు ఎస్‌సి రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ అదే కాంగ్రెస్ పార్టీ దళిత క్రైస్తవులకు మొండి చేయి చూపింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి పార్టీ మొదటినుంచి బాహాటంగానే దళిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది. 2004 తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సిఎం అయ్యాక దళిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి మెజారిటీ సభ్యుల ఆమోదంతో జరిగిన తీర్మానాన్ని కేంద్రానికి పంపడం జరిగింది. ఆనాడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. వైయస్ రాజశేఖర్ రెడ్డి దళిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ కల్పించాలని చిత్తశుద్ధితో ఉన్నా అనాటి కాంగ్రెస్ పట్టించుకోలేదు. బిజెపి దళిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేఖిస్తుంది. ఎందుకంటే ఇతర మతాల వారు ఇక్కడ ద్వితీయ శ్రేణి పౌరులు అనే సిద్ధాంతంతో ఉన్న బిజెపి దళిత క్రైస్తవ సమాజానికి రావలసిన ఎస్‌సి రిజర్వేషన్‌ను వ్యతిరేకించడం సహజం. సుప్రీం కోర్టుకు వివరణ కోసం మోడీ ప్రభుత్వం ఇదే విషయంపై అధ్యయనం కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ బాలకిషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉన్నది. మతం మారిన దళితులపై వివక్ష లేదు అని అనుకోవడానికి వీలు లేదు. అదే నిజమైతే కారంచేడులో హత్యకు గురైన మాదిగలు అందరూ క్రైస్తవ నేపథ్యం ఉన్నవారే. అయినప్పటికీ కారంచేడు అగ్రకుల దాడి దేశంలోనే సంచలనం సృష్టించింది. చుండూరులో హత్యకు గురైన మాలలు కూడా చర్చి నేపథ్యం ఉన్నవారే. ఇవే కావు ఇలాంటి అనేక సంఘటనలు దేశవ్యాప్తంగా ఉన్నవి. మతం మారినంత మాత్రాన దళితులపై సమాజ వైఖరి మారలేదు. అంతేకాదు మతం మారిన దళితులపై ముఖ్యంగా దళిత క్రైస్తవులపై దాడులు పెరిగినవి తప్పితే తగ్గలేదు. హిందూ విశ్వాసంలో ఉన్న దళితులపై కులం పేరుతో అగ్రకులాలు దాడి చేస్తే, దళిత క్రైస్తవులపై కులం పేరుతోపాటు, మతం పేరుతో కూడా దాడులు జరుగుతున్నవి. హిందూ మతం వదిలి వెళ్ళిన తరువాత అంటరానితనం క్రైస్తవంలో లేదు. అలాంటప్పుడు ఎస్‌సి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది బిజెపి వాదన. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ దేశంలో దళితులు సామాజికంగా అణచివేయబడ్డారు. ఈ దేశం మొత్తం దళితులను అంటరానివారుగా చూచింది. చర్చిలో కులం లేదు, కానీ ఈ దేశంలో భాగమైన బడిలో కులం ఉన్నది, సంతలో కులం ఉన్నది, ప్రభుత్వ కార్యాలయాల్లో కులం ఉన్నది, పాలనలో కులం ఉన్నది. చర్చిలో కులం లేకున్నా ఊరు ఉమ్మడి ఆస్తి అయిన మంచినీళ్ళ చెరు వుకాడ కులం ఉన్నది. ఒక క్రైస్తవుడు జీవించేది చర్చిలో కాదు. ఈ దేశంలో అందునా కులం పేరుతో విడిపోయిన ఈ సమాజంలో కులం ఉన్నది. ఆరాధన పద్ధతిలో తేడా, నమ్మే దేవునిలో తేడా అంతేకానీ అణచివేత ఒక్కటే. సమాజంలోఉన్న కులఅణచివేత లేదాకుల గుర్తింపు మతవిశ్వాసాన్ని బట్టి రాలేదు. పుట్టిన ఇంటిని బట్టి వచ్చిది అనే విషయాన్ని గుర్తించాలి. దళిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ సాధనకు ఐక్యసంఘటిత ఉద్యమమే పరిష్కారం. వర్గీకరణ పేరుతో విడిపోయిన మాలమాదిగలు దళిత క్రైస్తవ ఎస్‌సి రిజర్వేషన్ కోసం ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఇద్దరి సమస్య, ఇక్కడ చర్చికి వెళ్ళే మాలలు, మాదిగలు బాధితులే వీరు మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల్లో 59% కులాల సమస్య. కాబట్టి మాలమహానాడుతోనో, మాదిగదండోరాతోనో సాధ్యం కాదు. కొత్త నాయకత్వమే ముందుకు రావాలి. దలిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ కల్పించడానికి రెండు మార్గాలు. పార్లమెంటులో రాష్ట్రపతి ఉత్తర్వు 1950కి సవరణ చేసి ఆమోదించడం లేదా రాష్ట్రపత్తి ఉత్తర్వు 1950ను సుప్రీం కోర్టు రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం. పైరెండు మార్గాల ద్వారా దళిత క్రైస్తవులకు ఎస్‌సి రిజర్వేషన్ పొందే వీలు ఉన్నది.   - వలిగొండ విజయరాజు 81434 46626

మన తెలంగాణ 31 Mar 2026 10:05 am

ఆందోళనలో చిట్యాల రైతులు..

ఆందోళనలో చిట్యాల రైతులు.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో సోమవారం రాత్రి వీచిన

ప్రభ న్యూస్ 31 Mar 2026 9:59 am

Peddi Release: Buchi Babu gets Trolled

Buchi Babu Sana made an impressive debut with Uppena and the film ended up as a blockbuster. He waited for almost two years for the arrival of Charan and his next film Peddi featuring Ram Charan is in the final stages of shoot. The makers announced that the film releases on April 30th but there […] The post Peddi Release: Buchi Babu gets Trolled appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 9:53 am

Summer Effect : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

తెలుగు పోస్ట్ 31 Mar 2026 9:51 am

ഫാക്ട് ചെക്ക്: ഇറാൻ യുഎസ് വിമാനവാഹിനിക്കപ്പൽ ആക്രമിച്ചോ? പ്രചരിക്കുന്ന വീഡിയോ എഐ നിർമിതം

യുഎസ്എസ് എബ്രഹാം ലിങ്കൺ ഇറാൻ തകർക്കുന്ന ദൃശ്യമെന്ന് വാദത്തോടെയാണ് വീഡിയോ പ്രചരിക്കുന്നത്

తెలుగు పోస్ట్ 31 Mar 2026 9:48 am

రేపు పార్లమెంట్‌లో ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు

రేపు పార్లమెంట్‌లో ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు రానుంది

తెలుగు పోస్ట్ 31 Mar 2026 9:48 am

ఆమనగల్లులో భార్య, కుమారుడిని కత్తితో పొడిచి చంపి... కొనఊపిరితో కుమార్తె

ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో భార్య, కుమారుడిని భర్త కత్తితో పొడిచి చంపాడు. కూతురు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాం నగర్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని పులిగోనిపల్లి తండాలో బాణావత్ రాందాస్ నాయక్, కవిత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కూతురు పవిత్ర, కమారుడు హర్షలు ఉన్నారు.  ఆమనగల్లు పట్టణ సమీపంలోని సూర్యలక్ష్మి కాటన్ మిల్ లో రాందాస్ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కవిత మేస్త్రి పని కూలికి వెళ్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంది.  దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున భార్య, కుమారుడు, కూతురును కత్తితో పొడిచాడు. భార్య, కుమారుడు ఘటనాస్థలంలోనే మృతి చెందగా కూతురు కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 31 Mar 2026 9:40 am

చివరకు నిర్దోషిగా బయటకు వచ్చా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమేడియన్‌గా ఎన్నో విభి న్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన హేమ తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అదే సమయంలో నేరుగా, బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పే స్వభావం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటి హేమతో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో సోమవారంనాడు జరిగింది. తనపై నమోదైన డ్రగ్స్ కేసు, దాని వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, మీడియా పాత్ర వంటి అంశాలపై ఆమె భావోద్వేగంగా స్పందించారు. ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ “డ్రగ్స్ కేసులో నాపై వచ్చిన ఆరోపణలు నన్ను తీవ్రంగా మానసికంగా కలచివేశాయి. ఆ సమయంలో నేను చచ్చిపోవాలనిపించింది. అంతగా మానసికంగా కుంగిపోయాను. అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల ప్రసాద్ రావు, గౌరవ అధ్యక్షులు ప్రభు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, పలువురు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 31 Mar 2026 9:39 am

May Day Weekend: Four Films in Race

Ram Charan’s upcoming film Peddi is slated for April 30th release across the globe. There are strong rumors that the film is postponed and the team will announce the news officially very soon. As it falls over the long weekend of May Day, a number of films are eyeing this date. Four Telugu films will […] The post May Day Weekend: Four Films in Race appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 9:38 am

31stMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

31stMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 31stMarchCartoon | గ్యాస్ సరఫరా

ప్రభ న్యూస్ 31 Mar 2026 9:33 am

అందరినీ అలరించే కథ

ఒజి, శ్రీ సీతా రాముల కల్యా ణం చూత ము రారండి, అన్న య్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరోగా రూపొందుతున్న మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. “ఇది పూర్తిగా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వుంటాయి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కథ. వెంకట్‌కి ఇది మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుంది”అని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రంలో హెబ్బాపటేల్, సలోని, నాటషా, అలీ, సుమన్,రవి వర్మ, సుభాశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మన తెలంగాణ 31 Mar 2026 9:28 am

ఇస్ఫహాన్ నగరంపై అమెరికా భీకర దాడులు... వీడియోలు షేర్ చేసిన ట్రంప్

టెహ్రాన్: ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఇస్ఫహాన్ నగరంలో అణుకేంద్రాలే లక్ష్యంగా యుఎస్‌ఎ దాడులు చేసింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై రెండు వేల పౌండ్ల బంకర్ల బస్టర్‌లతో దాడికి పాల్పడింది. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ఇరాన్‌లో చమురు, ఇంధన, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. హర్మూజ్ జలసంధిలో రాకపోకలను తిరిగి తెరవకపోతే తీవ్ర పరిణమాలు ఉంటాయని ఇరాన్‌ను అమెరికా హెచ్చరించిన విషయం విధితమే. ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పలమార్లు హెచ్చరించారు. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ కూడా భీకర దాడులు చేస్తూనే ఉంది. గల్ఫ్ దేశాలలో గగనతల అభద్రత మరింత పెరిగింది. తమ దేశం గగనతలం నుంచి అమెరికా యుద్ధ విమానాలను అనుమతించమని స్పెయిన్ రక్షణ శాఖ మార్గరిటా రోబ్లెస్ ప్రకటించారు. ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధానికి స్పెయిన్ దేశం తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. 

మన తెలంగాణ 31 Mar 2026 9:27 am

శ్రీవారి సన్నిధిలో.. చింతల వెంకటేశ్వర్ రెడ్డి..

శ్రీవారి సన్నిధిలో.. చింతల వెంకటేశ్వర్ రెడ్డి.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భారత రాష్ట్ర

ప్రభ న్యూస్ 31 Mar 2026 9:25 am

ఇండియన్ సినిమాలో గొప్ప లవ్ స్టోరీగా..

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా కల ర్ ఫొటో, బేబి వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ‘ సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉం ది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ‘చెన్నై లవ్ స్టోరీ‘ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుం చి గుర్తుందా సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మా త సాయి రాజేశ్ మాట్లాడుతూ “బేబి మూవీ విజయం తర్వాత మేము డబ్బుల వెనక పరుగు పెట్టలేదు. ఒక మం చి కథతో మళ్లీ మూవీ చేయాలని అనుకున్నాం. నా మనసుకు నచ్చిన ఒక కథను రాసుకున్నాను. కానీ ఈ సినిమా ను నేను అనుకున్నదాని కంటే బాగా తెరకెక్కించాడు రవి నంబూరి. ఈ చిత్రంలో హీరోకు సమాన ప్రాధాన్యత ఉన్న పాత్ర హీరోయిన్‌ది. గత ఏడాది తమిళ సినిమాకు ఫిలింఫేర్ తీసుకున్న శ్రీ గౌరి ప్రియ..ఈసారి తెలుగు సినిమాకు కూడా తీసుకుంటుంది. ఈ సినిమా కిరణ్‌కు ఒక మరచిపోలేని మూవీ అవుతుంది”అని అన్నారు. డైరెక్టర్ రవి నంబూ రి మాట్లాడుతూ “నేను ఇంత పెద్ద మూవీ చేస్తున్నానంటే అందుకు కారణం ఎస్ కేన్, సాయి రాజేశ్. నేను ఎమోషనల్ మూవీ చేయగలనా అనుకున్న నాతో ఇలాంటి మంచి మూవీ చేయిస్తూ నా ప్రతిభను వెలికితీస్తున్నారు. కిరణ్ అన్న అద్భుతంగా నటించారు. శ్రీ గౌరి ప్రియ ఈ మూవీ కోసం చాలా కష్టపడుతోంది. మణిశర్మతో కలిసి వర్క్ చే యడం హ్యాపీగా ఉంది”అని తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “చెన్నై లవ్ స్టోరీ మూవీని డాల్బీలో చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ మూవీలో హీరోయిన్ ఒక దేవతలా అనిపించాలి. అలాంటి నివి పాత్రలో శ్రీగౌరి చాలా బాగా నటించింది. మణిశర్మ కంపోజ్ చేసిన ఏడు పాటల్ని థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియ న్ సినిమా గొప్ప లవ్ స్టోరీస్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ‘ ఒకటి కా బోతోంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మ్యూజి క్ డైరెక్టర్ మణిశర్మ, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, నిర్మాత ఎస్ కేఎన్, ధీరజ్ మొగిలినేని, విజయ్ పొలాకీ, విశ్వాస్ డేనియల్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 31 Mar 2026 9:20 am

సుడిగాలి భీభత్సం..

సుడిగాలి భీభత్సం.. ఆళ్లపల్లి/ గుండాల, ఆంధ్రప్రభ : గుండాల మండల పరిధి రోళ్లగడ్డ

ప్రభ న్యూస్ 31 Mar 2026 9:19 am

IPL 2026 : ఐపీఎల్ లో నేడు మరో బిగ్ ఫైట్

నేడు పంజాబ్ కింగ్స్ Vs గుజరాత్ టైటాన్స్‌ మ్యాచ్ జరగనుంది.

తెలుగు పోస్ట్ 31 Mar 2026 9:14 am

எடப்பாடி பழனிசாமி பரப்புரை வாகன முகப்பில் மோடி படமா? - உண்மை இதுதான்

எடப்பாடி பழனிசாமி பரப்புரை வாகன முகப்பில் பிரதமர் மோடி படம் இடம்பெற்றுள்ளதாக வைரலாகும் புகைப்படத்தின் உண்மைத் தன்மை சரிபார்ப்போம்.

తెలుగు పోస్ట్ 31 Mar 2026 9:11 am

అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..

అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:59 am

హాస్టల్.. ఆకస్మిక తనిఖీ..

హాస్టల్.. ఆకస్మిక తనిఖీ.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:52 am

Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్...భక్తుల రద్దీ సాధారణమే

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది

తెలుగు పోస్ట్ 31 Mar 2026 8:48 am

3 Indonesia Peacekeepers Killed : లెబనాన్​ లో బలి Andhra Prabha News

3 Indonesia Peacekeepers Killed : లెబనాన్​ లో బలి Andhra Prabha

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:43 am

ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి..

ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:41 am

Narendra Modi : నేడు గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

నేడు గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 31 Mar 2026 8:38 am

రికార్డులు సృష్టించిన రాజస్థాన్ రాయల్స్

హైదరాబాద్: ఐపిఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. సిఎస్‌కెపై ఆర్‌ఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్య వంశీ 17 బంతుల్లో 52 పరుగులు చేసి సునామీ సృష్టించాడు. సిఎస్‌కె విధించిన 127 పరుగుల టార్గెట్‌ను ఆర్‌ఆర్ 12.1 ఓవర్లలోనే చేధించి రికార్డు నెలకొల్పింది. చెన్నైపై 47 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఇదే రెండో అతి పెద్ద విజయంగా నమోదైంది. గతంలో చెన్నైపై కోల్‌కతా నైట్ రైడర్స్ 59 బంతుల తేడాతో ఘన విజయం సాధించి రికార్డులో తొలి స్థానంలో ఉంది. చెన్నైపై ఎక్కువ విజయాలు సాధించిన మూడో జట్టుగా ఆర్‌ఆర్ రికార్డు నెలకొల్పింది. చెన్నైపై ముంబయి(21), పంజాబ్(16), రాజస్థాన్(16) విజయాలు సాధించాయి. 2020 నుంచి చెన్నైతో 11 మ్యాచ్‌లు జరగగా రాజస్థాన్ 9 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఆర్‌ఆర్ బౌలర్ నంద్రే బౌర్గర్ రెండు మెయిన్ వికెట్లు తీయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

మన తెలంగాణ 31 Mar 2026 8:35 am

నేటితో ముగియనున్న మావోయిస్టుల డెడ్‌లైన్‌

నేటితో మావోయిస్టుల డెడ్‌లైన్‌ ముగియనుంది

తెలుగు పోస్ట్ 31 Mar 2026 8:32 am

Exclusive: Prabhas delays Spirit Again

Pan-Indian star Prabhas is committed to work with Sandeep Reddy Vanga in Spirit. The shoot was planned to start last year but it was pushed to 2026 because of the commitments of Prabhas. The actor promised to allocate bulk dates for Spirit and he promised to complete the shoot in a single stretch. But things […] The post Exclusive: Prabhas delays Spirit Again appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 8:21 am

ఆదివాసి మహిళపై దాడి చేసి..

ఆదివాసి మహిళపై దాడి చేసి.. ఆళ్ళపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో పూనెం

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:13 am

IPL 2026 : బ్యాటర్లు వరసబెట్టి పెవిలియన్ కు.. చెన్నై చెత్త బ్యాటింగ్.. రాజస్థాన్ దే జయం

ఐపీఎల్ 2026 మ్యాచ్ ప్రారంభమయిన తర్వాత మూడో మ్యాచ్ అతి చెత్తగా జరిగింది

తెలుగు పోస్ట్ 31 Mar 2026 8:10 am

Iran - Israel War : ట్రంప్ హెచ్చరికలు.. లైట్ తీసుకుంటున్నఇరాన్.. కొనసాగుతున్న దాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు

తెలుగు పోస్ట్ 31 Mar 2026 7:53 am

బోణీ కొట్టేదెవరో?

నేడు గుజరాత్‌తో పంజాబ్ ఢీ ముల్లాన్‌పుర్: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. న్యూ చండీగఢ్‌లోని మహరాజా యదవింద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. దీంతో రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమయ్యాయి. పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, గుజరాత్‌కు శుభ్‌మన్ గిల్ సారథ్యం వహిస్తున్నారు. పంజాబ్ కిందటి సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి ట్రోఫీ సాధించడమే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, శశాంక్ సింగ్, స్టోయినిస్, సూర్యాన్ష్, ముషీర్ ఖాన్, నెహాల్ వధెరా వంటి స్టార్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఈ సీజన్‌లో శ్రేయస్ జట్టుకు కీలకంగా మారాడు. టీమ్‌ను ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన శ్రేయస్ చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఇబ్బందులు ఖాయం. ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్, శశాంక్‌లు కూడా కిందటి సీజన్‌లో మెరుపులు మెరిపించారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక చాహల్, ఫెర్గూసన్, మార్కొ జాన్సన్, అర్స్‌దీప్ సింగ్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇక గుజరాత్‌లోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్‌లు జట్టుకు కీలకంగా మారారు. కిందటి సీజన్‌లో గిల్, సాయి సుదర్శన్‌లు పలు మ్యాచుల్లో జట్టుకు శుభారంభం అందించారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉన్నారు. జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, షారూక్ ఖాన్, అనూజ్ రావత్, తెవాటియా తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక రషీద్ ఖాన్, హోల్డర్, వాషింగ్టరన్, టామ్ బాంటమ్ వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. సిరాజ్, రబడా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

మన తెలంగాణ 31 Mar 2026 7:49 am

34 Passengers Safe: త‌ప్పిన మ‌హా ఘోరం An dhra Prabha News

34 Passengers Safe: త‌ప్పిన మ‌హా ఘోరం An dhra Prabha News

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:46 am

వైభవ్ సూర్యవంశీ వీర విహారం.... చెన్నైపై రాజస్థాన్ గెలుపు

గౌహతి: ఐపిఎల్ సీజన్ 2026లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. సోమవారం గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యా చ్‌లో రాజస్థాన్ 8 వికెట్ల తేడా తో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. రాజస్థాన్ బౌలర్లు ఆరంభం నుంచే మెరుగ్గా బౌలింగ్ చేశారు. ఓపెనర్లు సంజు శాంసన్ (6), రుతురాజ్ గైక్వాడ్ (6) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆయూస్ మాత్రె (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మాథ్యూ షార్ట్ (2) కూడా నిరాశ పరిచాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన సర్ఫరాజ్ ఖాన్ (17) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. కార్తీక్ శర్మ (18) పరుగులు చేశాడు. శివమ్ దూబె (6), నూర్ అహ్మద్ (1), మ్యాట్ హెన్రీ (5) జట్టుకు అండగా నిలువలేక పోయారు. జేమీ ఓవర్టన్ (43) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఆర్చర్, బర్గర్, జడేజా రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 12.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 17 బంతుల్లోనే 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో 52 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. యశస్వి జైస్వాల్ 38 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.

మన తెలంగాణ 31 Mar 2026 7:44 am

Cuba : క్యూబాకు రష్యా చమురు ట్యాంకర్ రాక… ఆంక్షల మధ్య ఊరట

క్యూబాకు ఈ ఏడాది తొలి చమురు సరఫరాగా రష్యా ట్యాంకర్ సోమవారం చేరింది

తెలుగు పోస్ట్ 31 Mar 2026 7:42 am

బాలుడి ప్రాణం తీసిన మందార పువ్వు

బెంగళూరు: మందార పువ్వు కాండం గొంతులో ఇరుక్కొని ఆరు నెలల బాలుడు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం హుణసూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హనగోడు హోబళి దొడ్డ హెజ్జూరు గ్రామంలో సుదర్శన్, నవ్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఆరు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. మందారం పువ్వు కింద భాగాన ఉండే కాండాన్ని బాలుడు నోట్లో పెట్టుకోవడంతో గొంతులోనికి వెళ్లింది. కాండం ఊపిరితిత్తులోనికి వెళ్లింది. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మైసూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. హుణసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 31 Mar 2026 7:37 am

Iran - Israel War : హిజ్బుల్లా–ఇజ్రాయెల్‌ పోరుతో పెరుగుతున్న ఉద్రిక్తతలు

లెబనాన్‌ నుంచి వెళ్లాలన్న ఆదేశాన్ని ఇరాన్‌ బహిరంగంగా తిరస్కరించింది

తెలుగు పోస్ట్ 31 Mar 2026 7:29 am

నష్టాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు

49 సంస్థలు ఆడిట్‌కు సహకరించలేదు.. మూసివేత దిశగా 16 సంస్థలు 6 సంస్థలు లాభాలు, 11 సంస్థలు నష్టాల్లో... సింగరేణిలో రూ.251 కోట్ల మేర నిధులు దుర్వినియోగం సింగరేణి బొగ్గు రవాణాలో లోపాల వల్ల రూ.25 కోట్ల నష్టం కాగ్ నివేదికలో వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చింది. 2023 మార్చి వరకు ఉన్న గణాంకాలను విశ్లేషించిన కాగ్ ఆయా సంస్థల నష్టాలు, వార్షిక బడ్జెట్ వివరాల గురించి వెల్లడించింది. కాగ్ 2022, 23 సంవత్సరానికి సంబంధించి పలు శాఖల పనితీరు, వాటి వివరాలను కాగ్ అసెంబ్లీకి నివేదించింది. రాష్ట్రంలోని మెజారిటీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని, కనీసం లెక్కలు సమర్పించడంలోనూ నిర్లక్ష్యం వహించాయని కాగ్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా, వాటిలో 16 సంస్థలు ఇప్పటికే మూతపడటం లేదా లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్నాయని, మిగిలిన 67 సంస్థల్లో ఏకంగా 49 సంస్థలు తమ వార్షిక ఖాతాలను సమర్పించలేదని, కేవలం 18 సంస్థలు మాత్రమే ఆడిటింగ్‌కు సహకరించాయని కాగ్ ఈ నివేదికలో తెలిపింది. 18 సంస్థల్లో కేవలం 6 సంస్థలు మాత్రమే లాభాల్లో ఉండగా, 11 సంస్థలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయని కాగ్ పేర్కొంది. 9 సంస్థల నెట్‌వర్త్ (నికర విలువ) నష్టాల కారణంగా పూర్తిగా కరిగిపోయిందని, మొత్తం మీద ఈ సంస్థల నెట్ వర్త్ రూ.50,930 కోట్లకు పడిపోయిందని కాగ్ తెలిపింది. ఈ సంస్థల్లో ప్రభుత్వం చేసిన మొత్తం పెట్టుబడులు రూ.98,572 కోట్లు కాగా, సింగరేణి కాలరీస్‌పై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించి అవకతవకలను గుర్తించింది. కొన్ని ఒప్పందాల్లో అవసరానికి మించి డీజిల్ వినియోగించినట్లు గుర్తించింది. కాంట్రాక్టుల్లోని లోపాల వల్ల రూ.251 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని నిబంధనలను అమలు చేయడంలో రూ.74 కోట్ల అదనపు భారం పడగా, బొగ్గు రవాణాలో లోపాల వల్ల రూ.25 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తేల్చింది. ట్రాన్స్‌ఫోర్ట్ ఛార్జీల పేరుతో రూ.1,078 కోట్ల అదనపు వసూళ్లు జరిగినట్లు కాగ్ నివేదికలో తెలిపింది. . 15 సంస్థల్లో 9 సంస్థలకు స్వతంత్ర డైరెక్టర్లే లేరు సంస్థల పాలనలో తీవ్ర లోపాలున్నట్లు నివేదిక వేలెత్తి చూపింది. 15 సంస్థల్లో 9 సంస్థలకు స్వతంత్ర డైరెక్టర్లే లేరని ఎక్కడా డైరెక్టర్ల సమావేశాలు నిర్వహించలేదని 5 సంస్థల్లో ఆడిట్ కమిటీలు, 9 సంస్థల్లో ఎన్‌ఆర్‌సి లేదని నివేదికలో కాగ్ తెలిపింది. పర్యావరణ నిబంధనలను పాటించడంలో సింగరేణి విఫలమైందని, ఎఫ్లువెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదని కాగ్ పేర్కొంది. నష్టాల్లో ఉన్న సంస్థల పనితీరుపై ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించాలని కాగ్ సూచించింది. పెండింగ్‌లో ఉన్న వార్షిక ఖాతాలను వెంటనే పూర్తి చేసి సమర్పించాలని, కాంట్రాక్టుల్లో లొసుగులు లేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కాగ్ నివేదికలో పేర్కొంది.

మన తెలంగాణ 31 Mar 2026 6:50 am

డీలిమిటేషన్ తో సీట్ల వ్యత్యాసంలో తేడా రావొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః లోక్‌సభ సీట్ల విషయంలో కేంద్రం చేపట్టనున్న డీ-లిమిటేషన్ ఫార్మూలా ఏదైనా ప్రస్తుతం దక్షిణ-ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న వ్యత్యాసమే భవిష్యత్తులో కూడా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం చేపట్టనున్న డీ-లిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు భారీగా నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి ఒబిసి మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. తమ ఐదేళ్ళ పాలన గడువు ముగిసిన తర్వాత జమిలి ఎన్నికల నిర్వహించే సమయం వరకూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ డాక్టర్ లక్ష్మణ్ వితండవాదం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించరా? అని ఆయన ప్రశ్నించారు. లక్ష్మణ్ ఎలా డాక్టర్ అయ్యారో, లెక్కలు రావేమో అర్థం కావడం లేదన్నారు. మీలో ఎవరికైనా లెక్కలు బాగా వస్తే డాక్టర్ లక్ష్మణ్‌కు చెప్పాలని ఆయన విలేకరులనుద్ధేశించి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల కోసం డాక్టర్ లక్ష్మణ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని అన్నారు. డీ-లిమిటేషన్‌పై బిజెపి నాయకులు అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. బ్రూటల్ మెజారిటీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. తిరుగులేని పాలన వస్తే నియంతృత్వం వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల సమస్య కాదు.. దేశవ్యాప్తంగా ఇప్పుడు 543 లోక్‌సభ సీట్లు ఉన్నాయని, అందులో సగం సీట్లు 272 పెంచాలని కేంద్రం భావిస్తున్నదని ఆయన చెప్పారు. దీంతో దేశ వ్యాప్తంగా 815 సీట్లు అవుతాయన్నారు. ఉదాహరణకు ఉత్తర్ ప్రదేశ్‌లో 80 సీట్లు ఉన్నాయని, డీ-లిమిటేషన్‌తో 120కి పెరుగుతాయని చెప్పారు. అదేవిధంగా తమిళనాడులో 40 ఉన్నాయని, డీ-లిమిటేషన్‌తో 60కి పెరుగుతాయని ఆయన తెలిపారు. ఉత్తరాదిలో ఇలా పెద్ద రాష్ట్రాలతో ఎక్కువ సీట్లు పెరుగుతాయన్నారు. పైగా దేశ వ్యాప్తంగా పెరిగే 272 సీట్లు మహిళా రిజర్వేషన్‌కు సరిపోతాయని అంటున్నారని ఆయన చెప్పారు. అయితే డీ-లిమిటేషన్ ఫార్ములా ఏదైనా ప్రస్తుతం దక్షిణాది-ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఉన్న సీట్ల వ్యత్యాసమే భవిష్యత్తులోనూ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు అంటే చిన్న చూపు ఉందని, భవిష్యత్తులో ఉత్తరాదిలో సీట్లు గణనీయంగా పెరిగితే, దక్షిణాదికి సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన తెలిపారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, ప్రజా సమస్య అని ఆయన అన్నారు. ఈ విషయంలో తాము దక్షిణాది రాష్ట్రాల పార్టీలను కలుపుకుని పోనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి వస్తారని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. కెసిఆర్ గృహ నిర్బంధంలో.. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ గురించి ప్రశ్నించగా, కెసిఆర్ విశ్రాంతి తీసుకోవడం లేదని, గృహ నిర్బంధంలో ఉన్నారని అనుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 31 Mar 2026 6:50 am

ఈగల్, హైడ్రా తరహాలో.. కల్తీ కట్టడికి కొత్త వ్యవస్థ

మన తెలంగాణ/హైదరాబాద్‌ః కల్తీ మాఫియా ఆట కట్టించేందుకు ఈగల్, హైడ్రా తరహాలో కొత్త వ్యవస్థ తీసుకుని వస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఆహార కల్తీపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ నిరోధానికి దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపడాతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. కల్తీ తిను బండారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనేక మంది కల్తీ ఆహారం తీసుకుని ఆసుపత్రి పాలవుతున్నారని, ఇంకా క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. కాబట్టి ఇకమీదట కల్తీ వ్యాపారుల ఆట కట్టిస్తానని ఆయన హెచ్చరించారు. రేషన్ షాపుల ద్వారా దొడ్డుబియ్యం అందించినా తినేవారు లేకపోవడంతో ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. పైగా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడడం లేదన్న ఆలోచనలు చేసిన తర్వాత పేదలు తినగలిగే సన్నబియ్యం అందించాలని ఈ పథకాన్ని గత ఏడాది ఉగాది రోజున ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇందు కోసమే క్వింటాలుకు రూ. 500 రూపాయల బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహించామని ఆయన వివరించారు. అడిగిన వారందరికీ రేషన్ కార్డు జారీ చేశామని చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వాణిజ్య ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎక్కడైనా ఉత్పత్తిదారుడే తమ వస్తువు ధరను నిర్ణయిస్తారు కానీ ఒక రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం లేదన్నారు. రైతుల హక్కులను కాపాడేందుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం తెచ్చిందని ఆయన గుర్తు చేశారు. నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువ అని ఆయన తెలిపారు. ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వాళ్ళను నియంత్రించడానికి ఆనాడు కాంగ్రెస్ పకడ్బందీగా పిడి యాక్ట్ (చట్టం) తీసుకొచ్చిందన్నారు. కాకపోతే అది అంతగా ప్రజల్లోకి వెళ్లలేదని ఆయన చెప్పారు. కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలుత పేదలకు రేషన్ కార్డులున్న వారికి కిలో రూపాయి తొంబై పైసలకు ఇచ్చారన్నారు. ఆ తర్వాత ఎన్టీరామారావు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంగా మార్చి ముందుకు తీసుకెళ్లారని ఆయన వివరించారు. రేషన్ బియ్యం పంపిణీపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. నలభై ఏళ్లుగా ఇదే పథకం కొనసాగుతోందని, ఆనాటి నుంచి దొడ్డు బియ్యమే ఇస్తూ వచ్చారని ఆయన తెలిపారు. దొడ్డు బియ్యం తినేవారు లేరని గ్రహించి, పేదలకు తినగలిగే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి సన్నబియ్యం పథకం ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ప్రధాని ఫొటో పెడతాం.. సన్న బియ్యం పథకానికి తమకు ఏటా రూ. 14,500 కోట్ల రూపాయల వ్యయం అవుతున్నదని ఆయన తెలిపారు. ఈ వ్యయాన్ని కేంద్రం మోస్తే పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెడతామని ఆయన చెప్పారు. ఈ పథకం బాగుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని తాను ఇదివరకే కేంద్రాన్ని కోరానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ సన్న బియ్యం పండించాలని రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. 3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఇది 90 శాతం కూడా కావచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విద్యార్థులకు పౌష్టికాహారం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం తమ లక్షమని ఆయన తెలిపారు. అందుకే వరి ఒక్కటే కాదు వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉందని, ఇందులో మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. పంట మార్పిడి విషయంలో రైతులపై వత్తిడి చేయం, అవగాహన కల్పిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 31 Mar 2026 6:40 am

సాదాబైనామాలకు తొలగిన అడ్డంకులు

మనతెలంగాణ/హైదరాబాద్: సాదాబైనామాలకు అడ్డంకులు తొలిగాయి. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 9 లక్షల దరఖాస్తుదారులకు మేలు జరిగేలా ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి సంబంధించి జిఓ 76, 77లను రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్‌కుమార్ జారీ చేశారు. ఈ జిఓలతో సాదాబైనామాల దరఖాస్తులకు అడ్డంకులు తొలగినట్టయ్యింది. భూభారతి చట్టం ద్వారా వాటి పరిష్కారానికి మార్గం లభించినా అనేక అడ్డంకులతో సాదాబైనామాలకు మోక్షం కలగడం లేదు, దీంతో రెవెన్యూ శాఖ ఈ రెండు జీఓల ద్వారా ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమం చేసింది. దరఖాస్తులను క్లియర్ చేసేందుకు జిల్లా కలెక్టర్లు అవలంబించాల్సిన కార్యాచరణ మార్గదర్శకాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. 2016 తరువాత జమాబందీ నిలిచి పోవటంతో రికార్డుల్లో మార్పులు, చేర్పులు సాదాబైనామాను పరిష్కారించాలంటే భూమి విక్రయించిన వ్యక్తుల నుంచి అఫిడవిట్‌తో పాటు కొనుగోలు చేసిన వారి దగ్గర సరైన పత్రాలు ఉండాలి. గత ప్రభుత్వ హయం నుంచే పలుమార్లు సాదాబైనామా తెరపైకి రాగా, తెల్లకాగితాలపై చేసుకున్న భూ క్రయ, విక్రయాల సమస్య నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ప్రభుత్వం ప్రతిసారి సాదాబైనామాల విషయాన్ని ప్రస్తావిస్తున్నా పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. దీనికి ప్రధానంగా గత యజమానుల అఫిడవిట్ లేక పోవడం, వారుసులు అభ్యంతరాలు తెలపడం, 2016 తరువాత జమాబందీ నిలిచి పోవటంతో రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేయటం కష్టంగా మారింది. తాజాగా విక్రయించిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాల్సిందేనని, కొనుగోలు చేసిన వ్యక్తి తప్పుడు రికార్డు సృష్టిస్తే చర్యలకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి వివాదాలు లేనట్లయితేనే దరఖాస్తులను పరిష్కరించి పట్టా జారీ చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావించింది. తెల్లకాగితాలు, స్టాంప్ పేపర్ల ఆధారంగా భూములు కొనుగోలు చేసిన వారు వాటిని సాగు చేసుకుంటున్నప్పటికీ పలు సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ప్రభుత్వం ఈ మార్పులు, చేర్పులను చేస్తూ కొత్తగా జిఓలను జారీ చేసింది. జీఓ నెం.76 ప్రకారం భూమిని కొనుగోలు చేసి వ్యక్తి అఫిడవిట్ ఇస్తే అయితే, అమ్మిన వ్యక్తి కాదు కొన్న వ్యక్తి భూభారతి చట్టంలోని సెక్షన్ (6) ప్రకారం సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించే వెసులుబాటు కల్పించినా ఆ తర్వాత రెవెన్యూ శాఖ జారీ చేసిన నిబంధనలు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఎప్పుడో కొన్న భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లావాదేవీ కోసం అప్పట్లో అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధన ఇబ్బందిగా మారింది. ఈ నిబంధనపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం కావడం, రైతులు ఇబ్బందులు పడుతుండడంతో ఆ నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.76 జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం భూమిని కొనుగోలు చేసి వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అఫిడవిట్‌తో పాటు ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆర్డీఓ పరిశీలిస్తారు. సదరు అఫిడవిట్ సమర్పించిన దరఖాస్తులు 30 రోజుల పాటు పెండింగ్‌లో పెడతారు. ఈలోపు ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే అఫిడవిట్‌తో పాటు డాక్యుమెంట్లను పరిశీలించి సదరు రైతుకు సాదాబైనామా సర్టిఫికెట్ జారీ చేస్తారు. అయితే, కొనుగోలు చేసిన వ్యక్తి ఇచ్చే అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఉందని ఎప్పుడు తేలినా సదరు సర్టిఫికెట్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కోసం రైతు చెల్లించే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును వెనక్కి ఇవ్వరు. దీంతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చిన రైతులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం అయినా జిఓ 77 కింద పరిష్కారం గ్రామాలుగా ఉన్నప్పుడు సాదాబైనామాల దరఖాస్తులను స్వీకరించినా ప్రస్తుతం ఆ గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం అయినా ఆ దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుగా జీఓ నెంబర్‌ను 77 జారీ చేశారు. కొత్తగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటయినప్పుడు చాలా గ్రామాలు వాటిలో విలీనం అయ్యాయి. భూభారతి చట్దానికి అనుగుణంగా ఆయా గ్రామాల్లో సాదాబైనామాలు చేయాలా వద్దా అనే దానిపై రెవెన్యూ అధికారులకు స్పష్టత లేదు. దీంతో ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేరకు పట్టణాల్లో కలిసిన గ్రామీణ ప్రాంతాల్లోని సాదాబైనామాల పరిష్కారానికి 77 జీఓలో వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా సాదాబైనామా సర్టిఫికెట్ జారీ చేసే నాటికి అమల్లో ఉన్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక, క్షేత్రస్థాయిలో ఈ సాదాబైనామా దరఖాస్తుల ప్రక్రియ పరిష్కారం కోసం అవసరమైన కార్యాచరణ మార్గదర్శకాలను జిల్లాల కలెక్టర్లకు జారీ చేసేలా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఏ)కు అనుమతినిస్తున్నట్టు ఈ జిఓలో ఉత్తర్వులు జారీ చేశారు.

మన తెలంగాణ 31 Mar 2026 6:40 am

31marchchintana |ఆధ్యాత్మికత, ప్రశాంతత మనిషి నిజమైన గమ్యం..

31marchchintana | ఆధ్యాత్మికత, ప్రశాంతత మనిషి నిజమైన గమ్యం.. 31marchchintana | జీవితం

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:36 am

అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం 10 రోజుల పాటు జరిగిన సమావేశాలు  మొత్తం 82 గంటల 47 నిమిషాలపాటు జరిగిన శాసనసభ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. 10 రోజుల పాటు జరిగిన శాసనసభా సమావేశాల్లో మొత్తం 82 గంటల 47 నిముషాలు ప్రజా సమస్యలపై చర్చించారు. అందులో అధికార కాంగ్రెస్ పార్టీకి 66 గంటలు, ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్‌కు 37 గంటలు, బిజెపి పార్టీకి 8 గంటలు, ఎంఐఎంకు 7 గంటలు, సిపిఐ పార్టీకి ఒక గంట పాటు సమయం కేటాయించారు. ఈ సమావేశాలలో ప్రభుత్వం మూడు తీర్మానాలు, 11 బిల్లులు ప్రవేశపెట్టగా, 10 బిల్లులు ఆమోదించి, ఒక బిల్లుకు సెలెక్ట్ కమిటీని పరిశీలనకు పంపించినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన 590 ప్రశ్నలకుగానూ ప్రభుత్వం 505 ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఇందులో 53 అన్‌స్టార్ ప్రశ్నలు, 68 స్టార్ ప్రశ్నలు ఉన్నాయని తెలిపారు. డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లు 2026 శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టి చర్చించారు. అనంతర ఉభయ సభలు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తెలిపాయి. అనంతరం ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈనెల 16న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు..సోమవారం (మార్చి 30) రాత్రి వరకు కొనసాగాయి. అంతకుముందుకు శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదించాల్సిన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఇది పీపుల్స్ బడ్జెట్‌గా ఆయన అభివర్ణిస్తూ కోటి 15 లక్షల కుటుంబాలు సంక్షేమ పథకాల లబ్ది పొందుతున్నాయని తెలిపారు. విద్యారంగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విప్లవాత్మకమైన విధానాలు అమలులోకి తీసుకువచ్చామని భట్టి కొనియాడారు. ద్రవ్యోల్భణం శాతం 2.8 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మనమంతా ముందు తెలంగాణవాదులం అని, పార్టీలకు అతీతంగా తమ ప్రజాపాలనకు సహకరిస్తూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 31 Mar 2026 6:30 am

ఏప్రిల్ 4న మూడు మున్సిపాలిటీల చైర్మన్‌ల ఎన్నిక

మన తెలంగాణ/హైదరాబాద్ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ తో పాటు ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గడువు ముగుస్తున్న నేపథ్యములో రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 4 వ తేదీన చైర్మన్ ,వైస్ చైర్మన్ ఎన్నిక జరపనున్నట్టు వెల్లడిం చారు. కాగా ఆయా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై బిఆర్‌ఎస్ న్యాయపోరాటం చేసిన విషయం విదితమే.

మన తెలంగాణ 31 Mar 2026 6:20 am

31marcheditorial |ఉద్యమం క్షీణతకు కారణాలు..

31marcheditorial | ఉద్యమం క్షీణతకు కారణాలు.. 31marcheditorial | మావోయిస్టుల లొంగిపోవడానికి కేంద్రం

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:16 am

గడ్డిమందు పారాక్వాట్‌పై నిషేధం విధించాలి

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మనతెలంగాణ/హైదరాబాద్ : గడ్డిమందు పారాక్వాట్ తయారీ, అమ్మకంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయంలో విస్తృతంగా వినియోగిస్తున్న పారాక్వాట్ అనే ప్రమాదకర గడ్డిమందును తక్షణమే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజ, పర్యావరణ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఈ తీర్మానం చేసిందని తెలిపారు. పారాక్వాట్ వినియోగం వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, అనేక సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారుతున్నదని పేర్కొన్నారు. క్షణికావేశంలో ఈ రసాయనం సేవించడం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. పారాక్వాట్ వంటి అత్యంత విషపూరిత రసాయనాల వినియోగం సుస్థిర, సహజ వ్యవసాయ విధానాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే యూరప్ సహా అనేక దేశాలలో పారాక్వాట్‌పై నిషేధం లేదా కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని అరికట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. పారాక్వాట్ కు ప్రత్యామ్నాయంగా అనేక గడ్డిమందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని పారాక్వాట్ డైక్లోరైడ్ తయారీ, దిగుమతి, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని రాష్ట్ర అసెంబ్లీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి విజ్ఙప్తి చేశారు. ఈ తీర్మానం ద్వారా రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 31 Mar 2026 6:10 am

ఎల్‌పిజి కొరతపై కిరోసిన్ అస్త్రం

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం వంటింటి పైనా పడింది. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడటంతో దేశంలో గ్యాస్, ఇంధనాల కొరత నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరతను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌సమస్యను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. కిరోసిన్- రహితంగా ప్రకటించిన 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా సుపీరియర్‌ కిరోసిన్‌ను తాత్కాలికంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేవలం వంట, దీపాలు వెలిగించడం కోసమే షరతులకు లోబడి ఈ పంపిణీ చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో పాటు లైసెన్స్ పొందిన సర్వీస్ స్టేషన్లలో 2,500 లీటర్ల వరకూ కిరోసిన్ నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది. సుపీరియర్ కిరోసిన్ అనేది ముడిచమురు రిఫైనరీ ప్రక్రియను నుంచి వచ్చే ఉప ఉత్పత్తి. ఇది అత్యంత శుద్ధి చేసిన కిరోసిన్. దీన్ని ప్రధానంగా వంటకు, దీపాలు వెలిగించేందుకు వినియోగిస్తారు. సాధారణ లో గ్రేడ్ కిరోసిన్‌తో పోలిస్తే ఇందులోంచి వెలువడే వాయువులు తక్కువ. పొగ కూడా తక్కువగా వస్తుంది. పశ్చిమ ఆసియాలో నెలరోజులుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు దెబ్బతింది. ముఖ్యంగా వంటగ్యాస్ సరఫరా ప్రభావితమైంది. భారత్ తన అవసరాల్లో సుమారు 60 శాతం ఎల్పీజీ దిగుమతి చేసుకుంటుండగా, అందులో 85-90 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. యుద్ధ పరిస్థితుల వల్ల ఈ సరఫరా నిలిచిపోవడంతో, హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు సరఫరా తగ్గించాల్సి వచ్చింది.ఇంటి వాడుకకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పరిమిత నిల్వల కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొని, గ్యాస్ కోసం భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎల్పీజీపై ఒత్తిడి తగ్గించేందుకు దేశవ్యాప్తంగా కిరోసిన్ వినియోగాన్ని కేంద్రం తాత్కాలికంగా అనుమతించింది. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ మార్చి 29న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, పెట్రోలియం చట్టం-1934, పెట్రోలియం నిబంధనలు-2002 కింద తాత్కాలిక మినహాయింపులు ఇస్తునట్లు తెలిపింది. దీని ప్రకారం ప్రతి జిల్లాలో గరిష్టంగా రెండు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సర్వీస్ స్టేషన్లలో 5,000 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే భద్రతా నిబంధనలను పాటించడం తప్పనిసరి. కిరోసిన్ డీకాంటింగ్ (నిల్వ నుంచి పంపిణీ) కోసం ఏజెంట్లు, డీలర్లు ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఇప్పటికే అనుమతులు ఉన్న ట్యాంకర్ వాహనాలకు అదనపు అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. 

మన తెలంగాణ 31 Mar 2026 6:10 am

కొన ఊపిరిలో నక్సలిజం

 నక్సల్స్‌కి ఇవి తుది ఘడియలు మోడీ సారథ్యంలో విజయం సాధించాం ఇందిరాగాంధీ రాజకీయ స్వార్థంతోనే నక్సలిజం ఆవిర్భావం కాంగ్రెస్ వైఖరితో గిరిజనులకు తీరని నష్టం గద్దర్‌తో రాహుల్ గాంధీ చర్చలు దేనికి సంకేతం?  లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో నక్సలిజం ఇప్పుడు కొన ఊపిరితో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సో మవారం లోక్‌సభలో చెప్పారు. కేంద్రంలోని మో డీ ప్రభుత్వ సారధ్యంలో మావోయిస్టు తీవ్రవాదం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నక్సలిజం అంతానికి నిర్ధేశిత గడువు విధించుకుందని, ఈ మేరకు కార్యాచరణ పూర్తి అయిందని తెలిపారు. మావోయిస్టు హింసాత్మకతకు కేంద్ర బిందువు అయిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం ఇప్పుడు నక్సల్స్ విముక్తం అయిందని చెప్పిన అమిత్ షా ఈ దశలో కాంగ్రెస్ పాలకుల తీరుపై మండిపడ్డారు. ఈ ఏడాది మార్చి 31 లోగా నక్సలిజం అంతం అని గతంలో కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. తరువాతి దశల్లో పలు స్థాయిలో పెద్ద ఎత్తున సరెండర్లు, భారీ ఎన్‌కౌంటర్ల ఘట్టాల తరువాత ఇప్పుడు నిర్ణీత డెడ్‌లైన్‌కు ఒక్కరోజు ముందు కేంద్ర హోం మంత్రి లోక్‌సభలో ప్రకటన వెలువరించారు. నక్సలిజం ని ర్మూలనలో ప్రభుత్వ ముందడుగును గురించి అ మిత్ షా ప్రస్తావించారు. బస్తర్ ఇప్పుడు వినూత్న రీతిలో బతుకుబాటలో సాగుతోందని, అభివృద్ధి పథంలో ముందుందని తెలిపారు. ఈ దిశలో సాధించిన విజయంలో ప్రతిష్ట అంతా కూడా భద్రతా బలగాలకు, స్థానిక పోలీసు బలగాలు, అక్కడి ఆదివాసీ తెగలకు చెందుతుందని స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల ప్రమేయం వారి సహకారం లేకుండా ఈ బృహత్తర లక్షం నెరవేరడం దుర్ల భం అయ్యేది అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పలు పునరావాస పథకాలను, సహాయక చర్యలను చేపట్టాయని.. క్రమంలోనే 4800కు పైగా నక్సల్స్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి చేరారని వెల్లడించారు. మూడేండ్లలో 706మంది నక్సల్స్‌ను మట్టుపెట్టారని, వీరిలో అగ్రశ్రేణి నక్సల్ నేతలు, పేరుమోసిన దళాల వారు ఉన్నారని గుర్తు చేశారు. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లోని అటవీశాఖా, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కూడా సరైన విధంగా స్పందించారని తెలిపారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే కేవలం రెండు నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు పునరావాస, సంక్షేమ చర్యలకు ప్రాధాన్యత ఇస్తూనే, మరో వైపు నక్సల్ కార్యకలాపాల ఆటకట్టుకు కటుతర చర్యలకు దిగిందని,ఈ ద్విముఖ వ్యూహం ఫలించిందని తెలిపారు. కాంగ్రెస్ వైఖరితోనే నక్సలిజం సమస్య 1970లో ఇందిరా గాంధీ రాజకీయ ఎత్తుగడ దుష్పలితం.. దేశంలో నక్సలిజం సంస్కృతి పెరిగిపోయి, అటవీ ప్రాంతాలు ఆదివాసి కేంద్రాలు క్రమేపీ మావోయిస్టు కేంద్రీకృత హింసాత్మక చర్యలకు వేదికలు అయ్యాయని అమిత్ షా తెలిపారు. ఇందుకు కారణం ఆయా ప్రాంతాల్లో చిరకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరే అని విమర్శించారు. మారుమూల వెనుకబడ్డ ప్రాంతాలలో అభివృద్ధి ఫలాలు ఆయా ప్రాంతాల్లోని ఆదివాసీలకు చేరవేయడంలో కాంగ్రెస్ పాలకులు నిర్లక్షం వహించారు. పైగా దళారి వ్యవస్థను పోషించడం ద్వారా ఈ ప్రాంతంలో ఆదివాసీలు తరాలుగా వెనుకబడ్డారని,ఈ క్రమంలోనే నక్సలిజం వేళ్లూనుకుందని అమిత్ షా తెలిపారు. తరువాతి క్రమంలో ఇది అదుపు తప్పి చివరికి తీవ్రస్థాయి హింసాత్మకతకు దారితీసిందన్నారు. నక్సలిజం అనేది అభివృద్ధి వాంఛతో తలెత్తలేదని , కేవలం వామపక్ష సిద్ధాంతాల భావజాలం వ్యాప్తితోనే జరిగిందని తెలిపారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ స్వార్థం కోసం ఇతర పార్టీలను దెబ్బతీసేందుకు దేశంలో కొన్ని ప్రాంతాలలో కావాలనే వామపక్ష సిద్ధాంతాలను ప్రోత్సహించిందని తెలిపారు. కమ్యూనిజం కాదని, 1970 ప్రాంతంలో ఇందిరాగాంధీ ఏకంగా ఈ వామపక్ష తీవ్రవాద జాలాన్ని ఎంచుకున్నారు. అప్పటి రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం కోసం ఈ ఎత్తుగడకు దిగారని, దీనితో పలు ప్రాంతాల్లో నక్సలిజం పుట్టకువచ్చిందని అమిత్ షా విశ్లేషించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రగతి ఫలాలను అందించలేదు. పైగా గిరిజన ప్రాంతాలను నిర్లక్షం చేశాయి. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాలను ఎంచుకుని వామపక్ష తీవ్రవాదం విస్తరించుకుందని, ఇన్నేళ్లకు మోడి ప్రభుత్వం ఈ జడల మర్రి ఊడలను దించిందని తెలిపారు. రేపటితో ఈ నక్సలిజం అంతం గడువు. నిర్ణీత లక్షం మేరకు దాదాపుగా సంపూర్తి అవుతుందన్నారు.  గద్దర్‌తో రాహుల్ చర్చలు దేనికి సంకేతం దేశంలో నక్సలిజం అంతం ప్రకటన దశలో హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ నేత , ఎంపి రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ తన సొంత బాజా కోసం దేశ భద్రతకు సవాళ్ల సమస్యలపై కూడా నిర్లక్షం వహించారని తెలిపారు. లోక్‌సభలో తమ ప్రకటన దశలో అమిత్ షా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఈ యాత్రలో నక్సలైట్లకు చెందిన పలువురు వివాదాస్పద వ్యక్తులు , ప్రముఖులు వచ్చి ఆయనను కలిశారు. యాత్రలో పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణకు వెళ్లినప్పుడు రాహుల్ తన ప్రచార ఆర్బాటంలో భాగంగా గద్దర్, కొందరు అజ్ఞాత నేతలను కలుసుకునే వారని , దీనికి ప్రచారం కల్పించుకునేలా చేసుకున్నారని విమర్శించారు. నక్సల్స్ అనుబంధ సంస్థలు, సంఘాలతో రాహుల్ పరిచయాలు, మిత్రత్వ ప్రదర్శనలు ఎటువంటి సంకేతాలకు దారితీస్తాయనేది ఆలోచించారా? అని ప్రశ్నించారు. సాయుధ ఉద్యమాల పిలుపులను సహించేది లేదని, వారికి వంతపాడే వారిని కూడా ఉపేక్షించేది లేదని అమిత్ షా హెచ్చరించారు. మిగిలిన నక్సల్స్ ఆయుధాలు వీడితేనే వారితో చర్చల ప్రసక్తి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ తన గొంతును లోక్‌సభలో అణచివేస్తున్నారనే వాదనను అమిత్ షా తోసిపుచ్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలకు సభలలో మాట్లాడేందుకు 157 గంటల సమయం ఇచ్చారు. ఇక ప్రతిపక్ష నేత రాహుల్‌ను మాట్లాడేందుకు పలుసార్లు అవకాశం కల్పించారు. అయితే ఆయనే దీనిని వాడుకోలేదు. పక్కదారితో సభల నుంచి వెళ్లిపోతూ వచ్చారని వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 31 Mar 2026 6:00 am

31stMarch2026 |మంగళవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

31stMarch2026 | మంగళవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 31stMarch2026 |

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:00 am

మంగళవారం రాశి ఫలాలు (30-03-2026)

మేషం బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభం వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మిధునం సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కొన్ని వ్యవహారాలు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. వృధా ఖర్చులు ఉంటాయి. కర్కాటకం ఇంటా బయట పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సింహం చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం ఉన్నది. కన్య చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. తుల కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగవు. వృశ్చికం బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధనస్సు జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. ధనాదాయం బాగుంటుంది. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకరం పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుంభం మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. మీనం ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి.  

మన తెలంగాణ 31 Mar 2026 12:00 am

Guruthundha from Chennai Love Story: Magical Melody launched at Dolby Cinema

Kiran Abbavaram and Sri Gouri Priya playing lead roles in Chennai Love Story. The blockbuster filmmaker Sai Rajesh provided the story and producing the film in association with successful producer SKN under Amrutha Productions and Mass Movie Makers banner. The previously released glimpse has become the talk of the town. Now, the makers released the […] The post Guruthundha from Chennai Love Story: Magical Melody launched at Dolby Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 11:38 pm

రాబోయే మూడేళ్లలో రూ.70 వేల కోట్లతో రోడ్లు: మంత్రి వెంకట్ రెడ్డి

హ్యామ్ విధానంలో వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభం గ్రామీణ రోడ్లతో రైతులు, విద్యార్థులు, రోగులకు మెరుగైన సౌకర్యాలు జాతీయ రహదారుల విస్తరణతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం గేమ్ ఛేంజర్‌గా మారనున్న త్రిబుల్ ఆర్, గ్రీన్ ఫీల్ ఎక్స్‌ప్రెస్‌వే అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే మూడు సంవత్సరాల్లో 70 వేల కోట్లతో రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి రోడ్లు భవనాలు శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, లక్ష్యాలు గురించి శాసన సభలో ప్రసంగించారు. మంచి రోడ్లు ఉంటే పెట్టుబడులు పెరిగి, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. రోడ్ల అభివృద్ధి ద్వారా మార్కెట్ సౌకర్యాలు మెరుగుపడి, పరిశ్రమలు విస్తరించి సమగ్ర ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధితో రైతులకు పంట మార్కెట్‌కు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని, విద్యార్థులు విద్య కోసం సులభంగా ప్రయాణిస్తారని, అత్యవసర పరిస్థితుల్లో రోగులు సమయానికి (గోల్డెన్ అవర్ లో) ఆసుపత్రులకు చేరుకోవచ్చని వివరించారు. యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. మోర్త్ లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో, 1.6 లక్షల మంది మరణించారని తెలిపారు. రాష్ట్రంలో 22,441 ప్రమాదాలు జరిగి 6,221 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. డబ్బు పోతే తిరిగి వస్తుందని, ప్రాణం పోతే తిరిగి రాదని అన్నారు. రోజుకు సగటున 18 నుండి 20 మంది మరణించడం విచారకరమని, ఇందులో ఎక్కువగా యువతే ఉండటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ఇటీవల చేవేళ్ల-, మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రోడ్డు అభివృద్ధి అనేది కేవలం మౌలిక వసతుల నిర్మాణం కాకుండా ప్రాణాలను కాపాడే బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో మొత్తం 34,062 కి.మీ రోడ్డు నెట్‌వర్క్ ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 7,590 కోట్లతో 1,835 కి. మీ రోడ్ల పనులు చేపట్టామని మంత్రి వెల్లడించారు. రూ. 13,051 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గత 27 నెలల్లో 595 కి.మీ రోడ్లు, 51 వంతెనలు పూర్తి (రూ. 1,035 కోట్లు) 323 కి.మీ రోడ్లు, 16 వంతెనలు (రూ. 485 కోట్లు) పూర్తయినట్లు వివరించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం హ్యామ్ (హైబ్రిడ్ అన్యూటి మోడల్) అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విధానంతో 12,000 కి.మీ రోడ్ల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఫేజ్-1లో 6,092 కి.మీ రోడ్లును సుమారు రూ. 13,006 కోట్ల వ్యయంతో 30 నెలల్లో నిర్మాణం, 15 సంవత్సరాల నిర్వహణ ఉంటుందని వివరించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (త్రిబుల్ ఆర్), హైదరాబాద్ నుంచి- విజయవాడ ఆరు లేన్ల విస్తరణ, అమరావతి నుంచి బందరు పోర్టు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, బుల్లెట్ ట్రైన్ కారిడార్లు (చెన్నై, పూణే, బెంగళూర్) లాంటి నగరాలను కలుపుతూ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. బుల్లెట్ ట్రైన్స్ కోసం కేంద్రంగా భారత్ ఫ్యూచర్ సిటీలో శంషాబాద్ దగ్గరలో 500 ఎకరాలు ప్రభుత్వం కేటాయించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయన్నారు. వేగంగా కొనసాగుతున్న ఉస్మానియా, హైకోర్టు కొత్త భవనాల పనులు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు రాష్ట్ర ఆర్‌అండ్‌బి శాఖ ఆధ్వర్యంలో పలు కీలక నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు మంత్రి తెలియజేశారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం నిర్మణం జరుగుతోందని, కొత్త హైకోర్టు భవనాల నిర్మాణం ప్రస్తుతం పిల్లర్ల దశలో ఉండగా, పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. అదే విధంగా నగర అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని నాలుగు వైపులా అధునాతన ఆస్పత్రులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. మొత్తం రూ. 8,000 కోట్ల వ్యయంతో నాలుగు పెద్ద ఆస్పత్రులను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సనత్ నగర్‌లో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రి దాదాపు రూ. 2,000 కోట్ల వ్యయంతో జూన్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 30 Mar 2026 11:12 pm

ఫ్యాక్ట్ చెక్: రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటనను ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనగా ప్రచారం చేశారు

రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటనను ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనగా

తెలుగు పోస్ట్ 30 Mar 2026 10:58 pm

మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆంధప్రదేశ్..

మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణ రావు సహా తొమ్మిది మంది ఎపి డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని డిజిపి ప్రకటించారు. లొంగిపో యిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ డంప్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేత, ఆంధ్రాఒడిశా సరిహద్దు (ఏవోబి) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణ రావు తలపై రూ.25 లక్షల భారీ రివార్డు ఉందంటేనే ఆయన ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఆయనతో పాటు కర్తం లచ్చు (రూ.5 లక్షల రివార్డు), పోడియం రాజే, ముచ్చిక మాస, మడవి జోగి, కర్తం అడామే(తలో రూ. 4 లక్షల రివార్డు), మాదివి అడా మా, ముచ్చిక లక్ష్మణ్, కడితి హుర్రే (తలో రూ.1 లక్ష రివార్డు) వంటి ముఖ్య నేతలు లొంగిపోయారు. వీరికి ప్రభుత్వం తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ. 20,000 అందజేసి, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు భరోసా కల్పించింది. పభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గ్రామాలకు కూడా చేరుతుండటం, ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పు రావడంతో ఉద్యమ ఉనికి తగ్గుతోందని, అందుకే సాయుధ పోరాటాన్ని వీడి లొంగిపోయినట్లు సోమన్న వివరించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నారాయణరావు దాదాపు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. 1989లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరిన ఆయన, క్రమంగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మిలిటరీ ఆపరేషన్లలో ఆరితేరిన నేతగా గుర్తింపు పొందాడు. గత ఏడాది అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక నేతలు గాజర్ల రవి, అరుణ మరణించిన తర్వాత, ఏవోబీ బాధ్యతల్ని సోమన్న చేపట్టారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో పలు కేసులు నమోదయ్యాయి. ఎపి ప్రభుత్వం భారీ రివార్డును కూడా ప్రకటించింది. ఉద్దానం ప్రాంతం నుంచి వచ్చిన సోమన్న లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కు కోల్పోయినట్లయింది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు పరిస్థితులు మారాయని, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు వెళ్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సాయుధ పోరాటం ద్వారా సాధించేదేమీ లేదని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లొంగుబాటు ఏవోబి ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి విఘాతంగా మారుతుందని భద్రతా దళాలు భావిస్తున్నాయి. గతంలో అగ్రనేతగా ఉన్న గణపతి వంటి వారు ప్రస్తుతం రాష్ట్రంలో లేరని, ఇతర రాష్ట్రాల విషయాల గురించి మాట్లాడలేమని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇప్పుడు పూర్తి శాంతి నెలకొందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోయిన వారిపై చట్టపరమైన ప్రక్రియ యథావి ధిగా జరుగుతుందని, అదే సమయంలో వారి పునరావాసానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. హింస వల్ల సాధించేదేమీ లేద ని, అభివృద్ధి పథంలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ఇవాళ సత్ఫలితాలను ఇచ్చింది. నక్సలిజం కోరల్లో చిక్కుకుని నలిగి పోయిన మారుమూల గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి వెలుగులు ప్రసరించనున్నాయి. ఎపి పోలీసుల తెగువ, కేంద్ర ప్రభుత్వ దృఢ నిశ్చయం కలిసి రాష్ట్రాన్ని నక్సల్స్ ఫ్రీ స్టేట్‌గా నిలబెట్టాయి.

మన తెలంగాణ 30 Mar 2026 10:07 pm

ഫാക്ട് ചെക്ക്: സൌദി രാജകൊട്ടാരത്തിൽ വെടിവെപ്പ്? പ്രചാരണത്തിൻ്റെ വസ്തുതയെന്ത്

ഇറാൻ ആക്രമണത്തിനെതിരെ സൌദി രംഗത്തെത്തിയതിന് പിന്നാലെയാണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 30 Mar 2026 10:02 pm

Palnadu Family Suicide : పల్నాడు గుండె చెరువు Andhra Prabha News

Palnadu Family Suicide : పల్నాడు గుండె చెరువు Andhra Prabha News

ప్రభ న్యూస్ 30 Mar 2026 9:53 pm

కాంగ్రెస్ పాలనలోనూ ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదు: విజయశాంతి ఆవేదన

ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ తప్పనిసరి బాధ్యత నిర్లక్ష్యం చేస్తే అది చారిత్రక తప్పిదమే మండలిలో ఎంఎల్‌సి విజయశాంతి ఆవేదన మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమంపై శాసనమండలిలో ఎంఎల్‌సి విజయశాంతి తన గళం వినిపించారు. ప్రభుత్వంపై ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సోమవారం ఆమె సభలో మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే, ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఉండేవారా? అని ప్రశ్నించారు. పదవుల కంటే ముందు వారి త్యాగాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలతో పాటు వివిధ సందర్భాల్లో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పనిసరిగా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను ఆదుకోవడమనేది ప్రభుత్వ తప్పనిసరి బాధ్యత అని అన్నారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తిస్తే అది చరిత్రగా నిలుస్తుంది. లేని పక్షంలో వారిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా ఇంకా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు సైతం అమలు కాలేదన్నారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఆయా కుటుంబాలకు నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ సైతం ఇచ్చామని ప్రభుత్వానికి వివరించారు. ఉద్యమకారులకు మనం తొలి ప్రాధాన్యం ఇస్తామని భరోసా కూడా ఇచ్చామన్నా . ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు తమను ప్రశ్నిస్తున్నారని శాసనమండలి వేదికగా ఎంఎల్‌సి విజయశాంతి వివరించారు. ఉద్యమ కారులపై పెట్టిన కేసులు ఎత్తి వేసి జూన్ 2వ తేదీ నాటికి వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చామని అది కూడా ఇంకా నెరవేరలేదని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన గౌరవం, పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని విజయశాంతి ప్రభుత్వానికి ఆమె సూచించారు.

మన తెలంగాణ 30 Mar 2026 9:35 pm

ఆడబిడ్డలకు శానిటరీ ప్యాడ్స్ అందించలేని దుస్థితిలో ప్రభుత్వాలు..

ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ హాస్టళ్లు, కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు కనీసం శానిటరీ ప్యాడ్స్ అందించలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఎక్స్ వేదికగా కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పీఎం శ్రీ పథకం కింద ఇతర స్కూళ్లలో ఇస్తున్నట్టే ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ హాస్టళ్లు, కెజిబివిల్లో చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతినెలా విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని ఆమె కోరారు.

మన తెలంగాణ 30 Mar 2026 9:22 pm

గెట్ అవుట్.. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్‌తో శాసనమండలి కార్యకలాపాలకు అడ్డుతగిలిన ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన 11 మంది ఎంఎల్‌సిలను సభ నుంచి చైర్మన్ గత్తా సుఖేందర్‌రెడ్డి సస్పెండ్ చేశారు.పెద్దల సభ గౌరవాన్ని కాపాడేందుకు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాల్సిందిగా శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైర్మన్ ఆమోదిస్తూ వారిని సభ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. అయితే సస్పెండ్ చేసినట్టు ప్రకటించినప్పటికీ బయటికి వెళ్లడానికి నిరాకరించిన ఎమ్మెల్సీలపై ఒకదశలో ‘గెటవుట్’ అంటూ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘మీలాంటి వారు సభకు రావడం దురదృష్టకరం&పెద్దల సభ గౌరవాన్ని దిగజార్చారు’ అని చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. శాసన మండలిలో సోమవారం బీఆర్‌ఎస్ సభ్యులు, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఛైర్మెన్ పోడియం దగ్గరికి దూసుకెళ్లారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిల ఆందోళన మధ్యనే తల్లిదండ్రుల సంరక్షణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఛైర్మన్ పోడియం వద్ద కు చేరుకుని ప్లకార్డులు పట్టుకుని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు నిరసన తెలిపారు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఈ అంశంపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లుగా శాసనసభలో స్పష్టం చేశామన్నారు. సభ సజావుగా సాగేందుకు బిఆర్‌ఎస్ సహకరించాలని కోరారు. మరో వైపు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా సభా కార్యక్రమాల నిర్వహణకు సహకరించాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలను పదే పదే కోరారు. సభ్యుల ప్రవర్తన సభా నియమావళికి విరుద్ధమని చెప్పినప్పటికీ వినిపించుకోకపోవడంతో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు 11 మందిని సభ నుండి సస్పెండ్ చేస్తోన్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మార్షల్స్‌కు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలకు మధ్య తోపులాట జరిగింది. సస్పెన్షన్ వేటు వేసిన తరువాత సైతం సభలోనే ఉండి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు చైర్మన్ పోడియం చుట్టుముట్టే ప్రయత్నం చేయడం, నిరసనకు దిగడంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సస్పెండ్ అయిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు : మధుసూదన్ చారీ, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, నవీన్ కుమార్ రెడ్డి, వంటేర్ యాదవ రెడ్డి, శంబీపూర్ రాజు, దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ, కోటి రెడ్డి, వాణీ దేవి, తాతా మధు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.****

మన తెలంగాణ 30 Mar 2026 9:17 pm

15K Hunting Foeces : అతడెవరు? Andhra Prabha SPL Story

15K Hunting Foeces : అతడెవరు? Andhra Prabha SPL Story (

ప్రభ న్యూస్ 30 Mar 2026 9:12 pm

ప్రధాని మోడీ ఫొటో పెడతాం: సిఎం రేవంత్

హైదరాబాద్: సన్న బియ్యం పథకానికి తమకు ఏటా రూ.14,500 కోట్ల రూపాయల వ్యయం అవుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తే.. పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెడతామని సిఎం చెప్పారు. సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. సన్న బియ్యం పథకం బాగుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని తాను ఇదివరకే కేంద్రాన్ని కోరానని తెలిపారు. రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ సన్న బియ్యం పండించాలని రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నామని సిఎం అన్నారు. 3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఇది 90 శాతం కూడా కావచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మన తెలంగాణ 30 Mar 2026 9:04 pm

స్పోర్ట్స్ హ్యాకథాన్‌లో 2,132 వినూత్న ఆవిష్కరణలు

హైదరాబాద్: క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన స్పోర్ట్స్ హ్యాకథాన్ ఘనంగా ముగిసింది. గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న హ్యాకథాన్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, క్రీడాకారులు, స్టార్టప్‌లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలు రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయేశ్ రంజన్, ఐఏఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (క్రీడలు), తెలంగాణ ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ యువతలో సృజనాత్మకతను వెలికితీసే ఇలాంటి వేదికలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్, గౌరవ ఉప సభాపతి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ హ్యాకథాన్‌లో ప్రత్యేకత ఏమిటంటే, కరాటే, వాలీబాల్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, పవర్‌లిఫ్టింగ్, చెస్, కేరంలు వంటి మొత్తం 24 క్రీడలు భాగస్వామ్యం కావడం. పాల్గొన్న వారు క్రీడల్లో పాల్గొంటూనే వాటిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి వినూత్న పరిష్కారాలను ఆవిష్కరించారు. ఈ ఆలోచనలను “పిచ్ అరేనా” వేదికపై నిపుణులు, అధికారులు, పెట్టుబడిదారుల ముందు ప్రదర్శించారు. ఈ హ్యాకథాన్‌లో వచ్చిన ఆవిష్కరణలు క్రీడల పనితీరు మెరుగుదల, శిక్షణ విధానాలు, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులను చూపిస్తున్నాయి. ఈ 2,132 ఆవిష్కరణలను ప్రత్యేక స్మారక గ్రంథంగా (Souvenir) ప్రచురించేందుకు నిర్వాహకులు ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా హ్యాకథాన్ బ్రాండ్ ఓనర్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ.. “క్రీడలు కేవలం ఆటలకే పరిమితం కావు — అవి ఆవిష్కరణలకు కూడా మార్గం చూపుతాయి. ఈ హ్యాకథాన్ ద్వారా యువతలో ఉన్న అపార సృజనాత్మకత వెలుగులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మా లక్ష్యం” అని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడం ద్వారా తెలంగాణ రాష్ట్రం క్రీడలు మరియు ఆవిష్కరణల రంగంలో ముందంజలో ఉందని మరోసారి రుజువైంది.

మన తెలంగాణ 30 Mar 2026 8:56 pm

జిఒ 317 బాధితులకు న్యాయం చేయండి: సిఎంకు కవిత లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్: జిఒ 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వన్ టైం రిలీఫ్ కింద ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అప్పటికే వివిధ ఉమ్మడి జిల్లాలు, జోన్‌లలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రాతిపాదికన కొత్త జిల్లాలు, జోన్‌లలో పోస్టింగ్స్ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగుల సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఎనిమిదేళ్లు, అంతకన్నా తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు, టీచర్లు ఆయా ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏదో ఒక జిల్లాకు అలాట్ అయ్యారని గుర్తు చేశారు. ఇలా ఉద్యోగులను కొత్త జిల్లాలు, జోన్ల వారీగా సర్దుబాటు చేయడానికి అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2021 డిసెంబర్ 6న జిఒ నంబర్ 317 జారీ చేసిందని తెలిపారు. కానీ, ఆ జిఒలోనూ స్థానికతపై స్పష్టత లేకపోవడంతో వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. జిఒ 317తో ఉద్యోగులు, టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అప్పటి సిఎం కెసిఆర్‌కు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.  

మన తెలంగాణ 30 Mar 2026 8:44 pm