మంగళవారం రాశి ఫలాలు (03-02-2026)
మేషం సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభం చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిధునం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి. కర్కాటకం చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహం చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రులతో చర్చలు చేస్తారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు. కన్య కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి. తుల కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చికం నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. ధనస్సు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయట పడతారు. మకరం వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు. కుంభం ఇంట బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీనం వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
వైసీపీ ట్రాప్లో పడొద్దు…అలజడి రేపేందుకు కుట్రలుటీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమాజంలో అలజడి సష్టించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని… టీడీపీ శ్రేణులు వారి ట్రాప్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆ పార్టీ నేతలకు సూచించారు. విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: సమాజంలో అలజడి సష్టించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని… టీడీపీ శ్రేణులు వారి ట్రాప్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత, […] The post రెచ్చగొడితే రెచ్చిపోవద్దు appeared first on Visalaandhra .
. సీఈసీ అబద్ధాల కోరు… 58 లక్షల ఓట్లు తీసేస్తారా!. ఎసఐఆర్ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. బంగా భవన్ వద్ద భద్రతా సిబ్బంది, మమత వాగ్వాదం. నలుపు దుస్తులు ధరించి సీఈసీని కలిసిన టీఎంసీ నేత న్యూదిల్లీ: దిల్లీలో ఇప్పటికీ భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ […] The post ఈసీపై మమత యుద్ధం appeared first on Visalaandhra .
ఎన్నికలలో పోటీకి అర్హత సాధించాలంటే కుమార్తెను అడ్డుతొలగించాలని ఆలోచించిన ప్రబుద్ధుడు. చివరకు కన్నబిడ్డను కడతేర్చాడు. కూతురిని నమ్మించి బయటకు తీసుకొచ్చిన తండ్రి.. కాలువలోకి తో సి దారుణంగా హతమార్చాడు. మానవత్వం మంటగలిసిన ఈ దారుణ ఘటన ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మీడియాకు వెల్లడించారు. జ నవరి 29న ఎడపల్లి మండలం ఎఆర్పి క్యాంపు శివారులోని నిజాంసాగర్ కెనాల్ (డి-46/8)లో ఆరేళ్ల గుర్తు తెలియని చిన్నారి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి, బోధన్ ఏసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ఫోటోను సామాజిక మాద్యమాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈక్రమంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన పిసి-630 సుధీర్ తన వాట్సాప్ స్టేటస్లో ఉంచిన ఫోటోను మహారాష్ట్రలోని ముఖేడ్ గ్రామస్తులు గుర్తించి, పాప ప్రాచి కొండమంగలే అని పోలీసులకు సమాచారం అందించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలుకా కెరూర్ గ్రామానికి చెందిన కొండమంగలే పాండురంగకు ముగ్గురు పిల్లలు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలని అతను ఆశపడ్డాడు. నిబంధనల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హుడు. దీనిపై ప్రస్తుత సర్పంచ్ గణేష్ షిండేతో కలిసి చర్చించిన పాండురంగ, తన ముగ్గురు పిల్లలలో ఒకరిని తక్కువ చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పథకం వేశాడు. ఒక బిడ్డను చంపేసి తప్పిపోయినట్టు నమ్మించాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకా రం... తండ్రి పాండురంగ తన పెద్ద కూతురు ప్రాచిని బైక్పై మాయమాటలు చెప్పి ఎడపల్లికి తీసుకువచ్చాడు. పాపను నిజాంసాగర్ కాలువలోకి తోసేసి పరారయ్యాడు. పోలీస్ దర్యాప్తులో గుట్టు రట్టుకావడంతో.. పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
రోడ్డెక్కిన విద్యుత్ మీటర్ రీడర్లు
హామీల అమలుపై నిర్లక్ష్యం సరికాదు . బాబు, పవన్, లోకేశ్ తీరు దుర్మార్గం. కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న ‘కూటమి’. న్యాయం చేయకుంటే పోరాటాలతో బుద్ధి చెబుతాం: ఈశ్వరయ్య విశాలాంధ్ర`విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం విద్యుత్ మీటర్ రీడర్స్ ‘చలో విజయవాడ’ నిరసన కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టింది. ధŠర్నాచౌక్ వద్ద ఏర్పాటు […] The post రోడ్డెక్కిన విద్యుత్ మీటర్ రీడర్లు appeared first on Visalaandhra .
. నిధుల కేటాయింపులో తీవ్ర వివక్షu ప్రత్యేక హోదా ఊసేలేదు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కేంద్రం మౌనం. ఏపీని పట్టించుకోని కేంద్ర బడ్జెట్. దేశవ్యాప్తంగా సామాన్యుల బతుకుపోరుకు భరోసా కరువు. పన్ను పోటు యథాతథం. మాటల గారడీతో సరిపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విశాలాంధ్ర – సచివాలయం: కార్మికులు, కర్షకులతో పాటు పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన వార్షి బడ్జెట్ తీవ్ర నిరాశే మిగిల్చింది. పెరిగిన నిత్యావసర […] The post విభజన హామీలకు తిలోదకాలు appeared first on Visalaandhra .
ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ కు తృటిలో తప్పిన ప్రమాదం
ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. విమానం ఎడమ ఇంధన నియంత్రణ స్విచ్ రెండు సార్లు రన్ స్థానంలో నిలవకుండా, ఇంజన్ స్టార్టప్ సమయంలో కటాఫ్ కు మారడంతో దానిని నిలిపివేసినట్లు ఎయిర్ లైన్స్ ప్రతినిధి సోమవారం నాడు తెలిపారు. ఎయిర్ ఇండియా 132 విమానం హీత్రో విమానాశ్రయం నుంచి బెంగళూరుకు సోమవారం వచ్చింది.బోయింగ్ 787-8 విమానం లో ఇంధన నియంత్రణ స్విచ్ లో లోపం ఉందని ఎయిర్ ఇండియా పైలెట్లలో ఒకరు నివేదించారని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాథమిక వివేదిక అందుకున్న తర్వాత ,ఆ విమానాన్ని నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. పైలెట్ ఆందోళనను పరిగణనలోకి తీసుకుని,ప్రాధాన్యతా ప్రాతిపదికన తనిఖీలు నిర్వహించవలసిందిగా , విమానం తయారీ దారు అయిన బోయింగ్ ను కోరినట్లు , ఆ సంస్థ ఎయిర్ ఇండియాతో సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు.ఇంధనం స్విచ్ కు సంబంధించి తలెత్తిన సమస్యను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ అథారిటీ (డిజిసిఏ) తెలియజేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికుల భద్రతే సంస్థ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొంది.2025 జూన్ లో అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ కుప్పకూలి 250 మందివరకూ మరమించిన తర్వాత టాటా యాజమాన్యం అన్ని బోయింగ్ 787 విమానాలలో ఇంధన నియంత్రణ స్విచ్ లను కచ్చితంగా తనిఖీ చేసి, లోపాలు లేవని నిర్థారించింది.
68,000 మంది ఉద్యోగుల జీతాలను నిలిపివేసిన యోగి సర్కార్
ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 68,236 మంది రాష్ట్ర ఉద్యోగుల జీతాలను నిలిపివేయడం సంచలనం కల్గించింది. ఇది వివిధ విభాగాలలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. జనవరి 31 లోగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు అంతా, తమతమ ఆస్తుల వివరాలను ప్రకటించాలన్న ప్రభుత్వం ఆదేశాన్ని పాటించక పోవడంతో ఈ చర్య తీసుకున్నారని తెలిసింది.ఉత్తరప్రదేశ్ లో మొత్తం 8,66,261 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. జనవరి 31లోగా మానస్ సంవిదా పోర్టల్ లో ఉద్యోగులు అంతా తమ స్థిరాస్తులు, చరాస్తుల వివరాలను అప్ లోడ్ చేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ నిబంధనలు పాటించని వారి జీతాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. జీతాలు నిలిచి పోయిన ఉద్యోగులలో, అత్యధిక సంఖ్యలో క్లాస్ 3 కు చెందిన వారే 34,926 మంది ఉన్నారు. ఇతరులలో క్లాస్ 2 ఉద్యోగులు 724 మంది, క్లాస్ 1 ఉద్యోగులు 2,628 ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మయన్మార్ గ్యాంగ్లో మరో నలుగురికి చైనాలో మరణశిక్ష
తైపే( తైవాన్) : ఆన్లైన్ మోసాలతోపాటు హత్యలు, టెలికాం మోసాలు, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్న మయన్మార్కు చెందిన గ్యాంగ్ లోని మరో నలుగురికి చైనాలో మరణశిక్ష అమలైంది. ఆరుగురు చైనీయుల మరణానికి వీరు కారణమైనట్టు తేలడంతో గత ఏడాది నవంబరులో కోర్టు మరణ శిక్ష విధించింది.మయన్మార్లో స్కామ్ సెంటర్లు నడుపుతున్న 11 మంది సభ్యుల నేర ముఠాకు మరణశిక్ష అమలు చేసినట్టు గతవారం ప్రకటించింది. స్కామ్ సెంటర్లు, కేసినోలు నడుపుతున్న బై కుటుంబానికి చెందిన వారితో సహా ఐదుగురికి షెంజెన్ కోర్టు గత నవంబరులో మరణశిక్ష విధించగా, వారిలో ఒకరు బై సోచింగ్గ్రూపు లీడర్ శిక్ష పడిన తరువాత అస్వస్థుడై మృతి చెందాడు. ఈ మాఫియా తమ వద్ద పనిచేస్తూ తప్పించుకోడానికి ప్రయత్నించిన 14 మంది చైనీయుల ప్రాణాలు తీసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యం లోనే ఆ ముఠా లోని నలుగురికి మరణశిక్ష అమలైనట్టు వెలుగులోకి వచ్చింది.
ట్రక్కుకింద పడి తండ్రీకొడుకుల మృతి
ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందిన సంఘటన వికారాబాద్లో చోటుచేసుకొన్నది. సోమవారం ఉదయం సుమారు 07:40 గంటల సమయంలో వికారాబాద్ పట్టణ పరిధిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధారూర్ మండలం కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన చాకలి లాలలయ్య (35), తన కుమారుడు చాకలి రిథిక్ (6)తో కలిసి మోటార్ సైకిల్పై వికారాబాద్ వైపు వస్తున్నారు. అదే సమయంలో వారి వెనుక చాకలి లాలయ్య భార్య మేఘన, తన కుమార్తె రిషికతో కలిసి స్కూటీపై వస్తున్నారు. ఈక్రమంలో వికారాబాద్ నుంచి తాండూర్ వైపు లారీ (ట్రక్కు) క్రేన్ లోడ్తో వెళ్తోంది. ట్రక్కు డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న లాలయ్యా మోటార్ సైకిల్ను ఢీకొట్టాడు. అనంతరం స్కూటీని ఢీకొట్టాడు. దీంతో ట్రక్కు(లారీ) నియంత్రణ కోల్పోయి, ట్రక్కు, క్రేన్ రెండూ చాకలి లాలయ్య, అతని కుమారుడు రిథిక్పై పడ్డాయి. భార్య మేఘనకు స్వల్ప గాయాలయ్యాయి. వీరు పరిగిలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో కొండాపూర్ కలాన్ గ్రామంలో ఉంటున్న తల్లిని చూసేందుకు లాలయ్య కుటుంబంతోసహా వచ్చాడు. యథావిధిగా మళ్లీ వారి వారి ప్రైవేట్ ఉద్యోగాల్లో విధులు నిర్వహించేందుకు సోమవారం ఉదయమే కొండాపూర్ కలాన్ గ్రామంనుంచి బయలు దేరారు. ఇంతలోనే ప్రమాదం ట్రక్కు రూపంలో వచ్చి తండ్రికొడుకును మృత్యు ఒడిలోకి తీసుకెళ్లింది. ఈ ఘటనతో స్వగ్రామం కొండాపూర్ కలాన్లో విషాదఛ్చాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం గురించి వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, గాయపడిన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించిన అనంతరం, రిథిక్ బాలుడు ఉదయం 08:38 గంటలకు మృతి చెందినట్లు ప్రకటించారు. చికిత్స పొందుతూ చాకలి లాలయ్య ఉదయం 10:37 గంటలకు మృతి చెందారు. విచారణలో, లారీ డ్రైవర్ ఎమ్.డి. షకీర్ (తండ్రి రుస్తం, నివాసం: హర్యానా రాష్ట్రం) మద్యం సేవించి వాహనం నడిపినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ సీఐ తెలిపారు.
అణు ఒప్పందంపై ఇరాన్కు ట్రంప్ మళ్లీ హెచ్చరిక
వాషింగ్టన్: అణు కార్యక్రమంపై ఇరాన్ ఒప్పందానికి రాకపోతే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చెప్పింది ఎంతవరకు నిజమవుతుందో తాము తేల్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా తమపై దాడికి పాల్పడితే అది పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని ఖమేనీ హెచ్చరించారు. తమపై ఎవరైనా దాడి చేస్తే ఇరాన్ గట్టిగా సమాధానం చెబుతుందన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందించి రెండు రోజుల్లో ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నానని, ఒకవేళ కుదరకపోతే ఖమేనీ చెప్పింది ఎంతవరకు నిజమవుతుందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకలు అక్కడ చాలా దగ్గరలో ఉన్నాయని ట్రంప్ హెచ్చరించారు.
తాడిచర్ల 1 బొగ్గు గనులు తెలంగాణకే
తాడిచర్ల -1 బొగ్గు గునుల కేటాయింపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ గనులను తెలంగాణకు కేటాయించామని సోమవారం రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థకు కేటాయించామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ అడిగి ప్రశ్నకు బదులిచ్చిన కిషన్ రెడ్డి 2019 మార్చిలో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆమోదం తర్వాత 2020 జూన్ నుంచి గనుల కేటాయింపుల ప్రక్రియ మారిందని తెలిపారు. వ్యాపారానికి వాడే గనులను వేలంలో కేటాయించాలని కమిటీ సూచించిందని, ప్రత్యేక, తప్పని పరిస్థితుల్లోనే బొగ్గు శాఖ నేరుగా కేటాయించాలని కమిటీ తెలిపిందన్నారు. తాడిచర్ల-2 గనులు ఇంకా ఎవరికీ కేటాయించలేదని స్పష్టం చేశారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాడిచర్ల కోల్ బ్లాక్ ను జెన్కోకు కేటాయించారు. దీని మైనింగ్ చేసేందుకు సింగరేణి ముందుకువస్తే వారితో ‘మేం పనిచేయలేమని బీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ రాయించుకుని’ ప్రైవేటు కంపెనీకి 25 ఏళ్ల టెండర్ కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? అని ఇటీవల కిషన్ రెడ్డి విమర్శించారు. నేడు సుమారు రూ.47వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడింది. దేశంలో ఏ కోల్ మైనింగ్ కంపెనీకి కూడా ఈ స్థాయిలో ఇబ్బందుల్లేవని వ్యాఖ్యానించారు.
వార్మప్ మ్యాచ్.. ఇండియా-ఎపై పోరాడి ఓడిన అమెరికా
నవీ ముంబై: అమెరికాతో సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్లో ఇండియాఎ టీమ్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టి20 వరల్డ్కప్ సన్నాహాల్లో భాగంగా ఈ మ్యాచ్ను నిర్వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ 55 బంతుల్లోనే (104) పరుగులు చేశాడు. కెప్టెన్ ఆయుష్ బడోని 26 బంతుల్లో అజేయంగా (60), తిలక్వర్మ 24 బంతుల్లో 38 పరుగులు సాధించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన అమెరికా 19.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది.
వెంకీ అట్లూరితో ‘విశ్వనాథం అండ్ సన్స్’?
విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు వెంకీ అట్లూరి... సూర్యతో చేయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టును సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా, త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ ‘ఫార్చ్యూన్ ఫోర్’ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. ఈ చిత్రానికి ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పేరు వినగానే త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో సూర్య ఒక నడి వయస్కుడిగా కనిపిస్తారని, కేరళ బ్యూటీ మమిత బైజు ఇందులో కథానాయికగా నటిస్తోందని సమాచారం. వీరిద్దరి మధ్య సాగే ప్రేమకథ చాలా ఆసక్తికరంగా, వైవిధ్యంగా ఉండబోతోందని సినీ వర్గాల టాక్. చాలా కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకు, ఈ ఫ్యామిలీ డ్రామా మంచి బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సూర్య చేతిలో ‘కరుప్పు’ వంటి యాక్షన్ సినిమాలు ఉన్నప్పటికీ, వెంకీ అట్లూరి స్టైల్ లో రాబోతున్న ఈ సినిమాపైనే ట్రేడ్ వర్గాల్లో ఎక్కువ ఆశలు ఉన్నాయి. వేసవి కానుకగా విడుదల కానున్న ఈ ‘విశ్వనాథం అండ్ సన్స్’ టైటిల్ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
మాజీ సిఎం జయలలితకు భారతరత్న ఇవ్వాలి
న్యూఢిల్లీ : తమిళనాడు మాజీ సిఎం జయలలితకు భారత రత్న బిరుదు ప్రదాని చేయాలని ఆ పార్టీ ఎంపీ రాజ్యసభలో డిమాండ్ చేశారు. జీరో అవర్లో ఈ అంశాన్ని ఎఐఎడిఎంకె ఎంపి ఎం ధనపాల్ లేవదీశారు. ఆమె తన పాలనా కాలంలో అమ్మా కాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, విద్యార్థులకు ఉచిత లాప్టాప్లు, సైకిళ్లు పంపిణీ చేయించారని, మిక్సర్లు, గ్రైండర్లు వంటి గృహోపకరణాలను సబ్సిడీపై సరఫరా చేయించారని, మొత్తం మీద ఆమె సంక్షేమ పథకాలకు తల్లి వంటివారని ఎంపీ వివరించారు. ఈ నేపథ్యంలో ఆమెకు భారతరత్న బిరుదు ప్రదానం చేయడమే సరైన నివాళి అని సూచించారు. ఆప్ ఎంపీ రాజీందర్ గుప్తా జిఎస్టి కౌన్సిల్ రీతిలో నేషనల్ ఫీస్కూల్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీ ఎంపి కె లక్ష్మణ్ అన్ని రాష్ట్రాల్లో, దిగువ కోర్టుల్లో జడ్జిల నియామకానికి వీలుగా ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసులను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇందూర్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం
అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలి.. ఐక్యతతో
నేమ్ లో "AIM' ఉంది? TeluguPost Business Podcast 1 | Telugu Post News
నిరుపేదల సంక్షేమమే నా లక్ష్యం..
18వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మహమ్మద్ జబ్బార్ పోటీ -గెలిచిన వెంటనే
రేవంత్రెడ్డి హార్వర్డ్లో చదువుకున్నా..తన వెనకటి గుణం మార్చుకోలేదు: హరీష్రావు
హార్వర్డ్లో చదువుకున్నా సిఎం రేవంత్రెడ్డి గుణం మార్చుకోలేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పి ఉపనేత హరీష్రావు విమర్శించారు. రవి నారాయణరెడ్డి పురస్కార ప్రదాన కార్యక్రమంలో కెసిఆర్పై సిఎం చేసిన వ్యాఖ్యలపై హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే, అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని, తన మాటల ద్వారానే బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. హేట్ స్పీచ్పై ఉపన్యాసం ముగియకముందే, రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్కు లైవ్ డెమో ఇచ్చారని ఎద్దేవా చేశారు. కెసిఆర్పై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు.. రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా వెళ్లి హార్వర్డ్లో నాలుగు రోజులు చదువుకున్నా.. రేవంత్ రెడ్డి తన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదని అన్నారు. కనీస సంస్కారం రాలేదు, చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదని వ్యాఖ్యానించారు. ద్వేష రాజకీయాలకు, నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశానికి గాంధీ జాతిపిత అయినట్లే, తెలంగాణను సాధించిన కెసిఆర్ జాతి పితనే అని వ్యాఖ్యానించారు. నాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్రా పాలకుల బూట్లు తుడుస్తున్న రేవంత్రెడ్డికి కెసిఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుంది..? అని ప్రశ్నించారు. ఉద్యమకారులపైకి తుపాకి ఎక్కుపెట్టిన ఆయనకు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా..? అని నిలదీశారు. ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న రేవంత్రెడ్డికి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా..అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా, ప్రతిపక్షాలపై రాజకీయ కక్షల కోసం వినియోగిస్తున్న ఆయన అధికార దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు ఉందా...లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన ఆయనకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి...ఎలా అర్థం అవుతాయి..? అంటూ ప్రశ్నలు సంధించారు. రేవంత్రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ వెళ్ళినా, అంతరిక్షం వెళ్ళినా ఆయన బుద్ధి మారదు, నోటి మురికి పోదు అన్నది సుస్పష్టం అని హరీష్రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కామారెడ్డి పట్టణంలో సంచిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. ముక్కలు ముక్కలు చేసిన సగం మృతదేహాన్ని దుండగులు మూటగట్టి పడేశారు. పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని సీఎస్ఐ చర్చి సమీపంలోని చెత్త కుప్పలో కాగితాలు ఏరుకునే వారికి గోనె సంచిలో నుంచి కాళ్లు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని గోనె సంచిని తెరిచి పరిశీలించగా తల నుంచి నడుం భాగం వరకు లేకుండా నడుం నుంచి కాళ్ల వరకు మాత్రమే ఉన్న మృతదేహం లభించింది. మృతదేహంలోని మిగతా భాగం కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహం సగం మాత్రమే ఉండడంతో మృతుడు ఎవరో గుర్తించడం కష్టంగా మారిందన్నారు. రెండు మూడు రోజుల క్రితమే హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా కోసి గోనె సంచిలో కట్టి ఇక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఎంచుకోవాలి? ఈ 3 విషయాలు తెలియకపోతే నష్టపోతారు
మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఎంచుకోవాలి? రేటింగ్స్, అసెట్ అలొకేషన్, పోర్ట్ఫోలియో స్టాక్స్ను ఎలా విశ్లేషించాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి అనేది కేవలం డబ్బు దాచుకోవడం కాదు, మీ సంపదను తెలివిగా పెంచుకోవడం. సరైన ఫండ్ను ఎంచుకోవడానికి రేటింగ్స్ మాత్రమే సరిపోవు, అసెట్ అలొకేషన్, పోర్ట్ఫోలియో విశ్లేషణ కూడా చాలా ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ రేటింగ్స్ – ఇవి ఎంతవరకు నమ్మదగినవి? మ్యూచువల్ ఫండ్ రేటింగ్స్ అనేది ‘Value Research‘ లేదా ‘Morningstar’ […] The post మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఎంచుకోవాలి? ఈ 3 విషయాలు తెలియకపోతే నష్టపోతారు appeared first on Dear Urban .
అవినీతి రుజువు.. బంగ్లా మాజీ ప్రధానికి పదేళ్ల జైలు శిక్ష
ఢాకా: రాజుక్ న్యూటౌన్ హౌసింగ్ అనే ప్రభుత్వ ప్రాజెక్టు లోని ప్లాట్ల కేటాయింపులో అవినీతి జరిగినట్టు రుజువు కావడంతో రెండు అవినీతి కేసుల్లో మాజీ ప్రధాని 79 ఏళ్ల షేక్ హసీనాకు పదేళ్లు జైలు శిక్ష పడింది. హసీనా తన అధికారిక పలుకుబడిని ఉపయోగించి తన మేనకోడలు, బ్రిటన్ లేబర్ ఎంపీ , మాజీ బ్రిటిష్ మంత్రి తులిప్ సిద్దిక్ సహా ఇతరులకు అక్రమంగా ప్లాట్లను కేటాయించారని ఢాకా స్పెషల్ జడ్జి కోర్టు ధ్రువీకరించింది. రాజధాని ఢాకాకు శివారులో పుర్బచోల్లో రాజుక్ న్యూటౌన్ హౌసింగ్ ప్రాజెక్టు ఉంది. జడ్జి రాబిల్ ఆలమ్ హసీనాతోపాటు ఆమె ఇద్దరు మేనకోడళ్లు, మేనల్లుడుకు వేర్వేరు జైలుశిక్షలు విధించారు. సిద్దిక్ సోదరి అజమన్ సిద్దిక్, సోదరుడు రద్వాన్ ముజిబ్సిద్దిక్ బాబీలకు ఏడేళ్లు శిక్ష విధించారు. మిగతా నిందితుల్లో మాజీ హౌసింగ్ జూనియర్ మంత్రి , మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి మాజీ రాజుక్ చైర్మన్ , అధికారులకు ఐదేళ్లు వంతున శిక్ష విధించారు. ఈ కేసులో సరెండర్ అయిన రాజుక్ సభ్యుడు ఖుర్షీద్ ఆలమ్కు ఏడాది జైలు శిక్ష విధించారు. నిందితులు అందరికీ లక్ష జరిమానా విధించారు. జరిమానా కట్టకుంటే అదనంగా ఆర్నెళ్లు జైలు జీవితాన్ని అనుభవించాలి.
తప్పతాగి నడివీధిలో భార్యను చితకబాదిన కానిస్టేబుల్
ప్రజల మాన ప్రాణాలకు రక్షణనివ్వాల్సిన పోలీసే తప్పతాగి నడివీధిలో భార్యను చితకబాదిన వైనం ఆ శాఖ పరువును గంగలో కలిపింది. బాధ్యత కలిగిన ఉద్యోగంలో ఉన్నానన్న విషయాన్ని విస్మరించి అర్థనగ్నంగా వీధుల్లో సంచరించన ఘటన మంచిర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. ఒక పోలీస్ హల్చల్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. భార్యను వీధిలోకి లాక్కొచ్చి విచక్షణారహితంగా బాదిన వైనం పట్ల కాలనీ వాసులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ రవిప్రసాద్ చర్యలను స్థానికులు చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో హేయమైన చర్య బహిర్గతమైంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీ రోడ్ నెంబర్ 14లో నివాసముంటున్న కానిస్టేబుల్ రవిప్రసాద్ తప్పతాగి అర్దనగ్నంగా వీధిలో తిరుగుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు. తాగిన మైకంలో.. భార్యను ఇంటి నుండి బయటకు లాక్కొచ్చి అమానూషంగా కొట్టడంతో.. తల్లి చంకలో వున్న చిన్నారి కేకలు విని స్థానికులు కానిస్టేబుల్ ను అడ్డుకున్నారు. అప్పటికే కానిస్టేబుల్ విచక్షణారహితంగా భార్యను కొడుతున్న దృశ్యాలను కొందరు చిత్రీకరించారు. కానిస్టేబుల్ రవిప్రసాద్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. రక్షకభటుడే సంస్కారహీనంగా ప్రవర్తించడం పట్ల బస్తీ మహిళలు ఆగ్రహాం వ్యక్తం చేసారు. రవిప్రసాద్ చర్య పోలీస్ శాఖ పరువు తీసిందని పలువురు దుయ్యబట్టారు. రవిప్రసాద్ వ్యవహారించిన తీరువల్ల తాము భయంతో ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానికులు భయందోళన వ్యక్తం చేసారు. కానిస్టేబుల్ అతి ప్రవర్తనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని.. ప్రజలలో పోలీస్ శాఖకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని స్థానికులు కోరారు.
సర్పంచ్ కావాలన్న ఆశతో కన్న కూతురిని...#Crime #Maharashtra #Telangana #Police
‘ సర్ ’ బాధిత కుటుంబాలతో CECని కలిసిన మమత
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ సిఎం, టిఎంసి చీఫ్ మమతాబెనర్జీ, “సర్”( ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) బాధితులైన కుటుంబాలు, పార్టీ నాయకులతో కలిసి చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సోమవారం కలుసుకున్నారు. గతవారం సిఇసి కుమార్ సోమవారం కలుసుకోవడానికి బెనర్జీకి సమయం కల్పించారు. ఈమేరకు ఆదివారం దేశ రాజధానికి మమతాబెనర్జీ చేరుకున్నారు. ఆమె వెంట తృణమూల్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, అడ్వకేట్ కూడా అయిన కల్యాణ్ బెనర్జీ ఉన్నారు. సోమవారం ఉదయం బెంగాల్ నుంచి ఎస్ఐఆర్ బాధితులు తమ సమస్యలను ఎలెక్షన్ కమిషన్కు వివరించడానికి వచ్చారని, కానీ వారికి బెదిరింపులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంగ భవన్ ఆవరణలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని ఆమె ప్రశ్నించారు. సర్ బాధితులైన దాదాపు 50 కుటుంబాలు పశ్చిమబెంగాల్ నుంచి ఢిల్లీకి వచ్చారు.
ఇంటి పన్ను పెంపుకు కాంగ్రెస్ ప్లాన్
ఇంటి పన్ను పెంపుకు కాంగ్రెస్ ప్లాన్ … కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి…రెండేళ్లలో
కొత్వాల్ చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండలం కెసి తాండలో చోటుచేసుకుంది. మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం కెసి తాండకు చెందిన జాటావత్ రిషి (6), జాటావత్ బద్రీనాథ్ (8) ఆదివారం సెలవు కావడంతో గ్రామంలో ఆడుకునేందుకు ఇంటి నుండి వెళ్లారు. చీకటి పడినా ఇంటికి చేరకపోవడంతో కుటుంబీకులు మహేశ్వరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి మహేశ్వరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆడుకుంటూ వెళ్లి గ్రామ సమీపంలోని కోత్వాల్ చెరువులో పడిపోయి ఉంటారన్న అనుమానంతో చెరువులో పోలీసు రెస్కూ టీం గాలింపు మొదలు పెట్టింది. ఆదివారం రాత్రి నుండి గాలింపు నిర్విహించి.. సోమవారం ఉదయం ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సమయస్ఫూర్తికి పురస్కారం. దమ్మపేట , ఆంధ్రప్రభ : సామాజిక బాధ్యతను చాటుతూ,సమయస్ఫూర్తితో వ్యవహరించి
సంజుకు కష్ట కాలం.. టీ20 వరల్డ్ కప్ తుది జట్టులో చోటు దక్కేనా?
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో స్టార్ ఆటగాడు సంజు శాంసన్ పేలవమైన బ్యాటింగ్తో నిరాశ పరిచాడు. ఐదు మ్యాచుల్లో ఆడే ఛాన్స్ దొరికిన ఒక్క మ్యాచ్లో కూడా కనీసం 20 పరుగుల మార్క్ను అందుకోలేక పోయాడు. వరుస అవకాశాలు లభించినా వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఘోర వైఫల్యం చవిచూశాడు. ఇలాంటి స్థితిలో త్వరలో జరిగే టి20 ప్రపంచకప్ తుది జట్టులో అతనికి ఛాన్స్ దొరుకుతుందా అంటే కష్టమేనని సమాధానం వస్తోంది. అందివచ్చిన అవకాశాలు చేజార్చుకున్న సంజు జట్టులో స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గాయం నుంచి కోలుకోవడంతో సంజు కష్టాలు మరింత పెరిగాయి. సంజు కంటే తిలక్ వర్మకే తుది జట్టులో ఆడించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే సంజు బెంచ్కే పరిమితం కాక తప్పదు.
60 సార్లు ఢిల్లీ వెళ్లిన సిఎం సాధించిందేంటి..?: కెటిఆర్
కేంద్ర బడ్జెట్లో పేదలు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధి హామీని కుదించారని కెటిఆర్ విమర్శించారు. ఎరువుల రాయితీ, ఆహార రాయితీతో పాటు స్వచ్ఛ భారత్కు నిధులు కూడా తగ్గించారని అన్నారు. వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, ఫార్మాకు హైదరాబాద్ కేంద్రం అయితే.. బయో ఫార్మా తయారీకి రూ.పది వేల కోట్లు కేటాయించి తెలంగాణకు రూ.10 కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ఢిల్లీకి 60 సార్లు వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి సాధించిందేంటి..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం సున్నా అని విమర్శించారు. తెలంగాణకు బిజెపి ఇచ్చేది ఇదేనా..? అని నిలదీశారు. హై స్పీడ్ రైల్ కారిడార్ కేటాయించామని గొప్పగా చెబుతున్నారని, తెలంగాణ భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉంది..కాబట్టి కారిడార్ హైదరాబాద్ మీదుగా వెళ్లక తప్పదని తెలిపారు. తెలంగాణకు హై స్పీడ్ ట్రైన్లు ప్రత్యేకంగా ఇచ్చినట్లు చెప్పడం హాస్యాస్పదం అని కెటిఆర్ అన్నారు. దావోస్ ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడులు ఎన్ని మెటీరియలైజ్ అయ్యాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. దావోస్లో జరిగిన ఒప్పందాలు విచిత్రంగా ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్రలో కేబినెట్లో ఉండే మంత్రి ఆ రాష్ట్ర సిఎంతో దావోస్ ఒప్పందం చేసుకున్నారని, అలాగే జూబ్లీహిల్స్లో ఉండే సిఎం రేవంత్రెడ్డి, మెగా కృష్ణారెడ్డి కూడా దావోస్లో ఒప్పందాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
అంతరిక్షం వెళ్లినా.. రేవంత్ బుద్ధి మారదు..
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్
మంగళగిరి: జనసేన అధినేత, ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి సికె కన్వెన్షన్లో నిర్వహించిన జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్ మాట్లాడారు. కల్తీ లడ్డూ వ్యవహారంపై పార్టీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘లడ్డూ వ్యవహారంలో వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదు? అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నది ఎందుకు? వైసిపి నేతల ట్రాప్లో చిక్కుకోవద్దు. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు.. జాగ్రత్తా! జనసేన నేతలు మాత్రం సిద్ధాంతపరంగా, సబ్జెక్ట్ పరంగానే మాట్లాడాలి. విమర్శలకు విషయంతోనే సమాధానం చెబుతాం. మహిళల విషయంలో పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు మీ చేయి తగిలినా రేప్ చేశారని వైకాపా నేతలు ప్రచారం చేస్తారు’’ అని పవన్ అన్నారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర వ్యవసాయంపై తీవ్ర నిర్లక్ష్యం: మంత్రి తుమ్మల
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్ రాష్ట్ర రైతులకు తీవ్ర నిరాశ కలిగించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది రైతుల ఆశలను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని, రాష్ట్రం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంపు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించకుండా, దిగుమతులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు నిధుల కేటాయింపు లేకపోవడం, అలాగే పసుపును హై వాల్యూ క్రాప్గా గుర్తించకపోవడంతో రాష్ట్ర పసుపు రైతులకు తీవ్ర నిరాశను కలిగించిందని చెప్పారు. లక్షలాది మంది పసుపు రైతులు ఎదురుచూస్తున్న డెడికేటెడ్ ఫండ్స్ గురించి బడ్జెట్లో స్పష్టమైన ప్రకటన లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చిందని మంత్రి పేర్కొన్నారు. కొబ్బరి (కోకనట్) బోర్డు ఏర్పాటు విషయంలో కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడం రాష్ట్ర రైతులకు మరో ఎదురుదెబ్బగా మారిందన్నారు. ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు రైతులపై మరింత భారం మోపనున్నాయని, ఇప్పటికే పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను తగ్గించే చర్యలు బడ్జెట్లో పూర్తిగా లేవని మంత్రి తెలిపారు. రైతులకు అత్యంత కీలకమైన ఎంఎస్పి (కనీస మద్దతు ధర)కు చట్టబద్ధ హక్కు కల్పించడంలో కేంద్రం మరోసారి విఫలమైందని మంత్రి మండిపడ్డారు. వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపై స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం కేంద్ర బడ్జెట్ లోని ప్రధాన లోపమన్నారు. దేశీయ నూనెగింజల రైతులను రక్షించేలా తినుబండార నూనెలపై ఇంపోర్ట్ డ్యూటీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. కేంద్ర పథకాల ఏకీకరణ పేరుతో రాష్ట్రానికి వచ్చే నిధుల్లో కోత విధించడం తీరని అన్యాయం అని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం ఇప్పటికీ మాటలకే పరిమితమయిందని, దానికి స్పష్టమైన రోడ్మ్యాప్ బడ్జెట్లో ఎక్కడా కనిపించలేదన్నారు. వ్యవసాయ రంగంలో బడ్జెట్లో ఏఐ ఆధారిత కార్యక్రమాల ప్రస్థావన మాత్రమే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని, అయితే ధర భద్రత, మార్కెట్ భరోసా లేకుండా కేవలం ఏఐ సాంకేతికత రైతు సమస్యలు పరిష్కారం తీర్చదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి, వ్యవసాయ రంగానికి ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం లేకుండా పోయిందని మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
దలైలామాకు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు..
దలైలామా సందేశ సంకలనానికి గ్రామీ అవార్డు ధ్యానం, దయ, అంతర్ముఖ ఆలోచనల ఆవిష్కరణ ప్రఖ్యాత సరోద్ వాయిద్యకారుడు అంజద్ సంగీతం ధర్మశాలలో మిన్నంటిన సంబరాలు, చైనా నిరసనలు ఈసారి పురస్కారాల్లో మోగని భారతీయ ఖ్యాతి లాస్ ఏంజిలెస్: ప్రఖ్యాత టిబెట్ బౌద్ధ మతగురువు దలైలామాకు 90 ఏండ్ల వయస్సులో విశిష్ట గ్రామీ అవార్డు దక్కింది. ఈ వయస్సులో ఈ పురస్కారం రావడం విశేష అంశం అయింది. ఆయన మాటలతో కూడిన ఆల్బమ్ మెడిటేషన్స్ ఆడియోకు గ్రామీ రావడం టిబెట్లో ఆయన అభిమానుల నుంచి సంతోషానికి దారితీసింది.టిబెట్ మతగురువు దలైలామా టెంజిన్ గ్యాస్టోకు అవార్డు ప్రకటించినట్లు అంతకు ముందు గ్రామీ వర్గాలు ప్రకటించాయి. ఈ ప్రకటనలపై చైనా నిరసన వ్యక్తం చేసింది. ఇన్ని సంవత్సరాల జీవిత ప్రస్థానంలో తన ఆలోచనలు, ఆధ్యాత్మిక భావాలు, సందేశాలను దలైలామా ఆడియో రూపంలో వెలువరించారు. దీనిని ధ్యానం పేరుతో అందరి ముందుకు తీసుకువచ్చారు. దలైలామాకు ఇది తొలి గోల్డెన్ గ్రామ్ఫోన్. ట్రెవర్ నో హోస్ట్గా అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో జరిగిన 68వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అక్కడి క్రిప్టో . కామ్, ఎరినాలో ఆదివారం రాత్రి కనులపండువగా జరిగింది. 90 కేటగిరిల్లో విజేతలకు అవార్డుల బహుకరణ కార్యక్రమం చేపట్టారు. దలైలామా మాటలకు ప్రఖ్యాత సరోద్ వాయిద్యకారుడు అంజద్ అలీఖాన్ నేపథ్య సంగీతం అందించారు. ధ్యానం, అంతర్ముఖం, దయ , ఆత్మ పరిశీలన వంటి విషయాలను దలైలామ ప్రస్తావించారు. దలైలామాకు గ్రామీ అవార్డు రావడంతో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల పట్టణంలో ఆయన అనుచరులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. గ్రామీ రావడంపై దలైలామా హర్షం వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత గొప్పదనం కాదని వ్యాఖ్యానించారు. తాను ఈ అవార్డును సవినయంగా స్వీకరిస్తున్నానని పర్యావరణ హితానికి సందేశంగా దీనిని భావిస్తున్నానని తెలిపారు. విశ్వజనీన సార్వత్రిక భావనకు దక్కిన పురస్కారంగా భావిస్తున్నానని ప్రకటన వెలువరించారు. దలైలామా తరఫున సింగర్ రుఫూస్ వాయిన్రైట్ ఆడియో కేటగిరిలో ఈ అవార్డును స్వీకరించారు. ఇతర కేటగిరిల్లో కూడా గ్రామీ అవార్డులు ప్రకటించారు. స్పెల్బెర్గ్ మ్యూజిక్ ఫిల్మ్ కేటగిరిలో అవార్డు అందుకున్నారు. గ్రామీకి భారతదేశ తరఫులన పలు కేటగిరిల్లో పోటీకి ఎంపిక అయిన ఆల్బమ్లు చివరికి పురస్కారం పొందలేకపొయ్యాయి.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు..
విశాలాంధ్ర – ఉరవకొండ: ఉరవకొండ పట్టణంలో గంజాయి విక్రయానికి సిద్ధమవుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి 2.17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, గుత్తి పట్టణానికి చెందిన చిన్న కందుకూరి అజయ్, వడ్ల ఆదిత్య అనే యువకులు గంజాయి విక్రయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందడంతో ఉరవకొండ పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద సోమవారం పోలీసులు దాడి నిర్వహించారు. తనిఖీల్లో వారి వద్ద ఉన్న 2.17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు […] The post గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు.. appeared first on Visalaandhra .
రాహుల్ గాంధీ vs కేంద్రం.. దద్దరిల్లిన లోక్ సభ
చైనా కబ్జా, మాజీ ఆర్మీచీఫ్ జ్ఞాపకాలు లోక్సభలో రాహుల్, కేంద్రం వ్యాగ్యుద్ధం పుస్తకంతో దాడికి దిగిన ప్రతిపక్ష నేత అడ్డుకున్న సీనియర్ మంత్రుల బృందం ఎంపిల నినాదాలతో సభ వాయిదా న్యూఢిల్లీ : లోక్సభలో సోమవారం కేంద్రం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య తీవ్రస్థాయిలో వ్యాగుద్ధం సాగింది. 2020 భారత్ చైనా ఘర్షణ నేపథ్యంతో సైనిక మాజీ ప్రధానాధికారి ఎంఎం నవరానే రాసిన జ్ఞాపకాల పుస్తకం’లోని అంశాలను రాహుల్ గాంధీ సభలో ప్రస్తావించడం వివాదానాకి దారితీసింది. ఘర్షణ దశలో చైనా సేనలు భారత్లోకి ప్రవేశించాయని మాజీ ఆర్మీచీఫ్ ఈ పుస్తకంలో పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వెలువడిన వార్తను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీనిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ , బిజెపి ఎంపిలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రచురితం కాని పుస్తకంలోని నిర్థారణ కాని అంశాలను రాహుల్ ప్రస్తావించం అనుచితం అని ప్రభుత్వం తరఫున రాజ్నాథ్ సింగ్ రాహుల్పై ఎదురుదాడికి దిగారు. ఆయన సభను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రాహుల్ పదే పదే సభను అవమానించేలా వ్యవహరిస్తున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఈ దశలోనే స్పీకర్ కలుగచేసుకుని వార్తా పత్రికల క్లిప్పింగ్లు, అప్రచురిత పుస్తకాల్లోని అంశాలు సభలో ప్రస్తావించకూడదని సభ్యులు తెలుసుకుంటే మంచిదని మందలించారు బిజెపి సభ్యులు రాజ్నాథ్కు, అమిత్ షాకు మద్దతు పలికారు. దీనితో సభలో వాడివేడి వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావించకుండా స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు. అయితే రాహుల్ వెనకకు తగ్గలేదు. ఆయనకు తోడుగా పలువురు ప్రతిపక్ష ఎంపిలు నిలిచారు. దీనితో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభ ముందుగా రెండుసార్లు వాయిదా పడింది. తరువాత అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి వాదనల నడుమనే స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై రాహుల్ గాంధీ ముందుగా మాట్లాడారు. ఈ సందర్భంగా అంతకు ముందు మాట్లాడిన బిజెపి ఎంపి తేజస్వీ సూర్య కాంగ్రెస్కు జాతీయవాదం లేదని చేసిన విమర్శను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే జనరల్ నవరానే పుస్తకంలోని అంశాలను ప్రస్తావించారు. చైనా మన భూభాగం కబ్జా చేస్తూ పోతూ ఉంటే నిమ్మకునీరెత్తినట్లుగా ఉన్న వారు జాతీయవాదులు అన్పించుకుంటారా? అని బిజెపిని నిలదీశారు. దీనితో వివాదం రాజుకుంది. పుస్తక ప్రస్తావనపై రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. దేశ సమగ్రత విషయంపై మాట్లాడకూడదనే విషయం ప్రతిపక్ష నేత తెలుసుకుంటే మంచిదని చురకలకు దిగారు. అయితే పుస్తకంలోని అంశం , ఇందులో పొందుపర్చిన డాక్యుమెంట్ నిర్థారితం అని , దీనిని ప్రస్తావించడంలో తప్పేమీ లేదని తెలిపారు. అయితే తప్పుడు అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. ఇది సభను పక్కదోవ పట్టించడమే అవుతుందని అధికార సభ్యులు రాహుల్ను దిగ్బంధం చేసేందుకు యత్నించారు. చైనాపై తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న పలు నిర్ణయాలు, ఆయన వల్ల వేలాది ఎకరాల భూమి చైనా ధారాదత్తం అయిన రికార్డులు ఉన్నాయని, వీటిని సభలో ప్రస్తావించలేమని తెలిపారు. అయితే తాను ఈ అంశాన్ని ప్రస్తావించదల్చుకోలేదని, కానీ బిజెపి ఎంపి సభలో కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ మాట్లాడటం వల్లనే తాను ఈ విషయం చెప్పాల్సి వచ్చిందని అన్నారు. రాహుల్కు సమాజ్వాది పార్టీ, టిఎంసి,ఆర్జేడీ ఇతర పార్టీల సభ్యులు మద్దతుగా లేచి నిలబడ్డారు. సభలో పరస్పర విమర్శల జోరు కొనసాగింది. దీనితో స్పీకర్ సభను వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ పక్క దారి పట్టింది.
Gods | ఓటర్ దేవుళ్ళు నమస్కారం… Gods | మంచిర్యాల, ఆంధ్రప్రభ :
కనేకల్లో వీధి కుక్కల, పశువుల బెడద..
విశాలాంధ్ర – కనేకల్: కనేకల్ మండలం కేంద్రంలో వీధి పశువులు, కుక్కల సంచారం రోజురోజుకూ పెరిగి ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. ప్రధాన రహదారులపై పశువులు గుంపులుగా పడుకోవడం, కొట్లాడుకోవడం వల్ల వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.ఆదివారం రామనగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడిని వీధి కుక్క కరచడంతో గాయాలపాలయ్యాడు. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీప మెయిన్ రోడ్డులో, దిగువగేరి పాత […] The post కనేకల్లో వీధి కుక్కల, పశువుల బెడద.. appeared first on Visalaandhra .
పడకల్ లో విజయనగర కాలపు శిల్పాలను పదిలపరచాలి!
పడకల్ లో 400 సం||ల శిల్పాలు.కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
Candle |దండేపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ.
Candle | దండేపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ. Candle | దండేపల్లి, ఆంధ్రప్రభ :
Barabar Premistha, Turning Point For Chandra Hass: Aadi
Attitude Star Chandra Hass starrer Barabar Premistha isn’t just another romantic entertainer, but it’s a film driven by attitude, emotion, and unpredictability. Directed by Sampath Rudra, the film stars Miss India finalist Meghna Mukherjee as the female lead and Arjun Mahi in a menacing antagonist role. The film’s pre-release event turned into a celebration of […] The post Barabar Premistha, Turning Point For Chandra Hass: Aadi appeared first on Telugu360 .
land |భూమి అమ్మనివ్వడం లేదని రాస్తారోకో…
land | భూమి అమ్మనివ్వడం లేదని రాస్తారోకో… land | జన్నారం, ఆంధ్రప్రభ
రామ్చరణ్కు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్
హైదరాబాద్: హీరో రామ్చరణ్, ఉపాసన రెండోసారి తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. వీరిద్దరికి కవల పిల్లలు జన్మించారు. ఈ సందర్భంగా ఆ దంపతులకు తోటి సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా రామ్చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నవ్వులతో నిండిన కుటుంబాన్ని చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు సోషల్మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘మరోసారి తల్లిదండ్రులైన ఉపాసన-రామ్చరణ్ దంపతులకు శుభాకాంక్షలు. చిరంజీవి గారి గర్వం, ఆనందం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబం మొత్తం నవ్వుతూ కనిపిస్తుండటం సంతోషంగా ఉంది. చిన్నారులు తమ రాకతో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చారు’’ అని పేర్కొన్నారు.
Leopard |కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులుల సంచారం…
Leopard | కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులుల సంచారం… Leopard | జుక్కల్
కానిస్టేబుల్పై లైంగిక వేధింపుల కేసు..బాధితురాలి ఆత్మహత్యాయత్నం
విశాలాంధ్ర – ఎల్లనూరు (పుట్లూరు): పుట్లూరు మండలం పరిధిలోని అరకట వేముల గ్రామంలో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడి హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ కానిస్టేబుల్ మారుతిపై శనివారం కేసు నమోదు అయిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత మహిళ భర్త వివరాల ప్రకారం, నిందితుడి తరఫు వ్యక్తులు కేసు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ ఒత్తిళ్లతో తీవ్ర మనోవేదనకు గురైన మహిళ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు.అస్వస్థతకు గురైన ఆమెను […] The post కానిస్టేబుల్పై లైంగిక వేధింపుల కేసు..బాధితురాలి ఆత్మహత్యాయత్నం appeared first on Visalaandhra .
రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార సభలో సీఎం రేవంత్
రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార సభలో సీఎం రేవంత్ కేసీఆర్ నిజమైన
Photos : Couple Friendly Movie Trailer Launch
The post Photos : Couple Friendly Movie Trailer Launch appeared first on Telugu360 .
Health |పిహెచ్ సీని తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ వో…
Health | పిహెచ్ సీని తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ వో…
MLA |ఉపాధి హామీ మార్పులకు వ్యతిరేకంగా…
MLA | ఉపాధి హామీ మార్పులకు వ్యతిరేకంగా… MLA | అచ్చంపేట, ఆంధ్రప్రభ
బొందలవాడలో చిరుతల సంచారం – వరుస దాడులతో గ్రామస్తుల్లో భయం..
విశాలాంధ్ర – నార్పల: నార్పల మండలం పరిధిలోని బొందలవాడ గ్రామ పరిసరాల్లో చిరుత పులుల సంచారం తీవ్ర భయాందోళన సృష్టించింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన వరుస ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, స్థానికుల ప్రతిదాడిలో ఒక చిరుత మృతి చెందినట్లు సమాచారం. సంజీవపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి పొలంలో పనులు చేస్తుండగా పొదల్లో దాక్కున్న చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. ఆమె కేకలతో అక్కడి నుంచి పరిగెత్తిన చిరుత బొందలవాడ వైపు చేరింది. […] The post బొందలవాడలో చిరుతల సంచారం – వరుస దాడులతో గ్రామస్తుల్లో భయం.. appeared first on Visalaandhra .
Medical College |జల్లపల్లి ఫారంలో పశు వైద్య శిబిరం…
Medical College | జల్లపల్లి ఫారంలో పశు వైద్య శిబిరం… Medical College
రవితేజ మూవీ నుంచి ‘బెల్లా బెల్లా’ వీడియో సాంగ్ రిలీజ్
మాస్ మహరాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సంక్రాంతి స్పెషల్గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. డింపుల్ హయాతి, అషిక రంగనాథ్లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా నుంచి ‘బెల్లా బెల్లా’ అంటూ సాగే వీడియో సాంగ్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్లో కూడా పాట అభిమానులను అలరిస్తోంది. ఈ పాటకి సురేశ్ గంగుల లిరిక్స్ అందించగా.. నకాశ్ అజీజ్, రోహిని అలపించారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు. కాగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
Central Govt |కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయం.
Central Govt | కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయం. Central Govt
President |మండల అధ్యక్షునిగా సుర్వి మల్లేష్ గౌడ్
President | మండల అధ్యక్షునిగా సుర్వి మల్లేష్ గౌడ్ President | చౌటుప్పల్,
Election |గులాబి కౌన్సిలర్లను గెలిపించండి …
Election | గులాబి కౌన్సిలర్లను గెలిపించండి … Election | జనగామ, ఆంధ్రప్రభ
Narsampeta |ముత్తోజీపేటలో ఇంటింటి ప్రచారం
Narsampeta | ముత్తోజీపేటలో ఇంటింటి ప్రచారం Narsampeta | నర్సంపేట, ఆంధ్రప్రభ :
వీల్చైర్లో అసెంబ్లీకి తేజస్వియాదవ్
ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వియాదవ్ సోమవారం బొటనవేలి గాయంతో వీల్చైర్లో బీహార్ అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా హాజరైన యాదవ్ గవర్నర్ ప్రసంగం తరువాత పాత్రికేయులతో మాట్లాడుతూ తన ఎడమ కాలిబొటనవేలు గాయమైందని , నడవడం కష్టం కావడంతో వీల్చైర్లో వచ్చానని చెప్పారు. గవర్నర్ ప్రసంగం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసినదేనని విమర్శించారు. అభివృద్ధి విషయంలో బీహార్ వెనుకబడి ఉన్నప్పటికీ ప్రసంగం అందంగా రంగు పూశారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా పాలన సాగిస్తున్నా అత్యాచారాలు, హత్యలు, ఇతర నేరాలు కొనసాగుతూనే ఉన్నాయని, శాంతిభద్రతలు లోపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్లు ఎన్నికల స్టంట్లుగా దిగజారాయని ఆరోపించారు. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధుబని చీర ధరించారని, ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నందున ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నందున మంత్రి సీతారామన్ కాంజీవరం చీర ధరించారని వ్యాఖ్యానించారు. ఈలోగా యాదవ్ విరోధులైన తోబుట్టువులు పెద్దక్క రోహిణీ ఆచార్య “ శరీరానికి గాయమైతే బాధ కలుగుతుంది. కానీ హృదయాన్ని గాయపరిస్తే ఇంకా విపరీతమైన నిస్పృహ కలుగుతుంది ” అని యాదవ్ను ఉద్దేశించి తన పోస్ట్లో రాసుకొచ్చారు. జేడీ(యు) నేషనల్ జనరల్ సెక్రటరీ , రాష్ట్రమంత్రి అశోక్ చౌదరి తేజస్వియాదవ్ను ఉద్దేశించి “ యాదవ్ ఉత్త కాళ్లతో క్రికెట్ ఆడుతుంటాడు. అతను తప్పకుండా షూలతో ఆడడం అలవాటు చేసుకోవాలి ” అని వ్యాఖ్యానించారు.
పత్రికా రంగంలో ఆంధ్రప్రభ నూతన ఒరవడి
బ్రోచర్ ఆవిష్కరణలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆత్మకూర్ , ఆంధ్రప్రభ :
Minister | దిష్టిబొమ్మలు దహనం… Minister | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం
సెంచరీతో కదం తొక్కిన నారాయణ్.. ఇండియా ఎ భారీ స్కోర్
నవీ ముంబై: టి-20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా యుఎస్ఎతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఇండియా ఎ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ నారాయణ్ జగదీషన్ సెంచరీతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యుఎస్ఎ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే 43 పరుగుల వద్దే ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(28) ఔట్ అయ్యాడు. కానీ, మరో ఓపెనర్ నారాయణ్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 55 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 104 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శస్త్ర చికిత్స నుంచి కోలుకొని తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్న తిలక్ వర్మ 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు కొట్టి 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక ఆయుశ్ బదోనీ కెప్టెన్ ఇన్నింగ్స్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 26 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. యుఎస్ఎ బౌలింగ్లో శుభం రంజనే, అలీ ఖాన్, జస్దీప్ సింగ్ తలో వికెట్ తీశారు.
Revanth Redddy : జాతి పిత టైటిల్ వారికి వారే పెట్టుకుంటారా?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
భారత్ తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. రూ.4,500 కోట్ల నష్టం!
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ జట్టు పాల్గొంటుందా?..పాల్గొన్న టీమిండియా జట్టుతో మ్యాచ్ ఆడుతుందా? అనే దానిపై కొద్దిరోజులుగా అనిశ్చితి నెలకొంది. దీనిపై తాజాగా పాకిస్థాన్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్ తమ జట్టు పాల్గొంటుందని.. కానీ, టీమిండియాతో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం లాహోర్లో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్తో భేటీ అయ్యాడు. చర్చల అనంతరం పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ట్వంటీ20 ప్రపంచ కప్లో పాల్గొనడానికి పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఫిబ్రవరి 15న భారత్ తో జరగాల్సిన మ్యాచ్ బహిష్కరించాలని నిర్ణయించింది అని ప్రకటనలో పేర్కొంది. అయితే, ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ కోసం ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఉంటారు. దీంతో ఈ మ్యాచ్ ద్వారా భారీగా ఆదాయం ఉంటుంది. ఇప్పుడు టీమిండియాతో పాక్ మ్యాచ్ ఆడకోవడం వల్ల దాదాపు రూ.4.500 కోట్ల నష్టం జరిగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నారు. ఇదిలావుంటే, భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న వివాదం కారణంగా ఇప్పటికే బంగ్లా జట్టు ఈ వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఫిబ్రవరి 7న భారత్, శ్రీలంక వేదికలుగా ఈ టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.
జనసేన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయిన పవన్
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
Latest Developments in Jana Nayagan Release
Vijay’s last film Jana Nayagan is stuck with censor hurdles. The makers are yet to get a clarity on the film’s release. The Censor Board is strict on their stand and the makers have stepped down to make changes as suggested by the Censor officials. The runtime is expected to come down by 20 minutes […] The post Latest Developments in Jana Nayagan Release appeared first on Telugu360 .
votes |టీబీజీకేఎస్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం
votes | టీబీజీకేఎస్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం votes |
కోఠిలో కాల్పుల ఘటన.. నిందితుల గుర్తింపు
హైదరాబాద్: నగరంలోని కోఠిలో చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల ఘటన కేసులో పురోగతి లభించింది. గత శనివారం కోఠిలోని ఎస్ బిఐ ప్రధాన కార్యాలయం ఎటిఎం వద్ద ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఎటిఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓవ్యక్తిని రెక్కీ చేసి తుపాకీతో దాడి చేశారు. కాల్పులు జరిపి రూ.6లక్షలు దొంగలించి స్కూటీపై పరారైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సిసి కెమెరాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 800కు పైగా సిసి కెమెరాలను పరిశీలించిన పోలీసులు సోమవారం నిందితులను గుర్తించారు. నిందితుల్లో ఓ వ్యక్తి పాత నేరస్తుడిగా గుర్తించిన పోలీసులు... వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Joined |బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి …
Joined | భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్
Govt |మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
Govt | మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి Govt
Started |ఉపాధి హామీ పనులు ప్రారంభం…
Started | కెరమేరీ, ఆంధ్రప్రభ : మండలంలోని సావర్ కేడ గ్రామంలో ఉపాధి
Suicide Attempt |తల్లి ఆత్మహత్యాయత్నం
Suicide Attempt | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తన ముగ్గురు పసిపిల్లలను
కోఠి దోపిడి కేసులో నిందితుల గుర్తింపు #Crime #Hyderabad #Police #BankRobbery #Investigation
Breaking : జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
TG |ముగిసిన శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాలు
TG | ముగిసిన శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాలు TG | దండేపల్లి, ఆంద్రప్రభ
TG |కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి…
TG | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి… TG | నర్సంపేట రూరల్,
Parakala |ఓటర్లు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా..
Parakala | ఓటర్లు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా.. 21వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి
రెచ్చిపోయిన దొంగలు.. ఎంత బంగారం ఎత్తుకెళ్లారంటే..
విజయనగరం: జిల్లాలోని రాజాం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లలో దాదాపు కేజీన్నర బంగారం చోరీ చేశారు. స్థానిక జిఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్స్ అపార్ట్మెంట్లో ఆదివారం అర్థరాత్రి ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. చిన్న పిల్లల వైద్యుడిగా పని చేస్తున్న డాక్టర్ నగేశ్ ఇంట్లో దుండగులు 1,250 గ్రాముల బంగారం, కిలో వెండి దోచుకెళ్లారు. అయితే వైద్యుడి కుటుంబం విశాఖలో ఉంటోంది. శనివారం విధులు ముగించుకొని నగేశ్ కూడా విశాఖకి వెళ్లిపోయారు. సోమవారం తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం తాళం తొలగించి ఉంది. బీరువాలోని వెండి, బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫఇర్యాదు చేయగా.. పోలీసులు క్లూస్ టీమ్తో ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికి సమీపంలోని మరో నివాస సముదాయంలోనూ చో ఘటన కలకలం రేపింది. జిఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న కృష్ణారెడ్డి ఇంట్లో 20 తులాల బంగారు నగలు చోరీ చేశారు.
TG | బోల్తా పడిన ట్రాక్టర్.. TG | ఏటూరునాగారం, ఆంధ్రప్రభ :
హైదరాబాద్ - బెంగళూరు మధ్య రెండు గంటలే ప్రయాణం
హై స్పీడ్ కారిడార్ తో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రెండు గంటల్లో వెళ్లవచ్చని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు
నేత్రదానంకు సహకరించిన వారికి సన్మానం..
విశ్వదీప సేవా సంఘంవిశాలాంధ్ర ధర్మవరం:: నేత్రదానం సహకరించిన కుటుంబ సభ్యులకు వారి ఇంటికి వెళ్లి, విశ్వదీప సేవా సంఘం వారు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అనంతరం విశ్వదీప సేవా సంఘం వారు మాట్లాడుతూ నేత్రదానం పై అవగాహనలో భాగంగా నేత్రదానం చేయించుటలో సహకరించిన నేత్రదాతల కుటుంబ సభ్యులను సన్మానం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫ్టలమిక్ అధికారి ఉరుకుందప్ప, ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి ,సేవా సంఘం ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి , ఎం […] The post నేత్రదానంకు సహకరించిన వారికి సన్మానం.. appeared first on Visalaandhra .
TG |మల్లన్న ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తా….
TG | మల్లన్న ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తా…. TG | బిక్కనూర్,
Telangana : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు
3 Weeds |ఎండిన కరివేపాకు పడేయకుండా…
3 Weeds | ఎండిన కరివేపాకు పడేయకుండా… 3 Weeds | వెబ్
Sajjala |వ్యవస్థలు ఉండాలి..
Sajjala | వ్యవస్థలు ఉండాలి.. Sajjala | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ :
విశాలాంధ్ర ధర్మవరం;మల్టీ స్టార్ ఆల్ ఇండియా బుడోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ధర్మవరం కళాజ్యోతి జడ్పీ గర్ల్స్ హై స్కూల్ లో నిర్వహించినటువంటి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ దాదాపు 80 మంది విద్యార్థులు కరాటే విద్యను ప్రదర్శించారు.నేర్చుకున్నటువంటి విద్యను ప్రదర్శించి వారిలో ఉన్నటువంటి,నైపుణ్యం గల 65 మంది విద్యార్థులకు బెల్ట్లు,ప్రశాంశ పత్రాలు ఎల్లో,ఆరెంజ్,గ్రీన్, బ్లూ , పర్పల్, బ్రౌన్ ,బెల్స్ అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టిడిపి నాయకులు సంధ రాగవ, మాంగల్య సిల్క్స పురుషోత్తం […] The post కరాటే విద్య ప్రదర్శన appeared first on Visalaandhra .
Chandur |ఏ,బీ ఫామ్ల అందజేత…
Chandur | ఏ,బీ ఫామ్ల అందజేత… Chandur | చండూర్, ఆంధ్రప్రభ :
karthi |తెలుగులో చేస్తున్న సినిమాలు ఇవే..
karthi | తెలుగులో చేస్తున్న సినిమాలు ఇవే.. karthi | ఊపిరి తర్వాత
ప్రపంచకప్కి ముందు వార్మప్ మ్యాచ్లు.. భారత్ పోరు ఎవరితో అంటే..
ఐసిసి టి-20 ప్రపంచకప్ త్వరలో ప్రారంభంకానుంది. అయితే ఈ మెగా టోర్నీ కంటే ముందు 16 వార్మప్ మ్యాచ్లు ఉంటాయని ఐసిసి తెలిపింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీం ఇండియా ఫిబ్రవరి 4న సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇండియా ఎ జట్టు ఈ రోజు (ఫిబ్రవరి 2న) యుఎస్ఎతో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం ఐదు గంటకు ప్రారంభం అవుతుంది. ఇటీవల గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ.. ఇండియా ఎ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ రెండు మ్యాచ్లు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈనెల 6న ఇండియా ఎ vs నమీబియా మ్యాచ్ బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరుగుతుంది. అఫ్గానిస్థాన్ vs స్కాట్లాండ్, యుఎస్ఎ vs ఇండియా ఎ, కెనడా vs ఇటలీ, నేపాల్ vs యుఎఇ, అఫ్గానిస్థాన్ vs వెస్టిండీస్, పాకిస్థాన్ vs ఐర్లాండ్, నేపాల్ vs కెనడా, న్యూజిలాండ్ vs యుఎఇ, ఇటలీ vs యుఎఇ, నమీబియా vs ఇండియా ఎ. మ్యాచు్లు జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. వార్మప్ మ్యాచ్లకు ఇండియా ఎ జట్టు: ఆయయు బదోని (కెప్టెన్), నమన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంశ్ ఆర్య, నారాయణణ్ జగదీశన్ (కీపర్), తిలక్ వర్మ, రియాన్ పరాగ్, మానవ్ సుతార్, ఆశోక్ శర్మ, ఉర్విల్ పటేల్ (కీపర్), గుర్జప్నీత్ సింగ్, విప్రాజ్ నిగమ్, రవి భిష్ణోయ్, ఖలీల అహ్మద్, మయాంక్ యదవ్.
Medak |కాంగ్రెస్ బోణీ.. 32వ వార్డు ఏకగ్రీవం
Medak | కాంగ్రెస్ బోణీ.. 32వ వార్డు ఏకగ్రీవం Medak | మెదక్
Epic socio-fantasy Nagabandham teaser for Mahasivaratri
Pan-India socio-fantasy epic Nagabandham, directed by Abhishek Nama, has become one of the most anticipated films in Indian Cinema. The makers have spent huge budget to bring marvellous visuals to life and recently, shot climax portions with grand sets. The promotions from the beginning have made this a highly crazy project Pan-India. Virat Karrna is […] The post Epic socio-fantasy Nagabandham teaser for Mahasivaratri appeared first on Telugu360 .
TG | తొలి జాబితా రిలీజ్! TG | మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ

19 C