SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
...

శనివారం రాశి ఫలాలు (21-03-2025)

మేషం:- అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం:- ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. మిధునం:- చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. కర్కాటకం:- సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. కుటుంబ విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సింహం:- కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. గృహనిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కన్య:- ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత రాణిస్తారు. తుల:- వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు జరుగుతాయి. ఇంటాబయట కొందరు ప్రవర్తన మానసిక చికాకు కeలిగిస్తుంది. బంధువర్గం నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృశ్చికం:- ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అవసరానికి ధనసహాయం లభిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. ధనస్సు:- వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. నూతన రుణయత్నాలు చేస్తారు. వ్యాపార విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మకరం:- స్నేహితులతో మాటపట్టింపులు ఉంటాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంతమందికోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. కుంభం:- చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. మీనం:- చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధన పరంగా చికాకులు తొలగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి. వ్యాపారమున అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.

మన తెలంగాణ 21 Mar 2026 12:10 am

ఇది బోగస్ బడ్జెట్: హరీశ్‌రావు

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించిన బడ్జెట్ అంతా బోగస్ అని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు అ న్నారు. ఇదొక ఝూటా బడ్జెట్ అని మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్‌తో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల ను, ఆర్‌టిసి కార్మికుల సమస్యలను, నిరుద్యోగల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చిన పించన్ పెంపు హామీలను కూడా సర్కారు మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అంకెలగారడీ, మాటల గారడీ తప్ప ప్రభుత్వానికి పేదలపట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమయ్యిందని హరీష్ రావు అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకొచ్చి మూడేళ్లు కాలేకపోయినా మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేసిందని, తెచ్చిన ఆ అప్పుతో ఏం చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా భట్టి అంబేద్కర్ సూక్తులు, రాజ్యాంగ విలువలను వల్లెవేశారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనుక కూసోబెట్టుకుని రాజ్యాంగ విలువల గురించి ఆయన మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలకు భట్టి ఘోరీ కట్టారని, కాగితాల మీద అంకెలు తప్ప, ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసం కోసం 6వేల కోట్లు , ఈసారి కూడా 6 వేల కోట్లు అన్నారని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనే అదే జరిగిందని, ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క పైసా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు.

మన తెలంగాణ 20 Mar 2026 11:22 pm

హోర్ముజ్ జలసంధి వద్ద నౌకలో కెప్టెన్ రంజన్ మృతి

హోర్ముజ్ జలసంధి సమీపాన చమురు రవాణా వాణిజ్యనౌకలో మృతి చెందిన కెప్టెన్ రాకేష్ రంజన్ మృతదేహాన్ని తిరిగి తీసుకు రావడంలో సహకరించాల్సిందిగా ఆయన కుటుంబం కేంద్ర ప్రభుత్వానికి, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాంచీకి చెందిన రంజన్ (43) ప్రైవేట్ కంపెనీకి చెందిన వాణిజ్యనౌక ‘ఎఎస్‌పి అవనాఆర్‌పిఎస్‌ఎల్ ఎంయుఎం172’ లో ఫిబ్రవరి 2న చేరారు. గుండెపోటుతో మార్చి 18న చనిపోయినట్టు ఆయన కుటుంబం వెల్లడించింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధికి 14 నాటికల్ మైళ్ల దూరంలో ఫిబ్రవరి 28 నుంచి ఈ నౌక నిల్చిపోయింది. “ వీలైనంత త్వరగా తన సోదరుని మృతదేహాన్ని రప్పించేందుకు సహకరించాలని జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్‌ను అభ్యర్థించాను. తన సోదరునికి రావలసిన ఆర్థిక బకాయిలు చెల్లింపులో కంపెనీ నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం పర్యవేక్షించాలి” అని ఆయన పెద్దన్న ఉమేష్ సింగ్ చెప్పారు. “ కేంద్ర ప్రభుత్వాన్ని , దుబాయ్ లోని భారత దౌత్యకార్యాలయాన్ని, కంపెనీని తన సోదరుని మృతదేహాన్ని వేగంగా రప్పించాలని విజ్ఞప్తి చేశాను ” అని ఉమేష్ సింగ్ చెప్పారు. ఈమేరకు సిఎం సోరేన్‌కు, రాంచీ ఎంపీ సంజయ్ సేథ్‌కు లేఖలు రాశానని తెలిపారు. “ నౌకలోకెప్టెన్ విధుల్లో ఉన్న తన సోదరుడు అపస్మారక స్థితిలో తన కుర్చీ నుంచి పడిపోయినట్టు మార్చి 18న కంపెనీ తెలిపింది. వైద్యసాయం అందించడానికి ప్రయత్నాలు జరిగాయి. విమానంలో ఆయనను తరలించడానికి అనుమతించలేదు. ఆ తరువాత ఆయన బోటులో దుబాయ్ లోని రషీద్ పోర్టుకు తరలించారు. అక్కడ ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. ” సింగ్ చెప్పారు. కెప్టెన్ రంజన్ పోస్ట్‌మార్టమ్ నివేదిక కోసం కుటుంబం నిరీక్షిస్తోంది. రషీద్ పోర్టులో పోలీస్ కస్టడీలో మార్చురీలో రంజన్ మృతదేహం భద్రపర్చి ఉంచారు. 

మన తెలంగాణ 20 Mar 2026 11:10 pm

22 Indian Ships Stranded : ​ ఆయిల్​ కష్టాల్లో భారత్​ Andhra Prabha News

22 Indian Ships Stranded : ​ ఆయిల్​ కష్టాల్లో భారత్​ Andhra

ప్రభ న్యూస్ 20 Mar 2026 10:51 pm

జిల్లా కలెక్టర్‌గా విజయ సునీత

విశాలాంధ్ర – మార్కాపురం : మార్కాపురం జిల్లా తొలి నూతన కలెక్టర్‌గా ఎం.విజయ సునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం మార్కెటింగ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 30న ఏర్పాటు చేసిన నూతన మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్‌గా 2014 బ్యాచ్ కి చెందిన మహిళా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది గతంలోనే జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులను ప్రభుత్వ నియమించింది. The post జిల్లా కలెక్టర్‌గా విజయ సునీత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:50 pm

పంట నష్టంపైరెండు రోజుల్లో నివేదిక

. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం రానివ్వొద్దు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో సంభవించిన పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, […] The post పంట నష్టంపైరెండు రోజుల్లో నివేదిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:43 pm

ఆరని చమురు మంటలు

కువైట్ రిఫైనరీపై ఇరాన్ మళ్లీ దాడులు . కువైట్ నుంచి యూఏఈ వరకు డ్రోన్లు, క్షిపణులు. భూమ్మీద రక్షణ లేకుండా చేస్తాం: అమెరికా, ఇజ్రాయిల్‌కు హెచ్చరిక. సైనికాధికారి మహమ్మద్ నయినీ మృతి. హోర్ముజ్ కోసం ఒక్కటైన ఆరు దేశాలు తెహ్రాన్/దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం మూడవ వారం భీకరంగా సాగుతూ ప్రమాదక స్థాయికి చేరుకుంది. ఈ దశలో చమురు క్షేత్రాలపై దాడులు తీవ్రతరమ య్యాయి. అమెరికా`ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడున్నాయి. ఇరాన్ కూడా తమ ప్రతీకార దాడులతో శుత్రువుల […] The post ఆరని చమురు మంటలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:38 pm

పెట్రోలు ధర రూ.2.35 పెంపు

న్యూదిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వేళ మోదీ సర్కారు పెట్రోలు ధరలు పెంచేసింది. ప్రీమియం పెట్రోలు ధర లీటర్‌కు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోలు ధర పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బీపీసీఎల్ స్పీడ్, ఐవోసీఎల్ ఎక్స్‌పీ95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధర పెంచాయి. సవరించిన […] The post పెట్రోలు ధర రూ.2.35 పెంపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:35 pm

అత్యంత కనిష్ఠానికి రూపాయి పతనం

ముంబై: పశ్చిమాసియా యుద్ధం అన్నిరంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 86 పైసలు క్షీణించి 93.75 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,559.38 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో దాదాపు వెయ్యి పాయింట్ల మేర లాభపడి 75,286.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెన్సెక్స్ 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం […] The post అత్యంత కనిష్ఠానికి రూపాయి పతనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:31 pm

మణిరత్నం లవ్ స్టోరీలో సాయి పల్లవి..

ప్రేమకథా చిత్రాలకు సమకాలీన అంశాలని జోడించి వెండితెరపై అందమైన దృశ్యకావ్యాలుగా ఆవిష్కరించడంలో మణిరత్నం మాస్టర్ అన్నది తెలిసిందే. రోజా నుంచి ఓకే బంగారం సినిమాల వరకు ఈ విషయాన్ని నిరూపించాయి. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మణిరత్నం రొమాంటిక్ లవ్ స్టోరీతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మంగా తెరపైకి తీసుకురాబోతోంది. మద్రాస్ టాకీస్ సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కథానాయికగా సాయి పల్లవి నటిస్తోంది. సాయి పల్లవి లాంటి సహజ నటితో తొలిసారి పని చేస్తున్న మణిరత్నం తనని ఎలా చూపిస్తాడు? అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.

మన తెలంగాణ 20 Mar 2026 10:30 pm

ఇరాన్ యురేనియం శుద్ధి చేయలేదు

జెరూసలేం: పశ్చిమాసియా యు ద్ధంలో ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీసి నట్లు ఇజ్రాయిల్ ప్రకటించుకుంది. యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యాన్ని ఇరాన్ కోల్పోయిందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. నిర్దేశించుకున్న మూడు లక్ష్యాలు సాధించడమే ఇరాన్‌పై యుద్ధం ముఖ్య ఉద్దేశంగా తెలిపారు. ఇరాన్ నుంచి అణుముప్ప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను అణగదొక్కడం, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించడమే అజెండాగా నెతన్యాహు చెప్పారు. ఇరాన్‌కు భారీగా నష్టం కలిగించా మని, క్షిపణి నిల్వలు, వాటి […] The post ఇరాన్ యురేనియం శుద్ధి చేయలేదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:26 pm

బతికే ఉన్నాం

నెతన్యాహు`ముజ్తబా వీడియో రుజువులు తెహ్రాన్/తెల్ అవీవ్: పశ్చిమాసియాలో యుద్ధం తారస్థాయికి చేరుకున్న తరుణంలో ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ మరణించినట్లు అమెరికా అనుకూల వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టాయి. అటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జాడలేరని, ఆయన ప్రాణాలతోనే ఉన్నారా అంటూ ఇరాన్ మీడియా అనుమానాలు రేకెత్తించింది. దీంతో ఆ ఇద్దరు నాయకులు తామింకా బతికే ఉన్నామని రుజువు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నెతన్యాహు కొన్ని వీడియోలు విడుదల చేయడం, ఇటీవల అమెరికా […] The post బతికే ఉన్నాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:24 pm

ట్రంప్ చైనా పర్యటన వాయిదా

వాషింగ్టన్: తన చైనా పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేసుకున్నారు. సుమారు నెలన్నర రోజులు పాటు ఈ పర్యటన వాయిదా పడింది. ఇదే విషయాన్ని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ‘చైనా పర్యటనను నెలన్నర రోజులు వాయిదా వేసుకున్నా. ఇది ఖరారైంది కానీ, చైనాలో పర్యటించాలని ఎదురు చూస్తున్నా’ అని ఓవల్ కార్యాలయంలో ట్రంప్ వెల్లడించారు.ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు వద్దని ఇజ్రాయిల్‌కు సూచించినట్లు ఆయన తెలిపారు. ‘మా దేశాలకు సమన్వయం కుదిరింది కానీ ఇజ్రాయిల్ […] The post ట్రంప్ చైనా పర్యటన వాయిదా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:22 pm

అమెరికా ఎఫ్-35కి ఇరాన్ దెబ్బ

తెహ్రాన్: అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ ద్బెతీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ విడుదల చేసింది. ఎఫ్-35 యుద్ధ విమానాన్ని తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోవడంతో అది పశ్చిమాసియాలోని అమెరికా స్థావరంలో అత్యవసరంగా దిగిందని ఇరాన్ ఒక ప్రకటన చేసింది. ‘మా గగనతల రక్షణ వ్యవస్థ అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా సైన్యానికి చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని దెబ్బతీసింది. అది ఏ స్థాయిలో దెబ్బతిన్నదనే దర్యాప్తు చేస్తున్నాం. విమానం పూర్తిగా ధ్వంసం కావడానికే […] The post అమెరికా ఎఫ్-35కి ఇరాన్ దెబ్బ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:21 pm

విదేశాలకెళ్లొద్దు… ఇంటి నుంచే పని: ఐఈఏ

పారిస్: పశ్చిమాసియాలో ఇంధన కేంద్రాలపై దాడుల క్రమంలో చమురు సంక్షోభం మరింత పరిగే పరిస్థితుల్లో అంత ర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) శుక్రవారం కొన్ని ప్రతిపాదనలు చేసింది. విదేశీ ప్రయాణాలు నివారించాలని, ఇంటి నుంచి పని సౌకర్యం కల్పించాలని సూచనలు చేసింది. తద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో చమురు ధరలపై ఒత్తిడిని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. ముడి చమురు ధరల పెరుగుదలతో వ్యూహాత్మక నిల్వల నుంచి రికార్డు స్థాయిలో 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు […] The post విదేశాలకెళ్లొద్దు… ఇంటి నుంచే పని: ఐఈఏ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:16 pm

గొప్ప గౌరవంగా భావిస్తున్నా…

ఎన్టీఆర్ జాతీయ పురస్కారంపై చిరంజీవిహైదరాబాద్: ఎన్టీఆర్ అంటే కళల సమ్మేళనమని, అలాంటి మహానుభావుడి పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ తనకు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తు న్నానని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నారు. తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడు అంటూ ఎన్టీఆర్‌ను కొనియాడారు. ‘దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపో యినా… కొన్ని పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ ఆయనది. రామా రావు జన్మించిందే సినిమాల కోసం […] The post గొప్ప గౌరవంగా భావిస్తున్నా… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:14 pm

సేతుపతి- సాయిపల్లవితో మణిరత్నం సినిమా

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం కొత్త సినిమాకు సంగీత దర్శకుడి విషయంలో కోలీవుడ్‌లో చర్చ సాగింది. రొటీన్‌కు భిన్నంగా ఈసారి తన చిత్రం కోసం వర్ధమాన సంగీత దర్శకుడిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్ ఇచ్చిన అప్‌డేట్‌తో ఈ రూమర్లకు చెక్ పడినట్లైంది. తమ సినిమా ఆడియో రైట్స్ సోనీ మ్యూజిక్ సొంతం చేసుకొందని తెలియజేస్తూ ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. […] The post సేతుపతి- సాయిపల్లవితో మణిరత్నం సినిమా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:12 pm

ఆసీస్ మహిళల గెలుపు

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా మహిళా టీమ్ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ బేథ్ మూపీ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 79 పరుగులు సాధించింది. ఇక ఎలిసె పేరి (36) పరుగులు చేసి తనవంతు సహకారం అందించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ ఖియానా జోసెఫ్ (45), స్టెఫాని (28) రాణించినా ఫలితం లేకుండా పోయింది.

మన తెలంగాణ 20 Mar 2026 10:10 pm

‘ఈగో రాజా’గా సాయికుమార్

హైదరాబాద్: ఆది సాయి కుమార్ హీరోగా ఎస్‌జీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సురేష్ నిర్మిస్తున్న ‘ఈగో రాజా’ మూవీని గురు శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆదితో పాటుగా నటుడు సతీష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను ఉగాది సందర్భంగా వెల్లడించారు. యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్‌తో రాబోతోన్న ఈ మూవీ అద్భుతంగా ఉండబోతోందని టీం నమ్మకంగా చెబుతోంది. ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ ఆది సాయి […] The post ‘ఈగో రాజా’గా సాయికుమార్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:09 pm

వన్డే ప్రపంచ కప్ : 20 మంది ప్రాబబుల్స్ సిద్ధం

ముంబై: ఓ వైపు ఐపీఎల్ 2026 సీజన్ సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లోనే మెగా లీగ్ ప్రారంభం కానుంది. ఇది పూర్తయ్యే వరకూ ఏ భారత క్రికెటరూ అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం ఉండదు. కానీ, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం నిశ్శబ్దంగా మహాసంగ్రామం కోసం జట్టును సిద్ధం చేసే పనిలో ఉంది. ఇప్పటికే ఓ 20 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ కోసమేనని […] The post వన్డే ప్రపంచ కప్ : 20 మంది ప్రాబబుల్స్ సిద్ధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 10:08 pm

ఈ నెల 23న ‘వాహన్ పోర్టల్’ ప్రారంభం

రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పారదర్శక, వేగవంత, సులభమైన సేవలను అందించేందుకు ‘వాహన్ పోర్టల్’ను ఈ నెల 23న ప్రారంభించ నున్నట్లు రవాణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.. ఈ పోర్టల్‌ను రవాణా, బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ వాహన్ పోర్టల్ ద్వారా దేశ వ్యాప్త వాహనాల సమాచారం ఒకే చోట లభ్యమౌతుందని తెలిపారు. వాహన్‌తో అనుసంధానం వల్ల తెలంగాణకు చెందిన వాహనాలు జాతీయ డేటా బేస్ లోకి వెళ్ళనున్నాయి. అంతే కాకుండా రెండవ వాహనాలకు వర్తించే అదనపు 2 శాతం జీవితకాలపు పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రద్దు మార్చి 23 నుండి అమలులోకి వస్తుందని తెలిపారు.

మన తెలంగాణ 20 Mar 2026 10:00 pm

Mega Family watching UBS Special Screening

Pawan Kalyan’s Ustaad Bhagat Singh released on Thursday and the film is doing decent. Though the talk is mixed, the film is posting decent numbers all over. Megastar Chiranjeevi along with his family and Pawan Kalyan along with his family are watching Ustaad Bhagat Singh in a special screening. The screening is taking place in […] The post Mega Family watching UBS Special Screening appeared first on Telugu360 .

తెలుగు 360 20 Mar 2026 9:58 pm

ఇక్కత్ చేనేత చీరలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి

ఇక్కత్ చేనేత చీరలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి ఇక్కత్ చేనేత చీరలు,

ప్రభ న్యూస్ 20 Mar 2026 9:51 pm

పోకిరిల పై చర్య తీసుకోవాలి..

పోకిరిల పై చర్య తీసుకోవాలి.. ఎస్సై కి వినతిపత్రం అందజేసిన ఏబీవీపీ నేతలు

ప్రభ న్యూస్ 20 Mar 2026 9:46 pm

పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు ఎంతో కీలకం

గోదావరిఖని, జనంసాక్షి : ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్bకుమార్ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో భాగంగా మొబైల్ టవర్లు, కాలుష్యం, పచ్చదనం తగ్గిపోవడం …

జనం సాక్షి 20 Mar 2026 9:43 pm

అంకెల గారడీ బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేది శూన్యం

అంకెల గారడీ బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేది శూన్యం మహిళలు,పేద ప్రజలను, నిరుద్యోగులను

ప్రభ న్యూస్ 20 Mar 2026 9:42 pm

1.6 లక్షల కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు 856 కోట్ల 98 లక్షల పన్ను మినహాయింపు

ఎలక్ట్రిక్ వాహన విధానం కింద 1 లక్ష 6 వేలఎలక్ట్రిక్ వాహనాలకు 856 కోట్ల 98 లక్షలపన్ను మినహాయింపులు ఇచ్చి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా రవాణా శాఖ పనితీరు, కేటాయింపులపై మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి రాబడి తగ్గినా పర్యావరణ పరిరక్షణ విషయంలో వెనుకడుగు వేయడం లేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ పరిధిలో 1 కోటి 82 లక్షల నమోదిత వాహనాలు ఉండగా వ్యవసాయ, త్రిచక్ర వాహనాలకు చెందిన 11 లక్షల 75 వేల వాహనాలకు, 105 కోట్ల 16 లక్షలరూపాయల పన్ను మినహాయింపులు చేశామని తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి) అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలు సారథి, వాహన్ లను తెలంగాణలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వాహన్ సేవలను వచ్చే ఆరు నెలల్లో పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్ అండ్‌బి రోడ్లను హామ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ అండ్ బి రోడ్డు నిర్మాణంతో పాటు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాల నినిర్ణయించామని డిప్యూటీ సిఎం భట్టి వెల్లడించారు.

మన తెలంగాణ 20 Mar 2026 9:40 pm

బురదలో గార్ధేబాల పరుగు…

బురదలో గార్ధేబాల పరుగు… కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆచార సంప్రదాయాలకు కర్నూలు

ప్రభ న్యూస్ 20 Mar 2026 9:36 pm

పెద్ద వెంకటాపురంలో వడగండ్ల వాన

పెద్ద వెంకటాపురంలో వడగండ్ల వాన ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో గురువారం

ప్రభ న్యూస్ 20 Mar 2026 9:27 pm

Gulf oil crisis 2026 : పశ్చిమాసియా అగ్నిగుండం Andhra Prabha Detail report

Gulf oil crisis 2026 : పశ్చిమాసియా అగ్నిగుండం Andhra Prabha Detail

ప్రభ న్యూస్ 20 Mar 2026 9:22 pm

కువైట్ రిఫైనరీపై ఇరాన్ దాడి..

గల్ఫ్‌లో చమురు కేంద్రాలపై దాడులు ఉధృతం అయ్యాయి. తమ ప్రతీకార దాడుల్లో ఇరాన్ శుక్రవారం కువైట్ లోని మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్లతో దాడికి దిగింది. ప్రస్తుత పోరు గల్ఫ్‌లోని ఇంధన వ్యవస్థలను దెబ్బతీయడం అంతర్జాతీయంగా చమురు సంక్షోమ తీవ్రతకు దారితీసన దశలోనే కువైట్‌లోని రిఫైనరీకి భారీ నష్టం సంభవించింది.ప్రతిరోజూ 7,30,00 బ్యారెల్స్ శుద్ధి సామర్థం గల ఈ రిఫైనరీ వరుసగా రెండో రోజు కూడా దాడులకు గురైంది. చమురు సంపన్న గల్ఫ్ దేశం కువైట్‌లో ఉన్న మూడు రిఫైనరీలలో మినా రిఫైనరీ ఒకటి. పర్షియన్ గల్ఫ్‌లోని తమ భారీ సహజవాయువు ఉత్పత్తి సౌత్ పార్స్ కేంద్రంపై ఇజ్రాయెల్ బుధవారం జరిపిన దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్‌లోని పలు చమురు క్షేత్రాలపై దాడులకు దిగుతోంది. ఇంతకు ముందే దెబ్బతిని ఉన్న కువైట్ రిఫైనరీ ఇప్పటి దాడులతో మరింత ధ్వంసం అయింది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ దాడుల క్రమంలోనే ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా మొజ్తాబీ నుంచి అరుదైన ప్రకటన వెలువడింది.ఇక ఇరాన్ శత్రువులు తమ భద్రతను గాలికి వదిలిపెట్టాల్సిందే అని ఆయన తరఫున ప్రకటనను వార్తా సంస్థలు వెలువరించాయి. మరో వైపు ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజాము నుంచే టెహరాన్‌పై దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ క్షిపణుల దాడులలో పలు ప్రాంతాలో మంటలు చెలరేగాయి. పర్షియన్ న్యూ ఇయర్ దశలోనే ఈ దాడులు ముమ్మరం అయ్యాయి. ఇరాన్ దాడులకు దెబ్బతింటున్న దుబాయ్‌లో శుక్రవారం కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. స్థానికంగా ఈదుల్ ఫితర్‌కు ప్రజలు సిద్ధమైన దశలోనే క్షిపణులు, డ్రోన్ల దాడుల భయాలు నెలకొన్నాయి. బహరైన్‌లో ఓ ఆయుధగిడ్డంగిపై దాడి జరిగింది. సైదీ అరేబియాలోని చమురు సంపన్న తూర్పు ప్రాంతంలో పలు డ్రోన్లను భద్రతా దళాలు నేలకూల్చాయి. ఇరాన్‌కు చెందిన గ్యాస్ ఫీల్డ్‌లపై మరోసారి దాడులకు దిగబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. చమురు సంక్షోభ తీవ్రత దశలో ట్రంప్ చేసిన విజ్ఞప్తి మేరకు తాము స్పందించినట్లు వివరించారు. ఇప్పటికే ఇరాన్ ఖండాంతర క్షిపణుల ఉత్పత్తి సామర్థాన్ని దెబ్బతీశామని తెలిపారు. ఈ వాదనను ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ వర్గాలు తోసిపుచ్చాయి. ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడుల్లో సిరియాలోని కొన్ని మిలిటెంట్ స్థావరాలు దెబ్బతిన్నాయి. డ్రూజే ప్రాంతంలో ఇంతకు ముందు జరిగిన దాడులకు ప్రతిగా సిరియాలోని స్థావరాలను లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్ స్పందించింది. 

మన తెలంగాణ 20 Mar 2026 9:20 pm

వాస్తవ పరిస్థితులకు భిన్నంగా రాష్ట్ర బడ్జెట్

వాస్తవ పరిస్థితులకు భిన్నంగా రాష్ట్ర బడ్జెట్ రాజీవ్ యువవికాసం పేరుతో ఉద్యోగు లను

ప్రభ న్యూస్ 20 Mar 2026 9:17 pm

పన్నులు పెంచలేదు…సవరణలే చేశాం

పన్నులు పెంచలేదు…సవరణలే చేశాం మున్సిపాలిటీగా మారిన తర్వాత ఆస్తుల పునఃపరిశీలన చేసాంఅండర్ అసెస్‌డ్

ప్రభ న్యూస్ 20 Mar 2026 9:12 pm

కుమార్తెతో కలిసి ట్యాంకర్ పై కిమ్‌ షికారు

ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్‌జూయే మరోసారి వార్తల్లో నిలిచారు. సైనిక విన్యాసాల్లో ఆమె ట్యాంకర్ నడిపిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సియోల్ నుంచి వచ్చిన సమాచార ప్రకారం, తండ్రి పర్యవేక్షణలో జరిగిన సైనిక శిక్షణలో కిమ్‌జూయే ట్యాంకర్‌ను నడిపిన దృశ్యాలు బయటకు రావడంతో, ఆమెను భవిష్యత్ వారసురాలిగా తయారు చేస్తున్నారనే ఊహాగానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, కిమ్ జోంగ్ ఉన్ సైనిక ట్యాంకర్ దళాలు, సైనికులతో కూడిన వ్యూహాత్మక విన్యాసాలను పర్యవేక్షించి, యుద్ధ సన్నద్ధతను పూర్తి చేయాలని సైన్యానికి పిలుపునిచ్చారు. విడుదలైన వీడియోలు, చిత్రాల్లో ఆయన కుమార్తె ఒక ఆకుపచ్చ రంగు ట్యాంకర్ డ్రైవర్ హ్యాచ్ నుంచి బయటికి చూసుకుంటూ వాహనాన్ని నడుపుతుండగా, కిమ్ పైభాగంలో కూర్చొని చిరునవ్వుతో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సుమారు 13 సంవత్సరాల వయస్సు గల కిమ్ జూయే, 2022 చివరి నుండి తండ్రితో కలిసి పలువురు కీలక సైనిక, ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపిస్తోంది. ఉత్తర కొరియా మీడియా ఆమెను అత్యంత ప్రియమైన, గౌరవనీయమైన సంతానంగా పేర్కొంటూ, ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని చూపించే దృశ్యాలను తరచుగా ప్రసారం చేస్తోంది. ఇటీవల ఒక ఆయుధ తయారీ కేంద్రాన్ని సందర్శించినప్పుడు తండ్రితో కలిసి తుపాకీ కాల్పులు జరపడం, రాకెట్ ప్రయోగాల పరీక్షలను వీక్షించడం వంటి కార్యకలాపాల్లో కూడా ఆమె పాల్గొంది. గత సెప్టెంబర్‌లో బీజింగ్ పర్యటనలో తండ్రిని అనుసరించిన ఈ యువతి, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయనకు చెంపపై ముద్దు పెట్టిన దృశ్యాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. దక్షిణ కొరియా గూఢచారి సంస్థ ఇటీవల ఆమెను వారసురాలిగా ప్రకటించే దిశగా కిమ్ అడుగులు వేస్తున్నారని అంచనా వేసింది. అయితే కిమ్ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

మన తెలంగాణ 20 Mar 2026 9:10 pm

రైతుల కోసం అసెంబ్లీలో గళమెత్తిన కడియం..!

రైతుల కోసం అసెంబ్లీలో గళమెత్తిన కడియం..! మొక్కజొన్న రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యేవెంటనే

ప్రభ న్యూస్ 20 Mar 2026 9:09 pm

వెల్దండలో అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష..

వెల్దండలో అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష.. వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ

ప్రభ న్యూస్ 20 Mar 2026 9:05 pm

Ashish’s DeThadi Interesting Glimpse Poster

Young hero Ashish who made his mark with films like Rowdy Boys and Love Me is presently starring in a rustic and culturally rooted Hyderabad based film DeThadi, being produced by Dil Raju and Shirish under Sri Venkateswara Creations with Aditya Rao Gangasani making his directorial debut. The project is swiftly moving through its shoot. […] The post Ashish’s DeThadi Interesting Glimpse Poster appeared first on Telugu360 .

తెలుగు 360 20 Mar 2026 9:02 pm

గోదావరిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతు

భద్రాచలం పట్టణంలో పెను విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం పరిధిలో కొల్లుగూడెం గోదావరి నదిలో జరిగిన విషాద ఘటనలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన వీరు నదిలో స్నానాలకు దిగగా ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతి లోని ఎస్‌ఆర్‌ఎంటీ (ఎస్ ఆర్ ఎమ్ టి) కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, భద్రాచలం ప్రాంతానికి చెందిన తమ మిత్రులు అభిరామ్, శ్రీకర్‌లతో కలిసి ఎటపాక మండలం లోని పురుషోత్తమపట్నం గ్రామ శివారులో ఉన్న కొల్లిగూడెం ఇసుక ర్యాంప్ సమీపంలోని గోదావరి నది లోకి దిగారు. ఫోటోలు తీసుకుంటూ ఉండగా ఏడుగురు యువకులు అకస్మాత్తుగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకోగా మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు.గల్లంతైన వారిని అభిరామ్, శ్రీకర్, తేజ, సతీష్, నవదీప్‌లుగా గుర్తించారు. ఇందులో అభిరామ్, శ్రీకర్ భద్రాచలం ప్రాంతానికి చెందినవారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక రిస్క్యూ బృందం కూడా మృతదేహాల కోసం గాలిస్తోంది. ముగ్గురి మృతదేహాలు లభ్యం గోదారి నదిలో గల్లంతైన వారిలో సాయంత్రం ఐదు గంటలకే మూడు మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలింపు చర్యలను చేపట్టారు. లభ్యమైన మృతదేహాలలో భద్రాచలం పట్టణానికి చెందిన చారు గుండ్ల శ్రీకర్ అభిరామ్ ఉయ్యూరుకి చెందిన నవదీప్ మృతదేహాలు లభ్యం కాగా భద్రాచలం పట్టణంలో విషాదఛాయలు అనుముకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌ఆర్‌ఎంటి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు నదీ ప్రమాదంలో మృతి చెందడంతో వారి స్నేహితులు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఉదయమే రామాలయ దర్శనానికి వచ్చి సంప్రదాయ వస్త్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అంతలోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారని మృతుల కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతి చెందిన ఐదుగురిలో ఇద్దరు భద్రాచలం పట్టణానికి చెందిన వారు కాగా అందులో ఒకరు సీనియర్ పాత్రికేయులు ఎయిర్‌టెల్ రామకృష్ణ కుమారుడు కాగా మరొకరు ఇటీవలే సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అర్చకత్వాన్ని అభ్యసిస్తున్న యువకుడు అభిరామ్ అని తెలిసింది. కొలిగుడం వద్ద ఇటీవల ఇసుకను తోడేయడంతో గోదావరి లోతుపై సరైన అంచనా లేకనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. స్నానాల కోసమని నదిలో దిగి సరదాగా సెల్ఫీలు దిగే సమయంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోవటంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రమాదంలో బయటపడ్డ ఇద్దరు యువకులు తెలిపారు. కళ్ళముందే తన స్నేహితులు నీళ్లలో మునిగిపోవడం కనిపించిందని తీవ్రమైన రోదనతో ఆ యువకులు విలపించారు.

మన తెలంగాణ 20 Mar 2026 8:55 pm

ఫ్యాక్ట్ చెక్: రైలులో సీట్ కోసం గొడవ అంటూ స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు

రైలులో సీట్ కోసం గొడవ అంటూ స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా..

తెలుగు పోస్ట్ 20 Mar 2026 8:46 pm

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు..

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు.. ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా పాయకాపురం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 20 Mar 2026 8:43 pm

ముస్లింలకు కెసిఆర్ రంజాన్ శుభాకాంక్షలు

రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లిం సహోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభం నుంచి చివరి రోజు వరకు, ప్రతి రోజూ ప్రత్యేక దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధలతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని అన్నారు.ఈ సందర్భంగా పరస్పర శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలు పరిమళిస్తాయని పేర్కొన్నారు. లౌకికవాద విలువలకు ప్రాధాన్యతనిస్తూ, విభిన్న మతాల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ, గంగా-జమున తహజీబ్‌కు ప్రతీకగా బిఆర్‌ఎస్ పాలన కొనసాగిందని తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, ప్రగతి కోసం విద్య తదితర రంగాల్లో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారి జీవన విధానంలో గుణాత్మక మార్పుకు దోహదం చేశాయని అన్నారు. ప్రగతి తిరిగి పుంజుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కెసిఆర్ ఆకాంక్షించారు.

మన తెలంగాణ 20 Mar 2026 8:39 pm

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత..

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత.. భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ

ప్రభ న్యూస్ 20 Mar 2026 8:36 pm

ప్రతి అర్జీపై బాధ్యతాయుత చర్యలు

ప్రతి అర్జీపై బాధ్యతాయుత చర్యలు సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు పాయకాపురం,ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 20 Mar 2026 8:33 pm

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని

ప్రభ న్యూస్ 20 Mar 2026 8:30 pm

అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్

అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ నిజామాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 20 Mar 2026 8:25 pm

కనకదుర్గమ్మవారికి బంగారు కానుక

కనకదుర్గమ్మవారికి బంగారు కానుక విలువైన మంగళసూత్రాలు కానుక ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడ

ప్రభ న్యూస్ 20 Mar 2026 8:21 pm

వినియోగదారులకు షాక్.. ఆ ఫీజు పెంచేసిన జొమాటో..

పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును జొమాటో పెంచేసింది. కంపెనీ యాప్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వినియోగదారులు ఒక్కో ఆర్డర్‌కు ఇక నుంచి రూ.2.40 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే వసూలు చేస్తున్న ఫీజు రూ.12.50 నుంచి 14.90కి పెరిగింది. జొమాటో, దాని పోటీ సంస్థ స్విగ్గీ ఒకే తరహాలో ధరల ట్రెండ్‌ను అనుసరిస్తుంటాయి. అన్ని పన్నులు కలుపుకొని ప్రస్తుతం స్విగ్గీ వసూలు చేస్తున్న ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.14.99గా ఉంది. యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు డెలివరీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఫీజు పెంపునకు అది ఓ కారణంగా చెప్పుకోవచ్చు. 

మన తెలంగాణ 20 Mar 2026 8:16 pm

పార‌ద‌ర్శ‌కంగా పంట న‌ష్టాల నివేదిక‌లు

పార‌ద‌ర్శ‌కంగా పంట న‌ష్టాల నివేదిక‌లు రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదుఅకాల వ‌ర్షాల‌పై

ప్రభ న్యూస్ 20 Mar 2026 8:15 pm

పీఎన్‌జీ క‌నెక్ష‌న్ కావాలా..

పీఎన్‌జీ క‌నెక్ష‌న్ కావాలా.. 91549 70454 నంబ‌రుకు కాల్ చేయండిప్ర‌యోజ‌నాల‌తో పాటు పూర్తివివ‌రాలు

ప్రభ న్యూస్ 20 Mar 2026 8:11 pm

శాఖల వారీగా బడ్జెట్‌లో కేటాయింపులు

2025/2026 బడ్జెట్‌లో...                                             2026/2027 బడ్జెట్‌లో... రైతు భరోసా - రూ.18 వేల కోట్లు                                   రైతు భరోసా రూ.18 వేల కోట్లు వ్యవసాయ శాఖకు - రూ.24,439 కోట్లు                         వ్యవసాయశాఖకు రూ.23,179 కోట్లు పశుసంవర్థక శాఖకు - రూ.1,674 కోట్లు                        పశుసంవర్ధకశాఖకు రూ.1529 కోట్లు పౌర సరఫరాల శాఖ- రూ.5,734 కోట్లు                         పౌర సరఫరాల శాఖ-కు రూ.7366 కోట్లు విద్యాశాఖకు - రూ.23,108 కోట్లుకు                            విద్యాశాఖకు - రూ.26,674 కోట్లు పంచాయతీ రాజ్ శాఖకు- రూ.31,605 కోట్లు                 పంచాయతీ రాజ్ శాఖకు- రూ.33,688 కోట్లు మహిళా, శిశు సంక్షేమం - రూ.2,861 కోట్లు                  మహిళా,శిశు సంక్షేమం - రూ.3143 కోట్లు ఎస్సీ సంక్షేమం - రూ.40,232 కోట్లు                           ఎస్సీ సంక్షేమం రూ.11,784కోట్లు ఎస్టీ సంక్షేమం - రూ.17,169 కోట్లు                             ఎస్టీ సంక్షేమం - రూ.7937 కోట్లు బీసీ సంక్షేమం - రూ.11,405 కోట్లు                            బీసీ సంక్షేమం - రూ.12,511 కోట్లు మైనర్టీ సంక్షేమం - రూ.3,591 కోట్లు                           మైనర్టీ సంక్షేమం - రూ.3769కోట్లు చేనేత - రూ.371 కోట్లు                                            చేనేత - రూ.258 కోట్లు ఐటీ - రూ.774 కోట్లు                                              ఐటీ - రూ.875 కోట్లు పారిశ్రామిక రంగం - రూ.3,525 కోట్లు                         పారిశ్రామిక రంగం - రూ.3,490 కోట్లు విద్యుత్ - రూ.21,221 కోట్లు                                    విద్యుత్ - రూ.21,285 కోట్లు వైద్యా,ఆరోగ్యం - రూ.12,393 కోట్లు                            వైద్యా,ఆరోగ్యం -రూ.13,679 పురపాలక, పట్టణాభివృద్ధి రూ.17,677 కోట్లు               పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.17,907 కోట్లు నీటిపారుదల - రూ.23,373 కోట్లు                             నీటిపారుదల -రూ.22,615 కోట్లు ఆర్ అడ్ బీ - రూ.5,907 కోట్లు                                 ఆర్ అడ్ బీ - రూ.12,789 కోట్లు పర్యాటక రంగం - రూ.775 కోట్లు                              పర్యాటక రంగం - రూ.1224 కోట్లు శాంతిభద్రతలు - రూ.10,188 కోట్లు                          శాంతిభద్రతలు - రూ.11,907 కోట్లు ఇందిరమ్మ ఇళ్లకు - రూ.22,500 కోట్లు                     ఇందిరమ్మ ఇళ్లకు - రూ.7,430 కోట్లు

మన తెలంగాణ 20 Mar 2026 8:10 pm

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33,688 కోట్ల బడ్జెట్ కేటాయింపు

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.33,688 కోట్లను కేటాయించినట్లు డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనిలో భాగంగా పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.2,622 కోట్లు, చేయూత పెన్షన్లకు రూ.14,861 కోట్లు, పంచాయతీ రాజ్ హామ్ రోడ్లకు రూ.1372 కోట్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.750 కోట్లు, గ్రామీణ రహదారుల నిర్వహణకు రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించిన నిధుల కేటాయింపును వివరించారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ ఎంపిక చేసిన రహదారులను హామ్ విధానంలో నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొదటి దశ కింద 96 నియోజక వర్గాల పరిధిలో 7,450 కి.మీ. గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విధానం ప్రకారం 40 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 60 శాతాన్ని రాయితీదారు పెట్టుబడి పెడతారని స్పష్టం చేశారు. ఈ 60 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాల కాల పరిమితి 30 యాన్యుటీలలో తిరిగి చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ రోడ్ల నిర్వహణబాధ్యత పెట్టబడిదారుడికే ఉంటుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,980 కి.మీ.ల రహదారులను నిర్మించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించారు.

మన తెలంగాణ 20 Mar 2026 8:00 pm

23 ఏళ్లుగా నిర్లక్ష్యం.. బిసిసిఐపై మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు

టీం ఇండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బిసిసిఐపై సంచలన ఆరోపణలు చేశారు. బిసిసిఐ కామెంటేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన ఆయన.. సోషల్‌మీడియాలో వరుసగా పోస్ట్‌లు పెట్టారు. 23 ఏళ్లుగా తనని నిర్లక్ష్యం చేసిందని బిసిసిఐపై మండిపడ్డారు. బ్రాడ్‌కాస్టింగ్‌తో సుదీర్ఘ సంబంధాలు ఉన్నప్పటికీ.. ఒక్కసారి కూడా తనకు కీలక బాధ్యతలు అప్పగించలేదని అన్నారు. ‘‘నేను బిసిసిఐ కామెంటేటర్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నా. గత 23 ఏళ్లుగా నన్ను పెద్ద మ్యాచ్‌లకు టాస్ వేయడం.. అవార్డు ప్రజెంటేషన్ వంటి వాటికి వినియోగించలేదు. నా తర్వాత వచ్చిన వారికి కూడా అవకాశాలు వస్తున్నాయి. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడూ కొత్త వాళ్లతోనే పిచ్ రిపోర్ట్ ప్రజెంటేషన్ చేయించింది. నన్ను పక్కనపెట్టి అలా చేయడానికి కారణాలు ఏంటో తెలియరాలేదు. అయితే ఆత్మ గౌరవాన్ని త్యాగం చేసి ఎవరికీ దాసోహం కాలేను. అలా ఎప్పటికీ ఉండలేను. ఈ నిర్ణయం ఒక కథకు ఆరంభం మాత్రమే. సాధారణ ప్రజలు, క్రికెట్ అభిమానులు ప్రతి ఒక్కరూ షాక్ అవుతారని తెలుసు. అలాగే నన్ను ద్వేషించేవాళ్లు సంతోషిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కనీసం నేను మంచి వాడినని భావించిన వారికి ధన్యవాదాలు’’ అంటూ వరుస పోస్టులతో శివ రామకృష్ణన్ విమర్శించారు. దీనిపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ‘వద్దు’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.

మన తెలంగాణ 20 Mar 2026 7:59 pm

18 మందికి లాఠీ దెబ్బలు… ఎందుకంటే

18 మందికి లాఠీ దెబ్బలు… ఎందుకంటే ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పైన

ప్రభ న్యూస్ 20 Mar 2026 7:54 pm

ప్రజా వంచన బడ్జెట్ తెచ్చారు..

ప్రజా వంచన బడ్జెట్ తెచ్చారు.. కరీంనగర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మరోసారి

ప్రభ న్యూస్ 20 Mar 2026 7:53 pm

మహిళ, శిశుసంక్షేమానికి రూ.3,143 కోట్లు

 వార్షిక బడ్జెట్ లో మహిళ, శిశుసంక్షేమానికి రూ.3,143 కోట్లను కేటాయించినట్లు భట్టి వెల్లడించారు. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ‘ఆధార్‌శిల’ పాఠ్యాంశాల ద్వారా సుమారు 4 లక్షల మంది చిన్నారులకు అత్యుత్తమ ప్రీ-ప్రైమరీ విద్యను ఉచితంగా అందించడంతో పాటు రెండు జతల యూనిఫాంలు అందిస్తున్నామని చెప్పారు. ‘బాల భరోసా’ పథకం ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక వైకల్యాలను లేదా ఎదుగుదలలో ఉండే లోపాలను తొలిదశలోనే గుర్తించడం ద్వారా, వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించి, భవిష్యత్తులో అవి శాశ్వత వైకల్యాలుగా మారకుండా నివారించి వారి తల్లిదండ్రులకు కొండంత ’భరోసా’ను ఇస్తోందని భట్టి పేర్కొన్నారు. దివ్యాంగుల మధ్య జరిగే వివాహాన్ని ప్రోత్సహిస్తూ, తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ప్రారంభించేందుకు వీలుగా రూ.2 లక్షల నగదును ప్రభుత్వం కానుకగా అందిస్తోందని చెప్పారు. ‘స్టేట్ న్యూట్రిషన్ మిషన్’ ద్వారా మన పట్టణాల్లోని పేదలకు అదనపు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఈ ఏడాది కొత్తగా 274 ‘మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను’ ఏర్పాటు చేయబోతున్నామని భట్టి తెలిపారు. పాలనా పథకం ద్వారా పనిచేసే మహిళల పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 500 అంగన్‌వాడీ కమ్ క్రచ్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారంతోపాటు, డే- కేర్సే సేవలు అందించి వారిని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధుల సంక్షేమానికి 37 ‘ప్రణామ్’ డేకేర్ సెంటర్లు మంజూరు చేశామని వెల్లడించారు.

మన తెలంగాణ 20 Mar 2026 7:50 pm

మేడపెల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం..

మేడపెల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం.. 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా

ప్రభ న్యూస్ 20 Mar 2026 7:48 pm

సింగిల్ యూస్ ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్మానం..

సింగిల్ యూస్ ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్మానం.. వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్

ప్రభ న్యూస్ 20 Mar 2026 7:45 pm

డ్వాక్రా సంఘాలకు రూ.2.500 కోట్ల వడ్డీ లేని రుణాలు

రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రూ.2.500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2026.27 వార్షిక బడ్జెట్‌లో డ్వాక్రా సంఘాలకు రూ.2,500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు ఆయన శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఎంతో మేలు చేసే వడ్డీలేని రుణాలను ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను ప్రోత్సహించడానికి కొత్తగా 18 ఏండ్లకు పైబడిన 61 ఏండ్లు దాటిన మహిళలను కూడా డ్వాక్రా సంఘాల్లో చేర్పించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను స్వయం ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు రూ.5 వేల నుంచి 5 లక్షల వరకు రుణాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. ఆరోగ్య, విద్య అవసరాల కోసం స్త్రీ నిధి ద్వారా రుణాలు అందజేసుతన్నారు. వ్యవసాయ అనుబంధ, పరిశ్రమ అనుబంధ రంగాలతో జీవనోపాధి పొందేందుకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నారు. దీనికి అదనంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టే వారికి రుణం వడ్డీ కోసం రూ.350 కోట్లు, పింఛన్లకు రూ.14,861 కోట్ల్లు మంజూరు చేశారు.

మన తెలంగాణ 20 Mar 2026 7:40 pm

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా: సిఎం రేవంత్

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ ఫూచరిస్టిక్ బడ్జెట్ అని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేశామని అన్నారు. అన్ని రంగాలు, అన్ని వర్గాలకు నిధులు కేటాయించామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఇందిరా కుటుంబ జీవిత బీమా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరా కుటుంబ జీవిత బీమా ద్వారా రూ.5 లక్షల పరిహారం అందుతుందని తెలిపారు. విద్యారంగ సంస్కరణలకు, ప్రజారోగ్య సంరక్షణకు అధిక నిధులు కేటాయించామని అన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర విద్యా విధానం మార్పు చేస్తామని తెలిపారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు ఒకే చోట చదివేలా విద్యా విధానం రూపొందిస్తామని అన్నారు. ఇక మూసీ పునరుజ్జీవం విషయంలో రాజీ పడేది లేదని సిఎం స్పష్టం చేశారు. మూసీ బాధితులను ఆదుకుంటామని.. మూసీ అభివృద్ధికి అప్పులు ఇచ్చేందుకు ఎడిబి సిద్ధంగా ఉందని తెలిపారు. మూసీ డిపిఆర్ సాంకేతిక నిపుణుల ద్వారానే తయారవుతోందని అన్నారు. డిపిఆర్ పూర్తయ్యాక నిధుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేస్తామని పేర్కొన్నారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదు స్పష్టం చేశారు. భూములు అమ్మిన నిధులను రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలని అన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాలేదు.. కానీ, రూ.44 వేల కోట్ల అప్పు చెల్లించామని సిఎం అన్నారు. ఆర్థిక వెసులుబాటు చూసుకొని గ్యారంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు. హరీశ్, కెటిఆర్, కెసిఆర్‌కు ఎం చెప్పినా.. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే అని మండిపడ్డారు.

మన తెలంగాణ 20 Mar 2026 7:31 pm

గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు

 తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా ‘కుంభమేళా’ తరహాలో పుష్కరాలను ప్రతిష్టాత్మ కంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ అందుకు అనుగుణంగా 2026-.27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.500 కోట్లను ప్రత్యేకంగా పుష్కరాల ఏర్పాట్ల కోసం కేటాయించింది. డిప్యూటీ సిఎం, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అవసరమైన నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకున్నారు. భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పన్నెండేళ్లకు ఒకసారి అత్యంత పవిత్రంగా జరిగే గోదావరి పుష్కరాలు రాష్ట్రంలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్నాయి. సుమారు 8 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా పుష్కరాల నిర్వహణ, రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మంత్రి డి. శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో పాటు తెలంగాణలో ఆధ్యాత్మికంగా పర్యాట రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సిఎం భట్టి వెల్లడించారు. దేవాదాయ శాఖ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థతో కలిసి రాష్ట్రంలో తొమ్మిది కొత్త పవిత్ర యాత్రా సర్క్యూట్లను ప్రారంభించిందని తెలిపారు. ఈ సర్క్యూట్ల ద్వారా భక్తులకు వసతి సదుపాయాలు, ప్రత్యేక దర్శనం, పర్యాటక సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

మన తెలంగాణ 20 Mar 2026 7:30 pm

Thaman to work with Trivikram Again

Top director Trivikram and young composer Thaman worked on films like Ala Vaikunthapurramuloo, Aravinda Sametha Veera Raghava and Guntur Kaaram in the past. Trivikram is currently directing Victory Venkatesh and the family entertainer is titled Adarsha Kutumbam. Instead of working with Thaman, Trivikram has roped in young composer Harshavardhan Rameshwar for the film. Many are […] The post Thaman to work with Trivikram Again appeared first on Telugu360 .

తెలుగు 360 20 Mar 2026 7:28 pm

గేదెలపై మొసలి దాడి

గేదెలపై మొసలి దాడి జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్ శివ్వారం ఎర్ర చెరువులో

ప్రభ న్యూస్ 20 Mar 2026 7:25 pm

మానవత్వాన్ని చాటుకున్న పల్లగుట్ట పూర్వ విద్యార్థులు

మానవత్వాన్ని చాటుకున్న పల్లగుట్ట పూర్వ విద్యార్థులు చిలుపూర్, ఆంధ్ర‌ప్ర‌భ : నేటి స్వార్థపూరిత

ప్రభ న్యూస్ 20 Mar 2026 7:22 pm

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ. 1,500 కోట్లు

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 1,500 కోట్లను కేటాయించింది. హైదరాబాద్ రూపురేఖలను మార్చే ప్రాజెక్టుగా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చింది. లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ తీరాన్ని అభివృద్ధి చేసే దిశగా కేటాయింపులు జరిపింది. ఈ నిధులతో మూసీనది ప్రక్షాళన, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టిపిల) ఏర్పాటు, నది పొడవునా పచ్చదనం పెంచే పనులకు వినియోగించనున్నారు. సుమారు 55 కిలోమీటర్ల మేర నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా చెక్ డ్యామ్‌ల నిర్మాణం, రివర్ వాక్-వేలు, సైక్లింగ్ ట్రాక్‌లు, పర్యాటకుల కోసం ప్రత్యేక వినోద ప్రాంతాలను ఏర్పాటు చేయనుంది. మరోవైపు నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు మూసీ పరిసర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు ఈ ప్రాజెక్టును కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి సామాజిక -ఆర్థిక సర్వేలు పూర్తి చేసింది. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే పనులు వేగంగా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే బడ్జెట్‌లో రూ. 1,500 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రాజెక్టు ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు, భూసేకరణకు సంబంధించి అత్యవసర పనులకు ప్రభుత్వం ఉపయోగించనుంది.

మన తెలంగాణ 20 Mar 2026 7:20 pm

నా దేవుడికి.. నా కొడుకుకి తెలుసు

నా దేవుడికి.. నా కొడుకుకి తెలుసు ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ

ప్రభ న్యూస్ 20 Mar 2026 7:20 pm

పాన్ డ‌బ్బాలపై పోలీసుల మెరుపు దాడులు

పాన్ డ‌బ్బాలపై పోలీసుల మెరుపు దాడులు సంగెం, ఆంధ్రప్రభ : మండలంలోని పాన్

ప్రభ న్యూస్ 20 Mar 2026 7:13 pm

హోం శాఖకు రూ. 11, 907 కోట్లు ..న్యాయ శాఖకు రూ. 2,367 కోట్లు

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నిలువరించడంలో పోలీస్ శాఖ మంచి ఫలితాలును కనబరుస్తొందని కొనియాడారు. ఈ క్రమంలో హోం శాఖ కు బడ్జెట్‌లో రూ. 11, 907 కోట్లను కేటాయించారు. గతేడాది హోం శాఖకు రూ. 10,181 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.1,726 కోట్లు అధికంగా కేటాయించారు. ప్రసంగంలో భట్టి మావోయిస్టుల లొంగుబాట్లపై మాట్లాడుతూ నక్సలిజం పుట్టుకకు కారణమైన ఫ్యూడలిస్టిక్ సామాజిక, ఆర్థిక అసమానతులను రూపుమాపడం ద్వారానే నక్సలిజం ఉద్యమం అంతం అవుతుందన్నారు. సమగ్ర సంక్షేమం, ఉపాధి ద్వారానే నిజమైన మార్పు సాధ్యమని తెలంగాణ నిరూపించిందని, ఈ విధానంలో మనం దేశానికే మార్గదర్శకంగా మారామని భట్టి అన్నారు. గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలిజాన్ని శాంతి-భద్రతల సమస్యగానే చూశాయని, ఈ క్రమంలో నక్సలిజాన్ని అణిచివేడానికి పోలీస్, సైనిక బలగాలను ఉపయోగించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్య మూలాలను విశ్లేషించి యువతకు సరైన జీవనోపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక భరోసా అడవుల్లోకి వెళ్లిన వాళ్లు సైతం ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలుస్తారనే సామాజిక ఆర్థిక వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 347 మంది మావోయిస్టులు లొంగిపోతే 2023 డిసెంబర్ 7 నుంచి 2026 మార్చి 8వ తేదీ వరకు 732 మంది వివిధ స్థాయి క్యాడర్ మావోయిస్టులు లొంగిపోయినట్లు చెప్పారు. సత్వర న్యాయం, సమ న్యాయం అనే లక్షంతో న్యాయశాఖను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు డిప్యూటి సిఎం వెల్లడించారు. రాష్ట్ర హైకోర్టు భవనాలను, న్యాయమూర్తుల నివాస గృహాలను రూ. 2,583 కోట్లతో అధునాతన వసతులతో నిర్మిస్తున్నామని, ఇప్పటికు 11 అదనపు జిల్లా న్యాయ స్థానాలు, రెండు సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాలు, 46 జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాలను నిర్మించిడానికి అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. వీటి కోసం బడ్జెట్‌లో రూ. 2,367 కోట్లు కేటాయించినట్లు డిప్యూటి సిఎం చెప్పారు.

మన తెలంగాణ 20 Mar 2026 7:11 pm

విద్యుత్‌కు రూ. 21,285 కోట్లు

విద్యుత్ అభివృద్ధి, విశ్వసనీయత భవిష్యత్తు దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కేవలం సరఫరా వ్యవస్థగా కాకుండా సామాజిక న్యాయం, ఆర్ధిక వృద్ది, భవిష్యత్ రాష్ట్ర పునాదిగా భావిస్తోందని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు.ఈ బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి రూ. 21,285 కోట్లు కేటాయించారు. గతేడాది విద్యుత్ రంగానికి రూ. 21,221 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో రూ. 64 కోట్లు స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. రాష్ట్ర విద్యుత్ రంగం దేశంలోనే అత్యుత్తమంగా నిలవడానికి నిరంతర సరఫరా మాత్రమే కాదని, విశ్వసనీయత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 23,187 మెగా వాట్ల సామర్ధం ఉందని వీటిలో అధిక భాగం పునరుత్పాదక శక్తి వనరుల నుంచే వస్తోందని చెప్పారు. విద్యుత్ కొరతల నుంచి మాట్లాడుకునే దగ్గర నుంచి నేడు విద్యుత్ భవిష్యత్‌ను రూపొందించే దిశగా రాష్ట్రంగా మారిందని భట్టి తెలిపారు. ఈ బడ్జెట్‌లో విద్యుత్ రాయితీలకు రూ. 14వేల కోట్లు, గృహా జ్యోతికి రూ. 2,080 కోట్లు, ట్రాన్స్‌కో, జెన్‌కో, గ్రీన్ ఎనర్జీ, వందశాతం సౌర గ్రామాల ఏర్పాటుకు వెయ్యికోట్ల చొప్పున కేటాయించారు. హైదరాబాద్‌లో భూగర్భ కేబులింగ్ పనులు చేపడుతూ నగరాన్ని సురక్షితంగా, ఆధునికంగా మార్చుతున్నట్లు భట్టి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,036 ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి పర్యావరణహిత రవాణా దిశగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గ్రీన్ మొబిలిటీని మరింత విస్తరించే దిశగా ఈ బడ్జెట్‌లో సహకారం అందించినట్లు భట్టి పేర్కొన్నారు. గృహా జ్యోతి పథకం ద్వారా 53 లక్షలకు పైగా కుటుంబాలు లబ్దిపొందుతున్నాయని వాటిని కొనసాగించేందుకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించామన్నారు.

మన తెలంగాణ 20 Mar 2026 7:08 pm

రెండు మొరం టాక్టర్లు పట్టివేత.. కేసు నమోదు…

రెండు మొరం టాక్టర్లు పట్టివేత.. కేసు నమోదు… ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇలాంటి

ప్రభ న్యూస్ 20 Mar 2026 7:08 pm

హైదరాబాద్ లో ఉద్యోగులకు గుడ్ న్యూస్

హైదరాబాద్‌లో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఎ) మినహాయింపు పరిమితిని 50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 6 దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం -1961 స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేసింది. ప్రధానంగా మెట్రో నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులకు పన్ను మినహాయింపు కలిగించేందుకు.. ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్‌లో హెచ్‌ఆర్‌ఏ 50 శాతం ఉంటుంది. తాజాగా ఈ నగరాల జాబితాలో హైదరాబాద్ చేరింది. గతంలో దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నైలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. ఈ నగరాల్లో హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పరిమితిని 50 శాతంగా ఉంది. తాజాగా ఈ జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ పేర్లను కూడా చేర్చారు. మొత్తం 8 నగరా ల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ జీతంలో 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. మిగిలిన నగరాల్లోని వారికి 40 శాతం వరకు హెచ్‌ఆర్‌ఎ పన్ను కొనసాగుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే 2027 జులైలో ఫైల్ చేసే ఐటీ రిటర్స్‌కు ఇది వర్తించనుంది. ఏప్రి ల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానున్న సంగతి విదితమే. కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ చట్టంలో హెచ్‌ఆర్‌ఎ మినహాయింపుల కోస ం మరికొన్ని మెట్రో నగరాలను 50 శాతం కేటగిరీలోకి చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది.

మన తెలంగాణ 20 Mar 2026 7:04 pm

రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు

రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి అనంతపురం జిల్లా

ప్రభ న్యూస్ 20 Mar 2026 7:03 pm

నిబద్ధత గల పాత్రికేయుడు పూర్ణ…

నిబద్ధత గల పాత్రికేయుడు పూర్ణ… పూర్ణ మరణం తీరని లోటుజర్నలిస్ట్ పూర్ణ భౌతిక

ప్రభ న్యూస్ 20 Mar 2026 7:00 pm

పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ,

ప్రభ న్యూస్ 20 Mar 2026 6:56 pm

బుజ్జి అభిమానికి ‘విరోష్’ విందు.. వీడియో వైరల్

హైదరాబాద్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మికలు ఇటీవల వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లికి తనని ఆహ్వానించలేదు అంటూ.. ఓ చిన్నారి చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘‘మనం కూడా ఫ్యాన్స్‌యే కాదా.. పిలిస్తే ఏమవుతుంది అంటా’’ అంటూ ఆ చిన్నారి వీడియోలో పలికిన మాటలు అందరినీ ముద్గుల్ని చేశాయి. ఈ వీడియో విజయ్ వరకూ చేరడంతో ‘‘నీకు ఏం ఇష్టమో చెప్పు. మనం కలిసి ఇంట్లోనే తిందాం’’ అంటూ అప్పుడే రిప్లే కూడా ఇచ్చాడు. తాజాగా ఆ చిన్నారిని ఇంటికి పిలిపించుకున్నారు ‘విరోష్’. ఆ చిన్నారిని ప్రత్యేక విందును ఇచ్చారు. విజయ్, రష్మికలు ప్రేమతో వడ్డించి.. ఆ బుజ్జి అభిమానిని ముద్దాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.  They finally met ❤️ #RashmikaMandanna #VijayDeverakonda #virosh pic.twitter.com/ZFXNbOMKWq — (@viroshily) March 20, 2026

మన తెలంగాణ 20 Mar 2026 6:55 pm

Ram Charan’s Peddi is on Track for Release

Ram Charan’s Peddi is in the final stages of shoot and the team is working round the clock to meet the deadlines. There are frequent speculations about the postponement of the release. The makers have closed the digital rights for a record price and they have also closed the theatrical deals. With April 30th the […] The post Ram Charan’s Peddi is on Track for Release appeared first on Telugu360 .

తెలుగు 360 20 Mar 2026 6:42 pm

Dhurandhar 2: Every Penny is a Profit

Dhurandhar: The Revenge released and is performing at a peak mode. The opening numbers are super strong despite the delay in the regional languages. The film will release in Telugu, Tamil, Kannada and Malayalam from tomorrow and Dhurandhar: The Revenge will have a super strong weekend all over. Aditya Dhar and his team completed the […] The post Dhurandhar 2: Every Penny is a Profit appeared first on Telugu360 .

తెలుగు 360 20 Mar 2026 6:40 pm

ఏపీలో అకాల వర్షాలకు పంట నష్టంపై అంచనాలివే

అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు

తెలుగు పోస్ట్ 20 Mar 2026 6:36 pm

Naga Vamsi |సిద్దు ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది..?

Naga Vamsi | సిద్దు ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది..? Naga Vamsi

ప్రభ న్యూస్ 20 Mar 2026 6:26 pm

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದಲ್ಲಿ ಪ್ರಧಾನಿ ಮೋದಿ ರ್ಯಾಲಿಯ ನಂತರ ಮೈದಾನದ ಪರಿಸ್ಥಿತಿ ಎಂದು ಎಐ ಚಿತ್ರ ಹಂಚಿಕೆ

ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದಲ್ಲಿ ಪ್ರಧಾನಿ ಮೋದಿ ರ್ಯಾಲಿಯ ನಂತರ ಮೈದಾನದ ಪರಿಸ್ಥಿತಿ ಎಂದು ಎಐ ಚಿತ್ರ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 20 Mar 2026 6:25 pm

ఘనంగా శోభన్ బాబు వర్ధంతి వేడుకలు

ఘనంగా శోభన్ బాబు వర్ధంతి వేడుకలు కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ : నట భూషణ్

ప్రభ న్యూస్ 20 Mar 2026 6:24 pm

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని..

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని.. విజయవాడ, ఆంధ్రప్రభ : ముస్లింల పవిత్ర

ప్రభ న్యూస్ 20 Mar 2026 6:20 pm

ప్రజా సౌకర్యమే నా ప్రాధాన్యత

ప్రజా సౌకర్యమే నా ప్రాధాన్యత స్పెషల్ ఆఫీసర్ డా. జి. లక్ష్మీశా కార్పొరేషన్,

ప్రభ న్యూస్ 20 Mar 2026 6:17 pm

Revanth Reddy Alleges KCR Is Under House Arrest

Telangana Chief Minister Revanth Reddy made strong remarks against former Chief Minister KCR and the opposition while speaking to the media. He alleged that KCR was kept under house arrest by his own family, which is why he did not attend the Assembly. Revanth Reddy also revisited his earlier challenge on the HILT policy and […] The post Revanth Reddy Alleges KCR Is Under House Arrest appeared first on Telugu360 .

తెలుగు 360 20 Mar 2026 6:09 pm

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ పై నిఘా ఏర్పాటు చేయాలి

రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష చేశారు.

తెలుగు పోస్ట్ 20 Mar 2026 6:08 pm

300 బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం

న్యూఢిల్లీ: అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్స్‌పై కేంద్రం కొరడా ఝుళిపించింది. 300 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ఫ్లాట్‌ఫామ్స్, బెట్టింగ్ ఎక్స్ఛేంజీలు, సట్టా/మట్కా గ్యాంబ్లింగ్, రియల్ మనీ కార్డ్-కెసినో గేమ్ యాప్స్ ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు ఇలాంటి 8,400 వెబ్‌సైట్లు, యాప్స్‌ను నిషేధించింది. బెట్టింగ్, ఆన్‌లైన్ జూదం కారణంగా యువత పక్కదోవ పట్టడం, ఆర్థికంగా చికితిపోతున్నట్లు గ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. గతేడాది అక్టోబర్‌లో ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ 2025ను తీసుకొచ్చింది. నగదుతో ముడిపడిన ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక 4900 వెబ్‌సైట్లు/యాప్‌లపై చర్యలు చేపట్టింది.

మన తెలంగాణ 20 Mar 2026 6:08 pm

Telangana |భారీ కేటాయింపులు

Telangana | భారీ కేటాయింపులు Telangana | తెలంగాణ బడ్జెట్ 2026-27 ముఖ్యాంశాలుసంక్షేమ

ప్రభ న్యూస్ 20 Mar 2026 5:59 pm

Road Accident : ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 20 Mar 2026 5:57 pm

C-section |సిజేరియన్ తర్వాత సురక్షితమైన మార్గాలు

C-section | సిజేరియన్ తర్వాత సురక్షితమైన మార్గాలు సిజేరియన్ తర్వాత ఎదురయ్యే సాధారణ

ప్రభ న్యూస్ 20 Mar 2026 5:49 pm

ఇంద్రపాలనగరం గుట్టపై కొత్త రాతి యుగ ఆనవాళ్లు

శంకరగుట్ట వద్ద 4 వేల ఏళ్ల చరిత్రకు సంకేతాలుఆనవాళ్లు కాపాడాలన్న శివనాగిరెడ్డిగ్రామస్తులకు విజ్ఞప్తి

తెలుగు పోస్ట్ 20 Mar 2026 5:46 pm