వాషింగ్టన్: పశ్చిమాసియాలో హోరాహోరీ యుద్ధం, దాడు లు.. ప్రతిదాడులకు హెచ్చరికలు సాగుతున్న క్రమంలో అ మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రకటన చేశా రు. 48గంటల్లోగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్, ఇంధన కేంద్రాలను లక్షంగా చేసుకుంటామని ప్రకటించిన ట్రంప్ ఆ దాడులను ఐదు రోజు ల పాటు వాయిదా వేసినట్లు తాజాగా వెల్లడించారు. ఈ మేరకు తమ బలగాలను కూడా ఆదేశించినట్లు సోమవారంనాడు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో పేర్కొన్నా రు. ఇరాన్తో చర్చల పురోగతిపైనే తమ భవిష్యత్ కార్యాచారణ ఆధారపడి ఉంటుందని కూడా వివరించారు. ఇరాన్ అణు, విద్యుత్, ఇంధన కేంద్రాలపై మరో 5 రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ ఎటువంటి దాడులకు దిగబోవని ప్రకటించారు. ఇరాన్కు చెందిన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తితో తన అల్లుడు కుష్నర్, విట్కాఫ్లు ఆదివారంనాడు రాత్రి చర్చలు జరిపారని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్తో చర్చల విషయం, దాడులు తాత్కాలిక నిలిపివేత విషయం ప్రకటన వెలువడగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గాయి. గంటల వ్యవధిలోనే బ్యారెల్ ముడిచమురు ధరలు 17 డాలర్ల చొ ప్పున తగ్గుముఖం పట్టి 97డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అసలు ట్రంప్ చెబుతున్నట్లు ప్రత్యక్షం గా, పరోక్షంగా కానీ ఆయనతో ఎలాంటి చర్చలు జరగలేదని కుండ బద్ధలు కొట్టింది. ఈ మేరకు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ తెలిపినట్లు ఇరాన్కు చెందిన అధికారిక వార్త సంస్థతో సహా రెండు ప్రధాన వార్తాసంస్థలు తెలిపాయి. చమురు ధరలు తగ్గుముఖం పట్టేందుకే ట్రంప్ ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేసింది. అదే సమయంలో చర్చల ప్రతిపాదన వచ్చినా తాము తిరస్కరించినట్లు ఇరాన్ పేర్కొంది. యుద్ధ నివారణకు గల్ఫ్ దేశాలు చొరవ తీసుకున్నాయని, కానీ చొరవ తీసుకోవాల్సింది యుద్ధం మొదలు పెట్టిన దేశం కదా అని ఎదురు ప్రశ్నించింది. మా హెచ్చరికలకు భయపడే ఇప్పుడు ట్రంప్ వెనక్కి తగ్గారని స్పష్టం చేసింది. అంతకుముందు ఉదయం తమ విద్యుత్, ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తే అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల విద్యుత్ కేంద్రాలను కూడా మేము దెబ్బతీస్తామని, హర్మూజ్ను శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరించింది. ట్రంప్ బెదిరింపులకు భయపడేదిలేదని ఇరాన్ తెలిపింది. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. తాను టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తో మాట్లాడినట్లు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య సంప్రదింపులకు టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. గల్ఫ్దేశాలను పూర్తి స్థాయిలో దెబ్బతీస్తామని, రక్షణ వలయాలను పటిష్టపర్చుకుంటామన్నారు. తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉన్నామని కూడా అరాగ్చీ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం అరబ్ ఏమిరేట్స్పై దూసుకువచ్చిన ఇరాన్ క్షిపణిని దెబ్బతీసినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు చర్చలు బెదిరింపులతో ప్రసక్తి లేకుండా ఇజ్రాయెల్ సేనలు సోమవారం ఉదయం నుంచే టెహరాన్ ఇతర ప్రాంతాలపై దాడులు తీవ్రతరం చేశాయి. ఇరాన్ కీలక స్థావరాలను ఎంచుకుని తమ దాడులు సాగిస్తామని వెల్లడించారు. అయితే ట్రంప్ చర్చల ప్రస్తావనకు ముందు ఈ ఘటనలు జరిగాయి. ఇరాన్తో చర్చలు ఫలిస్తే హర్మూజ్పై సంయుక్త ఆధిపత్యం హర్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ సోమవారం కీలక ప్రకటన వెలువరించారు. ఇరాన్తో తమ దౌత్యం ఫలిస్తే అంతా సుఖాంతం అవుతుందని తెలిపారు. త్వరలోనే హర్మూజ్ జలసంధి మార్గం తెరుచుకుంటుంది. పైగా ఇరాన్ నూతన నాయకత్వంతో కలిసి ఈ మార్గంపై తమ సంయుక్త ఆధిపత్యం ఉంటుందని కూడా వెల్లడించారు. తాము ఇప్పటి అధినేత మొజ్తాబాను నాయకుడిగా గుర్తించడం లేదన్నారు. అయితే ట్రంప్ తాజా ప్రకటనపై ఇరాన్ నుంచి ఎటువంటి స్పందనా వెలువడలేదు. ఇరాన్తో యుద్ధం దాదాపు ముగిసినట్లే అని ప్రకటించిన ట్రంప్, ఇరాన్తో 15 అంశాలతో కూడిన ఒప్పందం ఖరారు కానుందని చెప్పారు. హర్మూజ్పై ఉమ్మడి నియంత్రణ కీలకం అన్నారు. ఇరాన్పై తమ దేశ దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపిన ట్రంప్ ఈ ప్రాంతంలో అసాధారణ రీతిలో సముద్ర జలాల భద్రతకు వీలేర్పడుతుందని, ఇప్పటి ఉద్రిక్తత ఇకపై తలెత్తకుండా చేస్తామని కూడా వివరించారు. హర్మూజ్పై తమకు, ఇరాన్ నాయకత్వానికి మధ్య ఉమ్మడి అదుపు ఉంటుందని తెలిపారు. ఇప్పటి తమ చర్చలలో ప్రధానాంశం కేవలం ఇరాన్ ఇకపై అణ్వాయుధాలు సంతరించుకోకుండా ఉండటమే. ఇదే తమ లక్షం అని తేల్చిచెప్పారు. భవిష్యత్తులో యుద్థాలు తలెత్తకుండా చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు శాంతి ఒప్పందంలో ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్తో కీలక ఒప్పందం అత్యవసరం, కాదనలేనిది అని స్పష్టం చేశారు. ఇక్కడో మెలిక పెట్టారు. ఇరాన్తో చర్చలకు నూతన నాయకత్వం ఎంచుకుంటున్నట్లు ప్రకటించారు.
24thMarch 2026 |మంగళవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
24thMarch 2026 | మంగళవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 24thMarch
మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రివర్గం పలు బిల్లులకు ఆమో దం తెలిపింది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు అసెంబ్లీ క మిటీ హాల్లో సుమారు రెండుగంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించింది. అందులో భాగంగా విశ్వ విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన రోహిత్ వేముల చట్టం విధి, విధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ఉప సంఘం సభ్యులుగా మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్బాబు, ఉత్త మ్ కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్లను నియమించింది. వృద్ధాప్యం లో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా రూ.10వేలు ఏదీ తక్కువైతే ఆ మొత్తం వేతనాల నుంచి కట్ చేసి తల్లిదండ్రులకు అందజేసే తల్లిదండ్రుల మద్దతు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఎల్అండ్టి కంపెనీ నుంచి మెట్రోను స్వాధీనం.. హైదరాబాద్లో ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్ అండ్ టి కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రుణభారం సహా మొత్తం రూ.15వేల కోట్లకు ప్రభుత్వం ఎల్అండ్టికి చెల్లించి ఫేజ్ 1 ప్రాజె క్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే సబ్ కమిటీ నివేదికను సమర్పించింది. ప్రభుత్వం తరపున ఈ నిధుల చెల్లింపులు, లావాదేవీల బాధ్యతను నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు అప్పగించింది. హెచ్ఎంఆర్ఎల్ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ అడ్వకే ట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదులపై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ఈ బిల్లును రూపొందించారు. గతంలో జరిగిన అడ్వకేట్ దంపతులు వామనరావు హత్యల నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను ఆమోదించిన కేబినెట్ రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఇండిపెండెంట్ ఎక్స్ఫర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదిక తయారు చేసింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను కేబినెట్ చర్చించింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. 2024 నవంబర్ 06వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు 50 రోజుల పాటు రాష్ట్రమంతటా సర్వే నిర్వహించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026)ను మంత్రివర్గం ఆమోదించింది. మత సామరస్యాన్ని భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. గిగ్వర్కర్స్, ప్లాట్ఫాం కార్మికుల సంక్షేమం, భద్రత కోసం దీంతోపాటు గిగ్వర్కర్స్, ప్లాట్ఫాం కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ) యాక్ట్ , 2026’ బిల్లును కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్ తో పాటు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లు ప్రకారం గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయడంతో వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ దీనిని ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం పిసిసి అధ్యక్షుడితో పాలు పలువురితో సిఎం రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశమయ్యారు. సభలో చర్చించాల్సిన విషయాలు, సభలో సభ్యులు వ్యవహారించాల్సిన తీరు తదితర అంశాలపై కేబినెట్ చర్చించినట్టుగా తెలిసింది.
బియ్యం ఎగుమతులపై సభా సంఘం వేయాలి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఫిలిప్పీన్స్ దేశానికి చేస్తున్న బియ్యం ఎగుమతుల వ్యవహారంలో భారీ కుభంకోణం దాగి ఉందని బి ఆర్ఎస్ ఎంఎల్ఎ, మాజీ మంత్రి హరీశ్రావు ఆ రోపించారు. దీనిపై సభా సంఘం వేసి అందులో తనను సభ్యుడిగా నియమించాలని హరీశ్రావు డి మాండ్ చేశారు. సోమవారంనాడు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఉత్తమ్, హరీశ్రావు నడుమ ఈ అంశంపై వాడీవేడి చర్చ జరిగింది. ఇ తర దేశాలకు బియ్యం ఎగుమతి చేసేందుకు సల హాదారుగా వేల కోట్ల బ్యాంకింగ్ ఫ్రాడ్, బంగా రం స్మగ్లింగ్, ఇడి, సిబిఐ, కేసులు ఉన్న ప్రేమ్ చం ద్ గార్గ్ను నియమించుకున్నారా? లేదా? అని ప్ర శ్నించారు. ఆయన ఇచ్చిన సలహాల వల్లే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పది లక్షల మొట్రిక్ టన్నులకు ఎంఓయు కుదుర్చుకుని, 22, 750 మెట్రిక్ టన్నుల వద్ద ఎందుకు ఎగుమతులు ఆగాయని నిలదీశారు. నాఫెడ్ ఎండి ఎగుమతుల అవకాశం నాఫెడ్కు ఇవ్వాలని లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇవ్వకుండా ప్రయివేట్ సంస్థలకు ఎలా ఇస్తారని, దీని వెనుక ఉన్న మతలబు ఏమిటని నిలదీశారు. కాకినాడ పోర్టులో ఏడాది నుంచి సుమారు 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఉందని, ఏడాది నుంచి బియ్యం ఉంటే అవి పాడయిపోతాయని, వాటికి సంబంధించి గిడ్డంగి, నిర్వహణ చార్జీలు ఎవరు చెల్లిస్తున్నారని, ఇతర ఖర్చులు ఎవరు భరించాలిని అడిగారు. వాటాలు కుదరకపోవడం వల్లనే బియ్యం ఎగుమతులు ఆగిపోయాయని హరీష్ రావు ఆరోపించారు. బియ్యం ఎగుమతులు ప్రారంభించడానికి హెలికాఫ్టర్లో వెళ్లారని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగం సంస్థలు అడ్వాన్స్గా డబ్బులు ఇస్తామన్నా ఎగుమతి అవకాశం ఇవ్వలేదని, స్కాం నిరూపించడానికి హౌస్ కమిటీ వస్తే పూర్తివివరాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు హరీశ్రావు చెప్పారు. బియ్యం ఎగుమతుల్లో స్కాం జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరిందని విమర్శించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సూటిగా సమాధానాలు చెప్పకుండా దాట వేస్తూ సభను పక్కదోవ పట్టిస్తున్నారని హరీశ్రావు మంత్రిపై మండపడ్డారు. మంత్రి సత్యదూరమయిన మాటలు సభలో మాట్లాడుతున్నారని, ఈ విషయం ప్రజలు గమనిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పారదర్శకంగా ఉంటే, తప్పు చేయలేదని బావిస్తే ఈ కుంభకోణాలపై హౌజ్ కమిటీ వేయాలని, ఆధారాలతో నిరూపిస్తామని హరీశ్రావు సవాల్ విసిరారు. దీంతో పాటుగా రైతులకు యాసంగికి సంబంధించి రూ.1,200 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉందని వాటిని ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఈ దశలో పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుబంద ప్రశ్నలు అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం వరి దిగుబడి లెక్కలు అస్తవ్యస్థంగా ఉన్నాయని, పంటల కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారని, ఆలస్యంగా ప్రారంభించడంతో రైతులు దళారుల వలకు చిక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎ1గా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎ2గా ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరును చేర్చింది. అలాగే ఎ3గా హెచ్ఎండిఎ మాజీ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఎ4గా స్పోర్ట్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఎ5గా యుకెకు చెందిన ఎఫ్ఇఒ కంపెనీని పే ర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఎసిబి ఛార్జ్షీట్లో పొందుపరిచింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా -ఈ రేసింగ్ కోసం దాదాపు రూ.55 కోట్ల ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థల కు బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ. క్యాబినెట్ అనుమతి లేకుండానే నిధులు విడుదల చేయడం. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా విదేశీ కరెన్సీలో చె ల్లింపులు జరపడం, ఎన్నికల కోడ్ అమలులో ఉ న్న సమయంలో నిధులు బదిలీ చేయడం వంటి అంశాలపై ఎసిబి కేసు నమోదు చేసింది. ఫార్ము లా ఈ రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్ఎండిఎ ఒప్పందం చేసుకోవడం, ఆర్బిఐ అ నుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఫిర్యాదు మేరకు ఎసిబి కేసు నమోదు చేసి పలుమార్లు విచారణ చేసిన సంగతి తెలిసిందే.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఏప్రిల్ 9లోగా చెల్లించండి
మన తెలంగాణ/హైదరాబాద్: కో ర్టు ధిక్కరణ అంశాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప దవి విరమణ చేసిన ఉద్యోగు ల బకాయిలు ఏప్రిల్ 9లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని హైర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ధిక్కరించిన ఫైనాన్స్ సెక్రటరీపై తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని గత ఏడాది ప్రభుత్వానికి, ఫైనాన్స్ సెక్రెటరీకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయినా కూ డా బకాయిలు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించా రు. దీంతో సోమవారం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం పిటిషన్లు విచారించింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉ ద్యోగుల బకాయిలను చెల్లించాలన్న కోర్టు ఆదేశాలను రా ష్ట్ర ప్రభుత్వం పాటించడంలో విఫలమవడంతో ఆర్థిక కార్యదర్శి వ్యక్తిగత హాజరు నుండి మి నహాయింపు ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్లీడర్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ రా జేశ్వరరావు తిరస్కరించారు. దీంతో వ్యక్తిగతంగా ఫైనాన్స్ సెక్రటరీ హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నూ సోమవారం విచారణకు హాజరు కావాల్సిందేనని సెక్రటరీని హైకోర్ట్ ఆదేశించింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆయన హాజరు కాలేకపోయారని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు స్పందిస్తూ అర్ధరాత్రి వరకు కోర్టు హాలులోనే ఉంటామని, వ్యక్తిగత హాజరుకు ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో ఫైనాన్స్ సెక్రటరీ సాయంత్రం ఆన్లైన్లో కోర్టు విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ కష్టార్జితాన్ని చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న విపరీతమైన జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, తమ డబ్బు అందక తీవ్ర మనోవేదనకు గురై 80 మందికి పైగా విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. కోర్టు పట్టుబడితే, ప్రభుత్వం తన ఇతర ప్రాధాన్యతలను పక్కన పెట్టి, మార్చి 31 నాటికి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలన్నింటినీ చెల్లిస్తుందని ఫైనాన్స్ సెక్రటరీ కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే, ఈ బకాయిలను చెల్లించడానికి మరో 30 రోజుల గడువు ఇస్తే ప్రభుత్వానికి మరింత సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 3,656 మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు నమోదై ఉన్నాయని ఆర్థిక కార్యదర్శి సుల్తానియా కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇప్పటివరకు 1,056 మంది ఉద్యోగుల బకాయిలను చెల్లించిందని, ప్రస్తుతం మరో 2,600 మంది ఉద్యోగుల బకాయిల చెల్లింపు పెండింగ్లో ఉందని ఆయన వివరించారు. బకాయిల చెల్లింపు కోసం ఆర్థిక కార్యదర్శి కోరినట్లుగా 30 రోజుల గడువు ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి నామవరపు రాజేశ్వరరావు, ప్రభుత్వం పదవీ విరమణ బకాయిలను చెల్లించడానికి ఏప్రిల్ 9వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. లేదంటే, ఈ కేసులు విచారణకు వచ్చిన ప్రతిసారీ ఆర్థిక కార్యదర్శి స్వయంగా కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనికి కట్టుబడి ఉంటామని ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోర్టుకు తెలిపారు. అది వారి సొంత డబ్బని, ఏప్రిల్ 9వ తేదీలోగా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆ శుభవార్తను తెలియజేయండి, అని న్యాయమూర్తి రావు ఆదేశించారు. కాగా, గత రెండేళ్లుగా వేలాది మంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, జిపిఎఫ్, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవు, సరెండర్ సెలవు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి తమ పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పందిస్తూ, బకాయిలను ఆరు నుంచి పది వారాల్లోగా చెల్లించాలని హైకోర్టు గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను పాటించడంలో ప్రభుత్వం విఫలమవడంతో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్థిక కార్యదర్శితో సహా ప్రభుత్వ ప్రతినిధులపై కోర్టు ధిక్కార చట్టం నిబంధనల కింద చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు. ప్రభుత్వ ప్రతినిధులకు ధిక్కార నోటీసులు జారీ చేసినప్పటికీ, ప్రభుత్వ న్యాయవాది కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి గడువు కోరుతూ వాయిదాలు అడుగుతూనే ఉన్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆదేశాలను పాటించకపోవడం, అలాగే ధిక్కార నోటీసులకు స్పందించకపోవడం పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, గత విచారణ సందర్భంగా ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ఫారం-1 నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో జరిగిన వైఫల్యంపై వివరణ ఇవ్వడానికి, ఆయన స్వయంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో..ఎంఎల్ఎ దానంకు హైకోర్టు నోటీసు
పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతికి కూడా నోటీసు జారీ చేసింది. 2023లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ 2024లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్పై తాము ఇదివరకే అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేయగా, పార్టీ ఫిరాయించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని స్పీకర్ కేసు కొట్టి వేశారని పిటిషనర్ ఏలేటి తరఫున న్యాయవాది తన వాదన వినిపించారు. స్పీకర్ తరపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరుకాగా, అడ్వకేట్ జనరల్గా ఉంటూ స్పీకర్ తరపున ఎలా వాదిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ సీనియర్ న్యాయవాదిగా వాదించాలనుకుంటున్నానని చెప్పారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి చెబుతూ కేసును వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేశారు.
దాడులు 5 రోజులు ఆపేస్తున్నట్లు ప్రకటన . తెహ్రాన్తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ట్రంప్ భయపడి పారిపోయారు… చమురు ధరల తగ్గింపు కోసమే నాటకాలు: ఇరాన్. చర్చలు జరగలేదని స్పష్టీకరణ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులు వాషింగ్టన్/తెహ్రాన్: హోర్మూజ్ జలసంధిని 48గంటల్లోగా తెరవని పక్షంలో విద్యుత్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అల్టిమేటం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకంజ వేశారు. రెండురోజులుగా ఇరాన్తో చర్చలు ఫలవంతంగా జరగడంతో విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను […] The post బెదిరిన ట్రంప్ appeared first on Visalaandhra .
. యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. ఇది స్టీల్ప్లాంట్ కాదు…స్టీల్ సిటీకి శంకుస్థాపన. దేశ ఉక్కు అవసరాలు తీర్చేలా ప్రభుత్వ ప్రణాళిక. ఏఎం`ఎనఎస్ భూమి పూజలో సీఎం చంద్రబాబు. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రాభివృద్ధి: కుమారస్వామి విశాలాంధ్ర- పాయకరావుపేట (అనకాపల్లి జిల్లా): పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ తిరుగులేని వేదికని, ఇక్కడ అన్ని రకాల వనరులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకా పల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద రూ.1.35 లక్షల కోట్లతో […] The post పరిశ్రమలకుఏపీ సరైన వేదిక appeared first on Visalaandhra .
యుద్ధ సవాళ్లను ఐక్యంగా ఎదుర్కొందాం
. ఇంధన సరఫరా ఆగకుండా చర్యలు తీసుకున్నాం. ఎల్పీజీ ఉత్పత్తి పెంచాం. పశ్చిమాసియా ఉద్రికత్తలపై లోక్సభలో ప్రధాని మోదీ ప్రకటన న్యూదిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశంలోని అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆయన లోక్సభలో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాకుండా ప్రజల జీవన విధానంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. యుద్ధం కారణంగా దేశంలో […] The post యుద్ధ సవాళ్లను ఐక్యంగా ఎదుర్కొందాం appeared first on Visalaandhra .
. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే పరిష్కారం. గ్యాస్ సరఫరా సమస్య నివారణకు చంద్రబాబు సూచన. శ్రీకాకుళం-కాకినాడ పైప్లైన్ పునరుద్ధరణకు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పీఎన్జీ […] The post ఎల్పీజీ స్థానంలో పీఎన్జీ appeared first on Visalaandhra .
నాడు అంగీకరించి… నేడు విచారణేంటి?అధికారుల ద్వంద్వ వైఖరిపై నిరసనగొంతు నొక్కేందుకే ‘రీ-సర్వే’ అంటున్న రాజధాని రైతులు విశాలాంధ్ర – సచివాలయం: రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల భూములు త్యాగం చేసిన అమరావతి రైతులపై ప్రభుత్వం మరోసారి తన ప్రతాపం చూపుతోంది. జీఓ నంబర్ 50 రూపంలో కొత్త అస్త్రాన్ని ప్రయోగించి… భూములిచ్చిన రైతులను నేరస్తులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే సర్వేలు పూర్తి చేసి… అథారిటీ తీర్మానాల మేరకు ఇచ్చిన మినహాయింపులను ఇప్ప్పుడు ‘అక్రమాలు’గా […] The post గ్రామ కంఠాల గోస appeared first on Visalaandhra .
ప్రజల్ని తాగుబోతుల్ని చేసిందెవరో అందరికీ తెలుసు
తెలంగాణ ఏర్పడి బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.10 వేల కోట్ల లోపు ఉండేదని, బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.36 వేల కోట్లు అయ్యిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.2 వేల కోట్లు తగ్గిందని ఆయన చెప్పుకొచ్చారు. అసలు రాష్ట్రంలో మద్యాన్ని ప్రోత్సాహించింది ఎవరు?, తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేసింది ఎవరో ఈ లెక్కలను చూస్తే తెలిసిపోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. 60 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.65 వేల కోట్లకు మించలేదని బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో లక్షల కోట్లకు చేరిందని ఆయన అన్నారు. పదేళ్లలో ఎక్సైజ్శాఖ ఆదాయం పెరిగిందని మంత్రి జూప ల్లి కృష్ణారావు పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.46,941 కోట్ల్ల ఎక్సైజ్ ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు, గత సంవత్సరం కంటే దాదాపు రూ.12 వేల కోట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని అంటున్నారు, అంత ఆదాయం రావాలంటే రూ.25 వేల కోట్ల మద్యం అమ్మాలి, ఏకంగా 35 శాతం ఎక్కువ ఆదాయం వస్తుందని చెబుతున్నారంటే, గల్లీకొక బెల్టు షాపు పెడతారా అని మంత్రి జూపల్లి కృష్ణారావును ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించడంతో ఆయనకు కౌంటర్గా మంత్రి జూపల్లి సమాధానమిచ్చారు.
న్యూదిల్లీ: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. భవిష్యత్లో వంటగ్యాస్ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడిం చాయి. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్పీజీ సరఫరా సమస్యలు తలెత్తే […] The post ఇక 10 కిలోల గ్యాస్ సిలిండర్లు appeared first on Visalaandhra .
సర్వేలో అమెరికన్ల నిరసనవాషింగ్టన్: ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అమెరికన్లు భావిస్తున్నారు. గ్యాస్ ధరలు మరింత పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధం వల్ల స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా తమకు నష్టాలే జరుగుతాయనే అభిప్రాయంతో వారు ఉన్నారు. ఓ అమెరికన్ మీడియా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈవిషయం వెల్లడైంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం ఇప్పటికే ప్రారంభమైందని సర్వేలో పాల్గొన్న అనేమంది అమెరికన్లు చెప్పారు. […] The post యుద్ధం వల్ల అన్నీ నష్టాలే appeared first on Visalaandhra .
అమెరికా కఠిన వీసా విధానాలతోభారత్, చైనాపై అధిక ప్రభావం
వాషింగ్టన్: విదేశీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష పోకడలప్రభావం భారత్, చైనాపై ఎక్కువగా పడుతోంది. ముఖ్యంగా విద్యా ర్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వీసాల జారీ గణనీయంగా తగ్గినట్టు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెల్లడిం చింది. 2024తో పోల్చితే 2025 తొలి ఎనిమిది నెలల్లో సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయినట్లు ఆ నివేదిక తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినట్లయితే… 2025 […] The post అమెరికా కఠిన వీసా విధానాలతోభారత్, చైనాపై అధిక ప్రభావం appeared first on Visalaandhra .
రన్వేపై అగ్నిమాపక ట్రక్కును ఢీకొన్న విమానం
న్యూయార్క్ విమానాశ్రయంలో ఘటన న్యూయార్క్: రన్వేపై వెళ్తున్న విమానం ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన ఘటన అమెరికా లోని న్యూయార్క్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందగా… మరో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయ పడ్డారు. న్యూయార్క్ లోని లాగార్డియా విమానాశ్రయంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కెనడాలోని మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ సీఆర్జే-900… లాగార్డియా విమానాశ్రయంలోని నాలుగో రన్వేపై దిగింది. […] The post రన్వేపై అగ్నిమాపక ట్రక్కును ఢీకొన్న విమానం appeared first on Visalaandhra .
కూలిన కొలంబియా విమానం.. 80 మంది సైనికులు సజీవదహనం
బోగోటా : కొలంబియాలో ఓ సైనిక రవాణా విమానం సోమవారం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని దాదాపు 80 మంది సైనికులు చనిపోయ్యారని అధికారులు తెలిపారు. సైనికులను తరలించేందుకు వినియోగించే సి 130 హర్కులస్ విమానం ప్యూర్టో లెగూయి.జమో నుంచి బయలుదేరిన వెంటనే సాంకేతికలోపాలతో కూలింది. మంటలు చెలరేగి , ఇందులోని రెండు ప్లాటూన్ల సైన్యం దుర్మరణం చెందినట్లు కొలంబియా రక్షణ మంత్రి కూడా నిర్థారించారు. ఈక్వెడార్ సరిహద్దుల్లో జరిగిన ప్రమాదానికి కారణాలు వెల్లడికాలేదు. సాధారణంగా ఈ విమానంలో వంద మంది వరకూ సైనికులను కల్లోలిత ప్రాంతాలకు తరలిస్తారు. సరిహద్దులో ఘర్షణల అణచివేతకు సైన్యాన్ని తరచూ వినియోగిస్తున్నారు.
హోర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలపై భారీగా ‘టోల్’
ఇరాన్ నిర్ణయం!తెహ్రాన్: అమెరికా, ఇజ్రాయిల్తో కొనసాగుతున్న ఘర్షణల నడుమ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలకు కీలకమైన హోర్మూజ్ జలసంధి గుండా వెళ్లే కొన్ని నౌకలపై భారీగా టోల్ వసూలు చేయాలని నిర్ణయించి నట్లు సమాచారం. ఒక్కో నౌకపై సుమారు 2 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.18 కోట్ల వరకు పన్ను విధించనున్నట్లు ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత కమిటీ సభ్యుడు అలాఎద్దీన్ బొరూజెర్దీ వెల్లడించారు. ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థకు […] The post హోర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలపై భారీగా ‘టోల్’ appeared first on Visalaandhra .
కల్కి సీక్వెల్ కోసం ప్రత్యేక సెట్?
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం (సీక్వెల్) శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ లో దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్లకు సంబధించి కీలక సన్నివేశా లను చిత్రీకరిస్తున్నారు. అయితే, ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ ప్రత్యేక మైన సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ప్రభాస్ పై ఎంట్రీ సాంగ్ ను చిత్రీకరిస్తారట. ఈ పాటలో […] The post కల్కి సీక్వెల్ కోసం ప్రత్యేక సెట్? appeared first on Visalaandhra .
మే1న థియేటర్లలో ‘గాయపడ్డ సింహం’
హైదరాబాద్: కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్తో ఈ సినిమా టాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. కాగా ఈ చిత్రాన్ని మే 1, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన మరుసటి రోజే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. ప్రముఖ […] The post మే1న థియేటర్లలో ‘గాయపడ్డ సింహం’ appeared first on Visalaandhra .
కోలీవుడ్లో రోజా వరుస సినిమాలు
చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సీనియర్ నటీమణుల పునరాగమనం నడుస్తోంది. శోభన వంటి నటీమణుల బాటలోనే మాజీ మంత్రి రోజా కూడా మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ తమిళ సినిమాలకు దూరమైన రోజా… 12 రోజుల తర్వాత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కోలీవుడ్లో చర్చనీయాంశమైన చిత్రం ‘అన్బే డయానా’. పారి ఎలవళగన్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో రోజా ఒక ముఖ్య […] The post కోలీవుడ్లో రోజా వరుస సినిమాలు appeared first on Visalaandhra .
ఇంప్యాక్ట్ నిబంధన నాకు నచ్చదు: అక్షర్
న్యూదిల్లీ: ఇటీవల టీ20 ప్రపంచకప్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన అక్షర్ పటేల్ ఐపీఎల్లోనూ జోరు చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అక్షర్ ఈసారి జట్టుకు టైటిల్ను అందించేందుకు అవసరమైన వ్యూహాలు పన్నుతున్నాడు. మరో ఐదు రోజుల్లో పంతొమ్మిదో సీజన్ మొదలవ్వనున్న నేపథ్యంలో సహచరులతో కలిసి నెట్స్లో ప్రాక్టీస్తో బిజీగా ఉన్న అక్షర్ పటేల్… ‘ఇంప్యాక్ట్ ప్లేయర’ నిబంధనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అన్నీ ఒకే.. కానీ, ఈ ఒక్క నిబంధనే తనకు నచ్చదని […] The post ఇంప్యాక్ట్ నిబంధన నాకు నచ్చదు: అక్షర్ appeared first on Visalaandhra .
కొడంగల్లో ఆయిల్పామ్, రిఫైనరీ ఫ్యాక్టరీ ఏర్పాటు
కొడంగ్లో నూతన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ వెల్లడించారు. సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెరుగుతున్న డిమాండ్ దృష్టా సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కొడంగల్లో మరోక ఆయిల్ పామ్, రిఫైనరీ ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇకో పామ్ ఆయిల్, ఫ్యాట్స్ ప్రయివేట్ లిమిటెడ్కు చెందిన కంపెనీ గంటకు పది టన్నుల సామర్ధం కలిగిన మిల్లు ఏర్పాటుకు అంగీకారం తెలిపినట్లు చెప్పారు. మిల్లు ఏర్పాటు చేయడానికి 50 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలియజేశారు. భూ కేటాయింపులు జరిగిన సంవత్సరం కాలంలో రూ. 75 కోట్లతో మిల్లు పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మిల్లు ఏర్పాటుతో ప్రత్యక్షంగా వంద మందికి, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. కాగా, జాతీయంగా పామాయిల్ డిమాండ్ కోటి మెట్రిక్ టన్నులుగా ఉందని, భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి దిగుమతుల ద్వారా వంట నూనెల లోటును సమకూర్చుకుంటున్నామన్నారు. వంట నూనెల దిగుమతుల్లో పామాయిల్ వాటా సుమారు 60 శాతం ఉందని, పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే దేశంలో సుమారు 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడం అవసరమని అంచనా ఉన్నట్లు వివరించారు. దీంతో రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఆయిల్ పామ్సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో సిఎం ఆదేశాలతో కొడంగల్లో ఏర్పాటు చేయనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు రాష్ట్ర రైతులకు మేలు చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉద్యానవన సంచాలకులు యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన నగరంలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పాతబస్తీ, సంతోష్నగర్, మెయిన్బాగ్కు చెందిన సయీద్ లయీక్(31)ను మెయిన్బాగ్, మసాన్ గట్టి ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. క్లూస్టీం వచ్చి ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతోష్ నగర్ పోలీసులు తెలిపారు.
గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినేట్
గిగ్వర్కర్స్, ప్లాట్ఫాం కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ) యాక్ట్ , 2026’ బిల్లును కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్ తో పాటు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లు ప్రకారం గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయడంతో వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ దీనిని ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం పిసిసి అధ్యక్షుడితో పాలు పలువురితో సిఎం రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశమయ్యారు. సభలో చర్చించాల్సిన విషయాలు, సభలో సభ్యులు వ్యవహారించాల్సిన తీరు తదితర అంశాలపై కేబినెట్ చర్చించినట్టుగా తెలిసింది.
Did Pawan Kalyan Hint of Taking a Break?
Pawan Kalyan’s recent film Ustaad Bhagat Singh released last weekend and the film turned out to be a huge embarrassment for the actor. He is badly criticized and his fans trolled him badly. The actor’s production house Pawan Kalyan Creative Works has issued a statement to put an end to the speculations. “As of now, […] The post Did Pawan Kalyan Hint of Taking a Break? appeared first on Telugu360 .
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. హేట్ స్పీచ్ బిల్లుకు, గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే,పేరెంట్స్ సామాజిక భద్రత బిల్లుకు, అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు, కులగణనపై నిపుణుల కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తీర్మానించింది. ఈ కమిటీ ఛైర్మన్గా డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులుగా మంత్రులు ఉత్తమ్కుమార్, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, శ్రీధర్బాబు వ్యవహరించనున్నారు. ఎల్ అండ్ టీ నుండి మెట్రో స్వాధీనం వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Janhvi Kapoor’s Stand for Telugu Films
Sridevi’s daughter Janhvi Kapoor made her debut in Bollywood. Though she enjoys stardom, the actress hasn’t delivered a huge success in Hindi. She was paired up beside NTR in Devara and the actress’ performance was appreciated. She even became more popular after her portrayal in Devara and she is the leading lady in Ram Charan’s […] The post Janhvi Kapoor’s Stand for Telugu Films appeared first on Telugu360 .
కీడు సోకిందని ఊరు ఖాళీచేసిన గ్రామస్తులు
జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా వరుసగా 28 మంది వివిధ కారణాలతో మరణించడంతో గ్రామంలో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రామానికి ఏదో కీడుసోకిందని బలంగా నమ్మిన గ్రామస్తులు, పురోహితుడి సూచన మేరకు వింత నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజంతా గ్రామస్తులు ఊరు మొత్తం ఖాళీ చేసి వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి కీడు వంటలు వండుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం సోమవారం తెల్లవారు జామునే ఇళ్లకు తాళాలు వేసి గ్రామంలో డప్పు చాటింపు వేయించి మరీ ఊరి బయటకు వెళ్లారు. ఇలా చేస్తేనే గ్రామానికి పట్టిన (కీడు) పీడ విరుగడవుతుందని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.
Mega Steel Plant in Anakapalli Marks New Industrial Era for Andhra Pradesh
Andhra Pradesh has taken a major step forward in its industrial journey with the foundation of a massive steel plant in Rajayyapeta, Anakapalli district. Chief Minister Chandrababu Naidu laid the foundation stone for the ArcelorMittal Nippon Steel India project and described it as a turning point for the state’s economy. The project is set to […] The post Mega Steel Plant in Anakapalli Marks New Industrial Era for Andhra Pradesh appeared first on Telugu360 .
ఫైర్ట్రక్ను ఢీకొట్టిన కెనడా విమానం
అమెరికాలో ఎయిర్ కెనడా విమానానికి ప్రమాదం జరిగింది. పైలట్, కో పైలట్ మృతి చెందారు. సోమవారం ప్రాంతీయ జెట్ న్యూయార్క్ లాగార్డియా ఎయిర్పోర్టు రన్వేపే ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. అక్కడున్న అగ్నిమాపక ట్రక్కుతో ఢీకొంది. ఈ సమయంలో విమానంలో 39 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిని ఇతర సిబ్బందిని వెంటనే చికిత్సకు తరలించారు. కొందరికి ఎక్కువగా కాలిన గాయాలు అయ్యాయి. ఫైర్ ట్రక్కు సిబ్బంది కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘటన తరువాత ఈ విమానాశ్రయాన్ని కొద్ది సేపు నిలిపివేశారు.
రుణమాఫీ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో లేదు : నిర్మలా సీతారామన్
రైతులకు పూర్తి రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ సోమవారం పార్లమెంట్లో వెల్లడించారు. అయితే రైతుల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) ద్వారా సకాలంలో తగినంత రుణం అందించడం వంటి అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుందని వివరించారు. ఈ కేపిసి కింద రూ. 3 లక్షల వరకు పంట రుణాన్ని రాయితీ వడ్డీ రేట్లకు అందిస్తున్నట్టు చెప్పారు. సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్ఎస్) కింద సకాలంలో తిరిగి చెల్లిస్తే అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నట్టు గుర్తు చేశారు. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ ) జారీ చేసిన ప్రాధాన్య రంగ రుణాల మార్గదర్శకాల ప్రకారం అనుబంధ కార్యకలాపాల రుణాలతోసహా పూచీకత్తు లేని స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను రూ. 1.60 లక్షల నుంచి రూ. 2 లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు. అలాగే వ్యవసాయంతో సహా ఆర్థిక వ్యవస్థ లోని ప్రాధాన్య రంగాలకు బ్యాంకింగ్ నుంచి తగినంత రుణ ప్రవాహం ఉండేలా చూస్తున్నామని లోక్సభకు ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు. వీటితోపాటు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్ )పథకం కింద రైతులకు నేరుగా నగదు బదిలీతోపాటు పంటలబీమా అందిస్తున్నామని పేర్కొన్నారు.
అసెంబ్లీ ముట్టడికి బిజెపి యత్నం
ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ముట్టడికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఆటోలో అసెంబ్లీ వద్దకు వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసు స్టేషన్కు తీసుకెళ్ళి సాయంత్రం విడుదల చేశారు.సోమవారం ఉదయం11.30 గంటల సమయంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో అసెంబ్లీకి నలువైపులా వస్తూ ముట్టడించేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ ముట్టడికి బిజెపి శ్రేణులు వస్తున్నారన్న విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పార్టీ నాయకుడు దీపక్ రెడ్డి నాయకత్వంలో కొంత మంది కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకుని రాగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. అదే సమయంలో ఇతర మార్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, మహిళా మోర్చా కార్యకర్తలు దూసుకుని రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. కార్యకర్తలు దూసుకుని రావడం, ఆ ప్రాంత మంతా ఉద్రిక్తతకు దారి తీసి, ట్రాఫిక్కు కొంత సమయం తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఇదిలా ఉండగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరడం లేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప, మిగతా గ్యారంటీలన్నింటినీ పక్కనబెట్టి, అమలు చేసినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతు భరోసా చెల్లించడం లేదని, దాదాపు రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో పలు విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆయన విమర్శించారు. అర్ధరాత్రి నుంచే తమ పార్టీ నాయకులను గృహనిర్బంధం చేశారని, వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు వస్తున్న వేలాది కార్యకర్తలను మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. సుమారు ఎనిమిది వందల మంది కార్యకర్తలను అరెస్టు చేశారని రాంచందర్ రావు చెప్పారు.
ప్రయాగ్రాజ్లో ఘోర ప్రమాదం.. కోల్డ్ స్టోరేజ్ కూలి నలుగురు మృతి
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఓ కోల్డ్ స్టోరేజ్ కూలిపోవడంతో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. అగ్నిమాపక దళం, పోలీసులతో సహా పలు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో పేలుడు సంభవించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారి చెప్పారు. ఈ ఘటనకు గల కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించామని ప్రయాగ్రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ కుమార్ వర్మ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏడీఎం ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని, అది 24 నుంచి 48 గంటల్లో నివేదిక సమర్పించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశఆరు. మరణించిన వారికి సంతాపం తెలుపుతూ.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ఆయన ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 అందజేయనున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని యోగి, అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందేలా చూసేందుకు, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని జిల్లా పరిపాలన అధికారులను ఆదేశించారు.
పవన్ తదుపరి సినిమాలపై రూమర్స్.. నిర్మాణ సంస్థ ఏమందంటే..
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ‘హరిహర వీరమల్లు’, ‘ఒజి’ ఈ ఏడాది ‘ఉస్తాద్ భగత్సింగ్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ఓవైపు ఎపి డిప్యూటీ సిఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు ఈ సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు పవన్. అయితే పవన్ తదుపరి సినిమాలపై సోషల్మీడియాలో అప్పుడే చర్చ మొదలైంది. సామాజిక అంశాలే ఇతివృత్తంగా సినిమాలు తెరకెక్కించే ఓ దర్శకుడితో పవన్ వర్క్ చేయనున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ‘పవన్కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ నిర్మాణ సంస్థ స్పందించింది. పవన్ ప్రస్తుతం ఏ సినిమాకి కమిట్ కాలేదని పేర్కొంది. ‘‘ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ఏ కొత్త సినిమానీ అంగీకరించలేదు. ఆయన తదుపరి చిత్రాలపై వస్తున్న ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదు. వెంటనే కొత్త సినిమాలు చేయాలన్న ప్రణాళికలు లేవు. ఒకవేళ ఏదైనా ప్రాజెక్టు ఓకే అయితే.. అధికారిక మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలియజేస్తాం. ఒక ‘ఒజి2’ అప్డేట్పై సరైన సమయంలో పవన్కల్యాణే దాని గురించి చెబుతారు’’ అని స్పష్టం చేసింది.
కుడి చేత్తో రైతుబంధు నిధులు లాగేసుకొని ఎడమ చేత్తో రుణమాఫీ: హరీష్ రావు
గత వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి రైతులకు రావాల్సిన దాదాపు రూ. 19,000 కోట్ల రైతుబంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టిందని హరీష్రావు ఆరోపించారు. కుడి చేత్తో రైతుబంధు నిధులను లాగేసుకొని, ఎడమచేత్తో రుణమాఫీ చేశామని చెప్పడం రైతులను మోసం చేయడమే అని ఆయన విమర్శించారు. కెసిఆర్ది ‘పెట్టుబడి సాయం’ పథకమైతే, కాంగ్రెస్ ది ‘ఎన్నికల పెట్టుబడి సాయం’ అని ఎద్దేవా చేశారు. వరి ధాన్యానికి క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి, దానిని కేవలం సన్న రకాలకే పరిమితం చేశారని, అది కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని హరీష్ రావు దుయ్యబట్టారు. అలాగే, ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా’ పథకం కింద రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తామని బడ్జెట్లో రూ. 1,300 కోట్లు కేటాయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒక్క రైతుకు కూడా బీమా అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12,000లు ఇస్తామని ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో గొప్పగా ప్రకటించి, రెండు బడ్జెట్లు గడిచినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని హరీష్ రావు విమర్శించారు. ఇందిరాగాంధీ పేరు పెట్టుకొని నిరుపేద కూలీల కడుపు కొట్టడం ధర్మమేనా? అని హరీష్రావు ప్రశ్నించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని, తాజా బడ్జెట్లో ‘జాబ్ క్యాలండర్’ ప్రస్తావనే లేకపోవడం దారుణమని హరీష్ రావు అన్నారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న అశోక్ నగర్ అభ్యర్థులపై లాఠీచార్జీ చేయడాన్ని ఆయన ఖండించారు.
మైనర్ల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు,
మైనర్ల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు, పోలీసుల అదుపులో 11 ద్విచక్ర వాహనాలు, చిట్యాల,
తాటిచెట్టి పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు
తాటిచెట్టి పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు మొగుళ్లపల్లి, ఆంధ్రప్రభ :
కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రంగంలోకి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్అప్రమత్తమైన అగ్నిమాపక
సమస్యల పరిష్కారానికి సమర్థ నాయకత్వం ముఖ్యం…
సమస్యల పరిష్కారానికి సమర్థ నాయకత్వం ముఖ్యం… ప్రతి విజయం వెనుకా దృఢమైన నాయకత్వం
5days |ఇరాన్ యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భయమా? వ్యూహమా?
5days | ఇరాన్ యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భయమా? వ్యూహమా? 5days |
గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ బి.ఎం.బి. ఏ2.0 – 100 రోజుల
సామ్ కరన్ ఔట్.. RRలోకి శ్రీలంక ఆల్ రౌండర్
న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 మెగా టోర్నమెంట్ కు ముందు రాజస్థాన్ రాయల్స్ ..జట్టులో కీలక మార్పు చేసింది. గాయపడిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ స్థానంలో శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ దసున్ శనకను జట్టులోకి ఎంపిక చేసింది. శనకను రూ.2కోట్లకు తీసుకుంది. గతంలో గుజరాత్ టైటాన్స్కు ఆడిన శనక.. తన అనుభవంతో రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేస్తాడని రాజస్థాన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా శనక.. శ్రీలంక తరఫున 6 టెస్టులు, 71 వన్డేలు, 131 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో 3350కి పైగా పరుగులు, 86 వికెట్లు ఉన్నాయి. ఇదిలావుంటే.. గత డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మినీ-వేలంలో శనక అమ్ముడుపోలేదు. దీంతో అతను పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో లాహోర్ ఖలందర్స్, శనకను 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ లీగ్ను వదులి మళ్లీ ఐపీఎల్లో ఆడేందుకు వస్తున్నాడు. ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరనున్నాడు. మరో విదేశీ ఆటగాడు బ్లెస్సింగ్ ముజరబానీ కూడా పీఎస్ఎల్ లో ఇస్లామాబాద్ యునైటెడ్తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకుని కోల్కతా నైట్ రైడర్స్లో చేరాడు.
అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో కియోస్క్ మిషన్లు….
అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో కియోస్క్ మిషన్లు…. పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు…
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు… 16 వెల రూపాయలు అనధికారికంగా ఉన్న
మధ్యవర్తిత్వం లేకుండా ప్రభుత్వ సేవలు…
మధ్యవర్తిత్వం లేకుండా ప్రభుత్వ సేవలు… సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాయకాపురం, ఆంధ్రప్రభ
There are a lot of speculations about the upcoming film of Megastar Chiranjeevi which will be directed by Bobby Kolli. Titled Mega158, the film was announced last year and the shoot of the film was delayed due to various reasons. Bobby is yet to wrap up the scriptwork of the film and the casting process […] The post Mega158 Latest Updates appeared first on Telugu360 .
ఉన్నం హనుమంతరాయ చౌదరి సేవలు చిరస్మరణీయం–సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విశాలాంధ్ర, కళ్యాణదుర్గం:రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గుతున్న ఈ కాలంలో, వచ్చే తరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా జీవించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి సేవలు చిరస్మరణీయమని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు.సోమవారం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో దివంగత నేత హనుమంతరాయ చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. పెద్దాయన భార్య లక్ష్మీదేవి, కుమారులు మారుతి చౌదరి, ఉదయ […] The post ఉన్నం హనుమంతరాయ చౌదరి సేవలు చిరస్మరణీయం– సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ appeared first on Visalaandhra .
దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దానం పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేసిన బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని దానం నాగేందర్ను న్యాయస్థానం ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 16కి వాయిదా వేసింది. కాగా, పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బిఆర్ఎస్.. స్పీకర్ ఫిర్యాదు చేశారు. తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం ఆదేశాల మేరకు దానంతో సహా 10 మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. వారికి క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రేవంత్ రెడ్డిని సిఎం చేసింది నేనే: ఎంఎల్ఎ మల్లారెడ్డి
“రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే..” అని బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజికవర్గంలో రేవంత్ రెడ్డి తప్ప పవర్ పుల్ దమ్మున్న నాయకుడు మరొకరు లేరని రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో చెప్పానని ఆయన సోమవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. మీకు తన మాటలపై నమ్మకం లేకపోతే ఆ వీడియో చూపిస్తానని ఆయన విలేకరులనుద్ధేశించి తెలిపారు. ఎవరు అవునన్నా కాదన్నా తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదమ్ములమేనని ఆయన చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ తనదేనని అన్నారు. ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తనను నటించమని అడిగితే నిరాకరించానని ఆయన తెలిపారు. ఎందుకు నిరాకరించారని ప్రశ్నించగా, అలాంటి పాత్ర కాదు ఏకంగా ముఖ్యమంత్రి పాత్ర పోషించాలని ఉందన్నారు. వెండి తెరపై ముఖ్యమంత్రి పాత్ర పోషించడానికి అవకాశం వస్తే తప్పకుండా పోషిస్తానని సి. మల్లా రెడ్డి తెలిపారు.
బిఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేసిందో..ఏం ఇచ్చిందో చెప్పాలి: మంత్రి సీతక్క
బిఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేసిందో, ఏం ఇచ్చారో చెప్పాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాజీ మంత్రి హరీష్రావును ప్రశ్నించారు. అసెంబ్లీలో మాజీమంత్రి హరీష్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఢిల్లీ పాయే జాబులేమో రాకపాయే అంటూ అశోక్ నగర్ లాఠీచార్జీలను హరీశ్రావు గుర్తుచేశారు. నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. ఈ అంశంపై మంత్రి సీతక్క అసెంబ్లీలో మాట్లాడుతూ నోటిఫికేషన్ ఇస్తే వాళ్లకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినట్లేనానని మంత్రి ప్రశ్నించారు. పాండవులు సంపాదించింది అంత కౌరవుల తద్దినానికే సరిపోయిందన్నట్లుగా గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు, బిల్లుల బకాయిలు చెల్లించేందుకు సరిపోతుందని మంత్రి సీతక్క అన్నారు. ఇచ్చిన హామీల ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని సీతక్క చెప్పారు. హరీశ్ రావు నీ నియోజకవర్గానికి 50 శాతం రైతు రుణమాఫీ కాలేదంటున్నారని, మరి మీ గవర్నమెంట్లో రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని, మీరు అప్పుడు చేసి ఉంటే ఇప్పుడు మీరు అంటున్నట్లుగా ఇబ్బంది ఉండకపోయేది కదా? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఏం చేశారో లెక్కలతో సహా చెప్పాలని మంత్రి సీతక్క మండిపడ్డారు. మీ హయాంలో చాలా మంది రైతులు చనిపోయారు, మీ బాధ అంత అధికారం పోయిందని హరీష్ అన్న, మేము చేస్తున్న వాటిలో మన్ను పోసి మీరు గొప్ప అని చెప్పుకోవడం కాదని, సీట్ మారినంత మాత్రాన చరిత్ర మారుతుందా? పదేళ్లు అంటే చాలా సమయం ప్రజలు ఇచ్చారని, ఎందుకు మీరు చేయలేదని, మీ అప్పులకి వడ్డీలు, వడ్డీలకు వడ్డీలే సరిపోతున్నాయని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి ఐదు లక్షల జీవిత బీమా పెడితే ఓర్వ లేకపోతున్నారని, మట్టి, దుమ్ము పోసుడు రాజకీయం కాదని, ముందు మీరు చేసింది చెప్పాలని, తాము ఏం చేయాలో చెప్పాలని మంత్రి సీతక్క హరీష్రావుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
హనుమాన్ ఆలయ హుండీలో నకిలీ నోట్లు కలకలం #telugupost #fakecurrency #hanumantemple #viralnews
ఐదు రోజులు దాడులు ఆపుతామన్న ట్రంప్.. ఇరాన్ రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై 5 రోజుల వరకు దాడులు చేయమని ట్రంప్ తెలిపారు. ఇంధన మౌలిక సదుపాయాలపై 5 రోజుల వరకూ దాడులు చేయమని స్పష్టం చేశారు. ఇరాన్తో చర్చలు జరుగుతున్నట్లు ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేశారు. రెండు రోజులుగా ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. చర్చలు సానుకూలంగా ఉన్నాయని.. మరో వారం పాటు ఇరాన్తో చర్చలు జరగొచ్చని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు జరుగుతున్నాయన్నారు. చర్చల ఫలితంపై భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అన్నారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ప్రభుత్వం స్పందించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ట్రంప్ మరోసారి దిగివచ్చారని ఇరాన్ అన్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. తమ హెచ్చరికలతో ట్రంప్ దిగివచ్చారని ఇరాన్ తెలిపింది. ట్రంప్తో తాము ఎలాంటి చర్చలు జరపలేదని పేర్కొంది. చర్చల ప్రతిపాదనను తాము తిరస్కరించామని.. చమురు ధరల తగ్గింపు కోసమే ట్రంప్ నాటకాలు అని తెలిపింది. యుద్ధ నివారణ కోసం గల్ఫ్ దేశాలు చొరవ తీసుకున్నాయని.. అసలు చొరవ తీసుకోవాల్సింది.. యుద్ధం ప్రారంభించిన దేశమని ఇరాన్ స్పష్టం చేసింది.
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు
హైదరాబాద్: నగరంలోని మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ్నగర్ కాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శృతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మూడో అంతస్థులో ఎసి పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది, రోగులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.
'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో మైలురాయిని నెలకొల్పిన డానోన్ ఇండియా
ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి భారతదేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రతిజ్ఞ చేయడంతో, డానోన్ ఇండియా 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో ఒక మైలురాయిని నెలకొల్పింది. ఐరన్ లోపం, రక్తహీనతను పరిష్కరించడానికి అవగాహనను పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించడం, సమర్థవంతమైన పోషకాహార చర్యలను ప్రోత్సహించడంలో డానోన్ చేసిన సామూహిక కృషిని ఈ చారిత్రాత్మక విజయం ప్రతిబింబిస్తుంది. సూక్ష్మపోషకాల లోపాలను ఎదుర్కోవడంలో, ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో భాగస్వామ్య చర్యల ప్రాముఖ్యతను ఈ చొరవ నొక్కి చెబుతుంది. నవంబర్ 2025లో, డనోన్ ఇండియా దేశవ్యాప్తంగా ఐరన్ లోప రక్తహీనత (IDA)ను గుర్తించడం, నివారించడాన్ని వేగవంతం చేయడానికి 'ఐరన్ అప్!' అనే జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, అవగాహన పెంచడానికి, సకాలంలో రోగ నిర్ధారణను మెరుగుపరచడానికి, నివారణ పోషణను ప్రోత్సహించడాని కి కట్టుబడి ఉండాలని భారతదేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ నిపుణులకు పిలుపునిస్తూ డనోన్ 'IDA ప్లెడ్జ్ క్యాంపెయిన్'ను ప్రారంభించింది. కుటుంబాలు ప్రతిరోజూ ఐరన్ లోపాన్ని అర్థం చేసుకుని, దానిపై చర్యలు తీసు కోవడంలో సహాయపడటానికి వైద్య సమాజంలో ఒక బలమైన, ఏకీకృత ఉద్యమాన్ని నిర్మించడమే ఈ సామూ హిక ప్రయత్న లక్ష్యం. 'ఐరన్ అప్' చొరవ అనే ప్రచారం, అవగాహన కార్యక్రమాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాల ద్వారా భారతదేశవ్యాప్తంగా ఉన్న శిశువైద్యులు, సాధారణ వైద్యులు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులను భాగస్వాములను చేసింది. వైద్య సమాజాన్ని సమీకరించడం ద్వారా, డానోన్ ఇండియా ముఖ్యంగా పేద ప్రజలలో ఐరన్ లోపంపై అవగాహన పెంచడానికి, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తన విజ్ఞాన-ఆధారిత పోషకాహార విధానంలో భాగంగా, డానోన్ ఇండియా ఐరన్ శోషణకు, పేగు ఆరో గ్యానికి తోడ్పడే అవసరమైన పోషకాలతో రూపొందించిన 'ఐరన్బయోటిక్స్' వంటి పరిష్కారాలను అభివృద్ధి చేస్తూనే ఉంది. తద్వారా, ఐరన్ లోపం, రక్తహీనతను పెద్ద ఎత్తున పరిష్కరించాలనే తన నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తోంది. ఈ మైలురాయి గురించి డనోన్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక వర్మ మాట్లాడుతూ, ‘‘ఈ ప్రభావ వంతమైన కార్యక్రమానికి గాను ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందడం మాకు గర్వకారణం. లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న రక్తహీనతపై పోరాడటానికి వైద్య సమాజంలో ఉన్న ఉమ్మడి నిబద్ధతను, ఆరోగ్య సంరక్షణ నిపుణుల నుండి 20,911 ప్రతిజ్ఞలను పొందడం ద్వారా ప్రదర్శించవచ్చు. ఈ నిరంతర, సమాజ-ఆధారిత విధానం లెక్కలేనంత మంది భారతీయుల ఆరోగ్య ఫలితాలను మార్చివేస్తుంది. ఇది అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సమాజాలు, సంస్థలు ఏకతాటిపైకి వచ్చే సామూ హిక చర్య శక్తిని ప్రతిబింబిస్తుంది. దేశ పోషకాహార పునాదిని బలోపేతం చేయడమే కాకుండా, సాక్ష్యాధారిత, సమ్మిళిత ప్రజారోగ్య ఆవిష్కరణలలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టే ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం మాకు గర్వకారణం’’ అని అన్నారు. ఐరన్అప్ కార్యక్రమంతో పాటు, డనోన్ ఇండియా బిహార్లో 'స్వస్థ మాత స్వస్థ బాలక్' అనే ఏడాది పొడవునా సాగే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. గర్భిణీ స్త్రీల పోషణను మెరుగుపరచడం, అవగాహనను పెంచడం, తల్లులు, వారి శిశువులిద్దరికీ మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. గర్భిణులు, శిశువులలో ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి డనోన్ చేస్తున్న ప్రత్యేక ప్రయత్నాలలో ఈ కార్యక్రమం ఒక భాగం. పోషకాహార లోపం, సూక్ష్మపోషకాల కొరతను పరిష్కరించడానికి డనోన్ ఇండియా చేస్తున్న నిరంతర ప్రయత్నా లలో, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. ఆరోగ్యకరమైన భవి ష్యత్తును నిర్మించడానికి ఆరోగ్య సంరక్షణ భాగస్వాములు, విధాన రూపకర్తలు, సమాజాలతో కలిసి పని చేయడా నికి ఈ సంస్థ కట్టుబడి ఉంది.
‘ధురంధర్ 2’ను బ్యాన్ చేయాలంటూ.. కోర్టులో పిటిషన్
'ధురందర్ ది రివెంజ్' సినిమాను బ్యాన్ చేయాలంటూ ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టను ఆశ్రయించారు. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఆందోళనలను ప్రస్తావిస్తూ, తమిళనాడులో 'ధురందర్ 2' సినిమా విడుదలను నిషేధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఒక అత్యవసర పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తోంది. ఓ న్యాయవాది.. ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్ ఎదుట మౌఖికంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ చిత్రం రాజకీయ ఇతివృత్తాలతో కూడుకున్నదని, ఎన్నికల సమయంలో దీనిని ప్రదర్శించకూడదని ఆయన వాదించారు. అయితే, పిటిషనర్ అధికారికంగా రిట్ పిటిషన్ దాఖలు చేసి, ఆ తర్వాత ఈ విషయంపై అత్యవసర విచారణ కోరాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో కోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన తర్వాతే, సినిమా విడుదలను నిలిపివేయాలా వద్దా అనే దానిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాగా, 'ధురందర్ ది రివెంజ్' చిత్రం కరాచీలోని ల్యారీ నేపథ్యంలో సాగుతుంది. ఈ ప్రాంతం తరచుగా గ్యాంగ్ ఘర్షణలతో ముడిపడి ఉంటుంది. ఈ చిత్రం కల్పిత కథనంతో పాటు కాందహార్ హైజాకింగ్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడుల వంటి నిజ జీవిత సంఘటనలను కూడా ప్రస్తావించారు. హీరో రణ్ వీర్ సింగ్ తోపాటు అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కూడా నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయంతో దూసుకుపోతోంది. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా రూ.750 కోట్లకు పైగా వసూల్ చేసి.. రూ.వెయ్యి కోట్లవైపు పరుగులు పెడుతోంది.
Chandrababu : స్పీడ్ ఆఫ్ బిజినెస్ వైపు ఏపీ దూసుకెళుతుంది
స్పీడ్ ఆఫ్ బిజినెస్ వైపు ఏపీ వైపు వెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
నేనెంత చెప్పిన.. వైభవ్ నా మాట వినడు: జితేశ్ శర్మ
గత ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్ల వయస్సులోనే ఈ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత జరిగిన ఐపిఎల్ సీజన్లో వేగవంతమైన సెంచరీ చేసి తన సత్తా నిరూపించుకున్నాడు. ఆ తర్వాత భారత యువ జట్టు తరఫున కూడా పలు అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపిఎల్ 19వ సీజన్లో చాలా మంది దృష్టి వైభవ్ పైనే ఉంది. ఈసారి వైభవ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీపై ఆర్సిబి ఆటగాడు జితేశ్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఎబి డివిలియర్స్తో యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన జితేశ్.. వైభవ్ని అద్భుతమైన ఆటగాడని కొనియాడాడు. ‘‘వైభవ్ సూర్యవంశీ చక్కటి ఆటగాడు. అండర్-19 జట్టులో అతడి ఆట చూశాను. నిలకడగా రాణించడం సాధారణ విషయం కాదు. అండర్-19 ప్రపంచకప్లో అతడి ఆట తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. తన వయసు కన్నా ఎంతో పరిణితిని సాధించాడు’’ అని జితేశ్ అన్నాడు. ‘‘అతడు తన గేమ్ ప్లాన్ను అనుసరించి ఆడాడు. ఐపిఎల్లో ఎలా రాణించాడో దాన్నే కొనసాగించాడు. మరొకరిని అనుకరించలేదు. బౌలర్లతో దురుసుగా ప్రవర్తించలేదు. వైభవ్ భవిష్యత్తులో ప్రొఫెషనల్గా మారుతాడు. ప్రస్తుతానికైతే అతడు ప్రొఫెషనల్ కాదు (నవ్వుతూ). అందరూ అతడిని ప్రొఫెషనల్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. వైభవ్ ఎప్పటికీ అలానే ఉంటాడని నేను అనుకోవడం లేదు. నేను కూడా ఈ విషయంలో ఎంతో కృషి చేస్తున్నా. రాత్రిపూట ఐస్క్రీం తినొద్దు అని అతడికి నేను చాలాసార్లు చెప్పి చూశాను. అయినా ఎప్పుడు నా మాట వినలేదు’’ అని జితేశ్ వివరించాడు.
Ys Sharmila : నా అజెండా ఆస్తులు కాదు.. ఆస్తుల కోసమే అయితే?
వైఎస్ వివేకా హత్య కేసు వచ్చినప్పుడల్లా వైసీపీ నేతలు ఆస్తుల వివాదాన్ని తెస్తున్నారని వైఎస్ షర్మిల తెలిపారు
ఇరాన్ తో యుద్ధానికి ట్రంప్ బ్రేక్..
వాషింగ్టన్: ఇజ్రాయెల్ తో కిలసి ఇరాన్పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తో జరుగుతున్న యుద్ధానికి బ్రేక్ వేస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్పై తాత్కాలికంగా దాడులు ఆపేస్తున్నామని సోమవారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా ప్రకటించారు. గత రెండు రోజులుగా ఇరాన్తో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ తో చర్చలు జరుగుతున్నాయని.. రాబోయే ఐదు రోజులపాటు ఇరాన్పై దాడులకు ఆపేస్తామని చెప్పారు. టెహ్రాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను వాయిదా వేయాలని తమ సైన్యాన్ని ఆదేశించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు..
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డొమ్మేటి వెంకట రెడ్డిజయంతి వేడుకలు ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్, డా. కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డిగారు మట్లాడుతు..దొమ్మేటి వెంకటరెడ్డి (1853–1928) తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సామాజికవర్గ ఆద్యులు,దాత అన్నారు. 1920లో ఈండ్ర/ఈడిగ కులాన్ని ‘సెట్టిబలిజ’గా గుర్తింపు […] The post ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు.. appeared first on Visalaandhra .
Fake News: Anushka Sharma in Allu Arjun’s Film
Icon Star Allu Arjun is shooting for his upcoming movie directed by Atlee. The film titled AA22 is half done with the shoot and has four top actresses playing important roles. Deepika Padukone, Mrunal Thakur, Rashmika Mandanna and Jahnvi Kapoor will be seen in prominent roles in the film. From the past one day, there […] The post Fake News: Anushka Sharma in Allu Arjun’s Film appeared first on Telugu360 .
US Steps Back From Iran Conflict, But Israel’s Move Remains Uncertain
The United States has taken an unexpected step back from the brink of conflict with Iran. President Donald Trump announced a five-day pause on planned military strikes, saying that he had constructive talks with Iranian representatives. The decision has eased immediate tensions, but it has also raised a larger question. There is a growing belief […] The post US Steps Back From Iran Conflict, But Israel’s Move Remains Uncertain appeared first on Telugu360 .
రూరల్ ఎస్సై రాజశేఖర్ విశాలాంధ్ర -ధర్మవరం; మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో నివసించు బి. శ్రీనివాసులు(35)కుటుంబ కలహాలతో శనివారం అర్ధరాత్రి సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. వివరాలకు వెళితే మృతుడు బి శ్రీనివాసులు ఆరు సంవత్సరాల కిందట మహేశ్వరి అనే అమ్మాయిని వివాహం చేసుకొని, కుటుంబ కలహాలతో భార్య మృతి చెందింది. భార్య చనిపోవడంతో మద్యముకు బానిస అయ్యాడు. మధ్యము మాని, మరో పెళ్లి చేస్తే బాగుపడుతాడు అన్న ఉద్దేశంతో నాన్న అదెప్ప మరో […] The post కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య appeared first on Visalaandhra .
Iran - Israel War : అమెరికా అధ్యక్షుడి కీలక నిర్ణయం..ఊపిరి పీల్చుకున్న పశ్చిమాసియా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు
ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే గరికిపాటికి దమ్ముందా..?
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజావిశాలాంధ్ర ధర్మవరం;; గరికిపాటి నరసింహారావు విద్యార్థుల చదువు, వారి హక్కులపై మాట్లాడటం బాగానే ఉంది కానీ ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు గరికిపాటికి సమాధానం చెప్పే దమ్ముందా..? అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు సిపిఐ కాలనీలో పట్టణ అధ్యక్షులు గోవర్ధన్ ఏర్పాటుచేసిన విలేకరులతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వద్దు అనడంలో గరికపాటి ఆంతర్యం ఏమిటి అని?, పేదల పిల్లలకు చదువుకోవడం ఇష్టం […] The post ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే గరికిపాటికి దమ్ముందా..? appeared first on Visalaandhra .
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి
జేసి పులి శ్రీనివాసులు మార్కాపురం : మార్కాపురం జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్క రించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సూక్ష్మ స్థాయిలోపరిశీలించి సానుకూలంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజల నుండి […] The post ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి appeared first on Visalaandhra .
అరుంధతి రెడ్డికి 'ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఫిబ్రవరి నెలకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు విజేతలను సోమవారం ప్రకటించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసినం భారత ఆల్-రౌండర్ అరుంధతి రెడ్డి మహిళల విభాగంలో ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ను భారత్ 2-1 తేడాతో గెలుపొందడంలో అరుంధతి రెడ్డి కీలక పాత్ర పోషించింది. అధ్బుత బౌలింగ్ తో రాణించిన అరుంధతి.. మూడు మ్యాచ్లలో ఎనిమిది వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచింది. ఇక, పురుషుల విభాగంలో 2026 టీ20 ప్రపంచ కప్లో తన ప్రదర్శనకు గాను పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్.. 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్నాడు. సాహిబ్జాదా ఫర్హాన్ టి20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శన చేసి, రెండు శతకాలతో 383 పరుగులు సాధించాడు. అతను ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా, ఒక టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రెండు శతకాలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని వర్తింప చేయండి..
మహిళా రైతు వనమాల నారాయణమ్మవిశాలాంధ్ర ధర్మవరం;; అన్నదాత సుఖీభవ పి ఎం కిషోర్ పథకాన్ని నాకు వర్తింపచేయాలని మహిళా రైతు వనమాల నారాయణమ్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను ధర్మవరం మండల పరిధిలోని కొలుతురు గ్రామంలో గల మహిళా రైతు ఉన్నానని, నా భర్త వనమాల నారాయణ మృతి చెందడం జరిగిందని, ప్రస్తుతం కుమారుడితో తుంపర్తి కాలనీలో నివాసం ఉంటున్నానని తెలిపారు. సర్వేనెంబర్ 171-2 సర్వే నెంబర్లు రెండు ఎకరాల భూమి ఉందని పూలు […] The post అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని వర్తింప చేయండి.. appeared first on Visalaandhra .
ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ ఆలయంలో అద్భుత దృశ్యం #telugupost #temple #adilabadnews #sunrays
Breaking : పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్
ఇరాన్ పై యుద్ధాన్ని కొన్ని రోజుల పాటు ఆపేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు
ధర్మవరం పట్టు శాలువాలు తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలుకు శ్రీకారం
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ధర్మవరం పట్టుచీరలు ఇకనుంచి తిరుమల తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలో పాల్గొనే వారికి ఆలయం తరఫున పట్టు వస్త్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మవరం నుంచి కొనుగోలు చేయనున్నది. రాష్ట్ర చేనేత జౌళి శాఖ రంగం తరపున తొలి విడతలో 65 వేల పట్టు శాలువాలను కొనుగోలు చేసేలా రంగం సిద్ధమయింది. ధర్మవరంలోని చేనేత మగ్గాలపై నేసిన పట్టు శాలువాలను మాత్రమే తయారు చేసే విధంగా చర్యలు […] The post ధర్మవరం పట్టు శాలువాలు తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలుకు శ్రీకారం appeared first on Visalaandhra .
కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన వన్ టౌన్ పోలీసులు
విశాలాంధ్ర ధర్మవరం; ఎస్పీ సతీష్ కుమార్, ఇంచార్జ్ డిఎస్పి నర్సింగ్ అప్ప ఆదేశాల మేరకు వన్ టౌన్ పరిధిలోగల ఎర్రగుంట లో కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. వీరితో పాటు వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, టూ టౌన్ ఎస్ఐ వీరేష్, సిబ్బంది ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఏ ఇంటిలో అయినా డ్రగ్స్, అనుమానిత వస్తువులు ఉన్నాయా అన్న కోణంలో సోదాలు నిర్వహించారు. అనంతరం సీఐ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డ్రగ్స్ […] The post కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన వన్ టౌన్ పోలీసులు appeared first on Visalaandhra .
తమిళనాడు ఎన్నికలు.. కూటమి పార్టీల మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు
చెన్నై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) సోమవారం సీట్ల పంపకాల ఒప్పందాన్ని ఖరారు చేసింది. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి, భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఈ సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఐఏడీఎంకే అత్యధికంగా 178 సీట్లను దక్కించుకుంది. ఇక, బిజెపికి 27 సీట్లు.. పట్టాలి మక్కల్ కచ్చి (PMK) పార్టీకి 18 సీట్లు.. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) పార్టీకి 11 సీట్లు కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటనే ఈసారి బిజెపికి ఏడు సీట్లు ఎక్కువగా ఇచ్చేందుకు అన్నాడీఎంకే అంగీకరించింది. సీట్లు సర్దుబాటు అనంతరం BJP నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ.. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము అత్యంత బలమైన కూటమిని ఏర్పాటు చేశాం. మా కూటమి ఈ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించబోతోంది అని ధీమా వ్యక్తం చేశారు.
పేద విద్యార్థులకు అన్నపూర్ణ ఆపన్న అస్త్రం ఈ మధ్యాహ్న భోజన పథకం..
ఆమ్ ఆద్మీపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణవిశాలాంధ్ర ధర్మవరం;; పేద పిల్లలకు అన్నపూర్ణ ఆపన్న అస్త్రం ఈ మధ్యాహ్న భోజన పథకము అని ఆమ్ ఆద్మీపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకం మీద చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద, నిరుపేద, మధ్యతరగతి వారి పిల్లల కోసం రూపొందించినదే ఈ మధ్యాహ్న […] The post పేద విద్యార్థులకు అన్నపూర్ణ ఆపన్న అస్త్రం ఈ మధ్యాహ్న భోజన పథకం.. appeared first on Visalaandhra .
నా పోరాటం, అజెండా ఆస్తులు కాదు: షర్మిల
అమరావతి: మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తావిస్తే.. ఆస్తులు గురించి మాట్లాడుతున్నారని ఎపిసిసి చీఫ్ షర్మిల తెలిపారు. ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తోంది తాను కాదని.. అని అన్నారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తన పోరాటం, అజెండా ఆస్తులు కాదని, ఆస్తులే తన అజెండా అయితే ఎప్పుడో కోర్టుకు వెళ్లేదానిని అని తెలియజేశారు. ఆస్తులపై తన తల్లి విజయమ్మ స్పష్టత ఇచ్చారని, లేఖ ద్వారా విజయమ్మ వాస్తవాలు చెప్పారని అన్నారు. స్పష్టత ఇచ్చినా వైసిపి నేతలు మొరుగుతున్నారని, విజయమ్మ విడుదల చేసిన లేఖ నిజం కాదని చెబుతున్నారని షర్మిల మండిపడ్డారు. విజయమ్మపై ఒత్తిడి చేసి సంతకం పెట్టించానని ఆరోపిస్తున్నారని, ఒకవేళ తాను ఒత్తిడి చేస్తే.. ఈ సంతకం తనది కాదని విజయమ్మ చెప్పలేరా? అని ప్రశ్నించారు. విజయమ్మ లేఖ వాస్తవమని తెలుసు కాబట్టి జగన్ మాట్లాడలేరు అని.. జగన్ తన సైన్యంతో సోషల్ మీడియాలో మాట్లాడించడం ఎందుకు? అని.. జగన్ కు మాట్లాడే దమ్ము, ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. సాక్షిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో.. సత్యమేవజయతే అని బ్యానర్ వేశారని, సాక్షిలో విజయమ్మ లేఖను కనీసం చివరి పేజీలో అయినా వేశారా? అని ప్రశ్నించారు. విజయమ్మ లేఖ వేయకపోవడం బట్టే తెలుస్తోంది.. సత్యం పట్ల వారికున్న గౌరవం అని షర్మిల దుయ్యబట్టారు.
క్యూనెట్ కేసులో 32 మందిని అరెస్ట్ చేశాం: సజ్జనార్
హైదరాబాద్: క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేశామని సిపి సజ్జనార్ తెలిపారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో క్యూనెట్ మోసాలకు పాల్పడిన విషయం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. హైదరాబాద్, ఎపి, కర్ణాటకల్లో 25 బృందాలతో సోదాలు నిర్వహించారు. తాజాగా సజ్జనార్ ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. క్యూనెట్పై తెలంగాణలో 68, హైదరాబాద్లో 22 కేసులు ఉన్నాయని.. ఇటీవల మరో 4 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. మూడు రాష్ట్రాల్లో సోదాలు చేసి 32 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అక్టోబర్లో ఓ క్యూనెట్ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సెకండ్ ఇన్కమ్ పేరుతో ఐటి ఉద్యోగులను ఆకర్షిస్తున్నారని అన్నారు. స్టార్ హోటళ్లలో మీటింగ్లు పెట్టి ఉత్పత్తులు అమ్మమంటున్నారని.. రుణాలు ఇప్పించి మరీ క్యూనెట్లో చేర్చుకుంటున్నారని తెలిపారు. కార్లు, ఇళ్లు చూపించి క్యూనెట్లోకి ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. బాధితుల్లో ప్రముఖ ఐటి కంపెనీ ఉద్యోగులు ఉన్నారని వివరించారు. మనీలాండరింగ్పై దర్యాప్తు కోసం ఇడిని కోరుతమని తెలిపారు.
ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు..
ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు.. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసిన
రైతులకు రూ. 8.25 కోట్ల రుణాలు పంపిణీ…
రైతులకు రూ. 8.25 కోట్ల రుణాలు పంపిణీ… తిరువూరు, ఆధ్రప్రభ : తిరువూరు
రోడ్డు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..
రోడ్డు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. ఉరుసు బైపాస్ రోడ్డుపై ధర్నా
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా బాధ్యతా సేవా సంస్థ
కడియం : కడియం అరుంధతి పేటలో శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా కుడేలి చిన్న అమ్ములు కుటుంబానికి చెందిన తాటాకిల్లు దగ్ధమయింది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామన్లు కాలి బూడిద అయ్యాయి. బాధ్యతా సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల బాబు, సంస్థ సభ్యులతో కలిసి బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు, చీరలు, వంట సామగ్రి, బియ్యం, నగదు అందజేశారు. కోసూరి సూరిబాబు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా గిరజాల […] The post అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా బాధ్యతా సేవా సంస్థ appeared first on Visalaandhra .
10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 302 మంది గైరు హాజరు…
10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 302 మంది గైరు హాజరు… 53 పరీక్ష
ఉచిత గాలికుంటు నివారణ టీకాలు..
ఉచిత గాలికుంటు నివారణ టీకాలు.. చిట్యాల, ఆంధ్రప్రభ : పశు వైద్య శాఖ
చిట్యాల లో భగత్ సింగ్ వర్ధంతి..
చిట్యాల లో భగత్ సింగ్ వర్ధంతి.. చిట్యాల, ఆంధ్రప్రభ : భారత దేశ
Andhra Prabha Smart Edition |AP|నక్కపల్లిలో అద్భుత ఘట్టం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 23-03-2026, 4.00PM ap నక్కపల్లిలో నయా చరిత్ర..
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి : దేశంలో సామ్రాజ్యవాద, మతోన్మాద శక్తులకు చరమగీతం పాడి సమసమాజ కోసం పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదరర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు సుఖదేవ్, భగత్ సింగ్, శివరాం రాజ్ గురు 95వ వర్ధంతి వేడుకలు సోమవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా […] The post సమసమాజం కోసం పోరాటం చేద్దాం appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |TS|బకాయిల లడాయి/వివాదాల రణస్థలం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 23-03-2026, 4.00PM ts బకాయిల లడాయి.. హరీష్
సజావుగా పదో తరగతి పరీక్షలు..
సజావుగా పదో తరగతి పరీక్షలు.. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డా.
Disha Patani Irritates with her Glam Show
Disha Patani is one of the most glamorous actresses and she never hesitates to show off her curves in public. There are hundreds of her bikini pictures posted by the actress on social media. They kept trending for sometime and it is now irritating to watch her continuously in glamorous outfits. Her recent public appearance […] The post Disha Patani Irritates with her Glam Show appeared first on Telugu360 .

24 C