వైసిపి నేత ‘బొత్స’కు బ్రెయిన్ స్ట్రోక్
వైసిపి మాజీ మంత్రి, ఎపి మండలిలో ప్రతిపక్ష నాయకుడు, బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యా రు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడి సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరా బాద్కు తరలిం చారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పారు. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతేడాది కూడా ఓసారి బొత్స సత్యనారాయమ అస్వస్థతకు గురుయ్యారు. గతేడాది జూన్లో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసిపి చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బొత్స ఒక్కసారిగా కుప్పకూలిపో యారు. వెంటనే విశాఖపట్నంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యా రు. అంతకుముందు 2013 లో హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో కూడా బొత్స చికిత్స తీసుకున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టగా చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఎపిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మండలిలో వైసిపి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్య నారాయణ పార్టీ తరపున కీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి సూటిగా ప్రశ్నలు సంధిస్తూ మండలిలో తన వాయిస్ ను వినిపిస్తున్నారు. కట్ చేస్తే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో ప్రస్తుతం మండలి సమావేశాలకు దూరమయ్యే అవకాశం ఉంది. బొత్స అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను: పవన్ కల్యాణ్ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ త్వరగా ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను‘ అని తన ప్రకటనలో పేర్కొన్నారు.
‘స్పిరిట్’లో పవర్ ఫుల్రోల్లో ఒబెరాయ్
రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాన్- వరల్డ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు వివేక్ ఒబెరాయ్. మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్లో ఒబెరాయ్ స్టైలిష్ లుక్లో కనిపించి తన పాత్ర ఎంత ప్రభావవంతంగా ఉండబోతోందో చూపించారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న ఆయన రాకతో కథలో కొత్త డైనమిక్ చేరింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో ఐశ్వర్య దేశాయ్ ను పరిచయం చేశారు మేకర్స్. ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతుంది. యానిమల్ సంచలన విజయం తర్వాత నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి బోల్డ్ క్రియేటివ్ విజన్తో స్పిరిట్ను రూపొందిస్తున్నారు. ప్రభాస్ కు జోడిగా తృప్తి డిమ్రి కనిపించనున్నారు. భారీ స్థాయిలో, అద్భుతమైన ఎమోషన్స్ తో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించబోతోంది. 8 భాషల్లో విడుదల కానున్న ఈ పాన్- వరల్డ్ ఎంటర్టైనర్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. గుల్షన్ కుమార్ టి సిరీస్ సమర్పణలో, టి-సిరీస్ ఫిలిమ్స్ , భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కథ, ఎడిటింగ్, దర్శకత్వం మొత్తం సందీప్ రెడ్డి వంగా వహిస్తుండగా, భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
అంతర్జాతీయ సైబర్క్రైమ్ నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: అంతర్జాతీయ సైబర్క్రైమ్ నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా.. చెన్నై విమానాశ్రయంలో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు విశాఖకు చెందిన పెదపూడి ప్రసన్నకుమార్గా గుర్తించారు. మ్యాట్రిమోనియల్, క్రిప్టో ఇన్వెస్ట్ మోసం కేసులో అతడు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. షాదీ డాట్ కామ్ ద్వారా నకిలీ ప్రొఫైల్ సృష్టించి బాధితులతో పరిచయం ఏర్పరచుకున్నాడని పోలీసులు తెలిపారు. యువతిగా నటిస్తూ పెళ్లి చేసుకుంటానన్న హామీతో మోసాలు చేశాడని అన్నారు. నకిలీ క్రిప్టో ట్రేడింగ్ ద్వారా పెట్టుబడి పెట్టాలని ప్రలోభాలకు గురి చేసినట్లు గుర్తించారు. ఒక బాధితుడి నుంచి రూ.11 లక్షలు కాజేసినట్లు విచారణలో తేలింది. విత్డ్రాకు ప్రయత్నించే వారిని మరింత పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. అక్రమంగా సుమారు 500 సిమ్లు సేకరించి నకిలీ ఖాతాలను తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల ముఠాతో ఈ నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.
పేదల ఇళ్లు కూల్చడంలో రేవంత్ రెడ్డి పోటీ: మంత్రి బండి సంజయ్
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు నిర్మించిందని, మోదీ పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇచ్చే విషయంలో పోటీ పడుతుంటే పేదల ఇళ్లను కూల్చడంలో రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలు నానా కష్టాలు పడుతూ అప్పోసప్పో చేసి బతకడానికి ఇళ్లు కట్టుకుంటే వాటిని కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పనితీరు మారకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారని చెప్పారు. తక్షణమే పేదల ఇళ్ల కూల్చివేతను ఆపాలని, లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు న ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతలు త ప్ప సాధించింది ఏముంది? నానా కష్టాలుపడి పేదలు ఇండ్లు కట్టుకున్నరు. పోనీ ఇల్లు కటే ్టటప్పుడు అధికారులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అప్పొసప్పో చేసి బతకడానికి చిన్ని ఇల్లు కట్టుకుంటే ఆ పేదల ఇండ్లను కూల్చడానికి మీకు మనసెలా వచ్చింది? పేదలు ఇండ్లు కట్టుకోవద్దా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు కట్టించా మన్నారు. మోదీ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టడానికి ముందుకు వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేదల ఇండ్లను కూల్చే విషయంలో పోటీ పడుతోందన్నారు. ప్రభుత్వం “రైతు భరోసా” ఇవ్వడం లేదు : రాష్ట్ర ప్రభుత్వం “రైతు భరోసా” ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారన్నారు.మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా వేస్తామని ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. ఇలాంటి హామీలు చాలా ఇచ్చారని మాట తప్పారని, వాస్తవానికి ముఖ్యమంత్రి నోటి నుండి ఏ మాట వచ్చినా శాసనం కావాలన్నారు. కానీ రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారన్నారు. నమ్మించి ఓట్లేయించుకుని మోసం చేస్తారన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పి, రూ.9 వేల కోట్లు రెడీగా ఉన్నాయని పదేపదే చెబుతూ వార్తలు రాయించుకున్నారన్నాని, కానీ ఇంతవరకు ఆ ఊసే లేదన్నారు. అధికారంలోకి వచ్చాక రైతు భరోసా ఒక దఫా ఎగ్గొట్టారన్నారు. ఎన్నికలొ స్తే ఏదో ఒక హామీని తూతూ మంత్రంగా అమలు చేసినట్లు నటించి వార్తలు రాయించు కోవడ, ఆ ఎన్నికలైపోగానే వాటిని మర్చిపోవడం వాళ్లకు అలవాటైందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చే సమయంలో మళ్లీ ఏదో ఒక డ్రామాలాడతారన్నారు. తక్షణమే రైతు భరోసాను చె ల్లించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి : రాష్ట్ర ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో 6 గ్యారంటీలను అమలు చేయకపోయినా, డీఏలు, ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోయినా ఓట్లేశారన్నారు. దీంతో కాం గ్రెస్ నేతల్లో అహంకారం పెరి గిపోయిందన్నారు. ఏ హామీని అమలు చేయకపోయినా ఓట్లే స్తున్నారని చెబుతున్నారన్నారు. అందుకే ఈసారి ప్రజలంతా కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. రైతు భరోసా గురించి కేబినెట్ లో ఎందుకు చర్చించలేదన్నారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒక్కటే : కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, మున్సిపల్ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేశాయని, కలిసే పదవులు పంచుకున్నాయన్నారు. ఇప్పడు ఒకరికి ఒకరు పడనట్లు డ్రామాలాడుతున్నారన్నారు. మరి వాళ్లిద్దరికి ఎక్కడ చెడిందో వాళ్లే చెప్పాలన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు గత ఎన్నికల్లో మాట్లాడారని, మేం కూడా అదే చెప్పామన్నారు. ఈ అంశంపై విచారణ జరిపే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే మేం విచారణ చేపట్టేందుకు సిద్ధమని ఆ మేరకు లేఖ రాయాలని సీఎంను కోరుతున్నానన్నారు.
కోల్కతాలో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం
బెంగాల్ రాజధాని కోల్కతాలో శుక్రవారం మధ్యాహ్నం 1.22 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.5 తీవ్రత నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్ ) వెల్లడించింది. ఇది 35 కిమీ (21.75 మైళ్లు) లోతులో సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. కోల్కతా నగరం, పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు ఈ ప్రకంపనలు కొనసాగాయి. ఎత్తైన నివాస సముదాయాలు, రద్దీగా ఉండే మార్కెట్లలో భూమి కంపించడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. దీనివల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. స్థానికులు మాత్రం ఇళ్లల్లో సీలింగ్ ఫ్యాన్లు ఊగడం, ఫర్నీచర్ కంపించడం, కిటికీలు కొట్టుకోవడం వంటివి సంభవించాయని చెప్పారు. బహుళ అంతస్తుల భవనాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్గా మారాయి. భారత్బంగ్లాదేశ్ సరిహద్దు సమీపం లోని అనేక జిల్లాలపై ఈ భూకంపం ప్రభావం ఉన్నట్టు ఎన్సీఎస్ వివరించింది.
నటుడు విజయ్కు విడాకుల నోటీసులు
టీవీకే పార్టీ అధినేత ,నటుడు విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక సినీ నటితో విజయ్కు వివాహేతర సంబంధమే కారణమని విడాకుల పిటిషన్లో సంగీత పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణకు కోర్టు అంగీకరించింది. ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్కు నోటీసులు జారీ చేసింది. విజయ్, సంగీత వివాహం 1999 లో జరిగింది. విజయ్ రెండేళ్ల క్రితం రాజకీయాల్లో అడుగు పెట్టిన తరువాత విజయ్ వివాహేతర సంబంధంపై అనేక ఆరోపణలు వచ్చాయి. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్ మాట్లాడుతూ త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని వ్యాఖ్యానించడం వివాదాలకు దారి తీసింది. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుతున్నారని విజయ్ విమర్శించారు. త్రిష కూడా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల కోసం వాడుకోకూడదని సూచించింది. దీంతో నాగేంద్రన్ తరువాత క్షమాపణలు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ వివాదం నటుడు విజయ్ రాజకీయ భవిష్యత్పై కొంతవరకు ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.
అఫ్ఘన్పై ఇక బహిరంగ యుద్ధమే: పాక్ రక్షణ మంత్రి
ఇరుగుపొరుగు దేశాలు పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ మధ్య పోరు తీవ్రతరం అయింది. తమ దేశం అఫ్ఘనిస్థాన్పై బహిరంగ ప్రత్యక్ష యుద్ధానికి దిగిందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా శుక్రవారం ప్రకటించారు. తరచూ దాడులకు దిగుతూ, పౌరుల ప్రాణాలను హరిస్తూ వచ్చిన అఫ్ఘనిస్థాన్ తమ ఓపికను పరీక్షిస్తూ వచ్చిందని, ఇక తమ బహిరంగ యుద్ధాన్ని ఎదుర్కొవాలని ఆయన సవాలు విసిరారు. పాక్ సేనలు ఇప్పటికే 130 మందికి పైగా తాలిబన్ సాయుధులు హతులయ్యారని ఇస్లామాబాద్లో అధికార వర్గాలు ధృవీకరించాయి. రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ 2611 కిలోమీటర్ల సరిహద్దును దురంద్ రేఖగా వ్యవహరిస్తారు. అయితే అఫ్ఘన్ అధికారికంగా దీనిని గుర్తించలేదు. ఇప్పుడిక తమది ప్రత్యక్ష యుద్ధమే. ఇప్పుడు ఇక దమా దమ్ మస్త్ కలందర్ అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. పాక్ సైన్యం సముద్ర మార్గం మీదుగా విరుచుకుపడదు. ఎంతైనా పొరుగు దేశం కదా? బలాలు బలహీనతలు అని తెలుసు. వీటిని గుర్తించే తగు విధంగా విరుచుకుపడుతామని ప్రకటించారు. ఇప్పటికే పాక్ సైన్యం ఆపరేషన్ గజబ్ లిల్ హక్ పేరిట అఫ్ఘన్లోని పలు ప్రాంతాలపై దాడులకు దిగింది. తమ వైమానిక స్థావరాలు, గ్రామాలపై తాలిబన్ల దాడులకు ప్రతీకారంగానే ఇప్పుడు యుద్థానికి దిగింది. అటువైపు నుంచి కవ్వింపు చర్యలు సాగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? ఏరిపారేస్తామని రక్షణ మంత్రి హెచ్చరించారు. దమా దమ్ మస్త్ కలందర్ సింధ్ సూఫీ ప్రవక్త లాల్ షెబాజ్ కలందర్ ఆధ్మాత్మిక గీతాన్ని ప్రస్తావించారు. రక్షణ మంత్రి ఆసిఫ్ ప్రకటనకు అఫ్ఘన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి నుంచి స్పందన వెలువడింది. సరిహద్దుల వెంబడి తమ సేనల ప్రతీకార దాడుల్లో 55 మంది పాక్ సైనికులు చనిపోయారని తెలిపారు. పాక్ సైన్యపు రెండు ప్రధాన స్థావరాలను,19 చెక్పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మరో వైపు పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ టర్కీ , సౌదీ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని వివరించారు. పాక్ ..సౌదీ మధ్య గత ఏడాది సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మూడో దేశం దాడులు జరిగితే వెంటనే పరస్పరం సహకరించాలని ఈ ఒప్పందంలో నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పుడు పాకిస్థాన్కు సౌదీ , టర్కీ నుంచి సాయం అందుతుందని వెల్లడైంది. అయితే ఈ రెండు దేశాలూ నేరుగా యుద్ధంలో చేరే అవకాశాలు లేవు. తమ దేశం శాంతి, దేశ ప్రాదేశికత సమగ్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పాక్ అధ్యక్షులు అసీఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. తమ భూభాగాలపై దాడులకు దిగి అప్ఘన్ చాలా పెద్ద తప్పు చేసింది. ఇక తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్, సిసోడియా విడుదల
ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. వారిని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారంనాడు కేసు నుంచి విడుదల చేసింది. కోర్టు 23 మంది నిందితులపై పెట్టిన కేసులను కొట్టివేసింది. ప్రాసిక్యూషన్ కేసుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాలు, కుట్ర ఆరోపణలను స్పష్టంగా నిరూపించలేకపోయిందని పేర్కొంది. ఎక్సైజ్ విధానం కేసు కారణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సిసోడియా లు జైలు పాలైన విషయం తెలిసిందే. తీవ్రమైన నేరారోపణలు చేసినప్పుడు బలమైన భౌతిక ఆధారాలను కూడా సమర్పించవలసి ఉంటుందని , కుట్రపూరిత పాత్రను ఆపాదించినంత మాత్రాన కేసు నిలబడదని కోర్టు పేర్కొంది. ప్రాసిక్యూషన్ ఆరోపణలకు ఆధారాలు లేవని తేలితే, ఉన్నత పదవులపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని కూడా కోర్టు హెచ్చరించింది. ఎక్సైజ్ పాలసీ వెనుక ఎలాంటి విసృ్తతమైన కుట్ర లేదా, నేరపూరిత ఉద్దేశ్యం లేదని కోర్టు పేర్కొంది. నిందితుడిని అప్రూవర్ గా మార్చడం ద్వారా నేరం చేసినవారి సంఖ్యను పెంచడం వంటి దర్యాప్తు పద్ధతుల పట్ల న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. అటువంటి పద్దతులు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని కోర్టు పేర్కొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఇతరులను విడుదల చేస్తూ కోర్టు పది ముఖ్యమైన విషయాలను పేర్కొంది. 1. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లేవు. కుట్రలో కేజ్రీవాల్ కు ఆపాదించే ఖచ్చితమైన ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు సంస్థ ధ్రువీకరించకుండా, ఒక సాక్షి ఆలస్యంగా ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన పేరు ప్రధానంగా బయటకు వచ్చింది. 2. సాక్షి బలహీనమైన వాంగ్మూలంపై ఆధారపడడం. కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణ ఒకే ఒకవాక్యం ఆధారంగా ఉంది. ఆధారాలు లేకుండా ఇది మాత్రమే కుట్రను నిరూపించబోదని కోర్టు పేర్కొంది. 3. విధాన పరమైన మార్పులు ప్రత్యక్షపాత్రకు ఆధారాలు కావు. కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎక్సైజ్ విధానాన్ని మార్చారని, ప్రయోజనాలు పొందారని చూపే ఆధారాలు లేవు, కేబినెట్ నిర్ణయాన్నిఆమోదించడం నేరపూరిత కుట్రగా పరిగణించబడదు. 4. దర్యాప్తులో పలు అంశాలు సరైనవి కావని తేలింది. దర్యాప్తు లోపాలపై న్యాయమూర్తి తీవ్రంగా వ్యాఖ్యానించారు. కొన్ని చర్యలు ముందస్తు తారుమారులా కన్పించాయనడం న్యాయమైన దర్యాప్తు కాదని పేర్కొన్నారు. 5. దర్యాప్తు అధికారిపై శాఖ పరమైన చర్యకు సిఫార్సు. ఆధారాలు లేకుండా నిందితుడిని అరెస్ట్ చేసినందుకు దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యలు చేయాలని కూడా కోర్టు సిఫార్సు చేసింది. సాక్ష్యాధారాల ఆధారంగా ప్రాసిక్యూషన్ సాగలేదని కోర్టు ఆందోళన ను ఇది బహిర్గతం చేసింది. 6. దాదాపు 36 పేజీల జిఎంఓ దర్యాప్తు కుప్పకూలింది. కుట్రకు సంబంధించి చూపిన 36 పేజీల ప్రింటవుట్ కీలకమైన ప్రాసిక్యూషన్ వాదన రికార్డులకు విరుద్ధంగా ఉన్నట్లు కన్పించింది. 7.సమావేశాలపై స్వతంత్ర ధ్రువీకరణ లేదు. విధాన చర్చలకు సంబంధించి ప్రధానంగా డాక్యుమెంటరీ లేదా ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ లేకుండా ఆమోద ప్రకటనలను చేశారు. 8. పుకార్లు, విరుద్ధ ప్రకటనలు ఈ కేసులో అనేక ఆరోపణలు సాక్ష్యాల వాంగ్మూలాలపై ఆధారపడిఉన్నాయి. అభియోగ దశలో ప్రాసిక్యూషన్ కేసును బలహీనపరచింది. 9. డిమాండ్ లేదా సరైన రుజువు లు లేవు. అవినీతి ఆరోపణలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం కింద అవసరమైన డిమాండ్ రుజువు లేకపోవడాన్ని కోర్టు గుర్తించింది. 10. స్పష్టమైన ప్రమాణాలను పాటించలేదు.అభియోగాలు మోపే దశలో కోర్టు రికార్డుల్లో ఉన్న విషయాల ఆధారంగా తీవ్రమైన అనుమానంను గుర్తించాలి. సినియర్ రాజకీయ కార్యకర్తలతో సహా నిందితులకు సంబంధించి ప్రాసిక్యూషన్ స్పష్టమైన రుజువులు సమర్పించలేకపోయిందని న్యాయమూర్తి పదేపదే పేర్కొన్నారు. సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల కోర్టు సీబీఏ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకోడానికి కోర్టు తిరస్కరించింది.
వెస్టిండీస్ని అంత తేలికగా తీసుకోవద్దు: సునీల్ గవాస్కర్
టి-20 ప్రపంచకప్లో ఆదివారం భారత్కి అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. సెమీస్కి చేరుకోవాలంటే.. వెస్టిండీస్తో జరిగే ఈ మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది. మరోవైపు వెస్టిండీస్కి కూడా ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యం.. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ భారత జట్టుకు పలు కీలక సూచనలు చేశారు. వెస్టిండీస్ జట్టును తక్కువ అంచనా వేయొద్దని ఆయన పేర్కొన్నారు. ‘‘దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో భారత బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బతింది. దీంతో టాప్ ఆర్డర్లో కుడి-ఎడమ కాంబినేషన్ను అమలు చేుయాల్సిన పరిస్థితి వచ్చింది. గత మ్యాచ్ల నుంచి పాఠాలను నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. ఇప్పుడు విండీస్తో సవాల్ భిన్నమైంది. వారు దేనిని తేలిగ్గా తీసుకోరు. వారి బ్యాటర్లంతా మంచి ఫామ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లూ రిథమ్తో బౌలింగ్ చేస్తున్నారు. ఏదైనా పొరపాట్లు చేస్తే శిక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. వారిని కట్టడి చేయాలంటే భారత్కు సరైన ప్లాన్ అవసరం. మరీ ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్పై ఓ కన్నేయాలి. తొలి బంతి నుంచే భారీ షాట్లకు దిగేస్తారు. ఆదివారం మ్యాచ్ తప్పకుండా సూపర్గా ఉండబోతుంది’’ అని గవాస్కర్ అన్నారు.
ఆయేషా మీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించిన సిబిఐ
ఎపిలో బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సుదీర్ఘ కాలంగా సిబిఐ ఆధీనంలో ఉన్న ఆయేషా శరీర అవశేషాలను విజయవాడలోని సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో గుండెలు అవిసేలా రోదించిన తల్లిదండ్రులను చూసి అక్కడి వారు చలించిపోయారు. ఆయేషా మీరా హత్య జరిగి సుమారు రెండు దశాబ్దాలు కావస్తున్నా, ఇప్పటికీ అసలు హంతకుడెవరో తేలకపోవడం గమనార్హం. గతంలో ఈ కేసులో సత్యంబాబును నిందితుడిగా భావించినప్పటికీ, కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టినప్పటికీ సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసును మూసివేసు ్తన్నట్లు కోర్టుకు వెల్లడించింది. తమ బిడ్డకు న్యాయం జరగలేదని, కనీసం ఆమె అవశేషాలనైనా అప్పగించాలని తల్లిదండ్రులు కోరడంతో కోర్టు ఈ మేరకు అనుమతినిచ్చింది. 2019లో ఈ కేసు విచారణలో భాగంగా శాస్త్రీయ ఆధారాల కోసం ఆయేషా మీరా భౌతిక కాయానికి సిబిఐ రీ-పోస్టు మార్టం నిర్వహించింది. ఆ సమయంలో ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఆమె శరీర భాగాలు, అవశేషాలను సేకరించి భద్రపరిచారు. ఇప్పుడు కేసు విచారణ ముగియడంతో ఆ అవశేషాలను తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ భాషాలకు అప్పగించారు. ఈ అవశేషాలను తమ సొంత ఊరు తెనాలికి తీసుకువెళ్లి అక్కడ ఇస్లాం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయేషా మీరా తల్లిదండ్రులకు మద్దతుగా మహి ళా , మానవ హక్కుల సంఘాలు కోర్టు వద్ద ఆందోళన చేపట్టాయి. సాక్ష్యాలను తారుమారు చేసిన అధికారులు, అసలు నిందితులపై ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదని వారు మండిపడ్డారు. 19 ఏళ్ల పోరాటం తర్వాత కూడా హంతకుడిని పట్టుకోలేకపోవడం వ్యవస్థల వైఫల్య మేనని ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. డబ్బు, అధికారం ఉన్న వారిపై ఆయేషా తల్లిదండ్రులు ఇన్నేళ్లుగా చేసిన పోరాటం సామాన్యమైనది కాదని బాధితులకు మద్దతుగా నిలిచిన నేతలు కొనియాడారు. ఎన్నో బెదిరింపులు ఎదురైనా, ఏ ప్రభుత్వాలు అండగా నిలవకపోయినా తమ బిడ్డకు న్యాయం కోసం వారు అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు. చివరికి హంతకుడిని శిక్షించలేకపోయినా, తమ బిడ్డ అవశేషాలకైనా గౌరవ ప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం లభించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆవేదన ఆధారాలు ఉన్నాయని, ఎఫ్ఐఆర్లో వయస్సు కూడా తప్పుగా నమోదు చేశారని ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. నేరం జరిగిన తర్వాత అన్ని తుడిచేశారని, అయేషా కేసులో పోలీసులు పూర్తిగా నిందితులకు సహకరించారని ధ్వజమెత్తారు. ఆయేషా అవశేషాల కోసం కోర్టుల చుట్టూ ఏళ్ల క్రితం నుంచి తిరిగామని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతి గృహంలో 2007లో బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన 9 నెలల తర్వాత 2008 ఆగస్టులో సత్యంబాబును ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సత్యంబాబుకు జీవితఖైదు, అత్యాచారం నేరం కింద 10 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ 2010 సెప్టెంబర్లో తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సత్యంబాబు 2010 అక్టోబర్లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ 2017 మార్చి 31న తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఆయేషా తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 నవంబర్లో ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కేసు మళ్లీ మొదటికే వచ్చినట్ల యింది. ఇప్పుడు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు కొట్టేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. తమకు న్యాయం జరగలేదంటూ ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
గ్రామపంచాయతీలకు రూ. 389 కోట్లు విడుదల
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులు రూ. 389 కోట్లు విడుదల చేశారు. ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికల తరువాత అభివద్దే లక్షంగా పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిధులు విడుదలతో పంచాయతీల్లో అభివృద్ధి వేగంగా ముందుకు సాగనుందని నూతనంగా కొలువుదీరిన సర్పంచ్లు సంతోషం వ్యక్తం చేస్తోన్నారు.
సౌందరరాజన్ మృతి కలచివేసింది: కెసిఆర్
చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ మృతి పట్ల మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్లు సంతాపం వ్యక్తం చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, ‘చిలుకూరు సౌందరరాజన్’ గా సుపరిచితులైన ఆయన మృతి తమను ఎంతో కలిచివేసిందని వారు పేర్కొన్నారు. చిలుకూరు క్షేత్ర అభి వృద్ధిలో, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయడంలో సౌందరరాజన్ పోషించిన పాత్ర మరువలేనిదని వారు కొని యాడారు. కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సమాజంలోని మూఢనమ్మకాలపై పోరాడటం, దళిత గోవిందం వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక సమరసతకు ఆయన కృషి చేశారని వారు గుర్తు చేసుకున్నారు.
కెపిహెచ్బిలో గజం భూమి ధర రూ. 2.65 లక్షలు
కెపిహెచ్బిలో గజం భూమి ధర రూ. 2.65 లక్షలు పలికింది. 1,400 ఎస్ఎఫ్టి ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్కు రూ. 1.10 కోట్ల ధర పలకడంతో మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు, ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. భూములు, ఫ్లాట్ల విక్రయంతో రూ.24.26 కోట్ల మేర ఆదాయం హౌజింగ్బోర్డుకు సమకూరింది. ఈ నేపథ్యంలోనే హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్ల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు పోటీ పడ్డారు. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది, డిమాండ్ ఉన్న కెపిహెచ్బి ప్రాంతంలోని ప్లాట్లు, ఫ్లాట్లను బహిరంగం వేలంలో రికార్డు ధరలకు కొనుగోలు చేశారు. ఫేజ్-1, 2 లోని ధర్మారెడ్డి కాలనీలోని 4 ఓపెన్ ప్లాట్లు, ఫేజ్ -15 లోని సంపూర్ణం అపార్ట్మెంట్ లోని 8 ఫ్లాట్లకు శుక్రవారం హౌజింగ్బోర్డు అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. ఓపెన్ ప్లాట్ల ద్వారా రూ.15.81 కోట్లు మొత్తం 40 మంది కొనుగోలుదారులు పాల్గొన్న ఈ వేలం పాటలో ఎల్ఐజి కేటగిరీకి చెందిన ప్లాట్ చదరపు గజం కనీస ధర రూ. 1.30 లక్షలుగా నిర్ధారించగా, చదరపు గజం రూ.2.65 లక్షలకు అమ్ముడుపోయిందని, మరో ప్లాట్ ను చదరపు గజం రూ.2.41 లక్షలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలో తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకోడానికి బిడ్డర్లు (కొనుగోలుదారులు) పోటీ పడ్డారని ఆయన తెలిపారు. అదే విధంగా సంపూర్ణం అపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు రూ .90 లక్షలను అప్సెట్ ధరగా నిర్దారించగా వీటిని కొనుగోలు చేయడానికి కూడా బిడ్డర్లు పోటీ పడి గరిష్టంగా రూ.1.10 కోట్లు, అలాగే ఇతర ఫ్లాట్లను రూ.1.08 కోట్లు, రూ.1.07 కోట్లు, రూ. 1.06 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ విధంగా శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ. 24.26 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వైస్చైర్మన్ విపి గౌతం వివరించారు. ఇందులో ఓపెన్ ప్లాట్ల ద్వారా రూ.15.81 కోట్లు, సంపూర్ణం అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల ద్వారా రూ. 8.45 కోట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం..
ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం.. కర్నూలు నగరంలో 722 మ్యాట్రిక్స్
కేంద్రీయ విద్యాలయంలో సందర్శన విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటుకేంద్ర జాయింట్ సెక్రటరీ దేవేంద్ర
ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కల్లు సొసైటీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం బరిగల ఎల్లమ్మ కుటుంబానికి ఆర్థిక సాయంమానవత్వం చాటుకున్నచంద్రయ్య,
apcm 5formulae : ఇక 5 సూత్రాల సేధ్యం Andhra Prabha Assembly
apcm 5formulae : ఇక 5 సూత్రాల సేధ్యం Andhra Prabha Assembly
పాక్-ఆఫ్ఘన్ మధ్య యుద్ధం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య భగ్గుమన్న సరిహద్దు వివాదం55 మంది
కెటిఆర్.. ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును గౌరవించాలి: కవిత
హైదరాబాద్: తాను చెప్పింది నిజమని ఇవాళ కోర్టు తీర్పుతో తేలిందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. లిక్కర్ కేసు నుంచి తాను నిర్దోషిగా బయటపడటంపై ఆమె మాట్లాడారు. తనను ఐదు నెలలు జైలులో ఉంచి మానసికంగా వేధించారని.. తప్పు తేలకుండానే తన వ్యక్తిత్వ హననం చేశారని మండిపడ్డారు. ‘‘ఎక్స్లో నా అన్న కెటిఆర్ పెట్టిన పోస్టు చూశాను. నాపై పెట్టిన కేసు వల్లే బిఆర్ఎస్ ఓడిందన్నట్లుగా పోస్టు చేశారు. బిఆర్ఎస్ నేతలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి నేను కారణమా? ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు, ఇవ్వకపోవటం బిఆర్ఎస్ ఓటమికి కారణం. అభ్యర్థులను మార్చకుండా మళ్లీ వాళ్లకే టికెట్లు ఇవ్వటం కారణం. దోపిడీదారులకే మళ్లీ టికెట్లు ఇచ్చి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణే పార్టీ ఓటమికి కారణం. ఇవాళ కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడుతున్నారు. బిఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని చూడటం కరెక్ట్ కాదు. కెటిఆర్.. ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును గౌరవించాలి. వాస్తవాలు ఒప్పుకొని మీ లోపాలను సరి చేసుకోవాలి. ఎన్నికలప్పుడు ఏం జరిగిందో మర్చిపోయి నన్ను బ్లేమ్ చేయొద్దు. బిఆర్ఎస్ పార్టీ నుంచి నాకు ఎప్పుడూ మద్ధతు రాలేదు. నాపై పెట్టిన కేసులపై మూడేళ్లుగా ఒంటరిగానే పోరాడుతున్నా. మరో మూడు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నా. పార్టీ పెట్టే ముందే కోర్టు తీర్పు రావటం సంతోషకరం. సొంతంగా పార్టీ పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. పిడికెడు మందితోనే రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా మారుతా. బిజెపి, బిఆర్ఎష్ రెండు ఒకటే మళ్లీ చెప్పాల్సిన పని లేదు. కేవలం ఒక వ్యక్తి వల్ల ఓడిపోయేంత బలహీనంగా పార్టీ ఉందా? వైఫల్యాలను విస్మరించి ఓటమిని నా మెడలో వేస్తున్నారు. ఆడబిడ్డను అవమానించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని కవిత అన్నారు.
ETV Win announces 9 new Titles
ETV Win is slowly emerging as a prominent digital platform for the Telugu audience. Standing before the wave of digital giants like Netflix, Amazon Prime and others is not so easy. ETV Win has been picking up interesting projects that will appeal to the Telugu households and the family crowds. On the third anniversary of […] The post ETV Win announces 9 new Titles appeared first on Telugu360 .
ఇది తెలంగాణ వారసత్వం జీఐ ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ జిష్ణు
తొలిసారి ఫైనల్కు.. విజయం దిశగా జమ్ముకశ్మీర్
హుబ్లీ: తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్కు చేరిన జమ్ము కశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. తొలిసారి ఫైనల్కు చేరుకున్న ఈ జట్టు విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో జమ్ము కశ్మీర్ జట్టు 584 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో కర్ణాటక 293 పరుగులకే ఆలౌటై 291 పరుగుల వెనుకంజలో పడిపోయింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్ము కశ్మీర్ జట్టు 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ పకడ్బందీగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. 160 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సుతో 94 పరుగులు చేసి ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో జమ్ము కశ్మీర్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 477 పరుగల ఆధిక్యంలో ఉంది. క్రీజ్లో ఇక్బాల్తో పాటు సాహిల్ (16) ఉన్నాడు. ఈ మ్యాచ్లో జమ్ము గెలుపు ఇక లాంఛనమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇసుక తోడేళ్లపై పోలీస్ ఫైర్ స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
సమాచార హక్కు చట్టం దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు
సమాచార హక్కు చట్టం దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ
ఉపాధ్యాయ వేతనాలపై విద్యా కమిషన్ వ్యాఖ్యలు బాధాకరం
ఉపాధ్యాయ వేతనాలపై విద్యా కమిషన్ వ్యాఖ్యలు బాధాకరం తొర్రూరు, ఆంధ్రప్రభ : తెలంగాణ
గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు సహకరించాలి..
మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు సహకరించాలని ఎంపీడీవో గంగుల
దక్షిణ భారత చెస్ పోటీలకు ఎంపికైన అనంత మెడికోలు
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : తమిళనాడు భారతిదాసన్ యూనివర్సిటీలో మార్చ నెల 2వ తేది నుంచి 6వ తేది వరకు జరగనున్న దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాలచెస్ పోటీలకు అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు బి. దీపక్ మరియు కె. లోకేష్ నాయక్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తరుపున ద్వితీయ, తృతీయ స్థానము లో ఎంపికై ఈ పోటీలలో పాల్గొనడం కళాశాలకు గర్వకారణమని, చెస్ లో క్రీడాకారులు అద్భుత ఆటతీరు కనబరచడం […] The post దక్షిణ భారత చెస్ పోటీలకు ఎంపికైన అనంత మెడికోలు appeared first on Visalaandhra .
విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలి
విశాలాంధ్ర – ధర్మవరం : విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని, ఇటువంటి అవకాశం కేవలం ఎన్సిసి ద్వారానే సాధ్యమవుతుందని పట్టణ ప్రముఖులు, టిడిపి నాయకుడు సంధ రాఘవ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్సిసి విభాగం రావడం జరిగింది. ఈ ఎన్సిసి లో ప్రభుత్వం 50 మంది ఎన్సిసి నేర్చుకునే విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేసే భాగంగా ముఖ్యఅతిథిగా వారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సంధ రాఘవ తో పాటు, […] The post విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలి appeared first on Visalaandhra .
దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించండి…
మోదీకి సవాల్ విసిరిన కేజ్రీవాల్లిక్కర్ కేసులో క్లీన్చిట్ తర్వాత కేజ్రీవాల్ తొలి ప్రెస్ మీట్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని నాశనం చేసేందుకే కుట్ర పన్నారని ఆరోపించారు. దమ్ముంటే ఢిల్లీలో వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని కేంద్రానికి సవాల్ విసిరారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో క్లీన్చిట్ లభించిన అనంతరం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ […] The post దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించండి… appeared first on Visalaandhra .
Vivek Oberoi From Spirit: Icy Arrogance
Rebel Star Prabhas’ action entertainer Spirit, directed by Sandeep Reddy Vanga, is fast progressing with its shoot. As recently announced by the makers, the movie will grace the cinemas worldwide in nearly one year on March 5th, 2027. The makers who earlier unveiled first look of Prabhas and actress Tripti Dimri, have now unveiled the […] The post Vivek Oberoi From Spirit: Icy Arrogance appeared first on Telugu360 .
Kavitha : కవిత కుటుంబానికి, పార్టీకి మరింత దూరం అయ్యారా?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టులో క్లీన్ చిట్ లభించింది
‘స్పిరిట్’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్ ఫస్ట్లుక్ విడుదల
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా.. సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ని అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు సందీప్. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ ఫస్ట్లుక్ను ఆయన విడుదల చేశారు. ఈ పోస్టర్లో వివేక్ చాలా పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తెరపై ఇప్పటివరకూ చూడని సరికొత్త అవతారం ప్రభాస్ మనకు కనిపించనున్నారు. ఓ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పోలీసు కథతో పాటు, మాఫియా నేపథ్యాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా.. వివేక్ ఓబెరాయ్ విలన్గా నటిస్తున్నారు. సీనియర్ నటి కాంచన కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొమ్మిది భాషల్లో మార్చి 5, 2027న విడుదల కానుంది. Presenting you all, the antagonist of the film SPIRIT. Mr. Vivek Anand Oberoi. pic.twitter.com/e0imSbSDmm — Sandeep Reddy Vanga (@imvangasandeep) February 27, 2026
రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడలలో సత్తా చాటిన విద్యార్థులు
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని నైన్ పాక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు
26yrs |సంగీత నుంచి విడాకుల పిటిషన్..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్కు
శావల్యాపురం, ఆంధ్రప్రభ : సైన్స్ తోనే మానవ జీవితం ముడిపడి ఉందని వినుకొండ
కేరళ స్టోరీ - 2 సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
కేరళ స్టోరీ - 2 సినిమా విడుదలకు హైకోర్టుగ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
వైసీపీ నేత బుర్రి బాబురావుకు నివాళులు..
వైసీపీ నేత బుర్రి బాబురావుకు నివాళులు.. విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ తూర్పు
ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ భవన్లో మర్యాదపూర్వక భేటీ..
ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ భవన్లో మర్యాదపూర్వక భేటీ.. విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఏపీఎస్ఆర్టీసీ
చిలుకూరు బాలాజీ ఆలయ మాజీ పూజారి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ మరణించారు
Tamil actor Vijay is now a politician and he floated TVK. His political party is aiming to contest in all the Assembly constituencies of Tamil Nadu and the Election notification is due. Vijay is done with the shoot of his last film Jana Nayagan and the film releases soon. Vijay is completely occupied with his […] The post Big Shock for Vijay appeared first on Telugu360 .
బెల్లంపల్లిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం..
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి
సీఎం రిలీఫ్ ఫండ్ తో చిన్నారికి ప్రాణాధారం
సీఎం రిలీఫ్ ఫండ్ తో చిన్నారికి ప్రాణాధారం మోకాలి శస్త్రచికిత్సకు రూ.82,669 ఎల్ఓసీ
ఆజాద్ త్యాగం చిరస్మరణీయం.. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆంధ్రప్రభ, విజయవాడ రూరల్
నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలి
డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు వారి కార్యాలయంలో పట్టణంలోని ప్రైవేట్ డాక్టర్స్ తో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ , జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆదేశానుసారము సమావేశం నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి, అలాగే అనుమతి ఉండాలి, హాస్పిటల్స్ […] The post నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలి appeared first on Visalaandhra .
Bonda Uma |రూ.20 కోట్లతో డిగ్రీ కళాశాల సాధ్యం..
Bonda Uma | రూ.20 కోట్లతో డిగ్రీ కళాశాల సాధ్యం.. Bonda Uma
Breaking : టీవీకే చీఫ్ విజయ్ కు షాక్
తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే చీఫ్ విజయ్ కు షాక్ కుటుంబం నుంచి తగిలింది
Video : Vishnu Vinyasam Movie Review Analysis
The post Video : Vishnu Vinyasam Movie Review Analysis appeared first on Telugu360 .
రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాలలో రాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానితులను మొబైల్ స్కానింగ్ డివైస్ ద్వారా వారి యొక్క వేలిముద్రలతో తనిఖీ చేయడం జరిగిందని వారు తెలిపారు. దీనివలన ఎవరైనా గతంలో నేరాలలో పాల్గొనడం జరిగి ఉంటే వారిని ఈ యొక్క డివైస్ ద్వారా నేరస్థులుగా గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. ఇది నిరంతరము జరుగుతుందని తెలిపారు. అప్రమత్తమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. The post రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు appeared first on Visalaandhra .
క్రీడలతోనే సమాజానికి స్పూర్తి..
క్రీడలతోనే సమాజానికి స్పూర్తి.. విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల
ఆర్డీవో, ఎంపీడీవో, డీఎస్పీలు బదిలీ
వెంటనే రిలీవ్ కావాలని హైకోర్టు ఆదేశాలువిశాలాంధ్ర ధర్మవరం;; ఆర్డీవో మహేష్ ను, ఎంపీడీవో సాయి మనోహర్, డి.ఎస్.పి హేమంత్ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని కోరుతూ బదిలీ వేటు హైకోర్టు వేసింది. వివరాలకు వెళితే రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావడం జరిగిందని, అమరావతి లోని జిఏడీలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీఎస్పీ మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేసుకోవాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు […] The post ఆర్డీవో, ఎంపీడీవో, డీఎస్పీలు బదిలీ appeared first on Visalaandhra .
ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందిస్తా..
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థికంగా అండగా ఉంటామని విద్యార్థులకు
కవితకు న్యాయం జరిగిందంటూ కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్: మద్యం స్కామ్ పేరుతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఇదే కథ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి కారణమైందని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పుపై కెటిఆర్ ఎక్స్ లో స్పందించారు. మద్యం కేసులో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇవాళ న్యాయం జరిగిందని, తమ లీడర్లపై నమోదైన ప్రతి కేసు రాజకీయ కక్షలో భాగమేనని విమర్శించారు. నిజాలు బయటకు రానంతకాలం కాంగ్రెస్, బిజెపి దుష్ప్రచారాలను చూస్తూనే ఉంటామని తెలియజేశారు. ఏదేమైనా చివరకు న్యాయమే గెలుస్తుందని కెటిఆర్ పేర్కొన్నారు.
దళితులు ఆందోళన.. తుగ్గలి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం పరిధిలోని
Dacoit Rubaroo Video Song: Haunting Melody
Dacoit starring Adivi Sesh and Mrunal Thakur has created huge anticipation with regular buzzing updates during production and the teaser has transcended the expectations to next level. Now, the makers have released first single, Rubaroo, and it is a haunting melody. Bheems Ceciroleo, who is on fire in recent times, has yet again delivered a […] The post Dacoit Rubaroo Video Song: Haunting Melody appeared first on Telugu360 .
వైసీపీ తప్పులను వైఎస్సార్తో ముడిపెట్టడం సరికాదు
కాంగ్రెస్ నాయకుడు తుంపర్తి పరమేష్విశాలాంధ్ర ధర్మవరం;; వైసీపీ తప్పులను వైయస్సార్ తో ముడి పెట్టడం సరికాదు అని కాంగ్రెస్ నాయకుడు తుంపర్తి పరమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూఅత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుంది కూటమి తీరు ఇలా ఉందని,తిరుమల పవిత్రతపై పాపం వైసీపీ చేస్తే ,వైఎస్సార్కు చుట్టడం చంద్రబాబుకి భావ్యం కాదు అని తెలిపారు.చంద్రబాబు ఆరోపణలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలి అని, వైఎస్సార్కు చంద్రబాబు క్షమాణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్ ఏడు […] The post వైసీపీ తప్పులను వైఎస్సార్తో ముడిపెట్టడం సరికాదు appeared first on Visalaandhra .
ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అల్పాహారం పంపిణీ
శ్రీ సత్య సాయి సేవ సమితివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ఉదయం 300 మంది రోగులకు పాలు ,బ్రెడ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవాదళ్ సభ్యులు సాంబశివుడు, వెంకటేశు, వినోద్, రామాంజనేయులు, కాకుమని సాగర్ మాట్లాడుతూ పుట్టపర్తి బాబా ఆశీస్సులతో ఇటువంటి సేవా కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నేటి ఈ సేవ కార్యక్రమానికి పట్టణంలోని రామ్ […] The post ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అల్పాహారం పంపిణీ appeared first on Visalaandhra .
పీడీ ప్రమీల అవినీతి అక్రమాలపై అలుపెరగని పోరాటం
తప్పుడు పత్రాలతో ఫిర్యాదులను మూసివేయడంపై సాకే వినయ్ కుమార్ ఆగ్రహoవిశాలాంధ్ర ధర్మవరం;!శ్రీ సత్యసాయి జిల్లా మహిళా అభివృద్ధి , శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి బయటపడే వరకు పోరాటం కొనసాగుతుందని ధర్మవరం నియోజకవర్గ బాధ్యులు సాకే వినయ్ కుమార్ తెలిపారు. ధర్మవరం ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు ఎస్సీ జన సంఘం రాష్ట్ర బాధ్యులు మాల్యావంతం రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పీడీ ప్రమీలపై పోషకాహార పంపిణీ బిల్లుల వ్యవహారాల్లో అవినీతి జరుగుతున్నట్లు […] The post పీడీ ప్రమీల అవినీతి అక్రమాలపై అలుపెరగని పోరాటం appeared first on Visalaandhra .
ఎపి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
హైదరాబాద్: ఎపి మాజీ మంత్రి, వైసిపి నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడి నుంచి సిటీ న్యూరో సెంటర్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పిఆర్ సి కమిషన్ ను వెంటనే ప్రకటించాలి
ఏపీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ బి. కే. ముత్యాలప్ప డిమాండ్ విశాలాంధ్ర ధర్మవరం;; పి ఆర్ సి కమిషన్ వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ బి కే ముత్యాలప్ప డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం ఈనెల 26,27 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ధర్మవరం తాలూకా కేంద్రం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు.గత […] The post పిఆర్ సి కమిషన్ ను వెంటనే ప్రకటించాలి appeared first on Visalaandhra .
మునిసిపల్ ఆదాయాన్ని పెంచే విధంగా అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించాలి
పట్టణంలో వృధా నీటిని అరికట్టండి ఫ్లెక్సీల నిర్వహణలో మున్సిపల్ అధికారులు నియమ నిబంధనలతో ఆదాయాన్ని పెంచండి మున్సిపల్ పన్నుల వసూలులో వేగవంతాన్ని పెంచండి.. కౌన్సిల్ హాలులో కౌన్సిలర్లు డిమాండ్ విశాలాంధ్ర ధర్మవరం;; పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం పట్టణ సమస్యల పరిష్కారం పై కౌన్సిలర్లు తమదైన శైలిలో వ్యవహరించారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచే విధంగా అధికారుల కృషి ఎంతో అవసరమని, పట్టణములో నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టాలని, ఫ్లెక్సీ నిర్వహణలో నియమ నిబంధనలు పాటించే […] The post మునిసిపల్ ఆదాయాన్ని పెంచే విధంగా అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించాలి appeared first on Visalaandhra .
రాజుల శైలిలో విరోష్ పెళ్లి నగలతో మెరిసిన జంట #Virush #VijayDeverakonda #RashmikaMandanna
గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం…
మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చండూరు మార్కెట్
బేతంచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం
బేతంచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో కూలీలను తీసుకెళ్తున్న ఆటో బోల్తాడ్రైవర్ మృతి..
ఏపీకి మరో భారీ పరిశ్రమ..దేశంలోనే తొలి అమోర్ఫోస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్
ఏపీ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ముందడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి అమోర్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు. అమెరికా-జపాన్ దేశాలకు చెందిన ప్రొటీరియల్ అనే సంయుక్త సంస్థ ఈ ప్రాజెక్టును తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో స్థాపించనుంది. రూ.1350 కోట్ల భారీ పెట్టుబడితో ‘మెట్గ్లాస్ ఇండియా్ణ పేరుతో ఈ ప్లాంట్ను నిర్మించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్టీల్ ప్లాంట్ను ప్రొటీరియల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ అత్యాధునిక జపాన్ టెక్నాలజీని ఉపయోగించి […] The post ఏపీకి మరో భారీ పరిశ్రమ..దేశంలోనే తొలి అమోర్ఫోస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ appeared first on Visalaandhra .
రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం.. సిరీస్ కైవసం
హోబర్ట్: భారత మహిళ జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ని ఆస్ట్రేలియా మహిళ జట్టు కైవసం చేసుకుంది. హోబర్ట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 36.1 ఓవర్లలో చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్లో జార్జియా వోల్(101) శతకంతో చెలరేగగా.. లిచ్ఫీల్డ్ 80, కీపర్ మూనీ 31 పరుగులతో రాణించారు. భారత బౌలింగ్లో కష్వీ గౌతమ్, దీప్తి శర్మ చెరి 2, క్రాంతి గౌడ్ 1 వికెట్ తీశారు. సెంచరీతో ఆసీస్ను గెలిపించిన జార్జియా వోల్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అతిపెద్ద ఆక్వా కల్చర్ హబ్ గా మన రాష్ట్రం: చంద్రబాబు
అమరావతి: వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను, రైతులకు ఆధునిక పరికరాలను పరిచయం చేసి..ప్రోత్సహిస్తున్నామని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పై అధిక దృష్టి పెట్టామని అన్నారు. ఎపి అసెంబ్లీలో సిఎం ప్రసంగించారు. ప్రకృతి సేద్యాన్ని 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తామని, రాయలసీమలో 20 లక్షల ఎకరాల్లో హర్టీకల్చర్ సాగు అవుతోందని తెలియజేశారు. దేశంలోనే అత్యధిక పండ్లు పండే ప్రాంతంగా రాయలసీమ ఉందని, రాయలసీమలో హార్టీకల్చర్ ను 40 లక్షల ఎకరాలకు పెంచుతామని సిఎం పేర్కొన్నారు. రాయలసీమ హార్టీకల్చర్ కు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఏలూరు దగ్గర అతి పెద్ద కోకో సిటీ వస్తుందని అన్నారు. ఆక్వా ఉత్పత్తిలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నామని, ఏజెన్సీలో కాఫీ పంట విస్తీర్ణం పెరుగుతోందని చెప్పారు. అతిపెద్ద ఆక్వా కల్చర్ హబ్ గా మన రాష్ట్రం తయారవుతోందని, సమర్థ నీటి నిర్వహణ వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయని అన్నారు. ఒకే రకం పంట వేయడం వల్ల రైతులు బాగా నష్టపోతున్నారని, రైతులు ముందే మాట్లాడుకుని భిన్నమైన పంటలు వేయాలని సూచించారు. 2029 లోగా అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలనేది తమ లక్ష్యం అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందని బావను దారుణంగా హత్య చేసిన సోదరులు
విశాలాంధ్ర – మండపేట : చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుందన్న అక్కసుతో బావను పాశవికంగా హత్య చేసిన బావమరుదుల ఉదంతమిది. మండపేట మండలం జెడ్ మేడపాడు గ్రామానికి చెందిన అయినవిల్లి సంధ్య ప్రస్తుత రాయవరం డిప్యూటీ తాసిల్దార్ గా పనిచేస్తుంది. ఆమె ద్వారపూడి కి చెందిన పోలుపల్లి వీర వెంకట సూర్య ప్రకాశరావు ప్రేమించుకున్నారు ఈ నేపథ్యంలో వీరు గురువారం అన్నవరంలో వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న సంధ్య సోదరులు జేగురుపాడు కు చెందిన మరొక వ్యక్తి […] The post చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందని బావను దారుణంగా హత్య చేసిన సోదరులు appeared first on Visalaandhra .
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ కన్నుమూత #ChilkurBalaji#SoundarRajan#TempleNews
ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్..
రేపటితో ముగుస్తున్న విజయానంద్ పదవీ కాలం కొత్త సీఎస్గా బాధ్యతలు స్వీకరించనున్న సాయిప్రసాద్సాయిప్రసాద్ 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి. సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ పదవీ కాలం రేపటితో (ఫిబ్రవరి 28) ముగియనుంది. ఈ నేపథ్యంలో, విజయానంద్ స్థానంలో సాయిప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఉదయం సచివాలయంలో కొత్త […] The post ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్.. appeared first on Visalaandhra .
పడవల పునరాగమనం… మత్స్యకారుల ఆశలకు కొత్త ఆరంభం…
“పీఎం లంక బోట్స్” ప్రాజెక్ట్తో తుఫాను బాధిత మత్స్యకారులకు నూతన ఉత్తేజం…. విశాలాంధ్ర భీమవరం: గోదావరి తీరం వద్ద ఉదయం వెలుగు రాకముందే మత్స్యకారుడి రోజు మొదలవుతుంది. వలలు సరిచూసుకోవడం, గాలి దిశ అంచనా వేయడం, పడవను నీటిలోకి నెట్టడం—ఇది వారి దైనందిన జీవితం. పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారులకు తరతరాలుగా పడవ జీవనాధారమే కాక, వారి జీవన భాగస్వామిగా నిలిచింది. ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ఆ బంధాన్ని ఒక్క రాత్రిలో ఛిన్నాభిన్నం చేసింది. అనేక […] The post పడవల పునరాగమనం… మత్స్యకారుల ఆశలకు కొత్త ఆరంభం… appeared first on Visalaandhra .
Puri Jagannadh |సూర్యతో సినిమా ఫిక్స్…?
Puri Jagannadh | సూర్యతో సినిమా ఫిక్స్…? Puri Jagannadh | పూరి
priest |చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిగా సేవలు
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో
పంటలు, ఇళ్లపై దాడులు, భయాందోళనలో ప్రజలు
పంటలు, ఇళ్లపై దాడులు, భయాందోళనలో ప్రజలు ఎ.కొండూరు మండలంలో కోతుల బెడదఅధికారులు జోక్యం
వైభవంగా గవిమఠం చంద్రమౌళీశ్వరుడి రథోత్సవం..
వేలాదిమంది భక్తుల శివనమస్మరణలతో మార్మోగిన గవిమఠ ప్రాంగణం విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామి వారి రథోత్సవం గురువారం సాయంత్రం వేలాదిమంది భక్తుల కోలాహలాల మధ్య నేత్రపర్వంగా, వైభవంగా జరిగింది. రథోత్సవానికి భారీగా భక్తులు తరలిరావడంతో గవిమఠ ప్రాంగణం కిటకిటలాడింది. ప్రత్యేక పూజలు అనంతరం రథాన్ని లాగారు. రథోత్సవం సందర్భంగా గవిమఠం పీఠాధిపతి శ్రీచెన్నబసవ రాజేంద్ర స్వామి, ఉత్తరాధికారి శ్రీకరిబసవ రాజేంద్ర స్వామి, ఆదోని చౌకి మఠం మఠాధిపతి […] The post వైభవంగా గవిమఠం చంద్రమౌళీశ్వరుడి రథోత్సవం.. appeared first on Visalaandhra .
Big OTT Deal for Ustaad Bhagat Singh
Powerstar Pawan Kalyan completed the shoot of Ustaad Bhagat Singh last year and the film is now in the summer race. The makers are closing all the deals for the movie. Netflix has bagged the digital streaming rights of all the languages for a massive price of Rs 80 crores. Netflix has acquired the rights […] The post Big OTT Deal for Ustaad Bhagat Singh appeared first on Telugu360 .
‘ఓ బీసీ లేసి తెలుసుకో’ఆవిష్కరణ..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రహదారి బంగ్లాలో యువకవి,
ఆదర్శ మున్సిపల్గా తీర్చి దిద్దుతా
ఆదర్శ మున్సిపల్గా తీర్చి దిద్దుతా చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్
పేదలకు ఆర్థిక చేయూత సీఎంఆర్ఎఫ్
పేదలకు ఆర్థిక చేయూత సీఎంఆర్ఎఫ్ తొర్రూరు, ఆంధ్రప్రభ : ఆపత్కాలంలో పేదలకు ఆర్థిక
What Happened to Botsa Satyanarayana? Why He Was Shifted to Hyderabad?
Senior YSR Congress Party leader and MLC Botsa Satyanarayana was shifted to Hyderabad after showing symptoms of a possible brain stroke. He was admitted to City Neuro Hospital for medical evaluation and treatment. On Thursday, Botsa attended the Legislative Council session and interacted with the media. He stated that the YSRCP would strongly raise the […] The post What Happened to Botsa Satyanarayana? Why He Was Shifted to Hyderabad? appeared first on Telugu360 .
Sita All India Pre-Release Business Telugu360 Rating: 2.5/5 Sree Vishnu emerged as the King of Entertainment in Telugu cinema. He has a unique comic timing and dialogue delivery. Vishnu Vinyasam is one more attempt which is backed by entertainment. Yadunaath Maruthi Rao is the director and Nayan Sarika is the heroine. Vishnu Vinyasam released today […] The post Vishnu Vinyasam Movie Review appeared first on Telugu360 .
‘ఇలాగే కొనసాగించండి’.. టీం ఇండియాకు సూచన
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్-8లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. అన్ని విభాగాల్లో రాణించి జింబాబ్వే ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయిత జింబాబ్వే లక్ష్యాన్ని జింబాబ్వే చేధించలేక పోవడంతో భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీ ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జట్టును అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ సత్తా చాటింది. 256 పరుగులు చాలా పెద్ద స్కోర్. ప్రస్తుత ప్రపంచకప్లో ఇదే అత్యధికం. భారత్ ాగా ఆడింది. టీం ఇండియా ఇదే రిథమ్ను కొనసాగించాలి. ఈ టోర్నమెంట్లో చక్కటి ప్రదర్శనలు చేసిన జింబాబ్వేకి అభినందనలు’’ అంటూ సచిన్ రాసుకొచ్చారు.
Payyavula |జూన్ నాటికి అనకాపల్లి వరకు గోదావరి నీళ్లు
Payyavula | జూన్ నాటికి అనకాపల్లి వరకు గోదావరి నీళ్లు Payyavula Keshav
లిక్కర్ కేస్ తో బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం
లిక్కర్ కేస్ తో బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం కవితకు న్యాయం జరిగిందిలిక్కర్
మహిళా సాధికారతే లక్ష్యం.. ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఊర్కొండపేట గ్రామంలో
వైసీపీ నేత బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్
వైసీపీ మాజీ మంత్రి, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దాంతో ఆయనను నిన్న రాత్రి హైదరాబాదుకు తరలించారు. ఆయన ఈ తెల్లవారుజామున హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.బొత్స ఓ మోస్తరు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రమాదమేమీ లేదని తెలిపారు. బొత్స తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో వైసీపీ వర్గాలు ఆందోళన […] The post వైసీపీ నేత బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ appeared first on Visalaandhra .
meeting |అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
కలెక్టర్ తో సమీక్షా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆంధ్రప్రభ, నిజామాబాద్ :
కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ
గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల కేసునూజివీడులోని కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు ఏలూరు జిల్లా నూజివీడులోని కోర్టుకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాలకు సంబంధించి ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి ఈనాటి వాయిదాకు ఆయన హాజరయ్యారు. కోర్టు వద్దకు వచ్చిన పలువురు వైసీపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, ఆ కార్యాలయంలో పని […] The post కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ appeared first on Visalaandhra .
మద్యం కుంభకోణం కేసుపై కోర్టు తీర్పు… కేటీఆర్ సంచలన ట్వీట్#KTR #LiquorScamCase #CourtVerdict #Kavitha
march 4|మోదీకి విజయ్ దేవరకొండ, రష్మిక ఆహ్వానం
march 4| మోదీకి విజయ్ దేవరకొండ, రష్మిక ఆహ్వానం ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :

27 C