ఐపిఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఐదో విజయం నమోదు చేసింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మార్ష్ (55) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆర్చర్ మూడు, బర్గర్, బ్రిజేష్ శర్మ రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లక్నో బౌలర్లు సఫలమయ్యారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 4 ఫోర్లతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ (20) జట్టుకు అండగా నిలువలేక పోయాడు. హెట్మెయిర్ (22) కూడా ఆశించిన స్థాయిలో బ్యాట్ను ఝులిపించలేక పోయాడు. అయితే రవీంద్ర జడేజా 29 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. ఫెరీరా (20), శుభమ్ దూబె 19 (నాటౌట్) అతనికి సహకారం అందించారు. లక్నో బౌలర్లలో షమి, మోసిన్ ఖాన్, ప్రిన్స్ రెండేసి వికెట్లను పడగొట్టారు.
ఉమ్మడి ఏపీ మాజీ సిఎం నాదెండ్ల కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు క న్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య స మస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నా దెండ్ల భాస్కరరావు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియల ను పంజాగుట్ట శ్మశానవాటికలో గురువారం సా యంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కు టుంబ సభ్యులు వెల్లడించారు. ప్రజల సందర్శనా ర్థం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ నివాసం లో ఉంచారు. నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఇ రు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. లాయర్గా కెరీర్ ప్రారంభించి ఆపై రాజకీయాల్లోకి ఎంట్రీ నాదెండ్ల స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి. 1935, జూన్ 23న జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన నాదెండ్ల భాస్కరరావు హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ న 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతం లో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మంత్రివర్గం లో పనిచేశారు. 1982 లో తెలుగుదేశం పార్టీ ఏ ర్పాటు సమయంలో ఎన్టీ రామారావుతో కలిసి నడిచారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఎన్టీఆర్కు మార్గదర్శిగా తాను వ్యవహరించానని నాదెండ్ల భా స్కరరావు చెప్పుకుంటారు. -1983లో టిడిపి ఘన విజయం సాధించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఆయన మంత్రివర్గంలో నాదెండ్ల భాస్కరరావు ఆర్థిక మంత్రిగా చేరారు. 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వె ళ్ళిన సమయంలో టిడిపిలో సంక్షోభం తలెత్తింది. నాదెండ్ల భాస్కరరావు కొంతమంది ఎమ్మెల్యేల మ ద్దతుతో రాష్ట్ర సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన దాదాపు నెల (31 రోజుల) పాటు సిఎం గా కొనసాగారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో నాదెండ్ల సిఎం పదవికి రాజీనామా చే యాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ గూటి కి చేరారు. 1989లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపిగా పోటీ చేసి గెలుపొందారు. మర్రి చె న్నారెడ్డి, అంజయ్య, ఎన్టీఆర్ హయాంలో మంత్రి గా బాధ్యతలను నిర్వర్తించారు. 2019లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరా రు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వాకింగ్ విత్ డెస్టినీ పేరుతో భాస్కరరావు ఆత్మకథ రాసుకున్నారు. ఆయన జీవితం మలిదశ లో కూడా పలు ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్పై ఘాటై న విమర్శలు చేసేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు. మురళీధర్, మనోహర్. ఆయన భార్య పేరు లలిత. వారి వివాహం సత్యసాయి సమక్షంలో జరిగింది. నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారు. తొలుత కాంగ్రెస్లో కొనసాగిన నాదెండ్ల మనోహ ర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి శాసనసభకు స్పీకర్ గా వ్యవహరించారు. అలాగే, ఎపిలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. సిఎం రేవంత్ సంతాపం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నాదెండ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎపి సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ సంతాపం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఎపి సిఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. భాస్కరరావు కుమారు డు, ఎపి మంత్రి నాదెండ్ల మనోహర్ను సిఎం ఫోన్ లో పరామర్శించారు. నాదెండ్ల భాస్కరరావు మృ తిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఎపి మాజీ సిఎం జగన్ సంతాపం మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు.‘నాదెండ్ల భాస్కర్ రావు ఎపి రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించిన నాయకుడని పేర్కొన్నారు. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, రాజకీయ అను భవం తరతరాలకు ఆదర్శమని‘ అన్నారు.
అంగారకుడిపై జీవానికి మూలమైన సేంద్రియ అణువులు గుర్తింపు
అంగారక గ్రహంపై జీవం ఉనికి గురించి దశాబ్దాలుగా సాగుతున్న అన్వేషణలో నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మరో కీలక ముందడుగు వేసింది. క్యూరియాసిటీ రోవర్ అంగారకుడి భూమధ్యరేఖకు సమీపంలో ఒకప్పుడు సరస్సుగా ఉండి ఎండిపో యిన ప్రాంతంలో క్యూరియాసిటీ రోవర్ ఈ పరిశోధన జరిపింది. ఇక్కడ ఏడు వేర్వేరు సేంద్రియ సమ్మేళనాలను రోవర్ గుర్తించగా, వాటిలో ఐదింటిని మార్స్పై కనుగొనడం ఇదే తొలిసారి. ఈ సేంద్రియ పదార్థాలు పురాతన జీవుల నుంచి వచ్చాయా?ఉల్కల ద్వారా గ్రహానికి చేరాయా? లేక భౌగోళిక ప్రక్రియల వల్ల ఏర్పడ్డాయా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఒకవేళ అంగారకుడిపై జీవం ఉండి ఉంటే, దానికి సంబంధించిన రసాయన ఆనవాళ్లు ఇప్పటికీ భద్రంగా ఉండే అవకాశం ఉందని ఈ ఆవిష్కరణ సూచిస్తోంది. ఈ ప్రయోగానికి నేతృత్వం వహిం చిన ఫ్లోరిడా యూనివర్సిటీ ఆస్ట్రోజియాలజిస్ట్ ప్రొఫెసర్ అమీ విలియమ్స్ మాట్లాడుతూ ‘మేము 350 కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై భద్రపరచబడిన సేంద్రియ పదార్థాలను చూస్తున్నామని భావిస్తున్నాం. అయితే ఇది జీవానికి సంబంధించినదేనా? అన్నది ప్రస్తుత సమాచారంతో చెప్పలేం‘ అని వివరించారు. కొన్ని వందల కోట్ల ఏళ్ల కిందట మార్స్పై జీవం వృద్ధి చెందడానికి అనువైన వాతావరణం ఉండేదని, కానీ నేడు తీవ్రమైన రేడియేషన్, అతి శీతల పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘ఇంతటి కఠినమైన రేడియేషన్ వాతావరణంలో సేంద్రియ పదార్థాలు మనుగడ సాగించడం నిజంగా ఆశ్చర్యకరం‘ అని అమీ విలియమ్స్ అన్నారు. గుర్తించిన సమ్మేళనాల్లో డీఎన్ఏ నిర్మాణంలో పాలుపం చుకునే నైట్రోజన్ సమ్మేళనం వంటి నిర్మాణం ఒకటి ఉన్నప్పటికీ, అవి కేవలం ‘ఇటుకలు మాత్రమే, ఇల్లు కాదు‘ అని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆవిష్కరణలతో 2028లో ప్రయోగించనున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రోసలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్పై అంచనాలు పెరిగాయి. ఈ రోవర్ ఉపరితలం కింద రెండు మీటర్ల లోతు వరకు డ్రిల్ చేసి, రేడియేషన్ నుంచి మరింత సురక్షితంగా ఉన్న నమూనాలను విశ్లేషించగలదు.
CM Revanth Orders Real-Time Dashboard to Track Every investment deal
CM A. Revanth Reddy on Wednesday directed officials to fast-track the implementation of investment agreements signed by the state with major companies and remove all pending obstacles without delay. At a high-level review meeting on investments and infrastructure, the CM said MoUs signed at global platforms such as Davos, the Telangana Rising Global Summit and […] The post CM Revanth Orders Real-Time Dashboard to Track Every investment deal appeared first on Telugu360 .
కాళేశ్వరం పై సిబిఐ విచారణకు సిద్ధమా?: మంత్రి పొంగులేటి
కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎలాంటి అవినీతి జరగలేదని పదే పదే చెబుతున్న బిఆర్ఎస్ నాయకులు నిజంగా నిర్దోషులైతే, వెంటనే స్వయంగా సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవార ఓ ప్రకటనలో సవాల్ విసిరారు. కాళేశ్వరం అంశంపై హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తీవ్రంగా విమర్శించారు. నిజంగా ఎలాంటి అవకతవకలు జరగలేదంటే, స్వతంత్ర సంస్థ ద్వారా విచారణకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విచారణ జరిగితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే బిఆర్ఎస్ నాయకత్వం వెనుకడుగు వేస్తోందని, భారీ ఆర్థిక దోపిడీ, కమీషన్ల వ్యవహారం, కాంట్రాక్టుల లోపాలు అన్నీ బహిర్గతమవుతాయనే భయమే వారిని వెంటాడుతోందని మంత్రి ఆరోపించారు. ఇదే భయంతో బిజెపితో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని, విచారణను తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యతపై ఇప్పటికే తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మేడిగడ్డ వంటి కీలక నిర్మాణాలు కుంగిపోవడం, పంప్ హౌజ్లు దెబ్బతినడం వంటి సంఘటనలు యాదృచ్ఛికం కాదని స్పష్టం మంత్రి చేశారు. ఇవన్నీ ప్రాజెక్టులో జరిగిన పెద్ద ఎత్తున అవినీతికి నిదర్శనాలేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యత దెబ్బతిందని, అదే విధంగా నిర్మించిన చెక్ డ్యాములు కూడా కుప్పకూలిన ఘటనలు ప్రజల ముందు ఉన్న వాస్తవాలేనని మంత్రి గుర్తు చేశారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి అవినీతి జరగలేదన్నట్టుగా గ్లోబల్ ప్రచారానికి దిగడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆయన విమర్శించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్ట్పై పూర్తి స్థాయి పారదర్శక విచారణ జరగడం ప్రజాస్వామ్యంలో కనీస బాధ్యత అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన రోజు దగ్గరలోనే ఉందని, ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారు.
కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల దాడులు
కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. 10 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం ఆకస్మికదాడి చేశారు. అనంతరం ఆసుపత్రిలోని డ్యూటీ చార్ట్ ప్రకారం ఉండాల్సిన వైద్యులు విధుల్లో ఉన్నారా లేదా అని బయోమెట్రిక్ యంత్రాలు, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొందరు వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ కోసం ప్రభుత్వ విధులకు డుమ్మా కొడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశామన్నారు. ఆసుపత్రిలో ఉచితంగా జరగాల్సిన ల్యాబ్ పరీక్షల ప్రక్రియ పరిశీలన చేయడం జరిగిందన్నారు. రోగులను బయట ప్రైవేట్ ల్యాబ్లకు పంపిస్తున్నారా అనే కోణంలో రికార్డుల తనిఖీ, ఫార్మసీలో స్టాక్ రిజిస్టర్ పరిశీలన చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత మందులు రోగులకు అందుతున్నాయా లేదా బయట మెడికల్ షాపులకు రాసిస్తున్నారా అన్నది తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారం నాణ్యతను, క్యాంటీన్ నిర్వహణ పరిశీలన, వార్డులలో పారిశుధ్యలోపాల గుర్తిచడం జరిగిందన్నారు. తనిఖీల్లో భాగంగా కొన్ని కీలక రికార్డులను, రిజిస్టర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, సిబ్బంది ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు.
బైక్ను ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి
కారు బైక్ ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందిన విషాధ ఘటన గుర్రంపోడు మండలం చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చింతగూడెంకు చెందిన మారెడ్డి బాల్రెడ్డి (70) , భార్య అలివేలమ్మ, పాల్వాయి గ్రామానికి చెందిన మాలె, వెంకటమ్మ, మాలె మంజుల కారులో నల్లగొండలో తమ సమీప బంధువుల నిశ్చితార్థ వేడుకకు హాజరై తిరిగి స్వస్థలానికి వెళుతున్న క్రమంలో కనగల్ మండలానికి చెందిన మధుబాబు, నర్సింగ్ ధనుంజయ బైక్పై పాల్వాయి ధాన్యం మిల్లు నుంచి ధాన్యం అమ్మిన డబ్బులు తీసుకుని తిరిగి దేవరకొండ వైపు వెళుతుండగా చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద కారు బలంగా బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సింగ్ మధుబాబు (38), ధనుంజయగౌడ్ (45) కారులో ప్రయాణిస్తున్న మారెడ్డి బాల్రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు కారులోని మిగతా వారికి గాయాలు కాగా 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను తెలుసుకున్నారు. వెంటనే ప్రమాద స్థలికి దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరావు,కొండమల్లేపల్లి సిఐ నవీన్కుమార్,గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న చేరుకుని ప్రమాద ఘటనను పరిశీలించి పూర్తి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
GG’s Palleturu Song: Feel the Vibe & Warmth
Sumanth Prabhas’ rural love-and-family entertainer Godari Gattupaina, directed by debutant Subash Chandra and featuring Nidhi Pradeep as the heroine, has already made a positive impression with its glimpses and songs. As part of its musical promotions, the makers have released the fourth single, Nenu Na Palleturu. The song, scored by Naga Vamshi, carries a breezy, […] The post GG’s Palleturu Song: Feel the Vibe & Warmth appeared first on Telugu360 .
Too Many Speculations on Peddi Item Song
Ram Charan’s Peddi is postponed from April 30th release and the team is focused on the post-production work. The patch work of the film too is happening currently and an item song will be shot soon in a special set. From the past one week, there have been a lot of speculations about the actress […] The post Too Many Speculations on Peddi Item Song appeared first on Telugu360 .
లక్నో సూపర్ జెయింట్స్ లక్ష్యం 160
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎకనా స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 43, శుభమ్ దూబె 19 నాటౌట్ గా నిలిచారు. యశస్వి జశ్వాల్ 22,రియాన్ పరాగ్ 20, శిమ్రాన్ 22 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ ,ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వత్సవాయి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో ఒక
తృటిలో తప్పిన ప్రాణాపాయం ఎ. కొండూరు, ఆంధ్రప్రభ: గ్యాస్ లీక్ కారణంగా పూరిళ్లు
మరణానంతరం మహాదానం… ఐదుగురికి ప్రాణం పోసిన యువ సాఫ్ట్వేర్ ఉద్యోగికూకట్పల్లి మెట్రో వద్ద
పసిపిల్లలే టార్గెట్.. మాయమాటలతో బురిడీ కొట్టించి!
పసిపిల్లలే టార్గెట్.. మాయమాటలతో బురిడీ కొట్టించి! ముగ్గురు నిందితుల అరెస్ట్కిడ్నాపర్ల నుంచి మరో
ప్రధాని మోడీని ఉగ్రవాదిగా పేర్కొనడంపై కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం బుధవారం తీవ్రస్థాయి నోటిసు వెలువరించింది. తమిళనాడు , పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. చెన్నైలో విలేకరుల సమావేశం దశలో ఖర్గే ప్రధాని మోడీ టెర్రరిస్టు వంటి వారని విమర్శించారు. ప్రతిపక్షాల అణచివేతకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికార యంత్రాంగాలను వాడుకొంటోందని, ఈ క్రమంలో ఆయన టెర్రరిస్టు వంటి వారేనని ఖర్గే తెలిపారు. దీనిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఖర్గేకు నోటిసు ఇస్తూ దీనికి 24 గంటల్లో సమాదానం ఇచ్చుకోవల్సి ఉందని హెచ్చరించింది. ప్రజలను, పార్టీలను తన చర్యలతో భయభ్రాంతులను చేస్తున్న వ్యక్తి టెర్రరిస్టు కాక మరెవ్వరు అని ఖర్గే ఆ తరువాత వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈసికి ఆయన ఎటువంటి జవాబు ఇస్తారనేది చూడాల్సి ఉంది.
విద్వేషాలను తిప్పికొట్టడమే దేశ విధానం: కాంగ్రెస్
దేశం ఎప్పుడూ విద్వేషాలు, హింసాత్మక చర్యలకు తలొగ్గేది లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడుల ఏడాది నేపథ్యంలో పార్టీ అప్పటి మృతులకు బుధవారం నివాళులు అర్పించింది. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసింది. జాతి యావత్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా నిలుస్తుందని, విద్వేషాన్ని ఏ కోణంలో ప్రచారానికి తీసుకువవ్చినా తిప్పికొడుతుందని పార్టీ తెలిపింది. ప్రస్తుత గల్ఫ్ యుద్ధం దశలో దేశ విదేశాంగ విధానం పూర్తిగా విఫలం చెందిందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ విధానాలే కారణం అని పార్టీ విమర్శించింది. ముంబై ఉగ్రదాడుల తరువాత ప్రపంచ స్థాయిలో పాకిస్థాన్ ఏకాకి అయింది. అన్ని దేశాలూ ఉగ్రవాదం ముద్రతో వేలెత్తి చూపాయి. అయితే ఇప్పుడు పాకిస్థాన్ ఇరాన్, అమెరికా మధ్య దౌత్యానికి దిగుతూ ప్రపంచ స్థాయి ఆదరణను పొందుతోందని, మరి ప్రధాని మోడీ తరఫున వ్యాప్తి చెందిన విశ్వగురు వాదనకు ఏమైందని కాంగ్రెస్ ప్రశ్నించింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమ సందేశంలో దేశం అంతా కలిసి ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది. సంఘటితంగా స్పందిస్తుందని తెలిపారు. ఇండియా ఏ దశలో కూడా ఉగ్రవాద బాధిత కుటుంబాల త్యాగాలను విస్మరించబోదు. ఉగ్రవాద పిరికిపంద చర్యలకు దిగే వారిని జాతి క్షమించబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు , వారి వెనుక ఉన్న ప్రేరక శక్తులను క్షమించేది లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు పర్యాటక కేంద్రంలో అమాయకుల ప్రాణాలు తీసిన వైనం మనను ఈరోజుకీ కలిచివేస్తుంది. బాదిత కుటుంబాల గుండోకోత మనమంతా పంచుకోవల్సి ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తమ ప్రకటనలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీయ స్ఫూర్తి చెక్కుచెదరకుండా నిలుస్తుందని తెలిపారు. బాధితులకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ తమ ప్రకటనలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశ విదేశాంగ విధానం పునర్వించుకోవల్సి ఉంది. అయితే ప్రధాని మోడీ దీనిపై కదలరు మెదలరని విమర్శించారు.
ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి బీజేపీ డిమాండ్ చెన్నూర్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్
ప్రభుత్వోద్యోగులకు ప్రధాని లేఖలు
పౌరులే దేవుళ్లు అనే ప్రాతిపదిక భావనతోనే సేవలు అందించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వోద్యోగులకు సందేశం వెలువరించారు. కోటి మందికి పైగా సివిల్ సర్వెంట్స్కు బుధవారం ప్రధాని మోడీ తరఫున ఈ మేరకు లేఖలు పంపించారు. నాగరిక్దేవోభవ అనేది సివిల్ సర్వెంట్స్ ఉద్యోగ ఆచరణ నినాదం కావల్సి ఉందని ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై గురుతర బాధ్యత ఉంటుంది. పౌరుడి సేవలే కీలక లక్షంగా ప్రతి నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ శక్తివంచన లేకుండా ఈ దిశలో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రధాని తమ లేఖలలో తెలిపారు. సుపరిపాలనను పూర్తి స్థాయి సంయమనంతో నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రజా సేవకు బాధ్యత వహించే వారు జీవితాంతం అధ్యయనశీలులుగా నిలుస్తారు. వారి అనుభవం వారి సేవలు ప్రజానీకానికి మేలు చేస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. మీ నిర్ణయాలు, పౌరుల పట్ల అంకితభావపు కర్తవ్య పాలనతోనే పరిపాలనా వ్యవస్థ సక్రమం అవుతుందని ప్రధాని మోడీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు. మరాఠా, గుజరాతీ , బెంగాలీ వంటి దాదాపు 12 భాషలలో ఈ లేఖలను పంపించారు. 21వ శతాబ్థం అత్యంత సవాళ్ల కాలం, ఇదే దశలో మన ముందుకు పలు సదవకాశాలు వస్తాయి. దేనిని ఎంచుకుంటామనేది ప్రధాన విషయం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు దృక్పథాలు మారుతున్నాయి. నూతన సాంకేతికలు అనూహ్య రీతిలో ముందుకు వస్తున్నాయి. వినూత్న సృజనాత్మకతలు ఆవిష్కృతం అవుతున్నాయని ప్రధాని తెలిపారు. వివిధ భాషలలో ప్రధాని లేఖలు పలు మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల సివిల్ సర్వెంట్స్కు చేరాయి.
మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మొగుళ్లపల్లి,
100%increasing |యువతను మింగేస్తున్న డ్రగ్స్ మాఫియా
100%increasing | యువతను మింగేస్తున్న డ్రగ్స్ మాఫియా 100%increasing | భయానక స్థాయికి
రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగించడం సబబు కాదు
రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగించడం సబబు కాదు తహసీల్దార్ కి బిఆర్ఎస్ నాయకుల
కొల్లేరు అభయారణ్యం సరిహద్దులు తగ్గించే దిశగా ఏపీ ప్రభుత్వం #Kolleru #WildlifeSanctuary #CEC #NBWL
ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు సుర్వి యాదయ్యగౌడ్ చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
అతి వేగంతో వెళ్తూ బైక్ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
గుర్రంపోడు: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాకాజిపురానికి చెందిన మారెడ్డి బాల్రెడ్డి, అలివేలు, పాల్వాయి గ్రామానికి చెందిన మాలె మంజుల, మాలె వెంకటమ్మ నల్గొండలో ఓ శుభకార్యానికి హాజరై కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వద్దిరెడ్డిగూడెం సమీపంలో వీరి కారు అతి వేగంతో ఓ బైక్ను ఢీకొట్టి ఆ తర్వాత చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న కనగల్కు చెందిన రైతులు నర్సింగ్ మధుబాబు, నర్సింగ్ ధనుంజయ, కారులో ఉన్న బాల్రెడ్డి మృతి చెందారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
చోరీలు, నీటి ప్రమాదాలపై ఎస్పీ హెచ్చరిక
చోరీలు, నీటి ప్రమాదాలపై ఎస్పీ హెచ్చరిక గద్వాల, ఆంధ్రప్రభ: వేసవి సెలవులు మొదలయ్యాయి
మాలేగావ్ 2006 పేలుళ్ల కేసులో బొంబాయి హైకోర్టు కీలక తీర్పు
మహారాష్ట్రలోని మాలేగావ్ 2006 పేలుళ్ల కేసులో బొంబాయి హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై అభియోగాలు మోపుతూ ప్రత్యేక న్యాయస్థానం ఇంతకు ముందు వెలువరించిన ఆదేశాలను కొట్టివేసింది. హైకోర్టు ప్రదాన న్యాయమూర్తి చంద్రశేఖర్ , న్యాయమూర్తి శ్యామ్ చంద్రక్తో కూడిన ధర్మాసనం ఈ మలుపు తిప్పే తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులైన నలుగురు వ్యక్తులు రాజేంద్ర చౌదరి, ధన్సింగ్, మనోహర్ రామ్ సింగ్ నర్వారియా, లోకేష్ శర్మలు ఇప్పుడు కేసు నుంచి విముక్తి పొందారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పెట్టుకున్న దరఖాస్తులను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 2006 సెప్టెంబర్ 8వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న మాలేగావ్ పట్టణంలో పేలుళ్లు జరిగాయి. అక్కడి హమిదియా మసీద్ , బడా ఖబ్రస్థాన్ ఆవరణలలో నమాజ్ తరువాత మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. తరువాత నాలుగో పేలుడు అక్కడి ముషావరత్ చౌక్లో సంభవించింది. ఈ ఘటనలలో మొత్తం 31 మంది దుర్మరణం చెందారు. 312 మంది వరకూ గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్త సంచలనానికి దారితీసింది. దీనిపై రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) తొలుత దర్యాప్తు జరిపింది. కేసుకు సంబంధించి తొమ్మండుగురు ముస్లింలను అరెస్టు చేశారు. తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) రంగంలోకి దిగింది. ఇది హిందూత్వ ఉగ్రవాద చర్యల ఫలితం అని పేర్కొంటూ ఇప్పుడు నిర్దోషులు అయిన వారిని నిందితులుగా చేర్చింది. గత ఏడాది సెప్టెంబర్లో ప్రత్యేక కోర్టు వీరిపై కేసులు నమోదు చేసింది. దీనికి వ్యతిరేకంగా వారు హైకోర్టును ఆశ్రయించారు. తమకు వ్యతిరేకంగా ఎన్ఐఎ ఎటువంటి సాక్షాదారాలు చూపలేకపోయిందని, అయినా తమను నిందితులుగా చూపారని వీరు తెలియచేసుకున్నారు.
Amazon |అమెజాన్ డెలివరీ బాయ్..
Amazon | అమెజాన్ డెలివరీ బాయ్.. Amazon | ఇబ్రహీంపట్నం రూరల్, ఆంధ్రప్రభ
వివరాలను పక్కగా నమోదు చేయాలి కొత్తూరు తహసీల్దార్ ఎస్కే ముంతాజ్ కొత్తూరు, ఆంధ్రప్రభ:
రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్యపై మహిళల నిరసన…
ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా… విశాలాంధ్ర – రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.గత నెల రోజులుగా కొత్తగా బోరు బావిలో నీరు ఉన్నప్పటికీ, పైపులైన్ సక్రమంగా లేకపోవడం వల్ల కాలనీకి త్రాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు […] The post రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్యపై మహిళల నిరసన… appeared first on Visalaandhra .
హార్మూజ్ జలసంధిలో తాజా ఉద్రిక్తతల మధ్య, గత వారం కూడా రెండు భారత నౌకలు ఇరాన్ నౌకాదళ దాడులకు గురైన విషయం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. స్నేహపూర్వక దేశాలకు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని టెహ్రాన్ హామీ ఇచ్చినప్పటికీ ఈ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ జెండాతో ప్రయాణిస్తున్న ‘జాగ్ అర్నవ్’ అనే బల్క్ క్యారియర్ సౌదీ అరేబియా నుంచి భారత్కు వస్తుండగా దాడికి గురైంది. అలాగే ‘సాన్మార్ హెరాల్డ్’ అనే మరో నౌక ఇరాక్ నుంచి భారత్కు చమురు రవాణా చేస్తుండగా లక్ష్యంగా మారింది. ఏప్రిల్ నెలలో సుమారు పది భారత నౌకలు ఈ కీలక సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లు సమాచారం. ఈ ఘటనలతో ఇరాన్లో అసలు అధికార నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రభావం పెరిగి, రాజకీయ నాయకత్వాన్ని పక్కన పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి తన ఆందోళనను తెలియజేస్తూ ఇరాన్ రాయబారిని భారత ప్రభుత్వం పిలిపించి వివరణ కోరింది.
15yrsgirl |ఆశ్రమంలో గిరిజన బిడ్డ మృతికి బాధ్యులెవరు?
15yrsgirl | ఆశ్రమంలో గిరిజన బిడ్డ మృతికి బాధ్యులెవరు? 15yrsgirl | జ్వరంతో
ఈడీ దాడి సమయంలో ఐ-ప్యాక్ కార్యాలయంలోకి వెళ్లిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఈ ఏడాది జనవరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన దాడి సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఈడీ కోరింది.ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులు ఇప్పటికే అసాధారణంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు కూడా అత్యంత అసాధారణమైనదిగా భావిస్తున్నామని తెలిపింది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దర్యాప్తు జరుగుతున్న సమయంలో నేరుగా అక్కడికి వెళ్లి జోక్యం చేసుకోవడం సమంజసం కాదు. ఇలాంటి చర్య ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుంది. ఆ తరువాత దీనిని రాష్ట్రం-, కేంద్రం మధ్య వివాదంగా మార్చొద్దని చెప్పడం సరైంది కాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేసిన చర్య. అలాంటి వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టినట్లే.. అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో జనవరి 8న ఈడీ నిర్వహించిన దాడితో ఈ వివాదం ప్రారంభమైంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ దాడులు చేపట్టినట్లు ఈడీ తెలిపింది. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లి కీలక ఆధారాలను తొలగించారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ ఆరోపణలతో ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ నిపుణులు హెచ్.ఎం. సీర్వాయ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు కూడా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక సజీవ దర్యాప్తులో జోక్యం చేసుకునే పరిస్థితిని ఊహించి ఉండరని ధర్మాసనం పేర్కొంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ విచారణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్కు ప్రతిపక్ష బీజేపీ నుంచి గట్టి సవాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ కేసు రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, ఈడీ వంటి సంస్థలకు ప్రాథమిక హక్కులు ఉండవని తెలిపారు. అందువల్ల తమ హక్కులు ఉల్లంఘించబడ్డాయని ఆ సంస్థ వాదించలేదన్నారు. గత తీర్పులను ఉదహరిస్తూ, ఈడీ ఒక ప్రత్యేక న్యాయబద్ధ సంస్థ కాదని, దర్యాప్తు నిర్వహించేందుకు ప్రాథమిక హక్కులు కలిగిన స్వతంత్ర సంస్థగా దానిని పరిగణించలేమని సింఘ్వీ కోర్టుకు వివరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరఫున సీనియర్ న్యాయవాది మేనక గురుస్వామి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని రిట్ అధికార పరిధి కేవలం న్యాయబద్ధ వ్యక్తుల(జ్యూరిస్టిక్ పర్సన్స్)కు మాత్రమే వర్తిస్తుందని ఆమె తెలిపారు. పౌరులను ప్రభుత్వ అక్రమ చర్యల నుంచి రక్షించేందుకే ప్రాథమిక హక్కులు ఉద్దేశించబడ్డాయని, ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలే తమ హక్కులు ఉల్లంఘించబడ్డాయని చెప్పలేవని ఆమె వాదించారు.ఇప్పటికే స్థిరపడిన రాజ్యాంగ సూత్రాలను కేంద్ర ప్రభుత్వం మార్చేందుకు ప్రయత్నిస్తోందని మేనక గురుస్వామి ఆరోపించారు. ఈ సందర్భంగా కేశవానంద భారతి కేసు సహా పలు కీలక తీర్పులను ఆమె ప్రస్తావించారు.ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక కొనసాగుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడం వల్ల కలిగే ప్రభావాలపై పదేపదే ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశం సంస్థల అధికార పరిమితులు, న్యాయపాలన వంటి కీలక రాజ్యాంగ సూత్రాలపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఐ-ప్యాక్ కేసు ఏమిటి? జనవరి 8న కోల్కతాలోని ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ నిర్వహించిన దాడితో ఈ కేసు మొదలైంది. సోదాలు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లడంతో రాజకీయ, న్యాయపరమైన వివాదం చెలరేగింది.దాడి జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ అక్కడి నుంచి కొన్ని పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లారని ఈడీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను మమత ఖండించారు. తాను తీసుకెళ్లిన పత్రాలు 2019 లోక్సభ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఐ-ప్యాక్తో నిర్వహించిన రాజకీయ కార్యకలాపాలకు సంబంధించినవేనని, మనీ లాండరింగ్ దర్యాప్తుతో వాటికి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసును రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈడీ ముందుకు తీసుకెళ్తోందని కూడా మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే వ్యాపారవేత్త అనూప్ మజీకి సంబంధించిన కోల్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ నెట్వర్క్పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ దాడులు నిర్వహించామని ఈడీ చెబుతోంది. ఇటీవలి నెలల్లో ఈ కేసు మరింత విస్తరించింది. కోల్ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ను ఈడీ అరెస్టు చేసింది.
విడపనకల్లు మండలంలో కల్తీ ఆహార దందా బహిర్గతం…
అధికారుల మౌనం.. కల్తీ రాయుళ్లకు వరం! విశాలాంధ్ర – విడపనకల్లు: పసిపిల్లలు నోటిలో వేసుకునే మిఠాయిలే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. మండలంలో విక్రయిస్తున్న కొన్ని మిఠాయిలు నిప్పు అంటిస్తే కొవ్వొత్తిలా కరుగుతున్న ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కల్తీ దందా తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ ముద్రించడం చట్టరీత్యా తప్పనిసరి అయినప్పటికీ, ఇక్కడ విక్రయించే ప్యాకెట్లపై ఆ వివరాలు కనిపించడం లేదు. తనిఖీలను తప్పించుకునేందుకు తాత్కాలికంగా తేదీలు […] The post విడపనకల్లు మండలంలో కల్తీ ఆహార దందా బహిర్గతం… appeared first on Visalaandhra .
రాష్ట్రంలో ఆరుగురు సీనియర్ ఐపిఎస్లకు డిజి హోదా
హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపిఎల్ అధికారులకు డైరెక్టర్ జనరల్(డిజి)గా పదోన్నతులు కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో అదనపు డిజిలు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వివి శ్రీనివాస రావు, చారు సిన్హా, అనిల్ కుమార్, విసి సజ్జనార్ ఉన్నారు. మహేశ్ భగవత్ ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదనపు డిజిగా ఉండగా.. స్వాతి లక్రా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజిగా ఉన్నారు. వివి శ్రీనివాస రావు తెలంగాణ పోలీసు నియామక మండలి ఛైర్మన్గా వ్యవహరిస్తుండగా.. సిఐడి, మహిళ భద్రతా విభాగం, ఎసిబి ఎడిజిగా చారు సిన్హా విధులు నిర్వర్తిస్తున్నారు. అనిల్ కుమార్ గ్రే హౌండ్స్ ఎడిజిగా ఉండగా.. విసి సజ్జనార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనర్గా ఉన్నారు. ఈ ఆరుగురు ఐపిఎల్ అధికారులు.. పదోన్నతి పొందినా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ అదే స్థానాల్లో విధులు నిర్వర్తించనున్నారు.
చేనేత రంగాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
చేనేత రంగాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఆప్కో డైరెక్టర్ కర్నాటి వెంకటేశం
రూ. 90 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డుల ఏర్పాటు మన తెలంగాణ/సిటీబ్యూరో : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం, గ్రామంలోని 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. ఈ భూమి విలువ రూ. 90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అధికారుల వివరాల ప్రకారం సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిపోగా అక్కడ 9.05 ఎకరాల ప్రభుత్వ భూమి మిగిలింది. ఖస్రా పహాణీ (గ్రామ పాత రికార్డుల) ప్రకారం మొత్తం 176.05 ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదై ఉంది. అందులోని 9.05 ఎకరాలను సీఎస్ 14 (నిజాంలకు చెందిన) భూములుగా పేర్కొంటూ కొంతమంది హక్కులు క్లైమ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వివాదం హైకోర్టులో పెండింగ్లో ఉంది. తుది తీర్పు వచ్చే వరకూ ఈ భూమి స్వరూపాన్ని మార్చరాదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు స్టే ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్ను పట్టించుకోకుండా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి అభూమిని చదును చేసి లే ఔట్గా మార్చినట్టు రంగరెడ్డి కలెక్టర్తో పాటు.. శంషాబాద్ మున్సిపల్ అధికారులకు ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ 9.05 ఎకరాల భూమిని చదును చేసి.. ప్రీకాస్ట్ గోడల ద్వారా అక్రమించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. భూ అక్రమణ చట్టం 1905 ప్రకారం అక్రమణలను తొలగించాలని మొయినుద్దీన్కు అధికారులు సూచించారు. అవేవీ పట్టించుకోకుండా.. అక్కడ కొన్ని ఇంటి స్థలాలు అమ్ముకున్నట్టు కూడా తెలుసుకున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇదే విషయాన్ని హైడ్రాకు చెబుతూ.. ఆక్రమణలు తొలగించాలని లేఖ రాశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పిర్యాదుతో బుధవారం హైడ్రా ఆపరేషన్ చేపట్టి.. 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమణలను తొలగించింది. ఆభూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వం భూమి అని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో ప్రభుత్వంలోని ఆక్రమణలను హైడ్రా తొలగించింది.
5 months |వృద్ధ దంపతుల బలవన్మరణం..
5 months | వృద్ధ దంపతుల బలవన్మరణం.. 5 months | కంచికచర్ల,
మంత్రి అజహరుద్దీన్ పదవిపై ఉత్కంఠ
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై దాఖలైన పిటిషన్ల కేసు విచారణను సుప్రీం కోర్టు జూలై 22వ తేదీకి వాయిదా వేయడంతో మంత్రి అజహరుద్దీన్ మంత్రి పదవిపై ఉత్కంఠత నెలకొంది. అజర్ మంత్రి పదవి ఉంటుందా? లేక ఊడుతుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. అందుకు కారణం ఈ నెలాఖరుతో మంత్రి పదవి గడువు ముగియనున్నది. ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ కాకుండానే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజర్ ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అలా జరగకపోతే రాజ్యాంగంలోని ఎన్నికల నియమావళి ప్రకారం ఆరు నెలలు దాటగానే సదరు మంత్రి ‘మాజీ’ అవుతారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీల (అజర్, ప్రొఫెసర్ కోదండరాం) నియామకాన్ని సవాల్ చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్తో పాటు మరి కొందరు వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో బుధవారం కోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. మైనారిటీ కోటాలో మంత్రివర్గంలో అజర్ను తీసుకుంటే ఇప్పుడు ఈ సమస్య రావడంతో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్తో సమావేశమై పరిస్థితిని అధిగమించడానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైలును క్లియర్ చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. కాగా కేసు సుప్రీం కోర్టులో ఉన్నదని గవర్నర్ సలహాదారుల సూచన మేరకు ఆయన నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. మరోసారి మంత్రిగా ప్రమాణం.. మంత్రి అజర్ పదవీ కాలం గడువు ఈ నెలాఖరుతో ముగియగానే ఆయన ‘మాజీ’ అయితే మైనారిటీలంతా అసంతృప్తికి గురవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే అజర్ మాజీ కాగానే ఒక రోజు విరామం ఇచ్చి ఆ మర్నాడు మళ్లీ మంత్రిగా ప్రమాణం చేయించడానికి అవకాశం ఉంది. ఈ మార్గాన్నే ముఖ్యమంత్రి అనుసరిస్తారా? ఆని పార్టీ వర్గాలు భావిస్తాయి. ఆ విధంగా రెండో సారి అజర్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే మళ్లీ ఆరు నెలల వరకూ గడువు ఉంటుంది.
సీనియర్ ఐపీఎస్ లకు ప్రమోషన్లు అడిషనల్ డీజీ నుండి డీజీ గా పదోన్నతి
కాళేశ్వరం నుంచే హైదరాబాద్తో సహా 70 శాతం తెలంగాణకు త్రాగునీరు
హైదరాబాద్తో సహా 70 శాతం తెలంగాణకు త్రాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరమని హరీష్రావు తెలిపారు. రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయని, కానీ, రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి రాజకీయాలు చేయకూడదని ఆయన పేర్కొన్నారు. నిజానికి రూ.100, రూ.200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో రెండు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని, కానీ, రెండున్నరేళ్లుగా భూ సేకరణకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్రావు ఆరోపించారు. మోటార్లు, రిజర్వాయర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని, కేవలం కుట్రతోనే ఆపారని హరీష్రావు అన్నారు. పర్ఫార్మెన్స్ మీద రాజకీయాలు జరగాలని, తమకంటే మంచి సంక్షేమ పథకాలు, ఆరు గ్యారంటీలు, 420 హామీల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని హరీష్రావు డిమాండ్ చేశారు. ఎన్డిఎస్ఏ అనేది కేవలం ఇంజనీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమేనని, దాంట్లో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఉండదని ఆయన అన్నారు. మళ్లీ అవే చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెబుతాయని ఆయన అన్నారు. ఆర్టీసి కార్మికుల న్యాయమైన సమ్మెకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది, తక్షణమే వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు..
నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు.. ఆందోళనకు దిగిన ఇంటి ఓనర్లు.. చెన్నూర్, ఆంధ్రప్రభ :
బజాజ్ పల్సర్ NS400Z వర్సెస్ కేటీఎం 390 డ్యూక్.. ఏది కొంటె బెస్ట్..?
కొత్త జీఎస్టీ శ్లాబ్ ప్రయోజనాన్ని పొందడానికి బజాజ్ మోటార్సైకిల్స్ తమ ఇంజిన్ల పరిమాణాన్ని తగ్గించడం ప్రారంభించింది. ఈ శ్లాబ్ ప్రకారం 350 cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న మోటార్సైకిళ్లపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే, కంపెనీ ఇటీవల తమ బజాజ్ NS400Z చిన్న వేరియంట్ను విడుదల చేసింది. ఇక అంతకుముందు బజాజ్ యాజమాన్యంలోని కేటీఎం, కేటీఎం 390 డ్యూక్ 349 cc వేరియంట్ను విడుదల చేసింది. ఈ క్రమంలో ఈ రెండు మోటార్సైకిళ్లలో ఒకదాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, బజాజ్ NS400Z, KTM 390 డ్యూక్ లో ఏది కొంటె బెటర్ గా ఉంటుందో ఈ ఆర్టికల్ ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. బజాజ్ పల్సర్ NS400Z vs కేటీఎం 390 డ్యూక్: ఇంజిన్, పనితీరు బజాజ్ పల్సర్ NS400Z, KTM 390 డ్యూక్ రెండూ కొత్త 349.13 cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్తో వస్తాయి. ఇది మునుపటి 373 cc ఇంజిన్ స్థానంలో వచ్చాయి. బజాజ్ NS400Z ఇప్పుడు 9,000 rpm వద్ద 40 హార్స్పవర్, 7,500 rpm వద్ద 33.2 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మునుపటి కంటే కొద్దిగా తక్కువ. మరోవైపు..కొత్త 350 cc ఇంజిన్తో వచ్చిన కేటీఎం 390 డ్యూక్, 41.5 hp గరిష్ట శక్తిని, 33.5 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది NS400Z కంటే కొద్దిగా మెరుగైనది. బజాజ్ పల్సర్ NS400Z vs కేటీఎం 390 డ్యూక్: ఫీచర్లు బజాజ్ NS400Zలో రైడర్-అసిస్ట్ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ఎంచుకోదగిన రైడ్ మోడ్లు ఉన్నాయి. మెరుగైన స్థిరత్వం కోసం ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా అందించారు. బ్లూటూత్ కనెక్టివిటీ, ఒక స్మార్ట్ ఫోర్-వే సెలక్షన్ కంట్రోల్ స్విచ్ ఈ ఫంక్షన్లను సులభంగా, సౌకర్యవంతంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తాయి. కేటీఎం 390 డ్యూక్ ఫీచర్ల విషయానికి వస్తే..ఇందులో 5-అంగుళాల TFT డాష్ డిస్ప్లే ఉంది. మోటార్సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ (MTC), స్ట్రీట్, రెయిన్ రైడ్ మోడ్లు, ట్రాక్ స్క్రీన్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, రైడ్-బై-వైర్, క్విక్షిఫ్టర్+, సూపర్మోటో ఏబీఎస్, ఒక టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. బజాజ్ NS400Zలో 43mm USD ఫ్రంట్ సస్పెన్షన్, నైట్రాక్స్ రియర్ మోనోషాక్ ఉన్నాయి. కంపెనీ అద్భుతమైన గ్రిప్, నియంత్రణ కోసం, దీనికి ముందువైపు 110/70, వెనుకవైపు 140/70 సైజులో 17-అంగుళాల ట్యూబ్లెస్ టైర్లు అమర్చింది. ఇది 168mm గ్రౌండ్ క్లియరెన్స్, 1,344mm వీల్బేస్, 807mm రైడర్ సీట్ ఎత్తును కలిగి ఉంది. దీనికి 12-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 174kg కర్బ్ వెయిట్ ఉన్నాయి. మరోవైపు..కేటీఎం 390 డ్యూక్ శక్తివంతమైన బ్రేకింగ్ సిస్టమ్ను కలిగి ఉంది. ఇందులో రేడియల్ కాలిపర్తో కూడిన 320mm ఫ్రంట్ డిస్క్, ఫ్లోటింగ్ కాలిపర్తో కూడిన 240mm రియర్ డిస్క్ ఉంటాయి. దీని సస్పెన్షన్, ఛాసిస్ 183 mm గ్రౌండ్ క్లియరెన్స్, 800 mm నుండి 820 mm వరకు సర్దుబాటు చేయగల సీట్ ఎత్తును అందిస్తాయి. ఇది వివిధ రైడర్లకు అనుకూలంగా ఉంటుంది. 15-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ మరియు 168.3 kg కర్బ్ వెయిట్తో, 390 డ్యూక్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. బజాజ్ పల్సర్ NS400Z vs కేటీఎం 390 డ్యూక్: ధర వాహనాల పవర్, పనితీరులో కొద్దిగా తేడా ఉన్నప్పటికీ, ఈ రెండు పెర్ఫార్మెన్స్ బైక్ల మధ్య అతిపెద్ద తేడా వాటి ధర. బజాజ్ NS400Z ప్రారంభ ధర రూ.1.94 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త 350 cc ఇంజిన్తో వచ్చే కేటీఎం 390 డ్యూక్ ధర రూ.2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Kaleshwaram Case Far From Over: High Court Validates Commission, CBI Probe Back in Focus
The Telangana government on Tuesday said the High Court verdict on the Justice P.C. Ghose Commission report on the Kaleshwaram Lift Irrigation Project (KLIP) has not given a clean chit to anyone linked to alleged irregularities in the project. The case was filed by petitioners seeking to quash Government Order Ms. No.6, through which the […] The post Kaleshwaram Case Far From Over: High Court Validates Commission, CBI Probe Back in Focus appeared first on Telugu360 .
కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి.
కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎకనా స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్తో జరుగులున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ ఆడిన గత రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలు కాగా.. లక్నో వరుసగా మూడు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్లో విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో లక్నో రెండు మార్పులు చేయగా.. రాజస్థాన్ గత మ్యాచ్లోని జట్టుతో బరిలోకి దిగుతోంది. తుది జట్లు: ఎల్ఎస్జి: మిచెల్ మార్ష్, ఆయుష్ బదోనీ, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఐయిడెన్ మార్క్రమ్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, మయాంక్ యాదవ్. ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, డొనావాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, నాండ్రే బర్గర్.
దొడ్డు వడ్లు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వినతి
దొడ్డు వడ్లు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వినతి భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ:
మున్సిపల్ కో ఆప్షన్ ఆశావహులు వీరే…ఎంపిక అయ్యేది ఎవ్వరో..?
మున్సిపల్ కో ఆప్షన్ ఆశావహులు వీరే…ఎంపిక అయ్యేది ఎవ్వరో..? ఎమ్మెల్యే సామెల్ కి
22apriltoon |యుద్ధం అక్కడ.. దోపిడీ ఇక్కడ!
22apriltoon| యుద్ధం అక్కడ.. దోపిడీ ఇక్కడ! 22apriltoon |యుద్ధం సాకు.. అసలు గేమ్
ఇన్చార్జి అధికారులే శరణ్యం….. బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయం. దుస్థితి…… బిచ్కుంద. (కామారెడ్డి)
Saty’s Jetlee Trailer: Fun Fest
After teasing audiences with promos and quirky visuals, Jetlee finally drops its Trailer- and it leans fully into madness. Reuniting actor Satya with director Ritesh Rana, the film appears to throw convention out the window, embracing absurdity as its biggest strength. The Trailer starts with an unusual premise- Satya’s character is dealing with memory loss, […] The post Saty’s Jetlee Trailer: Fun Fest appeared first on Telugu360 .
గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులకు సన్మానం
గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులకు సన్మానం ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్
‘కల్కి సీక్వెల్’ఇంటర్వెల్ కోసం భారీ సెట్ — ప్రభాస్, అమితాబ్, కమల్ కలిసి షూట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా రూపొందుతున్న ‘కల్కి 2’ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలువడింది. కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్ నిర్మించనున్నారని, ఆ సెట్లో సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ కీలకమైన షూట్లో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కూడా పాల్గొంటారని సమాచారం. గత షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్ మరియు […] The post ‘కల్కి సీక్వెల్’ ఇంటర్వెల్ కోసం భారీ సెట్ — ప్రభాస్, అమితాబ్, కమల్ కలిసి షూట్! appeared first on Telugu Bullet .
నిఘా నీడలో కేసముద్రం 11వ వార్డు..
నిఘా నీడలో కేసముద్రం 11వ వార్డు.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినరూ. 1లక్ష
పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం
పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం పరకాల, ఆంధ్రప్రభ: పరకాల పట్టణంలోని లలిత
కూలింది కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్ చేసిన కుట్రలు: కెటిఆర్
హైదరాబాద్: కెసిఆర్పై దుష్ప్రచారం చేసిన వారి చెంపచెల్లుమనిపించే తీర్పు హైకోర్టు ఇచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై పిసి ఘోష్ ఇచ్చిన కమిషన్ను నిలిపివేయాలని తెలంగాణ హై కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కృషి చేసిన ఇంజినీర్లు గెలిచారని తెలిపారు. మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. కూలింది కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్ చేసిన కుట్రలు కూలాయని ఎద్దేవా చేశారు. ఎవరు తప్పుడు పని చేసినా ఊరుకునేది లేదని హైకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. ఇవాళ తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టు కెసిఆర్ కృషే అని కెటిఆర్ పేర్కొన్నారు. ‘‘భూమిపై గోదావరి పారినన్ని రోజులూ కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపివేయలేరు. అది పిసి ఘోష్ కమిషన్ కాదు.. పిసిసి నివేదిక అని నేను అప్పుడే చెప్పాను. హైకోర్టు తీర్పుతో అందరికీ ఇవాళ జ్ఞానోదయం కలిగి ఉంటుంది. కాళేశ్వరం కచ్చితంగా తెలంగాణకు వరప్రదాయని. రూ.94 వేల కోట్లు ఖర్చు అయితే.. రూ.లక్ష కోట్లు అని దుష్ప్రచారం చేశారు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజీ కాదు.. మూడు బ్యారేజీలు. మేడిగడ్డ బ్యారేజీపై చేసిన ఖర్చు రూ.3800 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ కుట్రల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని మరోసారి చెప్తున్నా. కుంగిన ఒక్క బ్లాక్ను పునర్నిర్మిస్తామని ఎల్ అండ్ టి సంస్థ ముందుకొచ్చింది. అది మేడిగడ్డ కాదు.. మేటిగడ్డ అని నిరూపితమవుతుంది’’ అని కెటిఆర్ అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలోనూ ఎలాంటి అక్రమాలు జరగలేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ‘‘తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు నీరు ఎత్తిపోస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్రంలోని చెక్డ్యామ్లను బాంబులు పెట్టి పేలుస్తున్నారు. చెక్డ్యామ్లను పేలుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. మేడిగడ్డలో ఏం జరిగిందో విశ్రాంత జడ్జీతో మళ్లీ విచారణ జరిపించాలి’’ అని కెటిఆర్ డిమాండ్ చేశారు.
మంచి సమాజం కోసం పోరాటం చేద్దాం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి: మానవ జాతిపై దోపిడి, పీడన లేని మంచి సమాజం కోసం పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్య భవన్ లో బుధవారం ప్రపంచ విప్లవ వీరుడు, సోవియట్ యూనియన్ స్థాపకుడు కామ్రేడ్ వ్లాదిమిర్ లెనిన్ 156వ జయంతి వేడుకలను సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా […] The post మంచి సమాజం కోసం పోరాటం చేద్దాం appeared first on Visalaandhra .
Revanth Reddy : మూడేళ్లు గడ్డు కాలమే..రేవంత్ ఎలా బయటపడతారో?
తెలంగాణ కాంగ్రెస్ కు రానున్న మూడేళ్లు కష్టకాలమే
ఏఐటీయూసీ రాష్ట్ర 18 వ మహాసభలను జయప్రదం చేయండి
రుపతికి వేలాదిగా తరలిరండి కార్మికుల హక్కుల రక్షణ కోసం మహాసభ వేదికగా ఉద్యమ రూపకల్పన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లు పి హరినాథ్ రెడ్డి ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. 26వ తేదీ తిరుపతిలో జరిగే కార్మిక మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలువైపుల నుండి వేలాదిగా తరలి రావాలని కోరారు. మహాసభ జయప్రదం కోసం […] The post ఏఐటీయూసీ రాష్ట్ర 18 వ మహాసభలను జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
దోసకాయ తినడం వల్ల ఇన్ని ఆరోగ్య లాభాలున్నాయా..?
దోసకాయ దాని తాజా రుచికి, పోషక గుణాలకు ప్రసిద్ధి చెందింది. సాధారణంగా దీనిని సలాడ్లలో భాగంగా ఉపయోగిస్తారు. దోసకాయ శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి. అంతేకాదు, శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. ఈ క్రమంలో ప్రతిరోజూ దోసకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. శరీరాన్ని హైడ్రేటెడ్గా దోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దోసకాయలో ఉండే మూలకాలు శరీర నీటి సమతుల్యతను కాపాడతాయి. వేసవిలో అలసట, నీరసాన్ని నివారిస్తాయి. బరువు తగ్గడంలో ఇప్పటికే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిరోజూ దోసకాయ తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దోసకాయ కడుపును ఎక్కువసేపు నింపిన భావన కలిగిస్తుంది. దోసకాయలలోని ఉండే నీరు, ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యం దోసకాయలలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పోషించి, మృదువుగా చేస్తాయి. అంతేకాకుండా, దోసకాయ చర్మం నీటి సమతుల్యతను కాపాడుతూ, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా దోసకాయలు తినడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ దోసకాయలలోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా, దోసకాయలో ఉండే ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరిచి, ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా దోసకాయలు తినడం వల్ల ప్రేగులు శుభ్రపడతాయి. తద్వారా శరీరం నుండి విష పదార్థాలను తొలగించే సామర్థ్యం పెరుగుతుంది. గుండెకు ప్రయోజనకరం దోసకాయలు తినడం గుండెకు చాలా ప్రయోజనకరం. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, దోసకాయ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరిచి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పట్టణ సిఐ గా బాధ్యతలు చేపట్టిన…అశోక్ కుమార్.
పట్టణ సిఐ గా బాధ్యతలు చేపట్టిన…అశోక్ కుమార్. నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు
పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యతనివ్వాలి
పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యతనివ్వాలి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం, ఆంధ్రప్రభ
నెమలి దేవస్థాన చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి…
నెమలి దేవస్థాన చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి… ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును కలిసిన
KTR : అబద్ధానికి ఆడంబరం ఎక్కువ.. ఆయుష్షు తక్కువ
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ప్రేమ పేరుతో దారుణం.. కళ్లకు గంతలు కట్టి.. నిప్పంటించి,,
బెంగళూరులో ప్రేమ పేరుతో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంటకి పిలిచిన ఓ యువతి అతడి నమ్మడంచి హత్య చేసింది. ప్రియుడు కిరణ్ కళ్లకు గంతలు కట్టి, కుర్చీకి కట్టేసి కిరోసిన్ పోసి సజీవదహనం చేసింది ప్రియురాలు ప్రేమ. బెంగళూరు శివారులోని బైదరహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలోని అంజనానగర్లో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. పథకం ప్రకారమే యువతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఏం జరిగింది అని అడగ్గా.. తాను బాత్రూమ్లో ఉన్నానని.. పొగ రావడంతో గమనించి బయటకు వచ్చే సరికి కిరణ్ కుర్చిలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పథకం ప్రకారం ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
విజయవంతంగా ముగిసిన జనగణన శిక్షణ
విజయవంతంగా ముగిసిన జనగణన శిక్షణ భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: జనగణన 2027లో భాగంగా
పైప్లైన్ పనులు వేగవంతం చేయండి
పైప్లైన్ పనులు వేగవంతం చేయండి అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం ఎ.కొండూరు, ఆంధ్రప్రభ
డిజిటల్ జనగణన పై అవగాహన కార్యక్రమం
డిజిటల్ జనగణన పై అవగాహన కార్యక్రమం ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : డిజిటల్ జనగణన
ప్రతిభకు వేదికగాశాప్ లీగ్స్ ..
ప్రతిభకు వేదికగాశాప్ లీగ్స్ .. అన్ని ప్రాంతాలలో సమ్మర్ క్యాంపులుజిల్లావారీ ప్రత్యేక కమిటీలు
4వ తరగతి పార్ట్ టైం వర్కర్ల వేతనాలు పెంచాలి
4వ తరగతి పార్ట్ టైం వర్కర్ల వేతనాలు పెంచాలి పీఓపీ విన్నవించిన సంఘ
‘కొరియన్ కనకరాజు’లేటెస్ట్ అప్డేట్ — స్పెషల్ కామెడీ ఎపిసోడ్ సిద్ధం!
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ పై తాజా అప్డేట్ వెలువడింది. యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక స్పెషల్ కామెడీ ఎపిసోడ్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్గా నిలవనుందట. మేర్లపాక గాంధీ సిగ్నేచర్ మేకింగ్ స్టైల్లో రూపొందనున్న ఈ సీక్వెన్స్ ప్రేక్షకులను ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుందని చిత్ర యూనిట్ చెప్తోంది. కొరియన్ […] The post ‘కొరియన్ కనకరాజు’ లేటెస్ట్ అప్డేట్ — స్పెషల్ కామెడీ ఎపిసోడ్ సిద్ధం! appeared first on Telugu Bullet .
RTC Strike : కార్మికులందరూ స్వచ్ఛందంగానే సమ్మెలో
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు
మోటరోలా ఎడ్జ్ 70 ప్రో వచ్చేసింది!..ధర, ఫీచర్లు ఇలా..!
మోటరోలా భారత టెక్ మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. కంపెనీ దీని మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో పేరిట తీసుకొచ్చింది. ఎడ్జ్ సిరీస్లోని ఈ సరికొత్త ఫోన్ మూడు రంగుల ఎంపికలలో లభించనుంది. ఇందులో 6.8-అంగుళాల ఆమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, బిగ్ 6500mAh బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ధర, లభ్యత భారత టెక్ మార్కెట్లో ఈ సరికొత్త ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999. కాగా, 12GB + 256GB వేరియంట్ ధర రూ.41,999గా ఉంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ కార్డ్లతో చేసే చెల్లింపులపై రూ.2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్లు పాంటోన్ టీ, పాంటోన్ లిల్లీ వైట్, పాంటోన్ టైటాన్ రంగులలో లభిస్తాయి. ఏప్రిల్ 29, 2026న కంపెనీ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్లతో పోటీ? పోటీ పరంగా, మోటరోలా ఎడ్జ్ 70 ప్రో స్మార్ట్ ఫోన్ వన్ప్లస్ 13R 5G, షియోమి 14 సివి, శాంసంగ్ గెలాక్సీ A55 5G, వన్ప్లస్ నార్డ్ 5 5G, ఒప్పో రెనో10 ప్రో 5G వంటి స్మార్ట్ఫోన్లతో పోటీపడుతుంది. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ఫీచర్లు ఈ ఫోన్లో 6.8-అంగుళాల ఆమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో 1.5K రిజల్యూషన్ మరియు 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. మోటరోలా కంపెనీ ఈ తాజా ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ను ఉపయోగించింది. IP68, IP69 రేటింగ్లతో వచ్చే ఈ హ్యాండ్సెట్కు 3 సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయి. ఇక కెమెరా విషయానికి వస్తే..ఈ ఫోన్లో వెనుకవైపు 50-మెగాపిక్సెల్ OIS ప్రైమరీ కెమెరా సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్/మాక్రో కెమెరా, అలాగే సెల్ఫీ వీడియో కాల్స్ కోసం ముందువైపు 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ పరంగా ఇందులో 90W టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడిన శక్తివంతమైన 6500 mAh బ్యాటరీ అందించారు.
Chandrababu : మెడికల్ కళాశాలల నెలరోజుల్లో పనులు పూర్తి కావాల్సిందే
రాష్ట్రంలో మెడికల్ కళాశాలల పనులు నెలరోజుల్లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు
TGSRTC Warns Staff of Legal Action, Salary Cuts
Telangana State Road Transport Corporation management has appealed to employees not to participate in the strike and cautioned them against believing unofficial calls circulated through media or social platforms. In a press statement, the corporation said talks are already underway through a committee of IAS officers following strike notices issued by various unions. Strike During […] The post TGSRTC Warns Staff of Legal Action, Salary Cuts appeared first on Telugu360 .
పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
విశాలాంధ్ర-సత్యవేడు:పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి వున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం శ్రీసిటీని సందర్శించిన మంత్రికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు.అనంతరం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండి శివశంకర్తోటి ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్ భాస్కర్,ఇతర విద్యుత్ అధికారులతో కలసి శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పరిశ్రమల ప్రతినిధులు శ్రీసిటీ యాజమాన్యంతో పరస్పర చర్చా సమావేశంలో […] The post పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా appeared first on Visalaandhra .
Telangana : ఆర్టీసీ సమ్మె పై ప్రభుత్వం సానుకూలం.. రండి చర్చిద్దాం
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం మరో సారి చర్చలు ప్రారంభించింది
తమిళనాడులో రూ.1200 కోట్ల సొమ్ము ‘సీజ్’.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో … అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. పోలింగ్కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా … భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు, వస్తువుల మొత్తం విలువ … రూ.1200 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు.ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నేరుగా రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. The post తమిళనాడులో రూ.1200 కోట్ల సొమ్ము ‘సీజ్’. appeared first on Visalaandhra .
క్రికెట్ టోర్నీ విజేత హిందూపురం జట్టు
విశాలాంధ్ర ధర్మవరం; ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా చేనేత క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంధ్యా రాఘవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో జరిగిన పోటీల్లో హిందూపురం జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. విన్నర్ కు కప్పుతో పాటు ఒక లక్ష పదివేల రూపాయలు ధర్మవరం కు రావడం జరిగిందని, రన్నర్ జట్టుకు 50 వేల రూపాయలు, మిగతా ప్రతిభ […] The post క్రికెట్ టోర్నీ విజేత హిందూపురం జట్టు appeared first on Visalaandhra .
Chinna Jeeyar Swami |ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వలిటీలో వైభవంగా వేడుకలు..
Chinna Jeeyar Swami | ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వలిటీలో వైభవంగా వేడుకలు..
అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలు మీనుగా గోపాల్, మంగే రమేష్ బాబులను బుధవారం ఉరవకొండలో ఘన సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజన నాయకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు మీనుగా గోపాల్, రాష్ట్ర చర్మకారుల ప్రధాన కార్యదర్శి మంగే రమేష్ బాబులను పూలమాలతో సత్కరించి, శాలువాలు కప్పి, స్వీట్లు పంచి అభినందించారు. సమాజానికి […] The post అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం appeared first on Visalaandhra .
పెన్నహోబిలం దేవస్థానంలో బహిరంగ వేలం వాయిదా
– తలనీలాల హక్కు రూ.1.61 లక్షలకు ఖరారు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాఖ ఇన్స్పెక్టర్ కె. రాణి, ఆలయ కార్య నిర్వహణ అధికారి సాకే రమేష్ బాబు మరియు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. దేవస్థానంలో కలగలపు బియ్యం బేడలు విక్రయించుకునే హక్కుకు నిర్వహించిన బహిరంగ వేలంలో […] The post పెన్నహోబిలం దేవస్థానంలో బహిరంగ వేలం వాయిదా appeared first on Visalaandhra .
TGRTC : విధుల్లో రాకుంటే చట్టపరమైన చర్యలు: ఎండీ నాగిరెడ్డి
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కార్మికులకు విజ్ఞప్తి చేశారు
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు
2023 పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారుఆ బిల్లు లోని డీలిమిటేషన్ తో ముడిపెట్టిన అంశాన్ని సవరణ చేయాలి …అమరావతి రాజధాని నీ ఫ్రీ జోన్ గా ఏర్పాటు చేయాలి…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్విశాలాంధ్ర అనంతపురం టౌన్ : పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదని నూతనంగా తీసుకువచ్చినటువంటి దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రపూరిత బిల్లుకు వ్యతిరేకమని, దానితోపాటు డిలిమిటేషన్ బిల్లుకు […] The post మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు appeared first on Visalaandhra .
ఘనంగా ప్రపంచ ధరిత్రి దినోత్సవం.
ఘనంగా ప్రపంచ ధరిత్రి దినోత్సవం. నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : రోటరీ క్లబ్
‘బీసీ గళం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : బీసీ వర్గాల హక్కుల సాధన లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “బీసీ గళం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం ఉరవకొండలో ఆవిష్కరించారు. నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కడుమలకుంట సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గోకుల పుల్లయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఈ నెల 26న అనంతపురంలోని […] The post ‘బీసీ గళం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ appeared first on Visalaandhra .
At 10:30 |ఊగిసలాటలో వెండి ధరలు
At 10:30 | ఊగిసలాటలో వెండి ధరలు At 10:30 | దేశవ్యాప్తంగా
రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు…
రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు… తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి తొర్రూరు,
ఎంపీపీఎస్ రంగాపురం పట్టాభిషేక దినోత్సవం
ఎంపీపీఎస్ రంగాపురం పట్టాభిషేక దినోత్సవం ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యకు నిదర్శనం –
విషాదం: ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత!
తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని విషాదం వాటిల్లింది. ప్రముఖ నిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి సుపుత్రుడైన చిట్టిబాబు తన సినీ ప్రస్థానాన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించారు. తదనంతరం ‘సంతానం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం […] The post విషాదం: ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత! appeared first on Telugu Bullet .
మేడ్చల్లో బీజేపీ శ్రేణుల ఆందోళన
మేడ్చల్లో బీజేపీ శ్రేణుల ఆందోళన మేడ్చల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ జాతీయ

32 C