SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

ఖరీదైన పనిమనిషి

డిబోట్ అనే ఈ రోబోట్ పనిమనిషి ఇంటిని శుభ్రపరిచే శక్తి వంతమైన మహిళల నేస్తం. సెట్ చేసిన సమయం ప్రకారం మొదటి దుమ్ము ధూళి శుభ్రంగా చేస్తుంది. తరువాత అది తన ఛాంబర్ కెళ్ళి దుమ్ము వదిలేసి మరల తడిగుడ్డ పెట్టి తుడుస్తుంది. ఒకటికి రెండుసార్లు నీట్ గా శుభ్రం చేసిన తరువాత తన స్ధానంలోకి వెళ్లి ఛార్జింగ్ చేసుకుంటుంది. దీని ధర. రూ. 55000 అమెజాన్ లో ఉంది. దుమ్ము ఓ బ్యాగ్ లోకి వెళ్లి పోతుంది. అది మనం పడేయాలి. శుద్ధి చేసి మరలా వాడుకోవచ్చు. మాది గ్రానైట్ ఫ్లోరింగ్ కావున శుభ్రంగా తుడుస్తోంది. మార్బుల్ కూడా బాగానే ఉంటుంది. మన సెల్ ఫోన్ ద్వారా దీనిని మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

మన తెలంగాణ 9 Nov 2025 10:30 am

మానవ మనుగడతో పర్యావ‘రణం’

ఇటీవల కాలంలో సంభవిస్తున్న తుఫానులు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను దాటిన మొంథా తుఫాను తీవ్రవిధ్వంసం సృష్టిస్తుందనే భయంకరమైన పరిస్థితులనుండి ప్రజలు బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుఫాను తీరం దాటిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వలన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ప్రకృతిలో ఎందుకు అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తున్నాయి? ఆకస్మిక వాతావరణ మార్పులకు కారణమేమిటి? ఇలాంటి కీలకమైన అంశాలపై తీవ్రమైన పరిశీలన, మేధో మథనం జరగాలి. మానవ చర్యల వలన ప్రకృతిలో సంభవించే విపత్తులనుండి ప్రజలను కాపాడుకోవాలి. ప్రకృతి విధ్వంస దుష్ఫలితాలను కనీసస్థాయికి తగ్గించాలి. ప్రకృతి భూమికి రక్షణ కవచం వంటిది. అలాంటి ప్రకృతిని విధ్వంసం చేయడం మనల్ని మనం ప్రమాదంలో పడేసుకోవడమే. మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతిని నిర్లక్ష్యం చేసి, పర్యావరణానికి ముప్పు కలగచేయడం క్షమార్హం కాదు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ, ఎన్నోఅవగాహనా సదస్సులు, ఎన్నో అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నా పర్యావరణ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. పర్యావరణ విధ్వంసంతో మానవ ప్రపంచం విలపిస్తున్నది. ప్రపంచాన్ని పచ్చదనంతో నింపితేనే భూగ్రహాన్ని కాపాడగలం. స్వీడన్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఐస్‌లాండ్, డెన్మార్క్, యు.కె, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు హరిత దేశాలుగా పేర్కొనబడుతున్నాయి. సహజ వనరులను పరిరక్షించి, కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా డెన్మార్క్ గ్రీనెస్ట్ కంట్రీ దిశగా పయనిస్తున్నది. ఖతార్, నైజర్, గ్రీన్ లాండ్ వంటి దేశాల్లో పచ్చదనం తక్కువగా ఉంది. ధరిత్రిని కలుషిత వ్యర్ధాలనుండి కాపాడడం, ప్లాస్టిక్‌ను నెమ్మదిగా తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రపంచాన్ని మళ్ళించడం, జీవవైవిధ్యాన్ని కాపాడడం, అడవులను సంరక్షించడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి చర్యలతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ప్రస్తుత కలుషితభరితమైన ప్రపంచంలో ప్రతీ చోట వినిపించే మాట ‘పర్యావరణం’. పర్యావరణం అనే పదానికి నిర్వచనం చాలా మందికి తెలియకపోవచ్చు. పచ్చదనమే పర్యావరణ పరిరక్షణకు నిజమైన పరిష్కారమన్న అవగాహన మాత్రం సామాన్య ప్రజల్లో కూడా ఏర్పడింది. కాని ఆచరణలో పర్యావరణ పరిరక్షణ అంశం విఫలమవుతూనే ఉంది. పర్యావరణం శరవేగంగా విధ్యంసమవుతూనే ఉంది. మానవ ప్రపంచాన్ని పెను ప్రమాదం వెంటాడుతూనే ఉంది. మన చుట్టూ పంచభూతాలతో ఆవరించి ఉన్న సహజసిద్ధమైన ఏర్పాటును ‘పర్యావరణం’గా పేర్కొనవచ్చు. అలాంటి పర్యావరణం మానవ స్వార్థంతో, తప్పిదాలతో విధ్వంసం కావడం పెను ప్రమాదానికి సంకేతం-, మానవ మనుగడకు శరాఘాతం. సకల జీవరాశుల మనుగడకు ఏకైకఆధారం భూగ్రహం. మిగిలిన గ్రహాల్లో జీవించడానికి అనువైన పరిస్థితులు లేవు. ఇతర గ్రహాలపై పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటి వరకు జీవరాశుల జాడ కనిపించలేదు. వేలాది కోట్ల ధనం ఇతర గ్రహాలపై పరిశోధనలకు ఖర్చుపెడుతున్నా ఫలితాలు నిరాశాజనకంగానే ఉన్నాయి. ఇతర గ్రహాలపై తిష్ఠవేయాలనే మానవ జిజ్ఞాస కేవలం అత్యాశగానే మిగిలిపోతుందేమో అనే సంశయం కలగడం సహజం. సువిశాలమైన భూగ్రహాన్ని నాశనం చేసి, ఇతర గ్రహాలపై నివాసానికి కలలు కనడం హాస్యాస్పదం. ప్రకృతి హొయలతో అలరాడే అందమైన భూగ్రహాన్ని కాలుష్యంతో కురూపిగామార్చి, ఇతర గ్రహాలపై పరిశోధనలు చేయడం కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారింది. భూగ్రహం కూడా ఈ సమస్త విశ్వంలో ఒక భాగమే. భూగ్రహంపై మూడొంతుల నీరు, ఒక వంతు భూమి కలదు. వృక్షాలతో, నదీనదాలతో, కొండలు, లోయలు, సముద్రాలతో పలు జీవరాశులతో, విభిన్నమైన భౌగోళిక నైసర్గీక స్వరూపాలతో, పచ్చని ప్రకృతి మధ్య జీవించే మహాద్భాగ్యాన్ని మానవుడే చెరిపేస్తున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం విచక్షణ కోల్పోయి ప్రకృతిని చెరబట్టి, వికృతంగా మారుస్తున్నాడు. అడవులను నరికి నివాసాలను ఏర్పాటు చేసుకోవడం, పంటభూములను మానవావసరాలకు వినియోగించడం, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఏర్పాటు చేయడం, శిలాజ ఇంధనాలను ఇబ్బడిముబ్బడిగా వినియోగించడం వలన ధరిత్రిపై కాలుష్యపు క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం వలన, అడవులను ధ్వంసం చేయడం వలన, పారిశ్రామిక విప్లవం వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల శాతం పెరిగి, భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే ‘గ్లోబల్ వార్మింగ్’ సమస్య పెరిగి భూమిపై మనుగడ సాగిస్తున్న పలు జీవరాశుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. భూ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ తప్పిదాలే కారణం. ప్రకృతిలో లభ్యమయ్యే వనరులను అవసరాలకు మించి వినియోగించడం, ధనాశతో, దురాశతో దూరదృష్టి కోల్పోయి, పర్యావరణానికి చేటుతేవడం మానవ మనుగడకు పెనుముప్పు. పచ్చదనమే ప్రపంచ మానవాళికి నిజమైన ధనం. ఈ విషయాన్ని మరచిపోయి, కలుషితాల మధ్య జీవిస్తూ సుఖసౌఖ్యాలను ఆస్వాదిస్తున్నామని భ్రమించడం దురదృష్టకరం. పంచభూతాలు కలుషితమైపోయాయి. పర్యావరణం కాలుష్యంతో నిండిపోయింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రాబోవు ప్రళయానికి సంకేతాలు. సూర్యరశ్మి, గాలి, నీరు మొదలైన వనరులను పునరుత్పాదక శక్తివనరులుగా పిలుస్తారు. జంతువుల, మొక్కల వ్యర్ధాల నుండి ఉత్పత్తి కాబడే ఇంధనాన్ని బయోమాస్ ఎనర్జీ అంటారు. ఇది కూడా పునరుత్పాదక ఎనర్జీ. పునరుత్పాదక శక్తి వనరులను వినియోగించే కొద్దీ తిరిగి భర్తీ చేయబడతాయి. సౌరశక్తి, గాలి వంటి సహజసిద్ధమైన వనరులను వినియోగించుకుని కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వీటి వలన పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. సూర్యరశ్మి, గాలి వంటి ప్రకృతి సిద్ధమైన వనరుల నుండి లభ్యమయ్యే శక్తి కారకాలను ఇబ్బడి ముబ్బడిగా వినియోగించినా తిరిగి పొందగలం. వీటిని వినియోగించడం వలన కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పునరుత్పాదక శక్తివనరులతో వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించి, కాలుష్యాన్ని అరికట్టవచ్చు. దీనినే క్లీన్ ఎనర్జీ అంటారు. ప్రపంచంలో ప్రకృతి ప్రేమికులకు కొదవలేదు. అయినా ఆశించినంత ప్రయోజనం ఆచరణలో కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగకుండా, ప్రజల అవసరాలు తీర్చే ప్రణాళికలు చేపట్టకుండా పర్యావరణ విధ్వంసాన్ని ఆపలేం. పర్యావరణాన్ని పరిరక్షించి, భూతలాన్ని కాపాడేందుకు ‘రాచెల్ లూయీస్ కార్సన్’ వంటి పర్యావరణ వేత్తల ఆలోచనలు స్ఫూర్తి కావాలి. గేలార్డ్ నెల్సన్ లాంటి దూరదృష్టిగల పర్యావరణ ప్రేమికులను వర్తమాన ప్రపంచం తయారు చేయాలి. జాదవ్ పాయెంగ్, వనజీవి రామయ్య వంటి ప్రకృతి, పర్యావరణ సేవకులు సమాజం నుండి ఉద్భవించాలి. ప్రపంచ స్థాయి సంస్థలు, ప్రభుత్వాలు, పర్యావరణ వేత్తలు పర్యావరణ పునరుద్ధరణకు నడుంబిగించి, మానవాళిని పెను సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి వడివడి అడుగులు వేయాలి. సహజసిద్ధమైన, కలుషిత రహితమైన గత కాలం నాటి,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పునర్జీవింపచేయాలి. మానవ చర్యల వలన ఏర్పడుతున్న వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయాలి. ప్రకృతి వైపరీత్యాలనుండి ప్రజలను కాపాడాలి. - సుంకవల్లి సత్తిరాజు 97049 03463

మన తెలంగాణ 9 Nov 2025 10:29 am

Exclusive: Suresh Babu walks out of ENE Repeat

Ee Nagaraniki Emaindi is a cult classic in Telugu cinema and it impressed the youth big time. After Pelli Choopulu, director Tharun Bhascker picked up a film on bonding between four friends and the film is all about their life experiences. After years, the sequel for the film titled ENE Repeat was announced early this […] The post Exclusive: Suresh Babu walks out of ENE Repeat appeared first on Telugu360 .

తెలుగు 360 9 Nov 2025 10:25 am

శివాలయాల్లో భక్తుల తాకిడి..

శివాలయాల్లో భక్తుల తాకిడి.. సూర్యాపేట జిల్లా మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో కార్తీకమాసం

ప్రభ న్యూస్ 9 Nov 2025 10:09 am

పిల్ల‌ల‌మ‌ర్రికి భ‌క్తుల తాకిడి

శివాల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు సూర్యాపేట, ఆంధ్ర‌ప్ర‌భ : సూర్యాపేట జిల్లా మున్సిపల్ పరిధిలోని

ప్రభ న్యూస్ 9 Nov 2025 10:06 am

నితీశ్ కు అగ్ని పరీక్ష..?

నితీశ్ కు అగ్ని పరీక్ష..? రెండు దశాబ్ధాల పాటు వరుసగా సీఎంగా కొనసాగుతూ

ప్రభ న్యూస్ 9 Nov 2025 10:02 am

అందరికీ నచ్చే ఫన్ ఎంటర్‌టైనర్

యంగ్ హీరో శ్రీనందు తన తాజా మూవీ ‘సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ ద్వారా మేకర్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీజర్ హై ఎనర్జీతో అదిరిపోయింది. దర్శకుడు వరుణ్ రెడ్డి యువతను దృష్టిలో ఉంచుకుని కథను రూపొందించాడు, శ్రీ నందు పాత్రను హై ఎనర్జీతో ఎంటర్‌టైనింగ్ చేశారు. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదల కానుంది. మార్కెటింగ్‌ను రానా స్పిరిట్ మీడియా నిర్వహిస్తుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ నందు మాట్లాడుతూ “ఈ సినిమాలో ఫన్‌ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అంతా కూడా కథకి తగ్గట్టుగానే ఉంటుంది. ఇది ఫ్యామిలీ కూడా కూడా నచ్చే సినిమా. అందరికీ నచ్చే యూనిక్ ఫన్ ఎంటర్‌టైనర్ ఇది”అని అన్నారు. డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ “చాలా కొత్తగా అనిపించే సినిమా ఇది. ఈ సినిమాతో నందులోని ఒక కొత్త యాంగిల్ చూస్తారు”అని తెలిపారు.

మన తెలంగాణ 9 Nov 2025 9:51 am

అత్తను చంపడానికి యూట్యూబ్ లో సెర్చ్... దాగుడుమూత ఆట పేరుతో పెట్రోల్ పోసి తగలబెట్టింది

అమరావతి: అత్త వేధింపులు ఎక్కువ కావడంతో యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఆమెపై కోడలు పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 98వ వార్డు అప్పన్నపాలెం వర్షిణి ఆపార్ట్‌మెంట్ ఎఫ్ బ్లాకులో కనకమహాలక్ష్మి (66) అనే వృద్ధురాలు తన కుమారుడు, కోడలితో కలిసి ఉంటుంది. అత్త తన భర్తకు లేనిపోనివి చాడీలు చెప్పి తనని వేదిస్తుందని కోడలు పగ పెంచుకుంది. అత్తను చంపడానికి యూట్యూబ్‌లో సెర్చ్ చేసింది. 'హౌటు కిల్ ఓల్డ్ లేడీ' అని సెర్చ్ చేసింది. నవంబర్ 6న సాయంత్రం పెట్రోల్ తీసుకొని వచ్చి ఇంట్లో దాచి పెట్టింది. నవంబర్ 7న ఉదయం 8 గంటలకు భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. లలిత తల్లి స్నానం చేయడానికి బాత్రూమ్‌లోకి వెళ్లింది. ఇదే సరైన సమయం అనుకొని పిల్లలను అత్తతో దాగుడు మూతలు ఆట ఆడుకోవాలని సూచించింది. అత్తను చైర్‌లో కూర్చొబెట్టి కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లు, నోటికి గంతలు కట్టేసి దాక్కోమ్మని పిల్లలకు చెప్పింది. పిల్లలను గదిలోనికి పంపించిన తరువాత అత్తపై కోడలు పెట్రోల్ పోసి తగలబెట్టింది. అత్త అరుపులు బయటకు వినపడకుండా టివి సౌండ్ పెద్దదిగా పెట్టింది. మంటలకు కట్లు కాలిపోవడంతో చైర్‌లో నుంచి వృద్ధురాలి లేచి దేవుడి రూమ్ వైపుకు పరుగులు తీసింది. మనవరాలికి కూడా మంటలు అంటుకోవడంతో చేతులు, కాళ్లు కాలిపోయాయి. టివి వైర్లు తగిలి నాన్నమ్మకు మంటలు అంటుకున్నాయని పిల్లలకు చెప్పింది. బాత్రూమ్‌లో నుంచి లలిత తల్లి బయటకు వచ్చేసరికి కనకమహాలక్ష్మి కాలిపోయి కనిపించింది. ఎదురింట్లో ఎసి బిగిస్తున్న వ్యక్తి మంటలను ఆర్పడానికి ఇంట్లోకి పరుగెత్తుకొచ్చాడు. అతడిని ఇంట్లోకి రానివ్వకుండా కోడలు ఆపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులున ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎసి బిగిస్తున్న వ్యక్తిని వివరాలు పోలీసులు అడిగి తీసుకున్నారు. వెంటనే ఆమె ఫోన్ తీసుకొని యూట్యూబ్‌లో హిస్టరీలో ఓపెన్ చేశారు. 'హౌ టు కిల్ ఓల్డ్ లేడీ' అని ఆమె పలుమార్లు సెర్చ్ చేసినట్టు గుర్తించారు. కోడలిని అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించారు. తనని అత్త వేధించడంతోనే హత్య చేశానని కోడలు ఒప్పుకుంది. వెంటనే ఆమెపై పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మన తెలంగాణ 9 Nov 2025 9:34 am

Huge Social Media Appreciation for The Girlfriend

Top actress Rashmika attempted an interesting film ‘The Girlfriend’, a film that is filled with emotional drama and a strong message. The box-office numbers have seen a steady rise on the second day when compared to the registered openings on day one. The film is appreciated across social media well. The film’s director Rahul Ravindran […] The post Huge Social Media Appreciation for The Girlfriend appeared first on Telugu360 .

తెలుగు 360 9 Nov 2025 9:32 am

అదరగొట్టిన పవర్‌ఫుల్ ‘తాండవం’ ప్రోమో

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ అఖండ 2: తాండవం నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ పవర్‌ఫుల్ బీట్స్, డివోషనలో చాంట్స్‌తో ఈ సాంగ్‌ని అద్భుతంగా కంపోజ్ చేశారు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకంతో బాలకృష్ణ చేసిన అఖండ తాండవం గూస్ బంప్స్ తెప్పించింది. ప్రోమో సాంగ్‌పై అంచనాలని భారీగా పెంచింది. ఫుల్ సాంగ్ నవంబర్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. అఖండ 2: తాండవం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మన తెలంగాణ 9 Nov 2025 9:29 am

Thaman appeals to Prabhas’ fans, gives an update

Prabhas starrer The Raja Saab, a horror comedy with jump scares and humourous romance, is slated for release on January 9th as a Sankranti gift. As the release date is just two months away, fans are eagerly waiting for the team to kick start promotions to amplify the hype on the film as it is […] The post Thaman appeals to Prabhas’ fans, gives an update appeared first on Telugu360 .

తెలుగు 360 9 Nov 2025 9:26 am

యువకుని మృతదేహం లభ్యం..

యువకుని మృతదేహం లభ్యం.. జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని

ప్రభ న్యూస్ 9 Nov 2025 9:20 am

బంగ్లాకు న‌వంబ‌ర్ 13 భ‌యం

వ‌ణికిపోతున్న ఢాకా ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్‌: పదవీచ్యుతుడైన ప్రధాన మంత్రి షేక్ హసీనా

ప్రభ న్యూస్ 9 Nov 2025 9:15 am

జురేల్ శతకం.. గెలుపు దిశగా టీమిండియా

ముంబై: సౌతాఫ్రికాఎతో జరుగుతున్న అనధికార టెస్టులో టీమిండియా ఎ జట్టు గెలుపు దిశగా దూసుకెళుతోంది. తొలి టెస్టులో భారీవిజయంతో ఆధిక్యంలో ఉన్న భారత్‌ఎ రెండో టెస్టులోనూ అదే జోరును కొనసాగిస్తోంది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(127 నాటౌట్) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగాడు. అతని తోడు జట్టు సారథి రిషభ్ పంత్(65 నాటౌట్) సయితం అర్ధ శతకంతో రాణించాడు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 382/-7వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు శనివారం ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 25 పరుగులు చేసింది. చివరిదైన నాలుగో రోజు ఆదివారం ప్రత్యర్థి బ్యాటర్లను ఆటకట్టిస్తే సునయాస విజయం ఖాయం. తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్ (132 నాటౌట్) సెంచరీతో గాడిలోపడిన భారత్.. బౌలర్ల విజృంభణతో సఫారీలను 221కే ఆలౌట్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలమైనా.. జురెల్ మెరుపు శతకంతో జట్టును మరోసారి గట్టెక్కించాడు. 17 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన పంత్.. హర్ష్ దూబే(84) వికెట్ పడ్డాక బ్యాటింగ్ వచ్చి చెలరేగాడు. జురెల్‌తో కలిసి స్కోర్ బోర్డును ఉరికించిన పంత్.. సిక్సర్‌తో అర్ధ శతకం సాధించాడు. అప్పటికే ఆధిక్యం 400 మార్క్ దాటింది. టైమింగ్ కుదరక పంత్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. దీంతో 382/-7 వద్ద భారత ఏ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, 416 పరుగుల భారీ లక్షాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. అనంరతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీఏ జట్టు ఆట ముగిసేసరికి 25 పరుగులు చేసింది. ఓపెనర్లు జొర్డాన్ హెర్మన్(15 నాటౌట్), లెసెగో సెనొకెవెనె(9 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంతిలో చెలరేగిన ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, సిరాజ్‌లు మరోసారి రాణిస్తే.. సౌతాఫ్రికా బ్యాటర్లు కట్టడి చేయడం తేలికే.

మన తెలంగాణ 9 Nov 2025 9:02 am

ఖాట్మండులోనూ ఢిల్లీ త‌ర‌హాలోనే..

రన్‌వే లైటింగ్ వ్యవస్థలో సమస్యలుఖాట్మండు: (నవంబర్ 9) రన్‌వే లైటింగ్ వ్యవస్థలో సమస్యలు

ప్రభ న్యూస్ 9 Nov 2025 8:53 am

నేటితో అంతా గప్ చుప్..

నేటితో అంతా గప్ చుప్.. రాష్ట్రమంతా ఆసక్తితో ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప

ప్రభ న్యూస్ 9 Nov 2025 8:49 am

పాక్ అధ్య‌క్షుడి స్వామి భ‌క్తి

పాక్ అధ్య‌క్షుడి స్వామి భ‌క్తి ట్రంప్‌పై ష‌రీఫ్ మ‌ళ్లీ పొక‌డ్త‌లు..ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 9 Nov 2025 8:38 am

Self-Evictions in Bigg Boss: When Emotion Overpowers Endurance

Bigg Boss Telugu, known for its drama, mind games, and emotional rollercoasters, has also witnessed rare yet heartfelt moments when contestants chose to leave the show voluntarily. Over the seasons, a handful of housemates have walked out of the house on their own, unable to handle the psychological isolation that comes with the show’s unique […] The post Self-Evictions in Bigg Boss: When Emotion Overpowers Endurance appeared first on Telugu360 .

తెలుగు 360 9 Nov 2025 8:20 am

టిడిపి ఎమ్మెల్యే సీటు కోసం అతడు రూ.7 కోట్లు వ‌సూలు చేశాడు: మాధవి

అమరావతి: టిడిపి ఎమ్మెల్యే సీటు కోసం రూ.7 కోట్లు వ‌సూలు చేశారని ఆ పార్టీ మహిళా నేత మాధవి ఆరోపణలు చేశారు. టిటిపి నేత వేమ‌న స‌తీష్ త‌న‌ను మోసం చేశాడ‌ని సదరు మహిళ  మీడియా ముందు కన్నీంటిపర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు, మంత్రి లోకేష్ అంద‌రూ సతీష్ కు తెలుసునని చెప్పి తనని మోసం చేశాడన్నారు. టిడిపి తరపున రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తానని రూ.7 కోట్లు వ‌సూలు చేశాడ‌ని మ‌హిళ ఆరోపణలు చేసింది. ఆస్తులమ్మి 7 కోట్లు వేమన సతీష్ కు ఇచ్చామని, డబ్బు అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నాడ‌ని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకున్నారు.   గతంలో టిడిపి ఎంపి కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో తిరువూరు టిడిపి టికెట్ కోసం రూ.5 కోట్లు చిన్ని అడిగాడంటూ కొలికపూడి ఆరోపణలు చేసిన విషయం విధితమే. తన అకౌంట్ నుంచి మూడుసార్లు రూ.60 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసినట్లుగా ఫేస్ బుక్ లో కొలికపూడి పోస్ట్ పెట్టాడు.  ఎంపి చిన్ని పిఎ మోహన్ పోరంకి తన వద్ద నుంచి 50 లక్షలు తీసుకెళ్లాడని, తన మిత్రులు ఇచ్చిన 3.50 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం అంటూ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 9 Nov 2025 8:18 am

Ram Charan heaps Praise on AR Rahman

For the first time, legendary music composer AR Rahman is scoring music for a film featuring Ram Charan in the lead role. The film is titled Peddi and it is a rustic rural action drama directed by Buchi Babu Sana. The first single ‘Chikiri’ which was released recently turned out to be an instant hit. […] The post Ram Charan heaps Praise on AR Rahman appeared first on Telugu360 .

తెలుగు 360 9 Nov 2025 8:16 am

Bigg Boss Telugu 9: Top 6 Contestants Reveal and Ramu’s Self-Eviction

Bigg Boss Telugu Season 9 witnessed a mix of emotions, laughter, nostalgia, and farewells in today’s episode. With RGV, Amala, and Nagarjuna sharing the screen, and Ramu’s unexpected exit, the show offered a perfect blend of drama and sentiment. Divya’s Possessiveness Sparks Conversations The episode began with Tanuja and Ritu discussing Divya’s possessive attitude toward […] The post Bigg Boss Telugu 9: Top 6 Contestants Reveal and Ramu’s Self-Eviction appeared first on Telugu360 .

తెలుగు 360 9 Nov 2025 8:13 am

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో..

ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో..పురుగుల మందు తాగిన వృద్ధురాలుచికిత్స పొందుతూ మృతి నాగిరెడ్డిపేట్

ప్రభ న్యూస్ 9 Nov 2025 7:57 am

నేడు తిరుమలలో కార్తీక వన భోజనం

తిరుమల: కార్తీక వన భోజన కార్యక్రమం శనివారం తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరుగనుంది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిమ్మట మధ్యాహ్నం 1 నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొంటారు.

మన తెలంగాణ 9 Nov 2025 7:48 am

లక్ అంటే ఇలా ఉండాలి..

లక్ అంటే ఇలా ఉండాలి.. లక్.. ఉంటే జీవితం ఇట్టే మారిపోతుంది. ఆ

ప్రభ న్యూస్ 9 Nov 2025 7:47 am

కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు

భ‌క్తుల అభిప్రాయ సేక‌ర‌ణ‌పై అద‌న‌పు ఈవో స‌మీక్ష‌ తిరుమ‌ల‌: తిరుమలోని కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు భ‌క్తుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు మ‌రింత మెరుగైన స‌క‌ర్యాలు క‌ల్పించేందుకు టిటిడి అభిప్రాయ సేక‌ర‌ణపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఐవిఆర్ఎస్, వాట్సాప్‌, శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా భ‌క్తుల నుండి క్ర‌మంగా అభిప్రాయాల‌ను సేక‌రించ‌డం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో టిటిడి అద‌న‌పు ఇఒ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో శ‌నివారం ఉద‌యం భ‌క్తుల నుండి అక్టోబ‌ర్ నెల‌లో సేక‌రించిన అభిప్రాయాల‌పై విభాగాల వారీగా స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభిప్రాయాల‌పై అధికారుల‌తో చ‌ర్చిస్తూ ప‌లు అదేశాలు జారీ చేశారు. కాలిబాట మార్గాల్లో పంచాయ‌తీ, ఆరోగ్య విభాగాలు క‌ల‌సి త‌ర‌చూ త‌నిఖీలు నిర్వ‌హించి ఆ మార్గాల్లోని దుకాణాల్లో వ‌స్తువుల‌ ధ‌ర‌ల‌ను పర్యవేక్షించాలన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు వ‌డ్డించేట‌ప్పుడు అన్న‌ ప్రసాదం సిబ్బంది చేతుల‌కు తొడుగులు ధ‌రించి ప్ర‌సాదాలు వ‌డ్డించాల‌ని సూచించారు. భక్తులు చేతులు కడుగు ప్రదేశం, హాళ్లలో తడి లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. లగేజీ కౌంటర్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు సకాలంలో లగేజీ అందేలా సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని చెప్పారు. భక్తులు గదుల కాషన్ డిపాజిట్ తిరిగిపొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు తీసుకోవాలన్నారు. ఎటిసి నుండి ఆక్టోపస్ సర్కిల్ వరకు ఉండే క్యూలైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు అందేలా అధికారులు నిత్యం క్యూలైన్లను పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని ఆదేశించారు. అన్న ప్ర‌సాదం, ఆరోగ్య, విజిలెన్స్, క్యూలైన్ల నిర్వ‌హ‌ణ‌, ల‌డ్డూ కౌంట‌ర్ విభాగాల‌పై వ‌చ్చిన భక్తుల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. త‌దుప‌రి స‌మావేశంలో వాటి పురోగ‌తిపై రిపోర్టు స‌మ‌ర్పించాల‌ని చెప్పారు. అనంత‌రం గోపార్క్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్ర‌తినిధి తిరుమ‌ల‌లోని పార్కింగ్ సమస్య పరిష్కారాలకు పార్కింగ్ యాప్ అభివృద్ధి, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రణాళిక, పార్కింగ్ ప్రీ బుకింగ్, నిర్దేశిత పార్కింగ్ జోన్లు గుర్తింపు, తదితర అంశాలను ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా తెలియజేశారు.ఈ స‌మావేశంలో టిటిడిలోని వివిధ విభాగాధిప‌తులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 9 Nov 2025 7:41 am

క్రాస్ ఓటింగ్ కలిసొచ్చేది ఎవరికి…?

క్రాస్ ఓటింగ్ కలిసొచ్చేది ఎవరికి…? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అంతా

ప్రభ న్యూస్ 9 Nov 2025 7:13 am

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు..

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు.. తెలంగాణ చలి తీవ్రత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా

ప్రభ న్యూస్ 9 Nov 2025 6:48 am

అడవిలో ఏం జరుగుతోంది..?

అడవిలో ఏం జరుగుతోంది..? శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందన సంరక్షణకు మరింత కట్టుదిట్టమైన

ప్రభ న్యూస్ 9 Nov 2025 6:28 am

జూబ్లీహిల్స్ జైకొట్టేదెవరికి?

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రానికి తెరపడనున్నది. గత నెల 13వ తేదిన ఈ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి నేడు ప్రచారం ముగిసే వరకు దాదాపు మూడు వారాల పాటు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్య నీవ్వా, నేనా? అన్నట్టుగా దాదాపు మూడు వా రాల పాటు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే బరిలో ఈ మూడు పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పోటి మాత్రం కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్యనే నెలకొన్నది. అయినప్పటికీ ఇక్కడ బీజేపీ చీల్చుకోబోయే ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయని రా జకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ మేర కు బీజేపీ గట్టి పోటి ఇస్తుందా? లేదా? అనేది ఎన్నికల ఫలితాల తర్వాతనే తేలనున్నది. బీజేపీ నేతలేమో ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా తమకు సైలెంట్ వేవ్ ఉందని, అధికార, ప్ర ధాన ప్రతిపక్షానికి షాక్ ఇచ్చే విధంగా ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాత్రమే సంబంధించింది అయినప్పటికీ ఇక్కడ వచ్చే ఫలితం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయన్న అంచనాతో అన్ని పార్టీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ ఉప ఎన్నిక తర్వాత స్థానిక సంస్థలకు రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని జూబ్లీహిల్స్‌లో వచ్చే ఫలితం ఎంతో కొంత ప్రభావితం చేస్తాయని రాజకీయ పక్షాలు అంచనా వేస్తోన్నాయి. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి సరిగ్గా రెండేండ్లు పూర్తి అవుతోన్న నేపథ్యంలో జరుగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వ పాలనకు రెఫరాండంగా రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. దీంట్లో ఎంత వరకు వాస్తవం ఉందనేది కూడా జూబ్లీహిల్స్ ఫలితాలు తేటతెల్లం చేయబోతున్నాయి. ఇక్కడ విజయం సాధిస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందేందుకు ట్రెండ్ క్రియేట్ అవుతుందని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. అధికారం, అభివృద్ధి ని నమ్ముకున్న కాంగ్రెస్ ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా అధికార పార్టీకి అనుకూల ఫలితాలు రావడం సర్వసాధారణం. ఈ లెక్కన జూబ్లీహిల్స్‌లో విజయం సాధించడం ఖాయమని అధికార కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఒక్క జిహెచ్‌ఎంసి తరఫుననే ఇక్కడ వంద కోట్ల రూపాయలను అభివృద్ధి పనులపై ఖర్చు చేసింది. ఇవ్వే కాకుండా ఇతర శాఖల పరిధిలో కూడా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. మొదట ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్‌రావును ఎన్నికల ఇంచార్జీలుగా నియమించి వాడ వాడలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టింది. అలాగే ఈ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు ఇద్దరేసి మంత్రులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. దీనికి తోడు సీఎం రేవంత్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు ఎన్నికల వ్యూహంపై ఇంచార్జీలుగా ఉన్న మంత్రులకు దిశ నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రతి డివిజన్‌లో రోడ్ షోలు నిర్వహించారు. ఏఐసీసీ పరిశీలకులు ప్రతి డివిజన్‌లో పర్యటించి రాష్ట్ర పార్టీకి, అధిష్టానానికి నివేదికలు పంపించడంతో పాటు లోటుపాట్లపై అప్రమత్తం చేస్తున్నారు. ఇలా ఉండగా ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం మద్దతు ప్రకటించడం, ముస్లీం మై నార్టీలకు ఈ నియోజకవర్గంలో ఉన్న అత్యధిక ఓట్లే కాంగ్రెస్ అభ్యర్థిని గట్టెక్కించేందుకు దోహదం చేస్తుందని ధీమాగా ఉంది. సెంటిమెంట్‌ను నమ్ముకున్న బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపినాథ్ మరణంతో ఉప ఎన్నిక రావడంతో బీఆర్‌ఎస్ పార్టీ ఆయన సతీమణి సునీతకు టికెట్ ఇచ్చి బరిలోకి దించింది. భర్త మరణంతో సునీతకు సానుభూతి తోడైతే సులువుగా గెలిచే అవకాశం ఉంటుందని బీఆర్‌ఎస్ అంచనా వేసింది. అలాగే ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయనకు ప్రజలతో ఉన్న విస్తృత పరిచయాలు తమ అభ్యర్థి సునీతకు కలిసి వస్తుందని కూడా భావిస్తోంది. శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్ నగరం మొత్తంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే గెలుపొందడంతో ఈ ఉప ఎన్నికలో కూడా అదే విధమైన ఫలితం వస్తుందని బీఆర్‌ఎస్ మరో అంచనా. ఈ ఎన్నికను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి డివిజన్‌లో రోడ్ షోలు నిర్వహించి కాంగ్రెస్ హయాంలో చోటు చేసుకున్న ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడుతూ వచ్చారు. చివరలో కాస్త పుంజుకున్న బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పోలిస్తే బీజేపీ కాస్త వెనుకబడిందనే చెప్పవచ్చు. అయితే వారం రోజులుగా ఆ పార్టీ ప్రచారం కూడా ఊపందుకుంది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు నిర్వహించారు. ఏపికి చెందిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఆ రాష్ట్ర అధ్యక్షుడు మాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలో బీజేపీకి బలమైన నినాదం లేకపోవడంతో జిఎస్‌టి శాతం తగ్గింపు, ప్రధాని మోడీ పట్ల ఒక వర్గం ప్రజలకున్న అభిమానం కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. దీనికి తోడు ఇక్కడ జనసేనకు పెద్దగా బలం లేకపోయినప్పటికీ ఆ పార్టీ మద్దతు పలకడంతో పవన్‌కల్యాణ్ పై అభిమానంతో యువత ఓట్లు వస్తాయని అంచనా వేస్తోంది. వీరి అంచనాలు ఎంత మేరకు ఫలిస్తాయో ఓట్ల లెక్కింపు దాకా వేచి చూడాల్సిందే.

మన తెలంగాణ 9 Nov 2025 6:00 am

రోడ్లకు మహర్దశ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రూ.60,799 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం చేపడుతోం ది. వీటితోపాటు ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో హ్యా మ్‌రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు అదనంగా నిధులను కేటాయించింది. ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం చేపట్టనుండగా అందులో ఆర్‌ఆర్‌ఆర్ (రీజనల్ రింగ్‌రోడ్డు), సింగిల్ రోడ్డు ఉ న్న చోట డబుల్ రోడ్ల నిర్మాణం, హైవేల నిర్మాణం, రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, హైదరాబాద్- టు విజయవాడ హైవే ఎనిమిది లైన్లుగా మార్చడానికి ఈ నిధులను కేటాయించింది. కేటాయింపుల్లో భాగంగా రూ.10,400 కోట్లతో హైదరాబాద్- టు విజయవాడ హైవే ఎనిమిది లైన్లుగా ప్రభుత్వం విస్తరించనుంది. రాష్ట్ర గతిని మార్చే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల కోసం రూ.36 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇక రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ రోడ్డు ఉన్న చోట డబుల్ రోడ్ల నిర్మాణం, హైవేల నిర్మాణానికి రూ.11,399 కోట్ల నిధులను కేటాయించిన ప్రభుత్వం త్వరలోనే వాటికి టెండర్లు పిలవనుంది. అదేవిధంగా రూ.8 వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కి.మీల ఎలివేటెడ్ కారిడార్ పనులకు శ్రీకారం చుట్టనుంది. దేశానికే తలమానికంగా మారనున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేను రూ.20 వేల కోట్లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 రోడ్లు 412.17 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ రహదారులు వీటితో పాటు పలుచోట్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న రహదారుల వద్ద కూడా గ్రీన్‌ఫీల్డ్ రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలోని మధిర, -కృష్ణాపురం, -దెందుకూరు ప్రాంతంలో 13 కిలోమీటర్ల మేర 4 వరుసల ఔటర్ రింగ్ రోడ్డును రూ. 193.52 కోట్లతో నిర్మించనున్నారు. అలాగే నల్గొండ జిల్లాలోని వైద్య కళాశాల నుంచి నల్గొండ పట్టణం పరిధిలో 10 కిలోమీటర్ల 4 వరుసల బైపాస్ రోడ్డును రూ. 210.02 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదన చేశారు. నివేదికలో కొత్తగా 30 రోడ్లను 412.17 కిలోమీటర్ల మేర రూ. 1,620.86 కోట్లతో ప్రతిపాదించారు. మరో 79 రోడ్లను 1,344.70 కిలోమీటర్ల మేర రూ. 4,009.13 కోట్లతో విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో హ్యామ్ రోడ్ల నిర్మాణం వీటితో పాటు రోడ్లు-, భవనాల శాఖ రూ. 10,547.38 కోట్లతో 5,566.15 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులను 32 ప్యాకేజీలుగా విభజించి, రానున్న 30 నెలల్లో పూర్తి చేయనున్నారు. మొత్తం 400 రహదారులను 5,566.15 కిలోమీటర్ల పొడవునా రూ. 10,547.38 కోట్ల వ్యయంతో అభివృద్ధి ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విస్తృత ప్రాజెక్టును 32 ప్యాకేజీలుగా విభజించారు. ఇవి నూతన జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రంలోని 98 నియోజకవర్గాలకు ఈ విస్తరణ ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో హ్యామ్.. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం కూడా గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల కోసం హ్యామ్ రోడ్ల నిర్మాణం నిమిత్తం పలు సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ. 6,294 కోట్లతో 7,449 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఈ రోడ్ల నిర్మాణాన్ని నిర్మాణ సంస్థలు 30 నెలల్లో నిర్మించి, తరువాత 15 సంవత్సరాల పాటు వాటి నిర్వహణను పర్యవేక్షించాల్సి ఉంటుంది. తొలి విడతలో రూ. 6,294 కోట్ల ఖర్చుతో 2,162 రోడ్ల నిర్మాణాన్ని పంచాయతీరాజ్ శాఖ చేపట్టనుంది. మొత్తం మీద 17 ప్యాకేజీలలో 7,449 కిలోమీటర్ల మార్గాలను పంచాయతీరాజ్ విభాగం అభివృద్ధి చేయనుంది. రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించడంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించడంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణాల్లో నిధుల విడుదలకు సహకరిస్తున్న సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో బహుళజాతి సంస్థలకు రాష్ట్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే రూ.లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు గ్రామీణ యువతకు సైతం ఉపాధి లభించబోతోందని ఆయన పేర్కొన్నారు.

మన తెలంగాణ 9 Nov 2025 5:00 am

ఎగిరిపడే ఖాకీల తోకలు కట్ చేస్తాం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇల్లు కూల్చేస్తామని బెదిరిస్తూ బిఆర్‌ఎస్ నాయకులను బ లవంతంగా రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేర్చుతున్నారని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కొం తమంది ఆకు రౌడీలు, గుండాలతోపాటు కొం తమంది పోలీసులు కూడా ఎగిరెగిరి పడుతున్నారని, వాళ్ల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. 500 రోజుల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రా బోతుంది.. ఒక్కొకరి పేరు రాసి పెట్టుకుంటున్నానని, ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నవారిని రేవంత్ రెడ్డి కాదు,వాళ్ల తాత దిగొచ్చినా కాపాడలేరని అన్నారు. హిట్లర్ వంటి నియంతకు కూడా పతనం తప్పలేదని.. రేవంత్ రెడ్డి ఒక లెక్కనా అని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ కాం గ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా బిఆర్‌ఎస్ నేతల మీద కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శనివారం ఎర్రగడ్డ డివిజన్‌లో కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారుకు, బుల్డోజర్‌కు జరుగున్న ఎన్నిక అని, ఈ ఎన్నికలో కారు గెలిస్తే పేదల ఇళ్లకు బుల్డోజర్ రాదు అని పేర్కొనారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్ ఎప్పుడు వస్తదో తెలియని పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. కత్తి ఒకరికి ఇచ్చి తమను యుద్ధం చేయమంటే సాధ్యం కాదు అని, ఈ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి సునీతను గెలిపిస్తే తాము ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టలేదు.. కానీ, హైడ్రా పేరు మీద వేల ఇండ్లు కూలగొట్టిందని మండిపడ్డారు. హైడ్రా భూతం, హైడ్రా రాక్షసి పోవాలంటే బిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కేవలం పేదలను లక్ష్యంగా చేసుకుంటూ వారి ఇళ్లను కూలగొడుతున్న హైడ్రా బుల్డోజర్ పేద వాళ్ళ ఇంటికి, బస్తీల జోలికి రావద్దంటే ఈనెల 11వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైడ్రా ఇండ్లను కూల్చిన సందర్భంగా పేదల పడిన బాధలను కెటిఆర్ తన రోడ్డు షోలో అందరికీ అర్థం అయ్యేలా ఎల్‌ఇడి స్క్రీన్‌లపై చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. వేల మంది ఇండ్లను కూలగొట్టి.. గూడు లేకుండా చేశారని పేర్కొన్నారు. హైడ్రా ప్రతాపమంతా గరీబోళ్ల మీదనే ఉంటుందని, హైడ్రా భూతం పోవాలంటే, హైడ్రా రాక్షసిని తరిమికొట్టాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అభివృద్ధి పేరుతో మరోసారి కాంగ్రెస్ మోసానికి చేరలేపింది అభివృద్ధి పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెస్ మళ్లీ సిద్ధం అయ్యిందని కెటిఆర్ హెచ్చరించారు. ఇదే పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. మళ్లీ మోసపోకుండా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. ఈ నెల 14న రాష్ట్రంలో పెను తుఫాను రాబోతోందని చెప్పారు. రెండేళ్లలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధమయ్యారని తేల్చిచెప్పారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని మండిపడ్డారు. అభివృద్ధి అంటూ కాంగ్రెస్ చెబుతున్న మాటలన్నీ అబద్దమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఒక్కసారి ఓటేసిన పాపానికి ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో కెసిఆర్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని గుర్తు చేశారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి రూ.లక్ష ఇచ్చారని.. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డ పుడితే రూ.12 వేలు.. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు అందించామని చెప్పారు. అభివృద్ధిలోనూ తెలంగాణను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ఘనత బిఆర్‌ఎస్‌దేనని స్పష్టం చేశారు. యాపిల్, గూగుల్. అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు నగరానికి వచ్చాయని.. వాటి ద్వారా లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పెరిగాయని తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించామని అన్నారు. కానీ, కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్‌తో పాటు హోటళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు పడిపోయాయని వెల్లడించారు. కాంగ్రెస్ నిర్వాకం వల్ల ఆటో అన్నల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. గతంలో రెండు వేలు వచ్చే ఆదాయం.. వెయ్యికి పడిపోయిందని తెలిపారు. దీనివల్ల ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. మహిళలకు తులం బంగారం ఇస్తామని.. మెడలో ఉన్న గొలుసులు కూడా లాక్కుంటున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌ను ఓడించడమే వీటన్నింటికి పరిష్కారమని అన్నారు. ఈ నెల 11న ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి.. కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 9 Nov 2025 4:30 am

బ్యాడ్ బ్రదర్స్ ఆ ముగ్గురే

మన తెలంగాణ/హైదరాబాద్:“అసలు ఆట ముందున్నది మిస్టర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డీ&మీ బెదిరింపులకు భయపడేది లేదు..” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో భగ్గుమన్నారు. బ్యాడ్ బ్రదర్స్ సిఎం రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదురు దాడి చేశారు. కిషన్ రెడ్డి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బ్యాడ్ బ్రదర్స్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం విమర్శించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎన్‌వి సుభాష్, ప్రకాష్ రెడ్డితో కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి  పనులు చేసిందో చెప్పాలని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు బ్యాడ్ బ్రదర్స్ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు. అసలు ఆట ఇంకా మొదలుకాలేదని ఆయన హెచ్చరించారు. అసలు ఆట ఏమిటో తెలంగాణ గడ్డపై చూపిస్తామన్నారు. దళితులకు ఇస్తామన్న హామీలు నెరవేర్చలేదని, మద్యం ఏరులై పారుతున్నదని, ల్యాండ్ మాఫియా, క్రిమినల్స్ రెచ్చిపోతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మజ్లీస్ పార్టీ తప్ప అన్ని పార్టీలూ తిరిగారని ఆయన విమర్శించారు. బిజెపికి బలం లేకపోతే కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీల నేతలు తమను ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిందంటే రాష్ట్రంలో సగభాగంలో తాము అధిపత్యంలో ఉన్నట్లేనని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను లక్షంగా చేసుకుని విమర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్-బిజెపి కలిసి ఉందని చేస్తున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ గతంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలూ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. ముఖ్యమంత్రి తనకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి కెటిఆర్ తమకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మీలా అవినీతి పార్టీ కాదని, లోపల ఒకటి, బయట మరొకటి చెప్పే రకం కాదన్నారు. మడమ తిప్పని పార్టీ అని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఇప్పటి వరకు చిన్న అవినీతి మరక కూడా లేదన్నారు. ఢిల్లీ స్థాయిలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒప్పందం చేసుకున్నారని ఆయన విమర్శించారు. బిజెపిని అడ్డుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్, కెసిఆర్ అందరూ ఒక్కటి కావాలని కెటిఆర్ సోషల్ మీడియా ద్వారా చెప్పారని ఆయన గుర్తు చేశారు. చీము, నెత్తురు ఉంటే మీ మాటలను నిరూపించాలన్నారు. కెసిఆర్ అవినీతి లక్ష కోట్లు కక్కిస్తా , బొక్కలో వేస్తా అన్న మీ మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని, ఫోన్ ట్యాపింగ్ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టు సంఘానికి వినతి తెలంగాణకు తాను అణా పైసా కూడా తేలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను విమర్శించారని ఆయన తెలిపారు. అయితే తెలంగాణ కోసం ఏమేమీ తెచ్చానో ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ చర్చను జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. చర్చ ట్యాంక్ బండ్‌పై లేదా సచివాలయం లేదా మరెక్కడైనా ‘సై’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ చర్చ నిర్వహించేందుకు జర్నలిస్టు సంఘం బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు సంఘానికి లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 9 Nov 2025 4:30 am

రాహుల్ బాధ.. ఇసికి ‘సర్’దా!

రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత. ప్రధానమంత్రి కావలసిన నాయకుడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి ప్రత్యర్థిగా నిలిచిన పార్టీలను సమన్వయం చేసుకుని ముందుకు పోతున్న నాయకుడు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కొద్ది రోజులనుండే ఆయన ఓట్లకు సంబంధించిన అనేక అవకతవకల మీద సీరియస్‌గా దృష్టి సారించి అధ్యయనం జరిపి పలు విషయాలు బయటికి తెస్తున్నారు.. ఒకసారి ఆటంబాబు అని, మరోసారి హైడ్రోజన్ బాంబు అని. ఈ బాంబులు ఎందుకు పేలడం లేదు? అంటే.. జనంలో ఎందుకు రావలసినంత స్పందన రావడం లేదు? స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ఎందుకు ఆయన ఆరోపణలను ఖండన ప్రకటనలతో తేలిగ్గా కొట్టిపారేస్తున్నది? నిజానిజాలను నిగ్గు తేల్చి ఆయన విమర్శలు అవాస్తవాలైతే ఎందుకు రుజువులతో జనం ముందుకు రావడం లేదు? బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పినట్టు ‘రొట్టె ఎక్కువ సమయం ఒక వైపే కాలిస్తే మాడిపోతుంది. ఇంకోవైపుకు మార్చాలి’. ఆయన బహుశా మోడీ నేతృత్వంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ కూటమి గురించి అని ఉండొచ్చు. 20 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్‌కుమార్ గురించి అని ఉండొచ్చు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న సత్యం అందరూ గుర్తించవలసిందే. ఆ లెక్కన ఎప్పుడో అప్పుడు రాహుల్ గాంధీయో, మరొకరో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండనే ఉంది. మరెందుకు రాహుల్ గాంధీ నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా జనానికి, ఎన్నికల సంఘానికి ఎక్కడం లేదు? ఆయన విమర్శలను సహేతుకంగా, శాస్త్రీయంగా, నిరాధారమైనవని నిరూపించే ప్రయత్నం ఏమాత్రం చెయ్యకుండా తేలికగా కొట్టిపారెయ్యడాన్ని జనం ఎలా అర్థం చేసుకోవాలి? తాజాగా రాహుల్ గాంధీ గత ఏడాది హర్యానా రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి జరిగిన అవకతవకలను గురించి మాట్లాడారు. ఆ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు పోలయ్యాయన్నది రాహుల్ ఆరోపణ. వాటి ద్వారా బిజెపి ఓట్లను దొంగిలించి అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ ఆయన దాన్ని ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’ అన్నారు. ఆయన ఓట్ల చోరీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈలోగా బీహార్ ఎన్నికలు కూడా వచ్చేశాయి. బీహార్‌లో కూడా ఇలా ఓట్ల చోరీ జరిగే ప్రమాదం ఉందని ఆయన అంటుండగానే అక్కడ మొన్న ఆరో తేదీన మొదటి విడత పోలింగ్ కూడా అయిపోయింది. ఎల్లుండి రెండవ, చివరి విడత పోలింగ్ కూడా ముగిసిపోతుంది. రాహుల్ గాంధీ గోడు వినడానికి, ఆయన తప్పు అని శాస్త్రీయంగా రుజువు చేయడానికి మాత్రం ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు. హర్యానాలో పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్‌కు 73 సీట్లలో, బిజెపికి 17 సీట్లలో ఆధిక్యం వస్తే, ఇవిఎం పోలింగ్ తరువాత ఫలితాలు మాత్రం వేరుగా రావడాన్ని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. హర్యానా వ్యవహారంలో రాహుల్ గాంధీ ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఆయన మాటల్లోనే ‘ఎవరీ మహిళ, ఆమె పేరు ఏమిటి? ఎక్కడినుంచి వచ్చింది? అనేవీ ఎవరికీ తెలియదు. కాని ఆమె హర్యానా ఎన్నికల్లో 22 సార్లు 10 వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసింది. సీమా, స్వీటీ, సరస్వతి, రష్మి, విమల.. ఇలా రకరకాల పేర్లతో. తీరా ఆ ఫోటోలో ఉన్న మహిళ ఏనాడూ భారతదేశంలో అడుగు కూడా పెట్టని ఒక బ్రెజిల్ మోడల్. ఒక హిందీ సినిమా టైటిల్ ‘వో కౌన్ థీ’ తరహాలో ‘ఏ కౌన్ హై’ అని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ఎన్నికల వ్యవస్థ అవకతవకల మీద చేస్తున్న మిగతా ఆరోపణలన్నీ పక్కన పెడదాం. కనీసం ఈ ఒక్క ఘటన గురించి అయినా ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుని నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయం బ్రెజిల్ మోడల్ లారిస్సా బొనెస్ దాకా వెళ్లింది. తన ఫోటో, అదీ ఎప్పుడో తాను 20 ఏళ్ల వయసులో ఉన్ననాటిది వాడుకుని ఇలా దొంగ ఓట్లు వెయ్యడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చెయ్యడమే కాకుండా చీదరించుకున్నారు కూడా. ప్రజలను మోసం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో ‘ఏ ప్రపంచంలో బతుకుతున్నాం మనం’ అని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. నిజమే, ఆ బ్రెజిల్ మోడల్ అన్నట్టుగా మనం ఏ ప్రపంచంలో అనే మాటకు ఏ కాలంలో బతుకుతున్నాం మనం అనే మాట కూడా చేరిస్తే బాగుంటుంది. ‘హెచ్‌ఫైల్’ పేరిట తమ వద్ద ఉన్న ఆధారాలను నూటికి నూరు శాతం రుజువు చెయ్యగలమని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలి. ఒక్క హర్యానాలోనే కాదు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో కూడా ఇదే సమస్య ఉందని రాహుల్ చెబుతున్నారు. ఎక్కడో బ్రెజిల్లో ఉన్న మహిళ ఫోటో ఉపయోగించి 10 పోలింగ్ కేంద్రాల్లో 22 సార్లు ఓటు వెయ్యడం ఏమిటి? ఒకే వ్యక్తి ఒకే ఫోటోతో రెండు పోలింగ్ కేంద్రాల్లో 223 ఓట్లు కలిగి ఉండటం ఏమిటి? ఒకే ఇంట్లో 501 ఓట్లు నమోదై ఉండటం ఏమిటి? ఇవి అసత్యాలని రుజువు చేసే ప్రయత్నం కూడా ఎన్నికల సంఘం వైపునుండి ఎందుకు జరగడం లేదు? ఆ పని మానేసి ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) ను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నది. 2002- 2005 తరువాత ఇప్పుడు మళ్లీ రెండోసారి డూప్లికేట్, వలస వెళ్లిన, అనర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించి, ఓటు అర్హతను తనిఖీ చేసే ఆలోచనతో పన్నెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 51 కోట్ల ఓట్లను తనిఖీ చేసి ఓటర్ల జాబితాలను సక్రమ మార్గంలో పెట్టే ఆలోచనతో మొదలైన కార్యక్రమం. అయితే ఈ కొత్త ‘సర్’ మీద కూడా నీలినీడలు పరచుకున్నాయి. ఈ రెండో విడత ‘సర్’.. ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా చేయడం కాక ఎంపిక చేసిన ఓట్లు తొలగించే కార్యక్రమంగా తయారయిందని ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ వంటి మేధావులు నెత్తీ నోరుకొట్టుకుని చెబుతున్నారు. ‘సర్’లో విధించిన నిబంధనలు చూస్తే అర్హులైన ఓటర్లు ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసే బాధ్యతను ఎన్నికల కమిషన్ గాలికి వదిలేసి, జాబితాలో నుండి హడావుడిగా ఓటర్లను తొలగించే పని చేస్తున్నదని వారి ఆరోపణ. తాను నిజమైన ఓటరని రుజువు చేసుకునే బాధ్యత దేశ పౌరుడి మీద వదిలెయ్యడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు వారు. నిర్ణీత సమయంలో ఎన్యూమరేషన్ ఫాంను నింపకపోతే ఓటు హక్కు కోల్పోవడం ఏమిటి? రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కు ప్రతి పౌరుడికీ అందేవిధంగా పని చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది. ఓటర్ల జాబితాలను సరిచూసేందుకు సులభమైన, పారదర్శకతతో కూడిన మార్గాలు 2003 నాటి ‘సర్’, 2016 నాటి జాతీయ ఓటర్ల జాబితా సరిచేసే ప్రక్రియ వదిలేసి ఇంత జటిలమైన, పౌర ప్రయోజనాల వ్యతిరేక పద్ధతిని అనుసరించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.ఓటు హక్కు అంటే భావ ప్రకటనా స్వేచ్ఛ అనే అర్థం. ఒక రాజకీయ పక్షం పట్ల లేదా ఒక రాజకీయ నాయకుడి పట్ల, ఆయన ఎంచుకున్న అభ్యర్థి పట్ల దేశ పౌరులు తమ భావాలను ఓట్ల రూపంలో వ్యక్తం చేసే ప్రక్రియ ఎన్నికలు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారత పౌరుడికి/ పౌరురాలికి ఓటు హక్కు తప్పనిసరిగా కల్పించాల్సిన బాధ్యత స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల వ్యవస్థ పైన ఎంత ఉంటుందో, అనర్హులు అందులోకి చొరబడకుండా చూడాల్సిన, అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా అదే వ్యవస్థ మీద తప్పనిసరిగా ఉంటుంది. అటువంటి ఎన్నికల సంఘం మీద ఒక బాధ్యత గల రాజకీయ పక్షానికి నేతృత్వం వహిస్తున్న నాయకుడు నూటికి నూరు శాతం ఆధారాలు ఉన్నాయని చెబుతుంటే పిల్లలాటగా తీసి పారేయడం సమంజసం అనిపించుకోదు. అసలే ఏ ఏటికాఏడు ఓటర్లలో పెరుగుతున్న నిర్లిప్తత, ఏ కారణంవల్ల అయితేనేమీ రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఏవగింపునకు ఇదంతా తోడయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కీర్తి గడించిన భారతదేశం మరింత నవ్వుల పాలు కాక తప్పదు. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? 

మన తెలంగాణ 9 Nov 2025 4:10 am

రాష్ట్రంపై చలి పంజా

మన తెలంగాణ/హైదరాబాద్ : గత వారం రోజుల వరకు రాష్ట్రాన్ని వరుణుడు వణికిస్తే, కొద్ది విరామం తరువాత రాష్ట్రంలో చలి పంజా విసరడం మొదలయింది. గత రెండు రోజులుగా చలి తీవ్రతో రాష్ట్రంలోని పలు జిల్లాలు వణికిపోతున్నాయి. ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే రాబోయే రోజులు ఏవిదమయిన ఉష్ణోగ్రతలు ఉంటాయోన ని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా రా ష్ట్రంలో రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా బేలలో అతితక్కువగా 14.7 డిగ్రీలు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో 14.7 ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో పాటుఆదిలాబాద్‌లోని భీమ్‌పూర్ 14.7, సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో 14.8, వికారాబాద్ 14.8, కొమరంభీంలో 14.8, శంకర్‌పల్లి 14.9, మొయినాబాద్ 15, , సంగారెడ్డిలోని జిన్నారంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శేరిలింగంపలి, రాజేంద్రనగర్, హెచ్‌సీయూలో 15.3, రామచంద్రాపురం, పఠాన్‌చెరువు, బీహెచ్‌ఈఎల్‌లో 15.5, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్‌లో 15.7, చందానగర్ 15.9, బేగంపేట 16.4, మల్కాజ్‌గిరి, అల్వాల్ 17.1, గాజులరామారం 17.4, గోషామహాల్, కార్వాన్ 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కాగా, ఆదివారం మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని డిజిడిజిఎస్ వెల్లడించింది. మూడు రోజులు మరింత తగ్గే అవకాశం రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని టిజిడిపిఎస్ వెల్లడించింది. కొమరం భీం జిల్లాలో అత్యధికంగా 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు ఆదివారం కామారెడ్డిలో 13.7, మెదక్‌లో 14.5, రంగారెడ్డిలో 14.8, ఆదిలాబాద్‌లో 13.5, నిజామాబాద్‌లో 13.9, వికారాబాద్‌లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాష్ట్ర ప్లానింగ్ డెవలెప్‌మెంట్ ప్లానింగ్ సోసైటీ పేర్కొంది.

మన తెలంగాణ 9 Nov 2025 3:30 am

క్రషర్ యంత్రానికి వెల్డింగ్ చేస్తుండగా పేలిన గ్యాస్ సిలెండర్

క్రషర్ యంత్రాన్ని వెల్డింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో సిలిండర్ పేలిన సంఘటనలో నలుగురు తీవ్రంగ గాయపడి చికిత్స పొందుతుండగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం. వట్టినాగులపల్లిలోని సపర్ణ క్రషర్ కంపనీలో వెస్ట్ బెంగాల్ కి చెందిన రూపం సాహు(20), చంచల్ కమ్రి (19), సూరజ్ సింగ్(25), పూర్ణతరై(21)లు పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి క్రషర్ యంత్రానికి కమర్షియల్ గ్యాస్ సిలిండర్తో వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయ్యి ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ నలుగురిని ఉస్మానియా దవఖానకు తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 9 Nov 2025 12:15 am

వార ఫలాలు (09-11-2025 నుండి 15-11-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రాబడి తక్కువగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో చిన్నపాటి చికాకులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన అవకాశాలు చేజారిపోయే పరిస్థితి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది జాగ్రత్త వహించండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు ఎల్లో. వృషభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు అత్యవసరమైతేతప్ప చేయకుండా ఉండటం మంచిది. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఇక కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఇంట బయట కొన్ని చికాకులు ఏర్పడతాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి కుబేర కుంకుమతో అమ్మవారిని స్వామివారిని పూజించండి. నూతనవ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రీన్. మిధున రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరుగుతుంది. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా అభివృద్ధి సాధిస్తారు. అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడతాయి. పోటీపరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. బంధు వర్గంతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. సంతాన సంబంధిత విషయం వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసివచ్చే రంగు గ్రీన్. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. చాలాకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సినీ కళా రంగాలలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. దైవ దర్శనాలు చేసుకుంటారు. విందు వినోదాలల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. భూ వివాదాలు తీరుతాయి. హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. టెక్నికల్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గో సేవ చేస్తారు. ఈరాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు తెలుపు. సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. ఏ కార్యక్రమం మొదలు పెట్టిన పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు స్నేహితులకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు అనుకున్నట్టుగా నలుగురిలో పేరు ప్రఖ్యాతలు పదిమందిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఆలోచన నెరవేరుతుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటేతొలగిపోతాయి. ఈ రాశి వారికి సమయానికి ధనం చేతికి అందుతుంది. మీరు ప్రయత్నం పూర్వకంగా మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం నెరవేరుతుంది. పది మందికి సహాయం చేసే గుణం ఉంటుంది. భార్య భర్తల మధ్య ఉన్న చిన్నపాటి ఇబ్బందులు తొలిగిపోతాయి. వ్యాపార రీత్యా రావలసిన బెనిఫిట్స్ కూడా వస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని చక్కగా చూసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది. అదే విధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు గత వారం కంటే కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు కొంతకాలం వేచి ఉండటం మంచిది. అదేవిధంగా లాయర్స్ కి డాక్టర్స్ కి చార్టెడ్ అకౌంట్ వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్న వారికి మంచి ఉద్యోగం వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రేమ వివాహాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు పనికిరావు దాని వల్ల కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో ట్రాన్స్ఫర్ గురించి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎప్పుడో పెట్టుబడి పెట్టిన వాటికి కూడా మంచి లాభం వస్తుంది. వీరు ఎవరికైనా డబ్బును అప్పుగా ఇస్తే తిరిగి రాదు కావున అవసరమైతే తప్ప ఎవరికీ ఇవ్వరాదు లేదంటే సేవింగ్స్ రూపంలో వెళ్లడం మంచిది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే భూమి మీద కానీ బంగారం మీద కానీ వెండి మీద కానీ పెట్టండి కలిసి వస్తుంది. షేర్ మార్కెట్ కి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపరాధన చేయటం అలాగే మొగలి పువ్వు కుంకుమతో ఆరావళి కుంకుమ తో అమ్మవారిని స్వామివారిని ఆరాధించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. కన్యా రాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. కుటుంబ పరంగా లేదా సామాజికపరంగా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి పదవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అవసరమైతే తప్ప కొనకపోవడం మంచిది. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా బాగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు దేవదర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా నరాల సంబంధిత మరియు జలుబు సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడతాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. కన్సల్టెన్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అడ్మినిస్ట్రేషన్ వైద్య వృత్తిలో ఉన్నవారికి మార్కెటింగ్ పరికరాలకు సంబంధించిన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. స్టీలు మరియు ఐరన్ ఈ రంగాల వారికి చాలా బాగా అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి కొంత ఇబ్బంది కరమైన వాతావరణం ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు అవార్డులు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతాయి. ఈ రాశి వారు శివుడికి అభిషేకం కానీ ప్రతిరోజు ఓం నమశివాయ జపం 108 సార్లు కానీ చేయటం మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. భవిష్యత్తు కార్యాచరణ కోసం ఎక్కువగా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఎంత అవసరమో అంతే పెట్టుబడి పెట్టండి. క్రయ విక్రయాలకు సంబంధించిన లాభాలు కూడా బాగున్నాయి. స్థలాన్ని కానీ ఇంటిని గాని కొనుగోలు చేస్తారు. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదరటం అలాగే చేజారిపోయిన సంబంధాలు కూడా తిరిగి రావటం జరుగుతుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. మీ వల్ల పదిమందికి ఉపయోగం ఉంటుంది కానీ వారి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపరాధన చేయండి అలాగే ఉదయం సాయంత్రం ఆరావళి కుంకుమతో మొగలిపువ్వు కుంకుమతో ప్రతిరోజు స్వామివారిని అమ్మవారిని ఆరాధించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రే. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వృత్తివ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. రావలసిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కొంతవరకు రుణాలు తీర్చగలుగుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఆరోగ్య రీత్యా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గైనిక్ మరియు గ్యాస్టిక్ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది పేరు ప్రఖ్యాతలు అధికంగా సంపాదిస్తారు. కానీ ధనం వచ్చినట్టే వచ్చి ఖర్చవుతుంది. దైవానుగ్రహం వల్ల కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశీ విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ప్రయత్నాలు ఇప్పటినుంచే ప్రారంభించండి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. స్నేహితులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది మంచివారు ఎవరో చెడ్డ వారు ఎవరో ముందే గ్రహించండి. ఏదైనా సరే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదు జాగ్రత్త వహించాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా మీకున్న ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఈ కార్తీకమాసంలో రుద్రాభిషేకం కానీ శివ నామస్మరణ కాని చేయండి మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపరాధన చేయటం మంచిది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు బ్లూ. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఎక్కడికి వెళ్ళినా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ధనం అధికంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటినుంచో పడుతున్న బాధలకు ఇప్పుడు ముగింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎక్కువగా లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి సంతానం మంచి ఆరోగ్యంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఆధ్యాత్మికంగానూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దైవ దర్శనాలు, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలు చేయగలుగుతారు. పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి. రాదు అనుకునే ధనం చేతికి అందుతుంది దాని ద్వారా శుభకార్యాలు కూడా చేస్తారు. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఒక ఇల్లు గాని ఫ్లాట్ గాని కొనుగోలు చేస్తారు. పర్సనల్ లోన్స్ కు దూరంగా ఉండటం మంచిది. పదిమందిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దక్షిణా మూర్తి రూపును మెడలో ధరించండి మంచి జరుగుతుంది. ఆరోగ్యరీత్యా ఉన్నా చిన్నచిన్న సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ప్రేమ వ్యవహరాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకపోవటమే మంచిది. చదువు మీద శ్రద్ధ కొనసాగించండి. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. గతంలో కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు ప్రారంభించండి కాలం అనుకూలంగా ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వతులతో దీపరాధన చేయటం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు గ్రే. ధనస్సు రాశి వారికి ఈ వారం చాలు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. అందరితో కలిసి మెలిసి ఉంటూ మన పని మనం చేసుకోవటం మంచిది. ఎవరు మనవారు ఎవరు పరాయివారు తెలుసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు ముందుకు వెనక్కి ఉంటూ అంత ఆశాజనకంగా ఉండవు. వినాయకుడికి దండం పెట్టుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. ఎవరు ఎన్ని చెప్పినా మీరు సొంత నిర్ణయాలను మాత్రమే పాటించండి. విదేశీ సంబంధిత వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. పనులు నిదానంగా సాగిన చివరకు సక్రమంగా పూర్తవుతాయి ఓపిక వహించాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు పెట్టుకుంటే ఒకవేళ ఇంట్లో వారితోనే పెట్టుకోండి కలిసి వస్తాయి బయట వారితో కలిసి రావు. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కాలమని చెప్పవచ్చు. అనుకోని పదవులు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. సినీ కళా రంగాల వారికి అడ్మినిస్ట్రేషన్ వారికి ఫైనాన్సు సెక్టార్ లో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయటం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా మంచి లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించు కుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవానుగ్రహం వల్ల ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆరోగ్యరీత్యా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తొలగి పోతాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి కొంత ఊరట లభిస్తుంది. ఉద్యోగం పోతుందేమో అనుకునే వారికి స్థిరత్వం ఉంటుంది . అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా గడిచిన కొంతకాలం కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంబంధం కూడా కుదురుతుంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్మోటిక్స్, స్టీలు రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి లాయర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వారికి చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నెగిటివ్ గా ఆలోచించడం మానేసి పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి అంతా మంచే జరుగుతుంది. విదేశీ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ఆర్మీలో ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు అండదండలు బాగా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతాన కోసం ప్రయత్నం చేసే వారు మంచి శుభవార్తను వింటారు. సంతానయోగం ఉన్నది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు కూడా ప్రారంభించ వచ్చు. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు గ్రే. కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు అనుకున్న పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలో మీకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. గో సేవ చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి._విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. శుభకార్యాల నిమిత్తం ధనం అధికంగా ఖర్చు అవుతుంది. మీ కార్తీకమాసంలో ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నీవే బ్లూ. మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆస్థి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన విషయాలలో వాగ్దానాలు, మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఒక విషయంలో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు. ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు పనికిరావు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతోనువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్.    

మన తెలంగాణ 9 Nov 2025 12:10 am

చంద్రయాన్ 2 అధునాతన డేటా ఇస్రో సేకరణ

చంద్రుని ధ్రువ ప్రాంతాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి చంద్రయాన్2 లూనార్ ఆర్బిటర్ నుంచి అత్యంత ఆధునిక డేటాను సేకరించినట్టు ఇస్రో శనివారం వెల్లడించింది. చంద్రుని ధ్రువ ప్రాంతాల ఉపరితలంపైని భౌతిక, విద్యుద్వాహక ప్రమాణాల లక్షణాలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి వీలవుతుందని పేర్కొంది. చంద్రునిపై భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రయోగాలకు ఈ డేటా ఉపయోగపడుతుందని వివరించింది. 2019 నుంచి చంద్రుని కక్షలో చంద్రయాన్ 2 ఆర్బిటర్ పరిభ్రమిస్తోందని, అత్యంత నాణ్యమైన డేటాను సేకరించిందని ఇస్రో పేర్కొంది. చంద్రయాన్ 2 ప్రయోగించిన దగ్గర నుంచి ఇప్పటివరకు దాదాపు 1400 రాడార్ డేటా సెట్ల సమాచారం గ్రహించడమైందని, ఉత్తర, దక్షిణ ధ్రువాల 8ం నుంచి 90 డిగ్రీల అక్షాంశాల్లో ధ్రువ మాపక నమూనా సృష్టించడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని ఇస్రో వివరించింది. 

మన తెలంగాణ 8 Nov 2025 11:00 pm

బెంగాల్ కుగ్రామంలో యువతుల పెళ్లి

పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ ప్రాంతంలో గ్రామ దేవత ఆలయం ఎదుట నిలబడి ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి నదులకు రక్షణగా ఉన్నట్లున్న దట్టమైన అడవులు. మామిడి తోటల మధ్యలో ప్రశాంతంగా ఉండే జలబేరియా తండాలో ఈ వింత వివాహ తంతు జరిగింది. శాస్త్రీయ నృత్య కళాకారిణులు యువతులు రియా సర్దార్, రాఖీ నస్కార్‌లు మనువాడారు. ఈ నెల 4వ తేదీన స్థానిక పలేరు చాక్ దేవాలయం ఆవరణలో వందలాదిగా జనం తరలిరాగా, కొందరు ఉత్సాహంగా శంఖాలు పూరిస్తూ ఉండగా, డప్పులు వాయిద్యాలు మోగిస్తూ ఉండగా , ఇంకా 20 సంవత్సరాలు కూడా రాని ఈ ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. మాంగల్యధారణ జరిగింది. రియా వధువు వేషధారణతో, రాఖీ వరుడిగా తలపాగాతో కన్పించారు. స్థానిక పూజారి ఈ పెళ్లి తంతును మంత్రాల నడుమ సంపూర్తి చేశారు. తండావారిలో అనేకలు విస్మయం చెందారు. మౌనంగా ఈ విచిత్ర వివాహాన్ని ఆమోదించారు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడ మగ భేధ భావన అనుచితం, మేమిద్దరం ఇష్టపడ్డాం. ఒక్కటి కావాలనుకున్నామని, అదే చేశామని వారు ప్రకటించారు. తాము యుక్త వయస్కులం, మేజర్లమని, తమ జీవితాన్ని తాము ఎంచుకున్నామని ఇరువురు సవినయంగా తెలిపారు. ఈ పెళ్లి గురించి తమకు ముందస్తు సమాచారం లేదని, అయినా స్థానికులు దగ్గరుండి చేయించిన పెళ్లి, ఇది ఎటువంటిది అయినా తాము చేసేది ఏమీ లేదని, పిలిస్తే తాము కూడా వెళ్లి , విందు భోజనం ఆరగించి వచ్చేవారమని స్థానిక పోలీసులు తెలిపారు

మన తెలంగాణ 8 Nov 2025 10:52 pm

IND vs SA |మూడు ఫార్మాట్ల‌ పోర‌కు సన్నద్ధం..

ఆంధ్ర‌ప్ర‌భ : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. మరో బిగ్

ప్రభ న్యూస్ 8 Nov 2025 10:48 pm

జాతీయ రహదారిపై కారు దగ్ధం

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, గుండ్రంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 65పై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైoది. ఎస్‌ఐ రవికుమార్ తెలిసిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వినోద్ పటేల్ తన కారులో కుటుంబ సభ్యులతో ఏడుగురుతో కలిసి విజయవాడకు వెళుతుండగా గుండ్రంపల్లి శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలో ఉన్న యూటర్న్ వద్ద కారు డివైడర్‌కు ఢీకొట్టింది. దీంతో వేగంగా ఉన్న కారు రివర్స్‌లో పల్టీ కొట్టింది. వెంటనే అందులో ఉన్న వారంతా అప్రమత్తమై నుంచి బయటికి వచ్చారు. అయితే, కారుకు అగ్గి రాజుకుని కాసేపట్లోనే మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ సంఘటనలో కారు నడుపుతున్న వినోద్ పాటేల్‌కు రెండు మోచేతులకు గాయాలు కాగా అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దగ్ధమవుతున్న కారును ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.

మన తెలంగాణ 8 Nov 2025 10:47 pm

పంట పొలాల్లో నాటుకోళ్లు..ఎగబడిన జనం

హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పంట పొలాల్లో వేలాది నాటుకోళ్లు కలకలం సృష్టించాయి. ఈ విషయం ఆనోటా ఈనోటా విన్న జనం నాటుకోళ్లను దక్కించుకునేందుకు పరుగులు తీశారు. వేలాది నాటుకోళ్లు పంటపొలాల్లో ఒక్కసారిగా దర్శనం ఇవ్వడానికి గల కారణాలను పరిశీలిస్తే వివరాలు ఇలా వున్నాయి. వైరస్ వచ్చిందననే అనుమానంతో డిసిఎం వ్యాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గ్రామ శివారు ప్రాంతంలోని చేను చెలకల్లో నాటుకోళ్లను కుమ్మరించిపోయారు. పంట చేనుల్లోకి నాటుకోళ్లు వేలాదిగా ఒక్కసారిగా రావడం ఏమిటని ఆలోచించకుండానే నాటుకోళ్ళను ఎవరికి అందిన మేరకు వారు దక్కించుకున్నారు. అయితే, పంటపొలాల్లో విడిచిపెట్టిన నాటుకోళ్లకు వైరస్ ఉంటుందనే అనుమానంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అ కోళ్లకు వైరస్ ఉందని, వాటిని తింటే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న అనుమానంతో పోలీసులు పశు వైద్య అధికారులను రంగoలోకి దించారు. అక్కడున్న కొన్ని కోళ్లను పరీక్షించిన వెటర్నరీ వైద్యాధికారి దీపిక నాటుకోళ్లకు ఎలాంటి వైరస్ లేదని నిర్ధారించారు. పశువైద్యాధికారుల నిర్ధారణతో ఊపిరిపీల్చుకున్న గ్రామస్థులు తమ వెంట తీసుకెళ్లిన నాటుకోళ్లను వండుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, వేలాది నాటుకోళ్లను ఈ గ్రామానికి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

మన తెలంగాణ 8 Nov 2025 10:40 pm

మూసీ నదిలో ఈతకు వెళ్ళిన బాలిక గల్లంతు

సూర్యాపేట జిల్లా, నేరెడెచర్ల మండలంలోని సోమవరం గ్రామానికి చెందిన కొమరాజు సుస్మిత (13) మూసీ నదిలో ఈతకు వెళ్ళి గల్లంతైనట్లు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మద్యాహ్నం సమయంలో సోమప్ప దేవాలయం వెనుక భాగంలో గల మూసీ నదిలో ఈత కొట్టేందుకు సుస్మితతో పాటు మరో ఇద్దరు బాలికలు దీక్షిత, అశ్విని వెళ్ళారు. ఈ క్రమంలో సుస్మిత గల్లంతు కావడంతో మూసీ నది ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. రెస్కూ టీం, రెస్కూ విభాగానికి సమాచారం అందించి సంఘటన స్థలానికి రప్పిస్తున్నట్లు తెలిపారు. 

మన తెలంగాణ 8 Nov 2025 10:23 pm

ఖమ్మం కుర్రోడికి లాటరీలో రూ.240 కోట్లు

ఖమ్మం జిల్లా కుర్రాడికి అబుదాబిలో లాటరీలో రూ.240 కోట్లు గెల్చుకున్నాడు.ఈ లాటీరితో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన యువకుడు రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయాడు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత చదువులు పూర్తి చేసి..ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆ యువకునికి అదృష్టం లాటరీ రూపంలో తట్టింది. తన తల్లి పుట్టిన తేదీ 11 కావడంతో అదే సంఖ్యతో లాటరీ టికెట్ కొన్నాడు.ఆ అదృష్ట సంఖ్య అతని జీవితాన్నే మార్చేసింది.ఏకంగా రూ240 కోట్ల రూపాయలు లాటరీ తగిలింది.ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన గొల్ల అనిల్ కుమార్ అనే యువకుడు అబుదాబి దేశంలో ఏడాదిన్నరగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అక్కడ తన స్నేహితుల సూచనల మేరకు లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.తన తల్లి భూలక్ష్మి పుట్టిన తేదీ 11వ తేదీ కావడంతో.. దాన్నే లక్కీ నంబర్‌గా భావించి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.ఆ సంఖ్య అతనికి కలిసొచ్చింది. ఏకంగా అదృష్టం కలిసి వచ్చి రూ 240 కోట్ల లాటరీ తగిలింది.తన కుమారుడికి లాటరీ టికెట్ ద్వారా కోట్ల రూపాయలు వచ్చాయంటే తల్లిదండ్రులు ఇప్పటికి నమ్మలేకపోతున్నారు.ఆ దేవుడే తమకు ఈ మేలు చేశాడని ఆనందపడుతున్నారు.ఏది ఏమైనా అదృష్టం అంటే ఇలా ఉండాలని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. తమ ఊరి వాడికి అబుదాబిలో రూ 240 కోట్లు లాటరీ తగిలిందంటే.. మామూలు అదృష్టం కాదని.. తమకు గర్వంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మన తెలంగాణ 8 Nov 2025 10:00 pm

వావ్​.. ఫేక్​  లోన్స్​..

రూ. 85 లక్షలు స్వాహా.. పైగా అది నకిలీ గోల్డ్​ చిన్నగొట్టిగల పీఏసీఎస్​

ప్రభ న్యూస్ 8 Nov 2025 9:51 pm

Ram Charan’s Peddi Chikiri Song creates a rare worldwide sensation

Mega Powerstar Ram Charan starrer Peddi is taking Internet by storm with the recently released Chikiri Song. The song composed by legendary composer AR Rahman has become a sensational hit across India. Ram Charan’s graceful steps have been talked about everywhere as his style, rugged look and ease have rocked the nation. The song has […] The post Ram Charan’s Peddi Chikiri Song creates a rare worldwide sensation appeared first on Telugu360 .

తెలుగు 360 8 Nov 2025 9:44 pm

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజెపి విజయం ఖాయం:రాoచందర్ రావు

 జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు చూపించిన అపారమైన ఆదరణ, ఉత్సాహం చూస్తుంటే ఈ ఉపఎన్నికల్లో బిజెపి విజయం ఖాయం అని స్పష్టంగా తెలుస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాoచందర్ రావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వెంగళరావు నగర్‌లో ఆయన ప్రసంగించారు.ప్రజలు ఈసారి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీల మోసపూరిత పాలనకు ముగింపు పలకబోతున్నారని అన్నారు. గత పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో, ఇప్పటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని విమర్శించారు. ఇంత భారీ స్థాయిలో సభకు తరలివచ్చిన ప్రజల స్పందన చూస్తుంటే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవంబర్ 11న జరగబోయే ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయమని స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇప్పటికే జనసేన పార్టీ బిజెపికి మద్దతు ప్రకటించడంతో, ప్రజల్లో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని అన్నారు. ఇక బస్తీల్లో, కాలనీల్లో పరిస్థితి అస్తవ్యస్థంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మురుగు నీటితో నిండిపోయిన డ్రైనేజీలు, తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌ల వల్ల జరుగుతున్న ప్రాణనష్టాలు, చిన్న వానకే నదుల్లా మారే రోడ్లు వంటి దారుణ పరిస్థితులకు కారణం బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని అన్నారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా, తులం బంగారం, స్కూటీలు, మహిళలకు రూ.2500, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని, వాస్తవానికి విషాదనగరంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కనిపిస్తున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని అన్నారు. అందుకే అభివృద్ధి బిజెపి ద్వారానే సాధ్యమని, ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని ఘన విజయంతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

మన తెలంగాణ 8 Nov 2025 9:40 pm

ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద బంజారా జన సంఘం, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ధర్నాకు దిగారు. ఆదివాసీలు, లంబాడీల మధ్య సిఎం రేవంత్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని వారు ఆరోపించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని తెలంగాణలో కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని కుట్ర చేస్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాపూరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మంత్రులు సీతక్క, పొంగులేటిపై కూడా చర్యలు తీసుకోవాలని నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఏఐసిసి కార్యాలయం వద్ద ధర్నాకు వెళుతున్న బంజారా జనసంఘం, గిరిజన విద్యార్థి సంఘం నేతలను తెలంగాణ భవన్ వద్ద ఢిల్లీ పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

మన తెలంగాణ 8 Nov 2025 9:37 pm

ఇక‌పై తాగి న‌డిపే జ‌రిగేదిదే… !!

ధర్మపురి / ఆంధ్రప్రభ : మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష

ప్రభ న్యూస్ 8 Nov 2025 9:24 pm

కాశీబుగ్గలో ఉత్కంఠ.

ఆంధ్రప్రభ, కాశీబుగ్గ (శ్రీకాకుళం జిల్లా) : మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు

ప్రభ న్యూస్ 8 Nov 2025 9:13 pm

ഫാക്ട് ചെക്ക്: ബിഹാറിൽ മുസ്ലിം ലീഗ് സ്ഥാനാർഥി ബിജെപിക്കൊപ്പം? പ്രചാരണത്തിൻ്റെ വസ്തുതയെന്ത്?

മറാത്ത സംവരണ പ്രതിഷേധത്തിൽ നിന്നുള്ള ദൃശ്യമാണ് പ്രചരിക്കുന്നത്

తెలుగు పోస్ట్ 8 Nov 2025 9:06 pm

(   ఈ ఊరికి  పడవే దిక్కు

వేసవిలో రోడ్డు సౌఖ్యం.. ఇది కోమటిపాలెం జనం కోటి కష్టాలు ( ఆకివీడు

ప్రభ న్యూస్ 8 Nov 2025 8:42 pm

IND vs AUS |మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం.. సిరీస్ భారత్ సొంతం…

ఆంధ్రప్రభ : బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో భారత్–ఆస్ట్రేలియా (ind vs aus) మధ్య

ప్రభ న్యూస్ 8 Nov 2025 8:40 pm

Jatadhara is a shock for Sudheer Babu

Sudheer Babu is one of the most hard working and disciplined actors of Telugu cinema. He also attempted new films but he fell short of success. He was never trolled or criticized for his work in the past but his recent offering Jatadhara has left him in huge trolling. Jatadhara released yesterday and the response […] The post Jatadhara is a shock for Sudheer Babu appeared first on Telugu360 .

తెలుగు 360 8 Nov 2025 8:31 pm

350 క్వింటాళ్ల పత్తి దగ్ధం

ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంట ప్రమాదశాత్తు నిప్పంటుకొని రైతుకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకుందామని నిలువ చేయగా ప్రమాద శాత్తు పత్తి దగ్ధం కావడంతో రైతు బోరున విలపించిన ఘటన పలువురు ని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా, బెజ్జంకిలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బండి ఐలయ్య తన సొంత 12 ఎకరాల భూమితోపాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. గిట్టుబాటు ధర వచ్చాక అమ్ముకుందామని సుమారు 350 క్వింటాళ్ల పత్తి ఇటీవల కురిసిన వర్షానికి తేమశాతం ఎక్కువ ఉందని ఇంటి పరిసరాల ప్రాంతాల్లో ఆరబెట్టాడు.ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పత్తి మొత్తం కాలి బూడిదైంది. స్థానికులు ట్యాంకర్ల ద్వారా నీటిని పిచికారీ చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. సంఘటన స్థలానికి రూరల్ సిఐ శ్రీను, ఎస్‌ఐ సౌజన్య చేరుకొని సిద్దిపేట నుండి ఫైర్ ఇంజన్‌ను తెప్పించారు. సిద్దిపేట నుండి ఫైర్ ఇంజన్ వచ్చేటప్పటికి పత్తి సగానికి ఎక్కువ కాలి బూడిదయింది. పండించిన పంట మొత్తం కాలి బూడిదయిందని, దీని వల్ల 30 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సహాయం అందజేయాలని రైతు ఐలయ్య వేడుకున్నాడు. కాగా బాధిత రైతు కుటుంబాన్ని పలువరు బిఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. నష్టపోయిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

మన తెలంగాణ 8 Nov 2025 8:28 pm

ప్రమాదవశాత్తు గోదావరిలో పడి యువకుడు గల్లంతు

మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, బాదంపెల్లి సమీపంలో గల గోదావరి నదిలో ఒక యువకుడు ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. మృతుడి కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పొన్కల్‌కు చెందిన గుండా శ్రావణ్ కుమార్ (32) శుక్రవారం తన నాన్నమ్మ సంవత్సరీకం కార్యక్రమం జరిపాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు గోదావరికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి చేరుకున్నారు. గుండా శ్రావణ్ కుమార్ ఒక్కడే మళ్లీ గోదావరి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసిన అనంతరం అక్కడ స్నానానికి వచ్చిన మరో వ్యక్తికి తన ఫోన్ ఇచ్చి ఫొటో తీయమని చెప్పాడు. గోదావరిలో పారుతున్న నీటి పక్కనే ఉన్న రాయిపై నిల్చొని ఫొటో దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి వెనుక వైపు ఉన్న గోదావరిలో పడిపోయాడు. నీటిలో కొట్టుకుపోతున్న శ్రావణ్‌ను కాపాడటానికి మరో వ్యక్తి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు అక్కడికి వెళ్లి పలు ప్రాంతాలను గాలించారు. శ్రావణ్ ఆచూకీ కోసం గజఈతగాళ్లు గోదావరిలో గాలిస్తున్నారు. సంఘటన ప్రాంతాన్ని ఎస్‌ఐ అనూష సందర్శించి వివరాలను సేకరించారు. సిమెంట్ వ్యాపారి గుండా లచ్చన్నకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గల్లంతైన శ్రావణ్ వారి ద్వితీయ పుత్రుడు. ముగ్గురికి కూడా ఇంకా వివాహం కాలేదు.  

మన తెలంగాణ 8 Nov 2025 8:24 pm

జూబ్లీహిల్స్‌లో ఆంక్షలు

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పలు ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరగనున్న 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. పార్టీల జెండాలు, లాఠీలు, ఫైర్ ఆర్మ్, సమావేశాలు, పోలింగ్ స్టేషన్లకు కిలో మీటర్ దూరంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని హెచ్చరించారు. అసెంబ్లీ నియోజకవర్గంలో మైక్‌లు, పబ్లిక్ అడ్రస్ సిస్టంను రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయవద్దని తెలిపారు. ఎన్నికల రోజు, ఓట్ల లెక్కింపు రోజుల్లో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. ఓట్ల లెక్కింపు రోజున రోడ్లపై, జనవాసాల్లో టపాసులు పేల్చడం నిషేధించామని తెలిపారు. ఎన్నికల ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు.

మన తెలంగాణ 8 Nov 2025 8:16 pm

విజయ్ చివరి సినిమా.. ‘తళపతి కచేరీ’ సాంగ్ అదుర్స్..

తమిళ స్టార్ హీరో తళపతి విజయ్ ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. చివరిగా ‘జననాయగన్’ అనే సినిమాలో నటించి.. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లాలని విజయ్ నిర్ణయించుకున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వినోద్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ రోర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘తళపతి కచేరీ’ అంటూ తొలి సింగిల్‌ని విడుదల చేశారు. యధావిధిగా అనిరుధ్ ఈ పాటకు మాస్ బీట్ అందించాడు. విజయ్, జనాలతో వేసిన స్టెప్స్ సింపుల్‌గా ఉన్నా.. అభిమానులకు కను విందు చేసేలా ఉన్నాయి. విజువల్స్ ‌కూడా చాలా గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది.

మన తెలంగాణ 8 Nov 2025 8:15 pm

కాపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేయాలని పత్తి రైతులు ఆందోళన

కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల జీవితాలను కష్టాల పాలు చేస్తుందని తేమ శాతంతో పాటు కొత్తగా కాపాస్ కిసాన్ ఆప్ ప్రవేశంతో సమస్యలకు తెర లేపిందని పత్తి రైతులు ఆందోళన బాట పట్టారు. నేరడిగొండ రైతుల వద్ద కొనే పత్తి పంట కొనుగోలు లో తేమ శాతాన్ని పెంచి తీసుకోవాలని మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు.రాకపోకలను స్థభింప చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యత రేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉప అధ్యక్షులు ఆడే వసంత్ రావు మాట్లాడుతూ పత్తి లో తేమ శాతాన్ని 12 నుండి 20 శాతానికి పెంచి రైతుల వద్ద పత్తి కొనుగోలు చేయాలని, సోయాబీన్ తేమశాతాన్ని ఎనిమిది శాతం నుండి 18 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రవేశ పెట్టిన కాపాస్ కిసాన్ ఆప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పత్తి రైతులను ఆదుకోవాలని అన్నారు. సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళనతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి,తేమ శాతం పేరుతో సీసీఐ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని, కఫాస్ కిషన్ యాప్ సమస్యలు తప్పడం లేదని వెంటనే కపాస్ కిషన్ యాప్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిసిఐ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఈ కార్యక్రమంలో మండల రైతులు నాయకులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 8 Nov 2025 8:07 pm

ఆరోగ్యమే మహాభాగ్యం…..

గోదావరిఖని టౌన్ (ఆంధ్రప్రభ) : భారత ప్రభుత్వం 2019లో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన “ఫిట్

ప్రభ న్యూస్ 8 Nov 2025 7:47 pm

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ..

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని

ప్రభ న్యూస్ 8 Nov 2025 7:41 pm

జయంతిలో భారీ చోరీ

తాళాలు పగలగొట్టి 40 లక్షల బంగారం అపహరణ వీరులపాడులో సంచలనం ( వీరులపాడు,

ప్రభ న్యూస్ 8 Nov 2025 7:40 pm

హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో గంజాయి కలకలం

హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థుల గంజాయి పార్టీ నగరంలో కలకలం సృష్టించింది. బేగంపేటలోని హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులకు టెస్ట్ నిర్వహించగా ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ పోలీసులు బేగంపేటలోని కులినరి అకాడమీ ఆఫ్ ఇండియాలో విద్యార్థులకు గంజాయి తీసుకుంటున్నారనే సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే కాలేజీలో పార్టీ ఏర్పాటు చేశారని, అందులో విద్యార్థులు గంజాయి తీసుకుంటున్నారనే సమాచారం రావడంతో ఈగల్ పోలీసులు దాడి చేసి 11మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో టిహెచ్‌సి పరీక్ష నిర్వహించగా సాక్షి ఈమాలియా, మోహిత్ షాహి, శుభం రావత్, కరోలినా సైన్‌తియా హరీసన్, ఆరిక్ జోనథన్ ఆంటోనీ, లాయ్ బారౌహాకు పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు రిహ్యాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు. మోహిత్ అనే విద్యార్థి గతంలో ఉడిపిలోని మణిపాల్ యూనివర్సిటీలో చదువుతుండగా డ్రగ్స్ తీసుకుంటుండగా, అతడి తండ్రి అక్కడి నుంచి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ జాయిన్ చేశాడు. ఇక్కడికి వచ్చినా కూడా గంజాయి తీసుకోవడం ఆగలేదు. ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన జాసన్ తన స్నేహితులు లాయ్, ఆరిక్ జోనాథన్ కలిసి విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నారు.

మన తెలంగాణ 8 Nov 2025 7:37 pm

హోంగార్డు గంజాయి దందా

కారులో గంజాయి తరలిస్తున్న హోంగార్డును ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది రామోజీ ఫిలిం సిటీ వద్ద శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 15.33కిలోల గంజాయి, కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిసా రాష్ట్రం, మల్కాన్‌గిరికి చెందిన నీలంబర్ మీర్కన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన ఉమాకాంత్ నాగర్ తన వద్ద ఉన్న గంజాయి 15.33కిలోలను హైదరాబాద్‌లో ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పడంతో దానికి హోంగార్డు అంగీకరించాడు. గంజాయి తీసుకుని తన కారులో హోంగార్డు నీలంబర్ మీర్కన్, సోనా కాలా బయలుదేరారు. ఈ విషయం ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బందికి తెలియడంతో రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. కారులో వస్తున్న నీలంబర్‌ను ఆపి కారులో తనిఖీ చేయగా గంజాయి లభించలేదు. కారు డిక్కీలో ఉన్న స్టెఫిన్ టైర్‌పై అనుమానం రావడంతో దానిని బయటికి తీసి తనిఖీ చేయాగా నాలుగు గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ సిబ్బందిని కేసు దర్యాప్తు కోసం హయత్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. డిఎస్పి తులా శ్రీనివాసరావు తదితరులు తనిఖీలు నిర్వహించారు.

మన తెలంగాణ 8 Nov 2025 7:34 pm

కారు గుర్తుకు ఓటు వేయండి

జూబ్లీహిల్స్, (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ఎర్రగడ్డ డివిజన్

ప్రభ న్యూస్ 8 Nov 2025 7:34 pm

తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్ కీలకపాత్ర..

తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్

ప్రభ న్యూస్ 8 Nov 2025 7:29 pm

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డికి పదవీగండం: ఎంఎల్‌ఎ జగదీష్‌రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో భయం మొదలైందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జి.జగదీష్‌రెడ్డి అన్నారు. సిఎం మానసిక స్థితి దెబ్బతిన్నట్లుందని.. సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు కెసిఆర్ కమాండ్ కంట్రోల్ కట్టారని గతంలో రేవంత్‌రెడ్డి అన్నారని, ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని తమ మీద పెడుతున్నారా..? అని ప్రశ్నించారు. ప్రగతిభవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సెక్రటేరియట్‌పై కమీషన్ వేయవచ్చు కదా..? అని అడిగారు. కెసిఆర్ దగ్గర ఉండి పని చేయించారు కాబట్టే.. ఆనాడు శాంతి భద్రతలు అదుపులో ఉండేవి అని పేర్కొన్నారు. కానీ, రేవంత్‌రెడ్డి చేయరాని పనులు చేస్తున్నారేమో, శాంతి భద్రతలు దెబ్బతిని, క్రైమ్ రేటు పెరిగిందని అన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి అజెండాపైనే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయబోతున్నారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎవరూ తిట్టని విధంగా వైఎస్సార్‌ను, సోనియా గాంధీని తిట్టింది రేవంత్‌రెడ్డినే అని పేర్కొన్నారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను ఎన్ని రోజులు భయపెడుతారని ప్రశ్నించారు. ఏం చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు అని, రేవంత్ రెడ్డి చేసే తప్పులకు చరిత్ర క్షమించదు అని చెప్పారు.బిహార్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డిని వద్దని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పిలిపించుకున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదవుల్లో ఉన్నారు కాబట్టి.. ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అని, వారు ఇద్దరూ మోదీ శిష్యులేనని అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి,హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలని సూచించారు.మాగంటి గోపీనాథ్ తల్లితో ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసు అని చెప్పారు.

మన తెలంగాణ 8 Nov 2025 7:28 pm

జూబ్లీ హిల్స్ ఓటర్లు చారిత్రక తీర్పు ఇవ్వాలి: మంత్రి తుమ్మల

కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం వెంగళ్ రావు నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఇంటింటి ప్రచారంలో మంత్రి తుమ్మలకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా జూబ్లీ హిల్స్ ఓటర్లు చారిత్రక తీర్పు ఇవ్వాలన్నారు. హైదరాబాద్ సుస్థిర అబివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వంలో అవినీతి అరాచకం రాజ్యమేలాయనీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా, ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ గెలిస్తే రాష్ట్రం అవినీతి అరాచక పాలనలోకి వెళ్ళే ప్రమాదం ఉందన్నారు. ప్రశాంతమైన హైదరాబాద్ కోసం బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలను తరిమి కొట్టాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. ఓటమి భయంతో బిఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుందని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు బి ఆర్‌ఎస్ అభ్యర్థికి వేయాలని కమ్మ సంఘాలకు తాను చెప్పినట్లు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తుమ్మల తీవ్రంగా ఖండించారు. కమ్మ సామాజిక వర్గానికి ఎవరు ఏమిటో తెలుసని, గత ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గం వారిని వేధించిన ఘటనలు మరచి పోలేదని మంత్రి స్పష్టం చేశారు. తెలుగుదేశం ఓట్ల కోసం బిఆర్‌ఎస్ ఆడుతున్న కపట నాటకాలను ఎలా తిప్పి కొట్టాలో పసుపు సైన్యానికి బాగా తెలుసన్నారు. ఆత్మ గౌరవంతో తెలుగుదేశం శ్రేణులు ఓటు వేయాలని మంత్రి తుమ్మల కోరారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అపార్ట్‌మెంట్ వాసులు విద్యావంతులు పోలింగ్ కు తరలి రావాలని, ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజా ప్రభుత్వం కు మద్దతుగా తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బిఆర్‌ఎస్, బిజెపి ఎన్ని కుయుక్తులు చేసినా జూబ్లీ హిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైరా ఎంఎల్‌ఏ రాoదాస్ నాయక్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 8 Nov 2025 7:21 pm

మామండూరు అటవీ క్షేత్రంలో డిప్యూటీ సీఎం…

మామండూరు అటవీ క్షేత్రంలో డిప్యూటీ సీఎం… తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ) : చుట్టూ

ప్రభ న్యూస్ 8 Nov 2025 7:17 pm

బీహారీ అరెస్ట్

సహచరుడిపై కత్తితో దాడి (గుడివాడ – ఆంధ్రప్రభ) గుడివాడ రూరల్ మండలం

ప్రభ న్యూస్ 8 Nov 2025 7:16 pm

సిసిఐ సిఎండితో పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల చర్చ

హైదరాబాద్: పత్తి కొనుగోళ్లపై సిసిఐ సిఎండి లలిత్‌కుమార్ గుప్తాతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణలో పత్తి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన లలిత్‌కుమార్‌కి ఫోన్‌లో వివరించారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పరిమితిపై చర్చించారు. ఆ నిబంధనను ఎత్తివేసి పాత విధానంలోనే సిసిఐ పత్తి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కపాస్ కిసాన్ యాప్‌ను 24 గంటలు అందుబాటులో ఉంచాలని కోరారు. పత్తి మిల్లులన్నీ వెంటనే తెరిచేలా చర్యలు తీసుకోవాలని.. 20 శాతం తేమ ఉన్న పత్తిని సిసిఐ కొనేలా చర్యలు చేపట్టాని విజ్ఞప్తి చేశారు. 

మన తెలంగాణ 8 Nov 2025 7:09 pm

Exclusive: Mad Rush for Peddi Theatrical Rights

Ram Charan’s next film Peddi is a hot cake in trade. The makers have closed the non-theatrical deals and the film is on track. The schedules are planned perfectly and the shoot is happening as per the plan. The makers recently reconfirmed that Peddi will hit the screens as per the plan on March 27th, […] The post Exclusive: Mad Rush for Peddi Theatrical Rights appeared first on Telugu360 .

తెలుగు 360 8 Nov 2025 6:55 pm

Chandrababu : తిరువూరు వివాదంపై చంద్రబాబు రియాక్షన్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరువూరు నియోజకవర్గం వివాదంపై స్పందించారు.

తెలుగు పోస్ట్ 8 Nov 2025 6:51 pm

Visakhapatnam Emerges as India’s Next Big Investment Destination

Visakhapatnam is witnessing a rapid transformation after Google announced plans to set up a $15 billion data centre in the city. Once known mainly as a serene coastal destination, the city is now emerging as a new hub for business and technology. Companies that once viewed Visakhapatnam as a seaside retreat are now recognising it […] The post Visakhapatnam Emerges as India’s Next Big Investment Destination appeared first on Telugu360 .

తెలుగు 360 8 Nov 2025 6:40 pm

Pawan Kalyan : స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్

ఎర్ర చందనం స్మగర్లకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు

తెలుగు పోస్ట్ 8 Nov 2025 6:34 pm

ఒటిటిలోకి ‘ది బెంగాల్ ఫైల్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

వివేక్ అగ్నిహోత్రి.. తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ వంటి వివాదాస్పద చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ మరణం వెనుక జరిగిన కుట్రలపై తాష్కెంట్ ఫైల్స్.. 1990లో జమ్మూ కశ్మీర్‌లో చెలరేగిన తిరుగుబాట్లపై కశ్మీర్ ఫైల్స్‌ని ఆయన తెరకెక్కించాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’. 1946లో బెంగాల్‌లో చెలరేగిన అల్లర్ల బ్యాక్‌డ్రాప్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివేక్ అగ్నిహోత్రి ట్రయాలజీలో ఇది చివరి సినిమా. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర గంటల నిడివి గల ఈ సినిమా కశ్మీర్ ఫైల్స్ అంత సక్సెస్ సాధించలేకపోయింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలో విడుదలకు సిద్ధమైంది. గత రెండు చిత్రాల్లానే ఈ చిత్రం కూడా జి-5లో నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జి-5 పోస్టర్‌ని పంచుకుంది. 

మన తెలంగాణ 8 Nov 2025 6:26 pm

Jubilee Hills Bye Election : రేవంత్ రెడ్డికే అసలు పరీక్ష.. అందుకే సర్వశక్తులూ ఒడ్డి?

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ అని చెప్పాలి

తెలుగు పోస్ట్ 8 Nov 2025 6:19 pm

India vs Australia : చివరి మ్యాచ్ వర్షార్షణం.. అయినా సిరీస్ భారత్ దే

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది

తెలుగు పోస్ట్ 8 Nov 2025 5:57 pm

Premante Pelli Shuru Single: Perfect Wedding Song

Premante starring Priyadarshi, Anandi has made a good impression among audiences with melodious first single, glimpse and teaser. Now, the movie makers have released Pelli Shuru Single from the album composed by Leon James. Famous actress Sreeleela has digitally released it. The song sung by Shreya Ghosal, Deepak Blue presents the vibe of wedding in […] The post Premante Pelli Shuru Single: Perfect Wedding Song appeared first on Telugu360 .

తెలుగు 360 8 Nov 2025 5:53 pm

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సజ్జనార్ కీలక ఆదేశాలు..

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలీంగ్ దృష్ట్యా హైదరాబాద్ కమీషనర్ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరగనున్న 11వ తేదీ (మంగళవారం) సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని హోటళ్లు, రెస్టారెంట్‌లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. ఓట్ల లెక్కింపు రోజున రహదారులు, జనావాసాల్లో టపాసులు పేల్చడం నిషేధమని, ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మన తెలంగాణ 8 Nov 2025 5:45 pm

వైసీపీ నుండి టీడీపీలో చేరిక..

విశాలాంధ్ర గుడిబండ.. మండలంలోని తాళ్లకెర పంచాయతీలో గల గొల్లపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు శనివారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి ల సమక్షంలో టిడిపిలో చేరారు. గ్రామానికి చెందిన చిత్తనగిరియప్ప, చిత్తయ్య, రంగస్వామి, మురళీధర్,చిత్రలింగప్ప,కరియన్న , కరియప్ప,ఈరన్న,చంద్రశేఖర్,కుమార్, తదితరులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టిడిపిలో చేరి పచ్చ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లక్ష్మీనరసప్ప, మందలపల్లి రైతు సాకార సంఘం అధ్యక్షుడు మద్దనకుట్టప్ప,జిల్లా […] The post వైసీపీ నుండి టీడీపీలో చేరిక.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Nov 2025 5:45 pm

Hyderabad : మియాపూర్ లో విషాదం.. స్విమ్మింగ్ పూల్ లో పడి ఇద్దరు చిన్నారుల మృతి

హైదరాబాద్ లోని మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందారు

తెలుగు పోస్ట్ 8 Nov 2025 5:40 pm

విద్యార్థుల సమస్యలపై నారా లోకేష్ కి ఏఐఎస్ఎఫ్ వినతి..

విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఏఐఎస్ఎఫ్ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు హనుమంతరాయుడు, నియోజకవర్గ కోశాధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని, యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెం.77ను రద్దు చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పిపిపి విధానాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ హాస్టళ్లలో […] The post విద్యార్థుల సమస్యలపై నారా లోకేష్ కి ఏఐఎస్ఎఫ్ వినతి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Nov 2025 5:30 pm