Balayya and Bunny’s Lavish Investments
Nandamuri Balakrishna owns a lavish villa in the prime location of Jubilee Hills. With the construction of a flyover nearby and his residence accessible to the busiest Film Nagar route, the actor has decided to shift to a new place years ago. He acquired a land six years ago and started constructing a beautiful bungalow. […] The post Balayya and Bunny’s Lavish Investments appeared first on Telugu360 .
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలి ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : దీర్ఘకాలిక
Andhra Pradesh : అనకాపల్లిలో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ..నేడు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ కునేడు ప్రతిష్టాత్మక సంస్థ రానుంది.
గ్రామాల అభివృద్ధే ధ్యేయం కుంటాల/ నర్సాపూర్ జి, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలోని గ్రామాలను
ఓట్లు బహుజనులవి.. కోట్లు అగ్రకులాలవి
‘ఉద్యమాలెన్నీ వచ్చినా, సంపద, అధికారం మాత్రం ఆధిపత్య వర్గాలదే -కుల సర్వే రిపోర్ట్ ఒక ఉదాహరణ. -తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమం భూమికోసం, నీటికోసం, ఉద్యోగాలకోసం జరిగినవే ఈ పోరాటాల ఫలితాలు మాత్రం సాంప్రదాయంగా అధికారం, భూమి, మూలధనం కలిగి ఉన్న ఆధిపత్య కులాలు చేజిక్కించ్చుకున్నవి. దీంతో సంఖ్య లో మెజారిటీగా ఉన్న బిసి, ఎస్సి, ఎస్టి వర్గాలు పోరాటాల్లో ముందుండి కూడా, ఫలితాల్లో మాత్రం వెనుకబడిపోయారు. ఇదే నిజాన్ని కుల సర్వే స్పష్టంగా అసలు స్వరూపం బయటపెట్టింది. సంఖ్యలో మెజారిటీ అయిన.. బహుజనులు సంపదలో, అధికారంలో మాత్రం మైనారిటీగా మిగిలిపోయిన వాస్తవాన్ని అది వెల్లడించింది. శ్రమ బహుజనులది, భోగాలు మాత్రం ఆధిపత్య కులాలవే అన్న చారిత్రక అసమానతను ఈ గణాంకాలు అద్దంలా చూపించాయి. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే రిపోర్టు (కులసర్వే రిపోర్ట్) -అర్ధసత్యాల రిపోర్ట్. తెలంగాణలో ఇటీవల విడుదలైన కులసర్వే రిపోర్ట్ ఒక సాధారణ గణాంక పత్రం కాదు. ఇది రాష్ట్రంలోని శక్తి సమీకరణాలను, వనరుల పంపిణీని, సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని ప్రతిబింబించిన కీలక పత్రం. బహుజన సమాజం శతాబ్దాలుగా అనుభవిస్తున్న అసమానతలను సంపూర్ణంగా బహిర్గత పరిచిన పత్రం. అయితే, ఈ రిపోర్టును లోతుగా పరిశీలిస్తే ఇది చెప్పినదానికంటే, చెప్పనిది ఎక్కువగా కనిపిస్తుంది. జనాభా వ్యత్యాసాలు ఈ సర్వే ప్రకారం తెలంగాణ జనాభా 3.55 కోట్లు. కానీ జాతీయ జనాభా కమిషన్ అంచనా ప్రకారం 2024లో తెలంగాణ జనాభా 3.83 కోట్లు సుమారు 30 లక్షల జనాభా తగ్గింది. అలాగే కొన్ని ఒసి కులాల జనసంఖ్య పెరిగింది. ఉదాహరణకు రెడ్డి కులం జనాభా సమగ్ర కుటుంబ సర్వే 2014 ప్రకారం 14,75,000. కానీ ఈ సర్వేలో 17,06,000 రావడం జరిగింది. వెలమ కుల జనాభా 2014 సర్వేలో 102,000, కానీ ఈసర్వేలో 143,000 జరిగింది. కమ్మ కులం 2014 సర్వేలో జనాభా 258,291 ఇప్పుడు 367,226. ఈ విధంగా ఆధిపత్య కులాల జనాభా పెరగడం జరిగింది. అలాగే బిసి జనాభా శాతం తగ్గింది (61%నుంచి 56.33%కు, ఒసి జనాభా 11% నుంచి 15.79 % పెరిగింది. 2014 సర్వే వివరాలు ప్రకటించబడ లేవు, కులగణన ఇంత శాస్త్రీయంగా జరగలేదు. కాబట్టి ఈ వ్యత్యాసాలు అని కొందరు అనవచ్చును. కానీ అసలు నిజాలు 2027 సర్వేలో బయట పడతా యని ఆశించవచ్చును. తెలంగాణలో కులాలు 242 గా తేల్చింది. అందులో ఎస్సి కులాలు 59, ఎస్టి కులాలు 32, బిసి కులాలు 133 (ఒక అనాథ కులం ఎస్ఎల్ 1044 తీసుకోలేదు ) ఒసి కులాలు 18గా తేల్చింది. మొదటి సారిగా వెనుకబాటుతనాన్నీ కొలిచేటందుకు సంయుక్త వెనుకబాటు సూచిక (COMPOSITE BACKWARD NESS INDEX)ను 42 అంశాలమీద 124 మార్కులు ఇచ్చి కులాల వెనుకబాటుతనాన్ని కొలిచినారు భూమిసంపద : ఎవరి చేతిలో? తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు జరిగినా, భూమి, సంపద, పరిశ్రమలు, వ్యాపారాలు ఇప్పటికీ కొద్దిమంది ఆధిపత్య కులాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. జనాభాలో తక్కువ శాతం ఉన్నవర్గాలు అధిక వనరులను నియంత్రిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన అసమానత. భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది ఆర్థిక శక్తి, రాజకీయ ప్రభావం, సామాజిక ఆధిపత్యానికి మూలం. భూమి కలిగి ఉన్నవారి వివరాలకు వెళ్తే, మొత్తం తెలంగాణ లో 35.6% కుటుంబాలు భూమి కల్గి ఉంటే, షెడ్యూల్డ్ కులాలలో 35.2%, షెడ్యూల్డ్ తెగలలోలో 58.1%, వెనుకబడిన కులాలలో 36.3%, జనరల్ కులాలలో 33.7%, కుటుంబాలు భూమిని కలిగి ఉన్నాయి. ఇందులో 5 ఎకరాలకు లోబడి వెనుకబడిన కులాలలో 85%, షెడ్యూల్డ్ క్యాస్ట్లో 90.5%, షెడ్యూల్డ్ తెగలలో 80.1%, జనరల్ క్యాస్ట్లో 69.1% ఉన్నారు. ఐదు నుంచి 20 ఎకరాలలో వెనుకబడిన కులాలలో 12.2% షెడ్యూల్డ్ కులాలలో 7%, షెడ్యూల్డ్ తెగలలో 17.9%, జనరల్ క్యాస్ట్లో 26.4% ఉన్నారు. అలాగే 20 ఎకరాలకు పైబడిన భూమి ఉన్నటువంటి వాళ్లు షెడ్యూల్డ్ క్యాస్ట్లో 1%, షెడ్యూల్డ్ ట్రైబ్లో 2%, బిసిలలో 2.9%, జనరల్ క్యాస్ట్లో 4.4% ఉన్నారు. కాని ఈ భూ వివరాలు కూడా వాస్తవికతకు దగ్గరగా లేవు, ఎందుకంటే ఆధిపత్య కులాల చేతిలో భూమి ఇంకా ఎక్కువ శాతం ఉంది. భూభారతి రికార్డులతో పరిశీలించి వివరాలు వెల్లడిస్తే వాస్తవాలు బయట కొస్తాయి. ఇందులో ఇచ్చినటువంటి గణాంకాలు భూ యజమాని ఇచ్చిన సమాచారంపై ఆధారపడి ఉంది. కాబట్టి పూర్తిగా నిజం ఉన్నదని భావించదానికి వీలు లేదు. ప్రభుత్వ రికార్డులతో పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయి. కేవలం 9.2% జనాభా ఉన్న 6 అగ్రకులాలు 18.5% భూమిని నియంత్రిస్తున్నాయి. ఎస్సి, బిసి వర్గాల్లో చాలా కులాలు జనాభా శాతంతో పోలిస్తే భూమి తక్కువగా కలిగి ఉన్నాయి భూమి యాజమాన్య విషయంలో స్పష్టమైన సామాజిక -ఆర్థిక అసమానతలు ఉన్నాయి. అదేకాకుండా ఆధిపత్య కులాల లో 30% మంది భూయాజమానులకు 5 ఎకరాలకు పైబడి భూమిని కలిగి ఉన్నారు. ఇక వ్యాపారాల, పరిశ్రమల, కంపెనీల, రియల్ ఎస్టేట్ పేర లక్షల ఎకరాల వ్యవసాయేతర భూముల్ని అధిపత్య కులాలు కలిగి ఉన్నారు. ఎంఎల్ఎలు, ఎంపిలు, కీలక పదవుల్లో ఎవరి ప్రాబల్యం ఎంత? ఉమ్మడి నిజామాబాదు, ఖమ్మం జిల్లాలో బిసిలు మెజారిటీ ప్రజలైనప్పటికీ ఒక్క బిసి ఎంఎల్ఎ కూడా లేరు. చట్టసభలలో బిసిల స్థానం ఎంత?(ఎస్సి, ఎస్టిలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ ఉన్నాయి) ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా రిపోర్టు అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఒక రాజకీయ ఎత్తుగడ, బహుశా ఆధిపత్యకుల రాజకీయ ప్రాబల్యం బహిర్గతమవుతుందని తొక్కిపెట్టారని అనుకోవాల్సి వస్తుంది. పేదరికానికి కులానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని సర్వేలో పాల్గొన్నటువంటి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా బిసిలు జనాభాలో 56.4% అయితే పేదరికంలో 58.4% ఉన్నారు. అలాగే, ఎస్సిలు జనాభాలో 17.5% అయితే, పేదరికంలో 19.7% ఉన్నారు. ఎస్టిలు జనాభాలో 10.4% అయితే, పేదరికంలో 13.2% ఉన్నారు. జనరల్ కులాలకు సంబంధించి 15.79% జనాభా ఇందులో కులం చెప్పనివారు 11.96 లక్షలు అనగా 3.4 % ను తీసి వేస్తే ఒసిల జనాభా 12.4%శాతం. అయితే, వారి 100 జనాభాలో 8.5% పేదరికంలో ఉన్నారు. ఒసిలలోని 18 కులాలలో ఒక్క కులం కూడా పేదరికంలో లేదు. అన్ని కూడా CBI (COMPOSITE BACKWARDNESS INDEX) లో అడుగున ఉన్నాయి. సంక్షేమ పథకాలు,- పంపిణి- ఈ రిపోర్ట్ మరో కీలక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. సంక్షేమ పథకాలు సమానంగా అందడం లేదు. ‘ రైతుభరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్ ఇవి ఎక్కువగా భూమి ఉన్న వర్గాలకే లాభం చేకూర్చాయి. భూమిలేని, అట్టడుగు వర్గాలకు ఒరిగింది శూన్యం. బిసి కులాల్లో తీవ్రమైన అంతర్గత అసమానతలు ఉన్నవి. కొన్ని బిసి కులాలు, ఎస్సిల కంటే కూడా వెనుకబాటులో ఉన్నాయి కాబట్టి, లక్ష్యబద్ధమైన విధానాలు అవసరం అని నొక్కి చెప్పుతుంది. ఆధిపత్య కులాల జీవన విధానమే వేరు ఆధిపత్య కులాలు మిగతా బిసి, ఎస్సి, ఎస్టి కులాల జీవన విధానములో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ కులగణన సర్వే ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఎన్ని ఉద్యమాలు జరిగినా తెలంగాణలో అభివృద్ధి సమానంగా జరగలేదు. సంపద, రాజకీయ అధికారం అంతా కొద్దీ కులాల చేతిలో కేంద్రీకృతమైనది. బిసి, ఎస్సి, ఎస్టిలు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలి పోయారు. కానీ అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతోంది. ఈ డేటాను ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుంది? విధాన మార్పులు చేస్తుందా? బహుజనులలో అట్టడుగు కులాలకు ప్రత్యేక ఆర్థిక ప్రణాళికలు ఏమైనా తెస్తుందా? లెక్కలు బయటపడ్డాయి. సరిచేయాల్సిన సమయం వచ్చింది. అధికారం లాక్కుంటేనే అది సాధమవుతుందనే విషయం గుర్తు బెట్టుకోవాలి. - టి. చిరంజీవులు విశ్రాంత ఐఎఎస్, (బిసి మేధావుల ఫోరం చైర్మన్)
ఫ్యాక్ట్ చెక్: శృంగేరి శారదా పీఠంలో రాహుల్ గాంధీకి ఆశీస్సులు ఇవ్వలేమన్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు
హిందూమతంలో అశాంతిని సృష్టించే బదులు, దయచేసి హిందూమతానికి దూరంగా ఉండండి
సామాజిక బాధ్యత ఎక్కడ..? రేగొండ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పలు జిల్లాలు, పట్టణాలు
Summer Effect : ఎండలతో అల్లాడిపోతున్న జనం.. బయటకు రావాలంటేనే భయం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
పోస్టాఫీస్ ఖాతాల్లో రూ.2 లక్షల 30 వేలు స్వాహా
పోస్టాఫీస్ ఖాతాల్లో రూ.2 లక్షల 30 వేలు స్వాహా మోత్కూర్, ఆంధ్రప్రభ :
ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోకు నోయిడాలో చోటు చేసుకున్న విధ్వంసానికి ఎలాంటి సంబంధం లేదు
9 మార్చి 2026న మహారాష్ట్ర లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ వరుస విజయాలతో దూసుకు పోతోంది. వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ నాలుగు విజయాలను అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లతో జరిగిన మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయాలు జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత సారథ్యంతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు.బ్యాట్తోనే కాకుండా తన అద్భుత కెప్టెన్సీతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతూ జట్టును ముందుకు తీసుకెళుతున్న తీరును ఎంత పొగిడినా తక్కువే. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా జట్టు విజయాల్లో తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. విధ్వంసక బ్యాటింగ్తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్లో కళ్లు చెదిరే శతకం సాధించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తిస్తూ అభిషేక్ ఐపిఎల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. రానున్న మ్యాచుల్లో కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఆల్రౌండ్షోతో అదరగొడుతున్నాడు. కీలక సమయంలో బ్యాట్తో చెలరేగి పోతున్నాడు. విధ్వంసక బ్యాటింగ్తో జట్టు భారీ స్కోరు సాధిచడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. బంతితోనూ రాణిస్తూ కీలక సమయంలో వికెట్లను పడగొడుతున్నాడు. యువ ఫాస్ట్ బౌలర్ సకిబ్ హుస్సేన్ కూడా అసాధారణ బౌలింగ్తో అలరిస్తున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేడయమే కాకుండా కీలక వికెట్లను తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ప్రఫుల్ హింగె కూడా తన వంతు పాత్రను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. శ్రీలంక సంచలనం ఇషాన్ మలింగ కూడా అద్భుత బౌలింగ్తో చెలరేగి పోతున్నాడు. కీలక సమయాల్లో వరుస వికెట్లను పడగొడుతూ ప్రత్యర్థి జట్ల బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చుతున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్లో అత్యంత నిలకడైన బ్యాటింగ్ను కనబరుస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్లో బ్యాట్తో సత్తా చాటుతున్నాడు. జట్టు విజయాల్లో క్లాసెన్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా ప్రతి ఆటగాడు తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తుండడంతో హైదరాబాద్ వరుస విజయాలను నమోదు చేస్తోంది.
తుపాన్లకూ తలొగ్గని వరి అమరావతి, ఆంధ్రప్రభ : వరి సేద్యంలో కొత్త ఆశలు
Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది
ఉత్తరాంధ్రలో భారీ పెట్టుబడులకు శ్రీకారం
ఉత్తరాంధ్రలో భారీ పెట్టుబడులకు శ్రీకారం అమరావతి, ఆంధ్రప్రభ : పారిశ్రామిక రంగంలో అనకాపల్లి
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ’గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. బుధవారం మేకర్స్ ‘గోదారి గట్టుపైన’ నుంచి ’నేను నా పల్లెటూరు’ పాటను విడుదల చేశారు. పాట వినగానే అందమైన పల్లె జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. నాగ వంశీ కృష్ణ స్వరపరిచిన ఈ మెలోడీ పల్లెటూరి మట్టి వాసన, గోదావరి తీరాల అందాన్ని అద్భుతంగా చూపించింది. రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు పల్లెటూరి ఆత్మని హత్తుకునేలా చూపిస్తున్నాయి. ఈ సాంగ్లో సుమంత్ ప్రభాస్ తన ఫ్రెండ్స్తో గడిపే సరదా క్షణాలని, పల్లెటూరి సింపుల్ లైఫ్ను ఎంతో సహజంగా చూపించారు. ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఫిన్లాండ్ మోడల్ వైపు తెలంగాణ చూపు..
ఫిన్లాండ్ మోడల్ వైపు తెలంగాణ చూపు.. హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రపంచంలోనే అత్యుత్తమ
23aprilchintana |తత్త్వజ్ఞానం, జీవన మార్గం
23aprilchintana | తత్త్వజ్ఞానం, జీవన మార్గం 23aprilchintana | తత్త్వ విచారణ ప్రాముఖ్యతకర్కటి
Gold Prices Today : గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయ్
ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. పురుషులకూ ఉచిత బస్ ప్రయాణం! #Telangana #RTC #RTCSammey #FreeBus
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. మే చివరలో రవి కిరణ్ కోలా కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడట. రామోజీ ఫిల్మ్ సిటీలో విజయ్ దేవరకొండ పై సాంగ్ ను షూట్ చేయనున్నారని, అనంతరం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ అనుకుంటున్నారు. మరి ఈ సాంగ్ లో ఏ హీరోయిన్ కనిపిస్తోందో చూడాలి. కాగా ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తాడట. పైగా విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ పాత్ర లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.
23aprileditorial |ఒత్తిడి వ్యూహాల వెనుక అసలు కథ
23aprileditorial | ఒత్తిడి వ్యూహాల వెనుక అసలు కథ 23aprileditorial | ఇరాన్–అమెరికా
అగ్ని ప్రమాదాల నివారణకు కీలక చిట్కాలు
అగ్ని ప్రమాదాల నివారణకు కీలక చిట్కాలు హైదరాబాద్, ఆంధ్రప్రభ: వేసవి వచ్చిందంటే అగ్ని
Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. రీజన్ ఇదే
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది
బోల్తాపడిన డీసీఎం వ్యాన్ బెజ్జంకి, ఆంధ్రప్రభ : కరీంనగర్ నుండి హైదరాబాద్కు కుటుంబంతో
కూకట్పల్లి కైతలాపూర్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. ఫ్యాక్టరీ సీజ్ #Kukatpally #FoodSafety #PoliceRaid
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ ప్రారంభం
కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. తొలివిడతలో 40 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 3.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 1,75 కోట్ల మంది మహిళలున్నారు. తొలివిడత బరిలో 1,478 మంది అభ్యర్థులు పోలింగ్ లో పాల్గొన్నారు. తొలివిడతలో భవానీ పూర్ నుంచి పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, బిజెపి లోక్ సభ సభ్యుడు సువేందు అధికారి పోటీ చేశారు. బెంగాల్ రెండో విడతలో 142 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. పోలింగ్ నేపథ్యం లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇసి పటిష్ట చర్యలు ఏర్పాటు చేశారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. 5.73 కోట్ల మంది ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటర్లలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
స్మార్ట్ రోబోల కొత్త యుగం బీజింగ్ : అంట్లు తోమడం, బట్టలు ఉతకడం,
సర్కారీ బడుల్లో విద్యా విప్లవం
సర్కారీ బడుల్లో విద్యా విప్లవం హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో
Tamilnadu : నేడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
తమిళనాడు,పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది
23AprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
23AprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’ 23AprilCartoon | ఇరాన్ యుద్ధ భయం..
IPL 2026 : లక్నో ఇక ఇంటికి పోవాల్సిందే.. రాజస్థాన్ మళ్లీ పుంజుకుందిగా
లక్నో సూపర్ జెయింట్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.
23rdaprileditorial |ఒత్తిడి వ్యూహాల వెనుక అసలు కథ
23rdaprileditorial | ఒత్తిడి వ్యూహాల వెనుక అసలు కథ 23rdaprileditorial | ఇరాన్–అమెరికా
Hormuz crisis : హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. నౌకలపై ఇరాన్ కాల్పులు
హోర్ముజ్ జలసంధిలో మూడు నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి.
23rdaprilchintana |తత్త్వజ్ఞానం, జీవన మార్గం
23rdaprilchintana | తత్త్వజ్ఞానం, జీవన మార్గం 23rdaprilchintana | తత్త్వ విచారణ ప్రాముఖ్యతకర్కటి
Women-reservation-bill |రాజకీయ పార్టీల వాదనలు, వివాదాలు
Women-reservation-bill | రాజకీయ పార్టీల వాదనలు, వివాదాలు Women-reservation-bill | మహిళా బిల్లు:
Andaman Sea disaster |మయన్మార్ హింస నుంచి శరణార్థుల వలసలు
Andaman Sea disaster | మయన్మార్ హింస నుంచి శరణార్థుల వలసలు Andaman
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని, రేవంత్రెడ్డి డ్రామాలు వెలుగులోకి వచ్చాయని, ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్ల మర్మమతులు పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. తీర్పు అనంతరం హరీష్రావు విలేకరులతో మా ట్లాడుతూ బిఆర్ఎస్పై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల లీకులు ఇస్తూ, అక్రమ కేసు లు బనాయిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు ఆరోపించారు ప్రాథమిక హక్కులు, సహ జ న్యాయసూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాం టి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటని, అందులో పదుల సం ఖ్యలో ఉండే పిల్లర్లలో రెండు మాత్రమే కుంగితే, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అబద్ధాన్ని పదేపదే చెబుతూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, కాళేశ్వరమే ఈ రా ష్ట్రానికి ప్రాణాధారమని హరీష్రావు తెలిపారు. ఈ తీర్పు సత్యమేవ జయతే అని, హైకోర్టు తీర్పుతో ధర్మం గెలిచిందని హరీష్రావు పేర్కొన్నారు. 70 శాతం తెలంగాణకు తాగునీరు అందిస్తున్నది కాళేశ్వరమే హైదరాబాద్తో సహా 70 శాతం తెలంగాణకు త్రాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అం దించే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరమని హరీష్రావు తెలిపారు. నిజానికి రూ.100, రూ.200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో రెండు మూ డు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకా శం ఉందని, కానీ, రెండున్నరేళ్లుగా భూ సేకరణ కు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్రావు ఆరోపించారు. మోటార్లు, రిజర్వాయ ర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని, కేవలం కుట్రతోనే ఆపారని హరీష్రావు అన్నారు. ఎన్డిఎస్ఏ అనేది కేవలం ఇంజనీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమేనని, దాంట్లో ప్రభుత్వ నిర్ణయాలకు సం బంధం ఉండదని ఆయన అన్నారు. మళ్లీ అవే చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెబుతాయని ఆయన అన్నారు. అవినీతి బయటపెడితే నాపై రెండు ఎంక్వైరీలు వేశారు అసెంబ్లీ సాక్షిగా రెండున్నరేళ్లుగా ప్రభుత్వ వైఫల్యాలను, స్కాంలను బయటపెడుతున్నామని, స మాధానం చెప్పుకోలేక మమ్మల్ని సస్పెండ్ చేయడమే కాకుండా, తాను అవినీతిని బయటపెట్టిన 48 గంటల్లోనే తన మీద రెండు ఎంక్వైరీలు వేశారని హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు సరిదిద్దుకోవడం మానేసి ప్రతిపక్షాలను వేధించ డం, అక్రమ కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
23rdaprilsplstory |ప్రపంచ దేశాల్లో తల్లిదండ్రుల సంరక్షణ చట్టాలు
23rdaprilsplstory | ప్రపంచ దేశాల్లో తల్లిదండ్రుల సంరక్షణ చట్టాలు 23rdaprilsplstory | తల్లిదండ్రులు–పిల్లల
23rdApril2026 | గురువారం నేటి పంచాంగం
23rdApril2026 |గురువారంనేటి పంచాంగం 23rdApril2026 |తేదీ, సంవత్సరం, ఋతువు వివరాలుసూర్యోదయం – సూర్యాస్తమయం
మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజె క్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుతో తెలంగాణ ప్రజలు, రైతు లు గెలిచారని, రాజకీయ రాబందులు, పిట్టల దొర కుట్రలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు. ఈ తీర్పుపై కెటిఆర్ హర్షం వ్య క్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో కూలింది కాళేశ్వరం కాదని, ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కు ట్రలు కూలిపోయాయని కెటిఆర్ వ్యాఖ్యానించా రు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం పెరిగిందని, నిజాన్ని ఎవరూ దాచలేరని ఈ తీర్పుతో స్ప ష్టమైందని ఆయన అన్నారు. ఇది జస్టిస్ పిసి ఘో ష్ కమిషన్ నివేదిక కాదని, పిసిసి (కాంగ్రెస్) నివేదిక అని తాము అప్పుడే చెప్పామని కెటిఆర్ గుర్తు చేశారు. మేడిగడ్డ కుంగడం వెనుక పెను కు ట్ర దాగి ఉందని, అది కచ్చితంగా కాంగ్రెస్ పనే అయి ఉంటుందని కెటిఆర్ ఆరోపించారు. మేడిగడ్డలో అసలు ఏం జరిగిందో తెలియాలంటే వి శ్రాంత జడ్జితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాం ధీని బ్యారేజీ వద్దకు తీసుకువచ్చి ఫొటోలు దిగి, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన మండిపడ్డారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను తాను మొదటి నుంచీ ‘పిసిసి రిపోర్ట్’ అని పిలుస్తున్నానని, నేడు కోర్టు తీర్పుతో అది నిజమని నిరూపితమైందని అన్నారు. నిప్పులాంటి నిజం బయటకు వచ్చింది రేవంత్రెడ్డి ఎవరిని తెచ్చి ఏ విధంగా వాదించినా, చివరకు సత్యమే గెలిచిందని, నిప్పులాంటి నిజం బయటకు వచ్చిందని కెటిఆర్ పునరుద్ఘాటించా రు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని, ఇది బిఆర్ఎస్కు ఏటిఎంలా మారిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టుకు అయిన మొ త్తం ఖర్చు రూ. 94 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.కాళేశ్వరం విషయంలో ఆఘమేఘాల మీద స్పం దించిన ఎన్డిఎస్ఏ, ఎస్ఎల్బిసీ కూలినప్పుడు, వట్టెం పంప్హౌస్ మునిగిపోయినప్పుడు ఎక్కడకు పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ మీ ద ఉన్న వ్యక్తిగత కక్షతో రైతులను ఇబ్బంది పెట్ట డం సరికాదని ఆయన హితవు పలికారు. 2014 ముందు కెసిఆర్ పాలన ముగిసే నాటికి పెరిగిన పంట దిగుబడే కాళేశ్వరం ప్రాజెక్టు విజయానికి నిదర్శనమని కెటిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ నేలపై గోదావరి జలాలు పారినన్ని రో జులు కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరని, ఇవాళ రా ష్ట్రంలో పారుతున్న ప్రతి నీటి బొట్టుకు కారణం కెసిఆర్అని కెటిఆర్ కొనియాడారు. మేడిగడ్డ బ్యా రేజీపై పెట్టిన ఖర్చు కేవలం రూ. 3,800 కోట్లు మాత్రమేనని కెటిఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డ అంటే కుంగిన గడ్డ కాదని, అది తెలంగాణకు ’మే టి గడ్డ’, ‘నీటి గడ్డ’ అని ఆయన అభివర్ణించారు. ఆర్టీసి కార్మికులకు బిఆర్ఎస్ మద్దతు ఆర్టీసి కార్మికులకు బిఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నామని కెటిఆర్ వెల్లడించారు. ఎన్నికల ముందు ఆర్టీసి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నారని, తక్షణమే ఆర్టీసి కార్మికులకు కాం గ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక కోర్టు నిలిపివేయడంతో తదుపరి ఎలా ముందుకెళ్లాల న్న విషయమై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చర్చించినట్టుగా తెలిసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అంశంతో పాటు లీగల్గా ఎలా ముందుకెళ్లాలన్నా అంశంపై వా రిద్దరూ మాట్లాడుకున్నట్టుగా సమాచారం. దీంతోపాటు సీనియర్ అడ్వకేట్లతోనూ ప్రభుత్వం లీగల్ ఓపినీయన్ తీసుకుంటున్నట్టుగా తెలిసింది. అయితే, ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయని సీనియర్ అడ్వకేట్లు పేర్కొన్నట్టుగా సమాచారం. మొదటిది ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదా రెండోది కొత్త కమిషన్ను నియమించడం. ఈ రెండు అంశాల గురించి బుధవారం సిఎం రేవంత్రెడ్డితో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపాటు కోర్టు తీర్పుపై నేడు కేబినెట్ చర్చించాలని సిఎం నిర్ణయించినట్టుగా సమాచారం. దీంతోపాటు కేబినెట్కు అడ్వకేట్ జనరల్ను పిలవాలని అధికారులను రేవంత్రెడ్డి ఆదేశించినట్టుగా తెలిసింది. హైకోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించిన తరువాత తదుపరి చర్యలను తీసుకోవాలని సిఎం రేవంత్ నిర్ణయించినట్టుగా సమాచారం. కేబినెట్లో తీసుకునే నిర్ణయం తరువాత ప్రభుత్వం ముందుకెళ్లనుంది. నేడు కేబినెట్ భేటీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలోని ఆరో అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్లో నేడు మధ్యాహ్నం 3 గంటలకు సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుకు సంబంధించి కేబినెట్ చర్చించునుంది. దీంతోపాటు జూన్ 2న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను ప్రారంభానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను కేబినెట్లో చర్చించనున్నారు. త్వరలో అమలు చేయనున్న మరో రెండు కొత్త పథకాల గురించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. వీటితో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించే అవకాశాలున్నాయని సమాచారం. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన కోదండరాం, అజారుద్దీన్లపై కేబినెట్ చర్చించనున్నట్టుగా తెలిసింది. ఆర్టీసి సమ్మె, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం గురించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, ఫిట్మెంట్, పెండింగ్ డిఏలు, పెండింగ్ సమస్యల గురించి కేబినెట్ చర్చించనున్నట్టుగా తెలిసింది. యాసంగి ధాన్యం సేకరణతో పాటు ధాన్యం, మొక్కజొన్నల సేకరణ ఎంత జరిగింది, ఇంకా రైతుల వద్ద ఎంత మేర ఉందన్న వివరాలను కేబినెట్ ఆరా తీయనుంది.
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మం త్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘో ష్ కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రా యం వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. సిబిఐకి ఘోష్ కమిషన్ పంపిన రిపోర్టులో ఎవరి పేర్ల ను పేర్కొనలేదని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. హై కోర్ట్ తీర్పు వెలువడిన తరువాత సిఎం రేవంత్రెడ్డి తో మంత్రి ఉత్తమ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, హై కో ర్టు తీర్పుపై వారిద్దరూ చర్చించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 6ను కొట్టివేయాలని పిటీషనర్లు హై కోర్టును ఆశ్రయించారని, కానీ, జ్యుడిషియల్ క మిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుపట్టలేదని ఆయ న స్పష్టం చేశారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించిందని ఆయన తెలిపారు. కమిషన్ ఫైండింగ్లను కూడా హైకోర్టు తప్పుపట్టలేదని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని సెక్షన్ 3 ప్రకారం జిఓ ఎంఎస్ నెంబ ర్ 6 ద్వారా ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగబద్ధమేనని న్యాయస్థానం స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సిబిఐకు లేఖ రాశాం కమిషన్ ఏర్పాటు అధికార పరిధిని మించింది కాదని, అసమంజసం కాదని, అక్రమం కాదని న్యాయస్థానం స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదికలో కొందరు బాధ్యులపై చేసిన నిర్దారణలపై హైకోర్టు అభ్యంతరం తెలిపిందని ఆయన చెప్పారు. పిటీషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్ర కారం నోటీసు ఇవ్వలేదన్న టెక్నికల్ అంశాన్ని హైకోర్టు తప్పుపట్టిందన్నారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దని పిటీషనర్లకు రిలీఫ్ ఇచ్చిందని మం త్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ఇప్పటికే తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపా లు, అవకతవకలపై సిబిఐతో విచారణ చేపట్టాలని నిర్ణయించిందని, దానిపై సిబిఐకు లేఖ రాశామని మంత్రి ఉత్తమ్ ప్రస్తావించారు. ఈ రోజు వెలువడిన హైకోర్టు తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కా దని, న్యాయస్థానం ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై ప్రభు త్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం నిజం కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ముమ్మాటికీ నిజమన్నారు. ప్రాజెక్టుకు ఎంచుకున్న సైట్ నుంచి డిజైన్ల నుంచి నిర్మాణాలు, నిర్వహణ అన్నిచోట్ల అవకతవకలు జరిగాయని అన్నీ లోపాలే ఉన్నాయని బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి హెచ్చరించారు. వారికి నోటీసులు ఇవ్వలేదన్న కారణంగా, వాళ్లపై కమిషన్ చేసిన రిమార్క్ మాత్రమే ఇన్ ఆపరేటివ్గా ఉంటాయని హైకోర్టు తెలిపిందన్నారు. ఇది పూర్తిగా ప్రొసిజరల్, టెక్నికల్ అంశమని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు సైట్ నుంచి డిజైన్లు, నిర్మాణంలో జరిగిన లోపాలను బయటపెట్టిన విజిలెన్స్ 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆ బ్యారేజీ దగ్గరకు వెళితే ఎవరికైనా కుంగిన తీరు కనపడుతుందన్నారు. లక్ష కోట్లతో కట్టిన బ్యారేజీ మూడేళ్లకే కుంగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు వాళ్ల హయంలోనే కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు కారణాలేమిటో తేల్చాల్చిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీల కుంగుబాటుకు దారి తీసిన కారణాలు, డిజైన్ల, నిర్మాణం, నిర్వహణ లోపాలపై తమ ప్రాథమిక నివేదికను బిఆర్ఎస్ హయాంలోనే సమర్పించిందని మంత్రి తెలిపారు. బ్యారేజీలకు ఎంచుకున్న ప్రాజెక్టు సైట్ నుంచి డిజైన్లు, నిర్మాణంలో జరిగిన లోపాలను తమ ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిషన్ బయటపెట్టిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.తీర్పు కాపీ వచ్చాక ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రెండేళ్లుగా ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు అందలేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది ఈ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు అప్పులు, వడ్డీలు భరిస్తుందన్నారు. కేవలం రెండు ఫిల్లర్లు కాదని, మొత్తం పౌండేషన్, మొత్తం మూడు బ్యారేజీల పునాదులు అనుమానాస్పదంగా ఉన్నా యని, ఇప్పటికే దేశంలో పేరొందిన సంస్థల నిపుణులందరూ అభిప్రాయపడ్డారని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు మృతి
` చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన నేత హైదరాబాద్(జనంసాక్షి): ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ …
` జనం ఇక్కట్లు.. ` డిపోల ముందు ధర్నాలతో కార్మికుల నిరసన ` నగరంలో అద్దె బస్సులను ఉచితంగా తిప్పిన ప్రభుత్వం ` చాన్నాళ్లకు ఆటోలు, క్యాబ్లకు …
జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టొద్దు
` తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశం ` కేసీఆర్,హరీశ్లకు భారీ ఊరట ` కమిషన్ నివేదికను నిలిపివేసిన ధర్మాసనం హైదరాబాద్(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, …
సిఎం రాజకీయ టూర్లో ఈయనకు ఏం పని?
మన తెలంగాణ/హైదరాబాద్: నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డిఎస్ఏ) ఛైర్మన్ అనిల్ జైన్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చే శారు. కేంద్రానికి చెడ్డ పేరు తెచ్చేలా య త్నించిన ఎన్డిఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి బం డి సంజయ్ బుధవారం తన మంత్రివర్గ స హచరుడైన కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్కు లేఖ రాశారు. చైర్మన్ అనిల్ జైన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి మంత్రి పాటిల్కు రాసిన లేఖను బండి సంజయ్ కార్యాలయం రహస్యంగా ఉంచింది. కాళేశ్వరం విషయంలో అనిల్ జైన్ వ్యవహారశైలి ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వేదికపై అనిల్ జైన్ భాగస్వామి కావడమేంటి? అని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద వెయ్యి బోర్ హోల్స్ తవ్వాలని ఎన్డీఎస్ నివేదిస్తే... అందుకు భిన్నంగా 100 బోర్ హోల్స్ తవ్వితే సరిపోతుందని చెప్పడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ సూచించిన పరీక్షలను నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బ్యారేజీల స్థితిపై భూగర్భ, భూభౌతిక పరీక్షలు నిర్వహించాని సూచించి రెండేళ్లయినా పురోగతి లేదని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డలో కేవలం 6 బోర్ హోల్స్ మాత్రమే పూర్తి చేసిందని ఆయన తెలిపారు. అన్నారం, సుందిల్లలో ఒక్క బోర్ హోల్స్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మే చివరి నాటికి బోర్ హోల్స్ను పూర్తి చేయాలని సూచించినా పట్టించుకోవడం లేదని, నిర్ణీత గడువులోగా బోర్ హోల్స్ పూర్తి చేయలేమని గ్రహించి ఎన్డీఏస్ ఛైర్మన్పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఆయన ఆరోపించారు. బోర్ హోల్స్ సంఖ్యను 100కు పరిమితం చేసి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం మేడిగడ్డను సందర్శించారని, రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఎన్డిఎస్ఏ చైర్మన్ అనిల్ ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ కమిటీ నిర్ణయాలను ఒక వ్యక్తి ఎలా అధిగమిస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్రానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే చైర్మన్ అనిల్ జైన్పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో బ్యారేజీలకు మరింత నష్టం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డిఎస్ఏపై నిందలు మోపే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి లోనై ముందుగా కమిటీ ఇచ్చిన సిఫార్సులను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
పెండింగ్ భూసేకరణ సత్వరమే పూర్తి
మన తెలంగాణ/హైదరాబాద్: పెండింగ్ భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సిఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప లు కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్య త్ అవసరాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ఆయన అధికారులకు సూ చించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటిని, ఎ స్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారుల ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సి ఎం అధికారులకు సూచించారు. పేరున్న బ్రాండ్ సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వీలైనంత త్వరగా ఎంఓయూలు కుదుర్చుకున్న సంస్థలు తమ కార్యకలాపాలు మొదలు పెట్టేలా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని అధికారులకు సిఎం సూచించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష చేశారు. ఈ సమీక్షకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో భాగంగా దావోస్లో జరిగిన పెట్టుబడులకు సంబంధించి, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పలు కంపెనీలతో జరిగిన ఎంఓయూలు, వాటి పురోగతి గురించి సిఎం రేవంత్రెడ్డి సమీక్షించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటివరకు పనులు ప్రారంభించిన కంపెనీలు, పెండింగ్ వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఫ్యూచర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో సంస్థలకు ప్రాధాన్యతల వారీగా కేటాయించాల్సిన భూ వివరాల గురించి అధికారులు సిఎం తెలియచేశారు. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి కార్మిక సమ్మె మొదటి రోజు విజయవంతమైంది. అన్ని చోట్ల బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్థరాత్రి నుండి కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం కాగా బస్స్టేషన్లు బస్సులు లేక వెలవెల బోయాయి. డిపోల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మె కారణంగా బస్సులు తిరగక పోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణీకులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీనిని అదనుగా భావించి ప్రైవేటు వాహనాలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల అద్దె బస్సులను పోలీసు ఎస్కార్ట్తో తిప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 లోపు అద్దెబస్సులు మాత్రమే పోలీసు బందోబస్తుతో నడిచినట్లు ఆర్టిసి వర్గాలు వెల్లడించాయి. ఆర్టిసిలో మొత్తం 10 వేల బస్సులు ఉండగా వీటిలో మూడున్నర వేల అద్దె బస్సులు ఉన్నాయి. ఉదయం నుంచే కార్మికులు డిపోల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా వారు అడ్డుకున్నారు. హైదరాబాద్ నగరంలోనూ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల జెఎసి నాయకులు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్థూపం వద్ద నివాళు లర్పించి గురువారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. అన్ని డిపోల ముందు మహా ధర్నాకు వారు పిలుపునిచ్చారు. మరోవైపు సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రయాణీకుల శ్రేయస్సు దృష్టా కార్మికులు సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కార్మికులు మాత్రం తమ డిమాండ్లు నెరవ్చేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సమ్మెను మన్నుందు మరింత ఉధృతం చేస్తామని జెఎసి నేతలు ప్రకటించారు. సమ్మెలో పాల్గొనడం లేదు : ఆర్టిసి సూపర్ వైజర్ అసోసియేషన్ ఆర్టిసి కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఎఎస్ల కమిటీని సూపర్ వైజర్ అసోసియేషన్ స్వాగతించింది. ప్రజా పాలన ప్రభుత్వానికి, ఆర్టిసి ఎండికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వం ఆర్టిసి సమస్యలపై చాలా సానుకూలంగా ఉందని, త్వరలో అన్ని సమస్యలపై పరిష్కారం అవుతాయన్న విశ్వాసం ఉన్నందున సూపర్ వైజర్ అసోసియేషన్ సమ్మెలో పాల్గొనడం లేదని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.వాసుదేవ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మె నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసులు పెంపు ఆర్టిసి సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రయాణీకులు ఇబ్బందులు పడకుండా ప్రయాణీకుల సౌకర్యార్థం మెట్రో రైల్ సర్వీసులు పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. మెట్రో రైళ్ల సర్వీసుల ఫ్రీక్వెన్సీని గరిష్ట స్థాయికి పెంచాలని నిర్ణయించినట్టు పేర్కొంది. రద్దీ ఉండే సమయాలలో పీక్ అవర్స్లో 56 రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. నాన్-పీక్ అవర్స్లో మియాపూర్ - ఎల్బీ నగర్ కారిడార్లో 4 నిమిషాలు, నాగోల్ రాయదుర్గ్ కారిడార్లో 5 నిమిషాల నిడివితో 44 రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. మియాపూర్, - ఎల్బీ నగర్ కారిడార్లో 4 నిమిషాల గ్యాప్తో, నాగోల్ -, రాయదుర్గ్ కారిడార్లో 3 నిమిషాల గ్యాప్తో మెట్రో రైళ్లు నడిపిస్తోన్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు కలుగకుండా రాత్రి 11.00 గంటల తర్వాత కూడా చివరి మెట్రో రైలు సర్వీసును పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
హార్మూజ్ జలసంధిలో నౌకపై ఇరాన్ కాల్పులు..
దుబాయ్: హార్మూజ్ జలసంధిలో బుధవారం ఓ కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులకు దిగింది. ఈ దాడిలో నౌక దెబ్బతినగా, యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన చర్చల ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఇరాన్కు చెందిన పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియాల్సి ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానిని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. భవిష్యత్ చర్చలకు ముందు టెహ్రాన్ ఒక ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు రావడానికి సమయం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. అయితే కాల్పుల విరమణ పొడిగింపుపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పొడిగింపు దౌత్యపరమైన ప్రయత్నాలకు మరింత సమయం ఇస్తుందని పేర్కొన్నారు. మాపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా, వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు పాకిస్థాన్ తన నిజాయితీగల ప్రయత్నాలను కొనసాగిస్తుంది అని షెహబాజ్ షరీఫ్ ఎక్స్లో పోస్టు చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్ పోర్టులపై అమెరికా అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. దీనిని ఇరాన్ అంగీకార యోగ్యం కానిదిగా అభివర్ణించింది. ఇస్లామాబాద్ చర్చలకు ఇప్పటివరకు అంగీకరించకపోవడానికి ఇదే ప్రధాన కారణమని టెహ్రాన్ సంకేతాలు ఇచ్చింది. ఇక రివల్యూషనరీ గార్డ్స్ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ప్రాంతంలో మిగిలి ఉన్న శత్రువుల ఆస్తులపై వారి ఊహకు అందని విధంగా ఘోరమైన దెబ్బలు కొడతాం అని ప్రకటించాయి.గత వారాంతంలో అమెరికా, ఇరాన్కు చెందిన ఓ కంటైనర్ నౌకపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవడం, అలాగే భారత మహాసముద్రంలో ఇరాన్ చమురు వ్యాపారంతో సంబంధం ఉన్న ఓ ఆయిల్ ట్యాంకర్పై ఎక్కి తనిఖీలు నిర్వహించిన తర్వాతే ఈ తాజా దాడి జరిగింది. బ్రిటిష్ సైన్యం ఆధ్వర్యంలో పనిచేస్తున్న యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 7:55 గంటలకు ఈ ఘటన జరిగింది. కాల్పులకు ముందు రివల్యూషనరీ గార్డ్స్కు చెందిన గన్బోట్ నౌకను హెచ్చరించలేదని వెల్లడించింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని కూడా స్పష్టం చేసింది.హార్మూజ్ జలసంధిలో నౌకపై జరిగిన కాల్పుల ఘటనపై ఇరాన్ మీడియా భిన్న వివరణలు ఇచ్చింది. ఇరాన్కు చెందిన ‘నూర్ న్యూస్’ ప్రకారం, ఇరాన్ సాయుధ దళాల హెచ్చరికలను ఆ నౌక పట్టించుకోకపోవడంతోనే రివల్యూషనరీ గార్డ్స్ కాల్పులు జరిపినట్లు పేర్కొంది. ఇరాన్కు చెందిన అధికారిక వార్తా సంస్థ ‘ఫార్స్’ కూడా ఈ చర్యను సమర్థించింది. హార్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను చట్టబద్ధంగా అమలు చేసిన చర్యగానే ఈ దాడిని అభివర్ణించింది. హార్మూజ్ జలసంధి ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో సుమారు 20 శాతం ఈ వ్యూహాత్మక జలమార్గం ద్వారానే సాగుతుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి అంతర్జాతీయ సముద్ర మార్గాలకు కలుపుతున్న ఈ జలసంధి, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం ప్రారంభమయ్యే వరకు పూర్తిగా తెరిచి ఉండేది. అయితే అప్పటి నుంచి టెహ్రాన్ హార్మూజ్ గుండా నౌకల రాకపోకలను కట్టడి చేయడంతో అంతర్జాతీయ చమురు సరఫరాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగి, అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడుతోంది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్లో అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్కు 98 డాలర్ల సమీపానికి చేరుకుంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇది 30 శాతానికి పైగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇక అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరిపించేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు ఇరాన్ అధికారికంగా అంగీకారం తెలియజేయకపోయినా, టెహ్రాన్ చర్చలకు ప్రతినిధి బృందాన్ని పంపుతుందనే నమ్మకం పాకిస్థాన్ అధికారుల్లో ఉందని సమాచారం. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. గత వారాంతంలో అమెరికా నుంచి కొత్త ప్రతిపాదనలు అందినట్లు ఇరాన్ తెలిపినా, ఇరువైపుల మధ్య ఇంకా గణనీయమైన విభేదాలు ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ మద్దతు గల మిలీషియా గ్రూపులు, హార్మూజ్ జలసంధి నియంత్రణ వంటి అంశాలే చర్చలకు ప్రధాన అడ్డంకులుగా మారినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపును ప్రకటించిన అనంతరం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పందించారు. ఈ నిర్ణయం అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలకు, పరస్పర విశ్వాస నిర్మాణానికి అత్యంత కీలక అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో కనీసం 3,375 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. లెబనాన్లో 2,290 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఇజ్రాయెల్లో 23 మంది మృతి చెందారు. గల్ఫ్ అరబ్ దేశాల్లో డజన్కు పైగా మరణాలు నమోదయ్యాయి. లెబనాన్లో 15 మంది ఇజ్రాయెల్ సైనికులు, ప్రాంతవ్యాప్తంగా 13 మంది అమెరికా సైనిక సిబ్బంది కూడా ఈ ఘర్షణల్లో మరణించినట్లు సమాచారం.
తొలిసారిగా తమిళనాట త్రిముఖ పోటీ
చెన్నై ః నేడు (గురువారం) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ద్రవిడ ఓటర్ల నాడిని నిర్థారిస్తూ జరుగుతాయి. 5.73 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ హక్కు వినియోగించుకోవల్సి ఉంది. బరిలో 4023 మంది అభ్యర్థులు నిలిచారు. జాతీయ స్థాయిలో తమిళనాడులో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడి రెండు ప్రదాన ద్రవిడ రాజకీయ శక్తులు పోటీపడుతున్నాయి. డిఎంకె సారధ్యంలో లౌకిక ప్రగతిశీల కూటమి(స్పా), అన్నాడిఎంకె ఆధ్వర్యంలో ఎన్డిఎ పరస్పర సవాళ్లతో ఎన్నికల పరీక్షకు దిగాయి. అధికార డిఎంకె లౌకికవాదం చాటుకుంటూ తిరిగి తమ అధికారం దక్కించుకునేందుకు స్టాలిన్ నాయకత్వంలో నిలిచింది. దెబ్బతిని ఉన్న విపక్షం అన్నాడిఎంకె ఈసారి అయినా తిరిగి అధికారంలోకి రావాలని యత్నిస్తోంది. ఈసారి విశేష ఘట్టంగా తమిళ హీరో విజయ్ నాయకత్వపు టివికె కూడా ఎన్నికల బరిలోకి దూసుకువచ్చింది. దీనితో ఈసారి ఎన్నికల రణరంగం త్రిముఖపోరుకు దారితీసింది. పైగా ప్రచారానికి మరింత తళుకుబెళుకులు అమరాయి. తమిళులు తప్పుడు వ్యక్తులను అధికారం నుంచి దూరంగా ఉంచాలని అన్నాడిఎంకె నేత ఎడప్పడి కె పళనిస్వామి పిలుపు నిచ్చారు. తమ సారధ్యంలోనే తమిళనాడు దక్షిణాదిలో ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని, ఇక ఓటర్ల తీర్పు ఈసారి మరీ కీలకం అని డిఎంకె అధినేత స్టాలిన్ తెలిపారు. ఎన్నికల రంగంలోకి వస్తూనే విజయ్ రెండు స్థానాల నుంచి బరిలో నిలిచారు. పెరంబూరు, తిరుచిరాపల్లిలో ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కించారు. రెండు ప్రధాన పార్టీలూ ఇంతకాలం కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం ఎత్తుగడలకు దిగాయని, రాష్ట్రంలో మార్పు తీసుకువచ్చేది టివికెతోనే అని ప్రకటించారు. అన్నాడిఎంకె, డిఎంకె బలాలను ఏ విధంగా విజయ్ పార్టీ ప్రభావితం చేస్తుందనేది చూడాల్సి ఉంది. అన్నాడిఎంకె నేతలకు తమ సొంత జిల్లాలు దాటి వేరే చోట్ల పోటీ చేసే శక్తి లేదని విజయ్ సవాలు విసిరారు. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. మంగళవారం ఎన్నికల ప్రచారం ముగిసింది. కేంద్రంలోని బిజెపితో నేరుగా తలపడుతున్న స్టాలిన్కు ఈ ఎన్నికల్లో విజయం అత్యంత కీలకమైన విషయం అయింది. మే నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాలు అదే రోజు వెలువడుతాయి. జాతీయ స్థాయి బిజెపి ద్రవిడ రాజకీయాలను, భాషాపరమైన భావోద్వేగాలను , ప్రత్యేకించి హిందీ అభిమాన హోరును తట్టుకుని ఈ రాష్ట్రంలో ఏ మేరకు తమ సంఖ్యాబలం చాటుకుంటుందనేది ప్రశ్న అయింది. ఇక కాంగ్రెస్ ఎప్పటిలాగానే డిఎంకెకు అనుబంధంగా రాజకీయ బలం చాటుకునే ప్రయత్నాలలో ఉంది. ఇది సొంత బలంగా మారని వైనం నెలకొంది. తమిళనాడులో ఓటింగ్ను పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు స్థాయిల్లో ఓటు చైతన్యకార్యక్రమాలను చేపట్టింది. ఎన్నికలకు ముందు తమిళనాడు ఎన్నికల సంఘం ప్రధానాధికారి అర్చనా పట్నాయక్ అన్ని కంట్రోలు రూంలు సందర్శించారు. పరిస్థితి సమీక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా , పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలకు దిగారు.
నేడే బెంగాల్లో తొలి దఫా పోలింగ్
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో గురువారం (నేడు) అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతుంది. చాలా కాలంగా రాజకీయ ఘర్షణలకు వేదిక అయిన బెంగాల్లో ఎన్నికలు ఎన్నికల సంఘానికి సవాలుగా మారాయి. ఇక్కడ రాజకీయ అదికారంతో పాతుకుపోయిన మమత బెనర్జీ సారధ్యపు టిఎంసికి , ఈ రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని బలంగా యత్నిస్తున్న బిజెపికి మధ్య పోటాపోటీ నెలకొంది. ఎన్నికల దశ వచ్చేసరికి ఓటర్లు రెండు భిన్న ధృవాల మధ్య తమ ఓటును ఖరారు చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. బెంగాల్లో అధికార పక్షం టిఎంసి అవినీతి, బంధుప్రీతి, ఉద్యోగాల స్కామ్లు, రాజకీయ హింసాకాండపై బిజెపి దృష్టి సారించింది. ఇక బిజెపికి తొత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం మారిందని, వ్యక్తుల గుర్తింపు , ఉనికి, వారి పౌరసత్వాలను, చివరికి ఓటు హక్కును హరించి వేసిందని మమత బెనర్జీ విరుచుకుపడుతూ వచ్చారు. తీవ్రస్థాయిలో తమ రాజకీయ ఎదురుదాడితో ముందుకు సాగారు. జాతీయ స్థాయిలో బిజెపికి పూర్తి సవాలు విసురుతూ వస్తోన్న మమతకు టిఎంసి తిరిగి అధికారంలోకి రావడం అత్యంత కీలక సవాలు అయింది. సర్ ప్రక్రియతో ఓటర్ల జాబితాలను కేంద్రం హైజాక్ చేసిందనే వాదనను టిఎంసి బలీయంగా ఓటర్ల వద్దకు తీసుకువెళ్లింది. రెండు దశల పోలింగ్ జరిగే బెంగాల్లో తొలి రౌండ్లో మొత్తం 294 స్థానాల అసెంబ్లీలోని 152 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇందులో 54 వరకూ ఉత్తర బెంగాల్లోని ఎనిమిది జిల్లాలు, మిగిలినవి ముర్షీదాబాద్, నాడియా, బిర్బూమ్, హుగ్లీ ఇతర జిల్లాలో జరుగుతాయి. ఉత్తర బెంగాల్పైనే బిజెపి అత్యధిక ఆశలు పెట్టుకుంది. ఈ ప్రాంతం రాష్ట్రంలో రాజకీయ అధికారానికి ముఖద్వారంగా నిలుస్తుంది. ఇక్కడ బిజెపి ఏదైనా పట్టు సాధిస్తుందా? లేక ప్రాబల్యం పోగొట్టుకున్న ఈ ప్రాంతంలో టిఎంసి తిరిగి తన బలం చాటుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది. ఈసారి ఇంతకు ముందటితో పోలిస్తే ఓటర్ల సంఖ్య సర్ జాబితా వడబోతతో తగ్గిపోయింది 3.60 కోట్ల మందికి పైగా ఓటర్లు ఏ పక్షాన్ని ఎంచుకుంటారనేది ప్రధానంగా ఈ తొలి దఫా పోలింగ్తో తేలనుంది. ఈసారి దాదాపుగా 1.75 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగానికి అర్హులుగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఈసారి ఇంతకు ముందటితో పోలిస్తే మరింత పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లకు దిగింది. అత్యంత సున్నిత ఉద్రిక్తత ప్రాంతాలను గుర్తించారు. ఈ క్రమంలో 8వేలకు పైగా పోలింగ్ కేంద్రాలకు రికార్డు స్థాయిలో 2450 కంపెనీల కేంద్రీయ బలగాలను పంపించారు. అధికార టిఎంసికి బెంగాల్లో బిజెపి సవాలు విసురుతోంది. ప్రత్యేకించి మహిళలపై పలు చోట్ల జరిగిన ఘోరమైన అత్యాచారాలపై అధికార పార్టీ ఇంతవరకూ ఎటువంటి చర్యకు దిగలేకపోయిందని, నిందితులైన అధికార పక్షం వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు వెలువడ్డాయి. 2021లో ఈ ప్రాంతంలోని 152 అసెంబ్లీ స్థానాలలో బిజెపి 59 చట్ల గెలిచింది. బిజెపి 93 స్థానాలు గెల్చుకుంది. దీనితో తొలిదశలో తన బలం పెంచుకోవాలని బిజెపి, ఇందుకు అడ్డుకట్ట వేయాలని మమత బెనర్జీ పరస్పరం విమర్శల కత్తులు దూసుకున్నాయి. ఓటర్ల తీర్పు తొలిదశలో రిజర్వ్ అవుతుంది. ఈసారి ఎన్నికలలో గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్యకు సర్ ప్రక్రియతో దాదాపుగా 91 లక్షలకు పైగా గండిపడింది. ఈ పరిణామం ఏ పార్టీకి అనుకూలం అవుతుందనేది తేలాల్సి ఉంది. తొలి దశ పోలింగ్ విస్తృత స్థాయిలో తేయాకు తోటల ప్రాంతాల పరిధిలో ఉంది. జల్పాయ్గురి, అఇపూరుదూర్, డార్జిలింగ్, కలింపాంగ్ పర్వతాలు, కూచ్ బెహార్ పరిధిలో ఓటింగ్ ఉంది. సర్ ద్వారా భారీ స్థాయిలో ఓటర్లను తీసివేయడం కేంద్రం రాష్ట్రంలో అక్రమ వలసదార్లపై చేపట్టిన దిగ్బంధనం ఫలితం అని బిజెపి ప్రచారం చేసుకుంది. ఈ క్రమంలో స్థానికులైన బెంగాలీలకు న్యాయం జరుగుతుందని ఓటర్లకు తెలియచేసుకుంది. ఈ విషయం ఓటర్లు విశ్వసిస్తే బిజెపికి సర్తో భారీ ఓట్ల లబ్థికి అవకాశం ఉంది. ఇందుకు ప్రతిగా అధికార టిఎంసి తరచూ సర్తో స్థానిక బెంగాలీలు, ప్రత్యేకించి అణగారిన వర్గాలకు కేంద్రం కీడు తలపెట్టిందని ఆరోపించింది. దీనితో సర్ ఈ సారి ఎన్నికల్లో తెరవెనుక ప్రధాన అంశం కానుంది. అక్రమ వలసలు, పౌరసత్వ సవాళ్లపై సర్ ఓ రెఫరెండం అని బిజెపి ఓటర్ల వద్దకు వెళ్లింది. ఇప్పుడు ఈసారి ఎన్నికలలో ఓటరుకు మరో కీలక సమస్య ఏర్పడింది. దశాబ్తాలుగా ఓటేసిన వారిలో అత్యధికులు ఈసారి ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉందో లేదో అనే సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. చివరికి తమకు తాము పరాయి అయ్యామనే ఆవేశం వ్యక్తం అవుతోంది. బెంగాల్లో రెడ్ అలర్ట్ స్థానాల్లో 17 శాతం పెరుగుదల ఇప్పుడు తొలిదశ పోలింగ్ జరిగే పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తతలకు అవకాశం ఉన్న నియోజకవర్గాల సంఖ్య పెరిగింది. ఇంతకు ముందటితో పోలిస్తే ఈసారి ఈ రెడ్ అలర్డ్ స్థానాల సంఖ్య లో 17 శాతం మేర పెరుగుదల ఉందని ఎడిఆర్ నివేదికలో వెల్లడైంది. బెంగాల్లో చాలా కాలంగా నెలకొంటూ వచ్చిన రాజకీయ హింసాత్మకతకు ఇది అద్దం పడుతోంది. ఎన్నికలలో నిలిచిన వారిలో మొత్తం 23 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్నికల ప్రజాస్వామిక సంస్కరణల విశ్లేషణ సంస్థ ఎడిఆర్ బెంగాల్ తొలి దశ పోలింగ్ నేపథ్యంలో ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. మొత్తం 293 మంది అభ్యర్థుల రికార్డులను పరిశీలించారు. ఇందులో 208 మంది అంటే దాదాపుగా 71 శాతం వరకూ బిజెపి అభ్యర్థులకు కళంకిత చరిత్ర ఉంది. కాంగ్రెస్ 26 శాతంతో, టిఎంసి 39 శాతంతో నేరాలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారని వెల్లడైంది. ఇక సిపిఐ (ఎం) అభ్యర్థులు దాదాపుగా 47 శాతం మంది వరకూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
ఐపిఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఐదో విజయం నమోదు చేసింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మార్ష్ (55) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆర్చర్ మూడు, బర్గర్, బ్రిజేష్ శర్మ రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లక్నో బౌలర్లు సఫలమయ్యారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 4 ఫోర్లతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ (20) జట్టుకు అండగా నిలువలేక పోయాడు. హెట్మెయిర్ (22) కూడా ఆశించిన స్థాయిలో బ్యాట్ను ఝులిపించలేక పోయాడు. అయితే రవీంద్ర జడేజా 29 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. ఫెరీరా (20), శుభమ్ దూబె 19 (నాటౌట్) అతనికి సహకారం అందించారు. లక్నో బౌలర్లలో షమి, మోసిన్ ఖాన్, ప్రిన్స్ రెండేసి వికెట్లను పడగొట్టారు.
ఉమ్మడి ఏపీ మాజీ సిఎం నాదెండ్ల కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు క న్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య స మస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నా దెండ్ల భాస్కరరావు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియల ను పంజాగుట్ట శ్మశానవాటికలో గురువారం సా యంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కు టుంబ సభ్యులు వెల్లడించారు. ప్రజల సందర్శనా ర్థం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ నివాసం లో ఉంచారు. నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఇ రు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. లాయర్గా కెరీర్ ప్రారంభించి ఆపై రాజకీయాల్లోకి ఎంట్రీ నాదెండ్ల స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి. 1935, జూన్ 23న జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన నాదెండ్ల భాస్కరరావు హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ న 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతం లో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మంత్రివర్గం లో పనిచేశారు. 1982 లో తెలుగుదేశం పార్టీ ఏ ర్పాటు సమయంలో ఎన్టీ రామారావుతో కలిసి నడిచారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఎన్టీఆర్కు మార్గదర్శిగా తాను వ్యవహరించానని నాదెండ్ల భా స్కరరావు చెప్పుకుంటారు. -1983లో టిడిపి ఘన విజయం సాధించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఆయన మంత్రివర్గంలో నాదెండ్ల భాస్కరరావు ఆర్థిక మంత్రిగా చేరారు. 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వె ళ్ళిన సమయంలో టిడిపిలో సంక్షోభం తలెత్తింది. నాదెండ్ల భాస్కరరావు కొంతమంది ఎమ్మెల్యేల మ ద్దతుతో రాష్ట్ర సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన దాదాపు నెల (31 రోజుల) పాటు సిఎం గా కొనసాగారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో నాదెండ్ల సిఎం పదవికి రాజీనామా చే యాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ గూటి కి చేరారు. 1989లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపిగా పోటీ చేసి గెలుపొందారు. మర్రి చె న్నారెడ్డి, అంజయ్య, ఎన్టీఆర్ హయాంలో మంత్రి గా బాధ్యతలను నిర్వర్తించారు. 2019లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరా రు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వాకింగ్ విత్ డెస్టినీ పేరుతో భాస్కరరావు ఆత్మకథ రాసుకున్నారు. ఆయన జీవితం మలిదశ లో కూడా పలు ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్పై ఘాటై న విమర్శలు చేసేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు. మురళీధర్, మనోహర్. ఆయన భార్య పేరు లలిత. వారి వివాహం సత్యసాయి సమక్షంలో జరిగింది. నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారు. తొలుత కాంగ్రెస్లో కొనసాగిన నాదెండ్ల మనోహ ర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి శాసనసభకు స్పీకర్ గా వ్యవహరించారు. అలాగే, ఎపిలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. సిఎం రేవంత్ సంతాపం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నాదెండ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎపి సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ సంతాపం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఎపి సిఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. భాస్కరరావు కుమారు డు, ఎపి మంత్రి నాదెండ్ల మనోహర్ను సిఎం ఫోన్ లో పరామర్శించారు. నాదెండ్ల భాస్కరరావు మృ తిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఎపి మాజీ సిఎం జగన్ సంతాపం మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు.‘నాదెండ్ల భాస్కర్ రావు ఎపి రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించిన నాయకుడని పేర్కొన్నారు. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, రాజకీయ అను భవం తరతరాలకు ఆదర్శమని‘ అన్నారు.
అంగారకుడిపై జీవానికి మూలమైన సేంద్రియ అణువులు గుర్తింపు
అంగారక గ్రహంపై జీవం ఉనికి గురించి దశాబ్దాలుగా సాగుతున్న అన్వేషణలో నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ మరో కీలక ముందడుగు వేసింది. క్యూరియాసిటీ రోవర్ అంగారకుడి భూమధ్యరేఖకు సమీపంలో ఒకప్పుడు సరస్సుగా ఉండి ఎండిపో యిన ప్రాంతంలో క్యూరియాసిటీ రోవర్ ఈ పరిశోధన జరిపింది. ఇక్కడ ఏడు వేర్వేరు సేంద్రియ సమ్మేళనాలను రోవర్ గుర్తించగా, వాటిలో ఐదింటిని మార్స్పై కనుగొనడం ఇదే తొలిసారి. ఈ సేంద్రియ పదార్థాలు పురాతన జీవుల నుంచి వచ్చాయా?ఉల్కల ద్వారా గ్రహానికి చేరాయా? లేక భౌగోళిక ప్రక్రియల వల్ల ఏర్పడ్డాయా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఒకవేళ అంగారకుడిపై జీవం ఉండి ఉంటే, దానికి సంబంధించిన రసాయన ఆనవాళ్లు ఇప్పటికీ భద్రంగా ఉండే అవకాశం ఉందని ఈ ఆవిష్కరణ సూచిస్తోంది. ఈ ప్రయోగానికి నేతృత్వం వహిం చిన ఫ్లోరిడా యూనివర్సిటీ ఆస్ట్రోజియాలజిస్ట్ ప్రొఫెసర్ అమీ విలియమ్స్ మాట్లాడుతూ ‘మేము 350 కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై భద్రపరచబడిన సేంద్రియ పదార్థాలను చూస్తున్నామని భావిస్తున్నాం. అయితే ఇది జీవానికి సంబంధించినదేనా? అన్నది ప్రస్తుత సమాచారంతో చెప్పలేం‘ అని వివరించారు. కొన్ని వందల కోట్ల ఏళ్ల కిందట మార్స్పై జీవం వృద్ధి చెందడానికి అనువైన వాతావరణం ఉండేదని, కానీ నేడు తీవ్రమైన రేడియేషన్, అతి శీతల పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘ఇంతటి కఠినమైన రేడియేషన్ వాతావరణంలో సేంద్రియ పదార్థాలు మనుగడ సాగించడం నిజంగా ఆశ్చర్యకరం‘ అని అమీ విలియమ్స్ అన్నారు. గుర్తించిన సమ్మేళనాల్లో డీఎన్ఏ నిర్మాణంలో పాలుపం చుకునే నైట్రోజన్ సమ్మేళనం వంటి నిర్మాణం ఒకటి ఉన్నప్పటికీ, అవి కేవలం ‘ఇటుకలు మాత్రమే, ఇల్లు కాదు‘ అని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆవిష్కరణలతో 2028లో ప్రయోగించనున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రోసలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్పై అంచనాలు పెరిగాయి. ఈ రోవర్ ఉపరితలం కింద రెండు మీటర్ల లోతు వరకు డ్రిల్ చేసి, రేడియేషన్ నుంచి మరింత సురక్షితంగా ఉన్న నమూనాలను విశ్లేషించగలదు.
కాళేశ్వరం పై సిబిఐ విచారణకు సిద్ధమా?: మంత్రి పొంగులేటి
కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎలాంటి అవినీతి జరగలేదని పదే పదే చెబుతున్న బిఆర్ఎస్ నాయకులు నిజంగా నిర్దోషులైతే, వెంటనే స్వయంగా సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవార ఓ ప్రకటనలో సవాల్ విసిరారు. కాళేశ్వరం అంశంపై హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తీవ్రంగా విమర్శించారు. నిజంగా ఎలాంటి అవకతవకలు జరగలేదంటే, స్వతంత్ర సంస్థ ద్వారా విచారణకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విచారణ జరిగితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే బిఆర్ఎస్ నాయకత్వం వెనుకడుగు వేస్తోందని, భారీ ఆర్థిక దోపిడీ, కమీషన్ల వ్యవహారం, కాంట్రాక్టుల లోపాలు అన్నీ బహిర్గతమవుతాయనే భయమే వారిని వెంటాడుతోందని మంత్రి ఆరోపించారు. ఇదే భయంతో బిజెపితో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని, విచారణను తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యతపై ఇప్పటికే తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మేడిగడ్డ వంటి కీలక నిర్మాణాలు కుంగిపోవడం, పంప్ హౌజ్లు దెబ్బతినడం వంటి సంఘటనలు యాదృచ్ఛికం కాదని స్పష్టం మంత్రి చేశారు. ఇవన్నీ ప్రాజెక్టులో జరిగిన పెద్ద ఎత్తున అవినీతికి నిదర్శనాలేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యత దెబ్బతిందని, అదే విధంగా నిర్మించిన చెక్ డ్యాములు కూడా కుప్పకూలిన ఘటనలు ప్రజల ముందు ఉన్న వాస్తవాలేనని మంత్రి గుర్తు చేశారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి అవినీతి జరగలేదన్నట్టుగా గ్లోబల్ ప్రచారానికి దిగడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆయన విమర్శించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్ట్పై పూర్తి స్థాయి పారదర్శక విచారణ జరగడం ప్రజాస్వామ్యంలో కనీస బాధ్యత అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన రోజు దగ్గరలోనే ఉందని, ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారు.
కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారుల దాడులు
కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. 10 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం ఆకస్మికదాడి చేశారు. అనంతరం ఆసుపత్రిలోని డ్యూటీ చార్ట్ ప్రకారం ఉండాల్సిన వైద్యులు విధుల్లో ఉన్నారా లేదా అని బయోమెట్రిక్ యంత్రాలు, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొందరు వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ కోసం ప్రభుత్వ విధులకు డుమ్మా కొడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశామన్నారు. ఆసుపత్రిలో ఉచితంగా జరగాల్సిన ల్యాబ్ పరీక్షల ప్రక్రియ పరిశీలన చేయడం జరిగిందన్నారు. రోగులను బయట ప్రైవేట్ ల్యాబ్లకు పంపిస్తున్నారా అనే కోణంలో రికార్డుల తనిఖీ, ఫార్మసీలో స్టాక్ రిజిస్టర్ పరిశీలన చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత మందులు రోగులకు అందుతున్నాయా లేదా బయట మెడికల్ షాపులకు రాసిస్తున్నారా అన్నది తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారం నాణ్యతను, క్యాంటీన్ నిర్వహణ పరిశీలన, వార్డులలో పారిశుధ్యలోపాల గుర్తిచడం జరిగిందన్నారు. తనిఖీల్లో భాగంగా కొన్ని కీలక రికార్డులను, రిజిస్టర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, సిబ్బంది ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు.
ఎలక్షన్ ముందు హామీలు... గెలిచాక ఎగనామాలు: హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి గెలిచాక ఎగనామాలు పెట్టారని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న ప్రాంతానికి వెళ్లి వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో భాగంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని మరి ఇక్కడ ఎందుకు రేవంత్ రెడ్డి వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు వారికి వచ్చే బెనిఫిట్స్ అన్ని అందివాలని కోర్టు తీర్పు ఇచ్చిన రేవంత్ రెడ్డి కోర్టు తీర్పును బేకారత్ చేశారని మండిపడ్డారు. తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లను పెట్టి బస్సులు నడపడం వల్ల ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని తెలిపారు. లేనిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడుతుందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా డ్రైవర్లు ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలిపారు. హైదరాబాదులో ఆర్టీసీ ని ప్రైవేటీకరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా వద్దు కానీ ఆర్టీసీ భవన్ మాత్రం ప్రభుత్వంలో తీసుకుంటాను అనడం విడ్డూరమని అన్నారు. ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి లాంటి మేధావులు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మాట్లాడకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రెండున్నర ఏళ్లుగా ఆర్టీసీ కార్మికులు ఓపికతో ఎదురుచూసి సమ్మెకు దిగాల్సి వచ్చిందని అన్నారు. ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీకి పెను ప్రమాదం ముంచుకొస్తుందని ఇప్పటికే కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ వరంగల్ హైదరాబాద్ లాంటి నగరాలలో తీసుకొచ్చారని ఇది అక్కడికి ఆగిపోకుండా రాష్ట్ర మొత్తం విస్తరిస్తుందని దీనివల్ల ఆర్టీసీ ప్రైవేటీకరణ అవడం ఖాయమని తెలిపారు. మహాలక్ష్మి పేరు మీద 9200 కోట్ల ఆదాయం వచ్చిందని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ సొమ్ము ఆర్టీసీ కార్మికులకు ఇవ్వకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం అతి త్వరలోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ నక్క మల్లేశం, కన్వీనర్ బిఎస్ గౌడ్, కార్యదర్శి రవీందర్ గౌడ్, కె ఎస్ నారాయణ, పరశురాములు, అనంతరెడ్డి, హేమలత, కళావతి, బిఆర్ఎస్ నాయకులు కడవెరుగు రాజనర్సు, పాల సాయిరాం, రెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి, రజనీకాంత్, కెమ్మాసారం శ్రవణ్ కుమార్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
బైక్ను ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి
కారు బైక్ ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందిన విషాధ ఘటన గుర్రంపోడు మండలం చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చింతగూడెంకు చెందిన మారెడ్డి బాల్రెడ్డి (70) , భార్య అలివేలమ్మ, పాల్వాయి గ్రామానికి చెందిన మాలె, వెంకటమ్మ, మాలె మంజుల కారులో నల్లగొండలో తమ సమీప బంధువుల నిశ్చితార్థ వేడుకకు హాజరై తిరిగి స్వస్థలానికి వెళుతున్న క్రమంలో కనగల్ మండలానికి చెందిన మధుబాబు, నర్సింగ్ ధనుంజయ బైక్పై పాల్వాయి ధాన్యం మిల్లు నుంచి ధాన్యం అమ్మిన డబ్బులు తీసుకుని తిరిగి దేవరకొండ వైపు వెళుతుండగా చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద కారు బలంగా బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సింగ్ మధుబాబు (38), ధనుంజయగౌడ్ (45) కారులో ప్రయాణిస్తున్న మారెడ్డి బాల్రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు కారులోని మిగతా వారికి గాయాలు కాగా 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను తెలుసుకున్నారు. వెంటనే ప్రమాద స్థలికి దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరావు,కొండమల్లేపల్లి సిఐ నవీన్కుమార్,గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న చేరుకుని ప్రమాద ఘటనను పరిశీలించి పూర్తి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
GG’s Palleturu Song: Feel the Vibe & Warmth
Sumanth Prabhas’ rural love-and-family entertainer Godari Gattupaina, directed by debutant Subash Chandra and featuring Nidhi Pradeep as the heroine, has already made a positive impression with its glimpses and songs. As part of its musical promotions, the makers have released the fourth single, Nenu Na Palleturu. The song, scored by Naga Vamshi, carries a breezy, […] The post GG’s Palleturu Song: Feel the Vibe & Warmth appeared first on Telugu360 .
Too Many Speculations on Peddi Item Song
Ram Charan’s Peddi is postponed from April 30th release and the team is focused on the post-production work. The patch work of the film too is happening currently and an item song will be shot soon in a special set. From the past one week, there have been a lot of speculations about the actress […] The post Too Many Speculations on Peddi Item Song appeared first on Telugu360 .
లక్నో సూపర్ జెయింట్స్ లక్ష్యం 160
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎకనా స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 43, శుభమ్ దూబె 19 నాటౌట్ గా నిలిచారు. యశస్వి జశ్వాల్ 22,రియాన్ పరాగ్ 20, శిమ్రాన్ 22 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ ,ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వత్సవాయి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో ఒక
మరణానంతరం మహాదానం… ఐదుగురికి ప్రాణం పోసిన యువ సాఫ్ట్వేర్ ఉద్యోగికూకట్పల్లి మెట్రో వద్ద
పసిపిల్లలే టార్గెట్.. మాయమాటలతో బురిడీ కొట్టించి!
పసిపిల్లలే టార్గెట్.. మాయమాటలతో బురిడీ కొట్టించి! ముగ్గురు నిందితుల అరెస్ట్కిడ్నాపర్ల నుంచి మరో
వారంలో పెళ్లి అంతలోనే బావిలో శవమై తేలిన యువతి
వారం రోజుల్లో తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి....కోటి అశాలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన ఓ యువతి సమీప వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. కళ్యాణ వేడుకల నిర్వహణలో ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా నెలకొన్న ఈ విషాదం పలువురిని కంటతడి పెట్టిస్తుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న, వినోదలకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కూతురు పెళ్లి అయింది. భూక్య సంగీత (19)ను తాను ప్రేమించిన మరిపెడ శివారు కొత్త తండాకు చెందిన అజ్మీర అరవింద్కు ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. మంగళవారం రాత్రి తాను వివాహం చేసుకోనున్న అరవింద్తో కలిసి సంగీత ఇటుగలగడ్డ తండాలోని వ్యవసాయ బావి వద్ద కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి సంగీత ఇంటికి రాకవపోటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తండావాసులు బావిలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్సై కోటేశ్వర రావు బావిలో ఉన్న మృతదేహం వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కట్టుకోబోయే వాడే కాలయముడైయ్యాడని తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఆరోపిస్తున్నారు. హత్య, ఆత్మహత్య విచారణలో తేలాల్సి ఉంది.
ప్రధాని మోడీని ఉగ్రవాదిగా పేర్కొనడంపై కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం బుధవారం తీవ్రస్థాయి నోటిసు వెలువరించింది. తమిళనాడు , పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. చెన్నైలో విలేకరుల సమావేశం దశలో ఖర్గే ప్రధాని మోడీ టెర్రరిస్టు వంటి వారని విమర్శించారు. ప్రతిపక్షాల అణచివేతకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికార యంత్రాంగాలను వాడుకొంటోందని, ఈ క్రమంలో ఆయన టెర్రరిస్టు వంటి వారేనని ఖర్గే తెలిపారు. దీనిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఖర్గేకు నోటిసు ఇస్తూ దీనికి 24 గంటల్లో సమాదానం ఇచ్చుకోవల్సి ఉందని హెచ్చరించింది. ప్రజలను, పార్టీలను తన చర్యలతో భయభ్రాంతులను చేస్తున్న వ్యక్తి టెర్రరిస్టు కాక మరెవ్వరు అని ఖర్గే ఆ తరువాత వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈసికి ఆయన ఎటువంటి జవాబు ఇస్తారనేది చూడాల్సి ఉంది.
విద్వేషాలను తిప్పికొట్టడమే దేశ విధానం: కాంగ్రెస్
దేశం ఎప్పుడూ విద్వేషాలు, హింసాత్మక చర్యలకు తలొగ్గేది లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడుల ఏడాది నేపథ్యంలో పార్టీ అప్పటి మృతులకు బుధవారం నివాళులు అర్పించింది. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసింది. జాతి యావత్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా నిలుస్తుందని, విద్వేషాన్ని ఏ కోణంలో ప్రచారానికి తీసుకువవ్చినా తిప్పికొడుతుందని పార్టీ తెలిపింది. ప్రస్తుత గల్ఫ్ యుద్ధం దశలో దేశ విదేశాంగ విధానం పూర్తిగా విఫలం చెందిందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ విధానాలే కారణం అని పార్టీ విమర్శించింది. ముంబై ఉగ్రదాడుల తరువాత ప్రపంచ స్థాయిలో పాకిస్థాన్ ఏకాకి అయింది. అన్ని దేశాలూ ఉగ్రవాదం ముద్రతో వేలెత్తి చూపాయి. అయితే ఇప్పుడు పాకిస్థాన్ ఇరాన్, అమెరికా మధ్య దౌత్యానికి దిగుతూ ప్రపంచ స్థాయి ఆదరణను పొందుతోందని, మరి ప్రధాని మోడీ తరఫున వ్యాప్తి చెందిన విశ్వగురు వాదనకు ఏమైందని కాంగ్రెస్ ప్రశ్నించింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమ సందేశంలో దేశం అంతా కలిసి ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది. సంఘటితంగా స్పందిస్తుందని తెలిపారు. ఇండియా ఏ దశలో కూడా ఉగ్రవాద బాధిత కుటుంబాల త్యాగాలను విస్మరించబోదు. ఉగ్రవాద పిరికిపంద చర్యలకు దిగే వారిని జాతి క్షమించబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు , వారి వెనుక ఉన్న ప్రేరక శక్తులను క్షమించేది లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు పర్యాటక కేంద్రంలో అమాయకుల ప్రాణాలు తీసిన వైనం మనను ఈరోజుకీ కలిచివేస్తుంది. బాదిత కుటుంబాల గుండోకోత మనమంతా పంచుకోవల్సి ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తమ ప్రకటనలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీయ స్ఫూర్తి చెక్కుచెదరకుండా నిలుస్తుందని తెలిపారు. బాధితులకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ తమ ప్రకటనలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశ విదేశాంగ విధానం పునర్వించుకోవల్సి ఉంది. అయితే ప్రధాని మోడీ దీనిపై కదలరు మెదలరని విమర్శించారు.
ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి బీజేపీ డిమాండ్ చెన్నూర్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్
ప్రభుత్వోద్యోగులకు ప్రధాని లేఖలు
పౌరులే దేవుళ్లు అనే ప్రాతిపదిక భావనతోనే సేవలు అందించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వోద్యోగులకు సందేశం వెలువరించారు. కోటి మందికి పైగా సివిల్ సర్వెంట్స్కు బుధవారం ప్రధాని మోడీ తరఫున ఈ మేరకు లేఖలు పంపించారు. నాగరిక్దేవోభవ అనేది సివిల్ సర్వెంట్స్ ఉద్యోగ ఆచరణ నినాదం కావల్సి ఉందని ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై గురుతర బాధ్యత ఉంటుంది. పౌరుడి సేవలే కీలక లక్షంగా ప్రతి నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ శక్తివంచన లేకుండా ఈ దిశలో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రధాని తమ లేఖలలో తెలిపారు. సుపరిపాలనను పూర్తి స్థాయి సంయమనంతో నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రజా సేవకు బాధ్యత వహించే వారు జీవితాంతం అధ్యయనశీలులుగా నిలుస్తారు. వారి అనుభవం వారి సేవలు ప్రజానీకానికి మేలు చేస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. మీ నిర్ణయాలు, పౌరుల పట్ల అంకితభావపు కర్తవ్య పాలనతోనే పరిపాలనా వ్యవస్థ సక్రమం అవుతుందని ప్రధాని మోడీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు. మరాఠా, గుజరాతీ , బెంగాలీ వంటి దాదాపు 12 భాషలలో ఈ లేఖలను పంపించారు. 21వ శతాబ్థం అత్యంత సవాళ్ల కాలం, ఇదే దశలో మన ముందుకు పలు సదవకాశాలు వస్తాయి. దేనిని ఎంచుకుంటామనేది ప్రధాన విషయం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు దృక్పథాలు మారుతున్నాయి. నూతన సాంకేతికలు అనూహ్య రీతిలో ముందుకు వస్తున్నాయి. వినూత్న సృజనాత్మకతలు ఆవిష్కృతం అవుతున్నాయని ప్రధాని తెలిపారు. వివిధ భాషలలో ప్రధాని లేఖలు పలు మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల సివిల్ సర్వెంట్స్కు చేరాయి.
మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మొగుళ్లపల్లి,
రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగించడం సబబు కాదు
రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగించడం సబబు కాదు తహసీల్దార్ కి బిఆర్ఎస్ నాయకుల
కొల్లేరు అభయారణ్యం సరిహద్దులు తగ్గించే దిశగా ఏపీ ప్రభుత్వం #Kolleru #WildlifeSanctuary #CEC #NBWL
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలోని ఆరో అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్లో నేడు మధ్యాహ్నం 3 గంటలకు సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుకు సంబంధించి కేబినెట్ చర్చించునుంది. దీంతోపాటు జూన్ 2న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను ప్రారంభానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను కేబినెట్లో చర్చించనున్నారు. దీంతోపాటు త్వరలో అమలు చేయనున్న మరో రెండు కొత్త పథకాల గురించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. వీటితో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించే అవకాశాలున్నాయని సమాచారం. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన కోదండరాం, అజారుద్దీన్లపై కేబినెట్ చర్చించనున్నట్టుగా తెలిసింది. ఆర్టీసి సమ్మె, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం గురించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, ఫిట్మెంట్, పెండింగ్ డిఏలు, పెండింగ్ సమస్యల గురించి కేబినెట్ చర్చించనున్నట్టుగా తెలిసింది. యాసంగి ధాన్యం సేకరణతో పాటు ధాన్యం, మొక్కజొన్నల సేకరణ ఎంత జరిగింది, ఇంకా రైతుల వద్ద ఎంత మేర ఉందన్న వివరాలను కేబినెట్ ఆరా తీయనుంది.
ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు సుర్వి యాదయ్యగౌడ్ చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
అతి వేగంతో వెళ్తూ బైక్ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
గుర్రంపోడు: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాకాజిపురానికి చెందిన మారెడ్డి బాల్రెడ్డి, అలివేలు, పాల్వాయి గ్రామానికి చెందిన మాలె మంజుల, మాలె వెంకటమ్మ నల్గొండలో ఓ శుభకార్యానికి హాజరై కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వద్దిరెడ్డిగూడెం సమీపంలో వీరి కారు అతి వేగంతో ఓ బైక్ను ఢీకొట్టి ఆ తర్వాత చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న కనగల్కు చెందిన రైతులు నర్సింగ్ మధుబాబు, నర్సింగ్ ధనుంజయ, కారులో ఉన్న బాల్రెడ్డి మృతి చెందారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
చోరీలు, నీటి ప్రమాదాలపై ఎస్పీ హెచ్చరిక
చోరీలు, నీటి ప్రమాదాలపై ఎస్పీ హెచ్చరిక గద్వాల, ఆంధ్రప్రభ: వేసవి సెలవులు మొదలయ్యాయి
మాలేగావ్ 2006 పేలుళ్ల కేసులో బొంబాయి హైకోర్టు కీలక తీర్పు
మహారాష్ట్రలోని మాలేగావ్ 2006 పేలుళ్ల కేసులో బొంబాయి హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై అభియోగాలు మోపుతూ ప్రత్యేక న్యాయస్థానం ఇంతకు ముందు వెలువరించిన ఆదేశాలను కొట్టివేసింది. హైకోర్టు ప్రదాన న్యాయమూర్తి చంద్రశేఖర్ , న్యాయమూర్తి శ్యామ్ చంద్రక్తో కూడిన ధర్మాసనం ఈ మలుపు తిప్పే తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులైన నలుగురు వ్యక్తులు రాజేంద్ర చౌదరి, ధన్సింగ్, మనోహర్ రామ్ సింగ్ నర్వారియా, లోకేష్ శర్మలు ఇప్పుడు కేసు నుంచి విముక్తి పొందారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పెట్టుకున్న దరఖాస్తులను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 2006 సెప్టెంబర్ 8వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న మాలేగావ్ పట్టణంలో పేలుళ్లు జరిగాయి. అక్కడి హమిదియా మసీద్ , బడా ఖబ్రస్థాన్ ఆవరణలలో నమాజ్ తరువాత మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. తరువాత నాలుగో పేలుడు అక్కడి ముషావరత్ చౌక్లో సంభవించింది. ఈ ఘటనలలో మొత్తం 31 మంది దుర్మరణం చెందారు. 312 మంది వరకూ గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్త సంచలనానికి దారితీసింది. దీనిపై రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) తొలుత దర్యాప్తు జరిపింది. కేసుకు సంబంధించి తొమ్మండుగురు ముస్లింలను అరెస్టు చేశారు. తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) రంగంలోకి దిగింది. ఇది హిందూత్వ ఉగ్రవాద చర్యల ఫలితం అని పేర్కొంటూ ఇప్పుడు నిర్దోషులు అయిన వారిని నిందితులుగా చేర్చింది. గత ఏడాది సెప్టెంబర్లో ప్రత్యేక కోర్టు వీరిపై కేసులు నమోదు చేసింది. దీనికి వ్యతిరేకంగా వారు హైకోర్టును ఆశ్రయించారు. తమకు వ్యతిరేకంగా ఎన్ఐఎ ఎటువంటి సాక్షాదారాలు చూపలేకపోయిందని, అయినా తమను నిందితులుగా చూపారని వీరు తెలియచేసుకున్నారు.
Amazon |అమెజాన్ డెలివరీ బాయ్..
Amazon | అమెజాన్ డెలివరీ బాయ్.. Amazon | ఇబ్రహీంపట్నం రూరల్, ఆంధ్రప్రభ
రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్యపై మహిళల నిరసన…
ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా… విశాలాంధ్ర – రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.గత నెల రోజులుగా కొత్తగా బోరు బావిలో నీరు ఉన్నప్పటికీ, పైపులైన్ సక్రమంగా లేకపోవడం వల్ల కాలనీకి త్రాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు […] The post రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్యపై మహిళల నిరసన… appeared first on Visalaandhra .
హార్మూజ్ జలసంధిలో తాజా ఉద్రిక్తతల మధ్య, గత వారం కూడా రెండు భారత నౌకలు ఇరాన్ నౌకాదళ దాడులకు గురైన విషయం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. స్నేహపూర్వక దేశాలకు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని టెహ్రాన్ హామీ ఇచ్చినప్పటికీ ఈ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ జెండాతో ప్రయాణిస్తున్న ‘జాగ్ అర్నవ్’ అనే బల్క్ క్యారియర్ సౌదీ అరేబియా నుంచి భారత్కు వస్తుండగా దాడికి గురైంది. అలాగే ‘సాన్మార్ హెరాల్డ్’ అనే మరో నౌక ఇరాక్ నుంచి భారత్కు చమురు రవాణా చేస్తుండగా లక్ష్యంగా మారింది. ఏప్రిల్ నెలలో సుమారు పది భారత నౌకలు ఈ కీలక సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లు సమాచారం. ఈ ఘటనలతో ఇరాన్లో అసలు అధికార నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రభావం పెరిగి, రాజకీయ నాయకత్వాన్ని పక్కన పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి తన ఆందోళనను తెలియజేస్తూ ఇరాన్ రాయబారిని భారత ప్రభుత్వం పిలిపించి వివరణ కోరింది.
Peddi: బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్ ని అలా అడగడం నచ్చలేదా?
సినిమా మేకింగ్ విషయంలో దర్శకుడు కాంప్రమైజ్ అయితే అనుకున్నదు అనుకున్నట్టుగా తీయలేదు. హీరోలో, నిర్మాతలో స్క్రిప్ట్ లో వేలు పెడితే..ఆ సినిమాల ఫలితం ఎలా ఉంటుందో పెద్ద పెద్ద కాంబినేషన్స్లో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ చాలా సినిమాలే ఉదాహరణగా ఉన్నాయి. దానివల్ల కోట్లలో నష్టపోయిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఇక, సినిమాకి ప్రధాన బలమైన సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవడం వల్ల కొన్ని సినిమాల రిజల్ట్ కూడా ఇలాగే వచ్చింది. […] The post Peddi: బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్ ని అలా అడగడం నచ్చలేదా? appeared first on Telugu Bullet .
15yrsgirl |ఆశ్రమంలో గిరిజన బిడ్డ మృతికి బాధ్యులెవరు?
15yrsgirl | ఆశ్రమంలో గిరిజన బిడ్డ మృతికి బాధ్యులెవరు? 15yrsgirl | జ్వరంతో
ఈడీ దాడి సమయంలో ఐ-ప్యాక్ కార్యాలయంలోకి వెళ్లిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఈ ఏడాది జనవరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన దాడి సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఈడీ కోరింది.ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులు ఇప్పటికే అసాధారణంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు కూడా అత్యంత అసాధారణమైనదిగా భావిస్తున్నామని తెలిపింది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దర్యాప్తు జరుగుతున్న సమయంలో నేరుగా అక్కడికి వెళ్లి జోక్యం చేసుకోవడం సమంజసం కాదు. ఇలాంటి చర్య ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుంది. ఆ తరువాత దీనిని రాష్ట్రం-, కేంద్రం మధ్య వివాదంగా మార్చొద్దని చెప్పడం సరైంది కాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేసిన చర్య. అలాంటి వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టినట్లే.. అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో జనవరి 8న ఈడీ నిర్వహించిన దాడితో ఈ వివాదం ప్రారంభమైంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ దాడులు చేపట్టినట్లు ఈడీ తెలిపింది. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లి కీలక ఆధారాలను తొలగించారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ ఆరోపణలతో ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ నిపుణులు హెచ్.ఎం. సీర్వాయ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు కూడా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక సజీవ దర్యాప్తులో జోక్యం చేసుకునే పరిస్థితిని ఊహించి ఉండరని ధర్మాసనం పేర్కొంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ విచారణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్కు ప్రతిపక్ష బీజేపీ నుంచి గట్టి సవాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ కేసు రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, ఈడీ వంటి సంస్థలకు ప్రాథమిక హక్కులు ఉండవని తెలిపారు. అందువల్ల తమ హక్కులు ఉల్లంఘించబడ్డాయని ఆ సంస్థ వాదించలేదన్నారు. గత తీర్పులను ఉదహరిస్తూ, ఈడీ ఒక ప్రత్యేక న్యాయబద్ధ సంస్థ కాదని, దర్యాప్తు నిర్వహించేందుకు ప్రాథమిక హక్కులు కలిగిన స్వతంత్ర సంస్థగా దానిని పరిగణించలేమని సింఘ్వీ కోర్టుకు వివరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరఫున సీనియర్ న్యాయవాది మేనక గురుస్వామి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని రిట్ అధికార పరిధి కేవలం న్యాయబద్ధ వ్యక్తుల(జ్యూరిస్టిక్ పర్సన్స్)కు మాత్రమే వర్తిస్తుందని ఆమె తెలిపారు. పౌరులను ప్రభుత్వ అక్రమ చర్యల నుంచి రక్షించేందుకే ప్రాథమిక హక్కులు ఉద్దేశించబడ్డాయని, ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలే తమ హక్కులు ఉల్లంఘించబడ్డాయని చెప్పలేవని ఆమె వాదించారు.ఇప్పటికే స్థిరపడిన రాజ్యాంగ సూత్రాలను కేంద్ర ప్రభుత్వం మార్చేందుకు ప్రయత్నిస్తోందని మేనక గురుస్వామి ఆరోపించారు. ఈ సందర్భంగా కేశవానంద భారతి కేసు సహా పలు కీలక తీర్పులను ఆమె ప్రస్తావించారు.ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక కొనసాగుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడం వల్ల కలిగే ప్రభావాలపై పదేపదే ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశం సంస్థల అధికార పరిమితులు, న్యాయపాలన వంటి కీలక రాజ్యాంగ సూత్రాలపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఐ-ప్యాక్ కేసు ఏమిటి? జనవరి 8న కోల్కతాలోని ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ నిర్వహించిన దాడితో ఈ కేసు మొదలైంది. సోదాలు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లడంతో రాజకీయ, న్యాయపరమైన వివాదం చెలరేగింది.దాడి జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ అక్కడి నుంచి కొన్ని పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లారని ఈడీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను మమత ఖండించారు. తాను తీసుకెళ్లిన పత్రాలు 2019 లోక్సభ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఐ-ప్యాక్తో నిర్వహించిన రాజకీయ కార్యకలాపాలకు సంబంధించినవేనని, మనీ లాండరింగ్ దర్యాప్తుతో వాటికి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసును రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈడీ ముందుకు తీసుకెళ్తోందని కూడా మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే వ్యాపారవేత్త అనూప్ మజీకి సంబంధించిన కోల్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ నెట్వర్క్పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ దాడులు నిర్వహించామని ఈడీ చెబుతోంది. ఇటీవలి నెలల్లో ఈ కేసు మరింత విస్తరించింది. కోల్ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ను ఈడీ అరెస్టు చేసింది.
విడపనకల్లు మండలంలో కల్తీ ఆహార దందా బహిర్గతం…
అధికారుల మౌనం.. కల్తీ రాయుళ్లకు వరం! విశాలాంధ్ర – విడపనకల్లు: పసిపిల్లలు నోటిలో వేసుకునే మిఠాయిలే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. మండలంలో విక్రయిస్తున్న కొన్ని మిఠాయిలు నిప్పు అంటిస్తే కొవ్వొత్తిలా కరుగుతున్న ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కల్తీ దందా తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ ముద్రించడం చట్టరీత్యా తప్పనిసరి అయినప్పటికీ, ఇక్కడ విక్రయించే ప్యాకెట్లపై ఆ వివరాలు కనిపించడం లేదు. తనిఖీలను తప్పించుకునేందుకు తాత్కాలికంగా తేదీలు […] The post విడపనకల్లు మండలంలో కల్తీ ఆహార దందా బహిర్గతం… appeared first on Visalaandhra .
రాష్ట్రంలో ఆరుగురు సీనియర్ ఐపిఎస్లకు డిజి హోదా
హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపిఎల్ అధికారులకు డైరెక్టర్ జనరల్(డిజి)గా పదోన్నతులు కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో అదనపు డిజిలు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వివి శ్రీనివాస రావు, చారు సిన్హా, అనిల్ కుమార్, విసి సజ్జనార్ ఉన్నారు. మహేశ్ భగవత్ ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదనపు డిజిగా ఉండగా.. స్వాతి లక్రా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజిగా ఉన్నారు. వివి శ్రీనివాస రావు తెలంగాణ పోలీసు నియామక మండలి ఛైర్మన్గా వ్యవహరిస్తుండగా.. సిఐడి, మహిళ భద్రతా విభాగం, ఎసిబి ఎడిజిగా చారు సిన్హా విధులు నిర్వర్తిస్తున్నారు. అనిల్ కుమార్ గ్రే హౌండ్స్ ఎడిజిగా ఉండగా.. విసి సజ్జనార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనర్గా ఉన్నారు. ఈ ఆరుగురు ఐపిఎల్ అధికారులు.. పదోన్నతి పొందినా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ అదే స్థానాల్లో విధులు నిర్వర్తించనున్నారు.
చేనేత రంగాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
చేనేత రంగాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఆప్కో డైరెక్టర్ కర్నాటి వెంకటేశం
రూ. 90 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డుల ఏర్పాటు మన తెలంగాణ/సిటీబ్యూరో : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం, గ్రామంలోని 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. ఈ భూమి విలువ రూ. 90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అధికారుల వివరాల ప్రకారం సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిపోగా అక్కడ 9.05 ఎకరాల ప్రభుత్వ భూమి మిగిలింది. ఖస్రా పహాణీ (గ్రామ పాత రికార్డుల) ప్రకారం మొత్తం 176.05 ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదై ఉంది. అందులోని 9.05 ఎకరాలను సీఎస్ 14 (నిజాంలకు చెందిన) భూములుగా పేర్కొంటూ కొంతమంది హక్కులు క్లైమ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వివాదం హైకోర్టులో పెండింగ్లో ఉంది. తుది తీర్పు వచ్చే వరకూ ఈ భూమి స్వరూపాన్ని మార్చరాదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు స్టే ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్ను పట్టించుకోకుండా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి అభూమిని చదును చేసి లే ఔట్గా మార్చినట్టు రంగరెడ్డి కలెక్టర్తో పాటు.. శంషాబాద్ మున్సిపల్ అధికారులకు ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ 9.05 ఎకరాల భూమిని చదును చేసి.. ప్రీకాస్ట్ గోడల ద్వారా అక్రమించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. భూ అక్రమణ చట్టం 1905 ప్రకారం అక్రమణలను తొలగించాలని మొయినుద్దీన్కు అధికారులు సూచించారు. అవేవీ పట్టించుకోకుండా.. అక్కడ కొన్ని ఇంటి స్థలాలు అమ్ముకున్నట్టు కూడా తెలుసుకున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇదే విషయాన్ని హైడ్రాకు చెబుతూ.. ఆక్రమణలు తొలగించాలని లేఖ రాశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పిర్యాదుతో బుధవారం హైడ్రా ఆపరేషన్ చేపట్టి.. 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమణలను తొలగించింది. ఆభూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వం భూమి అని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో ప్రభుత్వంలోని ఆక్రమణలను హైడ్రా తొలగించింది.
5 months |వృద్ధ దంపతుల బలవన్మరణం..
5 months | వృద్ధ దంపతుల బలవన్మరణం.. 5 months | కంచికచర్ల,
మంత్రి అజహరుద్దీన్ పదవిపై ఉత్కంఠ
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై దాఖలైన పిటిషన్ల కేసు విచారణను సుప్రీం కోర్టు జూలై 22వ తేదీకి వాయిదా వేయడంతో మంత్రి అజహరుద్దీన్ మంత్రి పదవిపై ఉత్కంఠత నెలకొంది. అజర్ మంత్రి పదవి ఉంటుందా? లేక ఊడుతుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. అందుకు కారణం ఈ నెలాఖరుతో మంత్రి పదవి గడువు ముగియనున్నది. ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ కాకుండానే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజర్ ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అలా జరగకపోతే రాజ్యాంగంలోని ఎన్నికల నియమావళి ప్రకారం ఆరు నెలలు దాటగానే సదరు మంత్రి ‘మాజీ’ అవుతారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీల (అజర్, ప్రొఫెసర్ కోదండరాం) నియామకాన్ని సవాల్ చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్తో పాటు మరి కొందరు వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో బుధవారం కోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. మైనారిటీ కోటాలో మంత్రివర్గంలో అజర్ను తీసుకుంటే ఇప్పుడు ఈ సమస్య రావడంతో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్తో సమావేశమై పరిస్థితిని అధిగమించడానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైలును క్లియర్ చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. కాగా కేసు సుప్రీం కోర్టులో ఉన్నదని గవర్నర్ సలహాదారుల సూచన మేరకు ఆయన నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. మరోసారి మంత్రిగా ప్రమాణం.. మంత్రి అజర్ పదవీ కాలం గడువు ఈ నెలాఖరుతో ముగియగానే ఆయన ‘మాజీ’ అయితే మైనారిటీలంతా అసంతృప్తికి గురవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే అజర్ మాజీ కాగానే ఒక రోజు విరామం ఇచ్చి ఆ మర్నాడు మళ్లీ మంత్రిగా ప్రమాణం చేయించడానికి అవకాశం ఉంది. ఈ మార్గాన్నే ముఖ్యమంత్రి అనుసరిస్తారా? ఆని పార్టీ వర్గాలు భావిస్తాయి. ఆ విధంగా రెండో సారి అజర్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే మళ్లీ ఆరు నెలల వరకూ గడువు ఉంటుంది.
గంజాయితో పట్టుబడ్డ యువకుడు ధర్మపురి, ఆంధ్రప్రభ: జగిత్యాల జిల్లా ధర్మపురిలో గంజాయి తరలిస్తున్న

31 C