రోకోలకు ఇంతటి అవమానమా...? ఆగ్రహిస్తున్న ఫ్యాన్స్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల పట్ల బీసీసీఐ సెలక్షన్ కమిటీ అవమానకరంగా వ్యవహరించిందన్న కామెంట్స్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి వినపడుతున్నాయి.
` ప్రాజెక్టుపై ముందుకెళ్లకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించండి ` కేంద్రానికి తెలంగాణ లేఖ హైదరాబాద్(జనంసాక్షి): పోలవరం- బనకచర్ల లింకు ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని తెలంగాణ …
` బీసీ రిజర్వేషన్ల ఆశలపై నీళ్లు చల్లారు ` బంద్తో బిసిల ఆకాంక్షను వెల్లడిస్తాం:ఆర్. కృష్ణయ్య హైదరాబాద్(జనంసాక్షి):బీసీల వాదన వినకుండా తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చిందని …
Narendra Modi : రేపు ప్రధాని ఏపీకి ఇచ్చే వరాలివే
ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటనలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను నిలువరించండి
` సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం – బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకొనేందుకు అనుమతివ్వాలని అభ్యర్థన – గురువారం …
మంచి మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్తో..
సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా కె ర్యాంప్. ఈ సినిమాను హా స్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శక త్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రాజేశ్ దండ మాట్లాడుతూ ..“దర్శకుడు జైన్స్ నాని చెప్పిన కథ నాకు నచ్చింది. ఇందులో హీరో పాత్ర పేరు కుమార్. ఆ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంది. - కథానుసారమే కేరళ బ్యాక్డ్రాప్ ఉంది. కేరళలో షూటింగ్ చేయడం వల్ల సినిమాకు కొత్త లుక్ వచ్చింది. కథలో హీరోయిన్ కేరళ అమ్మాయి. అక్కడ కాలేజ్ లో చేసిన సీన్స్, ఓనమ్ సాంగ్ విజువల్గా కలర్ఫుల్గా వచ్చాయి. -సినిమా చిత్రీకరణ సమయంలో కిరణ్ ఎంతో సహకరించారు”అని అన్నారు. ప్రొడ్యూసర్ శివ బొమ్మకు మాట్లాడుతూ.. “కుమార్ పాత్రలో హీరో కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్గా నటించారు. హీరోయిన్ క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తుంది. నరేష్, వెన్నెల కిషోర్ పాత్రలను ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు”అని పేర్కొన్నారు.
2047 నాటికి అభివృద్ధిలో భారత్ను ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచాలనే ‘వికసిత్ భారత్’ అంటూ నిత్యం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాం. ఇప్పటికే ఆర్థికంగా నాలుగో స్థానానికి చేరుకున్నామని, త్వరలో మూడో స్థానంకు చేరుకోబోతున్నామని భావిస్తున్నాం. అయితే కుల వివక్ష, ముఖ్యంగా అణగారిన ప్రజలపట్ల ఈసడింపు, వేధింపులకు మాత్రం అంతులేకుండా పోతున్నది. ఎంతమందిని మొక్కుబడిగా ఉన్నత పదవులకు తీసుకొచ్చినా, రాజ్యాంగపరంగా ఎన్ని రక్షణలు కల్పిస్తున్నా అత్యున్నత స్థాయిలో ఉన్నవారు సైతం ఎటువంటి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందో హర్యానాలో సీనియర్ ఐపిఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య స్పష్టం చేస్తున్నది. అటువంటి సీనియర్ అధికారి ఆత్మహత్య చేసుకుంటే, వెంటనే ఎందుకు చేసుకున్నానో వివరించిన 8- పేజీల నోట్ లభించినా దాని ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తగు చర్యలు చేపట్టేందుకు రోజుల తరబడి ప్రభుత్వం సంశయిస్తూ ఉందంటే మన వ్యవస్థలో వివక్ష ఎంత లోతుగా పాతుకు పోయిందో వెల్లడవుతున్నది. కేవలం పూరన్ కుమార్ భార్య అమ్నీత్ పి కుమార్ ఓ సీనియర్ ఐఎఎస్ అధికారిని కావడం, కీలక నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తగు చర్యలు తీసుకోవాలని సాహసంతో పట్టుబట్టడంతో కొంతవరకైనా ప్రభుత్వం కదిలి రావాల్సి వచ్చింది. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో ఓ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైతే 24 గంటల లోగా, ఆ రాష్ట్ర ఉన్నత పోలీసు అధికారులకన్నా ముందుగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మజుందార్ అక్కడకు చేరుకొని, దర్యాప్తుపై ఆరాతీసారు. కానీ, పూరన్ కుమార్ విషయంలో జాతీయ ఎస్టి కమిషన్ వారం రోజులలోగా ఓ నివేదిక పంపమని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు లేఖలు రాసి ఊరుకుంది. హక్కుల సంఘాలు అధికార పక్షాల ప్రచార విభాగాలుగా ఏ విధంగా దిగజారుతున్నాయో ఇటువంటి ఘటనలు వెల్లడి చేస్తున్నాయి. సూసైడ్ నోట్ చూస్తే గత ఐదేళ్లుగా కేవలం కులం కారణంగా ఏ విధంగా వేధింపులు ఎదుర్కొంటున్నారో, మానసిక వ్యథకు గురిచేసారో వెల్లడవుతుంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గాని, వ్యవస్థలు గాని జోక్యం చేసుకొనే ప్రయత్నం చేయలేదంటే దేశంలో ఎటువంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అర్థం అవుతుంది. ‘ఐపిఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం చాలా తీవ్రమైన అంశం. దాదాపు 14-15 మంది పోలీసు ఉన్నతాధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం చూస్తేనే కేసు తీవ్రత అర్థమవుతోంది’ అంటూ పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఆందోళన వ్యక్తం చేశారు. అయినా, ఎఫ్ఐఆర్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు అత్యున్నత స్థాయిలో జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. దళితులు, గిరిజనులకు రాజ్యాంగపరమైన ఉన్నత స్థానాలను కల్పిస్తున్నా, రాజ్యాంగం కల్పిస్తున్న అవకాశాల కారణంగా వారు ప్రభుత్వంలో ఉన్నత పదవులకు చేరుకుంటున్నప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారని అనేక ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. డా. బిఆర్ అంబేద్కర్ వంటి వారు అటువంటి వివక్ష, వేధింపులకు తిరగబడి పోరాటం చేసినా, అనేకమంది బలవుతూ వస్తున్నారు. దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నుండి, బిజెపి జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటువంటి వేధింపులకు గురయ్యారు. ఉన్నత పదవులు / స్థానాలు లభించినా స్వతంత్రంగా వ్యవహరింపలేని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. చివరకు వారిని కలిసేందుకు ఎవ్వరైనా వస్తే కీలకమైన ప్రభుత్వంలోని పెద్దల అనుమతి తప్పనిసరి అవుతుంది. రాజకీయంగా నాడు అత్యంత శక్తివంతమైన నేతగా పేరొందిన ఇందిరా గాంధీ స్వయంగా ఎంపిక చేసి దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ఆధిపత్యం వహిస్తున్న పెత్తందారీ వర్గం ఆయనకు అడుగడుగునా అడ్డుతగిలింది. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఢిల్లీకి చేరవేసి అప్రతిష్ఠకు గురిచేసే విఫల ప్రయత్నం చేసింది. నాడు ఆయనను ఆ పదవి నుండి దించేవరకు విశ్రమించనని శపథం చేసి కాసు బ్రహ్మానందరెడ్డి విజయం పొందారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ పట్టుబట్టి జనరల్ సీటు అయిన కర్నూల్ నుండి లోక్సభ అభ్యర్థిగా నిలబెడితే కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రతిష్ఠగా తీసుకొని ఓడించారు. కాంగ్రెస్ అధ్యక్షునిగా చేసినా నిలదొక్కుకోనీయలేదు. అయితే పాలన సామర్థ్యంలో తెలుగు రాష్ట్రాలను పాలించిన ఏ ముఖ్యమంత్రికీ సంజీవయ్య తీసిపోరని అందరికీ తెలిసిందే. అదే విధంగా బంగారు లక్ష్మణ్ను బిజెపి అధ్యక్షునిగా నాటి ప్రధాని వాజపేయి ఎంపిక చేస్తే మిగిలిన వారు తట్టుకోలేకపోయారు. ఓ కుట్రపూరితంగా ఆయనపై అవినీతి మరక చల్లి పదవి నుండి తొలగించారు. ఈ మొత్తం వ్యవహారంపై తెహల్కాకు ఓ ప్రముఖ బిజెపి నేత ఆర్థిక సహాయం చేయడం గమనార్హం. రికార్డు చేసిన టేపులో రక్షణ శాఖలో తనకు ఎవ్వరో తెలియదని, ఎటువంటి పనులు చేయలేనని లక్ష్మణ్ స్పష్టంగా చెప్పినట్లు వినిపిస్తుంది. ఇందులో కేసు ఏముందని ప్రశ్నించిన న్యాయమూర్తే ఆయనకు నాలుగేళ్లు శిక్ష విధించారు. అయితే, నాటి రక్షణ మంత్రి అధికార నివాసంలోనే రక్షణ ఒప్పందాల గురించి బేరాలు ఆడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న జయ జైట్ల్ వంటి వారిని కనీసం అరెస్ట్ కూడా చేయకపోవడం గమనార్హం. జైలులో తగిన వైద్య సదుపాయం లేకపోవడంతో అనారోగ్యానికి గురైతే కనీసం ఆయనను గాని, ఆయన కుటుంబ సభ్యులను గాని పరామర్శించే ప్రయత్నం నాటి ప్రముఖ బిజెపి నాయకులు ఎవ్వరూ చేయలేదు. కేవలం నాటి పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మారు పేరుతో జైలుకు వెళ్లి పరామర్శించారు. కానీ అనారోగ్యంతో ఆయన మృతి చెందగానే హైదరాబాద్కు వచ్చిన అగ్రనేతలు ఆయనను ఓ మహోన్నత దళిత నేత అంటూ పొగడ్తలు కురిపించారు. బిజెపి అధ్యక్షునిగా నితిన్ గడ్కరీ రెండోసారి కొనసాగితే తమ ఆటలు సాగవని భయంతో కొందరు ప్రముఖులు నాటి యుపిఎ ప్రభుత్వంతో చేతులు కలిపి, ఆదాయ పన్ను నోటీసులు ఆయన కంపెనీలకు ఇప్పిస్తే, వెంటనే ఓ ప్రముఖుడితో విచారణ జరిపించి ఆయనకు ‘క్లీన్ చిట్’ ఇప్పించారు. కానీ అటువంటి అండదండలు బంగారు లక్ష్మణ్కు ఎందుకు లభించలేదు? గిరిజనుల అభ్యున్నతి కోసం జీవితం మొత్తం ఎన్నో పోరాటాలు చేసి, ప్రత్యేక రాష్ట్రం సాధించిన శిబూ సొరేన్ను పివి నరసింహారావు ప్రభుత్వం కాపాడేందుకు రూ. 50 లక్షలు ఇస్తే, ఆ డబ్బు దాచుకోవాలని తెలియక అమాయకంగా బ్యాంకులో వేసుకొని జైలు శిక్ష అనుభవించారు. కానీ ఆరుగురు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారని నిర్దిష్టమైన సాక్ష్యాలతో మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి శాంతిభూషణ్ పిటిషన్ దాఖలు చేస్తే, ఆయన చనిపోయి చాలాకాలమైనా ఇప్పటి వరకూ దానిపై విచారించే ప్రయత్నం చేయడం లేదు. దళితులు, గిరిజనులు అనగానే వారంతా రిజర్వేషన్ల ద్వారా వచ్చారని, ప్రతిభ లేనివారని, అవినీతిపరులని హేళనగా మాట్లాడటం అలవాటుగా మారింది. అయితే, దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల నాయకత్వంలో, ఆధిపత్యంలోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలలో సైతం వారే కీలక పదవులలో ఉంటున్నారు. అయితే ప్రపంచంలోని దారుణమైన అవినీతి ప్రభుత్వాలలో ఒకటిగా భారత్ ఎందుకు అపఖ్యాతి మూటగట్టుకుంటున్నది? అందుకు ఎవ్వరు బాధ్యులు? ఉన్నత విద్యాసంస్థల్లో సైతం ఇటువంటి వివక్ష దశాబ్దాలుగా కొనసాగుతున్నది. చివరకు మెస్లలో వారి పక్కన కూర్చొని భోజనం చేసేందుకు సైతం వెనకాడే ధోరణులను మనం చూడవచ్చు. అసలు కేంద్ర విద్యా సంస్థలలో, ప్రభుత్వ విభాగాలలో వారికోసం ఉద్దేశించిన సీట్లు, ఉద్యోగాలను ఉద్దేశపూర్వకంగా భర్తీ చేయకుండా వారి అవకాశాలను కుట్రపూరితంగా వమ్ముచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిద్ధాంతాల గురించి ఘనంగా మాట్లాడే ఓ నాయకుడు వాజపేయి ప్రభుత్వ హయాంలో రాజస్థాన్కు చెందిన ఒక ఎస్సి నేతను రాజ్యసభకు పంపితే, ఆయనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్ను ఆక్రమించుకొని, చివరకు పనివారుండే గదిలో ఉండేందుకు కూడా ఆ ఎంపికి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని అప్పట్లో రవివార్ అనే ఆంగ్ల వారపత్రిక కవర్ పేజీ కథనంతో ప్రముఖంగా ప్రచురిస్తే బిజెపి సర్దుబాటు ప్రయత్నం చేసింది. ఆ విధంగా వేధించిన నేత ఆ తర్వాత రాజ్యసభకు కూడా వెళ్లారు. అసలు కులం, మతాలను గుర్తింపమని చెప్పుకొనే వామపక్షాలతో ఇప్పటివరకు ఈ వర్గాలకు చెందిన వారికి నాయకత్వ స్థాయికి అవకాశం ఇచ్చారా? చివరకు పిడబ్ల్యుజిలో సైతం కెజి సత్యమూర్తి వంటి వారు ఈ విషయమై చర్చలు లేవనెత్తారు. ఎస్సి, ఎస్టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. పలు సందర్భాలలో వాస్తవం కావచ్చు. అనేక మంది దొంగ కుల సర్టిఫికెట్లతో ఈ రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతూ, అత్యున్నత స్థానాలకు వెళ్లగలుగుతున్నారు కూడా. రిజర్వేషన్ ప్రయోజనాలు కేవలం అత్యంత అల్పమైన శాతం ప్రజలే పొందుతున్నారు. ఆ పేరుతో వారిపట్ల ద్వేషభావం పెంచుకోవడం నేరం కాగలదు. అసలు ఈ రిజర్వేషన్లు ఏ విధంగా అమలవుతున్నాయో ఇప్పటి వరకు సమీక్ష చేసి ప్రయత్నం, సాహసం ఎవ్వరూ చేయడం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు అడ్డువస్తున్నాయి. మరోవంక, ఈ వర్గాలకు చెందినవారు గ్రామాల నుండి అత్యున్నత స్థాయిల వరకు నిత్యం వేధింపులు, వివక్షలకు గురవుతున్నారు. బలమైన చట్టాలు ఉన్నప్పటికీ, వెంటనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి విషయంలోనే వెల్లడైతే ఇక సాధారణుల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఈ వర్గాల ప్రజలు హింసకు, వివక్షకు గురైన సందర్భాలలో వెంటనే వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం లేదు. ప్రతిపక్షాలు సైతం ఓ రాజకీయ అవకాశంగా భావిస్తున్నాయి. కనీసం మీడియా వారిని స్వేచ్ఛగా అటువంటి ప్రదేశాలకు వెళ్లే అవకాశం పలు సందర్భాలలో ఉండటం లేదు. అటువంటి ప్రయత్నాలు చేసి పలువురు అరెస్టుకు గురైన సందర్భాలు సైతం ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లకు సైతం ఇటువంటి దారుణమైన పరిస్థితులు దేశంలో కొనసాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, వ్యవస్థలు అందుకు బాధ్యత వహించాల్సిన సంస్థలు కారణమని చెప్పాల్సిందే. చలసాని నరేంద్ర 98495 69050
ఉస్మానియా యూనివర్శిటీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 200 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రూ. 40 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయిన సందర్భంలో కూడా 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కడతాం 2.70 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది, కనుక నిధులు విడుదల చేయమని కోరారు. అరవింద్ కేజ్రీవాల్ మూడు సార్లు పాఠశాలలు మూలంగానే ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తానని అన్నారు. మంచిదే, యంగ్ ఇండియా పాఠశాలల గురించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలగనడంలో తప్పులేదు! కలలు సాకారం కావడానికి ఉన్న పునాది ఏమిటి అనేదే అసలు ప్రశ్న? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఆలోచన తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రట బుర్ర వెంకటేశం బుర్రలోనుంచి వచ్చిన సమగ్ర పాఠశాల విధానం. ఇప్పటికే జిల్లా కేంద్రాల వరకు విస్తరించిన కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో లక్షల రూపాయల్లో ఫీజులు వసూలుచేస్తున్న ప్రైవేటు పాఠశాలలకు ప్రత్యామ్నాయ ఆలోచన ఆయనచేసి ఉండవచ్చును,తప్పులేదు! పదేపదే పాలకులు ఈ పాఠశాలల గురించి మాట్లడడం వలన ప్రభుత్వ ప్రాధాన్యత చెప్పకనే చెప్పినట్లైంది. 28 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం కోసం 2024 ఏప్రియల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వాటిస్థితి ఇప్పుడు ఏమిటి? ప్రభుత్వం చెబుతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల అసలు స్వరూపం ఏమిటి? ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల స్థలం, 2560 మంది విద్యార్థులు, 124 మంది ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు నిర్మించాలి. ఒక్కో పాఠశాల నిర్మాణం కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చొప్పున 200 పాఠశాలల నిర్మాణం కోసం రూ. 40 వేల కోట్లు నిధులు సమీకరించాలి. 5 వేల ఎకరాల స్థలం సేకరణ చేయాలి. 24,800 మంది ఉపాధ్యాయులను కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవాలి. వేలకోట్ల రూపాయలతో తరగతి గదులు నిర్మించాలి. ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యమంత్రి కలమొత్తం సాకారం అయితే, రాష్ట్రంలో 5 లక్షలమంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలుతో నాణ్యమైన ఉచిత విద్య అందుతుంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 27 లక్షల 69 వేల మంది విద్యార్థుల్లో మిగతా 22 లక్షల విద్యార్థుల భవితవ్యం ఏమవుతుంది? ఇక ఈ ఐదు లక్షల మంది విద్యార్థులు ఎక్కడనుండి వస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాల లో నుండే కదా? అంటే ఉన్న బడుల నమోదును, ఉనికిని దెబ్బ తీసి, దివాలాతీయించడమే కదా! ఇక ఇప్పటికే రాష్ట్రంలో 30,022 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు సరాసరి ఎకరం స్థలం వేసుకున్నా 30 వేల ఎకరాల విలువైన భూములు, గత 20 ఏళ్ళుగా సర్వశిక్షా అభియాన్ నిర్మించిన 2 లక్షల కోట్ల విలువైన తరగతి గదులు, 2 లక్షల 7 వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు. ఏటా వేతనాలకు రూ. 18 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ బడుల మనుగడ, భవిష్యత్తు, ఉనికి ఏమిటి? ఇప్పటికే ప్రభుత్వ బడులకు ఇన్నివేల ఎకరాలు ప్రభుత్వ స్థలాలు ఉండగా, మరో 5 వేల ఎకరాల పంట భూములు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల కోసం సేకరించడం అవసరమా? ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో పిల్లలు లేనిచోట బోధనా సిబ్బంది ఉండడం, పిల్లలు ఉన్న చోట మౌలిక సౌకర్యాలు, బోధనా సిబ్బంది లేకపోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో అసమతౌల్య నిర్వాహణ అనేది ఎంతో బోధనాశక్తిని వృథా చేస్తున్నది. కాలక్రమంలో అనేక ప్రభుత్వబడులు మూతపడి ఉండడం, మరికొన్ని మూత దశకు చేరుకోవడం చూస్తున్నాము. ఇట్లాంటి స్థితిలో ఇప్పటికే ఏడాదిన్నర కాలంలో రెండు విద్యా కమిషన్లను ప్రభుత్వం నియమించింది. మాజీ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి అధ్యక్షతన నియమించిన తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్రం అంతా పర్యటించి, అనేకమంది విద్యారంగం ప్రముఖుల అభిప్రాయాలు సేకరించి ఒక నివేదిక ఇచ్చింది. ఉన్న ప్రభుత్వ బడుల స్థానంలో మండలానికి నాలుగు తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, బడులు లేని క్యాచ్మెంట్ ఏరియా నుండి ఉచిత రవాణా సౌకర్యం పాఠశాల వరకు కల్పించాలని, ఒక్కో మండలానికి రూ. 50 కోట్లు చొప్పున, ప్రతి ఏటా వంద మండలాలకు రూ. 5 వేల కోట్లు వెరసి ఆరు సంవత్సరాలలో 634 మండలాల్లో ప్రభుత్వ బడుల పూర్తి సంస్కరణకు రూ. 31,700 కోట్లు ఆర్థిక ప్రణాళిక కూడా ఇచ్చింది. కానీ, ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో ఒక్క పైసా విద్యా సంస్కరణ కోసం కేటాయించలేదు. సరికదా! ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం వీటి గురించి ఎక్కడా మాట్లాడడం లేదు? అంటే, కమిషన్ సిఫార్సులు చెత్తబుట్టకు పరిమితం చేసినట్లే గదా? గత పదేళ్ళలో కెసిఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు పట్టించుకోకుండా ఒక వెయ్యి రెసిడెన్షియల్ స్కూళ్ల్లను స్థాపించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల నమోదును దారుణంగా దెబ్బతీసింది. ఆయా రెసిడెన్సియల్ పాఠశాలలు దివాలా తీసిన ఇంజనీరింగ్ కళాశాలల్లో అద్దె భవనాల్లో కునారిల్లుతున్నాయి. ఇప్పటికీ వాటి ప్రణాళిక లోపం వలన ఆయా రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు బయటపడడం, కొన్ని కూలిపోయిన సంఘటనలు వెలుగు చూశాయి. పదేళ్ళ తర్వాత కెసిఆర్ విద్యా ప్రణాళిక వల్ల విద్యా ప్రమాణాలు స్థాయి దేశంలో 31వ రాష్ట్రంగా తెలంగాణ స్థిరపడింది. పరోక్షంగా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ఈ అనాలోచిత రెసిడెన్షియల్ వ్యవస్థ వలన మరింత దెబ్బతిని ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో కార్పొరేట్ సంస్థలు విచ్చలవిడిగా పాఠశాలలు ఏర్పాటు చేసి ఒకటో తరగతికే రూ. రెండు లక్షల ఫీజులు ఏ విద్యా హక్కు చట్టం ప్రకారం వసూలు చేస్తున్నారో? చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు పాఠశాల వ్యవస్థ ఫీజులు నియంత్రణ గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడున్న అవసరాల స్థాయికి ప్రభుత్వ విద్యావ్యవస్థలో ప్రణాళిక రూపొందించాలి. అందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ వనరులు వాడుకోవడం, సద్వినియోగం దిశగా ఆలోచన చేయడం ప్రభుత్వం ముందు ఉన్న తక్షణ కర్తవ్యం. సిఎం రేవంత్రెడ్డి ప్రపంచస్థాయి నాణ్యమైన ఉచిత విద్య ప్రజలకు అందచేయాలనే ఆలోచనకు రావడం చాలా గొప్ప విషయం, ఆశయం, ఆలోచన, ఆయన కల అభినందనీయమే! కానీ, కలను సాకారం చేయడంలోనే పాలకుల నైపుణ్యం ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్క రోజులోనో, ఏడాదిలోనో నెరవేరే లక్ష్యం కాదు! సుదీర్ఘ ప్రణాళిక, చిత్తశుద్ధితో కూడిన కృషి, పట్టుదల అవసరం. ప్రభుత్వ ఆలోచనలు ఆచరణీయమైన ప్రణాళిక దిశగా తెలంగాణ విద్యా వ్యవస్థ మంచి సంస్కరణ దిశగా కొనసాగాలని ఆశిద్దాం. ఎన్.తిర్మల్ 94418 64514
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన దేశవాళీ క్రికె ట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సీజన్ 2025-26కి తెరలేవనుంది. బుధవారం ప్రారంభమ య్యే రంజీ ట్రోఫీకి వచ్చే ఏడా ది ఫిబ్రవరి 28తో తెరపడుతోం ది. రంజీ ట్రోఫీలో పాల్గొనే జట్ల ను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో 8 జట్లకు చోటు కల్పించారు. ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్ టీమ్కు ఎలైట్ గ్రూప్డిలో స్థానం దక్కింది. ముంబై, ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, పుదుచేరి, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ జట్లు ఈ గ్రూప్లో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ విదర్భతో పాటు ఆంధ్రా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బరోడా, ఒడిశా, నాగాలాండ్, తమిళనాడు గ్రూప్ఎలో ఉన్నాయి. కాగా, హైదరాబాద్ తన తొలి మ్యా చ్ను ఢిల్లీతో ఆడనుంది. హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, హైదరాబాద్ టీమ్కు తిలక్వర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. తన్మయ్ అగర్వాల్, చామ మిలింద్, కార్తీకేయ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు తదితరులతో హైదరాబాద్ బలంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. తిలక్వర్మ, తన్మయ్, త్యాగరాజన్, కార్తీకేయ, మిలిం ద్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండడం హైదరాబాద్కు కలిసి వచ్చే అం శంగా చెప్పాలి. ఇక ఢిల్లీ టీమ్ను కూడా తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు. కెప్టెన్ అయుష్ బడోని,అనూజ్ రావత్, నితీశ్ రాణా, ప్రియాన్ష్ ఆర్య, యశ్ ధుల్, నవ్దీప్ సైని, హిమ్మత్ సింగ్, సిమర్జీత్ సింగ్ తదితరులతో ఢిల్లీ పటిష్టంగా ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
ఫోన్ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావుకు చుక్కెదురు
మన తెలంగాణ/హైదరాబాద్ : రా ష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మంగళవారం సు ప్రీం కోర్టులో జస్టిస్ నాగరత్న, జస్టి స్ ఆర్ మహదేవ్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ధర్మాసనం కీలక వ్యా ఖ్యలు చేసింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కంప్యూటర్ క్లౌడ్, ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి క ల్పించిన స్పెషల్ రిలీఫ్ను న్యాయస్థా నం పొడిగించింది. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్తో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాననం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినించారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కేసు దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్కు అప్పగించాలని కోర్టుకు తెలిపారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటికి వస్తాయన్నారు. ప్రభుత్వం మారగానే హార్డ్ డిస్క్లో డేటా ధ్వంసం చేసి, కొత్తగా 50 హార్డ్ డిస్కులు ఆ స్థానంలో ఉంచారని న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు టాప్ చేశారని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. నక్సలైట్ల పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేసినట్లు తెలిపారు. డిజిటల్ డివైసెస్లో డేటా ఫార్మా చేశారని, ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డేటా మొత్తం డిలీట్ చేసి డివైసెస్ తమకు ఇచ్చారని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు తరఫున న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు డివైస్ రీసెట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయన్ను ఇప్పటికే 11సార్లు పిలిపించి సుమారు 80 గంటల పాటు విచారణ జరిపినట్లు తెలిపారు. డేటాను ప్రభాకర్ రావు డిలీట్ చేయలేదని డిపార్ట్మెంట్ డిలీట్ చేసిందని చెప్పారు. విచారణకు సహకరించడంలేదు అనడంలో వాస్తవం లేదని, విచారణ అంతా వీడియో రికార్డుల సమక్షంలోనే జరిగిందని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం కేసులో సిట్ అధికారులు అడిగిన సమాచారం ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు ఇవ్వాల్సిందేనని తెలిపింది. అదే విధంగా యూజర్, పాస్వర్డ్ల సమాచారం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సమాచారం తీసుకోవాలని సిట్కు సూచించింది. సమాచారం ధ్వంసం చేసినట్లుగా, నిందితుడు ప్రయత్నించనట్లుగా తేలితే తదుపరి చర్యలపై తాము నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 18 వతేదీకు వాయిదా వేసింది.
విండీస్ ఓటమి.. భారత్దే టెస్ట్ సిరీస్
న్యూఢిల్లీ: వెస్టిండీస్తో ఢిల్లీ వేదికగా జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ రెండు మ్యాచ్ల సిరీస్ను ౨-0తో క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్గా శుభ్మన్ గిల్కు ఇది తొలి సిరీస్ కావడం విశేషం. 121 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 63/1 ఓవర్నైట్ స్కోరుతో మంగళవారం చివరి రోజు తిరిగి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే సాక్ తగిలింది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ సాయి సుదర్శన్ 76 బంతుల్లో 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కిందటి స్కోరుకు సాయి 9 పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో షాయ్ హోప్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్తో సుదర్శన్ ఔటయ్యాడు. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, మరో సిక్సర్తో 13 పరుగులు చేసిన గిల్ను గ్రీవ్స్ వెనక్కి పంపాడు. ఇక ధ్రువ్ జురెల్ 6 (నాటౌట్) అండతో మిగిలిన లాంఛనాన్ని రాహుల్ పూర్తి చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 108 బంతుల్లో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(175), కెప్టెన్ శుభ్మన్ గిల్ 129 (నాటౌట్) శతకాలతో చెలరేగి పోయారు. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన విండీస్ 248 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్లో పడింది. కానీ, రెండో ఇన్నింగ్స్లో విండీస్ అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. షాయ్ హోప్, జాన్ క్యాంప్బెల్లు శతకాలతో కదం తొక్కారు. గ్రీవ్స్ కూడా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకుంది. ఇక ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్ను కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి 8 వికెట్లను పడగొట్టాడు. దీంతో కుల్దీప్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన రవీంద్ర జడేజాకు ప్రతిష్ఠాత్మకమైన ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. ఇదిలావుంటే అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. తాజాగా ఢిల్లీలోనూ గెలిచి సిరీస్ను వైట్ వాష్ చేసింది. అదరగొట్టిన గిల్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ సిరీస్పై తనదైన ముద్ర వేశాడు. ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో కూడా గిల్ సారథిగా సత్తా చాటాడు. అయితే ఇంగ్లండ్పై టీమిండియా సిరీస్ను సాధించలేక పోయింది. ఐదు మ్యాచ్ల సిరీస్ 22తో సమమైంది. కెప్టెన్గా గిల్ జట్టును ముందుండి నడిపించినా సిరీస్ మాత్రం అందించలేక పోయాడు. కానీ విండీస్పై మాత్రం సక్సెస్ అయ్యాడు. రెండు మ్యాచ్లలోనూ టీమిండియాను ముందుండి నడిపించాడు. సారథిగా గిల్ అద్భుతంగా రాణించాడు. బ్యాట్తోనే కాకుండా కీలక సమయంలో సముచిత నిర్ణయాలు తీసుకుని జట్టు విజయాల్లో తనవంతు పాత్రను సమర్థంగా పోషించాడు. కెప్టెన్గా ఇప్పటి వరకు ఆడిన రెండు సిరీస్లలో కూడా శుభ్మన్ చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు విండీస్పై విజయం దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో సమన్వయంతో వ్యవహరిస్తూ గిల్ జట్టును నడిపించిన తీరును ఎంత పొగిడినా తక్కువే.
ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యలో ఉంది. భారతదేశాన్ని 21వ శతాబ్దపు విజ్ఞానశక్తిగా మారుస్తానని కలలు కనిన మహానుభావుడు డా. అబ్దుల్ కలాం. డాక్టర్. ఎపిజె అబ్దుల్ కలాం ఒక ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త రాష్ట్రపతి. ఇస్రో, డిఆర్డిఒ సంస్థల్లో ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు. భారతదేశానికి స్వదేశీ మిసైళ్ళ తయారీలో మార్గదర్శకుడు కావడంతో ‘మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా’ అని పిలిచేవారు. 2002 నుండి 2007 వరకు 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయన ప్రజలతో మమేకమై పని చేసినందున ‘పీపుల్స్ ప్రెసిడెంట్’ అనే పేరు పొందారు. భారతరత్న (1997) భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం, అలాగే పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. భారతదేశ 11వ రాష్ట్రపతి, ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త, అంకితభావంతో కూడిన విద్యావేత్త డా. ఎపిజె అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన అంశంపై మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. డిగ్రీ పట్టాలు సరే.. ప్రతిభ, నైపుణ్యాలు ఏవి? బిఎ, బిఎస్సి, బిటెక్, ఎంసిఎ ఇవన్నీ విద్యార్హతల గుర్తింపులు మాత్రమే. వాటిని సంపాదించడం ఒక గొప్ప విషయం.కానీ సమాజంలో ఉద్యోగ అవకాశాలు దక్కాలంటే, ఆ పనిని చేయగల నైపుణ్యం ఉండాలి. ఉద్యోగాలు డిగ్రీని కాదు, పనితీరును చూస్తాయి. ఈ సందర్భంగా మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. డిగ్రీ పట్టాలు జీవిత విజయం కోసం ఒక మెట్టు మాత్రమే. కానీ నిజమైన ఎదుగుదల కోసం ప్రతిభ, నైపుణ్యాలు అవసరం.డిగ్రీ అంటే ఏమిటి? డిగ్రీ ఒక విద్యార్థి విద్యా ప్రయాణానికి గుర్తింపు. కానీ ఉద్యోగాలు, పరిశ్రమలు, సమాజం కోరుకునేది అభ్యాసంలో నేర్చుకున్న పాఠాల కంటే కూడా వాటిని ఆచరణలో పెట్టే సామర్థ్యం. అంటే, ప్రతిభ, నైపుణ్యాలు. ప్రాక్టికల్ నాలెడ్జ్. విద్యా ప్రమాణం కన్నా పనితీరు ముఖ్యం. ప్రతిభ అంటే ఏమిటి? ప్రతిభ అంటే పుస్తకాల్లో చదివిన విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు. ప్రతిభ అంటే ఆలోచించగలగటం, సృజనాత్మకంగా వ్యవహరించడం, కొత్త దారులు వెతకడం, నేర్చుకున్నది జీవితంలో ఉపయోగించగలగడం. ఇటీవల విడుదలైన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం మన పట్టభద్రుల్లో 51% మంది మాత్రమే ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉన్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే 8.25% మంది మాత్రమే చదువుకున్న విషయాలకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా వారంతా విద్యార్హతలతో సంబంధంలేని పనుల్లో స్థిరపడుతున్నారు. కంఫర్ట్ జోన్ చూసుకుంటూ కడుపులోని చల్లకదలకుండా ఉద్యోగాలను నెట్టుకొద్దామనేవారికి ఈనాటి పోటీ ప్రపంచం లో నిలబడలేరు. టెక్నాలజీ వేగంగా మారుతున్నది. విద్యార్థులు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా నూతన నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందే, లేనట్లయితే ఉద్యోగ మార్కెట్లో వెనుకబడిపోతారు. ప్రస్తుతం దేశంలో ఉద్యోగ సమస్య ఒక తీవ్రమైన సమస్యగా మారింది. కొందరు యువకులు కేవలం విద్యా పట్టాలు పొందడం ద్వారా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మార్కెట్లో నైపుణ్యాల లేకపోవడం వల్ల అవకాశాలు తగ్గిపోతున్నాయి. దేశంలో పౌరాభివృద్ధి, పరిశ్రమల వృద్ధి పరిమితంగా ఉండటంతో ఉద్యోగాలు సరిపోకపోవడం. యువతకు కావలసిన నైపుణ్యాలు నేర్పించే కార్యాచరణలు తక్కువగా ఉంటాయి.విజయానికి అవసరమైన నైపుణ్యాలు ఏమిటంటే అవి సాంకేతిక నైపుణ్యాలు (Technical Skills): కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ టూల్స్ ఉపయోగం, డేటా అనాలిసిస్, ప్రోగ్రామింగ్, డిజైన్, మృదు నైపుణ్యాలు (Soft Skills): కమ్యూనికేషన్ (మాట్లాడటం, వినటం) సమయ పాలన, టీమ్ వర్క్, లీడర్ షిప్ స్కిల్స్, సృజనాత్మకత, సమస్య పరిష్కరణ: కొత్త ఆలోచనలు, సమస్యలకు తక్షణ పరిష్కారాలు వెతకగలగటం. అభ్యాస సామర్థ్యం (Adaptability): మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నేర్చుకోవటం. ఆత్మవిశ్వాసం, స్వీయ నియంత్రణ: శ్రమ, క్రమశిక్షణతో ముందుకెళ్లే ధైర్యం. డా. కలాం నోట మాటలు ‘Learning gives creativity, Creativity leadsto thinking, Thinking provides know ledge, Knowledge makes you great’ అని కలాం చెప్పారు. వారు స్పష్టంగా చెప్పారు విద్య అంటే మార్కులు మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిని విలువైనవాడిగా మార్చే మార్గం. ఫ్యాషన్తో చదివినప్పుడే ఏ కోర్స్ అయినా వంటపడుతుంది. మన కాళ్ళపై మనం నిలబడడానికి అది తోడ్పడుతుంది, ప్యాకేజీ పైనే దృష్టి పెట్టి కోర్సులో చేరేవారు మనస్ఫూర్తిగా చదవలేరు, మనసుపెట్టి ఉద్యోగాలు చేయలేరు. ఈ రోజుల్లో అన్నింటికీ డబ్బే మూలమైపోయింది. ఫలితంగా చదువు కెరియర్లో కూడా ఆసక్తి ఉన్న రంగాలను వదిలేసి డబ్బు బాగా వస్తుందనుకున్న రంగాల్ని ఎంచుకుంటున్నారు. అకాడమిక్ చదువులతో సంబంధం లేకుండా నిపుణత సృజనాత్మకతలపై దృష్టి పెట్టే వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకు వెళతారు, అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. నైపుణ్యమున్న వ్యక్తులు అనతి కాలములోనే ఎంచుకున్న రంగాల్లో తమదైన ముద్రను వేయగలుగుతారు. ఈ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని నేటి యువత అబ్దుల్ కలాం స్ఫూర్తిని, అతని రచనల ప్రేరణ ద్వారా ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే నేను పొందిన డిగ్రీ నా ప్రతిభకు నిదర్శనమా? నేను సమాజానికి ఏమైనా ఇవ్వగలనా? నాకు ఉన్న నైపుణ్యాలు నన్ను జీవితంలో విజయవంతుడిని చేస్తాయా? కలాం మాకు ఇచ్చిన మార్గదర్శనం ఒక గొప్ప ఆస్తి. ఆయన బాటలో నడిచే ప్రతి విద్యార్థి, పటిష్టమైన వ్యక్తిగా ఎదగడం ఖాయం. నేడు మన భారతదేశానికి కావాల్సింది ప్రతిభ, నైపుణ్యాలతో, సృజనాత్మకత, చురుకుదనం కనబరిచే యువతరం. కోమల్ల ఇంద్రసేనారెడ్డి 98493 75829
మన తెలంగాణ / హైదరాబాద్ : పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టు టెండర్ను రద్దు చేయాలని ప్రభుత్వం సీడబ్ల్యూసీకి లే ఖ రాసింది. పోలవరం -బనకచర్ల లింక్ ప్రాజెక్టు పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నపటికీ ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం కొత్త టెండర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్పై తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా టెండర్ను రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. బనకచర్ల టెండర్, సర్వే నిలిపివేయాలని వి జ్ఞప్తి చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం - బనకచర్ల లింక్ ప్రా జెక్టును ఆమోదించవద్దని కోరింది. పోలవరం డీపీఆర్కు విరుద్ధంగా ఈ టెండర్ ఉందని తెలంగాణ ఆరోపించింది. కాగా ఇటీవలే ఈ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని, సిఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను స్వయంగా కలిసి లిఖితపూర్వకంగా తెలంగాణ అభ్యంతరాలు తెలిపామని, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ మేం ఆలమట్టి ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై ట్రైబ్యునల్ ఎదుట సమర్థంగా వాదనలు వినిపించామని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. దేవాదుల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలి దేవాదుల ప్రాజెక్టు పురోగతిని సమీక్షించిన ఉత్తమ్ కుమార్ రెడి, సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి డి. సీతక్క , ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికైన ప్రతినిధులతో కలిసి జె. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (జెసిఆర్డిఎల్ఐఎస్) పురోగతిని సమీక్షించారు. నిర్ణీత గడువు లోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అన్ని విధానపరమైన అడ్డంకులను తొలగించాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, ఉత్తర తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలలోని ప్రతి రైతుకు నీటిపారుదల ప్రయోజనాలు చేరేలా చూడాలని ఆయన నీటిపారుదల శాఖను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గంగారం గ్రామం సమీపంలోని గోదావరి నది నుండి 38.16 టిఎంసి నీటిని లిఫ్టు చేయడానికి రూపొందించబడిన దేవాదుల పథకం, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల ఎగువ, పాక్షిక శుష్క ప్రాంతాల్లో 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపొందించబడిందని అధికారులు మంత్రికి తెలిపారు. తాజా పురోగతి నివేదిక ప్రకారం ఇప్పటి వరకు మొత్తం నీటిపారుదల సామర్థ్యం మొత్తం 5.56 లక్షల ఎకరాల్లో 3.17 లక్షల ఎకరాలు. భూగర్భజలాల ద్వారా సాగునీరు అందించే 58,028 ఎకరాలతో కలిపి, మొత్తం ఆయకట్టు సామర్థ్యం పూర్తయిన తర్వాత 6.14 లక్షల ఎకరాలకు చేరుకుంటుందన్నారు. సవరించిన ప్రాజెక్టు వ్యయం రూ. 18,500 కోట్లకు గాను రూ. 14,269.63 కోట్లు ఖర్చు చేయగా మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ. 4,230 కోట్లు మిగిలి ఉన్నాయన్నారు. ఖర్చు చేసిన మొత్తం మొత్తంలో సివిల్ పనులకు రూ. 11,667.85 కోట్లు, భూసేకరణకు రూ. 1,343.06 కోట్లు, హైడ్రో-మెకానికల్, ఎలక్ట్రో-మెకానికల్ ఇన్స్టాలేషన్లకు రూ. 1,170.63 కోట్లు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. సమావేశంలో సమర్పించిన నివేదిక ప్రకారం ప్రణాళిక ప్రకారం 2,430.82 కిలోమీటర్లలో 1,663.10 కి.మీ. మట్టి తవ్వకం పూర్తయిందని, 702.62 కిలోమీటర్లలో 669.66 కి.మీ. పైపులైన్లు వేయబడ్డాయని తెలిపారు. ప్రణాళిక చేసిన 16,113 నిర్మాణాల్లో 8,510 పూర్తయ్యాయని, 1,202.14 కిలోమీటర్లలో 799.80 కి.మీ కాలువ లైనింగ్ పూర్తయిందన్నారు. 46 ట్యాంకులకుగాను 39, 21 పంప్ హౌస్లకు గాను 18 పనిచేస్తున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయండి : స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ములుగు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు. అలాగే గోదావరి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తిచేయాలని కోరారు. ములుగు పెండింగ్ ప్రాజెక్ట్ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ములుగు పెండింగ్ ప్రాజెక్ట్ ల పనుల పురోగతి పై నివేదిక సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశించారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు : చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలంగాణలో కేబినెట్ మంత్రుల మధ్య విభేదాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. మంత్రుల మధ్య సమన్వయం ఉందని, ఎలాంటి విభేదాలు లేవన్నారు. మంగళవారం సచివాయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన శాఖ, జిల్లా అభివృధి పనులపై ఫోకస్ పెట్టానని, ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవం అని చెప్పారు. బదిలీలు నిబంధనల ప్రకారం జరిగాయని ప్రాసెస్ అంతా తానే దగ్గరుండి చూశానన్నారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఉన్నా హక్కులను వదులుకోబోమన్నారు. బనకచర్ల, ఆల్మట్టిపై మేము నిబంధనల ప్రకారం ఫైట్ చేస్తున్నామని కృష్ణా, గోదావరిలో నీటి వాటాల కోసం ప్రభుత్వం కమిట్మెంట్తో పనిచేస్తోందన్నారు. కేసీఆర్ పదేళ్లలో చేసిందేమి లేదని కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా భారత దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పంటలు పండాయని, త్వరలోనే మహారాష్ట్ర వెళ్లబోతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కోసం 25 వేల కోట్లు రైతులకు కేటాయిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
గ్రూప్-2 విజేతలకు 18న నియామక పత్రాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ స ర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్- 2 అభ్యర్థులకు ఈనెల 18 తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిచే నియామక పత్రాలు అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు వెల్లడించారు. 18 తేదీ సాయంత్రం శిల్పకళా వేదికలో నిర్వహించను న్న ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం లో మంగళవారం సిఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రూప్-2 ద్వారా ఎంపికైన 783 మంది అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందిస్తారని సిఎస్ తెలిపారు. వారిలో దాదాపు 16 శాఖలకు చెందిన అభ్యర్థులు ఉన్నారని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు సిఎస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. ఈ కార్యక్ర మానికి అభ్యర్థితో పాటు వారి కుటుంబ సభ్యులను సాయంత్రం 4 గంటలలోపు శిల్పకళా వేదికలో అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ అన్నారు. రెవెన్యూ, హోం, జిఎడి కార్యదర్శులు సమన్వయంతో ఈ నియామకాల్లో అధికంగా, సాధారణ పరిపాలన, రెవిన్యూ, వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారే అధికంగా ఉన్నందున రెవెన్యూ, హోం, జిఎడి కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాల్లో సర్వీస్లో ఉంటారని, వారికి ప్రభుత్వ సర్వీస్ పట్ల ఉన్నత భావన కలిగేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిజిపి శివధర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్య కార్యదర్శులు బెనహర్ మహేష్ దత్ ఎక్కా, రిజ్వీ, సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శులు లోకేష్ కుమార్, టికె శ్రీదేవి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తదితర అధికారులు పాల్గొన్నారు.
బుధవారం రాశి పలాలు (15-10-2025)
మేషం - ఆర్థిక ప్రయోజనాలు సున్నితమైన అంశములతోటి వివాదాస్పదమైన వ్యక్తులతోటి ముడిపడి ఉంటాయి. ఓర్పు నేర్పులతోనే కార్య సాధన అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృషభం - ఊహలోకాలకు తెరదించి వాస్తవికత దృష్టితో విషయాలను పరిశీలించి అర్థం చేసుకుంటారు జమ ఖర్చులు ఆదాయ వ్యయాలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. మిథునం - పనులలో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకారంగా ఉంటుంది. చాలా విషయాలలో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చినప్పటికీ వెనుకడుగు వేయరు. కర్కాటకం - మీ ప్రతిభకు గుర్తింపుగా సన్మానాలు జరుగుతాయి. వివాహ ఉద్యోగయత్నాల అనుకూలిస్తాయి. మీ పట్ల ఈర్ష్య ద్వేషాలు అధికమవుతాయి. వివాదాస్పద అంశాలను వదిలివేయడం మంచిది. సింహం - నూతన పెట్టుబడులకు తగిన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతొ ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, అతిధుల నుండి శుభవార్తలు అందుకుంటారు. కన్య - క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నైపుణ్యంగా సమయస్ఫూర్తితో కట్టుదిట్టమైన కార్య ప్రణాళిక రూపొందించుకుంటారు. తద్వారా లాభపడతారు. తుల - సంస్థను విస్తరింప చేయడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూల దిశలో ఉంటాయి. ప్రయాణాలను సాగిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. వృశ్చికం - నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి అనుకూల సమయమని భావిస్తారు. మధ్యవర్తిత్వాలు రాయబారాలు మేలు చేకూరుస్తాయి. వినోద కార్యక్రమాలకు ఇచ్చిన ప్రాముఖ్యతను వృత్తికి ఇవ్వరు. ధనుస్సు - మాటమీద నిలబడే వ్యక్తిగా మంచి పేరును సంపాదిస్తారు. భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందనే ఆశావహ దృక్పథాన్ని కనబరుస్తారు. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మకరం - కొన్ని సందర్భాలలో దైవానుగ్రహం మీకు తోడు ఉందని రుజువు చేసే సంఘటనలు జరుగుతాయి. దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటారు. కుంభం - అమ్మకాలు కొనుగోలు అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వాయిదా పడుతూ వస్తున్న వ్యక్తిగత పనులను పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో మీరు చేసిన శ్రమ ఇప్పుడు అక్కరకు వస్తుంది. మీనం - కొంత లౌక్యాన్ని కనపరచగలిగితే ప్రయోజనాలను మరింతగా పొందగలుగుతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అంతరంగిక వ్యవహారాలలో కొన్ని రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి జోథ్పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను స్థానిక జవహర్ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశా యి. జైసల్మేర్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేట్ బస్సు జోథ్పూర్ బయలుదేరింది. జైసల్మేర్కు 20కిమీ దూరంలో థాయత్ గ్రామ సమీపంలో బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే బస్సంతా వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఫైర్ సిబ్బందికి తెలియజేశారు. బాధితులకు సహాయ చ ర్యలు చేపట్టారు. బస్సులో మొత్తం 57మంది ప్రయాణికులు ఉన్నారు. మృ తుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు, ఉన్నారని జైసల్మేర్ మున్సిపల్ కౌన్సిల్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ క్రిష్ణపాల్ సింగ్ రథోర్ వెల్లడించారు. బస్సులో ఉన్న వారిలో కొందరు కిటికీలు పగుల గొట్టి బయటపడ్డారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బస్సు ఇంజిన్ లేదా వైరింగ్ షార్టు సర్కూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. రాజస్థాన్ సిఎం భజన్లాల్ శర్మ మృతుల కుటుంబాలకు సంతాపం వెలిబుచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
గర్భవతిని చేసి యువతి మృతికి కారకుడైన హోంగార్డ్
ఏడు సంవత్సరాలుగా ప్రే మించాడు గర్బవతిని చేశాడు గర్భం తీయించే ప్రయ త్నం చేసి ఆమె చావుకు కారకుడయ్యాడు. ఈ దారుణమైన స ంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రంగారెడ్డి జిల్లా షారుఖ్ నగర్ మండలం రా య్కల్ గ్రామానికి చెందిన మౌనిక (29) ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుంది. అయితే శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫింగర్ ప్రింట్ విభాగంలో హొంగార్డు ఉద్యోగం చేస్తున్న ముచ్చింతల్ గ్రామానికి చెందిన మదుసుదన్ (39) తో ఏడు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. అమెను ప్రేమ పేరుతో లోపరుచుకుని శారీరకంగా వాడుకున్నాడు. దీంతో అమె నాలుగు రోజుల క్రితం గర్బవతి అయింది. విషయం మధుసుదన్ కు చెప్పడంతో అతను ఎలాగైనా గర్బాని తీయించాలని పథకం వేశాడు. సోమవారం ఉదయం అమెను తీసుకుని పాలమాకుల గ్రామంలోని ఆర్ఎంపి డాక్టర్ అయిన పద్మజ వద్దకు తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్త స్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశాడు. దీంతో మౌనిక మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు నింధితుడు మధుసుదన్ తోపాటు అబార్షన్ చేసిన ఆర్ఎంపి డాక్టర్ పద్మజలను అరేస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి పోలీసులు తరలించారు.
ఢిల్లీ ఎస్ఎయూ క్యాంపస్లోనే విద్యార్థినిపై లైంగిక దాడి
దేశ రాజధాని ఢిల్లీలో సౌత్ ఏషియన్ యూనివర్శిటీ(ఎస్ఎయూ)లో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి, దాష్టికం జరిగింది. సెక్యూరిటీ గార్డు సహా నలుగురు ఆమెపై లైంగిక దాడిచేసి, బట్టలు చించి, బలవంతంగా అబార్షన్ పిల్ తీసుకునేలా చేశారు. ఈ ఘాతుకం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే అక్టోబర్ 12న జరిగింది. దీనిపై మంగళవారం ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా 18 ఏళ్ల ఆ బాధితురాలు బట్టలు చిరిగి, గాయాలతో అక్టోబర్ 13న క్యాంపస్లో కనిపించింది. కాగా ఈ ఘటనతో విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఎనిమిది గంటల నిరసన చేపట్టారు. విషయాన్ని పోలీసులకు తెలుపడంలో కావాలని ఆలస్యం చేస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇదిలావుండగా ఈ ఘటనను సౌత్ ఏషియన్ యూనివర్శిటీ ఖండించింది. 10 రోజుల్లో వివరంగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశిస్తూ దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేసింది. జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆర్యన్ యశ్ అనే వ్యక్తి ఆమెను బెదిరిస్తూ మార్ఫ్డ్ ఫోటోలు, నగ్నఫోటోలతో ఈమెయిల్ సందేశాలు, సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపాడని సమాచారం. అతడి సూచనలు పాటించి ఆ విద్యార్థిని స్నాతోకోత్సవ కేంద్రం సమీపంలో మూసేసిన నిర్మాణ ప్రాంతానికి వెళ్లింది. అక్కడికి ఓ గార్డు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆ గార్డు ఓ మధ్య వయస్కుడైన వ్యక్తిని, ఇద్దరు అబ్బాయిలను పిలిచాడు. వారు నలుగురు తనపై శారీరకంగా దాడిచేశారని, బట్టలు చింపేశారని, తన నాలుక కింద బలవంతంగా గర్భస్రావ మాత్రను పెట్టడానికి ప్రయత్నించారని, దానిని తాను ప్రతిఘటించి ఉమ్మేసానని బాధితురాలు తెలిపింది. విశ్వవిద్యాలయం సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునే లోపే దాడి చేసిన వ్యక్తులు పారిపోయారు. పారిపోయిన నిందితులను పట్టుకోడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆధారాలు సేకరిస్తున్నారు. సిసిటివి ఫుటేజ్లను సేకరించారు.పోలీసు డిప్యూటీ కమిషనర్(సౌత్) అంకిత్ చౌహాన్ దర్యాప్తును చేపట్టాక కేసు ప్రాధాన్యత పెరిగింది. బాధితురాలకి ప్రస్తుతం కౌన్సెలింగ్ జరుగుతోంది. ఆమె తల్లిదండ్రులు విడిపోవడంతో ఆమె డిప్రెషన్లో ఉంది. ఆమె తండ్రి బీహార్లో నివసిస్తుంటే, తల్లి ముంబైలో నివసిస్తోంది. ఇదిలావుండగా సౌత్ ఏషియన్ యూనివర్శిటీ ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించింది. విద్యార్థులకు అన్ని రకాల మద్దతునిస్తానని హామీ ఇచ్చింది.
తమిళనాడు మద్యం కుంభకోణం దర్యాప్తుపై ఈడీ ని నిలదీసిన సుప్రీంకోర్టు
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించిన మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందని సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను ప్రశ్నించింది. మర్చిలో నిర్వహించిన రెండు దాడులపై ఆరు నెలల్లో రెండో సారి కోర్టు దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. వివరణ కోరింది.తమిళనాడు మద్యం కేసులో సుప్రీంకోర్టు పెడరలిజం వాదానికి ఏమైందని ప్రధానంగా ప్రశ్నించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఈడీ ని నిలదీస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి దర్యాప్తు చేసే హక్కును మీరు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం నేరాన్ని దర్యాప్తు చేయడం లేదా, మీరే ఆ రాష్ట్రానికి వెళ్లి దాన్ని చేయగలరా అని సీజేఐ ప్రశ్నించారు. విచారణ కొనసాగుతున్న సమయంలో ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించడం భావ్యం కాదని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.ఈ కేసులో మంగళవారం నాడు తమిళనాడు ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి వాదించారు. ఆరోపించిన నేరాలపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ, ప్రభుత్వరంగ సంస్థపై దాడులు చేసి, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎలా స్వాధీనం చేసుకుంటారని వారు ప్రశ్నించారు. ఇప్పటికే ఆరు ఎఫ్ఐఆర్ లు దాఖలు కాగా, ఈడీ ఎందుకు దర్యాప్తులో జోక్యం చేసుకుంటోందని కపిల్ సిబల్ ప్రశ్నించారు. కాగా, రోహత్గీ ప్రశ్నిస్తూ, టస్మాక్ సిబ్బంది గోప్యతా హక్కుకు ఏమైంది. వారు సిబ్బంది మొబైల్ లను ఎలా లాక్ చేసుకుంటారు అని ప్రశ్నించారు.ఈడీ తరుపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తన వాదన వినిపిస్తూ, రాష్ట్రం ఇప్పటికే 47 పోలీసు కేసులు నమోదు చేసిందని,ఈడీ మనీలాండరింగ్ అంశాన్ని మాత్రమే దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. కపిల్ సిబల్ మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 66(2) ప్రస్తావిస్తూ, దర్యాప్తు సమయంలో మరో చట్టం ఉల్లంఘన జరిగిందని, ఏజెన్సీ కనుకొంటే, తదుపరి చర్య కోసం సంబంధితన అధికారితో ఆ సమాచారం పంచుకోవల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
ఒకరి మృతి, ఒకరికి తీవ్ర గాయాలు..
కొత్తగూడ, (ఆంధ్రప్రభ): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లె సమీపంలోని బంగారుకుంట వద్ద
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 15-10-2025
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఎంసిసి కేసు నమోదు చేశారు. మాగంటి సునీత ఆమె కూతురు మాంగటి అక్షర యూసుఫ్గూడ, వెంకటగిరి ఏరియాలో శుక్రవారం ప్రార్థనల తర్వాత మజీద్ ప్రాంతానికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ విషయం తెలియడంతో కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత, అక్షర, యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.
స్కూల్ బస్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి
నిజామాబాద్ జిల్లా, భీమ్గల్ మండలం, రహత్నగర్ గ్రామంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ అనే మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్గల్ పట్టణానికి చెందిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్కు చెందిన బస్ బడి పిల్లలను తీసుకురావడానికి రహత్నగర్ గ్రామానికి వెళ్ళింది. ఒక బాలుడి తల్లి శిరీష తన పెద్ద కుమారుడిని స్కూల్ బస్సులో ఎక్కిస్తోంది.. ఆ సమయంలో చిన్నారి శ్రీకాంత్ బస్ ముందు ఆడుకుంటూ ఉండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు నడపడంతో బస్సు బాలుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తలకి త్రీవ గాయాలై ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించాడు. విషయం తెలుసుకున్న సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.సందీప్ తెలిపారు. కాగా, స్కూల్ డ్రైవర్ నిర్లక్ష్యంతో చనిపోయిన బాలుడి మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బంధువులు బైఠాయించారు. దీంతో స్కూల్ యాజమాన్యం ప్రాణంతో ఖరీదు కట్టినట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్ ముందు బాలుడి మృతదేహం కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తుండడంతో కొందరు మధ్యవర్తులు జోక్యం చేసుకున్నారు. పసివాడి ప్రాణం ఖరీదుకు పాఠశాల యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, రూ.9 లక్షలు చెల్లించేందుకు బాధిత కుటుంబ సభ్యులను ఒప్పించినట్టు తెలుస్తోంది.
మొదటిసారి కెసిఆర్ ఫొటోలేకుండా జనంలోకి కవిత
రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. ఈ నెల చివరివారంలో యాత్ర ప్రారంభించనున్నారు. తెలంగాణలో అన్ని జిల్లాల మీదుగా యాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు.ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు యాత్ర నిర్వహించనున్నారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి, స్వయానా తండ్రి అయిన కెసిఆర్ ఫొటో లేకుండా యాత్ర చేయాలని కవిత నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ జాగృతి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కెసిఆర్ ఫొటో లేకుండా కార్యక్రమాలు నిర్వహించలేదు. మొదటిసారి కెసిఆర్ ఫొటో లేకుండా కల్వకుంట్ల కవిత జనంలోకి వెళ్లనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో రూపొందించిన తెలంగాణ జాగృతి యాత్ర పోస్టర్ను కవిత బుధవారం ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మేధావులు, విద్యావంతులతో ఇటీవల కవిత వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాగృతి నేతలకు నియామకపత్రాలు అందజేత తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లాల నాయకులకు రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించే వరకు యువత వదిలిపెట్టదు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో యువతదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, అందులో యువతది కీలక పాత్ర ఉండాలని తాను భావిస్తున్నానని చెప్పారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారు మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాలని ఆకాంక్షించారు.
కర్నూలు , ఆంధ్రప్రభ బ్యూరో : కర్నూలులో జరగబోయే సూపర్ జీఎస్టీ –
బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్కు ‘కోమటి రెడ్డి ప్రతీక్’ పేరు
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్కు ‘కోమటి రెడ్డి ప్రతీక్’ పేరు పెట్టినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. సుమారు రూ.8 కోట్లతో నూతన స్కూల్ భవన నిర్మాణం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మంగళవారం మంత్రి కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రైమరీ అండ్ హైస్కూల్ స్థానంలో కార్పొరేట్కు దీటుగా అధునాతన సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించినట్టు మంత్రి తెలిపారు. అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా భవనంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తన ప్రథమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. నల్లగొండ లో పేదల విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నామని ఆయన అన్నారు. రాబోయే మూడేళ్లలో దశల వారీగా నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు అధునాతన సౌకర్యాలతో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. స్కూల్ కు ‘కోమటి రెడ్డి ప్రతీక్‘ ప్రభుత్వ పాఠశాలగా నామకరణం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా పాఠశాలను ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
డిప్యూటీ సీఎంకు వేద పండితుల ఆశీర్వచనం..
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు
అవేం పొగడ్తలు.. మాటలతో ట్రంప్ను ఉక్కిరిబిక్కిరి చేసిన పాక్ ప్రధాని
కైరో : ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపునకు సంబంధించి ఈజిప్టు లోని షర్మ్ షేక్లో శాంతి ఒప్పందంపై దేశాధినేతలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనంత గొప్ప అధ్యక్షుడు లేడన్నట్టు వ్యాఖ్యలు చేశారు. షరీఫ్ మాటలకు ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. చివరికి తాను మాట్లాడాల్సింది ఏమీ లేదంటూ చేతులెత్తేసి , ఇంటికి వెళ్లిపోదామంటూ షరీఫ్తో చమత్కరించారు. షెహబాజ్ మాట్లాడుతూ.. “ఈరోజు చరిత్రలో గొప్ప రోజుల్లో ఒకటి. ఎందుకంటే అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో అవిశ్రాంత ప్రయత్నాల తరువాత గాజాలో శాంతి సాధన అయింది. ఆయన నిజంగా శాంతిని కోరుకునే వాడు. ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి, శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు” అని కొనియాడారు. ఈ సందర్భంగా పాక్ భారత్ మధ్య జరిగిన సంఘర్షణను కూడా ట్రంపే ఆపారంటూ క్రెడిట్ ఇచ్చేశారు. ‘ భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంతో పాటు కాల్పుల విరమణ సాధించడానికి ట్రంప్ అసాధారణ ప్రయత్నాలు చేశారు. భారత్-పాక్ రెండూ అణ్వాస్త్ర శక్తులు. ఆ నాలుగు రోజుల్లో ట్రంప్, ఆయన అద్భుతమైన బృందంతో జోక్యం చేసుకోకపోతే, ఆ ఘర్షణలు పశ్చిమాసియాకు విస్తరించి ఉండేవి. ఏం జరిగిందో చెప్పేందుకు కూడా ఎవరూ మిగిలే వారు కాదు. ఇందుకు గాను నోబెల్ శాంతి బహుమతికి పాక్ ఆయనను నామినేట్ చేసింది. ఇది అందుకునేందుకు ఆయన అర్హుడు. ఇప్పటివరకు ఏడు యుద్ధాలు ఆపారు. ఇది ఎనిమిదవది ’ అంటూ షరీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు. షరీఫ్ ప్రసంగం నేపథ్యంలో అక్కడే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నోటిమీద చేయి వేసుకొని చూస్తూ ఉండిపోయారు. షరీఫ్ ప్రసంగం అనంతరం ఆసక్తికర చోటు చేసుకుంది. షరీఫ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బయిన ట్రంప్ ఇది తాను ఊహించలేదన్నారు. ఇంకా తాను మాట్లాడేందుకు ఏమీ లేదంటూ ... ఇంటికి వెళ్దాం అంటూ చమత్కరించారు. దీంతో ఆ ప్రాంగణం మొత్తం నవ్వులు విరిశాయి.
పిజీ కోర్సుల్లో సర్కార్ల బ్రేకులు
పిజీ కోర్సుల్లో సర్కార్ల బ్రేకులు బయ్యారం , ఆంధ్ర ప్రభ : స్వ
Sharwanand and Srinu Vaitla Film Locked
Veteran director Srinu Vaitla has worked on a script and he is aiming a strong comeback. There are lot of speculations around the film and Nithiin was finalized for the project. But, the movie now landed into the hands of Sharwanand. An official announcement will be made in the upcoming week and the shoot commences […] The post Sharwanand and Srinu Vaitla Film Locked appeared first on Telugu360 .
కొత్త లెక్సస్ LM 350h ని పరిచయం చేసిన లెక్సస్ ఇండియా
బెంగళూరు: భారతదేశంలో కార్ల ప్రముఖ ప్రీమియం బ్రాండ్ గా పేరొందిన లెక్సస్ ఇండియా... తాజాగా LM 350h ను పరిచయం చేసింది. ఇది అల్ట్రా-లగ్జరీ మొబిలిటీ విభాగాన్ని సరికొత్త పునర్నిర్వచించడానికి రూపొందించబడింది. సరికొత్త LM 350h రాక ప్రీమియం కార్ల మోడల్స్ లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది గెస్ట్ లకు అసమానమైన వైభవం, విలక్షణమైన డిజైన్ మరియు అసాధారణ సౌకర్యాన్ని అందించడంలో లెక్సస్ నిబద్ధతను బలోపేతం చేస్తుంది. ఫ్లాగ్ షిప్ వెహికల్ అయినటువంటి LM 350hకు ఇప్పటికే భారత మార్కెట్లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది విలాసవంతమైన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ లో ఇది ఎంటర్ అయ్యిందో... అప్పటినుంచే కొత్త లెక్సస్ LM 350h దేశవ్యాప్తంగా లగ్జరీ వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. విలాసవంతమైన ప్రయాణ అనుభవం కోసం పెరుగుతున్న కోరికను ప్రతిబింబిస్తుంది, ఫస్ట్-క్లాస్ ప్రయాణానికి కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. సరికొత్త LM 350h ప్రీమియం మోడల్ లో చాలా వివరాలను అద్భుతంగా పొందుపరిచారు. అల్ట్రా-లగ్జరీ మొబిలిటీ రంగంలో అగ్రగామి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇది అప్ డేట్స్ సూట్ను పరిచయం చేస్తుంది. ఈ అప్ డేట్స్ ని ఒక్కసారి చూస్తే...: · స్థిరత్వం మరియు అధునాతన సాంకేతికత పట్ల లెక్సస్ నిబద్ధతను ప్రదర్శించే E20-కంప్లైంట్ ఇంజిన్. · మెరుగైన సౌలభ్యం మరియు సహజమైన నియంత్రణ కోసం వెనుక కన్సోల్లో పవర్ స్లైడింగ్ డోర్ స్విచ్. · నాలుగు సీట్ల వేరియంట్లో మెరుగైన భద్రత మరియు డ్రైవర్ సౌకర్యం కోసం ఆటో-డిమ్మింగ్ ORVM ఫంక్షన్. · నాలుగు సీట్ల వేరియంట్లో వెనుక సీట్లలో కూర్చునేవారికి సౌలభ్యం మరియు మెరుగుదలను అందించే కొత్త వెనుక కన్సోల్ ట్రే. ఈ సందర్భంగా లెక్సస్ ఇండియా అధ్యక్షుడు శ్రీ హికారు ఇకేచి గారు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ... లెక్సస్ LM 350h కు మా గెస్ట్ ల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందనను చూసి మేము నిజంగా గర్విస్తున్నాము. ఈ అసాధారణ వాహనం కోసం వేచి ఉన్నందుకు మా కస్టమర్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. LM అనేది విలాసానికి మా అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. ఇందులో గ్రాండ్ ఇంటీరియర్స్, సౌకర్యం మరియు అధునాతనతను పునర్నిర్వచించే ప్రత్యేకమైన ప్రైవేట్ లాంజ్ ఉన్నాయి. ఇది ఫస్ట్-క్లాస్ లగ్జరీ ప్రయాణంలో కొత్త బెంచ్మార్క్ను నిర్దేశిస్తుంది. భారతదేశంలో మా గెస్ట్ లకు అధునాతనత, ప్రతిష్ట మరియు ఆనందం యొక్క అసమానమైన అనుభవాన్ని అందిస్తుంది. అని అన్నారు ఆయన. సరికొత్త లెక్సస్ LM 350h డెలివరీలు ఇవాళ్టి నుంచే ప్రారంభమవుతున్నాయి. మరిన్ని వివరాల కోసం గెస్ట్ లు తమ సమీపంలోని గెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించవచ్చు.
తాగునీరు-సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం..
విశాలాంధ్ర-తాడిపత్రి /పుట్లూరు: త్రాగు, సాగునీటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని కందికాపుల గ్రామంలో 1.50 లక్షల రూపాయల వ్యయంతో జె.సి. నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని ఎం.పీ. అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పునఃప్రారంభించారు. అనంతరం చింతకుంట గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్, 5 లక్షల రూపాయల వ్యయంతో సి.సి. రోడ్లను ప్రారంభించారు. చింతకుంట గ్రామానికి చెందిన […] The post తాగునీరు-సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం.. appeared first on Visalaandhra .
Telusu Kada is a never-before-seen love story – Siddhu Jonnalagadda
Star Boy Sidhu Jonnalagadda starrer Telusu Kada has created good anticipation with the blockbuster songs of S Thaman and teaser, trailer have captured the imagination of all audiences. Now, Siddhu interacted with the media about the film and he stated that “it will be a never-before-seen love story”. Supporting his statement, the actor said, “80% […] The post Telusu Kada is a never-before-seen love story – Siddhu Jonnalagadda appeared first on Telugu360 .
సముద్రంలోనూ అమెరికా-చైనా ట్రేడ్ వార్..
బీజింగ్ : అమెరికాచైనా మధ్య ఇటీవల వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్న సంగతి తెలిసిందే. బీజింగ్పై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో ఇరు దేశాల మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం రాజుకుంది. తాజాగా ఇరుదేశాలు నౌకలపై పరస్పర ప్రత్యేక ఫీజులు ప్రకటించాయి. అమెరికా యాజమాన్యం నిర్వహణలో ఉన్న నౌకలు, యూఎస్ నిర్వహించే లేదా ఆ దేశ జెండాలతో వచ్చే ఓడలపై ప్రత్యేక ఛార్జీలను వసూలు చేస్తున్నట్టు చైనా మంగళవారం ప్రకటించింది. అయితే చైనా నిర్మించిన నౌకలకు ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. అటు అమెరికా కూడా నేటి నుంచి ఈ ఫీజుల వసూలు ప్రారంభించింది. చివరివరకూ పోరాడతాం: చైనా మరోవైపు అమెరికా అదనపు సుంకాలపై చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందించింది. “ వాణిజ్య యుద్ధం.. టారిఫ్ల అంశంపై మా వైఖరి స్థిరంగా ఉంది. మీరు (అమెరికాను ఉద్దేశిస్తూ ) యుద్ధం కోరుకుంటే మేం చివరివరకూ పోరాడతాం. అదే చర్చలు కావాలనుకుంటే మా తలుపులు తెరిచే ఉన్నాయి” అని వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రపంచం లో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఇటీవల చైనా నియంత్రణలు విధించింది. ఇకపై విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇది ట్రంప్నకు కోపం తెప్పించింది. దీంతో బీజింగ్పై 100 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అవి నవంబరు 1 నుంచి గానీ, అంతకు ముందు నుంచి గానీ అమల్లోకి వస్తాయని తెలిపారు. దీంతోపాటు చైనాకు అమెరికా సంస్థలు ఎగుమతి చేసే కీలక సాఫ్ట్వేర్ల పైనా నియంత్రణ విధిస్తామని వెల్లడించారు.
గోదావరిఖని, ఆంధ్రప్రభ: గోదావరిఖని పట్టణాన్ని వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చేసేందుకే రూ.27
ఆంధ్రప్రభ, వెబ్ బిజినెస్ డెస్క్ : అమెరికా.. చైనా టారిఫ్ కుస్తీలో… భారత
ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు రాక
ఆంధ్రప్రభ, వెబ్ న్యూస్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు
మాగంటి సునీతకు బీఫామ్ అందజేసిన కేసీఆర్..
గజ్వేల్ (ఉమ్మడి మెదక్ జిల్లా), ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో
Fresh Tensions Between Telugu States Over Godavari–Krishna Water Link
The political heat between the Telugu states is intensifying once again, this time over the Godavari–Banakacharla Link Project. The Andhra Pradesh government’s decision to move forward with the project has drawn sharp criticism from Telangana, which alleges that the plan could undermine its water rights. According to the Andhra Pradesh government, the Polavaram–Banakacharla Link Project […] The post Fresh Tensions Between Telugu States Over Godavari–Krishna Water Link appeared first on Telugu360 .
Kangana Ranaut compares her journey to Shah Rukh Khan
Kangana Ranaut, an actor who is also active in politics, stated that she had a harder time making it in Bollywood compared to Shah Rukh Khan. She shared this opinion at an event in Delhi today. She questioned why she achieved so much success, suggesting that very few people from small villages reach such high […] The post Kangana Ranaut compares her journey to Shah Rukh Khan appeared first on Telugu360 .
గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బోగ రామస్వామి
గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బోగ రామస్వామి కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :
ఘనంగా జిఇ ఏరోస్పేస్ పూణే తయారీ సౌకర్యం 10వ వార్షికోత్సవం
పూణే: జిఇ ఏరోస్పేస్ యొక్క పూణే తయారీ సౌకర్యం ఈ రోజు తన పది సంవత్సరాల విజయవంతమైన కార్యకలాపాలను జరుపుకుంది. భారతీయ విమానయాన పరిశ్రమలో కంపెనీకి ఉన్న నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. గత దశాబ్దంలో, పూణే సౌకర్యం వాణిజ్య జెట్ ఇంజిన్ భాగాల తయారీకి ప్రధాన కేంద్రంగా మారడమే కాకుండా, అధునాతన తయారీ నైపుణ్యాల అభివృద్ధికి ఒక అగ్రగామి వేదికగా అవతరించింది. తన అప్రెంటిస్షిప్ మరియు ఇతర శిక్షణా కార్యక్రమాల ద్వారా, ఈ సౌకర్యం ఇప్పటివరకు 5,000 మందికి పైగా ఉత్పత్తి సహచరులను శిక్షణను అందిస్తుంది. “ఈ ఫ్యాక్టరీని ప్రారంభించినప్పుడు పూణేలో ఏరో-ఇంజిన్ తయారీ పర్యావరణ వ్యవస్థలో ఇంత అభివృద్ధి లేదు. అయితే, పది సంవత్సరాల తరువాత, మేము ప్రపంచ స్థాయి తయారీ నైపుణ్య కేంద్రాన్ని నెలకొల్పడమే కాకుండా, దేశంలోని విస్తృత ఏరోస్పేస్ రంగ అభివృద్ధికి కూడా సహకరించగలిగాము. మహారాష్ట్రలో అధిక విలువ కలిగిన తయారీ మరియు నైపుణ్య అభివృద్ధికి స్థానిక సామర్థ్యాన్ని నిర్మించడంలో మేము సాధించిన పురోగతి పట్ల నేను నిజంగా గర్వపడుతున్నాను,” అని మిస్టర్. అమోల్ నగర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ & సప్లై చైన్, జిఇ ఏరోస్పేస్ తెలిపారు. పూణే సౌకర్యం CFM* LEAP, GEnx మరియు GE9X ఇంజిన్ల కోసం విడిభాగాలను తయారు చేస్తోంది — ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాక్టరీల్లో పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్లను తీర్చడానికి ఉపయోగించబడుతున్నాయి. ఈ సౌకర్యం విజయానికి ప్రేరణగా ఉన్నది GE ఏరోస్పేస్ యొక్క యాజమాన్య లీన్ ఆపరేటింగ్ మోడల్ FLIGHT DECK, ఇది భద్రత, నాణ్యత మరియు సామర్థ్యానికి ప్రాధాన్యతను అందిస్తుంది. ఫ్లయిట్ డెక్ అమలు చేయడం ద్వారా, మరియు షాప్ ఫ్లోర్ ఉద్యోగుల నుండి వచ్చిన 1,000కి పైగా సూచనలను అనుసరించడం ద్వారా, పూణే సౌకర్యం వ్యర్థాలను గణనీయంగా తగ్గించింది, ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచింది మరియు ఉత్పత్తి స్థాయిని మెరుగుపరిచింది. అంతేకాకుండా, భద్రతా ప్రమాణాలను మరింతగా బలపరిచింది. క్లిష్టమైన భాగాల ఉత్పత్తి కోసం కొత్తగా ఏర్పాటు చేసిన మోడల్ లైన్లో, ఈ సౌకర్యం తక్కువ లీడ్ టైమ్లను సాధించింది, అదే బృందంతో అధిక ఉత్పాదకతను సాధించింది, మరియు డౌన్టైమ్ను తగ్గించింది. కేవలం ఆరు త్రైమాసికాల్లో చేసిన పలు మెరుగుదలల ఫలితంగా, ఆ లైన్ ప్రస్తుతం ఇంతకుముందు కంటే రెండు రెట్లు ఎక్కువ భాగాలను ఉత్పత్తి చేస్తోంది. “పూణేలో తయారైన భాగాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కర్మాగారాలకు సరఫరా అవుతూ, అక్కడ అవి CFM యొక్క LEAP, GEnx మరియు GE9X ఇంజిన్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భద్రత మరియు నాణ్యతపై మా అచంచలమైన దృష్టితో, GE యొక్క యాజమాన్య ఫ్లైట్ డెక్ లీన్ ఆపరేషన్స్ మోడల్ను ఉపయోగించి, ప్రపంచ వినియోగదారుల పెరుగుతున్న అవసరాలను తీర్చడం మాకు ఆనందంగా ఉంది,” మిస్టర్. విశ్వజిత్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్, పూణే మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, జిఇ ఏరోస్పేస్ అన్నారు. తయారీతో పాటు, GE ఏరోస్పేస్ యొక్క పూణే సదుపాయం ఖచ్చితమైన తయారీ నైపుణ్యాల్లో ఇంజనీరింగ్ ప్రతిభను తీర్చిదిద్దుతూ, బలమైన స్థానిక ఏరోస్పేస్ శ్రామిక శక్తిని అభివృద్ధి చేసింది. ప్రతి సంవత్సరం, కొత్త డిప్లొమా ఇంజనీర్లు తరగతి గది మరియు షాప్ ఫ్లోర్ శిక్షణల సమ్మిళిత కార్యక్రమంలో పాల్గొంటారు, దీని ద్వారా వారు ఏరోస్పేస్ తయారీ భద్రత మరియు నాణ్యత యొక్క అత్యున్నత ప్రమాణాలను అవలంబిస్తారు. GE ఏరోస్పేస్ భాగకాల గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లను కూడా స్పాన్సర్ చేస్తుంది, తద్వారా తమ నైపుణ్యాలను పెంపొందించే మరియు నాయకత్వ పాత్రల్లో ఎదిగే ఇంజనీర్ల బృందాన్ని సృష్టిస్తుంది. ప్రస్తుతం, పూణే సదుపాయంలో 300 మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తుండగా, మరెందరో భారతదేశ ఏరోస్పేస్ రంగంలో సానుకూల మార్పుకు తోడ్పడుతున్నారు. పర్యావరణ నిర్వహణ అనేది పూణే సౌకర్యం యొక్క ప్రధాన లక్షణం. ISO 14001 మరియు ISO 45001 ధృవపత్రాలు పొందిన ఈ సౌకర్యం, తన మొత్తం విద్యుత్ వినియోగంలో 30% ను పునరుత్పాదక వనరుల నుండి పొందుతోంది.
మరియాకు నోబెల్ .. నార్వేలో దౌత్య కార్యాలయం మూసివేత
ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎంపికపై భగ్గుమన్న వెనెజువెలా ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నార్వే లోని తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు వెనెజువెలా విదేశాంగ మంత్రిత్వశాఖ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. తమ దౌత్య కార్యకలాపాల అంతర్గత పునర్వవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మరోవైపు జింబాబ్వే, బుర్కినా ఫాసో వంటి దేశాల్లో తమ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు గాను ఆస్ట్రేలియా లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు పేర్కొంది. వెనెజువెలా ప్రభుత్వం నిర్ణయంపై నార్వే విదేశాంగ మంత్రిత్వశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. అనేక విషయాల్లో తమ విభేదాలు ఉన్నప్పటికీ వెనెజువెలాతో తాము చర్చలు కోరుకుంటున్నామని తెలిపింది. ఆ దిశగా పనిచేస్తుందని వివరించింది. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి ప్రకటించడం అనేది నార్వే ప్రభుత్వానికి చెందిన స్వతంత్ర నిర్ణయమని స్పష్టం చేసింది. వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మచాదో , దేశ ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ పేర్కొంది. వెనెజువెలాకు ప్రస్తుతం నికోలస్ మదురో అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే మదురో ఎన్నికను యూఎస్తో సహా పలు దేశాలు గుర్తించలేదు. మచాదోకు నోబెల్ ప్రకటించడంపై అక్కడి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ క్రమం లోనే దౌత్య కార్యాలయం మూసివేయడం గమనార్హం. ఇక తనకు దక్కిన ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అంకితమిస్తున్నట్టు మచాదో పేర్కొన్నారు.
Telangana : ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలివే
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈనెల 16వతేదీన జరగనుంది
Siddhu Jonnalagadda plays it Safe
Siddhu Jonnalagadda turned into a star with the super success of Tillu franchise. His last film Jack was a disaster and it left the actor in shock. His upcoming movie Telusu Kada is hitting the screens this week and the actor is promoting the film. Despite controversial questions, Siddhu Jonnalagadda decided to keep it calm […] The post Siddhu Jonnalagadda plays it Safe appeared first on Telugu360 .
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు పట్టివేత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది మంగళవారం గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...రైలులో గంజాయి చాక్లెట్లు తీసుకువస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో బృందం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లారు. అక్కడ పదో నంబర్ రైల్వే ఫ్లాట్ ఫాం వద్ద అనుమానస్పదంగా కన్పించిన బ్యాగును తీసి పరిశీలించగా గంజాయి చాక్లెట్లు లభించాయి. బ్యాగులో 1.6కిలోల గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చినట్లు గుర్తించారు. ఎక్సైజ్ సిబ్బందిని గుర్తించిన గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చిన నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం ఎక్సైజ్ చాక్లెట్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దండి…
విశాలాంధ్ర-తాడిపత్రి: చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయొద్దండని మునిసిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి ప్రజలకు సూచించారు. మంగళవారం పట్టణంలోని విజయనగర్ కాలనీలో మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి పర్యటిస్తూ ఉండగా విజయనగర్ కాలనీలోని రాముల గుడి ఎదురుగా రోడ్డు పక్కలో చెత్త ఉండడం జెసి. ప్రభాకర్ రెడ్డి గమనించాడు. దీంతో జెసి. ప్రభాకర్ రెడ్డి చీపురు చేత పట్టుకుని చెత్తను ఉడ్చాడు. ఈ సందర్భంగా జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ చెత్త వాహనాలు వచ్చినప్పుడు […] The post చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దండి… appeared first on Visalaandhra .
నాగర్కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, మాచినోనిపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం ఓ రైతు దగ్గర విద్యుత్ లైన్మన్ నాగేందర్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబికి పట్టుబడ్డాడు. ఎసిబి మహబూబ్నగర్ డిఎస్పి సిహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు మండలంలోని మాచినోనిపల్లి గ్రామానికి చెందిన రైతు తన వ్యవసాయ పొలంలో ట్రాన్స్ఫార్మర్ కావాలని ఎన్నో రోజుల నుండి డిడిలు కట్టి ఇంకా ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నాడు. సంబంధిత లైన్మన్ నాగేందర్ను ఇదే విషయమై ప్రశ్నించగా ‘ఇప్పట్లో నీ ట్రాన్స్ఫార్మర్ రావాలంటే సీరియల్ నెంబర్ 450 ఉందని, కనుక రావడానికి చాలా రోజులు సమయం పడుతుంది’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.దీంతో తొందరగా రావాలంటే రూ.20 వేలు అదనంగా ఇస్తే త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నాడు. దీంతో వారిద్దరి మధ్య రూ.15 వేలకు బేరం కుదిరింది. అయితే, బాధిత రైతు లైన్మన్కు ఆ డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచలన మేరకు మంగళవారం రూ.15 వేలు లైన్మన్ లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పి తెలిపారు.
ఎసిబి వలలో సర్వేయర్, అసిస్టెంట్
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ సర్వేయర్ మాడిశెట్టి వేణుగోపాల్, అతని అసిస్టెంట్ సూర్యవంశీ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్హ్యాండెడ్గా పట్టుపడ్డారు. ఎసిబి డిఎస్పి విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదో వార్డు చిన్నబోనాలలో ప్రవీణ్ అనే రైతుకు చెందిన 3 ఎకరాల భూమిని సర్వే చేసేందుకు సర్వేయర్ వేణుగోపాల్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. అందులో రూ.10 వేలు ముందుగా స్వీకరించి సోమవారం భూమి సర్వే చేశాడు. మంగళవారం సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మరో రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రూ.20 వేలు ఇవ్వడానికి మనసొప్పని బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ఎసిబి డిఎస్పి విజయ్కుమార్ సారధ్యంలో సిరిసిల్లలో కాపుకాసి, బాధితుడి నుండి సర్వేయర్ వేణుగోపాల్, అతని అసిస్టెంట్ సూర్యవంశీ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి బుధవారం ఎసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. కాగా, మంగళవారం ఎసిబికి చిక్కిన సర్వేయర్ వేణుగోపాల్పై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
వినియోగించుకున్న ప్రజలు కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండల
83 రోజుల్లో రూ. 81 లక్షలు బాసర, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం
పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై సమరం కొనసాగుతోంది. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ మరోసారి అభ్యంతరం
32 మంది మావోయిస్టుల మృతి.. 30మంది లొంగుబాటు, 266 మంది అరెస్ట్
రాంచీ: మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్రం ఆదేశాలతో భద్రతా దళాలు జరిపి ఎన్ కౌంటర్లలో భారీగా మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి 1 నుండి సెప్టెంబర్ చివరి వరకు జార్ఖండ్ లో భద్రతా దళాల ఆపరేషన్ లో మొత్తం 266 మంది మావోయిస్టులు అరెస్టయ్యారని.. 32 మంది మృతి చెందారని.. మరో 30 మంది భద్రతా దళాల ముందు లొంగిపోయారని మంగళవారం ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరు ప్రాంతీయ కమిటీ సభ్యులు, ఒక జోనల్ కమాండర్, ఇద్దరు సబ్-జోనల్ కమాండర్లు, CPI(మావోయిస్ట్).. మరో తొమ్మిది మంది ఏరియా కమాండర్లు అరెస్టు అయిన వారిలో ఉన్నారని ఆయన చెప్పారు. ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టులల్లో CPI(మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యులు వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంఝీ, అనుజ్ అలియాస్ సహదేవ్ సోరెన్ ఉన్నారని... ఇద్దరిపై రూ. 1 కోటి చొప్పున రివార్డు ఉందని తెలిపారు. భద్రతా దళాల ముందు 30 మంది లొంగుబాటు మొత్తం 30 మంది నక్సలైట్లు, భద్రతా దళాల ముందు లొంగిపోయారని ఆయన చెప్పారు. లొంగిపోయిన వారిలో జోనల్ కమాండర్ రవీంద్ర యాదవ్, సిపిఐ (మావోయిస్ట్) సబ్-జోనల్ కమాండర్ ఆనంద్ సింగ్, జార్ఖండ్ జన ముక్తి పరిషత్ (జెజెఎంపి) సబ్-జోనల్ కమాండర్ లావ్లేష్ గంజు అలియాస్ లోకేష్ గంజు ఉన్నారని చెప్పారు. జనవరి 1 నుండి సెప్టెంబర్ 30 వరకు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల నుండి దోచుకున్న 58 ఆయుధాలు, 11,950 కార్ట్రిడ్జ్లు, 18,884 డిటోనేటర్లు, 394.5 కిలోల పేలుడు పదార్థాలు, 228 ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ పరికరాలు (ఐఇడిలు) సహా 157 తుపాకులు స్వాధీనం చేసుకోవడంతోపాటు 37 మావోయిస్టు బంకర్లను కూడా ధ్వంసం చేశారని వెల్లడించారు.
హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య
హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు పరిష్కారం కాక ముందే మరో అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు. సైబర్ క్రైం విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఏఎస్ఐ) సందీప్ కుమార్ మృతదేహం రోహటక్ - పానిపట్ రోడ్డులోని ట్యూబ్ వెల్ సమీపంలో లభ్యమైంది. పూరన్ కుమార్ అవినీతి కేసును అతడు దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ కుమార్ మృతదేహం సమీపంలోనే పోలీసులు మూడు పేజీల సూసైడ్ నోట్ ను, స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆ అధికారి రికార్డు చేసిన వీడియో ను పరిశీలిస్తున్నారు. వరుసగా ఇద్దరు సీనియర్ పోలీసు అధికారుల ఆత్మహత్య పై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రతిపక్షాల వత్తిడి నేపథ్యంలో రాష్ట్ర డిజీపీ శతృఘ్న్ కపూర్ ను సెలవుపై పంపివేసింది. గతంలోనే రోహ్ తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా ను బదిలీ చేశారు. సందీప్ కుమార్ తన నోట్ లో అక్టోబర్ 7న ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పూరన్ కుమార్ ఒక అవినీతి అధికారి అని, ఆయనకు సంబంధించి చాలా ఆధారాలు, రుజువులు ఉన్నాయన్నారు. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా తనను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నానని ఏఎస్ ఐ పేర్కొన్నాడు. చనిపోయే ముందు మొత్తం అవినీతి బాగోతాన్ని బయటపెట్టాలని అనుకుంటున్నట్లు ఆ నోట్ లో పేర్కొన్నారు. తన మరణం తర్వాత నైనా ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని తాను కోరుతున్నట్లు సందీప్ కుమార్ పేర్కొన్నారు. పూరన్ కుమార్ అవినీతి కుటుంబాన్ని వదిలి పెట్టకూడదని, అతడు తన స్వార్థం కోసం కులరాజకీయాలను వాడుకొని, వ్యవస్థనే హైజాక్ చేశాడని నోట్ లో ఆరోపించారు. ఆ వీడియోలో పూరన్ కుమార్ కుల రాజకీయాలు, అవినీతి తో పోలీసు శాఖనే తీవ్రంగా ప్రభావితం చేశాడని ఆరోపించారు. ఐపీఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునుంచే కులరాజకీయాలను ప్రారంభించి, తన వారిని కింది ఉద్యోగులుగా నియమించుకుని పైళ్ల శోధన చేపట్టాడని సందీప్ పేర్కొన్నాడు. తర్వాత సంబంధిత అధికారులను పిలిపించి, హింసించి డబ్బువసూలు చేసేవాడని, మహిళా పోలీసు అధికారులను కూడా బదిలీ చేస్తామని బెదిరిస్తూ, కొందరిపై లైంగిక వేధింపులకు గురు చేశాడని ఆ వీడియోలో ఆరోపించారు. ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై దర్యాప్తు అక్టోబర్ 7న 52 ఏళ్ల ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ చండీగఢ్ లోని సెక్టార్ 11లోని తన నివాసంలోసర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆకేసు దర్యాప్తు చేస్తున్న బృందంలోని ఏఎస్ఐ సందీప్ కుమార్ కూడా నేడు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశం అయింది.పూరన్ కుమార్ 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. రోహ్ తక్ లోని సునారియాలోని పోలీసు శిక్షణా కేంద్రంలో ఇన్ స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన భార్య ఐఏఎస్ అధికారి అమ్ నీత్ పూరన్ కుమార్ ఇంట్లో లేరు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నాయకత్వంలోని ప్రతినిధివర్గంలో సభ్యురాలిగా జపాన్ లో అధికారిక పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర డిజీపీ శతృఘ్న్ కుమర్ పై వేటు ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య, అదే కేసు దర్యాప్తు చేస్తున్న మరో ఏఎస్ఐ కూడా బలవన్మరణానికి పాల్పడడంతో హర్యానా ప్రభుత్వం సీరియస్ అయింది. ఒక పక్క ప్రతిపక్షాలు దాడి ప్రారంభించడం, మరో పక్క పూరన్ కుటుంబసభ్యులు ఆయనను వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర డిజిపీ శతృఘ్న్ కుమార్ ను సెలవులో పంపివేసింది. ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం రోహ్ తక్ పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర బిజర్నియాను బదిలీ చేసింది డీజీపీని రాష్ట్రప్రభుత్వం డీజీపీ ని సెలవులోకి పోవల్సిందిగా ఆదేశించినట్లు హర్యానా ముఖ్యమంత్రి మీడీయా సలహాదారు రాజీవి జైట్లీ వెల్లడించారు. పూరన్ కుమార్ తన సూసైడ్ నోట్ లో డిజీపీ శతృఘ్న్ కుమార్, నరేంద్ర బిజర్నియా లు కూడా కులవివక్షతతో , తనను మానసికంగా వేధించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో కుప్పకూలుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ: హరీష్ రావు
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా పయణిస్తున్నదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైతే, తెలంగాణలో నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు అవుతుండటం మందగించిన ఆర్థిక పతనానికి సంకేతంగా నిలుస్తున్నదని అన్నారు. జూన్లో -0.93 శాతం, జూలైలో -0.44 శాతం, సెప్టెంబర్లో -0.15 శాతాలలో వరుసగా నాలుగు నెలల్లో మూడు నెలలు డిఫ్లేషన్ నమోదు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణాత్మక ద్రవ్యోల్బణం మూడు సార్లు నమోదు కావడం ఇదే మొదటి సారి అని వ్యాఖ్యానించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సాధారణంగా వినియోగం పెరిగి, పాజిటివ్ ద్రవ్యోల్బణం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కానీ, నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక విధానాల వైఫల్యం అని ఆరోపించారు. కెసిఆర్ పాలనలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన, ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్రం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుల్డోజర్ విధానాలు, ప్రతీకార రాజకీయాలు మానుకొని పాలనలో నానాటికి చతికిల పడిపోతున్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు విక్రయించినా చర్యలు తప్పవు…
నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమనిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి. విశాలాంధ్ర పుట్టపర్తి:- టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పి సతీష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ రానున్న దీపావళి సందర్భంగా అనుమతులు పొందిన ప్రతి ఒక్కరూ టపాసులు నిల్వ ఉంచే ప్రాంతాలతో పాటు అమ్మకాలు చేపట్టే దగ్గర ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు […] The post నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు విక్రయించినా చర్యలు తప్పవు… appeared first on Visalaandhra .
‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.#chiranjeevi #MeesalaPilla #DasaraRelease #anilravipudi
మాగంటి సునీతకు బి.ఫాం అందజేసిన కెసిఆర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్కు పార్టీ అధినేత కెసిఆర్ మంగళవారం బి.ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు, కుమారుడు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ఎంఎల్ఎలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 9మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాజధాని ఢాకాలోని ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఢాకాలోని మీర్పూర్ ప్రాంతంలో ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగి ఉన్న రెండు భవనాల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి.. కర్మాగారంలోని మొదటి, రెండవ అంతస్తుల నుండి తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. విష వాయువు పీల్చడం వల్ల తొమ్మిది మంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసున నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విశాలాంధ్ర – నంబులపూలకుంట :మండల పరిధిలోని బత్తినిగారిపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై వలి బాషా తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేసి, పేక ముక్కలు, రూ 3005 నగదు స్వాధీనం చేసుకునికోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూపేకాట, మద్యం, గంజాయి వంటి వ్యసనాలు గ్రామీణ సమాజంలో విస్తరిస్తూ కుటుంబాలనే దెబ్బతీస్తున్నాయని, రోజువారీ కూలీలు, చిన్న […] The post 5 మంది జూదరులు అరెస్ట్… appeared first on Visalaandhra .
Congress : రాహుల్ కోటరీకి కూడా కాంగ్రెస్ నేతలు భయపడటం లేదా?
ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ ను అధినాయకత్వం నియమించినప్పటికీ నేతల్లో మాత్రం మార్పు కనిపించడం లేదi
బీహార్ ఎన్నికలు.. బిజెపిలో చేరిన 25 ఏళ్ల సింగర్
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ లో రాజకీయ పార్టీలు సన్నదమవుతున్నాయి. అలాగే, పార్టీలల్లో చేరికలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్(25) మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరింది. మధుబని జిల్లాలోని బెనిపట్టికి చెందిన ఠాకూర్ రాజకీయాల్లోకి రావాలనే తన కోరికను గతంలో వ్యక్తం చేసింది. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపింది. మైథిలి ఠాకూర్ ఎవరు? బీహార్లోని మధుబని జిల్లాలో జన్మించిన మైథిలి, ఆమె ఇద్దరు సోదరులతో కలిసి.. వారి తాత మరియు తండ్రి వద్ద జానపద, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు. భోజ్పురి, హిందీ భాషలలో బీహార్ సాంప్రదాయ జానపద పాటలను మైథిలి పాడింది. బీహార్ జానపద సంగీతానికి ఆమె చేసిన కృషికి గాను 2021లో సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ను అందుకుంది. తన జానపద గీతాలతో ప్రజాదరణను సొంతం చేసుకున్న మైథిలి ఠాకూర్ ను బీహార్ ఎన్నికల సంఘం 'స్టేట్ ఐకాన్'గా నియమించింది. కాగా, దర్భంగా జిల్లాలోని అలీనగర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే మిశ్రీ లాల్ యాదవ్ పార్టీకి అక్టోబర్ 11న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదని ఆరోపిస్తూ.. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్కు తన రాజీనామాను సమర్పిస్తున్నట్లు తెలిపారు. దీంతో అలీనగర్ నుంచి మైథిలి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. 243 మంది సభ్యులు గల బీహార్ శాసనసభకు రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మొదటి దశ నవంబర్ 6న, రెండవ దశ పోలింగ్ నవంబర్ 11న జరుగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
Breaking : బస్సులో మంటలు.. పన్నెండు మంది సజీవ దహనం
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది సజీవ దహనమయ్యారు
దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్..
దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్.. గోదావరిఖని, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో అధికారం
ఆ సమస్యలు ఉన్నవారికి ఇవి బెస్ట్ !!
ఈ రోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలిలో హై బీపీ (రక్తపోటు), మధుమేహం (షుగర్)
ఆ విషయంలో కోహ్లీ నెంబర్ వన్: హర్భజన్
టీం ఇండియా మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్కి ఓ ప్రత్యేకత ఉంది. దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫేవరెట్ క్రికెర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ వన్డే సిరీస్తో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వీరిద్దరు మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫామ్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. అయితే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కోహ్లీ ఫామ్ గురించి ఆందోళణ చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ‘‘ప్రస్తుత క్రికెటర్లలో ఫిట్నెస్ విషయంలో కోహ్లీనే నెంబర్.1. ఆ విషయంలో అతడు మిస్టర్ పర్ఫెక్ట్. అతడి ఆట చూసేందుకు ఎదురుచూస్తున్నా. విరాట్ మరింత కాలం వన్డేల్లో కొనసాగాలని కోరుతున్నా. ఆస్ట్రేలియా కోహ్లీకి ఇష్టమైన ప్రదేశం. అక్కడ కొన్ని టన్నుల కొద్దీ పరుగులు రాబట్టాడు. మరోసారి రాణిస్తాడు. మూడు మ్యాచుల్లో కనీసం రెండు సెంచరీలు చేస్తాడని ఆశిస్తున్నా. రోహిత్ కూడా మంచి ప్రదర్శన చేసి జట్టు విజయానికి తోడ్పడాలని ఆశిస్తున్నా’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ 29 వన్డేలు ఆడి.. 51.03 సగటుతో 1,327 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, 6 అర్థ శతకాలు ఉన్నాయి.
హర్షిత్ ఎంపికపై విమర్శలు.. గంభీర్ ఆగ్రహం #Cricket #HarshitRana #GautamGambhir #BCCI
మద్యం మత్తులో డ్రైవింగ్.. మూడు రోజుల జైలు శిక్ష
మద్యం మత్తులో డ్రైవింగ్.. మూడు రోజుల జైలు శిక్ష గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ
రెండేళ్లుగా ఆర్టీసీ బస్టాండు ద్వారం మూత.. రాకపోకలకు ఇబ్బందులు
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. ఆర్టీసీ బస్టాండుకు ఇరువైపులా ద్వారాలు ఉంటే బస్సులు లోపలికి రావడానికి, వెలుపలికి వెళ్లడానికి సులువుగా ఉంటుంది. ఈ చిన్న ట్రిక్ ను ఆర్టిసి అధికారులు రెండేళ్లుగా మర్చిపోయారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం పర్యటన వచ్చిన నేపథ్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కు ధర్మవరం రోడ్డు వైపు ప్రధాన ద్వారాన్ని మూతవేశారు. అప్పట్లో భద్రత దృష్ట్యా ఇలా చేశారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ద్వారాన్ని తెరవాల్సి ఉంది. […] The post రెండేళ్లుగా ఆర్టీసీ బస్టాండు ద్వారం మూత.. రాకపోకలకు ఇబ్బందులు appeared first on Visalaandhra .
Telangana : 40 లక్షలు ఇచ్చి.. ఆల్ ది బెస్ట్ చెప్పిన కేసీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు పార్టీ అధినేత కేసీఆర్ నలభై లక్షలు అందించారు
మామిడి సబ్సిడీ బ్యాంకులో జమ 31,929 మంది రైతులకు రూ.146.84 కోట్లు విడుదలచిత్తూరు
శిక్షణ ప్రమాణాలపై పలు సూచనలు..
శిక్షణ ప్రమాణాలపై పలు సూచనలు.. కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిజామాబాద్
When will Pawan Kalyan return back to Films?
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan is an occupied man and the actor-turned-politician has completed all his film commitments. He also managed to release Hari Hara Veera Mallu and OG recently. His upcoming movie Ustaad Bhagat Singh will have its release next year. There are a lot of speculations about Pawan Kalyan and his […] The post When will Pawan Kalyan return back to Films? appeared first on Telugu360 .
క్రీడా పోటీలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థులు.. ప్రిన్సిపాల్ అనూప్
విశాలాంధ్ర ధర్మవరం : క్రీడా పోటీలలో భాగంగా హ్యాండ్ బాల్ పోటీల్లో యశోద పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని ప్రిన్సిపాల్ అను ప్, డైరెక్టర్లు రవీంద్ర పృధ్విరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 8 నుండి 13వ తేదీలలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆర్ట్స్ కళాశాలలో హ్యాండ్ బాల్ బాలికల విభాగం అండర్ -14, అండర్ 17, అండర్ 19 జరిగిన పోటీలలో పాల్గొని అనంతపురం జిల్లా జట్టుకు ఎంపిక కావడం […] The post క్రీడా పోటీలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థులు.. ప్రిన్సిపాల్ అనూప్ appeared first on Visalaandhra .
పూరన్ కుమార్ కేసులో మరో ట్విస్ట్.. దర్యాప్తు అధికారి బలవన్మరణం
హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
అమ్మవారికి నవ ధాన్యాలతో నైవేద్యం
అమ్మవారికి నవ ధాన్యాలతో నైవేద్యం దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం గుడిరేవు
గుంతకల్ పట్టణమును అభివృద్ధి చేయండి.. సిపిఐ నేత డి.జగదీష్
దీక్షలను ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్, విశాలాంధ్ర గుంతకల్లు… గుంతకల్లు పట్టణము అభివృద్ధి పట్ల ప్రభుత్వాల వివక్షతకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సామూహిక దీక్షలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీ జగదీష్ ప్రారంభించారు. ఈ దీక్షలకు మున్సిపల్ చైర్మన్ భవాని, మున్సిపల్ మాజీ చైర్మన్ రామలింగ, అడ్వకేట్ చెన్నకేశవ సంఘీభావం తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ మాట్లాడుతూ గుంతకల్లు […] The post గుంతకల్ పట్టణమును అభివృద్ధి చేయండి.. సిపిఐ నేత డి.జగదీష్ appeared first on Visalaandhra .
సిట్ హీట్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో సోదాలు (తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ )
ఇంట్లోనే ఉరివేసుకొని మృతి దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి(Dandepalli) మండలంలోని గుడిరేవు గ్రామానికి
తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి
విశాలాంధ్ర – హైదరాబాద్ :: తెలంగాణా రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంటు ను రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామ్యం పొందేలా సిటిజన్ సర్వే చేపట్టారు. అక్టోబర్ 10 వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో రాష్ట్ర ప్రజలు, ఎన్.ఆర్.ఐ లు పెద్ద ఎత్తున […] The post తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ, ఏర్పేడు (తిరుపతి జిల్లా) : గుడిమల్లం ఆలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన
బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను కొట్టేసిన ఈసీ
విచారణ జరిపిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ The post బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను కొట్టేసిన ఈసీ appeared first on Visalaandhra .
ఆలయంలో రావాడ చంద్రశేఖర్కు ఘనస్వాగతం
ఆలయంలో రావాడ చంద్రశేఖర్కు ఘనస్వాగతం (ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ (Vijayawada)
రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థిని మృతి
హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన యువతి మరణించింది. స్థానిక సుభాష్ నగర్కు చెందిన బండారి అశోక్-గీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వాళ్ల చిన్న కూతురు బండారి మనోజ్ఞ(22) హైదరాబాద్లో బిటెక్ ఫైనలియర్ చదువుతోంది. శనివారం వనస్థలిపురంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు మనోజ్ఞను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్ఞను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మనోజ్ఞ సోమవారం మృతి చెందింది. ఈ ఘటన పై పోలసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్ఞ మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Fact Check: Viral image showing Human-Shaped Sweet Potatoes is AI-Generated
The viral human-shaped sweet potato image in Alluri Seetharamaraju, Andhra Pradesh, is AI-generated.
బీసీ రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు
చారిత్రాత్మక నిర్ణయాన్ని బీజేపీ బిఅరెస్ వ్యతిరేకం The post బీసీ రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు appeared first on Visalaandhra .
బాహుబలిని బీట్ చేసిన కాంతార ఛాప్టర్-1 #cinema #kantara #boxoffice #bahubali #recordbreaker
రైతులను ఇబ్బంది పెట్టిన ఫలితం..
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : మామిడి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా
కింగ్ కోహ్లి వచ్చేశాడు ..!#TeluguPost #telugu #post #news
పాల్వంచలో పోలీసులను చూసి పరారు
పాల్వంచలో పోలీసులను చూసి పరారు భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : పాల్వంచలో ఈ