విభిన్న వాదనల వేదిక ‘సమగ్ర’ ప్రతి శుక్రవారం మీకోసం..
పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించినట్టుగా ఈ మార్చికల్లా మావోయిస్టు పార్టీ అంతరించిపోతుందా? పెద్ద నాయకుల నుండి కార్యకర్తల వరకూ వందల సంఖ్యలో ప్రాణ త్యాగాలూ, సాయు ధ లొంగుబాట్లూ సమాజానికి ఏ సంకేతాలను ఇస్తున్నాయి? జల్ జంగిల్ జమీన్ మీద హక్కు కోసం సాగిస్తున్న పోరాటం ఆగదం టూ లొంగిపోతున్న మావోయిస్టులమీద సా మాజిక కార్యకర్త సోనీ సోరి వ్యక్తం చేసిన ఆ గ్రహం మరో పోరాట రూపం తీసుకుంటుం దా? ఎక్కడో అడవుల్లో ఏర్పాటుచేసిన జనతన రాజ్యాలు ప్రజలకు మేలు చెయ్యవని గ్రహిం చి నీళ్ళలో చేపల్లా ప్రజల్లో కలిసిపోవాలన్న ఎత్తుగడలో భాగంగానే భారీ సంఖ్యలో లొం గుబాట్లు జరుగుతున్నాయా? మావోయిస్టు పార్టీ పూర్తిగా కనుమరుగయినా, వందల ఏ ళ్ళుగా సాగుతున్న ఆదివాసీ పోరాటాలు మా నవీయ, శాంతియుత సమాజం ఏర్పడేవర కూ ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉం టాయా? ఈ రోజు ‘సమగ్ర’లో ప్రముఖ వి ద్యావేత్త, పౌర హక్కుల నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రముఖ కవి, రచయిత హెచ్చా ర్కె, సీనియర్ పాత్రికేయుడు ఎస్.కె.జకీర్ అభిప్రాయాలు చదువుదాం.
రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని 33 శాతాని కి పెంచడమే లక్ష్యంగా తెలంగాణలోని ప్ర జా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమా న్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 2024లో 20.02 కోట్ల మొక్కలను నాటాలని లక్షం గా పెట్టుకోగా, 16.75కోట్ల (84%) మొక్కలను నాటా రు. 2025లో 18కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకో గా, 15.64 కోట్ల మొక్కలు నాటారు. 202526లో 10కోట్ల మొక్కలు నాటి 99% లక్ష్యాన్ని చేరుకున్నారు.
రెండేళ్లలో అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం గ్యారం టీ ఇచ్చింది. రేవంత్రెడ్డి అధికారం చేపట్టి న రోజు నుంచే రైతులు, మహిళలు, నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలబడే గ్యారంటీలను అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రజల సమక్షంలోనే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే కొత్త ఒరవడి అమలు చేశారు. రెండేళ్లలో కోటికి పైగా కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించారు.
తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం
ఈరోజు సాయంత్రం సాయి అనే యువకుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అన్యాయం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేస్తుందని దీనిపై పోరాటం చేయాలని తీన్మార్ మల్లన్న నీ కలిసేందుకు వచ్చానని స్థాఫ్ తో చెప్పారు.. మల్లన్న ఆఫీసులో లేరని రేపు ఉదయం రావాలని చెప్పి పంపించారు.. అక్కడి నుండి కిందకి వచ్చిన ఆయన క్యూ న్యూస్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు.. గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్ కు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పి ఆ యువకున్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు..ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమం గా ఉందని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు వెంటనే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిని పరామర్శించనున్నారు
శుక్రవారం రాశి ఫలాలు (05-12-2025)
మేషం ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృషభం వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మిధునం నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోదాలుంటాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలసిరావు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. కర్కాటకం ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులు సహాయంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సింహం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. కన్య వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. తుల వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వృశ్చికం వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ఇంటాబయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధనస్సు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు. మకరం వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు. కుంభం ఆర్థిక వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మీనం నూతన పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగమున చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి.
05 Dec Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
రెండేండ్ల పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
న్యూఢిల్లీ-ఆంధ్రప్రభ ప్రతినిధి : రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మకమైన
డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఈషా'
ఇటీవల లిటిల్హార్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్గా ఈ చిత్రాన్ని డిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ “ఈషా దర్శకుడు శ్రీనివాస్ నాకు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు. ఎంతో ఓపిక, ప్రతిభ ఉన్న దర్శకుడు. మంచి సినిమాను థియేటర్ వరకు తీసుకెళ్లాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి ప్లానింగ్ కావాలి. అది ఇప్పుడు వాసు, వంశీ చేస్తున్నారు”అని అన్నారు. బన్నీవాస్ మాట్లాడుతూ “నాకు దెయ్యాలు, ఆత్మలు అంటే నమ్మకం లేదు. కానీ ఈ సినిమా చూసిన తరువాత నేను కూడా థియేటర్లో నాలుగు సార్లు భయపడ్డాను. దర్శకుడు నా లాంటి వాళ్లను భయపెట్టాడంటే కంటెంట్లో దమ్ము ఉందనిపించింది. చివరి పదిహేను నిమిషాలు సినిమా అందరికీ ఎంతో థ్రిల్ను కలిగిస్తుంది. ఇక ఈ సినిమాను హార్ట్ వీక్గా ఉన్నవాళ్లు మాత్రం చూడొద్దు”అని తెలిపారు. ఈ సమావేశంలో వంశీ నందిపాటి పాల్గొన్నారు.
ఓటర్లకు బిందెలు పంచుతూ అడ్డంగా దొరికిన సర్పంచ్ అభ్యర్థి
కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, కన్కల్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు బిందెలు పంచుతూ దొరికిన సర్పంచ్ అభ్యర్థి పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్ఐ నరేష్ తెలిపిన ప్రకారం వివరాల్లోకి వెళ్తే.. గురువారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేస్తూ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన మద్దతుదారులు ఓటర్లను ప్రభావితం చేయడానికి బిందెలు పంచుతున్నారు. సరైన సమాచారంతో ఎన్నికల స్పెషల్ టీం సభ్యులు దాడి చేసి 41 బిందెలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఓటరులను ప్రభావితం చేసే విధంగా మద్యం, డబ్బు, ఇతర వస్తువులను పంపిణీ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని, చట్టపరంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. ఓటర్లు స్వచ్ఛందంగా నాయకులను ఎన్నుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు తలగొద్దని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.
చత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 18కి చేరిన మృతులు
చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా, బైరాంగడ్ - నైమేడ్ అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టు మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజి సుందర్ రాజ్, బీజాపూర్ జిల్లా ఎస్పి డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ ధ్రువీకరించారు. గురువారం బీజాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మృతి చెందిన 18 మందిలో 16 మృతదేహాలను గుర్తించగా మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందన్నారు. మృతుల్లో పిఎల్జిఏ కంపెనీ ఇన్ఛార్జి, వెల్లా మొరియం, సిఐపిసి కంపెనీ 3 డివిసిఎం సన్ను అవడం, పిపిసిఎం నందా మీడియం, లాలు అలియాస్ సీతారాం, రాజు, కామేష్, కవాసి లక్ష్మి, తాతి బండి, సఖి లేకం, సోమిడీ కొంచెం, దళ సభ్యుడు చందు, కోసం, శాంతి, సోని, మాద్వి సంగీత, పద్దం నన్ను లుగసను గుర్తించామని వెల్లడించారు. మిగిలిన ఇద్దరి మృతదేహాలను గుర్తించే ప్రయత్నం కొనసాగుతోందన్నారు. ఎన్కౌంటర్ ప్రాంతం నుండి ఎఎంజి ఒకటి, నాలుగు ఏకే 47, నాలుగు ఎస్ఎల్ఆర్లు, నాలుగు ఇన్ సాస్, రెండు 303 రైఫిల్స్, నాలుగు సింగిల్ షాట్ రైఫిల్స్, రెండు బిజిఎల్ లాంచర్స్, ఒక మజిల్ లోడింగ్ రైఫిల్, మావోయిస్టు సామగ్రి, కరపత్రాలను స్వాధీనపరుచుకున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఎస్పి జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. 2025 సంవత్సరంలో జిల్లా లో జరిగిన వివిధ ఎదురుకాల్పుల సంఘటనల్లో 161 మావోయిస్టలు మృతి చెందగా 546 మందిని అరెస్ట్ చేశామని, 560 మంది లొంగిపోయారని అన్నారు.
భారత్కు రష్యా చమురు సరఫరా సజావుగా , ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సాగుతోందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. భారత్ పర్యటన నేపథ్యంలో పుతిన్ ఓ ప్రత్యేక ఇంటర్వూలో పలు కీలక అంశాలు వెల్లడించారు.భారతీయ చమురు పరిశ్రమను రష్యా అత్యంత విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా భావిస్తుందని తెలిపారు. భారత్కు రష్యా చమురుపై అమెరికా వ్యతిరేకత గురించి ప్రస్తావించారు. అమెరికానే రష్యా ముడిచమురు తీసుకుంటూ ఉండగా, భారత్ తెప్పించుకుంటే తప్పేముంది? దీనినే హిపోక్రసీ అంటారేమో అని వ్యాఖ్యానించారు. ఇండియా టుడే ప్రత్యేక ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. భారత్ను బెదిరించే తరహాలో ట్రంప్ వ్యవహరిస్తున్నాడని పుతిన్ విమర్శించారు. ప్రధాని మోడీ ఎవరి ఒత్తిళ్లకో లొంగేరకం కాదని , ఆయన పద్ధతి ప్రకారం ఆయన వ్యవహరిస్తూ వెళ్లుతాడని స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల బెదిరింపులతో భారత్ను భయపెట్టాలనేది అమెరికా ఆలోచనగా ఉందన్నారు. మాస్కోలోని క్రెమ్లిన్లో చారిత్రక ఎకటెరినా కథరైన్ హాల్లో ముందుగానే రికార్డు చేసిన ఇంటర్వూ ఇప్పుడు పుతిన్ భారత్ పర్యటన దశలో ప్రసారం అయింది. భారత్కు రస్యా చమురు వద్దంటున్న ట్రంప్ వాదనలో పసలేదని పుతిన్ కొట్టిపారేశారు. రష్యా నుంచి ఓ వైపు అమెరికా దండిగానే న్యూక్లియర్ ఫ్యూయల్నుతమ దేశ అణు ఇంధన కేంద్రాల కోసం కొనుగోలుచేసుకొంటోంది. మరి భారత్ను ఎందుకు వద్దంటోందని ప్రశ్నించారు. రష్యా యురేనియం ఇప్పుడు అమెరికా రియాక్టర్లకు అందుతోందని చెప్పారు. అమెరికాకు ఓ ధర్మం భారత్కు మరో న్యాయమా? అని నిలదీశారు. భారత్ను వద్దంటున్న ట్రంప్ వ్యవహారంపై పూర్తి స్థాయి పరిశీలన అవసరమే. ఇందుకు తాము అవసరం అయితే ట్రంప్తో కూడా చర్చించేందుకు సిద్ధం అని పుతిన్ తేల్చిచెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని నిజంగానే ట్రంప్ కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన శాంతి స్థాపకులు అని అనుకోవచ్చు, అయితే ఈ విషయంలో ఆర్థిక, భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నట్లు ఉన్నాయని అన్నారు. శాంతి స్థాపనకే అలాస్క భేటీ సాగిందని తెలిపారు. భారత్ రష్యా సంబంధాలు ప్రత్యేకమైనవి, విశిష్టమైనవి, ఇతర దేశాలతో సంబంధాలకు ముప్పు కల్గించేవి కావని పుతిన్ తెలిపారు. ఇవి ఇతరులకు వ్యతిరేకం అని అనుకోరాదని స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ ట్రంప్ సొంత అజెండాతో ఉంటారని అయితే ఇతరులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా సంబంధాలు మల్చుకోవడమే తమ అజెండా అని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్తో యుద్ధ విరమణను ఆకాంక్షిస్తున్నామని చెప్పిన పుతిన్, నాటో అత్యంత ప్రమాదకరం అన్నారు. నాటో పట్ల ఉక్రెయిన్ తటస్థ వైఖరి పాటించడం ఆ దేశానికే మంచిదన్నారు. ఇక అంతర్జాతీయ విషయాల గురించి మాట్లాడుతూ యూరప్ తిరోగమన దశలో ఉంది. భారత్ పురోగమిస్తోంది. జి 7కు ప్రాధాన్యత లేదన్నారు. ఇండియా ముందంజలో ఉండటమే అమెరికా కలవరానికి కారణం అని ఆయన విశ్లేషించారు. బ్రిక్స్ కరెన్సీ ఇప్పట్లో వచ్చే వీలులేదని తెలిపారు. స్వాతంత్య్రానంతరం భారత్ వెలుగు అద్బుతం అని, ఇది ఎవరికి అంతుచిక్కని వాస్తవం అన్నారు.
వివాహం చేసుకుంటానని చెప్పి మహిళ వద్ద నుంచి రూ. 3,38,200 సైబర్ నేరస్థులు కొట్టేశారు. హైదరాబాద్, సైదాబాద్, వినయ్ నగర్కు చెందిన మహళ(47) యూక్కు చెందిన హిరాద్ అహ్మద్ వివాహం ప్రపోజల్ వచ్చింది. మ్యాట్రీమోనిలో రావడంతో మహిళ అంగీకరించింది, ఇద్దరు మొబైల్ నంబర్ మార్చుకుని రోజు మాట్లాడుకునేవారు, వీడియో కాల్స్, ఛాటింగ్ చేసుకునేవారు. తర్వాత బాధితురాలిని రెండు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించాడు, రెండు కొత్త సిమ్లు తీసుకోమని ఢిల్లీలోని యూకే నకిలీ అఫైర్స్ ఆఫీస్లోకు పంపమని చెప్పాడు. తర్వాత నకిలీ వీసా బాధితురాలికి పంపించి, వివాహానికి సంబంధించిన పేపర్లు పంపించాడు. వాటిని ప్రాసెస్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు. వీసా ఫీజులు, లేట్ ఛార్జీలు తదితరాల పేరు చెప్పి రూ. 3,38,200 వసూలు చేశాడు. తర్వాత కూడా వేరే నంబర్లతో కాల్స్ రావడంతో బాధితురాలు మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి సీతక్క స్వగ్రామం జగ్గన్నపేటలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్వగ్రామం ములుగు జిల్లా, ములుగు మండలంలోని జగ్గన్నపేటలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వడం ద్వారా ఏకగ్రీవమైందని మంత్రి సీతక్క కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సర్పంచ్ పదవికి కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, గ్రామాభివృద్ధికి ఏకాభిప్రాయం అవసరమని మంత్రి సీతక్క చేసిన సూచనల మేరకు స్థానిక నాయకులు పోటీదారులతో సమాలోచన జరిపారు. ఈ చర్చల ఫలితంగా, కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్న అర్రెo వెంకన్న పేరును ఏకగ్రీవ అభ్యర్థిగా ఖరారు చేశారు. తదనంతరం ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవడంతో అర్రెo వెంకన్న సర్పంచ్గా ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు.
రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లాలో 33 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మొత్తం 9,331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తొలిదశలో 4,236 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 37,440 వార్డు స్థానాలకు నవంబర్ 27 నుంచి 29 వరకు తొలి విడత పోలింగ్కు నామినేషన్లు స్వీకరించారు. అందులో బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, 4,236 సర్పంచ్ స్థానాలకు 395 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు 13,127 అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 37,440 వార్డు స్థానాలకు 67,893 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. తొలి విడతలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది తమ ఉపసంహరించుకోగా, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 9,626 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. రెండో విడత నామినేషన్ల గడువు ఈనెల 2వ తేదీతో ముగియగా, ఉపసంహరణకు శనివారం(డిసెంబర్ 6) వరకు గడువు ఉంది. ఏకగ్రీవాల కోసం భారీగా ఖర్చు..? రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామపంచాయతీల్లో సర్పంచి పీఠాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకునేందుకు కొందరు బడా వ్యాపారులు భారీగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లోకి వెళితే అనవసరంగా భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసుకోవాల్సి రావడంతో పాటు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తామన్న గ్యారంటీ ఉండదు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకుల మద్దతుతో సర్పంచి పదవికి ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎంఎల్ఎ పోరు కంటే పల్లెపోరునే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. గ్రామంలో సర్పంచి పదవి అంటేనే అందరూ ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఆ సర్పంచి పీఠం కోసం అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉంటుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికలకు ముందు నుంచే ఊళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వారి సొంత డబ్బులతో చేస్తుంటారు. మరికొంత మంది సర్పంచి పదవి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కొందరు ఆస్తులను, భార్యల పుస్తెల తాడులను కూడా తాకట్టు పెట్టి సర్పంచి పీఠం కోసం పోటీ చేస్తారు. అయితే కొన్ని గ్రామాలలో మాత్రం కొంతమంది అభ్యర్థులు గ్రామానికి ఇన్ని డబ్బులు ఇస్తాము అని చెప్పి ఏకగ్రీవం చేసుకుంటుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలంపాట, బెదిరింపులకు పాల్పడితే అలాంటి ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ (ఎన్నికల నిర్వహణ) చట్టం -2018లోని 15వ నిబంధన ప్రకారం.. ఒక స్థానంలో పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే, గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి.. ఒక్కరే పోటీలో ఉండడం, ఇతర అభ్యర్థులను భయపెట్టడం లేదా మోసానికి పాల్పడడం వంటివి జరగకుంటేనే ఏకగ్రీవంగా ప్రకటించాలని సూచించారు.
Revanth Reddy Promises Airport Works in Adilabad Within a Year
Chief Minister Revanth Reddy announced that Adilabad, a district that once struggled to get even basic transport facilities, will soon see the start of airport construction. He said the government is committed to transforming the region and bringing new industries that can create long-term growth. He promised that airport works would begin within a year […] The post Revanth Reddy Promises Airport Works in Adilabad Within a Year appeared first on Telugu360 .
మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో వెలసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి
KNR |అధిక లోడుతో గ్రానైట్ రవాణా..
గన్నేరువరం, ఆంధ్రప్రభ : మండలంలోని చాకలివాని పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గ్రానైట్
Choutuppal |వైభవంగా అయ్యప్ప స్వామి 18వ మహా పడిపూజ..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట
Choutuppal |రెండవ రోజు 36 నామినేషన్లు..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని 26 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను
NBK’s Akhanda 2 Premieres TODAY Across USA
Akhanda 2 is more than an action-packed spectacle, it is a tribute to the eternal values of Sanatana Dharma. The film is charging into North America with the BIGGEST-EVER NBK RELEASE, igniting staggering momentum and unprecedented industry-wide uproar. Pre-sales are shattering every benchmark, with bookings moving at rocket speed across all major circuits. The global […] The post NBK’s Akhanda 2 Premieres TODAY Across USA appeared first on Telugu360 .
చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు కంట్రోల్ తప్పి ముందు వెళ్తున్న కంటైనర్ ను ఢీకొట్టింది. గురువారం రాత్రి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పరిశ్రమ భూములను బడా వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర
సనత్ నగర్, ఆంధ్రప్రభ : పరిశ్రమలకు కేటాయించిన భూములను ప్రజల అవసరాలకే వినియోగించాలని
పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పలుచోట్ల ఎన్నో ఆసక్తికర సంఘటనలు, విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. వివరాలలోకి వెళితే.. ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండల కేంద్రంలో పెనుబల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన తేజావత్ సామ్రాజ్యం పోటీ చేస్తుండగా, ఆమె కుమార్తె బానోతు పాప బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి నిలబడ్డారు. ఒకే ఊర్లో ఒకే స్థానానాకి తల్లి కుమార్తెలు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయటంతో సర్వత్రా చర్చ కొనసాగుతోంది.
Independent |పోటాపోటీగా నామినేషన్లు దాఖలు
Independent | పోటాపోటీగా నామినేషన్లు దాఖలు Independent | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ :
విజయవాడ లో హస్తాకళల ఉత్పత్తులు, అమ్మకాలు..
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : హస్తకళలను ప్రోత్సహించి, కళాకారులను ఆదరించి వారికి ఆర్థిక
Rs. 1000 crore |విమర్శలకు బెదిరేది లేదు…
Rs. 1000 crore | విమర్శలకు బెదిరేది లేదు… Rs. 1000 crore
ఈ నెల 7న ఇందిరా పార్క్ దగ్గర బిజెపి మహాధర్నా
కాంగ్రెస్ మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా, రెండేళ్లుగా అమలుకాని హామీల సాధనే ధ్యేయంగా బిజెపి నిర్వహిస్తున్న ‘మహాధర్నా’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు పిలుపునిచ్చారు. మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా బిజెపి సమరశంఖం పూరించిందని ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా పేర్కొన్నారు. ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడానికి, ప్రజల పక్షాన నిలబడేందుకు బిజెపి నిర్వహిస్తున్న ‘మహాధర్నా’లో పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. ఈ నెల 7న ఉదయం 9 గంటలకు ఇందిరా పార్క్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో జరుగనున్న ‘మహాధర్నా’లో పాల్గొనేందుకు తరలి రావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు.
శ్రీవారి సేవలో తమన్ ఓంకార్ అశ్విన్ బాబు #Tirumala #TTD #Thaman #Omkar #AshwinBabu #CelebrityDarshan
కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని ఆసుపత్రి లో పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
ఎల్బి నగర్లో ప్రేమ్ చంద్ అనే బాలుడిపై కుక్కల దాడి ఘటనపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ప్రేమ్ చంద్కు తగిన వైద్యం, ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి అడ్లూరి అన్నారు. బుధవారం నీలోఫర్ ఆస్పత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న బాలుడిని మంత్రి అడ్లూరి పరామర్శించారు. ప్రేమ చంద్ తల్లి దండ్రులు. తిరుపతి రావు, చంద్రకళ దంపతులకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, బాలుడికి స్పెషల్ స్కూల్ లో అడ్మిషన్ ఇప్పించి చదువును ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ హృదయ విదారక ఘటన తనను ఎంతో కలిచి వేసిందన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల బృందం నిలోఫర్ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న బాలుడి తల్లిదండ్రులను కలసి వివరాలు సేకరించినట్లు మంత్రి చెప్పారు. బాధిత బాలుడి తండ్రి వినతిని పరిగణలోకి తీసుకొని, బాలుడి సంపూర్ణ వైద్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం దగ్గరుండి చేసుకుంటుందన్నారు. బాలుడికి అవసరమైన సహాయక చర్యలన్నీ ప్రభుత్వం నుంచి అందిస్తున్నామన్నారు. మంత్రి అడ్లూరి ఆదేశాల మేరకు సంబంధిత శాఖ అధికారులు ఆ బాలుడికి దివ్యాంగుల గుర్తింపు కార్డు తక్షణమే జారీ చేశారు. అర్హత ప్రకారం దివ్యాంగ పింఛను మంజూరు చేస్తామన్నారు. కోలుకున్న తర్వాత బాలుడికి కావలసిన సంరక్షణకు కావలసిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. వైద్య చికిత్స, పునరావాస సహాయం అందించడం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎప్పుడు , ఎక్కడ, చోటు చేసుకున్న జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారులు ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబాలను సందర్శించి, అవసరమైన సేవలు, సహాయం వెంటనే అందించాలని కూడా మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శైలజ నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ,ఆర్ ఎం ఓ డా ఆనంద్, లాలూ ప్రసాద్, బాబురావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
parking lot |సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లు పరిశీలన…
parking lot | సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లు పరిశీలన… parking lot
Pawan kalyan |పదవి అలంకారం కాదు…
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పదవి, పరువు, ప్రతిష్టలన్నీ పక్కన పెట్టి ప్రజల
Akhanda 2 is planned for a record release across the globe with paid premiere shows from this night. But the film has been stuck with financial hurdles of the producers and the premiere shows across India are cancelled. The advance bookings in AP are opened well in advance and the theatres are processing the refunds. […] The post Akhanda 2 Premieres Cancelled appeared first on Telugu360 .
ATMS System |తెలంగాణలో రవాణా విస్తరణ చేపట్టాలి
ATMS System | తెలంగాణలో రవాణా విస్తరణ చేపట్టాలి ATMS System |
దేదీప్యమానంగా కనక దుర్గమ్మ కలశ జ్యోతి ఊరేగింపు…
ఆంధ్రప్రభ, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను నియమబద్ధ దీక్షతో పూజించి అమ్మవారి అనుగ్రహం
భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
Government |దివ్యాంగులను ప్రోత్సహించాలి…
Government | దివ్యాంగులను ప్రోత్సహించాలి… Government | భీమ్గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ
ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..‘అఖండ 2’ ప్రీమియర్స్ రద్దు
నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ షాక్. ‘అఖండ 2’ మూవీ ప్రీమియర్స్ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి 8 గంటలకు ఈ మూవీ ప్రీమియర్స్ షోలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా ప్రీమియర్స్ రద్దు చేసినట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా క్యాన్సిల్ చేసినట్టు తెలిపింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా, రేపు(డిసెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
Hot Topics | పుతిన్… Hot Topics | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ :
MGM Hospital |కాజీపేటలో కత్తితో దాడి..
MGM Hospital | కాజీపేటలో కత్తితో దాడి.. MGM Hospital | కాజీపేట,
బహిరంగంలో మద్యం పార్క్ క్లీనింగ్ శిక్ష #SocialServicePunishment #CourtOrders #HyderabadNews
‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్ ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ’లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ‘ని రూపొందించామన్నారు. గచ్చిబౌలిలోని ‘ఐఐఐటీ హైదరాబాద్‘లో ‘నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం అండ్ తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ’ ని గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పట్లో విద్యుత్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయన్నారు. అదే తరహాలో రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతుందన్నారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ’లో భాగంగా రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ యాక్సిలరేషన్, టాలెంట్ పైప్లైన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. క్వాంటం సెన్సింగ్, సెక్యూరిటీ, కమ్యూనికేషన్, క్వాంటం కంప్యూటింగ్లో ఆర్అండ్ డీ, ఇన్నోవేషన్స్ ను ప్రోత్సహించేలా రూపొందించిన ఈ పాలసీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. ఇది కేవలం తమ ప్రభుత్వం రూపొందించిన ఒక పాలసీ మాత్రమే కాదని, క్వాంటం టెక్నాలజీలో దేశానికి దిశా నిర్దేశం చేసే ‘డైరెక్షన్’ అని అన్నారు. ఈ టెక్నాలజీ లో దేశానికి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా ప్రత్యేకంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్’కు కూడా శ్రీకారం చుట్టామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్టప్స్, కొత్త ఆలోచనలకు భరోసానిచ్చేలా ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‘ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ‘ఇండస్ట్రీ డే‘ పేరిట ప్రతి వారంలో ఒకరోజు అధికారులు, ప్రతి నెలలో ఒక రోజు సంబంధిత మంత్రి పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారన్నారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారన్నారు.
కుత్బుల్లాపూర్ కెటిఆర్ పర్యటనలో అపశృతి
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. విధి నిర్వహణ లో ఉన్న ఓ వీడియో జర్నలిస్ట్ ఒక్కసారి గా కుప్ప కూలిపోయాడు .హుటా హుటినా ఆస్పత్రి కి తరలించగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో మాజీ మంత్రి కెటిఆర్ హెచ్ఐఎల్టిపి భూ కేటాయింపి అంశం పై జీడిమెట్ల పారిశ్రామికవాడలో పర్యటించారు. అక్కడ హమాలీ అడ్డా లో కార్మికులతో మాట్లాడిన అనంతరం కెటొఆర్ ప్రభుత్వ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద, మాధవరం కృష్ణ రావు, ఎమ్మెల్సీల శంబిపూర్ రాజు, సునీత రాథోడ్, ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి,తదితరుల తో కలిసి పలు కంపెనీలలో కార్మికులతో మాట్లాడారు. ఈ సమయం లో అక్కడ విధి నిర్వహణలో న్యూస్ కవరేజ్ కోసం వచ్చిన సీనియర్ వీడియో జర్నలిస్ట్,ఆజ్ తక్ దామోదర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు అత్యుత్సాహంతో , సెల్ఫీల బెడదలో తొక్కిసలాటలో ఒకసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న తోటి రిపోర్టర్లు, గన్ మెన్లు, జీడిమెట్ల పోలీసుల సహాయంతో ఆటోలో షాపూర్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నోటి నుండి వాంతులు చేసుకున్న దామోదర్ బ్లడ్ ప్రెషర్ పెరిగి ఒత్తిడికి లోనయ్యాడు .పరిస్థితి విషమించడంతో వైద్యులు చికిత్స అందిస్తుండగా దామోదర్ మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు వీడియో జర్నలిస్ట్ కుటుంబానికి సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.
Awareness conference |ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
Awareness conference | ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు Awareness conference
బెలూన్ల పంచాయతీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు
ఐరోపాలోని బెలారస్, లిథువేనియా దేశాల మధ్య వాతావరణ బెలూన్ల కారణంగా సమస్యలు వస్తున్నాయి.
భారీగా అక్రమాస్తులు.. రంగారెడ్డి జిల్లా ఎడి శ్రీనివాస్ అరెస్టు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా భూ సర్వే అండ్ భూ సంస్కరణల రికార్డు అసిస్టెంట్ డైరెక్టర్(ఎడి) శ్రీనివాస్ అరెస్టు అయ్యాడు. శ్రీనివాస్కు సంబంధించి ఎసిబి అధికారులు భారీగా ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో శ్రీనివాసులు పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాస్ నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేసిన అధికారులు.. దాదాపుగా 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. అలాగే, మై హోం భూజాలో ఒక ఫ్లాట్, నారాయణపేటలో రైస్ మిల్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపూర్లో 11 ఎకరాలు, మహబూబ్నగర్లో 4 ప్లాట్లు, నారాయణపేటలో మరో 3 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన ఎసిబి అధికారులు.. సోదాల్లో విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి రోజు రోజుకీ క్షీణించిపోతోంది.
గోవిందరాజును గద్దెను కదలించిన పూజారులు
మేడారంలో గోవిందరాజు గద్దెను పూజారులు గురువారం కదలించారు. మేడారంలో పూజ సామాగ్రిని సిద్దం చేసుకుని సమ్మక్క- సారలమ్మ పూజారులతో కలిసి గోవిందరాజు పాత గద్దె వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ఐదుగురు పూజారులు కలిసి గద్దెను కదలించారు. ఈకార్యక్రమానికి ముందుగా సమ్మక్క- సారలమ్మ గద్దెల వ ద్ద పసుపు, కుంకుమ, సారా అరగించి పూజలు చేశారు. నూతనంగా పునర్నిర్మిస్తున్న గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పనులు పూర్తయి తర్వాత గద్దెలపై ఎఎధ్వజ స్తంబాలను ప్రతిష్టించనున్నారు. ఈనెల 24న గోవిందరాజు, పగిడిద్దరాజు నూతనంగా నిర్మిస్తున్న గద్దెలపై ధ్వజ స్థంబాలను ప్రతిష్టించనున్నట్లు పూజారులు తెలిపారు. ఈకార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు. పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక సారయ్య, కొక్కెర రమేష్, చందా రఘుపతి, పగిడిద్దరాజు పూజారి దబ్బకట్ల గోవర్థన్, పూజారులు పాల్గొన్నారు.
sections |రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు
sections | రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు sections | జన్నారం, ఆంధ్రప్రభ
మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 16 లేదా 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ మేరకు టెన్త్ పరీక్షలకు సంబంధించిన పలు తేదీలతో కూడిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే టెన్త్ పరీక్షల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, మార్చి13తో మెయిన్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తి కానున్నాయి. ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత మార్చి 16 లేదా 18 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఈసారి సిబిఎస్ఇ తరహాలో ఒక్కో పరీక్షకు మధ్యలో కనీసం ఒకటి లేదా రెండు రోజులు సెలవు ఉండేలా అధికారులు పరీక్షల షెడ్యూల్ రూపొందించారు.
కెటిఆర్ మాట్లాడే చిట్టిలను కాపీ కొడుతున్నా కిషన్ రెడ్డి: సామ రాంమ్మోహన్ రెడ్డి
తెలంగాణలో కిషన్ రెడ్డి కిరికిరి రెడ్డిగా మారారని, రాష్ట్ర అభివృద్ధికి పదే పదే అడ్డుపడుతున్నారని, కెటిఆర్ మాట్లాడే చిట్టిలను చూసి కిషన్ రెడ్డి కాపీ కొడుతున్నారని కాంగ్రెస్ నేత సామ రాంమ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బిజెపి నేతలపై కాంగ్రెస్ నేత సామ రాంమ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కిషన్రెడ్డి ఒక బ్రోకర్ అని ఆయన మండిపడ్డారు. ఒకటే స్క్రిప్ట్ను కెటిఆర్, కిషన్ రెడ్డిలు జీరాక్స్ చేసి చదువుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో గాలిని కొనుక్కొని బ్రతికే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో ఆ పరిస్థితి రాకూడదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. హైదరాబాద్ను కూడా ఢిల్లీగా మార్చాలని కిషన్రెడ్డి, కెటిఆర్ కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహేశ్వర్ రెడ్డికి చిట్టీలు అందించేది ఎవరో తెలియదా అని ఆయన ప్రశ్నించారు. హిల్ట్ పాలసీ కింద ఉన్నవి ప్రైవేట్ భూములు అని ప్రైవేట్ ఓనర్ల నిరుపయోగమైన భూములపై వలంటరీగా వెసులుబాటు ఇస్తే కెటిఆర్కు ఇబ్బంది ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. హిల్ట్ పాలసీలో ప్రభుత్వ భూమి లేదని, దేవాలయాలపై జీఎస్టీ వేస్తే బిజెపి నాయకులు మౌనంగా ఉంటారా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ దేవాలయాలపై వేసిన జీఎస్టీ తగ్గించే దాకా పోరాడడానికి కిషన్ రెడ్డి వస్తాడా? అని అన్నారు. బిజెపి నాయకులకు నరేంద్ర మోడీ ఒక్కడే దేవుడని, నిజమైన హిందువులకు ముక్కోటి దేవుళ్లు ఉన్నారని, సిఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నారని ఆయన తెలిపారు.
Cyber crimes |సైబర్ నేరాలపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు…
Cyber crimes | సైబర్ నేరాలపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు… Cyber crimes
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన
Temple |ఘనంగా అంజన్న బ్రహ్మోత్సవాలు…
Temple | ఘనంగా అంజన్న బ్రహ్మోత్సవాలు… Temple | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Elections |మద్దిమడుగు ఆంజనేయ స్వామి దర్శనం…
Elections | మద్దిమడుగు ఆంజనేయ స్వామి దర్శనం… Elections | అచ్చంపేట, ఆంధ్రప్రభ
Akhand 2: అఖండ మూవీ నిర్మాత కీలక నిర్ణయం..బాలయ్యఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్
అఖండ 2 మూవీ నిర్మాత సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ రైజింగ్-గ్లోబల్ సమ్మిట్.. సామాన్యులకు ఉచిత ప్రవేశం
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. దేశ, విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఈ సదస్సుకు ఆహ్వానిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, గ్లోబల్ సమ్మిట్కు సామాన్య ప్రజలకు కూడా ప్రవేశం కల్పించాలని ప్రభుత్వ నిర్ణయించింది. డిసెంబర్ 10 నుంచి 13 వరకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పించనుంది. భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి సెషన్లు, ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాల వీక్షించేందుకు ఏర్పాటు చేయనుంది. ఈ సమ్మిట్ కు వెళ్లేందుకు ప్రతిరోజూ హైదరాబాద్ నగరంలోని ఎంజిబిఎస్, జెబిఎస్, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బినగర్ నుండి ప్రత్యేక ఉచిత బస్సులను నడపనుంది.
Police Force |పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి…
Police Force | పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి… Police Force | వరంగల్
శ్రీతేజ ఆరోగ్యంపై స్పందించిన దిల్ రాజు
శ్రీ తేజ వ్యవహారంపై తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు
ఇంకా కోలుకోని శ్రీతేజ #Hyderabad #Accident #Pushpa2 #SantyaTheatre #ChildCare #Justice
ధూమ్ధామ్గా రాష్ట్ర యువజనోత్సవాలు..
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో: యువతలో నిక్షిప్తమైన ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీయడమే యువజన మహోత్సవం
Smart City |స్మార్ట్ నిధులు ఏమయ్యాయి…?
Smart City | స్మార్ట్ నిధులు ఏమయ్యాయి…? Smart City | కరీమాబాద్,
అబద్ధాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ : జగన్
అబద్ధాలకు అంబాసిడర్ ఎమ్మెల్యే వైఎస్ జగన్ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి తీరుతాం..
ఆదిలాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం సిఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.18.7 కోట్ల అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన-విజయోత్సవ బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. రెండేళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నా. రెండేళ్ల క్రితం ఓటును ఆయుధంగా మార్చి నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపారు. ప్రజలు తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంటోంది. సంక్షేమం-అభివృద్ధి రెండుకళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్ కంపెనీని మళ్లీ ప్రారంభిస్తాం. ఏడాదిలో ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. ఎర్ర బస్సు రావడం కష్టమనుకున్న ఆదిలాబాద్కు ఎయిర్బస్ తీసుకొస్తున్నాం. అత్యంత వెనకబడిన ఆదిలాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Facilitation Center |స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్
Facilitation Center | స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్ Facilitation Center
పూజలో ఉపయోగించే గంటలు ఎన్ని రకాలంటే?#Pooja #HinduTradition #TempleBells #Spiritual #Vastu
30 Police Act |శాంతియుతంగా ఎన్నికలు
30 Police Act | శాంతియుతంగా ఎన్నికలు 30 Police Act |
Chittoor |ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో
TP |మోసపూరిత ప్లాన్లు ఎందుకిచ్చారు?
TP |మోసపూరిత ప్లాన్లు ఎందుకిచ్చారు? TP | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ :
KCR : కేసీఆర్ పాలిటిక్స్ ను ఇక వదిలేసినట్లేనా? కీలక నేతలు ఏమంటున్నారంటే?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది
Temple |శివభక్త మార్కండేయ దేవాలయంలో…
Temple | శివభక్త మార్కండేయ దేవాలయంలో… Temple | కరీమాబాద్, ఆంధ్రప్రభ :
Elections |రాయికల్ ను అభివృద్ధి చేస్తా
Elections | రాయికల్ ను అభివృద్ధి చేస్తా సర్పంచి అభ్యర్థి జ్యోతి శ్రీనివాస్
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ మంట రగల్చొద్దు….
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుకుంటుంది.
Telangana : అఖండ 2 మూవీ నిర్మాతకు షాకిచ్చిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 మూవీ సినిమా విడుదల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది.
Heavy Rain |ఉప్పొంగుతున్న ముదిగేడు వాగు
Heavy Rain | ఉప్పొంగుతున్న ముదిగేడు వాగు Heavy Rain | పొదలకూరు,
Toll Plaza : టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు.. రయ్.. రయ్ మంటూ
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Krishna Tarang |తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం..
Krishna Tarang | తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. Krishna Tarang | మచిలీపట్నం,
201 couples |సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు..
201 couples | సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు.. 201 couples |
తెలంగాణలో అఖండ-2 టికెట్ రేట్ల పెంపు#TeluguPost #telugu #post #news
విమానాశ్రయానికి 800 ఎకరాల భూసేకరణకు ఆదేశించారు : పాయల్ శంకర్
హైదరాబాద్: ఆదిలాబాద్ కు విమానాశ్రయం కావాలని గతంలో సిఎం రేవంత్ రెడ్డిను అడిగానని బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కేంద్రం మంజూరు చేస్తే.. కావాల్సిన సహకారం అందిస్తానని సిఎం అన్నారని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న సిఎం కు ధన్యవాదాలు తెలియజేశారు. ఆదిలాబాద్ లో సిఎం పర్యటించారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బహిరంగసభ నిర్వహించారు. రూ. 18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తే అంగీకరించారని, విమానాశ్రయానికి వెంటనే 800 ఎకరాల భూసేకరణకు సిఎం ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఆదిలాబాద్ విమానాశ్రయానికి భూమి ఇచ్చేందుకు ముందుకు రాలేదని విమర్శించారు. నియోజక వర్గం అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా సిఎం ను కలుస్తానని చెప్పారు. చనాఖా- కొరాట ప్రాజెక్టుకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని, సోయాబీన్ పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ఆదిలాబాద్ కు యూనివర్శిటీ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని పాయల్ శంకర్ తెలియజేశారు.
special attention |ప్రచారం అదిరింది
special attention | ప్రచారం అదిరింది special attention | కమలాపూర్, ఆంధ్రప్రభ
MLA | కోడూరు, ఆంధ్రప్రభ : ప్రజాదర్బార్ కార్యక్రమం కోడూరు మండల పరిషత్
Plant Water |గుణాత్మక విద్యను అందించాలి
Plant Water | గుణాత్మక విద్యను అందించాలి ఉట్నూర్ ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ
77 DDO offices |డీడీఓ కార్యాలయాలతో అభివృద్ధి పరుగులు
77 DDO offices | డీడీఓ కార్యాలయాలతో అభివృద్ధి పరుగులు 77 DDO
Panchayat elections |ఎన్నికల్లో సత్తా చాటాలి
Panchayat elections | ఎన్నికల్లో సత్తా చాటాలి Panchayat elections | క్యాతనపల్లి,
అఖండ2 టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి..
నందమూరి బాలకృష్ణ-డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ2’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటకే ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రీయేట్ చేశారు మేకర్స్. ఈవాళ(డిసెంబర్ 4) రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇప్పటికే ఈ మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా అఖండ2 సినిమా టికెట్ రేట్ల పెంపుకు, ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోకు టికెట్ ధరను రూ.600గా నిర్ధారించింది. ఇక, సినిమా విడుదలైన రోజు నుంచి మూడు రోజులపాటు మల్టీప్లెక్స్ లకు రూ.100, సింగిల్ స్క్రీన్ లకు రూ.50 చొప్పున ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చెప్పింది.
Rs.600 crore |ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధికి బాటలు
Rs.600 crore | ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధికి బాటలు Rs.600 crore |
విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు #telugupost #vijayawada #demolitiondrive #latestnews #viralvideo
నా సితార్ విరిగిపోయింది.. ఎయిరిండియాపై కళాకారిణి ఫైర్ #AnoushkaShankar #AirIndia #Music #ViralVideo
విచిత్ర హామీ.. 'నా భార్యను గెలిపిస్తే ఫ్రీగా కటింగ్, షేవింగ్' #TeluguPost #telugu #post #news
Gold Rate |తగ్గిన పసిడి రేటు
Gold Rate | తగ్గిన పసిడి రేటు Gold Rate | వెబ్

22 C