SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి సీతక్కపై ఖర్గే ప్రశంసల జల్లు

మన తెలంగాణ / హైదరాబాద్ : కేరళలోని ఇడుక్కి జిల్లా ఏలప్పారలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కపై ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రశంసల వర్షం కురిపించారు. ఇడుపు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇడుక్కి జిల్లాలోని ఏలప్పార లొ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎస్‌టి సామాజిక వర్గానికి చెందిన సీతక్క తన కృషి, పట్టుదలతో ఎదిగిన గొప్ప నాయకురాలని ఆయన కొనియాడారు. సీతక్క ఒక గొప్ప ఫైటర్, హార్డ్‌వర్కింగ్ మహిళగా ఎప్పటికప్పుడు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఖర్గే పేర్కొన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పరితపిస్తూ, అడవుల్లో తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సేవలు అందిస్తున్న నాయకురాలని ఆయన అభినందించారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి కష్టసుఖాలను అర్థం చేసుకుని సేవ చేయడం సీతక్క ప్రత్యేకత అని ఖర్గే చెప్పారు. ఆమె సేవాభావం, నిబద్ధత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రిగా నియమించినట్లు ఆయన వెల్లడించారు.

మన తెలంగాణ 5 Apr 2026 8:27 pm

సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి : సిఎం రేవంత్ రెడ్డి

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి మన తెలంగాణ / హైదరాబాద్ : అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ జయంతి రోజున జరుపుకునే సమతా దివస్ సందర్భంగా, సమాజంలోని వివక్షతకు వ్యతిరేకంగా సమానత్వం, ఐక్యత, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి ని సిఎం కొనియాడు. కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, దళితుల హక్కుల కోసం వారు జీవితాంతం పనిచేశారని గుర్తు చేసుకున్నారు. బాబూజీ స్పూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల మేలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. సాంఘీక న్యాయయోధుడు జగ్జీవన్ రామ్ : గవర్నర్ నివాళి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగజీవన్ రామ్ ఒక మహోన్నత జాతీయ నాయకుడని, స్వాతంత్య్ర సమరయోధుడని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సాంఘిక న్యాయ యోధుడని ఆయన అభివర్ణించారు. సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రగతిశీల భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో దోహదపడిందని కొనియాడారు. న్యాయమైన, సమ్మిళిత, సమాజాన్ని నిర్మించడానికి తరతరాలకు స్ఫూర్తినిస్తూ, ఆయన వారసత్వం శాశ్వతంగా నిలిచిపోవాలని గవర్నర్ ఆకాక్షించారు. జగ్జీవన్‌రామ్ జీవితం మనందరికీ స్పూర్తిదాయకం : వివేక్ బాబు జగ్జీవన్‌రామ్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు అపారమైనవని కొనియాడారు. ఇందిరా గాంధీ కేబినెట్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రిగా కూడా ఆయన అద్భుతమైన సేవలు అందించారని, ఆయన స్ఫూర్తితో మనమందరం ముందుకు సాగుదామని అన్నారు. బిసి కమిషన్ ఘన నివాళి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాన్ని తెలంగాణ బిసి కమిషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బిసి కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాల లక్ష్మి ఇతర అధికారులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ జి.నిరంజన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి, బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసారని, ఆయన కూతురు మీరా కుమారి లోక్ సభ స్పీకర్ గా ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు ఆమోదానికి కృషి చేశారని తెలిపారు. ఆర్‌టిసి బస్ భవన్ లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు‘ ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆజన్మాంతం పని చేసిన ధీరుడు, భారత మాజి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ అని ఆర్‌టిసి అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం సంస్థ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబుజీ చేసిన కృషి చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆర్‌టిసి ఈడి సిహెచ్ .వెంకన్న అన్నారు. అధికారులు, సిబ్బంది బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీ భవన్‌లో జగ్జీవన్‌రామ్ జయంతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. పిసిసి మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు, కాంగ్రెస్ నేతలు కుమారరావు, మెట్టు సాయికుమార్, జగదీశ్వరరావు, సురేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మన తెలంగాణ 5 Apr 2026 8:14 pm

Anil Ravipudi confirms Krithi Shetty in his Next

From the past couple of weeks, there are rumors that Krithi Shetty is in talks to play one of the female leads in Anil Ravipudi’s upcoming directorial. She is paired up beside Kalyanram in the film. During the pre-release event of LIK, Anil Ravipudi himself confirmed the news. He said that the news was out […] The post Anil Ravipudi confirms Krithi Shetty in his Next appeared first on Telugu360 .

తెలుగు 360 5 Apr 2026 8:05 pm

తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సిబి.. విరాట్ ఔట్

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నైస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు ఆర్‌సిబిని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన ఆర్‌సిబి జట్టు నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే మ్యాట్ హెన్రీ వేసిన నాలుగో ఓవర్‌లో విరాట్ కోహ్లీ 16 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత అన్షుల్ కాంబోజ్ ఓవర్‌లో కోహ్లీ (28) శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పవర్‌ప్లే (ఆరు ఓవర్లు) ముగిసేసరికి ఆర్‌సిబి ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజ్‌లో సాల్ట్(20), పడిక్కల్ (3) ఉన్నారు.

మన తెలంగాణ 5 Apr 2026 8:03 pm

IPL Impacting Indian Cinema

The IPL 2026 has started recently and the cricket fever has gripped the nation. There is a heavy decline in the footfalls for the evening and night shows all over the country. On weekends as there are two matches, the IPL has been impacting the afternoon shows too. Biker and Rakasa released this weekend and […] The post IPL Impacting Indian Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 5 Apr 2026 8:00 pm

వ్యసనాలకు దూరంగా యువత క్రీడల్లో రాణించాలి

వ్యసనాలకు దూరంగా యువత క్రీడల్లో రాణించాలి తెలంగాణ రన్నర్స్ ప్రోమో రన్ విజయవంతంవెస్ట్

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:47 pm

దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పదినంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు

30 కోట్లతో కాచిగూడలో జగ్జీవన్ రామ్ భవన్ లోయర్ ట్యాంక్ బండ్ లో అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ నిర్మాణం జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మన తెలంగాణ / హైదరాబాద్ : జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు కేవలం స్మరణకే పరిమితం కాకుండా, దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పదినంగా మార్చాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సమానత్వం, న్యాయం, స్వాభిమానం అనే మహనీయుడు చూపిన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఆయన స్పష్టం చేశారు. జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రసంగిస్తూ, దళితులు, పేద, అణగారిన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం దళితుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని అన్నారు. జగ్జీవన్ రామ్ దళితుల గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని చెప్పారు. కాచిగూడ లోని నింబోలి అడ్డలో రూ. 30 కోట్లతో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను నిర్మిస్తున్నామని, లోయర్ ట్యాంక్ బండ్ లో పది అంతస్తులకు తగ్గకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అడ్లూరి వెల్లడించారు. అణగారిన వర్గాల పక్షాన నిలబడిన అరుదైన నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అభివర్ణించారు. అవకాశం లభిస్తే దళితుడు కూడా ఉన్నత నాయకత్వం చేపడతాడు అనే నమ్మకాన్ని ఆయన కార్యాచరణతో నిరూపించారని అన్నారు. రాజ్యాంగంలో ఎస్‌సి, ఎస్‌టిల హక్కులు, రిజర్వేషన్లు కాంగ్రెస్ దృక్పథంతోనే సాధ్యమయ్యాయని చెప్పారు. భూమి సంస్కరణలు, విద్యా అవకాశాల ద్వారా పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని వివరించారు. త్వరలో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు రాష్ట్రంలో ప్రజాపాలన పారదర్శకంగా సాగుతోందని, దళితుల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అనే సంకల్పంతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి అడ్లూరి తెలిపారు. సంక్షేమం మాత్రమే కాకుండా అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. దళిత విద్యార్థులకు ఉన్నత విద్యలో పూర్తి సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో రూ.100 కోట్లతో 10 అంతస్తుల అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. నిబ్మోలి గడ్డ హాస్టల్‌కు ఆధునిక సౌకర్యాలతో నూతన భవనం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తూ, మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు. సమాజంలో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరేలా కృషి చేస్తూ, వివక్షలేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ ఆశయాలకు దళిత ఐక్యతే మా బలం, సామాజిక న్యాయం కాంగ్రెస్ ధర్మం అంటూ నినాదాలు చేశారు. ప్రతి దళిత కుటుంబానికి గౌరవం, ప్రతి యువకుడికి అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జగ్జీవన్ రామ్ కలల భారతాన్ని తెలంగాణలో సాకారం చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, మాజీ పార్లమెంట్ సభ్యులు వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ, కౌన్సిల్ విప్ అద్దంకి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామెల్, నాగరాజు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ కాసిం, ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, జేబీ రాజు, మేడి పాపయ్య, ఉత్సవ కమిటీ నేతలు, పలువురు దళిత నాయకులు కార్యక్రమానికి హాజరై బాబు జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న ఆలపించిన గీతాలు ఆహుతులను ఉర్రూతలుగుంచాయి

మన తెలంగాణ 5 Apr 2026 7:43 pm

Iran Missile Strike : డ్రోన్ల ఫ్యాక్టరీ ధ్వసం Andhra Prabha News

Iran Missile Strike : డ్రోన్ల ఫ్యాక్టరీ ధ్వసం Andhra Prabha News

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:40 pm

జగ్జీవన్ రామ్ సేవలు స్ఫూర్తిదాయకం…

జగ్జీవన్ రామ్ సేవలు స్ఫూర్తిదాయకం… స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:40 pm

తండ్రిని హతమార్చిన తనయుడు..

తండ్రిని హతమార్చిన తనయుడు.. మందస(పలాస), ఆంధ్రప్రభ : పున్నామ నరకం నుండి కాపాడుతాడని,

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:34 pm

Thunderbolt |పిడుగు పడి…

Thunderbolt | పిడుగు పడి… Thunderbolt | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లాలోని

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:28 pm

రాణించిన పంత్.. హైదరాబాద్‌పై లక్నో ఘన విజయం

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఘన విజయం సాధించింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆఖరు వరకూ పోరాడి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్.. 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 156 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి లక్నో.. ఆరంభంలో దూకుడుగానే ఆడింది. మార్క్‌రం(45) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే మధ్య ఓవర్లలో లక్నో బ్యాటర్లని హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. ఓ వైపు వికెట్లు పడుతున్న పంత్(68) మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం ఉండగా.. పంత్ తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత రెండు డాట్‌బాల్స్ పడ్డాయి. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో 5 బంతిని కూడా ఫోర్‌గా మలిచి.. పంత్ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో లక్నో ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

మన తెలంగాణ 5 Apr 2026 7:27 pm

రేపు బిజెపి ఆవిర్భావ దినోత్సవం

కమలనాథులు చురుగ్గా పాల్గొనాలి ప్రతి ఇంటిపై జెండా రెపరెపలాడాలి పార్టీ చీఫ్ రాంచందర్ రావు పిలుపు మన తెలంగాణ/హైదరాబాద్‌: బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం (6న) పార్టీ శ్రేణులు పార్టీ నిర్దేశించిన వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని, ఇంటి యజమాని అనుమతితో వారి ఇంటిపై పార్టీ జెండా ఎగుర వేయాలని ఆయన సూచించారు. దీంతో జాతీయ గౌరవ భావన, ప్రజా భాగస్వామ్యం, పార్టీ పట్ల ప్రజల ఆత్మీయ అనుబంధం మరింత బలపడుతోంది. అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి ఎంతో సానుకూల స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకోనున్నారని ఆయన చెప్పారు. వేడుకలకు ముందు రోజే ప్రతి బూత్‌లో, ప్రతి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు ఇప్పటికే పార్టీ జెండాను ఆవిష్కరించడం ప్రారంభించి, పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం సంతోషకరమని అన్నారు. బిజెపి కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని జాతీయ సేవ, జాతీయత, క్రమశిక్షణ, ప్రజల పట్ల నిబద్ధత అనే విలువలతో ముందుకు సాగే ఒక మహత్తర జాతీయ ఉద్యమం అని పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త దేశం ముందు - పార్టీ తరువాత - స్వయం చివర అనే భావంతో, పార్టీ సిద్ధాంతాలను మరింతగా ప్రజలకు చేరువ చేసే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు. నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఆరు సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తమ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలవడం మనందరికీ గర్వకారణం అని ఆయన వివరించారు. గతంలో జనసంఘ్‌గా ప్రారంభమైన ఈ ప్రయాణం, 1980లో ముంబైలో అటల్ బిహారీ వాజపేయి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుని, తన సిద్ధాంత బలం, క్రమశిక్షణ గల కార్యకర్తల శ్రమ, జాతీయ సేవ పట్ల అచంచల నిబద్ధతతో ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని రాంచందర్ రావు వివరించారు. దేశంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చామని, అంతేకాక, రాబోయే కాలంలో కూడా మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రజలు నిర్ణయించుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రులైన తర్వాతనే భారత్ నిజమైన ఆర్థిక మార్పును, అభివృద్ధి యొక్క కొత్త యుగాన్ని చూడడం ప్రారంభించిందని ఆయన వివరించారు. వారిరువురి నాయకత్వం దేశానికి కొత్త దిశను చూపి, అభివృద్ధిని వేగవంతం చేసి, మరింత బలమైన, ఆత్మనిర్భరమైన, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి పునాది వేసిందని రాంచందర్ రావు తెలిపారు.

మన తెలంగాణ 5 Apr 2026 7:23 pm

బెంగళూరుపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై జట్టు ఈ మ్యాచ్‌లో అయినా విజయం సాధించాలని తాపత్రయ పడుతోంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. తుది జట్లు: సిఎస్‌కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీరె్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్. ఆర్‌సిబి: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడికల్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ.

మన తెలంగాణ 5 Apr 2026 7:15 pm

బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం

బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం జిల్లా కేడీసీసీ బ్యాంకు

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:14 pm

IPL 2026 : హైదరాబాద్ లో సన్ రైజర్స్ ఓటమి.. లక్నో కు విజయం

హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ పై ఓటమి పాలయింది

తెలుగు పోస్ట్ 5 Apr 2026 7:12 pm

ఇరాన్‌లో చిక్కుకున్న ఎఫ్-15 సిబ్బందిని రక్షించిన అమెరికా

స్పెషల్ ఫోర్సెస్, భారీ యుద్ధ విన్యాసాలతో అమెరికా ఆపరేషన్ న్యూఢిల్లీ: ఇరాన్‌లో కూలిన ఎఫ్-15 యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిని రక్షించేందుకు అమెరికా సైన్యం చేపట్టిన సాహసోపేత ఆపరేషన్‌పై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. వి గాట్‌హిమ్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ ఆపరేషన్‌లో డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, వందల సంఖ్యలో ప్రత్యేక దళాలు పాల్గొన్నట్లు సమాచారం. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాన్ని కూల్చివేయడంతో, అందులో ఉన్న ఇద్దరు సిబ్బందిలో పైలట్‌ను తక్షణమే రక్షించారు. అయితే వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ కనిపించకుండా పోవడంతో అతని కోసం అమెరికా విసృ్తత శోధనను ప్రారంభించింది. రెండో రోజు రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ మరుసటి రోజు ఉదయం ముగిసింది. అమెరికా సైన్యం ఈ ఆపరేషన్‌లో అత్యాధునిక యుద్ధ సామగ్రిని వినియోగించింది. హెచ్‌హెచ్-60 డబ్ల్యూ‘జాలీ గ్రీన్ II’ రక్షణ హెలికాప్టర్లు, ఎ-10 వార్థాగ్ దాడి విమానాలు, హెచ్‌సి-130 మిడ్‌ఎయిర్ ట్యాంకర్, ఎఫ్-35 స్టెల్త్ జెట్స్‌తో పాటు ప్రత్యేక ‘కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ’ దళాలు పాల్గొన్నాయి. శత్రు భూభాగంలో మిసైల్, రాడార్ ముప్పు మధ్య ఈ ఆపరేషన్ నిర్వహించడం గమనార్హం. మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారం, విమానం కూలిన వెంటనే ఇద్దరు సిబ్బంది తమ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా వారి స్థానాన్ని తెలియజేశారు. అమెరికా సైన్యం మొదటి పైలట్‌ను రక్షించగా, రెండో పైలట్ కోసం సీఐఏ ప్రత్యేక వ్యూహంతో శోధన చేపట్టింది. శత్రువులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ, అసలు స్థానం గోప్యంగా ఉంచింది. ఖచ్చితమైన సమాచారం అందిన వెంటనే ప్రత్యేక దళాలను ప్రవేశపెట్టి, తీవ్ర కాల్పుల మధ్య హెలికాప్టర్ల సహాయంతో రెండో పైలట్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఆపరేషన్‌లో కొంత ప్రతిఘటన ఎదురైందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ బలగాలు దాడి చేయడానికి ప్రయత్నించగా, అమెరికా యుద్ధవిమానాలు బాంబులు విసురుతూ, కాల్పులు జరిపి శత్రువులను దూరంగా ఉంచాయి. ఈ చర్యల మధ్యే రక్షణ కార్యాచరణ విజయవంతమైంది. రక్షించిన సిబ్బంది గాయపడినప్పటికీ ప్రాణాపాయం లేదని ట్రంప్ తెలిపారు. రెండో పైలట్‌ను గౌరవనీయ కల్నల్ అని పేర్కొంటూ, శత్రు ప్రాంతంలో ఉన్నప్పటికీ అతను ఒంటరిగా లేడు. 24 గంటలూ అతని కదలికలను మేము పర్యవేక్షించాం అని అన్నారు. అదేవిధంగా, రెండు వేర్వేరు సందర్భాల్లో శత్రు భూభాగంలో చిక్కుకున్న ఇద్దరు అమెరికా పైలట్లను విజయవంతంగా రక్షించడం సైనిక చరిత్రలో అరుదైన ఘటనగా ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రతిస్పందన మరోవైపు ఈ ఆపరేషన్‌పై ఇరాన్ విభిన్న వాదనలు చేసింది. అమెరికా రక్షణ చర్య విఫలమైందని, తమ బలగాలు ఒక సి-130 రవాణా విమానం, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేశాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొంది. ఇస్ఫహాన్ ప్రాంతంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని, కొందరు మరణించారని కూడా ఇరాన్ ఆరోపించింది. ఈ సంఘటనతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా తన వైమానిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని ప్రకటిస్తుండగా, మరోవైపు ఇరాన్ తీవ్ర ప్రతిదాడులకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా భద్రత, ఇంధన రంగాలపై ప్రభావం చూపే అవకాశముంది.

మన తెలంగాణ 5 Apr 2026 7:11 pm

పునరుద్దానుడైన యేసును ప్రకటిస్తున్నాం…

పునరుద్దానుడైన యేసును ప్రకటిస్తున్నాం… ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:11 pm

రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి వైసీపీ నే…

రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి వైసీపీ నే… విజయవాడ అభివృద్ధి నిరోధకులు దేవినేని అవినాష్

ప్రభ న్యూస్ 5 Apr 2026 7:08 pm

తహసీల్దార్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి

తహసీల్దార్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 5 Apr 2026 6:58 pm

సమాన హక్కుల కోసం కృషి చేసిన నేత‌ జగ్జీవ‌న్ రామ్‌

సమాన హక్కుల కోసం కృషి చేసిన నేత‌ జగ్జీవ‌న్ రామ్‌ సంగారెడ్డి ప్ర‌తినిధి,

ప్రభ న్యూస్ 5 Apr 2026 6:56 pm

గూడూరులో దొంగల ముఠా గుట్టు రట్టు…

గూడూరులో దొంగల ముఠా గుట్టు రట్టు… – ఆరుగురు అరెస్టు, భారీగా బంగారం

ప్రభ న్యూస్ 5 Apr 2026 6:52 pm

రాజనీతిజ్ఞుడు …భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్

రాజనీతిజ్ఞుడు …భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్118వ జయంతి

ప్రభ న్యూస్ 5 Apr 2026 6:49 pm

బాబుజికి ఘన నివాళులు…

బాబుజికి ఘన నివాళులు… పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని

ప్రభ న్యూస్ 5 Apr 2026 6:47 pm

దూకుడుగా ఆడుతున్న లక్నో.. విజయానికి చేరువలో..

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి చేరువ అవుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. పవర్‌ప్లేలో 53 పరుగులు రాబట్టింది. ఓపెనర్‌గా దిగిన మార్క్‌రమ్ 45 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి లక్నో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. లక్నో విజయానికి ఇంకా 42 బంతుల్లో 52 పరుగులు కావాల్సి ఉంది. క్రీజ్‌లో పంత్(31), పూరన్ (1) ఉన్నారు.

మన తెలంగాణ 5 Apr 2026 6:38 pm

అమెరికా యుద్ధ విమానాలను యుఎస్ఎనే ధ్వంసం చేసింది ఎందుకో తెలుసా?

రక్షణ ఆపరేషన్‌లో అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసం అవశేషాల ఫోటో విడుదల చేసిన ఇరాన్ వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్‌లో కూలిన అమెరికా యుద్ధవిమాన పైలట్‌ను రక్షించే ఆపరేషన్‌లో భాగంగా అమెరికా తన యుద్ధవిమానాలను తానే స్వయంగా ధ్వంసం చేసిందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన అవశేషాల చిత్రాన్ని ఇరాన్ విడుదల చేయగా, అమెరికాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఒక అమెరికా అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ రక్షణ చర్యలో రెండు ఎంసీ-130జె రవాణా విమానాలు పాల్గొన్నాయి. శత్రు ప్రాంతాల్లో రహస్యంగా ప్రవేశించి, సిబ్బందిని బయటకు తీసుకురావడానికి ఉపయోగించే ఈ విమానాలు ఆపరేషన్ సమయంలో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. దీంతో అవి ఇరాన్ చేతుల్లో పడకుండా ఉండేందుకు అమెరికా బలగాలు వాటిని పేల్చివేశాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్, ఈ ఘటనపై వ్యంగ్యంగా స్పందిస్తూ, ధ్వంసమైన విమానాల అవశేషాల ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇలాంటి విజయాలు ఇంకొన్ని సాధిస్తే అమెరికా పూర్తిగా నాశనం అవుతుంది అని వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్ వైమానిక రక్షణ దళాలు కూల్చివేసిన ఎఫ్-15ఇ యుద్ధవిమానంలో ఉన్న ఇద్దరు సిబ్బందిలో ఒకరిని ముందుగానే రక్షించగా, మిగిలిన పైలట్‌ను రాత్రి జరిగిన సాహసోపేత ఆపరేషన్‌లో అమెరికా సైన్యం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్‌ను ప్రశంసిస్తూ, మా సైన్యం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ రక్షణ చర్యను విజయవంతంగా పూర్తి చేసింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని పేర్కొన్నారు. వి గాట్ హిమ్! అంటూ ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ఇరాన్‌లోని పర్వత ప్రాంతాల్లో జరిగిన ఈ రక్షణ చర్యను ట్రంప్ చరిత్రలో అరుదైన సంఘటనగా అభివర్ణించారు. గాయాలపాలైన పైలట్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపారు. ఇక ఇజ్రాయెల్ కూడా ఈ ఆపరేషన్‌కు మద్దతుగా రహస్య సమాచారాన్ని అందించిందని సమాచారం. ఆ ప్రాంతంలో తమ దాడులను తాత్కాలికంగా నిలిపివేసి సహకరించినట్లు వెల్లడైంది. మరోవైపు ఈ ఆపరేషన్ సమయంలో అమెరికాకు మరింత నష్టం జరిగిందని ఇరాన్ పేర్కొంది. ఒక సీ-130 రవాణా విమానం, రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు సహా పలు యుద్ధ వాహనాలను ధ్వంసం చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. ఇప్పటివరకు ఈ యుద్ధంలో కనీసం ఏడు అమెరికా యుద్ధవిమానాలను కూల్చేశారని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. తాజా ఆరోపణలు నిజమైతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మన తెలంగాణ 5 Apr 2026 6:26 pm

Etala Rajender : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఈటల

బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.

తెలుగు పోస్ట్ 5 Apr 2026 6:19 pm

4 Us Aircraft Destroyed : పెంట‌గాన్ గూబ గుయ్ Andhra Prabha News

4 Us Aircraft Destroyed : పెంట‌గాన్ గూబ గుయ్ Andhra Prabha

ప్రభ న్యూస్ 5 Apr 2026 6:10 pm

బాబు జగ్జీవన్ రాంకు బీఆర్ ఎస్ నేతల నివాళి

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని చెరువు కట్ట వద్ద మాజీ

ప్రభ న్యూస్ 5 Apr 2026 6:03 pm

కడెంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

కడెం, ఆంధ్రప్రభ ; మండల కేంద్రమైన కడెంలో బృందావన్ రిసార్ట్ లో ఆదివారం

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:59 pm

ఏఐ ఉచిత శిక్ష‌ణ‌కు అనూహ్య స్పంద‌న‌..

ఏఐ ఉచిత శిక్ష‌ణ‌కు అనూహ్య స్పంద‌న‌.. గంట రవికుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు…సదస్సులో

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:58 pm

దేవున్‌పల్లి లో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు

దేవున్‌పల్లి లో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు భీమ్‌గల్‌ రూరల్

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:54 pm

హోర్ముజ్‌ జలసంధిని దాటిన మరో భారత నౌక

పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ మరో గుడ్ న్యూస్ అందిం

తెలుగు పోస్ట్ 5 Apr 2026 5:53 pm

పాలిటెక్నిక్ కళాశాలలో ‘పూర్వ విద్యార్థుల’ కోలాహలం!

పాలిటెక్నిక్ కళాశాలలో ‘పూర్వ విద్యార్థుల’ కోలాహలం! ఘనంగా గ్రాండ్ ఆలుమ్నీ మీట్ –

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:49 pm

అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ…

అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ… ఇకనైనా రాజకీయ నాటకాలు ఆపాలిరైతుల హక్కుల పరిరక్షణకు

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:46 pm

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. నేటి యువత బాబు జగ్జీవన్

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:46 pm

కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి..

ఆలేరు, ఆంధ్రప్రభ : భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 ఇందిరమ్మ

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:45 pm

ఆదుకున్న క్లాసెన్, నితీశ్.. ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లోక్న సూపర్ జెయింట్స్ బౌలర్లు చెలరేగిపోయారు. లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టుకు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టును షమీ కుదిపేశాడు. తొలి ఓవర్‌లో అభిషేక్‌ని, మూడో ఓవర్‌లో హెడ్‌ను ఔట్ చేశాడు. ఒక దశలో 26 పరుగులకే ఎస్‌ఆర్‌హెచ్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. ఈ దశలో జట్టును క్లాసెన్, నితీశ్ రెడ్డిలు ఆదుకున్నారు. వికెట్‌ని కాపాడుకుంటూనే.. పరుగులు రాబట్టారు. ఐదో వికెట్‌కి వీరిద్దరు కలిసి 116 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ భాగస్వామ్యానికి సిద్ధార్త్ బ్రేక్ వేశాడు. సిద్ధార్త్ బౌలింగ్‌లో నితీశ్ (56) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే క్లాసెన్(62) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. లక్నో బౌలింగ్‌లో షమీ, అవేశ్, ప్రిన్స్ చెరి రెండు, దిగ్వేశ్, సిద్ధార్త్ తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 5 Apr 2026 5:35 pm

Video: Kiran Abbavaram Round Table Interview

The post Video: Kiran Abbavaram Round Table Interview appeared first on Telugu360 .

తెలుగు 360 5 Apr 2026 5:30 pm

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. వివాహాల సీజన్ తో పెరిగిన భక్తుల రాక.రద్దీకి తగ్గట్లు

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:25 pm

కలెక్టర్‌ను కలిసిన డీహెచ్‌పీఎస్ నేత

కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను డీహెచ్‌పీఎస్

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:25 pm

Vemireddy : వైసీపీలో చేరబోం : వేమిరెడ్డి దంపతులు

తాము టీడీపిని వీడుతున్నట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని వేమిరెడ్డి దంపతులు అన్నారు

తెలుగు పోస్ట్ 5 Apr 2026 5:22 pm

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. ఘన నివాళులు

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. ఘన నివాళులు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:22 pm

సామాన్య భక్తుడే ముఖ్యం…

సామాన్య భక్తుడే ముఖ్యం… దుర్గమ్మ ఆలయ ఈవో వీకే శీనా నాయక్ విజయవాడ,

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:19 pm

పారిశ్రామిక వేత్త‌ల‌కు డైన‌మిక్ వేదిక‌.. ఫౌండ‌ర్స్ రూఫ్‌..

పారిశ్రామిక వేత్త‌ల‌కు డైన‌మిక్ వేదిక‌.. ఫౌండ‌ర్స్ రూఫ్‌.. ఒకేవైదిక‌పై ఫౌండర్స్, ఇన్వెస్టర్స్, క్రియేటర్స్‌ఒక

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:16 pm

నన్ను మెడలు పట్టి గెంటేశారు.. పార్టీలో మారే ప్రసక్తే లేదు: ఈటల

శామీర్‌పేట: మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. శామీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి తప్పు చేయకపోయినా మెడలు పట్టి బయటకు గెంటేసిన బిఆర్ఎస్‌ పార్టీలోకి మళ్లీ వెళ్తున్నానని పిచ్చి ప్రచారాలు చేస్తున్న వారికి చెబుతున్నా.. పార్టీలు మారే పరిస్థితి లేదు. పార్టీలు మారడం అంటే దుస్తులు మార్చినంత సుంభం కాదు’’ అని అన్నారు. ‘‘నన్ను ఎన్నో అవమానాలకు గురి చేస్తూ రాత్రికి రాత్రే బిఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేశారు. అధికాల బలంతో వ్యక్తిగతంగానూ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడేమో ఈటల పార్టీ మారుతున్నారని కరీంనగర్‌లో కొందరు పోస్టర్లు వేయడం, ఆరోపణలు చేయడం నాకు బాధ కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలు మారే పరిస్థితి రాదు’’ అని ఈటల పేర్కొన్నారు.

మన తెలంగాణ 5 Apr 2026 5:07 pm

ఉరుసులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్

ప్రభ న్యూస్ 5 Apr 2026 5:00 pm

బాధిత కుటుంబానికి 1.50 లక్షల ఎల్ఓసి అందజేత‌…

బాధిత కుటుంబానికి 1.50 లక్షల ఎల్ఓసి అందజేత‌… భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Apr 2026 4:59 pm

తాళ్ల పేట ముస్లిం మైనార్టీ నూతన కమిటీ ఎన్నిక

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని తాళ్లపేట ముస్లిం మైనార్టీ గ్రామ కమిటీని

ప్రభ న్యూస్ 5 Apr 2026 4:56 pm

ఐటీ, పారిశ్రామికరంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది: కెటిఆర్

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఆర్థిక వృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష అన్నారు. కొలంబియా బిజినెస్ స్కూలులో ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ముఖ్య అతిథిగా కెటిఆర్ హాజరయ్యారు. తెలంగాణ సాధించిన అద్బుత ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము అవకాశాల కోసం ఎదురు చూడలేదని, అద్భుతమైన పాలసీలు తయారు చేశామని తెలియజేశారు. మౌలిక సదుపాయాలు కల్పించామని, పెట్టుబడి దారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించామని, పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమని ప్రశంసించారు. ఐటీ, పారిశ్రామికరంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, ఐటీ ఎగుమతులు రూ.2.72 లక్షల కోట్లకు పెరగాయని కెటిఆర్ పేర్కొన్నారు. ఐటి ఉద్యోగుల సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరుకుందని, హైదరాబాద్ గ్లోబల్ ఐటి దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. అతిపెద్ద క్యాంపస్ ను అమెజాన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని, ఆవిష్కరణలకు చిరునామాగా తెలంగాణ మారిందని అన్నారు. 

మన తెలంగాణ 5 Apr 2026 4:41 pm

కేంద్ర మంత్రి అమిత్ షాకు.. తుమ్మల లేఖ.. దేని గురించంటే..

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని అందులో కోరారు. పాలనా సౌలభ్యం కోసం వీటిని భద్రాచలంలో కలపాలన్నారు. ఐదు గ్రామాలను కలిపితేనే గిరిజనుల సమస్యలు తొలగుతాయని పేర్కొన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే విలీనం బిల్లును ప్రవేశపెట్టేలా చూడాలని కోరారు.

మన తెలంగాణ 5 Apr 2026 4:38 pm

Us Pilot Rescued : అమెరికా ఫైల‌ట్ సేఫ్ Andhra Prabha News

Us Pilot Rescued : అమెరికా ఫైల‌ట్ సేఫ్ Andhra Prabha News

ప్రభ న్యూస్ 5 Apr 2026 4:19 pm

నాలుగు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో సన్‌రైజర్స్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో.. తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ జట్టుకు మహ్మద్ షమీ షాక్‌ మీద షాక్ ఇచ్చాడు. షమీ వేసిన మొదటి ఓవర్‌ చివరి బంతికి అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత షమీ వేసిన మూడో ఓవర్‌ తొలి బంతికి ట్రావిస్ హెడ్(7) పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ ఇషాన్ కిషన్(1) కూడా ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో లివింగ్‌స్టోన్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. కానీ, దిగ్వేష్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్(14) కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్‌హెచ్ 4 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజ్‌లో క్లాసెన్(4), నితీశ్(2) ఉన్నారు.

మన తెలంగాణ 5 Apr 2026 4:12 pm

పెంచిన మీసేవ చార్జీలను వెంటనే తగ్గించాలి…

పెంచిన మీసేవ చార్జీలను వెంటనే తగ్గించాలి… ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలపై బారం

ప్రభ న్యూస్ 5 Apr 2026 4:11 pm

Adivi Sesh’s Dacoit Trailer Strikes Hard

Adivi Sesh commands a massive following not only in Telugu states but across the Hindi belt as well, thanks to the sensational success of his Pan-India blockbuster Major. Now, he is gearing up for another nationwide outing with Dacoit, slated for release on the 10th of this month. After the teaser, songs, and posters made […] The post Adivi Sesh’s Dacoit Trailer Strikes Hard appeared first on Telugu360 .

తెలుగు 360 5 Apr 2026 4:10 pm

Will Vijay’s Nominations Be Valid After Affidavit Discrepancies?

Actor-turned-politician Vijay is facing scrutiny over discrepancies in his nomination affidavits for the Perambur and Tiruchi East constituencies in the Tamil Nadu Assembly elections. Election officials flagged variations between the two filings. His declared assets differ across documents. In one affidavit, he reported assets worth around ₹404 crore. In the revised details, the figure crosses […] The post Will Vijay’s Nominations Be Valid After Affidavit Discrepancies? appeared first on Telugu360 .

తెలుగు 360 5 Apr 2026 4:09 pm

పల్లెవెలుగు బస్సులో మంటలు.. తప్పిన ప్రాణనష్టం

అమరావతి: కడప జిల్లా వేంపల్లి మండలం వీరన్న గట్టపల్లె వద్ద పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తాకడంతో పల్లెవెలుగు బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై 21 మంది ప్రయాణికులు దిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.     

మన తెలంగాణ 5 Apr 2026 4:09 pm

Chandrababu Naidu Orders Crackdown on Illegal Entry of Fishermen

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has issued strict instructions to officials to curb the illegal entry of Tamil Nadu fishermen into the state’s coastal waters. The move comes amid rising tension in Nellore and Tirupati districts where local fishermen have raised serious concerns. The Chief Minister made it clear that such intrusions will […] The post Chandrababu Naidu Orders Crackdown on Illegal Entry of Fishermen appeared first on Telugu360 .

తెలుగు 360 5 Apr 2026 4:08 pm

భారీ బందోబస్తుతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

భారీ బందోబస్తుతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్

ప్రభ న్యూస్ 5 Apr 2026 4:07 pm

దళితుల గొంతుకగా నిలిచిన మహానుభావుడు జగ్జీవన్ రామ్

దళితుల గొంతుకగా నిలిచిన మహానుభావుడు జగ్జీవన్ రామ్ స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Apr 2026 4:01 pm

అంచలంచెలుగా ఎదిగిన బీజేపీ జన సంగ్ నుండి బీజేపీ వరకు..

అంచలంచెలుగా ఎదిగిన బీజేపీ జన సంగ్ నుండి బీజేపీ వరకు.. వికారాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:57 pm

బెంగాల్‌ను అంతం చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది: మమత

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌ను అంతం చేయడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.  ముర్షిదాబాద్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో దీదీ మాట్లాడుతూ.. అధికారులను బెదిరిస్తున్నారని, ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తున్నారని అన్నారు. మీకు దమ్ముంటే, బహిరంగంగా పోరాడండి అని ఫైరయ్యారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లను తొలగించే ప్రయత్నాలు ప్రజలను భయపెట్టడానికేనని ఆమె మండిపడ్డారు. టిఎంసి పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడతామని సిఎం మమత హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను నెమ్మదింపజేయడానికి సుమారు 500 మంది అధికారులను తొలగించారని ఆరోపించారు. మీరు నెల రోజుల పాటు పనులను ఆపవచ్చు, కానీ ఎన్నికల తర్వాత అన్నీ తిరిగి ప్రారంభమవుతాయి అని అన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతాయని ప్రజలకు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అన్ని మతాల ప్రజల కోసం పనిచేస్తుందని, విభజన రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోతే బెంగాలీ భాష, గుర్తింపు ప్రమాదంలో పడతాయని బెనర్జీ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదటి దశలో పురూలియా, బంకురా, ఝార్‌గ్రామ్, బీర్‌భూమ్, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్, జల్‌పైగురి, మాల్దాహా, ముర్షిదాబాద్, ఉత్తర, దక్షిణ దినాజ్‌పూర్, పశ్చిమ బర్ధమాన్, డార్జిలింగ్, కూచ్‌బెహార్, అలీపుర్‌దువార్, కాలింపాంగ్‌లలో ఎన్నికలు జరుగుతాయి. రెండవ దశలో తూర్పు బర్ధమాన్, నాడియా, ఉత్తర మరియు దక్షిణ 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, కోల్‌కతాలో ఎన్నికలు జరుగుతాయి.

మన తెలంగాణ 5 Apr 2026 3:57 pm

IPL Cricket |మూడు వికెట్లు కోల్పోయిన‌ హైద‌రాబాద్ జ‌ట్టు

IPL Cricket | మూడు వికెట్లు కోల్పోయిన‌ హైద‌రాబాద్ జ‌ట్టు IPL Cricket

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:56 pm

ఓటును దుర్వినియోగం చేయవద్దు…

ఓటును దుర్వినియోగం చేయవద్దు… అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అర్ల రమేష్ కడెం,

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:54 pm

ఉచిత ప్రయాణం.. మహిళలకు ఇబ్బందుల ప్రయాణమా?

మేడ్చల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మహాలక్ష్మి” పథకం

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:48 pm

సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి: సతీష్ రెడ్డి

కడెం, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:43 pm

విద్యుత్ తీగలు తగిలి మేకల కాపరి మృతి..

విద్యుత్ తీగలు తగిలి మేకల కాపరి మృతి.. యర్రావారిపాలెం ఆంధ్రప్రభ : మండల

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:22 pm

అట్టడుగు వర్గాల అభ్యున్నతే కూటమి ధ్యేయం…

అట్టడుగు వర్గాల అభ్యున్నతే కూటమి ధ్యేయం… ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ 119వ

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:16 pm

Mehreen Kaur Pirzada|పంజాబీ చిన్న‌ది.. భ‌ల్లే భ‌ల్లే..

Mehreen Kaur Pirzada| పంజాబీ చిన్న‌ది.. భ‌ల్లే భ‌ల్లే.. ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:15 pm

ఘనంగా జగ్జీవన్ రామ్‌ 119వ జయంతి..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్ముడు డాక్టర్ బాబు

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:14 pm

చిరువ్యాపారుల కోసం 5 కిలోల భారత్ గ్యాస్ సిలెండర్లు..

చిరువ్యాపారుల కోసం 5 కిలోల భారత్ గ్యాస్ సిలెండర్లు.. భవానీ గ్యాస్ అధినేత

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:14 pm

అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త…

అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త… మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:11 pm

సాంఘిక సంక్షేమ స్ఫూర్తి ప్ర‌దాత‌..

సాంఘిక సంక్షేమ స్ఫూర్తి ప్ర‌దాత‌.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయ‌న సేవ‌లు

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:10 pm

జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి: మాజీ ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, ఆంధ్రప్రభ : అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘ

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:10 pm

చలో.. ఆకివీడు పిలుపుతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం..

చలో.. ఆకివీడు పిలుపుతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం.. ఆకివీడు, ఆంధ్రప్రభ : ఆకివీడు

ప్రభ న్యూస్ 5 Apr 2026 3:08 pm

పవన్‌ మాజీ భార్యపై అసభ్య కామెంట్స్.. ఆరుగురు అరెస్ట్

అంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌పై సోష‌ల్ మీడియలె అసభ్యకర కామెంట్లు చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. సోషల్‌మీడియాలో రేణు దేశాయ్ చాలా యాక్టివ్‌ా ఉంటారు. తన గురించి.. తన పిల్లల గురించి.. పలు సామాజిక అంశాల గురించి ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే పలు సందర్భాల్లో ఆమెపై ట్ర్రోల్స్, అసభ్యకర కామెంట్లు వస్తుంటాయి. తాజాగా రేణు దేశాయ్‌పై అసభ్యకర సపదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా రేణు దేశాయ్ వెల్లడించారెు. పోలీసులకు ఆమె కృతజ్ఙతలు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ వీధి కుక్కల గురించి ఓ వీడియో పోస్ట్ చేశారు. వీధి కుక్కలను చంపడంపై ఆమె మండిపడ్డారు. 100 కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని.. మిగితా 90 కుక్కలు మంచివి ఉంటాయని పేర్కొన్నారు. ఆ 10 కుక్కల కోసం మిగితా 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. దీంతో ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.

మన తెలంగాణ 5 Apr 2026 2:35 pm

గొప్ప సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; దివంగత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్

ప్రభ న్యూస్ 5 Apr 2026 2:29 pm

Chandrababu : చంద్రబాబు హింట్ ఇచ్చారుగా.. ఇక సర్దుకోండి సార్లూ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పేశారు

తెలుగు పోస్ట్ 5 Apr 2026 2:26 pm

ఆకివీడులో విచిత్ర ఘటన

ఆకివీడులో విచిత్ర ఘటన ఆకివీడు, ఆంధ్రప్రభ : ఆకివీడు పట్టణంలో ఒక విచిత్ర

ప్రభ న్యూస్ 5 Apr 2026 2:25 pm

దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన తెరాస నాయకులు

బోధన్, ఆంధ్రప్రభ ; అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను బోధన్ మాజీ

ప్రభ న్యూస్ 5 Apr 2026 2:20 pm

సామాజిక న్యాయ సాధనకు జగ్జీవన్ రాం కృషి

సామాజిక న్యాయ సాధనకు జగ్జీవన్ రాం కృషి ఉమ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Apr 2026 2:17 pm

నాదర్ గుల్ లో మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ భూములను రక్షిస్తే, రేవంత్ ప్రభుత్వం వాటిని భక్షిస్తోందని ఫైరయ్యారు. హైదరాబాద్ నడిబొడ్డున రూ.7 వేల కోట్ల రూపాయల భూస్కాంకు తెరలేపారని.. దళితులు, బలహీన వర్గాల భూములు గద్దల్లా తన్నుకుపోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు చేయడం మొదలు పెట్టాడు. నాదర్ గుల్ భూముల్లో పొంగులేటి కొడుకు ఫెన్సింగ్ వేసి కబ్జా చేశాడు. హైదరాబాద్‌లోని లచ్చమ్మ కుంటను బడాబాబులు కబ్జా చేస్తుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కళ్ళు మూసుకున్నాడు. ఆ చెరువు కబ్జా దగ్గరికి నువ్వు పోతావా? మేము పోయి చూపించాలా?. పేదోళ్లను మాత్రమే అరెస్టులు చేస్తారా?.. బడాబాబులను అరెస్ట్ చేయడానికి రంగనాథ్‌కు చేతకావడం లేదా? అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 5 Apr 2026 2:15 pm

ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ 119వజయంతి వేడుకలు

ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ 119వజయంతి వేడుకలు బెజ్జంకి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Apr 2026 2:06 pm

వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండలంలోని వరి

ప్రభ న్యూస్ 5 Apr 2026 2:02 pm

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఊట్కూర్ పట్టణ అభివృద్ధి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఊట్కూర్ పట్టణ అభివృద్ధి. ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Apr 2026 1:59 pm

ధ్యానంతో ఒత్తిడిని జయించి ప్రశాంతంగా ఉండొచ్చు..

ధ్యానంతో ఒత్తిడిని జయించి ప్రశాంతంగా ఉండొచ్చు.. జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఊట్కూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Apr 2026 1:55 pm