SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

ఉన్మాది వికృత చేష్టలకు యువతి బలి

తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటుందనే అక్కసుతో ఓ ఉన్మాది వికృత చేష్టలకు ఓ యువతి బలవన్మరణానికి పాల్పిడింది. ఈ సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధి అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్న కందికొండ చిరంజీవి కుమార్తె రమణి (24)కి సమీప బంధువు వరుసకు బావ అయ్యే మనోహర్ (25)తో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో కొద్ది రోజులకు మనోహర్‌కు హెచ్‌ఐవీ ఉందని తెలియడంతో సదరు యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో మనోహర్ ఉన్మాదిగా మారాడు. తనను కాదని వేరే పెళ్లి చేసుకొని ఎలా ఆనందంగా ఉంటావంటూ ద్వేషం పెంచుకొని,గత సంవత్సరం మే నెలలో ఇంజెక్షన్ ద్వారా హెచ్‌ఐవీ రక్తం రమణికి బలవంతంగా ఎక్కించాడు. ఈ క్రమంలో యువతి అనారోగ్యానికి గురి కావండంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపించగా హెచ్‌ఐవీ అని నిర్ధారణ కావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మనోహర్‌ను ఆరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా నాటి నుంచి యువతి మనోవేధనకు గురైంది. దీంతో మనస్థాపంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి అమ్మానాన్న నన్ను క్షమించండి, మరో జన్మంటూ ఉంటే మీ కడుపున పుడతాను, చెల్లి, తమ్ముడు అమ్మానాన్నను మంచిగా చూసుకొండి అని లెటర్ రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రమణిని ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 10 Apr 2026 10:10 pm

కీలక బిల్లుతో కోడ్ ఉల్లంఘన..మోడీ సర్కారు తీరుపై సిడబ్లుసి నిరసన

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళా బిల్లు, చట్టసభలలో సీట్ల పెంపుదలకు కేంద్రంచర్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (కోడ్) ఉల్లంఘించడమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. శుక్రవారం ఇక్కడ ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) సమావేశంలో మాట్లాడారు. డిలిమిటేషన్‌తో నిమిత్తం లేకుండా మహిళా కోటా పెంపుదలకు, ఎంపీ స్థానాల పెంపుదలకు మోడీ ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18 వరకూ ప్రత్యేక సిట్టింగ్‌లకు దిగుతోంది. రాజ్యాంగ సవరణల బిల్లులను ఆదరాబాదరగా చేపట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. పైగా కోడ్ నేలరాయడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. కేంద్రం చర్యలను సంఘటితంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్థిష్ట వ్యూహం రూపొందించుకుంటుందని తెలిపారు. ఇప్పుడు సిడబ్లుసి సమావేశం కూడా ఈ దిశలోనే ఏర్పాటు చేశామని ఖర్గే వెల్లడించారు. శుక్రవారం నాటి సమావేశానికి ఖర్గే అధ్యక్షత వహించారు. పార్టీ ప్రముఖ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్, జై రాం రమేష్ ఇతరులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్నాటక సిఎం సిద్ధరామయ్య, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ , మాజీ స్పీకర్ మీరా కుమార్, అంబికా సోనీ, ఆనంద్ శర్మ కూడా హాజరయ్యారు. ఇంతకాలం మౌనంగా ఉంటూ వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు మహిళా రిజర్వేషన్లపై వేగం పెంచింది. అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణలను కూడా ఎటువంటి చర్చలకు అవకాశం లేకుండా చేసుకుని ఆమోదింపచేసుకునేందుకు పావులు కదుపుతోందని ఖర్గే ఆరోపించారు. ఈ చర్యలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని, ఇతర విపక్షాలతో కలిపి దీనిని ఎదుర్కొంటామని ప్రకటించారు. 

మన తెలంగాణ 10 Apr 2026 10:00 pm

మైనర్ బాలికపై మైనర్ బాలుడి లైంగిక దాడి

మైనర్ బాలికపై మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్‌స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక, తులసీరామ్ నగర్‌కు చెందిన మైనర్ బాలిక (13)కు ఇన్‌స్ట్రాగ్రామ్ రీల్స్ ద్వారా కాచిగూడ, గోల్నాక ప్రాంతానికి చెందిన బాలుడు పరిచయమయ్యాడు. మైనర్ బాలికతో స్నేహం పెంచుకొని ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడిని జువెనైల్ కోర్టులో హాజరు పరిచి జువెనైల్ హోమ్‌కు తరలించినట్లు ఇన్స్‌స్పెక్టర్ తెలిపారు.

మన తెలంగాణ 10 Apr 2026 9:52 pm

నగరంలో ఐబాకో నూతన బ్రాంచ్ ప్రారంభం

విశాలాంధ్ర – విజయవాడ (లబ్బీపేట) : నగరంలోని సీతారాంపురం కేపీ టవర్స్ లో ఐబాకో నూతన బ్రాంచ్ ను కెపి టవర్స్ ఏ బ్లాక్ అసోసియేషన్ సెక్రటరీ వి. రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో ఐబాకో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐబాకో కంపెనీ టీమ్ మెంబర్స్ శరత్, రమణ, కేపీ టవర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్ సిహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. The post నగరంలో ఐబాకో నూతన బ్రాంచ్ ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Apr 2026 9:48 pm

జననాయగన్‌కు పైరసీ దెబ్బ

 హీరో, టివికె నేత విజయ్ సినిమా జననాయగన్ విడుదలకు ముందే ఐదు నిమిషాల నిడివి సీన్లు లీక్ కావడం దుమారం రేపింది. ఆన్‌లైన్‌లో శుక్రవారం సినిమా క్లిప్స్ వాట్సాప్, టెలిగ్రామ్‌లలో కన్నించాయి. ఈ అంశంపై సినిమా నిర్మాతలు కెవిఎన్ ప్రోడక్షన్స్ వారు వెంటనే స్పందించారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే తమ సినిమాలోని కొన్ని సన్నివేశాలు బయటకు వచ్చాయని, వీటిని ఎవరో అక్రమంగా సేకరించి, దురుద్ధేశపూరితంగా ఆన్‌లైన్‌లో పెట్టారని, ముందు కొంత మేరకే లీక్ అయిందని అనుకున్నామని నిర్మాతల తరఫు న్యాయవాది విజయన్ సుబ్రమణ్యం తెలిపారు. అయితే సినిమా మొత్తానికి సంబంధించి లింక్‌లు తరువాత వెలుగులోకి వచ్చాయని స్పందించారు. ఈ పైరసి చర్యకు వ్యతిరేకంగా నిర్మాతలు చట్టపరమైన చర్యలకు దిగారు. కారకులు కొందరిని గుర్తించామని తెలిపారు. ప్రతి సినిమాను ఎంతో భావోద్వేగంతో తీస్తారని, వందలాది మంది సినీ కార్మికుల నెత్తురు చెమట చిందిస్తారని , దీనిని నీరుగార్చే ఈ విధమైన పైరసీలను నిలిపివేయాలని నటుడు శివకార్తికేయన్ తీవ్రంగా స్పందించారు. సినిమా నిర్మాతలు, పంపిణీదార్లు వెంటనే చెన్నైలోని ప్రాంతీయ సెన్సార్ అధికారితో మాట్లాడారు. తక్షణం ఈ అంశంపై స్పందించాలని కోరారు. కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖతో మాట్లాడేందుకు ఆయన అంగీకరించారని, క్లిప్పులు లింక్‌ల తొలిగింపునకు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ చిట్టచివరి చిత్రంగా ప్రచారం పొందిన ఈ సినిమా జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కావల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో సినిమా వాయిదాపడుతూ వచ్చింది. విడుదల కాని ఈ సినిమా సన్నివేశాల లీక్‌పై పలువురు చిత్రప్రముఖులు స్పందించారు. ఇటువంటి పైరసీలతో చిత్ర పరిశ్రమ దెబ్బతింటుందని అగ్రశ్రేణి నటులు, నిర్మాతలు, దర్శకులు, పంపిణీదార్లు విమర్శించారు. 

మన తెలంగాణ 10 Apr 2026 9:40 pm

ఎప్‌స్టీన్‌తో సంబంధాలు.. స్పందించిన మెలానియా ట్రంప్

వాషింగ్టన్‌లో వైట్ హౌస్‌లో గురువారం విడుదల చేసిన ప్రకటనలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారం అబ్బద్ధమని, అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. అలాగే ఆయన నేరాల గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను పూర్తి అసత్యాలుగా పేర్కొంటూ, ఇవి తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలని విమర్శించారు. నన్ను అవమానకర వ్యక్తి జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో అనుసంధానించే అబద్ధాలు ఇవాళ్టితోనే ముగియాలి. నా గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్న వారికి నైతిక విలువలు, వినయం, గౌరవం లేవు. వారి అజ్ఞానంపై నాకు అభ్యంతరం లేదు కానీ నా ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న వారి దుష్ప్రయత్నాలను నేను ఖండిస్తున్నాను అని మెలానియా ట్రంప్ పేర్కొన్నారు. వైట్ హౌస్‌లో స్వయంగా ప్రకటన చదివిన ఆమె, ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి అనుబంధం లేదని పునరుద్ఘాటించారు. న్యాయవాదులతో కలిసి ఈ నిరాధార ఆరోపణలను విజయవంతంగా ఎదుర్కొన్నాం అని తెలిపారు. ఇక ఎప్‌స్టీన్ కేసులో బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ, కాంగ్రెస్ ప్రజా విచారణ నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి మహిళకు తన కథను బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉండాలి. అప్పుడు మాత్రమే నిజం వెలుగులోకి వస్తుంది అని పేర్కొన్నారు. ఈ ప్రకటన, ఇటీవలి కాలంలో ఎప్‌స్టీన్ వివాదం తగ్గుముఖం పట్టిన వేళ వెలువడటం గమనార్హం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ వివాదం నుంచి బయటపడుతున్నట్టుగా కనిపిస్తున్న సమయంలో, మెలానియా వ్యాఖ్యలు మళ్లీ ఈ అంశాన్ని రాజకీయ చర్చల్లో ముందుకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. తనకు ఎప్‌స్టీన్ లేదా గిస్లేన్ మ్యాక్స్‌వెల్‌తో వ్యక్తిగత స్నేహం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే న్యూయార్క్, ఫ్లోరిడా ప్రాంతాల్లో సామాజిక వర్గాల్లో కొంత పరిచయం ఉన్నట్లు తెలిపారు. మ్యాక్స్‌వెల్‌కు పంపిన ఈ మెయిల్ సమాధానం సాధారణ మర్యాదపూర్వక స్పందన మాత్రమేనని, దానిని వేరే విధంగా అర్థం చేసుకోవడం సరికాదని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 10 Apr 2026 9:36 pm

Melania Fired : అయ్యో.. మెలానియా Andhra Prabha Top Story

Melania Fired : అయ్యో.. మెలానియా Andhra Prabha Top Story (

ప్రభ న్యూస్ 10 Apr 2026 9:06 pm

అత్యంత విలువైన అమెరికా డ్రోన్ అదృశ్యం

 హర్మూజ్ జలసంధిపై ప్రయాణిస్తున్న అత్యంత విలువైన అమెరికా నిఘా డ్రోన్ అకస్మాత్తుగా అదృశ్యం కావడం కలకలానికి దారి తీసింది. అత్యంత ఖరీదైనదిగా పేరున్న ఎంక్యూ-4సి ట్రైటన్ శుక్రవారంనాడు హర్మూజ్ గగనతలంలో కనిపించకుండా పోయింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికా-ఇరాన్ చర్చల వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం కలకలం రేపింది. పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలాలపై నిఘా కోసం బయలుదేరిన డ్రోన్ దాదాపు మూడు గంటల తరువాత కనిపించకుండా పోయింది. ఫ్లైట్ రాడార్24 డేటా ప్రకారం, ఈ డ్రోన్ మిషన్ తిరిగొస్తూ ఇరాన్ వైపు మళ్లింది. ఆ తరువాత కాసేపటికే ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ క్రమంలో కిందకు దిగిన డ్రోన్ రాడార్ స్క్రీన్‌లపై కనుమరుగైంది. డ్రోన్‌ను ఎవరైనా కూల్చేశారా? లేక మరేదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అన్న విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు 200 మిలియన్ డాలర్ల విలువైన ఈ డ్రోన్‌ను యూఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలోని గల్ఫ్ ప్రాంతంలో మోహరించారు. సముద్రజల్లాల్లో కీలక ప్రాంతాలపై ఎక్కువ సమయం పాటు నిఘా పెట్టేందుకు అమెరికా ఈ డ్రోన్‌ను వినియోగిస్తోంది. 

మన తెలంగాణ 10 Apr 2026 9:00 pm

యమునా నదిలో పడవ బోల్తా పడి 10 మంది మృతి..పలువురు గల్లంతు

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పెను విషాదం చోటు చేసుకుంది. బృందావన్ లోని యమునా నదిలో పడవ బోల్తా పడి, మునిగిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పడవలో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందిన యాత్రికులు ఉన్నారు. కేసీ ఘాట్ సమీపంలో రెండు డజన్లకు పైగా పర్యాటకులను తీసుకెళ్తున్న పడవ లోతైన నీటిలోకి వెళ్లిన సమయంలో తేలియాడుతున్న పాంటూన్‌ను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నీటి మట్టం పెరగడంతో అక్కడ ఉన్న పాంటూన్ వంతెనను తొలగించగా, కొన్ని పాంటూన్ డ్రమ్స్ నదిలోనే మిగిలిపోయాయి. వాటిలో ఒకదానిని పడవ ఢీకొట్టినట్లు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చంద్ర ప్రకాశ్ సింగ్ తొలుత ఆరుగురు మృతి చెందినట్లు వెల్లడించగా, అనంతరం మరిన్ని నాలుగు మృతదేహాలను రక్షక బృందాలు వెలికి తీయడంతో మృతుల సంఖ్య 10కు చేరిందని జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. ఇప్పటివరకు 16 నుంచి 17 మందిని సురక్షితంగా రక్షించాం. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది అని ఆయన తెలిపారు. బృందావన్ జాయింట్ హాస్పిటల్ వైద్యుల ప్రకారం మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సుమారు 50 మంది స్థానిక గజదళాలను కూడా గాలింపులో పాల్గొనిస్తున్నారు. స్థానిక డ్రైవర్ గులాబ్ తెలిపిన ప్రకారం ఇప్పటివరకు సుమారు 15 మందిని బయటకు తీశారు. ఈ యాత్రికులు పంజాబ్‌లోని లుధియానా, ముక్తసర్ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150 మంది భక్తుల బృందంలో భాగంగా బృందావన్‌కు చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం గాలివానల ప్రభావంతో పడవ ఒక్కసారిగా అదుపు తప్పి ఊగిసలాడింది. వేగం పెరగడంతో పాంటూన్ నిర్మాణాన్ని ఢీకొని తిరగబడింది. అయితే అధికారులు మాత్రం ఇటీవల తొలగించిన పాంటూన్ వంతెన అవశేషాలైన తేలియాడే డ్రమ్‌ను ఢీకొనడమే ప్రమాదానికి కారణమని తెలిపారు. పోలీసులు, జిల్లా అధికారులు సంయుక్తంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లోతైన ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం గజదళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మన తెలంగాణ 10 Apr 2026 8:50 pm

సిఎం చెప్పినట్లు టిపిసిసి నడుస్తుంది : జీవన్‌రెడ్డి

సిఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు టిపిసిసి నడుస్తుందని జీవన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి వల్ల అధిష్టానం కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుందని పేర్కొన్నారు. కెసిఆర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, ఆ సభకి కెసిఆర్‌ను ముఖ్య అతిథులుగా రావాలని విజ్ఞప్తి చేశానని, అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. తాను అధికార బిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్ళట్లేదని అన్నారు. పదవుల కోసమే బిఆర్‌ఎస్‌లోకి వెళ్లాలంటే తాను పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళేవాడిని అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు తాను బిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. రెండేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అని, ఇచ్చింది 17 వేల ఉద్యోగాలు మాత్రమే అని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని, రెండో సంవత్సరం లక్ష ఉద్యోగాలు అని ఇచ్చిన హామీ ఏమైంది..? అని ప్రశ్నించారు. ఈ రెండేళ్లు అయినా ప్రజాహితం కోసం పని చేయాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి పోవాలి.. కెసిఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో మొదలైందని అన్నారు.-

మన తెలంగాణ 10 Apr 2026 8:40 pm

అబిడ్స్‌లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తాం: కిషన్ రెడ్డి

హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మ గిరిజన వర్సిటీ-ఐఐటి హైదరాబాద్ మధ్య ఒప్పందం కుదిరింది. ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర గిరిజన వర్సిటీని ముందు మహబూబ్‌నగర్‌లో పెట్టాలనుకున్నామని.. కానీ కేంద్రం ములుగులోనే గిరిజన వర్సిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ ఏడాది ప్రధాని మోడీ గిరిజన వర్సిటీకి భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు. రెండు కేంద్ర సంస్థలు గిరిజన వర్సిటీకి సహకారం అందిస్తాయని అన్నారు. సమ్మక్క-సారలమ్మ యూనివర్సిటీ భవిష్యత్‌లో గొప్ప అభివృద్ధి సాధిస్తుందని.. గిరిజనులకు కావాల్సిన ఆధునిక సాంకేతికతను అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అబిడ్స్‌లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కేంద్రం రూ.24 వేల కోట్లతో అభివృద్ధి చేస్తుందని అన్నారు. 

మన తెలంగాణ 10 Apr 2026 8:26 pm

మద్యం తాగి పట్టుబడితే వాహనం సీజ్ చేయవద్దు: హైకోర్టు

రాష్ట్ర హైకోర్టు వాహనదారులకు ఊరటనిచ్చేలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. తనిఖీల్లో ఎవరైనా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే, పోలీసులు వారి వాహనాన్ని సీజ్ చేయకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికినంత మాత్రాన మోటారు వాహనాల చట్టం కింద వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. డంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లపై దాఖలయిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ ఈవి వేణుగోపాల్‌రావు ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం తాగి ఉన్నట్లు నిర్ధారణ అయితే, ఆ సమయంలో అతనితో పాటు ఉన్న మద్యం తాగని స్నేహితులకు లేదా బంధువులకు వాహనాన్ని అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ అక్కడ ఎవరూ లేని పక్షంలో సదరు వ్యక్తికి సంబంధించిన బంధువులు లేదా స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించి వాహనాన్ని వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఒకవేళ ఎవరూ వాహనం తీసుకెళ్లడానికి రాకపోతే మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది. నిబంధనల ప్రకారం డ్రైవర్‌పై చలానా వేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం మాత్రమే చేయాలని, వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించకూడదని ధర్మాసనం తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అంటూ రోడ్డుపై వాహనాలను నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని, చట్టం పరిధిలో ఉన్న అధికారాలను మాత్రమే వినియోగించుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే మద్యం తాగుతూ వాహనాలు నడిపి పట్టుబడిన అనేక సందర్భాల్లో పోలీసులు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనం సీజ్ చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారనే వాదనల నేపథ్యంలో హైకోర్టు ఈ స్పష్టత ఇచ్చింది.

మన తెలంగాణ 10 Apr 2026 8:25 pm

పాకిస్థాన్‌లో హై అలర్ట్

 ఇరాన్, అమెరికా మధ్య శనివారం నాటి శాంతిచర్చలకు ఆతిధ్య వేదిక అయిన పాకిస్థాన్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఇస్లామాబాద్‌లోనే కాల్పుల విరమణ చర్చలు జరుగుతాయి. దీనితో విదేశీ దౌత్యకార్యాలయాలు, దేశ పార్లమెంట్, ఇతర దేశాల ఆపీసులు, విలాసవంతమైన హోటల్స్ ఉండే రెడ్‌జోన్‌లో హై అలర్ట్ ప్రకటించారు. వాహనాల రాకపోకలను నియంత్రించారు. రెండు రోజులుగా ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో పలు కీలక మార్గాలు దాదాపుగా నిర్మానుష్యం అయ్యాయి. న్రభుత్వ భవనాలు, కీలక రహదారుల్లో కట్టుదిట్టమైన పహారా ఉంది. పూర్తి తనిఖీల తరువాత కానీ పౌరుల కదలికలకు వీల్లేని పరిస్థితి ఉంది. దీనితో జనం విసుగెత్తారు. శాంతిచర్చలకు యుద్ధ వాతావరణం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్చలకు పాకిస్థాన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. చర్చలు ఫలిస్తే అంతర్జాతీయంగా పాకిస్థాన్ ప్రతిష్ట పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇస్లామాబాద్ , ఇతర చోట్ల గురువారం నుంచే కార్యాలయాలకు సెలువులు ప్రకటించారు. ఇప్పటి చర్చలకు అమెరికా తరఫున వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ సారధ్యంలో ఒక బృందం హాజరు కానుంది. ఈ బృందం ఇప్పటికే ఇస్లామాబాద్‌కు బయలుదేరింది. ఇందులో ప్రత్యేక దూత స్టీవ్ వాట్కిఫ్, సీనియర్ సలహాదారు జెర్డ్ కుష్నేర్ ఉంటారని వెల్లడైంది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ ఇస్లామాబాద్‌కు బయలుదేరారనే పాకిస్థాన్ వార్తలను ఇరాన్ ఖండించింది. వారు టెహరాన్‌లోనే ఉన్నారని , తొందరపాటు వార్తలు తగవని హితవు పలికింది. అయితే అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇరాన్ ప్రతినిధి బృందం దాదాపుగా పాకిస్థాన్ చేరుకుందని చెపుతున్నాయి. పది అంశాలపై ఇరాన్ పట్టు .. లెబనాన్‌పై యుద్ధం ఇజ్రాయెల్ బెట్టు అతికష్టంమీద చర్చలకు పాకిస్థాన్ మార్గం కల్పించినా, ఇవి వైరిపక్షాల వైఖరితో డోలాయమానంగానే మారాయి. కాల్పుల విరమణ ప్రాతిపదికగా తాము వెలువరించిన పది అంశాలపై నిర్థిష్టంగా అమెరికా ప్రతినిధి బృందం చర్చకు రావాల్సిందే అని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇక హెజ్‌బోల్లాపై తమ దాడులను ఆపేది లేదని, ఈ చర్చలకు వీటికి సంబంధం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అయితే తమ మిత్రపక్షం అయిన హెజ్‌బోల్లాపై దాడులను సహించేది లేదని, వాటిని నిలిపివేయాల్సిందే అని ఇరాన్ అధికార వర్గాలు స్పష్టం చేశాయి. లెబనాన్ అంశమే కీలకం లెబనాన్ అంశమే ఇప్పుడు కాల్పుల విరమణకు కీలక విషయం అయింది. పూర్తి స్థాయిలో శాంతిస్థాపన జరగాలంటే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా నిలిచిపోవాలని ఇరాన్ చెపుతోంది. అయితే ఇజ్రాయెల్ ఈ లింక్ కుదరదని స్పష్టం చేస్తోంది. ఇప్పటి కాల్పుల విరమణ ప్రక్రియకు హెజ్‌బోల్లాపై తమ దేశ దాడులకు ఎటువంటి సంబంధం లేదని నెతన్యాహూ ముందు తెలిపినా తరువాత లెబనాన్‌తో చర్చలకు అమెరికా వేదికగా అంగీకరించారు. ఇక మధ్యవర్తిగా పాకిస్థాన్ ఉండటంపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. పాక్ మధ్యవర్తిత్వాన్ని తమ దేశం అంగీకరించేది లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ ఇజ్రాయెల్‌ను దుష్టశక్తి, మానవాళికి శాపం అని తిట్టిపోస్తూ వ్యాఖ్యలకు దిగడం తరువాత వీటిని ఉపసంహరించుకోవడం కీలక పరిణామాలు అయ్యాయి. ఇజ్రాయెల్ పట్ల పాకిస్థాన్ ద్వేషం ఏమిటనేది తెలిసిందని, ఇక ఈ దేశ మధ్యవర్తిత్వాన్ని తాము ఏ విధంగా అంగీకరిస్తామని నిరసనకు దిగారు. ఇక శాంతి చర్చల్లో పాకిస్థాన్ ఏ మేరకు సమతూకత పాటిస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. తటస్థదేశంగా వ్యవహరించగలదా? చర్చలలో ఏదో ఒక పక్షం వైపు మొగ్గుచూపుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 

మన తెలంగాణ 10 Apr 2026 8:20 pm

Sahu Garapati delivers a 100 cr blockbuster in Malayalam

Telugu Producer Sahu Garapati is making massive waves across the South Indian film industry, adding a monumental achievement to his growing portfolio. His latest Malayalam production, Vaazha 2, has struck gold at the box office, grossing over ₹100 crore worldwide in just seven days. Backed by his renowned banner, Shine Screens, this blockbuster further cements […] The post Sahu Garapati delivers a 100 cr blockbuster in Malayalam appeared first on Telugu360 .

తెలుగు 360 10 Apr 2026 8:17 pm

ఐపిఎల్‌ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

గౌహతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బర్సాపరా స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ వేయడం ఆలస్యమైంది. అయితే వర్షం తగ్గు ముఖం పట్టడంతో 8.15 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఆడిన మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయిట్ల టేబుల్‌లో మొదటి స్థానం దక్కించుకొనే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ ఒక మార్పు చేసింది. తుషార్‌కి విశ్రాంతి ఇచ్చి.. బ్రిజేష్‌ని జట్టులోకి తీసుకుంది. ఆర్‌సిబి కూడా ఒక మార్పు చేసింది. డఫ్ఫీ స్థానంలో హేజిల్‌వుడ్‌ని జట్టులోకి తీసుకుంది. అయితే టాస్ జరిగిన వెంటనే మళ్లీ వర్షం తిరిగి ప్రారంభమైంది. దీంతో అభిమానులు నిరాశ గురవుతున్నారు. తుది జట్లు: ఆర్ఆర్: యశస్వీ జైస్శాల్, ధృవ్ జురెల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, డానొవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ. ఆర్‌సిబి: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేశ్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్.

మన తెలంగాణ 10 Apr 2026 8:14 pm

రాజ్యసభ సభ్యులుగా నితీష్ ప్రమాణం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. ఎగువసభ ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ చాంబర్‌లో సంక్షిప్తంగా జరిగిన కార్యక్రమంలో నితీష్‌తో ప్రమాణం చేయించారు. దీనితో బీహార్‌లో రెండు దశాబ్దాల ఆయన పాలన ముగుస్తుంది. రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి రాకకు దారి ఏర్పడింది. నితీష్ హిందీలో ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రి, రాజ్యసభ నేత జెపి నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్‌ఠాకూర్, న్యాయ వ్యవహారాల సహాయ మంత్రి రామ్ మేఘ్వాల్ సమక్షంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా హాజరయ్యారు. పలువురు నేతలు నితీష్‌ను ఈ సందర్భంగా అభినందించారు. ఆ తరువాత నితీష్ వెలుపలికి వచ్చి, అక్కడున్న విలేకరులతో మాట్లాడారు. తాను గతంలో లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌కు వచ్చిన సందర్భం గుర్తుకు వస్తోందన్నారు. తరువాత పాత పార్లమెంట్ భవనంలోకి వెళ్లి, కొద్ది సేపు తన మునుపటి సీట్లో కూర్చునివెళ్లారు. బీహార్‌లో కొత్త ముఖ్యమంత్రిని ఎంపికచేసుకునేందుకు ఎన్‌డిఎ శాసనసభాపక్షం ఈ నెల 14న సమావేశం అవుతుంది. దీనితో ఇన్నేళ్ల నితీష్ పదవీకాలం గత పుటల్లోకి వెళ్లుతుంది. పార్లమెంట్ ఎగువ సభకు ఎన్నిక కాగానే మార్చి 30వ తేదీన నితీష్ కుమార్ బీహార్ ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి నిర్ణయాలలో భాగంగానే జెడియు అధినేత అయిన నితీష్‌ను సిఎం పదవి నుంచి జాతీయ రాజకీయాలలోకి తీసుకువెళ్లేందుకు తప్పించినట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఆయన మార్చి 16న రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయనకు కేంద్రంలో ఏదైనా పదవి ఉంటుందని జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతోంది.

మన తెలంగాణ 10 Apr 2026 8:10 pm

రియల్ మాఫియా అడ్డాగా కాంగ్రెస్ సర్కార్: సబితా ఇంద్రారెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ మాఫియాకు అడ్డాగా మారిందంటూ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నాదర్‌గూల్ భూములపై ప్రభుత్వం కుట్రలు చేస్తున్నందంటూ ఆమె మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్‌ఎస్ బృందం జిల్లా కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని కలసి నాదర్‌గూల్ భూ వ్యవహారంపై అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నాదర్‌గూల్ సర్వే నెంబర్ 613లో గల 373 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కబ్జాకు గురవుతోందంటూ వారు ఫిర్యాదు చేశారు. సదరు భూమిని పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సబిత మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్‌గూల్ రెవెన్యూ పరిధిలోని 613 సర్వే నెంబర్‌లో గల 373 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదని గతంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. హైకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తూ కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతోనే కొందరు అక్రమార్కులు ఈ భూములను కబ్జా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సుమారు 600 మంది రైతులు మూడు నాలుగు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న ఈ భూముల్లో రౌడీలు, గూండాలను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నేతలు దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారంటూ ఆమె ఆరోపించారు. పేదోళ్ల గుడిసెలపై బుల్డోజర్‌లతో విరుచుకుపడే హైడ్రాకు రూ.7 వేల కోట్ల విలువ చేసే 373 ఎకరాల భూమి కబ్జాకు గురవుతున్నా కన్పించడం లేదా అంటూ ఆమె మండిపడ్డారు. గతంలో చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్‌ల హయాంలో ప్రభుత్వ భూములను పరిరక్షించే యత్నం జరిగిందని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి భూ దోపిడీకి తెరతీశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ మాఫియా బౌన్సర్లు, గూండాలను అడ్డుపెట్టి రైతులను బెదిరించి బ్లూ షీట్స్ వేసి కండ్లముందే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూములు ప్రభుత్వానివా లేక ప్రైవేటువా అన్న విషయం తక్షణమే నిగ్గుతేల్చాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ భూములను కబ్జా చెర నుంర విడిపించేంతవరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య, పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు క్యామ మల్లేష్, గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ కర్నాటి రమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 10 Apr 2026 8:00 pm

నోట్ల కట్టల వ్యవహారం.. జస్టిస్ యశ్వంత్‌వర్మ రాజీనామా

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆయన, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. గత ఏడాది ఢిల్లీలోని ఆయన నివాసంలో కాలిపోయిన కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన ఘటన తర్వాత ఆయనను తొలగించేందుకు అభిశంసన ప్రక్రియకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటన 2025 మార్చి 14న హోలీ పండుగ రాత్రి సుమారు 11:35 గంటలకు లూటియన్స్ ఢిల్లీలోని న్యాయమూర్తి వర్మ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన సమయంలో భారీ మొత్తంలో నగదు నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది. ఆ సమయంలో వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. ఏప్రిల్ 9న రాష్ట్రపతికి పంపిన లేఖలో 57 ఏళ్ల వర్మ, గాఢమైన మనోవేదనతో ఈ రాజీనామాను సమర్పిస్తున్నాను. ఈ పదవిలో సేవ చేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. తన నిర్ణయానికి గల కారణాలను వివరించాల్సిన అవసరం లేదని కూడా లేఖలో తెలిపారు. వర్మ రాజీనామాతో ఆయనను పదవి నుండి తొలగించేందుకు చేపట్టిన అభిశంసన ప్రక్రియ ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి ముందు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్యలతో కూడిన మూడు సభ్యుల కమిటీ విచారణ నిర్వహిస్తోంది.ఈ కేసులో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు న్యాయమూర్తుల ప్రతికూల నివేదికల అనంతరం అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఇచ్చిన రాజీనామా సలహాను వర్మ తిరస్కరించారు. దీంతో ఖన్నా రాష్ట్రపతికి లేఖ రాసి అభిశంసన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం వర్మను ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించిన అభిశంసన తీర్మానాన్ని, దర్యాప్తు కమిటీ చెల్లుబాటు అంశాన్ని సవాలు చేస్తూ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జనవరి 16న తిరస్కరించింది. పార్లమెంటరీ ప్రక్రియను అడ్డుకునేందుకు చట్టంలోని నిబంధనలను ఉపయోగించలేమని స్పష్టం చేసింది. గత ఏడాది ఆగస్టు 12న బహుళ పార్టీల మద్దతుతో ఆయనను తొలగించే తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. 2025 మార్చి 22న సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో వర్మ నివాసంలో నగదు నిల్వలపై అంతర్గత విచారణ నివేదికను, అసాధారణ చర్యగా ఫొటోలు, వీడియోలతో సహా ప్రచురించింది. అదే రోజు అప్పటి సీజేఐ ఖన్నా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, తనపై వచ్చిన ఆరోపణలను వర్మ ఖండించారు. నా కుటుంబ సభ్యులు లేదా నేను ఎప్పుడూ స్టోర్‌రూమ్‌లో నగదు ఉంచలేదు. ఆ నగదు మాకు సంబంధించినదని చెప్పడం పూర్తిగా తప్పుడు ఆరోపణ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే విచారణ కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయినా అత్యున్నత న్యాయస్థానంలోనూ ఆయనకు ఊరట దక్కలేదు. సుప్రీం ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇక అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి లేఖలు రాశారు. జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని చేశారు. ఈ రాజీనామాతో అభిశంసన ప్రక్రియ ముగిసిపోతుందని లోక్‌సభ సెక్రటేరియట్‌వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

మన తెలంగాణ 10 Apr 2026 7:50 pm

బెంగాల్ ఎన్నికలు: బిజెపి మ్యానిఫెస్టో విడుదల

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ ఎన్నికల హామీలను ప్రజల ముందుంచారు. కోల్‌కతాలో శుక్రవారం విడుదల చేసిన పార్టీ సంకల్ప పత్రాన్ని ఆయన స్పష్టమైన సిద్ధాంతాత్మక అజెండాగా మలుస్తూ, ఆరు నెలల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, బెంగాల్ కుమారుడునే ముఖ్యమంత్రిగా నియమించడం, రాష్ట్రంలో రామ రాజ్యం స్థాపన వంటి హామీలను ప్రకటించారు. సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బెంగాల్‌లో ప్రతి పౌరుడికి ఒకే చట్టం ఉంటుంది అని షా స్పష్టం చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన విమర్శలకు సమాధానంగా, ఇది బీజేపీ ఆలోచన కాదని, రాజ్యాంగ సభ సిఫారసు అని తెలిపారు. ప్రతి పౌరుడిని మతం ఆధారంగా కాకుండా సమానంగా చూడాలన్నది రాజ్యాంగ సూత్రం. ఒకరికి నాలుగు పెళ్లిళ్లు, మరొకరికి ఒక్కటి అనుమతించడం సమానత్వమా? అని ప్రశ్నించారు. బెంగాల్‌లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు స్పందిస్తూ, తమ పార్టీ వంశపారంపర్య రాజకీయాలకు దూరమని షా పేర్కొన్నారు. దీదీ తర్వాత ఆమె మేనల్లుడు నాయకుడవుతాడనే విధానం మా వద్ద లేదు అని అభిషేక్ బెనర్జీపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి బెంగాల్‌కు ముఖ్యమంత్రి బెంగాల్‌కు చెందినవారే అవుతారు. ఆయనకు పరిపాలనా సామర్థ్యం, అర్హత ఉండాలి అని తెలిపారు. రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి నడిపించాలనే ఆరోపణలను ఖండిస్తూ, బెంగాల్‌ను ఢిల్లీ నుంచి పాలించం. కానీ ఢిల్లీ నుంచి పాలించడం కన్నా బంగ్లాదేశ్ ప్రభావం ఉండటం మరింత ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ చొరబాటుదారుల అంశం మరోసారి ముందుకు వచ్చింది. చొరబాటుదారులు, శరణార్థుల మధ్య తేడాను స్పష్టం చేస్తూ, భారత పౌరులు కాని వారే చొరబాటుదారులు. వారిని బయటకు పంపిస్తాం. శరణార్థులకు పౌరసత్వం ఇస్తాం అని షా తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చొరబాటుదారులపై వైట్ పేపర్ విడుదల చేస్తామని కూడా చెప్పారు. ఇక టీఎంసీ నేత అఖిల్ గిరి చేసిన రామ రాజ్యం అవసరం లేదు అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, రామ రాజ్యం అంటే మంచి పరిపాలన. స్వాతంత్య్ర సమర కాలంలో మహాత్మా గాంధీ కూడా ఇదే పాలనను ప్రస్తావించారు అని షా పేర్కొన్నారు.

మన తెలంగాణ 10 Apr 2026 7:37 pm

పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలను అత్యంత అనుచితమైనవిగా అభివర్ణిస్తూ, శాంతి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకునే దేశం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆందోళనకరమని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందిస్తూ, ఇజ్రాయెల్ నాశనం కావాలని పాకిస్తాన్ రక్షణ మంత్రి పిలుపునివ్వడం అంగీకారయోగ్యం కాదు. ముఖ్యంగా శాంతి కోసం తటస్థ మధ్యవర్తిగా నిలుస్తున్నట్లు చెప్పుకునే ప్రభుత్వ ప్రతినిధి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అసహ్యం అని పేర్కొంది. ఈ ప్రకటన గురువారం సాయంత్రం వెలువడింది.అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలికంగా రెండు వారాల కాలపరిమితి ఉన్న కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన దేశంగా పాకిస్తాన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో, రాబోయే వారాంతంలో శాంతి చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతోంది. అయితే, ఇదే సమయంలో ఆసిఫ్ సోషల్ మీడియాలో ఇజ్రాయెల్‌ను దుష్ట దేశం, మానవాళికి శాపంగా అభివర్ణిస్తూ, యూరోపియన్ యూదులను తొలగించాలని పిలుపునిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ లెబనాన్‌లో జన సంహారం జరుగుతోందని ఆసిఫ్ ఆరోపించారు. నిరపరాధ పౌరులు హతమవుతున్నారు. గాజా తర్వాత ఇరాన్, ఇప్పుడు లెబనాన్క్త్రపాతం ఆగకుండా కొనసాగుతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. పాలస్తీనా భూమిలో యూదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన వారిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ ఖండించారు. శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు చెప్పుకునే ప్రభుత్వ ప్రతినిధి నుంచి వచ్చిన ఈ వ్యతిరేక వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవి అని అన్నారు. ఇజ్రాయెల్ తన వినాశనాన్ని కోరుకునే ఉగ్రవాద శక్తుల నుంచి తనను తాను రక్షించుకుంటుంది అని ఆయన స్పష్టం చేశారు.

మన తెలంగాణ 10 Apr 2026 7:35 pm

ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల

 రాష్ట్రంలో ఆదివారం(ఏప్రిల్ 12) ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇంటర్ ఫలితాల సమయం, వేదిక శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. అయితే గతంతో పోలిస్తే ఈ సారి అత్యంత వేగంగా బోర్డు ఫలితాలను విడుదల చేయనుంది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసే లక్ష్యంతో మార్చి మొదటి వారం నుంచే బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసింది. గతంలో సాధారంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలు చేసేవారు. ఈసారి మాత్రం గతంలో కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఈసారి త్వరగా అడ్వాన్స్‌డ్ పరీక్షలు ఇంటర్ ఫలితాలు ఈసారి త్వరగా విడుదల చేస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు త్వరగా నిర్వహించి విద్యాసంవత్సరం ప్రారంభం లోపే ఫలితాలు ప్రకటించనున్నారు. తద్వారా ఇంటర్ తర్వాత ప్రవేశాలు పొందే ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ కోర్సులలో విద్యార్థులు సకాలంలో ప్రవేశాలు పొందనున్నారు.

మన తెలంగాణ 10 Apr 2026 7:29 pm

‘వైశాఖి’ వేడుకలకు కెటిఆర్‌కు ఆహ్వానం

 అమీర్‌పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్ - ‘వైశాఖి’ వేడుకలకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను గురుద్వారా ప్రతినిధులు ఆహ్వానించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అమీర్‌పేట్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ ఎస్.దర్శన్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం శనివారం కెటిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వేడుకల ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ సందర్భంగా మంగళవారం(ఏప్రిల్ 14) మధ్యాహ్నం 1.30 గంటలకు అమీర్‌పేట్‌లోని గురు గోవింద్ సింగ్‌జీ మల్టీపర్పస్ స్పోర్ట్ కాంప్లెక్స్ (మున్సిపల్ ప్లే గ్రౌండ్స్)లో జరగనున్న ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరారు.పంజాబ్‌కు చెందిన ప్రముఖ మత ప్రచారకుల చేత గుర్బానీ కీర్తనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, ఈ వేడుకలకు సుమారు 8,000 నుండి 8,500 మంది భక్తులు హాజరవుతారని కమిటీ ప్రతినిధులు వివరించారు. సిక్కు సమాజం అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ పండుగలో పాల్గొని గురు సాహెబ్ ఆశీస్సులు తీసుకోవాలని వారు కెటిఆర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో గురుద్వారా సాహెబ్ అమీర్‌పేట్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 10 Apr 2026 7:25 pm

రెండు సంవత్సరాల్లో 761 మంది లొంగుబాటు

రాష్ట్ర పోలీసు కృషితో రెండు సంవత్సరాల్లో 761 మంది మవోయిస్టులు లొంగిపోయారని డిజిపి వెల్లడించారు. అత్యధికంగా గతేడాది 509 మంది లొండిపోగా ఈ సంవత్సరం నాలుగు నెలల వ్యవధిలోనే 205 మంది జనజీవన స్రవంతిలోకి కలిసినట్లు డిజిపి పేర్కొన్నారు. దీంతో పాటు రెండు సంవత్సరాల్లో వివిధ రాకాలకు చెందిన 302 ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకోగా, వాటిలో అత్యాధునిక ఇజ్రాయల్, అమెరికా తయారీ తుపాకులు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రానికి చెందిన 125 మంది మవోయిస్టుల్లో వివిధ క్యాడర్లలో పనిచేసే వారు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఐదుకు తగ్గిందని డిజిపి తెలిపారు. ఇది పోలీసుల పనితీరుకు నిదర్శనంగా పేర్కొన్నారు.

మన తెలంగాణ 10 Apr 2026 7:14 pm

Telangana : ఈ నెల 20న బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి

సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారయింది.

తెలుగు పోస్ట్ 10 Apr 2026 7:11 pm

ఆర్‌సిబి, ఆర్ఆర్ మ్యాచ్.. వర్షం కారణంగా టాస్ వాయిదా..

గౌహతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గౌహతిలోని బర్సాపరా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా టాస్ వేయడం వాయిదా పడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ జట్టు 6 పాయింట్లతో, +2.403 నెట్‌ రన్‌రేటుతో మొదటి స్థానంలో ఉంది. మరోవైపు బెంగళూరు 4 పాయింట్లతో, +2.501 నెట్‌ రన్‌రేటుతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్2లో గెలిచిన జట్టు మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్ సజావుగా జరుగుతుందో.. లేక వర్షం కారణంగా రద్దవుతుందో తెలియాలంటే.. ఇంకాసేపు వేచి చూడాల్సిందే.

మన తెలంగాణ 10 Apr 2026 7:08 pm

Love Insurance Kompany (LIK) Review

Lik Movie Review Lik Movie Review Telugu360 Rating: 2/5 Pradeep Ranganathan has delivered blockbusters like Love Today, Dragon and Dude in the past. He emerged as one of the most bankable actors in Tamil and Telugu languages. All his super hit films are aimed for the youth of this generation and are new age love […] The post Love Insurance Kompany (LIK) Review appeared first on Telugu360 .

తెలుగు 360 10 Apr 2026 6:56 pm

BRS : తెలంగాణలో కారు స్పీడు అందుకుందా?

తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుంది.

తెలుగు పోస్ట్ 10 Apr 2026 6:50 pm

Ravi Babu’s Razor Releasing On A Special Date

Ravi Babu’s forthcoming thriller Razor is all set to hit the theatres this summer. The film, presented by Suresh Babu under the banner of Suresh Productions and produced by Flying Frogs, has already completed its shoot and the post-production works have also wrapped up. The makers have now officially locked May 8 as the theatrical […] The post Ravi Babu’s Razor Releasing On A Special Date appeared first on Telugu360 .

తెలుగు 360 10 Apr 2026 6:34 pm

ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా శ్రీనివాస్

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా

ప్రభ న్యూస్ 10 Apr 2026 6:28 pm

ప్రధానికి చంద్రబాబు ఆహ్వానం

భోగాపురం విమానాశ్రయం ప్రారంభించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఙప్తి చేశారు

తెలుగు పోస్ట్ 10 Apr 2026 6:24 pm

అదిగో చిరుత….

అదిగో చిరుత…. గద్వాల ప్రతినిధి, ఆంధ్రప్రభ ; అదిగో పులి.. ఇదిగో పులి

ప్రభ న్యూస్ 10 Apr 2026 6:24 pm

13 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడి

హైదరాబద్: నగరంలోని కాచిగూడలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిందితుడు బాలికకు పరిచయమయ్యాడు. ఆ పాపతో స్నేహం పెంచుకొని లైంగిక దాడి చేశాడు. ఈ కేసులో బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు.. అతడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.

మన తెలంగాణ 10 Apr 2026 6:19 pm

తహసీల్దార్ నరేష్‌కు ఘన సన్మానం

కొడిమ్యాల, ఆంధ్రప్రభ : కొడిమ్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన

ప్రభ న్యూస్ 10 Apr 2026 6:13 pm

అమరావతిపై పెట్టే ప్రతి పైసా కృష్ణా నదిలో పోసినట్టే

అమరావతి నిర్మాణానికి రెండు లక్షల కోట్లు కావాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 10 Apr 2026 6:13 pm

కాన్వాయ్ ఆపి వ్యాపారుల సమస్యలు విన్న ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : చిరు వ్యాపారుల సమస్యలను తెలుసుకునేందుకు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల

ప్రభ న్యూస్ 10 Apr 2026 6:10 pm

చిన్నపోర్లలో చెక్కులు పంపిణీ..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్లలో సర్పంచ్ గాండ్ల నిఖిత

ప్రభ న్యూస్ 10 Apr 2026 6:07 pm

రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి..

రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఊట్కూర్ మండల

ప్రభ న్యూస్ 10 Apr 2026 6:06 pm

Andhra Pradesh : మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు

తెలుగు పోస్ట్ 10 Apr 2026 6:02 pm

చౌటుప్పల్ లో ఓపెన్ ప్లై ఓవర్ ని నిర్మించాలని ఆర్డీవోకు వినతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ హైవే విస్తరణలో భాగంగా

ప్రభ న్యూస్ 10 Apr 2026 6:01 pm

Chandrababu Warns Ministers After Cabinet Agenda Leak

A serious concern about information leaks dominated the Andhra Pradesh cabinet meeting, led by Chief Minister N. Chandrababu Naidu, in Amaravati. Even before the meeting began, key agenda points reached the media. The Chief Minister expressed strong displeasure and questioned how sensitive information was being leaked. Chandrababu made it clear that such leaks violate government […] The post Chandrababu Warns Ministers After Cabinet Agenda Leak appeared first on Telugu360 .

తెలుగు 360 10 Apr 2026 5:57 pm

ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్

ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ పరకాల, ఆంధ్రప్రభ: పరకాల పట్టణంలోని చైతన్య మోడల్

ప్రభ న్యూస్ 10 Apr 2026 5:57 pm

ఉత్తర్‌ప్రదేశ్‌లో పడవ ప్రమాదం, 9 మంది మృతి

మథురు: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మథురలో యమున నదిలో పడప బోల్తా పడి 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పడవ బోల్తా పడటంతో పదుల సంఖ్యలో వ్యక్తులు గల్లంతయ్యారు.  గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక చ్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ తొమ్మిది మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. సీ ఘాట్‌ వద్ద ఉన్న పాంటూన్‌ వంతెనను ఢీకొట్టడంతో ఈ పడవ బోల్తా పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మన తెలంగాణ 10 Apr 2026 5:47 pm

కడపలో టెన్షన్.. ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి

కడప జిల్లా ఖాజీపేటలో ఉద్రిక్తత నెలకొంది.

తెలుగు పోస్ట్ 10 Apr 2026 5:44 pm

కదం తొక్కిన ఎర్రసైన్యం

.. అట్టహాసంగా ప్రారంభమైన సిపిఐ, బీకేఎంయూ పాదయాత్ర​ .. అడుగడుగునా నీరాజనాలుమహిళల హారతులు, ఆకట్టుకున్న. కళాకారుల నృత్యాలు​ ఉపాధి హామీని కాపాడాలి.. వి.బి.జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి: నేతల డిమాండ్ ​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, గ్రామీణ పేదల కష్టార్జితానికి భరోసానిచ్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, వి.బి.జి రాంజీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని […] The post కదం తొక్కిన ఎర్రసైన్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Apr 2026 5:38 pm

స్థానికంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి

స్థానికంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి జైనూర్, ఆంధ్రప్రభ ; వైద్యాధికారులు

ప్రభ న్యూస్ 10 Apr 2026 5:28 pm

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మునుగోడు, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చండూరు

ప్రభ న్యూస్ 10 Apr 2026 5:25 pm

ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు

విశాలాంధ్ర -ధర్మవరం : గ్రామాల్లో సమస్యలపై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన విద్యార్థులను వారి స్వీకరించారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాలు, ధర్మవరం పట్టణానికి చెందిన ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు తెలియజేశారు. ఇందులో ప్రధానంగా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా […] The post ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Apr 2026 5:24 pm

మూడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్

ప్రభ న్యూస్ 10 Apr 2026 5:21 pm

గంట రవి జన్మదినోత్సవం అభివృద్ధి పనులకు శ్రీకారం

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; పుట్టినరోజు వేడుకలు పెళ్లిరోజు వేడుకలలో ఖర్చులు మాని సేవా

ప్రభ న్యూస్ 10 Apr 2026 5:19 pm

సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది

సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది జైనూర్, ఆంధ్రప్రభ ;

ప్రభ న్యూస్ 10 Apr 2026 5:17 pm

సీనియర్ జర్నలిస్ట్ బుర్ల వెంకటేశం మృతి

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; ఆంధ్రప్రభ దినపత్రికలో విలేఖరిగా పనిచేసిన బుర్ల వెంకటేశం ఆ

ప్రభ న్యూస్ 10 Apr 2026 5:15 pm

రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది..

శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి-పిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు ఉదయం పాలు, రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా పెనుకొండ లోని వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి […] The post రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Apr 2026 5:14 pm

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; శివారు ప్రాంతాల్లోని

ప్రభ న్యూస్ 10 Apr 2026 5:09 pm

చంద్రబాబు లెక్కల ప్రకారం 40 ఏళ్లయినా అమరావతి పూర్తి కాదు: సజ్జల

అమరావతి: మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి పిలుపుతో మావిగన్ కు ఒక రూపం వచ్చిందని వైసిపి నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. మావిగన్ లో రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి పెట్టే ఖర్చులో 10% మావిగన్ లో పెడితే చాలని, మావిగన్ కు త్వరలో పోర్టు కూడా వస్తుందని తెలియజేశారు. జగన్ అన్నట్లు మావిగన్ కు అన్ని కనెక్టివిటీలు ఉన్నాయని, మావిగన్ ప్రతిపాదనను ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారని అన్నారు. జగన్ ప్రతిపాదన తర్వాత ప్రజల్లో చర్చ మొదలైందని, అమరావతి కోసం అప్పు చేయకుండా ఆచరణ ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని, తెచ్చిన అప్పులను ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. ప్రజా జీవనం లేకుండా లైవ్ సిటీ ఎలా అవుతుందని, జగన్ చెప్పిన దానికి.. ఎపి సిఎం చంద్రబాబు చెప్పినదానికి తేడా అదేనని సజ్జల పేర్కొన్నారు. జగన్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని, అమరావతికి ఆదాయం ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. అమరావతికి నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు కావాలని, రూ. 2లక్షల కోట్లు పెడితే వచ్చే ఆదాయం ఎంత? అని నిలదీశారు. చంద్రబాబు లెక్కల ప్రకారం 40 ఏళ్లయినా అమరావతి పూర్తి కాదని..నవ రాయపూరే ఇందుకు ఉదాహరణని పేర్కొన్నారు. రాజధాని పూర్తి కాకుండా రైతులకు ప్లాట్లు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. అమరావతికి చట్టబద్ధత అంటూ భ్రమలు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అవినీతి గనిగా మార్చుకున్నారని, అమరావతిలో పెట్టుబడి పెడితే.. కృష్ణానదిలో కలిపినట్లేనని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.  

మన తెలంగాణ 10 Apr 2026 5:07 pm

మల్బరీ తోటను సందర్శించిన ఎంపీడీవో

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పట్టు

ప్రభ న్యూస్ 10 Apr 2026 5:04 pm

ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్

ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్ వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; వరంగల్ పోలీస్

ప్రభ న్యూస్ 10 Apr 2026 4:57 pm

‘జననాయగన్’ లీక్.. విజయ్‌కి మెగాస్టార్ సపోర్ట్

హైదరాబాద్: తమిళ స్టార్ హీరో, టివికె పార్టీ అధినేత విజయ్ నటించి ‘జననాయగన్’ సినిమా విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించి ఐదు నిమిషాల వీడియో లీక్ అయింది. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. ‘‘జననాయగన్’ చిత్రం దురదృష్టవశాత్తు లీక్ కావడం నన్నెంతో ఆందోళనకు గురి చేసింది. నమ్మకం, శ్రమ, ఎంతో మంది సమష్టి కలల సమాహారమే సినిమా. ఇలాంటి సంఘటనలు పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి. మన క్రియేటివ్ వర్క్‌ని కాపాడుకోవడం ఎంత కీలకమో గుర్తు చేస్తుంటాయి. ఈ నష్టాన్ని అరికట్టడంలో, దోషులను శిక్షించడంలో మేమంతా ఏకతాటిపై కెవిఎన్ ప్రొడక్షన్స్‌కు మద్దతుగా నిలుస్తాం. సినిమాను గౌరవించి, పరిరక్షించేందుకు మనమందరం మన మద్దతును అందిద్దాం’’ అంటూ మెగాస్టార్ పేర్కొన్నారు.  The unfortunate leak of #Jananayagan is something that deeply concerns me. Cinema is built on trust, effort, and the collective dreams of many. Such incidents affect all of us in the industry and remind us how crucial it is to protect our creative work. We stand one with KVN… — Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2026

మన తెలంగాణ 10 Apr 2026 4:55 pm

Vishwambara has to Revive UV Creations

Top production house UV Creations has been struggling to deliver a solid box-office success from years. Some of the big-ticket films failed badly and the production house is in a lot of stress. 2026 opened on a decent note with Couple Friendly and the film made decent money in February and ended up as a […] The post Vishwambara has to Revive UV Creations appeared first on Telugu360 .

తెలుగు 360 10 Apr 2026 4:35 pm

ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.ఎం.ఎం.ఎస్ కు ఎంపిక .. హెడ్మాస్టర్ రామకృష్ణ

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని భుత్వ ఉన్నత పాఠశాల ధర్మవరంలో 8వ తరగతి చదువుతున్న భాస్కర్ నాయక్ నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ పోటీ పరీక్షల్లో ఎన్నికై తన తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు అని ప్రధానోపాధ్యాయులు రామక్రిష్టప్ప తెలిపారు. విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క ప్రయత్నాన్ని అభినందిస్తూ నాలుగు సంవత్సరాల పాటు 12 వేల రూపాయలు వంతున స్కాలర్షిప్ రావడం విద్యార్థికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేమని తల్లిదండ్రులు తెలియజేశారు.2025-26 విద్యా సంవత్సరానికి ఎన్సిసి యూనిట్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ […] The post ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.ఎం.ఎం.ఎస్ కు ఎంపిక .. హెడ్మాస్టర్ రామకృష్ణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Apr 2026 4:33 pm

మేడ్చల్‌లో కమిషనర్ సృజన సుడిగాలి పర్యటన

మేడ్చల్‌లో కమిషనర్ సృజన సుడిగాలి పర్యటన మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ సర్కిల్

ప్రభ న్యూస్ 10 Apr 2026 4:23 pm

పది రోజుల క్రితం ఉద్యోగంలో చేరిక.. కంపెనీలో రక్తపు మడుగులో విగతజీవిగా

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హరియాణాలో దారుణ హత్యకు గురయ్యాడు. బండ్ల రుషికేశ్(27) పది రోజుల క్రితం పంచకులవేది టెక్నాలజీస్‌ సంస్థలో చేరాడు. ఈ రోజు కంపెనీలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న గుడివాడ పోలీసులు బేతవోలులోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హరియాణాకు బయలుదేరారు. అయితే హత్యకు గల కారణాలు.. ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 10 Apr 2026 4:16 pm

తెలంగాణ రైతు సంఘం మహాసభల కరపత్రం విడుదల

దండేపల్లి, ఆంధ్రప్రభ ; ఈ నెల 23, 24, 25,న భద్రాద్రి కొత్తగూడెం

ప్రభ న్యూస్ 10 Apr 2026 4:15 pm

టెక్ ప్రియులకు షాక్..పెరిగిన శాంసంగ్ ఫోన్ల ధరలు..

దక్షణ కొరియా స్మార్ట్ ఫోన్ సంస్థ శాంసంగ్ భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల ధరలను మరోసారి పెంచింది. అయితే, ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంట్రీ-లెవల్ నుండి మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్లపై ధరలు పెంచిన కంపెనీ తాజాగా ఎంపిక చేసిన ఫోన్ల ధరలను సవరించింది. ఇందులో గెలాక్సీ A, F సిరీస్ మూడేళ్లు ఉన్నాయి. ఈ మేరకు టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సదరు ధరల పట్టికను ఎక్స్ లో షేర్ చేశారు. కాగా, నేటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పుడు ఏ మోడల్ పై ఎంత పెరిగిందో తెలుసుకుందాం.  శాంసంగ్ గెలాక్సీ A07 గెలాక్సీ A07 విషయానికి వస్తే..దీని 4GB + 64GB వేరియంట్ ధర గతంలో ఉన్న రూ.9,749 నుండి ఇప్పుడు రూ.10,999కి పెరిగింది. అంటే, ఇది సుమారుగా రూ.1,250 పెరుగుదలను సూచిస్తుంది.  శాంసంగ్ గెలాక్సీ A06 5G గెలాక్సీ A06 5Gలోని వివిధ వేరియంట్లలో రూ.1,000 వరకు పెరిగింది. దీని 4GB + 64GB మోడల్ ధర ఇప్పుడు రూ.13,499. కాగా, 4GB + 128GB వేరియంట్ ధర రూ.15,499. అలాగే, 6GB + 128GB వేరియంట్ ధర రూ.17,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A07 5G  గెలాక్సీ A07 5G వేరియంట్ల ధరలు కూడా మారాయి. 4GB + 128GB మోడల్ ధర ఇప్పుడు రూ.16,499. కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ.18,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A17 5G అదేవిధంగా గెలాక్సీ A17 5G వేరియంట్ల ధరలు కూడా రూ.1,000- రూ.1,500 వరకు పెరిగాయి. 6GB + 128GB మోడల్ ధర రూ.21,499, 8GB + 128GB వేరియంట్ ధర రూ.23,499, 8GB + 256GB మోడల్ ధర రూ.27,999గా ఉంది.  శాంసంగ్ గెలాక్సీ A36 మిడ్-రేంజ్ విభాగంలో గెలాక్సీ A36 ధర కూడా పెరిగింది. దీని ధరలు రూ.1,500 - రూ.3,000 వరకు పెరిగాయి. 8GB + 128GB వేరియంట్ ధర ఇప్పుడు రూ.33,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.37,999, 12GB + 256GB మోడల్ ధర రూ.43,499గా ఉంది.  శాంసంగ్  గెలాక్సీ A56 గెలాక్సీ A56 ధర రూ.2,000 -రూ.3,500 వరకు పెరిగింది. దీని 8GB + 128GB వేరియంట్ ధర రూ.42,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.46,999, 12GB + 256GB వేరియంట్ ధర రూ.52,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ F17 5G గెలాక్సీ F17 5G స్మార్ట్ ఫోన్ అన్ని వేరియంట్ల ధరలు రూ.1,000 పెరిగింది. దీని 4GB + 128GB వేరియంట్ ధర రూ.17,999, 6GB + 128GB వేరియంట్ ధర రూ.19,999,, 8GB + 128GB వేరియంట్ ధర రూ.21,999గా ఉంది.

మన తెలంగాణ 10 Apr 2026 4:14 pm

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్

కొండగట్టు, ఆంధ్రప్రభ ; కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు

ప్రభ న్యూస్ 10 Apr 2026 4:11 pm

60-Rockets : హిజ్బుల్లా రాకెట్ల వర్షం Andhra Prabha News

60-Rockets : హిజ్బుల్లా రాకెట్ల వర్షం Andhra Prabha News (ఆంధ్రప్రభ, జెరుసలేం

ప్రభ న్యూస్ 10 Apr 2026 4:09 pm

నాదర్ గుల్ భూములపై ప్రభుత్వం స్పందించాలి

నాదర్ గుల్ భూములపై ప్రభుత్వం స్పందించాలి ఆంధ్రప్రభ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :

ప్రభ న్యూస్ 10 Apr 2026 4:07 pm

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… పలు అంశాలపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉన్నత విద్యలో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై కేబినెట్ దృష్టి సారించింది. సమావేశంలో ప్రధానంగా, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసినందుకు […] The post ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… పలు అంశాలపై కీలక నిర్ణయాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Apr 2026 4:06 pm

KCR- Jeevan Reddy |మీతో కలిసి పని చేయమని..

KCR- Jeevan Reddy | మీతో కలిసి పని చేయమని.. కేసీఆర్ తో

ప్రభ న్యూస్ 10 Apr 2026 4:02 pm

కీలక నేత సోది కేశాలతో పాటు 42 మంది మావోయిస్టులు లొంగుబాటు

రాయ్ పూర్: మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ డిప్యూటీ కమాండర్, కీలక నేత సోది కేశాలు అలియాస్ మల్లా, మరో 30-40 మంది మావోయిస్టులతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట ఏప్రిల్ 2026లో లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో పనిచేస్తున్న వీరు, అనేక ఆయుధాలతో ప్రధాన స్రవంతిలో చేరారు. శుక్రవారం డిజిపి శివధర్ రెడ్డి ఎదుట కేశాలతో పాటు 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి 40-50 వరకు ఎకె-47, ఎస్ఎల్ఆర్ లు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల తీవ్రమైన కూంబింగ్, ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందని, తెలంగాణకు చెందిన ఐదుగురు మాత్రమే యూజిలో ఉన్నారని తెలియజేశారు.     

మన తెలంగాణ 10 Apr 2026 3:59 pm

13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం…

మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచేందుకు వీలుగా ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు, మెటా, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రి […] The post 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Apr 2026 3:55 pm

పెళ్లి కానుకగా రూ.21వేలు అందజేత..

వికారాబాద్, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికారాబాద్ పట్టణంలోని 30వ

ప్రభ న్యూస్ 10 Apr 2026 3:53 pm

ipl thrilling match|ఐపీఎల్ మొద‌లైన అస‌లు మ‌జా

ipl thrilling match| ఐపీఎల్ మొద‌లైన అస‌లు మ‌జా ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 10 Apr 2026 3:49 pm

ఈ అసభ్య భాష ఏంటి..? పిటిషనర్‌పై సుప్రీంకోర్టు సీరియస్!

దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానిని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.ఈ సందర్భంగా పిటిషనర్‌పై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కులగణనను చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేయగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జోయ్మాల్య బాగ్చీ, విపుల్ మనుభాయ్ పంచోలీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ పై మండిపాటువిచారణ సందర్భంగా పిటిషన్‌లో ఉపయోగించిన […] The post ఈ అసభ్య భాష ఏంటి..? పిటిషనర్‌పై సుప్రీంకోర్టు సీరియస్! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Apr 2026 3:38 pm

సీపీఐ సీనియర్ నాయకుడు గొర్రెజోసఫ్ రాజు మృతి

బెల్లంపల్లిరూరల్, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండల సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు రిటైర్డ్

ప్రభ న్యూస్ 10 Apr 2026 3:27 pm

ఘనంగా ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఎన్‌ఎస్‌యూఐ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్దన్ రాజు

ప్రభ న్యూస్ 10 Apr 2026 3:24 pm

గురుకుల కళాశాలపై కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మిక తనిఖీ

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి శివారెడ్డిపేటలో ఉన్న సామాజిక

ప్రభ న్యూస్ 10 Apr 2026 3:21 pm

12న మంచిర్యాల పర్యటనకు కేటీఆర్

12న మంచిర్యాల పర్యటనకు కేటీఆర్ హైదరాబాద్, ఆంధ్రప్రభ ; బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

ప్రభ న్యూస్ 10 Apr 2026 3:13 pm

పాక్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా.. ఈసారి అమ్మాయిలతో..

ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ అద్భుత ఘటన చోటు చేసుకోనుంది. తొలిసారిగా పాకిస్థాన్ మహిళల ద్వైసపాక్షిక సిరీస్ జరుగనుంది. జింబాబ్వే మహిళల జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, లీఈ సిరీస్ మహిళల క్రికెట్ అభివృదలో కీలక ఘట్టంగా నిలవనుంది.ఈ సిరీస్‌ మ్యాచ్‌‌లు మే 3 నుంచి 15 వరకూ మధ్య తేదీల్లో జరుగుతాయి. వన్ే సిరీస్‌ ఐసిసి మహిళల ఛాంపియన్‌షిప్-2025-29లో భాగంగా జరుగనుండగా.. టి-20 సిరీస్ సాధారణంగా సిరీస్‌గా పరిగణించబడుతుంది. అన్ని మ్యాచ్‌లు కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియంలో జరుగుతాయి.

మన తెలంగాణ 10 Apr 2026 3:13 pm

ఏఐ+ నోవా 2 సిరీస్ వచ్చేసిందోచ్..తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు..!

ఏఐ+ నోవా 2 సిరీస్ భారత టెక్ మార్కెట్లో విడుదల అయింది. ఈ లైనప్‌లో ఏఐ+ నోవా 2 5G, ఏఐ+ నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు పరికరాలు ఐదు రంగుల ఆప్షన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త సిరీస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర, సేల్స్ డేట్, ఫీచర్ల వివరాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ఏఐ ప్లస్ నోవా 2 5G ధర, ఫీచర్లు మార్కెట్లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. అయితే, కంపెనీ 6GB RAM + 128GB వేరియంట్ ధరను ఇంకా వెల్లడించలేదు. ఇక లభ్యత విషయానికి వస్తే..ఈ ఫోన్ ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు వస్తుంది. ఈ ఫోన్  బ్లూ, బ్లాక్, రెడ్, గ్రీన్, పర్పుల్ రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే..ఈ ఫోన్‌లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. పరికరం వేగం, మల్టీటాస్కింగ్ కోసం..యూనిసోక్ T8200 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ ముందు కెమెరా ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ పరికరం  6000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5G ధర, ఫీచర్లు ఈ డివైస్ 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. కాగా, కంపెనీ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధరను వెల్లడించలేదు. లభ్యత విషయానికి వస్తే..ఈ హ్యాండ్‌సెట్ సేల్స్ ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతాయి. ఈ పరికరాన్ని బ్లాక్, గ్రీన్, బ్లూ, పర్పుల్,  రెడ్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే..అల్ట్రా మోడల్‌లో 6.78-అంగుళాల 1.5K ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇది 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుంది. కెమెరా పరంగా.. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX752 కెమెరా సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్లో శక్తివంతమైన 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 

మన తెలంగాణ 10 Apr 2026 3:12 pm

ఆగని ఆకేరు అక్రమ ఇసుక రవాణా

ఆగని ఆకేరు అక్రమ ఇసుక రవాణా నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 10 Apr 2026 3:06 pm

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..? ఈ ఆహార పదార్థాలతో కంట్రోల్ చేయండి..!

అధిక రక్తపోటును నియంత్రించడంలో మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా అంతే ముఖ్యం. మీరు కూడా అధిక రక్తపోటుతో బాధపడుతుంటే, ఈ వార్త ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తపోటును సహజంగా నియంత్రించడంలో సహాయపడే కొన్ని కూరగాయల నుండి పండ్లు, నట్స్ వరకు ప్రత్యేక ఆహార పదార్థాల ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తప్పనిసరిగా డైట్ లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకరకాయ కాకరకాయ చేదు రుచి కారణంగా చాలామంది ఈ కూరగాయను తినడానికి వెనుకాడతారు. అయితే, ఇది అధిక రక్తపోటు రోగులకు ఒక వరమని తెలియదు. కాకరకాయలోని ప్రత్యేక పోషకాలు రక్తపోటును నియంత్రించడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి.  జామకాయ అధిక రక్తపోటు ఉన్నవారికి జామకాయ ఒక అద్భుతమైన పండు. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పొటాషియం శరీరంలో సోడియం హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది సాధారణ రక్తపోటును నిర్వహించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. బార్లీ పిండి అధిక రక్తపోటు ఉంటే, గోధుమ పిండి రొట్టెలు బదులుగా ఆహారంలో బార్లీ పిండి రొట్టెలు చేర్చుకోవడం చాలా మంచిది, ఆరోగ్యం కూడా ఎందుకంటే ఇందులో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అవిసె గింజలు అవిసె గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. రోజూ ఒక టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలను తినడం వల్ల సిరలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. బాదం పప్పులు బాదం పప్పులు మెదడును చురుగ్గా చేయడమే కాకుండా గుండెను కూడా కాపాడతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. రాత్రంతా నానబెట్టి 4-5 బాదాం పప్పులను ఒలిచి తీసుకోవడం తినడం ఉత్తమ మార్గం. మెంతుల నీరు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే ఆహార పదార్థాలలో మెంతుల నీరు కూడా ఒకటి. ఇందుకోసం అర టీస్పూన్ మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఈ చిన్న అలవాటు శరీరంలో రక్తపోటు, చక్కెర స్థాయిలను రెండింటినీ మెరుగ్గా నియంత్రిస్తుంది. 

మన తెలంగాణ 10 Apr 2026 3:02 pm

ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభం

ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభం మక్తల్, ఆంధ్రప్రభ ; ప్రధానమంత్రి సంసద్

ప్రభ న్యూస్ 10 Apr 2026 3:00 pm

Conspiracy | 36 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Conspiracy | 36 గంటల్లోనే ఛేదించిన పోలీసులు Conspiracy | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 10 Apr 2026 3:00 pm

గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి

గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి కడెం, ఆంధ్రప్రభ ; గర్భిణీ మహిళలు

ప్రభ న్యూస్ 10 Apr 2026 2:54 pm

చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ విష్ణువర్ధన్ శంకర్ గౌడ్

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : ఎండలు తీవ్రత రోజుకు ఘననియంగా పెరగడంతో చలివేంద్రం

ప్రభ న్యూస్ 10 Apr 2026 2:50 pm

కడపలో ఇంట్లోకి చొరబడి యువతి గొంతుకోసి

అమరావతి: పెళ్లికి ఒప్పుకోవడంలేదని ప్రియురాలి గొంతుకోసి ప్రియుడు చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఖాజీపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాస్ అనే యువకుడు, ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని యువతిని పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చాడు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతి ఇంటికి వెళ్లాడు. పెళ్లి చేసుకోవాలని  యువతిని బలవంతం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి అతడు తప్పించుకున్నాడు. వెంటనే స్థానికులు ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీశిలించిన వైద్యులు తెలిపారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

మన తెలంగాణ 10 Apr 2026 2:38 pm

Deepika Padukone’s Big Pay for Raaka

Deepika Padukone has been in the news for wrong reasons and she landed into controversies. The actress was removed from several upcoming big-budget films and rumors surfaced that the filmmakers have been finding other options because of the excessive demands from Deepika Padukone. The actress is the leading lady in Raaka featuring Allu Arjun in […] The post Deepika Padukone’s Big Pay for Raaka appeared first on Telugu360 .

తెలుగు 360 10 Apr 2026 2:35 pm