SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

Investment Scam: రూ.9.6 లక్షలు మోసం.. పెట్టుబడి పేరుతో మహిళకు టోపీ

యాప్‌ రుణాలు తీసుకుని పంపించిన బాధితురాలుడబ్బు అడిగితే స్పందించని ఇద్దరు వ్యక్తులు

తెలుగు పోస్ట్ 6 Apr 2026 9:25 pm

భారత్‌ కు రెండు వంటగ్యాసు నౌకలు

ఉద్రిక్తతల నెలవైన హర్మూజ్ జలసంధి నుంచి సోమవారం రెండు భారతీయ పతాక ఎల్‌పిజి ట్యాంకరు నౌకలు సురక్షితంగా ఈ కీలక మార్గాన్ని దాటాయి. భారత్ మరికొన్ని మిత్రదేశాలకు హర్మూజ్ ప్రవేశానికి ఇరాన్ సమ్మతించిన దశలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వంటగ్యాసుతో బయలుదేరిన గ్రీన్ సాన్వి నౌక 46650 టన్నుల ఎల్‌పిజితో ఈ నెల 7వ తేదీన భారతీయ రేవుకు చేరుకుంటుంది. ఇక 15500 టన్నుల వంటగ్యాసు సరుకుతో ఉన్న గ్రీన్ ఆశా ట్యాంకర్ నౌక ఈ నెల 9న ఇక్కడి పోర్టుకు వస్తుంది. ఈ విషయాలను కేంద్ర రేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగల్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నౌకల రాకతో దేశంలో వంటగ్యాసు కొరత కొంత మేర తీరే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ జలసంధి మీదుగా భారతీయ పతాకలతో మరో 16 నౌకలతో పాటు మొత్తం 433 మంది నావికులు ఈ ప్రాంతంలో ప్రయాణం కోసం సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత గల్ఫ్ యుద్ధ భయాల దశలో భారతీయ సముద్ర మార్గ కార్యకలాపాలు సురక్షితంగా, అవిచ్ఛిన్నంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. 

మన తెలంగాణ 6 Apr 2026 9:23 pm

మాజీ సిఎం కుమారుడికి యావజ్జీవ ఖైదు

చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగికి 2003 నాటి హత్యకేసులో యావజ్జీవ ఖైదు శిక్ష వెలువడింది. ఎన్‌సిపి ప్రముఖ నేత రామావతార్ జగ్గి హత్యోదంతంలో రాష్ట్ర హైకోర్టు సోమవారం ఈ తీర్పు ప్రకటించింది. అంతకు ముందు ఈ కేసులో ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది. అయితే కేసు పూర్వాపరాల విచారణ తరువాత హైకోర్టు 2007 నాటి ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసింది. రు. జీవిత ఖైదు విధించిన తరువాత అజిత్ జోగి మూడువారాలలో సరెండర్ కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోశాధికారి, రాజకీయాల్లోకి వచ్చిన వ్యాపారి రామావతార్ జోగిని 2003 జూన్ 4వ తేదీన రాయ్‌పూర్‌లో కాల్చి చంపారు. అప్పుడు అజిత్ జోగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయ కుట్రతోనే ఈ హత్య జరిగిందని పేర్కొంటూ ఈ కేసులో జోగితో పాటు పలువురిని నిందితులుగా చేర్చారు. 2007లో సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 28 మందిని దోషులుగా ఖరారు చేసింది. వారికి యావజ్జీవ శిక్షలు విధించారు. అయితే అమిత్ జోగిని నిర్దోషిగా ప్రకటించారు. ఈ తీర్పును సిబిఐ ఉన్నసవాలు చేసింది. దీర్ఘకాలిక వాద ప్రతివాదాలు, విచారణ తరువాత ఇప్పుడు రెండు దశాబ్దాలపై దశలో హైకోర్టు తీర్పు వెలువడింది.హైకోర్టు తీర్పు పట్ల రామావతార్ జగ్గి కుమారుడు సతీష్ హర్షం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా వేచిచూసిన న్యాయం ఇప్పటికి దక్కిందని , ఇప్పుడు తన తండ్రికి నిజమైన నివాళి అందిందని స్పందించారు. తీర్పును స్వాగతించారు. 

మన తెలంగాణ 6 Apr 2026 9:19 pm

45 Days Iran Rejects : కాల్పుల విరమణకు నో .. Andhra Prabha News

45 Days Iran Rejects : కాల్పుల విరమణకు నో .. Andhra

ప్రభ న్యూస్ 6 Apr 2026 9:13 pm

బెంగళూరు నుంచి సికింద్రాబాద్ ఊపిరితిత్తులు

ఓ వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలో భాగంగా అవసరమయిన ఊపిరితిత్తులను అత్యవసరం పరిస్థితుల్లో సోమవారం బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు తీసుకొచ్చారు. దీని కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి రవాణాకు ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమయిన చర్యలు తీసుకుంది. రవాణా కోసం ఎయిర్ అంబులెన్స్‌లో ప్రత్యేక వైద్య బృందం ఊపిరితిత్తులతో బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ వైద్యశాలకు ఊపిరితిత్తులను తరలించారు. అయితే ఉపిరితిత్తులను తరలిచేందుకు ప్రత్యేకమయిన అంబులెన్స్ ఏర్పాటు చేయడంతో పోలీసులు శంషాబాద్ విమనాశ్రయం నుంచి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వెళ్లే ప్రయాణ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టడంతో కేవలం 25 నిమిషాల్లోనే శంషాబాద్ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ కిమ్స్ వైద్యశాలకు ఊపిరితిత్తులు సురక్షితంగా చేరుకున్నాయి.

మన తెలంగాణ 6 Apr 2026 9:13 pm

గ్యాస్ లేదు... పండ్లతో బతుకుతున్నాం : సిపిఐ నారాయణ

 వంటగ్యాస్ కొరత, పెరుగుతున్న ధరలపై సిపిఐ జాతీయ నియంత్రణ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గంభీరమైన రాజకీయాలను చమత్కారంతో మేళవించడంలో పేరుగాంచిన నారాయణ, ఒక వ్యంగ్య వ్యాఖ్య ద్వారా సామాన్యుల కష్టాలను ఎత్తి చూపారు. ఇంట్లో వంటగ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల తాను వంట చేసుకోలేకపోతున్నానని, ‘పండ్లతోనే బతకాల్సి వస్తోందని‘ ఆయన అన్నారు. ‘లంకలోని బాపనయ్యలా‘ హాస్యభరితంగా ప్రారంభిస్తూ,నారాయణ ‘గ్యాస్ లేదు... పరిస్థితి లంకలోని బాపనయ్యలా తయారైంది‘ అని వ్యాఖ్యానించారు. గ్యాస్ లేకుండా టీ, కాఫీ చేసుకోవడం కూడా అసాధ్యంగా మారిందని, పండ్లపై ఆధారపడటం తప్ప మరో మార్గం లేదని ఆయన వివరించారు. ఇది కేవలం తన పరిస్థితి మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు.

మన తెలంగాణ 6 Apr 2026 9:06 pm

చంద్రుని చెంతకు ఆర్టెమిస్ 2

ఆర్టెమిస్2 చంద్రయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. నలుగురు వ్యోమగాములు ‘ఒరాయన్ ’వ్యోమనౌకలో చంద్రుడి గురుత్వాకర్షణ పరిధి లోకి ప్రవేశించారు. ప్రత్యేకంగా తయారు చేసిన నాలుగు అద్దాల కిటికీల్లోంచి బయటికి అంతరిక్షం లోకి తొంగి చూస్తుంటే చంద్రుడు మెలమెల్లగా చేరువవుతున్నట్టు, భూమి దూరంగా జరిగిపోతున్నట్టు వీరికి కనిపిస్తోంది. వ్యోమగాములు జాబిల్లిని చేరుకునే క్రమంలో మూడింట రెండొంతుల ప్రయాణం పూర్తయింది. వీరిని తీసుకెళ్లిన ఒరాయన్ వ్యోమనౌక 4,06,773 కి.మీ దూరం ప్రయాణించి అత్యంత సుదూర మానవ అంతరిక్షయాత్రగా రికార్డు సృష్టించింది. నలుగురు వ్యోమగాములు సోమవారం రాత్రి 23.47 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువ జామున 4.17 గంటలకు చంద్రుడి వెనుక వైపునకు వెళ్తారు. గతంలో 1970లో అపోలో 13 ప్రయాణించిన దూరం కంటే ఇది 2500 కిమీ అదనం కావడం గమనార్హం. ఈ క్రమంలోనే “లూనార్ ఫ్లైబై” దశ చోటు చేసుకోనుంది. ఆ విన్యాసంతో ఒరాయన్, చందమామను దాటి 6400 కిమీ దూరం వెళుతుంది. ఈ సమయంలో మనకు ఎప్పుడూ కనిపించని చంద్రుడి రెండో పార్శాన్ని వ్యోమగాములు క్లిక్‌మనిపిస్తారు. చంద్రుడి చుట్టూ ప్రయాణం పూర్తి చేశాక ఈ వ్యోమనౌక భూమి వైపు మళ్లుతుంది. ఈనెల 10న పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్ ఉండవచ్చు.  

మన తెలంగాణ 6 Apr 2026 8:50 pm

9మంది పోలీసులకు ఉరిశిక్ష

 తమిళనాడులోని మధురై కోర్టు సోమవారం నాడు సంచలన తీర్పు వెల్లడించింది. తూత్తుకుడి జిల్లా సాతన్‌కుళంకు చెందిన తండ్రీ కొడుకుల లాకప్‌డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. అత్యంత దారుణంగా అధికారాన్ని అతిక్రమించి క్రూరమైన నేరానికి పాల్పడ్డారని ఈ సందర్భంగా నిందితులను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. ఆరేళ్ల సుదీర్ఘ విచారణ, వాదనల అనంతరం జడ్జి ముత్తుకుమరన్ తీర్పు వెలువరించారు. 10 మంది నిందితులకు గాను ఒకరు విచారణ క్రమంలోనే మరణించారు. మిగతా తొమ్మిది మందికి ఈ శిక్షను వర్తింప చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పౌరులు, విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలతో పాటు తదితర రంగాలకు కొన్ని నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. 2020 సంవత్సరం జూన్ 19న నిర్ణీత సమయానికి మించి మొబైల్ షాపును తెరిచి ఉంచారని, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై యజమాని జయరాజ్(59), అతని కుమారుడు బెనిక్స్(31)ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కస్టడీలో వారిని తీవ్రంగా హింసించడంతో వారిద్దరూ సబ్‌జైలులో రెండు రోజుల వ్యవధిలో మరణించారు. పోలీసులు దారుణంగా కొట్టడం వల్లే దెబ్బలకు తాళలేక చనిపోయారని విచారణ నివేదికలు బహిర్గతం చేశాయి. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుల్లో ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్‌స్పెక్టర్‌లు రఘు గణేశ్, బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుళ్లు మురుగన్, సమదురై, కానిస్టేబుళ్లు ముత్తురాజ్, చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలిముత్తు ఉన్నారు. పదో నిందితుడైన ప్రత్యేక సబ్ ఇన్‌స్పెక్టర్ పాల్‌దురై కొవిడ్ సోకి చికిత్స పొందుతూ విచారణ దశలోనే మరణించాడు. దర్యాప్తు రికార్డు ఏం చెబుతుంది..? బాధితుల శరీరాలపై 18 అత్యంత తీవ్రమైన గాయాలున్నాయని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నివేదిక వెల్లడించింది. కస్టోడియల్ విచారణ సందర్భంగా పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక బెనిక్స్ గాయాలతో మరణించాడని పోస్ట్‌మార్టమ్ నివేదిక చెబుతోంది. తండ్రీ కొడుకులపై పోలీసుల దాష్టీకం గంటల పాటు నిరంతరంగా సాగిందని, వాళ్ల బట్టలు విప్పించి, లోదుస్తులపై ఉంచి అత్యంత క్రూరంగా హింసించినట్లు చార్జిషీట్‌లో తెలిపారు. చెక్కబల్లపై ఒకరి తర్వాత ఒకరిని పడుకోబెట్టి చేతులు, కాళ్లను నిందితులైన పోలీసులు గట్టిగి వంకరలు తిప్పి పట్టుకొని ఉండగా మరికొందరు లాఠీలతో వాళ్ల శరీరాలపై ఇష్టం వచ్చిన చోట విరుచుకుపడ్డట్లు పేర్కొన్నారు. రక్తం మరకలతో తడిసిముద్దయిన వాళ్ల దుస్తులను పలుమార్లు మార్పించారని, అంతటితో వారి క్రూరమైన చర్యలు ఆగలేదని.. నేలపై పారుతున్న వాళ్ల రక్తాన్ని వాళ్లతోనే ఎత్తి శుభ్రం చేయించారని కూడా చార్జిషీట్‌లో పొందుపరిచారు. దాడి తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని, తండ్రీ కొడుకులపై తప్పుడు కేసు కూడా మోపారని వివరించారు. జూన్ 22, 23 తేదీల్లో జయరాజ్, బెనిక్స్ కొవిల్‌పట్టి సబ్‌జైలులో మరణించారని, ఇది ప్రజాగ్రహానికి దారితీసిందని పేర్కొన్నారు. పారదర్శకంగా విచారణ జరిపి వారి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున అప్పట్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. సిబిఐ రిపోర్టులో ఏముంది? అంతకుముందు కేసు విచారణ జరిపిన సిబిఐ మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్‌కు నివేదిక సమర్పించింది. బాధితుల డిఎన్‌ఎ శాంపిళ్లు సేకరించడంతో పాటు పోలీస్ స్టేషన్ లాకప్ గోడలు, టాయిలెట్లు, ఎస్‌హెచ్‌ఓ గది, లాఠీల నుంచి సేకరించిన శాంపిళ్లు పరీక్షించి చూస్తే రెండూ మ్యాచ్ అయినట్లు తెలిపింది. జూన్ 19న రాత్రి 7.30గంటలకు జయరాజ్‌ను కామరాజ్ చౌక్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించగా.. వారిని అతని కుమారుడు అనుసరించగా ఇద్దరినీ నిర్బంధించారని వివరించింది. తనకు బిపి, డయాబెటిస్ తదితర వ్యాధులున్నాయని, దయచేసి కొట్టవద్దని జయరాజ్ ఎంత వేడుకున్నా నిందితులు వదిలిపెట్టలేదని, బెనిక్స్‌కు పలు చోట్ల అత్యంత తీవ్రమైన గాయాలయ్యాయని సిబిఐ తెలిపింది. ఈ హింస పోలీసుల జవాబుదారీతనంపై దేశవ్యాప్తంగా సామాన్యుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందని, నిందితులను కఠినంగా శిక్షించాల్సి అవసరాన్ని సిబిఐ ఈ సందర్భంగా కోరింది.

మన తెలంగాణ 6 Apr 2026 8:44 pm

జోగినపల్లి సంతోష్ కుమార్‌కు గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఇగ్నైటెడ్ మైండ్స్ నిర్వాహకులు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం దక్కింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్‌లో ఏప్రిల్ 17న ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. భారతదేశంలో పర్యావరణ ఉద్యమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడంలో ’ఇగ్నైటింగ్ మైండ్స్’ నిరంతర కృషి చేస్తున్నది. ముఖ్యంగా సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘హరా హై తో భరా హై‘ (ఆకుపచ్చగా ఉంటేనే సిరిసంపదలు) నినాదంతో ముందుకొచ్చిన ’గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ దేశవ్యాప్తంగా పర్యావరణ బాధ్యతను ఒక సత్సంప్రదాయంగా మార్చింది. విద్యార్థులు, యువత, రైతులు, సామాన్యుల నుంచి జాతీయ స్థాయి సెలబ్రిటీల వరకు ఎంతోమంది ఈ ఉద్యమంలో భాగస్వాములై మిలియన్ల కొద్దీ మొక్కలు నాటారు. లండన్‌లో వేడుక పర్యావరణ పరిరక్షణ,సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులపై పోరాడుతున్న ప్రపంచ స్థాయి నాయకులను గుర్తించి వారికి పురస్కారాలు అంది స్తున్న బ్రిటన్ సంస్థ హెలిన్ స్పార్క్ స్ట్రాటజీస్ యూకే లిమిటెడ్ ఏప్రిల్ 17న అంతర్జాతీయ కాన్ క్లేవ్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ లారడ్స్ లో సంతోష్ కుమార్ కు ’గ్లోబల్ గ్రీన్ ఐకాన్’ పురస్కారాన్ని అందజేస్తారు. సమిష్టి కృషికి దక్కిన గౌరవమిది ఈ గౌరవం పట్ల జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తన ఒక్కడికి దక్కిన గౌరవం కాదని, పర్యావరణ పరిరక్షణ కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ గుర్తింపుపై ’ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్’ స్పందిస్తూ డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ఆదర్శాలతో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసి భావితరాలకు పచ్చని భూమిని అందించడమే తమప్రధాన లక్ష్యమని పేర్కొన్నది.

మన తెలంగాణ 6 Apr 2026 8:35 pm

అమీర్‌పేట్‌లో స్క్రాప్ వ్యాపారి ఆత్మహత్య

 ఇంటి కొనుగోలు విషయంలో మోసపోయానని మనస్థాపం చెందిన స్క్రాప్ వ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమీర్‌పేట్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సారపాకకు చెందిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి(42) నగరంలోని అమీర్‌పేట్‌లో భార్య, పిల్లలతో కలిసి ఉంటూ స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. బాధితుడు ఇటీవల వనస్థలిపురంలో రూ.3.5కోట్లకు ఇంటిని కొనుగోలు చేశాడు. డబ్బులు చెల్లించి, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత నకిలీ పత్రాలతో ఇంటిని విక్రయించినట్లు బాధితుడికి తెలిసింది. దీంతో మనస్థాపం చెందిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి భార్యకు సూసైడ్ నోట్ రాశాడు, తనకు వ్యాపారంలో రూ.6.8కోట్లు రావాల్సి ఉందని అందులో పేర్కొన్నాడు. బేగంపేటలోని రెనెక్సా టవర్స్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఉన్న చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకునే కంటే ముందే భార్యకు లొకేషన్ పంపించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 6 Apr 2026 8:32 pm

Dacoit is a romantic thriller with great emotional core – Adivi Sesh

Adivi Sesh is bringing a pan-India action-romantic thriller titled Dacoit to the theaters on April 10. Directed by debutant Shaneil Deo, the film features Mrunal Thakur as the leading lady and includes Anurag Kashyap in a key role. The movie is presented by Annapurna Studios, produced by Supriya Yarlagadda, and co-produced by Sunil Narang. Sesh […] The post Dacoit is a romantic thriller with great emotional core – Adivi Sesh appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 8:31 pm

Photos : Bad Boy Karthik Movie Trailer Launch Event

The post Photos : Bad Boy Karthik Movie Trailer Launch Event appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 8:28 pm

Janhvi |జాన్వీ కపూర్ అమాయక చూపులు.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు

Janhvi | జాన్వీ కపూర్ అమాయక చూపులు.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు Janhvi

ప్రభ న్యూస్ 6 Apr 2026 8:00 pm

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం: సిఎం రేవంత్

ఆదిలాబాద్‌ జిల్లా మీద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు అమాయకులే కాదు.. నిరంకుశత్వం మీద పోరాడిన వీరులు అంటూ సిఎం రేవంత్ పొగిడారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” భహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. జల్ జంగల్ నినాదంతో పోరాట స్ఫూర్తిని చాటిన కొమురం భీమ్ గడ్డ ఇది అని, అలాంటి ఆదివాసీ వీరులు.. నిజాం నిరంకుశత్వంపై పోరాడారని  అన్నారు. అభివృద్ధికి నోచుకోని ఆదిలాబాద్ ను పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేయాలని ప్రేం సాగర్ రావు అనేవారని చెప్పారు. ఆదిలాబాద్ కు సాగునీరు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఈ వేదికగా మాట ఇస్తున్నా.. పెండింగ్ లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఎర్రబస్సు తిరగడమే కష్టమైన ఈ ప్రాంతంలో కేంద్రంతో మాట్లాడి ఎయిర్ పోర్ట్ మంజూరు చేయించాం. త్వరలోనే.. వీలైతే జూన్ 2 నాటికి ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శిలాఫలకం వేసే బాధ్యత తీసుకుంటాం. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఇందుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఆదిలాబాద్ లో యూనివర్సిటీకి సంబంధించి భూసేకరణ చేపట్టాం. త్వరలోనే ఆదిలాబాద్ లో యూనివర్సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తాం. బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశాం. ఆలయ అభివృద్ధికి అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తాం. ప్రేం సాగర్ రావు గారి అభ్యర్థన మేరకు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. ప్రతీ రెండు నెలలకోసారి ఈ జిల్లాకు వస్తూనే ఉంటా.. నిధులు తెస్తూనే ఉంటాం.పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనేది మా ప్రయత్నం. మేం పాలకులం కాదు… ప్రజల సేవకులం అని సిఎం రేవంత్ అన్నారు.

మన తెలంగాణ 6 Apr 2026 7:57 pm

పంజాబ్ పై బ్యాటింగ్ ఎంచుకున్న కెకెఆర్.. జట్టులో మార్పులు

ఐపీల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ అజింక్యా రహానె ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో కోల్ కతా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో క్యాచ్ పడుతూ గాయపడిన వరుణ్ చక్రవర్తి, నరైన్ స్థానాల్లో పావెల్, సైనీ జట్టులోకి తీసుకున్నట్లు రహానె తెలిపాడు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైన కోల్ కతా ఈ మ్యాచ్ లోనైనా గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలగా ఉంది. జట్లు: పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI) : ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), శ్రేయాస్ అయ్యర్ (c), కూపర్ కొన్నోలీ, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI) : ఫిన్ అలెన్, అజింక్యా రహానే(సి), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(w), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి

మన తెలంగాణ 6 Apr 2026 7:14 pm

యడ్లపాడులో నాటికల మహోత్సవం ఘన ముగింపు…

యడ్లపాడులో నాటికల మహోత్సవం ఘన ముగింపు… పోటాపోటీ ప్రదర్శనలు – అందరికీ న్యాయం

ప్రభ న్యూస్ 6 Apr 2026 7:13 pm

పోలీస్ గ్రీవెన్స్‌కు 101 ఫిర్యాదులు…

పోలీస్ గ్రీవెన్స్‌కు 101 ఫిర్యాదులు… విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం :

ప్రభ న్యూస్ 6 Apr 2026 7:05 pm

YSRCP’s 2029 Chances Depend on Alliance Dynamics, Says Undavalli Arun Kuma

Two years after the Andhra Pradesh Assembly elections, the coalition government continues to hold power. Public opinion across the state shows a mixed response to its performance so far. At the same time, a key political question is gaining traction. Can the opposition YSR Congress Party stage a comeback in 2029? Former MP Undavalli Arun […] The post YSRCP’s 2029 Chances Depend on Alliance Dynamics, Says Undavalli Arun Kuma appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 7:05 pm

రైతుల రహదారి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే…

రైతుల రహదారి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే… రోలుపాడు రైతుల వినతికి వెంటనే స్పందనసురవరం–రోలుపాడు

ప్రభ న్యూస్ 6 Apr 2026 7:00 pm

భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత…

భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత… ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:54 pm

Breaking : మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. పోలీసులకు మరణశిక్ష

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది

తెలుగు పోస్ట్ 6 Apr 2026 6:53 pm

రామేశ్వర స్వామి ఆలయ దోపిడీ కేసు ఛేదన….

రామేశ్వర స్వామి ఆలయ దోపిడీ కేసు ఛేదన…. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అరెస్ట్

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:50 pm

చెస్ రేటింగ్ సాధించిన విద్యార్థినికి అభినంద‌న‌…

చెస్ రేటింగ్ సాధించిన విద్యార్థినికి అభినంద‌న‌… అంతర్జాతీయ చెస్ క్రీడాకారుడిగా గుర్తింపు పాయకాపురం,

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:45 pm

నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచాలి..

నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచాలి.. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జల మట్టాలను

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:42 pm

హైదరాబాద్-రాయ్‌పూర్‌ విమానంలో సాంకేతిక లోపం..

హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చార్టర్ విమానం సాంకేతిక లోపానికి గురైంది. ఆదివారం(ఏప్రిల్ 5) హైదరాబాద్ నుండి రాయ్‌పూర్‌కు వెళ్తున్న VT-REM చార్టర్ విమానం.. ఎయిర్ పోర్టు ప్రధాన రన్‌వే నుండి టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్‌వేపై నిలిచిపోవడంతో, ఆర్జీఐ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు కొన్ని నిమిషాల పాటు అంతరాయం కలిగింది. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు స్పందించారు. నిన్న రాయపూర్‌కు బయలుదేరాల్సిన VT-REM చార్టర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది కొద్దిసేపు టాక్సీవేపై నిలిచింది. పరిస్థితిని గుర్తించిన మా ఎయిర్‌సైడ్ బృందం వెంటనే స్పందించి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ విమానాన్ని తక్షణమే సురక్షితంగా తరలించింది. ఈ కారణంగా ఒక విమానం గో-అరౌండ్ చేయాల్సి వచ్చినప్పటికీ, ఎటువంటి అంతరాయం లేకుండా విమానాశ్రయ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగాయి అని ఆర్జీఐ విమానాశ్రయ అధికారులు తెలిపారు.

మన తెలంగాణ 6 Apr 2026 6:39 pm

ఫ్యాక్ట్ చెక్: ఆసుపత్రిలో సోనియా గాంధీని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించినట్లుగా ఉన్న ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు

ఆసుపత్రిలో సోనియా గాంధీని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించినట్లుగా

తెలుగు పోస్ట్ 6 Apr 2026 6:35 pm

మొగ్ధూంపూర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం….

మొగ్ధూంపూర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం…. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:22 pm

రుక్మారావుకు రాష్ట్ర ప్రభుత్వ దళిత రత్న పురస్కారం…

రుక్మారావుకు రాష్ట్ర ప్రభుత్వ దళిత రత్న పురస్కారం… విద్యాభివృద్ధి, సామాజిక సేవకు గుర్తింపు…15

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:19 pm

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరు,ఏప్రిల్

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:13 pm

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజాత

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజాత మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:12 pm

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:12 pm

Dhurandhar Composer for Nani’s Film?

Young music composer Shashwat Sachdev scored music for Dhurandhar and his work is one of the major highlights of the spy thriller. The songs are instant hits and the background score composed by Shashwat Sachdev is an asset for the film. He is rushed with several offers. Rumours say that Sukumar is considering him for […] The post Dhurandhar Composer for Nani’s Film? appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 6:11 pm

బాధితుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

బాధితుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ రాయపర్తి, ఆంధ్రప్రభ : మండలంలోని పెరికేడు

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:09 pm

బాధిత కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ చేయూత

బాధిత కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ చేయూత ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రాయపర్తి,

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:09 pm

మండెల గూడెంలో చలివేంద్రం ప్రారంభం..

మండెల గూడెంలో చలివేంద్రం ప్రారంభం.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : వేసవికాలంలో ప్రజల దాహం

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:07 pm

చిట్యాల తహసీల్దార్‌గా ఎం. విజయ్ కుమార్

చిట్యాల తహసీల్దార్‌గా ఎం. విజయ్ కుమార్ చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలాని

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:07 pm

ముఖ్యమంత్రికి మనవడిని ఎత్తుకున్న ఫొటో అందజేత

ముఖ్యమంత్రికి మనవడిని ఎత్తుకున్న ఫొటో అందజేత బాసర (నిర్మల్ జిల్లా) : ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:04 pm

Tirumala : తిరుమల హుండీలో 400 కోట్ల పాత నోట్లు

తిరుమల హుండీలో 400 కోట్ల పాత నోట్లు కనిపించాయి

తెలుగు పోస్ట్ 6 Apr 2026 5:39 pm

అరుణాచల్‌ సిఎంకు సుప్రీం షాక్.. సిబిఐ దర్యాప్తుకు ఆదేశం

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌ సిఎం పెమా ఖండు ఫ్యామిలీ కాంట్రాక్టులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిఎం పేమా ఖండూ కుటుంబం పదేళ్లలో రూ.1,270 కోట్ల విలువైన కాంట్రాక్టులు పొందారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని ఆదేశించింది. రెండు వారాల్లోగా దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐని ఆదేశించింది. అలాగే, కాంట్రాక్టుల కేటాయింపునకు సంబంధించిన అన్ని పత్రాలను ఏజెన్సీకి సమర్పించాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 16 వారాల్లోగా దర్యాప్తు నివేదికను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. సీబీఐ రెండు వారాల్లోగా ప్రాథమిక విచారణ ప్రారంభించాలి. ప్రాథమిక విచారణ, తదుపరి దర్యాప్తు.. ఏవైనా ఉంటే, జనవరి 1, 2015 నుండి డిసెంబర్ 31, 2025 మధ్య కాలంలో జరిగిన ప్రభుత్వ పనుల అమలు, కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్‌లను పరిశీలించాలి. ప్రభుత్వం, సీబీఐకి పూర్తి సహకారం అందించాలి. సీబీఐతో సమన్వయం కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక నోడల్ అధికారిని నియమించాలి. ఎలాంటి రికార్డులు ధ్వంసం కాకుండా రాష్ట్రం చూసుకోవాలి అని ఉత్తర్వులో పేర్కొంది. సేవ్ మోన్ రీజియన్ ఫెడరేషన్, వాలంటరీ అరుణాచల్ సేన అనే సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

మన తెలంగాణ 6 Apr 2026 5:35 pm

కన్నుల పండుగగా జేఎన్టీయూ15 వ స్నాతకోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (అనంతపురం)15 వ స్నాతకోత్సవ వేడుకలు ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం కన్నుల పండుగగా వేడుకలను నిర్వహించారు. గౌరవ డాక్టరేట్’మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ టెస్సీ థామస్కుకుఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అందజేశారు, అనంతరం గవర్నర్ 24 మంది గోల్డ్ మెడలు సాధించిన విద్యార్థులకు మెడల్స్ ను సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం విశ్వవిద్యాలయం సాధించిన అభివృద్ధిపై వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ […] The post కన్నుల పండుగగా జేఎన్టీయూ15 వ స్నాతకోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 5:33 pm

కేంద్రం కొత్త నిబంధన.. టోల్ గేట్ దాటాలంటే?

కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 6 Apr 2026 5:32 pm

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు…

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు… ఖిలావరంగల్, ఆంధ్రప్రభ : ఖిలావరంగల్ తూర్పు

ప్రభ న్యూస్ 6 Apr 2026 5:29 pm

రెండు లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం సాధ్యమేనా?

ఆచ‌ర‌ణ సాధ్యం కాని అమ‌రావ‌తి క‌న్నా మావిగ‌న్ తో సులువైన అభివృద్ధి జరుగుతుందని వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 6 Apr 2026 5:27 pm

అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి

అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి నివాళులు తెలిపిన విద్యార్థినీ విద్యార్థులు తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 6 Apr 2026 5:25 pm

Naga Shaurya’s BBK Trailer: Mass Entertainer

Naga Shaurya will next be seen in an intense and mass character in Bad Boy Karthik. Directed by newcomer Raam Desina and produced by Srinivasa Rao Chintalapudi, the film promises a power-packed blend of mass, fun, and emotion. The trailer of the movie has been released just a while ago. The trailer presents Karthik as […] The post Naga Shaurya’s BBK Trailer: Mass Entertainer appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 5:17 pm

ఉచిత ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి

–ఎంఈఓ తిరుమలరావు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఈ నెల 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక నారాయణ ప్రైమ్ స్కూల్‌లో 6వ నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ తిరుమలరావు తెలిపారు. సోమవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ తిరుమలరావు చేతులమీదుగా ఉచిత ప్రవేశ పరీక్ష కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత పరీక్షలలో ప్రతిభ కనబరిచిన […] The post ఉచిత ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 5:16 pm

యువ‌త త‌ప్పు చేస్తున్నారు: సిఎం రేవంత్

యువత నెమ్మ‌దిగా క్రీడ‌ల‌కు దూరం అవుతున్నారని.. క్రీడా మైదానాల‌ను వ‌దిలిపెట్టి యువ‌త త‌ప్పు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం గ‌చ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప‌బ్, డ్ర‌గ్ క‌ల్చ‌ర్ లోకి వెళ్తున్న యువ‌త‌ను తిరిగి క్రీడా మైదానాల్లోకి ర‌ప్పించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నానన్నారు. ఎస్సీ, ఆదివాసీ పిల్ల‌లకు... మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడే అవ‌కాశం క‌ల్పించామన్నారు. భార‌త ఫుట్ బాల్ చ‌రిత్ర‌లో హైద‌రాబాద్ న‌గ‌రానికి విశేషమైన పేరు ప్ర‌ఖ్యాత‌లు ఉన్నాయని..  1950 నుంచి 60 వ‌ర‌కు న‌ర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్ బాల్ గా హైద‌రాబాద్ ను పిలిచేవారని చెప్పారు. దేశంలోనే ఫుట్ బాల్ ఆట‌ను ఆద‌రించి అగ్ర‌శేణి క్రీడాకారుల‌ను హైద‌రాబాద్ అందించిందన్నారు. బీఎన్ మల్లిక్ ఒక స్పై మాస్ట‌ర్ అని.. నిఘా వ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్ద‌డంలో బీఎన్ మ‌ల్లిక్ ది కీల‌క పాత్ర‌ అని సిఎం చెప్పారు. టోర్న‌మెంట్ లో 34 జ‌ట్లు అద్భుత‌మైన క్రీడా నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించారన్న సిఎం.. దేశం న‌లుమూల నుంచి క్రీడాకారులు త‌ర‌లివ‌చ్చి మంచి ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌ప‌ర్చిన వారందరికి అభినందన‌లు తెలిపారు. సౌత్ కొరియాలో స్పోర్స్ యూనివ‌ర్సిటీ ని నేను సంద‌ర్శించాను. 30 ఎక‌రాల్లో ఉన్న స్పోర్స్ యూనివర్సిటీ అనేక బంగారు ప‌త‌కాలు సాధించింది. 140 కోట్ల జ‌నాభా ఉన్న మ‌న దేశంలో ఒక్క‌రు కూడా బంగారు ప‌త‌కం సాధించ‌లేక‌పోయాం. 4 కోట్ల జ‌నాభా ఉన్న సౌత్ కొరియా దేశం 30 కి పైగా ప‌త‌కాలు సాధించింది. సౌత్ కొరియాలో ఒక్క అమ్మాయి 2 బంగారు ప‌త‌కాలు సాధిస్తే ఇంత పెద్ద దేశం ఒక్క ప‌త‌కాన్ని తెచ్చుకోలేక‌పోయింది. అంత‌ర్జాయ‌తీ స్థాయిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేట్,ప‌బ్లిక్ భాగ‌స్వామ్యంలో ఏర్పాటయ్యే ఈ యూనివ‌ర్సిటీలో ప్ర‌ముఖ క్రీడాకారులు, పారిశ్రామిక‌వేత్త‌లు బోర్డు మెంబ‌ర్స్ గా ఉన్నారు. యువ‌త‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేయాలనే హైద‌రాబాద్ కు మెస్సీని తీసుకువ‌చ్చాను. ఎస్సీ, ఆదివాసీ పిల్ల‌లకు మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడే అవ‌కాశం క‌ల్పించాం. బాక్సింగ్ ఛాంపియ‌న్ నిక్క‌త్ జ‌రీన్ కు గ్రూప్ 1 ఉద్యోగం తో పాటు 2 కోట్ల న‌గ‌దు పుర‌స్కారం అందించాం. 10వ త‌ర‌గ‌తి ఫెయిల్ క్రికెటర్ సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వ‌డానికి అర్హ‌త లేక‌పోయినా అన్ని నిబంధ‌న‌లు స‌డ‌లించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. ఫారా ఒలింపిక్స్ లో రాణించిన దీప్తి జురాంజి కి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాం. క్రీడ‌ల్లో రాణించే తెలంగాణ యువ‌త‌కు ఉద్యోగాలు త‌ప్ప‌కుండా వ‌స్తాయి.. నాది హామీ అని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 6 Apr 2026 5:14 pm

బీజేపీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషిచేయండి….

బీజేపీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషిచేయండి…. బీజేపీలో పని చేసిన ప్రతి కార్యకర్తకు

ప్రభ న్యూస్ 6 Apr 2026 5:14 pm

ఘనంగా ఘంటసాల వర్ధంతి

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కళాజ్యోతిలో స్వర్గీయ పద్మశ్రీ గంటసాల వర్ధంతి వేడుకలు కళాజ్యోతి కమిటీ కార్యదర్శి బాలకొండ రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జిల్లా టూరిజం ఆఫీసర్ జయరాం, కళాజ్యోతి అధ్యక్షులు కుంటివల నారాయణ, జాతీయ రహదారులు అనంతపురం సూపర్డెంట్ ఇంజనీర్ సంజీవ రాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఘంటసాల పాటలు నేడు ఇంకను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. అటువంటి ఘంటసాల […] The post ఘనంగా ఘంటసాల వర్ధంతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 5:11 pm

మేము ఇచ్చిన హామీలను మర్చిపోయే నేతలం కాదు: భట్టి

హైదరాబాద్: పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత మనపై ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. పిప్పిరిలో మొదలు పెట్టి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించారు. పీపుల్స్ మార్చ్ కు మూడేళ్లు పూర్తైన వేళ సభలో భట్టి మాట్లాడారు.. పీపుల్ మార్చ్ లో ఇచ్చిన హామీల అమలుపై జివోలు జారీ చేశామని, ఇవాళే రూ.1,238 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశామని తెలియజేశారు. అధికారంలోకి వచ్చేందుకు నేతలు ఎన్నో హామీలు ఇస్తుంటారని, కొందరు నేతలు అధికారంలోకి రాగానే హామీలు మర్చిపోతారని విమర్శించారు. తాము ఇచ్చిన హామీలను మర్చిపోయే నేతలం కాదని, ప్రజలు అధికారం ఇచ్చింది.. హోదా అనుభవించడానికి కాదని అన్నారు. ఒకే విడతలో రుణమాఫీ చేసి రూ. 22,500 కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని, ప్రతి నియోజకవర్గంలో పేదల కోసం 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని అన్నారు. తొలివిడతలోనే మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని భట్టి పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని, ఇన్ని పథకాలు, హామీలు ఎలా చేయగలుగుతున్నారని ఇతర రాష్ట్రాల నేతలు అడుగుతున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో పుట్టడం అదృష్టంగా ప్రజలు భావించే పరిస్థితులు ఉండాలని భావించామని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వర్తించేలా రూ.5 లక్షలతో ఇందిరమ్మ బీమా పథకం తీసుకువచ్చామని అన్నారు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన పేదల కష్టాలు, అవసరాలు తెలుసని, ప్రజల సంక్షేమం తప్ప.. వారికెవరికీ వ్యక్తి ప్రయోజనాలు లేవని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 6 Apr 2026 5:09 pm

మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ బాధ్యతలు స్వీకారం…..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నార్పల మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ శ్రీమతి ఐ. మమతా దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి, పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న […] The post మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ బాధ్యతలు స్వీకారం….. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 5:07 pm

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ… భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ మండలంలోని బాబానగర్

ప్రభ న్యూస్ 6 Apr 2026 5:07 pm

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో బాధితుల వద్దకే పోలీస్ సేవలు…

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో బాధితుల వద్దకే పోలీస్ సేవలు… అచ్చంపేట డిఎస్పి పల్లె శ్రీనివాస్

ప్రభ న్యూస్ 6 Apr 2026 5:00 pm

మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో కాకతీయ స్విమ్మింగ్ క్రీడాకారుల ప్రతిభ….

విశాలాంధ్ర నందిగామ:-రాష్ట్రస్థాయి మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో నందిగామ కాకతీయ హెల్త్ క్లబ్ స్విమ్మింగ్ అకాడమీ క్రీడాకారులు తమ సత్తా చాటి 11 పథకాలను దక్కించుకున్నారని కాకతీయ హెల్త్ క్లబ్ చైర్మన్ కాపా రవీంద్రనాథ్ తెలిపారు స్విమ్మింగ్ కోచ్ గోపీచంద్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే విజయతలగా పథకాలను గెలుచుకున్న వారికి పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఆదివారం జగ్గయ్యపేట లో జరిగిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాస్టర్ స్విమ్మింగ్ పోటీలకు జగ్గయ్యపేట డ్రీమ్ అసోసియేషన్ […] The post మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో కాకతీయ స్విమ్మింగ్ క్రీడాకారుల ప్రతిభ…. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 4:54 pm

పెద్దజట్రంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ…

పెద్దజట్రంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ… ఊట్కూర్, ఆంధ్ర‌ప్ర‌భ : మండల పరిధిలోని

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:54 pm

Anil Ravipudi |హీరోగా మెప్పించేనా..?

Anil Ravipudi | హీరోగా మెప్పించేనా..? Anil Ravipudi | దర్శకరత్న దాసరి

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:49 pm

జి ప్లస్ త్రీ అర్జీదారుల నగదు వాపస్….మున్సిపల్ కమిషనర్ లోవరాజు

విశాలాంధ్ర నందిగామ:- జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తమ ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేసి అర్జీ సమయంలో తాము కట్టిన నగదును తమ అకౌంట్ నందు జమ చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తాము చెల్లించిన డబ్బులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయానికి అందించి అర్జిదారులు కట్టిన సొమ్మును వెనక్కి తీసుకోవాలని తెలిపారు దానిలో భాగంగా నందిగామ మున్సిపల్ కార్యాలయానికి 1492 మంది ఎక్కువ […] The post జి ప్లస్ త్రీ అర్జీదారుల నగదు వాపస్….మున్సిపల్ కమిషనర్ లోవరాజు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 4:48 pm

దేశ సమగ్రత, సంస్కృతి విలువలు కాపాడడం బీజేపీకేసాధ్యం…

దేశ సమగ్రత, సంస్కృతి విలువలు కాపాడడం బీజేపీకేసాధ్యం… ఊట్కూర్, ఆంధ్రప్రభ : దేశ

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:48 pm

ఘనంగా అంజన్నఆలయ పునః నిర్మాణం…

ఘనంగా అంజన్నఆలయ పునః నిర్మాణం… వైభవంగా హోమం, గణపతి, నవగ్రహాల పూజ… ఊట్కూర్,

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:44 pm

అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గిత్త

విశాలాంధ్ర- నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోనీ బి ఆర్ ఆర్ నగర్ లో రూ.1 కోటి వ్యయంతో నిర్మిస్తున్న నూతన అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి సోమవారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని అన్నారు .ఈ కార్యక్రమంలో నందికొట్కూరు టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పట్టణ […] The post అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గిత్త appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 4:32 pm

Viswambara |తెర వెనుక ఏం జరగుతోంది..?

Viswambara | తెర వెనుక ఏం జరగుతోంది..? Viswambara | విశ్వంభరపై అప్

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:29 pm

అంగన్వాడీలో గర్భిణీలకు శ్రీమంతాలు

అంగన్వాడీలో గర్భిణీలకు శ్రీమంతాలు రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలంలోని వేపలగడ్డ తండా

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:27 pm

ఉట్నూర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఉట్నూర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:24 pm

ప్రజా క్షేత్రంలో పలచబడ్డ ‘గుర్తింపు’.. పార్టీ పదవుల కోసం ‘ఆరాటం’!

​ పాలనలో గ్రామాల్లో తిరగని సర్పంచులుఇప్పుడు మాజీల ముద్రతో తిప్పలు​ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ​ విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఐదేళ్ల పాటు గ్రామాల్లో చక్రం తిప్పిన సర్పంచుల పదవీ కాలం ముగిసి వారం కావస్తోంది. మొన్నటి వరకు ‘సర్పంచ్ గారు’ అని పిలిపించుకున్న వారు ఇప్పుడు ‘మాజీలు’గా మిగిలిపోయారు. అయితే, పదవిలో ఉన్న కాలంలో ప్రజలతో మమేకమవ్వడంలో మెజారిటీ సర్పంచులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా […] The post ప్రజా క్షేత్రంలో పలచబడ్డ ‘గుర్తింపు’.. పార్టీ పదవుల కోసం ‘ఆరాటం’! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 4:23 pm

మార్కాపురం దారుణంలో.. పిడుగుపాటుకు కూలీ మృతి

అమరావతి: మార్కాపురం పుల్లల చెరువులో దారుణం చోటు చేసుకుంది. ఓ కూలీ మృతి చెందాడు. మొక్క జొన్న పరిశ్రమలో పనిచేస్తున్నబిహార్ అరారియా జిల్లాకు చెందిన కూలీలలో కన్నయ్య అనే వ్యక్తి కి పిడుగుపాటుకు గురై మృతిచెందగా, మరో నలుగురు కి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను యర్రగొండపాలెం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 6 Apr 2026 4:23 pm

ప్రపంచంలోనే బీజేపీ బలపడింది..

ప్రపంచంలోనే బీజేపీ బలపడింది.. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… హసన్ పర్తి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:21 pm

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి…

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి… నచ్చన్ ఎల్లాపూర్ సర్పంచ్ బొడ్డు స్పందన

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:15 pm

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తాం: రాహుల్ గాంధీ

పుదుచ్చేరిలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర హోదా కల్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం లాస్‌పెట్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. పుదుచ్చేరిని అక్కడి ప్రజలు నడపడం లేదని, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ కేంద్రపాలిత ప్రాంతాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతోందన్నారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పుదుచ్చేరిలోని నిరుద్యోగ యువతకు నెలకు రూ. 2,000 ఆర్థిక సహాయం అందిస్తామని, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో 30,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని కూడా హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం 40 ఏళ్ల వయస్సు వరకు సడలింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ. 20 లక్షల ఆరోగ్య బీమా అందుబాటులో ఉంటుందని చెప్పారు.  పుదుచ్చేరిలో పారిశ్రామిక, వస్త్ర రంగాలు క్షీణదశలో ఉన్నాయని.. వందలాది ఫ్యాక్టరీలు మూతపడ్డాయని రాహుల్ ఆరోపించారు. పుదుచ్చేరిలో నకిలీ మందుల తయారీ రాకెట్ నడుస్తోందని.. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఒక వసూలు ఏజెంట్‌గా మారింది. అన్ని కాంట్రాక్టులపై 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని అందరికీ తెలుసు. స్మార్ట్ సిటీలు, రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలకు కమీషన్ తీసుకుంటున్నారు. ప్రతి టోల్ గేట్ వద్ద డబ్బు చెల్లించమని పుదుచ్చేరి ప్రజలను బలవంతం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజల నుంచే కాదు, దేవుళ్ల నుంచి కూడా దొంగిలిస్తోంది. ఆలయ భూములను ఆక్రమించుకుంది అని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు.

మన తెలంగాణ 6 Apr 2026 4:09 pm

Stock Markets |గుప్పిట్లో సూచీలు.. నిఫ్టీ 23,600 దిగువకు!

Stock Markets | గుప్పిట్లో సూచీలు.. నిఫ్టీ 23,600 దిగువకు! Stock Markets

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:08 pm

కసాయి తండ్రి.. కటకటాలకు..

కసాయి తండ్రి.. కటకటాలకు.. కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : కన్న బిడ్డలనే చేతులారా

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:07 pm

28న విశాఖలో గూగుల్ రూ.15 బిలియన్ డేటా సెంటర్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడిగా గూగుల్ తన 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ హబ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభించనుంది. గత అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలుస్తోంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గూగుల్ సీఈఓ థామస్ కురియన్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖపట్నం సమీపంలోని ఆదవివరం, తార్లువాడ గ్రామాలు, అనకాపల్లి […] The post 28న విశాఖలో గూగుల్ రూ.15 బిలియన్ డేటా సెంటర్ ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 4:05 pm

రూ.14 వేల కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్…

రూ.14 వేల కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్… రాష్ట్ర మంత్రి డా.

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:03 pm

Janhvi Kapoor|హార్ట్‌బీట్ పెంచేస్తున్న అతిలోక సుంద‌రి

Janhvi Kapoor| హార్ట్‌బీట్ పెంచేస్తున్న అతిలోక సుంద‌రి ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌

ప్రభ న్యూస్ 6 Apr 2026 3:57 pm

భర్తతో వీడియో కాల్ మాట్లాడుతూ.. నటి సుభాషిణి ఆత్మహత్య

చెన్నై: తమిళ నాడులో బుల్లితెర నటి సుభాషిణి అలియాస్ శశ్వీబాల ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి చెన్నైలోని పోరూర్ సమీపంలో ఉన్న అయ్యప్పంతంగల్‌లోని తన అద్దె నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. శ్రీలంకకు చెందిన 36 ఏళ్ల సుభాషిణి.. టీవీ సీరియళ్ల తోపాటు పలు సినిమాల్లోనూ నటించింది. సుభాషిణి, బెంగళూరుకు చెందిన బిపిన్ చంద్రన్ (38)ను ఏప్రిల్ 2024లో వివాహం చేసుకుంది. పెళ్లీ తర్వాత వీరిద్దరూ బెంగళూరులోనే నివసిస్తున్నారు. చెన్నైలో షూటింగ్ పనులు ఉన్నప్పుడు బస చేసేందుకు వీలుగా, అయ్యప్పంతంగల్‌లోని ఒక ప్రైవేట్ నివాస సముదాయంలో ఆమె ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారని, మార్చి 3న ఆమె నగరానికి చేరుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఆమె తన భర్తతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుండగా.. కుటుంబ విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆ కాల్ జరుగుతుండగానే, ఆమె అపార్ట్‌మెంట్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె భర్త తెలిపారు. వెంటనే అపార్ట్‌మెంట్ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు వెంటనే పోరూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను పూనమల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు ఆమె మరణించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

మన తెలంగాణ 6 Apr 2026 3:47 pm

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయ ధరల పతనం.. రైతులకు భారీ నష్టాలు

ఉల్లిపాయ లేకుండా వంటింట్లో పనులు జరగవు. దాదాపు ప్రతి వంటలో ఉల్లి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఉల్లి ధరల్లో మార్పులు నేరుగా సామాన్యులపై ప్రభావం చూపుతుంటాయి. గతంలో ఉల్లి ధరలు కిలోకు రూ.100 దాటిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. గల్ప్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో భారతదేశం నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో సరఫరా పెరిగి, ధరలు పడిపోయాయి. కానీ ఈ […] The post తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయ ధరల పతనం.. రైతులకు భారీ నష్టాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 3:41 pm

ప్రతీ గ్రామానికి వస్తా.. సమస్యలు పరిష్కరిస్తా..

ప్రతీ గ్రామానికి వస్తా.. సమస్యలు పరిష్కరిస్తా.. ఇబ్బంది ఉన్నా.. గ్యారెంటీల అమలుఎన్నికల తర్వాత

ప్రభ న్యూస్ 6 Apr 2026 3:22 pm

husband killed wife |పోలీసుల ఎదుటే దారుణం..

husband killed wife |పోలీసుల ఎదుటే దారుణం.. ప్రియుడితో వెళ్లిపోయింద‌ని.. భార్య గొంతులో

ప్రభ న్యూస్ 6 Apr 2026 3:14 pm

కులమతాల దాడులకు చెక్.. ప్రేమ జంటల కోసం కర్ణాటకలో కొత్త బిల్లు ఆమోదం

పరువు హత్యలను అరికట్టుతూ, ప్రేమ జంటలకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులం, మతం పేరుతో జరిగే దాడుల నుంచి ప్రేమికులను కాపాడే లక్ష్యంతో ‘కర్ణాటక వివాహ ఎంపిక స్వేచ్ఛ, గౌరవం పేరిట జరిగే నేరాల నిరోధక బిల్లు-2026’కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ బిల్లులోని ముఖ్య నిబంధనల ప్రకారం తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావించే ప్రేమ జంటలు పోలీసులను ఆశ్రయిస్తే, ఫిర్యాదు […] The post కులమతాల దాడులకు చెక్.. ప్రేమ జంటల కోసం కర్ణాటకలో కొత్త బిల్లు ఆమోదం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 3:13 pm

Brutal Dharma GPS Glimpse: JD Chakravarthy Turns Heat On

Tharun Bhascker latest entertainer Gaayapadda Simham is all set to hit the big screens on May 1st. The promotions are in full swing for the movie. Interim, the latest character reveal has ignited fresh excitement, and the spotlight is firmly on JD Chakravarthy, who steps in as the ferocious yet flamboyant Brutal Dharma. The new […] The post Brutal Dharma GPS Glimpse: JD Chakravarthy Turns Heat On appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 3:10 pm

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ వచ్చేసింది..

హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. సోమవారం(ఏప్రిల్ 6) ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇన్నిరోజులు లవర్ బాయ్ గా అలరించిన నాగశౌర్య.. ఈసారి పూర్తి యాక్షన్ మూవీతో రాబోతున్నట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో విధి యాదవ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, నరేష్ వికె, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 6 Apr 2026 3:10 pm

Rajamouli joins hands for a VFX Studio

SS Rajamouli is a mastermind and he has utmost clarity among the Indian directors. The visuals in his films are always top class and he never compromises till he gets the best output. Rajamouli has collaborated with a VFX Studio and the graphics work of his upcoming film Varanasi is handled by the same firm. […] The post Rajamouli joins hands for a VFX Studio appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 3:05 pm

10grams gold|భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

10grams gold| భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బంగారం,

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:45 pm

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం…

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం… బెజ్జంకి, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:35 pm

Mojtaba Alive : ఇతడు.. అతడే Andhra Prabha News

Mojtaba Alive : ఇతడు.. అతడే Andhra Prabha News ( ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:35 pm

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకం..

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకం.. వర్గంటి రాంమోహన్ గౌడ్‌కు శుభాకాంక్షలు… ​మేడ్చల్,

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:32 pm

అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ

అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:28 pm