SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

‘భూ’మంతర్

అధికార వ్య వస్థలు.. రాజకీయ పార్టీలు... కార్పొరేట్ సంస్థలు కుమ్మక్కయితే వచ్చిన ఫలితమే రూ.6 లక్షల కోట్ల విలువైన భూ స్కాం. మహా నగర నడిబొడ్డున ఉన్న కూకట్‌పల్లి ప్రాంతంలో జరిగిన ఈ భారీ భూ కుంభకోణం దేశ చరిత్రలో సంచలనాత్మక స్కాంగా నిలుస్తుందంటే అతిశయోక్తి కాదనిపిస్తోంది. పరిశ్రమల ముసుగులో రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూములను రియల్ వ్యాపారానికి మళ్లించిన తీరుపై ఏ ఒక్క రాజకీయ పార్టీ స్పందించకపోవడం, అధికార వ్యవస్థలు పట్టించుకోకపోవడం, నిఘా సంస్థలు నిగ్గుతేల్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార వ్యవస్థలు, రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థతో కుమ్మక్కైన ఫలితంగానే కూకట్‌పల్లి ఐడీఎల్ భూములను బడా నిర్మాణ సంస్థలకు దోచిపెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.6 లక్షల కోట్ల విలువైన ప్రజా సంపద ఎవరి జేబుల్లోకి వెళ్లిందనేది అతిపెద్ద ప్రశ్న. ‘రూ.6 లక్షల కోట్ల భూ స్కాం’ అనే ఆరోపణలే యావత్ దేశాన్ని కలవరపెడుతున్నది. ఈ వ్యవహారంలో లక్షల కోట్లు చేతులు మారాయాని, 6 లక్షల కోట్ల భారీ భూ దోపిడీపై నిగ్గుత్చేలాలని కోరుతూ ఇటీవల బోడుప్పల్ మునిసిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు చింతల శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎసీబీ, సీబీఐ లాంటి విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్‌పల్లి ఐడీఎల్ భూముల స్కాం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నాటి రైతుల త్యాగం.. నేటి కార్పొరేట్ సంస్థల భోగం: కూకట్‌పల్లి భూమికి ఉన్న విలువ బంగారం కంటే ప్రియమైనది. ఇక్కడ ఎకరం రూ.200 కోట్లకు తక్కువ పలుకదంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతంలో ఏడు దశాబ్దాల క్రితం.. అంటే 1965లో డిటోనేటర్ల పరిశ్రమ ఏర్పాటు కోసం 870.13 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూమితోపాటు రైతులు, ఆధ్మాత్మిక సంస్థల నుంచి సేకరించి పరిశ్రమకు కట్టబెట్టింది. పరిశ్రమ ఏర్పాటైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నాడు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, యాదవ, మున్నూరు కాపులకు చెందిన చిన్న, సన్నకారు రైతుల నుంచి ఎకరానికి రూ.50 ధర ఖరారు చేస్తే బాధితులు కోర్టు మెట్లెక్కారు. దీంతో కోర్టు రూ.వెయ్యి ఇవ్వాలని ఆదేశించింది. కానీ, నాటి ప్రభుత్వం ఎకరానికి రూ.500 చేతుల పెట్టి బలవంతంగా భూ సేకరణ చేశారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఉదరగొట్టి నమ్మబలికారని నాటి భూ బాధిత కుటుంబాలు, వారి వారసులు వాపోతున్నారు. ఐడీఎల్ కంపెనీ పేరుతో...: 1965లో రక్షణ రంగానికి అవసరమైన డిటో నేటర్ల తయారీ కోసం ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్ (ఐడీఎల్) పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నగర శివారులోని కూకట్‌పల్లి గ్రామ శివారులోని 870.13 ఎకరాల భూమిని సేకరించి సంస్థకు అప్పగించింది. ఇందులో 181.04 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 151.08 ఎకరాల భూమి రైతుల నుంచి సేకరించారు. అత్యంత ప్రమాదకరమైన డిటోనేటర్ల పరిశ్రమ కావడంతో కంపెనీ చుట్టూ బఫర్‌జోన్ ఉండాలన్న నిబంధన మేరకు నిజాంకాలంలో అప్పటి నైజాంరాజు ఉదాసీన్ మఠంకు ఇచ్చిన 538. 01 ఎకరాల భూమిని 99 ఏండ్ల లీజు పద్ధతిలో ఏడాదికి రూ.56 వేలను మఠంకు చెల్లించే ఒప్పందంతో ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఉదాసీన్ మఠం వారు సుప్రింకోర్టు మెట్లెక్కి పదేళ్లు పోరాడి హిందూజా చెర నుంచి బయటపడ్డారు. ఇది వేరే విషయం. పరిశ్రమ కోసం పచ్చటి పసిడి పంటలు పండించుకొని జీవనం సాగించే కూకట్‌పల్లి రైతులే బలి పశువులుగా మారారు. తమకున్న ఒకటి, రెండు ఎకరాలను లాక్కుంటే తాము ఎలా బతకాలని అప్పట్లోనే భూ బాధితులు ప్రశ్నిస్తే భూమి ఇచ్చిన ప్రతి రైతు కుటుంబానికి ఐడీఎల్ కంపెనీలో ఉద్యోగం ఇస్తామన్న గ్యారంటీ ఇచ్చారు. కానీ, ఉద్యోగం కాదు కదా ఏ ఒక్క కుటుంబానికి ఒనగూడిన ప్రయోజనం ఏమీ లేదు. భూములను త్యాగం చేసిన రైతుల ఆశలు అడియాశలుగానే మిగిలాయి. అనాడే సామాజిక న్యాయానికి ఘోరమైన అన్యాయం జరిగింది. ఇప్పటికీ భూ బాధిత కుటుంబాలు, వారసులు న్యాయస్థానాల్లో న్యాయం దక్కుతుందని లక్షల వెచ్చించి కేసులు వేసి కొట్లాడుతున్నారు. భూములను కొల్లగొట్టేందుకు హిందూ ‘జాదు’ వ్యవహారం: ఐడీఎల్ కంపెనీ రెండు దశాబ్దాల పాటు డిటోనేటర్ల తయారీలో అగ్రగామిగా నిలిచినప్పటికీ అనేక కారణాల వల్ల 2003లో హిందూజా గ్రూపునకు చెందిన గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మిటెడ్ చేసుకుంది. హిందూజా సంస్థ పాలనా పగ్గాలు చేపట్టిన నాటినుంచి కంపెనీలో తరచూ ప్రమాదాలు సంభవించడం, పదుల సంఖ్యలో కార్మికులు మృతిచెందడం, క్రమంగా సంస్థ తన ఉత్పత్తిని, ఉద్యోగులను తగ్గించుకుంటూ వచ్చిందని అందులో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా ఉత్పత్తి పూర్తిగా తగ్గించివేయడంతో కంపెనీ కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోయింది. నగర నడిబొడ్డున ఉన్న ఎంతో విలువైన భూములను దృష్టిలో పెట్టుకునే హిందూజా సంస్థ ఐడీఎల్ నుంచి కంపెనీని ంపెనీని చేసుకుందని రైతు బాధితులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అపార అనుభవం కలిగి ఉన్న హిందూజా సంస్థ కూకట్‌పల్లిలో ఉన్న ఎంతో విలువైన భూములపై కన్నేసి వ్యవహారాన్ని చాకచాక్యంగా నడిపించుకుంటూ వస్తోంది. బెంగుళూరు తరహాలోనే...: బెంగళూరులోని ఐడీఎల్ కంపెనీనీ స్వాధీనం చేసుకుని అక్కడి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లుగానే ఐడీఎల్ కంపెనీనీ హిందూజా స్వాధీనం చేసుకుంది. కంపెనీ నిర్వహణ కష్టం కావడంతో అక్కడి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టింది. ఇందుకోసం అక్కడ ఎల్లంక, చిక్కజాల, నవరత్న అగ్రహారాల్లో భూములను ఓ పద్ధతి ప్రకారం రియల్ వ్యాపారం చేసి కమర్షియల్ నిర్మాణాలతో అభివృద్ధి చేసింది. అదే తరహాలో కూకట్‌పల్లి ఐడీఎల్‌కు చెందిన 333 ఎకరాలను రాజకీయ, అధికార వ్యవస్థలను మేనేజ్ చేసుకొని రియల్ సంస్థలకు కట్టబెట్టిందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. జీవో నెంబర్ ౩౦2 ఆధారంగా కంపెనీకి చెందిన 100 ఎకరాలను మొదట పారిశ్రామికేతర అవసరాలకు మళ్లించిన సంస్థ తర్వాత 2022లో మిగతా 233 ఎకరాలను ప్లాట్లుగా చేసి బడా నిర్మాణ సంస్థలకు కట్టబెట్టి సొమ్ము చేసుకున్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటి టర్మ్‌లో ఫైల్‌ను పక్కన పెట్టింది. రెండో టర్మ్‌లో అధికారంలోకి వచ్చిన తరువాత 2022లో వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ౩౦2 ఆధారంగా అని పేర్కొంటూ కంపెనీకి చెందిన మిగతా 233 ఎకరాలను పారిశ్రామికేతర అవసరాలకు ఉపయోగించుకోవడానికి కూకట్‌పల్లి గ్రామ శివారు సర్వే నెం.627, 629, 1011/1, 1011, 1011/3, 1011/4, 1011/12, 1013 నుంచి 1023, 1031, 1032లలోని మొత్తం 333 ఎకరాలను విక్రయించడానికి 2021 అక్టోబర్ 29న ఎండార్స్‌మెంట్ నెం.ఎల్‌సీ/22881/2008, 2023 సెప్టెంర్ 26న ఎన్‌ఓసి/ ఎల్‌సీ /2281/ 2008 అప్పటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ జారీ చేశారు. రైతుల నుంచి బలవంతంగా సేకరించిన 151.08 ఎకరాలు, ప్రభుత్వానికి చెందిన 181.04 ఎకరాలు కలిపి మొత్తం 333 ఎకరాలకు కార్పొరేట్ బడా నిర్మాణ సంస్థలకు విక్రయించిన వాటిలో ఉన్నాయి. ప్రభుత్వ అధికార వ్యవస్థలు చట్టాన్ని తుంగలో తొక్కి దాసోహం కావడంతో హిందూజా దేశంలోనే పెరిన్నికగన్న 14 నిర్మాణం సంస్థలకు లే అవుట్ చేసి భూములను రిజిస్ట్రేషన్‌లు చేసి అప్పగించడం... సదరు నిర్మాణసంస్థలు వేగంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు పొంది విల్లాస్‌లతో పాటు, హైరైజ్డ్ బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలను జెడ్ స్పీడ్‌తో చేపడుతుండటం గమనార్హం. రాజ్యాంగం కల్పించిన హక్కులను అపహస్యం చేసే విధంగా... కూకట్‌పల్లి ఐడీఎల్ భూముల కుంభకోణం భారత రాజ్యాంగంలోని పలు మౌలిక సూత్రాలను అపహస్యం చేసేవిధంగా రాష్ట్రంలో అధికార వ్యవస్థలు వ్యవహరించాయని స్పష్టమవుతోంది. ఆర్టికల్ 14- (సమానత్వం) 21 (జీవనహక్కు) 300 ఏ (ఆస్తి హక్కు) మౌలిక సూత్రాలను పూర్తిగా ఉల్లంఘించాయి. ప్రజా ప్రయోజనం పేరిట భూమిని స్వాధీనం చేసుకొని తరువాత కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు లాభం చేకూర్చడం ఆర్టికల్ 14కు విరుద్ధం. రైతుల జీవనాధారమైన భూమిని అన్యాయంగా హరించడం, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును కోల్పోయేలా చేశారు. చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఎవరిని వారి ఆస్తి హక్కులను హరించరాదు. భూమి స్వాధీనం తర్వాత దాని ఉద్దేశాన్ని మార్చడం ఆర్టికల్ 300 ఏకు విరుద్ధమని సుప్రిం ఇదే తరహా కేసుల్లో అనేక మార్లు స్పష్టం చేసింది. దేశంలోని భౌతిక వనరులు సమాజానికి సమానంగా ఉపయోగపడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ప్రజా సంపదను ప్రైవేటు సంస్థల లాభాల కోసం వినియోగించడం ఆర్టికల్ 39 (బీ) ప్రకారం రాజ్యాంగ మూల సూత్రానికి విరుద్ధమని న్యాయ నిపుణులు చెప్తున్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంపదను కొద్ది మంది వ్యక్తులకు, సంస్థలకు ప్రయోజనం కల్గించేవిధంగా చేయడం రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రిం కోర్టు తీర్పులకు భిన్నంగా ..: భాతర రాజ్యంగ పరిరక్షకులుగా ఉన్న అతున్నత న్యాయస్థానం ఇచ్చిన పలు తీర్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన భూమిని ఆ ఉద్దేశ్యం నెరవేరకపోతే మరే ఇతర ప్రయోజనాలకు మళ్లించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని, అవిచెల్లవని పలుమార్లు అనేక తీర్పుల్లో స్పష్టంచేసినా రాష్ట్ర అధికార వ్యవస్థలు, సంస్థలు మాత్రం పెడచెవిన పెడుతూ కార్పొరేట్ సంస్థలకు దాసోహమవుతున్న తీరుపై న్యాయ నిపుణులు, ప్రజలు మండిపడుతున్నారు. రాయల్డ్ ఆర్చిల్డ్ హోటల్స్ వర్సెస్ జయరామిరెడ్డి (2011) కేసులో ప్రజా ప్రయోజనం పేరిట స్వాధీనం చేసుకున్న భూమిని ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు మళ్లించడం ‘ప్రాడ్ ఆన్ పవర్’గా పరిగణించబడుతుందని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా పుణె మున్సిపల్ కార్పొరేషన్ వర్సెస్ హరక్‌చంద్ మిశ్రీమాల్ సోలంకీ (2014) కేసులో భూములను త్యాగంచేసిన వారికి సరైన నష్టపరిహారం అందించకపోయినా, అసంపూర్తిగా నష్టపరిహారంతో సరిపుచ్చినా చెల్లదని స్పష్టం చేసింది. భూమి వినియోగాన్ని ఇండస్ట్రీయల్ నుంచి రెసిడెన్సియల్ లేదా కమర్షియల్‌గా మారినప్పుడు, అసలు రైతులు పెరిగిన పరిహారం, పునరావాస ప్రయోజనాలకు అర్హులని భూ సేకరణ చట్టం 2013లోని పలు సెక్షన్‌లు స్పష్టం చేస్తున్నాయి. అధికారులు, రాజకీయ నాయకుల పాత్రపై ప్రభుత్వం ఆరా..: కూకట్‌పల్లిలో లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూమిని పారిశ్రామికేతర (రియల్ ఎస్టేట్) అవసరాలకు మళ్లించడంపై ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. హిందూజా సంస్థ అధీనంలో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ విభాగం భూములను కన్వర్షన్‌కు ఎన్‌ఓసీల జారీ, భారీ నిర్మాణ సంస్థలకు విక్రయించడం పెద్ద స్కాం జరిగిందని ప్రభుత్వం భావిస్తున్నది. భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు రిజిస్ట్రేషన్ చేసిన తీరు, అప్పటి జిల్లా కలెక్టర్, రెవెన్యూ సెక్రటరీ, టీఎస్‌ఐఐసీ, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం, జీహెచ్‌ఎంసీల పాత్ర, చట్టాల ఉల్లంఘన, రాజకీయ నాయకుల పాత్రపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. ఈ భారీ భూ స్కాంపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా లేక గతంలో మాదిరిగానే మిన్నకుంటుందా అనేది వేచిచూడాలి. ఫోటో రైటప్‌ః 13కేపీహెచ్‌బి 1 నుంచి 10వరకు ఫోటోలు

మన తెలంగాణ 15 Apr 2026 4:00 am

అంబేద్కర్‌ను బందీ చేశారు

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2024 నుండి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని బందీగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము 14 రోజుల క్రితం హెచ్చరించిన తర్వాతే ప్రభుత్వం భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారికంగా వేడుకలు నిర్వహిస్తోందని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ నుండి భారీ కాన్వాయ్‌తో హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం వద్దకు కెటిఆర్, బిఆర్‌ఎస్ నాయకులు వెళ్లి బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ బిఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే అంబేద్కర్ సిద్ధాంతమే పునాదిగా తాము రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. కేవలం మాటల్లోనే కాకుండా, చేతల్లో గౌరవం చూపించాలనే ఉద్దేశంతో బిఆర్‌ఎస్ హయాంలో దళిత బిడ్డల కోసం 1000 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే రాష్ట్ర సచివాలయానికి బాబాసాహెబ్ పేరు పెట్టి గౌరవించుకున్నామని వ్యాఖ్యానించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటే, కాంగ్రెస్ మాత్రం రూ. 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి కనీసం 12 పైసలు కూడా విదిల్చలేదని విమర్శించారు. చేవెళ్ళ ఎస్‌సి,ఎస్‌టి డిక్లరేషన్‌తో పాటు బిసి, రైతు డిక్లరేషన్లను అమలు చేసే వరకు అంబేద్కర్ స్ఫూర్తితో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.అనంతరం కెటిఆర్, ఇతర బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు విగ్రహం కింది భాగంలో ఉన్న భవనంలోని మ్యూజియంను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ జీవిత విశేషాలను, చారిత్రక ఘట్టాలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మే, జూన్ నుంచి ప్రత్యక్ష పోరాటాలు ప్రారంభిస్తాం : కెటిఆర్ మే, జూన్ నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలు ప్రారంభించనున్నట్లు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వెల్లడించారు. ప్రధానంగా ఎస్‌సి, ఎస్‌టి వర్గాల సమస్యలపై తొలుత దృష్టి సారించబోతున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 20న జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభకు పార్టీ అధినేత కెసిఆర్ హాజరుకానున్నారని తెలిపారు. అనంతరం ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ ముఖ్య నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి,మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్,ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ,శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి,మాజీ మంత్రులు, బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన డిక్లరేషన్లను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఏయే ప్రాంతాల్లో ఏయే హామీలు ఇచ్చారో, తిరిగి అదే ప్రాంతాల్లో సభలు పెట్టి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాల కోసమే వాడుకుందని మండిపడ్డారు. అంబేద్కర్ పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా, ఆయనకు భారతరత్న ఇవ్వడంలోనూ, పార్లమెంటులో ఫొటో పెట్టడంలోనూ కాంగ్రెస్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించకుండా గేట్లు వేస్తే, తాము హెచ్చరించిన తర్వాతే గేట్లు తెరుచుకున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఎస్‌సి, ఎస్‌టిలు మోసపోయారని అన్నారు. వెయ్యికి పైగా గురుకులాల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ అరాచక పాలనపై బిఆర్‌ఎస్ గట్టిగా నిలదీస్తుందని అన్నారు.

మన తెలంగాణ 15 Apr 2026 3:30 am

బుధవారం రాశి ఫలాలు (15-04-2026)

మేషం వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. ధన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి. వృషభం రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదర వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు. మిధునం పాత ఋణ ఒత్తిడి నుండి బయట పడటానికి నూతన ఋణాలు చెయ్యాల్సి వస్తుంది. చిన్న నాటి మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట చికాకులు అధికమౌతాయి. వృత్తి వ్యాపారాలలో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. కర్కాటకం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్ధికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సింహం ఆదాయం కన్నా ఖర్చు అధికమౌతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన సమస్యలతో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కన్య సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు పొందుతారు. ఆర్ధిక లాభం కలుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. అన్ని విషయాలలో బంధు మిత్రుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. తుల ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులలో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృశ్చికం చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ధనస్సు సంతాన విద్యా విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి. ఖర్చులను అదుపు చెయ్యడం కష్టంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మకరం జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. కుంభం వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం విషయంలో లోటుపాట్లు అధిగమిస్తారు. వ్యాపారములలో శత్రు సమస్యలు నుండి బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీనం నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తవహించాలి.  

మన తెలంగాణ 15 Apr 2026 12:10 am

కోల్‌కతా నైట్‌రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్‌ విజయం

ఐపిఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి మెరుపులు మెరిపించాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న శాంసన్ 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 48 పరుగులు చేశాడు.193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.

మన తెలంగాణ 14 Apr 2026 11:49 pm

హైకోర్టుకు నలుగురు శాశ్వత అదనపు న్యాయమూర్తులు

మన తెలంగాణ/హైదరాబాద్ : 2025లో తెలంగాణ హైకోర్టుకు నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులను శాశ్వతం చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మంగళవారం జరిగిన కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శాశ్వత నియామకానికి సిఫార్సు చేయబడిన అదనపు న్యాయమూర్తులలో జస్టిస్ యారా రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు, జస్టిస్ ఇ. తిరుమల దేవి, - జస్టిస్ బి.ఆర్. మధుసూదన్ రావులు ఉన్నారు. 42 మంది న్యాయమూర్తుల మంజూరైన బలం ఉన్న తెలంగాణ హైకోర్టు, ప్రస్తుతం 28 మంది న్యాయమూర్తులతో పనిచేస్తోంది, దీంతో 14 ఖాళీలు ఉన్నాయి.

మన తెలంగాణ 14 Apr 2026 11:34 pm

మంత్రివర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటే తప్పేంటీ?:జగ్గా రెడ్డి

రాష్ట్ర మంత్రివర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటే తప్పేంటీ? అని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికీ చెబుతానని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నందున ఆయన సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఇవ్వరాదన్న వాదనను ఆయన తోసిపుచ్చారు.మహేష్ గౌడ్ పేరును పిసిసి చీఫ్‌గా ప్రతిపాదించింది తానేనని ఆయన తెలిపారు. రెడ్లు అందరూ మద్దతు ఇచ్చినందుకే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ అయ్యారని ఆయన అన్నారు. తాము అంత ఫ్రెండ్లీగా ఉన్నామని, ఎవరూ మిత్రత్వాన్ని చెడగొట్టవద్దని ఆయన కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు లేకుండా రాజకీయం లేదన్నారు. ఎవరు డబ్బు పెడితే వాళ్ళు నాయకుడు అవుతున్నారని ఆయన తెలిపారు.ఎమ్మెల్యేగా గెలుపొందాలంటే వంద కోట్లు ఖర్చు అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల కోసం పని చేశానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ నెల 30న సంగారెడ్డికి రావాల్సిందిగా ఆహ్వానించానని ఆయన తెలిపారు. ఇంకా అభివృద్ధి పనులపై నివేదిక ఇచ్చామని, అభివృద్ధి పనులపై ఈ నెల 21న సమీక్ష ఉంటుందన్నారు. 10 వేల మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చామని ఆయన తెలిపారు. గతంలో పేదలకు ఇచ్చిన భూములు బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతరులకు ధారదత్తం చేసిందని ఆయన విమర్శించారు. ఇంకో 15 వేల మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాదికి రాజకీయ ఉనికి లేకుండా కుట్ర జరుగుతున్నదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఏమీ మాట్లాడలేరని, ఏమీ చేయలేరని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌లో ఏదైనా సోనియా గాంధీకి చెప్పుకోవడానికి స్వాతంత్య్రం ఉందని, బిజెపిలో ఆ స్వేచ్ఛ ఉండదని ఆయన విమర్శించారు. రెండున్నర ఏళ్ళలో తాను సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా భూమి తీసుకున్నట్టు లేదా జోక్యం చేసుకున్నట్లు సమాచారం ఉందా..? అని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడిగారని ఆయన చెప్పారు. అటువంటిదేమీ తమ జిల్లాలో లేదని సర్టిఫికెట్ ఇచ్చానని ఆయన తెలిపారు. తనకు ఎదుటి వారిపై ఆరోపణలు చేసే అలవాటు లేదన్నారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు మళ్లీ ఆరోపణలు చేస్తే వాళ్ళ బండారం బయటపెడతానని ఆయన హెచ్చరించారు. పటాన్‌చెరువులో ఎవరు దందా చేశారో చెబుతానని అన్నారు. 2014 నుంచి తాను ఎక్కడైనా భూములు సంపాదించాని బిఆర్‌ఎస్ నాయకులు వెతికారని, జల్లెడ పట్టినా ఏమీ దొరకలేదని జగ్గారెడ్డి తెలిపారు. సోషల్ మీడియాను రద్దు చేయాలని, ప్రతి చిన్న విషయాన్ని వివాదం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితున్ని సీఎం ఎందుకు చేయలేదని ఎవరైనా అడిగారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

మన తెలంగాణ 14 Apr 2026 11:30 pm

మహిళలు హక్కుల కోసం వేచి చూడాల్సిన పని లేదు: ప్రధాని మోదీ

మహిళల రిజర్వేషన్ చట్టాన్ని 2029 సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేయడం దేశ సమిష్టి అభిప్రాయమని, దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీర్ఘకాలంగా ఎదురుచూసిన తర్వాత ఆమోదం పొందిన ఈ చట్టాన్ని ఆలస్యం చేయకుండా అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన దేశ మహిళలకు ఒక లేఖ రాసి దాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.“ప్రస్తుతం చాలా రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. అదేవిధంగా చట్ట సభల్లోనూ వారి ఉనికిని చాటేందుకు ఈ రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టాం. పార్లమెంటులో ఏప్రిల్ 16 నుంచి జరగనున్న మూడు రోజుల సమావేశాల్లో ‘నారీ శక్తి వందనం అధినియమ్’ బిల్లులో సవరణలు ప్రవేశపెడతాం. దీనిపై ఏమాత్రం ఆలస్యం జరిగినా అది భారతదేశ మహిళలకు అన్యాయం చేసినట్లే.. 2029 లోక్‌సభ ఎన్నికల సమయానికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. భారతదేశ కూతుర్లు వారి హక్కుల కోసం ఇంకా ఇంకా వేచి చూడటం సబబు కాదు. చట్టసభల్లో వారి గొంతుకను గట్టిగా వినిపించే సమయం వచ్చింది. దీంతో ప్రజాస్వామ్యం కూడా దృఢంగా మారనుంది. జరగబోయే పార్లమెంటు సమావేశానికి రాజ్యాంగ సవరణ ఆమోదం కోసం, దేశం నలుమూలలా ఉన్న కోట్లాది మహిళల ఆశీస్సులు కోరుకుంటున్నాను. మీరంతా మీ స్థానిక ఎంపీలకు లేఖ రాసి పార్లమెంటు సభల్లో పాల్గొనాలని వారిని కోరండి అంటూ దేశ మహిళలకు రాసిన లేఖలో మోదీ పేర్కొన్నారు.ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందు డెహ్రాడూన్‌లో జరిగిన ప్రజాసభలో మోదీ మాట్లాడుతూ, దేశంలోని సోదరీమణులు, కుమార్తెల హక్కులకు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ముందుకు తీసుకెళ్లాలి అని అన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి మహిళలకు కోటా అమలు చేయడానికి ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ సవరణలను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. 2023 సెప్టెంబర్‌లో పార్లమెంట్ ఆమోదించిన ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ (మహిళల రిజర్వేషన్ చట్టం) ప్రకారం, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడో వంతు స్థానాలు కేటాయించే విధానం అమలులోకి రానుంది. దేశ జనాభాలో సగం అయిన మహిళలకు వారి హక్కు దక్కేలా 2029 నాటికి చర్యలు తీసుకుంటాం అని మోదీ స్పష్టం చేశారు. ఈ చట్టం దాదాపు నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆమోదం పొందిందని గుర్తుచేసిన ప్రధాని, ఇకపై మహిళల హక్కుల అమలులో ఆలస్యం ఉండకూడదన్నారు. ఇది దేశవ్యాప్తంగా ప్రతి మహిళ ఆశించే లక్ష్యం, సమిష్టి సంకల్పం అని ఆయన పేర్కొన్నారు. దేశంలోని మహిళలకు ఉద్దేశించి తాను లేఖ రాసినట్లు వెల్లడించిన మోదీ, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరినట్లు తెలిపారు. మహిళలు విధాన రూపకల్పనలో, నిర్ణయ ప్రక్రియలో చురుకుగా పాల్గొంటే ‘వికసిత భారత్’ లక్ష్యం మరింత బలపడుతుందని ఆయన అన్నారు. 2029లో లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మహిళల కోటాతో జరిగితే భారత ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో మహిళలు ప్రతిభ చాటుతున్న నేపథ్యంలో శాసనసభల్లో వారి ప్రాతినిధ్యం పెరగడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

మన తెలంగాణ 14 Apr 2026 11:12 pm

ఆతిథ్యానికి ముందంజ.. హోటల్ బిల్లు కట్టలేక వెనుకంజ

అమెరికాఇరాన్ చర్చల వేదికైన సెరెనాకు బిల్లు చెల్లించలేని పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్ : అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశానికి చర్చలకు వేదికైన ప్రముఖ హోటల్ బిల్లు చెల్లించడం సమస్యగా తయారైంది. ఆతిథ్యానికి ఇస్లామామాద్‌లోని సెరెనా హోటల్ వేదికైంది. చర్చలు విఫలం అయ్యాయి కానీ ఇరు వర్గాల ప్రతినిధుల బృందానికి ఇచ్చిన ఆతిథ్యానికి హోటల్ బిల్లులు తడిసి మోపెడయ్యాయి. బిల్లుల చెల్లింపులకు పాక్ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో హోటల్ యజమానికి స్వయంగా కలుగజేసుకొని పరిష్కరించుకోవాల్సి వచ్చిందని మీడియా కథనాలు వెల్లడయ్యాయి. పాకిస్థాన్‌కు దౌత్యపరంగా అత్యుత్తమ ఆశయం ఉన్నప్పటికీ కనీసం హోటల్ ఖర్చులు కూడా భరించలేని దారిద్య్రం ప్రభుత్వాన్ని వెన్నాడుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. 

మన తెలంగాణ 14 Apr 2026 11:04 pm

పెట్రోలుపై రూ.18, డీజిల్‌పై రూ.35 పెరగొచ్చు

 అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి ఉత్పత్తి ఖర్చులు పెరిగినప్పటికీ పెట్రో, డీజిల్ రేట్లను ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు స్థిరంగా కొనసాగిస్తున్నాయి. దీని వల్ల లీటరు పెట్రోలుపై రూ.18, లీటర్ డిజిల్‌పై రూ.35 భారం పడుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. బిపిసిఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్), ఐఒసి (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్), హెచ్‌పిసిఎల్ (హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్)లు 2022 ఏప్రిల్ నుంచి రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సమయంలో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ 100 డాలర్లకు చేరాయి. ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా బ్యారెల్ క్రూడ్ రేటు 120 డాలర్ల వరకు పెరిగింది. ఈ రెండు సందర్భాలలోనూ ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు రిటైల్ పెట్రో ధరలను పెంచకుండా స్థిరంగా కొనసాగిస్తూ వస్తున్నాయి. ఈ మూడు ప్రభుత్వ చమురు కంపెనీలు గత నెలలో ప్రతి రోజు రూ.2400 కోట్ల మేరకు నష్టం చూశాయి. అయితే లీటర్‌కు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోలు, డీజిల్‌పై తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రతి రోజు నష్టం రూ.1600 కోట్లకు తగ్గింది. అయితే అంతర్జాతీయంగా చమురు ధరల తగ్గుదల ప్రయోజనాన్ని కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయకుండా తమ నష్టాలను పూడ్చుకోవడానికి వినియోగించుకున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్లోబల్ సంస్థ మార్కూ గ్రూప్ నివేదిక ప్రకారం, స్పాట్ పెట్రోలు, డీజిల్ ధరలు బ్యారెల్‌కు 135, 165 డాలర్ల చొప్పున ఉన్నాయి. సంస్థ అంచనా ప్రకారం, భారతీయ చమురు కంపెనీలు పెట్రోలుపై రూ.18, డీజిల్‌పై రూ.35 చొప్పున నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఎన్నికల తర్వాత పెరిగే అవకాశం ఏప్రిల్ ఆఖరులో జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత రిటైల్ ఇంధన ధరలు పెరిగే అవకాశముందని మార్కూ గ్రూప్ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తీవ్ర అస్థిరతలో ఉన్నప్పటికీ 2025లో భారత్ దాదాపు 88 శాతం క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. దీనిలో మధ్యప్రాచ్యం నుంచి 45 శాతం, రష్యా నుంచి 35 శాతం, అమెరికా నుంచి 6 శాతం దిగుమతి చేసుకుంది. దీంతో ప్రపంచంలో అత్యధిక చమురు దిగుమతి దేశంగా భారత్ కొనసాగుతోంది.

మన తెలంగాణ 14 Apr 2026 10:59 pm

రెడ్‌మి ఎ7 ప్రో 5జి లాంచ్

 షియోమి ఇండియా తన రెడ్‌మి ఎ సిరీస్‌లో తొలి ప్రో మోడల్ ఎ7 ప్రో 5జిని విడుదల చేసింది. దీనిలో 6.9 అంగుళాల అతిపెద్ద డిస్‌ప్లే, 6300 ఎంఎహెచ్ భారీ బ్యాటరీ ఉన్నాయి. 32ఎంపి ఎఐ కెమెరా, హైపర్ ఒఎస్ 3.0 వంటి అధునాతన ఫీచర్లు కూడా ఫోన్‌లో లభిస్తున్నాయి. ప్రారంభ ఆఫర్ కింద 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.11,499 లుగా నిర్ణయించారు. ఈ నెల 15 నుండి అమెజాన్, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్లు లభ్యమవుతాయని సంస్థ వెల్లడించింది.

మన తెలంగాణ 14 Apr 2026 10:47 pm

விஜய்யை முதல்வராக மக்கள் பார்க்கத் தொடங்கிவிட்டதாக பார்த்திபன் கூறினாரா?

விஜய்யை முதல்வராக மக்கள் பார்க்கத் தொடங்கிவிட்டதாக பார்த்திபன் கூறியதாக பொய்யான தகவலுடன் நியூஸ் கார்டு வைரலாகிறது.

తెలుగు పోస్ట్ 14 Apr 2026 10:45 pm

కష్టాల్లో కోల్‌కతా

ఐపిఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కష్టాల్లో చిక్కుకుంది. 193 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 11 ఓవర్లు ముగిసే సమయానికి 85 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి మెరుపులు మెరిపించాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న శాంసన్ 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7) పరుగులకే పెవిలియన్ చేరాడు. యువ సంచలనం ఆయుష్ మాత్రే 17 బంతుల్లోనే 6 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. డెవాల్డ్ బ్రెవిస్ 41 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. సర్ఫరాజ్ ఖాన్ (23), శివమ్ దూబె 13 (నాటౌట్) కూడా మెరుగ్గా బ్యాటింగ్ చేశారు.

మన తెలంగాణ 14 Apr 2026 10:44 pm

All Doors Closed for Krithi Shetty

Krithi Shetty made an impressive debut with Uppena and she turned a star. She then did Shyam Singha Roy with Nani and the film ended up as a decent hit. After that, not a single film of Krithi Shetty impressed the audience. Her Telugu outings Macherla Niyojakavargam, Aa Ammayi Gurinchi Meeku Cheppali, The Warriorr, Custody […] The post All Doors Closed for Krithi Shetty appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 10:21 pm

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: କେରଳରେ ମୋଦିଙ୍କ ଫଟୋସୁଟ ହେଉଥିବା ଫଟୋଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ଅଟେ

ଏଥର କେରଳମ୍ ରେ ତ୍ରିମୁଖୀ ଲଢ଼େଇ। ବାମପନ୍ଥୀ ଗଣତାନ୍ତ୍ରିକ ମେଣ୍ଟ- LDFରେ CPI, CPM ସହ ୧୦ ସହଯୋଗୀ ଅଛନ୍ତି । କଂଗ୍ରେସ ନେତୃତ୍ବାଧୀନ ମିଳିତ ଗଣତାନ୍ତ୍ରିକ ମେଣ୍ଟ- UDFରେ ୫ ସହଯୋଗୀ ସହ ମଇଦାନକୁ ଓହ୍ଲାଇ ଥିବା ବେଳେ ବଡ଼ ଏଣ୍ଟ୍ରି ନେଇଛି ବିଜେପି। NDA ମେଣ୍ଟରେ BJP ସହ ଭାରତ ଧର୍ମ ଜନସେନା ଓ KKC ପାର୍ଟି ଏକାଠି ହୋଇ ମଇଦାନକୁ ଓହ୍ଲାଇଛନ୍ତି। କଂଗ୍ରେସ ଏବଂ ବାମ ମେଣ୍ଟର ଗଡ଼ ଭିତରେ ଧସେଇ ପଶିବାକୁ ଚେଷ୍ଟା କରୁଛି ବିଜେପି। ୨୦୨୪ ଲୋକସଭା ନିର୍ବାଚନରେ ଓପନିଂ କରିବା ପରେ ତିରୁଅନନ୍ତପୁରମ୍ ମେୟର ସିଟ୍ କୁ ଅକ୍ତିଆର ଦଳର ଆତ୍ମଭରସାକୁ ଡବଲ୍ କରିଛି। ତେଣୁ ଏଥର କେରଳ ସମସ୍ତଙ୍କୁ ସପ୍ରାଇଜ୍ କରିପାରେ ବୋଲି ଅନୁମାନ କରାଯାଉଛି । ଇତିମଧ୍ୟରେ ସୋସିଆଲ ମିଡିଆରେ ଏକ ଫଟୋ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଫଟୋରେ ଏକ ସୁଟିଙ୍ଗ ହେଉଥିବା ବେଳେ କ୍ୟାମେରା ଲାଇଟ ସେଟ ଲାଗିଥିବାର ଦେଖୁବାକୁ ମିଳିଛି । ସୋସିଆଲ ମିଡ଼ିଆ ଆଇନ ଅନୁଯାଇ କିଛି ୟୁଜର୍ସଙ୍କ ଆକାଉଣ୍ଟରୁ  ଏହା ଡିଲିଟ କରାଯାଇଥିବା ବେଳେ ଏକାଧିକ ୟୁଜର୍ସ ଏହାକୁ ଡିଲିଟ କରିଦେଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି I ଏହାର ଏକ ସ୍କ୍ରିନସଟ ତଳେ ଉପଲବ୍ଧ  ରହିଛି । ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ହେଉଥିବା ଫଟୋଟି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦିଙ୍କ କେରଳ ଗସ୍ତ ସମୟର ନୁହେଁ, ବରଂ ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ । ଉକ୍ତ ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଯଦି ଏଭଳି ଫଟୋସୁଟ୍ ର ଫଟୋ ସତରେ ଭାଇରାଲ ହୋଇଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ସେହିପରି ମୋଦିଙ୍କ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏଭଳି ଫଟୋ ପୋଷ୍ଟ ହୋଇଥିବାର ମଧ୍ୟ ଆମର ହସ୍ତଗତ ହୋଇନଥିଲା। ଭାଇରାଲ ଫଟୋକୁ ଯଦି ତର୍ଜମା କରି ଦେଖାଯାଏ ତେବେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ମୋଦିଙ୍କ ପାଦ ଏବଂ ମୁହଁ ସମ୍ପୂର୍ଣ ଭାବେ ଅପ୍ରାକୃତିକ ଭାବେ ଦୃଶ୍ୟମାନ ହେଉଛି । ଯାହାକି ଏଆଇ ନିର୍ମାଣକୁ ସୁଚାଉଅଛି । ଅଧିକ ତଦନ୍ତ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଫଟୋକୁ ହାଇଭ ମଡରେସନ ଏଆଇ ଟୁଲ୍ ରେ ପରୀକ୍ଷା କରିଥିଲୁ । ପରୀକ୍ଷାରୁ ଉକ୍ତ ଫଟୋଟି ୯୯% ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ରିପୋର୍ଟ ପ୍ରକାଶ ପାଇଥିଲା ।   ସେହିପରି ଉକ୍ତ ଫଟୋକୁ ସେୟାର କରି ଏହା ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ଦର୍ଶାଇଛନ୍ତି କିଛି ବେଜିପି ନେତା । ଉକ୍ତ ଫଟୋ ପୋଷ୍ଟ କରି ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ପୁରା କଂଗ୍ରେସ ମୋଦିଙ୍କ ପଛରେ ପଡିଛି । ହେଲେ ଭାଇରାଲ ଫଟୋଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ଅଟେ ।  ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, କେରଳ ନିର୍ବାଚନ ଗସ୍ତରେ ମୋଦିଙ୍କ ରିଲ୍ସ ପାଇଁ ଫଟୋ ସୁଟ୍ ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ହେଉଥିବା ଫଟୋଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ଅଟେ । 

తెలుగు పోస్ట్ 14 Apr 2026 10:04 pm

ఇక మిగిలింది నలుగురు మావోయిస్టులే...!

రాష్ట్రానికి చెందిన నలుగురు మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీస్ శాఖ పేర్కొంది. కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియస్ గణపతి, పసునూరి అలియాస్ నరహరి అలియాస్ సంతోష్, స్టేట్ కమిటీ సభ్యులు జడే రత్నా బాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు ఉన్నారని పోలీస్ శాఖ తెలిపింది. సాయుధ పోరాటం విరమించి జనజీవన స్రవంతిలో కలవాలంటూ ఇప్పటికే మావోయిస్టులకు డిజిపి పిలుపు నివ్వడంతో పాటు, ప్రభుత్వ లొంగుబాటుతో పాటు పునరావాస విధానం ద్వారా లభించే ప్రయోజనాలు పొందాలని మావోయిస్టులకు పోలీస్ శాఖ పలు మార్లు విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, సోమవారం కాంకేర్ జిల్లాలో భద్రతా బల గాల కూంబింగ్ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎల్‌ఓసీ కమాండర్ రూపీ రెడ్డి అలియాస్ రంగబోయిన భాగ్య (46) మరణించారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం ఆమె స్వస్థలం. రెండు దశాబ్దాలుగా ఆమె అజ్ఞాతంలో ఉంటున్నారు. మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా రూపీ రెడ్డి ఉన్నారు. ఆమెపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. ఆమె మృతదేహానికి ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తయింది. మంగ ళవారం సాయంత్రం ఈ మృత దేహం ఆమె స్వగ్రామానికి చేరుకోనుంది. బుధవారం రూపీ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇటీవల తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని డిజిపి శివధర్ రెడ్డి ప్రకటించిన సంగతి విదితమే.

మన తెలంగాణ 14 Apr 2026 9:40 pm

ముగిసిన చెన్నై బ్యాటింగ్.. కోల్ కతా టార్గెట్ ఎంతంటే?

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. సిఎస్ కె బ్యాటర్లలో సంజూ శాంసన్(48), బ్రేవిస్(41), ఆయూష్ మాత్రే(38), సర్ఫరాజ్ ఖాన్(23)లు రాణించారు. ఇక, కోల్ కతా బౌలర్లలో కార్తిక్ త్యాగి రెండు వికెట్లు పడగొట్టగా.. అరోరా, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్ లు తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 14 Apr 2026 9:31 pm

బిహార్ సిఎంగా రేపు సామ్రాట్ చౌధరీ ప్రమాణ స్వీకారం

బీహార్ డిప్యూటీ సిఎం సమ్రాట్ చౌధరీ రాష్ట్ర మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా మంగళవారం బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. నూతన ముఖ్యమంత్రిగా బుధవారంనాడు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు సీనియర్ మంత్రి రాంకృపాల్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ గతవారం రాజ్యసభ ఎంపీ అయిన తరువాత మంగళవారంనాడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశార. బీజేపీ శాసనసభ నాయకుని ఎన్నికకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలకునిగా వ్యవహరించారు. బీజేపీ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా సమ్రాట్ చౌధరిని ఎన్నుకుందని చౌహాన్ ప్రకటించారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 89 మంది ఎమ్‌ఎల్‌ఎలతో బీజేపీ ఏకైక భారీ పార్టీగా ఉంటోంది. బీహార్ ప్రజలకు సేవ చేయడానికి ఇదో మంచి అవకాశమని, ప్రతి పౌరుని అంచనాలకు తగ్గట్టు తాను బాధ్యతలు నిర్వర్తిస్తానని సమ్రాట్ చౌధరీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబీన్ జీ మార్గదర్శకత్వంలో బీహార్ రాష్ట్రాన్ని ఉన్నత అభివృద్ధి పథానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. 1990లో ఆర్జేడీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ తరువాత జీడీయూలో చేరారు. 2017లో బీజేపీలో చేరారు. బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన కుష్వాహా వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో యాదవుల తర్వాత వీరి ప్రాబల్యం అధికంగా ఉన్నప్పటికీ ఈ వర్గానికి ఇప్పటివరకు సీఎం అయ్యే అవకాశం రాలేదు. ఆయనను పెద్ద నాయకుడిని చేస్తామని బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఈ క్రమం లోనే తదుపరి ముఖ్యమంత్రిగా ఆయనను ఎంపిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

మన తెలంగాణ 14 Apr 2026 9:30 pm

దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారం

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ గ్రామానికి చెందిన ఓ మైనర్ దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కొత్తకొండ గ్రామానికి చెందిన బాలికను మల్లారం గ్రామానికి చెందిన శివ, మణికంఠ, వేణు, టోనీ అనే నలుగురు వ్యక్తులు బైక్‌పై బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులందరూ మేజర్లు అని పోలీసులు నిర్ధారించారు. శనివారం జరిగిన ఈ అమానుష ఘటన, బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆదివారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు కొందరు స్థానిక ‘పెద్దమనుషులు’, అధికారులు ప్రయత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగినప్పటి నుంచి కేసును నీరుగార్చేందుకు, నిందితులను కాపాడేందుకు తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు సోమవారం ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉన్నదో వారందరిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మన తెలంగాణ 14 Apr 2026 9:20 pm

తమిళ నాడు ఎన్నికలు.. రైతులకు విజయ్ హామీ

తిరుప్పూర్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ ప్రచార జోరు పెంచారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్.. రైతులకు హామీలు ప్రకటించారు. మంగళవారం తిరుప్పూర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు రైతులకు పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు. సమగ్ర ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 16న విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న MSMEల కోసం రాష్ట్ర గ్యారెంటీ నిధిగా రూ. 15,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన విజయ్.. MSMEలకు విద్యుత్ వినియోగం అత్యధికంగా ఉండే సమయాల్లో (peak hours) విధించే అదనపు ఛార్జీలను రద్దు చేస్తామని, అంతేకాకుండా ఐదేళ్ల పాటు పన్ను రహిత విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న తమిళనాడులోని చిన్న రైతులకు పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని విజయ్ హామీ ఇచ్చారు; అదే సమయంలో ఎక్కువ భూమి ఉన్న రైతులకు 50 శాతం రుణ మాఫీని కల్పిస్తామని వాగ్దానం చేశారు. ధాన్యాన్ని క్వింటాలుకు రూ. 3,500 చొప్పున, చెరకును టన్నుకు రూ. 4,500 చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటిస్తూ, రైతులకు పంట సేకరణలో మద్దతు అందిస్తామని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రకటించిన విజయ్ విజయ్ పలు సంక్షేమ చర్యలను కూడా ప్రకటించారు. స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో ప్రదర్శించడానికి వీలుగా ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ-కామర్స్ వేదికను ఏర్పాటు చేస్తామని, అలాగే ఆ ఉత్పత్తుల విస్తృతిని పెంచేందుకు కొత్త షోరూమ్‌లను నెలకొల్పుతామని ఆయన తెలిపారు. అలాగే, చేనేత కార్మికులు ముడిసరుకులను కొనుగోలు చేసేందుకు వీలుగా 50 శాతం రాయితీ పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. చేనేత కార్మికులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని రూ. 3,000కు పెంచుతామని.. కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల విలువైన బీమా పాలసీని కూడా అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు.

మన తెలంగాణ 14 Apr 2026 9:11 pm

మోడీకి ట్రంప్ ఫోన్

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారంనాడు ఫోన్ చేశారు. ఇరువురు 40 నిమిషాల పాటు సంభాషించు కున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. మిత్రుడు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ అందుకున్నానని, ఇరుదేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాలు, వాటి పురోగతికి సంబంధించి చర్చించుకున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరంపై మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిన ఆవశ్యకత, ప్రాధాన్యతలపై కూడా ఇరువురి నడుమ కీలక చర్చ జరిగిందని మోడీ వివరించారు. మోడీ, ట్రంప్ ఫోన్ సంభాషణను భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ధ్రువీకరించారు. ‘మిమ్మల్ని మేమంతా అభిమానిస్తున్నామని చెప్పడానికే ఫోన్ చేసినట్లు మోడీతో ట్రంప్ చివరి మాటగా పేర్కొన్నారని గోర్ తెలిపారు. ఇరు దేశాధినేతలు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కూడా చర్చించుకున్నారని, త్వరలో అమెరికా, భారత్ నడుమ వాణిజ్య ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో వారి చర్చలకు ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఇదిలావుండగా ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడం, రెండో దశ చర్చలకు సన్నాహాలు జరుగుతున్న క్రమంలో మోడీకి ట్రంప్ ఫోన్ చేసి 40 నిమిషాల పాటు చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మన తెలంగాణ 14 Apr 2026 9:10 pm

పంట ఎండిపోవడంతో యువరైతు ఆత్మహత్య

 పంట ఎండిపోయి నష్టపోయామనే మనోవేదనతో యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో  మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్నది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెట్ల తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన పొన్న సుదర్శన్ కుమారుడు పొన్న సాయిబాబా (35) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. తనకు సొంతంగా ఒక ఎకరా వ్యవసాయం భూమి ఉండగా, మరో రెండు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని అందులో వరి వేశాడు. బోరులో నీళ్లు ఎండిపోయాయి. వేసిన వరి ఎండి పోతున్నదని, పెట్టుబడి అప్పులు ఎలా తీర్చాలనే మనో వేదనకు గురైనాడని తెలిపారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపంతో సాయిబాబా పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య పొన్న వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

మన తెలంగాణ 14 Apr 2026 9:02 pm

అమెరికా కళ్లుగప్పి హర్మూజ్‌ను దాటిన రెండు నౌకలు

హర్మూజ్ జలసంధిలో మంగళవారంనాడు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అమెరికా దిగ్బంధనాన్ని తప్పించుకొని రెండు నౌకలు జలసంధిని దాటడం సంచలన కలిగిస్తోంది. ఇరాన్ పోర్టులు, హర్మూజ్ చుట్టూ అమెరికా మోహరించిన 15 నౌకల కళ్లుగప్పి హర్మూజ్‌ను దాటి రావడం విశేషం. లైబీరియా జెండాతో కూడిన క్రిస్టియానా అనే నౌక, కొమొరాస్ జెండాతో కూడిన ఎల్పిస్ అనే నౌక అమెరికా దిగ్బంధనం మొదలైన రెండు గంటల తర్వాత జలసంధిని దాటాయి. క్రిస్టియానా ఇరాన్ ఓడరేవులో మొక్కజొన్నను అన్‌లోడ్ చేసినట్లు ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వెల్లడైంది. ఇక ఎల్పిస్ సోమవారం నాడు లారాక్ ద్వీపాన్ని దాటి హర్మూజ్ నుంచి బయటపడినట్లు ఆ డేటా సిస్టమ్ అధ్యయనం ద్వారా వెలుగుచూసింది. అమెరికా ట్యాంకర్ రిచ్ స్టార్రీ కూడా అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ హర్మూజ్ జలసంధిని దాటింది. ఇరాన్ దీనిపై స్పందించింది. ట్రంప్‌కు బయపడే వారికి మాత్రమే దిగ్బంధనం వర్తిస్తుందని ఇరాన్ ప్రకటించింది. 

మన తెలంగాణ 14 Apr 2026 8:50 pm

dr.b.r.ambedkar రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు

dr.b.r.ambedkar రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు గ్రామాలన్నింటిలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు,

ప్రభ న్యూస్ 14 Apr 2026 8:42 pm

Amaravati Emerges as India’s Quantum Hub with Launch of First Reference Facilities

On the occasion of World Quantum Day, Andhra Pradesh marked a major milestone in advanced technology. Chief Minister N. Chandrababu Naidu inaugurated India’s first Quantum Reference Facilities in Amaravati. This initiative positions the state at the forefront of quantum innovation and future-ready skills. The newly launched facilities aim to train 4.5 million people in quantum […] The post Amaravati Emerges as India’s Quantum Hub with Launch of First Reference Facilities appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 8:40 pm

narsampeta అంబేద్కర్ ఆశయాలే మా మార్గం,

narsampeta అంబేద్కర్ ఆశయాలే మా మార్గం, నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: భారత రాజ్యాంగ

ప్రభ న్యూస్ 14 Apr 2026 8:36 pm

Amaravati: Government Restructures CRDA into Eight Zones

The coalition government has accelerated the construction of Amaravati and reinforced its commitment to building it as the state capital. In a significant development, Parliament has approved a bill that grants legal backing to Amaravati. This move has strengthened the government’s position and added clarity to the long-standing capital debate. At the same time, former […] The post Amaravati: Government Restructures CRDA into Eight Zones appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 8:09 pm

ఘ‌నంగా అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌లు…

ఘ‌నంగా అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌లు… భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో

ప్రభ న్యూస్ 14 Apr 2026 8:08 pm

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే… మునుగోడు, ఆంధ్రప్రభ : మండల

ప్రభ న్యూస్ 14 Apr 2026 8:03 pm

ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి…

ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి… మంత్రి వివేక్ వెంకటస్వామి… చెన్నూర్,

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:58 pm

ప్రధాని మోడీకి సిఎం రేవంత్ బహిరంగ లేఖ..

హైదరాబాద్: లోక్ సభ సీట్ల పెంపు విధానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం మహిళా రిజర్వేషన్, లోక్ సభ సీట్ల పెంపు అంశాలపై సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 14 Apr 2026 7:56 pm

రైలు పట్టాల మధ్య పసిపాప

అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన పాప...కళ్లు తెరవకముందే రైలు పట్టాలపై పడుకోబెట్టారు. ఆడపిల్ల పుట్టిందని అలుసో లేక భారమనుకున్నారో పసిపాపను కాదనుకుని దూరం చేయాలనుకున్నారు. నగరంలో సంచలనం సృష్టించిన సంఘటన ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పసిపాపను బట్టలో చుట్టి రైలు పట్టాల మధ్య పడేసి వెళ్లడంతో రాళ్ల వేడి, దుమ్ము, ధూళి మధ్యలో ఈగలు వాలుతూ, చీమలు కుడుతుండగా పసిపాప గుక్కపెట్టి ఏడవడంతో రైల్వే సిబ్బంది గమనించారు. వెంటనే పాప ఉన్న ప్రాంతానికి చేరుకున్న రైల్వే సఫాయివాలా రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుళ్లు సాయికుమార్, శ్రీనివాసులు, శేఖర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని, శిశువును వైద్య పరీక్షల నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. పాప వయసు పది నుంచి పదిహేను రోజులు ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం శిశువుకు ఆస్పత్రి వైద్యులు ఎన్‌ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పాపను రైలు పట్టాల మధ్య పేడేసిన వారి కోసం గాలిస్తున్నట్లు జిఆర్‌పి సిఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. స్థానికంగా ఉన్న సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

మన తెలంగాణ 14 Apr 2026 7:51 pm

క్రైస్తవులు, పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి

క్రైస్తవులు, పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:46 pm

లారీ డ్రైవర్ కూతురు ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్

లారీ డ్రైవర్ కూతురు ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్ ఇలాంటి వారిని స్పూర్తిగా

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:42 pm

చరిత్రలోనే శాశ్వత స్థానం సంపాదించిన మహామేధావి అంబేద్కర్..

చరిత్రలోనే శాశ్వత స్థానం సంపాదించిన మహామేధావి అంబేద్కర్.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:38 pm

ఐపీఎల్ బెట్టింగ్‌పై మరో దాడి..

ఐపీఎల్ బెట్టింగ్‌పై మరో దాడి.. మరో ముగ్గురు అరెస్ట్.. చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:34 pm

గోహత్యల షెల్టర్ హౌస్‌లపై చర్యలు తీసుకోవాలి..

గోహత్యల షెల్టర్ హౌస్‌లపై చర్యలు తీసుకోవాలి.. మున్సిపల్ చైర్మన్‌కు వినతిపత్రం అందచేతగోరక్ష స్టేషన్

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:31 pm

బైక్ పై రీల్స్ చేస్తూ యువతి మృతి

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రీల్స్ చేస్తూ కొందరు యువత తమ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.తాజాగా ఓ యువతి బైక్ పై ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ మృతి చెందింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. గాజియాబాద్ కు చెందిన ఇక్రా అనే యువతి(19) , తన స్నేహితుడు హసీంతో కలిసి రీల్స్ చేసేందుకు జాతీయ రహదారి మీదకి వెళ్లారు. ఇక్రా స్పోర్ట్స్ బైక్ ను వేగంగా నడుపుతుండగా హసీం వెనుక కూర్చోని విడియో తీస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రహదారిపై ఉన్న డివైడర్ ను వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ యువతి మృతి చెందింది. ఆమె స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాంను కుటుంబసభ్యులకు అప్పగించి విచారణ ప్రారంభించారు.ప్రమాదానికి కారణం అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమేనని పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 14 Apr 2026 7:29 pm

మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేయూత

మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేయూత రాష్ట్ర కార్మిక ఉపాధి మంత్రి

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:27 pm

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి తొర్రూరు,

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:22 pm

రేషన్ బియ్యం, బెల్లం, పట్టిక పట్టివేత

రేషన్ బియ్యం, బెల్లం, పట్టిక పట్టివేత ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదు.. జైనూర్,

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:14 pm

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరి అరెస్టు

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం...లంక నిరుపమ, మామిడి అరుణ్ రాజ్ మరో ఎనిమిది మందితో కలిసి ప్రొఫెషనల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి ఆర్‌ఎ లైసెన్స్ లేకున్నా, గ్రీస్, ఇటలీ, సెర్బియా వంటి దేశాల్లో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారు. సోషల్ మీడియాలో విస్కృతంగా ప్రచారం చేసుకున్న నిందితులు చాలా మందికి యూరప్ (గ్రీస్/రొమేనియా)లో వర్క్ వీసా ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరు వసూలు చేశారు. డబ్బు తీసుకున్న తర్వాత నిరుద్యోగులకు నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చారు, వాటిని తీసుకున్న బాధితులు ఫోన్ చేసినా, మెసేజ్‌లు పెట్టినా నిందితులు స్పందించడంలేదు. దీంతో బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు గతంలో ట్రివైయల్ చాప్టర్ పేరుతో గతంలో కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారు ఈ మైగ్రేట్ పోర్టల్ ద్వారా ఏజెంట్ల వివరాలను సరిచూసుకోవాలని, నకిలీ ఆఫర్ లెటర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

మన తెలంగాణ 14 Apr 2026 7:09 pm

కొండాపూర్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

కొండాపూర్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం కొండాపూర్ గ్రామంలో

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:07 pm

పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం..

పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం.. సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్రప్ర‌భ : నియోజకవర్గాల పునర్విభజన విషయంలో

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:53 pm

ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలకు సిద్ధం

 అమెరికా-ఇరాన్ మధ్య నిలిచిపోయిన చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు పాకిస్థాన్ ఉన్నత స్థాయి ప్రయత్నాలు కొనసాగిస్తోంది. వచ్చే వారం ఇస్లామాబాద్‌లో రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని మంగళవారం మీడియా నివేదిక వెల్లడించింది. ఏప్రిల్ 21తో ముగియనున్న రెండు వారాల కాలపరిమితి ఉన్న కాల్పుల విరమణకు ముందు ఈ చర్చలు మళ్లీ జరగవచ్చని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక ఉన్నత వర్గాల వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్, ఉప ప్రధాని ఇషాక్ దార్, సైన్యాధిపతి అసీం మునీర్ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులను ముగించే దిశగా ఈ చర్చలు కీలకమయ్యే అవకాశముందని అంచనా. ఇస్లామాబాద్‌లో ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో, 47 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష చర్చలు ప్రారంభించిన అమెరికా-ఇరాన్ నేతల తదుపరి భేటీకి సిద్ధం కావాలని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని వర్గాల ప్రకారం, ఈ రెండో విడత చర్చలు గురువారం జరగవచ్చని సమాచారం. అయితే అదే రోజున ప్రధాని షెబాజ్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనుండటం గమనార్హం. ఆయన తక్కువ కాలపరిమితి పర్యటనలో సౌదీ అరేబియా, టర్కీ దేశాలను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు దాదాపు ఆరు వారాలుగా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు, ఏప్రిల్ 8న ఇరువైపులా రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు షెబాజ్ ప్రకటించారు. ఏప్రిల్ 11న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్-బాఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్‌లో దీర్ఘకాలిక సమావేశం నిర్వహించాయి. అయితే ఆ చర్చలు తుది ఒప్పందానికి దారితీయలేదు.ఇదిలా ఉండగా, సోమవారం అత్యవసర కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన షెబాజ్, ప్రాంతీయ శాంతి సాధనలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తుందని పునరుద్ఘాటించారు. అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన తాజా ప్రత్యక్ష చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చల్లో జరిగిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, నిర్మాణాత్మక ఫలితాలపై పాకిస్థాన్ విశ్వాసం ఉంచిందని తెలిపారు. ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు యుద్ధ మేఘాలను తొలగించి శాంతికి మార్గం సుగమం చేశాయని ప్రధాని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మధ్య ఇది ముఖ్యమైన పరిణామమని పేర్కొన్నారు. చరిత్రలో ఒస్లో, జెనీవా, గుడ్ ఫ్రైడే వంటి ముఖ్యమైన ఒప్పందాలు అమలులోకి రావడానికి సంవత్సరాలు పట్టినప్పటికీ, ప్రత్యర్థులైన రెండు దేశాల మధ్య సంభాషణకు పాకిస్థాన్ ప్రయత్నాలు దారితీశాయని ఆయన వివరించారు. ఇక, సోమవారం కేంద్ర కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి, రెండు దేశాలను చర్చల బల్లపైకి తీసుకువచ్చిన దేశ నాయకత్వానికి అభినందనలు తెలిపింది. ఈ నిజాయితీ ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా శాశ్వత శాంతికి దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

మన తెలంగాణ 14 Apr 2026 6:52 pm

అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబాటు…

అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబాటు… గుడిసె కృష్ణమ్మ పిలుపు..జిల్లా వ్యాప్తంగా ఘనంగా జయంతి

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:47 pm

Congress : రెండేళ్లకే హస్తం.. వ్యస్తం... లోపం ఎక్కడుంది బాసూ?

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువగా అతి విశ్వాసం కనిపిస్తుంది.

తెలుగు పోస్ట్ 14 Apr 2026 6:45 pm

అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం…

అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం… కర్నూలులో ఘనంగా జయంతి వేడుకలు…నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు…

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:40 pm

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

తెలుగు పోస్ట్ 14 Apr 2026 6:39 pm

అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే… జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:33 pm

How to Prevent Heat Stroke: What to Drink? #telugupost #doctor #heatstroke #viralvideo

తెలుగు పోస్ట్ 14 Apr 2026 6:31 pm

బిహార్ కొత్త సిఎంగా సమ్రాట్ చౌదరి.. రేపే ప్రమాణ స్వీకారం

పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు సమ్రాట్ చౌదరి బుధవారం (ఏప్రిల్ 15) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు చౌదరితో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. నితీష్ కుమార్ సిఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత, సమ్రాట్ చౌదరి బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు.  బీహార్‌లో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సమ్రాట్ చౌదరి పేరును ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు రేణు దేవి, మంగళ్ పాండే, దిలీప్ జైస్వాల్ బలపరిచారు. దీంతో బీహార్‌లో బీజేపీ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తిగా సమ్రాట్ నిలవనున్నారు. ఏళ్ల తరబడి రాష్ట్ర సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ పార్టీ, ఇప్పుడు స్వతంత్రంగా ప్రభుత్వాన్ని నడిపించనుంది.

మన తెలంగాణ 14 Apr 2026 6:29 pm

గ్లోబల్ గుర్తింపు దిశగా కప్పట్రాళ్ల ..

గ్లోబల్ గుర్తింపు దిశగా కప్పట్రాళ్ల .. లండన్ విద్యార్థినికి ఆదర్శంగా నిలిచిన కప్పట్రాళ్ల

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:29 pm

మాదాసి కుర్వలకు ప్రభుత్వం ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి…

మాదాసి కుర్వలకు ప్రభుత్వం ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి… ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:24 pm

Flansh News : ఛత్తీస్ ఘడ్ లో విషాదం... తొమ్మిది మంది మృతి

ఛత్తీస్ ఘడ్ లో విషాదం చోటు చేసుకుంది. సక్తీ జిల్లాలోని పవర్ ప్లాంట్ లో పేలుడు సంభవించింది

తెలుగు పోస్ట్ 14 Apr 2026 6:12 pm

మెడికల్ కాలేజీలో ఆధునిక వీఆర్‌డీఎల్ ల్యాబ్ ప్రారంభం..

మెడికల్ కాలేజీలో ఆధునిక వీఆర్‌డీఎల్ ల్యాబ్ ప్రారంభం.. రూ.66 లక్షలతో నిర్మాణం…సూపర్ సిక్స్‌లో

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:10 pm

అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం

అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:06 pm

నీతిమంతులను జ్ఞాపకం చేసికొనుట ఆశీర్వాదకరం…

నీతిమంతులను జ్ఞాపకం చేసికొనుట ఆశీర్వాదకరం… పాయకాపురం, ఆంధ్రప్రభ : నీతిమంతులను జ్ఞాపకం చేసికొనుట

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:02 pm

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి చౌటుప్పల్, ఆంధ్రప్రభ : విద్యార్థులు

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:01 pm

డీ లిమిటేషన్ పై ఎవరి మద్దతు ఉంటుందో?

ఎల్లుండి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలు కీలకంగా మారనున్నాయి.

తెలుగు పోస్ట్ 14 Apr 2026 5:59 pm

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి బూర్గంపాడు, ఆంధ్రప్రభ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:58 pm

రోడ్డు భద్రత….అందరి బాధ్యత

రోడ్డు భద్రత….అందరి బాధ్యత అలైవ్….. అరేయ్ కార్యక్రమంలోకె. యూ ఎస్సై విజయ్ కుమార్

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:53 pm

విషాదం: భారీ పేలుడు.. 10 మంది మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శక్తి జిల్లాలోని సింగితారి గ్రామంలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ బాయిలర్ పేలుడు సంభవించి.. 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 40 మందికి పైగా గాయపడ్డారు. భారీ పేలుడుతో ఘటనాస్థలం పరిసర ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు, స్థానిక పరిపాలన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని హుటాహుటినా చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.

మన తెలంగాణ 14 Apr 2026 5:52 pm

అమరావతిలో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ

అమరావతిలో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు

తెలుగు పోస్ట్ 14 Apr 2026 5:45 pm

NTR’s Birthday Triggers God of War Discussion

With NTR’s birthday arriving next month, there are debates about his upcoming projects. He is completely focused on Dragon, a high-voltage action drama directed by Prashanth Neel. NTR underwent a transformation for his role and he is expected to wrap up the shoot later this year. Koratala Siva is left in waiting mode since a […] The post NTR’s Birthday Triggers God of War Discussion appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 5:43 pm

సర్వే నంబర్ 650-2 లో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 650-2 సర్వే నంబర్ లో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 650-2 సర్వే నెంబర్లో ప్లంబర్స్, అండ్ ఎలక్ట్రిషన్స్ కి కేటాయించిన రెండు ఎకరాల భూమిని కొంతమంది అన్యక్రాంతం చేసి ఆ స్థలంలో భవనాలు నిర్మించడం జరిగింది అన్నారు. వెంటనే ఆ భవనాలను తొలగించాలని, కార్మికులకు న్యాయం చేయాలని పట్టణం లో […] The post సర్వే నంబర్ 650-2 లో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 5:35 pm

బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌధరి

బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌధరి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు

తెలుగు పోస్ట్ 14 Apr 2026 5:34 pm

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;;భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరంవిగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని, కేంద్ర ప్రభుత్వం రాజకీయ స్వలాభాల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు […] The post ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 5:31 pm

Union Minister |డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వితండవాదం

Union Minister | డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వితండవాదం Union Minister |

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:27 pm

వాళ్ళిద్దరూ ఫోన్ లో ఏమి మాట్లాడారంటే..!

చాలా సంవత్సరాల తర్వాత నిన్న రాత్రి సుమారు 11:30కి ఆమె దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది… చాలా పరిచయమైన మధురమైన స్వరం… ఆమె అడిగింది… “ఎలా ఉన్నావు?”నేను చెప్పాను,“హ్యాపీ హ్యాపీ… నేను బాగానే ఉన్నాను!” ఎక్కడో మనసులో చిన్న ఉత్సాహం… ఆమె అడిగింది,“ఇంకా నిద్రపోలేదా?” నేను,“ఇంకా లేదు!” అని చెప్పాను. ఇంకా ఏం మాట్లాడుతుందో వినాలని కుతూహలం నాలో పొడచూపింది ఆమె అంది,“ఈరోజు పార్టీ లో నిన్ను చూసాను… చాలా హ్యాండ్సమ్‌గా కనిపించావు!” నేను ఆనందంగా,“థాంక్స్!” […] The post వాళ్ళిద్దరూ ఫోన్ లో ఏమి మాట్లాడారంటే..! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 5:23 pm

సమసమాజ దిశగా అంబేద్కర్ మార్గం..

సమసమాజ దిశగా అంబేద్కర్ మార్గం.. అంబేద్కర్ ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి:

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:20 pm

డా. బీఆర్ అంబేద్క‌ర్ ఆశ‌యాలు..అభివృద్ధికి దారిదీపాలు

డా. బీఆర్ అంబేద్క‌ర్ ఆశ‌యాలు..అభివృద్ధికి దారిదీపాలు మ‌హ‌నీయుడు అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుదాం..ఎన్‌టీఆర్

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:10 pm

నేరాల నియంత్రణే ధ్యేయం.. సామాన్యుడికి అండగా ఉంటాం

​– అనంతపురం రూరల్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి. శ్రీనివాసులు ​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : నేరాల నియంత్రణే ధ్యేయంగా పనిచేస్తామని, సామాన్యుడికి అండగా ఉంటామని అనంతపురం రూరల్ డీఎస్పీ టి.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన రాప్తాడులోని రూరల్ డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఒంగోలులో డీఎస్పీగా పనిచేసి, అక్కడ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. ​ అందుబాటులో పోలీస్ యంత్రాంగం బాధ్యతలు చేపట్టిన […] The post నేరాల నియంత్రణే ధ్యేయం.. సామాన్యుడికి అండగా ఉంటాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 5:10 pm

ముక్కంటి భూములకు రక్షణేదీ..?

*మౌనముద్రలో అధికారులు..*రూ.కోట్లు విలువ చేసే ఆస్తులు పరాధీనం! దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ, రాహు-కేతు పూజలతో స్వామివారికి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నారు. అయితే, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించిన భూములు, ఆస్తుల విషయంలో మాత్రం దేవదాయ శాఖ అధికారులు ఘోర వైఫల్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముక్కంటి ఆస్తులు కళ్లముందే కరిగిపోతున్నా, అన్యాక్రాంతమవుతున్నా అధికారులు మాత్రం మౌనముద్ర వహించడం పలు విమర్శలకు దారితీస్తోంది. నిర్లక్ష్యం వెనుక […] The post ముక్కంటి భూములకు రక్షణేదీ..? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 5:10 pm

Samrat Chaudhary |రేపే ప్రమాణ స్వీకారం

Samrat Chaudhary | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బిహార్ రాజకీయాల్లో కీలక

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:09 pm

రాజ్యాంగాన్నిసవరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది: కిషన్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం డీలిమేషన్ ను వ్యతిరేకించడం దారుణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. డీలిమేషన్ తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని అన్నారు. ఈ సందర్భంగా డీలిమేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..తాను బంట్రోతు ఉద్యోగం చేస్తానని ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలను కాంగ్రెస్ బంట్రోతులుగా చూసిందని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అద్దాల మేడలో కూర్చోని ఇతరులపై రాళ్లు విసురుతున్నారని, అనేక రకాలుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కర్నాటక సిఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమయం కూడా ఇవ్వలేదని, రేవంత్ రెడ్డి డబ్బుతో రాజకీయంగా మనుగడ సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తర్వాత అత్యంత మేధావి రేవంత్ రెడ్డినే, సిఎం చెబుతున్న హైబ్రిడ్ మోడల్ ఎక్కడా లేదని అన్నారు. రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, 543 ఎంపి స్థానాలకు 850కి పెంచాలని, రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 ఎంపి స్థానాలు ప్రతిపాదించామని కిషన్ రెడ్డి తెలియజేశారు.  

మన తెలంగాణ 14 Apr 2026 5:07 pm

టీ.ఎన్.ఎస్. ఎఫ్ లోకి పలువురు చేరిక…

టీ.ఎన్.ఎస్. ఎఫ్ లోకి పలువురు చేరిక… పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్‌లోని

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:06 pm

“రైస్ పుల్లింగ్” పేరుతో మోసం

“రైస్ పుల్లింగ్” పేరుతో మోసం నలుగురు అరెస్ట్, ఇద్దరు పరారీ పెద్దపంజాణి, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:02 pm

ఐపీఎల్ బెట్టింగ్‌పై పోలీసుల దాడి..

ఐపీఎల్ బెట్టింగ్‌పై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్ చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో :

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:56 pm

చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు…

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం ప్రత్యేకాధికారి నారపరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ సురేష్, విఆర్ఓ పెద్దన్న, గౌతమి తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వకం, బండ బలం, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని పనులు నిర్వహిస్తున్న తీరును […] The post చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:56 pm

విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలి

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం; విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి ధర్మవరం పట్టణంలో యుటిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల్లో […] The post విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:52 pm

యుద్ధంతో రూ.25 లక్షల కోట్ల నష్టం: ఇరాన్

అమెరికా-ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంతో తమకు రూ.25 లక్షల కోట్ల నష్టం జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా ఎక్కువే నష్టం ఉండొచ్చని తెలిపింది. దాడులకు బాధ్యులైన దేశాల నుంచి నష్ట పరిహారం కోరతామని ప్రకటించింది. కాగా.. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాదాపు 40 రోజులపాటు యుద్ధం జరిగింది.  యుద్ధం మొదటి రోజే.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందాడు. ఆయనతోపాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. ఇరు దేశాల దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఇటీవల ట్రంప్ పిలుపుతో ఇరాన్ షరతులతో కూడిన కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 14 Apr 2026 4:51 pm

అంబేద్కర్‌కు ఘన నివాళులు..

అంబేద్కర్‌కు ఘన నివాళులు.. విజయవాడ, ఆంధ్రప్రభ : మంగ‌ళ‌వారం న‌వ భార‌త రాజ్యాంగ

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:49 pm

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత పుల్లమ్మ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ వీధి కి చెందిన కీ,శే పసుపులేటి పుల్లమ్మ (76 సం ) వృద్ధాప్యం తో మరణించగా విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది అని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు . […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత పుల్లమ్మ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:49 pm

గాలికుంటు నివారణ టీకాలను సద్వినియం చేసుకోవాలి

టేకుమట్ల,ఆంధ్రప్రభ ‌: గాలికుంటు నివారణ టీకాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని వేలంపల్లి సర్పంచ్

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:46 pm

భక్తులకు గౌరవమే ప్రథమ కర్తవ్యం..

భక్తులకు గౌరవమే ప్రథమ కర్తవ్యం.. వారించండి కానీ బాధించకండిసేవా భావంతో సేవచేయండిఈఓ శీనా

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:46 pm

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

రోటరీ క్లబ్ అధ్యక్షులు డి.నాగభూషణ విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు డి. నాగభూషణ, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ జి. పెరుమాళ్ళ దాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల కోట మున్సిపల్ పాఠశాల యందు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నాగభూషణ మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్ […] The post పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:44 pm

Ramayana Producer to take up Brahmastra 2

Bollywood producer Namit Malhotra is busy with Ramayana, the country’s most expensive film, a mythological drama that is high on expectations. The film will release in two parts for Diwali 2026 and 2027 respectively. The team is at Cinema Con 2026 to promote Ramayana and Namit Malhotra revealed that he is in plans to produce […] The post Ramayana Producer to take up Brahmastra 2 appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 4:40 pm

పార్లమెంటు సమావేశాల్లో బీసీల వాటాకు తగిన ఆమోదం తెలపండి

రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీవిశాలాంధ్ర ధర్మవరం;; ఢిల్లీలోని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏప్రిల్ 16న జరగనున్న మహిళ రిజర్వేషన్ సవరణ బిల్లుకు అత్యంత కీలకము కానున్నది. ఇటువంటి సమయంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా బీసీల యొక్క డిమాండ్లు సమస్యలను ఒక వినతి పత్రం […] The post పార్లమెంటు సమావేశాల్లో బీసీల వాటాకు తగిన ఆమోదం తెలపండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:40 pm