SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

అసోం, కేరళ, పుదేచ్చేరిలో పోలీంగ్ ప్రారంభం

అసోం, కేరళ, పుదేచ్చేరిలో పోలీంగ్ ప్రారంభం అయింది. కేరళలో 140 నియోజకవర్గాలకు 30,495 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జరిగింది. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు బరిలో 722 మంది అభ్యర్థులు నమోదయ్యారు. కేరళలో 140 స్థానాల్లో 883 అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కేరళలో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు నమోదు అయ్యారు. పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఓటింగ్ కేంద్రాల వద్ద విస్తృతమైన ఏర్పాటు చేశారు.  

మన తెలంగాణ 9 Apr 2026 8:26 am

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ସାଂସଦ ରାଘବ ଚଡ୍ଡାଙ୍କ ଭାଇରାଲ ହେଉଥିବା ଭିଡିଓଟି ବହୁ ପୁରୁଣା ଅଟେ

ଆମ ଆଦମୀ ପାର୍ଟିର ସବୁଠାରୁ ଚର୍ଚ୍ଚିତ ଚେହେରା ବା କେଜ୍ରିୱାଲଙ୍କ ସଙ୍କଟମୋଚକ ବୋଲାଉଥିବା ରାଘବ ଚଢ଼ା ଏବେ ଦଳ ଭିତରେ ନିଜ ଅସ୍ତିତ୍ୱ ରକ୍ଷା ପାଇଁ ସଂଘର୍ଷ କରୁଛନ୍ତି । ରାଜ୍ୟସଭାରେ ଉପ-ନେତା ପଦରୁ ହଟାଯିବା ପରେ ରାଘବ ଏବଂ ଆପ୍ ହାଇକମାଣ୍ଡଙ୍କ ମଧ୍ୟରେ ଥିବା ତିକ୍ତତା ଏବେ ସଂସଦରୁ ବାହାରି ସୋସିଆଲ ମିଡିଆ ପର୍ଯ୍ୟନ୍ତ ପହଞ୍ଚିଛି । ପଞ୍ଜାବରୁ ରାଜ୍ୟସଭାକୁ ଯାଇଥିବା ରାଘବଙ୍କ ଉପରେ ଦଳ ଅଭିଯୋଗ ଆଣିଛି ଯେ, ସେ ରାଜ୍ୟର ସ୍ୱାର୍ଥ ରକ୍ଷା କରିବାରେ ବିଫଳ ହୋଇଛନ୍ତି । ଖୋଦ୍ ଆପ୍ ନେତାମାନେ ପ୍ରଶ୍ନ ଉଠାଇଛନ୍ତି ଯେ ରାଘବ ସଂସଦରେ ଗମ୍ଭୀର ପ୍ରସଙ୍ଗ ଛାଡ଼ି କେବଳ ଲାଇମଲାଇଟ୍ ରେ ରହିବା ଭଳି ପ୍ରସଙ୍ଗ ଉଠାଉଛନ୍ତି । ଏହା ପଛରେ ଦଳର ଗୋଟିଏ ଗୋଷ୍ଠୀ ତାଙ୍କୁ ରିୟଲ ପଲିଟିସିଆନ୍ ବଦଳରେ ପିଆର ଷ୍ଟଣ୍ଟବାଜ ବୋଲି କଟାକ୍ଷ କରିବାକୁ ପଛାଉନାହାନ୍ତି । ଇତିମଧ୍ୟରେ ସାଂସଦ ରାଘବ ଚଡ୍ଡାଙ୍କ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଉକ୍ତ ଭିଡିଓରେ ରାଘବ ବିଜେପିକୁ ଟାର୍ଗେଟ କରୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଭିଡିଓରେ ରାଘବ କହିଛନ୍ତି, ମତେ ରାଜ୍ୟସଭାରୁ ଆଜି ସସପେଣ୍ଡ କରି ଦିଆଯାଇଛି । ମୁ ସଂସଦରେ ଠିଆ ହୋଇ ବିଶ୍ୱର ସବୁଠାରୁ ବଡ଼ ପାର୍ଟି ବିଜେପି ଉପରେ ପ୍ରଶ୍ନ ପଚାରିଛି ନାଁ ଏହା ମୋର ଅପରାଧ ଯେ ଦିଲ୍ଲୀର ବଡ଼ବଡ଼ିଆ ବିଜେପି ନେତାଙ୍କୁ ଦିଲ୍ଲୀ ସେବା ବିଲ୍ ନେଇ ପ୍ରଶ୍ନ ପଚାରିଛି । ବିଜେପିକୁ ତାଙ୍କରି ପୁରୁଣା ନିର୍ବାଚନୀ ଇସ୍ଥହାର ଦେଖାଇ ତାହାସବୁ ପୂରଣକରିବାକୁ କହିଲି । ୩୪ ବର୍ଷୀୟ ଏହି ଯୁବ ସାଂସଦ କିଭଳି ଭାବେ ଆମକୁ କଟାକ୍ଷ କରୁଛି ତାହା କଣ ବିଜେପି ସହି ପାରୁନି ।  ଉକ୍ତ ଭିଡିଓଟି ବର୍ତ୍ତମାନ ଦିନର ବୋଲି ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । View this post on Instagram A post shared by Digital Breaking (@digitalbreakingmp) ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭାଇରାଲ ଭିଡିଓଟି ବର୍ତ୍ତମାନ ଦିନର ନୁହେଁ । ଉକ୍ତ ଭିଡିଓଟି ୨୦୨୩ ମସିହାର ଅଟେ । ଦାବୀର ସତ୍ୟାସତ୍ୟ ଜାଣିବାକୁ ଯାଇ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନ ସମୟରେ ଉକ୍ତ କିୱାର୍ଡ ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ତେବେ ଭାଇରାଲ ଭିଡିଓରେ ବିଜେପି ଉପରେ ବର୍ଷିଥିବା ରାଘବଙ୍କ ଉକ୍ତ ଭିଡିଓଟି ପାଇନଥିଲୁ । ରାଜ୍ୟସଭାରେ ଉପ-ନେତା ପଦରୁ ହଟାଯିବା ପରେ ରାଘବଙ୍କ ବହୁ ଭିଡିଓ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ବିଭିନ୍ନ ଭିଡିଓରେ ଭିନ୍ନଭିନ୍ନ ମତ ଦେଇଥିବାର ଦେଖାଯାଇଛି । ଯାହାକୁ ରାଘବ ନିଜେ ତାଙ୍କର ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଯାହାର ଲିଙ୍କ୍ ଏଠାରେ , ଏଠାରେ , ଏଠାରେ ଏବଂ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି ।   ଉକ୍ତ କୌଣସି ମଧ୍ୟ ଭିଡିଓ ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ତାଳମେଳ ଖାଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିନଥିଲା । ତେଣୁ ଭାଇରାଲ ଭିଡିଓଟି ବର୍ତ୍ତମାନ ଦିନର ହୋଇନଥାଇ ପାରେ ବୋଲି ଅନୁମାନ କରାଯାଏ । ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ଲିଙ୍କ୍ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୧୧ ଅଗଷ୍ଟ ୨୦୨୩ରେ ଏକ ଖବର ପ୍ରସାରଣ କରି ଏନଡିଟିଭି ଉକ୍ତ ଭିଡିଓକୁ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖାଯାଇଛି । ଉକ୍ତ ଖବରରେ ଏନଡିଟିଭି ଉଲ୍ଲେଖ କରିଛି, ସସପେଣ୍ଡ ପରେ ଆପ୍ ସାଂସଦ ରାଘବ ଚଡ୍ଡା ମୁହଁ ଖୋଲିଛନ୍ତି । ଉକ୍ତ ଭିଡିଓରେ ରାଘବ ସ୍ପଷ୍ଟୀକରଣ ଦେଇ କହିଛନ୍ତି ଯେ, ମୁଁ କୌଣସି ଦସ୍ତଖତ କରିବାକୁ ଭୁଲି ନାହିଁ । ପ୍ରସାରିତ ଖବରରେ ଯେଉଁ ଭିଡିଓ ଅଛି ତାହା ଭାଇରାଲ ଭିଡିଓର ଏକ ଅଂଶ ପରି ଦୃଶ୍ୟମାନ ହୋଇଥିଲା । ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ଭିଡିଓ ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଭାଇରାଲ ଭିଡିଓଟି ବର୍ତ୍ତମାନ ଦିନର ନୁହେଁ I କାରଣ ଏହା ୨୦୨୩ରୁ ଇଣ୍ଟରନେଟରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ତେବେ ଉକ୍ତ କିୱାର୍ଡ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ଖବର ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୧୧ ଅଗଷ୍ଟ ୨୦୨୩ରେ ହିନ୍ଦୁସ୍ତାନ ଟାଇମ୍ସ ଏକ ଖବର ପ୍ରସାରିତ କରିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଖବର ପ୍ରସାରଣ କରି ହିନ୍ଦୁସ୍ତାନ ଟାଇମ୍ସ ଉଲ୍ଲେଖ କରିଛି, ଆମ ଆଦମୀ ପାର୍ଟି (ଆପ) ସାଂସଦ ରାଘବ ଚଡ୍ଡା ଏକ ଭିଡିଓ ବାର୍ତ୍ତାରେ ନିଜକୁ 'ନିଲମ୍ବିତ' ରାଜ୍ୟସଭା ସଦସ୍ୟ ବୋଲି କହିଛନ୍ତି ଏବଂ  ସଦନରୁ ତାଙ୍କୁ ନିଲମ୍ବିତ କରିବା ପାଇଁ କେନ୍ଦ୍ର ସରକାରଙ୍କ ଉପରେ ଇଙ୍ଗିତ କରି ଏକାଧିକ ପ୍ରଶ୍ନ ଉଠାଇଛନ୍ତି। ସେ ପଚାରିଛନ୍ତି ଯେ, ତାଙ୍କ ନିଲମ୍ବନର କାରଣ କ'ଣ ସେ 'ସଂସଦ ଭିତରେ ବିଶ୍ୱର ସବୁଠାରୁ ବଡ଼ ଦଳର ନେତାମାନଙ୍କୁ ପ୍ରଶ୍ନ କରିଥିଲି' ଏବଂ ଅନ୍ୟାନ୍ୟ ପ୍ରାସଙ୍ଗିକ ବିଷୟଗୁଡ଼ିକ ଉପରେ ପ୍ରଶ୍ନ ଉଠାଇଥିଲି ? ମୁଁ କ'ଣ ଦୋଷୀ କାରଣ ମୁଁ ସଂସଦ ଭିତରେ ବିଶ୍ୱର ସବୁଠାରୁ ବଡ଼ ଦଳର ନେତାମାନଙ୍କୁ ପ୍ରଶ୍ନ କରିଥିଲି ନା ମୁଁ ଦୋଷୀ କାରଣ ମୁଁ ଦିଲ୍ଲୀ ସେବା ବିଲ୍ ଉପରେ ମୋର ମତ ରଖିଥିଲି ଏବଂ ସେମାନଙ୍କଠାରୁ ନ୍ୟାୟ ଦାବି କରିଥିଲି? ବୋଲି ଉଲ୍ଲେଖ କରିଛି ହିନ୍ଦୁସ୍ତାନ ଟାଇମ୍ସ । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭାଇରାଲ ଭିଡିଓଟି ବର୍ତ୍ତମାନ ଦିନର ନୁହେଁ । ଉକ୍ତ ଭିଡିଓଟି ୨୦୨୩ ମସିହାର ଅଟେ । ବର୍ତ୍ତମାନ ଦିନରେ ରାଜ୍ୟସଭାରେ ଉପ-ନେତା ପଦରୁ ହଟାଯିବା ଘଟଣା ସହ ଉକ୍ତ ଭିଡିଓର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ ।  

తెలుగు పోస్ట్ 9 Apr 2026 8:20 am

పోలీసు సిబ్బందికి వేసవి రక్షణ సామగ్రి పంపిణీ..

పోలీసు సిబ్బందికి వేసవి రక్షణ సామగ్రి పంపిణీ.. నర్సంపేట, క్రైం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 9 Apr 2026 8:18 am

మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రారంభమయింది.

తెలుగు పోస్ట్ 9 Apr 2026 8:08 am

IPL 2026 : టైటాన్స్ సూపర్ విక్టరీ.. ఢిల్లీపై ఒక్క పరుగుతోనే?

ఢిల్లీ కాపిటల్స్ ఈ సీజన్ లో తొలి ఓటమి చవి చూసింది

తెలుగు పోస్ట్ 9 Apr 2026 7:59 am

షూటింగ్ పూర్తి

యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి విలేజ్ ఎంటర్‌టైనర్ ’ఓ.! సుకుమారి’ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫోటో లో హీరో తిరువీర్ తో పాటు టీమ్ మొత్తం ఒకేచోట చేరి సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీ వైబ్ లో కనిపించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 9 Apr 2026 7:50 am

పవర్‌ఫుల్ లుక్‌లో ‘లెనిన్’

యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ మీదున్న భారీ అంచనాల గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ‘లెనిన్’ ఓ డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భావోద్వేగాలతో పాటుగా ఆకట్టుకునే కథనంతో పూర్తి సినిమాటిక్ ప్యాకేజీగా ‘లెనిన్’ రూపుదిద్దుకుంటోంది. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పవర్‌ఫుల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అఖిల్ కొత్త లుక్‌లో కనిపించగా, ఆయన చిరునవ్వు మరింత ఆకర్షణీయంగా ఉంది. అభిమానుల్లో ఇప్పటికే ఎన్నో అంచనాల్ని సృష్టించిన ఈ చిత్రం జూన్ 26న విడుదల కానుంది. మురళీ కిషోర్ అబ్బూరు ‘లెనిన్’ చిత్రాన్ని భారీ స్థాయిలో, అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

మన తెలంగాణ 9 Apr 2026 7:35 am

Israel - Iran War : కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు.. కొనసాగుతున్నదాడులు

ఇజ్రాయెల్ లెబనాన్‌లో దాడులు ప్రారంభించడంతో ప్రతిస్పందనగా ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది

తెలుగు పోస్ట్ 9 Apr 2026 7:21 am

గీత కార్మికుడికి తీవ్ర గాయాలు..

గీత కార్మికుడికి తీవ్ర గాయాలు.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన

ప్రభ న్యూస్ 9 Apr 2026 7:20 am

కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ గండి?

దుబాయ్ : ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక తెరపడిందన్న సంబరం కొద్ది గంటలు కూడా నిలబడలేదు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే విషయమై అమెరికా విధించిన గడువు సమీపిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కాల్పుల విరమణ ప్రకటన ప్రపంచ దేశాలకు పోయిన హర్షం వ్యక్తం చేశాయి. అం తలోనే ఇజ్రాయెల్ లెబనాన్‌పై అత్యంత భీకర దాడులకు దిగింది. ఈ దాడిలో 89 మందికి పైగా మృతి చెందారు. 700 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలోలెబనాన్ ప్రముఖ మతపెద్ద అలీ నబూ డా 1982 తర్వాత లెబనాన్ పై ఇదే అతిపెద్ద దాడి ఇదే. ఈ దాడుల పట్ల భగ్గుమ న్న ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూ సి వే సింది. బీరూట్, ఇతర ప్రాంతాలలో ని ఇరాన్ ఆధిపత్య హెజ్‌బోల్లా మిలిటెంట్ల అ ణచివేత ల్లో భాగంగా ఇజ్రాయెల్ ఈ దాడుల కు దిగిం ది. ఈ మిలిటెంట్లపై తమ దాడులు ఆగబోవని ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రతిపాదన తరువాత కూడా వెల్లడించింది. ఇందు కు అ నుగుణంగానే దాడులకు దిగింది. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులలో ఈ నెల 3 నుం చి జ రుగుతున్న పరిణామాలలో మొత్తం మృ తుల సంఖ్య 1500 దాటింది. లెబనాన్‌లో ఇ జ్రాయెల్ పలు చోట్ల భూతల దాడులు కూడా సా గిస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకూ సాగిస్తో న్న దాడులలో 130 మంది వరకూ పిల్లలు చ నిపోయారు. 100 మందికి పైగా మహిళలు బలి అయ్యారు. అయితే హెజ్‌బోల్లా అంతం వరకూ తమ పంతం సాగుతుందని తాత్కాలి క కాల్పుల విరమణతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ సేనలు కదం తొక్కుతున్నాయి. దీ నితో పోరు విరమణ ప్రక్రియపై నీలినీడలు ప ర్చుకున్నాయి. బుధవారం బీరూట్‌లో అ త్యం త భయానక పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్ వరుస దాడులతో రక్తసిక్తమైన జనం కార్లలో దూర ప్రాంతాలకు తరలివెళ్లేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆసుపత్రికి చేరేలోగానే పలువురు మృతి చెందారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లెబనాన్‌పై యుద్ధం ఆగబోదని, కాల్పుల విరమణ ప్రతిపాదన ఈ ప్రాంతం పరిధిలోకి రాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. బుధవారం తమ బలగాలు హెజ్‌బోల్లాకు మునుపెన్నడూ లేని స్థాయిలో నష్టం కల్గించాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెలీ కట్జ్ తెలిపారు.సౌదీలోని ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడులు తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఎదురుదాడులకు దిగాయి. దీనితో పాటు కువైట్, బహరైన్‌లలో కూడా గగనతలంలో పోరు బీకరమైంది. హర్మూజ్ జలసంధిని తిరిగి మూసేసిన ఇరాన్ బుధవారం కొద్ది సేపు హర్మూజ్ జలసంధి మార్గం తెరిచేందుకు అంగీకరించిన ఇరాన్ తరువాత నిర్ణయం మార్చుకుంది. ఇజ్రాయెల్ నుంచి లెబనాన్‌పై భారీ స్థాయిలో దాడులతో తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఇరాన్ ప్రకటించింది. దీనితో కాల్పుల విరమణ ప్రక్రియ ఆదిలోనే ఆటంకాలతో కుంటుపడింది. హర్మూజ్‌పై ఇరాన్ తాజా నిర్ణయం గురించి ఇరాన్ అధికారిక వార్తాసంస్థ వెల్లడించింది. యుద్ధ విరమణకు ఇజ్రాయెల్ తూట్లుపొడుస్తున్న దశలో తమ నిర్ణయాలు కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటాయని ఇరాన్ ప్రకటించింది. అమెరికా తన పెంపుడు పిచ్చికుక్కను అదుపులో పెట్టలేకపోతే , తాము అందుకు తగ్గట్లుగానే దెబ్బ తీయాల్సి ఉంటుందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రక్రియలో లెబనాన్ కూడా ఉందని శాంతిచర్చలలో కీలకమైన పాకిస్థాన్ అంతకు ముందు తెలిపింది. 

మన తెలంగాణ 9 Apr 2026 6:00 am

9thApril2026 |గురువారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

9thApril2026 | గురువారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 9thApril2026 |

ప్రభ న్యూస్ 9 Apr 2026 6:00 am

ఇది ఖర్చుకాదు బాధ్యత

మనతెలంగాణ/హైదరాబాద్: సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సిఎస్‌ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీలు సిఎస్‌ఆర్‌కు చేస్తున్న వ్యయం వందకు వంద శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్యా, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని సిఎం రే వంత్‌రెడ్డి తెలియజేశారు. కంపెనీలు వాటితో పాటు తమ కు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సిఎస్‌ఆర్ నిధులు వినియోగించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించా రు. ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగా ణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీ ర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా తయారు చేస్తామని సిఎం పేర్కొన్నారు. విద్యపై పెట్టే వ్య యాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్‌లోనే 44 శాతం ఉన్నారని వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సిఎస్‌ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలన్నారు. సిఎస్‌ఆర్ నిధుల వినియోగం కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నియామకం సిఎస్‌ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటివరకు సరైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఇందుకు నియమించామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సమన్వయం చేసుకొని తమకు ఆసక్తి ఉన్న విద్యా, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సిఎస్‌ఆర్ నిధులు వినియోగించవచ్చని సిఎం తెలిపారు. ఇప్పటికే రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయని సిఎం వారికి అభినందనలు తెలిపారు. కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ సిఎస్‌ఆర్ నిధుల విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని ఆయన తెలిపారు. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. పాఠశాల విద్యా, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు వారు ఆసక్తి చూపారు. ఈ సమావేశంలో రహేజా ఫౌండేషన్ నుంచి శ్రావణ్ కుమార్, రాంకీ ఫౌండేషన్ నుంచి దాక్షయణి ఆళ్ల, యశోద ఆసుపత్రి నుంచి డాక్టర్ గోరుకంటి సురేందర్ రావు, గోరుకంటి ఫల్గుణ్ రావు, మేఘా నుంచి సుధా రెడ్డి, అపోలో ఆసుపత్రి నుంచి అపర్ణా రెడ్డి, కామినేని భాస్కర్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి శేఖర్ రెడ్డి, నాడ్యామ్ ఫౌండేషన్ నుంచి పగిడిపాటి దేవయ్య, రుద్రమదేవి, ఎంపి వేం నరేందర్ రెడ్డి, సిఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 9 Apr 2026 5:30 am

త్వరలో మీ అవినీతి చిట్టా విప్పుతా

మనతెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావులు తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసం తమ ప్రభుత్వాన్ని, మంత్రులను భ యబ్రాంతులను గురిచూస్తే వారి తాటాకు చప్పుళ్ల కు భయపడమని, ఇష్టానుసారంగా కారుకూతలు కూస్తే తాము భయపడమని రెవెన్యూ శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ నాయకుల అక్రమాలు, భూదందాల చిట్టాను త్వరలోనే విప్పుతామని బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బాగోతాల జాబితాను ఒక్కొక్కటి గా తమ మిత్రలు ఇస్తున్నారని వాటిని త్వరలోనే బ యటకు తీస్తామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నాదర్‌గుల్, వట్టినాగులపల్లి భూముల వ్య వహారం , మంత్రులపై బిఆర్‌ఎస్ నాయకులు చేసి న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలను ‘అబద్ధాల రావు’, ‘డ్రామాల రావు’ అని సంబోధి స్తూ, వారు చేస్తున్న విమర్శలను అసత్యాల పుట్టగా మంత్రి పొంగులేటి అభివర్ణించారు. బుధవారం ఆ యన సచివాలయంలో గ్రౌండ్‌ప్లోర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పది సంవత్సరాల్లో తెలంగాణను కొల్లగొట్టి ఆ బురదని ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని బిఆర్‌ఎస్ నాయకులైన అబద్ధాల రావు, డ్రామారావు, శకుని మామలు ఎలా తాపత్రయ పడుతున్నారో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ధరణిలో జరిగిన అవకతవకలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయని, ఫోరెన్సిక్ ఆడిట్ లో రెండు జిల్లాల రిపోర్టు వచ్చిందని, మిగతా జిల్లాలది రాబోతుందని ఆయన తెలిపారు. అవన్నీ బయట పెట్టక ముందే, మనకంటిన బురద వారికి పూస్తే ఇద్దరం బురద రాసుకున్నోళ్లం అవుతామని బిఆర్‌ఎస్ పగటి కలలు కంటుందని ఆయన అన్నారు. అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తరువాత డ్రామారావు, అబద్ధాల రావు, శకుని మామ కుటుంబానికి ఉన్న ఆస్తులెంతా? ఇప్పుడు వారికున్న ఆస్తులెంత చెప్పాలని మంత్రి పొంగులేటి డిమాండ్ చేశారు. మీ పార్టీకి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. మోచేతి నీళ్లంటే కోటి రూపాయలు కాదని అంతకన్నా ఎక్కువని... రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎవరిదో మీకు తెలియదా అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్ మోచేతి నీరు తాగినోళ్లు మీరని, ప్రజలకు ఈ విషయం తెలుసో లేదో కానీ, ఈ అబద్ధాల రావు, డ్రామా రావుకు బాగా తెలుసనీ ఆయన అన్నారు. అంతేకాదు మాయమాటలు చెప్పి, తడి బట్టతో నా గొంతు కోసిన తరువాత, నీ పార్టీకి ఇదే రాఘవ కన్‌స్ట్రక్షన్ నుంచి అధికారికంగా కోటి రూపాయలు ఇచ్చానని మరచిపోయావా అబద్ధాలరావు అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అప్పుడే తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నావా డ్రామారావు? మోచేతి నీళ్లంటే కోటి రూపాయలు కాదని అంతకన్నా ఎక్కువని ఈస్టోరీ మీ అంతరాత్మకు తెలుసనీ మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శాసనసభ సమావేశంలో డైరెక్టుగా చెప్పారు, మీకు చాలెంజ్ విసిరారు. ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్‌కు రాఘవ కన్ స్ట్రక్షన్ సంబంధం లేదని, రోడ్లకు మెటల్ పంపే కంపెనీ మీద సిబిసిఐడీ విచారణ వేస్తామని సిఎం పేర్కొన్న విషయాన్ని మరోసారి మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉన్న ఒక సభ్యుడిపై బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తే చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి ఆ కంపెనీతో పాటు విదేశాలకు వేలాది కోట్ల రూపాయల సంపద తరలించిన కంపెనీలపై కూడా సిబిసిఐడీ విచారణ జరిపిస్తామని పేర్కొనడం తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి నిరూపిస్తుందని ఆయన అన్నారు. 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల్లో గనుల శాఖకు అబద్ధాలరావు, డ్రామారావు, శకుని మామలే మంత్రులుగా వ్యవహారించారని ఆయన తెలిపారు. ఈ ముగ్గురు ఎన్ని సెక్టార్లలో మైనింగ్‌ను దోచుకున్నారో ప్రతిదీ ఈ సిబిసిఐడీ ద్వారా విచారణలో వస్తుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోనే నాదర్‌గుల్ భూములకు మ్యుటేషన్.... నాదర్‌గుల్ గ్రామంలోని సర్వే నంబర్ 613లో గల 370 ఎకరాల భూమిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సాక్ష్యాధారాలతో మంత్రి పొంగులేటి తిప్పికొట్టారు. ఈ భూమి బాగోతం మొత్తం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. 2014లోనే మూడు సంస్థలకు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, 2016లో మ్యుటేషన్ పూర్తి చేసింది కూడా గత ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. గూగుల్ మ్యాప్స్ సాక్ష్యాలను బయటపెడుతూ 2021 వరకు ఖాళీగా ఉన్న ఈ భూమిలో 2022 నాటికి రోడ్లు నిర్మించి, రేకుల షెడ్లు వేయించింది బిఆర్‌ఎస్ నాయకులేనని ఆయన మండిపడ్డారు. ఈ భూమి విషయంలో గత ప్రభుత్వం కోర్టులో కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం వహించిందని గత ప్రభుత్వమని, కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మార్చి 15న ప్రభుత్వం తరపు కౌంటర్ దాఖలు చేశామని ఆయన వెల్లడించారు. తమ పార్టీ మంత్రులపై బురద జల్లడం ద్వారా తమ కుటుంబ ఆస్తుల పెంపు, పంపకాల చర్చను పక్కదారి పట్టించాలని ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. వట్టినాగులపల్లి భూములపై అబద్దాలరావుది దుష్ప్రచారం.... వట్టినాగులపల్లి భూముల్లోనూ అబద్దాలరావుది పూర్తిగా దుష్ప్రచారమని మంత్రి పొంగులేటి కొట్టిపారేశారు. కుటుంబ సభ్యుల వివాదాన్ని కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షా కుటుంబానికి సంబంధించిన భూమిని తన కుమారుడు సహా నలుగురు డెవలప్‌మెంట్‌కు తీసుకున్నారని, వట్టినాగులపల్లి భూములను తన కుమారుడు కొనలేదని మంత్రి పొంగులేటి వెల్లడించారు. హోమ్ అనే సంస్థ కొన్న భూమి కొంత ఓఆర్‌ఆర్‌లో పోయిందని, ఓఆర్‌ఆర్‌లో పోయిన కొంత భూమిని రికార్డుల నుంచి తొలగించుకోలేదని మంత్రి తెలిపారు. ఓఆర్‌ఆర్‌లో పోయినంత భూమిని పక్కవాళ్ల భూమి నుంచి కబ్జా చేసే ప్రయత్నం చేశారని, ఆనాడు ప్రభుత్వం అండతో హోం సంస్థ భూఅక్రమాలకు పాల్పడిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఆధారం చూపకుండానే వేల కోట్ల అవినీతి జరిగిందని... ఆధారం చూపకుండానే వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వంపై మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని, సన్నబియ్యం పథకంపై ప్రజల స్పందన చూసి దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం పూర్తయితే బిఆర్‌ఎస్ ఉనికి పోతుందని మంత్రి కోమటిరెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని, సింగరేణిలో అవకతవకలని ఉప ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారం చేశారని, పౌర సరఫరాలో అవినీతి అంటూ మంత్రి ఉత్తమ్‌పై మరో పుకారు పుట్టించారని ఆయన అన్నారు. లిక్కర్ విషయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి మీద కూడా అదే రకంగా నిందలు వేశారని ఆయన మండిపడ్డారు. హిల్ట్ పాలసీ, మైనింగ్ పై విచారణకు సిద్ధమని సిఎం రేవంత్ చెబితే అసెంబ్లీ నుంచి తోక ముడుచుకొని వెళ్లిందెవరు అంటూ మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.

మన తెలంగాణ 9 Apr 2026 5:00 am

ఆదిలాబాద్‌లో జంట ఎయిర్‌పోర్టులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి రెం డు నూతన విమానాశ్రయాలు రాబోతున్నా యి. ఆదిలాబాద్‌లో అతి పెద్ద విమానాశ్రయా న్ని నెలకొల్పనున్నట్లు, మామునూరుకు మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్రానికి చెందిన కేంద్ర బొగ్గు గను ల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సమక్షంలో ఈ శుభ వార్త వెల్లడించారు. అ న్ని డిమాండ్లను పరిశీలిస్తున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ తెలిపారు. విమానాశ్రయాల అవసరం ఉన్న చో ట నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నె లల్లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చే స్తున్నామన్నారు. ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్నామని, అయితే ఆదిలాబాద్‌లో పెద్ద విమానాశ్ర యం నిర్మించాలని కేంద్రం భావిస్తోందన్నారు. సైని క, పౌరుల అవసరాలకు అనుగుణంగా ఇది ఉంటుంది అని తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైనట్లు ఆయన చెప్పారు. ఎప్పటి నుంచో తెలంగాణలో ఒకే విమానాశ్రయం కేవలం హైదరాబాద్‌లోనే ఉందన్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలు ఉండాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఫీజిబిలిటీకి తగ్గట్లుగా విమానాశ్రయాలు నిర్మించాలనేది ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన అని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా వరంగల్ లో విమానాశ్రయానికి అడుగులు ముందుకు వేస్తున్నామని, మరో మూడు నెలల్లో మామునూరులో శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణకు ముఖద్వారమైన ఆదిలాబాద్‌లో, పర్యాటకానికి, వివిధ వాణిజ్య కార్యక్రమాలను ప్రోత్సహించేలా విమానాశ్రయం రావాలని చిరకాల డిమాండు ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పలు దఫాల్లో చర్చించామని,వివిధ ఫీజిబుల్ ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణంపై దృష్ఠి సారించమని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో 360 ఎకరాలకు సంబంధించిన డిఫెన్స్ స్థలంలో విమానాశ్రయం నిర్మించాలను కున్నామని ఆయన తెలిపారు. లోగడ కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమై కోరామని ఆయన చెప్పారు. దీనికి రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపిందని ఆయన వివరించారు. మరో 450 ఎకరాలు అవసరం ఆదిలాబాద్ లో విమానాశ్రయానికి అదనంగా మరో 450 ఎకరాల అవసరం అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణ డిమాండ్ గురించి చెప్పడంతో సానుకూలంగా స్పందించిందని ఆయన చెప్పారు.విమానాశ్రయానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నామని, మొదట ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించాలని అనుకున్నామని, అయితే రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యూహాత్మకమైన ప్రాంతం కావడం, వైమానిక దళం శిక్షణకు కీలకమైన ప్రాంతం కావడంతో ఈ విమానాశ్రయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంట్లో ఒక పక్కన సామాన్య ప్రజల కోసం విమాన సేవల టర్మినల్‌ను ఎయిర్ పోర్ట్ అథారిటీ నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు తెలిపారు.సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ నెల 17న క్షేత్రస్థాయిలో సర్వే చేసిన తర్వాత రన్ వే ఓరియంటేషన్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు అవసరమైన 450 ఎకరాల స్థలాన్ని అప్పజెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని ఆయన తెలిపారు. భూసేకరణలో ఎలాంటి సమస్యలు లేవని ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పారని ఆయన వివరించారు. ఆదిలాబాద్ భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉన్న ప్రాంతం అవుతుందన్నారు. కమర్షియల్ హబ్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జేవర్ విమానాశ్రయం యూపీ ప్రభుత్వం పిపిపి పద్ధతిలో చేసుకుందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే రాష్ట్రం భూమిని తమకు అప్పగించాల్సి ఉంటుందన్నారు. పెద్దపల్లిలో ఒక స్థలాన్ని ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిందని, తమ నివేదికలోనూ సానుకూలంగా వచ్చిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక సమాధానం వచ్చిన తర్వాత ముందుకెళ్తామన్నారు. విమానాశ్రయానికి 600 నుంచి 700 ఎకరాలు అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. పెద్ద విమానాశ్రయాలు భవిష్యత్ కోసం కావాలంటే కనీసం 1200 ఎకరాలు అవసరం అవుతాయన్నారు. కొత్తగూడెంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఫీజిబుల్ కాదన్న విషయాన్ని తెలియజేశామని కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు తెలిపారు. -=-=-=-=-=-=-=-=-=-=- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం రాష్ట్రంలో వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్ స్ట్రిప్ ఉన్నదని, ఆ స్థలంలో నూతన విమానాశ్రయం కట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి చర్చించామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, పౌర విమానయాన శాఖ అధికారులు, రక్షణ శాఖ అధికారులు, ఆదిలాబాద్ కలెక్టర్ పాల్గొన్నారు. --++--

మన తెలంగాణ 9 Apr 2026 4:30 am

ఇరిగేషన్ మోటార్లపై ఇదేం కుట్ర?

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్ రా వు ధ్వజమెత్తారు. బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే ఈ కుట్ర జరుగుతుందని, ఆ నె పాన్ని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నా రా అంటూ ప్రశ్నించారు. భారీ నీటి పారుదల మోటార్లను ఇష్టానుసారం స్టార్ట్, స్టాప్ చేయడం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధమని, ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చే శారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేస్తున్నారా?, లేక ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా? అని నిలదీశారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవని, పదే పదే ఆపితే తీవ్ర న ష్టం కలుగుతుందని హెచ్చరించారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరమని, తక్షణమే మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం, డిజైన్ కు అనుగుణంగా ని రంతరాయంగా పంపులు నడిపించాలని, రాజకీయాల కోసం రా ష్ట్ర రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హ రీష్ రావు హెచ్చరించారు.

మన తెలంగాణ 9 Apr 2026 3:30 am

నేడు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

 నేడు (గురువారం) కేరళ, అసోం, పుదుచ్చేరిల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. వామపక్ష కూటమి అధికారంలో ఉన్న కేరళలో 2.71 కోట్ల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోవల్సి ఉంది. ఇక్కడ ఎల్‌డిఎఫ్ వరుసగా మూడోసారి తన బలాన్ని పరీక్షించుకొంటోంది.కాంగ్రెస్ సారధ్య అ యుడిఎఫ్ రాష్ట్రంలో విరామం తరువాత పాగాకు యత్నిస్తోంది. ఇక బిజెపి సారధ్య ఎన్‌డిఎ తన ఖాతా తెరిచేందుకు రంగంలోకి దిగింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలలో మొత్తం మీద 883 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ అత్యధిక స్థానాలలో యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్ మధ్యనే ఉంటుంది. బిజెపి రాకతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. పది సంవత్సరాల తమ పాలనలో సాధించిన ప్రగతిని చాటుకుంటూ అధికార ఎల్‌డిఎఫ్ ప్రచారం సాగించింది. ఈ హయాంలో అవినీతిని ఎండగడుతూ ప్రతిపక్ష యుడిఎఫ్ విజయం కోసం ఆరాటపడుతోంది. ఈశాన్య రాష్ట్రం అసోంలో బిజెపి ఈసారి గెలుపుతో హ్యాట్రిక్‌కు సర్వశక్తులు ఒడ్డింది. ఇక్కడ ఎన్‌డిఎ, కాంగ్రెస్ నాయకత్వ ప్రతిపక్ష కూటమి నడుమ పోటి నెలకొని ఉంది. 126 మంది సభ్యుల అసెంబ్లీ ఎన్నికల బరిలో ఇప్పుడు మొత్తం 722 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవ్ గొగోయ్, ప్రతిపక్ష నేత దెవవ్రత సైకియా, ఎఐయుడిఎఫ్ అధ్యక్షులు బద్ద్రుద్దీన్ అజ్మల్, రాయ్‌జోర్ దళ్ నేత అఖిల్ గొగోయ్ , ఎజెపి ప్రెసిడెంట్ లూరింజ్యోతి గగోయ్ రంగంలో ఉన్నారు. ఈసారి ఎన్నికలకు చాలా కాలం ముందుగానే రాష్ట్ర కాంగ్రెస్ నేత గౌరవ్ ప్రధాన కేంద్రంగా బిజెపి పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఆయన జాతీయతను ప్రశ్నించింది. ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గురువారమే ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 294 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు, ఇక్కడ ఎన్‌డిఎకు కాంగ్రెస్, అన్నాడిఎంకె, విసికెతో కూడిన ఇండియా కూటమి సవాలు విసురుతోంది. ఈసారి నటుడు విజయ్ కూడా తమ టివికె పార్టీ తరఫున అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఎన్‌డిఎలో కీలకమైన ఎఐఎన్‌ఆర్‌సి నేత , సిఎం రంగస్వామి ఇప్పుడు థట్టన్‌చావడీ, మంగళం స్థానాల నుంచి పోటీలో ఉన్నారు

మన తెలంగాణ 9 Apr 2026 12:20 am

గురువారం రాశి ఫలాలు(09-04-2026)

మేషం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వృషభం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. మిధునం గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు. సింహం చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు. కన్య సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తుల ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. వృశ్చికం కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనస్సు ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధన పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మకరం వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుంభం అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. మీనం కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు.  

మన తెలంగాణ 9 Apr 2026 12:00 am

ఢిల్లీ క్యాపిటల్స్‌ పై గుజరాత్ టైటాన్స్ విజయం

 ఐపిఎల్ గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్ని అందుకుంది. బుధవారం చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో గుజరాత్ ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఇదే తొలి గెలుపు కాగా, ఢిల్లీ మొదటి ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 45 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన జోస్ బట్లర్ 27 బంతుల్లోనే 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు సాధించాడు. వాషింగ్టన్ సుందర్ (55) పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా (41), కెఎల్ రాహుల్ (92) అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచినా ఫలితం లేకుండా పోయింది.

మన తెలంగాణ 8 Apr 2026 11:51 pm

తాగునీటి కొరత రానీయొద్దు

అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం విశాలాంధ్ర-హైదరాబాద్: వేసవి నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణ జల సరఫరా శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి బుధవారం అధికారులతో మంత్రి సమీక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా అవసరానికి తగ్గట్టుగా వినియోగించేలా అవగాహన పెంచాలని సూచించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో తాగునీటి […] The post తాగునీటి కొరత రానీయొద్దు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:45 pm

అసత్యాలు ఆపండి

. నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ మీరే. కోర్టుకు వెళ్లి కొట్లాడుతున్నది మేమే. వట్టినాగులపల్లి వివాదం మీ ‘కుటుంబ పంచాయితీ’. కొత్వాల్‌గూడ క్రషర్‌పై అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు. బీఆరఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం విశాలాంధ్ర – హైదరాబాద్: నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బీఆరఎస్‌దేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాల రావు, డ్రామా రావు, శకుని […] The post అసత్యాలు ఆపండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:39 pm

హర్మూజ్ జలసంధిని తిరిగి మూసేసిన ఇరాన్

బుధవారం కొద్ది సేపు హర్మూజ్ జలసంధి మార్గం తెరిచేందుకు అంగీకరించిన ఇరాన్ తరువాత నిర్ణయం మార్చుకుంది. ఇజ్రాయెల్ నుంచి లెబనాన్‌పై భారీ స్థాయిలో దాడులతో తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఇరాన్ ప్రకటించింది. దీనితో కాల్పుల విరమణ ప్రక్రియ ఆదిలోనే ఆటంకాలతో కుంటుపడింది. హర్మూజ్‌పై ఇరాన్ తాజా నిర్ణయం గురించి ఇరాన్ అధికారిక వార్తాసంస్థ వెల్లడించింది. యుద్ధ విరమణకు ఇజ్రాయెల్ తూట్లుపొడుస్తున్న దశలో తమ నిర్ణయాలు కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటాయని ఇరాన్ ప్రకటించింది. అమెరికా తన పెంపుడు పిచ్చికుక్కను అదుపులో పెట్టలేకపోతే , తాము అందుకు తగ్గట్లుగానే దెబ్బ తీయాల్సి ఉంటుందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రక్రియలో లెబనాన్ కూడా ఉందని శాంతిచర్చలలో కీలకమైన పాకిస్థాన్ అంతకు ముందు తెలిపింది. 

మన తెలంగాణ 8 Apr 2026 11:34 pm

నేటి నుంచి దుకాణాల వేలం

అందుబాటులో 36 కాలనీల్లో 1400 షాపులు విశాలాంధ్ర – హైదరాబాద్: భాగ్యనగరంలోని క్యూర్ పరిధిలో డబుల్ బెడ్ రూం కాలనీల్లో ఉన్న 1400కు పైగా దుకాణాలను బహిరంగ వేల ద్వారా విక్రయించే ప్రక్రియ గురువారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 36 కాలనీల్లో ఉన్న దుకాణాలను వేలం ద్వారా విక్రయించడానికి ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీచేశారు. తొలుత రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎనిమిది కాలనీల్లో […] The post నేటి నుంచి దుకాణాల వేలం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:33 pm

ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం

. పోర్టు కారిడార్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు. గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి. ఈవీ బస్సుల వినియోగం పెంచుదాం. సీఎం చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు, […] The post ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:21 pm

అమరావతికి మరో కీలక ప్రాజెక్టు

కేంద్ర కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణంరూ.2,534 కోట్లతో కార్యాలయాలు, నివాస భవనాలు22.53 ఎకరాలు కేటాయించిన సీఆర్‌డీఏ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణం చేపడుతున్న తరహాలోనే… అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.2,534 కోట్లతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్‌ను […] The post అమరావతికి మరో కీలక ప్రాజెక్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:18 pm

లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: విజయవాడలో లూలు గ్రూపుకు భూముల కేటాయింపుపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలోని ఆర్‌టీసీ స్థలాన్ని లూలు మాల్‌కు కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో లూలు మాల్‌కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్‌పేట ఆర్‌టీసీ డిపోకు […] The post లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:16 pm

అసెంబ్లీ పోరుకుసర్వం సిద్ధం

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. గురువారం రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ప్రజలు తమ తీర్పును ఇవ్వనున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఒక అగ్నిపరీక్షగా మారనున్నాయి. తమిళనాడు, పశ్చిమ […] The post అసెంబ్లీ పోరుకుసర్వం సిద్ధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:12 pm

ఆహార భద్రత డొల్ల!

. ప్రజల ప్రాణాలతో కల్తీరాయుళ్ల చెలగాటం. మామూళ్ల మత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు. 28వ స్థానానికి దిగజారిన ఏపీ ర్యాంకింగ్. ఎఫఎసఓలు, ఏఎఫ్‌సీలు విజిటింగ్‌లకే పరిమితం. 30 శాతం లైసెన్సులు లేకుండానే వ్యాపారం విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో ఆహార భద్రత వ్యవస్థ అపహాస్యమవుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీరాయుళ్లను కట్టడి చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార కేంద్రాల్లో నాణ్యతలేని పదార్థాల వాడకం విచ్చలవిడిగా పెరుగుతుంటే, ఫుడ్ సేఫ్టీ అధికారులు […] The post ఆహార భద్రత డొల్ల! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:08 pm

400 Tankers Struck : మ‌ళ్లీ హోర్ముజ్ బ్లాక్ Andhra Prabha News

400 Tankers Struck : మ‌ళ్లీ హోర్ముజ్ బ్లాక్ Andhra Prabha News

ప్రభ న్యూస్ 8 Apr 2026 11:05 pm

ప్రపంచ శాంతికి ఇది గొప్ప దినం

డొనాల్డ్ ట్రంప్వాషింగ్టన్: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన అమెరకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా ఈ పరిణామాన్ని ప్రపంచ శాంతికి అతిపెద్ద రోజుగా అభివర్ణించారు. ఇరాన్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోంది. ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది. వారికి ఇక చాలు అనిపించింది. అలాగే, ప్రపంచం మొత్తం కూడా యుద్ధం ఆగిపోవాలనే కోరుకుంటోంది. హోర్మూజ్ జలసంధిలో […] The post ప్రపంచ శాంతికి ఇది గొప్ప దినం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 11:03 pm

అమెరికా జర్నలిస్ట్ విడుదల

వాషింగ్టన్: ఇరాక్‌లో గత వారం కిడ్నాప్‌కు గురైన అమెరికా జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ సురక్షితంగా విడుదల య్యారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం అధికారికంగా ధ్రువీకరిం చారు. ఆమె విడుదలతో తామంతా ఊపిరి పీల్చుకున్నామని, ఇరాక్ నుంచి ఆమె సురక్షితంగా బయటకు వచ్చేం దుకు పూర్తి సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. మార్చి 31న బాగ్దాద్‌లోని ఒక వీధిలో ఇరాన్ మద్దతున్న కతైబ్ హిజ్బుల్లా అనే మిలీషియా గ్రూప్ షెల్లీ కిటిల్సన్‌ను […] The post అమెరికా జర్నలిస్ట్ విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 10:59 pm

డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లొద్దు

యువతకు సూపర్‌స్టార్ రజనీకాంత్ సూచనచెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్… యువతకు మంచి సందేశం ఇచ్చారు. దయచేసి డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లవద్దని సూచించారు. చెన్నై విమానాశ్రయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత కాలంలో యువత పెడదోవ పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ లేని జీవితం నరకప్రాయమవుతుందని హెచ్చరించారు. యువత కేవలం సినిమాల్లోని స్టంట్లు, నటుల వేషధారణ చూసి ప్రభావితమై బైక్ రేసింగ్ వంటి ప్రమాదకర పనులకు పాల్పడటం సరికాదని… అది ప్రాణాపాయానికి దారితీస్తుందని హితవు […] The post డ్రగ్స్, మద్యం జోలికి వెళ్లొద్దు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 10:55 pm

Iran War Strategy: ఆయుధ సేకరణం Andhra Prabha Top Story

Iran War Strategy: ఆయుధ సేకరణం Andhra Prabha Top Story (

ప్రభ న్యూస్ 8 Apr 2026 10:31 pm

Supriya reveals emotional journey behind production logo

Producer Supriya Yarlagadda became talk of the town post Adivi Sesh’s Dacoit pre-release event. While Mythri Ravi and Naga Vamsi words about her strictness went viral, her emotional side while revealing story behind logo of their production banner, SS Creations. She stated that she added Akkineni Nageswara Rao’s Panche, who guided them throughout their life, […] The post Supriya reveals emotional journey behind production logo appeared first on Telugu360 .

తెలుగు 360 8 Apr 2026 10:23 pm

Active Producers Guild strongly Oppose Percentage Model

A week ago, the exhibitors of the single screens from Telangana announced that Hyderabad single screens will be in business on a percentage models and a list of 23 single screens are listed in the statement issued. The distributors will get 60 percent share from the Nett in the first week, 50 percent share in […] The post Active Producers Guild strongly Oppose Percentage Model appeared first on Telugu360 .

తెలుగు 360 8 Apr 2026 10:10 pm

Iran Us Ceasefire : జ‌ల‌తంత్రం Andhra Prabha Top Story

Iran Us Ceasefire : జ‌ల‌తంత్రం Andhra Prabha Top Story ఆంధ్ర‌ప్ర‌భ‌,

ప్రభ న్యూస్ 8 Apr 2026 10:09 pm

వన్‌ప్లస్ నోర్డ్ 6 స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ

న్యూదిల్లీ: వన్‌ప్లస్ ఇండియా ఈరోజు నోర్డ్ 6ను ఆవిష్కరించింది. ఆధునిక హస్ట్లర్‌కు స్పష్టమైన ఆధిక్యం అందించేందుకు రూపొందించబడిన ఈ స్మార్ట్‌ఫోన్, విభాగంలో తొలిసారిగా 165 ఎఫ్.పి.ఎస్. గేమింగ్ అనుభవాన్ని అందిస్తూ అద్భుతమైన గ్రాఫిక్ స్మూత్‌నెస్‌ను ఇస్తుంది. అలాగే, 9000 ఎం ఏ హెచ్ సామర్థ్యంతో ఉన్న, తన విభాగంలోనే అతిపెద్దదయిన భారీ ఎస్.ఐ.కార్బన్, అనేది పవర్‌పై ఉన్న ఆందోళనకు ముగింపు పలుకుతుంది. వన్‌ప్లస్ నోర్డ్ 6, మధ్యశ్రేణి ఫోన్లపై ఉన్న అంచనాలను కొత్తగా నిర్వచిస్తుంది. ఇది ఫ్లాగ్‌షిప్ […] The post వన్‌ప్లస్ నోర్డ్ 6 స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 10:07 pm

టాటా మోటార్స్ టాటా ఇంట్రా ఈవీ పికప్ విడుదల

ముంబయి: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, సరికొత్త టాటా ఇంట్రా ఈవీ పికప్‌ను ప్రారంభిస్తూ ఎలక్ట్రిక్ వాణిజ్య చలనశీలతలో తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసింది. ఎలక్ట్రిక్ చిన్న వాణిజ్య వాహనాల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ, ఈ కొత్త పికప్ విశ్వసనీయ ఇంట్రా ప్లాట్‌ఫారమ్ బలాన్ని, ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్‌తో కలిపి అందిస్తోంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న కార్గో అవసరాలను తీర్చేందుకు నమ్మదగిన, అధిక ఆదాయం సాధించే పరిష్కారంగా ఇది రూపుదిద్దుకుంది. […] The post టాటా మోటార్స్ టాటా ఇంట్రా ఈవీ పికప్ విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 10:02 pm

ఖరీఫ్ ఎరువులపై రూ 41,534 కోట్ల సబ్సిడీ ఖరారు

 ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో ఖరీఫ్ పంటకాలానికి ఎరువులలో సబ్సిడీని 12 శాతం పెంచే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖరీఫ్‌లో నత్రజని, భాస్వర (పి. కె) ఎరువులపై ప్రభుత్వ సబ్సిడీ పెరుగుదల రూ 41,534 కోట్లుగా నిర్ణయించారు. గల్ఫ్ యుద్ధంతో సరఫరాల ఆటంకాలతో అంతర్జాయ స్థాయి ధరల ప్రభావం ఎరువులపై పడకుండా ఉండేందుకు సబ్సిడీని పెంచారు. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఖరీఫ్ పంటకాలానికి నత్రజని ఆధారిత ఎరువులపై కిలోకు రూ 47.32 పైసలు చొప్పున పెరుగుతుంది. ఇక ఫాస్పేట్ ఎరువులపై సబ్సిడీలు కిలోకు రూ 52.76 చొప్పున పెరుగుతాయని కేబినెట్ తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఇక సల్ఫర్ ఎరువులపై సబ్సిడీలు రూ 3.16గా పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ పంటల పోషక ప్రతిపాదిత సబ్సిడీ (ఎన్‌బిఎస్) స్కీమ్ పరిధిలో ఈ సబ్సిడీల పెంపుదల ఖరారు చేశారు. ఈ పథకం 2010 ఏప్రిల్ నుంచి అమలులో ఉంది. గత ఏడాది 2025 ఖరీఫ్ సీజన్ సబ్సిడీ మొత్తంతో పోలిస్తే ఇప్పుడు ఈ ఏడాది పెంపుదల రూ 4317 కోట్లుగా ఉందని తెలిపారు.ఎన్‌బిఎస్ స్కీమ్ పరిధిలోకి వచ్చే 28 రకాల ఎరువుల సబ్సిడీలకు ఈ పెంపుదల వర్తిస్తుంది. కోవిడ్ దశలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు ప్రత్యేకించి డిఎపి వంటి వాటి దరలు గణనీయంగా పెరిగాయి. అయితే దేశంలో 50 కిలోల ఎరువుల సంచి రిటైల్ ధర రూ 1350గానే ఉంచామని మంత్రి వివరించారు. ఇప్పుడు యుద్ధం దశలోనూ రైతుల ఎరువులపై భారం పడకుండా పలు చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేబినెట్‌లో రెండు ప్రధాన మౌలిక సదుపాయాల వ్యవస్థల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రూ 40000 కోట్ల వ్యయ అంచనాలతో రెండు జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన అంశం కూడా ఉంది. జైపూర్ మెట్రోరైలు రెండో దశకు కూడా ఆమోదం వెలువడిందని కేబినెట్ తరువాత కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. వెస్ట్‌బెంగాల్ జార్ఖండ్ మల్టీ ట్రాకింగ్ రైలు ప్రాజెక్టుకు కూడా గ్రీన్‌సిగ్నల్ వెలువడింది.రాజస్థాన్ ఆయిల్ రిఫైనరీ రెట్టింపు సామర్థపు నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజస్థాన్ రిఫైనరీ డబ్లింగ్ పనులకు రూ 79,450 కోట్ల వ్యయ అంచనాలకు ఆమోదం తెలిపారు. హెచ్‌పిసిఎల్ నుంచి అదనపు ఈక్విటీ మద్దతు కూడా ఈ ప్రాజెక్టుకు దక్కుతుంది. ఈ మేరకు ఇప్పుడు హెచ్‌సిఎల్ నుంచి ఈ ప్రాజెక్టులో రూ 19600 కోట్ల వరకూ ఈక్విటీ ఉంటుంది. ఈ రిఫైనరీకి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 21న ప్రారంభోత్సవం జరుపుతారు.

మన తెలంగాణ 8 Apr 2026 10:01 pm

వెల్కమ్‌హోటల్ బ్రాండ్ 50వ హోటల్ మైలురాయి: ఐటీసీ హోటల్స్ వేడుకలు

న్యూదిల్లీ: ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ (ఐటీసీహెచఎల్) భారతదేశంలో వెల్కమ్‌హోటల్ బ్రాండ్ కోసం 50వ హోటల్ మైలురాయి ఒప్పందాన్ని ఈరోజు ప్రకటించింది. పెరుగుతున్న ఈ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోకు షిర్డీ మరియు భువనేశ్వర్‌లలో కొత్త హోటళ్లను చేర్చింది. వెల్కమ్‌హోటల్ బ్రాండ్ కోసం త్వరలో ప్రారంభం కానున్న గమ్యస్థానాలలో సిక్కింలోని గాంగ్‌టక్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, గ్వాలియర్ ఉన్నాయి. మహారాష్ట్రలోని షిర్డీలో మెస్సర్స్ శాండీ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనున్న 73 గదుల హోటల్‌ను నిర్వహించడానికి ఐటీసీహెచఎల్ ఇటీవల వారితో ఖచ్చితమైన ఒప్పందాలను […] The post వెల్కమ్‌హోటల్ బ్రాండ్ 50వ హోటల్ మైలురాయి: ఐటీసీ హోటల్స్ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 9:57 pm

ఎసిబి వలలో అవినీతి పోలీసులు

పాస్‌పోర్ట్ కేసులో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఔట్ పోస్ట్ సీఐ సంపత్తి కనుకయ్య, ఎస్సై సిద్ధేశ్వర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇటీవల ఫేక్ పాస్‌పోర్ట్ కేసులో నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన కేరళకు చెందిన వ్యక్తిని శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చిన వ్యక్తిని ప్రతి ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని పోలీసులు సూచించారు, చార్జిషీట్ ఫైల్ చేయడం కోసం బాధితుడిని సీఐ కనకయ్య, ఎస్‌ఐ సిద్ధేశ్వర్‌లు మొదటగా రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబసభ్యుల పేర్లు కూడా చార్జిషీట్‌లో చేరుస్తామని వారు హెచ్చరించారు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని బ్రతిమిలాడగా రూ. 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా మంగళవారం రూ.2 లక్షల లంచం సీఐ కనకయ్య, ఎస్‌ఐ సిద్దేశ్వర్‌లు తీసుకుంటుండగా పట్టుకున్నామని రంగారెడ్డి జిల్లా రేంజ్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.

మన తెలంగాణ 8 Apr 2026 9:56 pm

సహజ రత్నాల విభాగంలో తనిష్క్ కొత్త అధ్యాయం ప్రారంభం

హైదరాబాద్: పవిత్రమైన అక్షయ తృతీయ పండుగ సమీపిస్తున్న తరుణంలో, టాటా సంస్థకు చెందిన భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్ అయిన తనిష్క్, సహజ రత్నాల విభాగంలో తమ తాజా ఆభరణాలను రుక్మిణి వసంత్‌తో కలిసి ఆవిష్కరించింది. దక్షిణ భారతదేశంలో ఎల్లప్పుడూ రత్నాలు, కేవలం అలంకరణకు మించినవి; అవి సంప్రదాయం, గుర్తింపు, నిత్యజీవితపు సొగసుకు ప్రతీకలు. టెంపుల్ జ్యువెలరీ ప్రభావం నుండి ఉత్సాహభరితమైన వేడుకల వరకూ, ఈ ప్రాంతపు సౌందర్య భాషలో లోతుగా రత్నాలు పెనవేసుకుపోయాయి. కెంపులు, పచ్చలు, […] The post సహజ రత్నాల విభాగంలో తనిష్క్ కొత్త అధ్యాయం ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 9:54 pm

Jagan Threats to ABN Radha Krishna and Chandrababu Naidu

Former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy has once again stirred political debate with his sharp remarks against ABN Andhra Jyothy and its managing director Vemuri Radhakrishna. His statements were not limited to criticism. They carried clear warnings of action if his party returns to power. Jagan alleged that the media house has […] The post Jagan Threats to ABN Radha Krishna and Chandrababu Naidu appeared first on Telugu360 .

తెలుగు 360 8 Apr 2026 9:41 pm

హరీష్ రావు వనపర్తి సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

బిఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు వనపర్తి సభకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభకు అనుమతి నిరాకరిస్తూ జిల్లా ఎస్పి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. గురువారం నియోజకవర్గంలో హరీశ్ రావు సభ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. వనపర్తి జిల్లాలోని గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నిర్వాసిత రైతులకు సంఘీభావం తెలిపేందుకు, వారి సమస్యలపై పోరాడేందుకు హరీశ్ రావు వనపర్తి పర్యటనకు సిద్దమయ్యారు. దీని కోసం ముందుగా అనుమతులు తీసుకున్నప్పటికీ, చివరి నిమిషంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ జిల్లా ఎస్పి అనుమతులను రద్దు చేశారు. ఈ క్రమంలో అనుమతి నిరాకరణను సవాల్ చేస్తూ హరీష్ రావు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న హైకోర్టు పోలీసుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సభ నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే, నిబంధనల ప్రకారం శాంతియుతంగా సభ నిర్వహించుకోవాలని సూచించింది. దీంతో హరీష్ రావు వనపర్తి సభకు మార్గం సుగమమయ్యింది.

మన తెలంగాణ 8 Apr 2026 9:37 pm

రాష్ట్రంలో 2027 జన గణనకు సర్వం సిద్ధం

తెలంగాణలో జనగణన 2027కు ప్రభుత్వం సిద్ధమైంది. హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సర్వే మే 11 నుంచి జూన్ 9 వరకు అదే విధంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ అవకాశం కల్పిస్తారు. ప్రజలు తమ వివరాలను ముందుగానే ఆన్‌లైన్ లో నమోదు చేసుకునే సౌకర్యం ఉంది. జనగణనలో పూర్తి సహకారం అందించాలని ప్రజలకు ప్రభుత్వ విజ్ఞప్తి చేసింది. సెన్సస్ చట్టం ప్రకారం సమాచారం ఇవ్వడం తప్పనిసరి, తప్పుడు సమాచారం ఇస్తే జరిమానా/శిక్షలు, సెన్సస్ అధికారులకు అడ్డంకులు కలిగిస్తే కఠిన చర్యలు ఉంటా యని పేర్కొంది. ఇళ్లలోకి ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని,- గుర్తులు/నంబర్లు వేయడానికి సహకారం అవసరం అని వెల్లడించింది. పాలసీ నిర్ణయా లు, అభివృద్ధి కోసం కీలకమైనది సెన్సస్ డేటాగా పేర్కొంది. సెన్సస్ సమాచారం గోప్యం,- కోర్టుల్లో కూడా ఉపయోగించరాదని వెల్లడించింది. అన్ని శాఖలు, కలెక్టర్లు, మున్సిపల్ సంస్థలకు ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మన తెలంగాణ 8 Apr 2026 9:33 pm

యురేనియం శుద్ధి నిలిపివేతే లక్ష్యం: ట్రంప్

ఇరాన్‌తో కాల్పుల విరమణ అనంతరం కొత్త దశ చర్చల్లో యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలన్న పట్టుదలతో అమెరికా ముందుకు వెళ్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో టారిఫ్ తగ్గింపులు, ఆర్థిక ఆంక్షల సడలింపుపై కూడా చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ ఒప్పందం విసృ్తత పరిధిలో ఇప్పటికే కొన్ని కీలక అంశాలు అంగీకారానికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో, ఇరాన్‌లో యురేనియం శుద్ధి పూర్తిగా నిలిచిపోతుంది. అమెరికా, ఇరాన్‌తో కలిసి లోతుగా దాచిన అణు మౌలిక సదుపాయాల అవశేషాలను వెలికితీసి తొలగిస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణు కేంద్రాలు ఉపగ్రహాల ద్వారా నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయని, దాడి జరిగినప్పటి నుంచి వాటిలో మార్పులేమీ లేవని కూడా ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌తో ఆర్థిక చర్చలు కీలక పాత్ర పోషిస్తాయని ట్రంప్ సూచించారు. టారిఫ్‌లు తగ్గించడం, ఆంక్షలను సడలించడం వంటి అంశాలపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 15 అంశాల్లో చాలా వరకు ఇప్పటికే అంగీకారానికి వచ్చాయి అని పేర్కొన్నప్పటికీ, వాటి వివరాలు వెల్లడించలేదు. అలాగే, ఇరాన్‌కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే ఏ దేశానికైనా అమెరికాకు ఎగుమతులపై వెంటనే 50 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నిర్ణయానికి ఎలాంటి మినహాయింపులూ ఉండవని స్పష్టం చేశారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందం చివరి క్షణంలో సాధ్యమైంది. అయితే దీని అమలు, షరతులపై ఇంకా స్పష్టత లేదు. ఒప్పందం ప్రకటించిన కొద్ది గంటల్లోనే యూఏఈ, కువైట్ వంటి గల్ఫ్ దేశాల్లో క్షిపణి హెచ్చరికలు నమోదయ్యాయి. ఇరాన్‌లో చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు కూడా సమాచారం వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఒప్పందాన్ని సున్నితమైన తాత్కాలిక విరమణగా అభివర్ణించారు. లెబనాన్‌లోని హెజ్బొల్లాపై యుద్ధం కూడా ఒప్పందంలో భాగమా అనే విషయంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు వ్యక్తమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి ఈ వివాదంలో ప్రధాన కేంద్రంగా మారింది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకలపై ఫీజులు విధించే విధానాన్ని ఇరాన్ అమలు చేయవచ్చని సంకేతాలు వెలువడ్డాయి. ఒమాన్‌తో కలిసి ఈ వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇది పెద్ద ఆర్థిక వనరుగా మారుతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించగా, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మార్గంలో రాకపోకలు ఇరాన్ సైన్య పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు. అయితే గల్ఫ్ దేశాలు దీనికి వ్యతిరేకంగా నిలిచే అవకాశముంది. ఇరాన్ అణు కార్యక్రమ భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఇరాన్ గతంలో యురేనియంను 60 శాతం వరకు శుద్ధి చేసింది, ఇది ఆయుధ స్థాయి శుద్ధికి దగ్గరగా ఉంటుంది. అధిక శుద్ధి యురేనియం నిల్వలు ఇంకా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇరాన్ విడుదల చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనలో ఫార్సీ, ఇంగ్లీష్ పత్రాల్లో వ్యత్యాసాలు కనిపించాయి. ఫార్సీ వెర్షన్‌లో శుద్ధి కొనసాగుతుందని సూచనలు ఉండగా, ట్రంప్ దానిని తప్పుడు పత్రంగా కొట్టిపారేశారు. అమెరికా, ఇజ్రాయెల్ వర్గాలు ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తున్నప్పటికీ, దీనికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణ ఇంకా వెలుగులోకి రాలేదు. యుద్ధం ముగియాలంటే అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, ఆంక్షలు ఎత్తివేయడం, నిల్వ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులను ఇరాన్ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అయితే ఇవి అమెరికాకు ఆమోదయోగ్యం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. టెహ్రాన్‌లో కాల్పుల విరమణ అనంతరం ప్రభుత్వ అనుకూల నిరసనలు కొనసాగడం, అమెరికాఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు వినిపించడం, దేశంలో కఠిన వైఖరి ఇంకా కొనసాగుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో శాశ్వత ఒప్పందంపై చర్చలు త్వరలో ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మన తెలంగాణ 8 Apr 2026 9:29 pm

ఐపిఎల్ 2026: ఢిల్లీ ముందు భారీ టార్గెట్ ఉంచిన గుజరాత్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు, గుజరాత్ టైటాన్స్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్(70), జోస్ బట్లర్(52), వాషింగ్టన్ సుందర్(55) అర్ధ శతకాలతో చెలరేగారు

మన తెలంగాణ 8 Apr 2026 9:29 pm

జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఖరీఫ్ సబ్సిడీ కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో రెండు ప్రధాన మౌలిక సదుపాయాల వ్యవస్థల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రూ 40000 కోట్ల వ్యయ అంచనాలతో రెండు జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన అంశం కూడా ఉంది. 2026 ఖరీఫ్ సీజన్‌కు ఎన్‌బిఎస్ సబ్సిడీ రేట్లకు ఆమోదం, జైపూర్ మెట్రోరైలు రెండో దశకు కూడా ఆమోదం వెలువడిందని కేబినెట్ తరువాత కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. వెస్ట్‌బెంగాల్ జార్ఖండ్ మల్టీ ట్రాకింగ్ రైలు ప్రాజెక్టుకు కూడా గ్రీన్‌సిగ్నల్ వెలువడింది. 

మన తెలంగాణ 8 Apr 2026 9:20 pm

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. తీవ్రంగా స్పందించిన ఇరాన్

టెహ్రాన్: ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటల తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. మిస్సైల్స్ తో పెద్ద ఎత్తున దాడులకు దిగింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై 100 వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. లెబనాన్‌పై దాడి చేస్తూ.. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కొనసాగిస్తే, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం నుండి వైదొలుగుతామని ఇరాన్ హచ్చరించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్, యుద్ధ విరమణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ దేశాన్ని శిక్షిస్తామని ఇరాన్‌ పేర్కొంది. ఈ యుద్ధ విరమణ ఒప్పందం లెబనాన్‌ కూ వర్తిస్తుంది. ఇజ్రాయెల్ వాగ్దానాలను ఉల్లంఘించడంలో పేరుగడించింది. దానిని తూటాలతో మాత్రమే ఆపగలం అని ఇరాన్ తెలిపింది. 

మన తెలంగాణ 8 Apr 2026 9:20 pm

ఇరాన్‌కు ఆయుధాలిచ్చే దేశాలపై 50 శాతం టారిఫ్‌లు : ట్రంప్

ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూ తమ దేశానికి ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవంటూ ట్రూత్‌లో పోస్ట్ పెట్టారు. ఇరాన్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను ట్రంప్ ప్రయోజనకరమైన పాలనాపరమైన మార్పుగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఆ దేశంతో కలిసి పని చేస్తామన్నారు. భూగర్భ అణు కేంద్రాలపై బి2 బాంబర్లతో చేసిన దాడుల వల్ల ఏర్పడిన అణువ్యర్థాలను టెహ్రాన్ సహాయంతో పూర్తిగా వెలికి తీసి తొలగిస్తామన్నారు. దాడులు జరిగిన నాటి నుంచి ఆ ప్రాంతంలో దేనినీ కదిలించలేదని, అమెరికా స్పేస్ ఫోర్స్ ఉపగ్రహాల ద్వారా నిరంతరం ఆ ప్రదేశంపై నిఘా ఉంచామని తెలిపారు. ఇరాన్‌లో ఇకపై ఎలాంటి యురేనియం శుద్ధి కార్యక్రమాలు జరగబోవని తేల్చి చెప్పారు. సుంకాలు, ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించే అంశంపై ప్రస్తుతం ఆ దేశంతో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రతిపాదన లోని అనేక అంశాలపై ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. 

మన తెలంగాణ 8 Apr 2026 9:17 pm

మొహిసినా కిద్వాయ్ కన్నుమూత

కాంగ్రెస్ ప్రముఖ నాయకురాలు , కేంద్ర మాజీ మంత్రి మొహిసినా కిద్వాయ్ బుధవారం కన్నుమూశారు. ఈ నాయకురాలి వయస్సు 94 సంవత్సరాలు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల మంత్రివర్గాలలో కిద్వాయ్ కీలక మంత్రిత్వశాఖలు నిర్వర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకికి చెందిన కిద్వాయ్ ఇందిరా గాంధీకి కుడిభుజంగా వ్యవహరించారు. వయోవృద్ధ అనారోగ్య సమస్యలతో చికిత్సకు చేరిన ఆమె నోయిడాలోని మెట్రో హాస్పిటల్‌లో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె అల్లుడు రజీ ఉర్ రెహ్మన్ కిద్వాయ్ తెలిపారు. అంత్యక్రియలు, సాయంత్రం నిజాముద్దిన్ ఖననవాటికలో జరిగాయి. అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెకు నివాళులు అర్పించారు. ఖర్గే, రాహుల్ గాంధీ ఇతరులు సంతాపం తెలిపారు. 

మన తెలంగాణ 8 Apr 2026 9:13 pm

భభానీపూర్‌తోనే ఏదైనా నామినేషన్ దశలో మమత బెనర్జీ

తన జీవితంలో అంతా ఇక్కడి నుంచే ఆరంభమయిందని సొంత నియోజకవర్గం భభానీపూర్ నుంచి నామినేషన్ సందర్భంగా తెలిపారు. బుధవారం ఆమె మమత బెనర్జీ జిందాబాద్, జాయ్ బంగ్లా, టిఎంసి జిందాబాద్ నినాదాల మధ్య మమత బెనర్జీ ఆకర్షణీయమైన ప్రదర్శన సాగింది. తాను ఇక్కడనే పుట్టానని, ఇక్కడనే ఏడాది పొడవునా ఉంటానని, తన జీవితం ఇక్కడ ఆరంభమైంది. ఉద్యమాలు, జయాపజయాలు అన్నింటికీ ఈ ప్రాంతం కేంద్రీకృతం అయిందని , ఇక్కడి వారికి ధన్యవాదాలు అని మమత తెలిపారు. తమ కాళీఘాట్ నివాసం నుంచి అలీపోర్ సర్వే బిల్డింగ్ వరకూ ప్రదర్శన సాగింది. 2021లో మమత ఎన్నికల రాజకీయ ప్రక్రియ ఆరంభమైంది. ముకుళిత హస్తాలతో, తనదైన చిరునవ్వుతో పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు వెంటరాగా మమత నామినేషన్ దాఖలు కార్యక్రమం సాగింది. పార్టీ కార్యకర్తలు టిఎంసి జెండాలు పట్టుకుని, ఉత్సాహంతో ముందుకు కదిలారు. ఇక్కడ విలేకరులతో మాట్లాడిన మమత బిజెపిపై, ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. సర్ ప్రక్రియతో అర్హులైన ఓటర్లపై వేటు వేశారని మమత ఆరోపించారు. ఈ వ్యవహారంపై తమ పార్టీ కోర్టుకు వెళ్లుతుందని హెచ్చరించారు. పేర్ల తొలిగింపుతో రాష్ట్రంలో తమ టిఎంసి ఓడిపోదని, జనం గుండెల్లో నిలిచి ఉందని తెలిపారు. బెంగాల్‌లో ఈ 23, 29 తేదీలలో రెండు దఫాలుగా ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. రాష్ట్రంలో అధికార పరివర్తనకు బిజెపి పిలుపు నిచ్చింది. మమత ప్రతిష్టాత్మక స్థానం నుంచి బెంగాల్ బిజెపి నేత సువేందు అధికారి గత వారం నామినేషన్ దాఖలు చేశారు. దీనితో ఇక్కడ పోటీ కీలకమైంది.

మన తెలంగాణ 8 Apr 2026 9:10 pm

పాండా ఉప ఎన్నిక రద్దు

గోవాలో పాండా అసెంబ్లీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను బొంబాయి హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఏప్రిల్ 9న ఎన్నికల నిర్వహణ ప్రకటన చెల్లనేరదని హైకోర్టు న్యాయమూర్తులు వాల్మీకి మెనెజెస్, అమిత్ జంసన్దెకర్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది లోపే గడువు ఉందని,ఈ లోగా ఈ ఉప ఎన్నిక ఎందకుని ఇద్దరు ఓటర్లు పెట్టుకున్న పిటిషన్లపై కోర్టు స్పందించింది. గోవా మాజీ మంత్రి రవి నాయక్ మృతితో , ఏర్పడ్డ ఖాళీ భర్తీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించింది. దీని మేరకు గురువారం జరగాల్సిన ఉప ఎన్నిక ఒక్కరోజు ముందు రద్దు అయింది. 

మన తెలంగాణ 8 Apr 2026 9:05 pm

కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ చమురు శుద్ధి కేంద్రంపై దాడి

యుద్ధంలో కాల్పుల విరమణ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్‌లోని లావన్ దీవిలో ఉన్న ఒక చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. ఈ దాడి కారణంగా శుద్ధి కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. దాడిని ఎవరు నిర్వహించారు అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా లేదు.

మన తెలంగాణ 8 Apr 2026 9:00 pm

Dacoit Censor Report: Adivi Sesh is back with a blockbuster

Adivi Sesh has consistently delivered blockbusters with his unique style of films and consistent performances at the box office. Taking a four-year gap to deliver perfect love story with thriller elements, he brought us the highly anticipated Dacoit, hitting theaters on this April 10, 2026. The movie completed censor formalities with a U/A certification with […] The post Dacoit Censor Report: Adivi Sesh is back with a blockbuster appeared first on Telugu360 .

తెలుగు 360 8 Apr 2026 8:55 pm

అమెరికా-ఇజ్రాయెల్‌-ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం

పశ్చిమాసియా రణరంగంగా మారింది. ప్రపంచమంతా పెట్రోల్ ధరల మంటలు.. తెల్లారితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు.. వీటన్నింటి నడుమ హార్మూజ్‌ను తెరవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన డెడ్‌లైన్ దగ్గరపడుతోంది. గడువు ముగిస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో అని ప్రపంచమంతా ఆందోళనగా ఎదురుచూసింది. ఈ సమయంలోనే ట్రంప్ ‘ఓ నాగరికత అంతమవుతోంది’ అని విరుచుకుపడ్డారు. మరోవైపు.. ఏమాత్రం తొణకని ఇరాన్.. సంధికి మాత్రం ససేమిరా అంటూ కూర్చుంది.. దీంతో భీకరదాడులు తప్పవనే ఉత్కంఠ పరిస్థితుల్లోకి ప్రపంచం వెళ్లిపోయింది.డెడ్‌లైన్ ముగిసేది రాత్రి ఎనిమిది గంటలకు.. ఆ తర్వాత వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై దాడులకు టార్గెట్ లిస్ట్ సిద్ధమైంది. టెహ్రాన్ సమీపంలోని ఒక భారీ వంతెనను ధ్వంసం చేశామని.. జరగబోయే విధ్వంసానికి ఇది నిదర్శనమంటూ ట్రంప్ చేసిన ప్రచారం, ఖార్గ్ ద్వీపంపై దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. యుద్ధంలో వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేని ఇరాన్.. ఈ బెదిరింపులను మరింత సీరియస్‌గా తీసుకుంది. ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ పరిణామాలన్నీ యుద్ధం తీవ్రరూపం దాల్చొచ్చనే సంకేతాలను ఇచ్చాయి. ఈ సమయంలో ట్రంప్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. డెడ్‌లైన్‌కు కేవలం 90 నిముషాల ముందు సాయంత్రం పోస్టు పెట్టారు. హార్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ పది పాయింట్ల ప్రతిపాదనలు, చర్చలు జరపడానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ వెంటనే ఇరాన్ స్పందించింది. అలా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. చివరి క్షణాల్లో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌పై భారీ బాంబుదాడుల హెచ్చరికల నుంచి వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఒప్పందం అమలులోకి వచ్చిందా? దాని షరతులు ఏమిటి? దీర్ఘకాలిక శాంతికి దారి తీస్తుందా? అనే అంశాలపై స్పష్టత లేదు. పక్షాలు ఒప్పంద నిబంధనలను భిన్నంగా వివరిస్తున్నాయి. ఒప్పందం ప్రకటన అనంతరం గంటల వ్యవధిలోనే ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు ఇరాన్ నుంచి క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం రావడంతో పాటు, కువైట్ సైన్యం డ్రోన్ దాడులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో ఇరాన్‌లోని ఒక చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు సమాచారం వెలువడింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఒప్పందాన్ని సున్నితమైన తాత్కాలిక విరమణగా అభివర్ణించారు. ఒప్పందంపై చర్చలు త్వరలో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నప్పటికీ, కీలక అంశాలు ఇంకా అనిశ్చితంగా ఉన్నాయి. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఫీజులు వసూలు చేసే విధానాన్ని చట్టబద్ధం చేయడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఇరాన్ పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన షరతులు ఇంకా వెల్లడి కాలేదు. ఇతర దేశాలు దీనికి అంగీకరించాయా, లేదా అన్నదీ తెలియరాలేదు. ఇదే సమయంలో లెబనాన్‌లోని పోరాటాలను ఈ ఒప్పందం నిలిపివేస్తుందని పాకిస్తాన్ పేర్కొనగా, ఇజ్రాయెల్ మాత్రం అంగీకరించలేదు. టెహ్రాన్ వీధుల్లో ప్రభుత్వం అనుకూలంగా నిరసనకారులు అమెరికా మృతి, ఇజ్రాయెల్ మృతి అంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామాలు తీవ్రవాద వర్గాల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఒప్పందం కుదరకపోతే ఒక నాగరికత అంతరించిపోతుంది అని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ షరతులపై విభిన్న వాదనలు ట్రంప్ చెప్పిన ప్రకారం, ఇరాన్ 10 అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే ఫార్సీ భాషలో బయటకు వచ్చిన ఈ పత్రంలో ఇరాన్ యురేనియం శుద్ధిని కొనసాగిస్తుందని పేర్కొనడంతో, ట్రంప్ దానిని తప్పుడు పత్రంగా పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిలో అమెరికా యుద్ధనౌకలు కొనసాగుతాయని కూడా ఆయన సూచించారు. ఇరాన్ మాత్రం యుద్ధం ముగియాలంటే అమెరికా, తమ సైన్యాన్ని ఆ ప్రాంతం నుంచి ఉపసంహరించుకోవాలని, ఆంక్షలను ఎత్తివేయాలని, తమ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇవి అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో శాశ్వత శాంతి చర్చలు త్వరలో ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఈ ఒప్పందాన్ని మద్దతు ఇచ్చినా, లెబనాన్‌లోని హెజ్‌బుల్లా పై యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధిలో వసూళ్లకు అవకాశం యుద్ధంలో సాంకేతికంగా ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ కంటే వెనుకబడి ఉన్నప్పటికీ, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ ఇరాన్‌కు వ్యూహాత్మకంగా లాభించింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం నియంత్రణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. ఒప్పందం ప్రకారం, ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఇరాన్, ఒమన్ దేశాలు ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఆదాయాన్ని పునర్నిర్మాణానికి వినియోగిస్తామని ఇరాన్ భావిస్తోంది. అయితే ఇది అంతర్జాతీయ నావిగేషన్ సంప్రదాయాలకు విరుద్ధమని గల్ఫ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశముంది. ఇది పెద్ద ఆర్థిక వనరుగా మారుతుంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అణు, క్షిపణి కార్యక్రమాలపై స్పష్టత లేదు యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర దాడులు చేసినప్పటికీ, అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయలేకపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుతమని చెబుతున్నప్పటికీ, అధిక శుద్ధి యురేనియం నిల్వలు ఇంకా ఉన్నట్లు అంచనా. అమెరికా, ఇజ్రాయెల్ ప్రకారం ఈ ముప్పులను తొలగించడమే యుద్ధానికి ప్రధాన కారణం. ఇజ్రాయెల్ అధికారులు, అమెరికా ఈ ఒప్పందాన్ని ముందుగానే సమన్వయం చేసిందని, ఇరాన్ మౌలిక వసతులపై దాడులు ఈ ఒప్పందానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ఒప్పందం తర్వాత కూడా దాడులు ఒప్పంద ప్రకటన తర్వాత కూడా పలు దేశాల్లో క్షిపణి హెచ్చరికలు జారీ అయ్యాయి. అబుదాబిలో గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కువైట్, యుఏఇ దేశాలు డ్రోన్, క్షిపణి దాడులను అడ్డుకున్నట్లు వెల్లడించాయి. ఇరాన్‌లోని లావన్ దీవిలో చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యుద్ధంలో ఇరాన్‌లో 1,900 మందికి పైగా మరణించగా, లెబనాన్‌లో 1,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో కూడా పలువురు మృతిచెందినట్లు సమాచారం. అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

మన తెలంగాణ 8 Apr 2026 8:49 pm

గత ప్రభుత్వంలోనే నాదర్‌గుల్ భూములకు మ్యుటేషన్: మంత్రి పొంగులేటి

నాదర్‌గుల్ గ్రామంలోని సర్వే నంబర్ 613లో గల 370 ఎకరాల భూమిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సాక్ష్యాధారాలతో మంత్రి పొంగులేటి తిప్పికొట్టారు. ఈ భూమి బాగోతం మొత్తం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. 2014లోనే మూడు సంస్థలకు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, 2016లో మ్యుటేషన్ పూర్తి చేసింది కూడా గత ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. గూగుల్ మ్యాప్స్ సాక్ష్యాలను బయటపెడుతూ 2021 వరకు ఖాళీగా ఉన్న ఈ భూమిలో 2022 నాటికి రోడ్లు నిర్మించి, రేకుల షెడ్లు వేయించింది బిఆర్‌ఎస్ నాయకులేనని ఆయన మండిపడ్డారు. ఈ భూమి విషయంలో గత ప్రభుత్వం కోర్టులో కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం వహించిందని గత ప్రభుత్వమని, కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మార్చి 15న ప్రభుత్వం తరపు కౌంటర్ దాఖలు చేశామని ఆయన వెల్లడించారు. తమ పార్టీ మంత్రులపై బురద జల్లడం ద్వారా తమ కుటుంబ ఆస్తుల పెంపు, పంపకాల చర్చను పక్కదారి పట్టించాలని ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.

మన తెలంగాణ 8 Apr 2026 8:43 pm

మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నగరంలో సామాన్య ప్రయాణికుడిలా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రోటోకాల్స్‌కు భిన్నంగా ఆయన అత్యంత సాదాసీదాగా మెట్రో ఎక్కారు. నగరంలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం ఆయన ఎర్రమంజిల్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో వెళ్లారు. స్టేషన్ చేరుకున్న మంత్రి స్వయంగా టికెట్ తీసుకుని ప్లాట్‌ఫాంపైకి వెళ్లారు. రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో మంత్రి సీటు కోసం ప్రయత్నించకుండా తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే ప్రయాణించారు. ఈ క్రమంలో తోటి ప్రయాణీకులతో ఆయన ముచ్చటించారు. ప్రయాణీకులతో ఆయన ముచ్చటించారు. మెట్రో ప్రయాణంలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రిని తమ మధ్య చూసిన ప్రయాణికులు తొలుత ఆశ్చర్యపోయినా, ఆయన పలకరింపుతో ఉత్సాహంగా మాట్లాడారు. పలువురు ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా మంత్రి ఎంతో ఓపికగా వారితో ఫొటోలు దిగారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి మెట్రో ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు.

మన తెలంగాణ 8 Apr 2026 8:33 pm

మైదానంలో బట్లర్ బౌండరీల వర్షం.. హాఫ్ సెంచరీ చేసి వెంటనే ఔట్..

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు గుజరాత్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన గుజరాత్‌కు ముఖేశ్ కుమార్ షాక్ ఇచ్చాడు. 3వ ఓవర్ తొలి బంతికే సాయి సుదర్శన్‌(12) క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన జాస్ బట్లర్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 52 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజ్‌లో గిల్(29), సుందర్(15) ఉన్నారు.

మన తెలంగాణ 8 Apr 2026 8:27 pm

విస్తరించిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి…

విస్తరించిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి… 11 గ్రామాల విలీనం… చిట్యాల,

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:54 pm

Vijay’s TVK To Reshape Tamil Nadu Poll Dynamics ?

In a significant political observation ahead of the April 23 Tamil Nadu Assembly election, Durai Vaiko stated that actor Vijay and his party Tamilaga Vettri Kazhagam (TVK) could secure close to 15 percent vote share in their debut electoral outing. He said such a performance could alter the balance of power in the state. Speaking […] The post Vijay’s TVK To Reshape Tamil Nadu Poll Dynamics ? appeared first on Telugu360 .

తెలుగు 360 8 Apr 2026 7:53 pm

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకుడు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకుడు భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:50 pm

‘ధురంధర్’ కథ కాపీ వివాదం.. హైకోర్టులో అదిత్యకు ఊరట..

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘ధురంధర్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే జోరుతో ఆ సినిమా సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ చిక్కుల్లో పడ్డారు. సంతోష్ కుమార్ అనే దర్శకుడు.. అదిత్య తన కథను కాపీ కొట్టి సినిమా తీశారంటూ ఆరోపణలు చేశాడు. ‘స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’లో తన కథ రిజిస్టర్ అయి ఉందని అదిత్య పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిచాడు. దీంతో ఆదిత్య తనపై సంతోష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని.. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నాడని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై తాజాగా హై కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ చేపట్టే వరకూ ఆదిత్య గురించి ఏం మాట్లాడకూడదంటూ సంతోష్‌కు న్యాయస్థానం సూచించింది. ఇలాంటి పునరావృతం కాకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీన జరుగనుంది.

మన తెలంగాణ 8 Apr 2026 7:47 pm

స్నేహితున్ని పరామర్శించిన మాజీ జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్

స్నేహితున్ని పరామర్శించిన మాజీ జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:46 pm

ఇరాన్ కు ఆయుధాలు ఇస్తే.. భారీగా సుంకాలు విధిస్తా: ట్రంప్ వార్నింగ్

ఇరాన్ తో కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఈ హెచ్చరికలు ఇరాన్ కు కాదు..  ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు. ఇక నుంచి ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తూ.. అమెరికాకు ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని తన ట్రూత్ సోషల్ లో ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.  కాగా, ఇరాన్ ఎట్టకేలకు అమెరికాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవడంతో పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడింది. కాల్పుల విరమణ డీల్ తర్వాత రెండు వారాల పాటు ఇరాన్‌పై దాడులకు ట్రంప్ విరామం ప్రకటించారు. హర్మూజ్‌ జలసంధిని తక్షణమే తెరిచేందుకు ఇరాన్‌ అంగీకారించడంతోపాటు 10 ప్రతిపాదనలను ఇరాన్‌.. అమెరికా ముందు ఉంచింది. దీనికి ట్రంప్ ట్రంప్ అంగీకరించడంతో రెండు వారాలపాటు హార్ముజ్ లో రాకపోకలకు అనుమతి ఇస్తామని భద్రతామండలికి ఇరాన్ తెలిపింది.

మన తెలంగాణ 8 Apr 2026 7:44 pm

విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి తొర్రూరు, ఆంధ్రప్రభ : విద్యుత్ కార్మికుల సమస్యలు

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:44 pm

జుక్కల్ ఎస్సైగా మురళి నియామకం

జుక్కల్ ఎస్సైగా మురళి నియామకం జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ పోలీస్ స్టేషన్

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:41 pm

విద్యుత్ శాఖ అధికారులకు అవగాహన సదస్సు

విద్యుత్ శాఖ అధికారులకు అవగాహన సదస్సు గీసుగొండ, ఆంధ్రప్రభ : ఈ వంచనగిరి

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:39 pm

బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి…

బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి… రూ 38 లక్షలతో కేజీబీవీలో పలు పనులకు

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:37 pm

మాతృ సంరక్షణ పట్ల జాగ్రత్త వహించాలి : డాక్టర్ కుషాలి

మాతృ సంరక్షణ పట్ల జాగ్రత్త వహించాలి : డాక్టర్ కుషాలి చిలుపూర్, ఆంధ్ర

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:33 pm

పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయాలి

పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయాలి పీఆర్‌టీయూ తెలంగాణ డిమాండ్ నిజామాబాద్ స్పోర్ట్స్,

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:29 pm

మాహగం సబ్ సెంట‌ర్‌కు ఉత్తమ అవార్డు…

మాహగం సబ్ సెంట‌ర్‌కు ఉత్తమ అవార్డు… సిర్పూర్ (యు) ఆంధ్రప్రభ : కొమరం

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:26 pm

అక్రమ మట్టి తరలిస్తున్న 6 గురి పై కేసు నమోదు

అక్రమ మట్టి తరలిస్తున్న 6 గురి పై కేసు నమోదు గీసుగొండ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:22 pm

పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు..ఆవిరైపోతున్న వానాల్లోని ఇంధనం

రాజు ఒక చిరు ఉద్యోగి, సమయానికి కార్యాలయానికి చేరుకోక పోతే వేతనంలో కోత విధించడంతో రోజుకు 60 కిలో మీటర్లు ఇచ్చే ద్విచక్ర వాహానాన్ని ఆశ్రయించారు. గత కొద్ది రోజులు క్రితం నుంచి ఒక లీటర్‌కు 60 కిలో మీటర్లు ఇచ్చే వాహనం మైలేజ్ తగ్గడం ప్రారంభించింది. దీంతో అనుమానం వచ్చి పెట్రోల్ పోసేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాడు. అయితే బంక్ నుంచి పెట్రోల్ సరిగ్గా వస్తున్నట్లుగానే గుర్తించాడు. దాంతో వెంటనే సమీపంలోని మెకానిక్‌ను సంప్రందించగా అతడు కూడా క్షుణ్ణంగా బండి పరిశీలించి ఎటువంటి సమస్య లేదని తేల్చి చెప్పాడు. ఇటువంటి సమస్య కేవలం ఒక రాజుది అనుకుంటే తప్పులో కాలు వేసినట్లే .నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాహనాల్లో ఇంధనం 20 శాతం ఆవిరై పోతుండటంతో వాహనాల్లో గత వారం రోజులుగా మైలేజి తగ్గుముఖం పడుతోంది. వాహనాల్లో లీటర్ పెట్రోల్ ఏ మాత్రం సరిపోవడం లేదు. పశ్చిమాసియా యుద్ద ప్రభావంతో వినియోగదారులు తమ వాహనాల్లో పెట్రోల్‌ను పూర్తి స్థాయిలో నింపుకోవడంతో గత కొద్ది రోజులుగా పెట్రోల్,డిజీల్ అమ్మకాలు బాగా పెరిగాయి. ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్ ,డీజిల్ బంకులు వుండగా ప్రతి రోజు సగటున 30 లక్షల లీటర్ల డీజిల్,పెట్రోల్ అమ్మకాలు సాగుతున్నాయి. అయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతి రోజు పెట్రోల్ బంకులకు 170 నుంచి 200 ట్యాంకర్ల ద్వారా ఇంధన సరఫరా అవుతోంది. ఒక్కో ట్యాంకర్లలో సగటున 12 నుంచి 30వేల లీటర్ల సామర్థం కలిగి ఉన్నాయి. వాహన ట్యాంక్‌లను పూర్తిగా నింపవద్దు ః పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పెట్రోల్ వాహనాల ట్యాంకులు పూర్తిగా నింపవద్దు, సగం వరకు మాత్రమే నింపాలని అయిల్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ట్యాంక్ నిండా నింపితే ప్రమాదమని గతంలో ట్యాంక్‌ను పూర్తిగా నింపడం వల్ల ప్రమాదాలు సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా గ్తురు చేశాయి.వాహనంలో పెట్రోల్ ఆవిరి కాకుండా ఉండాలంటే ద్విచక్ర వాహనాలయితే పెట్రోల్ ట్యాంక్‌పై గుడ్డతో కూడిన ట్యాంక్ కవర్‌ను ఉపయోగించాలి. అంతే కాదు వాహనాన్ని ఎక్కువ సమయం ఎండలో నిలపకూడదని, కార్ల వంటి వాహనాలను కూడా ఎక్కవ సేపు ఎండలో ఉండకుండా చూడాలని , ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నాయి.

మన తెలంగాణ 8 Apr 2026 7:19 pm

న్యాయవాదులు విధుల బహిష్కరణ

న్యాయవాదులు విధుల బహిష్కరణ యువ న్యాయవాది హత్యకు దమ్మపేట బార్ అసోసియేషన్ ఖండన

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:14 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ లీగ్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఢిల్లీ.. హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన గుజరాత్ జట్టు తొలి విజయం సాధించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తన జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. గుజరాత్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. కుమార్ కుషాగ్రా స్థానంలో శుభ్‌మాన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. తుది జట్లు ఢిల్లీ క్యాపిటల్స్: కెఎల్ రాహుల్(కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీశ్ రాణా, విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్. గుజరాత్ టైటాన్స్: శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జాస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ.

మన తెలంగాణ 8 Apr 2026 7:13 pm

బండ్లపల్లి బహిరంగ సభను జయప్రదం చేయండి.

విశాలాంధ్ర-తాడిపత్రి: ఉపాధి హామీ చట్టం పేరు మార్పును నిరసిస్తూ సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నార్పల మండలం బండ్లపల్లి గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి నాగరంగయ్య పిలుపునిస్తూ, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ […] The post బండ్లపల్లి బహిరంగ సభను జయప్రదం చేయండి. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Apr 2026 7:12 pm

విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం….

విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం…. మంటలను అదుపులోకి తీసుకు వచ్చిన

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:11 pm

వ్యవసాయ మార్కెట్లోకి పలు గ్రామాలు విలనంపట్ల హర్షం….

వ్యవసాయ మార్కెట్లోకి పలు గ్రామాలు విలనంపట్ల హర్షం…. చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:05 pm

పిల్లలను స్వంత బిడ్డలుగా చూసుకోవాలి..!

పిల్లలను స్వంత బిడ్డలుగా చూసుకోవాలి..! స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : పిల్లలను

ప్రభ న్యూస్ 8 Apr 2026 7:02 pm

వేద రెస్టారెంట్ ను ప్రారంభించిన టీజిఐఐసీ చైర్ పర్సన్…

వేద రెస్టారెంట్ ను ప్రారంభించిన టీజిఐఐసీ చైర్ పర్సన్… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 8 Apr 2026 6:59 pm

మతిస్థిమితం లేని వ్యక్తికి భరోసా నిచ్చిన సర్పంచ్

మతిస్థిమితం లేని వ్యక్తికి భరోసా నిచ్చిన సర్పంచ్ చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ

ప్రభ న్యూస్ 8 Apr 2026 6:57 pm

ఆదిలాబాద్‌లో పెద్ద ఎయిర్‌పోర్టు: రామ్మోహన్ నాయుడు

ఎయిర్‌పోర్టులపై వస్తున్న అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఫీజబులిటి ఉన్న చోట ఎయిర్‌పోర్టులు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్‌లో పెద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లు వెల్లడించారు. సైనిక, పౌరుల అవసరాలకు అనుగుణంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు ఉంటుందని అన్నారు. సివిల్ ఏవియేషన్‌తో కలిసి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని రక్షణ శాఖ చెప్పిందని తెలిపారు. ఈ నెల 17న ఆదిలాబాద్ భూముల పరిశీలనకు అధికారులు వెళ్తారని పేర్కొన్నారు. రక్షణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాక నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఆదిలాబాద్‌లో రక్షణశాఖకు 360 ఎకరాలు ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కావాల్సిన అనుకూలతలు ఆదిలాబాద్‌కు ఉన్నాయని.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఏయిర్‌పోర్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వివరించారు. పెద్దపల్లి ఎయిర్‌పోర్టు ప్రతిపాదనపై ఫీజబులిటీ నివేదిక సానుకూలంగా ఉందని అన్నారు.

మన తెలంగాణ 8 Apr 2026 6:42 pm

మహిళా రిజర్వేషన్లతో చట్ట సభలకు ఎన్నికలు: బిజెపి రాంచందర్ రావు

చట్ట సభలకు రాబోయే ఎన్నికలు తప్పని సరిగా మహిళా రిజర్వేషన్లతోనే జరుగుతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.కొండాపూర్‌లోని శిల్పా పార్క్ అపార్ట్‌మెంట్స్ నివాసితులు బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో మహిళా సాధికారత కోసం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నారీశక్తి వందన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఈ చట్టం ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని, రాబోయే 2029 ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని, మహిళలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఇది పెద్ద అడుగు అని ఆయన అభివర్ణించారు.దేశవ్యాప్తంగా త్వరలో డీ-లిమిటేషన్ ప్రక్రియ జరగనుందన్నారు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న ‘సర్’ అనేది పూర్తిగా ఎలక్టోరల్ ప్రాసెస్‌లో భాగమని ఆయన తెలిపారు. ఓటర్ లిస్టును శుద్ధి చేయడానికి చేపట్టే ప్రక్రియ మాత్రమే. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న విధానమని ఆయన వివరించారు. సర్ ప్రక్రియ గతంలో 1956, 1965, 1970, 1980, 1990లలో జరిగిందని, చివరిసారిగా 2002లో జరిగిందని ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఓటర్లు వేరే ప్రాంతానికి మారడం, మరణించడం వంటి కారణాలతో ఓటర్ లిస్టులో లోపాలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. ఈ సమస్యలను సరిచేయడానికి ఎన్నికల సంఘం ఫార్మ్-6, ఫార్మ్-7, ఫార్మ్-8లను ప్రవేశపెట్టిందని, వీటి ద్వారా కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు జరుగుతాయని అందువల్ల ప్రతి ఓటరు తమ వివరాలను సరిచేసుకోవడం చాలా అవసరమని ఆయన చెప్పారు. మరోవైపు హైదరాబాద్ పాతనగరంలోని పలు ప్రాంతాల్లో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లు నమోదై ఉండడం వంటి అనుమానాస్పద అంశాలు కూడా కనిపిస్తున్నాయన్నారు. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలు అక్రమంగా ప్రవేశించి, స్థానికంగా మజ్లీస్ మద్దతుతో ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు పొందడం చూస్తూనే ఉన్నామన్నారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలి. రెండు చోట్ల ఓటు ఉండటం చట్ట విరుద్దమని, అలాంటి డూప్లికేట్ ఓట్లను తొలగించడం తప్పనిసరి అని రాంచందర్ రావు అన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలోనూ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనని రాంచందర్ రావు ఆయన తెలిపారు. --==--

మన తెలంగాణ 8 Apr 2026 6:34 pm

అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి…

అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి… కోర్టు ముందు న్యాయవాదులు ధర్నాబార్ అసోసియేషన్

ప్రభ న్యూస్ 8 Apr 2026 6:27 pm

చిన్నారులకు, గర్భి ణీలకు పౌష్టిహారం అందజేయాలి

చిన్నారులకు, గర్భి ణీలకు పౌష్టిహారం అందజేయాలి అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ

ప్రభ న్యూస్ 8 Apr 2026 6:23 pm

Telangana : యాష్కీకి ఇక పదవులు లభించడం కష్టమేనా?

మధుయాష్కీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అత్యున్నత పదవి లభిస్తుందని భావించారు

తెలుగు పోస్ట్ 8 Apr 2026 6:21 pm

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ…

మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ… జవహర్ నగర్, ఆంధ్రప్రభ : కీసర

ప్రభ న్యూస్ 8 Apr 2026 6:19 pm

నువ్వెంత… నువ్వెంత… కాంగ్రెస్ నేతల లొల్లి

నువ్వెంత… నువ్వెంత… కాంగ్రెస్ నేతల లొల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రె

ప్రభ న్యూస్ 8 Apr 2026 6:13 pm