SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

Fact Check: No Evidence That Lemon, Garlic, Turmeric and Honey Can Cure

Social media has become one of the biggest platforms for sharing knowledge today. People can easily find a wide range of information, including many health-related tips, within seconds. Many users depend on these platforms to learn about fitness, diet, and general well-being. Sometimes, such information is shared by qualified doctors and health experts, making it useful and reliable. However, a large portion of content is also posted by creators who may not have proper medical knowledge or training. Without consulting experts, they often share many tips that can be misleading or incorrect. These posts often gain high reach because they are simple and attractive. As a result, along with useful information, wrong messages are also spread widely, especially in the case of health-related advice shared without proper knowledge. Amid this, a health tip is widely spread on social media. In an Instagram reel, a creator claims that lemon, garlic, turmeric, and honey can cure fatty liver in 8 days. In a reel posted by a user, it is claimed that fatty liver can be reversed within just 8 days using a simple home remedy. The creator says that even people already dealing with liver problems, infections, or toxin buildup can see their liver become completely clean in this short period. According to the video, the remedy is easy to prepare using common household ingredients. A glass of water is taken, and the juice of one full lemon is added to it. A small pinch of turmeric is mixed in, followed by two crushed garlic cloves. Half a teaspoon of honey is then added to complete the mixture. The preparation should be left aside for about an hour, then strained before consumption. The creator advises drinking this mixture every morning on an empty stomach. It is further claimed that regular use for 8 days will cleanse the liver, remove toxins from the body through urine, and may also help with several other health issues. The claim can be found here . Fact Check: The claim is False, There is no scientific proof or medical agreement that fatty liver disease can be cured in just 8 days by taking lemon, garlic, turmeric, and honey. While these ingredients may be good for overall health, they are not a substitute for proper treatment or long-term lifestyle changes. During a conversation with dietician Bishnupriya Gadanayak, she explained the condition of fatty liver in a very clear way. She said that fatty liver disease develops in four stages, and each stage shows a higher level of damage to the liver. In the first stage (Type 1), fat builds up in the liver but there is no inflammation, so it is usually not harmful. In the second stage (Type 2), fat is present along with inflammation, which shows that the liver is under stress. In the third stage (Type 3), there is fat accumulation along with damage to liver cells. The fourth stage (Type 4) is the most serious, where there is severe damage along with fibrosis, and it may lead to cirrhosis. She added that the early stages can be reversed with proper diet and regular exercise, but the later stages may cause permanent damage. However, with proper treatment and lifestyle control, the disease can be managed and its progression can be slowed. She also spoke about the ingredients mentioned in the viral remedy. Lemon is low in calories and rich in vitamin C, which is good for overall health. Garlic contains natural compounds that may help reduce inflammation and support heart and liver health. Turmeric, known for its active compound curcumin, has anti-inflammatory and healing properties and has been used in traditional medicine for many conditions. Honey is a natural product with antioxidant and antibacterial qualities and has been used for both food and health purposes for a long time. However, she clearly stated that there is no scientific proof that lemon, garlic, turmeric, and honey can cure fatty liver in just 8 days. While these ingredients may support general health and may have some benefits for the liver, they cannot act as a quick cure for fatty liver disease. Proper medical care, a balanced diet, exercise, and long-term lifestyle changes are necessary to manage and improve the condition. During a conversation with Dr. Swasti Tirta Prayag, He clearly explained that lemon, garlic, turmeric, and honey cannot cure fatty liver, especially not within a few days. He said that although these ingredients have some health benefits like antioxidant and anti-inflammatory properties, there is no medical evidence to show that they can reverse fatty liver in such a short time. He explained that lemon contains vitamin C, which may help reduce inflammation, but it does not treat liver disease. Garlic is known to support heart health and has some protective effects, but there is no strong proof that it can treat fatty liver. Turmeric also has useful properties and may support general health, but it does not remove fat from the liver. Honey, she added, contains natural sugars, and taking too much of it could actually make fatty liver worse instead of improving it. Dr. Prayag emphasized that while these ingredients can be part of a healthy diet, they should not be seen as a cure. The best way to manage fatty liver is through long-term lifestyle changes, including a balanced diet and regular exercise. He also advised regular health check-ups and screening for other factors such as alcohol use or infections like hepatitis B and C, which can worsen the condition. He concluded that fatty liver requires proper care over time, not quick remedies. He added that while some changes may be seen over the long term, improvement within eight days is impossible. As per expert opinion, the claim that fatty liver can be cured within a few days using lemon, garlic, turmeric, and honey is False. These ingredients may support general health but cannot treat or reverse the condition. Proper medical care, along with long-term lifestyle changes, remains the most effective approach.

తెలుగు పోస్ట్ 22 Apr 2026 12:27 am

విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్ షురూ

హైదరాబాద్: టాలీవుడ్‌లో రెండు క్రేజీ ప్రాజెక్టులు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఒకటి విజయ్ దేవరకొండది కాగా మరొకటి బెల్లంకొండ గణేశ్‌ది. నాని హీరోగా తెరకెక్కించిన ‘హాయ్ నాన్న’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మెప్పించారు శౌర్యువ్. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శౌర్యువ్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ప్రారంభమైంది. నాని ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా సమయంలో నాని, విజయ్ ఎంత స్నేహంగా […] The post విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్ షురూ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:44 pm

‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి

హైదరాబాద్: అభిమానులు ఎప్ప్పుడెప్ప్పుడా అని ఎదురు చూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుపుతూ చిత్ర బందం కొన్ని ఫొటోలు పంచుకుంది. మాఫియా, ప్రతీకార నేపథ్యం, కుటుంబ అంశాల మేళవింపుగా రూపొంది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ‘జైలర’ చిత్రానికి కొనసాగింపుగా ‘జైలర్ 2’ వస్తోన్న సంగతి తెలిసిందే. అగ్రహీరో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. […] The post ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:42 pm

సీఎస్కేను వెంటాడుతున్న గాయాలు

. తాజాగా జట్టుకు దూరమైన యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే. ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగిన బౌలర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ఐపీఎల్ 2026లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్ ఆయుష్ మాత్రే ఎడమ కాలి గాయం (హామ్‌స్ట్రింగ్) కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇవాళ సీఎస్కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో […] The post సీఎస్కేను వెంటాడుతున్న గాయాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:41 pm

కెప్టెన్సీ తర్వాత…ముందు జట్టులోకి రావాలిశ్రేయస్ అయ్యర్‌కు జహీర్‌ఖాన్ సూచన

న్యూదిల్లీ: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, జట్టులో కీలక బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అయ్యర్‌కు మాజీ పేసర్ జహీర్ ఖాన్ కీలక సూచనలు చేశాడు. టీమిండియా కెప్టెన్సీ గురించి ఆలోచించొద్దని, బ్యాటర్‌గా రాణిస్తూ టీ20 జట్టులో పునరాగమనంపై దృష్టిసారించాలని తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్‌లో శ్రేయస్ 600కు పైగా పరుగులు చేయడంతోపాటు జట్టును […] The post కెప్టెన్సీ తర్వాత…ముందు జట్టులోకి రావాలిశ్రేయస్ అయ్యర్‌కు జహీర్‌ఖాన్ సూచన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:38 pm

కెనడా క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్!బజ్వాను కెప్టెన్‌గా నియమించడం వెనుక హస్తం

న్యూదిల్లీ: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి కెనడా క్రికెట్ జట్టులో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడటంతో ఐసీసీ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా ప్రమేయంపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణ జరుపుతోంది. కాగా ఈ ఫిక్సింగ్ వ్యవహారంలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (సీబీసీ) ఓ కథనం ప్రచురించింది. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో దిల్‌ప్రీత్ బజ్వా అసాధారణంగా, ఖరీదైన […] The post కెనడా క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్!బజ్వాను కెప్టెన్‌గా నియమించడం వెనుక హస్తం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:37 pm

రేపు ఏపీఈసెట్ పరీక్ష

విశాలాంధ్ర-జేఎన్టీయూ: ఏపీ ఈసెట్ పరీక్ష 23న జరగనుంది. సెట్ చైర్మన్ ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ భానుమూర్తి ఈ విషయం వెల్లడించారు. జేఎన్టీయూ ఆర్యభట్టు ఆడిటోరియంలో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వీసీ ప్రొఫెసర్ సుదర్శన్‌రావు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేశామని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని చెప్పారు. పరీక్ష కేంద్రాలలోకి గంట ముందే అనుమతిస్తామని తెలిపారు. అనంతపురం జేఎన్టీయూ అధ్వర్యంలో నిర్వహించే […] The post రేపు ఏపీఈసెట్ పరీక్ష appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:30 pm

రాత్రివేళ బైక్ ర్యాలీలపై నిషేధం: ఈసీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఆంక్షలు విధించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, శాంతియుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడానికి బైక్ ర్యాలీలను నిషేధించడం, పగటిపూట వెనుక కూర్చొని ప్రయాణించడంపై పరిమితులు విధించింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి అంటే మంగళవారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 23న బెంగాల్‌లో 152 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. వైద్యారోగ్యం, కుటుంబ కార్యక్రమాల వంటి […] The post రాత్రివేళ బైక్ ర్యాలీలపై నిషేధం: ఈసీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:28 pm

కేరళలో భారీ పేలుడు…13 మంది మృతి

తిరువనంతపురం: కేరళలోని త్రిసూర్ జిల్లాలోని బాణసంచా గిడ్డంగిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మృతి చెందగా 30 మందికిపైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పూరం వేడుక కోసం నిల్వ ఉంచిన బాణసంచా కేంద్రాల్లో ఈ పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. స్థానికంగా పంటపొలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్‌లలో బాణసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు గాయపడిన వారిని […] The post కేరళలో భారీ పేలుడు…13 మంది మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:27 pm

ప్రధానిపై హక్కుల ఉల్లంఘన నోటీసు

. స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించిన కాంగ్రెస్. సభ్యులపై నిందారోపణలు చేశారని ఆరోపణ న్యూదిల్లీ: లోక్‌సభ సభ్యులపై ‘నిందారోపణలు’ చేయడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రధానికి వ్యతిరేకంగా హక్కుల నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ మేరకు ఓం బిర్లాకు వేణుగోపాల్ లేఖ రాశారు. ‘18 ఏప్రిల్, 2026న టెలివి జన్‌లో ప్రసారమైన తన ప్రసంగంలో లోక్‌సభ సభ్యు […] The post ప్రధానిపై హక్కుల ఉల్లంఘన నోటీసు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:12 pm

ఎన్నికల ప్రచారానికి తెర

తమిళనాడులో రేపు పోలింగ్బెంగాల్‌లో మొదటిదశకు కూడా… చెన్నై/కోల్‌కతా: తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు తప్పనిసరి 48 గంటల నిశ్శబ్ద కాలం అమలులోకి వచ్చింది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభలు లేదా ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదు. టెలివిజన్, రేడియో, సోషల్ మీడియా, […] The post ఎన్నికల ప్రచారానికి తెర appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:09 pm

కొసెళ్లేదాక ఉంటవో.. ఊడుతవో తెలియదు

రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి శని పట్టిందని, ఆ శని పీడ విరగడ కావాలంటే రేవంత్‌రెడ్డి పోవాలి... కేసీఆర్ రావాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా జగిత్యాలలో కేసీఆర్ సభ జరిగిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసిన గొప్ప వ్యక్తి కేసిఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పుణ్యంతోనే నీవు సీఎం అయ్యావని, కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించకుంటే నీవు సీఎం అయ్యేవాడివా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభ సక్సెస్ కాకూడదనే నీవు మేడిగడ్డ వద్ద సభ పెట్టావు.. 30 మాసాలుగా అక్కడికి ఎందుకు పోలేదు? నిద్ర పోయావా అని రేవంత్‌ను ప్రశ్నించారు. మేడిగడ్డ మరమ్మతు పనులకు కేవలం రూ.400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని, మరమ్మతులు చేయకుండా కేసీఆర్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నేను పదవుల కోసం లొంగేవాడిని కాదని, నేనెవరిని తొక్కుకుంటూ రాలేదన్నారు. నాదేండ్లను ఎన్టీఆర్ మంత్రి వర్గంలో తొలగించడంతో నా మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వచ్చానన్నారు. 1984లో పార్టీ ఫిరాయింపు చట్టమే లేదని, అయినా నా పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరానన్నారు. నేను ఇంకా పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్ విర్రవీగి మాట్లాడుతున్నాడని, ఈ రెండేండ్లు పూర్తిగా ఉంటాడో, ఊడతాడో కూడా తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలుండగా తన సొంత కుంపటి కోసమే బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాడని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో చేరికతో నా ప్రజా జీవితానికి నూతన అధ్యయం ఏర్పడిందని, తెలంగాణ పునర్నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రేవంత్ సీఎంలా వ్యవహరించకుండా వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నాడన్నారు. నోరు తెరిస్తే బండ బూతులు మాట్లాడటం సీఎం స్థాయిలో ఉన్న రేవంత్‌రెడ్డికి తగదన్నారు. చావుకు ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకా కేసీఆర్‌ను ఊరి తీసేదని ప్రశ్నించారు? ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకా? రైతన్నలకు అండగా నిలిచినందుకా, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆరాటపడినందుకా? ఎందుకు కేసీఆర్‌ను ఉరి తీయాలని ఈశ్వర్ రేవంత్‌రెడ్డిని నిలదీశారు.

మన తెలంగాణ 21 Apr 2026 11:09 pm

మరో రూ.4,600 కోట్ల అప్ప్పు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంది. తాజాగా ప్రభుత్వం మరో రూ.4,600 కోట్ల అప్పు చేసినట్లు సమాచారం. ఇది రాష్ట్ర ఖజానాపై మరింత భారాన్ని పెంచనుంది. గణాంకాలను పరిశీలిస్తే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 60 నెలల్లో దాదాపు రూ. 3,32,000 కోట్ల అప్పులు చేయగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 23 నెలల స్వల్ప కాలంలోనే రూ.3,56,655 కోట్ల భారీ రుణాలను సమీకరించింది. అంటే గత ప్రభుత్వ ఐదేళ్ల […] The post మరో రూ.4,600 కోట్ల అప్ప్పు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:07 pm

అవినీతి ఊబిలో రెవెన్యూ

. పనికావాలంటే పైసలివ్వాల్సిందే. 22-ఏ పేరుతో అక్రమ దందా. తారుమారవుతున్న భూ రికార్డులు. రాజకీయ నాయకులతో అధికారుల కుమ్మక్కు విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలు అక్రమాలకు అక్షయపాత్రలా తయారయ్యాయి. సామాన్యుడి పట్టా భూమిని రాత్రికి రాత్రే పరాధీనం చేసే మాయా లోకాన్ని తలపిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయంలోకి అడుగు పెట్టాలంటే జేబులో నోట్ల కట్టలు ఉండాలి. లేదంటే రాజకీయ అండ ఉండాలి. అక్కడ చట్టం కంటే రాజకీయ నాయకుడి మాటే శాసనం. నిబంధనల కంటే నోట్ల కట్టలకే విలువ […] The post అవినీతి ఊబిలో రెవెన్యూ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:05 pm

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం భారీ బైక్ ర్యాలీలు

విశాలాంధ్ర`తిరుపతి: ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికవర్గం మంగళవారం బైక్ ర్యాలీలు నిర్వహిం చింది. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ర్యాలీలు జరిగాయి. తిరుపతి, వినుకొండ, ఇతర ప్రాంతాల్లో భారీ బైక్ ర్యాలీలు కొనసాగాయి. కార్మికులు ఉత్సాహంగా బైక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ రాష్ట ఉపాధ్యక్షులు నాగ సుబ్బారెడ్డి మంగళవారం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. బైక్ […] The post ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం భారీ బైక్ ర్యాలీలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:00 pm

కెసిఆర్ చెప్పినవన్నీ కేంద్ర నిధులతో చేపట్టినవే: ఎంపి ధర్మపురి

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జగిత్యాల బహిరంగ సభలో చెప్పిన పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినవేనని బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. 72 ఏళ్ళ వయసులో కెసిఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో దుయ్యబట్టారు. ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారని ఆయన విమర్శించారు. పౌరసరఫరాల విభాగంలో అవినీతి, అక్రమాలు గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఆ అవినీతిని ప్రస్తుత మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న బిఆర్‌ఎస్‌కు కోవర్ట్ అని విమర్శించారు. రైతుల వద్ద నుంచి కరెంట్ బిల్లులు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని ఎంపీ అర్వింద్ చెప్పారు. ఆదివాసీల పోడు భూములను బలవంతంగా తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. దీనిని ప్రశ్నిస్తే దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో రైతులను ఆదుకోని కెసిఆర్ పంజాబ్‌కు వెళ్ళి రైతులకు చెక్కుల పంపిణీ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తన పోరాటం ఆగదని, పసుపు రైతులకు క్వింటాల్‌కు రూ. ౩౦ వేలు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూముల ధరలకు దేశ వ్యాప్తంగా రెక్కలు వచ్చాయని ఎంపీ అర్వింద్ తెలిపారు. తుపాకి రామునిలా.. ఎంపీ రఘునందన్ రావు జగిత్యాలలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, భూపాల్‌పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో తుపాకి రామునిలా డైలాగులు కొట్టారని బిజెపి ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పరస్పరం కాపాడుకుంటున్నాయని, నామమాత్రంగా విమర్శలు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

మన తెలంగాణ 21 Apr 2026 11:00 pm

కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..?: హరీష్‌రావు

కెసిఆర్ సభ జరుగుతుందని ముందే తెలిసి, ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన కుచిత బుద్ధికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అని హరీష్‌రావు విమర్శించారు. కెసిఆర్ ప్రసంగం ఎప్పుడు ప్రారంభమవుతుందో చూసి అదే సమయానికి మైకు పట్టుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అని పేర్కొన్నారు. సోమవారం కెసిఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారని అన్నారు. కెసిఆర్ వ్యూవర్‌షిప్‌లో కనీసం 10 శాతం కూడా రేవంత్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ అధికారిక లైవ్‌లో బిఆర్‌ఎస్ సభను 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ లైవ్‌లో కేవలం 54 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కెసిఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎంతో హుందాగా, రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే..రేవంత్ రెడ్డి మాత్రం రాంకెలు వేయడం, ఏడవడం తప్ప ఇంకేం చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ జేజమ్మ దిగివచ్చినా దానిని ఆపలేరు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయని అన్నారు. ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి.. సోమవారం జగిత్యాల సభలో కెసిఆర్ గర్జిస్తారని భయపడి రాత్రికి రాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశారని చెప్పారు. కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..? అని ప్రశ్నించారు. పంట పెట్టుబడిగా ఇవ్వాల్సింది, పంట చేతికి వచ్చాక వేశారని తెలిపారు.

మన తెలంగాణ 21 Apr 2026 10:50 pm

‘ఎన్టీఆర్ నీల్’ వచ్చేది అప్పుడే

ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్... కెజిఎఫ్ సిరీస్, సలార్ లాంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో భారీ యాక్షన్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ‘ఎన్టీఆర్ నీల్’ మూవీ అని పిలుస్తున్నారు. ఈ సినిమాపై ఇటు ఫ్యాన్స్, అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్ గురించి వివరాలను తెలియజేశారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ ఒక పవర్‌ఫుల్ సినిమాటిక్ వరల్డ్‌ను పరిచయం చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా జూన్ 11, 2027న శుక్రవారం థియేటర్లలోకి రానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్ నీడలాంటి ఓ లుక్‌లో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ సహా పలు భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌లో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.

మన తెలంగాణ 21 Apr 2026 10:43 pm

ఆర్మీ ట్యాంకుల కొనుగోలుకు రూ.975 కోట్లతో ఒప్పందం

న్యూఢిల్లీ: మందుపాతరలు అమర్చిన క్షేత్రాలను ధ్వంసం చేసే అత్యంత సామర్థం కలిగిన కీలకమైన ఆర్మీ ట్యాంకుల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ రూ. 975 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బిఇఎంఎల్) , ఎలెక్ట్రోన్యూమాటిక్స్ , హైడ్రాలిక్స్ (ఇండియా) ప్రైవేట్ సంస్థలతో ఈ ఒప్పందం కుదిరిందని ప్రకటన వెలువడింది. ఈమేరకు టి 72,/టి90 ట్యాంకులు లభిస్తాయి.

మన తెలంగాణ 21 Apr 2026 10:43 pm

థాయ్‌లాండ్‌లో ‘ఈఎన్‌ఈ రిపీట్’.. ఆకట్టుకుంటున్న ఫోటో

’ఈ నగరానికి ఏమైంది’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్‌ని కొనసాగిస్తూ సినిమా సీక్వెల్ ‘ఈఎన్‌ఈ రిపీట్’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్లీ కలిసి నటిస్తూ, మొదటి భాగంలో కనిపించిన కెమిస్ట్రీని తిరిగి తెరపైకి తీసుకురానున్నారు. శ్రీనాథ్ మాగంటి కొత్తగా చేరారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్‌పై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ నెల పాటు కొనసాగుతుంది. సెట్ నుంచి వచ్చిన ఫోటో అందరినీ ఆకట్టుకుంది. ‘టీమ్ కన్యారాసి‘ గ్యాంగ్‌కు చెందిన ఆ నలుగురు అబ్బాయిలు వింటేజ్ కారులో హాయిగా కూర్చుని, ఎంతో ఉత్సాహంతో కనిపిస్తున్నారు. 

మన తెలంగాణ 21 Apr 2026 10:34 pm

జర్మనీ గురుద్వారా దగ్గర ఘర్షణ... నలుగురికి గాయాలు

లండన్: జర్మనీ లోని గురుద్వారాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఆయుధాలు, కత్తుల దాడి వల్ల నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు జర్మనీ లోని మోయిర్స్ సిటీ గురుద్వారాలో ఈ సంఘటన జరిగింది. సిక్కు సమాజం లోని రెండు వర్గాల మధ్య మొదలైన చిన్నగొడవ చివరకు ఆయుధాలు, కత్తుల దాడికి దారి తీసిందని అధికారులు చెప్పారు. అయితే ఘర్షణకు కారణాలేమిటో ఇంకా తెలియడం లేదని పోలీసులు చెప్పారు. 

మన తెలంగాణ 21 Apr 2026 10:24 pm

ఒప్పందం లేకపోతే ఇరాన్‌పై దాడులు: ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్‌పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ముగియనున్న రెండు వారాల కాల్పుల విరమణ గడువులోపు ఒప్పందం కుదరకపోతే, ఇరాన్‌పై బాంబు దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ తెలిపారు. నేను అలా చేయాలని అనుకోవడం లేదు అని సీఎన్‌బీసీ ‘స్క్వాక్ బాక్స్’ కార్యక్రమంలో ట్రంప్ అన్నారు. శాంతి చర్చలు కొనసాగేందుకు కాల్పుల విరమణను పొడిగిస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, వారు చర్చలకు రావాల్సిందే. ఒప్పందం కుదిరితే ఇరాన్ మళ్లీ బలమైన దేశంగా ఎదగగలదు అని పేర్కొన్నారు. అయితే ఒప్పందం లేకుండా కాల్పుల విరమణ ముగిస్తే, దాడులు మళ్లీ ప్రారంభించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అలాంటి దృక్పథంతో ముందుకు వెళ్లడం మంచిదని నేను భావిస్తున్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్, మంచి ఒప్పందం కుదురుతుందని అనుకుంటున్నాను. వారికి వేరే మార్గం లేదు అని అన్నారు. మేము వారి నౌకాదళాన్ని, వైమానిక దళాన్ని దెబ్బతీశాం. వారి నాయకత్వాన్ని కూడా ప్రభావితం చేశాం అని పేర్కొన్నారు. అయితే, నాయకత్వ మార్పు పరోక్షంగా జరిగిందని ట్రంప్ సూచిస్తూ, ఇది నేరుగా చెప్పిన ‘రెజీమ్ ఛేంజ్’ కాకపోయినా పరోక్షంగా జరిగిందే అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత అమెరికాఇరాన్ చర్చలు ఫలితం లేకుండానే ముగియగా, రెండో విడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది.

మన తెలంగాణ 21 Apr 2026 9:56 pm

చర్చలు విఫలం. అర్ధరాత్రి నుంచి ఆర్టీసి బస్సులు బంద్

తెలంగాణలో ఆర్టీసి సమ్మె బాట పట్టనుంది. మంగళవారం ప్రభుత్వంతో టీజిఎస్ ఆర్టీసీ జేఏసీ చర్చలు జరిపింది. సచివాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఆర్‌ అధికారుల కమిటీతో దాదాపు 4 గంటలకుపైగా ఆర్టీసీ సంఘాలు చర్చలు జరిపాయి. అయితే, ఈ చర్చలు విఫలం కావడంతో ఈ అర్ధరాత్రి నుంచే టీజిఎస్ ఆర్టీసి సమ్మెకు వెళ్లనుంది. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈక్రమంలో ప్రజా రవాణా స్తంభించే అవకాశం ఉంది. 

మన తెలంగాణ 21 Apr 2026 9:37 pm

అభిషేక్ ఊచకోత.. ఢిల్లీకి భారీ టార్గెట్

మన తెలంగాణ/హైదరాబాద్: మరోసారి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఐపిఎల్‌ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తో జరుగుతున్న మ్యాచ్ లో అభిషేక్ తన బ్యాటింగ్ తో వీరవిహారం చేశాడు. స్టేడియంలో సిక్సుల మోత మోగించాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్  చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అభిషేక్, 10 సిక్సులు, 10 ఫోర్లతో అజేయంగా 135 పరుగులతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ తోపాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(37), కెప్టెన్ ఇషాన్ కిషన్(25), క్లాసెన్(37 నాటౌట్)లు రాణించారు.

మన తెలంగాణ 21 Apr 2026 9:25 pm

లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ సిఐ, ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ సిఐ, ఎస్‌ఐ ఎసిబికి దొరికిపోయిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. మంగళవారం రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరుకు చెందిన ఓ వ్యక్తి, అతని కుటుంబసభ్యులపై వికారాబాద్ మహిళ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 498 ఏ కింద కేసు నమోదైంది. ఈ కేసులో బాధితుడికి, అతని తల్లి, ఆడ పడుచులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు మహిళా పోలీస్‌స్టేషన్ సిఐ సరోజ, ఎస్‌ఐ రాణి ఒక్కొక్కరికి లంచం డిమాండ్ చేశారు. రూ.40 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగానే మొదటి విడతలో రూ.20 వేలు ఇచ్చారు. మిగిలిన డబ్బులు తన వద్ద లేకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టాం. ఈ విచారణలో సాక్ష్యాలు లభించాయి. ఈ నేపథ్యంలోనే బాధితుడి వద్ద నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా సీఐ, ఎస్‌ఐలను పట్టుకున్నామని డీఎస్పీ ఆనందర్‌కుమార్ తెలిపారు. మొదటి విడత డబ్బులు రూ.20 వేలు సీఐ సరోజ సమక్షంలో ఎస్సై తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సీఐ, ఎస్సైపై లోతుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. వికారాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ సరోజ స్టేషన్‌కు వచ్చిన బాధితుల రక్తం తాగేదని బాధితుడు, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షద్ ఆరోపించారు. ఫిబ్రవరి 20న నా భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం కౌన్సిలింగ్ కూడా ఇవ్వలేదు. కానీ డబ్బుల కోసం నాపై, నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, తమ్మునిపై కేసులు నమోదు చేశారు. నాకు, నా భార్యకు చిన్న గొడవ జరిగింది. నా భార్య ఇచ్చిన ఫిర్యాదుపై అదే రోజు కేసు నమోదు చేశారు. వాస్తవానికి మా అమ్మనాన్న ఇద్దరు వృద్ధులు. వారు నాతో దూరంగా ఉంటారు. మా సిస్టర్లు ఇద్దరు, మా తమ్ముడు నాతో పాటు ఉండరు. కానీ వారిపైనా కేసు నమోదు చేశారు. కేసును లోక్ అదాలత్‌లో కొట్టేసేవిధంగా చేస్తానని, అందుకోసం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పునా మొత్తం రూ.60 వేలు కావాలని డిమాండ్ చేశారు. రూ. 40 వేలకు సెటిల్‌చేసి ముందుగా రూ. 20 వేలు తీసుకున్నదన్నారు. వీరిద్దరు నెలకు రూ.50 నుంచి 60 లక్షల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించాడు. మా వాళ్ల తప్పుల్లేకపోయినా వారిని డబ్బుల కోసం సీఐ, ఎస్సై ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ ఇద్దరు అధికారులు బాధితులకు న్యాయం చేయకపోగా లంచాలు తీసకుంటున్నారన్నారు. వీళ్ల భాగోతం గురించి జిల్లాలో ఎవరినడిగినా తెలుస్తుందన్నారు. అవినీతి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 21 Apr 2026 9:14 pm

పెద్ది నుంచి కీలక అప్డేట్.. బుచ్చిబాబుతో రామ్ చరణ్ సెల్ఫీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్పోర్ట్ యాక్షన్ డ్రామా ’పెద్ది’ నుంచి విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా సంచలనం సృష్టించాయి. రెండు గ్లింప్స్‌లలో చరణ్ డిఫరెంట్ అవతార్స్‌లో కనిపించి మైమరపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ బర్త్ స్పెషల్ గా విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందనతో సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ ఇంకో 6 రోజుల్లో పూర్తవనుంది. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. ఈ సినిమా జూన్‌లో థియేటర్లలో విడుదల కానుంది. సెట్స్ నుంచి విడుదలైన కొత్త స్టిల్స్‌లో షూటింగ్ స్పాట్‌లోని పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తోంది. దర్శకుడు బుచ్చి బాబు సానాతో కలిసి రామ్ చరణ్ ఆనందంగా కనిపిస్తూ, షూట్ వాతావరణాన్ని తెలియజేస్తున్నారు. చరణ్ పొడవాటి జుట్టు, గడ్డం, స్టైలిష్ షేడ్స్‌తో రగ్గడ్ అవతార్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి అద్భుతమైన తారాగణం కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మన తెలంగాణ 21 Apr 2026 9:09 pm

ఇజ్రాయెల్ లెబనాన్ చర్చలు పునఃప్రారంభం

ఇజ్రాయెల్‌ లెబనాన్ మధ్య చారిత్రాత్మక దౌత్య చర్చలు గురువారం వాషింగ్టన్ లో పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్గత చర్చలకు సంబంధించిన సమాచారం కావడంతో, అధికారులు గోప్యతా నిబంధనల మేరకు పేర్లు వెల్లడించలేదు. దశాబ్దాల తరువాత గత వారం ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు నేరుగా సమావేశమై చర్చలు జరపడం గమనార్హం. ఈ చర్చల ద్వారా హిజ్బుల్లా మిలిటెంట్లను నిరాయుధీకరించడం, లెబనాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం లక్ష్యమని ఇజ్రాయెల్ వెల్లడించింది.ఇదే సమయంలో లెబనాన్‌లో 10 రోజుల కాల్పుల విరమణ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికాఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌పై ప్రారంభమైన రెండో రోజునే, ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ల మధ్య ఘర్షణలు చెలరేగాయి. లెబనాన్‌లో జరిగిన పోరాటాల్లో ఇప్పటివరకు 2,290 మందికి పైగా మరణించినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో కనీసం 3,375 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అదనంగా ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్ అరబ్ దేశాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌లో 15 మంది ఇజ్రాయెల్ సైనికులు, ప్రాంతవ్యాప్తంగా 13 మంది అమెరికా సైనికులు కూడా మరణించినట్లు సమాచారం.

మన తెలంగాణ 21 Apr 2026 9:06 pm

చెన్నైకి బిగ్ షాక్.. ఐపిఎల్ నుంచి స్టార్ బ్యాటర్ ఔట్

చెన్నై: వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్ తగిలింది. గాయంతో యువ ఆటగాడు ఆయుష్ మాత్రె ఐపిఎల్‌కు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో చెన్నై అంతంత మాత్రంగానే రాణిస్తోంది. ఆరు మ్యాచుల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఇలాంటి స్థితిలో ప్రతిభావంతుడైన బ్యాటర్‌గా పేరున్న ఆయుష్ దూరం కావడం సిఎస్‌కెకు పెద్ద ఎదురు దెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆయుష్ గాయానికి గురయ్యాడు. తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం తీవ్రత అధికంగా ఉన్నట్టు తేలింది. అతనికి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో ఆయుష్ ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయాన్ని సిఎస్‌కె యాజమాన్యం మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

మన తెలంగాణ 21 Apr 2026 8:59 pm

పొన్నాల గతే జీవన్ రెడ్డికీ పడుతుంది: ఎంపి చామల

గతంలో కాంగ్రెస్‌ను వీడి బిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు పట్టిన గతే మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికీ పడుతుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డికి ఆ పార్టీ అధినేత కెసిఆర్ వెంటనే ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారని, నిజానికి తమ పార్టీ అధినేతగా చేయాలనుకున్నామని ఎంపీ చామల మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. జీవన్ రెడ్డి ఆలోచన లేని పని చేశారని అన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహు, కేతు గ్రహం అని ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ విమర్శించడాన్ని ఎంపీ చామల తీవ్రంగా ఖండించారు. అసలు బండి సంజయ్ ఏ గ్రహం అని ఆయన అన్నారు. నవ గ్రహాల్లో బండి సంజయ్ ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.కేంద్ర మంత్రి బండి ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మెట్రో పేజ్ 2, ట్రిపుల్ ఆర్, మూసీ ప్రక్షాళన విషయంలో మీ వైఖరి ఏమిటని ఆయన ప్రశ్నించారు. భువనగిరి లోక్‌సభ పరిధి కోసం నిధులు తీసుకుని వచ్చేందుకు బహిరంగ సభను కేంద్ర మంత్రులు బండి సంజయ్, జి. కిషన్ రెడ్డి కలిసి పెట్టాలని, అందుకు పార్టీలకు అతీతంగా ప్రజలను తీసుకుని వచ్చే బాధ్యత తనదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగిస్తే ఇరవై నాలుగు గంటల్లో విచారణ చేపిస్తానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఎంపీ చామల ప్రశ్నించారు. సిబిఐ విచారణకు ఆదేశించడం కేంద్ర హోం శాఖ మంత్రి పరిథిలోకే వస్తుందని, అయినా బండి సంజయ్ మాట్లాడడం లేదన్నారు. కాళేశ్వరం బిఆర్‌ఎస్‌కు ఏటీఎంగా మారిందన్న బిజెపి ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎంపీ చామల ప్రశ్నించారు.

మన తెలంగాణ 21 Apr 2026 8:50 pm

అమెరికా సీజ్ చేసిన నౌకలో.. చైనా నుంచి ఇరాన్‌కు క్షిపణి రసాయనాలు

వాషింగ్టన్: హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకను అమెరికా ఇటీవల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ నౌకలో క్షిపణి తయారీకి వినియోగించే రసాయనాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ మాజీ రాయబారి , రిపబ్లికన్ నేత హేలీ సంచలన ఆరోపణలు చేశారు. ఈమేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీనిని బట్టి ఇరాన్‌కు చైనా సైనిక సాయం అందిస్తోందనే విషయాన్ని కొట్టి పారేయలేమని ఆరోపించారు. ఈ తొస్కా నౌక అనేక సార్లు చైనాకు వెళ్లిందని, ఇరాన్ క్షిపణుల తయారీకి కావలసిన రసాయనాలను తీసుకొచ్చిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. గత ఆరు వారాల్లో ఈ నౌక చైనాకు రెండు సార్లు వెళ్లిందని పేర్కొంది. మరోవైపు తౌస్కా నౌకను, అందులోని సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ఇది వెంటనే జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికాను హెచ్చరించింది. ఇరాన్ నౌకతో మా సంబంధం లేదు: చైనా అమెరికా సీజ్ చేసిన ఇరాన్ తౌస్కా వాణిజ్య నౌకలో క్షిపణుల తయారీకి కావలసిన చైనా రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలను చైనా కొట్టి పారేసింది. “నాకు తెలిసినంతవరకు , ఇది విదేశీ పతాకం కలిగిన నౌక. దాంతో తమ దేశానికి సంబంధం ఉందన్న దుష్ప్రచారాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం ” అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారప్రతినిధి గుయో జియా కున్ పత్రికా విలేకరులకు చెప్పారు. అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

మన తెలంగాణ 21 Apr 2026 8:49 pm

27న తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ కీలక సమావేశం

భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ రజతోత్సవ సంబురాల సందర్భంగా పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 27వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ భేటీ జరగనుంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన గులాబీ బాస్, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి అనే విషయాలపై కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.వీటితో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ భేటీలో స్పష్టత రానుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు తప్పనిసరిగా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే మాజీ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌సిలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లను కూడా ఈ భేటీకి ఆహ్వానించినట్లు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మన తెలంగాణ 21 Apr 2026 8:38 pm

బాలుడి ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి..

మనతెలంగాణ, సిటిబ్యూరోః రీల్స్ పిచ్చి ఓ బాలుడి ప్రాణాలు తీసిన సంఘటన నాచారం, మల్లాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. రీల్స్ కోసం వీడియో తీస్తు బిల్డింగ్‌పై నుంచి కిందపడడంతో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్ట్రానికి చెందిన బాలుడు మితున్(14) తల్లిదండ్రులు బతుకు దెరువు కోసం నాచారం, మల్లాపూర్‌కు వచ్చి పనిచేస్తున్నారు. మల్లాపూర్, గాంధీ బొమ్మ దగ్గర ఉన్న బస్తీలో ఉంటున్నారు. బాలుడు సమీపంలోని పాఠశాలలో చదువుతున్నాడు, బాలుడు తరచూ ఇన్‌స్ట్రాగ్రాం, యూట్యూబ్‌లో రీల్స్ చూసేవాడు. తాను కూడా రీల్స్ చేసి ఫేమస్ కావాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే మార్చి 5వ తేదీన తాను ఉంటున్న భవనం బాల్కనీ రేయిలింగ్ పిట్ట గొడపై ఫీట్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతిచెందాడు.

మన తెలంగాణ 21 Apr 2026 8:35 pm

రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి...లిక్కర్ దందా

బెంగళూరు, హర్యానా డిఫెన్స్ మద్యం విక్రయం రూ.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం మనతెలంగాణ, సిటిబ్యూరోః నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం నిల్వ చేసిన ఇంటిపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. రూ.10లక్షల విలువైన 361 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్ రెడ్డి హస్తినాపురంలో ఉంటున్నాడు. గత కొంత కాలం నుంచి సురేష్ బెంగళూరు, హర్యానా రాష్ట్రాల్లోని ఆర్మీ క్యాంటీన్ల నుంచి కొనుగోలు చేసిన ఖరీదైన మద్యం బాటిళ్లను హస్తినాపురానికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి మార్కెట్ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది శ్రీరమణ కాలనీ, ఫేజ్2లోని ఇంట్లో దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది దాడి చేస్తున్నట్లు తెలుసుకున్న సురేష్ రెడ్డి ఇంటి నుంచి పారిపోయాడు. కేసు దర్యాప్తు కోసం మద్యం బాటిళ్లను స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

మన తెలంగాణ 21 Apr 2026 8:24 pm

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి ఆగి ఉన్న టిప్పర్ ఢీకొని… జన్నారం,ఏప్రిల్ 21

ప్రభ న్యూస్ 21 Apr 2026 8:20 pm

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఊస్ట్.. ఇంటిపైనే గంజాయి మొక్కలు పెంచుతూ..

మనతెలంగాణ,సిటిబ్యూరోః గంజాయి అలవాటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోగొట్టుకున్న యువకుడు... ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతూ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది చేతికి చిక్కాడు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం... నాచారం, ఈస్ట్ గాంధీనగర్‌కు చెందిన సిహెచ్.శశిధర్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత యువకుడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే వచ్చే జీతమంతా గంజాయి కొనుగోలుకే వెచ్చించడంతో చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది. దీంతో యువకుడు తన ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. దాని నుంచి వచ్చే గంజాయిని తాను వినియోగించుకుంటున్నాడు. ఈ విషయం రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందికి తెలియడంతో సిఐ బాలరాజు, సిబ్బంది కలిసి దాడి చేశారు. ఇంటిపై పెంచుతున్న 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలు మూడు మీటర్లు పెరిగి, పూతకు వచ్చాయి. ఈ మొక్కలు నుంచి 10కిలోల గంజాయి వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్టు చేశారు. ఇద్దరి వద్ద నుంచి 480 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు బండి అరుణ్ కుమార్, బి.ఆషిష్‌ను అరెస్టు చేసి ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

మన తెలంగాణ 21 Apr 2026 8:13 pm

Koratala Siva to Direct NBK

Writer-turned-director Koratala Siva has been idle since the release of Devara. He is ready with the script of Devara 2 but NTR is occupied with other projects. Koratala Siva has been keen to work with Nandamuri Balakrishna. The discussion took place recently and Balayya has given his nod for Koratala Siva’s script. The shoot of […] The post Koratala Siva to Direct NBK appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 8:03 pm

శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం అనుసరణీయం..

శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం అనుసరణీయం.. అలరించిన గుంటుపల్లి మోహనకృష్ణ ఆధ్యాత్మిక ప్రవచనం.. ఇంద్రకీలాద్రి,

ప్రభ న్యూస్ 21 Apr 2026 8:01 pm

వైభవంగా శంకరాచార్య జయంతి ఉత్సవాలు..

వైభవంగా శంకరాచార్య జయంతి ఉత్సవాలు.. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా నిర్వహణశాస్త్రోక్తంగా శంకరాచార్య

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:57 pm

భక్తుల సంతృప్తియే ముఖ్యం..

భక్తుల సంతృప్తియే ముఖ్యం.. దేవాలయాల్లో సౌకర్యాల మెరుగుదల చేయండి..దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం..

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:53 pm

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం…

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం… ఇంద్రకీలాద్రిపై జనసేన నేతల ప్రత్యేక మొక్కుమోకాళ్లపై మెట్లు

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:48 pm

దమ్మపేట ఎస్సై కి ఎస్పీ ప్రశంస…

దమ్మపేట ఎస్సై కి ఎస్పీ ప్రశంస… దమ్మపేట, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:42 pm

చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణాపై సిపిఐ ఆందోళన..

తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా – టీడీపీ నేతల మద్దతు విశాలాంధ్ర – గోరంట్ల: గోరంట్ల మండల పరిధిలోని చిత్రావతి నదిలో రోజురోజుకీ ఇసుక అక్రమ రవాణా పెరుగుతోందని, దీంతో పరివాహక ప్రాంత రైతుల ఫిల్టర్ బోర్లు ఎండిపోతున్నాయని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య ముఖ్య అతిథిగా […] The post చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణాపై సిపిఐ ఆందోళన.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 7:39 pm

ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు మేలు

ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు మేలు ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉచిత

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:39 pm

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే… రాప్తాడు, ఆంధ్రప్రభ : ఎన్నికల ముందు ఇచ్చిన

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:36 pm

విద్యార్థిని ఉన్నత చదువుకు ఆర్థికసహాయం..

విశాలాంధ్ర – లేపాక్షి: లేపాక్షిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీవిబి)లో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన సుభానీ భీ కుమార్తె ఉన్నత చదువుల కోసం విద్యాలయ సిబ్బంది మంగళవారం ఆర్థిక సహాయం అందజేశారు.విద్యాలయంలో పనిచేస్తున్న బోధన, భోధనేతర సిబ్బంది కలిసి రూ.51 వేల మొత్తాన్ని మృతురాలి కుమార్తెకు అందించారు. ఈనెల 17వ తేదీన హిందూపురం నుంచి లేపాక్షిలోని విద్యాలయానికి విధులకు వెళ్తుండగా, టోల్ గేట్ సమీపంలో ద్విచక్ర వాహన ప్రమాదానికి గురై […] The post విద్యార్థిని ఉన్నత చదువుకు ఆర్థికసహాయం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 7:30 pm

తెలంగాణ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు: మంత్రి జూపల్లి

నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘దివ్య భారత్’ పర్యాటక నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతోందని, ఇది తెలంగాణకు గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని మంత్రి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, చారిత్రక గోల్కొండ కోట, భువనగిరి కోట వంటి కట్టడాలతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాలు నిత్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని వివరించారు. కేవలం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలే కాకుండా ప్రకృతి ఒడిలో విరాజిల్లే కుంటాల, బొగత జలపాతాలు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర వంటి సాంస్కృతిక వేడుకలు రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి ఇక్కత్ వంటి సంప్రదాయ కళలు పర్యాటక రంగాన్ని మరింత సుసంపన్నం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని సుసంపన్నమైన సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలను తిలకించేందుకు దేశ విదేశీ పర్యాటకులు తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కల్పనను మరింత బలోపేతం చేయడంతో పాటు, తెలంగాణ పర్యాటక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్త్తోందని మంత్రి జూపల్లి పునరుద్ఘాటించారు.

మన తెలంగాణ 21 Apr 2026 7:28 pm

జగద్గురు ఆదిశంకరాచార్య నగరోత్సవం..

జగద్గురు ఆదిశంకరాచార్య నగరోత్సవం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్బంగా

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:25 pm

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..13మంది మృతి

కేరళలో మరో విషాదం నెలకొంది. త్రిస్సూర్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13మంది మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. త్రిస్సూర్ తిరువంబడిలోని ఓ బాణసంచా తయారీ యూనిట్లో ఈ సంఘటన జరిగింది. బాణసంచా కోసం ఆ కేంద్రంలో సామగ్రిని ఉత్పత్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ శబ్దం సుమారు కొన్ని కిలోమీటర్ల మేర వినిపించినట్టు స్థానికులు తెలిపారు. తొలుత దీన్ని భూప్రకంపనలుగా భావించినట్టు వారు తెలిపారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై ప్రధానమంత్రి మోడీ, కేరళ సిఎం విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రకటించారు. 

మన తెలంగాణ 21 Apr 2026 7:21 pm

తమిళనాడులో డిఎంకే కూటమిదే విజయం: భట్టి విక్రమార్క

 తమిళనాడులో డిఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసిసి పరిశీలకుడు, మాజీ ఎంపీ మధు యాష్కీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి రాణిపేట జిల్లా షోలింగర్ నియోజకవర్గంలో నీకారిక్కల్ , వీరనట్టుర్, అరియూర్, అయిపేడు ప్రాంతాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించి, కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. తమిళ ప్రజలు అభివృద్ధి, లోకికవాదానికే పట్టం కడతారని చెప్పారు. ఆత్మగౌరవానికి తమిళ ప్రజల మద్దతు చెబుతారని ఆకాంక్షించారు. ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వం భారీ మెజారిటీతో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని భట్టి విక్రమార్క చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలోనీ ప్రజా ప్రభుత్వం ఎన్నికలవేళ ఇచ్చిన హామీలే కాకుండా, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. అనుమానం ఉంటే ఎవరైనా వచ్చి పరిశీలించవచ్చని తెలిపారు. రైతు భరోసా కింద రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు వివరించారు. రూ. 500 కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు అంటే ఒక సిద్ధాంతం తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తాయని కొనియాడారు. తమిళనాడు అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు, అదొక గొప్ప సిద్ధాంతమని పేర్కొన్నారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధి వంటి మహనీయులు ఇక్కడ సామాజిక న్యాయానికి బలమైన పునాదులు వేశారని ఆయన పేర్కొన్నారు. లౌకికవాదాన్ని కాపాడటంలో తమిళ ప్రజలు ఎప్పుడూ ముందుంటారని ఆయన ప్రశంసించారు. ఢిల్లీ పీఠంపై ఉన్న పాలకులు తమిళ సంస్కృతిని, భాషను, హక్కులను అణచివేయాలని చూస్తున్నారని భట్టి విమర్శించారు. ఇలాంటి శక్తులను ఎదుర్కోవాలంటే సెక్యులర్ శక్తుల ఐక్యత అనివార్యమని, అందుకే స్టాలిన్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ అందిస్తున్న ప్రేమ సందేశం, స్టాలిన్ చేపట్టిన అభివృద్ధి నినాదం ఒక్కటయ్యాయని భట్టి పేర్కొన్నారు. తమిళ ప్రజలు వేసే ఓటు కేవలం ఒక గుర్తుపై వేసే ముద్ర కాదని, అది విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వినిపించే ప్రజాస్వామ్య గొంతుక అని వ్యాఖ్యానించారు. నియంతృత్వాన్ని ఓడించి, విద్వేషం లేని సమాజాన్ని నిర్మించుకోవాలని, ఇక్కడ కేవలం ప్రేమకు, సమధర్మానికి మాత్రమే చోటు ఉందని నిరూపించాలని ఆయన కోరారు. తాము మాట ఇచ్చిన ప్రకారం సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నామని, అదే స్ఫూర్తితో తమిళనాడులో కూడా అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే డీఎంకే-కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని భట్టి విక్రమార్క కోరారు.

మన తెలంగాణ 21 Apr 2026 7:20 pm

తుమ్మలని విమర్శించే అర్హత పువ్వాడకు లేదు…

తుమ్మలని విమర్శించే అర్హత పువ్వాడకు లేదు… ఖమ్మం బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : వ్యవసాయ

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:18 pm

తాడిపత్రి లో జోరుగా మట్కా దందా …

పేదల నివాస ప్రాంతాలే లక్ష్యంగా మట్కా నిర్వహణ… మట్కా మహమ్మారి కాటులో తాడిపత్రి పేదలు ఆన్లైన్, వాట్సాప్లలో మట్కా నిర్వహణ. విశాలాంధ్ర – తాడిపత్రి: పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ప్రతి మనిషి ఆశాజీవి. అయితే ఆ ఆశనే ఆయుధంగా చేసుకుని మట్కా నిర్వాహకులు పేదలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “ఒక్క రూపాయికి 90 రూపాయలు” అనే ఆశ చూపిస్తూ తాడిపత్రి పట్టణంలోని పేద ప్రాంతాల్లో మట్కా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. రోజంతా కష్టపడి […] The post తాడిపత్రి లో జోరుగా మట్కా దందా … appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 7:14 pm

ప్రశ్నిస్తే తొలగిస్తారా?

ప్రశ్నిస్తే తొలగిస్తారా? చంద్రబాబు సర్కారుపై జగన్ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:13 pm

చైన్ స్నాచింగ్ కేసులో మలుపు…

చైన్ స్నాచింగ్ కేసులో మలుపు… ఇద్దరిలో ఒకరి అరెస్ట్పల్సర్ బైక్ స్వాధీనం..అంతర్రాష్ట్ర భవారియా

ప్రభ న్యూస్ 21 Apr 2026 7:10 pm

IPL 2026: ఢిల్లీపై టాస్ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్..

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకుని.. హైదరాబాద్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదుంది. ఢిల్లీని కూడా ఓడించి హ్యాట్రిక్ విజయాన్నిఅందుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పాలి. మరోవైపు, హైదరాబాద్ ను ఓడించి తమ సత్తా చాటాలని ఢిల్లీ భావిస్తోంది.

మన తెలంగాణ 21 Apr 2026 7:08 pm

భారత విమానాలపై పాక్ గగనతల దిగ్బంధనం మే 24 వరకు పొడిగింపు

 భారత విమానాలపై గగనతల దిగ్బంధనం మే 24 వరకు పొడిగిస్తూ పాకిస్థాన్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గాంపై ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏప్రిల్ 24 నుంచి రెండు దేశాల మధ్య గగనతల దిగ్బంధనం కొనసాగుతోంది. గత ఏడాది ఏప్రిల్ 30 నుంచి పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలాన్ని వినియోగించడానికి అనుమతి లేదు. పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ నోటమ్ ప్రకారం ఈ ఏడాది మే 24 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. దీనివల్ల పశ్చిమదేశాలకు , ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు, యూరప్ దేశాలకు ఢిల్లీ, అమృత్‌సర్, జైపూర్ నుండి వెళ్లే సుమారు 800 వారపు విమాన సర్వీసులపై ప్రభావం పడుతుంది. 

మన తెలంగాణ 21 Apr 2026 7:06 pm

రేపు మేఘాలయ పర్యటనకు మంత్రి సీతక్క

మేఘాలయ ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. స్టేట్- టు- స్టేట్ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు మంత్రి అక్కడి కార్యక్రమాలను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో మహిళా శిశు అభివృద్ధి రంగంలో మేఘాలయ అమలు చేస్తున్న పలు కీలక కార్యక్రమాలను మంత్రి అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా మిషన్ 1000 డేస్, ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలెప్‌మెంట్ కార్యక్రమాలు, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి వంటి అంశాలను పరిశీలించనున్నారు. అలాగే మహిళా శిశు సంక్షేమంపై ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇతర సాంకేతిక భాగస్వామ్య సంస్థలు నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా కూడా మంత్రితో పాటు ఉంటారు. మేఘాలయలో అమలవుతున్న కార్యక్రమాల ద్వారా అంగన్వాడి కేంద్రాలను కేవలం పోషకాహార పంపిణీ కేంద్రాలుగా కాకుండా, పిల్లల సమగ్ర అభివృద్ధికి వేదికలుగా మార్చుతున్నారు. మాతా శిశు ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యను కలగలిపిన సమగ్ర విధానంతో ఆ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. తల్లిదండ్రులకు శిశు సంరక్షణ, పోషణపై అవగాహన పెంపు, రియల్‌టైమ్ మానిటరింగ్ కోసం డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థల వినియోగం, సంప్రదాయ అంగన్వాడి కేంద్రాలను హ్యాపినెస్ సెంటర్లగా మార్చడం వంటి చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. గర్భిణీలు, శిశువులకు పోషకాహారం అందజేయడంతో పాటు, స్థానిక మహిళా సంఘాలు, సంక్షేమ, వైద్య, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంతో మేఘాలయ రాష్ట్రం అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలుసుకుని, తెలంగాణలో అంగన్వాడీ సేవలను బలోపేతం చేసే లక్ష్యంతో మంత్రి సీతక్క ఈ పర్యటన చేపడుతున్నారు.

మన తెలంగాణ 21 Apr 2026 7:00 pm

విద్యార్థులకు వృత్తి విద్యాకోర్సు కిట్లు పంపిణీ…

విద్యార్థులకు వృత్తి విద్యాకోర్సు కిట్లు పంపిణీ… పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వము

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:58 pm

మోదీపై వ్యాఖ్యలు..

మోదీపై వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపాటు శ్రీ సత్యసాయి బ్యూరో,

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:54 pm

Ys Jagan : ఎక్స్ లో చంద్రబాబు పై జగన్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు పై ఫైర్ అయ్యారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 6:52 pm

రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మోదీ: మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించారు. ఆయన ప్రభుత్వ యంత్రాంగం, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ పార్టీలను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. చెన్నైలో జరిగిన పత్రికా సమావేశంలో ఏఐసీసీ సాధారణ కార్యదర్శి (సంస్థ) కె.సి. వేణుగోపాల్‌తో కలిసి మాట్లాడిన ఖర్గే, ఏఐఏడీఎంకేబీజేపీ కూటమిపై విమర్శలు చేస్తూ తొలుత ప్రధాన మంత్రిని టెర్రరిస్ట్‌గా పేర్కొన్నారు. అయితే, తన వ్యాఖ్యలపై పాత్రికేయులు వివరణ కోరడంతో, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను భయపెడుతున్నారనే ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య చేశానని స్పష్టం చేశారు.ఆయన ప్రజలను, రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నేను ఆయనను నిజంగా టెర్రరిస్ట్ అన్నానా? లేదా? ఎందుకు అన్నాను? అన్నది కాదు ముఖ్యం. ఆయన తన అధికారాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై దాడి చేస్తున్నారు అని ఖర్గే అన్నారు. ఇక భారత ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయ విస్తరణగా మారిపోయిందని ఆరోపించిన ఆయన, ఎన్నికల ప్రచారం చివరి దశలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ప్రధాన మంత్రిపై విమర్శలు గుప్పించారు. అలాగే, కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను విభాగాలను రాజకీయ కార్యకర్తలను బెదిరించే సాధనాలుగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.అదే సందర్భంలో, మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు లోక్‌సభ స్థానాలను పెంచడం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో అనుసంధానం చేసే రాజ్యాంగ సవరణ బిల్లుపై కూడా మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళల రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షం అడ్డుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఆయన అన్నారు. 2023లో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడిందని గుర్తుచేశారు.నిజంగా అమలు చేయాలనే ఉద్దేశ్యం ఉంటే, ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వవచ్చు. అయితే ఎందుకు ఇవ్వడం లేదు? అని ఖర్గే ప్రశ్నించారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా జనాభా నియంత్రణలో విజయవంతమైన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. దక్షిణ భారత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన రాష్ట్రాల ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం ఉంది. వారి పురోగతికి శిక్ష విధించాలని మోదీ, షా భావిస్తున్నారు అని విమర్శించారు.డీఎంకేకాంగ్రెస్ కూటమి బలాన్ని పునరుద్ఘాటించిన ఖర్గే, కె.సి. వేణుగోపాల్‌తో కలిసి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ మధ్య విభేదాలున్నాయన్న వార్తలను కొట్టిపారేశారు. ఇద్దరూ అన్నదమ్ముల్లాంటి వారు అని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కూటమి హామీలను కూడా ఆయన మరోసారి వెల్లడించారు. మహిళలు, వృద్ధులకు నెలకు రూ.2,000 సహాయం, కుటుంబాలకు ఆహార భద్రత కోసం నెలకు రూ.2,500, అలాగే 300 రోజుల్లో ప్రభుత్వ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ప్రధాన మంత్రి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ, భారత ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయ విస్తరణలా వ్యవహరిస్తోంది అని ఖర్గే విమర్శించారు.

మన తెలంగాణ 21 Apr 2026 6:50 pm

కెసిఆర్ వద్ద జీవన్ రెడ్డికీ భంగం తప్పదు: ఎంపీ మల్లు రవి

 భంగపడినట్లు ఇప్పుడు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చేతిలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికీ తప్పదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. సోమవారం కాంగ్రెస్‌పై కెసిఆర్, టి. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎంపీ మల్లు రవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కెసిఆర్‌కు నమ్మించి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని ఆయన తెలిపారు. కెసిఆర్‌తో ఏమి ఉపయోగం లేదని ఎన్నికల్లో రుజువైందని అన్నారు. కెసిఆర్ ఎన్ని మాటలు చెప్పినా ప్రజా ప్రభుత్వానికి ఏమి కాదని, ప్రజలకు తమ వైపు ఉన్నారని ఆయన తెలిపారు. త్రేతాయుగంలో రావణుడి చేతిలో విభీషణుడు భంగపడినట్లు కలియుగంలో కెసిఆర్ చేతిలో జీవన్ రెడ్డికి భంగపాటు తప్పదని ఆయన అన్నారు. 42 ఏళ్ళు జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో అనేక పదవులు అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శించడం భావ్యం కాదని ఆయన విమర్శించారు. తాను చెప్పినట్లు కాంగ్రెస్ వినలేదని జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి పోవడంతో 42 ఏండ్ల వ్యక్తి గత ప్రతిష్టను దిగజార్చుకున్నారని ఆయన తెలిపారు. ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు రేవంత్ రెడ్డి కులగణన నిర్వహించారని మల్లు రవి చెప్పారు.

మన తెలంగాణ 21 Apr 2026 6:43 pm

తెలంగాణ వైపు నార్వే చూపు..

తెలంగాణ వైపు నార్వే చూపు.. సచివాలయంలో కీలక భేటీ! ఆంధ్రఫ్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:42 pm

అమెజాన్ డెలివరీలో భారీ మోసం..

అమెజాన్ డెలివరీలో భారీ మోసం.. ఢిల్లీ పోలీసుల వేటలో దొరికిన కేటుగాళ్లు! ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:39 pm

Telangana : గెలుపు ధీమా .. ఎవరి అంచనాలు వారివే... లెక్కలు మాత్రం?

తెలంగాణలో ఎన్నికలకు మూడేళ్ల ముందే హీటెక్కింది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 6:35 pm

బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి

త్రిస్సూర్: కేరళలో భారీ పేలుడు జరిగింది. త్రిస్సూర్‌లో బాణసంచా నిల్వ, తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. త్రిస్సూర్ పూరం ఉత్సవాల్లో భాగంగా జరిగే తిరువంబడి కోసం బాణసంచా సామగ్రిని సిద్ధం చేస్తున్న కేంద్రంలో మంగళవారం ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న  వెంటనే పోలీసులు, అగ్నిమాపక, సహాయక బృందాలు, అంబులెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని త్రిస్సూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. భారీ పేలుడుతో..దాని శబ్దం చాలా కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. దీంతో సమీపంలోని నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపం సంభవించినట్లు అనుకుని భయపడినట్లు స్థానికులు తెలిపారు. దట్టమైన పొగ, మంటలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

మన తెలంగాణ 21 Apr 2026 6:34 pm

సామాజిక న్యాయం పాటిస్తేనే పార్టీకి ఆధిక్యం

సామాజిక న్యాయం పాటిస్తేనే పార్టీకి ఆధిక్యం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాబోయే

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:28 pm

బీఆర్ఎస్ కీలక సమావేశం..

బీఆర్ఎస్ కీలక సమావేశం.. కేసీఆర్ అధ్యక్షతన రజతోత్సవ ముగింపు వేడుకలు ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:27 pm

బిగ్ రిలీఫ్.. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

బిగ్ రిలీఫ్.. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:24 pm

ప్రధాని మోడీ 'టెర్రరిస్టు'.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆయన.. ప్రధాని మోడీని టెర్రరిస్టు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సమానత్వాన్ని విశ్వసించని వ్యక్తి(ప్రధాని మోడీ)తో AIADMK చేతులు కలపి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. మోడీతోపాటు ఆయన పార్టీ కూడా సమానత్వాన్ని, న్యాయాన్ని విశ్వసించదు. అలాంటి వారితో వీరు చేతులు కలపడం అంటే, వారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని అర్థం అని పేర్కొన్నారు. ప్రధాని మోడీని ఉగ్రవాది అనడంతో ఖర్గే వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం రాజకీయ పార్టీలను, ముఖ్యంగా ఎన్నికల అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వారు సిబిఐ, ఈడీ, ఐటి వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను కూడా లక్ష్యంగా చేసుకోగల శక్తివంతమైనది తమ ప్రభుత్వమేనని ప్రజలు భావించేలా, వారిలో భయాన్ని సృష్టిస్తున్నారు. ఆ సందర్భంలోనే నేను ఆ వ్యాఖ్యలు చేశాను. ఆయన (మోడీ) స్వయంగా ఒక ఉగ్రవాది అని నేను ఎప్పుడూ అనలేదు. ఈ సంస్థలను ఉపయోగించుకుని ఆయన, ఆయన ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాత్రమే నేను చెప్పాను. నా ఉద్దేశం అదే అని ఖర్గే అన్నారు.

మన తెలంగాణ 21 Apr 2026 6:23 pm

ధర్మ యోగ బిరుదు పొందిన దాత్రిక రమేష్

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : నగరానికి చెందిన గోరక్ష ప్రముక్ దాత్రిక రమేష్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:21 pm

రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి..

రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:20 pm

40 people |భారీ పేలుడు..

40 people | భారీ పేలుడు.. 40 people | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:17 pm

అందుకే ఢిల్లీకి వెళ్లా..

అందుకే ఢిల్లీకి వెళ్లా.. సీఎం రేవంత్ కు హరీష్ వార్నింగ్ ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:10 pm

నీ కుంపటి ఏర్పాటు చేసుకునేందుకే ఆ పదిమందిని చేర్చుకున్నావు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని..రేవంత్ రెడ్డి.. ఆ పీడ విరగడ కావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి స్వార్థ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలే తప్ప ప్రజల గురించి ఆలోచన లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి తగిన మెజార్టీ సభ్యులు ఉన్నా.. నీ కుంపటి ఏర్పాటు చేసుకునేందుకే పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు అని ఆరోపించారు. రాష్ట్రంలో తిరోగమన పాలన సాగుతోంది. కెసిఆర్ ను ఉరి తీస్తావా.. నీవేమి ముఖ్యమంత్రివి?. నీవు సీఎం కావడం కెసిఆర్ పుణ్యమే. తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం చేస్తానన్నావు ఏమైంది. మేడిగడ్డ మరమ్మతుకు రూ.400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది. 30 మాసాలుగా నిద్రపోయి ఇప్పుడు మేడిగడ్డ గుర్తొచ్చి వెళ్లారా?. మేడిగడ్డ మరమ్మతులకు సంబంధించి డిజైన్ కే ఏడాది పడితే, ఎప్పుడు మరమ్మత్తులు చేస్తారు, ఎప్పుడు నీరందిస్తారు.ఈ రెండేళ్లు ప్రకృతి సహకరించింది.. రేపు ప్రకృతి సహకరించకుంటే పరిస్థితి ఏంటి? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

మన తెలంగాణ 21 Apr 2026 6:08 pm

నిరుపేద కుటుంబానికి భరోసాగా పి.4..

నిరుపేద కుటుంబానికి భరోసాగా పి.4.. పి.4.మార్గదర్శి బొండా సిద్ధార్థ పాయకాపురం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:07 pm

మావూరి మట్టి సింగారం పుస్తక ఆవిష్కరణ.. ఎమ్మెల్యేకు ఆహ్వానం

మావూరి మట్టి సింగారం పుస్తక ఆవిష్కరణ.. ఎమ్మెల్యేకు ఆహ్వానం తొర్రూరు టౌన్, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:01 pm

నారాయణపేటలో లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఆర్డీఓ..

నారాయణపేటం అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి చేప చిక్కింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంపై మంగళవారం ఎసిబి అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్డీఓ రామచందర్ నాయక్ ను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏకకాలంలో ఆర్డీఓ నివాసం, కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. పట్టుబడిని ఆర్డీఓను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే, వికారాబాద్ జిల్లా కేంద్రం మహిళా పోలీస్ స్టేషన్ లోనూ ఎసిబి అధికారులు దాడులు చేశారు. సీఐ, ఎస్ఐ.. బాధితుల నుంచి ఆన్ లైన్ లో డబ్బులు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.

మన తెలంగాణ 21 Apr 2026 5:57 pm

నేటితో ముగియనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారం

మరికాసేపట్లో తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగియనుంది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 5:47 pm

Ram Charan’s Peddi Shoot Update

Mega Powerstar Ram Charan’s highly awaited Pan-India project Peddi is steadily marching towards the finish line. Electrifying fans across social media, Ram Charan shared a couple of striking behind-the-scenes selfies with director Buchi Babu Sana, officially confirming that the film is only six days away from wrapping up its principal photography. The pictures offer a […] The post Ram Charan’s Peddi Shoot Update appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 5:42 pm

బిజెపి నిజంగానే పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టిందా….

– మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఫైర్ పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది మహిళా బిల్లెనా అని, 2023 లో పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళ బిల్లును తిరిగి ఎలా ప్రవేశపెడతారని, కేవలం ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలలో ఓట్లు రాబట్టుకునేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఫైర్ అయ్యారు. ఏపీ ప్రజానాట్యమండలి కోస్తా జిల్లాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు ఒంగోలులో ప్రారంభమవుతున్న నేపథ్యంలో, […] The post బిజెపి నిజంగానే పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టిందా…. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 5:39 pm

Telangana : ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు.. ఆ రెండు మినహా

ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభమయ్యాయి

తెలుగు పోస్ట్ 21 Apr 2026 5:33 pm

ఘనంగా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..

పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని నాగులూరు గ్రామం వద్ద గల రూపా రాజా పిసిఎన్ఆర్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ గ్రాజియేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరములు విద్యార్థులు చేసిన ప్రయాణాన్ని కు గుర్తుగా, ఆనందంగా, ఉత్సాహభరితంగా, జ్ఞాపకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రతిభగర పరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. […] The post ఘనంగా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 5:31 pm

ముఖ గుర్తింపు వ్యవస్థతో ఉపాధి కూలీలకు ఇబ్బందులు

ముఖ గుర్తింపు వ్యవస్థతో ఉపాధి కూలీలకు ఇబ్బందులు టేకుమట్ల, ఆంధ్రప్రభ : ముఖ

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:29 pm

మృతుని ఆచూకీ తెలపండి : సిఐ శ్రీ హర్ష

మృతుని ఆచూకీ తెలపండి : సిఐ శ్రీ హర్ష రాప్తాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:27 pm

రైతు భరోసా సభ విజయవంతం…

రైతు భరోసా సభ విజయవంతం… ప్రజలకు మంత్రి శ్రీధర్‌బాబు కృతజ్ఞతలు… కాటారం రూరల్,

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:22 pm

Kerala : కేరళలో త్రిసూర్ లో భారీ పేలుడు.. ఆరుగురి మృతి

కేరళలో త్రిసూర్ లో భారీ పేలుడు సంభవించింది. ఆరుగురు మరణించారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 5:19 pm

TG |సమ్మెపై సర్కార్ క్లారిటీ..

TG | సమ్మెపై సర్కార్ క్లారిటీ.. ఆర్టీసీ సమ్మెపై కీలక ప్రకటన! TG

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:08 pm

22-carat |బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..

22-carat | బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. 22-carat | వెండి ధరల

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:04 pm