రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు..
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రారంభమవుతోంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు. గత సంవత్సరం ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించామని సిఎం గుర్తు చేశారు. ఈ ఏడాదిలో రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా అందరూ ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సిఎం అన్నారు.
ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.. ములకలపల్లి, ఆంధ్రప్రభ : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ
హిల్ట్, టిడిఆర్పై ఏ విచారణకైనా సిద్ధం ఏ విచారణ కావాలో ప్రతిపక్ష నాయకులు లేఖ ఇవ్వాలి విచారణకు వెనకాడినా, వెనక్కి తగ్గినా క్షమాపణ చెబుతాం విపక్ష నేత సమయం, సందర్భం లేకుండా నచ్చినట్లు మాట్లాడుతున్నారు ఎంతో కష్టపడి కెసిఆర్ను మహబూబ్ నగర్ ఎంపిగా గెలిపించాం ఆరు గ్యారంటీల్లో ఒక్కటి మినహా అన్నీ అమలు చేస్తున్నాం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సిఎం రేవంత్రెడ్డి ధన్యవాదాల తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం.. వాయిదా మనతెలంగాణ/హైదరాబాద్: నన్ను తొక్కాలనుకున్న వారిని తొక్కుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చానని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. అలాగే, 2029లో కూడా మళ్లీ బరాబర్ తొక్కుకుంటూ మళ్లీ అధికారంలోకి వస్తామని, 2034 వరకు తామే అధికారంలోకి ఉంటామని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తాను వారసత్వంగా పదవిలోకి వచ్చిన వ్యక్తిని కాదన్నారు. మీ మాదిరిగా ఎవరి దయాదాక్ష ణ్యాలతో ఈ స్థాయికి రాలేదన్నారు. కనీసం వార్డుమెంబర్గా కూడా గెలవని వ్యక్తిని వైఎస్ఆర్ దయవల్ల ఏకంగా మత్రి అయ్యారని హరీష్రావును దెప్పిపొడుస్తూ, సిరిసిల్లలో కెటిఆర్ చంద్రబాబు దయతో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారని సిఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. నేను ఎంతో కష్టపడి కెసిఆర్ను మహబూబ్నగర్ ఎంపిగా గెలిపించానని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇప్పటికే ఎన్నోసార్లు బుద్ధిచెప్పారని సిఎం అన్నారు. ప్రజలు తమ తీర్పుతో ఎన్నిసార్లు బుద్దిచెప్పినా బిఆర్ఎస్ నేతల తీరు మారడం లేదన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు పరివారం, పలహారం అన్నట్టుగా సాగిందని సిఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాత్రి సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పైన ముఖ్యంగా కెసిఆర్, కెటిఆర్, హరీష్రావుల వైఖరిలను ఎండగడుతూ సిఎం రేవంత్రెడ్డి నిప్పులు చెరిగారు. జీతభత్యాలపై సభలో చర్చ జరగాలి జీతభత్యాలపై సభలో చర్చ జరగాలని సిఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉంటూ ఇప్పటివరకు కెసిఆర్ డిసెంబర్ 1, 2023 నుంచి 1 కోటి 6 లక్షల 56 వేల 674 రూపాయలు జీతభత్యాలు పొందారని, విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కెసిఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని, విధులకు హాజరుకాకుండా ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో తీసుకునే వారిపై సభలో చర్చ జరగాలని ఆయన అన్నారు. దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీపై సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తులతో విచారణకు సిద్ధం హిల్ట్, టిడిఆర్లపై ఏ విచారణకైనా సిద్ధమని అసెంబ్లీలో సిఎం రేవంత్రెడ్డి బిఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. పారిశ్రామిక బదలాయింపులపై 2014 నుంచి ఇప్పటివరకు హిల్ట్ పాలసీపై విచారణకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. దీనిపై ఏ విచారణ కావాలో ప్రతిపక్ష నాయకులు లేఖ ఇవ్వాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. హిల్ట్ పాలసీపై సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తులతో విచారణ చేయించడానికి సిద్ధమని, కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపించేందుకే హిల్ట్ పాలసీ తెచ్చామని సిఎం తెలిపారు. దీంతోపాటు టిడిఆర్ పాలసీపై కూడా విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విచారణకు వెనకాడితే, వెనక్కి తగ్గితే క్షమాపణ చెబుతామన్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా తెలంగాణ ‘పాలసీ డాక్యుమెంట్’ను ఆవిష్కరించామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అసెంబ్లీలో చేసిన ప్రసంగం చారిత్రాత్మకమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు పోలేదని బిఆర్ఎస్ పార్టీ తీరుపై సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షం కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుందనుకున్నానని, కానీ, వారు నియంత పోకడలతో బిఆర్ఎస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. విపక్షనేత సమయం, సందర్భం లేకుండా నచ్చినట్లు మాట్లాడుతున్నారని సిఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులని ఆయన తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి, అధికారం పీకేసినా అదే అహంకారంతో వ్యవహారిస్తున్నారని సిఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షం నియంతృత్వ ధోరణితో అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారనుకున్నామని, కొత్త గవర్నర్ను కలవడానికి ప్రతిపక్ష నేత కెసిఆర్ వస్తారనుకున్నామని, ఆయన రాకపోగా సభ సంప్రదాయాలను గౌరవించకపోడం తెలంగాణ సంస్కృతికి పూర్తి విరుద్ధమని సిఎం రేవంత్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. విపక్షాల తీరు 4 కోట్ల తెలంగాణ ప్రజలను నిరాశపరిచేలా ఉందన్నారు. విపక్ష నేత తీరు రాష్ట్రానికి మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్షం నియంతృత్వ ధోరణితో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని సిఎం ధ్వజమెత్తారు. కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభను తప్పుదోవ పట్టించడమే విపక్షాల పనిగా మారిందని ఆయన ఫైర్ అయ్యారు. ఏఐ సంక్షోభం ముంచుకొస్తుంది ఏఐ సంక్షోభం ముంచుకొస్తుందని, ఏఐ ద్వారా లక్షలాది ఉద్యోగాలు పోయి నిరుద్యోగ సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా విజన్ డాక్యుమెంట్ను సభలో ప్రవేశపెట్టామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఏ ప్రణాళికలోనైనా రాజకీయం, స్వార్థం, అధికారం కోల్పోయామన్న బాధనే విపక్షాల మాటల్లో కనిపిస్తోందని ఆరోపించారు. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047లో తెలంగాణను మూడు భాగాలుగా విభజించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడిదారులు ఎక్కువగా హైదరాబాద్ వైపు చూస్తున్నారని, అందుకు తగ్గట్టుగానే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. క్యూర్ను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ అర్బన్ ప్రాంతం క్యూర్ను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లోని పరిస్థితులు మనకు కనువిప్పు కావాలన్నారు. ముందుచూపులో భాగంగానే హైదరాబాద్లో చెరువులను పునరుద్ధరిస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. చెరువులను కబ్జాల చెర నుంచి విడిపించి పునరుజ్జీవనం చేస్తున్నామని, బతుకమ్మకుంట, నల్లచెరువు, బుమ్రుఖ్ఉద్దౌలా చెరువులను పునరుద్ధరించామని సిఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు హైదరాబాద్లో నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని గతంలో కెసిఆర్ ప్రకటించారని ముఖ్యమంత్రి తెలిపారు. నాలాలపై నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చాలని గతంలో కెటిఆర్ ఆదేశాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ కార్యాచరణనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. గతంలో వాళ్లు చెప్పిన మాటలనే ఇవాళ తప్పుపడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బిజెపి నేతలు సబర్మతి, గంగానది, యమున ప్రాజెక్టులను సమర్థించి మూసీ ప్రాజెక్టును ఎందుకు తప్పుపడుతున్నారని సిఎం ప్రశ్నించారు. హైదరాబాద్లో ముంపు, కాలుష్యం సమస్యను పరిష్కరించాలని నిర్ణయించినట్లు సిఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే భారీ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. భవిష్యత్ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు భవిష్యత్ ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని సిఎం రేవంత్రెడ్డి గుర్తు చేశారు. విద్య, సాగునీటి రంగాలకు కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే దేశంలో అనేక భారీ ప్రాజెక్టులు, ప్రముఖ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు వెలిశాయని ఆయన పేర్కొన్నారు. నాడు దొరల ఆధీనంలో ఉన్న భూములను సైతం ఇందిరాగాంధీ పేదలకు పంచిపెట్టారని సిఎం రేవంత్రెడ్డి గుర్తు చేశారు. హరిత విప్లవం ద్వారా ఆకలి తీర్చడమే కాదు, దేశంలో సరిపడా ఆహార ఉత్పత్తి జరిగేలా చేశారన్నారు. ఫలితంగా ఇతర దేశాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరిందని ఆయన వివరించారు. ఇందిరాగాంధీ పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారని, ఆమె హయాంలో గరీబీ హఠావో, 20 సూత్రాల పథకం వంటివి మైలురాళ్లుగా నిలిచాయని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం మత కల్లోలాలతో ఉందని ఆయన కేవలం వారసత్వంగా ప్రధాని కాలేదని రేవంత్ అన్నారు. విద్య, సాగునీటితోనే దేశం ముందుకు వెళ్తుందని నెహ్రూ నమ్మారని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1950 నుంచి 1990 వరకు నెహ్రూ, ఇందిరా గాంధీల సేవలు దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయని, 1990 తర్వాతే భారత్ ప్రపంచంతో పోటీ పడే స్థాయికి చేరుకుందని ఆయన తెలిపారు. అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదని, తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి అని ఆయన అన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళికగా ఆయన తెలిపారు. అటువంటి గొప్ప సంకల్పాన్ని, పవిత్ర శాసన సభ వేదిక నుంచి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శుక్లాకు ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు. అప్పట్లో అక్రమం, ఇప్పుడు సక్రమం ఎలా అయ్యిందో చెప్పాలి గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై సభలో కెసిఆర్, కెటిఆర్లు మాట్లాడిన మాటలను సభకు సిఎం రేవంత్రెడ్డి వినిపించారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయాలని వారు మాట్లాడారని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. అప్పుడు సక్రమం అని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయ్యిందని సిఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మీరు మాట్లాడిన మాటలను ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకున్నారా? మూసీ ఉప్పల్ భగాయత్ లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూసొద్దాం రండి, ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసే వారికి పన్ను మినహాయించామని ఆయన తెలిపారు. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నామని, మన నగరాన్ని మనం పరిరక్షించుకోకపోతే, చెరువులను పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరం మనల్ని క్షమించదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్కార్డులు ఇవ్వలేదు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నందునే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని సిఎం అన్నారు. 1,200 మంది యువత బలిదానాలతో తెలంగాణ వచ్చిందని, పేద యువత కష్టపడి గ్రూప్-1 ఉద్యోగాలు సాధిస్తే వాటిపై కూడా కేసులు వేశారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్కార్డులు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్కార్డులు ఇవ్వలేదని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 13 లక్షల కొత్త రేషన్కార్డులు ఇచ్చి, సన్నబియ్యం కూడా ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్కు మూడు బుల్లెట్ రైళ్లు ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ రహదారి నంబర్ కూడా కేటాయించారని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు.హైదరాబాద్కు మూడు బుల్లెట్ రైళ్లు రానున్నాయని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. నగరానికి పరిశ్రమలు తీసుకురావడానికి రేడియల్ రోడ్లు వేస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వేసే రోడ్లను కూడా తప్పు పడుతున్నారన్నారు. రైతును రాజుగా చేసేందుకే రూరల్ అగ్రికల్చరల్ రీజియన్పై దృష్టి సారించామన్నారు. టాటా సంస్థతో కలిసి ఐటీఐలను ఏటిసిలుగా అభివృద్ధి చేసి యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారం సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యిందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని గతంలో కెసిఆర్ స్వయంగా శాసనసభలోనే చెప్పారన్నారు. మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల రుణాలు ఇచ్చామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. మహిళా సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ కోసం రూ.1,900 కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వేసే రోడ్లను కూడా తప్పు పడుతున్నారని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. నగరానికి పరిశ్రమలు తీసుకురావడానికి రేడియల్ రోడ్లు వేస్తున్నామని సిఎం అన్నారు. దేశంలో 9వ స్థానానికి హైదరాబాద్ మెట్రో అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ లేదని, బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు మెట్రో విస్తరణను పట్టించుకోలేదని సిఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. మెట్రోను విస్తరించేందుకు తాము ఎంతో కష్టపడుతున్నామన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ మెట్రో ఢిల్లీ తర్వాత రెండోస్థానంలో ఉండేదని, హైదరాబాద్ మెట్రో ఇప్పుడు దేశంలో 9వ స్థానానికి పడిపోయిందన్నారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటే బిఆర్ఎస్ వాళ్లు ఓఆర్ఆర్ను అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఈనెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు. 20వ తేదీన బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది. ఇలా ఉండగా శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి శ్రీధర్బాబు మాట్లాడారు.
కాకరేపుతున్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఎమ్మెల్యేగా గెలవని జగ్గారెడ్డి వంద సీట్లు గెలిపిస్తాడా? మొన్న నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిపై విమర్శలు తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు పార్టీలో బీసీ నేతల పట్ల అక్కసు ఎందుకని మండిపాటు కాంగ్రెస్ వర్గాలలో అసెంబ్లీ లాబీలలో దీనిపైనే చర్చ పార్టీ పెద్దలు కూడా సీరియస్గా తీసుకున్నట్టు సమాచారం మన తెలంగాణ/ హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చిచ్చుకు, చర్చకు దారితీసాయి. పీసీసీ అధ్యక్షునిగా మహేష్కుమార్గౌడ్ స్థానంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నియమిస్తే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా చిట్చాట్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీగా సమీకరణలు ఉపందుకున్నాయి. ఇటు పార్టీ వర్గాలలో, అటు అసెంబ్లీ లాబీలలోనూ బుధవారం ఈ అంశంపైనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లడమే కాకుండా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో పార్టీపరంగా 56 శాతం అవకాశం కల్పించిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీకి సారధ్యం వహిస్తోన్న బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ నాయకత్వాన్ని తక్కువ చేసే విధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీలో బీసీల మనోవభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆ సామాజివర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు మండిపడుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పున్నా కైలాష్ నియమాకాన్ని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఒక కార్యక్రమంలో బహిరంగ సభలో అవమానించిన ఉదంతాన్ని తాజా వ్యాఖ్యల నేపథ్యంలో గుర్తు చేస్తున్నారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలువలేని జగ్గారెడ్డి, రాష్ట్రంలో వందసీట్లు ఎలా గెలిపిస్తారని బీసీ నాయకులు మంత్రి వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షునిగా నియామకం అయిన బీసీ నేత, పొన్నాల లక్ష్మయ్యను నల్లగొండ జిల్లా ప్రచారానికి రావద్దని అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు ఆ జిల్లాకు చెందిన రెడ్డి నాయకులు సహాయ నిరాకరణ చేశారని పార్టీలో బీసీ నేతలు గుర్తు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షునిగా మహేశ్కుమార్గౌడ్ ,సీఎం రేవంత్రెడ్డి వీరిద్దరూ సమన్వయం తో పని చేస్తూ ప్రతి ఎన్నికలలోనూ వరుస విజయాలు సాదించినప్పటికీ, కొత్త పీసీసీ అధ్యక్షునిగా జగ్గారెడ్డిని నియమించాలని బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలలోకి, ముఖ్యంగా బీసీ సామాజికవర్గలోకి తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా ఉన్నాయని పార్టీ అధిష్టానం కూడా సీరియస్గా తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. మంత్రి కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన రోజు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో సమావేశం కావడంతో ఈ వ్యాఖ్యల విషయంపై కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. గతంలో పీసీసీ అధ్యక్షునిగా రేవంత్రెడ్డి నియామకం అయినప్పుడు కూడా పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా కోమటిరెడ్డి ఇదే మాదిరిగా తీవ్ర ఆరోపణలు చేసిన విషయాన్ని పార్టీ పెద్దలవద్ద ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. తన శాఖకు సంబంధించి జీవోలు తనకు తెలియకుండానే వస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. మంత్రి క్రమశిక్షణారిహిత్యాన్ని అధిష్టాన పెద్దలు కూడా సీరియస్గా తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలు భారీ వర్షానికి 150 మేకల మృత్యువాత దెబ్బతిన్న కూరగాయలు, మొక్కజొన్న, వరి ఈదురుగాలులకు నేలరాలిన మామిడి హైదరాబాద్లోనూ వర్షం 22 వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక రాష్ట్రంలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన అకాల వర్షాలు అపార నష్టాన్ని కలిగించాయి. వడగండ్ల వానలు అన్నదాతకు కడగండ్లనే మిగిల్చాయి. వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో అనేక చోట్ల మొక్కజొన్న నేలకొరిగింది. మామిడి నేలరాలింది. కూరగాయల సాగు దెబ్బతినింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి మూగజీవాలు బలయ్యాయి. వికారాబాద్ జిల్లా పుడూరు మండలంలో 150 మేకలు చనిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్, వనపర్తి, గద్వాల తదితర జిల్లాల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. మన తెలంగాణ / న్యూస్ నెట్వర్క్ : అకాల వర్షంతో రైతులకు అపారనష్టం కలిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన వివిధ రకాల పంట చేతికొచ్చే దశలోనే ప్రకృతి కన్నెర్ర చేసింది. వడగండ్లు, ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షం రైతులకు శాపంగా మారింది. హైదరాబాద్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్, వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున పంటనష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, మంగపేటల్లో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలరాలింది. వీణవకంలోన అపర పంట నష్టం జరిగింది. నర్సింగాపూర్లో మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. కొన్ని చోట్ల మామిడి పిందెలు రాలిపోవడంతో రైతులు ఆవేన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వడగండ్ల వానకు చేతికి వచ్చిన పంట నేల రాలింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో అకాల వర్షానికి మిర్చి రైతులు విలవిలలాడారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో మంగళవారం రాత్రి సమయంలో పిడుగు పడి ఆవు మృతి చెందింది. అకాల వర్షానికి, ఈదురు గాలులకు మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. వడగండ్ల వానకు సదాశివపేట మండల పరిథిలోని నాగులపల్లిలోని ప్రాథమిక పాఠశాల గోడ కూలింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మార్కెట్ యార్డులో రైతుల కంది పంట తడిసి ముద్దయింది. 150 మేకలు మృత్యువాత వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని నిజాంపేట్మేడిపల్లి గ్రామ శివార్లో నియోజకవర్గంలోని చౌడాపూర్ మండలం కొత్తపల్లిలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులకు మేకలు మృతి చెందాయి. పరిగి మండల పరిధిలోని ఆయా గ్రామాలలో తీవ్రంగా పలు రకాల పంటలు, కూరగాయలు నేలమట్టమై నష్టం వాటిల్లింది. పాల్కంపల్లి, నర్సయ్యగూడ, రాపోల్, తదితర గ్రామాల్లో వేసిన పంట పూర్తిగా దెబ్బతింది. నర్సయ్యగూడలో పిడుగు పడి గ్రామంలో ప్యాట శ్రీనివాస్కు చెందిన రూ. 60 వేల విలువ చేసే ఆవు మృతి చెందింది. షాద్ నగర్ నియోజకవర్గంలో మామిడి తోట, వరి, మొక్కజొన్న, టమాట మిరపకాయ వంటి పంటలు దెబ్బతిన్నాయి.
ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు
ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి హతం బషెర్ అణు కేంద్రంపై దాడులు గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ దాడుల్లో ఖతార్ చమురు క్షేత్రం ధ్వంసం కువైట్ యువరాజుతో ప్రధాని మోడీ చర్చలు హర్మూజ్ జలసంధి భద్రతకే ప్రాధాన్యమని స్పష్టీకరణ జెరూసలెం: ఇజ్రాయెల్ సైనిక దాడులలో బుధవారం ఇరాన్ ఇంటలిజెన్స్ వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. టెహరాన్ వద్ద ఇజ్రాయెల్ తెల్లవారుజామున భీకర దాడులకు దిగింది. ఈ క్రమంలో ఇంటలిజెన్స్ మంత్రి హతులయాయరని వివరించారు. ఇది ఇరాన్కు అత్యున్నత స్థాయి నష్టం అని విశ్లేషించారు. తమ దాడులు మరింత విస్తృతం అవుతా యి. శత్రుపక్షాలు విస్తుపోయ్యేలా దెబ్బతీస్తామని ఇజ్రాయెల్ మంత్రి తెలిపారు. ఇరాన్ అత్యున్నత స్థాయి భద్రతా సంబంధిత వ్యక్తులు హతులు కా వడం వరుసగా రెండురోజుల్లో ఇది రెండో ఘటన అయింది. అయితే ఖ తీబ్ మృతిని ఇరాన్ అధికారికంగా నిర్థారించలేదు. ఇరాన్ బలగాలు బుధవారం పర్షియన్ గల్ప్, ఇజ్రాయెల్పై దాడులను ఉధృతం చేశాయి. వరుసగా మూడోరోజు కూడా ఇరాన్ విరుచుకుపడింది. టెల్ అవీవ్ వద్ద జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఇరాన్ అత్యంత అధునాతన మిస్సైల్స్ను ఈ క్రమంలో ప్రయోగించింది. ఇవి అన్ని కూడా ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులను తట్టుకుంటూ, తప్పించుకుంటూ ముందుకు సాగాయి. పరస్పర దాడుల తీవ్రతతో ఇప్పటి పోరు ఎప్పటిలోగా ఆగిపోతుందో తెలియని స్థితి నెలకొంది, మరో వైపు ఇజ్రాయెల్ లెబనాన్లో తమ దాడులను ముమ్మరం చేశాయి. ఇరాన్ మద్దతుగల హెజ్బోల్లా మిలిటెంట్లను గురిచేసుకున్నాయి. బీరూట్ ఇతర ప్రాంతాలో బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసం అయ్యాయి. ఇరాన్లో బషేర్ అను విద్యుత్ కేంద్రం ఆవరణపై ఓ క్షిపణి దాడి జరిగింది. ఈ క్రమంలో ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం అణు ధ్వంసం జరగలేదని వెల్లడైంది. అణు ప్రమాదాలు జరగకుండా వ్యవహరించాలని ఇరుపక్షాలకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) చీఫ్ రాఫెల్ గ్రాసీ విజ్ఞప్తి చేశారు, ఇరాన్ నుంచి అందిన సమాచారంతో ఆయన స్పందించారు. ఇరాన్లో ఇజ్రాయెల్ తరఫున వేగు చర్యలకు పాల్పడుతున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తికి మరణశిక్ష అమలు చేశారు. ఇజ్రాయెల్ మోసాద్ సంస్థకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడని పేర్కొంటూ కైరోష్ కెవ్యానిని చంపివేశారు. ఇరాన్కు చెందిన కీలక ప్రాంతాలను మోసాద్ గూఢచార సంస్థకు అందించాడనే విషయాన్ని నిర్థారించుకుని శిక్ష అమలు చేశారు. కోర్టు కాంప్లెక్స్పై దాడులు.. పౌరులు సిబ్బంది మృతి బుధవారం మధ్యాహ్నం ఇరాన్లోని లారెస్తన్లో ఓ కోర్టు కాంప్లెక్స్పై ఇజ్రాయెల్, అమెరికా సేనలు దాడులకు దిగాయి. కార్యాలయం పనిచేస్తున్న సమయంలో దాడులు జరిగాయి. ఈ దాడులలో పౌరులు, సిబ్బంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారని తెలిపారు. అమెరికా సైనిక స్థావరాలతో ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణుల దాడులు నిర్ణీత ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సౌదీలోని విస్తారిత తూర్పు ప్రాంతంపై ఇరాన్ దాడి జరిపింది. అక్కడి చమురు క్షేత్రాలపై , కువైట్, బహరైన్ లోని సైనిక కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. సౌదీ అరేబియా పలు బాలిస్టిక్ క్షిపణులను నేల కూల్చింది. ప్రత్యేకించి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్ వైపు దూసుకువచ్చిన క్షిపణులను దెబ్బతీశారు. ఇక్కడ అమెరికా సైనిక బలగాలు, ఓ యుద్ధ విమానం ఉంటుంది. రియాద్లో ఓ దౌత్య సిబ్బంది క్వార్టర్స్పై దాడి జరిగింది. ఇక్కడ అమెరికా ఎంబసీ వారు, ఇతర విదేశీ దౌత్య సిబ్బంది నివాసం ఉంటున్నారు. లారిజనీ హత్యకు ప్రతీకారం మరో వైపు బుధవారం ఇరాన్ ఇజ్రాయెల్పై పలు ప్రతీకార దాడులకు దిగింది. తమ దేశ అత్యంత శక్తివంతమైన జాతీయ భద్రతా మడలి కార్యదర్శి లారిజనిని ఇజ్రాయెల్ దాడులలో చంపివేయడంపై భగ్గుమంటూ దాడులు జరిగాయి. సెంట్రల్ ఇజ్రాయెల్పై తాము పలు వార్హెడ్స్తో దాడికి దిగినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులలో మృతి చెందిన లారిజనీ, ఖతీబ్లపై అమెరికా ఇప్పటికే అమెరికా నుంచి నిషేధిత వ్యక్తుల కఠిన చర్యలు ప్రకటించింది. బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ మరోసారి దాడులకు దిగింది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ వివరాల ప్రకారం ఇప్పటివరకూ జరిగిన దాడులలో 1300 మందికి పైగా ఇరానీయన్లు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. నిర్వాసితులు అయ్యారు. ఇజ్రాయెల్ సైనిక దాడులు.. ఇరాన్, ఖతార్ చమురు క్షేత్రంలో మంటలు దుబాయ్: ఇరాన్, ఖతార్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న సముద్ర తీర సహజవాయువు ఉత్పత్తి కేంద్రం సౌత్ పార్స్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ బుధవారం దాడులకు దిగింది. ఈ ఘటనపై ఖతార్ తీవ్రంగా మండిపడింది. ఇజ్రాయెల్ చర్యను ఖండిస్తున్నామని ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ ప్రకటన వెలువరించారు. ఈ ఫీల్డ్కు చెందిన ఇరాన్ వైపు ఉన్న భాగం దగ్ధం అయిందని తెలిపారు. ప్రస్తుత విస్తారిత ఉద్రిక్తతల దశలో ఇటువంటి దాడుల ఘటన అత్యంత ప్రమాదకరం అని అల్ అన్సారీ విమర్శించారు. ప్రపంచ ఇంధన వ్యవస్థకు ఇది పెను ముప్పు కల్గిస్తుంది. బాధ్యతారహిత ఘటన అని తెలిపారు. ఇరాన్ జరిపిన దాడులలో దుబాయ్ వద్ద ఉన్న తమ స్థావరంలో కొద్దిగా మంటలు చెలరేగాయని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనెస్ వెల్లడించారు. అయితే ఎటువంటి నష్టం జరగలేదన్నారు. పశ్చిమ దేశాలకు మార్గమధ్యపు మజిలీ అయిన అల్ మిన్హాద్ ఎయిర్ బేస్ వద్ద పేలుళ్లు జరిగాయి. సౌదీ అరేబియాకు చెందిన సమ్రేఫ్ రిఫైనరీ, జుబాలీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, అరబ్ ఎమిరేట్స్కు చెందిన అల్ హసన్ గ్యాస్ ఫీల్డ్ , ఖతార్లోని రిఫైనరీ, పెట్రో కెమికల్ విభాగాలను దెబ్బతీస్తామని ఇరాన్ హెచ్చరించింది. కువైట్ యువరాజుతో ప్రధాని మోడీ చర్చలు న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం కొనసాగుతున్న నేపథ్యంలో కువైట్ యువరాజు షేక్ అల్ ఖలేద్ తో టెలిఫోన్ ద్వారా ప్రధాని నరేంద్రమోడీ సంభాషించారు. పశ్చిమాసియాలో యుద్ధం మూడు వారాల క్రితం ప్రారంభమైన తరువాత కువైట్ యువరాజుతో మోడీ మాట్లాడడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సురక్షితంగా,స్వేచ్ఛగా సాగడమే తమ ప్రథమ ప్రాధాన్యతగా మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవల ఎదురవుతున్న సవాళ్లపై ఇరువురు నేతలు తమ ఆందోళన పంచుకున్నారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం దౌత్యపరమైన చర్చలు, నిరంతరం కొనసాగడం అత్యంత అవసరమని ఇరువురు ఏకీభవించారు. ఇదే క్రమంలో కువైట్లో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రత, సంక్షేమం కోసం కువైట్ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతుకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈద్ పండగను పురస్కరించుకుని కువైట్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ , రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం సాగుతున్న యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాకు చెందిన సౌదీ అరేబియా, బహ్రయిన్, యుఏఇ, ఒమన్, జోర్డాన్, ఇజ్రాయెల్, ఇరాన్ తదితర అనేక దేశాల నాయకులతో ప్రధాని మోడీ చర్చలు జరిపారు.
పారిశ్రామిక ప్రగతికి ‘భవ్య’ పథకం
రూ.33,600 కోట్లతో కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ చిన్నతరహా జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.2,585 కోట్లు ఉత్తరప్రదేశ్కు మరో జాతీయ రహదారి న్యూఢిల్లీ ః కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన(భవ్య) పథకాన్ని ఆవిష్కరించింది. రూ 33,600 కోట్ల ఈ పథకానికి కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ తరువాత విలేకరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో పారిశ్రామిక వాడలను చేపట్టి, ప్రారంభించేందుకు ఈ పథకం తీసుకువచ్చారు. ప్రత్యేకించి పారిశ్రామిక ప్రపంచ స్థాయి మౌలిక సాధనాసంపత్తి నెలకొల్పేందుకు , ఉత్పత్తి సామర్థం పెంచేందుకు , దేశ ప్రగతి పథం సక్రమ గతికి ఈ పథకం రూపొందించారని మంత్రి తెలిపారు. భవ్య స్కీంతో దేశవ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల వరకూ ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా కూడా ఉపాధికి అవకాశం ఉంది. వంద ఎకరాల నుంచి వేయి ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రీయల్ పార్క్ల ఏర్పాటుతో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది. ఒక్కో పార్క్కు వాటి స్థాయి బట్టి రూ కోటి వరకూ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని స్కీం గురించి మంత్రి తెలిపారు. రూ 2585 కోట్లతో చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి దేశంలో జలవిద్యుత్ ఉత్పాదన సంబంధిత చిన్న తరహా హైడ్రో పవర్ డెవలప్మెంట్ స్కీంను రూ 2585 కోట్లతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీం ద్వారా 1500 మైక్రోవాట్స్ మేర పునరుత్థాన ఇంధన ఉత్పత్తి లక్షం ఖరారు చేసుకున్నారు. దేశ పర్యావరణ పరిరక్షణ దిశలో ఈ స్కీంకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రజలు నిర్వాసితులు కాకుండా చేస్తూ, డ్యామ్ల నిర్మాణం లేకుండానే నదులపై ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారని మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఒక్కో జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా 1 మైక్రోవాట్ నుంచి 25 మైక్రోవాట్స్ మేర విద్యుత్ ఉత్పాదక సామర్థం ఉంటుంది. ఈ పధకాన్ని ఐదేళ్ల పాటు 203031 ఆర్థిక సంవత్సరం వరకూ అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పత్తి సేకరణ సామర్థం పెంపుదలకు చర్యలు తీసుకునే నిర్ణయానికి ఆమోదం తెలిపింది. దీని మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)కు రూ 1,718 కోట్లు కేటాయింపుల నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. యుపికి నాలుగులేన్ల రహదారి..హైవే 927 ఉత్తరప్రదేశ్కు ఉపయుక్తంగా ఉండేలా రూ 6969 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల జాతీయ రహదారినెంబరు 927 నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రహదారి ఉత్తరప్రదేశ్లోని బారాబంకి నుంచి బహరైచ్ వరకూ నిర్మిస్తారు. 101 కిలోమీటర్లకు పైగా ఉండే ఈ రోడ్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక, అత్యంత కీలక సంస్థల కేంద్రీకృత ప్రాంతాలకు మరింత రవాణా అనుసంధానత ఏర్పడుతుంది.
19thMarch2026 |గురువారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
19thMarch2026 | గురువారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 19thMarch2026 |
why2fight |పంచాంగ శ్రవణంలో ట్రంప్ కి పంచ్.
why2fight |పంచాంగ శ్రవణంలో ట్రంప్ కి పంచ్. why2fight | అధ్యక్షుడి ఆత్మశోధనకిదే
ugadi2026 |బాబుగారి కవిసమ్మేళనం-ఏపీ విజన్ సాక్షాత్కారం
ugadi2026 | బాబుగారి కవిసమ్మేళనం-ఏపీ విజన్ సాక్షాత్కారం ugadi2026 | ముఖ్యమంత్రే కవి…
April23 |మోడీగారి ధ్యేయం-తమిళనాట కమల వికాసం
April23 | మోడీగారి ధ్యేయం-తమిళనాట కమల వికాసం April23 | దక్షిణాదిలో కమలానికి
1ToAll |గ్యాస్ కోసం గుబులు… తీరేనా వంటింటి కష్టాలు?
1ToAll | గ్యాస్ కోసం గుబులు… తీరేనా వంటింటి కష్టాలు? 1ToAll |
అసద్ మిర్జా అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేసిన దాడులు భారతదేశాన్ని క్లిష్టపరిస్థితిలోకి నెట్టేశాయి. దౌత్యపరంగా కూడా భారత్ ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. ఒకవైపు ఇరాన్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు భారత్ వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. “వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి “ అంటూ గొప్పలు చెప్పుకున్న భారత్ ఈ సంక్షోభం సమయంలో మాత్రం స్పష్టమైన వైఖరి చూపలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ శక్తిగా నిలవాలంటే, భారత్ మరింత స్పష్టతతో సమగ్ర విధానంతో ముందుకు వెళ్ళాలి. కానీ భారత్ అలా చేయడం […] The post భారత్ దౌత్యం పై విమర్శలు appeared first on Visalaandhra .
ఆధునిక వ్యవసాయంలో ఆశలు, అగాధాలు
డా॥ సూర్యదేవర రామకృష్ణ ఒకప్పుడు రైతు అంటే తన పొలంలో పండిన పంటలో ఒక భాగాన్ని పవిత్రంగా దాచుకుని, వచ్చే కాలానికి విత్తనంగా వాడుకునే స్వయం శక్తిపరుడు. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. తెల్లవారుజామున విత్తనాల దుకాణం ముందు క్యూ కట్టే రైతు కనిపిస్తున్నాడు. సమకాలిక వ్యవసాయ రంగంలో విత్తన కంపెనీలు కేవలం విక్రేతలుగా మాత్రమే కాకుండా, వ్యవసాయ గమనాన్ని శాసించే శక్తులుగా ఎదిగాయి. అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత వంటి ఆకర్షణీయమైన మాటలతో విత్తన […] The post ఆధునిక వ్యవసాయంలో ఆశలు, అగాధాలు appeared first on Visalaandhra .
. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు. ఉన్నత జీవనస్థితి కల్పిస్తాం: అధికార పక్షం. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి వ్యతిరేకం: బీఆరఎస్. ప్రక్షాళనపై అట్టుడికిన శాసనసభ విశాలాంధ్ర – హైదరాబాద్: మూసీ ప్రాజెక్టుపై శాసనసభ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మూసీ ప్రక్షాళనపై వాదోపవాదాలు జరిగాయి. మూడోరోజైన బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మూసీ ప్రక్షాళన చేసి పరీవాహక ప్రజలకు ఉన్నతమైన జీవనస్థితి కల్పిస్తామని అధికార కాంగ్రెస్ చెబుతుండగా, మూసీ […] The post ‘మూసీ’పై మంటలు appeared first on Visalaandhra .
నియంత పోకడలతో ప్రజాస్వామ్యం అపహాస్యం
కేసీఆర్ సభకు రావాలిగవర్నర్ ప్రసంగం అభివృద్ధికి మార్గదర్శిభవిష్యత్లో ఏఐ సునామీ: సీఎం రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్ : రాజులు… రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు మాత్రం పోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇప్ప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారని తెలిపారు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని, ప్రజలే తప్ప్పు చేశారని అనుకుంటున్నారని పేర్కొన్నారు. శాసనసభను ఉద్దేశించి బుధవారం ఆయన మాట్లాడుతూ నియంత పోకడలను […] The post నియంత పోకడలతో ప్రజాస్వామ్యం అపహాస్యం appeared first on Visalaandhra .
పోలీసులకు టీఏ బకాయిలు చెల్లించండి
కూనంనేనివిశాలాంధ్ర- హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సరెండర్ లీవులు, టీఏ బకాయిలను పోలీసులకు త్వరితగతిన చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో బుధవారం జీరో అవర్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఖమ్మం జిల్లాలో కొంత వరకు బకాయిలు చెల్లించినప్పటికీ, కొత్తగూడెం జిల్లాలోని పోలీసులకు మాత్రం ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని, బకాయిలను ఎందుకు చెల్లించలేదో అర్ధం కాలేదన్నారు. కొత్తగూడెం పరిధిలోని 6వ బెటాలియన్లో సుమారు 450 మంది సిబ్బంది ఉన్నారని, […] The post పోలీసులకు టీఏ బకాయిలు చెల్లించండి appeared first on Visalaandhra .
‘ఎస్ఎల్బీసీ’ పూర్తి చేయండి : నెల్లికంటి
విశాలాంధ్ర- హైదరాబాద్ : నల్లగొండ జిల్లాపై చిన్న చూపు కూడకుండా రైతాంగానికి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు జీవనాడి అయిన ఎసఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనమండలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో కీలక ప్రాజెక్టులు నత్తనడకన సాగాయని, కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందనే భ్రమలో గత ప్రభుత్వం ఉండిపోయిందన్నారు. దీనివల్ల నల్లగొండ జిల్లాలోని […] The post ‘ఎస్ఎల్బీసీ’ పూర్తి చేయండి : నెల్లికంటి appeared first on Visalaandhra .
వ్యతిరేక కమిటీ ఏర్పాటువిశాలాంధ్ర- హైదరాబాద్ : ఇరాన్పై అమెరికా- ఇజ్రాయిల్ల యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్లోని మఖ్దుంభవన్లో ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన బుధవారం యుద్ధ వ్యతిరేక కమిటీ ఏర్పడింది. పశ్చిమాసియా మధ్య- ప్రాచ్యంలో ఈ యుద్ధం వల్ల తీవ్రస్థాయిలో ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా భారతదేశంలో తీవ్రమైన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వంట గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక నగరాలు పట్టణాల్లో […] The post యుద్ధం ఆపండి appeared first on Visalaandhra .
మూడోవిడతగా రూ.226 కోట్ల చెక్కు అందించిన సీఎం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వారి త్యాగ ఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతోందని అన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమయ్యారు. భూసేకరణ పునరావాస, పరిహార ప్యాకేజీ కింద మూడో విడతలో రూ.226.61 కోట్ల చెక్కును నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మూడో […] The post నిర్వాసితుల త్యాగ ఫలమే పోలవరం appeared first on Visalaandhra .
. భారీగా పెంచిన రవాణా చార్జీలు. సామాన్య ప్రయాణికుల ఇక్కట్లు. రవాణాశాఖ చోద్యం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వరుస పండగలు, వారాంతపు సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే సామాన్య ప్రయాణికులపై ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు నిర్దాక్షిణ్యంగా భారాలు మోపుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి నగరాలు, పల్లెలకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, టికెట్ ధరలను అమాంతం పెంచేస్తూ పండగ ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల నుంచి రాష్ట్రంలోని […] The post ప్రైవేట్ట్రావెల్స్ దందా appeared first on Visalaandhra .
28, 29 తేదీల్లో ఐజేయూ 11వ ప్లీనరీ
. 34 ఏళ్ల తర్వాత విజయవాడలో. ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీ సమావేశం ఈ నెల 28, 29 తేదీలలో విజయవాడ (అమరావతి)లో జరగనుంది. ఈ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి బల్వీందర్ సింగ్ జమ్ము, కార్యదర్శి డి సోమసుందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలకు చెందిన […] The post 28, 29 తేదీల్లో ఐజేయూ 11వ ప్లీనరీ appeared first on Visalaandhra .
23 సీట్లలో కాంగ్రెస్ పోటీ చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ ఐదు స్థానాల్లో పోటీ చేయనున్నది. ఈ మేరకు డీఎంకేతో ఒప్పందం కుదిరింది. సీట్ల సర్దుబాటుపై చర్పోచర్చల అనంతరం ఏకాభిప్రాయం కుదిరింది. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి భారత కమ్యూనిస్టు పార్టీ అంగీకరించింది. సీట్ల పంపకం ఒప్పందంపై డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్ సంతకాలు చేశారు. ఈ మేరకు డీఎంకే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అనంతరం […] The post తమిళనాట సీపీఐకి ఐదు స్థానాలు appeared first on Visalaandhra .
23న సామ్రాజ్యవాద వ్యతిరేక దినం: సీపీఐ
ఉపాధి హామీ పునరుద్ధరణకు ఏపీలో పాదయాత్ర: రామకృష్ణ న్యూదిల్లీ: బ్రిటిష్ పాలకులను గడగడలాడించి, ఉరికంబాన్ని ముద్దాడిన అమర వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ త్యాగాన్ని స్మరించుకుంటూ ‘షహీద్ దివన’ సందర్భంగా ఈనెల 23న సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని పార్టీ శ్రేణులకు సీపీఐ జాతీయ కార్యవర్గం పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వెనిజులా, ఇరాన్, పలస్తీనాపై అమెరికా యుద్ధోన్మాదాన్ని, ప్రపంచాన్ని శాశించాలనే ధోరణిని ఎండగట్టింది. ఈ విధానాలను ప్రతిఘటించడం అవసరమని […] The post 23న సామ్రాజ్యవాద వ్యతిరేక దినం: సీపీఐ appeared first on Visalaandhra .
ఏటా రూ.20 వేల కోట్ల బిసిల బడ్జెట్ ఏమైంది: తలసాని
ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామన్న కామారెడ్డి బిసి డిక్లరేషన్ పరిస్థితి ఏమిటి బిసి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజుల బకాయిలు పది వేల కోట్లు ఎప్పుడు ఇస్తారు 42 శాతం బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం కండితుడుపుగా వ్యవహరించింది శాసనసభ జీరో అవర్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గడచిన ఎన్నికలకు ముందు కామారెడ్డి బిసి డిక్లరేషన్లో తాము అధికారంలోకి రాగానే ప్రతి ఏటా రూ.20 వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్ను బిసిల కోసం కేటాయిస్తామని ఇచ్చిన వాగ్ధానం మేరకు ఇప్పటి వరకు ఎన్ని కోట్లు కేటాయించారో స్పష్టం చేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇలా ప్రతి ఏడాది బడ్జెట్లో రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు. శాసనసభలో బుధవారం జరిగిన జీరో అవర్లో సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న బిసిలకు మీరిచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని కోరారు. బిసి విద్యార్థులకు ఫీజులు అందక బకాయిలు పడి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. దాదాపు పది వేల కోట్లు ఫీజు బకాయిలు ఉన్నాయని తెలిపారు. తాను బిసిల ప్రతినిధిగా చెప్పే ఈ అంశం చాలా గంభీరమైందని పదే పదే చెబుతూ బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్దత లేకుండా బిసి రిజర్వేషన్లు ఎలా సాధ్యపడతాయని గతంలోనే తాము ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. చివరకు బిసిలంతా దగాపడి 42 శాతం రిజర్వేషన్లుకు నోచుకోని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. రానున్న రాష్ట్ర బడ్జెట్లో బిసిలకు ఎక్కువ కేటాయింపులు చేయడంతో పాటు బిసిలకు ఏటా రూ.20 వేల కోట్ల నిధుల కేటాయింపుపై ఇప్పుడైనా ప్రభుత్వం శాసనసభ వేదికగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిసిల పట్ల చులకన భావన వద్దని తలసాని కోరారు. సభ్యుడు తలసాని ప్రస్తావించిన అంశాలపై సభలో ఉన్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు స్పందిస్తూ సీనియర్ సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన అంశాలను తప్పకుండా సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళతానని అన్నారు. సీనియర్ సభ్యుడైన తలసానికి జీరో అవర్ అంటే తెలియనిది కాదని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం, సంబంధిత దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
శత్రువును సమర్థంగా ఎదుర్కొంటాం
. మా రాజకీయ వ్యవస్థను అస్థిరపర్చలేరు. గల్ఫ్ చమురు క్షేత్రాలపై గురి పెడతాం. లారిజానీ, సులేమానీ హత్యకు తీవ్రస్థాయిలో ప్రతీకారం. అమెరికా, ఇజ్రాయిల్కు ఇరాన్ హెచ్చరిక. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిని చంపేశాం: ఇజ్రాయిల్. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై అమెరికా దాడులు తెహ్రాన్: అగ్ర నాయకత్వాన్ని కోల్పోయినాగానీ అత్యాధునిక యుద్ధ తంత్రంతో శత్రువులను సమర్థంగా ఎదుర్కోగలమని, వ్యక్తులను కాదు పటిష్ట వ్యవస్థలను నమ్ముకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రాజకీయ వ్యవస్థను అస్థిరపర్చడం అంత సులువు కాదని ఆ దేశ […] The post శత్రువును సమర్థంగా ఎదుర్కొంటాం appeared first on Visalaandhra .
. లారిజానీ, సులేమానీ హత్యల ధ్రువీకరణ. ఇరాన్ కవచం ‘మొజాయిక్ డిఫెన్స’. వికేంద్రీకృత యుద్ధతంత్రంతో శత్రువులకు వణుకు తెహ్రాన్: అమెరికాఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో తమ జాతీయ భద్రతాధికారి అలీ లారిజానీ మరణించినట్లు ఇరాన్ ధ్రువీకరించింది. లారిజానీని హతమార్చినట్లు ప్రకటించిన ఇజ్రాయిల్, నూతన అధినేత ముజ్తబా ఖామేనీని వేటాడి చంపుతామంటూ ప్రతిజ్ఞ చేసింది. మాజీ అధినేత ఆయాతుల్లా అలీ ఖామేనీని కోల్పోయిన ఇరాన్కు లారిజానీ మరణం తీరని లోటు. అయినప్పటికీ ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. […] The post మా రక్షణకు ఢోకా లేదు appeared first on Visalaandhra .
70 మంది డిటిలకు తహసీల్దార్లుగా పదోన్నతి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 70 నయాబ్ తహశీల్దార్ల (డిటిలకు) తహసీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. మల్టీ జోన్-1లో 43, మల్టీజోన్ -2లో 27 మందికి ఈ పదోన్నతులు లభించాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సిసిఎల్ఏ కమిషనర్ లోకేశ్కుమార్బుధవారం జారీ చేశారు. పదోన్నతులు కల్పించడంపై తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టిజిటిఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ (టిజిఆర్ఎస్ఏ) నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తమ కృషి ఫలితంగానే 70 నయాబ్ తహశీల్దార్ల (డిటిలకు) తహసీల్దార్లుగా పదోన్నతి లభించిందని ఆయా సంఘాల రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, వి.భిక్షంలు పేర్కొన్నారు. ఈ పదోన్నతి ప్రక్రియకు సహకరించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, సిసిఎల్ఏ లోకేశ్కుమార్లకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారితో పాటు ఈ పదోన్నతుల ప్రక్రియలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసి చైర్మన్ వి.లచ్చిరెడ్డి కృషి ఎంతో ఉందని వారన్నారు.
తెలఅవీవ్: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించారు. తాను చనిపోలేదని నిరూపించుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఇజ్రాయిల్కు అమెరికా రాయబారి మైక్ హక్కబీతో కలిసి ఉన్న ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. అందులో నెతన్యాహుతో మైక్ మాట్లాడుతూ ‘మీరు చనిపోయారని వార్తలు వస్తుండటంతో వెళ్లి చూసి రమ్మని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను పంపారు’ అని అనడం… అందుకు నేను బతికే […] The post నేను బతికే ఉన్నా: నెతన్యాహు appeared first on Visalaandhra .
అక్రమ వలసదారులకు ‘ఎగ్జిట్ బోనస’
2,600 డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటన వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛందంగా అమెరికాను వీడితే ‘ఎగ్జిట్ బోనస’ ఇస్తామని ప్రకటించింది. అక్రమ వలసదారులకు ఈ ఆఫర్ను అమెరికా ఇస్తోంది. వారికి 2,600 డాలర్లు అంటే సుమారు రూ.2,40,329 నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తామని హోమ్ల్యాండ్ భద్రతా విభాగం వెల్లడించింది. అక్రమ వలసదారులు అమెరికా నుంచి వారి దేశాలకు వెళ్లిపోయేందుకు ఉచితంగా విమాన ప్రయాణ సౌకర్యాన్ని ట్రంప్ సర్కారు కల్పించనుంది. ఇందుకోసం ‘సీబీపీ హోమ’ యాప్లో […] The post అక్రమ వలసదారులకు ‘ఎగ్జిట్ బోనస’ appeared first on Visalaandhra .
మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం: ఆది శ్రీనివాస్
హైదరాబాద్: మూసి నది ప్రక్షాళన పూర్తైతే ఆ ప్రాజెక్టులో గల్లంతు అవుతామని కెటిఆర్ భయపడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేసి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎంఎల్ఎలు సామేలు, నాగరాజులతో కలిసి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కెటిఆర్ చిట్ చాట్ పేరిట చెత్త మాటలు మాట్లాడుతున్నారని, ఐఎఎస్, ఐపిఎస్ లను కెటిఆర్ భయపెడుతున్నారని విమర్శించారు బ్యూరోక్రసిని పట్టుకొని మీ పేర్లు పింక్ బుక్, ఆరేంజ్ బుక్, రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటున్నామని భయపెడుతున్నాడని అన్నారు. తమ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క అధికారికి ఇబ్బంది కలుగకుండా వారి సూచనలు తీసుకుంటూ ముందుకు పోతున్నామని, తమ కుటుంబ గొడవల ఫ్రస్టేషన్ను కెటిఆర్ అధికారులపై తీస్తున్నారని చెప్పారు. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి డ్రగ్స్ పరీక్షలకు నమూనాలు ఇవ్వడానికి సిద్ధం కావాలని ఆయన చెప్పారు. కెటిఆర్ పైలెట్ రోహిత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Ustaad Bhagat Singh Movie Review
Ustaad Bhagat Singh Movie Review Ustaad Bhagat Singh Movie Review Live Updates from USA Premiere show : 11:00 PM Humor that plays on Pawan Kalyan’s limited dancing abilities lands effectively. 10:45 PM Pawan Kalyan Police Station Entry scene is appealing. 10:30 PM Movie opens with childhood scenes of Pawan Kalyan Powerstar Pawan Kalyan and Harish […] The post Ustaad Bhagat Singh Movie Review appeared first on Telugu360 .
వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యహారంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వివాదాస్పద భూములకు సంబంధించి స్టేటస్కో కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తి బి. విజయ్సేన్ రెడ్డి ధర్మాసనం బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులందరికీ అక్కడే ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని బాధితులు చేసిన విజ్ఞప్తి పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ, బాధితుల్లో 311 మంది మాత్రమే కాదని, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు భూముల్లో అక్కడ స్టేటస్ కో కొనసాగించాలని జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహాశీల్దార్లకు ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ యజ్ఞ బోర్డు పట్టాలు ఇచ్చిన భూముల్లోనే ఇళ్లు కట్టుకున్నామని వాటిని ప్రభుత్వం ముందస్తు ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేసిందని తమకు న్యాయం చేయాలని 24 మంది ఖమ్మం పట్టణానికి చెందిన బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం భూదాన్ భూముల్లో యథాతథ స్థితిని ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఆక్రమణలు అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. సుమారు 31 ఎకరాల భూమిలో ఇళ్ల కూల్చివేతలు జరగగా, కోర్టు ఆదేశాలు పొందిన పది కుటుంబాలకు మినహాయింపునిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఖమ్మం రూరల్ మండలం వెలుగుమట్ల గ్రామం, వినోబా నవోదయ కాలనీ. 2014లో 800లకు పైగా పేద కుటుంబాలకు కేటాయించిన భూదాన్ భూములను ప్రభుత్వం అక్రమంగా భావించి, ఇటీవల కూల్చివేతలు చేపట్టింది. గతంలోనే ఇక్కడ ఇళ్ల కూల్చివేతలపై స్టేటస్ కో ఉన్నా, ప్రభుత్వం ఆక్రమణల పేరుతో చర్యలు చేపట్టిందని బాధితులు వాపోయారు. సుమారు 31.07 ఎకరాల భూదాన్ భూమిలో సుమారు 21 ఎకరాల వరకు ఆక్రమణకు గురైందని, గురుకుల పాఠశాల, కెజిబివిల కోసం ఈ భూమిని తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కాగా ఈ వివాదంపై హైకోర్టులో విచారణ జరుగగా కోర్టు స్పందించింది. గతంలో ఉన్న స్టేటస్ కో (యథాతథ స్థితి)ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.
అరంగేట్రం కోసం కుర్రాళ్ల ఎదురుచూపులు
ఐపీఎల్లో ఆ ఐదుగురిపైనే అందరి కళ్లు! న్యూదిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)`2026కు సర్వం సిద్ధమైంది. ఈసారి కూడా వేలంలో కోట్లు పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్లు, అండర్ 19 ప్రపంచకప్లో సత్తా చాటిన కుర్రాళ్లపైనే అందరి చూపు ఉంది. సీఎస్కే, ముంబై, ఆర్సీబీ వంటి దిగ్గజ జట్లు ఈసారి కొత్త ప్రతిభను వెలికితీసే పనిలో పడ్డాయి. మైదానంలో అడుగుపెట్టకముందే తమ స్థాయి ఏంటో నిరూపించుకున్న అద్భుత ప్రతిభ గల ఐదుగురు యువ ఆటగాళ్లు ఈ సీజన్లో మైదానంలోకి అడుగుపెట్టడానికి […] The post అరంగేట్రం కోసం కుర్రాళ్ల ఎదురుచూపులు appeared first on Visalaandhra .
ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఆధిపత్యం
ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మొదటి 5 బ్యాటర్లలోభారత్ నుంచి ముగ్గురులండన్: అంతర్జాతీయ క్రికెట్లో తాజా వన్డే ర్యాంకింగ్స్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ ) ప్రకటించింది. దీనిలో భారత ఆటగాళ్లు మరోసారి తమ సత్తా చాటారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో భారత్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్-5లో చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) అగ్రస్థానంలో నిలవగా… ఆయన తర్వాత విరాట్ కోహ్లీ (భారత్) రెండో స్థానంలో ఉన్నాడు. ఇబ్రాహీం జద్రాన్ (అఫ్గనిస్తాన్) మూడో […] The post ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఆధిపత్యం appeared first on Visalaandhra .
America Political Tornado జో కెంట్ రాజీనామా Andhra Prabha Detail Report
America Political Tornado జో కెంట్ రాజీనామా Andhra Prabha Detail Report
Trump Failure Strategy : హోర్ముజ్ సంక్షోభం. Andhra Prabha Analysis
Trump Failure Strategy : హోర్ముజ్ సంక్షోభం. Andhra Prabha Analysis అమెరికా
వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్త..
వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్త.. చైతన్యం..హక్కుల సాధన కరపత్రాన్ని ఆవిష్కరించిన సీఐ హసన్
రంజాన్ పండుగ మత సమరస్యానికి ప్రతీక
రంజాన్ పండుగ మత సమరస్యానికి ప్రతీక అన్ని మతాలు, కులాలు కలిసి సహాజీవనం
జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జ్యేష్ఠ శ్రీనాథ్
జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జ్యేష్ఠ శ్రీనాథ్ ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మాజీ
కొత్త సంవత్సరంలో అన్ని సుఖ సంతోషాలే..
కొత్త సంవత్సరంలో అన్ని సుఖ సంతోషాలే.. ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని
మంత్రాలయంలో వడగండ్ల వర్షం మంత్రాలయం, ఆంధ్ర ప్రభ : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయం
విద్యార్థులు గురువులను పూజించాలి… గౌరవించాలి
విద్యార్థులు గురువులను పూజించాలి… గౌరవించాలి విజ్ఞాన్ స్కూల్ నాలుగో వార్షికోత్సవ కార్యక్రమంలో…వైరా మున్సిపాలిటీ
రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి క్లారిటీ..
ఏప్రిల్, మే నెలల్లో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభం అసంపూర్తి నిర్మాణాలకు మోక్షం వచ్చే మూడేళ్ల లోపట్టణ ప్రాంతాల్లోని ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇళ్లు అక్రిడేషన్ కార్డుల జారీ విషయంలో అపోహలు వద్దు మంత్రి పొంగులేటి మన తెలంగాణ/హైదరాబాద్: ఏప్రిల్, మే నెలల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ రెండవ విడత ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం మాయ మాటలు చెప్పదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని ఆచరణలో చూపిస్తుందన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో పట్టణ ప్రాంతాలల్లోని ప్రతీ వార్డులో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. ఇప్పటికే మొదటి విడతలో ఇళ్ల మంజూరు చేశామని, మిగిలిన మూడు విడతలను కూడా దశలవారీగా పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన తండాలు, గూడాల్లో గతంలో ప్రారంభమై వివిధ స్థాయిలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని తెలిపారు. వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి, లబ్ధిదారులకు అనుకూలంగా మార్పులు చేపడతామని మంత్రి చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి వివక్ష ఉండదని, కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అత్యంత పేదలకే ప్రాధాన్యం ఇస్తాన్నామని, ఎక్కడైనా లోపాలు ఉన్నట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నాటికి సుమారు లక్ష ఇళ్లు పూర్తి కానున్నాయని, జూన్, జులై నాటికి మొదటి విడతలో మంజూరైన మూడు లక్షల ఇళ్లలో మెజారిటీ పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 18,579 డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేశామని, నీటి సరఫరా, మరుగు నీటి పారుదల, విద్యుత్తో పాటు మౌలిక సదుపాయాల పనులు పెండింగ్లో ఉండటంతో వాటిని కేటాయించాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం వాళ్ళు నివసిస్తున్న ప్రాంతానికి వీలైనంత దగ్గరలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడానికి కార్యాచరణ రుపొందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. గతంలో దూర ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులు ఉపయోగించలేకపోయిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం పథకంలో పెండింగ్ బిల్లులలో 99 శాతం ఇప్పటికే చెల్లించామని, మిగిలినవాటిని కూడా త్వరలో క్లియర్ చేస్తామన్నారు. వివిధ దశల్లో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేయడానికి ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
70 లక్షల మంది రైతుల ఖాతాలో ఒకేసారి డబ్బులు
హైదరాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలోని నర్మెట సభా వేదిక నుంచి ఈనెల 22వ తేదీన 70 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను సిఎం రేవంత్రెడ్డి విడుదల చేయనున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు. 70 లక్షల మందికి ఒకేసారి ఖాతాలో డబ్బులు వేసే ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. గతంలో 20 లక్షల మంది రైతులకు 20 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని, గతంలో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతు సంక్షేమ కార్యక్రమాలు ఆగవద్దని సిఎం చెప్పినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ప్రభుత్వానికి రైతాంగమే ప్రాధాన్యం అని ఆయన చెప్పారు. ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు చేసి చూపించామన్నారు.
నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు
నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు చెన్నూర్ ఆంధ్రప్రభ : వాహనాలు నడిపే ప్రతి
తెలంగాణలో మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభం
హుస్నాబాద్ నియోజకవర్గంలోని నర్మెట సభా వేదిక నుంచి ఈనెల 22వ తేదీన 70 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను సిఎం రేవంత్రెడ్డి విడుదల చేయనున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు. 70 లక్షల మందికి ఒకేసారి ఖాతాలో డబ్బులు వేసే ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. గతంలో 20 లక్షల మంది రైతులకు 20 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని, గతంలో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతు సంక్షేమ కార్యక్రమాలు ఆగవద్దని సిఎం చెప్పినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ప్రభుత్వానికి రైతాంగమే ప్రాధాన్యం అని ఆయన చెప్పారు. ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు చేసి చూపించామన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లపై ధర్నాలు చేయడం తేలికైన పని కానీ, ధర్నాలు చేస్తున్న వారే కేంద్రంలో ఉన్నారని వారు కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లను బుధవారం నుంచే ప్రారంభించిందని ఆయన చెప్పారు.
పాఠశాలలలో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
పాఠశాలలలో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని పాఠశాలల విద్యార్థిని
మరో మూడు నెలల పాటు సిఎస్ పదవీకాలం పొడిగింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ పరిధిలోని పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డిఓపిటి) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం అధికారిక సమాచారం అందింది. తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు రామకృష్ణా రావు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. గతేడాది ఆగస్టు 31వ తేదీన రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసును పొడిగించాలని డిఓపిటిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో 7 నెలలు ఆయన సర్వీసును పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. అయితే, ఈనెల 31వ తేదీతో పదవీ కాలానికి సంబంధించి గడువు ముగుస్తుండటంతో మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిఓపిటికి లేఖ రాయగా సానుకూలంగా స్పందించింది. దీంతో మరో మూడు నెలల పాటు రామకృష్ణా రావు సిఎస్ పదవిలో కొనసాగనున్నారు.
సగర కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన
సగర కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాద్,
కరీనంనగర్ సిపి అక్రమాలపై సిట్ వేయండి: కౌషిక్రెడ్డి
హైదరాబాద్: ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని కరీనంగర్ సిపి గౌస్ ఆలంపై ఉన్న అక్రమాలపై ప్రత్యేక సిట్ ద్వారా విచారణ చేపట్టాలని బిఆర్ఎస్ శాసనసభ్యుడు కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు, సమాచారం తన వద్ద ఉందని వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. శాసనసభ జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్లో ఉండాల్సిన ప్రభుత్వ వాహనం హైదరాబాద్లో తిరుగుతోందని, ఇందుకు కరీంనగర్లోని ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా వినియోగిస్తున్నారని అన్నారు. సిపి సతీమణి తన స్నేహితులతో కలిసి ఫైరింగ్ జోన్లో ఫైరింగ్ చేయడం వల్ల ఒక వృద్దురాలికి గాయమైందని తెలిపారు. అంతే కాకుండా కరీంనగర్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు. ఇప్పటికే సిపిపై ఉన్న అవినీతి ఆరోపణలు, తాజాగా జరిగిన అక్రమాలపై సిట్ ద్వారా విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇందుకు సభలో ఉన్న మంత్రి శ్రీధర్బాబు స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని అన్నారు. ఆరోపణల్లో వాస్తవాల గురించి తెలుసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతు మహోత్సవంలో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలి
రైతు మహోత్సవంలో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
అకాల వర్షం.. రైతన్నకు నష్టం ఈదురుగాలులకు నేలకొరిగిన మొక్కజొన్నపుల్లశెనగను కాపాడుకునేందుకు తంటాలుచిలుకూరు, దాములూరు,
తెలంగాణలో హ్యామ్ రోడ్ల నిర్మాణం: మంత్రి వెంకట్రెడ్డి
వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో హ్యామ్ రోడ్లు పూర్తి చేస్తాం ఇంకా టెండర్లు కూడా తెరవక ముందే ఆరోపణలు చేయడం సరికాదు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసెంబ్లీలో రోడ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మంత్రి మనతెలంగాణ/హైదరాబాద్ : 2028 జూన్ నాటికి దేశంలో తెలంగాణ మోడల్గా నిలిచేలా హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్ధతిలో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు రూ.30 వేల కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. దాదాపు రూ.17 వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి ఇంకా టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఏప్రిల్ 10 నాటికి అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో హ్యామ్ రోడ్లు పూర్తి చేస్తామన్నారు. రహదారులు రాష్ట్ర అభివృద్ధికి సూచికలు అని, పేదల ఇంటి ముందు రోడ్డు ఉంటేనే నిజమైన డెవలప్మెంట్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో రోడ్లపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎంఎల్ఎలు హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు హ్యామ్ రోడ్ల నిర్మాణం జరగుతుందని, ఇంకా టెండర్లు కూడా తెరవక ముందే బిఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు ఆరోపణలు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వ పెద్దలు సుమారు రూ.4,600 కోట్ల బిల్లులు పెండింగులో పెట్టారని మండిపడ్డారు.
అధిక 8రేట్ల పన్నుల వసూలుపై మండిపాటు
అధిక 8రేట్ల పన్నుల వసూలుపై మండిపాటు ఇప్పటికే ఆదాయం తగ్గి అప్పుల పాలవుతున్నాంమున్సిపాలిటీ
మూసీ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారింది
మూసీ ప్రాజెక్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. గాంధీ సరోవర్, రాహుల్ గాంధీ సరోవర్ పేర్లతో కొత్త నాటకాలు ఆడుతున్నారా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో బుధవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అమీన్పూర్లో కూల్చివేసిన ఇళ్లకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం చట్టవ్యతిరేక చర్యలు చేపడుతోందని అన్నారు. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయమని తాము సవాల్ విసిరినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన వారిపై ఆరోపణలు వచ్చినా విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. కానీ, అధికార పార్టీ మాత్రం తప్పించుకుంటోందని అన్నారు. తమ పార్టీ బీ ఫాం మీద గెలిచిన వారికి క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు. బడ్వే అని తిడితే కూడా ఖండించలేదని, అలాంటప్పుడు కెసిఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తమనే తట్టుకోలేకపోతుంది..కెసిఆర్ను ఎలా తట్టుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రోజురోజుకు బయటపడుతోందని, ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు.పొంగులేటి కుమారుడు కబ్జాలు చేసిన ఘటనలో సంబంధిత అధికారిని బదిలీ చేశారని అన్నారు.
కలెక్టర్ ను కలిసిన ఆలేరు బిఆర్ఎస్ నేతలు
కలెక్టర్ ను కలిసిన ఆలేరు బిఆర్ఎస్ నేతలు ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి
భారీ అగ్నిప్రమాదాలు..17మంది బలి
న్యూఢిల్లీ/ఇండోర్: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బుధవారం విషాదం నెలకొంది. రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలలో మొత్తం 17 మంది దుర్మరణం చెందారు. ఢిల్లీలోని పాలం మెట్రోస్టేషన్ సమీపంలోని రామ్చౌక్ మార్కెట్లోని అపార్ట్మెంట్లో చెలరేగిన మంటల్లో ఓ కుటుంబానికి చెందిన తొమ్మండుగురు సజీవ దహనం చెందారు. వీరిలో 70 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. వీరిలో మూడేండ్ల బాలిక కూడా ఉంది. ఈ ఘటన హృదయవిదారకం అయింది, ముగ్గురు గాయపడ్డారు. ఈ భవనం బేస్మెంట్లో ఓ బట్టల దుకాణం, కాస్మోటిక్ షోరూం ఉన్నాయి వీటి యజమాని రాజేందర్ రెండో మూడో అంతస్తుల్లో తన కుటుంబంతో ఉంటున్నాడు. మంటలు ముందు మొదటి అంతస్తులో తలెత్తి, తరువాత వేగంగా ఇతర అంతస్తులకు పాకాయి. ఎక్కువగా మండే స్వభావం ఉండే సౌందర్య సాధనాలు, పర్ఫ్యూమ్స్తో మంటలు చెలరేగాయి. స్థానిక మార్కెట్ సంఘం అధ్యక్షులు అయిన రాజేందర్ తన పెద్ద కుటుంబంతో ఉంటున్నారు. ఐదుగురు కమారులు, కోడళ్లు, ఓ కూతురు, ఏడుగురు మనవలుమనవరాళ్లతో నివసిస్తున్నారు. రాజేందర్ భార్య 70 సంవత్సరాల లాడో కూడా మంటల్లో చనిపోయారు. కుటుంబ సభ్యులు కొందరు ప్రయాణాలలో ఉండటంతో ముప్పు తప్పింది. కింది అంతస్తులో వస్త్రాల షాపు ఉండటం, సుగంధ ద్రవ్యాలు మంటలతో కాలిపోవడంతో వేగంగా మంటలు అంటుకున్నట్లు, అంతా నిద్రలో ఉండటం వల్ల మంటల నుంచి తప్పించుకోలేకపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు కిటికీ నుంచి కిందకు దూకి గాయపడ్డారు. నివాసాలలో కిటికీలు మూసివేసి ఉండటం, బయటకు వెళ్లేందుకు దారిలేకపోవడంతో దారుణం జరిగింది. ఇవి ఛార్జింగ్ పాయింట్ పేలుడు.. ఇండోర్ మంటల్లో 8 మంది ఆహుతి బుధవారం ఉదయం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రజేశ్వరీ అనెక్స్ కాలనీలోని మూడంతస్తుల భవనం వెలుపల ఎలక్ట్రిక్ వాహనం (ఇవి) చార్జింగ్ పాయింట్ పేలుడులో ఎనమండుగురు ఆహుతి అయ్యారు. మృతులలో ఇద్దరు బాలలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. తెల్లవారు జామున పేలుడుతో భవనానికి మంటలు అంటుకున్నాయని ఇండోర్ పోలీసు అధికారి కుందన్ మండ్లోయ్ తెలిపారు. ఇవి వాహనం ఒకటి రాత్రి పూట చార్జింగ్కు పెట్టారు. ఉన్నట్లుండి ఛార్జింగ్ పాయింట్ పేలింది. దీనితో ముందు అక్కడ ఛార్జింగ్ అవుతున్న కారు మంటల్లో చిక్కింది. తరువాత మంటలు భవనానికి అంటుకున్నాయని కుందన్ వెల్లడించారు. నివాసం ద్వారాలు ఎలక్ట్రానిక్ లాక్లతో ఉండటం, లోపలి వారిని వెంటనే బయటకు తీసుకురాలేకపోయారని వెల్లడైంది. చార్జింగ్ పాయింట్లో పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. మంటలు లోపలికి వ్యాపించడం, వంట గ్యాసు సిలిండర్లు కూడా అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ తీవ్ర సంఘటనతో స్థానిక అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఇవి ఛార్జింగ్లపై సరైన పద్దతులతో కూడిన ఎస్ఒపిల ఖరారుకు సిద్ధం అయ్యారు. ప్రధాని మోడీ తీవ్ర దిగ్భాంతి.. సంతాపం, పరిహారం రెండు వేర్వేరు ఘటనల్లో 17 మంది అగ్నికి ఆహుతి కావడంపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇండోర్, పాలంలో ఘటనల్లో కుటుంబాలలో నెలకొన్న విషాదం కలచివేసిందని పేర్కొంటూ ప్రకటన వెలువరించారు. ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి రూ 2 లక్షల సాయం ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ 50000 సాయం అందుతుంది.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు రూ,3,500 నగదు, పేకాట ముక్కలు స్వాధీనంఏడుగురి అరెస్ట్చిట్యాల
స్కూల్ మైదానంలో పడిన పిడుగు.. ఓ వ్యక్తి మృతి
తుళ్లూరు: గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానిక మేరీమాత స్కూల్ మైదానంలో పిడుగుపడింది. అదే సమయంలో అక్కడ ఉన్న శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆయన మృతి చెందారు. బిఎస్ఆర్ కంపెనీలో ఆయన సర్వేయర్గా పని చేస్తున్నారు. మరోవైపు నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోట గ్రామంలో వర్షానికి ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో ఏడాది బాలుడు అభి మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే జయసూర్య పరామర్శించారు.
ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయం…
ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయం… షాదీ ఖానాల అభివృద్ధికి కృషి చేస్తావిజయవాడ పశ్చిమ
కుమార్తె కోసం వెళ్తూ.. గుంటూరు, ఆంధ్రప్రభ : రాజధాని ప్రాంతంలో బుధవారం సాయంత్రం
మొక్కజొన్నకు మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు
మొక్కజొన్నకు మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే మక్కల
మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డిఎంహెచ్ఓ.. కార్పొరేటర్
దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంబిస్తున్న ఎమ్మెల్యే..
దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంబిస్తున్న ఎమ్మెల్యే.. ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి’ పథకం
సర్పంచ్ సస్పెన్షన్ తోసి పుచ్చిన హైకోర్టు..
సర్పంచ్ సస్పెన్షన్ తోసి పుచ్చిన హైకోర్టు.. త్వరలో తిరిగి బాధ్యతలు స్వీకరించనున్న సర్పంచ్
ట్రిపుల్ ఐటి విద్యార్థిని మృతి.. తోటి విద్యార్థుల ఆందోళన
ట్రిపుల్ ఐటి విద్యార్థిని మృతి.. తోటి విద్యార్థుల ఆందోళన బాసర, ఆంధ్రప్రభ :
فیکٹ چیک: کیا ایران نے میزائل پر ایپسٹین متاثرین کی یاد میں فارسی تحریر شامل کی، جانئے پوری حقیقت
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ ایران نے اپنے میزائل پر ایپسٹین متاثرین کی یاد میں تحریر لکھی ہے۔ جانچ پڑتال سے ثابت ہوا کہ یہ عبارت اے آئی ٹولز سے شامل کی گئی ہے
Sharmila vs Jagan: Explosive Claims
YS Sharmila has launched a sharp attack on YS Jagan Mohan Reddy and Kadapa MP Avinash Reddy over the YS Vivekananda Reddy murder case. She called their statements shocking and unacceptable. Responding to Avinash Reddy’s claim that Sunitha first spoke about a heart attack, Sharmila dismissed it outright. She said such arguments are nothing but […] The post Sharmila vs Jagan: Explosive Claims appeared first on Telugu360 .
విషాదం: అప్పుల బాధతో కొడుకు ఆత్మహత్య.. అది తట్టుకోలేక తల్లి..
జగిత్యాల అర్బన్ మండలం మోతెలో విషాదం చోటు చేసుకుంది. తల్లి, కొడుకు ఒకే రోజు మృతి చెందారు. గ్రామానికి చెందిన దొడ్ల సంపత్ (25) అనే యువకుడు అప్పుల బాధతో మంగళవారం సాయంత్రం ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందతూ బుధవారం మృతి చెందాడు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొడుకు మృతితో ఏడుస్తూ అతడి తల్లి మల్లవ్వ (60) గుండెపోటు వచ్చి కుప్పకూలింది. అదే ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించారు. కానీ, ఆమె కూడా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఆయిల్ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవానికి రండి: కెటిఆర్కు తుమ్మల ఆహ్వానం
మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో టిజి ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆయిల్ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవానికి రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కెటిఆర్ను బుధవారం కోరారు. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కెసిఆర్ ఛాంబర్కు మంత్రి తుమ్మల స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ఫాం ఫ్యాక్టరీ ప్రారంభం జరుగనుంది. నర్మెట శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో తెలంగాణ ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీని ఆధునిక టెక్నాలజీతో ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆయిల్ పాం ఫ్యాక్టరీలో నూనెను ఉత్పత్తి చేయడంతో పాటు ఇక్కడి నుంచే నేరుగా మారెట్లోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆయిల్ఫామ్ పండ్ల గుజ్జు నుంచి ముడి నూనె తీసి రిఫైన్డ్ చేసి పామాయిల్ను ప్యాకెట్స్ రూపంలో మార్కెట్లోకి తీసుకొస్తారు. 10 కోట్ల లీటర్ల నిలువ సామర్థ్యంతో నీళ్ల ట్యాంకును ఏర్పాటు చేశారు. ఆయిల్ఫామ్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క యూనిట్కు రూ.1.50 మాత్రమే ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి కానుండటంతో భారం తప్పనుంది. వాడిన నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీ సైక్లింగ్ చేసే పద్ధతి కూడా ఉంది. ఈ ఫ్యాక్టరీలో మొదట గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యం, గెలల పరిమాణం పెరుగుతున్న కొద్దీ క్రషింగ్ సామర్థ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలు కల్పించారు. గంటకు 120 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ కట్టడం దేశం లోనే తొలిసారి.
రోడ్డు భద్రత మనందరి బాధ్యత.. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో
ఈదురుగాలులకు నేలరాలిన మామిడికాయలు
ఈదురుగాలులకు నేలరాలిన మామిడికాయలు ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా
చేనేతకు చేయూతే లక్ష్యం.. కళాత్మక చేనేత వస్త్రాలకు వేదికగా గాంధీ బునకర్ మేళాఈ
గ్యాస్ కోసం బారులు..పండుగ పూట ప్రజల తిప్పలు
గ్యాస్ కోసం బారులు..పండుగ పూట ప్రజల తిప్పలు మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్
నగర అభివృద్ధికి పెద్దపీట ఖమ్మం, ఆంధ్రప్రభ : రూ. 196 కోట్లతో ఖమ్మం
రంజాన్ తోఫా అందజేస్తున్న ఎమ్మెల్యే…
రంజాన్ తోఫా అందజేస్తున్న ఎమ్మెల్యే… పాయకాపురం, ఆంధ్ర ప్రభ : మైనారిటీ కుటుంబాలకు
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర
దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం…
దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం… తిరువూరు, ఆధ్రప్రభ : ఆర్టీసీ బస్సుల్లో
Chemical |పరిశ్రమల్లో వేసవి భద్రతా తనిఖీలు…
Chemical | పరిశ్రమల్లో వేసవి భద్రతా తనిఖీలు… కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలతో
విశాఖ వాసులకు గుడ్న్యూస్.. త్వరలో రైల్వే జోన్ కార్యకలాపాలు
న్యూఢిల్లీ: విశాఖపట్నం వాసులకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుడ్న్యూస్ అందించారు. త్వరలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. విశాఖ రైల్వే జోన్పై ఆయన పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నియామకాలు పూర్తయ్యాయని వెల్లడించారు. జోన్ ప్రధాన కార్యాలయ భవనం పునాది పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్కు రూ.2,047 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఎపిలో రూ.70,232 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఆర్ధికంగా వెనుకబడిన బ్రాహ్మణులను ఆదుకుంటాం: డిప్యూటీ సిఎం భట్టి
బడ్జెట్లో బ్రాహ్మణ పరిషత్కు రూ. 200 కోట్లకు వినతి మన తెలంగాణ/హైదరాబాద్ః ఆర్థికంగా వెనుకబడి అర్హులైన బ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు బ్రాహ్మణ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులను ఆదుకోవడానికి బ్రాహ్మణ పరిషత్కు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ (బాస్) నాయకులు బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. వివిధ బ్రాహ్మణ సంఘాలతో కలిపి ఏర్పాటైన ‘బాస్’ ప్రధాన సమన్వయకర్త బసవరాజు శ్రీనివాస్ అధ్వర్యంలో ఇతర ముఖ్య నాయకులు ఎన్. లక్ష్మీనారాయణ, కైలాష్, సూర్య ప్రకాష్, ప్రమోద్, రాఘవురావు, శ్రీనివాస రావు తదితరులు అసెంబ్లీకి వచ్చి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, మంత్రి శ్రీధర్ బాబును కలిసి సమస్యలను వివరించారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేదహిత, వేద పాఠశాల, వేదహిత-వేద పండిట్స్, వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్, టెస్ట్ స్కీం, బ్రాహ్మణ భవనాలు, ఉద్యొగార్థులకు ఆర్థిక సహాయం, పెన్షన్, నిరుద్యోగ బ్రాహ్మణులకు ఉద్యోగాలు కల్పించడం తదితర సమస్యలను, డిమాండ్లను వారు వివరించారు. గత రెండేళ్ళుగా బ్రాహ్మణులకు సరైన నిధులు లేక ఏ పథకమూ అమలు కాకపోవడంతో విద్యార్థులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. సంక్షేమ భవనాలకు నిధులు లేకపోవడంతో నిర్మాణ దశలోనే నిలిచిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.పెన్షన్లు, ఆర్థిక సహాయం లేక పండితులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వారు చెప్పారు. గత ఏడాది కేటాయించిన నిధులు పాత బకాయిలకే సరిపోలేదన్నారు. దాదాపు కొన్ని వందల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో కొత్త దరఖాస్తులను పిలవడం లేదని వారు వివరించారు. కాబట్టి బ్రాహ్మణుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బడ్జెట్లో రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని వారు కోరాఉ. అందుకు స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులను అన్ని విధాల ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.
ఐపిఎల్-2026.. సన్రైజర్స్కి కెప్టెన్గా ఇషాన్ కిషన్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మరో పది రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ సీజన్ కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అభిషేక్ శర్మకు అప్పగించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ సీజన్లో కొన్ని మ్యాచ్లకు దూరం అవుతున్నట్లు తెలిపింది. అతడి గైర్హాజరీలో ఎస్ఆర్హెచ్ జట్టును కిషన్ నడిపించనున్నాడు. ఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్లో ఇషాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. అంతకు ముందు జరిగిన దేశవాళీ టోర్నమెంట్లో ఝార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించిన కిషన్.. జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. దీంతో అతడికి ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.
కన్స్యూమర్ జస్టిస్ రిపోర్ట్ 2026లో ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్థానం
విజయవాడ: భారతదేశంలో మొట్టమొదటిసారిగా వివాదాల పరిష్కార కమిషన్ సామర్ధ్యాలను పరిశీలించిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజెఆర్) నేడు కన్స్యూమర్ జస్టిస్ రిపోర్ట్ (వినియోగదారుల న్యాయ నివేదిక 2026) ను విడుదల చేసింది. భారతదేశ వ్యాప్తంగా 19 పెద్ద మరియు మధ్య తరహా (ఒక్కొక్కటి కోటి కంటే ఎక్కువ జనాభాతో) రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఆ తరువాత స్థానాలలో నిలిచాయి. కొన్ని ప్రోత్సాహకరమైన ధోరణులు: · ఆంధ్రప్రదేశ్ యొక్క జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లలో (డి సి డి ఆర్ సి) అధ్యక్షుల కొరత కేవలం 6% కాగా సభ్యులలో 3% మాత్రమే కొరత ఉంది, ఈ క్లస్టర్లో (2025) అతి తక్కువ ఇది. · ఈ క్లస్టర్లో 3 సంవత్సరాలకు పైగా [2022-2024] పెండింగ్లో ఉన్న కేసులలో అతి తక్కువ వాటా (4.75%) రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎస్ సి డి ఆర్ సి) నివేదించింది. · 2020 మరియు 2024 మధ్య రాష్ట్రం తమ అన్ని కేసుల్లో దాదాపు 93% కేసులను పరిష్కరించింది. మెరుగుదలలు చేయగలిగేవి: · 2025 నాటికి, కమిషన్లో అధ్యక్షుడు లేరు. · ఎస్ సి డి ఆర్ సి సభ్యులలో 25% కొరత ఉంది (2025). · రాష్ట్రంలోని 26 జిల్లాల్లో, కేవలం 17 లేదా 65% మాత్రమే ప్రత్యేక జిల్లా వివాద పరిష్కార కమిషన్ను కలిగి ఉన్నాయి. తొమ్మిది చిన్న రాష్ట్రాలలో (ఒక కోటి కంటే తక్కువ జనాభా ఉన్న) మేఘాలయ మొదటి స్థానంలో నిలిచింది, తరువాత సిక్కిం మరియు హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. సమాచార హక్కు చట్టం కింద చేసిన విచారణలు మరియు పార్లమెంటరీ ప్రతిస్పందనల ద్వారా పొందిన పబ్లిక్ డేటాను ప్రధానంగా ఉపయోగించి చేసిన ఈ అధ్యయనం బడ్జెట్లు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, పనిభారం మరియు వైవిధ్యం అనే ఫిల్టర్ల ద్వారా రాష్ట్ర పనితీరును అంచనా వేసింది, వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం చట్టబద్ధమైన బాధ్యతలను నెరవేర్చడానికి రాష్ట్రాలు ఎంత బాగా సన్నద్ధమయ్యాయో ఈ ర్యాంక్ సూచిస్తుంది. వినియోగదారుల కమిషన్ అధికార పరిధి 2021 నియమాల ఆధారంగా, ప్రతి స్థాయికి, ఒక నిర్దిష్ట ద్రవ్య విలువ కలిగిన ఫిర్యాదులను స్వీకరించడానికి ఒక ఆర్థిక అధికార పరిధి ఉంటుంది. · జిల్లా కమిషన్లు - పరిగణనలోకి తీసుకున్న వస్తువులు లేదా సేవల విలువ 50 లక్షల రూపాయలకు మించని చోట ఫిర్యాదులను స్వీకరించడానికి అధికార పరిధి వుంది. · రాష్ట్ర కమిషన్లు - ప్రతిఫలంగా చెల్లించిన వస్తువులు లేదా సేవల విలువ రూ. 50 లక్షల కంటే ఎక్కువగా ఉండి, రూ. 2 కోట్ల మించని ఫిర్యాదులను స్వీకరించే అధికార పరిధిని కలిగి ఉంటాయి. · జాతీయ కమిషన్ - ప్రతిఫలంగా చెల్లించిన వస్తువులు లేదా సేవల విలువ రూ. 2 కోట్ల కంటే ఎక్కువగా ఉన్న ఫిర్యాదులను స్వీకరించే అధికార పరిధిని కలిగి ఉంటుంది. 3 సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల వాటాలో అత్యల్ప స్థాయి వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 38(7) ప్రకారం, వస్తువుల విశ్లేషణ లేదా పరీక్ష అవసరం లేని ఫిర్యాదులను, అవతలి పక్షానికి నోటీసు అందిన తేదీ నుండి మూడు నెలల వ్యవధిలోపు; వస్తువుల విశ్లేషణ లేదా పరీక్ష అవసరమయ్యే ఫిర్యాదులను ఐదు నెలల వ్యవధిలోపు- సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. 19 పెద్ద మరియు మధ్యస్థాయి రాష్ట్రాల సమూహంలో, ఆంధ్రప్రదేశ్ మాత్రమే 3 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల శాతం కేవలం 5%గా ఉందని నివేదించింది. వినియోగదారుల కేసుల రంగాల వారీ విశ్లేషణ అధికారిక పోర్టల్ అయిన 'Confonet' (ప్రస్తుతం 'e-jagriti')లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, 2010 మరియు 2024 మధ్య (15 ఏళ్లు) దాఖలైన మరియు పరిష్కరించబడిన కేసులపై ఐజెఆర్ చేసిన విశ్లేషణ ఈ క్రింది విషయాలను వెల్లడిస్తోంది: 1. ఆంధ్రప్రదేశ్ ఎస్ సి డి ఆర్ సి లో దాదాపు 19,000 కేసులు దాఖలయ్యాయి. వీటిలో, 9,839 లేదా 52% కేసులు 'మొదటి అప్పీళ్లు' (first appeals) - జిల్లా కమిషన్ ఇచ్చిన తీర్పుతో సంతృప్తి చెందని పక్షానికి అందుబాటులో ఉండే ఒక న్యాయపరమైన పరిష్కార మార్గం - కాగా, కేవలం 1,245 లేదా 7% కేసులు మాత్రమే 'మూల అధికార పరిధి' (original jurisdiction) కింద నేరుగా దాఖలైన వినియోగదారుల కేసులు. 2. ఎస్ సి డి ఆర్ సి లో దాఖలైన ప్రతి 3 కేసులలో ఒకటి [6,018 లేదా 34%] బీమా రంగానికి సంబంధించిన ఫిర్యాదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో గృహనిర్మాణ [12%] మరియు బ్యాంకింగ్ [11%] రంగాల ఫిర్యాదులు ఉన్నాయి. e-jagriti పోర్టల్లో నిర్దిష్టంగా పేర్కొనబడని 'ఇతరాలు' (others) విభాగం కింద దాఖలైన కేసులు 3,574 లేదా 20% గా నమోదయ్యాయి. 3. ఈ కాలంలో దాఖలైన కేసులలో 40% కంటే ఎక్కువ కేసుల పరిష్కారానికి 365 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టింది. సగటున, ఆంధ్రప్రదేశ్ ఎస్ సి డి ఆర్ సి కేసులను 416 రోజులలో పరిష్కరించింది. 4. కేవలం 25% కేసులు మాత్రమే నిర్దేశిత కాలపరిమితి అయిన మూడు నెలల లోపు పరిష్కరించబడినట్లు నివేదించబడింది. ఐజెఆర్ యొక్క వినియోగదారుల డాష్బోర్డ్ను ఇక్కడ చూడవచ్చు: https://ccdash.indiajusticereport.org/ ఎస్ సి డి ఆర్ సి లో సిబ్బంది వివరాలు 2025 నాటికి, కమిషన్లో అధ్యక్ష స్థానం ఖాళీగా ఉంది; అలాగే మంజూరైన నలుగురు సభ్యుల స్థానాలకు గాను, ఒక సభ్యుని స్థానం ఖాళీగా ఉంది. 2021 మరియు 2025 మధ్య కాలంలో, సభ్యుల ఖాళీలు గణనీయంగా తగ్గాయి. ఇవి 75% నుండి 25%కి చేరుకున్నాయి. అయితే, ఒక అధ్యక్షుడు మరియు నలుగురు సభ్యులు ఉండాలనే కనీస చట్టపరమైన నిబంధనను ఎస్ సి డి ఆర్ సి కేవలం 2022లో మాత్రమే పూర్తిగా పాటించగలిగింది. ఎస్ సి డి ఆర్ సి సజావుగా పనిచేయడానికి తగినంత మంది సిబ్బంది ఉండటం అత్యంత ఆవశ్యకం. 2000లో సమర్పించిన 'బాగ్లా కమిటీ నివేదిక' (Bagla Committee Report), ఒక ఎస్ సి డి ఆర్ సి లో 10 మంది ప్యూన్లతో కలిపి మొత్తం 38 మంది సిబ్బంది ఉండాలని సిఫార్సు చేసింది. ప్రతి 250 పెండింగ్ కేసులకు ఒక సహాయకుడు (Assistant) మరియు ఒక LDC ఉండాలని, తద్వారా కనీస సిబ్బంది సంఖ్య 40కి చేరాలని కూడా ఇది పేర్కొంది. 500 కంటే తక్కువ కేసులు పెండింగ్లో ఉన్న ఎస్ సి డి ఆర్ సి ల కోసం, మొత్తం 15 సిబ్బంది పోస్టులను సిఫార్సు చేశారు. 2021 మరియు 2025 మధ్య కాలంలో, ఆంధ్రప్రదేశ్ ఎస్ సి డి ఆర్ సి లో మంజూరు చేసిన దానికంటే ఎక్కువ మంది సిబ్బంది ఉన్నట్లు నివేదించబడింది. లింగ వైవిధ్యం సభ్యులలో (మరియు/లేదా అధ్యక్షులలో) కనీసం ఒక మహిళ ఉండాలని సిపిఏ , 2019 చట్టం నిర్దేశిస్తుంది. 2023 మరియు 2025 మధ్య ఒక మహిళా సభ్యురాలిని కలిగి ఉండటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎస్ సి డి ఆర్ సి ఈ నిబంధనను అనుసరించింది; అయితే, ఈ కాలంలో ఆ కమిషన్కు ఎప్పుడూ మహిళా అధ్యక్షురాలు లేరు. డేటాను అందించిన 13 పెద్ద మరియు మధ్యస్థాయి రాష్ట్రాల ఎస్ సి డి ఆర్ సి లలో ఏ ఒక్కటి కూడా తమ సిబ్బందిలో మహిళల వాటాను 50 శాతానికి చేర్చలేకపోయింది (2024 నాటికి). 2021 మరియు 2025 మధ్య కాలంలో, తమ ఎస్ సి డి ఆర్ సి లో లింగ వైవిధ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందించిన పది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈ కాలంలో, ఎస్ సి డి ఆర్ సి లోని మహిళా సిబ్బంది వాటా 21 శాతంతో ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగింది. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కిషన్ కౌల్ నివేదికను విడుదల చేస్తూ, “పార్లమెంట్ సంకల్పం ఒక చట్టంలో ప్రతిబింబిస్తుంది. కానీ ఆ చట్టాన్ని నిష్క్రియం చేస్తే సంకల్పం కూడా ఓడిపోతుంది. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 దేశంలో వినియోగదారుల రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని భావించారు. అయితే, రాష్ట్ర కమిషన్లలో సగం కంటే ఎక్కువ అధ్యక్ష మరియు సభ్య పదవులు ఖాళీగా ఉండటం, అలాగే అన్ని జిల్లాల్లోనూ జిల్లా కమిషన్లు ఏర్పాటు కాకపోవడం ఆందోళన కలిగించే విషయం. సామర్థ్య లోపాలపై మేము స్వచ్ఛందంగా (suo motu) స్వీయ విచారణ చేపట్టిన నా పదవీకాలంతో సహా, అనేక కోర్టు ఆదేశాలు వెలువడినప్పటికీ- ఈ పరిస్థితి మాత్రం అలాగే కొనసాగుతూనే ఉంది. ఈ ముఖ్యమైన అంతరాలు వినియోగదారుల రక్షణకు సంబంధించి సంస్థాగత నిర్మాణం, వేగవంతమైన మరియు ప్రభావవంతమైన పరిష్కార లభ్యతను ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా, ఇది వినియోగదారుల కమిషన్లలో ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై వినియోగదారులకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.. అని అన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం అనేది సాధారణ వినియోగదారుడి రక్షణను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఒక ప్రయోజనకరమైన చట్టం అని జస్టిస్ (రిటైర్డ్) మదన్ బి లోకూర్ అన్నారు. ఆయనే మాట్లాడుతూ రాష్ట్ర కమిషన్లలో ఖాళీలు 40% వరకు ఉండటంతో, ఈ వ్యవస్థ కేవలం మనుగడ స్థాయిలోనే పనిచేస్తోందని ఈ నివేదిక స్పష్టంగా వెల్లడిస్తోంది. మూడు కేసుల్లో ఒకటి మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. వినియోగదారుల సమస్యల పరిష్కార యంత్రాంగాలపై విశ్వాసం లేకపోవడం వల్ల వినియోగం, ఆర్థిక వృద్ధి తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని అధికారులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. వినియోగదారుల రక్షణ చట్టం అమలులోకి వచ్చిన నలభై సంవత్సరాల తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ కమిషన్లు నిజంగానే ఫిర్యాదుల పరిష్కార సంస్థలా? అనే ప్రశ్నను ఈ స్థితి లేవనెత్తుతుంది అని అన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఎడిటర్ మాజా దారువాలా మాట్లాడుతూ, “2019 వినియోగదారుల రక్షణ చట్టం భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న మార్కెట్ సంక్లిష్టతలకు అనుగుణంగా ప్రతిస్పందించడానికి రూపొందించబడింది. మునుపటి చట్టంతో పోలిస్తే సవరణలు మరియు ఆవిష్కరణలు ఉన్నప్పటికీ, అత్యంత ప్రగతిశీల చట్టం కూడా బలమైన సంస్థాగత యంత్రాంగాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్ టి ఐ ద్వారా పొందిన డేటా వెల్లడించే దాని ప్రకారం కమిషన్లలో నాయకత్వ ఖాళీలను భర్తీ చేయడంలో అంతరాలు మరియు నిర్లక్ష్యం కనిపిస్తోంది, ఇది వినియోగదారుల రక్షణ లక్ష్యం యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తుంది మరియు అసమర్థమైన ఫిర్యాదుల పరిష్కారానికి దారితీస్తుంది. వినియోగదారుల కమిషన్లలో లింగ వైవిధ్యం అనేది కేవలం సమ్మతికే పరిమితం చేయబడిందని, పెండింగ్ కొనసాగుతుందని మరియు మధ్యవర్తిత్వం అలంకార ప్రాయంగా ఉందని, చివరికి వినియోగదారులకు సంస్థాగత పరిష్కారం మరియు పరిష్కారం యొక్క వాగ్దానాన్ని బలహీనపరుస్తుందని మేము కనుగొన్నాము” అని అన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ గురించి: ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజెఆర్) అనేది వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్న అధికారిక న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని ర్యాంక్ చేయడానికి ప్రభుత్వం స్వయంగా అందించిన గణాంకాలను వినియోగించుకునే ఒక పరిమాణాత్మక సూచిక. ఐజెఆర్అనేది దక్ష ( DAKSH) , కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, కామన్ కాజ్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ మరియు టిస్ -ప్రయాస్ చేపట్టిన భాగస్వామ్య ప్రయత్నం. 2019లో మొదట ప్రచురించబడిన ప్రతి ద్వైవార్షిక నివేదిక, 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన పోలీసు, న్యాయవ్యవస్థ, జైళ్లు, న్యాయ సహాయం మరియు మానవ హక్కుల కమిషన్లలో బడ్జెట్లు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, పనిభారం మరియు వైవిధ్యం యొక్క పరిమాణాత్మక కొలతల ఆధారంగా న్యాయం అందించడానికి ప్రతి రాష్ట్రం యొక్క నిర్మాణాత్మక మరియు ఆర్థిక సామర్థ్యంలో మెరుగుదలలు మరియు నిరంతర లోటులను ట్రాక్ చేస్తుంది.
ఉగాది పండుగ సందర్భంగా ఆకాశవాణిలో ‘అష్టావధానం’
ఉగాది పండుగ సందర్భంగా ఆకాశవాణిలో ‘అష్టావధానం’ విజయవాడ, ఆంధ్రప్రభ : సాంస్కృతిక కార్యక్రమాలు
వెల్లంపల్లిపై ధ్వజమెత్తిన కూటమి కార్పొరేటర్లు
వెల్లంపల్లిపై ధ్వజమెత్తిన కూటమి కార్పొరేటర్లు భవానిపురం, ఆంధ్రప్రభ : మేము ఏ ప్రలోభాలకి
తెలుగు లోగిళ్లలో ఉగాది సందడి ఆరు రుచులు…జీవితంలో ఎదురయ్యే ఆరు రకాల భావోద్వేగాలు
ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం… భానుడి భగభగకు కాస్త బ్రేక్బెజవాడలో పిడుగులతో వర్షం,ఉష్ణోగ్రత
BJP : కేంద్ర నాయకత్వం క్లాస్ బీజేపీలో పనిచేస్తున్నట్లుందిగా
తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వచ్చినట్లున్నాయి.
పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ
పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ అల్ మేవా ను అభినందించిన

20 C