Students |విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు
Students | విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు Students | ఆంధ్రప్రభ
పేద విద్యార్థికి ఎంసెట్ కోచింగ్కు ఆర్థిక సహాయం
పేద విద్యార్థికి ఎంసెట్ కోచింగ్కు ఆర్థిక సహాయం వైరా, ఆంధ్రప్రభ : వైరా
స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
మోపిదేవి, ఆంధ్రప్రభ ; మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర
ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు కృషి
ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు కృషి ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రైజ్ సెంటర్
అయ్యప్ప స్వామి అన్నసేవ మండప నిర్మాణానికి రూ. లక్ష విరాళం
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం చెమ్మనగిరిపేటలోని శివాలయంలో కొలువై ఉన్న బంగారు అయ్యప్ప
తొలి గెలుపు ఉత్సాహంలో గైక్వాడ్కు షాక్.. భారీ జరిమానా
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో తమ హోం గ్రౌండ్ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్లో రచ్చ లేపిన సిఎస్కె.. ఆ తర్వాత బౌలింగ్లోనూ అదరహో అనిపించింది. దీంతో ఈ సీజన్లో తమ సత్తా ఎంటో చాటి చెప్పింది. అయితే ఈ విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కి షాక్ తగిలింది. అతడిపై భారీ జరిమానా పడింది. మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేసినందుకు గాను రూ.12 లక్షలు జరిమానా విధించారు. ఇది ఈ సీజన్లో సిఎస్కెకి తొలి తప్పిందం. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు నితిష్ రాణాకి కూడా భారీ జరిమానా పడింది. మ్యాచ్లో నితీష్ రాణా ఆడనప్పటికీ.. అతను ఫీల్డ్ బయట అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆర్టికల్ 2.3 ప్రకారం.. అతని మ్యాచ్ ఫీజ్ నుంచి 25 శాతం కోత విధించడమే కాక.. కోడ్ ఆఫ్ కండెక్ట్ను అతిక్రమించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఇక, నిన్న జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. ఢిల్లీ 20 ఓవర్లలో 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో 23 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఈ సీజన్లో ఖాతా తెరిచింది.
విద్యుత్ వైర్లకు అల్లుకున్న తీగలు పొంచి ఉన్న ప్రమాదం
వెల్దండ ఏప్రిల్ 11 ( జనంసాక్షి ) :వెల్దండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామంలో ఇది స్తంభాలకు, వైర్లకు మొక్కల తీగలు అల్లుకొని ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. స్తంభాల …
చైతన్య దివిటీలు.. పరిషత్ నాటికలు..
చైతన్య దివిటీలు.. పరిషత్ నాటికలు.. యడ్లపాడు, ఆంధ్రప్రభ : లింగారావుపాలెం కొండవీటి కళా
12aprcrimealert |ఆందోళనకరంగా చిన్నారుల భవితవ్యం
12aprcrimealert | ఆందోళనకరంగా చిన్నారుల భవితవ్యం 12aprcrimealert | ఐదేళ్లలో 19వేల పోక్సో
సాహెబ్ నగర్ లో రెండు కేజీల గంజాయి పట్టివేత
హయత్ నగర్, ఏప్రిల్ 12 (జనం సాక్షి)వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్ఓటి ఆధ్వర్యం లో 2 కిలోల గంజాయి, దాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు, త్రాగడానికి …
గ్రేటర్ హైదరాబాద్లో ఇటీవల ఫుట్పాత్ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విస్తరిస్తున్న నగరానికి తగ్గట్టుగా రహదారులు లేకపోవడంతోపాటు భారీగా వాహనాల పెరుగుదలతో హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహంలో ప్రజలు నిత్యం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగర ప్రజలు రద్దీ సమయాల్లో రోడ్లపై నడవాలంటేనే నరకయాతన అనుభవిస్తున్నారు. ఉన్న కొన్ని ఫుట్పాత్లను కూడా చిరు, బడా వ్యాపారస్థులు కబ్జాలు చేయడంతో ఏమీ చేయలేక రోడ్డుపైనే నడుస్తూ ప్రయాణికులు ప్రమాదాలకు గురైన ఘటనలు నగరంలో అనేకం ఉన్నాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం నగరం నలువైపులా ఫుట్పాత్లపై అక్రమ కట్టడాల తొలగింపుకు నడుం కట్టడంతో ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది. రాజకీయంగా, అధికారికంగా ఏ రూపంలోనైనా ఒత్తిడిలు వచ్చినా కబ్జాదారుల కబంధహస్తాల నుండి ఫుట్పాత్లను విముక్తి చేయాలి. వేగంగా అభివృద్ధి చెందుతూ మెట్రో నగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ ఐటి, మౌలిక వసతులు, రహదారుల విస్తరణలో ముందంజలో ఉన్నా ఫుట్పాత్ల పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నాయి. అభివృద్ధిలో భాగంగా వాహనాలకు పెద్దపీట వేస్తున్న ప్రస్తుత కాలమానంలో మనుషుల అవసరాలను తీర్చడంలో వెనుకబడి పోతున్నామని చెప్పడానికి నగరంలో ఫుట్పాత్ నిర్వహణనే నిదర్శనం. జిహెచ్ఎంసి పరిధిలో సుమారు తొమ్మిది వేల కిలోమీటర్లకుపైగా రోడ్డు నెట్వర్క్ ఉంది. అయితే అందులో ఫుట్పాత్లు వెయ్యి కిలోమీటర్ల లోపలే ఉన్నాయి. అంటే దాదాపు 60శాతం రోడ్లకు ఫుట్ఫాత్లు లేవు. ఉన్న చోట్ల కూడా అవి పూర్తిగా వినియోగించుకునే స్థితి లేవు. ఫుట్పాత్ల సమస్యలో ప్రధాన కారణం ఆక్రమణలే. రోడ్డు పక్కన వ్యాపారులు, షాపుల విస్తరణలు, వాహనాల పార్కింగ్ వంటి కారణాలతో ఫుట్పాత్లు కబ్జా అవుతున్నాయి. పాదచారులకోసం నిర్మించిన ఫుట్పాత్లు వాణిజ్య కార్యకలాపాల కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఫుట్పాత్లను ఆక్రమించడంతో నగర ప్రజలు తప్పని పరిస్థితుల్లో రహదారులపైనే నడవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో వేగంగా వెళ్లే వాహనాలతో ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా వృ ద్ధులు, పిల్లలు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో నడక ప్రమాదకరంగా మారిపోయింది. ప్రతి సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్లో వెయ్యికిపైగా పాదచారుల ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఉదాహరణకు 2024 గణాంకాలు పరిశీలిస్తే 400 మంది పాదచారులు ప్రమాదంలో మృతి చెందారు. 775 మంది గాయపడ్డారు. అంటే నగరంలో రోజుకు సుమారు 30 మందికిపైగా పాదచారులు రోడ్డు ప్రమాదాల బారీనపడుతున్నారు. ఈ ప్రమాదాలు అత్యధికంగా ఫుట్పాత్ సమస్యలతో ముడిపడి ఉండడం గమనార్హం. నగరంలో రహదారుల, ఫుట్పాత్ సమస్యలు పరిష్కరించడంలో భాగంగా వాటిని అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సుమారు మూడు వేల కోట్లకుపైగా రూపాయలు వెచ్చించి వెయ్యి కిలోమీటర్లకు పైగా రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా బిటి, సిసి రోడ్లతోపాటు ఫుట్పాత్లు, సెంట్ల్ మీడియన్లు, సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 700 కిలోమీటర్లకుపైగా రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు, అదనంగా 200 కిలోమీటర్లకుపైగా రోడ్లను ఎఫ్డిఆర్ సాంకేతికతతో పునర్నిర్మాణం చేయనున్నారు. వీటితోపాటు నగరం మొత్తం ఫుట్పాత్లను కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిహెచ్ఎంసి 2025 -26లో గుంతలు పూడ్చడంతోపాటు ట్రాఫిక్ భద్రతా చర్యలను చేపట్టింది. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు 24 లింక్ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ. 487 కోట్ల ప్రణాళికను అమలు చేస్తున్నారు. రోడ్లు, ఫుట్పాత్ను ఆక్రమించి ట్రాఫిక్ సమస్యలకు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న కట్టడాలపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధ్దమైన జిహెచ్ఎంసి ప్రతి వారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా నగరం నలువైపులా అక్రమ కట్టడాలను తొలగించేందుకు ముందుకొచ్చిన జిహెచ్ఎంసి ఏప్రిల్ 4వ తేదీన హైడ్రా, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకొని ఆరు జోన్ల్ పరిధిలోని 798 నిర్మాణాలను నేలమట్టం చేసింది. తొలగించిన వాటిలో 340 పూర్తిస్థాయి, 458 తాత్కాలిక నిర్మాణాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సున్నితమైన పాతబస్తీతోపాటు కొన్ని చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నా అధికారులు సమన్వయంతో విజయవంతంగా అక్రమాలను తొలగించారు. ఇదే తరహాలో ఇకపై నగరవ్యాప్తంగా ప్రతివారం ఏదో ఒక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని జిహెచ్ఎంసి అధికారులు ప్రకటించడంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నగర ప్రజలు ఇదే కోరుకుంటున్నారు. చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరంలోని ప్రధాన మార్గాల్లో ఫుట్పాత్ ఆక్రమణలు పలు సమస్యలకు కారణాలవుతున్నాయి. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకునే చార్మినార్ పరిసరాల్లో వ్యాపారస్థులు పూర్తిగా ఫుట్పాత్లను ఆక్రమించడంతో పర్యాటకులు నడవలేని పరిస్థితి నెలకొంది. దక్షిణ హైదరాబాద్కు ముఖద్వారమయిన మూసీనదిపై నాటి నిజాం కాలంలో నిర్మించిన వంతెన ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ప్రస్తుతం పాతబస్తీలో మూసీ నదిపై ఉన్న వంతెనలన్నింటిలో ‘నయాపూల్’గా పిలువబడే వంతెన ఎత్తైనది. భారీ వాహనాల ప్రయాణానికి అనువుగా నిర్మించిన ఈ వంతెనపై రిక్షాలు, సైకిళ్ల కోసం, పాదచారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. 2000 సంవత్సరం వరకు ఇదే తరహాలో ఉండేది. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు భారీ వాహనాల మార్గం మినహాయించి రిక్షాలు, సైకిళ్లు, పాదచారులకోసం ఏర్పాటు చేసిన మార్గాలు పూర్తిగా తోపుడు బండ్లతో నిండిపోతున్నాయి. అక్కడ పాదచారులు భారీ వాహనాలు నడిచే మార్గంలోనే నడవాల్సి ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఇదే మార్గంలో ముందుకెళ్తే చారిత్రాత్మక కట్టడాలున్న మదీనా, గుల్జర్హౌజ్, చార్మినార్ మరింత క్లిష్ట పరిస్థితులున్నాయి. పాతబస్తీలోనే కాదు నగరం నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్, కోఠి, నాంపల్లి, చిక్కడిపల్లి, మెహిదీపట్నం, ఆరాంఘర్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, ఉప్పల్ వంటి పలు ప్రధాన మార్గాల్లో ఇలాంటి దుస్థితే నెలకొంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్పందించకుండా ఫుట్పాత్లను ఆక్రమించిన వారిలో తప్పు చేస్తున్నామనే స్పందనలేకపోవడం, రాజకీయ ప్రయోజనాలతో వారికి మద్దతుగా నేతలు బలప్రదర్శన చేస్తూ అధికారులను అడ్డుకోవడం దురదృష్టకరం. ఇటీవల నగరంలోని ఆరు జోన్లలో అక్రమాలను తొలగిస్తుంటే పాతబస్తీతోపాటు కొన్ని చోట్ల నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా అధికారులు వెనక్కి తగ్గకుండా పని పూర్తిచేయడం అభినందనీయం. ఎంతోకాలంగా అక్కడ వ్యాపారాలు చేస్తున్నారని, వారందరూ చిరు వ్యాపారులు అంటూ ఫుట్పాత్లను ఆక్రమించిన వారికి మద్దతుగా నిలిచే వారు వాదిస్తున్నారు. దీర్ఘకాలికంగా వారక్కడ ఆక్రమించి ప్రజలను ఇబ్బందుల పాలుచేస్తున్నారనే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటుందనే వాస్తవాన్ని వారు గ్రహించాలి. చిరువ్యాపారుల జీనవోపాధి దెబ్బతినడం బాధాకరమే. ఇలాంటి వారి కోసం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రత్యామ్నాయం ఆలోచించి చర్యలు తీసుకోవాలి. మరోవైపు ప్రధాన కూడళ్లలో బడా వ్యాపారస్థులు కూడా తమ దుకాణాలకు ముందున్న ఫుట్పాత్లను ఆక్రమించి లావాదేవీలు నిర్వహిస్తున్న ప్రదేశాలు నగరంలో కోకొల్లలు. మరికొన్ని చోట్ల పెద్ద వ్యాపారస్థులే వారి మనుషులతో ఫుట్పాత్లను ఆక్రమింపజేసి వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. వాస్తవాలు ఇలా ఉంటే చిరువ్యాపారులకు అన్యాయం జరుగుతుందంటూ రాజకీయ నేతలు అధికారులపై ఒత్తిడి తేవడం ప్రజలను ఇబ్బందుల పాలుజేయడమే. విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరానికి అనుగుణంగా రహదారులు, ఫుట్పాత్ అభివృద్ధి కోసం ఆలస్యంగానైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై కబ్జాల తొలగింపు కార్యక్రమాన్ని ఒక్క రోజుకే పరిమితం చేసి చేతులు దులుపుకోకుండా ఆ అక్రమ కట్టడాలపై పర్యవేక్షణ నిత్యం కొనసాగాలి. తొలగించిన కట్టడాలను పాతబస్తీ వంటి కొన్ని ప్రాంతాల్లో తిరిగి నిర్మిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని అరికడితేనే ప్రభుత్వ లక్ష్యం సఫలమవుతుంది. ఎలాంటి ఒత్తిడిలకు లొంగకుండా పాతబస్తీతో సహా నగరంలోని నలుమూలల రహదారులపై అక్రమంగా వెలిసిన కట్టడాలన్నింటినీ తొలగించాలని నగరవాసులు అందరూ కోరుకుంటున్నారు. ఆక్రమణల తొలగింపుతో గ్రేటర్ రహదారులకు మహర్దశ ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. ఇలాంటి బహత్కరమైన కార్యమ్రాలను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా కొనసాగిస్తే కబ్జాదారులు మరోసారి అక్రమాలు చేయడానికి సాహసించరు. - ఐ.వి.మురళీకృష్ణ
తెహ్రాన్కు ఆయుధాలు పంపితే బీజింగ్కు తీవ్ర సమస్యలు
చైనాకు ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తెహ్రాన్కు ఆయుధాలు పంపితే బీజింగ్ తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అటువంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని సూచించారు. హోర్మూజ్ను తిరిగి తెరవడానికి వీలుగా సీమైన్స్ను తొలగించడానికి తమ దళాలు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్తో చర్చలు విఫలమైనప్పటికీ అంతిమ విజయం తమదేనని పేర్కొన్నారు. ఆ దేశాన్ని సైనిక పరంగా ఓడించామని […] The post తెహ్రాన్కు ఆయుధాలు పంపితే బీజింగ్కు తీవ్ర సమస్యలు appeared first on Visalaandhra .
మెదక్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి మెదక్ ఎమ్మెల్యే
మెదక్ ఏప్రిల్ 12 (జనం సాక్షి )నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి – మంత్రి, కలెక్టర్ తో మాట్లాడినమెదక్ ఎమ్మెల్యే పైనంపల్లి రోహిత్ …
సేవకు లభించిన గుర్తింపు.. ఇల్లెందు, ఆంధ్రప్రభ : ప్రజలకు సేవ చేసే అదృష్టం
ఇసుక ట్రాక్టర్ సీజ్, కేసు నమోదు..
ఇసుక ట్రాక్టర్ సీజ్, కేసు నమోదు.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం
Sesh’s Dacoit Day 2: Solid Hold
The box office trajectory of Adivi Sesh’s Dacoit, directed by Shaneil Deo, is turning more impressive. After a strong opening, Day 2 reports indicate solid hold. In fact, the second day collections are almost equal to day one. In the Telugu states, the movie sees exceptional occupancy rates. In overseas, the film has crossed $1 […] The post Sesh’s Dacoit Day 2: Solid Hold appeared first on Telugu360 .
Sharwa’s Biker sustains great momentum in second week
Sharwanand is enjoying a highly successful theatrical run with his latest release, Biker, which is holding its ground beautifully in its second week. Co-starring Malavika Nair, Rajasekhar and backed by the prestigious UV Creations, in the direction of Abhilash Reddy, the film has managed to sustain a very solid run at the ticket windows. The […] The post Sharwa’s Biker sustains great momentum in second week appeared first on Telugu360 .
ఉచితాలు ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం
డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి చెన్నై: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత హామీలపై వివరణ ఇచ్చారు. ఉచితాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, తాము మాత్రం దాన్ని ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం అని చెప్పారు. తమ మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ… గతంలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్ప్పుడు డబుల్ బర్నర్ గ్యాస్ స్టవ్లు ఇచ్చారు. పొగపొయ్యిలు తగ్గిన ఫలితంగా మహిళల ఆరోగ్యమూ మెరుగైంది. ఆడపిల్లకు 10వ తరగతి […] The post ఉచితాలు ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం appeared first on Visalaandhra .
పేదింటి పెళ్లికి చేయూతగా నిలిచిన కాంగ్రెస్ నేత..
పేదింటి పెళ్లికి చేయూతగా నిలిచిన కాంగ్రెస్ నేత.. ఇటిక్యాల, ఆంధ్రప్రభ : ఎర్రవల్లి
బీఆర్ఎస్ నాయకుల పరామర్శ.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : టేకుమట్ల మండలం రాఘవాపూర్ గ్రామంలో
Andhra Pradesh : ఉద్యోగులు కూటమి వైపేనా.. చంద్రబాబు ఆలోచన అదేనా?
కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను దగ్గరకు చేర్చుకుంటుంది
కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఒడితల గ్రామంలో
నెంబర్ ప్లేటు మారుస్తూ.. ట్రాఫిక్ పోలీసులను ఏమారుస్తూ...
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు
సీటీసీకి బెల్లంపల్లి బెస్ట్..! డీజీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
సీటీసీకి బెల్లంపల్లి బెస్ట్..! డీజీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :
ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు
ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.
చిన్నారుల దగ్గుమందు సిరప్ ల పై కేంద్రం కఠిన చర్యలు #CoughSyrup #ChildHealth #HealthRules
నాడు అడిషనల్ ఎస్పీగా.. నేడు డీజీపీగా..
నాడు అడిషనల్ ఎస్పీగా.. నేడు డీజీపీగా.. బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర పోలీస్
Summer Warning : హెచ్చరిక...పది రోజులు బయటకు రాకండి.. వస్తే మాడి మసైపోతారంతే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
12aprilsplstory |విశ్వం చూస్తోంది దైన్యంగా!
12aprilsplstory | విశ్వం చూస్తోంది దైన్యంగా! 12aprilsplstory | అమెరికా-ఇరాన్ యుద్ధం అసలు
నో హెల్మెట్ – నో పెట్రోల్.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పెట్రోల్ బ్యాంకుల
Gold Prices Today : గోల్డ్ లవర్స్ కు షాక్.. దూసుకుపోతున్న బంగారం
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది
విద్యుత్ సరఫరా నిలిపివేత.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని గిద్ద ముత్తారం సబ్
12thAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
12thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 12thAprilCartoon |రోబో సినిమా నుంచి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి..
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి.. కుంటాల, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టపడి
స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి
అమరావతి: గుంటూరు జిల్లా వరగాని గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది. స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తున్న చిన్నారిని చూసుకోకుండా బస్సును డ్రైవర్ కదిలించడంతో బస్సు చక్రాల కింద పడి చిన్నారి మృతి చెందింది. ఈ ప్రమాదం చూసిన బస్సు డ్రైవర్ భయంతో అక్కడినుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు రూప్ అన్వేష్ గా పోలీసులు గుర్తించారు.
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం..పదమూడు మంది మృతి
. బీహార్ లోని కటిహార్ లో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పదమూడు మంది మరణించారు.
హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ..
హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని
అమరావతి పేరిట లక్షల కోట్ల దోపిడీ –మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.
అమరావతి పేరిట లక్షల కోట్ల దోపిడీ – మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.
12aprchintana |సిగ్గు–బిడియం మధ్య జీవన సత్యాలు
12aprchintana | సిగ్గు–బిడియం మధ్య జీవన సత్యాలు 12aprchintana |సిగ్గు, బిడియం –
అకస్మాత్తుగా అడవి పంది రోడ్డు దాటడంతో..
అకస్మాత్తుగా అడవి పంది రోడ్డు దాటడంతో.. నిర్మల్ జిల్లా, దస్తూరాబాద్ ఆంధ్రప్రభ :
Telangana : నేడు ఇంటర్ ఫలితాలు
నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి.
IPl 2026 : ఫామ్ లోకి వచ్చిన చెన్నై.. ఢిల్లీకి మరొక ఓటమి
శనివారం చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ కాపిటల్స్ ను ఓడించింది
12aprileditorial |ప్రపంచ దేశాల ప్రేక్షక పాత్ర – అమెరికా–ఇరాన్ యుద్ధంపై మౌనంలో ప్రపంచం
12aprileditorial | ప్రపంచ దేశాల ప్రేక్షక పాత్ర – అమెరికా–ఇరాన్ యుద్ధంపై మౌనంలో
శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరోగా రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో హీరో వెంకట్ మాట్లాడుతూ “దర్శకుడు రాజ్ తాళ్లూరి అద్భుతంగా సినిమాను తీశారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. మణి జిన్న అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇది మంచి కమర్షియల్ ఎంటర్టైనర్”అని అన్నారు. డైరెక్టర్ రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ “‘ఈ సినిమా కోసం వెంకట్ ప్రాణం పెట్టి పనిచేశారు. హెబ్బా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, చంద్ర మహేష్, మణి జిన్న, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Iran - America Talks : ఇరాన్ -అమెరికా చర్చలు ఫలితం తేల్చలేదా? అసంపూర్తిగానే?
అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి
చంద్రుడిని చుట్టేసి వచ్చిన ఆర్టెమిస్-2
వాషింగ్టన్: చంద్రుడి చుట్టూ విజయవంత పరిభ్రమణం తరువాత అమెరికా నాసాకు చెందిన ఆర్టెమిస్ బృందం తిరిగి భువికి చేరింది. 50 సంవత్సరాల తరువాత చంద్రుడిపైకి మానవ సంచారం చారిత్రక ఘట్టం అయింది. ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడియన్తో కూడిన నలుగురు వ్యోమగాముల బృందంతో కూడిన ఆర్టెమిస్ 2 నౌక ఒరాయన్ క్యాప్సూల్ శనివారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 5.38 గంటలకు పసిఫిక్ మహాసముద్రం శాన్డియాగో తీరంలో సురక్షితంగా దిగింది. చంద్రుడి వీక్షణం, వాతావరణ పరిశీలన ముగిసింది. ఇక తమ ముందున్న లక్షం చంద్రుడిపైకి నిరంతరాయంగా మనుష్యులను చేరవేయడం అని నాసా నిర్వహణాధికారి, భారతీయ సంతతికి చెందిన అమిత్ క్షత్రియ విలేకరుల సమావేశంలో తెలిపారు. బృందం తీరం చేరిన తరువాత కొద్ది సేపటికి విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు ఆర్టెమిస్ క్యాప్సూల్ ల్యాండింగ్ దృశ్యాలను కోట్లాది మంది పలు రకాల సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించారు. ఆర్టెమిస్ 2 విజయవంతం అయింది. ఇక చంద్రుడిపై అడుగిడే అత్యంత కీలక ఘట్టంతో కూడిన ఆర్టెమిస్ 4 తమ చంద్రమండల యాత్రల్లో భాగంగా, కొనసాగుతుందని నాసా అధికారి క్షత్రియ తెలిపారు. చంద్రుడి వైపు మార్గం సుగమం అయింది. ఇకపై మిగిలిన లక్షం సంపూర్తి అతి గొప్పది. ఇప్పుడు సాధించినది అతి తక్కువే అవుతుందని వ్యాఖ్యానించారు. నాసా తదుపరి లక్షాలు మనిషి చంద్రుడిపై నేరుగా దిగడం, అక్కడ ఉండేందుకు అవసరం అయిన శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవడం అని క్షత్రియ తెలిపారు. చంద్రుడిపై పరిభ్రమణపు ఇప్పటి యాత్రలో కమాండర్ రీడ్ వైజ్మ్యాన్, పైలట్ విక్టర్ గ్లోవర్, క్రిస్టియానా కోచ్, కెనడాకు చెందిన జెరెమి హాన్సెన్ ఉన్నారు. 1972 డిసెంబర్లో చంద్రుడిపైకి వ్యోమగాములు యుగెన్ సెర్నాన్, హరిసన్ స్కిమిట్ చేరుకుని , ముడు రోజుల పాటు చంద్రుడి ఉపరితల అధ్యయనం పూర్తి చేసుకుని వచ్చారు. ఈ కీలక చంద్ర మండల యాత్ర తరువాత చేపట్టిన రెండో యాత్ర ఇదే అయింది. ఈ యాత్ర వ్యోమగాములు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఈ యాత్ర సంచాలకులు రిక్ హెన్ఫ్లింగ్ తెలిపారు. 24000 మైళ్ల వేగం వేడిమి క్యాప్సుల్ భూ వాతావరణంలోనికి గంటకు 24000 మైళ్ల వేగంతో ప్రవేశిస్తున్నప్పుడు విపరీతమైన వేడిమి ఉష్ణోగ్రతలు వెలువడ్డాయి. వీటిని తమ క్యాప్సూల్ పొరలు అత్యంత సమర్థవంతంగా తట్టుకున్నాయని, తాము సేఫ్ అని కమాండర్ వైజ్మ్యాన్ విజయ చిహ్నం చూపుతూ ప్రకటించారు. దీనితో నాసా మిషన్ కంట్రోలు రూంలో పెద్ద ఎత్తున చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. చంద్రుడిని దగ్గరి నుంచి పరిశీలించడంతో పాటు ఈ వ్యోమగాముల బృందం ఇప్పుడు చంద్రుడిపై సూర్యగ్రహణం కూడా వీక్షించింది. అప్పటి పరిణామాలను రికార్డు చేసకుంది. భూమి నుంచి చుంద్రడు, చంద్రుడి నుంచి భూమి ఏ విధంగా ఉంటాడు? చంద్రుడిపై పరిణామాలు ఏ విధంగా అనేది ఎప్పటికప్పుడు వీక్షించి వీడియోలు పంపించారు. చంద్రుడిపైకి భద్రంగా చేరడం, సురక్షితంగా ఆనందంగా తిరిగిరావడం అనే రెండు లక్షాలు నెరవేరాయని నాసా నిర్వాహకులు తెలిపారు. ఇది ఓ లక్కు కాదు, దీని వెనుక వేయి మంది అపార పరిశ్రమ దాగి ఉందని వెల్లడించారు. ఈ యాత్ర మొత్తం 700,237 మైళ్లు సాగింది. గరిష్ట వేగం గంటకు 24664. వ్యోమగాములకు ముందుగా వైద్య పరీక్షలు జరిపి, తరువాత వారిని హుస్టన్లోని నాసా కేంద్రంలో కొద్ది రోజుల పాటు పరిశీలనకు ఉంచుతారు. తరువాత వారికి పూర్తి స్వేచ్ఛ కల్పిస్తారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం(ఏప్రిల్ 12) ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో కలిసి ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు ఇంటర్ ప్రథ మ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చే యనున్నారు. http://tgbie.cgg.gov.in, http: //results.cgg.gov.in వెట్సైట్లో విద్యార్థులు ఇంటర్ ఫలితాల చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. అయి తే గతంతో పోలిస్తే ఈ సారి అత్యంత వేగంగా బో ర్డు ఫలితాలను విడుదల చేయనుంది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసే లక్ష్యంతో మార్చి మొదటి వారం నుంచే బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసింది. గతంలో సాధారంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలు చేసేవారు. ఈసారి మాత్రం గతంలో కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఇంటర్ ఫలితాలు ఈసారి త్వరగా విడుదల చేస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు త్వరగా నిర్వహించి విద్యాసంవత్సరం ప్రారంభం లోపే ఫలితాలు ప్రకటించనున్నారు. తద్వారా ఇంటర్ తర్వాత ప్రవేశాలు పొందే ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ కోర్సులలో విద్యార్థులు సకాలంలో ప్రవేశాలు పొందనున్నారు. వాట్సాప్లో ఇంటర్ ఫలితాలు రాష్ట్రంలో విడుదల కానున్న ఇంటర్ ఫలితాలు తెలంగాణ మీసేవా వాట్సాప్ చాట్బాట్ వాట్సాప్ ద్వారా నేరుగా తమ పరీక్ష ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీసేవా తెలంగాణ వాట్సాప్ నెంబర్ 8096958096కు ‘Hi’ అని మెసేజ్ పంపించడం ద్వారా మీసేవా చాట్బాట్ మొదలవుతుంది. ‘BIE Exam Result’ టైప్ చేసి Open Service ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత మీ రోల్ నంబర్ నమోదు చేయండి, సంవత్సరం (1వ / 2వ) స్ట్రీమ్ (జనరల్ / వొకేషనల్) ఎంచుకుని సమర్పిస్తే ఇంటర్ ఫలితం తక్షణమే వాట్సాప్లో వస్తుంది. రేపు దోస్త్ నోటిఫికేషన్ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాలు ఆదివారం విడుదల కానున్న నేపథ్యంలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ సోమవారం(ఏప్రిల్ 13) విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఉదయం 11.30 గంటలకు చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేయనుననారు. ఈసారి డిగ్రీ కోర్సులలో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మారుతున్న పరిశ్రమ అవసరాలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త కోర్సులను రూపకల్పన చేశారు.బిఎస్సిలో 9, బిబిఎలో 5, బి.కాంలో 3, బి.ఎలో 2, బిఎస్సి ఆనర్స్ నాలుగేళ్ల కోర్సులోనూ కొత్తగా 4 కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
12aprSunday2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
12aprSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక 12aprSunday2026 | ఈ సంచికలో… 1.జలియన్వాలా
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ వేదికగా అమెరికా , ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాల మధ్య ముఖాముఖి అధికారిక చర్చలు శనివారం రాత్రి జరిగాయి. ముందుగా వేర్వేరుగా తరువాత నేరుగా జరిగిన చర్చలు ముగిశాయి. తరువాత అమెరికా, ఇరాన్ ప్రతినిధుల బృందాలు పరస్పరం మధ్యమధ్యలో మూడు పక్షాల మధ్య త్రైపాక్షిక చర్చలు కూడా జరిగాయి.రెండో దఫా చర్చలు శనివారం అర్థరాత్రి తరువాత కానీ ఆదివారం కానీ జరుగుతాయని ఇరాన్ టీవీ తెలిపింది. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ అధికార వర్గాలు నిర్థారించలేదు. 1979 నాటి ఇస్లామిక్ రెవెల్యూషన్ తరువాత ఇరాన్ అమెరికా మధ్య జరిగిన ముఖాముఖీ చర్చలు ఇవే. ఇప్పుడు కుదిరిన అంగీకారానికి క ట్టుబడి ఉంటామని ఇరుపక్షాలు తెలిపాయి. లిఖితపూర్వక పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. సర్దుబాట్లకు సమ్మతిస్తున్నామని ఇందులో తెలియచేసుకున్నట్లు వెల్లడైంది. పశ్చిమాసియా పోరుకు శాశ్వ త శాంతి పరిష్కారం దిశలో ఇస్లామాబాద్లో సా గుతోన్న సంప్రదింపులపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠత నెలకొంది. ఇరాన్ డిమాండ్లలో అత్యంత కీలకమైన మూడు నాలుగింటిపై అమెరికా నుంచి సానుకూ ల స్పందన వెలువడిందని స్పష్టం అయింది. ఖతా ర్ ఇతర దేశాల్లోని ఇరాన్ బ్యాంకు ఖాతాల స్తంభ న ఎత్తివేత, ఆస్తుల విడుదల, ఇరాన్ సొంతం చేసేందుకు అంగీకారం కుదిరిందని వెల్లడైంది. లె బనాన్పై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా అమెరికా హామీ ఇచ్చింది. దీని తరువాతనే ఇరాన్ బృందం నేరుగా అమెరికా బృందంతో చర్చలకు సిద్ధపడింద ని అధికార వర్గాలు అంతర్గతంగా తెలిపాయి. అమెరికా ఉన్నత స్థాయి బృందంలో దేశ ఉపాధ్యక్షులు జెడి వాన్స్, ట్రంప్ అల్లుడు, జెర్డ్ కుశ్నేర్, మిడిలిస్టు దూత స్టీవ్ విట్కాఫ్ ఉన్నారు. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అరాగ్చి, స్పీకర్ ఘాలీబాఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముందుగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు దేశాల ప్రతినిధి బృందాలతో వేర్వేరుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ దశలో అత్యంత కీలకమైన క్లిష్ట అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. తమ షరతులు నెగ్గితేనే నేరుగా పరస్పర చర్చలు ఉంటాయని షరీఫ్కు ముందుగా ఇరుదేశాల ప్రతినిదులు తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే వారికి నచ్చచెప్పి, పరోక్ష చర్చలతో లాభం లేదని, నేరుగా మాట్లాడుకుంటేనే ఫలితం ఉంటుందని పాక్ ప్రధాని వారికి నచ్చచెప్పినట్లు , తరువా త ముఖాముఖీ చర్చలు జరిగినట్లు స్పష్టం అయిం ది. చర్చలు పురోగతిలో ఉన్నాయనే ఆశిస్తున్నట్లు పాక్ అధికార వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. తీవ్రస్థాయి ఉద్రిక్తతల తరువాత ఇరుదేశాల ప్రతినిధి బృందాలు నేరుగా మాట్లాడుకోవడం ఇదే తొ లిసారి అని ఈ చర్చలపై పాకిస్థాన్ టీవీ వార్తా కథనాలు వెలువరించింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ సమర్థవంత దౌత్యనీతిని చాటేందుకు విశేషాలను జోడించారు. ఈ చర్చలతో ఇరుపక్షాల మధ్య శాం తికి వీలేర్పడుతుందని ప్రపంచ నేతలు సహేతుక ప్రకటనలు వెలువరించారని, పాక్ దౌత్యనీతి విజ యం దిశలో సాగుతోందని తెలిపారు. తొలి దఫా చర్చల తరువాత పాకిస్థాన్ విదేశాంగ కార్యాల యం నుంచి సంబంధిత విషయాలపై అధికారిక ప్రకటన వెలువడుతుందని ఓ అధికారి నిర్థారించా రు. ఈ చర్చలతో సుస్థిర శాంతి స్థాపనకు మార్గం ఏర్పడుతుందని తాము ఆశిస్తున్నట్లు ప్రధాని షరీఫ్ తెలిపారు. చర్చలలో ఇరాన్ వైఖరి పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అమెరికా , ఇరాన్ ప్రతినిధి బృందాలతో చర్చలలో పాకిస్థాన్ తరఫున ప్రదాని షరీఫ్తో పాటు దేశ విదేశాంగ మంత్రి, ఉప ప్రధా ని ఇషాఖ్ డార్, సైనిక దళాల ప్రధానాధికారి మా ర్షల్ అసిం మునీర్, అంతర్గత వ్యవహారాల మం త్రి మెహిసన్ రజానక్వీ ఇతరులు పాల్గొన్నారు. ఇ స్లామాబాద్లో చర్చలు ఐదు గంటలు ఆలస్యం గా మొదలయ్యాయని తెలిసిందని అంతకు ముందు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ షరతుల తో ఈ పరిస్థితి ఏర్పడిందని, తాము అన్ని గమని స్తూ ఉన్నామని, చర్చల పట్ల ఇరాన్ వైఖరి, చిత్తశు ద్ధి ఏమిటనేది తెలుస్తూనే ఉందన్నారు. చర్చలు విఫలమైతే భారీ మూల్యం : ట్రంప్ ఇస్లామాబాద్ చర్చలు ఎలా జరగుతున్నాయో తన కు అవగాహన కానీ, సమాచారం కానీ లేదని అ మెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కానీ తక్కువ సమయంలోనే ఇరాన్ చిత్తశుద్ధిని చర్చల విషయంలో అంచనా వేయగలమని అన్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్పై దాడులు భీకరంగా ఉంటాయని, అత్యంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శక్తివంతమైన ఆ యుధాలు ప్రయోగిస్తామన్నారు. ఇరాన్తో చ ర్చ లు ఆలస్యం కావడంపై కొంత అసహనం వ్యక్తం చేశారు. హర్మూజ్ జలసంధి వీలైంనత త్వరగా తెరుచుకోబోతోందని, ప్రత్యామ్నాయ రవాణా మా ర్గాలు కూడా అన్వేషిస్తున్నట్లు ట్రంప్ వివరించారు. ఇరాన్ను విఫలమవుతున్న దేశంగా పేర్కొన్నారు.
మన తెలంగాణ/నాంపల్లి: దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపుతున్నదని, డీలిమిటేషన్ ప్రక్రియల్లోనూ చట్టసభలకు సీ ట్లు పెంచడంలోనూ అదే తరహాలో వ్యవహరిస్తున్నదని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2011 జనాభా లె క్కల ప్రకారం కేంద్రం ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ద్రవిడ రాష్ట్రాల రాజకీయ ఉనికే ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఈ మేరకు శనివారం రవీంధ్రభారతిలో రాష్ట్ర బీసీ సం క్షేమశాఖ పక్షాన జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజాపాలన సర్కార్ సామాజిక స్పృహ, సామాజిక న్యాయానికి పూర్తిగా కట్టుబడి పనిచేస్తోందని, త్వరలో బీసీలకు సబ్ప్లాన్ గురిం చి ఆలోచన చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తున్నదని, అదే ఇతర పార్టీలు అ ధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ఒక రూపాయి పన్ను ల రూపంలో వెళ్లగా.. తిరిగి 37 పైసలు మాత్రమే పంపిస్తున్నదని, అదే బీజేపీ పాలిత యూపీ, ఎం పీ, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తున్నదని ఆయన వివరించారు. నిధుల రాబడిలో కేంద్రం తెలంగాణకు నష్టం చేస్తోందని, రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తుల పునరేకీకరణ యత్నం జరుగుతుందని, ఈ నేపథ్యంలో బహుజనులు ఏ కం కావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన లెక్కల ప్రకారం తెలంగాణలో ఎమ్మెల్యేలు, లోకసభ స్థానాలు పెరుగాల్సి ఉన్నదని, కానీ, కేంద్రం మాత్రం 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకొని దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను తగ్గించేందుకు యత్నిస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా సీడబ్లూసీ సమావేశంలో సీఎం రేవంత్ గళం విప్పరాని, దీని గురించి పెద్ద చర్చ జరుగుతోందని గుర్తుచేశారు. కేంద్రం ఇష్టారీతిన, రాజకీయ దురుద్దేశంతో దక్షిణాది రాష్ట్రాలను బలహీనపర్చేందుకు కేంద్రం పన్నుల్లో వాటాను తగ్గించిందని పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్రంపై తమ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చేందుకు యత్నిస్తోందన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయదేవి, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, జాతీయ బీసీ ఉద్యమ నాయకులు గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్, నీల వెంకటేశ్, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, బీసీ ఆర్థిక సంస్థ చైర్మన్ నూతి శ్రీకాంత్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీడీని ఆవిష్కరించారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తమను వేధిస్తున్నారని, ఆయన కారణంగా తాను ఆసుపత్రి పాలైనట్లు ఆరోపిస్తూ ఎక్సై జ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కమిషనర్ హరికిరణ్ వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపణలు చేస్తూ డిసి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఇటీవల ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీల నిమిత్తం కమిషనర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు తన పట్ల హరికిరణ్ దుర్భాషలాడినట్లు సోమిరెడ్డి ఈ వీడియోలో ఆరోపించారు. అతడి మాటలను తట్టుకోలేక తాను కిందపడిపోయాయ ని దాంతో తనను స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. తాను ఈ విషయంలో చాలా ఆవేదనకు గురైనట్లు, ఉ ద్యోగం వీడాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారులకు, మిత్రులకు, ఎక్సైజ్ కుటుంబ సభ్యులకు సోమిరెడ్డి ధన్యవాదా లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉం దని ఆయన తెలిపారు. తనలాంటి వ్యక్తి ఈ శాఖ లో ఇమడలేడని చాలాసార్లు అనిపించిందని, తన మేలుకోరే ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఇన్ని రోజులు తాను నెట్టుకొచ్చానని వారికి ఎప్పటికీ రు ణపడి ఉంటానని ఆయన తెలిపారు. ఇక, ప్రస్తు తం తాను ఈ ఉద్యోగంలో ఇమడలేనని పూర్తిగా అర్థం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. చేయని తప్పుకి వెధవ, ఇడియట్ అన్నప్పుడు తన సున్నిత మనస్తత్వం ఆ మాటను స్వీకరించలేక పోయిందన్నారు. తాను ఒక్కటే మాట ఎదురు చెప్పానని, ఇలాంటి మాట అనొద్దు సార్ అని మాత్రమే అన్నానని, తాను ఎదురు చెప్పిన ఆ చివరి మాటకు కమిషనర్ ఈగో హర్ట్ అయిందనుకుంటానని ఆయన తెలిపారు. ఆకలితోనైనా చస్తాం కానీ.. నా జీవితంలో ఎన్నడూ ఎదుర్కొని ఘోర అవమానం కమిషనర్ చేశారని ఆయన తెలిపారు. నాతోనే నేను వేధవను అనిపించేలా ప్రయత్నం చేశారన్నారు. అదే గదిలో నలుగురు అధికారులు, సిబ్బంది ఉన్నారని, వారి ముందు నాకు పరిస్థితి రావడం చాలా మానసిక వ్యధకు గురి చేసిందన్నారు. అరేయ్, ఒరేయ్, వెధవ, ఇడియట్, యూస్ లెస్ ఫెలో ఇలా చాలా అవమానకరమైన పదాలతో తిట్టినా, దూషించినా ఇన్నాళ్లు నెట్టుకొస్తున్న అధికారులకు, మిత్రులకు ఇతర అధికారులకు నమస్కారమని, తాను పెరిగిన వాతావరణంలో ఆత్మాభిమానంతో బ్రతకడమే జీవింతం అని నమ్మానని, ఆకలితోనైనా చస్తాం కానీ, ఆత్మాభిమానం వదులుకోలేనని సోమిరెడ్డి తెలిపారు. అన్న కాళోజీ మాటలు యాది చేసుకుంటూ చేతకాని చావలేని, చైతన్యం చచ్చిపోయిన ఈ శాఖలో 30 సంవత్సరాలుగా పని చేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నానన్నారు. నా కుటుంబ సభ్యులతో చర్చించానని, ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదని తలచి శాఖను (ఉద్యోగం) వీడి వెళ్లాలని బాధతో నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఇన్ని సంవత్సరాలు తనతో ప్రయాణం చేసిన, తనకు సహకరించిన ఉన్నతాధికారులకు మిత్రులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలని ఆయన అన్నారు. ఈ వీడియో పోస్టు ఎంతో మానసిక సంఘర్షణకు లోనై పెడుతున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలి: జేఏసి చైర్మన్ లచ్చిరెడ్డి ఎక్సైజ్ కమిషనర్ తీరుపై తెలంగాణ ఉద్యోగుల జేఏసి చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరికిరణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు పెన్డౌన్కు సైతం పిలుపునిచ్చినట్టు వారు ప్రకటించారు. ఆబ్కారీ శాఖ కమిషనర్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులను దూషిస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న ఆబ్కారీ కమిషనర్ తీరును వారు ఖండించారు. -
మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా: రేవంత్ సర్కార్ ఫ్యూచర్సిటీ మాటున రియల్ మాఫియాను పెంచి పోషిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రా మారావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి రియల్ దందా కొనసాగించేందుకే ఫ్యూచర్ సిటీని ఎంచుకున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఈ మేర కు శనివారం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సమీపంలోని బొం గ్లూర్ ప్రమిద గార్డెన్స్లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థా యి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మం త్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్ మాట్లాడు తూ.. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరు తో రియల్ దందాకు తెరలేపారని ఆయన ఆరోపించారు. గడిచిన రెండున్నరేండ్ల పాలన అగమ్యగోచరంగా మారిందన్నారు. రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా రూ.27వేల కోట్లు రుణమాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలోకి రాగానే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కేవలం 11వేల ఉద్యోగాలు ఇవ్వలేక చేతులెత్తేసిందంటూ ఆయన విమర్శించారు. మహిళలకు తులం బంగా రం, యువతకు స్కూటీలు, అత్తా కోడళ్లకు రూ.2,500 ఇస్తామన్న హామీలు నీటి మీద రాతలుగా మారాయన్నారు. రూ.200 పింఛన్ రూ.2 వేలకు పెంచిన ఘనత కేసీఆర్దని ఆయన అన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప రాష్ట్రానికి పైసా నిధులు రాబట్టలేకపోతున్నాని ఆయన మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దందాలకు రేవంత్ సర్కార్ తెరలేపిందన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు రియల్ దందాకు ఇది అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం 16 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోటి ఎకరాలకు చేరిందన్నారు. రేవంత్ సర్కార్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో రాబోయేవి అసెంబ్లీ ఎన్నికలు కావని, కేసీఆర్ ఎన్నికలని ఆయన అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలతో పాటు అధికారులు సైతం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి క్యామ మల్లేష్, రైతు సమన్వయ సమితి నేత వంగేటి లకా్ష్మరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ టేకుల సుదర్శన్రెడ్డి, యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఎండలను దృష్టి లో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో మూ డు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తుండటం తో రేషన్ దుకాణాల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఒ క్కరికీ (మూడు నెలలకు సంబంధించి 18 కిలోల బియ్యాన్ని) నెలాఖరు వరకు తీసుకోకపోతే కోటా రద్దు చేస్తామని రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రేషన్షాపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. దీనికి తోడు రేషన్షాపుల వద్ద సాంకేతిక సమస్యలు తలెత్తడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ప లు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మూ డు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపి ణీ ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైంది. రాష్ట్ర వ్యా ప్తంగా రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. సన్న బియ్యం పంపిణీ పథకం కింద ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున మొత్తం మూడు నెలలకు కలిపి 18 కిలోల బియ్యం పంపిణీ జరుగుతుంది. రేషన్ బియ్యం రవాణా నిల్వ పరిమితు ల కారణంగా కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే పంపిణీ చేపట్టింది. రేష న్ బియ్యం పంపిణీ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రా ష్ట్రంలోని ప్రధాన గోదాంల నుంచి జిల్లాలోని లబ్ధిదారులకు సరిపడా బియ్యం నిలువలను సివిల్ సప్లయ్ శాఖ సరఫరా చేస్తోంది. బయోమెట్రిక్తో చిక్కులు.. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ నిబంధనల ప్రకారం మూడు నెలల బియ్యం తీసుకోవాలంటే లబ్ధిదారు లు ఈ-పాస్ యంత్రంపై మూడుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. ప్రతి నెలకు విడివిడిగా అథెంటికేషన్ చేయాల్సి రావడంతో ఒక్కో కార్డుకు 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది. ఒకేసారి లక్షలాది మంది బయోమెట్రిక్ వేస్తుండటంతో సర్వర్లపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వేలిముద్రలు పడక ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఎండలు మండుతుండటంతో వృద్ధులు, మహిళలు షాపుల వద్ద తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రద్దీని తగ్గించేందుకు కొన్ని చోట్ల డీలర్లు టోకెన్ సిస్టమ్ ప్రవేశపెట్టినప్పటికీ, అది మరింత గందరగోళానికి దారితీస్తోంది. మరోవైపు, గోదాంల నుంచి వస్తున్న బియ్యం బస్తాల్లో తూకం తక్కువగా ఉందని డీలర్లు ఆరోపిస్తున్నారు. 50 కేజీల బస్తాలో 4 కేజీల వరకు తక్కువగా వస్తోందని, దీంతో తాము నష్టపోతున్నామని డీలర్ల సంఘం నేతలు పేర్కొంటున్నారు. అయితే బియ్యం పంపిణీ ప్రక్రియ ఈ నెల మొత్తం కొనసాగుతోంది. అలాగే, మూడుసార్లు థంబ్ వేసే పద్ధతిని మార్చి, ఒకే వేలిముద్రతో 3 నెలల బియ్యం ఇచ్చేలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని వారు కోరుతున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై విజయం
ఐపిఎల్ 2026లో ఎట్టకేలకు చెన్నై బోణీకొట్టింది. సంజు శామ్సన్ సెంచరీతో చెలరేగగా.. బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆకట్టుకున్నారు. దీంతో లక్ష ఛేదనకు దిగిన ఢిల్లీని .. పరుగులకే కట్టడి చేశారు చెన్నై బౌలర్లు. దీంతో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 213 పరుగుల లక్ష ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లలో పాతుమ్ నిశాంక(41), ట్రిస్టన్ స్టబ్స్(60)లు రాణించినా.. మిగతా బాటర్లు రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దాంతో ఢిల్లీ ఓటమిని మూటగట్టుకుంది. సంజూ సెంచరీ.. ఈ మ్యాచ్లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (15) త్వరగానే ఔట్ అయ్యా డు. ఈ క్రమంలో సంజు శాంసన్, ఆయుష్ మాత్రేతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. మ్యాచ్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు సంజూ. మాత్రే 36 బంతుల్లో 59 పరుగులు చేసి, రిటైర్డ్ ఔట్గా వెనుదిరగగా.. సంజు మాత్రం మరో ఎండ్లో దూకుడుగా ఆడుతూ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీపూర్తి చేసిన సంజు.. ఈ సీజన్లో తొలి శతకం నమోదు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఐపిఎల్లో ఓవరాల్గా నాలుగోది కావడం విశేషం. ఇక చివరలో శివమ్ దూబే (20 నాటౌట్) కూడా వేగంగా ఆడడంతో చెన్నై స్కోర్ 200 దాటింది.
పార్టీ ఫిరాయింపులను దేవుడు ప్రోత్సహించడం ఎంత మాత్రం బాగాలేదు. అదేంటి, పార్టీ ఫిరాయింపుల్ని దేవుడు ఎందుకు ప్రోత్సహిస్తాడు అనుకుంటున్నారా? సీనియర్ రాజకీయ నాయకుడు తాటిపర్తి జీవన్రెడ్డి శుక్రవారంనాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును చూడగానే భావోద్వేగంతో అన్నా, నీతో కలిసి పని చేయమని దేవుడే నన్ను పంపించాడు అన్నారు. జీవన్రెడ్డి ఈ మాటలు అన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలే ఆధారం. పార్టీ ఫిరాయింపులు అనైతికమని 2023లో ఓడిపోయిన దగ్గర నుండి భారత రాష్ట్ర సమితి అనని రోజు లేదు. తమ పార్టీనుంచి పదిమంది శాసనసభ్యులు కాంగ్రెస్కు వలసపోవడం అనైతికమని ఇంటాబయటా.. అంటే శాసనసభలోనూ, న్యాయస్థానాల్లోనూ వాదించిన పార్టీ భారత రాష్ట్ర సమితి. ఆ పదిమంది శాసనసభ్యులు తాము ఇంకా భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నామని అభివృద్ధి, సంక్షేమాలు ప్రజలకు అందించడంకోసమే కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నారు, అది వేరే విషయం. వచ్చే రెండున్నర సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా సభలో విప్ జారీ చేసే అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది పదిమంది శాసనసభ్యులు ఏమవుతారు అన్నది. అయితే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్రెడ్డిని కెసిఆర్తో కలిసి పనిచేయమని దేవుడే పంపించి ఉంటే ఆ పదిమంది శాసనసభ్యులను కూడా దేవుడే ‘మీరు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలసి ప్రజలకు మంచి చేయండి’ అన్నాడేమో.అయితే ఈ పదిమందికి, సీనియర్ రాజకీయవేత్త జీవన్రెడ్డికి పార్టీ ఫిరాయింపు విషయంలో తేడా ఉంది. ఆ పదిమంది భారత రాష్ట్ర సమితి టికెట్ మీద శాసనసభ ఎన్నికయినవారు. జీవన్రెడ్డి ప్రస్తుతం ఏ చట్టసభలోనూ లేరు. కాబట్టి ఎవరి రాజకీయాలు సరైనవి, ఎవరితో కలిసి పనిచేయాలి అన్నది ఆయన ఇష్టం. నలభైఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆయనకు కాంగ్రెస్ విధానాలో, వ్యవహార శైలో నచ్చలేదు, పార్టీ మారారు. ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. అయినా పార్టీ ఫిరాయింపుల గురించి సీరియస్గా ఆలోచించే రోజులు పోయాయి. 1970వ దశకంలో హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి ప్రాంతానికి సంబంధించిన ఒక భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే కొన్ని నెలలపాటు చర్చ జరిగింది. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు, కాంగ్రెస్ విధివిధానాలకు పోలికే లేదు కదా ఎందుకు పార్టీ ఫిరాయించి ఉంటాడు అని. అంత ఛోటా నాయకుడు పార్టీ మారితే కూడా అంత పెద్దయెత్తున చర్చ జరిగింది. అదే పార్టీలో కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత చాలా పెద్ద నాయకుడు, పార్టీలకతీతంగా అత్యంత గౌరవం పొందిన నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు తన కుమారుని రాజకీయ భవిష్యత్తుకోసం అప్పటి అధికారపక్షం అయిన తెలుగుదేశం పార్టీలో చేరితే దానిమీద పెద్దగా చర్చ జరగలేదు. అంటే, అప్పటికి పార్టీలు మారడం చాలా సాధారణం అయిపోయింది. మిగతా పార్టీలలో ఫిరాయింపుల పరిస్థితి ఎలా ఉన్నా, వామపక్ష పార్టీల్లో చేరేవారు సాధారణంగా కమ్యూనిస్టు సిద్ధాంతానికి నిబద్ధులై ఉంటారని భావిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు జరుగుతున్న పార్టీ ఫిరాయింపులకు, ఆ సంఘటనలకు అసలు పోలిక లేదు. ఇప్పుడు జరిగే ఫిరాయింపులు అధికారం కోసం లేదా అధికారంలో ఉన్నవారి నుంచి పొందాలనుకున్న ప్రయోజనాల కోసం. అవి ప్రజాప్రయోజనాలు కావచ్చు, వ్యక్తిగత ప్రయోజనాలు కావచ్చు. సీనియర్ నాయకుడు జీవన్రెడ్డిని కొంచెం భిన్నంగా చూడాలి. తెలంగాణ ప్రాంతంలో ఆయన ముక్కుసూటి మనిషి, నిజాయితీపరుడని పేరు తెచ్చుకున్న నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినవాడు. ఒక్క పర్యాయం మినహాయిస్తే ప్రజాజీవితం అంతా కాంగ్రెస్ పార్టీలోనే గడిచింది. 1983లో అప్పుడప్పుడే ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడుగా ఎన్నికై మంత్రి పదవి కూడా చేపట్టిన జీవన్రెడ్డి 1984లో నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసి తర్వాత కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరి దాదాపు ఆరుసార్లు జగిత్యాల నియోజకవర్గంనుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఒకసారి ఉత్తర తెలంగాణ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గంనుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. మూడుసార్లు లోకసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రెండుసార్లు ఆయన కరీంనగర్ లోక్సభకు కెసిఆర్ మీదనే పోటీచేసి ఓడిపోయారు. మొదటిసారి దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతే, రెండవమారు అతి స్వల్పంగా కేవలం పదిహేనువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని కొద్దిమాసాలుగా వినిపిస్తూనే ఉన్నది. ఏం కోరి ఆయన కాంగ్రెస్ను వీడి భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారు? ఏం ఆశించి భారత రాష్ట్ర సమితి ఆయనను తన అక్కున చేర్చుకుంటున్నది? సాధారణంగా పార్టీ ఫిరాయింపులు ప్రతిపక్షంనుండి అధికారపక్షంలోకి జరుగుతుంటాయి. జాతీయ రాజకీయ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఆ పార్టీ అధికారంలో ఉండగా, భవిష్యత్తు ఇంకా స్పష్టంగా లేని ప్రాంతీయపార్టీలో చేరాలని ఆయన ఎందుకు నిర్ణయించుకున్నారు? ఈ విషయం రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్నవారికంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ ఆలోచించాలేమో. అధికారపక్షానికి కనిపించని బిఆర్ఎస్ అనుకూల వాతావరణం ఏదైనా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతూ జీవన్రెడ్డికి కనిపిస్తున్నదా? జీవన్రెడ్డి ప్రస్తుతం పార్టీ వీడి బిఆర్ఎస్లో చేరడానికి చెబుతున్న కారణాలు ఏవైనా, జగిత్యాలనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రాష్ట్ర సమితి శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కాంగ్రెస్కు వలసపోవడమే ప్రధాన కారణమని అందరికీ తెలుసు. తనమీదనే గెలిచిన సంజయ్తో కలిసి పనిచేయడం జీవన్రెడ్డి వల్ల కాని పని. కాంగ్రెస్ పెద్దలు, ముఖ్య నాయకులు, పిసిసి అధ్యక్షునితో సహా సీనియర్ మంత్రులు కూడా వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇంత రాజకీయ జీవితం చూసిన తర్వాత జీవన్రెడ్డి ఇంకా ఏం ఆశిస్తున్నట్టు? చాలామందికి రాజకీయాల్లో దక్కనన్ని అవకాశాలు ఆయనకు వచ్చాయి. ఇన్ని దశాబ్దాలుగా తాను పార్టీకి పనిచేస్తూ ఉంటే మధ్యలో వచ్చిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఏమిటన్న దుగ్ధ కూడా ఆయనను బాధిస్తూ ఉండవచ్చు. అది మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులలో కూడా ఉండవచ్చు. అయితే అటువంటి ఆలోచన చేస్తున్నవారు ఎవరైనా సరే, జీవన్రెడ్డితోసహా, కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఆ ఖాళీ ఎందుకు ఏర్పడింది? రేవంత్రెడ్డి వచ్చి ఆ ఖాళీని పూరించి ముఖ్యమంత్రి కావడానికి అవసరమైన వాతావరణం ఎందుకు ఏర్పడింది? అని కదా ఆలోచించాలి. మొదటినుంచీ కాంగ్రెస్తో ఉన్న నాయకులు ఎందుకు రేవంత్రెడ్డిలు కాలేకపోయారు? సరే, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడం దగ్గర నుండి బిఆర్ఎస్కు చెందిన సంజయ్ కాంగ్రెస్లో చేరడంవరకు ఉన్న పలు కారణాలు జీవన్రెడ్డిని భారత రాష్ట్ర సమితిలోకి పంపించి ఉండవచ్చు. ఒక దశలో ఆయన భారతీయ జనతా పార్టీలో కూడా చేరతారని ప్రచారం జరిగింది. అయితే మైనారిటీలను దూరం చేసుకోవాల్సి వస్తుందని ఆయన ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిసింది. ఇక భారత రాష్ట్ర సమితి విషయానికొస్తే అధికారంలో లేదు కాబట్టి ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానించడం, అందునా జీవన్రెడ్డివంటి బలమైన నాయకుడు రావడం అనుకూల అంశంగానే భావిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిననాటి నుండి కూడా చంద్రశేఖరరావు ఉత్తర తెలంగాణ, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కేంద్రంగానే ఉద్యమంగానీ, రాజకీయంగానీ నడిపించారు. మూడుసార్లు ఆయన కరీంనగర్ లోకసభ స్థానంనుండి పోటీచేసి గెలిచారు (2004, 2006, 2008). తన సొంత జిల్లా మెదక్ను కాకుండా కెసిఆర్ కరీంనగర్ని ఎంచుకోవడం, ఆయన కుమారుడు కెటి రామారావు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్లనుండే రాజకీయ అరంగేట్రం చేయడం ఇవన్నీ కెసిఆర్, ఆయన పార్టీ కరీంనగర్కి ఇచ్చిన ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. పార్టీలో ఉండిన మరో బలమైన నాయకుడు ఈటల రాజేందర్ని బయటికి పంపించిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో బలమైన నాయకుడి అవసరం ఉందని భావించి కెసిఆర్ జీవన్రెడ్డికి ఆహ్వానం పలికారా? జీవన్ రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి బలం వచ్చే ఎన్నికల నాటికి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఇదే చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఈనెల 20వ తేదీన భారీ జనసమీకరణ జరిపి జగిత్యాలలో నిర్వహించే బహిరంగసభలో జీవన్రెడ్డి బిఆర్ఎస్లో చేరబోతున్నారు. ఈ బహిరంగసభలో కెసిఆర్ కూడా ప్రసంగిస్తారని వార్తలు వెలువడ్డాయి. పార్టీ రజతోత్సవ సభలో ప్రసంగించిన తర్వాత బహిరంగవేదికల మీదికి కెసిఆర్ రావడం ఇదే మొదలు అవుతుంది. సుదీర్ఘ రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్లో లభించని ప్రాధాన్యత భారత రాష్ట్ర సమితిలో లభిస్తుందని జీవన్రెడ్డి భావిస్తున్నారా? అన్నది ఒక ప్రశ్న అయితే మహామహా కాంగ్రెస్ దిగ్గజాల్ని తన పార్టీలో చేర్చుకొని తరువాత మూలన కూర్చోపెట్టగలిగిన కెసిఆర్ జీవన్రెడ్డిని ఏం చేస్తారో చూడాలి. జీవన్రెడ్డిని పార్టీ వీడకుండా చూసే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం నిస్సహాయంగా ఉండిపోయిందనీ, అంతా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇష్టప్రకారం జరుగుతున్నదనీ ఒక చర్చ జరుగుతున్నది. ఇలా విమర్శించిన నోళ్లే కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం రాష్ట్రాల నాయకులను సామంతరాజుల వలే చూస్తుందనీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు గాలి పీల్చి వదలాలన్నా ఢిల్లీ అనుమతికోసం ఎదురుచూస్తూ ఉంటారని విమర్శించడం ఎన్నోసార్లు విన్నాం. 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉండిన డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి అధిష్టాన వర్గాన్ని గౌరవిస్తూనే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగారు. అదే పని రేవంత్రెడ్డి చేస్తుంటే అభినందించవలసిందిపోయి కాంగ్రెస్ హై కమాండ్ అదుపులో ఏం లేదు అని కాంగ్రెస్ వ్యతిరేకులు బాధపడటం ఎందుకో? ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వస్తున్న సమాచారం నిజమయితే కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయం. అదే జరిగితే అధిష్టానం దగ్గర రేవంత్రెడ్డి పలుకుబడి, పట్టు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కేరళ ఎన్నిక మొత్తం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ చేతుల మీదుగానే సాగింది. కేరళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా రేవంత్రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరణ జరిగిన విషయం తెలిసిందే. ఏదిఏమైనా జీవన్రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు ఇంకో మార్గం ఎంచుకోవడం వల్ల ఆయనకు, భారత రాష్ట్ర సమితికి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందా లేక గతంలో కాంగ్రెస్ను వీడిన దిగ్గజాల పరిస్థితి జీవన్రెడ్డికీ ఎదురవుతుందా? ఏదిఏమైనా ముక్కుసూటి రాజకీయాలు చేసే జీవన్రెడ్డికి ఆల్ ది బెస్ట్. Delete Edit
వార ఫలాలు (12-04-2026 నుంచి 18-04-2026 వరకు)
మేష రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. విద్యా ఉద్యోగపరంగా మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఏ కార్యక్రమం మీరు ప్రారంభించిన దానిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. క్రయవిక్రయాలు లాబిస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. నలుగురిలో ప్రత్యేకంగా కనబడడానికి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. గడిచిన రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చికాకులు పెరుగుతాయి. ఎంతోకాలంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి కాలభైరవ రూపం మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చి సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మిధున రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. చాలాకాలంగా పడిన ప్రేమకు ఫలితం లభిస్తుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. వస్త్ర వ్యాపారస్తులకు బంగారు వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏదైనా ఒక మంగళవారం రాహు సాయంత్రం పూట రాహుకాల దీపం పెట్టండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 6 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా లాభసాటిగా ఉంటుంది. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించకపోవచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు లైట్ గ్రీన్. అదేరా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గతమార్తం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయానికి ఎక్కువగా స్పందించవద్దు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఓం నమో నారాయణా వత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి. ప్రతిరోజు శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఒక వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. మెడలో దక్షిణామూర్తి రూపు ధరించండి. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయటపడగలుగుతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కాలం అనుకూలంగా లేదు. కొద్దికాలం వేచి ఉండండి. ఈ రాజు వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు రాయల్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ముందుకు వెళ్లాలనే భావనతో ఉంటారు అదేవిధంగా ప్రయత్నం చేస్తే ఫలితం కూడా దక్కుతుంది. మీ నీతి నిజాయితీలే మిమ్మల్ని రక్షిస్తాయి. ఏదైనా సరే కాలం అనుకూలంగా ఉన్నప్పుడు కాలానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి ముందుకు వెళ్ళండి కచ్చితంగా మంచి జరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం జరుగుతుంది. అదేవిధంగా రావలసిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. స్థిరస్తుల విలువ పెరగటం చక్కటి అవకాశాలు రావటం జరిగే అవకాశం లేకపోలేదు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఏదైనా సరే పిల్లల భవిష్యత్తు కోసం మనం కష్టపడి ముందుకు వెళ్లాలి. పదిమంది బాగుండాలి పదిమందితో కలిసి మనం కూడా ముందుకు వెళ్లాలి అనే భావనతో ఉంటారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వారికి అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్ కి కాలం అనుకూలంగా ఉంది. గ్రూప్స్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి కాలం చాలా అనుకూలంగా ఉంది. ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు గ్రహించి మెలగాలి. అఘోర పాశుపత హోమం చేయించుకోండి మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1 కలసవచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తులారాశి వారికి వారం చాలు అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా బాగా కలిసి వస్తుంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వృత్తి ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు కన్న కలలు నెరవేరుతాయి. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలనుకుంటారు ఒక కొత్త ఉత్సాహంతో ముందుకు వెళతారు. అదేవిధంగా శత్రువుల పైన మీరు విజయం సాధిస్తారు. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో మీకు మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. మీరు ఎప్పుడో చేసిన సహాయానికి కొంతైనా రుణం తీర్చుకోవాలని ముందుకు వస్తారు. భూ క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త గృహం కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సహోదరి సోదరుల మధ్య మంచి బాంధవ్యం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలా ఉంటాయి. వారి సహకారంతో మరింత ముందుకు వెళ్లే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలుచేస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఏదైనా సరే అందరితో సామరస్య భావంతో ఉండాలనే భావన నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి తగ్గుతుంది. శ్రద్ధ తగ్గుతుంది. చదువు మీద శ్రద్ధ వహించి నిర్లక్ష్యం చేయకుండా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం వరిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వ్యాపార రంగంలో ఉన్న వారికి సినీ కళా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. చిన్న వ్యాపారస్తులకు కూడా ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించి నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య రీత్యా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజ ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ కలిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా సమస్యలు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరీ సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి మంచి బాంధవ్యం ఏర్పడుతుంది. ఎవరైనా శత్రువులు ఉంటే మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. ఇప్పుడు సరైన సమయం కాదు కాబట్టి కొంతకాలం ఆగి ప్రయత్నించండి. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీకు ఏదైతే ఒక కోరిక ఉన్నదో అది ఈ వారం నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి ముఖ్యంగా కాంపిటీటివ్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కలిసి వస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం ఎరుపువతులతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి ఈ వారం చాలావరకు బాగుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కూడా చాలావరకు సానుకూల పడతాయి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా చక్కగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు ఒక కార్యక్రమాన్ని తల పెడతారు. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్థాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం ప్రోత్సహిస్తుంది. వచ్చిన ఉద్యోగాన్ని కాదని వేరే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ప్రస్తుతం ఉన్న సమయంలో సద్వినియోగపరుచుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఆరోగ్యరీత్యా చిన్నచిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసే వారికి పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా చాలావరకు అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా చేసే చిన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందులకు గురిచేస్తాయి. కానీ తర్వాత లాభాలు వచ్చే విధంగా కూడా ఉంది. ఎంత లాభం వస్తుందో ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అప్పులకి దూరంగా ఉండటం క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండటం చెప్పదగిన విషయం. ఏదైతే మీరు సంకల్ప సిద్దితో ఒక మంచి కార్యక్రమం తలపెడుతున్నారు అది నెరవేరుతుంది. అన్నదాన సత్రాలకు చాలావరకు అనుకూలంగా ఉంది. ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటున్నారో దాని కోసం కొంతకాలం ఆగి ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం, దుర్గాదేవి స్తోత్రం చదవటం చెప్పదగిన సూచన. విద్యార్థులకు ఈ వారం చాలావరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసివచ్చే రంగు ఎల్లో, ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి. కుంభ రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంకా బయట పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు లేదా విదేశీ సంస్థల్లో ఉద్యోగం రావటం కావచ్చు జరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కాస్త సమయం పడుతుంది ఇప్పటినుంచి ప్రయత్నిస్తే సంవత్సరం చివరిలో వెళ్లే అవకాశం గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం కూడా గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఈ రాశి వారు ఈ వారం ఏ పని ప్రారంభించిన దిగ్విజయంగా పూర్తి అవుతుంది. కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు వారాలు కాస్త చికాకు పెడతాయి. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలకు దూరంగా ఉండటం అలాగే ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగిన సూచన. దూర ప్రాంత ప్రయాణాల విషయాలలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కొంతవరకే అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రథమార్తం కంటే ద్వితియార్థం చక్కగా ఉంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. లేకపోతే కొంత ధర నష్టం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి స్థానచలనం ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్మోటిక్ రంగంలో ఉన్నవారికి సినీ కళా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వృధా ఖర్చులు అయ్యే అవకాశం గోచరిస్తుంది. రూపాయికి 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం మంగళవారం శనివారం ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రీన్, ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గ్రహ స్థితులపరంగా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పేరు ప్రఖ్యాతలు చక్కగా లభిస్తాయి. ఎప్పుడో కొన్న స్థిరస్తుల విలువలు పెరుగుతాయి. మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించే వారు చాలావరకు ఉంటారు. కానీ దైవానుగ్రహం వల్ల అలాంటివేమీ జరగకుండా ఉంటాయి. ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న నిర్ణయాలు లాభసాటిగా ఉంటాయి. పదిమందికి ఆమోదపూర్వకంగా ఉంటుంది. అందరూ బాగుండాలి మనం బాగుండాలి అనే ఆలోచనతో ముందుకు వెళతారు ఈ ఆలోచనలే పదిమందికి నచ్చుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రాజకీయ పదవీ కోసం ఎదురుచూసే వారికి కాస్త నిరాశ అని చెప్పవచ్చు. ప్రజలలో పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ ఒక పదవి రాకపోవటం అనేది నిరాశకు గురి చేస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి చక్కటి అవకాశం. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఏదైనా ఒక పనిమీద నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకోండి. మీరు ఆలోచించి తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే సఫలీకృతం అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు గాని దైవదర్శనాలు గాని చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మన సంకల్పం బాగుండాలి పదిమంది బాగుండాలి అని ఆలోచనతో ముందుకు వెళతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలావరకు అనుకూలంగా ఉంది. భూ సంబంధిత విష వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విష వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన అప్పులు చేయటానికి దూరంగా ఉండటం క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు ఆలస్యంగా చేతికి అందుతాయి కావున ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే మీరు మీ కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లాలి. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. లాభాల రూపంలో కావచ్చు పేరు ప్రఖ్యాతలు రూపంలో కావచ్చు కచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు చదువు పట్ల ఇంకా అధిక శ్రద్ధ వహించాలి. చెడు వ్యసనాలకు సోషల్ మీడియాకు స్నేహితులకు దూరంగా ఉండాలి. ఇతరులకు అంతరంగ విషయాలు చెప్పడం కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చదువు మీద శ్రద్ధ పెట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేవారికి మీరు కోరుకునే ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా వైద్యవృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు మద్యస్థ ఫలితాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైన పెట్టుబడులు పెట్టి మోసపోకండి. ఖర్చులో విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం చెప్పుదగిన సూచన. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం, దుర్గా స్తోత్రం చదవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తప్పుగా మాట్లాడితే చెప్పు తెగుద్ది
‘తప్పు డు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది’ అంటూ మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక ప్రతిపక్షా లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీతక్క ఆరోపించారు. అవసరమైతే కోర్టులకు వెళ్లి పరువు న ష్టం దావాలు వేస్తామని తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి ఫోన్ల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. కేంద్రం సూచించిన నిబంధనల ప్రకారం పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించామని చె ప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలు చెప్తున్నాయన్నారు. మేడారం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులపై వచ్చిన విమర్శలను సీతక్క కొట్టిపారేశారు. మేడారం గద్దెల వద్ద జరిగిన ప్రమాదాన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు. మంత్రి సీతక్కపై బురదజల్లితే ఊరుకోం: ఇందిరాశోభన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కపై ఇటీవల బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్యారోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరాశోభన్ తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల టెండర్ల వ్యవహారంపై ఆమె గణాంకాలతో సహా శనివారం మీడియాకు వివరించా రు. బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ గత నెల రో జులుగా పొంతన లేని మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇందిరాశోభన్ ధ్వజమెత్తా రు. గత నెలలో రూ.8 కోట్ల కుంభకోణం అన్న క్రి శాంక్, నిన్నటి ఇంటర్వ్యూలో రూ.30 కోట్లు అన డం, నెల తిరక్క ముందే ఆయన మాటల్లోనే పొం తన లేకపోవడం విడ్డూరమన్నారు. కేంద్ర ప్రభు త్వ పథకమైన ‘పోషణ్ అభియాన్’ కింద మొత్తం 38,130 మొబైల్ ఫోన్ల కొనుగోలుకు 2025 న వంబర్లో టెండర్లు పిలిచారని ఇందిరాశోభన్ తెలిపారు. కేంద్రం నిర్దేశించిన ధర రూ.11,800 కాగా, తమ ప్రభుత్వం కేవలం రూ.11,650లకే ఫోన్లను కొనుగోలు చేసిందని వివరించారు. ఇం దులో ఫోన్ మాత్రమే కాకుండా పవర్ అడాప్టర్, యూఎస్బీ కేబుల్, ఇంటర్ఫేస్, డస్ట్ ప్రూఫ్ పౌచ్, మొబైల్ కేస్, స్క్రీన్ ప్రొటెక్టర్తో సహా రెండేళ్ల పాటు ’మొబైల్ డివైస్ మేనేజ్మెంట్’ అప్లికేషన్ వంటి ఆరు రకాల అదనపు సేవలు ఉన్నాయని తెలిపారు. సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు అంగన్వాడి మొబైల్స్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ మంత్రి సీతక్కను లక్షంగా చేసుకుని బిఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ స్టేషన్లో అంబర్ పేట కాంగ్రెస్ నేత పాండు నాయక్ ఫిర్యాదు చేశారు. పదేపదే నిరాధార ఆరోపణలు చేస్తూ మంత్రి సీతక్క ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
గూడూరు మండలంలోని మట్టేవాడ గ్రామ శివారు నేలవంచ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు శనివారం ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం నేలవంచ గ్రామానికి చెందిన కత్తుల శిరీష(9) ,పేనక చరిత్ర(9) ఇద్దరు స్నేహితురాలు. ఈతకని వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారని తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర గిరిధర్ రెడ్డి తెలిపారు.
టోల్ప్లాజాల్లో కేవలం డిజిటల్ చెల్లింపులే
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల టోల్ప్లాజాలలో వసూళ్లు ఇకపై కేవలం డిజిటల్ రూపంలోనే జరుగుతాయి. శనివారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన వెలువరించింది.నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. ఆన్లైన్ చెల్లింపులలో షాస్టాగ్ లేదా యుపిఐ ప్రక్రియలతోనే చెల్లింపుల ప్రక్రియ ఉంటుందని ఉత్తర్వులు వెలువడ్డాయి. టోల్ కలెక్షన్లలో సమర్థత, పారదర్శకత కోసం ఈ చర్యను గణనీయ రీతిలో తీసుకువచ్చారు. అయితే టోల్గేట్ వసూళ్లలో మార్పును అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో ఇప్పుడు వర్తింపచేయడం లేదని ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ చెల్లింపుల పద్ధతిని తప్పనిసరిగా పాటించాల్సిందే అని , లేకపోతే ఇబ్బందులు తప్పవని జాతీయ రహదారుల అధీకృత సంస్థ ఎన్హెచ్ఎఐ తెలిపింది. ఈ నెల 10వ తేదీనే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది.
లెబనాన్లో 200 చోట్ల ఇజ్రాయెల్ దాడులు
ఒకవైపు ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్లోని పలు ప్రాంతాల్లో హెజ్బొల్లా లక్షంగా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 10మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. గత 24 గంటల్లో లెబనాన్లోని 200పైగా హెజ్బొల్లా ప్రాంతాలను లక్షంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ముగ్గురు మరణించినట్లు లెబనాన్ ప్రకటించింది. బీరుట్, కారకాస్లలో ఇజ్రాయెల్ గత బుధవారంనాడు జరిపిన దాడుల్లో భారీ భవంతులు ధ్వంస మయ్యాయి. శిథిలాలను తొలగించడంతో పాటు బాధితులను గుర్తించేందుకు లెబనాన్ పౌర రక్షణ విభాగం రంగంలోకి దిగింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కారకాస్లోని ఓ భవంతిలో కనీసం 100మంది సజీవ సమాధి అయినట్లు గుర్తించారు.
గుండెపోటుతో ఆసుపత్రిలో ఆశాభోస్లే
ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు రావడంతో స్థానిక బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో హుటాహుటిన చికిత్సకు చేర్పించారు. వేలాది పాటల గాయని ఆశాభోస్లే వయస్సు 92 పంవత్సరాలు. దిగ్గజ గాయని లతామంగేష్కర్కు చిన్న సోదరి అయిన ఆమెకు చాలాకాలంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి. దీనితో శ్వాస కోశ అవలక్షణాలను ఎదుర్కొంటున్నారు. చికిత్సకు ఆమెను ఆసుపత్రికి తరలించిన విషయాన్ని కుటుంబ వర్గాలు, సన్నిహితులు తెలియచేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎప్పటికప్పుడు డాక్టర్ల బృందం పరీక్షలు నిర్వహిస్తున్నారని ప్రకటన వెలువడింది.
శతకంతో చెలరేగిన సంజూ.. ఢిల్లీకి భారీ టార్గెట్
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజూ శాంసన్ కతకంతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నైకి శుభారంభం దక్కింది. సంజూ భారీ షాట్లతో చెలరేగాడు. గత మూడు మ్యాచుల్లో విఫలమైన సంజూ.. ఢిల్లీపై విరుచుకుపడ్డాడు. దీంతో 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సులతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆయూష్ మాత్రే(59) రిటైర్డ్ ఔట్ గా వెనుదిరిగాడు. చివర్లో శివమ్ దూబే(20 నాటౌట్) రాణించాడు.దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు చేసింది.
LIK is a Big Shock for Pradeep Ranganathan
Pradeep Ranganathan has delivered quite impressive films like Love Today, Dragon and Dude. All these films impressed the youth and Pradeep Ranganathan was focused on the script and the writing of these films. Top production house Mythri Movie Makers has offered a remuneration of Rs 50 crores for his next film that will be launched […] The post LIK is a Big Shock for Pradeep Ranganathan appeared first on Telugu360 .
Legendary Indian singer Asha Bhosle who is 92 years old has been rushed to a private hospital in Mumbai after she suffered cardiac arrest. She is undergoing treatment under the supervision of experts in Breach Candy Hospital in Mumbai. Asha Bhosle has been unwell from the past few months and she is away from singing […] The post Legendary Singer Hospitalized appeared first on Telugu360 .
లాడ్జిపై పోలీసుల దాడులు.. వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడిన మహిళలు
నారాయణపేట: వ్యభిచారం నిర్వహిస్తూ నలుగురు మహిళలు పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని మూన్ లైట్ డార్మెటరీ లాడ్జ్ లో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు మహిళలను పట్టుకున్నారు. పట్టుబడిన మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించి.. స్టేట్ హోమ్కు పంపిస్తున్నట్లు నారాయణపేట సీఐ శివశంకర్ తెలిపారు. అలాగే, లాడ్జ్ యజమాని బుగ్గేశ్వర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పట్టణంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సిఐ స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
gudur mandal |బావిలో పడి ఇద్దరు బాలికల మృతి
gudur mandal | బావిలో పడి ఇద్దరు బాలికల మృతి gudur mandal
కొబ్బరికాయల లారీ బోల్తా...మానవత్వం మంటగలిసిన ఘటన.. #Dahod #TruckAccident #CoconutTruck #PublicGreed
చమురు సంపదలో అమెరికా నెంబరు 1: ట్రంప్
అమెరికా చమురు సంపన్న దేశం అని దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శనివారం గొప్పగా చెప్పారు. తమ దేశం వద్ద ఇప్పుడు రష్యా కన్నా ఎక్కువ చమురు నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. ఇప్పుడు ఇక సౌదీ ఇతర గల్ఫ్ దేశాలలో కూడా చమురు అడుగంటింది. దీనితో పలు ఖాళీ ట్యాంకర్లు చమురు కోసం అమెరికా తీరానికి చేరుకుంటాయని చమత్కరించారు. అమెరికా ఇప్పుడు తమ తియ్యటి ఆయిల్, కోరుకునే గ్యాస్ను ప్రపంచంలో ఎవరికైనా అందించేందుకు సంసిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు. ఇప్పుడు చమురు ఎగుమతులలో పై చేయి స్థితికి చేరామని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో ఖాళీ చమురు ట్యాంకర్లు అమెరికా వైపు వస్తున్నాయని , ఇంతకు ముందటి వరకూ చమురు సంపన్న దేశాల వారు కూడా ఇక్కడికి రావల్సిందే అన్నారు. వారికి స్వాగతం పలుకుతామని తెలిపారు. అత్యున్నత ప్రమాణాల చమురు, సహజవాయవులు తమ వద్ద ఉన్నాయని, రెండు అత్యంత భారీ ఆర్థిక శక్తుల మిశ్రిత చమురు సంపదతో పోలిస్తే తమ వద్ద ఎక్కువ చమురు ఉందని పరోక్షంగా రష్యా , చైనా లేదా గల్ఫ్ దేశాల పరిస్థితిని తెలిపారు. ఈ సరుకు తీసుకుపోయే వారికోసం వేచి చూస్తున్నామని తెలిపారు. తొందరపడండి, ఆలస్యం వద్దు..డిజెటి అంటూ ట్రంప్ తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా సంచలనానికి దిగారు. ఈ సందర్భంగా ఆయన ఇతర మీడియాలపై దుమ్మెత్తిపోశారు. బూటకపు మీడియా సంస్థలు తమ ప్రతిష్ట దెబ్బతీసుకున్నాయని విమర్శించారు. ఎప్పుడూ వారికి ట్రంప్ను తిట్టిపోసుకునే జబ్బు తలెత్తిందని వ్యాఖ్యానించారు. ఈ లక్షణానికి ఆయన టిడిఎస్ అని సంబోంధించారు. ఇరాన్ అన్ని విధాలుగా దెబ్బతింటూ ఉంటే, కొందరు ఇరాన్ నౌకాదళం, వైమానిక బలగాలు దెబ్బతింటూ ఉంటే, వారికి నాయకుడు లేకుండా పోతే , క్షిపణులు , డ్రోన్లు కుప్పకూలితే సంబంధిత ఫ్యాక్టరీలు నేలమట్టం అయితే ఇంకా ఇరాన్ బలంగా ఉందనే వాదన తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. చివరికి ఇరాన్ వారి మిగిలిన నేతలతో కూడిన నౌకలు వారు అమర్చుకున్న సీ మైన్స్లో పడి దెబ్బతింటాయని తిట్టిపోశారు. ఇప్పటికే వారి 28 మైన్ బోట్లు సముద్రం అడుగుకు చేరాయని తెలిపారు. కొన్ని దేశాలకు హర్మూజ్ను తెరవాలని, చైనా , జపాన్, కొరియా మరికొన్ని దేశాల నేతలను ప్రసన్నం చేసుకోవాలని అనుకున్నా ఇప్పుడు సీ మైన్స్ ఇరకాటంలో పడ్డారని తెలిపారు. వారంత వారుగా హర్మూజ్ను తిరిగి తెరిచే పరిస్థితిలో లేరని స్పందించారు. ఇతర దేశాలు కూడా హర్మూజ్ ఓపెన్ విషయంలో ఏమి చేయలేకపోతున్నాయి. ఈ దశలో చమురు కోసం పలు దేశాలు ఇప్పుడు అమెరికాకు క్యూ కడుతున్నాయని వెల్లడించారు. ఈ విషయంపై దృష్టి పెడుతున్నందుకు థ్యాంక్స్ అంటూ ట్రంప్ తమదైన రీతిలో తమ స్పందనను ముగించారు. ...................
సుప్రీం కోర్టును ఆశ్రయించిన లాలూ..
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘ఉద్యోగాలకు భూమి’ అవినీతి ఆరోపణల కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ శనివారం లాలూ ప్రసాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 13న ఈ పిటిషన్పై విచారణ జరపనుంది. అంతకుముందు, తనపై దాఖలైన ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్లను కొట్టివేయాలన్న లాలూ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి రవీందర్ దత్ దేజా తిరస్కరించారు. ఈ కేసులో దాఖలైన మూడు ఛార్జిషీట్లను కూడా కోర్టు సమర్థించింది. కాగా, 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. జబల్పూర్లోని ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ జోన్లో, బహుమతిగా ఇచ్చిన లేదా బదిలీ చేసిన భూమికి బదులుగా “గ్రూప్ డి” రైల్వే ఉద్యోగాలను కేటాయించారని అధికారులు ఆరోపిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద సీబీఐ ముందస్తు అనుమతి పొందనందున, ఎఫ్ఐఆర్, దర్యాప్తు, ఛార్జిషీట్లు చట్టపరంగా లోపభూయిష్టంగా ఉన్నాయని, అందువల్ల ఈ విచారణ చెల్లదని లాలూ వాదించారు.
రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నెహ్రూ రింగ్ రోడ్డుకు 30 కిలో మీటర్ల వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతున్నాయిని వివరించారు. రింగ్ రోడ్ల పక్కన రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి రవాణా సదుపాయాలను ప్రపంచంలోని పెద్ద నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హయత్ నగర్-, ఎల్.బి.నగర్ మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మిస్తున్నాట్టు వివరించారు. కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాలకు వినియోగిస్తామని, పైన ఉండే రెండు అండు అంతస్థుల రోడ్లు నగరం నుంచి వెలుపలకు, లోపలకి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకిస్తామని చెప్పారు. నాగపూర్ తర్వాత డబుల్ డెక్కర్ రోడ్లు నిర్మిస్తున్న నగరం ఇదేనని పేర్కొన్నారు. రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో పికో టెక్నాలజి వ్యవస్థాపక సిఇఒ జారొడ్ యుస్టర్, పికో ఇండియా సిఇఒ హరి కోదండరామన్, డైరెక్టర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.
Driving seat |కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
Driving seat | కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
తనపై ఆరోపణలు.. నార్సింగి పిఎస్లో మంగ్లీ ఫిర్యాదు
హైదరాబాద్: తనపై ఆరోపణలు చేసిన న్యాయవాది సుభా సింగబోష్పై సింగర్ మంగ్లీ నార్సింగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.150 కోట్ల మేర మోసం చేశారంటూ తనపై అతడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 21న సుభా సియపోగు పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి తనను బెదిరించారని తెలిపారు. ‘‘అతడు అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారు. తనను కలవాలని ఒత్తిడి చేశారు. నిరాకరిస్తే అప్రతిష్ట పాలుచేస్తానని బెదిరించారు. మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యాలు చేశారు. నాకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారు. సుభా సింగబోష్ తీరుపై నా కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు’’ అని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఆసుపత్రికి వెళ్లి మరీ.. సోనియా గాంధీని ప్రధాని మోదీ పరామర్శించారా? #FactCheck#FakeNews#AIFake#Modi
‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మిగా కయాదు లోహర్
నేచురల్ స్టార్ నాని పీరియడ్ యాక్షన్ డ్రామా ’ది ప్యారడైజ్’ పై అంచనాలు ’ఆయా షేర్’ సింగిల్ విడుదల తర్వాత నెక్స్ లెవెల్ కి చేరుకున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ప్రతి పాత్ర పరిచయంతో ఆసక్తిని మరింత పెంచుతోంది. అభిమానులకు ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్గా, హీరోయిన్ కయాదు లోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర నిర్మాతలు శనివారం ఆమె ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. కయాదు లోహర్ ’ది ప్యారడైజ్’ ప్రపంచంలోకి సుబ్బలక్ష్మి (సుబ్బు)పాత్రలో అడుగుపెట్టింది. సినిమా మొత్తం రగ్డ్, ఇంటెన్స్ ప్రపంచంలో సాగుతున్నప్పటికీ, ఆమె పాత్ర ఆ కథకు ఓ సాఫ్ట్ టచ్ అందించనుందని పోస్టర్ సూచిస్తోంది. ఇప్పటికే భారీ విజువల్స్, గ్రాండ్ సెట్టింగ్, బలమైన పాత్రలతో ఈ చిత్రం అంచనాలు పెంచుతోంది. మోహన్ బాబు విలన్గా, రాఘవ్ జుయాల్ కీలక పాత్రలో, అలాగే సంపూర్ణేష్ బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్గా విడుదలకు సిద్ధమవుతోంది.
కాల్పుల విరమణ తరువాత భారత్కు తొలి ఎల్పీజీ ట్యాంకర్
అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత భారత పతాకం కలిగిన ఎల్పిజి ట్యాంకర్ జగ్ విక్రమ్ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హర్మూజ్ జలసంధిని దాటి శనివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోకి ప్రవేశించింది. మరి కొద్ది రోజుల్లో భారత్కు ఇది చేరుకోనుంది. కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత హర్మూజ్ను దాటిన మొట్టమొదటి నౌక ఇదే. మార్చి నెల మొదట్లో హార్ముజ్ జలసంధిని దాటిన తొమ్మిదో నౌక జగ్ విక్రమే అవుతుంది. మరో భారత రిజిస్టర్డ్ నౌకలు పర్షియన్ గల్ఫ్ లోనే ఉన్నాయని,త్వరలో అవి కూడా ఇదే మార్గం మీదుగా భారత్కు చేరుకునే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్టీలకు అతీతంగా మద్దతు: ఎంపి డికె అరుణ
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మద్దతునివ్వాలని బిజెపి లోక్సభ సభ్యురాలు డికె అరుణ కోరారు. ఈ బిల్లు ఆమోదంతో దేశ రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పడుతుందని ఆమె తెలిపారు.యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే మన భారతీయ సంస్కృతి ప్రకారం, ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారని, అటువంటి గొప్ప సంప్రదాయం మన దేశంలో ఉందని ఆమె శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మహిళా 33 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో తీసుకువచ్చి మహిళల ప్రాధాన్యాన్ని మరింతగా చాటి చెప్పారని ఆమె తెలిపారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం అని ఆమె అన్నారు. 2029 ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. ఎన్నో సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడినా, గత ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపించలేదని ఆమె విమర్శించారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని పార్టీలను సమన్వయం చేసి ఈ బిల్లును తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఈ బిల్లు అమలు అయితేనే దాని సార్థకత ఉంటుంది. అందుకే అన్ని పార్టీల ఎంపీలు పార్టీలకు అతీతంగా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇది కేవలం ఒక చట్టం కాదు కోట్లాది మహిళల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక, దేశ రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పలికే బిల్లు అని ఎంపీ డికె అరుణ తెలిపారు. తొమ్మిది ఎంపీ సీట్లు మహిళలకు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు పెరిగి, దాదాపు 9 మంది మహిళలు పార్లమెంట్కు వెళ్లే అవకాశం వస్తుందని ఆమె చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు 273 మంది మహిళలకు అవకాశం లభిస్తుందని ఆమె వివరిచారు. అసెంబ్లీ స్థాయిలో కూడా మహిళలకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం పెరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే, దాదాపు 60 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఉండే అవకాశం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా గణనీయ ప్రాతినిధ్యం లభిస్తుందని ఎంపీ అరుణ తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే వసంత ఆకస్మిక తనిఖీ…
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే వసంత ఆకస్మిక తనిఖీ… మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం
‘కొరియన్ కనకరాజు’ నుంచి తొలి సింగిల్ విడుదల
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. కొరియన్ బ్యాక్డ్రాప్లో హారర్ కామెడీ జోనర్లో ఈ సినిమా రూపొందుతోంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్కి విశేషమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి తొలి సింగిల్ని విడుదల చేశారు. ఈ పాటని కాసర్ల శ్యామ్ రచించగా.. సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.
మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి…
మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి… నో ప్రిస్క్రిప్షన్… నో మెడిసిన్..డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు
బోనకల్ వద్ద గంజాయి పట్టివేత… నిందితుడి అరెస్ట్, 2.4 కిలోల గంజాయి స్వాధీనం…
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పే పోలీసులే ఉల్లంఘిస్తే...రూల్స్ నగరవాసులకే తప్ప తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తే...తామేమి చేసినా అడిగేవారు లేనట్లుగా నిబంధనలు ఉల్లంఘించడంపై నగర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూల్ పెడుతాం కానీ పాటించం అన్నట్లుగా పోలీసుల తీరుపై సర్వత్రా గుర్రుమంటున్నారు. హెల్మెట్ లేకున్నా, రాంగ్రూట్లో వెళ్లినా కొరడా జులిపిస్తున్న పోలీసులు తమవారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ వాహనాలతో రాంగ్ రూట్లో వెళ్తు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలు సాధారణ ప్రజలకు తప్ప తమకు వర్తించవని భావిస్తున్నట్లు ఉంది వారి వ్యవహారం. బండ్లగూడ జాగీర్, కాళీమందిర్ సమీపంలో టిఎస్ 09 పిఏ 2126 టాటా సుమో వాహనం రాంగ్ రూట్లో వెళ్లింది. ఎదురుగా వాహనాలు వారి దారిలో వస్తున్నా కూడా పోలీస్ వాహనం ఎదురుగా రాంగ్ రూట్లో వెళ్లింది. యూటర్న్ చాలా దూరం ఉండడంతో అంతదూరం ఎవరు తిరిగి వస్తారని, రాంగ్ రూట్లో వెళ్లాడు.
సమాజ దిశను మార్చిన మహాత్మా ఫూలే…
సమాజ దిశను మార్చిన మహాత్మా ఫూలే… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహాత్మా
పూలే విగ్రహానికి నివాళి ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు
ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు…
ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు… పాయకాపురం, ఆంధ్రప్రభ : వాహనాల,వాహనచోదకులు ప్రమాద బారిన
ఎలక్ట్రానిక్స్ తయారీలో ‘గ్లోబల్ హబ్’గా తెలంగాణ
ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రపంచ స్థాయి కేంద్రం(గ్లోబల్ హబ్)గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. కేవలం ఉత్పత్తుల అసెంబ్లింగ్ మాత్రమే పరిమితం కాకుండా, విడిభాగాల తయారీ నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు అవసరమైన పూర్తిస్థాయి ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శనివారం కోటి(10 మిలియన్లు) టెలివిజన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న హైదరాబాద్కు చెందిన రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... రేడియంట్ సంస్థ సాధించిన ఈ ఘనత తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో ‘తెలంగాణ’ కీలక పాత్ర పోషించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ దిశగానే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఓవైపు ఎలక్ట్రానిక్స్ తయారీలో టాప్ గ్లోబల్ ప్లేయర్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తూనే..మరోవైపు వారికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, రెడీ టూ వర్క్ ఫోర్స్ తయారీపై దృష్టి సారించామన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి... ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. సరళతర వాణిజ్య విధానాలతో పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెజల్యూట్ గ్రూప్ ఛైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్, డైరెక్టర్ మణికందన్, లీగల్ అండ్ ఐపీఆర్ హెడ్ శుభజిత్ సాహా, అడ్మినిస్ట్రేషన్ హెడ్ నోయెల్ రాబిన్ సన్ తదితరులు పాల్గొన్నారు.
ఐపిఎల్ 2026లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. 220 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(57), ప్రభుసిమ్రాన్(51)లు మెరుపు అర్ధ శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 69తో పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో పంజాబ్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగులు చేసి గెలుపొందింది. సన్ రైజర్స్ బౌలర్లలో శివాంగ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్ దూబే ఒక వికెట్ తీశాడు. అంతకుముందు, హైదరాబాద్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్లో అర్ష్దీప్, శశాంక్లు చెరి రెండు, బ్రాట్లెట్ ఒక వికెట్ తీశారు.
సామాజిక మార్పు దిశగా జ్యోతిరావు ఫూలే ఆలోచనలు…
సామాజిక మార్పు దిశగా జ్యోతిరావు ఫూలే ఆలోచనలు… ఇటుకాలపల్లి గ్రామంలో ఘనంగా జయంతి
Flash news: పంజాబీ రోటీ.. హైదరాబాద్ బిర్యానీ గొంతులో పడితే ఎంత మజా ఉంటుందో అలా ఉంది గురూ...!
వీకెండ్ మ్యాచ్ అదిరిపోయింది. క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించింది
రాష్ట్రంలో విడుదల కానున్న ఇంటర్ ఫలితాలు తెలంగాణ మీసేవా వాట్సాప్ చాట్బాట్ వాట్సాప్ ద్వారా నేరుగా తమ పరీక్ష ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీసేవా తెలంగాణ వాట్సాప్ నెంబర్ 8096958096కు ‘Hi’ అని మెసేజ్ పంపించడం ద్వారా మీసేవా చాట్బాట్ మొదలవుతుంది. ‘BIE Exam Result’ టైప్ చేసి Open Service ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత మీ రోల్ నంబర్ నమోదు చేయండి, సంవత్సరం (1వ / 2వ) స్ట్రీమ్ (జనరల్ / వొకేషనల్) ఎంచుకుని సమర్పిస్తే ఇంటర్ ఫలితం తక్షణమే వాట్సాప్లో వస్తుంది.

35 C