SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

37    C
...

ప్రభుత్వంపై వ్యవసాయ సలహాదారు పోచారం అసంతృప్తి

వర్ని, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల మంజూరులో నిర్లక్ష్యంగా

ప్రభ న్యూస్ 13 Apr 2026 11:29 am

నాకు ప్రాణహాని ఉంది : సురేందర్ రెడ్డి

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయారెడ్డి భర్త సురేందర్‌ పోలీసులను ఆశ్రయించాడు

తెలుగు పోస్ట్ 13 Apr 2026 11:27 am

ఖానాపూర్‌లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ..

కడెం, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ

ప్రభ న్యూస్ 13 Apr 2026 11:24 am

జట్టులో భారీ మార్పులు అవసరం: హార్ధిక్ పాండ్యా

హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓటమిని చవి చూశారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విఫలం కావడంతో ఎంఐ ఓడిపోయింది. ఈ సందర్భంగ ఎంఐ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మీడియాతో మాట్లాడారు. రాబోయే మ్యాచ్‌లో ఎంఐ జట్టులో భారీగా మార్పులు ఉంటాయని తెలియజేశారు. ఆర్‌సిబితో జరిగిన మ్యాచ్‌లో త్వరగా వికెట్లు కోల్పోవడంతో పాటు బౌలింగ్‌లో భారీగా పరుగులు ఇచ్చామని చెప్పారు. పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉందని, చాలా విషయాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్‌సిబి జరిగిన మ్యాచ్‌లో రూథర్‌ఫోర్డ్ పోరాటం జట్టుకు ఎంతో ఉపయోగం పడిందని ప్రశంసించారు. ముంబయి జట్టుకు ఎప్పుడు అతడు అదనపు బలమని కొనియాడారు. చివరలో రూథర్ ఫోర్డ్ 31 బంతుల్లో ఒక ఫోర్ తొమ్మిది సిక్స్‌లతో 71 పరుగులు చేశాడు. 

మన తెలంగాణ 13 Apr 2026 11:23 am

ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేసేందుకు..

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫు్లయెన్సర్ యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి హీరోయిన్ సెంట్రిక్ కథతో ‘క్వీన్‘ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్‌గా, ఆసక్తికరంగా ఉండే హీరోయిన్ తండ్రి పాత్రలో 90వ దశకం హీరోల్లో ఒకరు నటించబోతున్నారు. ఆదివారం హీరోయిన్ యామినీ ఈఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ ‘క్వీన్’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో క్లాసికల్ డాన్సర్ గెటప్‌లో అందంగా ముస్తాభైన యామిని, ఆనందభాష్పాలతో కనిపించి ఆకట్టుకుంటోంది. ప్రస్తుత సమాజంతో ముడిపడి ఉన్న ఒక ఆసక్తికర లవ్ స్టోరీని ఈ చిత్రంలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రతన్ రిషి. తను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ.. అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో ఆద్యంతం ఆసక్తిని కలిగించనుంది. ‘క్వీన్’ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

మన తెలంగాణ 13 Apr 2026 11:21 am

శ్రీ షిర్డీసాయి బాబా సేవలో ఎమ్మెల్యే వసంత

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : శ్రీ షిర్డీసాయి బాబా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో

ప్రభ న్యూస్ 13 Apr 2026 11:20 am

తొలి విడత చందనం అరగదీత ప్రారంభం

సింహాచలం, ఆంధ్రప్రభ : ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ

ప్రభ న్యూస్ 13 Apr 2026 11:18 am

ములుగులో కోతుల కోసం విషం కలిపిన బాలామృతం... కానీ బాలుడు మృతి

ములుగు: కోతుల కోసం విషం కలిపిన బాలామృతం తిని ఓ బాలుడు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గోవిందరావుపేటలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పెట్టే బాలామృతంలో కోతులను చంపేందుకు పంచాయతీ సిబ్బంది విషం కలిపారు. నర్సరీ ప్రాంతంలో విషం కలిపిన బాలామృతం పెట్టడంతో అశ్విన్ నందన్ అనే నాలుగేళ్ల బాలుడు తెలియక అది తిన్నాడు. వెంటనే బాలుడు స్పృహతప్పి పడిపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. 

మన తెలంగాణ 13 Apr 2026 11:11 am

వరంగల్ ఆర్వో కార్యాలయంలో అవినీతి కలకలం

వరంగల్, ఆంధ్రప్రభ ; వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురి రామనర్సింహారావును సస్పెండ్

ప్రభ న్యూస్ 13 Apr 2026 11:10 am

ములుగు జిల్లాలో విషాదం... కోతుల కోసం విషాహారం పెట్టి...?

ములుగు జిల్లాలో విషాదం నెలకొంది

తెలుగు పోస్ట్ 13 Apr 2026 11:09 am

చెన్నూరు విద్యార్థినికి ప్రశంస

చెన్నూర్, ఆంధ్రప్రభ : బోర్డు ఆఫ్ ఇంటర్ మీడియట్ ఆదివారం విడుదల చేసిన

ప్రభ న్యూస్ 13 Apr 2026 11:08 am

6accused |విచారణలో సంచలన నిజాలు బహిర్గతం

6accused | విచారణలో సంచలన నిజాలు బహిర్గతం 6accused | విదేశీ హ్యాండ్లర్ల

ప్రభ న్యూస్ 13 Apr 2026 11:06 am

మళ్లీ దాడులకు పూనుకుంటున్న అమెరికా, ఇజ్రాయిల్

తెహ్రాన్: పశ్చిమాసియా మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అమెరికా`ఇరాన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో యుద్ధవాతావరణ కనిపిస్తోంది. ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయిల్ సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోంది. హోర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఇరాన్‌పై పరిమిత స్థాయిలో సైనిక దాడులను పునరుద్ధరించేలా ట్రంప్ సలహాదారులు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ […] The post మళ్లీ దాడులకు పూనుకుంటున్న అమెరికా, ఇజ్రాయిల్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Apr 2026 11:05 am

ఇంటర్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత

చిట్యాల, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మండల కేంద్రంలోని టీజీ ఎస్

ప్రభ న్యూస్ 13 Apr 2026 11:05 am

‘గోదారి గట్టుపైన’ వచ్చేది అప్పుడే

యం గ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ’గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆదివారం మేకర్స్ ‘గోదారి గట్టుపైన’ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. మే 8న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఒక వైపు సుమంత్ ప్రభాస్, మరో వైపు జగపతి బాబు.. మధ్యలో నిధి ప్రదీప్ నిల్చున్న రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కథపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రం ప్రేక్షకులను లవ్, ఫ్యామిలీ మోషన్స్‌తో కట్టిపడేసే అనుభూతిని అందించబోతోందని ఈ పోస్టర్ సూచిస్తోంది.

మన తెలంగాణ 13 Apr 2026 11:01 am

فیکٹ چیک: منی پور میں سی آر پی ایف کیمپ پر حملے کا ویڈیو من گھڑت دعووں کے ساتھ وائرل

وائرل ویڈیو جس میں دعویٰ کیا گیا ہے کہ مشتعل ہجوم نے اگورنر ہاؤس کو آگ لگا دی اور اور اب تک 92 افراد ہلاک کردئے گئے۔ تاہم تحقیق سے سے پتہ چلتا ہے کہ یہ ویڈیو بشنوپور ضلع میں سی آر پی ایف کیمپ پر حملہ کا ہے اور درجنوں ہلاکتوں کی خبر فرضی ہے۔

తెలుగు పోస్ట్ 13 Apr 2026 10:59 am

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಎರಡು ಭಾಗಗಳಾಗಿ ಬೇರ್ಪಟ್ಟಂತಹ ದೇಹವನ್ನು ಬ್ಲೂಟೂತ್‌ ಮೂಲಕ ಜೋಡಿಸಲು ಸಿದ್ದವಾಗಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

ಎರಡು ಭಾಗಗಳಾಗಿ ಬೇರ್ಪಟ್ಟಂತಹ ದೇಹವನ್ನು ಬ್ಲೂಟೂತ್‌ ಮೂಲಕ ಜೋಡಿಸಲು ಸಿದ್ದವಾಗಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 13 Apr 2026 10:50 am

తెలుగు ప్రేక్షకులను మైమరపించిన ఆశా పాటలు

భారతీయ దిగ్గజ గాయని ఆశా భోంస్లే మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదం లో ముంచెతింది. ఆమె సంగీత ప్రస్థానంలో తెలుగు సినిమాతో ఉన్న అనుబంధం చాలా తక్కువే అయినా, ఆమె పాడిన ఆ 8 పాటలు తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచాయి. 1981లో ’ఇది మౌనగీతం’తో మొదలుపెట్టి, 2007లో ’చందమామ’ సినిమాలోని ’నాలో ఊహలకు’ వరకు ఆమె గాత్రం తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఎస్పీ బాలు, ఇళయరాజా, రెహమాన్, కీరవాణి వంటి దిగ్గజాలతో కలిసి ఆమె చేసిన పాటలు సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇక సంగీత ప్రియులు, సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పించారు.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ తదితర సినీ ప్రముఖులు ఆశా భోస్లె మృతి భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. ఇక పదేళ్ల వయసులో 1943లో ఆమె సంగీత ప్రస్థానం ప్రారంభమైంది.. కొన్ని దశాబ్దాలపాటు అప్రతిహతంగా సాగింది. 12 వేలకు పైగా పా టలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికారడ్స్‌లో చోటు సంపాదించారు. సినిమా పాటలు, పాప్ మ్యూజిక్, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో ఆమె సిద్ధహస్తురాలు. హిం దీతో పాటు, ఆమె 20కి పైగా భారతీయ, విదేశీ భాషలలో పాటలు పాడి అలరించారు. తెలుగు సినిమాల్లోనూ పాటలు పాడారు. ఆశా భోస్లే తెలుగులో పాడింది తక్కువ పాటలే అయినా, వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. 1981లో ’పాలు నీళ్లు’ అనే సినిమాలో ’ఇది మౌనగీతం’ అనే పాటను ఆలపించారు. ఆ తర్వాత 1988లో ’చిన్ని కృష్ణుడు’ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ’జీవితం సప్త సాగరం’ అనే గీతాన్ని పాడారు. దీనికి ఆమె భర్త ఆర్డీ బర్మన్ సంగీతం సమకూర్చారు. ఇక 1992లో నందమూరి బాలకృష్ణ నటించిన ’అశ్వమేథం’ సినిమాలో ఆశా భోస్లే రెండు పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇళయరాజా స్వరకల్పనలో ఆమె ఆలపించిన ’ఓ ప్రేమా’, ’సీతాకాలం ప్రేమకు’ పాటలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అనిపించుకున్నాయి. ఇవి ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. ‘ప్రేమకు ప్రేమంటే తెలుసా’(1995) మూవీలో ’జల్లంది మది’ అనే పాట పాడారు ఆశా భోస్లే. 1996లో ఎంఎం కీరవాణి ’పవిత్ర బంధం’ సినిమాలో ’ఐసాలకిడీ’ అనే సాంగ్ ను ఆమెతో పాడించారు. వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో.. ఆశా భోస్లేతో స్టేజ్ మీద ఈ సాంగ్ పాడించినట్లు చూపిస్తారు. ఇద్దరు’ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ’వెన్నెల’ పాట పాడింది కూడా ఈమెనే. దశాబ్దం తర్వాత 2007లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ’చందమామ’ చిత్రంలో ’నాలో ఊహలకు’ పాట పాడి తన గాత్రంతో మరోసారి తెలుగు సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. దీనికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం సమకూర్చారు. ఇదే ఆమె తెలుగులో పాడిన చివరి సాంగ్. మొత్తంగా ఆశా భోస్లే తెలుగులో 8 పాటలు ఆలపించారు.

మన తెలంగాణ 13 Apr 2026 10:45 am

Hot Summer : అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి.. పది రోజులు హై అలెర్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హై అలెర్ట్ జారీ చేసింది

తెలుగు పోస్ట్ 13 Apr 2026 10:28 am

13thAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

13thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 13thAprilCartoon | ఎన్నికల వేడి..

ప్రభ న్యూస్ 13 Apr 2026 10:25 am

నేడు వివేకా కేసు విచారణ

నేడు తెలంగాణ హైకోర్టులో నేడు వివేకా కేసు విచారణ జరగనుంది

తెలుగు పోస్ట్ 13 Apr 2026 10:23 am

రజత్ సిక్సర్ల సునామీ... హ్యాట్రిక్

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో సిక్స్‌ల వర్షం కురిసింది. ఎంఐపై ఆర్‌సిబి 18 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 29 సిక్స్‌లు బాదాయి. 36 ఫోర్లను బౌండరీకీ దాటించాయి. ఆర్‌సిబి జట్టు తొలుత 240 పరుగుల చేయగా ముంబయి జట్టు 222 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. రెండు జట్లు కలిసి 462 పరుగులు చేయగా 318 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఆర్‌సిబి కెప్టెన్ రజత్ పటిదార్ సిక్స్‌ల సునామీ సృష్టించాడు. మయాంక్ మర్కండే వేసిన 12 ఓవర్‌లో హాట్రిక్ సిక్స్‌లు కొట్టి రజత్ ఔరా అనిపించాడు. ముంబయి ఆల్‌రౌండర్ రూథర్‌పోర్డ్ 20 ఓవర్‌లో ఐదు సిక్స్‌లు బాదాడు. 

మన తెలంగాణ 13 Apr 2026 10:18 am

ముచ్చి మోదుగు పాట

ఛ రే ణా... నత్తి నొక్కు నీ బుగ్గలపైన మోదుగు పువ్వు మొన పువ్విప్పి చప్పరించు ఛిన్ని చుక్క మకరందం ఛ రే ణా...... (ఛ రే ణా అంటే అది ఒక నత్తి స రే నా!) సుమనస్పతి (నోట్: ముచ్చి- చిత్రకారుడు (‘ముచ్చి’ అని చర్మ కళాకారుల వర్గం నుండి ఏర్పడిన ఒకవర్గం/కులం/ఉపకులం ఉండేది. ‘మోచీ’ నుండి వచ్చిన రూపమే ‘ముచ్చి’.)

మన తెలంగాణ 13 Apr 2026 10:13 am

Jana Nayagan Piracy: Multiple Arrests Made

The entire film of Vijay’s Jana Nayagan was leaked online and it left everyone in deep shock. The makers KVN Productions are already struggling with the censor hurdles and they are trying hard to release the film at the earliest. The ongoing Tamil Nadu Assembly elections have pushed the release of the film. Now, the […] The post Jana Nayagan Piracy: Multiple Arrests Made appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 10:11 am

Telangana : ఈ నెల 30వ తేదీ వరకూ రేషన్ పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో పేదలకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారు

తెలుగు పోస్ట్ 13 Apr 2026 10:08 am

నేనే విజేతను

నల్లని ఆ త్రాచు తోకపై లేచింది పడగవిప్పి నన్నే చూస్తోంది నేను కదలినా పరుగెత్తినా అది నన్ను కాటేస్తుంది నేను అలాగే నిశ్చలంగా ఉన్నాను అదో కారడవి, శిరసుపైన మధ్యాహ్నపు కాగడాతో ధగధగలాడే సూర్యుడు ప్రాణావసాన వేళాజనితం అంత భయం లోనూ ఎన్ని తూనీగలు ముసురుతున్నాయో తలలో, తల చుట్టూ నేను ఉరిమే నీలిమేఘాన్నని తెలిసినా ఎందుకు ఆ విధంగా విచ్చుకున్న నెమలి పించమై నా గుండె తాళానికి అనుగుణంగా నర్తిస్తావు నా బతుకు పొట్లంలో ఒక మిఠాయివై కూర్చుంటావు నా జీవ నారణ్యంలో అర్ధరాత్రి విచ్చుకున్న వేకువ పువ్వవుతావ్ నాకు తెలుసు ఆ సర్పం నన్ను కాటేస్తుందని? నాకు పూర్తిగా తెలుసు నేనొకనిర్నిద్ర సముద్రం లోపలికి జారిపోతానని? అయినా విశ్వాసం సన్నగిల్లడం లేదు మృత్యు సర్పం వైపు నిశ్చలంగా చూస్తూ నేను నిర్ణయం తీసుకుంటున్నాను బహుశా ఆ నెమలిపించమే నన్ను మెరుపులతో పాటు వర్షమై కురిసే మెత్తని మబ్బుగా చేసింది కంటి కెమెరాలలో, తూనీగలను అక్షరమానం చేసింది ఒక విస్పోటనం నుండి కొత్త ప్రపంచాన్ని దగ్గరగా చేసింది ఇక అడుగు ముందుకేశాను ఏం జరిగినా నేనే విజేతను - డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు 

మన తెలంగాణ 13 Apr 2026 10:07 am

పేదరికాన్ని జయించిన ప్రతిభ..

పేదరికాన్ని జయించిన ప్రతిభ.. స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా స్టేషన్

ప్రభ న్యూస్ 13 Apr 2026 10:00 am

ఫ్యాక్ట్ చెక్: LPG గ్యాస్ సమస్య గురించి ప్రజలు ప్రశ్నిస్తోంది ప్రధాని నరేంద్ర మోదీని కాదు. ఆయనలా కనిపించే వ్యక్తిని

ప్రధాని నరేంద్ర మోదీని రోడ్ షోలో గ్యాస్ సమస్య గురించి ప్రజలు ప్రశ్నించారు

తెలుగు పోస్ట్ 13 Apr 2026 9:58 am

మరణం పరిష్కారం కాదు

మరణం ఎప్పుడూ ఒక వీలునామా కాదు ఏ పిరికితనమూ మరణ కాంక్షకి శాశ్వత చిరునామా కాదు అనేక భావోద్వేగాల మధ్య తీవ్ర అంతర్గత ఒత్తిళ్ల మధ్య అప్రయత్నంగా ఎవరైనా తమ జీవితానికి తామే ఉరిశిక్ష వేసుకుంటే అది కేవలం ఆత్మహత్యా సదృశ్యమే కాదు చట్ట విరుద్ధమైన చర్య కూడా ఈ చావు భయం శారీరకమే కాదు అంతర్గతమూ కూడా మృత్యువు పేరుతో సమాజానికి వేసిన ఒక సామూహిక ప్రశ్న, ఓ నిశ్శబ్ద నిష్క్రమణ ఒక్క క్షణం జీవితంలో ఓడిపోతే చాలు దానికి శాశ్వత పరిష్కారం మృత్యువు రూపంలో తొంగి చూస్తోంది అపురూపంగా పెంచుకున్న ఈ ఆయుష్షు ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడమంటే అది ఓ ప్రచ్ఛన్న అంతర్గత యుద్ధమే ప్రతి సమస్యకీ మరణమే ఓ శాశ్వత పరిష్కారమైతే ఈ లోకంలో ఏ జీవీప్రాణాలతో బతికి బట్టకట్టదు ఓటమి భయంతో ఆత్మవిశ్వానికి దూరమౌతుంటే విరిగిన మనసుకు మరణం వీలునామా కాదు అది ఓ తాత్కాలిక, శాశ్వత విరామం మాత్రమే రేపటి మీద ఆశతో బతకాలంటే ఇవాళ్టి మీద భరోసాతో ముందడుగు వెయ్యడమే మనిషికి చిరకాల స్వప్నం ఈ నమ్మకంతోనే కాలాన్ని బతికిద్దాం బతికినంత కాలంఓ చైతన్య జ్యోతిగా వెలిగి నిలిచిపోదాం - ఎన్.లహరి

మన తెలంగాణ 13 Apr 2026 9:58 am

సెట్‌లోకి అడుగుపెట్టిన దేవరకొండ, రష్మిక

హైదరాబాద్: 'రణబాలి' సినిమాలో విజయదేవర కొండ, రష్మిక జంటగా నటిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత ఈ దంపతులు తొలి సారి సెట్‌లో అడుగుపెట్టారు. సినిమా బృందం ఆ దంపతులకు ఘన స్వాగతం పలికిన అనంతరం కేక్ కట్ చేయించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిమాకు అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా నీరవ్ షా గ్రాఫిక్స్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. బ్రిటీష్ కాలంలో 1854 నుంచి 1978 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ హీరోగా నటిస్తుండగా ఆయన భార్య జయమ్మగా రష్మిక నటిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11 ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మన తెలంగాణ 13 Apr 2026 9:47 am

చుట్టూ ఉన్న స్వర్ణల్ని పట్టించుకోండి

తాజా కితాబ్:  మీరు బట్టల షాపుకు వెళతారు. అక్కడ ఒక స్వర్ణ, మీరు అడిగినవి అడగనివి విసుగు చెందకుండా చూపిస్తుంది. మీరు ఒక హాస్పిటల్ కు వెళతారు. అక్కడ ఒక స్వర్ణ రిసెప్షన్‌లో ఉండి మీకు కావలసిన సహాయాన్ని అందించి డాక్టర్ దగ్గరకు మీ ఫైల్‌తో సహా మిమ్మల్ని పంపిస్తుంది. మీరు ఒక హోటల్‌కి వెళ్తారు. అక్కడ మరొక స్వర్ణ మీ ఆకలిని తీర్చడానికి మెనూ కార్డుతో తయారుగా ఉంటుంది. వర్తమాన సమాజంలో చదువు పెద్దగా లేకపోయి నా, చిన్నచిన్న ఉద్యోగాలతో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న స్వర్ణలు ఎందరో ఉంటున్నారు. పనిచేసే దగ్గర కూర్చోవడం అనేది ఒక హక్కుగా కేరళ, తమిళనాడులలో మహిళలు సాధించుకున్నారు. చేసే పనికి సంబంధించి, యజమానుల దాష్టీకాలకు సంబంధించి, అనుమానపు చూపులకు సంబంధించి రకరకాల సమస్యలను ఈ మ హిళలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వారి స మస్యలను పట్టించుకొని వారికి కొంత బాసటగా నిలువమంటున్నారు రచయిత్రి పి.సత్యవతి. ఇల్లలకగానే, సూపర్ మామ్ సిండ్రోమ్, దమయంతి కూతురు లాంటి అద్భుతమైన కథలను అందించిన సత్యవతి ఇప్పుడు ‘ఇట్లు మీ స్వర్ణ’ అనే 11 కథల సంపుటితో పాఠకుల ముందుకు వచ్చారు. ఈ సంపుటిలోనే అన్ని కథల్లోనూ స్వర్ణ పాత్ర ఉంది. మన ఇళ్లల్లో పనిచేసే స్వర్ణ కావ చ్చు, షాపింగ్ మాల్స్‌లో పనిచేసే స్వర్ణ కావచ్చు, మాల్స్‌లో సరుకులు ప్యాక్ చేసే స్వర్ణ కావచ్చు, మన ఇళ్లల్లో నడవలేని, మంచాన పడిన ముసలివారికి సేవ చేసే నర్సింగ్ స్వర్ణ కావచ్చు, ఇలా మన చుట్టూ ఎందరో స్వర్ణలు ఉన్నారు. వారి ఆలోచనలను వినండి. అవసరమైతే వారికి చేయూతనివ్వండి. అవకాశం ఉంటే చదువుకోవాలనుకునే వారికి చదువుకోడానికి ప్రోత్సా హం ఇవ్వండి. వాళ్ల జీవితాలను నిర్దేశిస్తున్న ఆచార వ్యవహారాలు, మూఢనమ్మకాలు, ప్రభుత్వాలు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు, అమ్మ ఒడులు వీటన్నిటి పట్ల వారికి అవగాహన కల్పించండి. వారిని సమాజంలో భాగంగా ఎదగనివ్వండి అంటున్నారు పి.సత్యవతి. ఏదో ఒకలా పదో తరగతి వరకు ఈడ్చుకొచ్చి పది గట్టెక్క లేకపోతే, ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఆమె పట్ల చూపే నిరాదరణ లేదా ప్రతి పనికి వారిని ఉపయోగించుకునే తీరు ‘ప్రశ్న పత్రంలో ఈ క్రింది ఖాళీలను సరైన క్రియ పదములతో పూరింపుము’ అన్నట్లుగా వారి ఖాళీ తనాన్ని ఏదో ఒక పనితో పూరిస్తారు అంటారు రచయిత్రి. పనిచేసే చోట దొరికే చిన్న చిన్న సంతోషాలకే సంతృప్తిపడి కష్టపడి పనిచేసే స్వర్ణలు ఏమి కోరుకుంటారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వీళ్ల శ్రమను గుర్తించాలని అనుకుంటారు. వాళ్ల కి పెళ్లి చేసి పంపటంతో బాధ్యత తీరిందనుకోడానికి లేదు. అప్పటివరకు కుటుంబానికి చేదోడుగా ఉన్నవారు, పరాయి ఇంటికివెళ్లి భర్త చేత తిట్లు, తన్నులు తింటూ అక్కడ ఉండలేక తిరిగి పుట్టింటికి వచ్చి తమ రెక్కల శ్రమను నమ్ముకోవాల్సిన స్థితిని సత్యవతి ఈ కథల్లో ఆవిష్కరించారు. ఈ స్వర్ణల ఉద్యోగాలకు భద్రత ఉండదు. వీరి తల్లిదండ్రులు కూడా వారు చేసే ఉద్యోగాలను ఉద్యోగాలుగా తలచరు. పెళ్లి చేసి పంపే అంతవరకు కాలక్షేపం గానూ, వాళ్ళు తెచ్చే రెండు రాళ్లు తమ కుటుంబానికి ఉపయోగపడే విధంగానూ ఉంటాయి అనుకుంటారు తప్ప, అంతకు మించిన ఆలోచన చేయరు. మన చుట్టూ ఉన్న పేదరికపు గీతకు కింద ఉన్న వీరందరి వైపు ఓసారి చూడమని, వీరిని పట్టించుకోమని తన కథల ద్వారా చెబుతున్నారు సత్యవతి. - బండ్ల మాధవరావు

మన తెలంగాణ 13 Apr 2026 9:47 am

515medicinesonly |ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత.. రోగులపై పెరుగుతున్న భారం

515medicinesonly | ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత.. రోగులపై పెరుగుతున్న భారం 515medicinesonly

ప్రభ న్యూస్ 13 Apr 2026 9:44 am

Gold Prices Today: బంగారం ధరలు ఈ వారంలో భారీగా పెరుగుతాయా?

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి

తెలుగు పోస్ట్ 13 Apr 2026 9:39 am

శ్రమ జీవుల వలసల బాధామయగాధ

వలస మానవ జీవన ప్రయాణంలో అవసరమైన మజిలీ. ఉన్న చోట కష్టాల నుండి బయటపడడానికో లేదా మరింత బాగా బతుకు సాగాలనే ఆశతో మనిషి ప్రవాసానికి సిద్ధమవుతాడు. అయితే అలా వేసిన అడుగుల వల్ల ఎదురయ్యే మేలు గాని, కీడు గాని తీరం చేరితేనే అర్థమవుతుంది. సాధారణంగా పొట్ట చేతబట్టుకొని బయలుదేరిన మనిషి అవసరాన్ని, దిక్కులేనితనాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం, ఇస్తామన్న కూలి సొమ్మును తగ్గించే, వీలైతే ఎగ్గొట్టే ఆలోచన వ్యాపార లక్షణం. కార్చిన చెమట తూకం కన్నా దక్కిన లాభం లెక్కలే ముఖ్యమైన కాలంలో దేశ దేశాల్లో వలస జీవుల వెతలు ఇన్నీ అన్నీ కావు. అయితే చరిత్ర రచనలో ఇదొ క విస్మృత కోణం. సాహిత్యంలో దొరకని చీకటి అధ్యాయం. ఎవరికీ అక్కర లేనట్లు మగ్గిపోయిన ఈ వలస లెక్కలపై, మూలాల ముచ్చటపై రచయిత ముకుంద రామారావు దృష్టి పడింది. ఆ ఆసక్తి, శ్రమ ఫలితమే ‘అగమ్య గమ్యాలు’. వ్యాసాల రూపంలో ఆయన రాసిన ఈ పుస్తకం వల్ల వందేళ్ల వలస కార్మికుల చరిత్ర ఓ గమ్యానికి చేర్చింది. బ్రిటీష్ పాలన లో ఒప్పంద కార్మిక వలస విధానంలో భారతీయ శ్రమజీవుల కన్నీటి గాధలు ఈ రచన ద్వారా వెలుగు చూశాయి. ప్రతి పేజీలో ముకుంద రామారావు విషయ సేకరణ కోసం చేసిన కృషి కనబడుతుంది. ఇది నిన్న మొన్నటి సంగతి కాదు, రెండు వందల ఏళ్ల వెనుకటిది. ఆ బాధలు అనుభవించిన వారు తమ పిల్లలకు కూడా చెప్పుకోనంత దుర్భరమైనవి. మీరు బాగుంటే చాలు, మా కష్టాల ఏకరువు మీకెందుకు అని దాటేసిన ఆ నా టి క్రూర జ్ఞాపకాలు అవి. అక్కడా, ఇక్కడా దస్తావేజుల్లో మిగిలిన గణాంకాలు, ఆర్కైవ్ రికార్డులు, నవలల్లో, కవితల్లో నిక్షిప్త సమాచారం ఈ రచనకు మూలాధారాలు. సుమారు దశాబ్ద కాలపు రచయిత వెదుకులాట ఫలితమీ గ్రంథం. ఒప్పంద వలస జీవుల చరిత్ర వెలికితీయాలన్న రామారావు కాంక్షకు ఓ నేపథ్యం ఉంది. ఆ విషయాన్ని రచయిత తన మాటలో వివరించారు. ‘మా తాతయ్య 19041914 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా వెళ్లారు. మా నాన్న అక్కడే పుట్టారు. ఆ ముందూ, వెనుకా, మా తాతయ్య, నానమ్మలలాంటి వాళ్లు వేల కొద్దీ వెళ్లారని, ఒక్క దక్షిణాఫ్రికానే కాదు, అనేక దేశాలకు రైతులుగానో, కార్మికులుగానో వలస వెళ్లారని, అలా వెళ్ళినవారు పడరాని కష్టాలు పడ్డారని తెలిసి, వారిలో ఒకరిలా మా నసిక క్షోభ అనుభవించాను. ఒప్పంద కార్మికుల చరిత్రను న మోదు చేయడం బాధ్యతగా భావించి, వారందరి వారసుడిగా నేను చేస్తున్న చిరు ప్రయత్నం ఇది’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్ లాంటి రాజ్యాల్లో 1833లో బానిస వ్యవస్థ రద్దు అయ్యాక దాని స్థానాన్ని పూరించేందుకు చట్టబద్దమైన ఒప్పంద వలస కార్మికుల వ్యవస్థ ఏర్పడింది. అయిదు, పదేళ్ల రాతపూర్వక అంగీకారం పైకి పద్ధతిగానే ఉండేది. ఇది పూర్తిగా బానిసత్వమూ కాదు, పూర్తి స్వేచ్ఛా కాదు అంటారు రచయిత. అలా 1834-1920 మధ్య కాలంలో ప్రపంచంలోని 19కి పైగా వలస రాజ్యాలకు దాదాపు 13 లక్షల మంది భారతీయులు ఒప్పంద వలస కార్మికులుగా వెళ్లారు. సుదీర్ఘమైన, ప్రమాదభరిత ప్రయాణాలవి. కలకత్తా నుండి జమైకాకు 180 రోజుల సముద్రయానం. ఓడ ఎక్కిన వారంతా గమ్యం చేరుతారన్న గ్యారెంటీ లేదు. విషజ్వరాలు, కలరా, అగ్ని ప్రమాదాలు, ఓడ ధ్వంసం ఇలా ఎన్నో ఉపద్రవాల నడమ ప్రయాణం సాగేది. మార్గంమధ్యలో ఎందరో చనిపోయేవారు. మెడకు తగిలించిన బిళ్లలోని నెంబరే వారి గుర్తింపు. పని స్థలాల్లో అత్యంత కఠినమైన నిబంధనలు ఉండేవి. ఒక రోజు పనికి రాకపోతే రెండు రోజుల వేతనం కోత పెట్టేవారు. చేసిన పని నచ్చకపోతే కొట్టేవారు, జరిమానా వేసేవారు. జైలుకు పంపేవారు. ఒప్పంద కాలాన్ని పెంచేవారు. వెరసి ఎంతో మందికి ఈ ఒప్పంద వలస కార్మిక జీవితం యావజ్జీవ దేశ బహిష్కరణగా మారిపోయింది. అందుకే వెళ్లిన 13లక్షల మందిలో సుమారు 3లక్షల వరకే స్వదేశానికి తిరిగి వచ్చినట్లు రికార్డుల్లో ఉంది. వందేళ్లుగా బ్రిటీష్, ఫ్రెంచ్, డచ్ వలస దేశాల్లో మిగిలిన భారత సంతతి అక్కడే ఉండిపోయింది. వాళ్లు మిశ్రమ సాంప్రదాయ జీవితాలు గడుపుతున్నారు. అత్యధికంగా నాలుగున్నర లక్షల మంది మారిషస్‌లో మిగిలిపోయారు. ట్రినినాడ్ జనాభాలో 40% వలస కార్మికుల వారసులే. కరేబియన్ దీవులకు వెళ్లిన 4లక్షల వలస కార్మికుల్లో అక్కడే స్థిరపడ్డవారు అధికం. భారతీయ మూలాలు, పూర్వీకుల స్పష్టమైన ఆధారాలు లేకపోవడమే అందుకు కారణమని రచయిత అంటారు. పేర్లు కూడా మారిపోయి గణపతి చివరకు కెనబడీ అయింది. మన దేశంలో వచ్చిన కరువుకు, వలసలకు ప్రత్యక్ష సంబం ధం ఉందని రచయిత సోదాహరణంగా వివరించారు. భారతదేశంలో పెద్ద ఎత్తున వచ్చిన కరువులన్నీ బ్రిటిష్ పాలనలోనే రావడం జరిగింది. కరువు సమయంలోనూ ఆహార ధరలు తగ్గించడానికి బ్రిటిష్ పాలకులు అంగీకరించలేదు. ఈ విపత్తులను తట్టుకోలేక, మరో గత్యంతరం లేక ప్రజలు వలసలకు పాల్పడ్డారు.తమ పాలక దేశాల్లో పంటలకు, పరిశ్రమలకు, రైలు మార్గ నిర్మాణాలకు కూలీల అవసరాల దృష్ట్యా బ్రిటీష్ పాలకులు వలసల అనివార్య పరిస్థితిని కల్పించారు. లక్షలాదిగా భారతీయుల వలస కార్మిక నికృష్ట బతుకులకు, వారి వారసులు ఆయా దేశాల్లోనే మగ్గిపోవడానికి పరోక్షంగా బ్రిటిష్ పాలనే కారణమని రచయిత పేర్కొన్నారు. వలస కార్మికుల వెతలతో వెలువడ్డ సాహిత్యాన్ని రామారావు చాలా మట్టుకు సేకరించారు. కవిత్వాన్ని చాలా చోట్ల పరిస్థితుల వివరణ కోసం వాడుకున్నారు. వలస దేశాల వివరాలు తెలిపే క్రమంలో అక్కడి వలస సంతతి రచనలను అనుబంధంగా ఇచ్చారు. చాలా కవితల్లో వేదన, దుఃఖం, నిస్సహాయత, మూలాలు కోల్పోయిన ఏకాకితనం నిండి ఉంది. భారతీయ ఒప్పంద వలస కార్మికుల కష్ట నష్టాలను రచయిత ముకుంద రామారావు ఎంతో సమర్థవంతంగా, హృద్యంగా చిత్రించారు. తెలుగు సాహిత్యంలో అరుదైన గ్రంథ రచన ఇది. గొలుసులతో బంధించి ఆఫ్రికా నుండి బానిసలను తీసుకుపోయినట్లు, భారతీయ ఒప్పంద కార్మికుల తీసుకు వెళ్లక పోయినా రెంటికి పెద్ద తేడా లేదని తొలి అధ్యాయంలో రచయిత అన్నమాట పుస్తకం చదివాక అర్థమవుతుంది. రచయిత విషయ సేకరణ, ఒక క్రమంలో వాటిని కూర్చిన తీరు, అక్కడక్కడా తన ఉద్వేగాన్ని వ్యక్తపరచిన సందర్భాలు పుస్తకానికి పరిపూర్ణతనిచ్చాయి. - బద్రి నర్సన్

మన తెలంగాణ 13 Apr 2026 9:36 am

3942wards |సన్నాహాలు ప్రారంభం

3942wards | సన్నాహాలు ప్రారంభం 3942wards పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం ముందడుగుడివిజన్లు, వార్డుల

ప్రభ న్యూస్ 13 Apr 2026 9:25 am

గాఢతను సంతరించుకున్న సరళత నాకు ఇష్టం

నేను, నా సాహితీయాత్ర: 1974లో నా పదమూడవ ఏట నా సాహిత్య ప్రయాణం మొదలయింది. వరంగల్ జిల్లా ఖానాపురం అనే గ్రామంలో ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడు మా తెలుగు ఉపాధ్యాయుడు తేలు లక్ష్మీనారాయణ గారి ప్రోత్సాహంతో కవితలను రాయడం మొదలుపెట్టాను. స్కూలు వార్షికోత్సవ కార్యక్రమంలో కొన్ని వందల మంది గ్రామస్తుల సమక్షంలో నా తొలి కవితను చదివే అవకాశాన్ని పొందాను. స్కూల్ రోజుల్లో కొన్ని పద్యాలు రాశాను. నేను రాసిన తొలి కథ ‘వెలుగు రేఖలు’ 1978లో యోజన అనే పత్రికలో అచ్చయింది. కవిత్వం వైపు పూర్తిగా మళ్లడం వల్ల మళ్ళీ నేను కథలు రాయలేదు. నేను వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో MSc (Ag) పూ ర్తి చేసాక 1984లో ఆంధ్రా బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరి కలకత్తాలో, హుబ్లిలో పనిచేసి పొన్నూరుకు వచ్చాను. అక్కడ ఉన్నప్పుడే తుమ్మపూడిలో ఉండే సంజీవదేవ్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. గుంటూరులో ఉన్న కాలంలో పా పినేని శివశంకర్ గారి ద్వారా ఎన్నో సాహిత్యవిషయాలను తెలుసుకున్నాను. అక్కడే ‘చినుకు’ అనే బులెటిన్‌కు సహ సంపాదకుడిగా పనిచేసాను. రోమిలా థాపర్ రాసిన Sati in history అనే దీర్ఘ వ్యాసాన్ని చరిత్రలో సతిగా అనువదించాను. దాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఒక చిన్న పుస్తకంగా ప్రచురించింది. 1987లో నా తొలి కవితా సంపుటి ‘జీవన వీచిక’ ను తెనాలిలో సంజీవదేవ్ గారు ఆవిష్కరించారు. ఆ తర్వాత వచ్చిన నా కవితా సంపుటులు ఇవి: ప్రవాహం (1992), ముఖాముఖం (1995), వేళ్ళు మాట్లాడే వేళ (1999), ఆట (దీర్ఘ కవిత - 2001), నాగటిచాళ్ళు (2004), నేల గంధం (2009), పొలం గొంతుక (2013), పత్రహరితం (2016). ధాన్యం గింజలు (2019), బాలల కోసం బాటసారి పదాలు (2020), జొన్నచేను ముందు (2023). నా లేఖా సంపుటి 2021లో పలకరింపుగా వెలువడింది. నా విమర్శ వ్యాసాల సంపుటి ఇష ్టవాక్యం (2012)లో వచ్చింది. అమితావ్ ఘోష్, మహాశ్వేతా దేవి, వాసుదేవ నాయర్, దామోదర్ మౌజోలతో పాటు మరి కొందరితో నేను చేసిన ఇంటర్వ్యూల సంపుటి అనుభవం మాట్లాడింది (2025)లో. నా తొలి ఆంగ్ల కవితా సంపుటి Scents of the Soil (2016)లో వచ్చింది. నా కవితలను కొన్నింటిని దేశెట్టి కేశవరావు ఆంగ్లంలోకి అనువదించగా Green Fingers and other poems అనే సంపుటిగా తెచ్చాను. వ్యవసాయం, నా యాత్రలు, మానవ సంబంధాలు, రాజకీయాల తీరుతెన్నులు, నా లోపలి చింతనలూ ఉహలూ స్థూలంగా ఇవీ నా కవితా వస్తువులు. నా కవితలు సరళంగా, గాఢతతో, దృశ్యమానంగా వుండాలని అభిలషిస్తూ ఆ దిశగా సాధన చేసాను. 2004 నుంచి 2014 వరకు వెలువడిన కవిత వార్షిక సంచికలకు సహ సంపాదకుడిని. 2015 నుంచి 2024వరకు సంపాదకుడిగా కవిత్వం వార్షిక సంచికలను రూపొందించాను. కాళోజీతో సహా ఎందరినుంచో నేను స్ఫూర్తిని పొందాను. సాహిత్యం ప్రజాహితానికీ, మానవ సంస్కారానికీ దోహదం చేయాలని నా నిశ్చితాభిప్రాయం. నా కవిత్వానికీ, నా వ్యక్తిత్వానికీ నడుమ భేదం ఉండకూడదనీ, నేను కవిత్వంలో ప్రతిపాదించే విలువలకు భిన్నంగా జీవించకూడదనీ నాకు నేను పెట్టుకున్న ప్రమాణాలు. నా ప్రయాణంలో ఫ్రీవర్స్ ఫ్రంట్, సినారె పురస్కా రం, గరికిపాటి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారంతో పాటు దాదాపు ఇరవై అయిదు పురస్కారాలను పొందాను. 1992లో బ య్యారం అనే ఊళ్లో రైతులమీద నేను రాసిన కవిత ను చదివినపుడు, అక్కడ కొందరు రైతులు నన్ను సమీపించి మా గురించి రాశారు, చాలా సంతోషం గా ఉంది అని అన్నారు. అది నా సాహిత్య జీవితం లో నేను పొందిన అత్యున్నత పురస్కారమని అనుకుంటాను. నా విస్తార సాహిత్య ప్రయాణానికి నా సహచరి కమల, పిల్లలు మానస రవళి, చైత్ర మౌ నిక అందించిన తోడ్పాటును మాటల్లో చెప్పలేను. - దర్భశయనం శ్రీనివాసాచార్య

మన తెలంగాణ 13 Apr 2026 9:21 am

NTR’s Beast Look Loading

NTR is transforming himself for Prashanth Neel’s film and he is taking bigger breaks for his transformation. Though it is unclear how many looks Tarak would portray, the top actor is spending hours in the gym to get the desired beast look. Tarak himself posted a click from his transformation in his gym. He gets […] The post NTR’s Beast Look Loading appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 9:00 am

Nara Lokesh : నేడు ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీకి చేరుకున్నారు

తెలుగు పోస్ట్ 13 Apr 2026 8:57 am

ప్రియురాలిని చంపి... పిఎస్‌లో లొంగిపోయిన ప్రియుడు

చెన్నై: అనుమానంతో ప్రియురాలిని ప్రియుడు హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం పెరంబలూరు జిల్లా కున్నం తాలూకాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... పుదువెట్టక్కుడి గ్రామానికి చెందిన పచ్చముత్తు, సత్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నందిని(25) అనే మహిళకు భర్త చనిపోవడంతో ఇద్దరు కుమారులు, కూతురుతో కలిసి ఉంటుంది. పెరంబలూర్‌లో పని చేస్తుండగా నందినికి పచ్చముత్తు పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం సత్యకు తెలియడంతో పలుమార్లు భర్తను మందలించింది. భర్తలో మార్పు రాకపోవడంతో సత్య ఆత్మహత్య చేసుకుంది. పెరంబలూరులోని భారతీనగర్‌లో నందినితో కలిసి పచ్చముత్తు ఉంటున్నాడు. నందిని ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ఆమెపై పచ్చముత్తు అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రియుడు ఆమెను ప్రశ్నించాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆగ్రహంతో ఆమెపై దాడి చేయడంతో చనిపోయింది. వెంటనే పెరంబలూర్ పోలీస్ స్టేషన్‌లో అతడు లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

మన తెలంగాణ 13 Apr 2026 8:51 am

Weekend Box-office: It’s a Dacoit Show

Two films Adivi Sesh’s Dacoit and Pradeep Ranganathan’s Love Insurance Kompany (LIK) released on Friday. Dacoit dominated the show completely and the film had a decent weekend all over. Though the film received mixed response, Dacoit performed well in A centres and in overseas. The film failed to register big numbers in B, C centres […] The post Weekend Box-office: It’s a Dacoit Show appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 8:50 am

Sibling Rivalry Intensifies Over TRS Legacy

K. T. Rama Rao and K. Kavitha, once seen walking in the footsteps of their father K. Chandrashekar Rao, are now seen competing for the legacy of the pink flag. At the centre of this emerging rivalry is the TRS brand name, which still carries strong emotional value among Telangana voters. There is a growing […] The post Sibling Rivalry Intensifies Over TRS Legacy appeared first on Telugu360 .

తెలుగు 360 13 Apr 2026 8:49 am

Zodiac Signs : ఈరోజు అదృష్టం ఏ రాశికో తెలుసా? ఇబ్బందులు ఈ రాశుల వారికో తెలుసా?

దినఫలాలు అంటే చాలా మందికి గురి

తెలుగు పోస్ట్ 13 Apr 2026 8:47 am

అమీన్ పూర్ లో ఆక్రమణల తొలగింపు... 861 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్.

అమీన్ పూర్ లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ దాదాపు పూర్తి కావచ్చింది

తెలుగు పోస్ట్ 13 Apr 2026 8:36 am

అమ్మా... చంపుతావునుకోలేదమ్మా

భువనేశ్వర్: కుమారుడు, కుమార్తెను కసాయి తల్లి చంపిన సంఘటన ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కన్నతల్లి కాటికి పంపిస్తుందని అనుకోలేదు. ఝూర్సుగూడలోని తంగరపల్లి గ్రామంలో రంజిత అనే మహిళ, భర్త కుమారుడు బిభాన్షు(06), కుమార్తె జిజ్ఞాస (10) కలిస జీవిస్తోంది. శనివారం రాత్రి భర్తను లేపి బయటకు రమ్మని పిలించింది. ఆమె ఇంటి లోపలికి వెళ్లి గడియ వేసుకుంది. కూతురు, కుమారుడిని పదునైన ఆయుధంతో దాడ చేసి చంపేసింది. అనంతరం తాను గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంది. లోపల నుంచి కేకలు వినపడడంతో భర్త ఇరుగుపొరుగు వారిని పిలిచాడు. గ్రామస్థులు డోర్ బద్దలు కొట్టి చూడగా ఇద్దరు రక్తపు మడుగులో కనిపించారు. భార్య కొన ఊపిరితో ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మన తెలంగాణ 13 Apr 2026 8:31 am

IPL 2026 : ఐపీఎల్ లో నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పోరాడనుంది.

తెలుగు పోస్ట్ 13 Apr 2026 8:16 am

IPL 2026: తేరుకోని ముంబయి.. పట్టుకోల్పోని బెంగళూరు

ముంబయి ఇండియన్స్ తేరుకోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పట్టు కోల్పోలేదు

తెలుగు పోస్ట్ 13 Apr 2026 8:04 am

Strait of Hormuz : హోర్ముజ్‌ జలసంధిపై పట్టు కోసం అమెరికా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కీలక ప్రకటన చేశారు

తెలుగు పోస్ట్ 13 Apr 2026 7:48 am

13thApril 2026 |తిరుమల సమాచారం..

13thApril 2026 | తిరుమల సమాచారం.. తిరుమల, ఆంధ్రప్రభ : “ఓం నమో

ప్రభ న్యూస్ 13 Apr 2026 7:42 am

వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

వికారాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం సిద్దన్నమడుగు తండా - తట్టెపల్లి మధ్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కుటుంబం తాండూర్  నుంచి జహీరాబాద్ కు స్కూటీపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు, కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గాయపడిన కుమారుడిని 108లో తాండూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 13 Apr 2026 7:39 am

ఫెయిలవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య.... తీరా చూస్తే పాస్!

ఖమ్మం జిల్లా రాపల్లిలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి అక్షాంత్ అన్ని సబ్జెక్టుల్లోనూ పాస్ అయినట్లు ఫలితాల్లో వెల్లడి మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/మహబూబ్‌నగర్ బ్యూరో/ వెల్దుర్తి/ ఉట్నూర్: ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అవుతానని భయపడి నాలుగు రోజుల క్రితం ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ, ఆదివారం వెల్లడైన ఇంటర్ ఫలితాలలో మాత్రం ఆ విద్యార్థి పాసయ్యాడు. బోనకల్ మండలం రాపల్లికి చెందిన గంగాదేవుళ్ల వెంకటేశ్వర్లు రేణుక కుమారుడు గంగాదేవుల అక్షాంత్ వైరా పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, తాను పరీక్షలు సరిగ్గా రాయలేదని, ఫెయిల్ అవుతానేమోననే భయంతో గురువారం మధిర రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆదివారం వెలువడ్డ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అక్షాంత్ 347 మార్కులతో అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యాడు. ఇది తెలిసిన తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన విద్యార్థుల్లో పెరుగుతున్న పరీక్షల ఒత్తిడిని మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఫలితాలపై విద్యార్థులు ఆందోళన చెందకుండా, కుటుంబసభ్యులు, ఉపాధ్యాయులు వారికి మానసికంగా ధైర్యం చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు. జీవితం ఒక పరీక్షా ఫలితంతో ముగియదని, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని అవగాహన కల్పించడం అత్యంత అవసరమని వారు పేర్కొన్నారు. ఎందరో గొప్ప వ్యక్తులు చదువులో విఫలమైనా, జీవితంలో అద్భుత విజయాలు సాధించారని నిపుణులు పేర్కొంటున్నారు. అన్నాసాగర్‌లో విద్యార్థిని ఆత్మహత్య ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానన్న బాధతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో చోటుచేసుకున్నది. జక్కుల శ్రావణి (17) అనే విద్యార్థిని భూత్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివి పరీక్షలు రాసింది. ఆదివారం విడుదలైన ఫలితాలలో శ్రావణి ఫెయిల్ అయింది. దీంతో మానసిక వేదన చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెల్దుర్తిలో విద్యార్థి ఆత్మహత్య ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అ య్యాడనే మనస్థాపం తో చాకలి సాయిరాం (17) అనే విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నా డు. వివరాల్లోకి వెళితే... చాకలి సాయిలు నాగమణి దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి పని చేసుకునే తరుణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో సా యిరాం ఇంటర్‌లో సీఈసీ చదువు తున్నాడు. ఈ నెలలో సోదరి మహేశ్వరి వివాహం కుదరడంతో కుటుం బసమేతంగా స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ తరుణంలో ఆదివారం నాడు వెలువడిన పరీక్ష ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. మనస్థాపానికి గురైన సాయిరాం ఇంట్లో ఎవరూ లేని సమయం లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. దంతన్‌పల్లిలో ఉరివేసుకొని.. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉట్నూర్ మండలంలో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండలంలోని దంతన్‌పల్లికి చెందిన జిల్లపెల్లి బక్కన్న, బుచ్చవ్వ దంపతుల కుమార్తె సౌజన్య (17) ఇంటర్ చదువుతోంది. ఆదివారం ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదల కాగా ఆ ఫలితాలలో సౌజన్య ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

మన తెలంగాణ 13 Apr 2026 7:33 am

Haiti stampede : తొక్కిసలాట...25 మంది మృతి... వందలాది మందికి గాయాలు

హైతీలోని మిలోట్‌లో తొక్కిసలాట జరిగింది

తెలుగు పోస్ట్ 13 Apr 2026 7:31 am

నేషనల్ హైవే పై ప్రమాదం..

నేషనల్ హైవే పై ప్రమాదం.. ఉయ్యురు, ఆంధ్రప్రభ : ఉయ్యూరు – మచిలీపట్నం

ప్రభ న్యూస్ 13 Apr 2026 7:13 am

అగ్నిగోళం.. బయటకు వెళితే ఇక అంతే..

అగ్నిగోళం.. బయటకు వెళితే ఇక అంతే.. హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత

ప్రభ న్యూస్ 13 Apr 2026 6:46 am

ఆబ్కారీ శాఖకు అవినీతి కిక్కు?

 రహస్య కోటి రూపాయలు స్వాహా ఇద్దరు అధికారుల చేతివాటం ఎస్‌టిఎఫ్, డిటిఎఫ్‌లో పాతుకుపోయిన అధికారులు, సిబ్బందితో వసూళ్ల దందా మేడ్చల్ పరిధిలో కిందిస్థాయి సిబ్బందికి ఓ అధికారి టార్గెట్ పెట్టి వసూళ్లు సికింద్రాబాద్‌లో డిఫెన్స్ బాటిళ్లను విక్రయిస్తున్న ఎక్సైజ్ అధికారి గంజాయి సేవిస్తూ దొరికిన ఓ కంపెనీ యజమాని మనవడు, రూ. 20 లక్షలు పుచ్చుకొని వదిలేసిన వైనం మనతెలంగాణ/హైదరాబాద్: ఆబ్కారీ శాఖలో అవినీతి తిమింగలాలు అధికమయ్యారు. గంజాయి, ఎండిఎం, డ్రగ్స్, నకిలీ మద్యం కేసుల్లో అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్‌టిఎఫ్, డిటిఎఫ్‌లో పనిచేసే కొందరు అధికారుల చేతివాటం అధికమయ్యిందన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. ముఖ్యంగా ఎస్‌టిఎఫ్, డిటిఎఫ్‌లో కిందిస్థాయి సిబ్బంది ద్వారానే ఈ వసూళ్ల దందా జరుగుతుందని అందుకే తమకు నచ్చిన కానిస్టేబుళ్లను డిప్యూటేషన్ తీసుకొచ్చి ఇక్కడ అక్రమాలు, అవినీతి కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో... ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఇన్‌ఫార్మర్‌ల పేరుతో ఏర్పాటు చేసే సీక్రెట్ ఫండ్‌కు సంబంధించి కోటి రూపాయలను ఇద్దరు అధికారులు కలిసి స్వాహా చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డబ్బుకు సంబంధించి ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో ఇన్‌ఫార్మర్‌ల పేరుతో ఆ డబ్బును ఇద్దరు అధికారులు స్వాహా చేశారని ఇప్పటికే దీనిపై ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు అందినట్టుగా సమాచారం. ఇలా, ఎస్‌టిఎఫ్, డిటిఎఫ్‌లో చాలాకాలంగా కొందరు అధికారులు, సిబ్బంది డిప్యూటేషన్‌ల పేరుతో పాతుకు పోయారని వారే ప్రస్తుతం చక్రం తిప్పుతూ అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.20 లక్షలు ఇచ్చి మనువడిని తీసుకెళ్లిన... ఈ మధ్య ఎస్‌టిఎఫ్‌లో పనిచేసే ఓ అధికారి ఓ ప్రముఖ కంపెనీకి చెందిన ఆయన మనువడిని అరెస్టు చేస్తానని బెదిరించి గంటలోనే వారి నుంచి రూ.20 లక్షలను వసూళ్లు చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. గంజాయి కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసిన సమయంలో ఆ వ్యక్తి ఫోన్‌ను ఎస్‌టిఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌ను చెక్ చేయగా ప్రముఖ కంపెనీకి చెందిన మనువడు గంజాయి తీసుకుంటున్న వీడియో ఎస్‌టిఎఫ్ అధికారులకు దొరికింది. వెంటనే ఎస్‌టిఎఫ్ అధికారులు ప్రముఖ కంపెనీకి చెందిన మనువడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆ కంపెనీ యజమాని ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి తన మనువడిని ఎస్‌టిఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయమై మొరపెట్టుకోగా ఆ ఎమ్మెల్యే వెంటనే ఎస్‌టిఎఫ్ అధికారితో సంప్రదింపులు జరిపారని, ఆ అధికారి డబ్బులు డిమాండ్ చేయడంతో గంటలోపే ప్రముఖ కంపెనీ యజమాని రూ.20 లక్షలు ఇచ్చి ఆయన మనువడిని ఇంటికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. మేడ్చల్ పరిధిలో పనిచేసే... మేడ్చల్ పరిధిలో పనిచేసే ఒక అధికారి కూడా వసూళ్లలో కింగ్‌మేకర్ అయ్యారని గతంలో ఆయన పనిచేసిన జిల్లాలోనూ అనేక ఆరోపణలు వచ్చాయని ప్రస్తుతం కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్ పెట్టి ఆయన వసూళ్లు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక, సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో పనిచేసే ఇద్దరు ఎక్సైజ్ సిఐలకు రెగ్యులర్‌గా ఇచ్చే మాముళ్లు సరిపోక వారి పరిధిలోని బార్‌లు, వైన్‌షాపులపై వేరే వారితో కేసులు నమోదు చేయించి అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శంషాబాద్ పరిధిలోని డిటిఎఫ్‌లో... సికింద్రాబాద్ పరిధిలో పనిచేసే ఒక ఎక్సైజ్ అధికారి డిఫెన్స్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నప్పుడు వాటిని ధ్వంసం చేయకుండా ఇతరులకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్నతాధికారులు ఆయన్ను ఒకసారి మందలించినా ఆయనలో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. శంషాబాద్ పరిధిలో డిటిఎఫ్‌లో పనిచేసే ఒక అధికారిపై భారీగా ఆరోపణలు రావడంతో ఆయనపై ఉన్నతాధికారులు నిఘా పెట్టినట్టుగా తెలిసింది. అధికారుల పనితీరుపై రిపోర్టు... దీంతోపాటు ఎక్సైజ్ స్టేషన్‌ల పరిధిలోని కొందరు సిఐలు, ఎస్‌ఐలు వైన్‌షాపులు, బార్ యజమానులను కేసుల పేరుతో బెదిరిస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఈ మధ్య ఫిర్యాదులు అందడంతో దానిపై అంతర్గతంగా విచారణ ప్రారంభించినట్టుగా తెలిసింది. త్వరలో జరిగే బదిలీల్లో ఎస్‌ఐలు, సిఐలు, ఏఈఎస్‌లు, ఈఎస్‌లు, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌ల పనితీరు, వారి అవినీతి భాగోతాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలిసింది. అందులో భాగంగా ఇప్పటికే అంతర్గతంగా వారి రిపోర్టు సైతం ప్రిన్సిపల్ సెక్రటరీ తెప్పించుకున్నట్టుగా సమాచారం.

మన తెలంగాణ 13 Apr 2026 6:30 am

బిఆర్ఎస్ మళ్లీ టిఆర్ఎస్?

ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం పొత్తులు మాకు కలిసిరావు బిఆర్‌ఎస్, బిజెపి పొత్తు ప్రచారం అబద్ధం. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు బిఆర్‌ఎస్ బలోపేతానికి కార్యాచరణ మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు, నాయకులకు మధ్య దూరం పెరిగింది ఆ లోపాలను సరిదిద్దుకుంటాము బిఆర్‌ఎస్‌ను మళ్లీ టిఆర్‌ఎస్‌గా మార్పు గురించి పరిశీలిస్తాం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని మీడియా ప్రతినిధులతో కెటిఆర్ చిట్‌చాట్ తండ్రిని సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ ఏడిపించొద్దు..కవిత తీరుపై కెటిఆర్ వ్యాఖ్యలు మనతెలంగాణ/హైదరాబాద్ : 2027లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు 2027 నుంచి పాదయాత్ర ప్రారంభించాలనే ప్రణాళికలో ఉన్నామని చెప్పారు. నియోజకవర్గాల డిలిమిటేషన్ వల్ల రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయని, దీనివల్ల బిఆర్‌ఎస్‌కు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ పైన ఇప్పుడు ఉన్న సమాన నిష్పత్తిలో విభజన జరిగితే ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదని అన్నారు. పార్లమెంట్‌లో ప్రస్తుతం 24 శాతం ఎంపీల స్థానాల్లో వాటా ఉన్నదని, అదే శాతం తగ్గకుండా డీలిమిటేషన్ జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్ల పెరిగితే నష్టం లేదని పేర్కొన్నారు. ఈ అంశంలో అభ్యంతరం ఎందుకు అర్థం కావడం లేదని అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని ఆదివారం మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ నివాసంలో మీడియా ప్రతినిధులతో కెటిఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, సంస్థాగత అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని,పొత్తులు తమకు కలిసిరావని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ఎప్పటిలాగే ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తుందని ధీమా ఆశాభావం వ్యక్తం చేశారు. 2014, 2018లో ఒంటరిగానే పోటీ చేసి గెలిచి అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. 2023లో కూడా ఒంటరిగానే గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయామని వ్యాఖ్యానించారు. బిజెపితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పోటీ చేయబోమని తేల్చిచెప్పారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు గుర్రాలే తమకు ముఖ్యం అని, ఈ అంశంలో పార్టీకి ఎలాంటి మొహమాటం లేదని అన్నారు. ఎవరు ఎక్కడ గెలుస్తారో అక్కడికి పంపిస్తామని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎంఎల్‌ఎలను మార్చగలిగితే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పదేళ్లలో పార్టీకి, ప్రజలకు మధ్య దూరం పెరిగింది గతంలో అధికారంలో ఉన్న సమయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని లోపాలను ఈ సందర్భంగా కెటిఆర్ బహిరంగంగానే అంగీకరించారు. ఆ లోపాలను సరిదిద్దుకుంటామని వెల్లడించారు. పదేళ్ల పాలనలో పార్టీకి, ప్రజలకు మధ్య దూరం పెరిగిందని, ఆ గ్యాప్‌ను తగ్గించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా, పదేళ్లు అధికార పార్టీగా, గత రెండున్నరేళ్లుగా ప్రతిపక్ష పార్టీగా మూడు పాత్రలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపిటిసిలు, మండల స్థాయి నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉన్నప్పటికీ, వారి ప్రయోజనాల కోసం సరైన ‘గల్ఫ్ పాలసీ’ని తీసుకురాలేకపోయామని వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం ముఖ్యంగా కొన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇలాంటి లోపాలు తలెత్తయన్నారు. బిఆర్‌ఎస్‌ను మళ్లీ టిఆర్‌ఎస్‌గా మార్పు గురించి పరిశీలిస్తామని కెటిఆర్ తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర నుండి అభ్యంతరాలు ఉన్నప్పటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించడం విచిత్రమని అన్నారు. చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతు బంధు, రైతు రుణమాఫీ సక్రమంగా అమలు కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిపై ప్రజల్లో విశ్వాసం క్రమంగా తగ్గుతోందని వ్యాఖ్యానించారు. జైలుకు వెళితేనే సిఎం అవుతారనేది ఒక భ్రమ మాత్రమేనని అని పేర్కొన్నారు. నలభై ఏళ్ల క్రితం అలాంటి రాజకీయ సంస్కృతి లేదని, తాము హత్యలు చేసి అక్రమాలు చేసి జైళ్లకు వెళ్లేంత దుర్మార్గుకాము కాదు అని స్పష్టం చేశారు. ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణ వల్ల కార్మికుల సంఖ్య తగ్గుతోందని, ప్రస్తుత ప్రభుత్వంపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. సమస్యలపై చర్చించేందుకు ఎఐటియుసి నేతలను హైదరాబాద్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు. టిబిజికెఎస్ కార్మిక సంఘాన్ని త్వరలోనే పునర్నిర్మించి, కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ గెలిచిన తర్వాత నిధులు తెస్తామని చెప్పిన నాయకులు మాట నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. దేశంలో అభివృద్ధి అంతా ఒకే నాయకుడి వల్ల జరిగిందనే భావనను ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు. పార్టీలో కెసిఆర్ నిర్ణయమే ఫైనల్ భారత రాష్ట్ర సమితిని బలోపేతం చేసే దిశగా పార్టీ చేపట్టనున్న కార్యాచరణన ఆయన వివరించారు. పార్టీని తిరిగి బలోపేతం చేసే దిశగా మే, జూన్ నెలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, అలాగే కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ బలం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో నేరుగా కనెక్ట్ కావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో తెలుగుదేశం లాంటి ఇతర పార్టీలలో ఉన్న సంప్రదాయాన్ని గుర్తిస్తూ, అక్కడి మంచి లక్షణాలను నేర్చుకుంటామని చెప్పారు. పార్టీలో ఎలాంటి ఆధిపత్య పోరులేదు అని, అందరం కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారం కేవలం విపక్షాల ప్రచారం మాత్రమే అని పేర్కొన్నారు. తాను ఆల్ రౌండర్‌ను అని, తన వయసుకు మించిన పదవులను పొందను అని చెప్పారు. కెసిఆర్ ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను పార్టీ సైనికుడిగా నిర్వహిస్తానని అన్నారు. తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే అని, కెసిఆర్ ఏ పని అప్పచెప్తే ఆ పని చేయడమే తన కర్తవ్యం అని చెప్పారు. పార్టీలో జనరల్ సెక్రెటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కి ఎంత ప్రాధాన్యత ఉందో తనకూ అంతే ప్రాధాన్యత ఉందని అన్నారు. పార్టీలో కెసిఆర్ నిర్ణయమే తుది నిర్ణయం అని తెలిపారు. పార్టీ నాయకుడు నేరుగా కార్యకర్తలతో మాట్లాడే వ్యవస్థ తమ పార్టీలో లోపించిందని, అదే ఓటమికి కారణమైందని అంగీకరించారు. తెలంగాణను కాపాడగల ఏకైక నాయకత్వం కెసిఆర్‌దేనని పేర్కొన్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించింది కెసిఆర్ నాయకత్వమే అని పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాలలోనే దెబ్బతీసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సింగరేణి సహా అన్ని స్థాయిలలో బిఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందని, ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారని కెటిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కవిత విషయంలో చెప్పేదేమీ లేదు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విషయంలో చెప్పేదేమీ లేదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. పిల్లలు తండ్రిని సంతోష పెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ, ఏడిపించవద్దని తెలిపారు. ఈ రాజకీయం ఉంటుంది, పోతుంది.. కానీ ఇతరులను బాధ పెట్టే తీరు మంచిది కాదని చెప్పారు. రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చని, ప్రజల ఆదరణ లేకుంటే వృథానే కదా అని పేర్కొన్నారు. ప్రజల కోణంలో పార్టీ పెడితే తప్పు లేదని, వ్యక్తిగత సమస్యలతో పార్టీ పెడితే ఎవరూ పట్టించుకోరని అన్నారు.

మన తెలంగాణ 13 Apr 2026 6:10 am

13thApril2026 |సోమవారం నేటి పంచాంగం

13thApril2026 | సోమవారం నేటి పంచాంగం 13thApril2026 | ఈ రోజు తిథి,

ప్రభ న్యూస్ 13 Apr 2026 6:00 am

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ప్రథమ సంవత్సరంలో 74.40 శాతం, ద్వితీయ సంవత్సరంలో 78.65 శాతం ఉత్తీర్ణతతో ముందంజలో బాలికలు ఫస్టియర్‌లో 3,23,807 మంది, సెకండియర్‌లో 3,58,490 మంది ఉత్తీర్ణత - మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, మే 22 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు - ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడులయ్యాయి. ఈసారి ఫలితాల్లోనూ మళ్లీ బాలికలే ముందంజలో ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 9.97 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 4,89,123 మంది విద్యార్థులు హాజరుకాగా, 3,23,807 మంది ఉత్తీర్థత సాధించారు. ఫస్టియర్‌లో 66.20 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సరంలో 5,07,948 మంది పరీక్షలు రాయగా, 3,58,490 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 70.58 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ప్రథమ సంవత్సరం ఫలితాలలో జనరల్‌లో 1,92,589 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా, 65,480 మంది బి గ్రేడ్, 27,476 సి గ్రేడ్, 10,235 మంది డి గ్రేడ్ సాధించారు. ఒకేషనల్‌లో 17,791 మంది మంది విద్యార్థులు ఎ గ్రేడ్, 9,616 మంది బి గ్రేడ్, 586 మంది సి గ్రేడ్, 34 మంది డి గ్రేడ్ సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌లో 2,13,179 మంది విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించగా,25 మంది ప్రైవేట్ విద్యార్థులు ఎ గ్రేడ్ సాధించారు. రెగ్యులర్‌లో 69,641 మంది, ప్రైవేట్‌లో 11 మంది బి గ్రేడ్, రెగ్యులర్‌లో 22,862 మంది, ప్రైవేట్‌లో ఆరుగురు సి గ్రేడ్, రెగ్యులర్‌లో 5,430 మంది, ప్రైవేట్‌లో నలుగురు డి గ్రేడ్ సాధించారు. ఒకేషనల్ రెగ్యులర్‌లో 20,099 మంది ఎ గ్రేడ్ సాధించగా, బి గ్రేడ్‌లో 10,305 మంది, సి గ్రేడ్‌లో రెగ్యులర్‌లో 450, డి గ్రేడ్‌లో రెగ్యులర్‌లో 18 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు ఇంటర్మీడియేట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా, కళాశాల విద్య కమిషనర్ శ్రీదేవసేన, పరీక్షల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ,ఇంటర్మీడియేట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ తరుఫున అభినందనలు తెలిపారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు ధీటుగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందని పేర్కొన్నారు. బాలికలదే పైచేయి ఇంటర్ ఫలితాలలో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 66.20 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 74.40 శాతం నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర సగటు 70.58 శాతం నమోదుకాగా, బాలికల ఉత్తీర్ణత 78.65 శాతం నమోదైంది. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 2,24,436 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, 1,67,045 ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 24,674 మంది బాలికలు హాజరు కాగా, 18,286 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 2,17,427 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా, 1,28,734 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 22,586 మంది హాజరుకాగా, 9,741 మంది ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌లో 2,12,930 మంది బాలికలు హాజరు కాగా, 1,74,136 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ప్రైవేట్‌లో 17,921 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, 6,191 మంది ఉత్తీర్ణులయ్యారు. పెరిగిన ఉత్తీర్ణత ఇంటర్మీడియేట్ ఫలితాలలో గత ఐదేళ్లతో పోల్చితే ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2022లో ప్రథమ సంవత్సరంలో 64.86 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 2023లో 62.85 శాతం, 2024లో 61.08 శాతం, 2025లో 66.91 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈ ఏడాది గత ఐదేళ్ల కంటే అధికంగా 66.94 శాతానికి ఉత్తీర్ణత పెరిగింది. అలాగే ద్వితీయ సంవత్సరంలో 2022లో 68.68 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 2023లో 67.27 శాతం, 2024లో 69.49 శాతం, 2025లో 71.43 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. సెకండియర్‌లో కూడా ఈ ఏడాది గత ఐదేళ్ల కంటే అధికంగా 75.61 శాతానికి ఉత్తీర్ణత పెరిగింది. ఇంటర్ ఫలితాల్లో టాప్‌లో మేడ్చల్ రాష్ట్ర ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మొదటి మూడు జిల్లాలు మేడ్చల్ 77.31 శాతం, రంగారెడ్డి 76.38 శాతం, జయశంకర్ భూపాలపల్లి 73.04 శాతం ఉత్తీర్ణత సాధించాయి. చివరి మూడు జిల్లాలు కామారెడ్డి 49.40 శాతం, మహబూబాబాద్ 49.11 శాతం, రాజన్న సిరిసిల్ల 49.05 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొదటి మూడు జిల్లాలు వరుసగా మేడ్చల్ 82.73 శాతం, జయశంకర్ భూపాలపల్లి 82.34 శాతం, కుమురం భీం ఆసిఫాబాద్ 82.16 శాతం ఉత్తీర్ణత సాధించాయి. చివరి మూడు జిల్లాలు ఆదిలాబాద్ 62.50 శాతం, వరంగల్ 60.80 శాతం, రాజన్న సిరిసిల్ల 58.69 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎంపిసిలో అత్యధిక ఉత్తీర్ణత నమోదు ఇంటర్మీయేట్ ఫలితాలలో గ్రూపుల వారీగా ఎంపిసి ఫస్టియర్‌లో 75.51 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఎంఇసిలో 64.07 శాతం, బైపిసిలో 72.39 శాతం, సిఇసిలో 44.90 శాతం, హెచ్‌ఇసిలో 34.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా సెకండియర్ ఎంపిసిలో 78.01 శాతం,ఎంఇసిలో 67.91 శాతం, బైపిసిలో 76.04 శాతం, సిఇసిలో 49.39 శాతం, హెచ్‌ఇసిలో 49.25 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి రోజుకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ప్రకటించారు.మే 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని అన్నారు. రెగ్యులర్ విద్యార్థులతో తదుపరి చదువులకు వెళ్లేందుకు వీలుగా సప్లిమెంటరీ పరీక్షలు సైతం త్వరగా నిర్వహిస్తామని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపులు సోమవారం నుంచే ప్రారంభం అవుతాయని, ఏప్రిల్ 20 చివరి తేదీ అని వెల్లడించారు. రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు ఈ నెల 13 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ.100, స్కాన్ చేసిన జవాబు పత్రాలు, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.800 చెల్లించాలని పేర్కొన్నారు. వాట్సాప్‌లోనూ ఫలితాలు ఇంటర్ ఫలితాలను ఈసారి వాట్సాప్‌లోనూ చూసుకునే అవకాశం కల్పించారు. ఇందుకు స్మార్ట్‌ఫోన్‌లలో 80969 58096 నంబర్‌ను సేవ్ చేసుకొని, ఆ నెంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ చేసి ‘BIE Exam Result’ అని టైప్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఉత్తీర్ణత శాతం ఇలా.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 66.20 శాతం ఉత్తీర్ణత ఇంటర్ రెండో సంవత్సరంలో 70.58 శాతం ఉత్తీర్ణత ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం- 74.40 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలుర ఉత్తీర్ణత శాతం- 57.69 ఇంటర్ రెండో సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం- 78.65 ఇంటర్ రెండో సంవత్సరంలో బాలుర ఉత్తీర్ణత శాతం- 62.50 సెకండియర్‌లో మేడ్చల్‌లో జిల్లాలో అత్యధికంగా 82.73 శాతం ఉత్తీర్ణత సెకండియర్‌లో అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 58.69 శాతం ఉత్తీర్ణత ఫస్టియర్‌లో అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 77.31 శాతం ఉత్తీర్ణత ఫస్టియర్‌లో అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 49.05 శాతం ఉత్తీర్ణత

మన తెలంగాణ 13 Apr 2026 5:50 am

పెళ్లి చేసుకోవడానికి అందగత్తెను పంపండి

సోమాలియాలో మేము అందిస్తున్న సేవలకు గాను బిలియన్ డాలర్ల నగదు చెల్లించండి నెల రోజుల్లోగా నా డిమాండ్లకు అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు టర్కీకి ఉగాండా ఆర్మీ చీఫ్ ముహూజీ హెచ్చరిక టర్కీకి ఉగాండా సైన్యాధిపతి కైనెరూగాబా హుకుం లేకపోతే దౌత్యబంధాన్ని తెంచుకుంటామని హెచ్చరిక కంపాలా: ఉగాండా సైన్యాధిపతి, అధ్యక్షుడు యోవెరి ముసేవెనీ కుమారుడు ముహూజి కైనెరూగాబా టర్కీపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. టర్కీ తమకు 1 బిలియన్ డాలర్లు చెల్లించడంతో పాటు దేశంలోని అత్యంత అందమైన అమ్మాయిని తనకు భార్యగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 30 రోజుల్లో ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే దౌత్యపరమైన సంబంధాలను తెంచి, కంపాలాలోని టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. ఎక్స్ లో చేసిన పలు పోస్టుల్లో కైనెరూగాబా మాట్లాడుతూ, ప్రాంతీయ భద్రత కోసం ఉగాండా చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించలేదని, అందుకు ఆర్థిక పరిహారం రావాల్సిందేనని పేర్కొన్నారు. టర్కీ సోమాలియాలో, ముఖ్యంగా రాజధాని మొగాదిషులో పోర్టులు, విమానాశ్రయాలు వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల ద్వారా లాభాలు పొందుతుండగా, భద్రతా బాధ్యతలను ఉగాండానే భుజాన వేసుకుందని ఆయన ఆరోపించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఉగాండా సైన్యం ఆఫ్రికన్ యూనియన్ మిషన్లలో భాగంగా సోమాలియాలో సేవలందిస్తోంది. ముఖ్యంగా అల్-షబాబ్ అనే అల్-ఖైదా అనుబంధ మిలిటెంట్ సంస్థను ఎదుర్కొనేందుకు ఈ దళాలు పనిచేస్తున్నాయి.టర్కీకి ఇది చాలా సులభమైన ఒప్పందం... వారు మాకు డబ్బు చెల్లించాలి, లేకపోతే వారి రాయబార కార్యాలయాన్ని మూసివేస్తాను. వారు కూడా టర్కీలోని మా రాయబార కార్యాలయాన్ని మూసివేయవచ్చు.. మాకు ఎలాంటి సమస్య లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఉగాండాటర్కీ సంబంధాలు గంభీరమైనవి అని పేర్కొన్న ఆయన, వాటిని సోషల్ మీడియా నాటకంగా చూడకూడదని అన్నారు. త్వరలోనే దౌత్య సంబంధాలను తెంచేస్తాం అంటూ హెచ్చరించారు. వెన్నుపోటు పొడిచే స్నేహితుడు ఎవరికీ అవసరం లేదు అని కూడా ఆయన విమర్శించారు. ఇంకా, భద్రతా కారణాల దృష్ట్యా ఉగాండా ప్రజలు టర్కీకి ప్రయాణించకుండా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో, ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటిస్తూ, నా ఆధ్వర్యంలో 1 లక్ష మంది ఉగాండా సైనికులను పంపడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన తెలిపారు. ఇది కైనెరూగాబా నుంచి వచ్చిన మొదటి వివాదాస్పద వ్యాఖ్య కాదు. 2022 అక్టోబర్‌లో ఆయన, జార్జియా మెలోనిను వివాహం చేసుకోవడానికి 100 అంకోల్ గోవులను ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించి వివాదం సృష్టించారు.

మన తెలంగాణ 13 Apr 2026 5:30 am

కాళేశ్వరం బ్యారేజ్ పునరుద్ధరణకు వారంలో డిజైన్లు

పునరుద్ధరణ పనుల వేగవంతానికి స్టీరింగ్ కమిటీ కమిటీకి కన్వీనర్‌గా ఇరిగేషన్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా 2028 నాటికి మరమ్మతుల ప్రక్రియ పూర్తి ఎల్‌అండ్‌టీ సహా సంస్థలన్నీ తమ పనులను తక్షణమే పునరుద్ధరించాలి కాళేశ్వరంపై ప్రత్యేక సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పధకం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు గాను నీటిపారుదల రంగ నిపుణులు కల్నల్ పరిక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ వారానికి రెండు సార్లు సమావేశమై ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తుందని అన్నారు. అవసరమైతే స్వయంగా తానే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమావేశాల్లో పాల్గొని పురోగతిని సమీక్షించ నున్నట్లు వెల్లడించారు. ఈ పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు గాను సంబంధిత అధికారులతో ఆదివారం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్, నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్య దాస్‌నాధ్, జాయింట్ సెక్రటరీ కే.శ్రీనివాస్, టన్నెల్ నిపుణులు పరిక్షిత్ మెహ్రా, ఇ.ఎన్.సిలు రమేష్ బాబు, శ్రీనివాస్‌లతో పాటు సి.డబ్ల్యూ.పి.ఆర్.ఎస్ ఆదనపు డైరెక్టర్ సెల్వా బాలన్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఏ), విజిలెన్స్ కమిషన్ వంటి చట్టబద్ధ సంస్థలు ఇప్పటికే మూడు బ్యారేజీల ఫౌండేషన్, డిజైన్, ప్రణాళిక, అమలు అంశాల్లో తీవ్రమైన లోపాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ మూడు నిర్మాణాల్లో సమస్యలు ఒకే విధంగా ఉన్నాయని అన్నారు. 2028 నాటికి మరమ్మతుల ప్రక్రియ పూర్తి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతుల పూర్తి ప్రక్రియలో భాగంగా 2027, 2028 సంవత్సరాలను కీలకంగా పరిగణించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిర్దేశిత గడువులోనే అన్నారం, సుందిళ్ల పనులు పూర్తవుతాయని, అదే సమయంలో మేడిగడ్డలో కొంత భాగన్నీ పూర్తి చేయగలమనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌వై ఇండియా, ఐఐటి ముంబయిలకు కొత్త డిజైన్ల బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే డిజైన్ కన్సల్టెంట్‌గా ఎఫ్‌ఆర్‌వై ఇండియాను ఎంపిక చేసి, ఐఐటి ముంబయితో సంయుక్తంగా పని చేయాలని నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. డిజైన్ బృందం రాత్రింబవళ్లు పనిచేసి వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. డిజైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, డిజైన్ సిద్ధమైన వెంటనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదానికి పంపాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. సెక్రటరీ పరిక్షిత్ మెహ్రాతో నిరంతరం సంప్రదింపులో ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కన్సల్టెంట్లకు ఆయన సూచించారు. డిజైన్ ప్రక్రియకు సంబంధించిన భూభౌతిక, భూసాంకేతిక, మట్టి, హైడ్రాలిక్ మోడలింగ్ వంటి అన్ని అధ్యయనాలు సమగ్రంగా నిర్వహించబడతాయని తెలిపారు. అవసరమైన అన్ని పరీక్షలు, డేటా అత్యవసర ప్రాధాన్యంతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పుణెలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ ఈ పరీక్షలు, అధ్యయనాల బాధ్యత వహిస్తోందని తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులను కేంద్ర సంస్థ అత్యున్నత ప్రాధాన్యంగా పరిగణించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కేంద్ర జల కమిషన్‌తో సమన్వయం చేసి అవసరమైన అనుమతులు పొందాలని ఆయన సూచించారు. కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ సిబ్బంది 45 రోజుల అధ్యయన కాలంలో నిరంతరం ప్రాజెక్ట్ స్థలాల్లో ఉండాలని ఆదేశించారు. ఏజెన్సీలకు శిబిరాల పునఃప్రారంభ ఆదేశం ఎల్ అండ్ టీ సహా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన సంస్థలన్నీ తమ క్యాంపులు, మెస్ సదుపాయాలు, లాజిస్టిక్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంజినీర్లు, టెక్నీషియన్లు, రిగ్ ఆపరేటర్లకు వసతి, ఆహార సమస్యలు రాకుండా చూడాలని ఆయన సూచించారు. ఇసుక తొలగింపు, జిపిఆర్ (భూభౌతిక) పరీక్షలు, సైట్ సిద్ధం పనులు అన్ని ఏజెన్సీల పూర్తి సహకారంతో నిర్వహించబడతాయని పేర్కొన్నారు. డిజైనర్లు, కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా సంస్థ, ఆయా శాఖల ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులు కలిసి అన్ని పరీక్షలను ప్రత్యక్షంగా వీక్షించాలని, ప్రతి అంశాన్ని సక్రమంగా నమోదు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మన తెలంగాణ 13 Apr 2026 5:00 am

గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకూ చలివేంద్రాలు

గ్రామీణాభివృద్ది శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్‌కు మంత్రి సీతక్క ఆదేశం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను గ్రామ పంచాయితీలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆ శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్‌కు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించే వారు, పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వేసవి కాలంలో సాధారణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో, ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో, బస్ స్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, ప్రధాన రహదారుల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రయాణ సమయంలో అలసటకు గురయ్యే వారికి, కూలీలు, రైతులు, రోజువారీ పనుల కోసం వెళ్లే ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ములుగు నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో చలివేంద్రాల ఏర్పాటు పూర్తి కాగా, ప్రజలు ఈ సౌకర్యాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి సీతక్క కోరారు. గత ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి లక్షలాది మందికి తాగునీరు అందించారని అన్నారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని అన్నారు. వేసవి వేడి కారణంగా ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామంలో తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. మంత్రి సీతక్క ఆదేశాలతో ప్రతి గ్రామ పంచాయతీలో చలివేంద్రాల ఏర్పాటుకు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చర్యలు చేపట్టినట్లు శాఖ డైరెక్టర్ దివ్యా దేవ రాజన్ తెలిపారు.

మన తెలంగాణ 13 Apr 2026 4:40 am

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటే చరిత్ర హీనులవుతారు; బండి

కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరిక మన తెలంగాణ/హైదరాబాద్‌ః మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటే చరిత్ర హీనులవుతారు జాగ్రత్త అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అని పార్టీలను హెచ్చరించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీలన్నీ పార్లమెంట్ లో బిల్లుకు మద్దతివ్వాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. మహిళా బిల్లును వ్యతిరేకించే పార్టీలకు మహిళలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. మహిళలకు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నది దశాబ్ద కాలంగా ప్రభుత్వ ఆలోచన అని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లుతో రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయంగా ఉండిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఈ బిల్లుకు మద్దతునివ్వాలని ఆయన కోరారు. మహిళలు ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక మహిళా రిజర్వేషన్ బిల్లు అని ఆయన తెలిపారు. పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందేనని ఆయన తెలిపారు. డీలిమిటేషన్‌తో పార్లమెంట్‌లో స్థానాలు పెరుగుతాయని, తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరించారు.

మన తెలంగాణ 13 Apr 2026 4:00 am

ఎండ ప్రచండ

 ఉదయం 9 గంటలకే భగ్గుమంటున్న సూర్యుడు రాష్ట్రంలో 40డిగ్రీలు దాటిన ఉష్ణ్రోగ్రతలు మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం   మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పలు జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఎండ తీవ్రతకు తోడు వేడి, ఉక్కపోత అధికంగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం జిల్లాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలీవిధంగా ఉన్నాయి. ఆదిలాబాద్ (40.3 డిగ్రీలు), భద్రాచలం (39.6 డిగ్రీలు), హన్మకొండ (37.5 డిగ్రీలు), హైద రాబాద్ (39.4 డిగ్రీలు), ఖమ్మం (39.8 డిగ్రీలు), మహబూబ్‌నగర్ (40.5 డిగ్రీలు), మెదక్ (39.9 డిగ్రీలు), నల్గొండ (37.8 డిగ్రీలు), నిజామా బాద్ (40.7 డిగ్రీలు), రామగుండం (39.0 డిగ్రీలు), హయత్‌నగర్ (37.6 డిగ్రీలు), పటాన్‌చెరు (38.0 డిగ్రీలు), రాజేంద్రనగర్ (38.5 డిగ్రీలు) మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతు న్నారు. ఉదయం 9 గంటలకే ఎండ వేడిమి అధికం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అతి ముఖ్య మైన పని ఉంటేనే బయటకు వస్తున్నారు.ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. శుక్రవారం నాటికే రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరగనున్న నేపథ్యం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. మధ్యా హ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హితవు పలికింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భి ణులు, చిన్నారుల విష యంలో మరింత జాగ్రత్త అవస రమని సూచించింది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బ తగలకుండా తలపాగా, గొడుగు వంటివి వాడా లని, తరచూ నీరు, ద్రవ పదార్థా లు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.   ఎపిలోనూ అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు అటు ఎపిలో ఇప్పటికే భానుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం కడప జిల్లాలో గరిష్టంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 200కు పైగా మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా కొండాపురం మండలం పొట్టిపాడులో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీలుగా రికార్డయింది. రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు వీస్తాయని, మొత్తం 93 మండలాల్లో వీటి ప్రభావం ఉంది. హీట్ వేవ్‌తో పాటు ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఎండ మొదలవుతోంది. 10 గంటల తర్వాత ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుండగా ప్రజలకు బయటకు రావాలంటేనే భయపడు తున్నా రు. దీంతో ఇళ్లల్లోనే ఉంటున్నారు. వచ్చే రెండు నెలల పాటు ఇటువంటి పరిస్థితులే ఉండనున్నాయి.

మన తెలంగాణ 13 Apr 2026 3:20 am

సోమవారం రాశి ఫలాలు (13-04-2026)

మేషం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృషభం కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. మిధునం ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తికావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. కర్కాటకం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. సింహం సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా విషయంలో శుభ వార్తలు అందుతాయి. కన్య జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తుల కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృశ్చికం సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. మకరం చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కుంభం వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. మీనం ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.  

మన తెలంగాణ 13 Apr 2026 12:20 am

ముంబయిపై గెలిచిన బెంగళూరు

ముంబయి: ఐపిఎల్ లో భాగంగా ముంబయి ఇండియన్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఎంఐపై 18 పరుగుల తేడాతో ఆర్ సిబి గెలుపొందింది. తొలుత ఆర్ సిబి 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఎంఐ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబయి బ్యాట్స్ మెన్లు విఫల కావడంతో 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. షెర్పన్ రూథర్ పోర్డ్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ముంబయి బ్యాట్స్ మెన్లలో షెర్పన్ రూథర్ పోర్డ్ (71), హార్ధిక్ పాండ్యా(40), రికెల్టన్(37), సూర్యకుమార్ (33) పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్లు విఫలం కావడంతో ముంబయి ఓటమిని చవిచూసింది. రోహిత్ శర్మకు దెబ్బతగలడంతో రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. ముంబయి బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు వికెట్లు, కృనాల్ పాండ్యా, సలమ్ ధర్, జాకోడ్ డఫీ తలో ఒక వికెట్ తీశారు. బెంగళూరు బ్యాట్స్ మెన్లలో రజత్ పాటిదర్, ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రజత్ 20 బంతుల్లోనే 53 పరుగులు, సాల్ట్ 36 బంతుల్లో 78 పరుగులు చేసి వీరవిహారం చేశారు. 36 బంతుల్లో 78 పరుగులు చేసిన సాల్ట్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

మన తెలంగాణ 12 Apr 2026 11:52 pm

బిసి మహిళ సబ్ కోటాపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలి

పూలేకు నివాళులే కాదు.. పూలే ఆశయం కోసం ప్రధాని పాటుపడాలి బిసి మహిళ సబ్ కోటా కై ఈనెల 16న ఢిల్లీలో బిసి మహిళల ధర్నా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిల ఐకాన్ మహాత్మ జ్యోతిబా పూలే 200 జయంతి సందర్భంగా మొదటి సారిగా పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించడం అభినందనీయమని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పూలే ఆశయాలు అమలు చేయడానికి ప్రధాని మోడీ పాటుపడాలని ఆయన కోరారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లు ఆమోదం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు కంటే ముందు జాతీయస్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. దేశంలో మెజార్టీ రాజకీయ పార్టీలు మహిళా బిల్లు లక్ష్యం నెరవేరాలంటే బిసి మహిళలకు సబ్ కోట కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని ఈ విషయాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మహిళా బిల్లుపై గోడ మీది పిల్లి వాటంగా వ్యవహరించకుండా బిసి కోటపై తమ రాజకీయ విధానాన్ని ప్రకటించి 16 న జరిగే పార్లమెంటు సమావేశాల్లో బిసి మహిళల సబ్ కోట కోసం పట్టుబట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బిసి మహిళలకు వాటా కల్పించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అందులో భాగంగా ఈ నెల 13న అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేపడతామని, ఈనెల 16న ఢిల్లీలో బిసి మహిళలచే పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

మన తెలంగాణ 12 Apr 2026 11:00 pm

ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థుల విజయకేతనం

90 శాతం ఉత్తీర్ణతతో సంక్షేమ గురుకుల్లాలో ప్రథమ స్థానం మన తెలంగాణ / హైదరాబాద్ : -ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. 90 శాతం ఉత్తీర్ణత సాధించడం ద్వారా సంక్షేమ గురుకులాల్లో బిసి గురుకులాలు ప్రథమ స్థానంలో నిలిచారు. సీనియర్ ఇంటర్‌లో బైపిసి విద్యార్థి శ్రియ (994), బి. హిమానీ(993), రాథోడ్ నందు(993), ఎంపిసిలో బి. మధు(994), శ్రీనిధి(994), సిఇసిలో శ్రీలత (981), ఎంఈసిలో జాహ్నవి (983), హెచ్ ఇసిలో రాజేశ్వరి (980) స్టేట్ ర్యాంకులు సాధించారు. -సీనియర్ ఇంటర్‌లో పది లోపు ర్యాంక్‌లు ఎంపిసిలో 97 మంది, బైపిసిలో 62 మంది విద్యార్థులు సాధించారు. -జూనియర్ ఇంటర్ లో 16మందిఎంపిసి విద్యార్థులు స్టేట్ ర్యాంక్ (468) సాధించగా బైపిసిలో 11మందివిద్యార్థులు 438 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్‌ఫలితాల్లో 33 కాలేజీల్లో 100 శాతం ఉత్తీర్ణత, జూనియర్ ఇంటర్ లో 9 కాలేజీల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సీనియర్ ఇంటర్ లో ఏడు శాతం, జూనియర్ ఇంటర్ లో ఎనిమిది శాతం అధిక ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర సగటు ఉత్తర్ణీత (70.58 శాతం) కాగా బిసి గురుకుల విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సాధించారు. జూనియర్ ఇంటర్‌లో ఎంపిసిలో పి. ప్రవల్లిక (468), కె. వైష్ణవి (468)తో పాటు 15 మంది విద్యార్థులు, బైపిసిలో పి. రాఘవి (438), వి. హేమశ్రీ (438) మార్కులు సాధించారు. మహాత్మా జ్యోతి బా పూలే బిసి గురుకుల విద్యాసంస్థల సొసైటీ లోని 261 కాలేజీల నుండి 2025- 26 విద్యా సంవత్సరానికి జనరల్ కేటగిరీలో సీనియర్ ఇంటర్ - 12,035 మంది పరీక్షకు హాజరుకాగా 10,856 (90 శాతం), జూనియర్ ఇంటర్ లో 14,783 మందికి గాను 12,664 మంది (86 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో ప్రథమ సంవత్సరం 191 కు 183 మంది (96 శాతం) ద్వితీయ సంవత్సరం 176 కు 172 మంది (98 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో 98శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.   వందశాతం ఉత్తీర్ణత సాధించిన కాలేజీలు సీనియర్ ఇంటర్‌లో బాలికలు - 17, బాలురు - 16, మొత్తము - 33 కాలేజీలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. జూనియర్ ఇంటర్ లో బాలికలు - 5, బాలురు - 4, మొత్తము - 9 కాలేజీలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఒకేషనల్ కోర్సులో బాలికలు - 6, బాలురు - 2, మొత్తము - 8 కాలేజీలు వంద శాతం ఫలితాలు సాధించాయి. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతి బా పూలే బిసి గురుకుల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 70.60 శాతం కంటే అధిక ఉత్తీర్ణత 90 శాతం సాధించి విజయభేరి మోగించారు. పది లోపు ర్యాంక్ లు ఎంపిసిలో (988/1000) కన్న ఎక్కువ వచ్చిన వారు 97 మంది, బైపిసిలో (985/1000) కన్న ఎక్కువ వచ్చిన వారు 62 మంది ఉన్నారు. సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 12,211 కాగా వీరిలో 11,028 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఏ గ్రేడ్ (75 శాతం మార్కులు) సాధించిన విద్యార్థులు 8,490 బి గ్రేడ్ (60శాతం మార్కులు) 2,097. మంది సాధించారు. జూనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 14,974 కాగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 12,847 మంది ఉన్నారు. పది లోపు ర్యాంకులు సాధించినవారు ఎంపిసిలో (460/470) కన్న ఎక్కువ వచ్చిన వారు 727మంది, బైపిసిలో (429/430) కన్న ఎక్కువ వచ్చిన వారు 459 మంది ఉన్నారు. వీరిలో ఏ గ్రేడ్ (75 శాతం మార్కులు) సాధించిన విద్యార్థులు 9,628, బి గ్రేడ్ (60శాతం మార్కులు) 2,360. సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ఫలితాలు సాధించిన బోధనా సిబ్బందిని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మహాత్మా జ్యోతి బా పూలే బిసి గురుకుల విద్యాసంస్థల సోసైటీ కార్యదర్శి బి. సైదులు అభినందించారు.

మన తెలంగాణ 12 Apr 2026 10:18 pm

ఇంటర్ ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం

సీనియర్ ఇంటర్ ఎంపిసిలో స్టేట్ టాప్ మార్క్ 996 శ్రీ చైతన్యదే సీనియర్ ఇంటర్ బైపిసిలో స్టేట్ టాప్ మార్క్ 997 శ్రీచైతన్యదే జూనియర్ ఇంటర్ ఎంపిసిలో స్టేట్ టాప్ మార్క్ 469 శ్రీచైతన్యదే జూనియర్ ఇంటర్ బైపిసిలో స్టేట్ టాప్ మార్క్ 438తో 83 మంది మన తెలంగాణ/హైదరాబాద్ : జూనియర్ ఇంటర్ ఎంసిలో 470 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 469తో ఇద్దరు, 468 మార్కులు ఆ పైన 147 మంది, 467 మార్కులు ఆపైన 701 మంది, 466 ఆపైన 1378 మంది, 465 ఆపైన 1988 మంది, 460 ఆపైన 4497 మంది శ్రీ చైత న్య విద్యార్థులే. జూనియర్ ఇంటర్ బైపిసిలో 440 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 438తో 83 మంది, 437 ఆపైన 319 మంది, 436 ఆపైన 583 మంది, 435 ఆపైన 837 మంది, 400 మార్కులు ఆపైన 4941 మంది శ్రీచైతన్య విద్యార్థులే. సీనియర్ ఇంటర్‌లో 1000 మార్కులకు గానూ 997 స్టేట్ టాప్ మార్క్‌తో పాటు 996 మార్కులు ఆపైన 3 గురు, 995 మార్కులు ఆపైన 16 మంది, 990 మార్కులు ఆపైన 759 మంది శ్రీచైతన్య విద్యార్థులు విజయం సాధించారు. ఇప్పటికే విడుదలైన జెఇఇ మెయిన్ 2026లో సెషన్ 1 అండ్ 2, ఎన్‌టిఎ ప్రొవిజనల్ కీ ప్రకారం 300కి 300 మార్కులు సాధించిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శ్రీచైతన్య విద్యార్థులే కావడం విశేషం. ప్రతీ ఏటా ఐఐటి జెఇఇ, నీట్‌లలో అత్యథిక ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులే సాధిస్తున్నారని, రేపటి ఐఐటి అడ్వాన్స్‌డ్, నీట్‌లలోనూ నెంబర్ వన్ ర్యాంకులు సాధి స్తారని శ్రీచైతన్య అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘శ్రీచైతన్య సృష్టించిన పటిష్ట మైన ప్రోగ్రామ్‌లు, సరైన ప్రణాళిక, అగ్రశ్రేణి అధ్యాపకులతో శిక్షణ వంటి ప్రత్యేకతల వల్లే ఇంటర్మీడియేట్లో సబ్జెక్ట్‌పై తమ విద్యార్థులు కాన్సె ప్టువల్‌గా పట్టు సాధించడంతో జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో టాపర్స్‌గా నిలుస్తున్నారన్నారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్లనే ఇంటర్మీడియేట్‌లో స్టేట్ టాప్ మార్కులు సాధ్యమయ్యాయని, దీనితో పాటు రాబోయే రిజల్ట్‌లో కూడా అగ్రస్థానం శ్రీచైతన్యదే అనే నమ్మకం తమకు ఉందన్నారు. అతు ్యత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, తమ విద్యా సంస్థపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను, ఇంతటి ఫలితాలకు దోహదపడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన అభినందించారు.

మన తెలంగాణ 12 Apr 2026 10:10 pm

ఇరాన్‌కు ఆయుధాలు?.. చైనాకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌కు చైనా ఆయుధాలను సరఫరా చేస్తే పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగుతుందా లేదా అన్న అనిశ్చితి మధ్య ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైట్ హౌస్ నుంచి మియామీకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్, చైనా, ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే, చైనాకు పెద్ద సమస్యలు వస్తాయి అని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మరే వివరాలు వెల్లడించలేదు. ఈ హెచ్చరికకు కారణం, అమెరికా గూఢచారి నివేదికల ఆధారంగా వెలువడిన సిఎన్‌ఎన్ కథనం. దాని ప్రకారం, రాబోయే వారాల్లో ఇరాన్‌కు చైనా ఆయుధాలను సరఫరా చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సరఫరాలను ప్రత్యక్షంగా కాకుండా మూడో దేశాల ద్వారా రహస్యంగా పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అమెరికాఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయినప్పటికీ, రెండు దేశాలూ భారీ సైనిక బలగాలను కొనసాగిస్తున్నాయి. ఇరాన్ సమీపంలో అమెరికా నౌకాదళం మోహరించగా, ఇటీవలి అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్న గగన రక్షణ వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్టు భావిస్తున్నారు. చైనా మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఘర్షణలో ఏ పక్షానికీ మేము ఆయుధాలు సరఫరా చేయలేదు అని స్పష్టం చేసింది. అలాగే అమెరికా ఆధారంలేని ఆరోపణలు, అతిశయోక్తులను మానుకోవాలి అని సూచించింది. చైనా ఇరాన్‌కు సైనిక సహాయం అందిస్తే, అది పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే చర్యగా అమెరికా భావించే అవకాశం ఉంది. అంతేకాకుండా, వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగనున్న ట్రంప్ పర్యటనపై కూడా దీని ప్రభావం పడే అవకాశముంది. పశ్చిమ దేశాల ఆంక్షల కింద ఉన్న ఇరాన్‌కు, చైనా మరియు రష్యా ప్రధాన వ్యూహాత్మక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇవి ఇరాన్‌కు ముఖ్యమైన ఆర్థిక, దౌత్య మద్దతు అందిస్తున్నాయి. సిఎన్‌ఎన్ నివేదిక ప్రకారం, ఇరాన్‌కు చేరే అవకాశం ఉన్న ఆయుధాల్లో మాన్‌పాడ్స్ (భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణులు) కూడా ఉండవచ్చు. ఇవి తక్కువ ఎత్తులో ప్రయాణించే అమెరికా విమానాలను ఎదుర్కొనేందుకు ఉపయోగపడవచ్చు. ఈ నెల ప్రారంభంలో అమెరికా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లపై జరిగిన ఘటనల్లో ఇటువంటి వ్యవస్థలు ఉపయోగించి ఉండవచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇరాన్ ఈ విషయంపై అధికారికంగా వివరాలు వెల్లడించకపోయినా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాజా దాడుల్లో కొత్త ఆధునిక రక్షణ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. ఇదిలా ఉండగా, అమెరికాఇరాన్ మధ్య చర్చలు లోతుగా కొనసాగుతున్నాయి అని ట్రంప్ తెలిపారు. అయితే తుది ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా తమకు ప్రయోజనం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా మేమే గెలుస్తాం అని ట్రంప్ అన్నారు. అదేవిధంగా, ఇరాన్ సముద్ర మార్గాల్లో కొన్ని మైన్లు అమర్చినట్టు భావిస్తున్నామని, వాటిని తొలగించేందుకు అమెరికా మైన్స్‌వీపర్ నౌకలు చర్యలు తీసుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. దీంతో హార్మూజ్ జలసంధిలో నౌకా రవాణా భద్రతను కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

మన తెలంగాణ 12 Apr 2026 9:57 pm

మహిళా రిజర్వేషన్లపై కలిసిరండి.... ఫ్లోర్‌లీడర్స్‌కు ప్రధాని మోడీ లేఖలు

న్యూఢిల్లీ: దేశంలో 2029 నాటికి చట్టసభలలో మహిళా రిజర్వేషన్ కోటా అమలులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా కీలక పార్టీలు ఒకేతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కేంద్రంతలపెట్టిన రాజ్యాంగ సవరణలకు, చట్టం రూపకల్పనకు అంతా ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ, లోక్‌సభలలోని పలు పార్టీల సభాపక్ష నేతలకు లేఖలు రాశారు ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పొడిగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణల ఆమోదానికి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ మూడు రోజుల ప్రత్యేక సిట్టింగ్‌ను ఖరారు చేశారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఉభయ సభల ఫ్లోర్ లీడర్స్‌కు లేఖలు పంపించినట్లు అధికారికంగా వెల్లడైంది. చట్టసభల పరిపూర్ణత దిశలో రిజర్వేషన్ల కోటా అమలుకు సంకల్పించినట్లు ప్రధాని పేర్కొన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలు, అప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికలు మహిళా కోటా అమలు తోనే నిర్వహించాల్సిన అవసరం ఉందని , ఈ విషయాన్ని పార్టీల నేతలంతా గుర్తించాలని, ఈ విషయంలో సభలో ఐక్యత చాటుకోవల్సి ఉందన్నారు. భారతీయ ప్రజాస్వామిక వ్యవస్థ మరింత పరిపుష్టం అయి తీరాలి. మహిళలకు పరిపాలనలో మరింత ప్రాతినిధ్యం తలెత్తాలని ఈ లేఖలలో పేర్కొన్నారు నారీ శక్తి వందన్ అధినియం సాకారం కీలక మలుపు అవుతుందన్నారు. రాజ్యాంగ సవరణల మేరకు రూపొందే చట్టంతో లోక్‌సభలో, అసెంబ్లీలో మహిళలకు 33శాతం స్థానాలకు వీలేర్పడుతుంది. 2023లోనే ఈ మేరకు సవరణలు అమలులోకి వచ్చాయి. అయితే 2027 జనగణన ప్రాతిపదికన జరిగే డిలిమిటేషన్ పూర్తి తరువాతనే కోటా అమలులోకి వస్తుంది. అప్పటి చట్టం అమలులో ఉంటే రిజర్వేషన్ల కోటా అమలు 2534కు ముందు అసాధ్యం అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని దీనికి ఇప్పుడు సవరణలు చేపట్టారు. ఈ ప్రక్రియతో లోక్‌సభ బలం 816కు చేరుతుంది. ఇందులో కోటా మేరకు మహిళలకు 273 స్థానాలు కల్పించాల్సి ఉంటుంది. ఇది అత్యంత కీలక పరిణామం అవుతుందని ప్రధాన మంత్రి తెలిపారు. డిలిమిటేషన్ ప్రక్రియలోని అంశాలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నేడు ఢిల్లీలో జాతీయ స్థాయి మహిళా సదస్సుకు ప్రధాని మహిళా రిజర్వేషన్ల కోటా నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జాతీయ స్థాయి మహిళా సదస్సు జరుగుతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ముందు జరిగే నారీ శక్తి వందన్ సమ్మేళన్‌కు ప్రధాని మోడీ హాజరవుతారు. దేశ భవిష్యత్తు రూపకల్పన, వికసిత భారత్ 2047 లక్ష సాధనలో మహిళలకు ఇతోధిక ప్రాతినిధ్యం, నిర్ణయాథికారాలలో వారికి ప్రాధాన్యత వంటి విషయాలపై విశ్లేషణకు ఈ జాతీయ సదస్సును తలపెట్టారు.

మన తెలంగాణ 12 Apr 2026 9:43 pm

ముంబయి లక్ష్యం 241

ముంబయి:  ఐపిఎల్ లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్-  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ సిబి 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఎంఐ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రజత్ పాటిదర్, ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రజత్ 20 బంతుల్లోనే 53 పరుగులు, సాల్ట్ 36 బంతుల్లో 78 పరుగులు చేసి వీరవిహారం చేశారు. బెంగళూరు బ్యాట్స్ మెన్లలో విరాట్ కోహ్లీ(50), టిమ్ డేవిడ్(34), జితేశ్ శర్మ(10), రోమారియో షెపర్డ్(2) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో బౌల్ట్, శార్థూల్ టాకూర్, మిచెల్ శాంట్నార్, హార్ధిక్ పాండ్యా తలో ఒక వికెట్ తీశారు. 

మన తెలంగాణ 12 Apr 2026 9:32 pm

annabhau |సాఠే విగ్రహావిష్కరణ.. దళిత సాహిత్యానికి దిక్సూచి!

annabhau | సాఠే విగ్రహావిష్కరణ.. దళిత సాహిత్యానికి దిక్సూచి! annabhau | నిజామాబాద్‌లో

ప్రభ న్యూస్ 12 Apr 2026 9:29 pm

సిఎం పదవికి నితీష్ రాజీనామా?

ముందుగా తుది కేబినెట్ భేటీ . కొత్త సిఎం సామ్రాట్? పాట్నా: తూర్పు మధ్య ప్రాంత కీలక రాష్ట్రం బీహార్ ఉన్నత స్థాయి రాజకీయ మార్పు దశకు చేరుకుంది. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ నెల 14 (మంగళవారం) సిఎం పదవికి రాజీనామా చేస్తారు. అంతకు ముందు అదే రోజు ఆయన తమ సారధ్యపు కేబినెట్ చివరి సమావేశంలో పాల్గొంటారు. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో ఆదివారం బీహార్ రాజకీయాల్లో కదలిక ఏర్పడింది. తుది కేబినెట్ భేటీ తరువాత జెడియు నేత అయిన నితీష్ ప్రభుత్వ పగ్గాలు వదులుకుంటారు. బిజెపి సారద్య ప్రభుత్వానికి వీలు కల్పిస్తారు. కేబినెట్ సెక్రెటేరియల్ వెలువరించిన నోటిఫికేషన్ మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. ఇందులో నితీష్ తమ సహచరులకు సందేశం వెలువరిస్తారు. తరువాత గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్‌కు రాజీనామా సమర్పిస్తారు. సోమవారం తరువాత రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆరంభం అవుతుందని అంతకు ముందు కుమార్ అత్యంత సన్నిహితులు , జెడియు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సంజయ్ కుమార్ ఝా విలేకరులకు తెలిపారు. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఈసారి బిజెపి తరఫున సీనియర్ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనితో రాష్ట్రంలో తొలిసారి బిజెపి రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనుంది. ఈ అపూర్వ ఘట్టం నెలకొనడానికి ముందు పలు అవరోధాలు, జెడియు నుంచి గణనీయ ప్రతికూలత వెలువడింది. ఇది తరువాత సమసిపోయింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, నూతన మంత్రి మండలి ఏర్పాటు సజావుగా సాగేందుకు ఎన్‌డిఎ జాతీయ స్థాయి నాయకత్వం తగు చర్యలు తీసుకుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీహార్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడి ఎన్నిక కార్యక్రమానికి కేంద్ర పరిశీలకులుగా బిజెపి నియమించింది. ఆయన సోమవారం పాట్నాకు చేరుకునే వీలుంది. సింగ్ నియామకం గురించి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. బిజెపి సిఫార్సు మేరకు కేంద్రంలోని సీనియర్ నేతల సూచనల క్రమంలోనే లెజిస్లేటర్లు అంతా కలిసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అంతా ప్రజాస్వామిక పద్థతిలో జరుగుతుందని అంతకు ముందు జెడియు సీనియర్ నేత, శాసనసభా వ్యవహారాల మంత్రి విజయ్‌కుమార్ చౌదరి మీడియాకు తెలిపారు. బీహార్‌కు రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పిన నితీష్ ఇకపై జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. తరువాతి ముఖ్యమంత్రి ఎవరనేది కేంద్ర నాయకత్వం ఖరారు చేస్తుందని బీహార్ బిజెపి మాజీ అధ్యక్షులు , మంత్రి దిలీప్ జైస్వాల్ తెలిపారు. అయితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు కీలకమైన హోం శాఖను నిర్వహిస్తోన్న సామ్రాట్ చౌదరి కొత్త ముఖ్యమంత్రి అవుతారని రాజకీయ వర్గాలలో జోరుగా ఊహాగానాలు తలెత్తాయి. ఇటీవలి కాలంలో ఆయన తరచూ ఢిల్లీ నుంచి పిలుపు మేరకు వెళ్లిరావడం, కేంద్ర నాయకత్వంతో మాట్లాడటం వంటి పరిణామాలతో ఆయనే సిఎం అని భావిస్తున్నారు.

మన తెలంగాణ 12 Apr 2026 9:16 pm

12apr |మణికొండలో వైభవంగా జరిగిన హిందూ సమ్మేళనం

12apr | మణికొండలో వైభవంగా జరిగిన హిందూ సమ్మేళనం 12apr | సనాతన

ప్రభ న్యూస్ 12 Apr 2026 9:11 pm

ముందుచూపుతోనే ఆ ప్రతిపాదనలు చేశాం... కానీ విఫలం: ఇరాన్ స్పీకర్ భాఘర్

ఇస్లామాబాద్: పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పాకిస్తాన్‌లో జరిగిన చారిత్రాత్మక అమెరికా ఇరాన్ చర్చల్లో అమెరికా ఇరాన్ విశ్వాసాన్ని పొందడంలో విఫలమైంది అని ఇరాన్ పార్లమెంట్‌ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లో జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిసిన అనంతరం, ఇరాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఘాలిబాఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ లో చేసిన పలు పోస్టుల్లో ఆయన మాట్లాడుతూ, మా బృందం ముందుచూపుతో కూడిన ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ చర్చల దశలో ప్రత్యర్థి పక్షం మా విశ్వాసాన్ని సంపాదించలేకపోయింది అని పేర్కొన్నారు. చర్చలకు ముందు తాము సత్సంకల్పంతో ముందుకు వచ్చామని, కానీ గత రెండు యుద్ధ అనుభవాల కారణంగా అమెరికాపై విశ్వాసం లేకపోయిందని ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. మా సిద్ధాంతాలు, తర్కాన్ని అమెరికా గ్రహించింది. ఇప్పుడు మా విశ్వాసాన్ని పొందగలదా లేదా అన్నది వారి నిర్ణయం అని ఆయన అన్నారు. ఇరాన్ ప్రజల హక్కులను కాపాడేందుకు శక్తివంతమైన రాజనీతితో పాటు సైనిక శక్తిని కూడా వినియోగిస్తామని ఘాలిబాఫ్ తెలిపారు రాజనీతితో పాటు సైనిక పోరాటం కూడా ఇరాన్ ప్రజల హక్కుల సాధనలో భాగమే. 40 రోజుల జాతీయ రక్షణ ద్వారా సాధించిన విజయాలను కాపాడేందుకు మా ప్రయత్నాలు ఎప్పటికీ ఆగవు అని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చలకు వేదిక కల్పించిన పాకిస్తాన్‌కు ఘాలిబాఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మద్దతుగా నిలిచిన ఇరాన్ ప్రజలను వీర ప్రజలుగా అభివర్ణిస్తూ, తమ బృందం చేసిన నిరంతర శ్రమను ప్రశంసించారు. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విరమించడానికి సిద్ధంగా లేకపోవడమే చర్చల విఫలం కావడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. మా చివరి, ఉత్తమ ప్రతిపాదనను సమర్పించాం. ఇరాన్ దానిని అంగీకరిస్తుందో లేదో చూడాలి అని ఆయన తెలిపారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యక్ష చర్చలు విఫలమవడంతో రెండు వారాల కాల్పుల విరమణ స్థిరత్వంపై సందేహాలు నెలకొన్నాయి. అలాగే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ స్థిరీకరణకు కీలకమైన హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఆశలు కూడా మసకబారాయి.

మన తెలంగాణ 12 Apr 2026 8:41 pm

Amaravati’s Quantum Leap and IBM’s Entry Signal Andhra Pradesh’s Tech Push

Andhra Pradesh is positioning itself as a future-ready technology hub with a dual push in quantum computing and IT expansion. Nara Lokesh announced on X, that on April 14, World Quantum Day, Chief Minister Chandrababu Naidu will inaugurate India’s first indigenous open-access quantum computers, Amaravati 1S and 1Q, at SRM University. This marks the launch […] The post Amaravati’s Quantum Leap and IBM’s Entry Signal Andhra Pradesh’s Tech Push appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 8:34 pm

మార్చి నెల@ 2.24 లక్షలు ట్యాంకర్ ట్రిప్పులు... నీటిని పొదుపుగా వాడుకోవాలి

ఈనెల 12 రోజుల్లోనే 95,454 ట్రిప్పులు నీటిని పొదుపుగా వాడుకోవాలి ప్రతి కుటుంబం 20 శాతం నీటిని ఆదాచేయాలి ఎండీ అశోక్‌రెడ్డి మనతెలంగాణ, సిటీబ్యూరో ః ఈ సంవత్సరం మార్చి నెలలో మొత్తం 2,24,421 ట్యాంకర్ ట్రిప్పులను డెలివరీ చేశామని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెలలో 12వ తేదీ నాటికే 95,454 ట్రిప్పులు సరఫరా చేసినట్టు తెలిపారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నగర పరిధిలో భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో తాగునీటి డిమాండ్ నీటి వినియోగంపై ప్రతి పౌరుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. నీటి అవసరాలు గణనీయంగా పెరుగుతున్నందున, నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను కచ్చితంగా పాటించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. వేసవి కార్యాచరణ, ట్యాంకర్ మేనేజ్‌మెంట్‌పై అశోక్ రెడ్డి జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్‌తో పాటు రీజినల్ ఈడీలు, డైరెక్టర్లలు, సీజీఎంలు, జీఎంలతో జూమ్ మీటింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ తదితర వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ వేసవిలో గత ఏడాది కంటే ఓవరాల్ గా ట్యాంకర్ బుకింగ్ ఘననీయంగా పెరగకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ఫిల్లింగ్ స్టేషన్ లలో గత ఏడాదికంటే బుకింగ్ పెరిగిందని చెప్పారు. పెరిగిన బుకింగ్స్.. గత ఏడాదికంటే మణికొండ, బంజారాహిల్స్, డోయెన్స్, హఫీజ్‌పేట్, నేతాజీ పార్క్ ఫిల్లింగ్ స్టేషన్‌లో బుకింగ్స్ పెరిగినట్టు వెల్లడించారు. ఈ పెండెన్సీని తగ్గించుకోవడానికి.. ఈ రెండు రోజుల్లో సున్నానికి తగ్గించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్‌లో నీటిసరఫరా సరఫరాలను, సరఫరా సమయాన్ని పెంచడం, డిమాండ్ తక్కువ ట్యాంకర్ బుకింగ్ నమోదు అవుతున్న ఫిల్లింగ్‌స్టేషన్ నుంచి అధికంగా డిమాండ్‌ని డెలివరీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాత్రి వేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో.. పెండెన్సీ బాగా తగ్గించుకున్నామని తెలిపారు. అవసరమైతే నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో కమర్షియల్ వినియోగదారులకు టాంకర్లను సరఫరా చేయడానికి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాగే ప్రత్యేక దృష్టి పెడితే బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేసే వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీటి పొదుపుపై ఎండీ విజ్ఞప్తి: ------------------------------------హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు .. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అత్యంత కీలకమని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజులలో నీటి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, ప్రతి పౌరుడు నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని ప్రతి కుటుంబం కనీసం 20 శాతం వరకు నీటిని ఆదా చేయాలని సూచించారు. చిన్నచిన్న అలవాట్ల మార్పులతోనే పెద్ద మొత్తంలో నీటిని సంరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. పౌరులకు ముఖ్య సూచనలు: ----------------------------------విలువైన తాగునీటిని వాహనాల శుభ్రపరిచేందుకు, ఇళ్ల పరిసరాలను కడగడానికి ఉపయోగించరాదు. బ్రష్ చేసేటప్పుడు నల్లా (ట్యాప్) నిరంతరం తెరిచి ఉంచకుండా, మగ్గులో నీరు తీసుకుని వినియోగించాలి. స్నానం చేసేటప్పుడు షవర్ వినియోగాన్ని తగ్గించి, బకెట్ నీటితో స్నానం చేయడం ద్వారా గణనీయంగా నీటిని ఆదా చేయవచ్చు. లీకేజీలు ఉన్న పైపులు, ట్యాపులు వెంటనే మరమ్మతులు చేయించుకోవాలి. అవసరానికి మించి నీటిని నిల్వ చేయడం, వృథా చేయడం నివారించాలి. జలమండలి ఇప్పటికే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతోందని ఎండీ తెలిపారు. అయినప్పటికీ, వేసవిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రజల సహకారం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. నీరు అమూల్యమైన వనరు. ప్రతి చుక్కను విలువైనదిగా భావించి వినియోగిస్తేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించగలం అని అశోక్ రెడ్డి పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలను అధిగమించేందుకు ప్రతి పౌరుడు నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను పాటిస్తూ జలమండలికి సహకరించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ జూమ్ మీటింగ్ లో లో రీజియన్ ఈడీలు పంకజ, అశోక్ సామ్రాట్, సంతోష్, డైరెక్టర్లు ఆపరేషన్స్-1,2,3 వినోద్ భార్గవ, నారాయణ, శీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 12 Apr 2026 8:27 pm

ఉపాధి హామీ రక్షణ కై దేశవ్యాప్తంగా ఉద్యమం.. సిపిఐ నేత డి.రాజా

మోడీ సర్కార్ కు సిపిఐ హెచ్చరిక… విశాలాంధ్ర.. ప్రత్యేక ప్రతినిధి/అనంతపురం బ్యూరో.. నూతన ఉపాధి హామీ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలకు దిగుతామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా హెచ్చరించారు. కేంద్రం తీసుకొచ్చిన “విబిజీ రాంజీ” చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.అనంతపురం […] The post ఉపాధి హామీ రక్షణ కై దేశవ్యాప్తంగా ఉద్యమం.. సిపిఐ నేత డి.రాజా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Apr 2026 8:26 pm

Exclusive: Peddi to take up Toxic Date

Ram Charan’s Peddi will not release as per the plan on April 30th. Though the team hasn’t made any official statement yet, the industry insiders, producers and filmmakers are well aware that the film’s release is pushed. For now, the team of Peddi is considering two dates in June. Yash’s Toxic is slated for June […] The post Exclusive: Peddi to take up Toxic Date appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 8:14 pm

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి... సెకన్లలో కారు నంబర్ ప్లేటు మార్పు

స్వాప్ నంబర్ ప్లేట్స్ పట్టుకున్న జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఫొటొః బిఎం పేరుతో ఉంది... మనతెలంగాణ, సిటిబ్యూరో: ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి కారు యజమాని చేసిన పని చూసి ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బిఎండబ్లూ కారుకు స్వాప్ నంబర్ ప్లేట్ అమర్చి తిరుగుతుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి కారు నడుపుకుంటూ వచ్చాడు. అతడికి బ్రీత్ పరీక్ష నిర్వహించగా మద్యం తాగి వాహనం నడిపినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు కారును స్వాధీనం చేసుకునేందుకు పరిశీలిస్తుండగా కారుకు ఉన్న నంబర్ ప్లేట్ మారుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కారుకు చైనీస్ ఫ్లాగ్‌షిప్ నంబర్ ప్లేట్ అమర్చిన కారు యజమాని దానిని రిమోట్ సాయంతో మార్చుతుండడంతో డిఎల్ 6 సిఎం 7097, టిఎస్ 9 ఎఫ్‌క్యూ 9999 నంబర్ ప్లేట్లు మారుతున్నాయి. వెంటనే పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి ఖరీదైన బిఎండబ్లూ కారు నంబర్ ప్లేట్ మార్చడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇలాంటివి చూడలేదని, ఇదే మొదటిసారి పోలీసులు తెలిపారు. గతంలో ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్‌ను డ్యామెజ్ చేయడం, మాస్కువేయడం చేసేవారు. ఇప్పుడు ఏకంగా రిమోట్ సాయంతో నంబర్ ప్లేట్‌ను మార్చుతున్నారు. దీనిని చూసి ఎంతమంది అనుసరిస్తారోనని, ప్రతి కారును ఇక నుంచి క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.

మన తెలంగాణ 12 Apr 2026 8:12 pm

ఎవరికోసం! ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం ఈ ధర్మదీక్ష

ఎవరికోసం! ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం ఈ ధర్మదీక్ష ఎన్టీఆర్ జిల్లా

ప్రభ న్యూస్ 12 Apr 2026 8:02 pm

అడ్వకేట్‌పై మంగ్లీ ఫిర్యాదు

రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నిరాకరించడంతో భూతులు తిట్టారు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు ఫొటొః మంగ్లీ పేరుతో ఉంది... మనతెలంగాణ, సిటిబ్యూరో:  డబ్బులు ఇవ్వలేదని అడ్వకేట్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని సింగర్, యాక్టర్ ముదావత్ సత్యవతి అలియాస్ మంగ్లీ పంజాగుట్ట పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తాను ఎలాంటి డబ్బులు వసూలు చేయలేదని, తనవి అని చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. గత నెల 22వ తేదీన అడ్వకేట్ సింగపోగు సుబ్బు ఆఫీస్‌కు వెళ్లానని, అక్కడ సుబ్బతోపాటు ముగ్గురు ఉన్నారని పేర్కొన్నారు. అడ్వకేట్ సుబ్బు తనతో అసభ్యంగా మాట్లాడారని, దీంతో తాను అడ్వకేట్‌ను నిలదీశానని తెలిపింది. తనపై యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాం, ఇతర సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు తొలగించాలని అడ్వకేట్‌ను అడిగితే, రూ.10లక్షలు ఇస్తేను వాటిని తొలగిస్తానని చెప్పాడని తెలిపారు. తాను డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో అడ్వకేట్ సుబ్బ, అక్కడ ఉన్నవారు అసభ్యంగా తనను తిట్టారని, డబ్బులు ఇవ్వకుంటే వేధిస్తామని, రెప్యుటేషన్ డ్యామెజ్ చేస్తామని హెచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మైక్రో ఫైనాన్స్‌తో సంబంధం లేదు: సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని సింగర్ మంగ్లీ తెలిపారు. తన పేరుతో ఎవరూ డబ్బులు వసూలు చేశారో తెలియదని తెలిపారు. అడ్వకేట్ సుబ్బుపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మంగ్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుబ్బు భరత నాట్యం డ్యాన్సరని, బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు తన పేరు వాడుకుంటున్నాడని తెలిపారు. తనను డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపించారు. ఆరోపణలు అన్నీ నిరాధారమని తెలిపారు. నా పేరు చెప్పి ఎవరూ వసూలు చేశారో నాకు తెలియదని, వారికి తనకు సంబంధం లేదని తెలిపారు. మధుకు తన సోదరుడికి సంబంధంలేదని తెలిపారు.

మన తెలంగాణ 12 Apr 2026 7:57 pm

దమ్మపేట మండల విద్యార్థినిలకు స్టేట్ ర్యాంక్…

దమ్మపేట మండల విద్యార్థినిలకు స్టేట్ ర్యాంక్… దమ్మపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇంటర్మీడియట్

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:55 pm

ఇంటర్ ఫలితాల భయంతో…

ఇంటర్ ఫలితాల భయంతో… మూడు రోజుల ముందే విద్యార్థి ఆత్మహత్య..తీరా ఫలితాలలో 347

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:51 pm

ఇంటర్ ఫలితాల్లో ఏబీవీ జూనియర్ కళాశాల ప్రభంజనం…

ఇంటర్ ఫలితాల్లో ఏబీవీ జూనియర్ కళాశాల ప్రభంజనం… ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:46 pm

కొత్త కార్పొరేషన్‌లకు రూ. 500 కోట్లు ఉత్తమాటేనా..?

మొదటి కమిటీలో స్పెషలాఫీసర్ ప్రకటన రెండో మీటింగ్‌లో ఊసేలేని నజరానా రాష్ట్ర బడ్జెట్‌లోనూ కనిపించని ప్రస్తావన మనతెలంగాణ, సిటీబ్యూరో ః కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్‌లకు ప్రత్యేక అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రకటించిన రూ. 500 కోట్లు ఉత్తమాటేనా..? అనేది ఇప్పుడు కోర్ అర్బన్ రీజియన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. కొత్తగా ఏర్పడిన కొద్దిరోజుల్లోనే కార్పోరేషన్‌ల అధికారులతో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన స్పెషలాఫీసర్.. నూతనంగా ఆవిర్భవించిన రెండు కార్పోరేషన్‌లకు ఒక్కొక్క కార్పోరేషన్‌కు రూ. 500 కోట్లు మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆ ప్రకటన కాస్త కార్యరూపంలోకి రాకుండా ప్రకటనగానే మిగిలిపోయినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషలాఫీసర్‌గా నియమితులైన మొదటి సమావేశంలోనే ఆయన ఈ ప్రకటనను ఎందుకు చేసినట్టు..? ఎందుకు నిధులు మంజూరు చేయలేకపోతున్నట్టు..? అనేది ఇప్పుడు కోర్ అర్బన్ రీజియన్‌లో ఆసక్తికరమైన చర్చకు కేంద్రబిందువుగా మారింది. ప్రకటనచేసి నెల రోజులకుపైగా గడిచినా.. అనంతరం మరోమారు స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగినా.. ప్రకటించిన రూ. 500 కోట్లకు సంబంధించి కార్పోరేషన్‌ల ప్రత్యేకాధికారి ప్రస్తావించకపోవడంపై పలురకాలుగా వ్యాఖ్యానాలకు కేరాఫ్‌గా మారింది. బడ్జెట్‌లో ప్రస్తావనేది..? సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్‌లకు ఊరటనిచ్చేందుకే రూ. 500 కోట్లను మంజూరు చేయనున్నట్టు ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ ప్రకటించారా..? లేక ప్రభుత్వం నుండి వచ్చిన సంకేతాల మేరకు ప్రకటించారా..? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకుండానే ఆయన ఈ ప్రకటనను చేశారా..? అనేది ఇప్పుడు ఇటు అధికారులను, అటు పాలకులను తొలుస్తున్న ప్రశ్న. ఇదిలా ఉండగా గత మార్చిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ అంచనాల కేటాయింపుల్లోనూ కొత్తగా ఏర్పడిన కార్పోరేషన్‌లు సైబారాబద్, మల్కాజిగిరిలకు నిధుల కేటాయింపుపై ఊసే లేకపోవడం కూడా అధికారులను, మాజీ పాలకులను ఆశ్చర్యానికి లోనుచేస్తోంది. కేవలం హెచ్‌సిటీ ప్రాజెక్టులకు మాత్రమే రూ. 2654 కోట్లను కేటాయించిన ప్రభుత్వం.. మరి ఈ రూ. 500 కోట్ల ప్రస్తావన చేయలేదు. గతంలో జీహెచ్‌ఎంసి వరకు మాత్రమే హెచ్‌సిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా జీహెచ్‌ఎంసిలో శివారులోని 27 మున్సిపాలిటీలు విలీనమయ్యాయి. అదనంగా పెరిగిన ప్రాంతాల్లోనూ మౌలిక వసతులను కల్పించడం, అభివృద్ధి పథకాలను చేపట్టడం జరగాల్సి ఉంది. మరి వీటిని నిధుల సహాకారం చేయాల్సిన ప్రభుత్వం కాస్త వార్షిక బడ్జెట్ అంచనాలలో కొత్త మున్సిపల్ కార్పోరేషన్‌లకు నిధులను కేటాయించకపోవడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. ఆస్తి పన్ను, ప్లానింగ్‌పైనే.. ఎర్లీబర్డ్ స్కీంతో వచ్చే ఆస్తిపన్ను వసూలు, టౌన్‌ప్లానింగ్ విభాగం వసూలు చేసే భవన నిర్మాణాల ఫీజుల నుండి వస్తున్న ఆదాయంపైనే ఈ రెండు కొత్త కార్పోరేషన్‌లు ఆధారపడి ఉన్నాయి. వచ్చే ఆదాయం మేరకు కార్పోరేషన్ ఉద్యోగుల జీతభత్యాలను అందించనున్నది. ఈ రెండు విభాగాల నుండి ఆదాయం వస్తేనే ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీన జీతాలు తమతమ బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయని, లేదంటే జాప్యం కావడం ఖాయమనేది అధికార వర్గాల్లోని అభిప్రాయం. గత ఏడాది ఆస్తిపన్ను వసూలు సిఎంసిలో రూ. 1000.36 కోట్లుగా ఉంటే మల్కాజిగిరి కార్పోరేషన్‌కు రూ. 962.62 కోట్లు వసూలైనట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క మార్చినెలకు సైబారాబాద్‌లో ఆస్తిపన్ను రూ. 143.69 కోట్లుగా ఉంటే ఎంఎంసిలో రూ.107.09 కోట్లు వసూలైంది. 202526 టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా సిఎంసికి రూ. 538.09 కోట్లు, ఎంఎంసికి రూ.198.24 కోట్లు ఆదాయంగా వచ్చాయి. ఇప్పుడు ఈనెల(ఏప్రిల్)లో ఎర్లీబర్డ్ స్కీం అమలులో ఉన్నందున ఆస్తిపన్ను కొంతమేర ఖజానాకు చేరే అవకాశాలున్నాయి. అనంతరం ఇక టౌన్‌ప్లానింగ్ నుండి వచ్చే ఆదాయంపైనే ఈరెండు కార్పోరేషన్‌లు ఆధారపడాల్సి ఉంటుందనేది అధికారులు వివరిస్తున్నారు.

మన తెలంగాణ 12 Apr 2026 7:42 pm

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ‘అవని’విద్యార్థుల ప్రభంజనం..

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ‘అవని’ విద్యార్థుల ప్రభంజనం.. భీమారం, ఆంధ్ర ప్రభ : స్థాపించిన

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:40 pm

Guruthundha Magic: Massive 10 Million views & Counting

“Guruthundha” from Chennai Love Story has turned into a massive sensation dominating charts and social media feeds with reels, shorts, and fan recreations. Crossing over 10 million views, it has firmly established itself as one of the most talked-about songs in recent times. The song has become an addiction to everyone. Both Kiran Abbavaram and […] The post Guruthundha Magic: Massive 10 Million views & Counting appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 7:39 pm