Change of Producer for Sharwanand’s Next
Sharwanand is back with a bang this year with Nari Nari Naduma Murari. His recent film Biker received critical acclaim but the film did not collect big money. The technical aspects from the film along with the performance of the actor are appreciated. Sharwanand is shooting for Bhogi and the actor announced that he would […] The post Change of Producer for Sharwanand’s Next appeared first on Telugu360 .
Digital Arrest : బెజవాడలో ఏడు లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
విజయవాడలోనూ సైబర్ నేరం జరిగింది.
Travels |ముగ్గురు మృతి, 30మందికి గాయాలు
Travels | ముగ్గురు మృతి, 30మందికి గాయాలు Travels | ఆంధ్రప్రభ, వెబ్
Tragic incident |చికిత్స పొందుతూ మృతి
Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా మానూర్
ఏలూరు జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది.
PhotoGallery |అందాలతో మతిపోగొడుతున్న శ్రద్ధాదాస్..
PhotoGallery | అందాలతో మతిపోగొడుతున్న శ్రద్ధాదాస్..
వికారాబాద్లో ఘనంగా అంబేద్కర్ జయంతి
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఆర్ టిసి ఉద్యోగుల సమస్యలు వినేందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి: పొన్నం
హైదరాబాద్: ఆర్ టిసి కార్మికులను సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తాను కోరుతున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్ టిసి కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో పొన్నం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆర్ టిసి ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని తెలియజేశారు. ఈ రెండు అంశాలు తప్ప మిగతా ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఉద్యోగుల సమస్యలు వినేందుకు మా తలుపులు ఎల్లవేళలా తెరిచి ఉంటాయని వివరించారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డిఎ అమలులోకి తీసుకొచ్చామని, ప్రస్తుతం ఎలాంటి డిఎ బకాయిలు లేవని తెలియజేస్తున్నానని, ఆర్ టిసి ఉద్యోగులకు పిఆర్ సి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, ఉద్యోగుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆర్ టిసి ఉద్యోగుల విలీనంపై గత ప్రభుత్వం 9 సెప్టెంబర్ 2023న కమిటీ ఏర్పాటు చేసిందని, ఎన్నికల షెడ్యూల్కు ముందు హడావిడిగా ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిందని, ఈ విషయాన్ని తాను గుర్తు చేస్తున్నానని, కమిటీ ఏర్పాటయ్యాక కొద్ది రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంని, అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిందని, ఆ తరువాత లోకసభ ఎన్నికల షెడ్యూల్ కారణంగా కోడ్ అమలులో ఉండటం వల్ల ఈ అంశంపై సమగ్రంగా ముందుకు వెళ్లడం ఆలస్యమైందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామని, ఆర్ టిసి సేవలను బలోపేతం చేశామని పొన్నం పేర్కొన్నారు. ఒకప్పుడు ఉనికికే ప్రశ్నార్థకంగా ఉన్న ఆర్ టిసిని, ప్రస్తుతం 90కి పైగా డిపోలు లాభాల్లో నడుస్తున్నాయని, ఆర్ టిసి సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం, ఈ మూడు అంశాలకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఉద్యోగుల ప్రభుత్వ విలీనంపై కమిటీ సమగ్ర అధ్యయనం అవసరమని తాను భావిస్తున్నానని పొన్నం చెప్పారు. ప్రస్తుతం ఆర్ టిసి క్రమంగా కోలుకుంటున్న సమయంలో సమ్మె నిర్ణయం సరైంది కాదని తాను భావిస్తున్నానని, ఇది సంస్థకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని, మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్ టిసికి అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, గతంలో రూ.1205 కోట్లుగా ఉన్న పిఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించామని, అలాగే రూ.690 కోట్లుగా ఉన్న సిసిఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామని, ఇప్పటి వరకు 2978 కొత్త బస్సులను ప్రవేశపెట్టామని, 1134 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించామని, కొత్త ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు పూర్తి చేశామని, త్వరలోనే వారు విధుల్లోకి రానున్నారని పొన్నం చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్ టిసి ఉద్యోగులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తాను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.
అతివేగంతో అదుపుతప్పిన కారు… మోత్కూరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు
నేటి నుంచి తెలంగాణలో అగ్నిమాపక వారోత్సవాలు
నేటి నుంచి తెలంగాణలో అగ్నిమాపక వారోత్సవాలు జరగనున్నాయి
హైదరాబాద్: నవీన్రాజ్ హీరోగా, జోయెల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘తెరచాప’. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో విడుదలకు ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకుడు నవీన్రాజ్ మాట్లాడుతూ మత్స్యకారుల్లో తామూ కలిసిపోయి, వారి జీవితాల్ని పూర్తిగా అర్థం చేసుకుని రూపొందించిన సినిమానే ‘తెరచాప’ అని నవీన్రాజ్ శంకారపు అన్నారు.‘సహజత్వానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన చిత్రమిది. మండుటెండల్లోనూ, సముద్ర తీరంలోనూ ఎన్నో సవాళ్ల మధ్య పనిచేశాం. ఎక్కువమంది నటులు ఇందులో […] The post హదయాలను కదిలించే…‘తెరచాప’ appeared first on Visalaandhra .
ORRపై బైక్లు ఎలా? నెటిజన్ల ఆగ్రహం #telugupost #orr #bikers #viralvideo
Aadarsha Kutumbam: మే ఫస్ట్ వీక్ నుంచి సాంగ్ షూట్ కి రెడీ అవుతున్న వెంకీ!
విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రం ఆదర్శ కుటుంబం. ట్యాగ్ లైన్ గా ‘హౌస్ నెం. 47, ఎ.కె. 47’ పెట్టడంతో సినిమాపై మొదటి నుంచే ఆసక్తి మొదలైంది. ఎప్పటి నుంచో వెంకటేష్, హారిక అండ్ హాసినీ వారితో ఓ సినిమాను చేయనున్నాడనే వార్త వచ్చి ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకి అదే నిజమై..ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉంది. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, వెంకీ సరసన […] The post Aadarsha Kutumbam: మే ఫస్ట్ వీక్ నుంచి సాంగ్ షూట్ కి రెడీ అవుతున్న వెంకీ! appeared first on Telugu Bullet .
బీహార్లో రేపు కొత్త ప్రభుత్వం
బీహార్లో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది
Kayadhu lohar | టార్గెట్ ఇదే.. Kayadhu lohar | సోషల్ మీడియాను
ఘనంగా అంబేద్కర్ జయంత్యోత్సవ ర్యాలీ
ఘనంగా అంబేద్కర్ జయంత్యోత్సవ ర్యాలీ సంగారెడ్డి, ఆంధ్రప్రభ: మాల విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ
గుర్రంపోడు మండలంలో ‘అరైవ్ అలైవ్’ –పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత గ్రామ సభలు
గుర్రంపోడు, ఏప్రిల్ 14, (జనంసాక్షి) :నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా …
‘జలసంధి’ ముట్టడి- శాంతికి గండి
ఇరాన్ అమెరికా చర్చలు విఫలం కావడంతో అనిశ్చితి మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని బంధించకుండా అలాగే అణునిల్వలు, అణ్వాయుధ తయారీ వంటి అంతర్జాతీయ సమస్యలను ఈ ఒప్పందంలో ఇమడ్చకుండా మిగతా అంశాలపై చర్చలు సాగితేనే చిక్కులు వీడతాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. 197679 మధ్యకాలంలో అమెరికా మద్దతుతో షా పాలన బలంగా ఉన్నట్టు కనిపించినా, ప్రజల్లోని అసంతృప్తి 1979 లో అమెరికా మద్దతు గల ప్రభుత్వాన్ని పడగొట్టి ఇస్లామిక్ విప్లవానికి దారితీసింది. అప్పటినుంచి ఇరాన్కు అమెరికాకు మధ్య సన్నిహిత సంబంధాలు కానీ, చర్చలు కానీ జరగలేదు. మళ్లీ ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావడం చారిత్రాత్మకమైన సంఘటన. మొదటిసారి ఈ రెండు దేశాల ముఖాముఖి ప్రత్యక్ష చర్చలు బెడిసికొట్టడం దుష్పరిణామానికి సంకేతమే. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అణ్వస్త్ర తయారీతోసహా అమెరికా షరతులేవీ ఇరాన్ ఒప్పుకోవడం లేదనీ విలేకరులకు వెల్లడించారు. ఒక్క సమావేశం తోనే ఒప్పందం ఎలా కుదురుతుందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ విస్మయం ప్రకటిస్తోంది. అమెరికావి సాధ్యం కాని గొంతెమ్మ కోరికలని ఇరాన్ ప్రభుత్వ వార్తాపత్రిక వ్యాఖ్యానించింది. ఇరుదేశాలు యుద్ధ విరమణకు తాత్కాలికంగా నిర్ణయించడంతో కొన్నిరోజుల పాటు ఆర్థిక మార్కెట్లు పుంజుకోవడం కనిపించింది. ఇప్పుడు మళ్లీ అకస్మాత్తుగా పరిస్థితి సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఏర్పడింది. హర్ముజ్ జలసంధిని ముట్టడించడం, నౌకారవాణాను అడ్డుకోవడం ప్రధాన సంక్షోభం అయినప్పటికీ దాన్ని నివారించకుండా కొనసాగితే ఇది ఎప్పుడు పరిష్కారమవుతుందో ఏ దేశం చెప్పలేకపోతోంది. అయితే ఇటు ఇరాన్, అటు అమెరికా ఈ రెండూ చర్చలు ముగిసిపోలేదన్న సంకేతాలు అందించడం ఆశలు చిగురిస్తున్నాయి. ఒప్పందం కుదర్చడంలో వాన్స్ వైఫల్యం చర్చలు ముగిసిపోయినట్టు కాదని ఇరాన్ అభిప్రాయపడుతోంది. రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ చర్చలు కొనసాగుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేసింది. అయితే మళ్లీ చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టం చేయలేదు. రెండు దేశాలు చర్చలు సాగించడం తప్పనిసరి. అణుసంబంధిత అంశాలు క్లిష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని ఇతర అంశాల నుండి వేరు చేసి సుదీర్ఘకాలం నిరంతర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న అభిప్రాయం వినబడుతోంది. అలాగే లెబనాన్పై బాంబు దాడులు కొనసాగించకుండా ఇజ్రాయెల్ను అమెరికా కట్టడిచేయడం తక్షణ అవసరం. బాంబు దాడులవల్ల హెజ్బొల్లా వర్గాలతో సంబంధం లేని అమాయక ప్రజలు వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. హర్మూజ్ జలసంధిని తన అధీనంలో బంధించకుండా, అలాగే రవాణా నౌకలపై టోల్ రుసుం విధించకుండా స్వేచ్ఛగా రవాణా జరిగేలా ఇరాన్ చొరవ చూపవలసిన అవసరం ఉంది. జలసంధి ద్వారా సురక్షిత ప్రయాణంకోసం కొన్ని నౌకలు ఇరాన్ అధికారులకు దాదాపు 2 మిలియన్ డాలర్లు (దాదాపు 16 నుంచి 17 కోట్ల రూపాయలు) చెల్లించినట్టు సమాచారం. ఇదే విధంగా ఇజ్రాయెల్ లేదా వారి మిత్రదేశాలతో సంబంధం లేని నౌకల రవాణాకు భద్రత కల్పించడానికి నెలవారీ 180 మిలియన్ డాలర్లు చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడించాయి. 1982 లో ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం ఒప్పందాన్ని రూపొందించగా, ఇరాన్తో సహా 168 దేశాలు ఆమోదించాయి. అయితే ఇరాన్ ఆమోదించినప్పటికీ చట్టబద్ధంగా అమలులోకి తీసుకు రాలేదు. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచ మహా సముద్రాలు, వాటి వనరులపై ఆయా దేశాల హక్కులు, బాధ్యతలు నిర్ణయించబడ్డాయి. ఇప్పుడు హర్మూజ్ జలసంధిని ఇరాన్ కానీ, అమెరికా కానీ ముట్టడిస్తే ఐక్యరాజ్యసమితి ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. ఈ జలసంధిని మూసేయడం వల్ల అమెరికాకు ఎలాంటి నష్టం ఉండదని, ఈ జలసంధి ద్వారా అమెరికా సముద్ర వాణిజ్యం చాలా స్వల్పమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ జలసంధి ముట్టడి వల్ల చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా దేశాలే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే ఈ దేశాలన్నీ 50% కన్నా ఎక్కువ శాతం ఇంధనాన్ని ఈ జలసంధిద్వారా దిగుమతి చేసుకుంటున్నాయి. అంతేకాదు అమెరికా మిత్రదేశాలు సౌదీఅరేబియా, కువాయిట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల నుంచి కూడా చమురు ఎగుమతులకు ఆటంకం ఏర్పడుతుంది. ఇంతటి సంక్షోభాన్ని కూడా తమ దేశానికి లాభం తెచ్చే అవకాశంగా ట్రంప్ వినియోగించుకోవడం విచిత్రం. మా వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, మా దేశానికి వచ్చి చమురును కొనుక్కుని వెళ్లండని ట్రంప్ పిలుపునిస్తున్నారు. సముద్రంలో మందుపాతరలు అమర్చి అంతర్జాతీయ వాణిజ్యానికి దారిఇవ్వకుండా ప్రపంచ దేశాలను ఇరాన్ దోపిడీ చేస్తోందని ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ బెదిరింపులకు అమెరికా లొంగిపోదని హెచ్చరిస్తున్నారు. ఇరాన్కు అనవసరంగా, అక్రమంగా టోల్ చెల్లించే ప్రతినౌకను క్షుణ్ణంగా తనిఖీ చేసి అడ్డగించాలని తన నావికా దళాన్ని ఆదేశించానని, అలా టోల్ చెల్లించే నౌకలకు దేనికీ నడిసముద్రంలో సురక్షితంగా ప్రయాణించే అవకాశం ఉండదని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తోందో, ఇతర దేశాలతో దాని సంబంధాలు ఎలా మారుతున్నాయో సూచిస్తున్నాయి.
రోడ్డు భద్రత –ప్రతి ఒక్కరి బాధ్యత ‘అరైవ్-అలైవ్’అవగాహన సదస్సు ఎస్సై అనిల్ కుమార్..
గంభీరావుపేట ఏప్రిల్ 14(జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం గంభీరావుపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో, …
రాష్ట్ర స్థాయి ర్యాంక్ కైవసం..
రాష్ట్ర స్థాయి ర్యాంక్ కైవసం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగారెడ్డిగూడెం
మా కుర్రాళ్లు సత్తా చాటారు: ఇషాన్ కిషన్
హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్కు సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి రుచి చూపించింది. సొంత మైదానంలో యువ బౌలర్ల సత్తాను అభిమానులకు ప్రత్యక్షంగా చూపించారు. ఇంత వరకు జట్టులో బౌలింగ్పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. తమను నమ్మి అవకాశం ఇస్తే నిరూపించుకోవడానికి సిద్ధమని సన్రైజర్స్ యువ బౌలర్లు తమ ప్రదర్శనతో చెప్పారు. కొత్త కుర్రాళ్లు ప్రఫుల్ 4, సకిబ్ 4 వికెట్లు తీసి ఎసఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం యువ పేసర్లపై కెప్టెన్ ఇషాన్ […] The post మా కుర్రాళ్లు సత్తా చాటారు: ఇషాన్ కిషన్ appeared first on Visalaandhra .
అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం నెతన్యాహుయే కారణం?
అమెరికా- ఇరాన్ చర్చలు పట్టాలు తప్పడం మొత్తం ప్రపంచాన్ని నిరాశకు గురిచేసింది. ఎందుకంటే ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రమేయం కారణంగా ప్రపంచం ఈ చర్చలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అమెరికాకు కాబోయ్ అధ్యక్షునిగా ప్రచారం పొందుతున్న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఇరాన్ను చర్చల బల్ల వద్దకు తీసుకురావడం వాన్స్కు అప్పగించిన అత్యంత కీలకమైన బాధ్యత కావడం గమనార్హం. ఈ చర్చలు సఫలమైతే మొత్తం ప్రపంచం ఒక పక్క యుద్ధ జ్వాలలు చల్లారతాయని, మరోవంక అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరతకు మార్గం ఏర్పడుతుందని ఆశతో ఎదురు చూసింది. ఈ చర్చలద్వారా తన దౌత్య నైపుణ్యతను ప్రదర్శించి ఓ కీలకమైన అంతర్జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందేందుకు వాన్స్ సైతం ఎంతో ఆత్రుత చెందారని చెబుతున్నారు. అందుకనే ఆయన ఇరాన్ ప్రతినిధులతో సామరస్యంగా వారిలో ఓ విశ్వాసం కలిగించేందుకు ప్రయత్నిస్తూ స్నేహపూర్వక హస్తం అందించేందుకు సిద్ధమయ్యారని కూడా తెలుస్తుంది. అయితే, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో అమెరికా ఇరాన్ల మధ్య 21 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు, ఇరుపక్షాలు ఒకరి డిమాండ్లకు మరొకరు అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభనను తొలగించడంలో విఫలమవడం విస్మయం కలిగిస్తోంది. ఇరాన్అమెరికాల మధ్య ఉన్న ‘అవిశ్వాసం, అపార్థాల ప్రమాదం’ గురించి తెలిసినప్పటికీ, టెహ్రాన్ సంధానకర్తలతో ‘సత్సంబంధాలు పెంచుకుని, మరింత స్నేహపూర్వకంగా’ మారారని దౌత్య వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ కూడా అంగీకరించి, ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, చివరికి వాన్స్ బృందం ఇరాన్తో ‘చాలా స్నేహపూర్వకంగా’ మారిందని చెప్పారు. అయితే, తన ‘అణు ఆశయాలను’ వదులుకోవడానికి ఇరాన్ నిరాకరించడమే చివరికి చర్చల వైఫల్యానికి దారితీసిందని ఇప్పుడు చెబుతున్నారు. ‘మేము చాలా తీవ్రమైన చర్చలు జరిపాము, చివరికి అవి చాలా స్నేహపూర్వకంగా మారాయి. వారు తమ అణు ఆశయాలను వదులుకోవడానికి నిరాకరించడం మినహా, మాకు అవసరమైన దాదాపు అన్ని అంశాలనూ మేము సాధించాము. నిజం చెప్పాలంటే, నా దృష్టిలో, అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైన అంశం అదే’ అని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. 21 గంటల పాటు జరిగిన రహస్య చర్చల వివరాలను వెల్లడించడానికి వాన్స్ నిరాకరించినప్పటికీ, ప్రధాన విభేదం అణ్వాయుధాల అంశంపైనేనని చెబుతున్నారు. ఇరాన్లోని యురేనియం శుద్ధి కేంద్రాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయని అంటూనే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విరమించడానికి సిద్ధంగా లేకపోవడమే చర్చల విఫలం కావడానికి ప్రధాన కారణమని వాన్స్ తెలపడం గమనార్హం. ఇరాన్ మాత్రం తాము అణుబాంబు తయారీ ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేస్తున్నా తమకు ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదనే స్పష్టమైన హామీ కావాలని పట్టుబట్టడం గమనిస్తుంటే ఇరాన్ చెప్పినట్లు యుద్ధం ద్వారా సాధింపలేని అంశాలను చర్చల ద్వారా సాధించాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు అవుతుంది. కాగా, ఇరాన్ అమెరికా చర్చలలో పురోగతి లేకపోవటానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కారణమని ఇరాన్ ఆరోపించడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంటున్నది. చర్చల మధ్యలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్కు ఫోన్ చేశారని, ఆ తర్వాత చర్చల ప్రక్రియ పట్టాలు తప్పిందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి ఆరోపించారు. చర్చల మధ్యలో జెడి వాన్స్కు, నెతన్యాహూ ఫోన్ చేశారని, ఆ తర్వాత కీలక పురోగతి దిశగా వెళ్తున్న చర్చల ప్రక్రియ పట్టాలు తప్పిందని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 28న అకస్మాత్తుగా ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి అమెరికా దాడులు ప్రారంభించడానికి సైతం ఇజ్రాయెల్ ఒత్తిడియే కారణమని అమెరికా నిఘా విభాగంలో కీలక వ్యక్తులు సైతం ఇంతకు ముందు ఆరోపించడం గమనార్హం. ముందు రోజు వరకు యుఎఇలో రెండు దేశాల మధ్య జరిగిన చర్చలలో దాదాపుగా ఓ అంగీకారంకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అణ్వాయుధాల విషయంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇరాన్ దిగివచ్చి అనేక షరతులకు అంగీకరించినట్లు స్వయంగా యుఎఇ ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్పై దాడులు ప్రారంభమయ్యాయి. కేవలం ఐక్యరాజ్యసమితి నిపుణులు మాత్రమే కాకుండా, అమెరికా నిపుణులు సైతం ఇరాన్లో అణు కేంద్రాల తనిఖీకి అంగీకారం కుదిరిందని కూడా చెప్పారు. అంతగా ఇరాన్ దిగివచ్చిన యుద్ధం ప్రారంభించారంటే యుద్ధానికి అమెరికా చెబుతున్న కారణాలు ఏవీ వాస్తవం కాదని స్పష్టం అవుతుంది. ఇరాన్కు అమెరికా, ఇజ్రాయెల్పై దాడులు జరిపే ఉద్దేశం లేదని, ఇప్పుడు ఆ దేశంపై యుద్ధంకు వెళ్లాల్సిన అవసరం గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని స్వయంగా అమెరికా నిఘా విభాగంలో కీలక వ్యక్తులు చెప్పడం గమనిస్తే కేవలం ఇజ్రాయెల్పై ఒత్తిడితో, ఆ దేశం ప్రధానిని సంతృప్తి పరచేందుకు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడి అవుతుంది. అయితే, యుద్ధం లో ఇరాన్లోని అగ్రనాయకత్వం మొత్తాన్ని దాదాపుగా హతమొనర్చిన్నప్పటికీ అక్కడి సైన్యం ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తీవ్రమైన ప్రతిఘటన ఇస్తూ ఉండటం, పైగా యుద్ధ పరిధిని అటు గల్ఫ్ దేశాలకు, ఇటు హర్మూజ్ జలసంధికి విస్తరింపచేయడంతో అమెరికా ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఇరాన్ దూకుడును తట్టుకొనేందుకు అదనపు దళాలను మోహరింప చేయాల్సి వచ్చింది. ఊహించని రీతిలో భారీగా వ్యయం భరించాల్సి వస్తుంది. ఇరాన్ శక్తిసామర్ధ్యాలను అంచనా వేయకుండానే అమెరికా తొందరపాటుతో యుద్ధంకు ఉపక్రమించినట్లు ఇప్పుడు సర్వత్రా భావిస్తున్నారు. అందుచేత ఈ యుద్ధం నుండి గౌరవంగా బయటపడాలని ట్రంప్ మార్గాలు అన్వేషిస్తున్న సమయంలో పాకిస్తాన్ ఓ వారధిగా కనిపించింది. పాకిస్తాన్ను చైనా నడిపిస్తున్నట్లు స్పష్టం అవుతున్నా అమెరికా కనుసన్నల్లోనే ఆ దేశం ఇరాన్తో సయోధ్యకు సంప్రదింపులు ప్రారంభిన్నట్లు తెలుస్తున్నది. ఇరాన్ కూడా గౌరవంగా ఈ యుద్ధం నుండి బయటపడేందుకు మార్గాలు అన్వేషిస్తున్నట్లు వెల్లడైంది. అందుచేతే ఇరువురూ చర్చలపట్ల ఆసక్తి చూపారు. వారి మధ్య ఎక్కడ ఒప్పందం కుదురుతుందో అని కేవలం ఇజ్రాయెల్ మాత్రమే అలజడికి గురైనట్లు తర్వాత పరిణామాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు చర్చల మధ్యలో జెడి వాన్స్కు, ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్ చేశారనే వార్తలపై అమెరికా నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. జెడి వాన్స్కు నెతన్యాహు ఫోన్ కాల్ తర్వాత అమెరికా - ఇరాన్ చర్చల దృష్టి మొత్తం ఇజ్రాయెల్ ప్రయోజనాలవైపు మళ్లిందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపించడం, నెతన్యాహు ఒత్తిడి మేరకే ట్రంప్ ఇరాన్పై యుద్ధానికి దిగారని ఇంతకు ముందు అమెరికా నిభా విభాగం అధికారులు పేర్కొనడం చూస్తుంటే నెతన్యాహు అభీష్టంకు వ్యతిరేకంగా అడుగులు వేయలేని నిస్సహాయ స్థితిలో ట్రంప్ ఉన్నారా? అనే అనుమానాలు సర్వత్రా కలుగుతున్నాయి. గత అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అందించిన సహకారం మాత్రమే అందుకు కారణం కాకపోవచ్చని కూడా ఈ సందర్భంగా భావిస్తున్నారు. బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉన్నప్పటికీ గల్ఫ్లో భారత్ వాణిజ్య, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు విశేషంగా ముడివడి ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమాసియా ఘర్షణలో జోక్యం చేసుకోలేకపోవడం సైతం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుంది. యుద్ధం మొదటి రోజునే చెప్పిన మాటలు ప్రకారం, ఇరాన్ లో ప్రభుత్వం మారితే, అంటే తమ కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడకుండా యుద్ధం ముగిసిపోతే తమ దేశం భద్రత, ఎత్తుగడలకు పెద్ద ముప్పు ఏర్పడగలదని ఇజ్రాయెల్ భయపడుతున్నట్లు స్పష్టం అవుతుంది. మరోవంక, ఇరాన్ను ఇప్పుడు లొంగదీసుకోకపోతే సమీప భవిష్యత్తులో సాధ్యం కాదని అమెరికా సైతం గ్రహించింది. అమెరికాకు మాదకద్రవ్యాల సరఫరా నెపంతో వెనిజులాపై దాడి చేసి ఆ దేశం అధ్యక్షుడు నికోలస్ మదురో మోరో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్లను అపహరించి తమ దేశంలోని జైలులో నిర్బంధించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మాదకద్రవ్యాల అక్రమ రవాణా గురించి మాట్లాడటంలేదు. వందలాది మంది అమెరికా కంపెనీల ప్రతినిధులను ఆ దేశం పంపుతూ, ఆ దేశంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చమురు కంపెనీలలో పెట్టుబడులు పెట్టేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు ఇరాన్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చమురు కంపెనీలలో అమెరికా కంపెనీలకు భాగస్వామ్యంకు అనుమతిస్తే ఇరాన్ చేపట్టే అణు కార్యక్రమంతోపాటు హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం వంటి అంశాలకు అమెరికా అంతగా పట్టుపట్టకపోవచ్చని చెప్పవచ్చు. అవసరమైతే జలసంధి వద్ద టోల్ ఫీజు వసూలులో కొంత వాటా కోరవచ్చు. గల్ఫ్ దేశాలలో సైతం ఆ దేశాల భద్రతా అంశాలపై కన్నా తమ పెట్టుబడుల భద్రతపై అమెరికా ఆందోళనగా ఉంది. - చలసాని నరేంద్ర 98495 69050
UBS Shock: Pawan Kalyan Extra Cautious
Powerstar Pawan Kalyan has completed all his acting assignments. His last release Ustaad Bhagat Singh is a big shock for the actor as the film failed to register decent footfalls. The film has turned out to be a huge shock for the actor-turned-politician and he also received huge criticism for his acting. After the first […] The post UBS Shock: Pawan Kalyan Extra Cautious appeared first on Telugu360 .
Male Breast Cancer Often Detected Late, Says Hyderabad Study
Hyderabad, April 14: Male breast cancer, though rare, is frequently diagnosed at an advanced stage, highlighting the urgent need for greater awareness and earlier detection, according to a new study conducted at ESIC Medical College and Hospital, Hyderabad. Published in the Journal of the Association of Physicians of India, the retrospective study analysed 15 male […] The post Male Breast Cancer Often Detected Late, Says Hyderabad Study appeared first on Telugu360 .
Telangana RTC Strike From April 22: Govt Seeks Talks, Unions Stand Firm
Hyderabad, April 14: A confrontation is brewing over Telangana RTC after employee unions announced a statewide strike from April 22, while the state government appealed to workers to withdraw the protest and resolve pending issues through talks. According to the Joint Action Committee (JAC) representing RTC employees, the strike call was given after neither the […] The post Telangana RTC Strike From April 22: Govt Seeks Talks, Unions Stand Firm appeared first on Telugu360 .
Summer Effect : రెండు తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్.. బయటకు రావద్దండి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
తల్లిని సజీవదహనం చేసిన కుమారుడు
అమరావతి: కన్న తల్లి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుమారుడు ఇల్లును తగలబెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఒంగోలులో వెంకటరమణమ్మ తన ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తోంది. చిన్నకుమారుడు చెన్నైలో జాబ్ చేస్తుండగా పెద్ద కుమారుడు కిషోర్ బాబు తల్లితో ఉంటూ మాంసం దుకాణం నడుపుతున్నాడు. మంగళవార తెల్లవారుజామున తల్లి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుమారుడు ఇల్లును తగలబెట్టాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి అతడు పారిపోయాడు. గ్రామస్థులు మంటలను ఆర్పేశాడు. అప్పటికే వెంకటరమణ సజీవదహనమయ్యారు. కిషోర్ బాబు మానసిక స్థితి సరిగా లేదని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా పెరిగిన బంగారం, వెండి! ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్
డైనోసార్ అవశేషాలతో తయారైన హ్యాండ్బ్యాగ్ #Dinosaur #LuxuryBag #Fashion #TyrannosaurusRex #Netherlands
నేడు లెబనాన్ - ఇజ్రాయిల్ మధ్య చర్చలు
నేడు లెబనాన్ - ఇజ్రాయిల్ మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన రోడ్లపై నిర్దిష్ట 14 కి.మీ దూరంలోని ఆసుపత్రికి 22 నిమిషాల్లో చేరుకుని ఐదుగురు రోగుల ప్రాణాలను కాపాడిన సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారి అవయవాలను దానం చేస్తుడడం నిత్యం చదువుతూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ‘అవయవ దానం’కు ప్రాణం పోస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మనిషికి, మరణించిన మనిషి ప్రాణంపోయడం మానవత్వానికి ఉన్న గొప్ప గుణంగా భావించాలి. మరణించిన మనిషి తాలూకూ అవయవాలను నిర్దిష్ట సమయంలో మరో మనిషికి అమర్చడంవల్ల ఓ కొత్త జీవితం అందుతుంది. మరణం అంచున ఉండేవారికి రెండవ జీవితాన్ని ప్రసాదించడం ‘పునర్జన్మ’గానే భావించాలి. ఇటీవలికాలంలో దేశవ్యాప్తంగా అవయవ దానంపై కొంతసానుకూల వాతావరణం ఏర్పడుతోంది. 2013లో అవయవదాతల సంఖ్య 5 వేల లోపు ఉండగా, 2025లో నాలుగు రెట్లు పెరిగి 20 వేలకు చేరింది. దేశవ్యాప్తంగా పన్నెండు వందల కుటుంబాలు అవయవాలు దానం చేసి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపారు. అత్యధిక అవయవదానం చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. ఇది జాతీయ సగటుకన్నా ఎక్కువ కావడం విశేషం. మధుమేహం, అధిక రక్తపోటు తదితర కారణాల వల్ల దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కిడ్నీ, కాలేయం, గుండె తదితర వ్యాధులకు గురవుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతున్నాయి. సరిపడ అవయవాల లభ్యత లేనందువల్ల ఏటా అయిదు లక్షలమంది నిస్సహాయస్థితిలో ప్రాణాలు కోల్పోతున్నారు. మనిషి జీవించినప్పుడు రక్తదానంతో పాటు కిడ్నీ, కాలేయం, గర్భాశయం, గర్భధారణ కణజాలం దానం చేయవచ్చు. బ్రెయిన్డెడ్ అయితే మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, గుండె కవాటాలు, పేగులు, క్లోమం, కార్నియా ఇతరులకు ఉపయోగపడుతాయి. గుండె ఆగి మరణించిన వారైతే కళ్లు, చర్మం, గుండె, కవాటాలు, ఎముకలు వంటి కణజాలాలు వంటి అవయవాలు మాత్రమే కాకుండా, మొత్తం శరీరాన్ని కూడా దానం చేయవచ్చు. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలను నిర్దేశిత సమయాల్లో అవసరమైన వారికి అమర్చాలి. ఆలస్యమైతే అవి పాడైపోయే ప్రమాదముంది. ఒక దాత ఎనిమిదిమంది ప్రాణాలను కాపాడటానికి ఆస్కారముంది. అలాగే సహజ మరణం చెందిన కొద్ది నిమిషాల్లో కళ్లు. కణజాలం (టిష్యూ) సేకరించవచ్చు. కానీ, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, అపోహల వల్ల అవయవదానం చేస్తున్నవారి సంఖ్య ఆశించినమేరకు పెరగడం లేదు. 2023లో పదివేల మంది మహిళలు జీవించి ఉండగానే అవయవదానం పత్రాలమీద సంతకం చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నివేదిక తెలిపింది. పురుషులతో పోల్చితే ఈ సంఖ్య దాదాపు రెట్టింపు. దేశవ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఒకటిన్నర లక్షల మందికిపైగా మరణిస్తున్నారు. సంబంధిత కుటుంబాలకు నచ్చజెప్పి మృతుల్లో కొందరి అవయవాలను మార్పిడి చేసినా అభాగ్యులెందరికో కొత్త ఊపిరి అందుతుంది. కానీ, బ్రెయిన్డెడ్ కేసులను సత్వరం గుర్తించడంతోపాటు వారి కుటుంబ సభ్యులను ఒప్పించడంలో నిర్లక్ష్యం నెలకొంటోంది. అవయవ దానం చేసేందుకు ఎవరైనా ముందుకు రావచ్చు. 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి అవయవదానం కోసం తమ పేరును నమోదు చేసుకోవచ్చు. 18 ఏళ్లలోపు ఉండేవారు తమ అవయవాలను దానం చేయడానికి అతని తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి ఉండాలి. మరణానంతరం అవయవ దానం కోసం నమోదు చేసుకుంటే, ముందుగా ఆ వ్యక్తిని వైద్యులు తనిఖీ చేస్తారు. ఆ వ్యక్తికి ఉన్న అనారోగ్య సమస్యలను అంచనా వేసి ఏ అవయవాలను దానం చేయవచ్చో తెలియజేస్తారు. తీవ్ర ప్రమాదం లేదా ఏదైనా వ్యాధి కారణంగా కోమాలోకి వెళ్లి, మళ్లీ స్పృహలోకి రాలేని పరిస్థితిలో ఉన్న బాధితుడిని బ్రెయిన్డెడ్గా నిర్ధారిస్తారు. ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో వారి గుండె ఇంకా కొట్టుకుంటూ, ఇతర ముఖ్య అవయవాలు మాత్రం కొన్ని గంటలపాటు పనిచేస్తూనే ఉంటాయి. వీటిని కుటుంబ సభ్యుల అనుమతితో సేకరించి, బ్లడ్గ్రూప్ తదితర అంశాలు సరిపోలిన వారికి నిర్దేశిత సమయంలో అమర్చుతారు. బ్రెయిన్డెడ్గా ధ్రువీకరించడానికి ఒకరి కంటే ఎక్కువ మంది వైద్యనిపుణులతో కూడిన బోర్డు అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అవయవాల సేకరణ, నిల్వ, తరలింపు, వాణిజ్యపరంగా వాటి దుర్వినియోగం వంటివాటిని నియంత్రించడానికి 1994లో మానవ అవయవాలు, కణాల మార్పిడి చట్టం తీసుకువచ్చింది. 2011లో దీనికి సవరణలు చేశారు. అవయవాల సేకరణ, కేటాయింపు, తరలింపును జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్ఒటిటిఒ) పర్యవేక్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అవయవ దానానికి ‘జీవన్దాన్’ ఎంతగానో కృషి చేస్తొంది. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలూ పాటుపడుతున్నాయి. మరణించిన వ్యక్తుల అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు 2019లో కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈమేరకు అవయవాల అందుబాటును పెంచాలనేది జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమ ఉద్దేశం. జాతీయ, ప్రాంతీయ, రాష్ర్ట స్థాయి అవయవ, కణజాల మార్పిడి సంస్థలు అవయవాల సేకరణ, పంపిణీకి సంబంధించిన సమన్వయ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాయి. అవయవాలను అత్యంత తక్కువ సమయంలో సురక్షితంగా అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈమేరకు ప్రజలు వెబ్సైట్ ద్వారా అవయవ దానానికి ‘ఎన్ఒటిటిఒ’ను తీసుకొచ్చింది. దాత నుంచి సేకరించే అవయవాలను గ్రహీత ఉండే ఆస్పత్రికి చేర్చే ప్రక్రియలో అంబులెన్సులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా గ్రీన్కారిడార్ పేరిట ప్రత్యేక మార్గాన్ని కల్పించారు. అంతేకాకుండా ‘ఒకే దేశం ఒకే విధానం’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీంతో భారతీయులంతా రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 65 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని తొలగించడం వల్ల ఎవరైనా, ఎక్కడైనా గ్రహీతలుగా అర్హులే. ఈ నేపథ్యంలో అవయవ దానంపైన ప్రచారోద్యమం ముమ్మరంగా సాగాలి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విదార్థులకు అవయవదానంపై అవగాహన కల్పించాలి. ఎవరికైనా అపోహలుంటే తొలగించాలి. సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా వేదికల ద్వారా ప్రచారం పెంచాలి. ఇందుకోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేయాలి. - కోడం పవన్కుమార్ - 9848992825
పోలీసులకు స్పెషల్ లీవ్స్.. ఏపీ డీజీపీ కీలక ఉత్తర్వులు
పోలీసులకు స్పెషల్ లీవ్స్.. ఏపీ డీజీపీ కీలక ఉత్తర్వులు ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
Nara Lokesh : నేడు, రేపు మంత్రి తిరుపతిలో పర్యటన
తిరుపతిలో ఈరోజు, రేపు మంత్రి లోకేశ్ పర్యటించనున్నారు
బుమ్రా అందుకే బౌలింగ్ చేయలేకపోతున్నాడు: ఫాప్ డుప్లెసిస్
ముంబై: సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, అందుకే ఈ ఐపిఎల్ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేయలేక పోతున్నాడని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాప్ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో బుమ్రా ఇప్పటి వరకు ఒక్క వికెట్ తీయలేక పోయిన సంగతి తెలిసిందే. దీంతో అతనిపై విమర్శలు వెత్తుతున్నాయి. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బుమ్రా వేసిన తొలి బంతికే కళ్లు చెదిరే సిక్సర్ కొట్టిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి బుమ్రా ఎంత ఒత్తిడిలో ఉన్నాడో అర్థమవుతుందన్నాడు. ఇక ముంబై కూడా బుమ్రాపై ఎక్కువగా ఆధారపడ కూడదన్నాడు. కీలకమైన మ్యాచుల్లో మాత్రమే అతన్ని ఆడించాలన్నాడు. అప్పుడే అతను ఎలాంటి ఒత్తిడి లేకుండా తన సహాజసిద్ధ బౌలింగ్ను చేసే అవకాశం ఉంటుందని డుప్లెసిస్ పేర్కొన్నాడు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నేత నరసింహారెడ్డి
నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నేత నరసింహారెడ్డి చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ పట్టణంలోని
Andhra Pradesh : నేటి నుంచి చేపల వేట నిషేధం
సముద్రంలో చేపలవేటను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
భక్తులకు కాషాయ టీ షర్ట్ ల పంపిణీ
భక్తులకు కాషాయ టీ షర్ట్ ల పంపిణీ మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్
నేడు కోల్కతాతో చెన్నై ఢీ చెన్నై: ఐపిఎల్లోభాగంగా మంగళవారం జరిగే కీలక మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ సవాల్గా మారింది. కోల్కతా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేదు. పంజాబ్తో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఒక పాయింట్ లభించింది. ఇది తప్పిస్తే మిగిలిన మూడు మ్యాచుల్లోనూ కోల్కతా ఓటమి చవిచూసింది. ఇలాంటి స్థితిలో చెన్నైతో జరిగే పోరు కెకెఆర్కు కీలకమనే చెప్పాలి. ఇక చెన్నై కిందటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి బోణీ కొట్టింది. ఇదే జోరును కోల్కతాపై కూడా కొనసాగించాలనే భావిస్తోంది. సంజు శాంసన్ ఢిల్లీపై అజేయ శతకం సాధించి ఫామ్లోకి వచ్చాడు. ఇది సిఎస్కు సానుకూల పరిణామంగా చెప్పాలి. శాంసన్ గాడిలో పడడంతో చెన్నై బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోయాయి. ఎలాంటి బౌలింగ్నైనా చిన్నాభిన్నం చేసే సత్తా శాంసన్కు ఉంది. ఈ మ్యాచ్లో అతను విజృంభిస్తే జట్టుకు భారీ స్కోరు సాధించడం కష్టం కాదు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రమే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబె, డెవాల్డ్ బ్రెవిస్, మాథ్యూ షార్ట్ తదితరులతో చెన్నై బ్యాటింగ్ బలోపేతంగా ఉంది. బౌలింగ్లో కూడా జట్టు బాగానే కనిపిస్తోంది. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. దీంతో చెన్నై ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. కోల్కతా టీమ్లో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ అజింక్య రహానె, ఫిన్ అలెన్, రఘువంశీ, కామెరూన్ గ్రీన్, రింకు సింగ్, రొమన్ పొవెల్, సునీల్ నరైన్, రమణ్దీప్ సింగ్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. అయితే గ్రీన్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. అయితే కిందటి మ్యాచ్లో అతను రాణించడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పాలి. రహానె, రఘువంశీలు ఈ మ్యాచ్లో కూడా జట్టుకు కీలకంగా మారారు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత వీరిపై నెలకొంది. నవదీప్ సైని, కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, ముజరబ్బాని తదితరులతో జట్టు బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో కోల్కతా కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.
వడదెబ్బపై అప్రమత్తం… గ్రామాల్లో ఓఆర్ఎస్ పంపిణీ
భీమదేవరపల్లి:ఏప్రిల్ 14 (జనం సాక్షి)వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రెహమాన్ సూచించారు. …
ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి – డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద
ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి – డిప్యూటీ డీఎంహెచ్ఓ యశోద చౌటుప్పల్,
దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ’నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. విరాట్ కర్ణా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో పౌరాణిక కథ, చరిత్ర, యాక్షన్తో పాటు బలమైన ఎమోషన్స్, సాంస్కృతిక అంశాలు వున్నాయి. చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ ‘సుర సుర...’ను ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సిద్ధమవుతుండటంతో, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ’సుర సుర’ పాటను సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్లతో ఈ పాట సినిమాలో ఒక మెయిన్ హైలెట్ గా నిలవనుంది. ఈ పాటకు సంగీతాన్ని జునైద్ కుమార్, అభే అందించగా, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ ఈ పాటకు మరింత జోష్ తీసుకురానుంది. అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ వంటి గాయకులు ఈ పాటకు గాత్రం అందించారు. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం వేడుకలు, సంప్రదాయం, కలిసికట్టుగా ఉండే ఆనందాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. నిక్ స్టూడియోస్ బ్యానర్పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగి రెడ్డి ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్తో కలిసి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్, రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మాంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బి.ఎస్. అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ‘నాగబంధం’ చిత్రం జూలై 3న విడుదల కానుంది.
Crucial Meetings in Tollywood: Exhibitors Vs Producers
The tussle between the producers and exhibitors of Telugu cinema happened several times in the past. The Telangana exhibitors have been demanding a percentage system and they have released a statement about the implementation. Soon all the Active Producers who are busy producing big-budget films made it clear that they are against the percentage system. […] The post Crucial Meetings in Tollywood: Exhibitors Vs Producers appeared first on Telugu360 .
రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ రైల్వే జీఆర్పీ
నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు#Trisha #Chennai #BombThreat #BreakingNews #Police #Alert
భావోద్వేగపూరిత కథనం, గొప్ప యాక్షన్తో ‘భరతవర్ష’
హీరో టి.గోపీచంద్.. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ డ్రామా ‘గోపీచంద్33’తో తన కెరీర్లో ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో, పవన్ కుమార్ సమర్పణలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, గోపీచంద్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. చిత్ర నిర్మాతలు పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్ను ఆవిష్కరించారు. క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ఈ గ్లింప్స్, శూల భూమిలో ప్రారంభమై, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో కట్టిపడేసింది. భారీ యుద్ధ సన్నివేశాలు, యుద్ధంలో ఆరితేరిన యోధు ల క్లోజప్లు, కత్తులు, గొడ్డళ్లు, అగ్నిజ్వాలల మధ్య జరిగే పోరాటాలు కనువిందు చేసే విజువల్ ఫీస్ట్ ని అందించాయి. భరత భూమికి (భారతదేశానికి) ప్రతీకగా నిలిచే ’భరత వర్ష’ టైటిల్ తెలియజేయ డం పవర్ఫుల్గా ఉంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన విజన్ ని అద్భుతంగా ప్రతిబింబిస్తూ, భారత చరిత్రలో ఎక్కువగా పరిశీలించని ఒక అధ్యాయాన్ని గొప్పగా ఆవిష్కరించారు. భారీ స్థాయి, భావోద్వేగపూరిత కథనం, గొప్ప యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. హీరో గోపీచంద్ ఈ చిత్రంలో యోధుడి పాత్ర కోసం పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. ఆయన ఫిజిక్, నటన అన్నీ క లిసి పాత్రను ఎంతో నిజాయితీగా కనిపించేలా చే శాయి. ఇది ఆయన గత చిత్రాల నుండి పూర్తిగా భిన్నమైన పాత్రగా నిలుస్తోంది. హీరోయిన్గా రీతూ వర్మ నటిస్తున్నారు. షూటింగ్ దాదాపు చివ రి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా కొనసాగుతోంది. భరత వర్ష భారతీయ సినిమాల్లో గుర్తుండిపోయే హిస్టారికల్ డ్రామాగా నిలవబోతోంది.
Gold Prices Today : బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు గుడ్ న్యూస్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి.
ఎన్టీఆర్ ‘దేవర’తో సంచలనం సృష్టించిన ప్రముఖ నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్ బ్యానర్ మరో భారీ సినిమాను రూపొందించటానికి సిద్ధమైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ప్రస్తుతానికి యువ సుధ ఆర్ట్ ప్రొడక్షన్ నెం.3 అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించటంతో పాటు సమర్పకుడిగానూ వ్యవరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ కొట్టగా, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి, స్క్రిప్ట్ను అందించారు. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్కు రజత్ దర్శకత్వం వహిస్తున్నారు.
Vaibhav Sooryavanshi’s Impact Role Debate After First IPL 2026 Failure
Young sensation Vaibhav Sooryavanshi has taken IPL 2026 by storm with fearless batting, but his role as an impact player has now become a talking point after his first failure in this season. The 15-year-old player has been used only as a batter in recent matches for the Rajasthan Royals, staying off the field during […] The post Vaibhav Sooryavanshi’s Impact Role Debate After First IPL 2026 Failure appeared first on Telugu360 .
కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశా.. కో ఆప్షన్ పదవి ఇవ్వండి
కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశా.. కో ఆప్షన్ పదవి ఇవ్వండి మోత్కూర్,
Tirumala : తిరుమలకు నేడు వెళుతున్న వారికి హై అలెర్ట్
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది.
ఇంటర్ పరీక్షలలో ఫెయిల్... ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య
హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మరో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత మూడు రోజుల నుంచి13 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎన్.జీ. హంక్రాన్ గ్రామంలో రమేష్(17), నాగల్గిద్ద మండలం కారముంగి గ్రామానికి చెందిన నందిని(17), నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన మణివర్ధన్, సిద్దిపేట జిల్లా రంగనాయకపురం గ్రామానికి చెందిన పొట్ల ప్రత్యూష(17), నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో భూక్యా ఆకాష్(18) అనే విద్యార్థులు బలవన్మరణం చెందారు. సోమవారం హైదరాబాద్ లోని వారసిగూడలో కళ్యాణి(16), మేడ్చల్ జిల్లాలోని నాచారంలో లక్ష్య(16), మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామంలో సాయిరాం(16), ఉట్నూర్ గ్రామంలో సౌజన్య(17), భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో శ్రావణి(17), సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల గ్రామంలో సౌజన్య(17), రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ గ్రామంలో అభియాదవ్ అనే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
గొర్రెలుగా కాదు… సింహాలుగా జీవించండి
గొర్రెలుగా కాదు… సింహాలుగా జీవించండి స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : గొర్రెలుగా కాదు..
Petrol Prices : భారత్ లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగనున్నాయా? ఎప్పటి నుంచి అంటే?
భారత్ లోనూ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలను కొట్టి పారేయలేం
ఎగ్జిక్యూటివ్ మెంబెర్ కు సర్పంచుల సన్మానం
ఎగ్జిక్యూటివ్ మెంబెర్ కు సర్పంచుల సన్మానం టేకుమట్ల, ఆంధ్రప్రభ : టేకుమట్ల మండల
సంగారెడ్డిలో పిఎస్ లో ఎఎస్ఐని ఢీకొట్టిన పోలీస్ వాహనం... హత్యా?
సంగారెడ్డి: పోలీస్ వాహనం ఢీకొని ఎఎస్ఐ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మనూరు పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మనూరు పోలీస్ స్టేషన్ లో గోవింద్ నాయాక్ అనే వ్యక్తి ఎఎస్ఐగా పని చేస్తున్నాడు. పోలీస్ వాహనం అదుపుతప్పి గోవింద్ పైకి దూసుకెళ్లడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోవింద్ దుర్మరణం చెందాడు. పోలీస్ వాహనం డ్రైవర్ రామారావు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలపిారు. నిందితుడి కక్షపూరితంగానే హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్ఫూర్తి ప్రదాత.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
స్ఫూర్తి ప్రదాత.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వైరా, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ
Amravathi : ఊపందుకున్న అమరావతి పనులు.. మరిన్ని నిధులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ఒక కీలకమైన ఆర్థిక ముందడుగు పడింది
చేతన్ నగర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న యోగాజి అనే పేద వ్యక్తికి ఆర్థిక సహయం …డాక్టర్ హకీమ్
జనం సాక్షి.నిజమాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగర్గా ఫారం గ్రామానికి చెందిన ఆదిల్ అన్సార్ చదువులో మంచి ప్రతి ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నిజామాబాద్ లోని …
100%increased |ఎండల ఎఫెక్ట్ తో బీరు అమ్మకాల జోరు లిక్కర్ బేజారు..
100%increased | ఎండల ఎఫెక్ట్ తో బీరు అమ్మకాల జోరు లిక్కర్ బేజారు..
జనసైనికుల ఆత్మీయ సమావేశం చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో
హర్మూజ్ దగ్గరే నిలిచిపోయిన పదిహేను భారతీయ నౌకలు నిలిచిపోయాయి.
ನಾಗರಿಕ ರಕ್ಷಣಾ ಮೆರವಣಿಗೆಯ ವೇಳೆ ನಡೆದ ಘರ್ಷಣೆಯ ವಿಡಿಯೋವನ್ನು ಬಂಗಾಳ ಪೊಲೀಸರು–ಕೇಂದ್ರ ಪಡೆಗಳ ನಡುವೆ ಘರ್ಷಣೆ ಎಂದು ಹಂಚಿಕೆ
Andhra Pradesh : క్వాంటం విప్లవానికి ఆంధ్రప్రదేశ్ పునాది
ఆంధ్రప్రదేశ్ లో నేడు ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది
14thAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
14thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 14thAprilCartoon |మహిళా బిల్లుతో కొత్త
Kavya Maran : కావ్య ఫీలింగ్స్ చూశారా.. ఒక కెమెరా ఆమె పైనే ఉందిగా
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ వికెట్లు టపా టపా పడుతుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి
వివాహేతర సంబంధం... వేధింపులు తట్టుకోలేక జిమట్రైనర్ ఆత్మహత్య
బెంగళూరు: ఓ వివాహిత వేధింపులకు గురి చేయడంతో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు ప్రాంతంలోని నెలమంగలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వాహరహళ్లి ప్రాంతంలో దిలీప్ అనే వ్యక్త జిమ్ ట్రైనర్గా పని చేస్తున్నాడు. ఓ వివాహిత జిమ్లో జాయిన్ కావడంతో ఆమెకు దిలీప్ ట్రైనర్గా ఉన్నాడు. దీంతో ఇద్దరు మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవ స్థానిక పోలీస్ స్టేషన్కు చేరడంతో ఇరువర్గాలకు రాజీ కుదిర్చి పంపించారు. దీంతో ఆమెను దిలీప్ దూరం పెట్టాడు. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు మహిళ సహజీవనం చేయాలని వేధించడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని దిలీప్ తండ్రి రమేశ్ ఆరోపణలు చేశాడు.
జెసి దివాకర్ రెడ్డి చింత తోటకు నిప్పుపెట్టిన దుండగులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని జూటూరు గ్రామంలో మాజీ ఎంపి జెసి దివాకర్ రెడ్డికి చెందిన చింత చెట్ల తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తొట కాపలాదారులు చెప్పిన వివరాల ప్రకారం..... జెసి దివాకర్ 60 ఎకరాలలో చింత చెట్లను పెంచుతున్నారు. బిందు సేద్యం ద్వారా చింత చెట్లకు నీళ్లు పోసి కాపాడుకుంటున్నాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొటకు నిప్పు పెట్టారు. దీంతో 30 ఎకరాలలో చింత చెట్లు కాలిపోవడంతో పాటు బిందు సేద్యం పరికారాలు కాలి బూడిదగా మారాయి. జెసి దివాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదు లక్షల మేరు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. జెసి దివాకర్ రెడ్డి ప్రత్యర్థి వర్గం వారు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
IPL 2026 : రాజస్థాన్ కు తొలి షాక్ ఇచ్చిన హైదరాబాద్.. అద్గదీ దెబ్బంటే?
రాజస్థాన్ రాయల్స్ జట్టును సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుమట్టి కరిపించింది.
America - Iran - War : ఆరు వారాల యుద్ధానికి ముగింపు ఒప్పందానికి సిద్ధం కావాల్సిందే
ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా సైన్యం ఇరాన్ పోర్టులపై దిగ్బంధం ప్రారంభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు
Lebenon - Israel Talks : లెబనాన్ - ఇజ్రాయిల్ చర్చలపై ప్రతిష్టంభన
లెబనాన్కు చెందిన సాయుధ సంస్థ హెజ్బుల్లా నాయకుడు నయీం ఖాసెమ్ సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు
తుని నుండి గుంటూరుకు అక్రమ రవాణా
తుని నుండి గుంటూరుకు అక్రమ రవాణా మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో
మానవ సమాజపు ఆత్మీయబంధమే చాగంటి రామలింగేశ్వరరావు.
మానవ సమాజపు ఆత్మీయబంధమే చాగంటి రామలింగేశ్వరరావు. వీడ్కోలు వేడుకలో కుమార్ చొరవకు పురాణపండ
14thAprilchintana |ధైర్యం, ఆత్మవిశ్వాసం ద్వారా విజయ మార్గం
14thAprilchintana | ధైర్యం, ఆత్మవిశ్వాసం ద్వారా విజయ మార్గం 14thAprilchintana | భయం
14thaprileditorial |ట్రంప్ చర్యలు.. ప్రపంచ ఆందోళనలు
14thaprileditorial | ట్రంప్ చర్యలు.. ప్రపంచ ఆందోళనలు 14thaprileditorial | ఇరాన్పై దాడులు:
14thApril2026 |మంగళవారం నేటి పంచాంగం
14thApril2026 | మంగళవారం నేటి పంచాంగం 14thApril2026 | రోజు విశేషాలు మరియు
డీలిమిటేషన్కు హైబ్రిడ్ ఫార్ములా
మన తెలంగాణ/హైదరాబాద్: హైబ్రిడ్ ప్రాతిపదికన సీట్లు పెంచాలన్నదే తమ డిమాండ్ సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. దేశానికి ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలను గౌరవించాలని ఆయన కోరారు. కొత్తగా వచ్చే 272 సీట్లలో 50 శాతం జీడిపి ప్రాతిపదికగా తీసుకోవాలని, మరో 136 సీట్లను జనాభా ప్రాతిపదికగా పెంచాలని సిఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగేలా గతంలో సీట్ల కేటాయింపు జరిగిందని ఆయన తెలిపారు. మొదటగా మహిళా బిల్లు ఆమోదించి తర్వాతే డీలిమిటేషన్పై చర్చ చేయాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. సచివాలయంలో సిఎం రేవంత్రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అనేవి దేశ ప్రజలకు సంబంధించిన అంశాలని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ, బిజెపి మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహారిస్తోందని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ను కలిపి తీసుకురావడం, పాత జనాభా లెక్కల ప్రకారం వెళ్లడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏ మాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన అన్నారు. సీట్ల పునర్విభజనలో పర్సంటేజీలు కాదు నెంబర్ ముఖ్యమని, రాజకీయాల్లో నెంబర్ ముఖ్యమని, వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయిందని నెంబర్ లేకుండా రాజకీయాల్లో ఎవరూ ఎవరితోనూ చర్చలు చేయరని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. సీట్ల పెంపు తర్వాత దక్షిణాదిలో లోక్సభ సీట్లు 195 అవుతాయని, సీట్ల పెంపు తర్వాత ఉత్తరాదిలో సీట్లు 620కి పెరుగుతాయని, ఉత్తరాది, దక్షిణాది మధ్య ప్రస్తుతం 412 సీట్ల గ్యాప్ ఉందని, అది రానున్న రోజుల్లో 620 సీట్ల గ్యాప్నకు పెరుగుతుందని, అప్పుడు ఉత్తరాదికి 208 సీట్లు అదనంగా వస్తాయని సిఎం రేవంత్ వివరించారు. ప్రస్తుతం 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న యూపికి ఉన్న అంతరం ప్రస్తుతం 60 సీట్లు మాత్రమేనని, కానీ యాభై శాతం పెంచితే ఈ రెండు రాష్ట్రాల మధ్య 90 సీట్ల గ్యాప్ పెరుగుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గింది ఎన్డీఏ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని కీలకశాఖల్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని, దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షను మరింత పెంచేలా బిజెపి వెళుతోందని ఆయన వివర్శించారు. దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి పన్నులు కట్టడం, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలి అన్నట్లుగా ఉందని, పన్నులు కట్టాలి, సలాం కొట్టాలి అనే విధానానికి తాము వ్యతిరేకమని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులు ఉత్తరాది రాష్ట్రాలు దేశానికి రాజకీయ రాజధానులైతే, దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులని ఆయన అభివర్ణించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు. దేశానికి అత్యధిక ఆదాయాన్ని, జీఎస్డిపిని అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం దేశ మనుగడకే ప్రమాదకరమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం వల్ల అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో పెంచాలనుకుంటున్న 273 అదనపు సీట్లలో 50 శాతం జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50 శాతాన్ని ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధిరేటు ఆధారంగా కేటాయించాలని ఆయన ప్రతిపాదించారు. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని ఆయన కోరారు. డీలిమిటేషన్ విషయంలో మాత్రం తొందరపాటు వద్దని సూచించారు. దీనికి 2028 వరకు సమయం ఉన్నందున, హడావిడి చేయకుండా అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలు మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కావాలనే ఈ రెండు అంశాలను కలిపి బిజెపి రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపు రెండూ కీలక అంశాలని ఆయన చెప్పారు. దేశ ప్రజలందరికీ సంబంధించి ఈ రెండూ కీలక అంశాలని ఆయన పేర్కొన్నారు. బిజెపి మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహారిస్తోందని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదని బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందన్నారు. మహిళలకు ఓటు హక్కు సహా సమాన హక్కులను కల్పించింది కాంగ్రెస్ అని సిఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కావాలని, కుట్రపూరితంగా దేశ వ్యాప్తంగా కేంద్రం హడావిడి చేస్తోందని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు 33 శాతం మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పాత జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండింటిని కలిపి 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు చేయా లని కేంద్రం చూస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను చేయాలన్నదే తమ డిమాండ్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. 2026 వరకు సీట్ల పెంపు వద్దని 2001లో వాజ్పేయి ప్రభుత్వం చట్ట సవరణ చేసిందని ఆయన గుర్తు చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, మహిళా రిజర్వేషన్లను ఆర్నెళ్లలోనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మహిళా బిల్లును అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ చేయొద్దని ఆయన కోరారు. ప్రమాదకర దిశలో డీలిమిటేషన్ ప్రమాదకర దిశలో డీలిమిటేషన్ వెళుతోందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న రాష్ట్రాలు, దక్షిణాదికి అన్యాయం చేసే కుట్రను మోడీ చేస్తున్నారని, కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సమర్థంగా అమలు చేశాయని, ఉత్తరాదిలో కుటుంబ నియంత్రణ సరిగా జరగకపోవటంతో జనాభా విపరీతంగా పెరిగిందని ఆయన ఆరోపించారు. జనాభా అంతరం వల్లనే నియోజకవర్గాల పెంపును కేంద్రం గతంలో వాయిదా వేసిందని, జనాభా ప్రాతిపదికన చేస్తే చిన్న రాష్ట్రాలు నష్టపోతాయని ఆయన పేర్కొన్నారు జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు వద్దని దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా చెప్పాయని, దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకత వల్ల మోడీ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారని, ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచుతామని మోడీ చెబుతున్నారని ఆయన తెలిపారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో సీట్లు భారీగా పెరగనున్నాయని, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య లోక్సభ సీట్లలో అంతరం భారీగా పెరుగుతుందని ఆయన తెలిపారు. అన్ని పార్టీలకు, సిఎంలకు లేఖలు రాస్తా డీలిమిటేషన్ అన్యాయంపై అన్ని పార్టీలకు, సిఎంలకు లేఖలు రాస్తామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్తో ముడి పెట్టొద్దని, సీట్లు పెంచాలనుకుంటే అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. ఏ ప్రాతిపదికన 50 శాతం సీట్లు పెంచుతారు?. సీట్లు 50 శాతం పెంచాలని మోడీకి ఏ దేవుడు చెప్పాడు, 50 శాతం సీట్లు పెంచితే ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరం పెరుగుతుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ శాసనసభల్లోనూ చర్చ జరగాలని, డీలిమిటేషన్పై ఒక కమిటీ వేసి ప్రజాసంఘాల అభిప్రాయాలు కూడా సేకరించాలని ఆయన సూచించారు. 2026లో జనగణన పూర్తి చేసి సమగ్ర చర్చ తర్వాత సీట్ల పెంపు చేయాలని, నియోజకవర్గాల పెంపునకు 2028 వరకు గడువు ఉందని, అప్పటివరకు ఎక్స్పర్ట్ కమిటీని వేయాలని, అసెంబ్లీ అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన వివరించారు. వివక్ష వల్ల భవిష్యత్లో ప్రాంతీయ అసమానతలు, ఉద్యమాలకు 1967లో 520గా ఉన్న లోక్సభ స్థానాలను, 1976లో ఇందిరాగాంధీ 542కు పెంచారని సిక్కిం చేరికతో అది 543కు చేరిందని సిఎం రేవంత్రెడ్డి గుర్తు చేశారు. సీట్లు తగ్గడం వల్ల రాజకీయంగా బలహీనవర్గాలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రాల మధ్య గ్యాప్ పెంచేలా కేంద్రం వ్యవహారించవద్దని ఆయన హితవు పలికారు. బిజెపి నేతలు ముఖ్యంగా ఎంపి లక్ష్మణ్ వంటి వారు యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లడం వల్ల ఆ ప్రాంత ప్రమోజనాల కోసం దక్షిణాదికి ద్రోహం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వివక్ష వల్ల భవిష్యత్లో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలకు, ఉద్యమాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు బిజెపి అధ్యక్షురాలిగా ఒక్క మహిళను నియమించలేదు 60 ఏళ్లలో మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. 46 ఏళ్లలో ఒక్క మహిళ ను పార్టీ అధ్యక్షురాలిగా బిజెపి చేయలేదని, కనీసం జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పదవి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. మహిళలను చిన్న చూపు చూడటమే బిజెపి లక్షణమని, ద్వితీయ శ్రేణి పౌరులుగా మహిళలను చూస్తున్నారని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన బిజెపి పార్టీ ఏర్పాటైంది, ఇప్పటి వరకు 15 మంది బిజెపి అధ్యక్షుల నియామకం జరిగింది, కానీ, ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఒక్క మహిళను కూడా నియామించలేదని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో అతి ఎక్కువ కాలం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ మహిళలకు అన్యాయం చేస్తుందా..? బిజెపికి మహిళా నాయకురాలిని అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్ మాట్లాడాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. పునర్విభజనపై పోరాడుతాం బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ్యతిరేకమని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. మా ఎంపిలు తెలంగాణను సాధించారని, ఇప్పుడు పునర్విభజనపై పోరాడుతారని ఆయన తెలిపారు. దక్షణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తామని, పార్లమెంట్ లో బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్దేనని, యాభై శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్రెడ్డి, బండి సంజయ్లు మోడీ ఇంటి ముందు బంట్రోతులుగా నిలబడాల్సి వస్తుందని, వాళ్ల అవసరం ఇక ముందు ఉండదని, అన్ని దక్షణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు దీనిపైన లేఖ రాస్తానని ఆయన తెలిపారు. 2001లో వాజ్పేయి పునర్విభజనపై చట్ట సవరణ 2024 లోక్సభ ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తే 181 మహిళలు లోక్సభకు ఎన్నికయ్యే వారని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. 2001 లో వాజ్ పేయి పునర్విభజనపైన చట్ట సవరణ చేశారని, దాని వల్ల 2009 లో తెలంగాణకు 17 ఎంపి సీట్లు, ఆంధ్రాకు 25 ఎంపి సీట్లు వచ్చాయన్నారు. తెలంగాణకు 119 అసెంబ్లీ సీట్లు, ఎపికి 175 శాసనసభ సీట్లు వచ్చాయన్నారు.
డీలిమిటేషన్పై సిఎంకు అవగాహన లేదు
మన తెలంగాణ/హైదరాబాద్: డీ-లిమిటేషన్పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించగా, డీ-లిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం ఏమిటీ? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. డీలిమిటేషన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన విమర్శలపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులిరువురూ వేర్వేరుగా ధ్వజమెత్తారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై ముఖ్యమంత్రి అపోహలు సృష్టిస్తున్నారని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని, మహిళా రిజర్వేషన్ బిల్లు దేశంలోని మహిళల గౌరవాన్ని పెంచే చారిత్రక నిర్ణయం అని ఆయన తెలిపారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ నిర్ణయాన్ని రాజకీయంగా చూడకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని పెండింగ్లో పెట్టిందని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు దీనిపై రాజకీయాలు చేయకుండా, దేశంలోని 70 కోట్ల మహిళల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పడం సరైంది కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వేర్వేరు అంశాలు కావని, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం డీలిమిటేషన్ అవసరం ఉంటుందని చెప్పారు. దీనికి సమయం పడుతుందని అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కేంద్రం తీసుకుంటుందని ఆయన వివరించారు. అందువల్ల అపోహలు సృష్టించకుండా, ప్రజలకు అసలైన సమాచారం ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సిఎం వాదనలో శాస్త్రీయత లేదు: బండి సంజయ్ డీలిమిటేషన్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న వాదనలో శాస్త్రీయత లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్ విమర్శించారు. అత్యధిక ఆదాయం ఇచ్చిన వాళ్లకు మా త్రమే సీట్లు, ఓట్లు ఇవ్వాలని చెబుతారా? మీరు చెప్పిన ప్రాతిపదిక ప్రకారం, అత్యధిక ఆదాయం ఇస్తున్న హైదరాబాద్కు మాత్రమే అత్యధిక సీట్లు, ఓట్లు ఇవ్వాలా? అని ఆయన ప్రశ్నించారు. మీరు పుట్టి పెరిగిన పాలమూరుకు, వెనుకబడిన ఆదిలాబాద్, ఇతర జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరమే లేదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్కు మూటలు పంపి డబ్బు ప్రాతిపదికనే సిద్దాంతాలు రచిస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతం ఇదేనా?, ఆర్ధికంగా బలంగా ఉన్న వాళ్లకు సగం, జనాభా ప్రాతిపదికన మిగిలిన ప్రజలకు సగం సీట్లు ఇవ్వాలని చెబుతారా? అని ఆయన ప్రశ్నించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బతికి ఉంటే కాంగ్రెస్ను దేశం నుంచి బహిష్కరించాలని రాజ్యాంగంలో పొందుపరిచే వారన్నారు. నేను రేవంత్రెడ్డిలా అవకాశవాదిని కాదు తాను ఉత్తర భారత దేశానికి వలస వెళతానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. వలసపోవడానికి తాను అవకాశవాదిని కాదని, రేవంత్రెడ్డిని అంతకంటే కాదని ఆయన విమర్శించారు. తాను చచ్చినా బతికినా బిజెపిలోనే ఉంటానని ఆయన తెలిపారు. తాను చనిపోతే తన శవంపై కప్పేది కాషాయ జెం డానే అని ఆయన తెలిపారు. ఆ సన్నివేశం చూడడానికైనా రేవంత్రెడ్డి నిండు నూరేళ్లు బతికి ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. తాను చచ్చినా, బతికినా, ఓడినా, గెలిచినా కేరాఫ్ అడ్రస్ కరీంనగరేనని ఆయన చెప్పారు. తన రక్తంలోనే జాతీయవాదమనే డీఎన్ఏ ఉందన్నారు. వలసవాది, అవకాశవాదానికి ప్రతిరూపం రేవంత్రెడ్డి అని ఆయన విమర్శించారు. పాలమూరు నుంచి మల్కాజ్గిరి దాకా వలస పోయిం ది రేవంత్రెడ్డేనని ఆయన ధ్వజమెత్తారు. మహిళా బిల్లును వ్య తిరేకించే మీరు కూడా తమను విమర్శిస్తారా? అని ఆయన ప్ర శ్నించారు. మీరు నిజంగా మహిళా రిజర్వేషన్లకు సానుకూలమైతే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు అమలు చేయలేద ని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో దాదాపు 30 ఏళ్లకుపైగా కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ ఉన్నా మహిళా రిజర్వేషన్లను ఎం దుకు అమలు చేయలేదని కేంద్ర మంత్రి బండి ప్రశ్నించారు.
మహిళా బిల్లుతో సరికొత్త చరిత్ర
సరికొత్త చరిత్రను సృష్టించేందుకు అతి చేరువలో భారత్ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 21వ శతాబ్దంలో అత్యంత కీలకమైన నిర్ణయాలలో ఒకదానిని తీసుకోబోతోందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఉద్దేశించి సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2029 నాటికి దీన్ని అమలు చేసేందుకు అవసరమైన సవరణలను ఆమోదించడానికి పార్లమెంట్ సమావేశం కానున్న నేపథ్యంలో, దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందుగా మహిళా చట్టాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, ‘నారీ శక్తి వందన్ అధినియం’ సవరణలు గత స్వప్నాలను సాకారం చేయడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలను నెరవేర్చుతాయని అన్నారు. పాలనలో మహిళల పాత్రను ప్రశంసిస్తూ, మరింత పెద్ద బాధ్యతలు చేపట్టేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. మన దేశ పార్లమెంట్ కొత్త చరిత్రను సృష్టించే దశలో ఉంది. ఇది గత ఆశయాలను నిజం చేస్తూ, భవిష్యత్ సంకల్పాలను నెరవేర్చే చరిత్ర అవుతుంది. సమానత్వం, సామాజిక న్యాయం మన కార్యసంసృ్కతిలో భాగమయ్యే భారతదేశ నిర్మాణానికి ఇది దారి చూపుతుంది. భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యావశ్యకం. సుదీర్ఘ కాలం తర్వాత ఈ బిల్లు వస్తోంది. ప్రతి పార్టీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. 2029లోగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి. ఈ నిర్ణయం మహిళా శక్తి, గౌరవానికి అంకితం. సమానత్వంతో కూడిన భారతదేశానికి ఇదో తీర్మానం. ఇక్కడ సామాజిక న్యాయం నినాదానికే పరిమితం కాదు. అది మన పని సంసృ్కతిలో ఒక భాగం. రాష్ట్ర శాసనసభల నుంచి దేశ పార్లమెంట్ వరకు దశాబ్దాల నిరీక్షణకు తెరదించే సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఏప్రిల్ 16, 17, 18 అని మోదీ పేర్కొన్నారు. 2023లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని, ముఖ్యంగా ప్రతిపక్షం 2029 నాటికి అమలు చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలు నుంచి పార్లమెంట్ వరకు మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ సవరణలు అవసరమని చెప్పారు. 2023 సెప్టెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ ప్రకారం లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడో వంతు సీట్ల రిజర్వేషన్ కల్పించారు. అయితే జనగణన అనంతరం జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు అనుసంధానించబడిన కారణంగా, ఈ చట్టం అమలు 2034 వరకు ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిని ముందుకు తెచ్చి 2029 లోక్సభ ఎన్నికల నుంచే అమలు చేయడానికి సవరణలు తీసుకువస్తున్నారు. ఈ సవరణలు అమలులోకి వస్తే లోక్సభ సీట్ల సంఖ్య 816కి పెరిగి, అందులో 273 సీట్లు మహిళలకు కేటాయిస్తారు. మహిళా భాగస్వామ్యం పెరగడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియను చర్చ, సహకారం, భాగస్వామ్యంతో పూర్తి చేయాలని ఆయన ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా మహిళల్లో ఈ అంశంపై ఉత్సాహం పెరుగుతోందని, శాసనసభలు, లోక్సభకు చేరాలన్న ఆశయాలు వ్యక్తమవుతున్నాయని మోదీ అన్నారు. ఈ ప్రక్రియలో మహిళలు చురుకుగా పాల్గొని తమ అభిప్రాయాలను ఎంపీలకు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళల పాత్ర స్వాతంత్య్ర పోరాటం నుంచి రాజ్యాంగ నిర్మాణం వరకు మహిళల పాత్రను గుర్తుచేసిన ప్రధాని, అవకాశాలు లభించిన ప్రతిసారి మహిళలు దేశానికి విశేష సేవలు అందించారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రపతి నుంచి ఆర్థిక మంత్రివరకు కీలక పదవుల్లో మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలను మహిళల నాయకత్వానికి ఉత్తమ ఉదాహరణగా చూపుతూ, ప్రస్తుతం 14 లక్షలకుపైగా మహిళలు స్థానిక సంస్థల్లో సేవలందిస్తున్నారని తెలిపారు. సుమారు 21 రాష్ట్రాల్లో మహిళల భాగస్వామ్యం 50 శాతం వరకు చేరుకుందని చెప్పారు. మహిళల నిర్ణయాధికారంలో పెరుగుదల వల్ల నీరు, విద్య, ఆరోగ్యం, పోషణ వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధ్యమయ్యాయని, ‘జల్ జీవన్ మిషన్’ విజయానికి కూడా మహిళా పాత్ర కీలకమని మోదీ వివరించారు. స్థానిక సంస్థల్లో అనుభవం సంపాదించిన లక్షలాది మహిళలు ఇప్పుడు పెద్ద బాధ్యతలకు సిద్ధంగా ఉన్నారని, ఈ చట్టం అమలు వారి జీవితాల్లో గొప్ప అవకాశంగా మారుతుందని ఆయన అన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల ప్రయాణం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. అవకాశాలు కల్పించాలి.. దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తె ఆశయాలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, వాటి సాధనకు అన్ని చర్యలు తీసుకుంటుందని మోదీ భరోసా ఇచ్చారు. మహిళలు కష్టపడి, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారని, వారికి మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. వికసిత భారతదేశ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొంటూ, 2014 నుంచి మహిళల జీవన చక్రంలోని ప్రతి దశను దృష్టిలో ఉంచుకుని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. బాలికల రక్షణ, విద్య కోసం ‘బేటీ బచావో- బేటీ పడావో’, గర్భిణీల పోషణ కోసం ‘మాత్రు వందన్ యోజన’, బాలికల భవిష్యత్తు కోసం ‘సుకన్య సమృద్ధి యోజన’ వంటి పథకాలను ఉదాహరణగా పేర్కొన్నారు. గతంలో ఇళ్లు పురుషుల పేర్ల మీదే ఉండేవి. భూమి, దుకాణం, కారు.. ఇలా ఏది చూసుకున్నా మగవాళ్ల పేరు మీదే ఉండేవి. అదంతా సహజమనే భావన ఉండేది. అందుకే మేం పీఎం ఆవాస్ యోజన తీసుకొచ్చాం. దాని కింద మహిళ పేరు మీదే ఇళ్ల రిజిస్ట్రేషన్కు మేం ప్రాధాన్యం ఇచ్చాం అని అన్నారు. ఇలా మహిళా సాధికారత కోసం తీసుకువచ్చిన పథకాల గురించి ప్రస్తావించారు. తాను కుటుంబ జీవితాన్ని జీవించకపోయినా.. ఆ వ్యవహారాలపై అవగాహన ఉందని ప్రధాని సరదాగా వ్యాఖ్యానించారు.
మన తెలంగాణ/బాన్సువాడ: కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రగిలిపోతున్నారు. ఆయన తన నియోజకవర్గంలో జరుగుతున్న పనులకు నిధుల మంజూరు చేసే విషయంలో లోలోపల మదన పడుతున్నారు. ఆదివారం బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం సిద్ధాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిని పరిశీలించడానికి ఆయన ప్రాజెక్టు సైట్కి వెళ్లారు. పనుల్లో పురోగతి లేకపోవడంతో తీరా అసహనానికి గురయ్యారు. ఈ వయసులో తాను నిధులు మంజూరు చేయాలని ‘కాళ్లు మొక్కాల’ అని, టీఆర్ఎస్ హయాంలో కూర్చుంటే జీవోలు వచ్చాయని, సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద ప్రభుత్వ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మధ్యాహం నుంచి రాత్రి 10 గంటల వరకు బైటాయించారు. మంత్రుల మీద హాట్ కామెంట్స్ చేశారు. బిల్లుల కోసం మంత్రులకు ఫోన్లు చేసినా లేపడం లేదని, సీఎంకు 20 సార్లు ఫోన్చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక పనులు ఆగిపోతున్నాయని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఇప్పటివరకు నేనెప్పుడూ చూడలేదన్నారు. తన పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటోనని ప్రశ్నించారు. పైస్థాయి అధికారులు పోచారంను రెండు రోజులు వేచిచూద్దామని రిక్వెస్ట్ చేయడంతో పోచారం ఇంటికి వెళ్లారు.
రేపటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ - తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం(ఏప్రిల్ 15) నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ వి.బాలకిష్టారెడ్డి దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్లు ఇ.పురుషోత్తం, ఎస్కె మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, డిగ్రీ ప్రవేశాలకు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. మొదటి విడత దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి మే 7 వరకు కొనసాగుతుందని అన్నారు. మొదటి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మే 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. మే 14న తొలి విడత డిగ్రీ సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈసారి డిగ్రీలో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. మారుతున్న పరిశ్రమ అవసరాలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త కోర్సులను రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. కొత్త కోర్సుల ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 30 నాటికి దోస్త్ వెబ్సైట్లో పొందుపరుస్తామని, విద్యార్థులు కొత్త కోర్సులకు కూడా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మూడు విడతల్లో దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రూ400 రిజిస్ట్రేషన్ ఫీజుతో మే 15 నుంచి రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే మే 31 నుంచి మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి జూన్ 27 వరకు నేరుగా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. జూన్ 29, 30 తేదీలలో డిగ్రీ ఓరియెంటేషన్ తరగతులు ఉంటాయని, జులై 1 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో దోస్త్ పరిధిలో 969 డిగ్రీ కాలేజీల్లో 4,40,107 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.గత ఏడాది 2,05,140 సీట్లు భర్తీ కాగా, 54 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయనని చెప్పారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జెఎన్టియుహెచ్, తెలంగాణ మహిళా యూనివర్సిటీ, జెఎన్టియుహెచ్, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే డిగ్రీ చేరాలనుకునే అభ్యర్థులకు దోస్త్ సింగిల్ విండోలాంటిది అని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గతంలో దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న సమయంలో ఏదైనా అంతరాయం ఏర్పడితే మళ్లీ మొదటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవలసి వచ్చేదని అన్నారు. ఈసారి ఆ సమస్య తలెత్తకుండా ట్యాబ్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఏదైనా కారణంతో రిజిస్ట్రేషన్ మధ్యలో అంతరాయం ఏర్పడినా ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇదీ దోస్త్ షెడ్యూల్ ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు రూ.200 ఫీజుతో మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు -ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం మే 14వ తేదీన మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు మే 15 నుంచి 25 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్కు అవకాశం మే 15 నుంచి 25 వరకు రూ.400 ఫీజుతో రెండవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు మే 15 నుంచి 26 వరకు రెండవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం మే 30వ తేదీన రెండవ విడత డిగ్రీ సీట్ల కేటాయింపు మే 31 నుంచి జూన్ 5 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్కు అవకాశం మే 31 నుంచి జూన్ 16 వరకు మూడవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు మే 31 నుంచి జూన్ 26 వరకు మూడవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం జూన్ 16వ తేదీన మూడవ విడత సీట్ల కేటాయింపు జూన్ 20 నుంచి 25 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్కు అవకాశం జూన్ 20 నుంచి 27 వరకు మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు నేరుగా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి -జూన్ 29,30 తేదీలలో విద్యార్థులకు కళాశాలల్లో ఒరియెంటేషన్ ఉంటుంది. జులై 1 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభం వాట్సాప్లో దోస్త్ సేవలు దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200 ద్వారా వాట్సాప్ చాట్బాట్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు ఈ వాట్సాప్ నెంబర్కు ‘Hi’ అని టైప్ చేసి పంపిస్తే దోస్త్ మెను వస్తుంది. అందులో విద్యార్థులు తమ ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులు కోరితే వారి వాట్సాప్ నెంబర్కు ఒటిపి, ఇతర అలర్ట్ కూడా వస్తాయి. వీటితోపాటు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. దోస్త్ ఫేస్బుక్ పేజీ: facebook.com/dost.telangana దోస్త్ యూట్యూబ్ చానల్ : http://youtube.com/c/dost.telangana దోస్త్ ట్విట్టర్ ఖాతా : twitter.com/dost. telangana దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200 హెల్ప్ లైన్ నెంబర్ : 040 23120416 ...........................................................................................
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ఆర్టిసి) కార్మిక సంఘాలు ప్రేరేపిత సమ్మెకు వెళ్లవద్దని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాల కు విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసి ఇ ప్పుడిప్పుడే గాడిలో పడుతున్న పరిస్థితుల్లో ఇ బ్బందులకు గురి చేయవద్దని కోరారు. పెం డింగ్ డీఏ ను ఇప్పటికే విడుదల చేశామని, పీఆర్సీపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ అంశంపై కమిటీ వేశామని, ప్రస్తుతం కమిటీ వద్ద ఈ రెండు అంశాలు పరిశీలనలో ఉన్నాయని అన్నారు. ఈ రెం డు ప్రధాన సమస్యలు మినహా మిగతా అం శాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సిబ్బందికి సంబంధించిన ఏ సమస్యలైనా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నగరంలోని ఖైరతాబాద్ రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాల గోడపత్రికను మంత్రి పొన్నం సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్ర త్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వికాస్ రా జ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, టిజిఎస్ఆర్టిసి ఎండి నాగిరెడ్డి, రవాణా శాఖ జెటిసిలు చంద్రశేఖర్ గౌడ్, రమేష్, శివ లిం గయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలని, తొందర పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తీసుకున్న సమ్మె ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. 13 నుంచి 18 వరకు రోడ్డు భద్రతపై అవగాహన ఈ నెల 13 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తం గా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ల క్ష్యంతో పోలీస్, రవాణా శాఖలు కలిసి అరైవ్-అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తె లిపారు. రవాణా నిబంధనలు, రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలపై చర్చించి, వా టిని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, రోడ్డు ప్ర మాదాలను తగ్గించే చర్యలు మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మంగళవారం రాశి ఫలాలు (14-04-2026)
మేషం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృషభం నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉన్నది. మిధునం వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని విషయాలలో మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన ఋణయత్నాలు చెయ్యకపోవడం మంచిది. కర్కాటకం కుటుంబ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. సింహం వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కన్య కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన విజయం సాధిస్తారు. వృత్తి,ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తుల చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృశ్చికం సంతాన విద్యా విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ధనస్సు శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది. మకరం ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. కుంభం చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. మీనం ఆర్ధిక విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వలన శిరో బాధలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్లో వరుస విజయాలతోదూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. సోమవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో రాజస్థాన్ను చిత్తు చేసింది. ఈ సీజన్లో సన్రైజర్స్కు ఇది రెండో విజయం కాగా, రాజస్థాన్ తొలి ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (18)లు విఫలమయ్యారు. అయితే కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన ఇషాన్ 44 బంతుల్లోనే 6 సిక్స్లు, 8 ఫోర్లతో 91 ప రుగులు చేశాడు. క్లాసెన్ (40), నితీశ్ కుమా ర్ రెడ్డి (28), సలీల్ అరోరా 24 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. ప్రఫుల్, సాకిబ్ నాలుగేసి వికెట్లను పడగొట్టారు.
కెసిఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు
అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లీగల్ నోటీసు పంపించారు. మంత్రి తరఫున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఈ నోటీసు పంపించారు. నోటీసులో అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టిజిటిఎస్) నిర్వహించిందని, టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇందులో తన ప్రమేయం లేదని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొత్తం టెండర్ విలువ రూ.44.42 కోట్లే ఉన్నప్పటికీ, అందులో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం అసంబద్ధమని, ఇది పూర్తిగా ఆధారాలు లేని ఆరోపణ అని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో మొబైల్ ఫోన్ను రూ.11,650కే కొనుగోలు చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరకు టీజీటీఎస్ ద్వారా కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనల మేరకే టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని మంత్రి వివరించారు. దుష్ప్రచారానికి పార్టీ అధినేతగా కేసీఆరే బాధ్యత వహించాలి బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న దుష్ప్రచారానికి పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఈ మేరకు 48 గంటల్లో సోషల్ మీడియా పోస్టులను తొలగించి, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీసులో హెచ్చరించారు. ప్రజా భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క, అంగన్వాడి మొబైల్ కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. వ్యక్తిగతంగా ఎవరైనా ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కానీ అవాస్తవాలను పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేయడం వల్లే ఆ పార్టీ అధినేత కేసీఆర్కు లీగల్ నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు తాను కెసిఆర్కు లీగల్ నోటీసు పంపించినట్టు గుర్తుచేశారు. తప్పును పదిసార్లు చెబితే నిజం కాదని అన్నారు. రూ.44 కోట్ల టెండర్లో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం హాస్యాస్పదమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడినప్పుడు తాను గట్టిగా సమాధానం ఇచ్చిన తరువాత తనపై దుష్ప్రచారం ప్రారంభమైందని మంత్రి సీతక్క గుర్తు చేశారు.
మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది: బిజెపి ఎంపీ లక్ష్మణ్
మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉం దని బిజెపి ఒబిసి మోర్చా అధ్యక్షుడు, రాజ్యస భ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. మహిళా బిల్లుపై కాంగ్రెస్ దొంగ నీతికి పాల్పడుతున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ఎస్సి, ఎస్టిల రాజకీయ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతోందని ఆయన విమర్శించారు. నారీ శక్తి వందన్ అధినియంపై సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) అమలు విషయంలో సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని తీవ్రం గా విమర్శించారు. రాజకీ య లబ్ధి కోసమే ఈ చారిత్రాత్మక బిల్లును కాంగ్రెస్ అడ్డుకునే ప్రయ త్నం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.గత 30 ఏళ్లు గా ఏదో ఒక సాకుతో మహిళా బిల్లు ను కాంగ్రె స్ అడ్డుపడుతున్నదని ఆయన గుర్తు చేశారు. యూపీఏ హయాంలో సోనియా గాం ధీ మహి ళా చైర్ పర్సన్ గా ఉన్నప్పటికీ, కూ టమి పార్టీల పేరు చెప్పి వెనక్కి తగ్గారే తప్ప, మ హిళా సాధికారతపై, రిజర్వేషన్ల అమలుపై వారికి ఎప్పుడూ చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు.
ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోని నక్సల్ ప్రభావిత కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు సోమవారం నిర్వహించిన ఎన్కౌంటర్లో పార్థాపూర్ ఏరియా కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావో నేత రూపి అలియాస్ రంగబోయిన భాగ్య ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ఆమెపై గతంలో రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ ఎన్కౌంటర్లో మరణించిన రూపి, 2025 ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత విజయ్ రెడ్డి . ఎన్కౌంటర్ తరువాత సంఘటన స్థలం నుంచి ఒక ఆటోమేటిక్ తుపాకీతోపాటు విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాఖేచా వెల్లడించారు. కాల్పుల తరువాత మరో 10 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. వారి కోసం మాచ్పల్లి అడవుల్లో గాలింపు ముమ్మరం చేశారు. ఈ ఎన్కౌంటర్పై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ స్పందిస్తూ అడవుల్లో ఉన్న మావోయిస్టులకు సమయం చాలా తక్కువగా ఉందని, ఇప్పటికైనా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతి లోకి రావాలని హెచ్చరించారు. హతమైన రూపి స్వస్థలం తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంగా గుర్తించారు. ఆమె వయసు 46 సంవత్సరాలు. 2004లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆమె తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. ఆ తరువాత అబూజ్మడ్ వంటి కఠినమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. తాజా సంఘటనతో ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఇంతవరకు 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. గత ఏడాది రాష్ట్రంలో 285 మంది మావోయిస్టులు హతమయ్యారు.
హైదరాబాద్ పాత నగరంలోని చంచల్గూడ జైలుకు ఎదురుగా ఉన్న శ్మశానవాటికలో 18 ఏళ్ల యువకుడు హత్య కు గురైనట్లు సోమవారం ఆరోపణలు వచ్చాయి. గుడి బావడి ప్రాంతానికి చెందిన బాధితుడు షేక్ జాహిద్ సాయంత్రం 5 గంటల ప్రాంతం లో హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత నిందితుడు సుల్తాన్ దైరా శ్మశానవాటిక నుండి పారిపోయినట్లు సమాచారం. ఈ గొడవను గమనించిన స్థాని కులు వెంటనే అధికారులకు తెలియజేశారు.తదనంతరం మదన్నపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఘటనల క్రమాన్ని తెలుసుకు నేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి. ఆంజనేయులు హత్యను ధృవీకరించారు, కానీ దర్యాప్తు కొనసాగుతున్నం దున మరిన్ని వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. హత్య వెనుక కారణం ఇంకా తెలియరాలేదు.
అది రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ
మహిళా రిజర్వేషన్ బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజనే అత్యంత ముఖ్యమైన అంశమని కాంగ్రెస్ అగ్రనత, ఆ పార్టీ పార్లమెంటరీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డిలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత ప్రమాదకరమైనది మాత్రమే కాకుండా, రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. అంతేకాక ఎన్నికల సమయంలో ‘నారీ శక్తి వందనం అధినియమ్’ సవరణ బిల్లును తీసుకురావడం పైనా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుల అసలు ఉద్దేశ్యం మహిళల రిజర్వేషన్ కాదని, డిలిమిటేషన్ అంశమే ప్రధానమని సోనియా గాంధీ పేర్కొన్నారు. లోక్సభ సభ్యుల సంఖ్య పెంపుతో కూడిన డిలిమిటేషన్ రాజకీయంగా సమానత్వంతో ఉండాలని, కేవలం గణితపరమైన లెక్కలతో మాత్రమే నిర్ణయించకూడదని ఆమె స్పష్టం చేశారు. “రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై కేంద్రం తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ ప్రతిపాదన గురించి ప్రతిపక్షం ఒకసారి కాదు, ఇప్పటికే మూడుసార్లు కేంద్రానికి లేఖ రాసింది. అయినా అందరికీ ఉపయోగపడే ఈ అభ్యర్థనను ప్రధాని తిరస్కరించారు. దీనికి బదులుగా ప్రధానమంత్రి సంపాదకీయాల రాయడం, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తులు చేయడం, ఇతర సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ‘నా మాటే నెగ్గాలి’ అన్నట్లుగా ప్రధానమంత్రి వ్యవహరించడం విచారకరం. రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల వేళ ఈ అంశాలపై కేంద్రం పార్లమెంటులో చర్చ చేపట్టాలని చూస్తోంది అంటూ సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఉదృ్ధతంగా జరుగుతున్న సమయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ లాభం పొందడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆమె అన్నారు. ప్రతిపక్షాన్ని రక్షణాత్మక స్థితిలోకి నెట్టడానికే ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, సోనియా గాంధీ వ్యాసాన్ని ఉటంకిస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ కూడా స్పందించారు. మహిళల రిజర్వేషన్ ప్రక్రియలో తొందరపాటు డిలిమిటేషన్ వల్ల అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.2023లో ఆమోదించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ ప్రకారం, మహిళల రిజర్వేషన్ అమలు తదుపరి జనగణన, డిలిమిటేషన్ పూర్తైన తర్వాతే అమలులోకి రావాల్సి ఉందని సోనియా గాంధీ గుర్తుచేశారు. అయితే ప్రతిపక్షం ఈ షరతును కోరలేదని, వెంటనే అమలు చేయాలని అప్పట్లో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారని తెలిపారు. ఇప్పుడేమో 2029 నుంచే మహిళల రిజర్వేషన్ అమలు చేయాలనే సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని, అయితే ఈ నిర్ణయానికి 30 నెలలు ఎందుకు పట్టిందని ఆమె ప్రశ్నించారు. కొన్ని వారాలు వేచి అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేయడంలో ఏమి ఇబ్బంది ఉందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల చివరి దశ (ఏప్రిల్ 29) అనంతరం అన్ని పార్టీల సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షం మూడుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ప్రభుత్వం తిరస్కరించిందని ఆమె తెలిపారు. బదులుగా వ్యాసాలు రాయడం, సమావేశాలు నిర్వహించడం ద్వారా ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. మహిళల రిజర్వేషన్ చట్టం 73వ, 74వ రాజ్యాంగ సవరణల ఆధారంగా ఏర్పడినదని, వాటి ద్వారా పంచాయతీలు, నగర పాలక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించారని ఆమె గుర్తుచేశారు. 2021లో జరగాల్సిన జనగణనను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల, జాతీయ ఆహార భద్రత చట్టం కింద సుమారు 10 కోట్ల మంది ప్రయోజనాల నుంచి దూరమయ్యారని సోనియా గాంధీ ఆరోపించారు. ఐదేళ్ల ఆలస్యానంతరం మాత్రమే జనగణన ప్రక్రియ ప్రారంభమవుతోందని ఆమె తెలిపారు.
పశ్చిమాసియా యుద్ధం మరో మలుపు తిరిగింది. అమెరికా అన్నంత పని చేస్తోంది. ఇరాన్కు చెందిన హర్మూజ్ జలసంధితో పాటు అన్ని రేవులను దిగ్బంధం చేస్తామని హెచ్చరించినట్లుగానే సోమవారంనాడు ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇరాన్ పోర్టుల వైపు వచ్చి, వెళ్తున్న నౌకలను అడ్డుకోవడం ప్రారంభించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7గంటలకు అమెరికా వివిధ దేశాల నౌకలను దిగ్బంధించడం మొదలుపెట్టింది. ఇరాన్ పోర్టుల్లోకి వచ్చి వెళ్లే అన్ని దేశాల నౌకలను అమెరికా నావికాదళం అడ్డుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పాకిస్థాన్లో శాంతి చర్చల విఫలం తరువాత ప్రెసిడెంట్ ట్రంప్ హర్మూజ్ దిగ్బంధం తప్పదని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు అమెరికా నౌకాదళాలు చర్యకు దిగాయి. ఈ చర్యపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ సైన్యం పర్షియన్ గల్ఫ్ పోర్టులను దిగ్బంధిస్తుందని హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు బెదిరింపులు కుదరవని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ (ఐఆర్జిసి ) ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ గల్ఫ్ వెంబడి భద్రత అనేది అందరికీ వర్తించేది లేదా ఎవరికి భద్రత ఉండకూడదని స్పష్టం చేశారు. హర్మూజ్పై నౌకల రాకపోకల భద్రతను తాము పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇప్పుడు ఇరాన్ రేవులు, తీర ప్రాంతాల బ్లాకేడ్కు రంగం సిద్ధం అయింది. ఇరాన్ నౌకలు ఏవీ అంగుళం కూడా కదలలేవని యుఎస్ దళాలు స్పష్ట చేశాయి. దీనికి ప్రతిగా ఇరాన్ తీవ్రస్థాయిలో స్పందించింది. వేరే శక్తులు హర్మూజ్కు చేరినా, రేవులను దిగ్బంధించినా మాడిపోవడం తథ్యం అని హెచ్చరించారు. . ఇరాన్ రేవులకు ఏ దేశం నౌకలు రాకుండా చేస్తాం. అక్కడి నుంచి కదలకుండా చేస్తామని , ఈ విషయంలో ఎటువంటి పక్షపాతం ఉండదని వ్యాఖ్యానించారు. అమెరికా బ్లాకేడ్ హెచ్చరికతో రెండు రోజులుగా హర్మూజ్ మీదుగా ఇంతకు ముందటి వరకూ కనీసం పరిమితంగా అయినా తిరిగిన నౌకలు కూడా కదలలేని పరిస్థితి తలెత్తింది . యుద్ధం ముందు హర్మూజ్ మీదుగా రోజుకు కనీసం 100 నుంచి 135 వరకూ వాణిజ్య నౌకలు తిరిగేవి. కాగా కాల్పుల విరమణ తరువాత రెండు మూడు రోజులు ఈ మార్గం మీదుగా 40 నౌకలు ప్రయాణించాయని మెరైన్ విశ్లేషక సంస్థ లాయడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ తెలిపింది. మరోవైపు ఈ దిగ్బంధనం సెగ భారత్ను కూడా తాకింది. హర్మూజ్ జలసంధి మీదుగా రావాల్సిన 15 భారత నౌకలు చిక్కుకుపోయినట్లు సమాచారం. వీటిలో అధికంగా ఎల్పిజి, ముడి చమురు ట్యాంకర్లు ఉన్నాయి. అమెరికా బ్లాకేడ్ను తాము సమ్మతించడం లేదని, ఇరాన్ రేవుల దిగ్బంధ చర్యల్లో తాము పాల్గొనేది లేదని బ్రిటన్ తెలిపింది. ఈ మేరకు దేశ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం ప్రకటన వెలువరించారు. హర్మూజ్లో సీ మైన్స్ తీసివేతకు బ్రిటన్ సహకరిస్తుందనే ట్రంప్ వాదనపై స్టార్మర్ స్పందించారు. ఈ విషయంలో తమ దేశం సహకరించవచ్చు. అయితే ముందుగా పోరు పూర్తిగా నిలిచిపోవల్సి ఉందని స్పష్టం చేశారు.

37 C