SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

20    C
... ...View News by News Source

‘పదహారు రోజుల పండగ’ ప్రారంభం..

వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం ’పదహారు రోజుల పండగ’. సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం-1గా సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. కోన వెంకట్, కేకే రాధా మోహన్ నిర్మాతలకి స్క్రిప్ట్ అందించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల క్లాప్ కొట్టారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్‌కు డి.సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి రవి, దామోదర ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై టీంకి అభినందనలు తెలిపారు. ఈ వేడుకలో సాయి రణ్ అడివి మాట్లాడుతూ.. “పదహారు రోజుల పండగ టైటిల్‌ని సూచించింది కృష్ణ వంశీ. ఆయనకి కథ విపరీతంగా నచ్చి ఈ టైటిల్ పెట్టమని చెప్పారు”అని అన్నారు. హీరో సాయి కృష్ణ మాట్లాడుతూ.. సాయి కిరణ్ దర్శకత్వంలో ఇంత మంచి కథతో తన మొదటి సినిమా చేయడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ వేడుకలో రేణు దేశాయ్, గోపిక ఉదయన్, అనసూయ భరద్వాజ్, రామ్, లక్ష్మణ్ మాస్టర్లు, జానీ మాస్టర్, సురేష్ కుమార్, కళ్యాణి సునీల్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 26 Nov 2025 10:20 pm

దుర్గాదేవి ఆలయానికి భూమి పూజ..

ములుగు, (సిద్దిపేట జిల్లా) ఆంధ్రప్రభ : దేవుడి దయతో రాష్ట్ర ప్రజలు సుఖ

ప్రభ న్యూస్ 26 Nov 2025 10:17 pm

హైదరాబాద్ చెన్నై మధ్య బుల్లెట్ రైలు

హైదరాబాద్, చెన్నై ప్రజల బుల్లెట్ రైలు కల త్వరలో సాకారం కానుంది. ఇంటర్ సిటీ ప్రయాణాన్ని పునర్నిర్మించే ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు మార్గానికి దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలో చేర్చేందుకు తుది అలైన్‌మెంట్ సమర్పించింది. హైస్పీడ్ మార్గం కారిడార్‌కు సమగ్ర ప్రాజెక్టు నివేదికపై రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించిన తరువాత నెలలోపు ఖరారు చేస్తామని సీయూఎంటీఏ (చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ) సభ్య కార్యదర్శి ఐ.జయకుమార్ తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు గతంలో గూడూరు మీదుగా ప్రణాళిక రూపొందించిన స్థానంలో తిరుపతిలో స్టేషన్‌ను చేర్చడానికి మార్పులు చేశామని ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్-చెన్నై మధ్య ప్రయాణం 12 గంటలు సమయం పడుతోంది. నూతనంగా డిజైన్ చేసిన మార్గంతో వేగం పెరిగి 2.20 గంటల టైం తగ్గనుంది. కొత్త మార్గంలో రాష్ట్ర పరిధిలో చెన్నై సెంట్రల్, మీంజూరు సమీపంలోని చెన్నై రింగు రోడ్డులో నూతన స్టేషన్‌తో కలిపి 2 స్టేషన్లు ఉంటాయి. మొబిలిటీ, వాణిజ్య హబ్‌లు అందుబాటులోకి తేవడానికి రవాణా ఆధారిత అభివృద్ధి కోసం రైల్వేశాఖ ప్రతిస్టేషన్ చుట్టూ సుమారు 50 ఎకరాల స్థలాన్ని కోరింది. ఇటీవల రవాణాశాఖకు రాసిన లేఖలో దక్షిణ మధ్య రైల్వే అలైన్‌మెంట్, స్టేషన్‌కు స్థలాలు త్వరగా ఖరారు చేయాలని, భూమిని సేకరించేందుకు సూత్రప్రాయ ఆమోదం పొందాలని, రాష్ట్రంలో దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్‌లో రైలు కారిడార్‌ను కూడా చేర్చాలని కోరింది. రాష్ట్రంలోని హైస్పీడ్ నెట్‌వర్క్ నిర్మాణంలో 12 కి.మీ వరకు సొరంగ మార్గం ఉండనుంది. స్థల సేకరణపై జాప్యాన్ని నివారించేందుకు రైల్వేశాఖలు రాష్ట్ర అధికారులతో కలిసి ఉమ్మడిగా క్షేత్ర సందర్శనలకు అభ్యర్థించారు. దక్షిణాదిన ప్రణాళికలో ఉన్న 2 హైస్పీడ్ మార్గాలలో ఒకటి చెన్నై-హైదరాబాద్, రెండోది హైదరాబాద్- బెంగళూరు కారిడార్. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు నగరాలను కలిపేలా సర్వే జరుగుతోందని ఇటీవల విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో 61 కి.మీ విస్తీర్ణంలో 2 ప్రధాన స్టేషన్ల ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వ కన్సల్టెన్సీ సంస్థ ’రైట్స్’ లిమిటెడ్ నిర్వహించిన సర్వేల ఆధారంగా ఆలైన్‌మెంట్ రూపొందించారు. ప్రతిపాదిత మార్గానికి 223.44 హెక్టార్ల భూమి అవసరం. అటవీ భూమి ఇందులో లేదని రైల్వే అధికారులు గుర్తించారు. ఆ మార్గం 65 రహదారులు, 21 హైటెన్షన్ విద్యుత్తు లైన్లు దాటనుంది.

మన తెలంగాణ 26 Nov 2025 10:13 pm

41 మంది మావోయిస్టుల లొంగుబాటు..

చర్ల, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్‌లో 12 మంది మహిళలతో పాటు 41 మంది

ప్రభ న్యూస్ 26 Nov 2025 10:01 pm

ముంబై మరువలేని కాళరాత్రి

. ఉగ్ర క్రూరత్వానికి చెరగని గుర్తుగా 26/11. 12 చోట్ల రక్తపాతం – 166 మంది మృతి. తొమ్మిది మంది ముష్కరులు హతం. ప్రాణాలతో పట్టుబడ్డ కసబ్‌-ఆపై ఉరి. ముంబై ఉగ్రదాడులకు 17 ఏళ్లు ముంబై : నవంబరు 26వ తేదీ ప్రపంచాన్ని కుదిపివేసిన రోజు. 2008లో అంటే సరిగ్గా 17 ఏళ్ల కిందట ఇదే రోజు భారత దేశ ఆర్థిక రాజధాని చరిత్రలో కాళరాత్రిగా నిలిచింది. కాల్పులు, పేలుళ్లతో ముంబై నగరం దద్దరిల్లింది. 10 మంది […] The post ముంబై మరువలేని కాళరాత్రి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 10:00 pm

చెన్నై నుంచే 2 లక్షలకు పైగా హెచ్ 1బి వీసాలు

వాషింగ్టన్ / చెన్నై: హెచ్ 1బి వీసా ప్రక్రియ యావత్తూ మోసం అని అమెరికా ఆర్థికవేత్త డేవ్ బ్రాట్ విమర్శించారు. చెన్నైకు చెందిన ఓ కన్సల్టెంట్ సంస్థ ఒక్కదానికే 2,20,000 హెచ్ 1 బి వీసాలు జారీ అయ్యాయని, భారతదేశం అంతటితో పోలిస్తే ఇది రెండింతలు పైగా ఉందని , ఇంతకంటే ఫ్రాడ్ మరోటి ఉంటుందా? అని ప్రశ్నించారు. అమెరికా మాజీ రాయబారి అయిన బ్రాట్ భారత్‌కు ఉన్న హెచ్ 1 బి వీసాల పరిమితి 85000 అని, అయితే చెన్పై కన్సల్టెంట్‌కు రెండున్నర లక్షల వీసాలు దక్కాయని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటకల హెచ్ 1బి వీసాల దరఖాస్తుల ప్రాసిసింగ్‌లో ఉండే ఈ కంపెనీకి ఇన్ని వీసాలు మంజూరు కావడం ఏమిటని ప్రశ్నించారు. దీనితో హెచ్ 1 బి వీసాల అంశం ఇప్పుడు మరోసారి వివాదాస్పదం అయింది. హెచ్ 1 బి వీసాల ప్రక్రియ అంతాకూడా పారిశ్రామిక వర్గాల స్థాయి స్కామ్‌లు పావులు ఎత్తుగడల గుప్పిట్లోకి జారుకుందని విమర్శించారు. చట్టబద్ధమైన అధికారిక పరిమితి దాటి వీసాలు జారీ అయితే ఇక ఈ ప్రక్రియకు విలువ ఏమిటని హెచ్ 1 బి వీసాల వాటాల్లో 71 శాతం వరకూ ఇండియాకు చెందుతాయి. కాగా చైనాకు కేవలం 12 శాతం కోటా దక్కుతోంది. భారత్‌కు సంబంధించి 85000 వీసాల పరిమితి ఉంది.అయితే కానీ ఇండియాలోని చెన్నై జిల్లా లేదా పూర్వపు మద్రాసు జిల్లకు రెండులక్షలకు పైగా హెచ్ 1 బి వీసాలు దక్కాయని రిపబ్లికన్ మాజీ ఎంపి అయిన డాక్టర్ బ్రాట్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగల వీసాల ప్రాసిసింగ్ సెంటర్‌గా చెన్నై కన్సల్టెంట్ సెంటర్ ఉంది. హెచ్ 1 బి వీసాల ప్రక్రియ ఇంత యధేచ్ఛగా మోసాల భరితం అయి ఉంటే ఇక అమెరికా వర్కర్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా), యాంటి ఇమిగ్రేషన్ అజెండా వంటివి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయని ప్రశ్నించారు. 

మన తెలంగాణ 26 Nov 2025 9:59 pm

AP |ఫిట్‌నెస్ భారం భరించలేం…

AP | ఫిట్‌నెస్ భారం భరించలేం… ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్రస్థాయి

ప్రభ న్యూస్ 26 Nov 2025 9:55 pm

Gudivada |స్కానింగ్ సెంటర్లపై చర్యలు..

గుడివాడ, ఆంధ్రప్రభ : స్టేట్ పీఎస్సీ పి అండ్ డి టి యాక్ట్

ప్రభ న్యూస్ 26 Nov 2025 9:50 pm

శోభాయమానంగా పద్మావతి అమ్మవారి పుష్పయాగం

తిరుచానూరు, ఆంధ్రప్రభ : నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా తిరుచానూరు శ్రీ

ప్రభ న్యూస్ 26 Nov 2025 9:45 pm

రైతుల బలోపేతం కోసం ‘‘రైతన్న మీకోసం’’

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : రైతును ఆర్థికంగా బలోపేతం చేసే చర్యల్లో భాగంగా

ప్రభ న్యూస్ 26 Nov 2025 9:36 pm

వ‌డివ‌డిగా ధాన్యం కొనుగోళ్లు…

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రైతుల క్షేమం, సంక్షేమానికి ప్రాధాన్య‌మిస్తున్న ప్ర‌భుత్వం.. ప్ర‌తి

ప్రభ న్యూస్ 26 Nov 2025 9:28 pm

Lokesh |రామ్ లాల్ జీతో మంత్రి నారా లోకేష్ భేటీ

Lokesh | రామ్ లాల్ జీతో మంత్రి నారా లోకేష్ భేటీ మంగళగిరి,

ప్రభ న్యూస్ 26 Nov 2025 9:17 pm

హసీనా అప్పగింతపై స్పందించిన భారత్

న్యూఢిల్లీ: మరణ శిక్ష పడ్డ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ అభ్యర్థనపై భారతదేశం స్పందించింది. ఈ విషయాన్ని తాము పరిశీలిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం తెలిపారు. అమానుష దాడుల అభియోగాల కేసులో గత వారం బంగ్లా నేత హసీనాకు అక్కటి ట్రిబ్యునల్ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. హసీనా ఇప్పుడు భారత్‌లో తలదాచుకుంటున్నారు. బంగ్లాదేశ్ సముచిత ప్రయోజనాల కోణంలో ఆమె అప్పగింత విషయాన్ని పరిశీలించి, తెలియచేస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి వివరించారు. జుడిషియల్, అంతర్గత న్యాయచట్టపరమైన కోణాలలో బంగ్లాదేశ్ డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు జైస్వాల్ తెలిపారు.బంగ్లాదేశ్ ప్రయోజనాలకు భారత్ కట్టుబడి ఉంటుంది. శాంతి, ప్రజాస్వామ్యం, సమీకృత విధానం, స్థిరత్వం వంటి పలు కీలక విషయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై సంబంధితపక్షాలతో సంప్రదింపులు జరుగుతాయని వివరించారు.

మన తెలంగాణ 26 Nov 2025 9:14 pm

Pulivendula |హద్దు దాటిన అభిమానం

Pulivendula | హద్దు దాటిన అభిమానం పులివెందుల, ఆంధ్రప్రభ : నాయకులపై అభిమానాన్ని

ప్రభ న్యూస్ 26 Nov 2025 9:11 pm

రాష్ట్రంలో వయో వృద్ధులకు పెద్ద పీట : మంత్రి అడ్డూరి

వయో వృద్ధులకు రాష్ట్రంలో పెద్ద పేట వేస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ వివిధ పథకాలు అమలు చేస్తోందని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్రస్థాయి వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్‌జెం డర్స్ వ్యక్తుల సాధికారత శాఖ బంజారాహిల్స్‌లోని బాబు జగజ్జీవన్ రామ్ ఆడిటోరియం లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వయో వృద్ధులకు పెన్షన్‌లు, ప్రతి జిల్లాలో వయో వృద్ధుల ఆశ్రమాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఇప్పటి వరకు మన రాష్రటంలో 13 జిల్లాల్లో వృద్ధ ఆశ్రమాలు ఏర్పాటు చేశామన్నారు. మిగతావి వివిధ దశలలో పూర్తి చేస్తామని అన్నారు. తల్లి దండ్రులు, వయో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం2007 ప్రకారముగా ప్రతి జిల్లాలో మెయింటెనెన్స్ ట్రిబునళ్లు, అప్పీల్లేట్ ట్రిబునళ్లను ఏర్పాటు చేశామన్నా రు. అంతేకాకుండా రాష్టంలోని ప్రతి జిల్లాలో వయో వృద్ధుల కోసం ఈ నెల 12 నుంచి 16 వరకు వారోత్సవాలు నిర్వహించామని తెలిపారు. ఇట్టి వారోత్సవాలకు ఆయా జిల్లాలో ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు, జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో వయో వృద్ధులకు ఆటల పోటీలు, జిల్లా స్థాయి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చారన్నారు. వయో వృద్ధుల సంక్షేమము కొరకు రాష్ట్ర స్థాయి కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తామని మంతరి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. త్వరలో రాష్ట్రంలో 33 జిల్లాల్లో 37 డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రుల, వయో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం2007 నియమాలను సూచిం చే పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఐఎఎస్ అనితా రామచంద్రన్, సంచాలకులు బి.శైలజ, రాష్ట్రస్థాయి అధికా రులు, వివిధ వయో వృద్ధుల సంఘాల ప్రతినిధులు, 1500 మంది వయో వృద్ధులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 26 Nov 2025 9:08 pm

கன்னியாகுமரியில் மலைப்பாம்பு ஊர்ந்து செல்வதாக பரவும் வீடியோ - உண்மை இதுதான்

கன்னியாகுமரியில் மலைப்பாம்பு சாலையில் ஊர்ந்து செல்வதாக தவறான தகவலுடன் வீடியோ வைரலாகிறது.

తెలుగు పోస్ట్ 26 Nov 2025 9:02 pm

ACA |మళ్లీ తిరిగి విజయవాడకు ఏసీఏ…

ACA | మళ్లీ తిరిగి విజయవాడకు ఏసీఏ… ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో :

ప్రభ న్యూస్ 26 Nov 2025 8:53 pm

భారీ అగ్ని ప్రమాదం.. కాలిపోయిన 5 టవర్స్.. 13 మంది మృతి

హాంకాంగ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం హాంకాంగ్‌లో తాయ్ పో జిల్లాలోని 5 భారీ అపార్ట్‌మెంట్ భవనాల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో చాలా మంది అపార్ట్‌మెంట్ భవనాల్లోనే చిక్కుకుపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 700 మంది నివాసితులను రక్షించి తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారని, మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఐదు బిగ్ టవర్స్ మంటల్లో కాలిపోయి పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మన తెలంగాణ 26 Nov 2025 8:45 pm

HYD |జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం

HYD | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం హైదరాబాద్ :

ప్రభ న్యూస్ 26 Nov 2025 8:37 pm

భారత్ ఘోర పరాజయం

 సౌతాఫ్రికాతో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. భారత్‌పై చారిత్రక విజయం సాధించిన దక్షిణాఫ్రికా టీమ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 549 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బుధవారం ఐదో రోజు 63.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. పరుగుల పరంగా భారత్‌కు టెస్టుల్లో ఇదే అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం. మరోవైపు భారత గడ్డపై టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం సౌతాఫ్రికాకు ఇది రెండోసారి. గతంలో హాన్సి క్రోనే సారథ్యంలోని దక్షిణాఫ్రికా టీమ్ భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. తాజాగా తెంబబవుమా కెప్టెన్సీలో సఫారీ మరోసారి ఇలాంటి ఫీట్‌ను సాధించడం విశేషం. కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్ చేతిలో క్లీన్‌స్వీప్‌కు గురైన టీమిండియా మరోసారి సౌతాఫ్రికా చేతిలోనూ ఇలాంటి అవమానకర ఓటమిని చవిచూసింది. కివీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ను 30తో చిత్తుగా ఓడించింది. తాజాగా సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి టీమిండియాకు కోలుకోలేని దెబ్బతీసింది. వరుస క్రమంలో.. ఓవర్‌నైట్ స్కోరు 27/2తో బుధవారం చివరి రోజు ఆటను తిరిగి ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్ (5) పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ మరోసారి నిరాశ పరిచాడు. రెండు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి తేలిపోయాడు. 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మారథాన్ ఇన్నింగ్స్ ఆడినసాయి సుదర్శన్ 139 బంతుల్లో 14 పరుగులు చేసి ఇంటిదారి పట్టాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజా 87 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. వాషింగ్టన్ సుందర్ (16) పరుగులు చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి, సిరాజ్‌లు ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల వద్దే ముగిసింది. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హార్మర్ 37 పరుగులకే ఆరు వికెట్లు తీశాడు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లను పడగొట్టాడు.

మన తెలంగాణ 26 Nov 2025 8:34 pm

సర్వీస్ రివాల్వర్ తాకట్టు పెట్టిన ఎస్ఐ

 బెట్టింగ్‌కు బానిసగా మారిన ఎస్సై ఏకంగా సర్వీస్ రివాల్వర్‌ను తాకట్టుపెట్టి అప్పు తీసుకున్నాడు. అంతేకాకుండా చోరీ కేసులో రికవరీ చేసిన ఐదు తులాల బంగారం కూడా కుదువ బెట్టుకున్నట్లు బయటపడింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం...ఎపికి చెందిన భాను ప్రకాష్ 2020లో ఎస్సైగా ఎంపికయ్యాడు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పనిచేశాడు. ప్రస్తుతం అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఎస్సైగా పనిచేస్తున్నాడు. భానుప్రకాష్ బెట్టింగ్‌కు బానిసగా మారండంతో వచ్చే జీతం కుటుంబ అవసరాలకు, బెట్టింగ్ కట్టేందుకు సరిపోవడంలేదు. దీంతో తన వద్ద ఉన్న రివాల్వర్‌ను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు, రౌండ్స్ మాత్రం తన పిఎస్‌లోని తన డెస్క్‌లో దాచి పెట్టాడు. రౌండ్స్ కుదువ పెట్టుకున్న వ్యక్తికి ఇస్తే ఎక్కడైన ఫైరింగ్ చేస్తే తాను ఇరుక్కుంటానని భావించి ఇవ్వనట్లు తెలిసింది. కాగా ఇటీవల భానుప్రకాష్ ఎపిలో నిర్వహించిన గ్రూప్2లో ఎఎస్‌ఓగా ఎంపికయ్యాడు. ఆ ఉద్యోగంలో చేరాలంటు ఇక్కడ రిలీవ్ కావాల్సి ఉంటుంది, దానికి తన వద్ద ఉన్న అన్నింటినీ ఎస్‌హెచ్‌ఓకు హ్యాండ్‌ఓవర్ చేయాల్సి ఉంది. దీని కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన భానుప్రకాష్, డెస్క్ తన రివాల్వర్ మిస్సింగ్ అయిందని ఇన్స్‌స్పెక్టర్ కిరణ్‌కు చెప్పాడు. రౌండ్లు ఉన్నాయని, రివాల్వర్ మాత్రమే పిఎస్ నుంచి మిస్సింగ్ అయిందని చెప్పాడు. ఎందుకైనా మంచిది అని ఇన్స్‌స్పెక్టర్ కిరణ్ పిఎస్‌లో ఉన్న సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలిద్దామని చూశాడు. ఫుటేజ్‌లో భానుప్రకాష్ బంగారం తీసుకుని వెళ్తున్నట్లు బయటపడింది, దానిపై నిలదీయగా తాను కుదువ బెట్టుకున్నానని చెప్పాడు. వెంటనే ఇన్స్‌స్పెక్టర్ పై అధికారులకు సమాచారం ఇవ్వగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. భానుప్రకాష్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించగా, బెట్టింగ్‌కు బానిసగా మారానని డబ్బుల కోసం రివాల్వర్ తాను కుదువ బెట్టానని ఒప్పుకున్నట్లు తెలిసింది. వెంటనే ఉన్నతాధికారులు భానుప్రకాష్‌ను సస్పెండ్ చేశారు. రివాల్వర్ బెట్టింగ్ కోసం కుదువబెట్టాడా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మన తెలంగాణ 26 Nov 2025 8:24 pm

పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

న్యూఢిల్లీ: బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పలు అంశాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్(ఆర్ఇపిఎం) స్కీమ్‌ స్వయం సమృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.7,280 కోట్లతో ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ స్కీమ్ అమలు కానుంది. ఆర్ఇపిఎం ఎకో సిస్టమ్‌ ప్రోత్సాహానికి కేంద్ర కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు రూ.9,858 కోట్లతో పుణె మెట్రో విస్తరణను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రూ.1,457 కోట్లతో ద్వారా-కనాలుస్ రైల్వే డబ్లింగ్ లైన్‌‌కు.. బద్లాపూర్-కర్జత్ మధ్య మూడు, నాలుగో రైల్వేలైన్‌‌కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

మన తెలంగాణ 26 Nov 2025 8:23 pm

‘ఎన్‌బికె111’ సినిమా షురూ

వరుస బ్లాక్‌బస్టర్‌ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో హిస్టారికల్ ఎపిక్ ‘ఎన్‌బికె111’ చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. బాలకృష్ణతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు బి.గోపాల్ క్లాప్ కొట్టారు. బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్‌కు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చి బాబు సమిష్టిగా దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ దర్శకులు, నిర్మాతలు అనేక మంది ప్రముఖ అతిథులు హాజరయ్యారు. హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలు, అద్భుతమైన యాక్షన్, విజువల్ వండర్ గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోంది.

మన తెలంగాణ 26 Nov 2025 8:14 pm

Rs.4.25 lakhs |ఫోన్ పోయిందా… ఖాతా ఖాళీ

Rs.4.25 lakhs | ఫోన్ పోయిందా… ఖాతా ఖాళీ Rs.4.25 lakhs |

ప్రభ న్యూస్ 26 Nov 2025 8:10 pm

CM Chandrababu Launches Major Road Safety Initiative in Andhra Pradesh

Chief Minister N. Chandrababu Naidu has launched a major road safety initiative to curb the rising number of accidents in Andhra Pradesh. In a high-level review meeting at the Secretariat, he directed officials to conduct third-party audits for every accident to clearly identify whether the fault lies with the driver, the vehicle or road engineering. […] The post CM Chandrababu Launches Major Road Safety Initiative in Andhra Pradesh appeared first on Telugu360 .

తెలుగు 360 26 Nov 2025 8:10 pm

అవినీతి అనకొండ రేవంత్‌రెడ్డి: కెటిఆర్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవినీతి అనకొండ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దుయ్యబట్టారు. వరంగల్ జిల్లా, గీసుగొండ శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును బుధవారం పార్టీ నేతలతో కలిసి ఆయన సందర్శించారు. కిటేక్స్ కంపెనీకి చెందిన అత్యాధునిక స్పిన్నింగ్ ఇండస్ట్రీని, యంగ్ వన్ కంపెనీకి చెందిన గార్మెంటరీ ఇండస్ట్రీని ఆయన పరిశీలించారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఉత్పత్తికి సంబంధించిన వివరాలను, పార్కులో సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి వేల కోట్ల పెట్టుబడులను, కొత్త కంపెనీలను తెచ్చిందన్నారు. అందులో భాగంగానే వరంగల్‌లో ఏర్పాటు చేసిన దేశంలోని అతి పెద్దదైన మెగా టెక్స్‌టైల్ పార్కు అని గుర్తు చేశారు. కెసిఆర్ దార్శనికతకు నిలువుటద్దం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కు అని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిశ్రామిక విధానానికి తూట్లు పొడుస్తూ విలువైన భూములను ప్రయివేట్ వ్యక్తులకు అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ (హిల్టప్) ఎవరి ప్రయోజనం కోసం తెచ్చారని ప్రశ్నించారు. పారిశ్రామికవాడల్లోని రూ.5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి, ఆయన సోదరుల కనుసన్నల్లో కొల్లగొట్టే ప్రయత్నమే హిల్టప్ పాలసీ ఉద్దేశమని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి దోచుకున్న వేల కోట్ల రూపాయలను రాహుల్ గాంధీకి పంపే ఏర్పాట్లలో ముఖ్యమంత్రి ఉన్నారని ధ్వజమెత్తారు. ఇకా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని గొప్పలు చెప్పి, పంచాయతీ ఎన్నికల్లో 17 శాతానికే పరిమితం చేసినందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్, రేవంత్ రెండు చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓఆర్‌ఆర్ పనులతో పాటు డ్రైనేజీ, ఇతర సౌకర్యాలు కల్పించి పార్కును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట జనగామ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు చల్లా ధర్మారెడ్డి, వినయ్ భాస్కర్, నరేందర్, రాజయ్య, వెంకట రమణారెడ్డి, సుదర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. * నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు గీసుకొండ మండలం, ఊకల్ హవేలి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిరామారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

మన తెలంగాణ 26 Nov 2025 8:09 pm

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ఆందోళన

ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వం దోచుకొని తనను తప్పుగా చిత్రీకరిస్తూ పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్న ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన చేపట్టింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా, కాసిపేటలో చోటుచేసుకుంది. కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోమగూడెం భారత్ కాలనీలో నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుడు ఎస్‌కె సలీం ఇంటి ముందు చొప్పరిపల్లె గ్రామానికి చెందిన ఎస్.అనూష బుధవారం ఉదయం బైఠాయించింది. ఆమెకు అంబేద్కర్ మహిళా సంఘం నాయకురాళ్లు మద్దతుగా బైఠాయించారు. ఈ సందర్భంగా ఆ యువతి మాట్లాడుతూ.. సలీం తనను ప్రేమిస్తున్నానని వెంటపడడ్డాడని, తాను ఒప్పుకోని పరిస్థితిలో అతని తల్లిని కూడా తన ఇంటికి రప్పించి, తన తల్లిని ఒప్పించాడని తెలిపింది. చనిపోతానని బెదిరించడంతో తాను సలీంను కూడా ప్రేమించానని, 8 సంవత్సరాలుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిపింది. ప్రేమ పేరుతో సర్వం దోచుకొని తనను అందరి మధ్య తప్పుడుగా చిత్రీకరిస్తూ మరో పెళ్లికి సలీం సిద్ధమయ్యాడని ఆరోపించింది. గతంలో కూడా తన పట్ల అమర్యాదగా వ్యవహరించడంతో సలీంపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టానని తెలిపింది. సలీం నెల రోజులకు పైగా జైలుకు వెళ్ల్లివచ్చాడని, ఆయినప్పటికీ అతనిలో మార్పు రాలేదని, తనతోనే ఉంటూనే, తాను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు ఫోన్‌లో స్టేటస్‌లో పెట్టి మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయింది. సలీంతో తనకు వివాహం జరిపించి న్యాయం చేయాలని కోరింది. సలీం ఇంటి ముందు బైఠాయించడంతో సలీం కుటుంబీకులు ఘర్షణకు దిగడంతో పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. ఎఎస్‌ఐ బూర రవీందర్ సంఘటన స్థలానికి చేరుకొని అనూషకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సలీం ను మందమర్రి సిఐ వద్దకు పిలిపించామని, సమస్యను అక్కడ పరిష్కరించుకోవాలని ఆయన సూచించడంతో మహిళా సంఘాలు అనూష ను తీసుకొని సిఐ శశిధర్‌రెడ్డి వద్దకు తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా సిఐ వారిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇప్పటికే ఈ విషయం కోర్టులో నడుస్తోందని, ఇలా ఇంటి ముందు బైఠాయించడం సరికాదని, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మధ్యవర్తుల సహాయంతో సమస్యను పరిష్కారం చేసుకోవాలని, కోర్టు తీర్పు వరకు వేచిచూడాలని సిఐ వారికి సూచించారు. ఈ విషయంలో ఎవరు కూడా గొడవలకు వెళ్లవద్దని హితవు పలికారు. కాగా, బాధితురాలు అనూషకు మద్దతుగా మంచిర్యాల అంబేద్కర్ మహిళా సంఘం నాయకురాలు మద్దెల భవాని, కామెర అనూష సభ్యులు మద్దతు పలికారు.

మన తెలంగాణ 26 Nov 2025 8:04 pm

11 crore |సహకార వ్యవస్థలో రాజకీయాలు ఉండకూడదు..

11 crore | సహకార వ్యవస్థలో రాజకీయాలు ఉండకూడదు.. 11 crore |

ప్రభ న్యూస్ 26 Nov 2025 8:02 pm

సోదరుడు ఇమ్రాన్ ఖాన్ జాడ చెప్పండి

తన సోదరుడి జాడ చెప్పాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరిలు ముగ్గురు డిమాండ్ చేశారు. రావల్పిండి జైలులో ఖైదీ అయిన తమ సోదరుడిని కలిసేందుకు అనుమతిని ఇవ్వాలని అధికారులను కోరారు. నెలరోజులుగా ఇమ్రాన్‌ను జైలులో ఎవరూ చూడటానికి వీల్లేకుండా అధికారులు ఆంక్షలు విధించారు. మరో వైపు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, చనిపోయాడని, దీనిని రహస్యంగా ఉంచుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఆయన ఎక్కడున్నాడు? ఏమైంది? అనేది తమకు తీవ్ర మానసిక ఆందోళన కల్గిస్తోందని ముగ్గురు సోదరిలు నూరెన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా తెలిపారు. తాము ఇటీవల రావల్పిండిలోని అడియాలా జైలు వద్దకు పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పిటిఐ) కార్యకర్తలతో కలిసి వెళ్లామని, ఆయనను కలిసేందుకు అనుమతి అడిగామని, అయితే ఈ దశలో తమపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. రావల్పిండి జైలులో 2023 నుంచి ఖాన్ నిర్బంధంలో ఉన్నాడు. మూడు వారాలుగా ఆయన పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదని ఇమ్రాన్ సోదరిలు వాపోయారు. 

మన తెలంగాణ 26 Nov 2025 7:58 pm

నాంపల్లిలో ఫిష్ క్యాంటీన్ ప్రారంభం

రాష్ట్ర మత్స శాఖ నాంపల్లిలో ఫిష్ క్యాంటీన్‌ను ప్రారంభించింది. నాంపల్లి గగన్ విహార్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, అనిల్ కుమార్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకే మత్స శాఖ ప్రధాన కార్యాలయం (మాసాబ్ ట్యాంక్) పక్కనే ఫిష్ క్యాంటీన్ ఉన్నది.

మన తెలంగాణ 26 Nov 2025 7:54 pm

ఇందిరమ్మ చీరలపై దుష్ప్రచారం చేయడం తగదు:మంత్రి సీతక్క

ఇందిరమ్మ చీరలపై దుష్ప్రచారం చేయడం తగదని, ఓర్వలేకనే బిఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలు, మహిళా సంఘాలు ఎంపిక చేసుకున్న డిజైన్లలోనే చీరలను ఇస్తున్నామని, అయినా కలర్, డిజైన్ బాగాలేదని బిఆర్‌ఎస్ వాళ్లు విమర్శిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. సహజంగా ఆడవాళ్లు ఎదుగుతుంటే కెటిఆర్, హరీశ్‌రావులు ఓర్వలేరని మంత్రి సీతక్క విమర్శించారు. ఆడబిడ్డలు చీరలు తీసుకొని సంబరపడుతుంటే వారు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ మాదిరిగా ఇవి సూరత్ నుంచి కిలోల లెక్కన తీసుకొచ్చిన చీరలు కాదని, సిరిసిల్ల నేతన్నలు తమ చేతితో స్వయంగా నేసిన చీరలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కావాలంటే కెటిఆర్, హరీష్‌రావు, కవితలు స్వయంగా సిరిసిల్ల వెళ్లి నేతన్నలను అడిగి తెలుసు కోవాలని మంత్రి సీతక్క సూచించారు. కొందరు బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు కావాలని చీరలు బాగా లేవంటూ మాట్లాడటం సిరిసిల్ల నేతన్నలను అవమానించేలా ఉందన్నారు. చీరలను మహిళా సంఘాల వారికే ఇస్తున్నామని ఆరోపణలు అవా స్తవమని మహిళా సంఘాల సభ్యులకు ఇస్తూనే సభ్యత్వం లేని వారిని సైతం సంఘంలోకి ఆహ్వానిస్తూ వారికి సారె పెడుతున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

మన తెలంగాణ 26 Nov 2025 7:48 pm

నకిలీ ఐఎఎస్ ఆఫీసర్ అరెస్టు

ఐఎఎస్, ఐపిఎస్,ఎన్‌ఐఏ అధికారినంటూ పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి బాడీగార్డులుగా పనిచేసిన ఇద్దరు పరారీలో ఉన్నారు. రెండు మొబైల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, రెండు వాకీటాకీలు, నకిలీ ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌జోన్ డిసిపి చింతమనేని శ్రీనివాస్ తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరలోని షేక్‌పేటకు చెందిన బత్తిని శశికాంత్(39) అమాయకులకు తాను ఐఎఎస్, ఐపిఎస్ ఆఫీసర్ నంటూ నమ్మిస్తూ మోసాలు చేస్తున్నాడు. అతడికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రవీణ్, విమల్ బాడీగార్డులుగా పనిచేస్తున్నారు. నిందితుడు కొందరికి డిప్యూటీ కమిషనర్ మైన్స్‌గా పనిచేస్తున్నట్లు, ఎన్‌ఐఏ అధికారి నంటూ చెప్పి పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాడు. నకిలీ ఐఏఎస్,ఐపిఎస్, ఎన్‌ఐఏ ఐడికార్డులను తయారు చేయించుకున్నాడు. తనతోపాటు ఇద్దరు బాడీగార్డులు, కారుకు సైరన్ పెట్టుకుని తిరుగుతుండడంతో పలువురు నిజంగానే ఆఫీసర్ అని భావించారు. కమ్యూనికేషన్ కోసం రెండు వాకీటాకీలను కూడా వాడేవారు. టిఎస్‌ఐఐసిలో ఇండస్ట్రీయల్ భూమి ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే గోల్డ్ జిమ్ యజమాని అలీ హసన్ వద్ద రూ.10,50,665 వసూలు చేశాడు. తర్వాత నుంచి కన్పించకుండా పోయాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

మన తెలంగాణ 26 Nov 2025 7:44 pm

video : Director Mahesh Babu Exclusive Interview

The post video : Director Mahesh Babu Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 26 Nov 2025 7:44 pm

Anganwadi |అంగన్వాడి కేంద్రానికి గ్రహణం

Anganwadi | అంగన్వాడి కేంద్రానికి గ్రహణం Anganwadi | ఎడపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Nov 2025 7:42 pm

Keerthy Suresh responds about Eight-Hour Work Rule

The current discussion regarding working hours in the Indian films has received new focus after Deepika Padukone expressed her views. The latest to respond about it is national-award-winning actress Keerthy Suresh. She spoke about the increasing demands for an eight-hour workday for actors and crew, an issue that has created a conversation among those in […] The post Keerthy Suresh responds about Eight-Hour Work Rule appeared first on Telugu360 .

తెలుగు 360 26 Nov 2025 7:41 pm

విజయ్ దేవరకొండ సినిమాలో హాలీవుడ్ యాక్టర్

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హిట్స్‌ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది ‘కింగ్‌డమ్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు విజయ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ డ్రామా జూలైలో విడుదలైంది. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ మూవీ తర్వాత ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌తో జతకట్టాడు విజయ్. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీ ‘విడి14’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు, మమ్మీ చిత్రం విలన్ ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారనే వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే వినోద్ సాగర్‌తో కలిసి ఆర్నాల్డ్ వోస్లూ కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమాలో ఆర్నాల్డ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారా..? లేక మరేదైనా రోల్‌లో నటిస్తున్నారా.? అనే చర్చ కూడా జరుగుతోంది.

మన తెలంగాణ 26 Nov 2025 7:37 pm

Video : Fight Masters Ram Lakshman Exclusive Interview

The post Video : Fight Masters Ram Lakshman Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 26 Nov 2025 7:31 pm

73 years |ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం..

73 years | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం.. 73 years |

ప్రభ న్యూస్ 26 Nov 2025 7:30 pm

మాదాపూర్‌లో ఐటీ కంపెనీ పేరుతో ఘరానా మోసం..

హైదరాబాద్: నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూల్ చేసి ఓ ఐటి కంపెనీ బోర్డుతిప్పేసింది. ఈ ఘరానా మోసం నగరంలోని మాదాపూర్లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శిక్షణ ఇచ్చి, ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ నిరుద్యోగులను నమ్మించి భారీగా డబ్బులు వసూల్ చేసింది. దాదాపు 400 మంది విద్యార్థుల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.3 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేసిన కంపెనీ తర్వాత బోర్డు తిప్పేసింది. మొత్తం డబ్బును తీసుకుని కంపెనీ డైరెక్టర్ స్వామి నాయుడు పరారయ్యాడు. దీంతో బాధిత విద్యార్థులు సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారైన స్వామి నాయుడును పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. 

మన తెలంగాణ 26 Nov 2025 7:22 pm

Farmer Happy |అన్నదాత‌ పరవశం

Farmer Happy | అన్నదాత‌ పరవశం Farmer Happy | ఎన్టీఆర్ బ్యూరో,

ప్రభ న్యూస్ 26 Nov 2025 7:20 pm

Temple | 18వ మహా పడిపూజ…

Temple | 18వ మహా పడిపూజ… Temple | ములుగు సిద్దిపేట జిల్లా,

ప్రభ న్యూస్ 26 Nov 2025 7:10 pm

ఆటో కిందపడి ఏడాదిన్నర చిన్నారి మృతి

బోధన్: సాలూర మండలం సాలంపాడ్ గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. ఇంటి ముందు ఆటోలో ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ వచ్చిన బోధన్‌కు చెందిన వ్యాపారి అబ్ధుల్ ఖాదర్ వద్దకు తల్లి అయేషా బేగం వెళ్లింది. ఆమె వెనకే చిన్నారి కూడా పాకుతూ బయటకు వచ్చింది. ఉల్లిగడ్డల బేరం కుదరకపోవడంతో తల్లి పక్కకు వచ్చింది. చిన్నారిని గమనించని ఖాదర్ ఆటోని ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆటో టైరు పాప తలపై నుంచి వెళ్లింది. పాపకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటివరకూ కళ్లముందే ఆడిన పసి పాప విగత జీవిగా మారడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతి చెందిన చిన్నారి సాలంపాడ్ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, అయేషాబేగం దంపతులకు మూడో సంతానం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై తెలిపారు.

మన తెలంగాణ 26 Nov 2025 7:07 pm

Karimabad |హెల్త్ కార్డులను వెంటనే విడుదల చేయాలి

Karimabad | హెల్త్ కార్డులను వెంటనే విడుదల చేయాలి Karimabad | కరీమాబాద్,

ప్రభ న్యూస్ 26 Nov 2025 7:02 pm

వైద్య ఆరోగ్యశాఖలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ

విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి అధ్యక్షతన కార్యాలయ లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగం దాని ఆవశ్యకత పై వివరించడం జరిగింది అనంతరం రాజ్యాంగ పీఠిక చదివి వినిపించారు.అలాగే రాజ్యాంగ పీఠిక కు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించడం జరిగినది, ఈ సందర్భంగా డాక్టర్ డియం ఎచ్ ఓ ఈ బి దేవి మాట్లాడుతూ ఈరోజు […] The post వైద్య ఆరోగ్యశాఖలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 7:00 pm

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.234కిలోల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బోరబండ ప్రాంతంలో హుస్సేన్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే నిఘా పెట్టిన ఎక్సైజ్ సిబ్బంది బైక్‌పై గంజాయి తీసుకుని వచ్చి విక్రయిస్తున్న హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 84 ప్యాకెట్లలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు రెహమాన్ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు కోసం హుస్సేన్‌ను బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

మన తెలంగాణ 26 Nov 2025 6:59 pm

Sports |రాష్ట్ర స్థాయి వాలీబాల్‌కు ఎంపిక..

Sports | రాష్ట్ర స్థాయి వాలీబాల్‌కు ఎంపిక.. Sports | లక్షేట్టిపేట, ఆంధ్ర

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:55 pm

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ దారుణ హత్య?.. బలూచిస్తాన్ సంచలన ఆరోపణలు

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో దారుణంగా హత్య చేశారంటూ బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. పాక్ సోషల్ మీడియాలో, ఆఫ్ఘన్ మీడియాలలోనూ ఇమ్రాన్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు కుటుంబ సభ్యులు జైలు వద్దకు వెళ్లగా.. పోలీసులు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇమ్రాన్ హత్యకు గురై ఉండవచ్చనే అనుమానాలను ఇది మరింత తీవ్రతరం చేసింది. మరోవైపు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలులో చిత్రహింసలకు గురిచేసి చంపారని.. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ కుట్రను అమలు చేశారని బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. కాగా, అవినీతి కేసులో 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్.. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయన మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మన తెలంగాణ 26 Nov 2025 6:53 pm

జూబ్లీహిల్స్ ఎంఎల్ఎ గా ప్రమాణం చేసిన నవీన్ యాదవ్

ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన వి. నవీన్ యాదవ్ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యాదవ్ తో ప్రమాణం చేయించారు. అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ ఛాంబర్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర మంత్రులు డి. శ్రీధర్ బాబు, అజహరుద్దీన్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. నవీన్ కుమార్ పార్టీ నాయకులతో, తన అనుచరులతో అసెంబ్లీకి ఊరేగింపుగా వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నిక ప్రచారం సమయంలో విపక్షాల నేతలు తనను, తన కుటుంబ సభ్యులను అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపినాథ్ మరణించకపోయినా ఉప ఎన్నిక జరిగేదని అన్నారు. మాగంటి మరణించడంతో తాము ఎన్నికల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నామని ఆయన చెప్పారు. తనను గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి రుణాన్ని తీర్చుకుంటానని ఆనవీన్ యాదవ్  తెలిపారు. మజ్లీస్ పార్టీ నేతలకూ నవీన్  కృతజ్ఞతలు తెలిపారు.

మన తెలంగాణ 26 Nov 2025 6:52 pm

Narayanapet |ఎస్.ఈగా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

Narayanapet | ఎస్.ఈగా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌ Narayanapet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:50 pm

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

హెడ్మాస్టర్ సివి. శేషు విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని శివానగర్లో బ్రిలియంట్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని హెడ్మాస్టర్, కరెస్పాండెంట్ సివి. శేషు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్య చిన్నపిల్లల హాస్పిటల్ వారిచే ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం 600 మంది కు వైద్య పరీక్షలను నిర్వహించి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో […] The post ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 6:49 pm

Commissioner |పట్టణ శుభ్రత, పచ్చదనం కోసం కృషి చేయాలి

Commissioner | పట్టణ శుభ్రత, పచ్చదనం కోసం కృషి చేయాలి Commissioner |

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:42 pm

విషాదం: ఛతేశ్వర్ పుజారా బావమరిది ఆత్మహత్య

టీం ఇండియా క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఇంట్లో విషాదం చోటు చేుసకుంది. అతడి భార్య సోదరుడు జీత్ రిసిఖ్‌భాయ్ పబారీ బుధవారం రాజ్‌కోట్‌లోని నివాసంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ప్రాణం ఉందనే ఆశతో అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాలవీయనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. జీత్ ఆత్మహత్యకు గత కారణాలపై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. 2024లో జీత్ రసిఖ్‌భాయ్‌పై తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న యువతి అత్యాచార ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిగ్గా ఏడాది తర్వాత జీత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత సంవత్సరం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం జీత్ పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో లైంగిక సంబంధానికి బలవంతం చేశాడని ఆరోపించింది. వారి నిశ్చితార్థం తర్వాత కూడా వేధింపులు కొనసాగాయని.. ఆ తర్వాత అతను ఒక్కసారిగా బంధం తెంచుకున్నాడని పేర్కొంది.

మన తెలంగాణ 26 Nov 2025 6:38 pm

'ఎల్లమ్మ' సినిమాపై స్పందించిన కీర్తి సురేష్..

బలగం డైరెక్టర్ వేణు తెరకెక్కించబోతున్న సెకండ్ మూవీ ఎలమ్మ. ఈ సినిమాపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నాచురల్ స్టార్ నాని, నితిన్ తోపాటు పలువురు యంగ్ హీరోలు ఈ సినిమాను రిజెక్ట్ చేశారని..ఎట్టకేలకు ఈ సినిమాకు హీరో దొరికాడని, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రూమార్స్ వస్తున్నాయి. అలాగే,ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై కీర్తి సురేష్ స్పందించింది. తన లేటెస్ట్ మూవీ ‘రివాల్వర్‌ రీటా’ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కీర్తి.. మీడియాతో మాట్లాడుతూ ఎల్లమ్మ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చింది. తాను ఈ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేసింది. కాగా, తమిళ్ లో క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కిన ‘రివాల్వర్‌ రీటా’ను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ తోపాటు రాధిక శరత్‌కుమార్, సునీల్, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 28న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇక, తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి కీర్తి సురేష్ రౌడీ జనార్థనా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మన తెలంగాణ 26 Nov 2025 6:36 pm

Rs. 28 crores |అభివృద్ధికి చిరునామాగా గుర్తింపు తెస్తా..

Rs. 28 crores | అభివృద్ధికి చిరునామాగా గుర్తింపు తెస్తా.. Rs. 28

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:35 pm

Telangana |రాజ్యాంగంతోనే అందరికీ రక్షణ

Telangana | రాజ్యాంగంతోనే అందరికీ రక్షణ Telangana | లక్షెట్టిపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:34 pm

Judicial Remand for iBomma Ravi

Piracy website iBomma organizer Immadi Ravi has been arrested and the court granted custody for five days. He was produced before the court after the custody got concluded. The Nampally Court has now granted 14 days judicial remand of Immadi Ravi today. The Cyber Crime cops have filed a PT warrant in the Nampally Court […] The post Judicial Remand for iBomma Ravi appeared first on Telugu360 .

తెలుగు 360 26 Nov 2025 6:27 pm

Crime |ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఇద్దరిపై కేసు..

Crime | ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఇద్దరిపై కేసు.. Crime | నర్సంపేట,క్రైo,

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:25 pm

Warangal |రాజ్యాంగ హక్కులకు లోబడి పనిచేయాలి

Warangal | రాజ్యాంగ హక్కులకు లోబడి పనిచేయాలి భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంభారత్

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:24 pm

ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన

హైదరాబాద్ (జనంసాక్షి) : ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన – 2027 పూర్తి చేయాలనీ రాష్ట్ర జనగణన సంచాలకురాలు భారతి హోలికేరి అధికారులకు సూచించారు. …

జనం సాక్షి 26 Nov 2025 6:24 pm

Farmer Happy : అన్నదాత‌ పరవశం

Farmer Happy : అన్నదాత‌ పరవశం (ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) రైతుల క్షేమం,

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:21 pm

Collector |కలెక్టర్ ఆకస్మిక పర్యటన..

Collector | కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. Collector | కమలాపూర్, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:18 pm

Warangal |ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ సస్పెండ్

Warangal | ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ సస్పెండ్ సీరియస్ గా స్పందించిన పోలీస్ కమిషనర్ఉత్తర్వులు

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:13 pm

MLA |హామీ ఇచ్చిన అభ్య‌ర్థుల‌కే ఓటు వేయండి…

MLA | హామీ ఇచ్చిన అభ్య‌ర్థుల‌కే ఓటు వేయండి… MLA | చిట్యాల,

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:13 pm

Villagers |బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం

Villagers | బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం తుగ్గలి ,ఆంధ్రప్రభ : మండల

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:08 pm

Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ నుంచి.. బహిష్కరణ తప్పదా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను తిరిగి పార్టీలోకి చేర్చుకునే అవకాశం కనిపించడం లేదు.

తెలుగు పోస్ట్ 26 Nov 2025 6:06 pm

Yadadri |కాలుష్య‌కార ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్రేమ ఎందుకో?

Yadadri | కాలుష్య‌కార ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్రేమ ఎందుకో? Yadadri | చౌటుప్ప‌ల్‌, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:01 pm

Former |సద్వినియోగం చేసుకోవాలి..

Former | సద్వినియోగం చేసుకోవాలి.. తుగ్గలి, ఆంధ్రప్రభ : రైతులు కొసం ప్రభుత్వం

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:01 pm

Madhapur IT Scam: NSN Infotech Vanishes After Cheating 400

An alarming scam has come to light in Hyderabad’s IT district after a firm operating under the name NSN Infotech shut its doors overnight. The company, which promised professional training and guaranteed placements, reportedly collected money from more than 400 job aspirants and then disappeared without a trace. The office in Madhapur was found locked […] The post Madhapur IT Scam: NSN Infotech Vanishes After Cheating 400 appeared first on Telugu360 .

తెలుగు 360 26 Nov 2025 5:45 pm

ఐ-బొమ్మ రవిపై ఐదు కేసులు.. మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

రెండో కేసులో కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు మిగిలిన మూడు కేసులకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలుకోర్టు అనుమతితో మిగిలిన మూడు కేసుల్లోనూ అరెస్టు చూపనున్న సైబర్ క్రైమ్ పోలీసులుపైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టు మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రోజు రవిని కోర్టులో హాజరుపరిచారు. రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఇదివరకే 5 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రెండో కేసులో […] The post ఐ-బొమ్మ రవిపై ఐదు కేసులు.. మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:40 pm

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్.. మళ్లీ రోహిత్‌యే నెం.1

టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ(781 పాయింట్ల) ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నెం.1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. గత వారం న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్(766) నెం.1గా ఉన్నాడు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు మిచెల్ ఆడలేదు. దీంతో అతడు నెం.2కి పడిపోయాడు. మరో నాలుగు రోజుల్లో సౌతాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ ఆడనున్నాడు. ఈ మ్యాచుల్లో రోహిత్ రాణిస్తే తన నెం.1 ర్యాంకుని మరింత పదిలం చేసుకునే అవకాశం ఉంది. ఇక అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మూడో ర్యాంకులో, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, వరుసగా నాలుగు, ఐదో ర్యాంకుల్లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ ఎనిమిది నుంచి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. కెఎల్ రాహుల్ 16వ ర్యాంకులో ఉన్నాడు. 

మన తెలంగాణ 26 Nov 2025 5:38 pm

Telangana : తొలి పంచాయతీ ఏకగ్రవం ఎక్కడంటే?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదట పంచాయతీ స్థానం ఏకగ్రీవం అయింది

తెలుగు పోస్ట్ 26 Nov 2025 5:34 pm

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన నేత్రదాత

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణం లోని శారదానగర్ కు చెందిన కీ శే జుజారు మణి (40 సం) గుండెపోటు తో మరణించగా విశ్వదీప సేవా సంఘం వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం పై అవగాహన కల్పించి వారి సహకారంతో విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అందత్వ నివారణ సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డివై. కుళ్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ జి.రాఘవేంద్ర నేత్రాలను సేకరించడం జరిగిందని విశ్వదీప సేవా సంఘం […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన నేత్రదాత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:33 pm

ఆస్పరి గ్రామ ప్రజల రుణం తీర్చుకోలేనిది

–సర్పంచ్ మూలింటి రాధమ్మ–300 ఏళ్ల నాటి సింహద్వారం పునర్నిర్మాణం–అట్టహాసంగా సింహద్వారం ప్రారంభం విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రమైన ఆస్పరి గ్రామానికి శతాబ్దాల కలగా మిగిలిన ఘన చరిత్రకు నేడు కొత్త ప్రాణం పోసారు. సుమారు 300 ఏళ్ల క్రితం కూలిపోయిన ప్రాచీన గ్రామ సింహద్వారం (ఊరి వాకిటి) మళ్లీ భవ్యంగా తలెత్తింది. గ్రామపంచాయతీ నిధులు రూ.40 లక్షలకు పైగా వ్యయం చేసి, పూర్తిగా రాతికట్టుతో అద్భుతంగా పునర్నిర్మించారు. ఈ సింహద్వారం నేడు ఆస్పరి […] The post ఆస్పరి గ్రామ ప్రజల రుణం తీర్చుకోలేనిది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:30 pm

Rs.5 lakhs |రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం

Rs.5 lakhs | రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం Rs.5 lakhs |

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:29 pm

వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్విశాలాంధ్ర ధర్మవరం;; వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్, వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పోతుకుంట గ్రామం వద్ద రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రస్తరించార్జ్ మహేష్ చౌదరి కూడా పాల్గొన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ముఖ్యమంత్రి సందేశాన్ని కూడా వివరించడం జరిగిందని […] The post వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:27 pm

AKT To Show Ram As A Complete Actor

Ram Pothineni is widely known for his high-energy screen presence, and most directors tend to highlight that vibrant aspect of his persona. However, Andhra King Taluka is set to reveal a different dimension of Ram- one defined by depth, maturity, and controlled performance. While the film certainly carries his trademark lively moments, entertaining sequences, and […] The post AKT To Show Ram As A Complete Actor appeared first on Telugu360 .

తెలుగు 360 26 Nov 2025 5:22 pm

Collector |ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శం

Collector | ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శం రాజకుమారి : జిల్లా కలెక్టర్ డా.

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:22 pm

Natural resources|రాయలసీమను ఎడారి కాకుండా కాపాడండి..

Natural resources| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ ప్రాంతం రతనాల సీమ

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:22 pm

Indhanpalle |ఆవును చంపిన పులి

Indhanpalle | ఆవును చంపిన పులి యజమానికి నష్టపరిహారం చెల్లిస్తాం : అటవీ

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:21 pm

ప్రజల భద్రతే మా విధి.. ఎస్ ఐ. మరిడి నాయుడు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం: వలేటివారిపాలెం మండల ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని వలేటివారిపాలెం ఎస్ ఐ మరిడి నాయుడు అన్నారు. ఈ సందర్బంగాబుధవారం విశాలాంధ్ర విలేకరి తో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్నా తక్షణమే పోలీసులకు సమాచారం అందజేయాలని ఆకాక్షించారు.గౌరవాయుత, ప్రెండ్లీ పోలీసింగ్ నూతన దిశగా ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్ లు మరియు 112 ద్వారా 24గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు.అలాగే యువతను చెడు అలవాట్లు, మత్తు పదార్థాల […] The post ప్రజల భద్రతే మా విధి.. ఎస్ ఐ. మరిడి నాయుడు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:21 pm

24 hours | 20 ఏళ్ల కరెంట్‌ సమస్యకు ముగింపు

24 hours | 20 ఏళ్ల కరెంట్‌ సమస్యకు ముగింపు 24 hours

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:19 pm

Andhra Pradesh : పేదలకు గుడ్ న్యూస్... మూడు నెలలకొకసారి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 26 Nov 2025 5:19 pm

బడుగు వర్గాలకు అండ ఎన్.టీ.ఆర్, పరిటాల

-టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు : మహానేత ఎన్టీఆర్, కార్మిక శాఖ మాజీ మంత్రి దివంగత పరిటాల రవి బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచి ప్రజల మనసుల్లో ముద్ర వేసుకుకున్నారని టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి అన్నారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులిలో ఎన్.టీ.ఆర్, పరిటాల రవి విగ్రహాల ఏర్పాటుకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన మేరకు బుధవారం మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో […] The post బడుగు వర్గాలకు అండ ఎన్.టీ.ఆర్, పరిటాల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:17 pm

MLA |పై చ‌దువుల‌కు ఆర్థిక సాయం..

MLA | పై చ‌దువుల‌కు ఆర్థిక సాయం.. MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:10 pm

IFTU |కార్మికులపై తీవ్ర ఒత్తిడి…

IFTU | కార్మికులపై తీవ్ర ఒత్తిడి… IFTU జిల్లా నాయకులు ఎస్.బాలరాజు,ఏఐకెఎంఎస్ జిల్లా

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:09 pm

Tekumatla |రాజ్యాంగతోనే సమాన అవకాశాలు..

Tekumatla | రాజ్యాంగతోనే సమాన అవకాశాలు.. మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతుల శ్రీనివాస్

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:08 pm