బుధవారం రాశి పలాలు (15-10-2025)
మేషం - ఆర్థిక ప్రయోజనాలు సున్నితమైన అంశములతోటి వివాదాస్పదమైన వ్యక్తులతోటి ముడిపడి ఉంటాయి. ఓర్పు నేర్పులతోనే కార్య సాధన అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృషభం - ఊహలోకాలకు తెరదించి వాస్తవికత దృష్టితో విషయాలను పరిశీలించి అర్థం చేసుకుంటారు జమ ఖర్చులు ఆదాయ వ్యయాలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. మిథునం - పనులలో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకారంగా ఉంటుంది. చాలా విషయాలలో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చినప్పటికీ వెనుకడుగు వేయరు. కర్కాటకం - మీ ప్రతిభకు గుర్తింపుగా సన్మానాలు జరుగుతాయి. వివాహ ఉద్యోగయత్నాల అనుకూలిస్తాయి. మీ పట్ల ఈర్ష్య ద్వేషాలు అధికమవుతాయి. వివాదాస్పద అంశాలను వదిలివేయడం మంచిది. సింహం - నూతన పెట్టుబడులకు తగిన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతొ ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, అతిధుల నుండి శుభవార్తలు అందుకుంటారు. కన్య - క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నైపుణ్యంగా సమయస్ఫూర్తితో కట్టుదిట్టమైన కార్య ప్రణాళిక రూపొందించుకుంటారు. తద్వారా లాభపడతారు. తుల - సంస్థను విస్తరింప చేయడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూల దిశలో ఉంటాయి. ప్రయాణాలను సాగిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. వృశ్చికం - నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి అనుకూల సమయమని భావిస్తారు. మధ్యవర్తిత్వాలు రాయబారాలు మేలు చేకూరుస్తాయి. వినోద కార్యక్రమాలకు ఇచ్చిన ప్రాముఖ్యతను వృత్తికి ఇవ్వరు. ధనుస్సు - మాటమీద నిలబడే వ్యక్తిగా మంచి పేరును సంపాదిస్తారు. భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందనే ఆశావహ దృక్పథాన్ని కనబరుస్తారు. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మకరం - కొన్ని సందర్భాలలో దైవానుగ్రహం మీకు తోడు ఉందని రుజువు చేసే సంఘటనలు జరుగుతాయి. దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటారు. కుంభం - అమ్మకాలు కొనుగోలు అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వాయిదా పడుతూ వస్తున్న వ్యక్తిగత పనులను పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో మీరు చేసిన శ్రమ ఇప్పుడు అక్కరకు వస్తుంది. మీనం - కొంత లౌక్యాన్ని కనపరచగలిగితే ప్రయోజనాలను మరింతగా పొందగలుగుతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అంతరంగిక వ్యవహారాలలో కొన్ని రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి జోథ్పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను స్థానిక జవహర్ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశా యి. జైసల్మేర్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేట్ బస్సు జోథ్పూర్ బయలుదేరింది. జైసల్మేర్కు 20కిమీ దూరంలో థాయత్ గ్రామ సమీపంలో బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే బస్సంతా వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఫైర్ సిబ్బందికి తెలియజేశారు. బాధితులకు సహాయ చ ర్యలు చేపట్టారు. బస్సులో మొత్తం 57మంది ప్రయాణికులు ఉన్నారు. మృ తుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు, ఉన్నారని జైసల్మేర్ మున్సిపల్ కౌన్సిల్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ క్రిష్ణపాల్ సింగ్ రథోర్ వెల్లడించారు. బస్సులో ఉన్న వారిలో కొందరు కిటికీలు పగుల గొట్టి బయటపడ్డారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బస్సు ఇంజిన్ లేదా వైరింగ్ షార్టు సర్కూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. రాజస్థాన్ సిఎం భజన్లాల్ శర్మ మృతుల కుటుంబాలకు సంతాపం వెలిబుచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
గర్భవతిని చేసి యువతి మృతికి కారకుడైన హోంగార్డ్
ఏడు సంవత్సరాలుగా ప్రే మించాడు గర్బవతిని చేశాడు గర్భం తీయించే ప్రయ త్నం చేసి ఆమె చావుకు కారకుడయ్యాడు. ఈ దారుణమైన స ంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రంగారెడ్డి జిల్లా షారుఖ్ నగర్ మండలం రా య్కల్ గ్రామానికి చెందిన మౌనిక (29) ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుంది. అయితే శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫింగర్ ప్రింట్ విభాగంలో హొంగార్డు ఉద్యోగం చేస్తున్న ముచ్చింతల్ గ్రామానికి చెందిన మదుసుదన్ (39) తో ఏడు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. అమెను ప్రేమ పేరుతో లోపరుచుకుని శారీరకంగా వాడుకున్నాడు. దీంతో అమె నాలుగు రోజుల క్రితం గర్బవతి అయింది. విషయం మధుసుదన్ కు చెప్పడంతో అతను ఎలాగైనా గర్బాని తీయించాలని పథకం వేశాడు. సోమవారం ఉదయం అమెను తీసుకుని పాలమాకుల గ్రామంలోని ఆర్ఎంపి డాక్టర్ అయిన పద్మజ వద్దకు తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్త స్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశాడు. దీంతో మౌనిక మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు నింధితుడు మధుసుదన్ తోపాటు అబార్షన్ చేసిన ఆర్ఎంపి డాక్టర్ పద్మజలను అరేస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి పోలీసులు తరలించారు.
ఢిల్లీ ఎస్ఎయూ క్యాంపస్లోనే విద్యార్థినిపై లైంగిక దాడి
దేశ రాజధాని ఢిల్లీలో సౌత్ ఏషియన్ యూనివర్శిటీ(ఎస్ఎయూ)లో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి, దాష్టికం జరిగింది. సెక్యూరిటీ గార్డు సహా నలుగురు ఆమెపై లైంగిక దాడిచేసి, బట్టలు చించి, బలవంతంగా అబార్షన్ పిల్ తీసుకునేలా చేశారు. ఈ ఘాతుకం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే అక్టోబర్ 12న జరిగింది. దీనిపై మంగళవారం ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా 18 ఏళ్ల ఆ బాధితురాలు బట్టలు చిరిగి, గాయాలతో అక్టోబర్ 13న క్యాంపస్లో కనిపించింది. కాగా ఈ ఘటనతో విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఎనిమిది గంటల నిరసన చేపట్టారు. విషయాన్ని పోలీసులకు తెలుపడంలో కావాలని ఆలస్యం చేస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇదిలావుండగా ఈ ఘటనను సౌత్ ఏషియన్ యూనివర్శిటీ ఖండించింది. 10 రోజుల్లో వివరంగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశిస్తూ దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేసింది. జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆర్యన్ యశ్ అనే వ్యక్తి ఆమెను బెదిరిస్తూ మార్ఫ్డ్ ఫోటోలు, నగ్నఫోటోలతో ఈమెయిల్ సందేశాలు, సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపాడని సమాచారం. అతడి సూచనలు పాటించి ఆ విద్యార్థిని స్నాతోకోత్సవ కేంద్రం సమీపంలో మూసేసిన నిర్మాణ ప్రాంతానికి వెళ్లింది. అక్కడికి ఓ గార్డు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆ గార్డు ఓ మధ్య వయస్కుడైన వ్యక్తిని, ఇద్దరు అబ్బాయిలను పిలిచాడు. వారు నలుగురు తనపై శారీరకంగా దాడిచేశారని, బట్టలు చింపేశారని, తన నాలుక కింద బలవంతంగా గర్భస్రావ మాత్రను పెట్టడానికి ప్రయత్నించారని, దానిని తాను ప్రతిఘటించి ఉమ్మేసానని బాధితురాలు తెలిపింది. విశ్వవిద్యాలయం సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునే లోపే దాడి చేసిన వ్యక్తులు పారిపోయారు. పారిపోయిన నిందితులను పట్టుకోడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆధారాలు సేకరిస్తున్నారు. సిసిటివి ఫుటేజ్లను సేకరించారు.పోలీసు డిప్యూటీ కమిషనర్(సౌత్) అంకిత్ చౌహాన్ దర్యాప్తును చేపట్టాక కేసు ప్రాధాన్యత పెరిగింది. బాధితురాలకి ప్రస్తుతం కౌన్సెలింగ్ జరుగుతోంది. ఆమె తల్లిదండ్రులు విడిపోవడంతో ఆమె డిప్రెషన్లో ఉంది. ఆమె తండ్రి బీహార్లో నివసిస్తుంటే, తల్లి ముంబైలో నివసిస్తోంది. ఇదిలావుండగా సౌత్ ఏషియన్ యూనివర్శిటీ ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించింది. విద్యార్థులకు అన్ని రకాల మద్దతునిస్తానని హామీ ఇచ్చింది.
తమిళనాడు మద్యం కుంభకోణం దర్యాప్తుపై ఈడీ ని నిలదీసిన సుప్రీంకోర్టు
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించిన మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందని సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను ప్రశ్నించింది. మర్చిలో నిర్వహించిన రెండు దాడులపై ఆరు నెలల్లో రెండో సారి కోర్టు దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. వివరణ కోరింది.తమిళనాడు మద్యం కేసులో సుప్రీంకోర్టు పెడరలిజం వాదానికి ఏమైందని ప్రధానంగా ప్రశ్నించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఈడీ ని నిలదీస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి దర్యాప్తు చేసే హక్కును మీరు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం నేరాన్ని దర్యాప్తు చేయడం లేదా, మీరే ఆ రాష్ట్రానికి వెళ్లి దాన్ని చేయగలరా అని సీజేఐ ప్రశ్నించారు. విచారణ కొనసాగుతున్న సమయంలో ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించడం భావ్యం కాదని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.ఈ కేసులో మంగళవారం నాడు తమిళనాడు ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి వాదించారు. ఆరోపించిన నేరాలపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ, ప్రభుత్వరంగ సంస్థపై దాడులు చేసి, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎలా స్వాధీనం చేసుకుంటారని వారు ప్రశ్నించారు. ఇప్పటికే ఆరు ఎఫ్ఐఆర్ లు దాఖలు కాగా, ఈడీ ఎందుకు దర్యాప్తులో జోక్యం చేసుకుంటోందని కపిల్ సిబల్ ప్రశ్నించారు. కాగా, రోహత్గీ ప్రశ్నిస్తూ, టస్మాక్ సిబ్బంది గోప్యతా హక్కుకు ఏమైంది. వారు సిబ్బంది మొబైల్ లను ఎలా లాక్ చేసుకుంటారు అని ప్రశ్నించారు.ఈడీ తరుపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తన వాదన వినిపిస్తూ, రాష్ట్రం ఇప్పటికే 47 పోలీసు కేసులు నమోదు చేసిందని,ఈడీ మనీలాండరింగ్ అంశాన్ని మాత్రమే దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. కపిల్ సిబల్ మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 66(2) ప్రస్తావిస్తూ, దర్యాప్తు సమయంలో మరో చట్టం ఉల్లంఘన జరిగిందని, ఏజెన్సీ కనుకొంటే, తదుపరి చర్య కోసం సంబంధితన అధికారితో ఆ సమాచారం పంచుకోవల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
ఒకరి మృతి, ఒకరికి తీవ్ర గాయాలు..
కొత్తగూడ, (ఆంధ్రప్రభ): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లె సమీపంలోని బంగారుకుంట వద్ద
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఎంసిసి కేసు నమోదు చేశారు. మాగంటి సునీత ఆమె కూతురు మాంగటి అక్షర యూసుఫ్గూడ, వెంకటగిరి ఏరియాలో శుక్రవారం ప్రార్థనల తర్వాత మజీద్ ప్రాంతానికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ విషయం తెలియడంతో కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత, అక్షర, యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.
ఆద్యంతం ఆసక్తికరంగా బైసన్ ట్రైలర్
నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ దర్శకుడుగా ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం బైసన్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను హీరో దగ్గుబాటి రానా రిలీజ్ చేసి టీమ్కు శుభాకాంక్షలు చెప్పారు. 1990 బ్యాక్డ్రాప్ పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో వచ్చిన ఈ ట్రైలర్ రా అండ్ రస్టిక్గా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత బాలాజీ మాట్లాడుతూ..“ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంటూనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ధృవ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు”అని అన్నారు.
స్కూల్ బస్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి
నిజామాబాద్ జిల్లా, భీమ్గల్ మండలం, రహత్నగర్ గ్రామంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ అనే మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్గల్ పట్టణానికి చెందిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్కు చెందిన బస్ బడి పిల్లలను తీసుకురావడానికి రహత్నగర్ గ్రామానికి వెళ్ళింది. ఒక బాలుడి తల్లి శిరీష తన పెద్ద కుమారుడిని స్కూల్ బస్సులో ఎక్కిస్తోంది.. ఆ సమయంలో చిన్నారి శ్రీకాంత్ బస్ ముందు ఆడుకుంటూ ఉండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు నడపడంతో బస్సు బాలుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తలకి త్రీవ గాయాలై ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించాడు. విషయం తెలుసుకున్న సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.సందీప్ తెలిపారు. కాగా, స్కూల్ డ్రైవర్ నిర్లక్ష్యంతో చనిపోయిన బాలుడి మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బంధువులు బైఠాయించారు. దీంతో స్కూల్ యాజమాన్యం ప్రాణంతో ఖరీదు కట్టినట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్ ముందు బాలుడి మృతదేహం కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తుండడంతో కొందరు మధ్యవర్తులు జోక్యం చేసుకున్నారు. పసివాడి ప్రాణం ఖరీదుకు పాఠశాల యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, రూ.9 లక్షలు చెల్లించేందుకు బాధిత కుటుంబ సభ్యులను ఒప్పించినట్టు తెలుస్తోంది.
మొదటిసారి కెసిఆర్ ఫొటోలేకుండా జనంలోకి కవిత
రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. ఈ నెల చివరివారంలో యాత్ర ప్రారంభించనున్నారు. తెలంగాణలో అన్ని జిల్లాల మీదుగా యాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు.ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు యాత్ర నిర్వహించనున్నారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి, స్వయానా తండ్రి అయిన కెసిఆర్ ఫొటో లేకుండా యాత్ర చేయాలని కవిత నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ జాగృతి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కెసిఆర్ ఫొటో లేకుండా కార్యక్రమాలు నిర్వహించలేదు. మొదటిసారి కెసిఆర్ ఫొటో లేకుండా కల్వకుంట్ల కవిత జనంలోకి వెళ్లనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో రూపొందించిన తెలంగాణ జాగృతి యాత్ర పోస్టర్ను కవిత బుధవారం ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మేధావులు, విద్యావంతులతో ఇటీవల కవిత వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాగృతి నేతలకు నియామకపత్రాలు అందజేత తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లాల నాయకులకు రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించే వరకు యువత వదిలిపెట్టదు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో యువతదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, అందులో యువతది కీలక పాత్ర ఉండాలని తాను భావిస్తున్నానని చెప్పారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారు మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాలని ఆకాంక్షించారు.
కర్నూలు , ఆంధ్రప్రభ బ్యూరో : కర్నూలులో జరగబోయే సూపర్ జీఎస్టీ –
బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్కు ‘కోమటి రెడ్డి ప్రతీక్’ పేరు
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్కు ‘కోమటి రెడ్డి ప్రతీక్’ పేరు పెట్టినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. సుమారు రూ.8 కోట్లతో నూతన స్కూల్ భవన నిర్మాణం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మంగళవారం మంత్రి కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రైమరీ అండ్ హైస్కూల్ స్థానంలో కార్పొరేట్కు దీటుగా అధునాతన సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించినట్టు మంత్రి తెలిపారు. అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా భవనంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తన ప్రథమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. నల్లగొండ లో పేదల విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నామని ఆయన అన్నారు. రాబోయే మూడేళ్లలో దశల వారీగా నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు అధునాతన సౌకర్యాలతో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. స్కూల్ కు ‘కోమటి రెడ్డి ప్రతీక్‘ ప్రభుత్వ పాఠశాలగా నామకరణం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా పాఠశాలను ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
డిప్యూటీ సీఎంకు వేద పండితుల ఆశీర్వచనం..
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు
అవేం పొగడ్తలు.. మాటలతో ట్రంప్ను ఉక్కిరిబిక్కిరి చేసిన పాక్ ప్రధాని
కైరో : ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపునకు సంబంధించి ఈజిప్టు లోని షర్మ్ షేక్లో శాంతి ఒప్పందంపై దేశాధినేతలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనంత గొప్ప అధ్యక్షుడు లేడన్నట్టు వ్యాఖ్యలు చేశారు. షరీఫ్ మాటలకు ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. చివరికి తాను మాట్లాడాల్సింది ఏమీ లేదంటూ చేతులెత్తేసి , ఇంటికి వెళ్లిపోదామంటూ షరీఫ్తో చమత్కరించారు. షెహబాజ్ మాట్లాడుతూ.. “ఈరోజు చరిత్రలో గొప్ప రోజుల్లో ఒకటి. ఎందుకంటే అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో అవిశ్రాంత ప్రయత్నాల తరువాత గాజాలో శాంతి సాధన అయింది. ఆయన నిజంగా శాంతిని కోరుకునే వాడు. ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి, శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు” అని కొనియాడారు. ఈ సందర్భంగా పాక్ భారత్ మధ్య జరిగిన సంఘర్షణను కూడా ట్రంపే ఆపారంటూ క్రెడిట్ ఇచ్చేశారు. ‘ భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంతో పాటు కాల్పుల విరమణ సాధించడానికి ట్రంప్ అసాధారణ ప్రయత్నాలు చేశారు. భారత్-పాక్ రెండూ అణ్వాస్త్ర శక్తులు. ఆ నాలుగు రోజుల్లో ట్రంప్, ఆయన అద్భుతమైన బృందంతో జోక్యం చేసుకోకపోతే, ఆ ఘర్షణలు పశ్చిమాసియాకు విస్తరించి ఉండేవి. ఏం జరిగిందో చెప్పేందుకు కూడా ఎవరూ మిగిలే వారు కాదు. ఇందుకు గాను నోబెల్ శాంతి బహుమతికి పాక్ ఆయనను నామినేట్ చేసింది. ఇది అందుకునేందుకు ఆయన అర్హుడు. ఇప్పటివరకు ఏడు యుద్ధాలు ఆపారు. ఇది ఎనిమిదవది ’ అంటూ షరీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు. షరీఫ్ ప్రసంగం నేపథ్యంలో అక్కడే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నోటిమీద చేయి వేసుకొని చూస్తూ ఉండిపోయారు. షరీఫ్ ప్రసంగం అనంతరం ఆసక్తికర చోటు చేసుకుంది. షరీఫ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బయిన ట్రంప్ ఇది తాను ఊహించలేదన్నారు. ఇంకా తాను మాట్లాడేందుకు ఏమీ లేదంటూ ... ఇంటికి వెళ్దాం అంటూ చమత్కరించారు. దీంతో ఆ ప్రాంగణం మొత్తం నవ్వులు విరిశాయి.
Sharwanand and Srinu Vaitla Film Locked
Veteran director Srinu Vaitla has worked on a script and he is aiming a strong comeback. There are lot of speculations around the film and Nithiin was finalized for the project. But, the movie now landed into the hands of Sharwanand. An official announcement will be made in the upcoming week and the shoot commences […] The post Sharwanand and Srinu Vaitla Film Locked appeared first on Telugu360 .
పహల్గాం తరహాలో మరోదాడి జరగొచ్చు..
శ్రీనగర్ : పహల్గాం తరహాలో పాకిస్థాన్ మరోసారి దాడికి ప్రయత్నించవచ్చని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలే కనుక జరిగితే భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందని అన్నారు. జమ్ముకశ్మీర్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్కు గట్టి బదులిచ్చాం. కానీ దాయాది ఎప్పటికీ తన బుద్ధి మార్చుకోదు. పహల్గాం తరహాలో మరోదాడికి యత్నించవచ్చు. అందుకే దాని ప్రతి కదలికపై మేం దృష్టి సారించాం. ఈసారి అలాంటి దుశ్చర్యలకు పాల్పడితే, మనం ఇచ్చే సమాధానం మామూలుగా ఉండదు ” అని మనోజ్కుమార్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గాంకు దగ్గర్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన వారు పర్యాటకులను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ సంఘటనలోఓ కశ్మీరీ సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొత్త లెక్సస్ LM 350h ని పరిచయం చేసిన లెక్సస్ ఇండియా
బెంగళూరు: భారతదేశంలో కార్ల ప్రముఖ ప్రీమియం బ్రాండ్ గా పేరొందిన లెక్సస్ ఇండియా... తాజాగా LM 350h ను పరిచయం చేసింది. ఇది అల్ట్రా-లగ్జరీ మొబిలిటీ విభాగాన్ని సరికొత్త పునర్నిర్వచించడానికి రూపొందించబడింది. సరికొత్త LM 350h రాక ప్రీమియం కార్ల మోడల్స్ లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది గెస్ట్ లకు అసమానమైన వైభవం, విలక్షణమైన డిజైన్ మరియు అసాధారణ సౌకర్యాన్ని అందించడంలో లెక్సస్ నిబద్ధతను బలోపేతం చేస్తుంది. ఫ్లాగ్ షిప్ వెహికల్ అయినటువంటి LM 350hకు ఇప్పటికే భారత మార్కెట్లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది విలాసవంతమైన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ లో ఇది ఎంటర్ అయ్యిందో... అప్పటినుంచే కొత్త లెక్సస్ LM 350h దేశవ్యాప్తంగా లగ్జరీ వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. విలాసవంతమైన ప్రయాణ అనుభవం కోసం పెరుగుతున్న కోరికను ప్రతిబింబిస్తుంది, ఫస్ట్-క్లాస్ ప్రయాణానికి కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. సరికొత్త LM 350h ప్రీమియం మోడల్ లో చాలా వివరాలను అద్భుతంగా పొందుపరిచారు. అల్ట్రా-లగ్జరీ మొబిలిటీ రంగంలో అగ్రగామి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇది అప్ డేట్స్ సూట్ను పరిచయం చేస్తుంది. ఈ అప్ డేట్స్ ని ఒక్కసారి చూస్తే...: · స్థిరత్వం మరియు అధునాతన సాంకేతికత పట్ల లెక్సస్ నిబద్ధతను ప్రదర్శించే E20-కంప్లైంట్ ఇంజిన్. · మెరుగైన సౌలభ్యం మరియు సహజమైన నియంత్రణ కోసం వెనుక కన్సోల్లో పవర్ స్లైడింగ్ డోర్ స్విచ్. · నాలుగు సీట్ల వేరియంట్లో మెరుగైన భద్రత మరియు డ్రైవర్ సౌకర్యం కోసం ఆటో-డిమ్మింగ్ ORVM ఫంక్షన్. · నాలుగు సీట్ల వేరియంట్లో వెనుక సీట్లలో కూర్చునేవారికి సౌలభ్యం మరియు మెరుగుదలను అందించే కొత్త వెనుక కన్సోల్ ట్రే. ఈ సందర్భంగా లెక్సస్ ఇండియా అధ్యక్షుడు శ్రీ హికారు ఇకేచి గారు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ... లెక్సస్ LM 350h కు మా గెస్ట్ ల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందనను చూసి మేము నిజంగా గర్విస్తున్నాము. ఈ అసాధారణ వాహనం కోసం వేచి ఉన్నందుకు మా కస్టమర్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. LM అనేది విలాసానికి మా అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. ఇందులో గ్రాండ్ ఇంటీరియర్స్, సౌకర్యం మరియు అధునాతనతను పునర్నిర్వచించే ప్రత్యేకమైన ప్రైవేట్ లాంజ్ ఉన్నాయి. ఇది ఫస్ట్-క్లాస్ లగ్జరీ ప్రయాణంలో కొత్త బెంచ్మార్క్ను నిర్దేశిస్తుంది. భారతదేశంలో మా గెస్ట్ లకు అధునాతనత, ప్రతిష్ట మరియు ఆనందం యొక్క అసమానమైన అనుభవాన్ని అందిస్తుంది. అని అన్నారు ఆయన. సరికొత్త లెక్సస్ LM 350h డెలివరీలు ఇవాళ్టి నుంచే ప్రారంభమవుతున్నాయి. మరిన్ని వివరాల కోసం గెస్ట్ లు తమ సమీపంలోని గెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించవచ్చు.
తాగునీరు-సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం..
విశాలాంధ్ర-తాడిపత్రి /పుట్లూరు: త్రాగు, సాగునీటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని కందికాపుల గ్రామంలో 1.50 లక్షల రూపాయల వ్యయంతో జె.సి. నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని ఎం.పీ. అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పునఃప్రారంభించారు. అనంతరం చింతకుంట గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్, 5 లక్షల రూపాయల వ్యయంతో సి.సి. రోడ్లను ప్రారంభించారు. చింతకుంట గ్రామానికి చెందిన […] The post తాగునీరు-సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం.. appeared first on Visalaandhra .
Telusu Kada is a never-before-seen love story – Siddhu Jonnalagadda
Star Boy Sidhu Jonnalagadda starrer Telusu Kada has created good anticipation with the blockbuster songs of S Thaman and teaser, trailer have captured the imagination of all audiences. Now, Siddhu interacted with the media about the film and he stated that “it will be a never-before-seen love story”. Supporting his statement, the actor said, “80% […] The post Telusu Kada is a never-before-seen love story – Siddhu Jonnalagadda appeared first on Telugu360 .
సముద్రంలోనూ అమెరికా-చైనా ట్రేడ్ వార్..
బీజింగ్ : అమెరికాచైనా మధ్య ఇటీవల వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్న సంగతి తెలిసిందే. బీజింగ్పై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో ఇరు దేశాల మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం రాజుకుంది. తాజాగా ఇరుదేశాలు నౌకలపై పరస్పర ప్రత్యేక ఫీజులు ప్రకటించాయి. అమెరికా యాజమాన్యం నిర్వహణలో ఉన్న నౌకలు, యూఎస్ నిర్వహించే లేదా ఆ దేశ జెండాలతో వచ్చే ఓడలపై ప్రత్యేక ఛార్జీలను వసూలు చేస్తున్నట్టు చైనా మంగళవారం ప్రకటించింది. అయితే చైనా నిర్మించిన నౌకలకు ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. అటు అమెరికా కూడా నేటి నుంచి ఈ ఫీజుల వసూలు ప్రారంభించింది. చివరివరకూ పోరాడతాం: చైనా మరోవైపు అమెరికా అదనపు సుంకాలపై చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందించింది. “ వాణిజ్య యుద్ధం.. టారిఫ్ల అంశంపై మా వైఖరి స్థిరంగా ఉంది. మీరు (అమెరికాను ఉద్దేశిస్తూ ) యుద్ధం కోరుకుంటే మేం చివరివరకూ పోరాడతాం. అదే చర్చలు కావాలనుకుంటే మా తలుపులు తెరిచే ఉన్నాయి” అని వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రపంచం లో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఇటీవల చైనా నియంత్రణలు విధించింది. ఇకపై విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇది ట్రంప్నకు కోపం తెప్పించింది. దీంతో బీజింగ్పై 100 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అవి నవంబరు 1 నుంచి గానీ, అంతకు ముందు నుంచి గానీ అమల్లోకి వస్తాయని తెలిపారు. దీంతోపాటు చైనాకు అమెరికా సంస్థలు ఎగుమతి చేసే కీలక సాఫ్ట్వేర్ల పైనా నియంత్రణ విధిస్తామని వెల్లడించారు.
గోదావరిఖని, ఆంధ్రప్రభ: గోదావరిఖని పట్టణాన్ని వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చేసేందుకే రూ.27
ఆంధ్రప్రభ, వెబ్ బిజినెస్ డెస్క్ : అమెరికా.. చైనా టారిఫ్ కుస్తీలో… భారత
మాగంటి సునీతకు బీఫామ్ అందజేసిన కేసీఆర్..
గజ్వేల్ (ఉమ్మడి మెదక్ జిల్లా), ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో
‘ఇది ఆల్టైమ్ చెత్త ఫొటో’.. ట్రంప్ సెల్ఫ్ ట్రోలింగ్ #TeluguPost #telugu #post #news
Fresh Tensions Between Telugu States Over Godavari–Krishna Water Link
The political heat between the Telugu states is intensifying once again, this time over the Godavari–Banakacharla Link Project. The Andhra Pradesh government’s decision to move forward with the project has drawn sharp criticism from Telangana, which alleges that the plan could undermine its water rights. According to the Andhra Pradesh government, the Polavaram–Banakacharla Link Project […] The post Fresh Tensions Between Telugu States Over Godavari–Krishna Water Link appeared first on Telugu360 .
Kangana Ranaut compares her journey to Shah Rukh Khan
Kangana Ranaut, an actor who is also active in politics, stated that she had a harder time making it in Bollywood compared to Shah Rukh Khan. She shared this opinion at an event in Delhi today. She questioned why she achieved so much success, suggesting that very few people from small villages reach such high […] The post Kangana Ranaut compares her journey to Shah Rukh Khan appeared first on Telugu360 .
గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బోగ రామస్వామి
గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బోగ రామస్వామి కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :
ఘనంగా జిఇ ఏరోస్పేస్ పూణే తయారీ సౌకర్యం 10వ వార్షికోత్సవం
పూణే: జిఇ ఏరోస్పేస్ యొక్క పూణే తయారీ సౌకర్యం ఈ రోజు తన పది సంవత్సరాల విజయవంతమైన కార్యకలాపాలను జరుపుకుంది. భారతీయ విమానయాన పరిశ్రమలో కంపెనీకి ఉన్న నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. గత దశాబ్దంలో, పూణే సౌకర్యం వాణిజ్య జెట్ ఇంజిన్ భాగాల తయారీకి ప్రధాన కేంద్రంగా మారడమే కాకుండా, అధునాతన తయారీ నైపుణ్యాల అభివృద్ధికి ఒక అగ్రగామి వేదికగా అవతరించింది. తన అప్రెంటిస్షిప్ మరియు ఇతర శిక్షణా కార్యక్రమాల ద్వారా, ఈ సౌకర్యం ఇప్పటివరకు 5,000 మందికి పైగా ఉత్పత్తి సహచరులను శిక్షణను అందిస్తుంది. “ఈ ఫ్యాక్టరీని ప్రారంభించినప్పుడు పూణేలో ఏరో-ఇంజిన్ తయారీ పర్యావరణ వ్యవస్థలో ఇంత అభివృద్ధి లేదు. అయితే, పది సంవత్సరాల తరువాత, మేము ప్రపంచ స్థాయి తయారీ నైపుణ్య కేంద్రాన్ని నెలకొల్పడమే కాకుండా, దేశంలోని విస్తృత ఏరోస్పేస్ రంగ అభివృద్ధికి కూడా సహకరించగలిగాము. మహారాష్ట్రలో అధిక విలువ కలిగిన తయారీ మరియు నైపుణ్య అభివృద్ధికి స్థానిక సామర్థ్యాన్ని నిర్మించడంలో మేము సాధించిన పురోగతి పట్ల నేను నిజంగా గర్వపడుతున్నాను,” అని మిస్టర్. అమోల్ నగర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ & సప్లై చైన్, జిఇ ఏరోస్పేస్ తెలిపారు. పూణే సౌకర్యం CFM* LEAP, GEnx మరియు GE9X ఇంజిన్ల కోసం విడిభాగాలను తయారు చేస్తోంది — ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాక్టరీల్లో పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్లను తీర్చడానికి ఉపయోగించబడుతున్నాయి. ఈ సౌకర్యం విజయానికి ప్రేరణగా ఉన్నది GE ఏరోస్పేస్ యొక్క యాజమాన్య లీన్ ఆపరేటింగ్ మోడల్ FLIGHT DECK, ఇది భద్రత, నాణ్యత మరియు సామర్థ్యానికి ప్రాధాన్యతను అందిస్తుంది. ఫ్లయిట్ డెక్ అమలు చేయడం ద్వారా, మరియు షాప్ ఫ్లోర్ ఉద్యోగుల నుండి వచ్చిన 1,000కి పైగా సూచనలను అనుసరించడం ద్వారా, పూణే సౌకర్యం వ్యర్థాలను గణనీయంగా తగ్గించింది, ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచింది మరియు ఉత్పత్తి స్థాయిని మెరుగుపరిచింది. అంతేకాకుండా, భద్రతా ప్రమాణాలను మరింతగా బలపరిచింది. క్లిష్టమైన భాగాల ఉత్పత్తి కోసం కొత్తగా ఏర్పాటు చేసిన మోడల్ లైన్లో, ఈ సౌకర్యం తక్కువ లీడ్ టైమ్లను సాధించింది, అదే బృందంతో అధిక ఉత్పాదకతను సాధించింది, మరియు డౌన్టైమ్ను తగ్గించింది. కేవలం ఆరు త్రైమాసికాల్లో చేసిన పలు మెరుగుదలల ఫలితంగా, ఆ లైన్ ప్రస్తుతం ఇంతకుముందు కంటే రెండు రెట్లు ఎక్కువ భాగాలను ఉత్పత్తి చేస్తోంది. “పూణేలో తయారైన భాగాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కర్మాగారాలకు సరఫరా అవుతూ, అక్కడ అవి CFM యొక్క LEAP, GEnx మరియు GE9X ఇంజిన్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భద్రత మరియు నాణ్యతపై మా అచంచలమైన దృష్టితో, GE యొక్క యాజమాన్య ఫ్లైట్ డెక్ లీన్ ఆపరేషన్స్ మోడల్ను ఉపయోగించి, ప్రపంచ వినియోగదారుల పెరుగుతున్న అవసరాలను తీర్చడం మాకు ఆనందంగా ఉంది,” మిస్టర్. విశ్వజిత్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్, పూణే మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, జిఇ ఏరోస్పేస్ అన్నారు. తయారీతో పాటు, GE ఏరోస్పేస్ యొక్క పూణే సదుపాయం ఖచ్చితమైన తయారీ నైపుణ్యాల్లో ఇంజనీరింగ్ ప్రతిభను తీర్చిదిద్దుతూ, బలమైన స్థానిక ఏరోస్పేస్ శ్రామిక శక్తిని అభివృద్ధి చేసింది. ప్రతి సంవత్సరం, కొత్త డిప్లొమా ఇంజనీర్లు తరగతి గది మరియు షాప్ ఫ్లోర్ శిక్షణల సమ్మిళిత కార్యక్రమంలో పాల్గొంటారు, దీని ద్వారా వారు ఏరోస్పేస్ తయారీ భద్రత మరియు నాణ్యత యొక్క అత్యున్నత ప్రమాణాలను అవలంబిస్తారు. GE ఏరోస్పేస్ భాగకాల గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లను కూడా స్పాన్సర్ చేస్తుంది, తద్వారా తమ నైపుణ్యాలను పెంపొందించే మరియు నాయకత్వ పాత్రల్లో ఎదిగే ఇంజనీర్ల బృందాన్ని సృష్టిస్తుంది. ప్రస్తుతం, పూణే సదుపాయంలో 300 మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తుండగా, మరెందరో భారతదేశ ఏరోస్పేస్ రంగంలో సానుకూల మార్పుకు తోడ్పడుతున్నారు. పర్యావరణ నిర్వహణ అనేది పూణే సౌకర్యం యొక్క ప్రధాన లక్షణం. ISO 14001 మరియు ISO 45001 ధృవపత్రాలు పొందిన ఈ సౌకర్యం, తన మొత్తం విద్యుత్ వినియోగంలో 30% ను పునరుత్పాదక వనరుల నుండి పొందుతోంది.
మరియాకు నోబెల్ .. నార్వేలో దౌత్య కార్యాలయం మూసివేత
ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎంపికపై భగ్గుమన్న వెనెజువెలా ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నార్వే లోని తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు వెనెజువెలా విదేశాంగ మంత్రిత్వశాఖ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. తమ దౌత్య కార్యకలాపాల అంతర్గత పునర్వవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మరోవైపు జింబాబ్వే, బుర్కినా ఫాసో వంటి దేశాల్లో తమ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు గాను ఆస్ట్రేలియా లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు పేర్కొంది. వెనెజువెలా ప్రభుత్వం నిర్ణయంపై నార్వే విదేశాంగ మంత్రిత్వశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. అనేక విషయాల్లో తమ విభేదాలు ఉన్నప్పటికీ వెనెజువెలాతో తాము చర్చలు కోరుకుంటున్నామని తెలిపింది. ఆ దిశగా పనిచేస్తుందని వివరించింది. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి ప్రకటించడం అనేది నార్వే ప్రభుత్వానికి చెందిన స్వతంత్ర నిర్ణయమని స్పష్టం చేసింది. వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మచాదో , దేశ ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ పేర్కొంది. వెనెజువెలాకు ప్రస్తుతం నికోలస్ మదురో అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే మదురో ఎన్నికను యూఎస్తో సహా పలు దేశాలు గుర్తించలేదు. మచాదోకు నోబెల్ ప్రకటించడంపై అక్కడి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ క్రమం లోనే దౌత్య కార్యాలయం మూసివేయడం గమనార్హం. ఇక తనకు దక్కిన ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అంకితమిస్తున్నట్టు మచాదో పేర్కొన్నారు.
Telangana : ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలివే
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈనెల 16వతేదీన జరగనుంది
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు పట్టివేత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది మంగళవారం గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...రైలులో గంజాయి చాక్లెట్లు తీసుకువస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో బృందం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లారు. అక్కడ పదో నంబర్ రైల్వే ఫ్లాట్ ఫాం వద్ద అనుమానస్పదంగా కన్పించిన బ్యాగును తీసి పరిశీలించగా గంజాయి చాక్లెట్లు లభించాయి. బ్యాగులో 1.6కిలోల గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చినట్లు గుర్తించారు. ఎక్సైజ్ సిబ్బందిని గుర్తించిన గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చిన నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం ఎక్సైజ్ చాక్లెట్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
మూడేళ్ల చిన్నారి మృతి భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్గల్ మండల కేంద్రానికి
చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దండి…
విశాలాంధ్ర-తాడిపత్రి: చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయొద్దండని మునిసిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి ప్రజలకు సూచించారు. మంగళవారం పట్టణంలోని విజయనగర్ కాలనీలో మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి పర్యటిస్తూ ఉండగా విజయనగర్ కాలనీలోని రాముల గుడి ఎదురుగా రోడ్డు పక్కలో చెత్త ఉండడం జెసి. ప్రభాకర్ రెడ్డి గమనించాడు. దీంతో జెసి. ప్రభాకర్ రెడ్డి చీపురు చేత పట్టుకుని చెత్తను ఉడ్చాడు. ఈ సందర్భంగా జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ చెత్త వాహనాలు వచ్చినప్పుడు […] The post చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దండి… appeared first on Visalaandhra .
నాగర్కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, మాచినోనిపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం ఓ రైతు దగ్గర విద్యుత్ లైన్మన్ నాగేందర్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబికి పట్టుబడ్డాడు. ఎసిబి మహబూబ్నగర్ డిఎస్పి సిహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు మండలంలోని మాచినోనిపల్లి గ్రామానికి చెందిన రైతు తన వ్యవసాయ పొలంలో ట్రాన్స్ఫార్మర్ కావాలని ఎన్నో రోజుల నుండి డిడిలు కట్టి ఇంకా ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నాడు. సంబంధిత లైన్మన్ నాగేందర్ను ఇదే విషయమై ప్రశ్నించగా ‘ఇప్పట్లో నీ ట్రాన్స్ఫార్మర్ రావాలంటే సీరియల్ నెంబర్ 450 ఉందని, కనుక రావడానికి చాలా రోజులు సమయం పడుతుంది’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.దీంతో తొందరగా రావాలంటే రూ.20 వేలు అదనంగా ఇస్తే త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నాడు. దీంతో వారిద్దరి మధ్య రూ.15 వేలకు బేరం కుదిరింది. అయితే, బాధిత రైతు లైన్మన్కు ఆ డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచలన మేరకు మంగళవారం రూ.15 వేలు లైన్మన్ లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పి తెలిపారు.
ఎసిబి వలలో సర్వేయర్, అసిస్టెంట్
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ సర్వేయర్ మాడిశెట్టి వేణుగోపాల్, అతని అసిస్టెంట్ సూర్యవంశీ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్హ్యాండెడ్గా పట్టుపడ్డారు. ఎసిబి డిఎస్పి విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదో వార్డు చిన్నబోనాలలో ప్రవీణ్ అనే రైతుకు చెందిన 3 ఎకరాల భూమిని సర్వే చేసేందుకు సర్వేయర్ వేణుగోపాల్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. అందులో రూ.10 వేలు ముందుగా స్వీకరించి సోమవారం భూమి సర్వే చేశాడు. మంగళవారం సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మరో రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రూ.20 వేలు ఇవ్వడానికి మనసొప్పని బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ఎసిబి డిఎస్పి విజయ్కుమార్ సారధ్యంలో సిరిసిల్లలో కాపుకాసి, బాధితుడి నుండి సర్వేయర్ వేణుగోపాల్, అతని అసిస్టెంట్ సూర్యవంశీ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి బుధవారం ఎసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. కాగా, మంగళవారం ఎసిబికి చిక్కిన సర్వేయర్ వేణుగోపాల్పై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
వినియోగించుకున్న ప్రజలు కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండల
83 రోజుల్లో రూ. 81 లక్షలు బాసర, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం
పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై సమరం కొనసాగుతోంది. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ మరోసారి అభ్యంతరం
హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య
హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు పరిష్కారం కాక ముందే మరో అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు. సైబర్ క్రైం విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఏఎస్ఐ) సందీప్ కుమార్ మృతదేహం రోహటక్ - పానిపట్ రోడ్డులోని ట్యూబ్ వెల్ సమీపంలో లభ్యమైంది. పూరన్ కుమార్ అవినీతి కేసును అతడు దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ కుమార్ మృతదేహం సమీపంలోనే పోలీసులు మూడు పేజీల సూసైడ్ నోట్ ను, స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆ అధికారి రికార్డు చేసిన వీడియో ను పరిశీలిస్తున్నారు. వరుసగా ఇద్దరు సీనియర్ పోలీసు అధికారుల ఆత్మహత్య పై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రతిపక్షాల వత్తిడి నేపథ్యంలో రాష్ట్ర డిజీపీ శతృఘ్న్ కపూర్ ను సెలవుపై పంపివేసింది. గతంలోనే రోహ్ తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా ను బదిలీ చేశారు. సందీప్ కుమార్ తన నోట్ లో అక్టోబర్ 7న ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పూరన్ కుమార్ ఒక అవినీతి అధికారి అని, ఆయనకు సంబంధించి చాలా ఆధారాలు, రుజువులు ఉన్నాయన్నారు. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా తనను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నానని ఏఎస్ ఐ పేర్కొన్నాడు. చనిపోయే ముందు మొత్తం అవినీతి బాగోతాన్ని బయటపెట్టాలని అనుకుంటున్నట్లు ఆ నోట్ లో పేర్కొన్నారు. తన మరణం తర్వాత నైనా ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని తాను కోరుతున్నట్లు సందీప్ కుమార్ పేర్కొన్నారు. పూరన్ కుమార్ అవినీతి కుటుంబాన్ని వదిలి పెట్టకూడదని, అతడు తన స్వార్థం కోసం కులరాజకీయాలను వాడుకొని, వ్యవస్థనే హైజాక్ చేశాడని నోట్ లో ఆరోపించారు. ఆ వీడియోలో పూరన్ కుమార్ కుల రాజకీయాలు, అవినీతి తో పోలీసు శాఖనే తీవ్రంగా ప్రభావితం చేశాడని ఆరోపించారు. ఐపీఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునుంచే కులరాజకీయాలను ప్రారంభించి, తన వారిని కింది ఉద్యోగులుగా నియమించుకుని పైళ్ల శోధన చేపట్టాడని సందీప్ పేర్కొన్నాడు. తర్వాత సంబంధిత అధికారులను పిలిపించి, హింసించి డబ్బువసూలు చేసేవాడని, మహిళా పోలీసు అధికారులను కూడా బదిలీ చేస్తామని బెదిరిస్తూ, కొందరిపై లైంగిక వేధింపులకు గురు చేశాడని ఆ వీడియోలో ఆరోపించారు. ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై దర్యాప్తు అక్టోబర్ 7న 52 ఏళ్ల ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ చండీగఢ్ లోని సెక్టార్ 11లోని తన నివాసంలోసర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆకేసు దర్యాప్తు చేస్తున్న బృందంలోని ఏఎస్ఐ సందీప్ కుమార్ కూడా నేడు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశం అయింది.పూరన్ కుమార్ 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. రోహ్ తక్ లోని సునారియాలోని పోలీసు శిక్షణా కేంద్రంలో ఇన్ స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన భార్య ఐఏఎస్ అధికారి అమ్ నీత్ పూరన్ కుమార్ ఇంట్లో లేరు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నాయకత్వంలోని ప్రతినిధివర్గంలో సభ్యురాలిగా జపాన్ లో అధికారిక పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర డిజీపీ శతృఘ్న్ కుమర్ పై వేటు ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య, అదే కేసు దర్యాప్తు చేస్తున్న మరో ఏఎస్ఐ కూడా బలవన్మరణానికి పాల్పడడంతో హర్యానా ప్రభుత్వం సీరియస్ అయింది. ఒక పక్క ప్రతిపక్షాలు దాడి ప్రారంభించడం, మరో పక్క పూరన్ కుటుంబసభ్యులు ఆయనను వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర డిజిపీ శతృఘ్న్ కుమార్ ను సెలవులో పంపివేసింది. ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం రోహ్ తక్ పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర బిజర్నియాను బదిలీ చేసింది డీజీపీని రాష్ట్రప్రభుత్వం డీజీపీ ని సెలవులోకి పోవల్సిందిగా ఆదేశించినట్లు హర్యానా ముఖ్యమంత్రి మీడీయా సలహాదారు రాజీవి జైట్లీ వెల్లడించారు. పూరన్ కుమార్ తన సూసైడ్ నోట్ లో డిజీపీ శతృఘ్న్ కుమార్, నరేంద్ర బిజర్నియా లు కూడా కులవివక్షతతో , తనను మానసికంగా వేధించారని పేర్కొన్నారు.
గగన వీధిలో మిలమిల ఆంధ్రప్రభ, వెబ్ బిజినెస్ డెస్క్ : ఇటు దీపావళి
కాంగ్రెస్ పాలనలో కుప్పకూలుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ: హరీష్ రావు
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా పయణిస్తున్నదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైతే, తెలంగాణలో నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు అవుతుండటం మందగించిన ఆర్థిక పతనానికి సంకేతంగా నిలుస్తున్నదని అన్నారు. జూన్లో -0.93 శాతం, జూలైలో -0.44 శాతం, సెప్టెంబర్లో -0.15 శాతాలలో వరుసగా నాలుగు నెలల్లో మూడు నెలలు డిఫ్లేషన్ నమోదు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణాత్మక ద్రవ్యోల్బణం మూడు సార్లు నమోదు కావడం ఇదే మొదటి సారి అని వ్యాఖ్యానించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సాధారణంగా వినియోగం పెరిగి, పాజిటివ్ ద్రవ్యోల్బణం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కానీ, నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక విధానాల వైఫల్యం అని ఆరోపించారు. కెసిఆర్ పాలనలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన, ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్రం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుల్డోజర్ విధానాలు, ప్రతీకార రాజకీయాలు మానుకొని పాలనలో నానాటికి చతికిల పడిపోతున్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు విక్రయించినా చర్యలు తప్పవు…
నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమనిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి. విశాలాంధ్ర పుట్టపర్తి:- టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పి సతీష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ రానున్న దీపావళి సందర్భంగా అనుమతులు పొందిన ప్రతి ఒక్కరూ టపాసులు నిల్వ ఉంచే ప్రాంతాలతో పాటు అమ్మకాలు చేపట్టే దగ్గర ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు […] The post నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు విక్రయించినా చర్యలు తప్పవు… appeared first on Visalaandhra .
‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.#chiranjeevi #MeesalaPilla #DasaraRelease #anilravipudi
మాగంటి సునీతకు బి.ఫాం అందజేసిన కెసిఆర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్కు పార్టీ అధినేత కెసిఆర్ మంగళవారం బి.ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు, కుమారుడు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ఎంఎల్ఎలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 9మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాజధాని ఢాకాలోని ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఢాకాలోని మీర్పూర్ ప్రాంతంలో ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగి ఉన్న రెండు భవనాల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి.. కర్మాగారంలోని మొదటి, రెండవ అంతస్తుల నుండి తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. విష వాయువు పీల్చడం వల్ల తొమ్మిది మంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసున నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విశాలాంధ్ర – నంబులపూలకుంట :మండల పరిధిలోని బత్తినిగారిపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై వలి బాషా తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేసి, పేక ముక్కలు, రూ 3005 నగదు స్వాధీనం చేసుకునికోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూపేకాట, మద్యం, గంజాయి వంటి వ్యసనాలు గ్రామీణ సమాజంలో విస్తరిస్తూ కుటుంబాలనే దెబ్బతీస్తున్నాయని, రోజువారీ కూలీలు, చిన్న […] The post 5 మంది జూదరులు అరెస్ట్… appeared first on Visalaandhra .
బీహార్ ఎన్నికలు.. బిజెపిలో చేరిన 25 ఏళ్ల సింగర్
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ లో రాజకీయ పార్టీలు సన్నదమవుతున్నాయి. అలాగే, పార్టీలల్లో చేరికలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్(25) మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరింది. మధుబని జిల్లాలోని బెనిపట్టికి చెందిన ఠాకూర్ రాజకీయాల్లోకి రావాలనే తన కోరికను గతంలో వ్యక్తం చేసింది. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపింది. మైథిలి ఠాకూర్ ఎవరు? బీహార్లోని మధుబని జిల్లాలో జన్మించిన మైథిలి, ఆమె ఇద్దరు సోదరులతో కలిసి.. వారి తాత మరియు తండ్రి వద్ద జానపద, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు. భోజ్పురి, హిందీ భాషలలో బీహార్ సాంప్రదాయ జానపద పాటలను మైథిలి పాడింది. బీహార్ జానపద సంగీతానికి ఆమె చేసిన కృషికి గాను 2021లో సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ను అందుకుంది. తన జానపద గీతాలతో ప్రజాదరణను సొంతం చేసుకున్న మైథిలి ఠాకూర్ ను బీహార్ ఎన్నికల సంఘం 'స్టేట్ ఐకాన్'గా నియమించింది. కాగా, దర్భంగా జిల్లాలోని అలీనగర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే మిశ్రీ లాల్ యాదవ్ పార్టీకి అక్టోబర్ 11న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదని ఆరోపిస్తూ.. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్కు తన రాజీనామాను సమర్పిస్తున్నట్లు తెలిపారు. దీంతో అలీనగర్ నుంచి మైథిలి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. 243 మంది సభ్యులు గల బీహార్ శాసనసభకు రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మొదటి దశ నవంబర్ 6న, రెండవ దశ పోలింగ్ నవంబర్ 11న జరుగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
ట్రాన్స్ ఫార్మర్ల కోసం ఎదురుచూపులు….
2500 మంది రైతులకు అందని పరికరాలు 12నెలలుగా కాలయాపన…. సిబ్బంది కొరతతో సతమతం విశాలాంధ్ర , కళ్యాణదుర్గం వ్యవసాయం భారంగా మారిన నేపథ్యంలో అన్నదాతలు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాధార పంటలు చేతికి అందక భూగర్భ జలం కోసం అన్వేషిస్తూ రైతులు బోరుబావులు తవ్వుకుంటున్నారు. కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలో రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 2500 మంది రైతులు బోరు బావులు తవ్వుకొని విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. పెట్టుబడి పెట్టి బోరు బావులు […] The post ట్రాన్స్ ఫార్మర్ల కోసం ఎదురుచూపులు…. appeared first on Visalaandhra .
Breaking : బస్సులో మంటలు.. పన్నెండు మంది సజీవ దహనం
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది సజీవ దహనమయ్యారు
దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్..
దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్.. గోదావరిఖని, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో అధికారం
ఆ సమస్యలు ఉన్నవారికి ఇవి బెస్ట్ !!
ఈ రోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలిలో హై బీపీ (రక్తపోటు), మధుమేహం (షుగర్)
ఆ విషయంలో కోహ్లీ నెంబర్ వన్: హర్భజన్
టీం ఇండియా మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్కి ఓ ప్రత్యేకత ఉంది. దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫేవరెట్ క్రికెర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ వన్డే సిరీస్తో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వీరిద్దరు మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫామ్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. అయితే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కోహ్లీ ఫామ్ గురించి ఆందోళణ చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ‘‘ప్రస్తుత క్రికెటర్లలో ఫిట్నెస్ విషయంలో కోహ్లీనే నెంబర్.1. ఆ విషయంలో అతడు మిస్టర్ పర్ఫెక్ట్. అతడి ఆట చూసేందుకు ఎదురుచూస్తున్నా. విరాట్ మరింత కాలం వన్డేల్లో కొనసాగాలని కోరుతున్నా. ఆస్ట్రేలియా కోహ్లీకి ఇష్టమైన ప్రదేశం. అక్కడ కొన్ని టన్నుల కొద్దీ పరుగులు రాబట్టాడు. మరోసారి రాణిస్తాడు. మూడు మ్యాచుల్లో కనీసం రెండు సెంచరీలు చేస్తాడని ఆశిస్తున్నా. రోహిత్ కూడా మంచి ప్రదర్శన చేసి జట్టు విజయానికి తోడ్పడాలని ఆశిస్తున్నా’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ 29 వన్డేలు ఆడి.. 51.03 సగటుతో 1,327 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, 6 అర్థ శతకాలు ఉన్నాయి.
హర్షిత్ ఎంపికపై విమర్శలు.. గంభీర్ ఆగ్రహం #Cricket #HarshitRana #GautamGambhir #BCCI
మద్యం మత్తులో డ్రైవింగ్.. మూడు రోజుల జైలు శిక్ష
మద్యం మత్తులో డ్రైవింగ్.. మూడు రోజుల జైలు శిక్ష గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ
Telangana : 40 లక్షలు ఇచ్చి.. ఆల్ ది బెస్ట్ చెప్పిన కేసీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు పార్టీ అధినేత కేసీఆర్ నలభై లక్షలు అందించారు
Kalvakuntla Kavitha : తెలంగాణలో కవిత యాత్ర.. ఎప్పటి నుంచి అంటే?
బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత తెలంగాణలో యాత్రను ప్రారంభించనున్నారు
మామిడి సబ్సిడీ బ్యాంకులో జమ 31,929 మంది రైతులకు రూ.146.84 కోట్లు విడుదలచిత్తూరు
శిక్షణ ప్రమాణాలపై పలు సూచనలు..
శిక్షణ ప్రమాణాలపై పలు సూచనలు.. కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిజామాబాద్
When will Pawan Kalyan return back to Films?
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan is an occupied man and the actor-turned-politician has completed all his film commitments. He also managed to release Hari Hara Veera Mallu and OG recently. His upcoming movie Ustaad Bhagat Singh will have its release next year. There are a lot of speculations about Pawan Kalyan and his […] The post When will Pawan Kalyan return back to Films? appeared first on Telugu360 .
క్రీడా పోటీలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థులు.. ప్రిన్సిపాల్ అనూప్
విశాలాంధ్ర ధర్మవరం : క్రీడా పోటీలలో భాగంగా హ్యాండ్ బాల్ పోటీల్లో యశోద పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని ప్రిన్సిపాల్ అను ప్, డైరెక్టర్లు రవీంద్ర పృధ్విరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 8 నుండి 13వ తేదీలలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆర్ట్స్ కళాశాలలో హ్యాండ్ బాల్ బాలికల విభాగం అండర్ -14, అండర్ 17, అండర్ 19 జరిగిన పోటీలలో పాల్గొని అనంతపురం జిల్లా జట్టుకు ఎంపిక కావడం […] The post క్రీడా పోటీలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థులు.. ప్రిన్సిపాల్ అనూప్ appeared first on Visalaandhra .
పూరన్ కుమార్ కేసులో మరో ట్విస్ట్.. దర్యాప్తు అధికారి బలవన్మరణం
హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
అమ్మవారికి నవ ధాన్యాలతో నైవేద్యం
అమ్మవారికి నవ ధాన్యాలతో నైవేద్యం దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం గుడిరేవు
సిట్ హీట్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో సోదాలు (తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ )
యుటిఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్సీ 2025 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజిస్టర్ ల బహుకరణ
విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ధర్మవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, సుందరయ్య నగర్ నందు డీఎస్సీ – 2025 ద్వారా ఎంపికై, ధర్మవరం మున్సిపాలిటీ నందు నియమితులైన నూతన ఉపాధ్యాయులకు స్వాగతం పలికి, అనంతరం యుటిఎఫ్ పక్షాన నూతన ఉపాధ్యాయులకు సేవా పుస్తకాలు (సర్వే రిజిస్టర్లు) , యుటిఎఫ్ బ్యాగులను రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా కార్యదర్శి రామకృష్ణ నాయక్ […] The post యుటిఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్సీ 2025 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజిస్టర్ ల బహుకరణ appeared first on Visalaandhra .
ఇంట్లోనే ఉరివేసుకొని మృతి దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి(Dandepalli) మండలంలోని గుడిరేవు గ్రామానికి
తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి
విశాలాంధ్ర – హైదరాబాద్ :: తెలంగాణా రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంటు ను రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామ్యం పొందేలా సిటిజన్ సర్వే చేపట్టారు. అక్టోబర్ 10 వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో రాష్ట్ర ప్రజలు, ఎన్.ఆర్.ఐ లు పెద్ద ఎత్తున […] The post తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ, ఏర్పేడు (తిరుపతి జిల్లా) : గుడిమల్లం ఆలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన
బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను కొట్టేసిన ఈసీ
విచారణ జరిపిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ The post బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను కొట్టేసిన ఈసీ appeared first on Visalaandhra .
ఆలయంలో రావాడ చంద్రశేఖర్కు ఘనస్వాగతం
ఆలయంలో రావాడ చంద్రశేఖర్కు ఘనస్వాగతం (ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ (Vijayawada)
రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థిని మృతి
హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన యువతి మరణించింది. స్థానిక సుభాష్ నగర్కు చెందిన బండారి అశోక్-గీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వాళ్ల చిన్న కూతురు బండారి మనోజ్ఞ(22) హైదరాబాద్లో బిటెక్ ఫైనలియర్ చదువుతోంది. శనివారం వనస్థలిపురంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు మనోజ్ఞను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్ఞను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మనోజ్ఞ సోమవారం మృతి చెందింది. ఈ ఘటన పై పోలసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్ఞ మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బీసీ రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు
చారిత్రాత్మక నిర్ణయాన్ని బీజేపీ బిఅరెస్ వ్యతిరేకం The post బీసీ రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు appeared first on Visalaandhra .
బాహుబలిని బీట్ చేసిన కాంతార ఛాప్టర్-1 #cinema #kantara #boxoffice #bahubali #recordbreaker
రైతులను ఇబ్బంది పెట్టిన ఫలితం..
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : మామిడి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా
కింగ్ కోహ్లి వచ్చేశాడు ..!#TeluguPost #telugu #post #news
పాల్వంచలో పోలీసులను చూసి పరారు
పాల్వంచలో పోలీసులను చూసి పరారు భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : పాల్వంచలో ఈ
Andhra Pradesh Signs Historic MoU to Set Up India’s Largest AI Data Hub
In a transformative moment for India’s digital future, the Government of Andhra Pradesh and tech giant Google signed a historic Memorandum of Understanding (MoU) on October 14, 2025, in New Delhi. The agreement paves the way for the establishment of a state-of-the-art, AI-powered data centre in Visakhapatnam with a staggering investment of ₹87,520 crore. This […] The post Andhra Pradesh Signs Historic MoU to Set Up India’s Largest AI Data Hub appeared first on Telugu360 .
మొక్కజొన్న విత్తనం గుట్టు భారీ డంపు మర్మమేమిటో? (అర్ధవీడు, ఆంధ్రప్రభ) : ప్రకాశం
రాష్ట్రంలో మద్యం ఏరులా పారుతుంది..
మాజీ ఎమ్మెల్యే సోదరుడు కృష్ణారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్రంలో మద్యం ఏరులా పారుతోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైఎస్సార్సీపీ పార్టీ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ముందు నకిలీ మద్యం వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా ధర్మవరంలో కూడా కల్తీ మద్యం అధికంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మద్యం కుటీర […] The post రాష్ట్రంలో మద్యం ఏరులా పారుతుంది.. appeared first on Visalaandhra .
‘మీసాల పిల్ల’ వచ్చేసింది.. మీరూ చూసేయండి..
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్గా ‘శశిరేఖ’ అనే పాత్రలో నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం దసరా కానుకగా ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ అనే పాట ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ప్రోమోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫుల్ సాంగ్ విడుదలకు మాత్రం చిత్ర యూనిట్ కాస్త ఆలస్యం చేసింది. అయితే ఈ ఆలస్యాన్ని కూడా ప్రమోషన్ కింద వాడేసుకున్నాడు దర్శకుడు అనిల్. ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలోని బుల్లిరాజుతో ఈ పాట ఎప్పుడు వస్తుందా అంటూ ఓ ఫన్నీ వీడియోని విడుదల చేశారు. నిజానికి ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ సోమవారమే విడుదల చేస్తామని తొలుత చెప్పారు. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా వేశారు. కాగా, ఈ పాటని మంగళవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ పాటని ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ అలపించగా.. భీమ్స్ సంగీతం అందించారు. భాస్కరభట్ల ఈ పాటకు లిరిక్స్ రాశారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Chiru’s Meesala Pilla: Sure Shot Viral Chartbuster
After teasing with the promo of the first single Meesala Pilla from Megastar Chiranjeevi’s out-and-out entertainer Mana Shankara Vara Prasad Garu which garnered superb response, the team unleashed the lyrical video today. The film directed by Anil Ravipudi and produced by Sahu Garapati and Sushmita Konidela has music scored by Bheems Ceciroleo. Bheems’ composition sparkles […] The post Chiru’s Meesala Pilla: Sure Shot Viral Chartbuster appeared first on Telugu360 .
పెండింగ్ పనులు పూర్తి చేయాలి (అనంతపురం, ఆంధ్రప్రభ ప్రతినిధి) : డిసెంబర్ లోగా
Why did Trivikram replace Thaman
Top director Trivikram is closely associated with Thaman as music composer for all his recent films. Thaman also delivered his best work and spent ample time on Trivikram’s movies. But for Venkatesh’s film, Trivikram roped in Harshavardhan Rameshwar and this came as a surprise for many. There are a lot of speculations about Trivikram replacing […] The post Why did Trivikram replace Thaman appeared first on Telugu360 .
మందు బాబు స్కా న్ చెయ్.. వివరాలు చూసుకో #LiquorSafety #FakeLiquorCheck #apgovernment
ఫ్యాక్ట్ చెక్: వైరల్ చిత్రం ఆఫ్ఘనిస్తాన్ మంత్రి నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని చూపడం లేదు
Viral image falsely claims women journalists attended Afghan Embassy press meet; event was at VIF in Delhi during Muttaqi’s visit
జీఎస్టీతో పారిశ్రామిక వృద్ధి..
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జీఎస్టీతో పారిశ్రామిక వృద్ధి, వినియోగదారుల వృద్ధికి తోడ్పాటున అందిస్తుందని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కామర్స్ అధ్యాపకురాలు బి. షర్మిల రామయ్య పేర్కొన్నారు. పి వి కె కె పీజీ కళాశాలలోని సెమినార్ హాల్లో జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ పై అవగాహన సదస్సును కళాశాల ప్రిన్సిపల్ డా . వై మునికృష్ణారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవేంద్రప్రసాద్, కామర్స్ విభాగాధిపతి జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పారిశ్రామిక […] The post జీఎస్టీతో పారిశ్రామిక వృద్ధి.. appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |గొప్ప కలలను/రెండూ మనవే/ తుపాకీ వీడిన మల్లోజుల
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 14-10-2025, 4.00PM గొప్ప కలలను అణచివేయొద్దు టెస్టు, సిరీస్..
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు తహసిల్దార్ బాలకృష్ణపై ఒక మహిళ చేసిన దాడి ఘటనపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వ అధికారిపై కార్యాలయంలోనే దౌర్జన్యానికి దిగడం అమానుషమని, అంగీకారయోగ్యం కాదని రాజాం తహసిల్దార్ యం. రాజశేఖర్ ఖండించారు.ఈ సందర్భంగా దళిత నాయకులు డి. రామప్పడు (రిటైర్డ్ తహసిల్దార్), బొత్స జానకిరావు, బొత్స బుద్ధుడు, జరజాన నీలయ్య, కొల్లి రామారావు, బోనెల నారాయణరావు, ధర్మాన కృష్ణ, […] The post తహసిల్దార్పై దాడి అమానుషం appeared first on Visalaandhra .
44 ఏళ్ల మావోయిస్టు ఉద్యమ చరిత్రకు తెర..
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : విప్లవ ప్రస్థానానికి మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్
16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన
16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన ( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో ):
బిహార్ ఎన్నికలు.. తొలి జాబితా ప్రకటించిన బిజెపి
పాట్నా: బిహార్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఇటీవలే బిహార్లో ఎన్డిఎ పార్టీల సీట్ల పంపిణీ ఒప్పందం జరిగింది. అందులో బిజెపికి 101 స్థానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిజెపి అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 71 స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ తారాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. మరో డిప్యూటీ సిఎం విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి బరిలోకి దిగనున్నారు. మంత్రులు నితన్ నబీన్.. బాంకీపూర్, రేణు దేవీ.. బేతియా, మంగల్ పాండే సీవాన్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి మొత్తం 101 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.