గజ గజ.. చలికి వణుకుతున్న రాష్ట్రం
భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు దిత్వా తుఫాన్ ప్రభావంతో చలిగాలులు మన తెలంగాణ/హైదరాబాద్: గత కొన్ని రోజులుగా చలికి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్నం తేడా లేకుండా గజ గజా వణికిపోతుంది. చాలా ప్రాంతాల్లో ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. అయితే దిత్వా తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన చలి గాలులు వీస్తాయని అంచనా వేసింది. దిత్వా తుఫానుతో డిసెంబర్ తొలి వారంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో వర్షాలు కురిసినా చలి తీవ్రత తగ్గే సూచనలు కనిపించడం లేదని, తీవ్రమయిన చలిగాలులు వీచే ఆవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాల్లో 9 నుంచి 11 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. చలి ప్రభావం వల్ల వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు, వ్యాధులతో బాధ పడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని, మధ్యాహ్నం సమయంలోనే ఊర్ల ప్రయాణాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. చలితోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఆదివారం ఉదయం వరకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తొమ్మిది జిల్లాల్లో 12 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా మన్యం గ్రామాల్లో మధ్యాహ్నాం 12 అయినా చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్లోనూ మూడ రోజులపాటు రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీలుగా నమోదవుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో ఆదిలాబాద్లో 10.3, కామారెడ్డిలో 10.8, నిజామాబాద్లో 10.9, నిర్మల్లో 11, సంగారెడ్డిలో 11.2, వికారాబాద్లో 12.4, రాజన్న సిరిసిల్ల, జగిత్యాలలో 12.5, సిద్దిపేట, మెదక్లో 13, మంచిర్యాలో 13.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లిలో 14.1, రామచంద్రాపురం, పఠాన్ చెరులో 14.4, రాజేంద్రనగర్లో 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. పలు జిల్లాలకు వర్ష సూచన దిత్వా తుఫాన్ ప్రభావం రాష్ట్రంలో పలు జిల్లాలపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 2 నుంచి 5 వరకు రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చలి, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. అధిక వర్షాలతో నేలలు చిత్తడిగా మారి గాలిలోని తేమశాతం పెరగటం, ఉత్తర భారతదేశం నుంచి చలి గాలులు వీస్తుండటం, వాతావరణ మార్పుల ప్రభావంతో నవంబరు మాసంలో సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా డిసెంబరు నెలలో చలి అధికంగా ఉంటుందని, ప్రస్తుతం నవంబరు నెల నుంచే చలి పంజా విసరుతోందని చెపుతున్నారు. ఈ క్రమంలో రాబోయే మూడు రోజులు చలిగాలులు అధికంగా వీచే అవకాశందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Ditwah cyclone |దిత్వా బలహీనపడినా…?
Ditwah cyclone | దిత్వా బలహీనపడినా…? Ditwah cyclone, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
నేటినుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ, జాతీయ భద్రత తదితర అంశాలపై చర్చకు పట్టుపట్టనున్న విపక్షాలు 14 బిల్లులతో సిద్ధమైన ప్రభుత్వం చర్చల ఎజెండాను బిఎసి నిర్ణయిస్తుంది అఖిలపక్ష భేటీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు న్యూఢిల్లీ: డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతాకాలం సమావేశాలకు రంగం సిద్ధమైంది. పార్లమెంటులో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రి విజన్, జాతీయ భద్రత పరిస్థితిపై స్పష్టమైన చర్చ జరగాలని, ఆదివారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశంలోనే ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పార్లమెంటు ఉభయసభలు సజావుగా జ రిగేందుకు సహకరించాలని, అన్ని పక్షాలతో కలి సి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్ర భుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. శీతాకాలం సమావేశాలకు ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి 36 రాజకీయ పా ర్టీలకు చెందిన 50మంది నాయకులు హాజరయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, బిజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జెపినడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కిరణ్ రిజిజు సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎల్ మురుగేశన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సర్తో పాటు, ఢిల్లీ పేలుడు తర్వాత జాతీయ భద్రత పరిస్థితి, కార్మిక కోడ్లు వంటి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చా యి. అలాగే ఫెడరలిజం, అసెంబ్లీలు ఆమోదించి న బిల్లులను కొందరు గవర్నర్లు తొక్కి పెట్టిన అం శాలు, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులఅంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా పార్లమెంటు శీతాకాలం సమావేశా లు సజావుగా, ప్రశాంతంగా సాగేటట్లు సహకరించాలని అన్ని పార్టీలను పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరారు. బొత్తిగా 15 రోజులేనా సమావేశాలు? శీతాకాలం సమావేశాలను కేవలం నామ్ కే వాస్తే ని ర్వహిస్తున్నట్లు కన్పిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి జయ రాం రమేశ్ అన్నారు. ప్రతిపక్షాలతో సంప్రదింపులు జ రపకుండా కేవలం తక్కువ కాలం వ్యవధి నిర్ణయించడం నరేంద్రమోదీ సర్కార్ వైఖరికి అద్దంపడుతోందన్నారు. 15 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు పార్లమెంటరీ చరిత్రలోనే అతి తక్కువ సమయం జరుగుతాయని, మోదీ సర్కార్ 13 బిల్లులను ఆమోదం కోసం సిద్ధం చేసిందని, అందులో ఒకటి ఆర్డినెన్స్ స్థానే ప్రవేశపెట్టే బిల్లు అనీ, రెండు లోక్ సభ కమిటీ పరిశీలించినవని, కాబట్టి పది బిల్లులను సంబంధిత స్టాండింగ్ కమిటీ పరిశీలించనే లేదని జైరాంరమేశ్ విమర్శించారు. అణుశక్తి బిల్లుతో సహా 14 బిల్లులు సిద్ధం పార్లమెంటులో ప్రతిపాదిత అణుశక్తి బిల్లు 2025 తో సహా 14 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండి యా బిల్లు 2025, జన్ విశ్వాస్ (సవరణ) బిల్లు 2025, ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ బిల్లు 2025, ఆర్డినెన్స్ స్థానే మణిపూర్ వస్తువులు సేవల పన్ను(రెండో సవరణ) బిల్లు, హైవే అభివృద్ధి కోసం పారదర్శకంగా భూసేకరణకు ఉద్దేశించిన జాతీయ రహదారుల (సవరణ)బిల్లు వంటి ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి.
కొండగట్టులో 30 దుకాణాలు బుగ్గి
అర్ధరాత్రి అగ్రిప్రమాదం 2 గంటల పాటు ఎగిసిపడిన మంటలు ఆలస్యంగా వచ్చిన అగ్నిమాపక వాహనం కాలిబూడిదయిన షాపులు బాధితుల కన్నీరుమున్నీరు ఆదుకుంటామని మంత్రులు అడ్లూరి, పొన్నం భరోసా ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి/మల్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 30 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్కూట్తో ఓ దుకాణంలో మంటలు లేచి పక్కనున్న దుకాణాలన్నింటికీ మంటలు వ్యాపించి అందులోని సామగ్రి కాలి బూడిదైంది. సుమారు రెండు గంటల పా టు మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలోని జనమంతా భయంతో రోడ్డు పైకి వచ్చి హాహాకారాలు చేశారు. ఉవ్వెత్తున మంటలు లేవడంతో మంటలను ఆర్పే పరిస్థితి లేకుండా పోయింది. జగిత్యాల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వెంటనే రావాల్సిన ఫైర్ సిబ్బంది గంటన్నర ఆలస్యంగా రావడంతో అప్పటికే దుకాణాలన్నీ కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదం లో కళ్ల ముందే తమ దుకాణాలు తగలబడి మంటల్లో లక్షల రూపాయల విలువ చేసే సామగ్రి అంతా కాలిపోవడంతో రోడ్డున పడ్డ మమ్మల్ని ఆదుకునేవారెవరు... తాము బతికేదెట్లా అంటూ బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అంతా బతుకుదెరువు కోసం వచ్చిన వారే... అగ్ని ప్రమాదంలో దుకాణాలు కాలిపోయిన బాధితులంతా వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం కొండగట్టుకు వచ్చిన వారే. కొందరు ఇళ్లను అద్దెకు తీసుకుని దుకాణాలు నిర్వహిస్తుండగా, మరికొందరు స్థలాలను అద్దెకు తీసుకుని షెడ్డు నిర్మించుకుని దుకాణాలను నిర్వహిస్తున్నారు. అప్పు సప్పు చేసి దుకాణాల్లోకి సామగ్రిని తెచ్చుకుంటే రెండు గంటల్లోనే అగ్నికి అహుతై బుగ్గి కావడంతో బతికేదెట్లా... తమను ఆదుకునేదెవరు అంటూ బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. అగ్ని ప్రమాదంలో అన్ని కాలిపోయాయని, కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభు త్వం ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్నారు. కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాదంలో 30 దుకాణా లు కాలిపోయి కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆదివారం పరామర్శించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఫోన్లో ఆదేశించారు. అగ్ని ప్రమాద సంఘటన దురదృష్టకరమని, బాధితులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.
రెండో దశ పంచాయతీకి నామినేషన్లు షురూ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 3,242, వార్డు స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనున్నాయి. ఈ నెల 2 వరకు అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు సమర్పింవచ్చు. ఈ నెల 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 6 వరకు ఉపసంహరణ గడువు ఉంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 14వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచి ఫలితాలు వెల్లడిస్తారు. తొలి విడత నామినేషన్ల గడువు శనివారం ముగియగా, చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 17,940, వార్డు స్థానాలకు 70,596 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు మొత్తం 25,654 నామినేషన్లు దాఖలు కాగా, 37,440 వార్డు స్థానాలకు మొత్తం 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి.
తమిళనాడులో హైవేపై బస్సులు ఢీ.. 11 మంది మృతి
చెన్నై : తమిళనాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 11మంది మృతి చెందారు. దాదాపు 40 మంది వరకూ గాయపడ్డారు. రాష్ట్రంలోని శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు వద్ద తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు మృతి చెందారని అధికారులు తెలిపారు.వీరిలో తొమ్మండుగురు మహిళలు ఉన్నారు. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ముందు మృతుల సంఖ్య ఏడు అని ప్రకటించారు. కానీ చికిత్స పొందుతున్న వారిలో కొందరు చనిపోవడంతో ఈ సంఖ్య పెరిగింది.హైవేపై ఓ బస్సు కరైకూడకి మరోటి మధురైకు వెళ్లుతుండగా బస్సులు ఢీకొన్నాయి. దీనితో వాహనాల ముందు భాగాలు ఒకదానిలోకి మరోటి చొ చ్చుకువెళ్లాయి. లోపల ప్రయాణికులు విలవిలలాడుతూ ప్రా ణాలు కోల్పోయ్యారు.. ఘటన గురించి తెలియగానే అక్కడికి స్థానికులు , సహాయక బృందాలు వచ్చి గాయపడ్డ వారిని హు టాహుటిని శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడైంది. ఘటనపై సిఎం ఎంకె స్టాలిన్ స్పందించారు.
సోమవారం రాశి ఫలాలు (01-12-2025)
మేషం సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృషభం సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. మిధునం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కర్కాటకం కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. సింహం గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. కన్య నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోక నష్టాలు ఎదుర్కొంటారు. తుల వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక సమయంలో సన్నిహితులు సాయం అందిస్తారు. వృశ్చికం కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట చికాకులు అధికమవుతాయి. స్వంత ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వ్యాపారాలలో భాగస్వాములతో బేధాభిప్రాయాలు కలుగుతాయి. ధనస్సు ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో మరింత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. మకరం దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగమున మీప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుంభం దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. మీనం ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు తప్పవు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు.
పెళ్లిళ్లు ఔట్డేటెడ్.. యువత జీవితం అనుభవించాలి: జయబాధురి
ముంబై ః పెళ్లి ఓ కాలం చెల్లిన కట్టుబాట్ల వ్యవస్థ. తన ఉద్ధేశంలో యువతరం ఈ పెళ్లి తంతుకు వెళ్లకుండా హాయిగా తన జీవితం తాను అనుభవిస్తూ ఆనందించాలని ప్రముఖ నటి జయ బాధురి చెప్పారు. సామాజిక, రాజకీయ, సిని రంగ విషయాలపై నిర్మొహమాటంగా మాట్లాడే జయ బాధురి ఇప్పుడు భారతీయ వివాహ వ్యవస్థపై స్పందించారు. తన మనవరాలు నవ్య నవేలీ నందా పెళ్లి చేసుకోకుండా ఉండటం తనకు ఇష్టం అని కూడా తెలిపారు. తన తరం వంతు అయిపోయింది. ఇప్పుడు నవ యువ తరం వచ్చింది. ఈ తరం పెళ్లి బంధంలో చిక్కుకుపోరాదని ఆమె ఇటీవల వి ది ఉమెన్ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. తాను వయస్సు మీద పడినదానిని, మనవరాలు నవ్యకు త్వరలో 28 ఏండ్లు వస్తాయి. పెళ్లికి చట్టబద్ధతతోనే బాంధవ్యం ఖరారు అయిపోతుందని అనుకోరాదని కూడా జయ బాధురి చెప్పారు. ముంబైలోని బాల్ గంధర్వ రంగ్ మందిర్లో ఆదివారం వి ది ఉమెన్ కార్యక్రమం బర్కా దత్ ఆధ్వర్యంలో జరిగింది. జయా బాధురితో పాటు రాణి ముఖర్జీ, జాన్వి కపూర్, మసాబా గుప్తా, సిద్థార్థ్ మల్హోత్రా పాల్గొన్నారు. పలు అంశాలపై వక్తలు తమ స్పందన వెలువరించారు.
ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై భారత్ విజయం..
కదంతొక్కిన విరాట్ కోహ్లి రోహిత్, రాహుల్ అర్ధ సెంచరీలు కుల్దీప్, హర్షిత్ మ్యాజిక్ రాంచీ: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్యటీమిండియా 17 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు కెప్టెన్ కెఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్తో జట్టునుఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన సఫారీ టీమ్కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు మార్క్రమ్ (7), రియాన్ రికెల్టన్ (0), వన్డౌన్లో వచ్చిన డికాక్ (0) విఫలమయ్యారు. దీంతో సౌతాఫ్రికా 11 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మాథ్యూ బ్రిట్జ్కె (72), టోనీ డి జోర్జి (39) డెవాల్డ్ బ్రేవిస్ (39) అద్భుత బ్యాటింగ్తో జట్టుకు అండగా నిలిచారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మార్కొ జాన్సన్ 39 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. కార్బిన్ బోస్చ్ (67) కూడా అసాధారణ బ్యాటింగ్ను కనబరచడంతో సౌతాఫ్రికా పోరాడి ఓడింది. భారత బౌలర్లలో కుల్దీప్ నాలుగు, హర్షిత్ మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను విరాట్ కోహ్లి ఆదుకున్నాడు. ధాటిగా ఆడిన కోహలి 120 బంతుల్లోనే 11 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 135 పరుగులు చేశాడు. రోహిత్ 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57, కెప్టెన్ రాహుల్(60), జడేజా (32) పరుగులు సాధించారు.
IND vs SA |తొలి వన్డేలో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ !!
IND vs SA | తొలి వన్డేలో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్
బెల్టు షాపుల్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు…
సంగెం, ఆంధ్రప్రభ : ఎస్సై వంశీకృష్ణతో పాటు కానిస్టేబుల్ బృందం మండలంలోని మొండ్రాయి
Bodhan |ఆపన్నులకు చేయూత సాయం…
బోధన్, ఆంధ్రప్రభ: యాచకులు, బీదవారు, రోడ్డు వెంట దుకాణాల ముందు ఇల్లు లేక
గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా నందివాడ మండలం గాజులపాడు శివారులో భారీ పేకాట
Panchayat Elections |ఉరుకులు.. పరుగుల్లో ప్రధాన పార్టీలు
Panchayat Elections | ఉరుకులు.. పరుగుల్లో ప్రధాన పార్టీలు డోంగ్లి, ఆంధ్రప్రభ :
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్పై కీలక ఎఫ్ఐఆర్ దాఖలు
మరో ఏడుగురిపైనా నమోదు..ఇడి కేసుకు స్పందన రూ.50 లక్షలతో రెండున్నరవేల కోట్లకు ఎసరు అభియోగాలు న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసు విభాగం స్పందించింది. కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసు ఎఫ్ఐఆర్లు దాఖలు చేసింది. వీరితో పాటు మరో ఏడుగురిపై కూడా ఎఫ్ఐఆర్లు దాఖలు అయినట్లు తెలిపారు. కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్ సంబంధిత నిధుల్లో బదలాయింపులు ఇతరత్రా ఆర్థిక నేరాలు జరిగాయనే కోణంలో ఇడి రంగంలోకి దిగింది. దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఇడి నుంచి తమకు అందిన ఫిర్యాదు మేరకు ఇప్పుడు ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. గాంధీలు ఇతరులపై తమకు అక్టోబర్ 3వ తేదీనే ఫిర్యాదు అందిందని వివరించారు. ఇప్పుడు ఈ మేరకు ఎఫ్ఐఆర్లను దాఖలు చేశారు. క్రిమినల్ కుట్ర, ఆస్తుల దుర్వినియోగం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, చీటింగ్కు సంబంధించిన 420 వంటి సెక్షన్ల పరిధిలో ఇప్పుడు సోనియా , రాహుల్ ఇతరులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లు దాఖలు అయిన వారిలో కాంగ్రెస్ ప్రముఖులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియా, డోటెక్స్ మార్కండైజ్ లిమిటెడ్, డోటెక్స్ ప్రమోటర్ సునీల్ భండారితో పాటు అసోసియేటెడ్ జర్నలిస్టు లిమిటెడ్ (ఎజెఎల్) పేర్లు ఉన్నాయి. వీరిని నిందితులుగా చేర్చారు. కాగా ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ వోరాలు మృతి చెందారు. నిందితులు తమ వంతుగా రూ 50 లక్షలే చెల్లించి ఎజెఎల్కు చెందిన రూ 2500కోట్ల విలువైన ఆస్తులపై అధికారం పొందారని, ఈ క్రమంలో ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించామని ఇడి తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఈ కేసులో పోలీసు ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో సంబంధిత నిందితులను పోలీసులు అరెస్టు చేసే అధికారం ఉంటుంది. ఈ విషయంపై కాంగ్రెస్ వర్గాలలలో కలవరానికి దారితీసింది. ఇడి కేసుకు సంబంధించి డిసెంబర్ 16వ తేదీన తదుపరి విచారణ జరుగుతుంది. ఈలోగా ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ దాఖలుపై న్యాయస్థానం స్పందన వెలువడాల్సి ఉంది. మోడీ, అమిత్ షా రాజకీయ వేధింపులు, బెదిరింపులు: కాంగ్రెస్ ఆగ్రహం ఇడి పిర్యాదుతో తమ నేతలపై ఢిల్లీ పోలీసు ఎఫ్ఐఆర్ దాఖలు కావడం గర్హనీయం అని కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ మేరకు సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటన వెవరించారు. రాజకీయ ప్రత్యర్థులపై మోడీ అమిత్ షాల వేధింపులు బెదిరింపుల పర్వం సాగుతోందని తెలిపారు.ఇది కక్షసాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. బెదిరింపులకు దిగేవారే అభద్రతతో భయాలతో కొట్టుమిట్టాడుతున్నారని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ఈ కేసు బోగస్, సత్యమే గెలుస్తుందని జై రాం రమేష్ , మరో నేత అభిషేక్ మనూ సింఘ్వీ తెలిపారు. సారా కానీ సీసా కానీ చివరికి గ్లాసులు కానీ కొత్తవి కావని, ఇదంతా కూడా పాత సీసా మూతలు తెరవడం కథ అని సింఘ్వీ చమత్కరించారు.
పెద్దమందడి: (ఆంధ్రప్రభ): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్లఖానాపురం నాగులకుంట తండ గ్రామపంచాయతీకి
సుబ్బరాయుడి సన్నిధిలో జడ్జీ దంపతులు
కొత్తూరు, నంద్యాల జిల్లా , ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పాణ్యం మండలం
బస్తర్లో 37 మంది మావోయిస్టులు సరెండర్..
దంతేవాడ : ఛత్తీస్గఢ్లో ఆదివారం 37 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 27 మందిపై కలిపి మొత్తం మీద రూ 65లక్షల రివార్డు ప్రకటితం అయి ఉంది దంతేవాడ జిల్లా వీరు తమ ముందు సరెండర్ అయినట్లు పోలీసు వర్గాలు ఆదివారం తెలిపాయి. ఇప్పుడు లొంగిపోయిన వారిలో 12 మంది మహిళా నక్సల్స్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పూనా మార్గెం పునరావాస, సామాజిక సమ్మిళితం కార్యక్రమంలో భాగంగా వీరు తమ మావోయిస్టు పంథా వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ విషయాన్ని మీడియాకు దంతేవాడ ఎస్పి గౌరవ్ రాయ్ తెలిపారు. బస్తర్ ప్రాంతంలో శాఆంతి స్థాపనకు, సమగ్ర ప్రగతికి, గౌరవ మర్యాదల వాతావరణం నెలకొనేలా చేసేందుకు ప్రభుత్వం పునరావాస పథకం తీసుకు వచ్చిందని ఎస్పి తెలిపారు. దీనిని ఇప్పటికీ అడవుల్లో ఉన్న మావోయిస్టులు వినియోగించుకుని సరెండర్ కావాలని అభ్యర్థించారు. ఇప్పుడు సరెండర్ అయిన వారిలో కొందరు ముఖ్యులు కూడా ఉన్నారు. కుమాలి అలియాస్ అనిత మాధవి, గీతా అలియాస్ లక్ష్మి మద్కం, రంజన్ అలియాస్ సోమ మందవి , భీమా అలియాస్ జహాజ్ కల్మూ ఉన్నారు. వీరిపై తలో రూ 8 లక్షల పారితోషికం ప్రకటితం అయి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల పరిధిలో ఇప్పటివరకూ 500 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారని ఎస్పి వివరించారు.
కరీంనగర్ రూరల్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా నగునూరు శివారులో తీవ్ర విషాద
అమెరికాలో విందు పార్టీపై కాల్పులు.. నలుగురు మృతి
స్టాక్టన్ : అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఫంక్షన్హాల్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. పది మంది వరకూ గాయపడ్డారు. అక్కడి స్టాక్టన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం వేడుక కోసం అక్కడికి చేరిన దశలోనే ఎవరో వారిపై దాడికి దిగాడని షెరీఫ్ అధికారులు తెలిపారు. బాధితులలో పిల్లలు , పెద్దలు ఉన్నారు. కాల్పులకు దిగిన వ్యక్తిని అరెస్టు చేశారు. దాడికి కారణాలను దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వివరించారు. గాయపడ్డ వారి పరిస్థితి ఏమిటనేది వెలుగులోకి రాలేదు.
శబరిమలకు ఆర్టిసి సేవలు... ఆ ముగ్గురికి ఉచితం
శబరిమలకు వెళ్లే భక్తుల కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలను మరింత సులభతరం చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. గ్రూపులుగా వెళ్లే అయ్యప్ప భక్తులకు అతి తక్కువ ధరకే అద్దె బస్సులు సమకూర్చాలని ఆర్టిసి నిర్ణయించింది. ప్రత్యేక సౌకర్యాలను కల్పించనుంది. పలువురికి ప్రత్యేకంగా ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఆర్టిసి అద్దె ప్రాతిపదికన బస్సులను కేటాయించింది. భక్తుల ప్రయాణ ప్రణాళికకు అనుగుణంగా సంస్థ ఈ బస్సులను ఏర్పాటు చేస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆర్టిఓ పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, అల్ట్రాడీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ నలు మూలల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టిసి సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 200 బస్సులను నడపాలని నిర్ణయించింది. సుమారు లక్ష మంది భక్తులకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టిసి లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తూ ప్రతీ డిపోకు రెండు బస్సులు కేటాయించింది. ఈ ప్రత్యేక బస్సులకు ప్యాకేజీలను ఖరారు చేసింది. ప్రయాణ దూరాన్ని బట్టి కిలోమీటరుకు ఛార్జీలు నిర్దారించింది. బస్సుల వెయిటింగ్ సమయానికి గంటకు రూ.300 చొప్పున వెయిటింగ్ ఛార్జి చెల్లించాల్సి ఉంటుందని ఆర్టిసి స్పష్టం చేసింది. గురుస్వామి పేరుతో బస్సు బుక్ చేసుకుంటే ఒక యాత్రికుడి(గురుస్వామి) ఛార్జి అంటే సుమారు రూ.5,498 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.10 వేల కాష్ ను డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. యాత్ర పూర్తయిన తర్వాత భక్తులకు తిరిగి చెల్లిస్తారు. రాజధాని బస్సుల్లో 40 సీట్లు ఉంటుండగా కి.మీకు రూ.77 వసూలు చేయనున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 36 సీట్లకు కి.మీకు రూ.59 వసూలు చేయనున్నారు. డీలక్స్ 40 సీట్లకు కి.మీకు రూ.57, ఎక్స్ప్రెస్ 50 సీట్లకు కి.మీ రూ.62 వసూలు చేస్తారు. ఈ బస్సుల్లో గురుస్వామికి ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. భక్తులతో పాటు వచ్చే లగేజ్ అటెండెంట్లు, వంట మాస్టర్లకు కూడా సీట్లు కేటాయించకుండా ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు.
Andhra King Taluka, Memorable Film: Hanu Raghavapudi
Ram Pothineni’s latest outing Andhra King Taluka is running successfully in theatres, earning appreciation from audiences and industry insiders alike. Directors Hanu Raghavapudi and Bobby extended their praises to the team for crafting such an emotionally resonant film. Hanu Raghavapudi, who is currently directing Prabhas in Fauzi, watched Andhra King Taluka and was highly impressed. […] The post Andhra King Taluka, Memorable Film: Hanu Raghavapudi appeared first on Telugu360 .
Korutla |సర్పంచ్ బరిలో తల్లి, కూతుళ్ళు …
Korutla | సర్పంచ్ బరిలో తల్లి, కూతుళ్ళు … కోరుట్ల, ఆంధ్రప్రభ :
సిఎం రేవంత్ జిల్లాల పర్యటన ఆపాలి.. ఎన్నికల సంఘానికి కవిత ఫిర్యాదు
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనలు చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. పట్టణ ప్రాంతాల్లో సిఎం పర్యటనలకు.. ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఎన్నికలు గ్రామాల్లో ఉంటే .. జిల్లా కేంద్రాలకు వెళ్లి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారా..? అని అడిగారు. అక్కడికి జిల్లా ప్రజలు అందరినీ ప్రభుత్వ సొమ్ముతో తరలించి ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల నిబంధనను ఉల్లంఘించటమేనని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకుని, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనను వెంటనే నిలిపివేయాలని కవిత డిమాండ్ చేశారు. కాగా, ప్రభుత్వ సొమ్ముతో సిఎం రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం ఆరు జిల్లాల్లో ప్రచార సభలు నిర్వహించడంపై ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ జాగృతి నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదినితో కవిత ఫోన్లో మాట్లాడి ప్రజాధనం అక్రమ మార్గాల్లో ఖర్చు చేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధిపొందాలని చూస్తున్నారని వివరించారు.
Nirmal |నామినేషన్ వేసిన మరుసటి రోజే…
మామడ, ఆంధ్రప్రభ : మండలంలో విషాదం చోటుచేసుకుంది… పొన్కల్ గ్రామానికి చెందిన దుబ్బాక
ఐదు వికెట్లు కోల్పోయి.. ఆచితూచి ఆడుతున్న సౌతాఫ్రికా
రాంచీ: జెఎస్సిఎ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికా ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్లో సఫారీ జట్టు టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. 350 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ రికల్టన్ వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో రికల్టన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే మరో కీలక ఆటగాడు డికాక్(0) కూడా హర్షిత్ రాణా బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే ఆర్ష్దీప్ బౌలింగ్లో కెప్టెన్ మార్క్రమ్(7) రాహుల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని బ్రీట్జ్కే, జోర్జిల జోడీ ఆదుకుంది. వీరిద్దరు కలిసి 66 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జోర్జి ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 37 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో బ్రీట్జ్కే, యాన్సెన్ల జోడీ పట్టు వదలకుండ స్కోర్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బ్రీట్జ్కే, యాన్సెన్లు అర్థ శతకం సాధించారు. యాన్సెన్ అర్థశతకం 26 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. క్రీజ్లో బ్రీట్జ్కే(67), యాన్సెన్(54) ఉన్నారు.
ఐబొమ్మ రవిని కాదు.. వారిని ఉరి తీయాలి.. సిపిఐ నారాయణ సంచలన కామెంట్స్
ఐబొమ్మ వెబ్సైట్లో నేను కూడా సినిమాలు చూశా వందల్లో టికెట్ ధరలవల్లే ఇలాంటివి పుట్టుకొస్తున్నాయి ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది పుడతారు సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ మన తెలంగాణ / హైదరాబాద్ : ఐబొమ్మ’ వెబ్సైట్లో తాను కూడా సినిమాలు ఉచితంగా చూశానని సిపిఐ సీనయర్ నాయకుడు డా. కె. నారాయణ అన్నారు. ఐబొమ్మ రవిని శిక్షించడం కంటే అసలైన సినిమా మాఫియాను ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ డా. నారాయణ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధరలను రూ. 600 నుండి రూ.700 వరకు పెంచితే సామాన్యులు సినిమాలు ఎలా చూస్తారని ఆయన ప్రశ్నించారు. ‘కోట్లు ఖర్చుపెట్టి, టికెట్ ధరల కోసం అడుక్కుంటారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం సాయం చేస్తుందా? కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారిని ఐబొమ్మ రవి దెబ్బకొట్టారు‘ అని నారాయణ వ్యాఖ్యానించారు. ఒకరిని జైల్లో వేయడం వల్ల ప్రయోజనం లేదని, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని ఆయన సూచించారు. వ్యవస్థలోని లోపాలను సరిచేయనంత వరకు ఇలాంటి వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారని నారాయణ హెచ్చరించారు. ‘ఒక ఐబొమ్మ రవిని జైలులో వేస్తే మరో వంద మంది వస్తారన్నారు. అలాగే మావోయిస్టు నేత హిడ్మాను చంపడం ద్వారా వెయ్యి మంది హిడ్మాలు పుడతారని నారాయణ వ్యాఖ్యానించారు. వ్యవస్థాగత వైఫల్యాల వల్లే రవి లాంటి వారు తప్పుడు మార్గంలోకి వెళుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తులను శిక్షించడం సమస్యకు పరిష్కారం కాదని, అసలు సమస్య వ్యవస్థలోనే ఉందని నారాయణ స్పష్టం చేశారు. ఈ వ్యవస్థే ఐబొమ్మ రవి లాంటి వ్యక్తులను సృష్టిస్తోందని, లోపాలను సరిదిద్దకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటి వారు వస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో భారీ భూ స్కామ్ జరుగుతోంది.. రాహుల్ గాంధీకి కెటిఆర్ లేఖ
హిల్ట్ పి పేరుతో రూ. లక్షల కోట్ల కాంగ్రెస్ భూ కుంభకోణం దీనిపై రాహుల్ గాంధీ మౌనం ఆమోదానికి సంకేతం ఆయన స్పందించకుంటే ఈ అవినీతిలో భాగ్యస్వామ్యం ఉన్నట్లే మనతెలంగాణ/హైదరాబాద్ : స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణాలలో ఒకటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్ట్ పి) అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా, లేకుంటే తెలిసి కావాలని మౌనంగా ఉన్నదా..? అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. సిఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టిన హిల్ట్ పి విధానం వల్ల తెలంగాణ ప్రజలకు రూ.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని బాలానగర్, జీడిమెట్ల, సనత్నగర్, ఉప్పల్, మల్లాపూర్, రామచంద్రాపురం, హయత్నగర్ వంటి కీలక క్లస్టర్లలో మునుపటి ప్రభుత్వాలు సుమారు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించాయని కెటిఆర్ తన లేఖలో వివరించారు. ఈ భూములను మొదట పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన, దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి రాయితీ ధరలకు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే, కొత్త హిల్ట్ పి కింద, పారిశ్రామిక భూములను కలిగి ఉన్నవారు ఇప్పుడు ఆ భూములను వాణిజ్య లేదా నివాస జోన్లుగా మార్చుకోవడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం(ఎస్ఆర్ఒ) విలువలో కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే చాలు అని ఆరోపించారు. ప్రస్తుత మార్కెట్ ధరలు చాలా రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ విధానం ప్రజలకు దక్కాల్సిన ఆస్తులను తక్కువ ఖర్చుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, లక్షల కోట్ల విలువైన భూమిని నామమాత్రపు ధరకు క్రమబద్ధీకరిస్తుందని ఆరోపించారు. ప్రక్రియలో పారదర్శకత లేదు వేల కోట్ల విలువైన ఆస్తుల మార్పిడికి 45 రోజుల్లో ఫాస్ట్-ట్రాక్ ఆమోదాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై కెటిఆర్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇంత తొందరపాటుతో కూడిన ప్రక్రియలో పారదర్శకత లేదని, కేవలం డబ్బులు దండుకోవాలని మాత్రం వలననే సరైన విచారణ లేకుండానే ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొందరపాటుతనం, ఈ మొత్తం పాలసీలో దాగున్న రాజకీయ అవినీతి అనేక ప్రశ్నలను లేవనెత్తుతుందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ఒఆర్ఆర్) వెలుపలికి కాలుష్య పరిశ్రమలను తరలించాలనే ఈ విధానం లక్ష్యం పేరు చెప్పి తప్పుడు దారిలో లక్షల కోట్ల తెలంగాణ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసిందని ఆరోపించారు. పరిశ్రమల తరలింపు ప్రధాన లక్ష్యం అయితే, ఇది మొత్తం పరిశ్రమలకు ఒక పాలసీ నిర్ణయంగా కాకుండా పూర్తి స్వచ్ఛందంగా నచ్చిన వారు మాత్రమే దరఖాస్తు చేయాలనడం, ఒక్కొక్క దరఖాస్తు వారీగా ప్రత్యేకంగా ప్రభుత్వం భూముల ట్రాన్స్ఫర్కి ఆమోదం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, ప్రస్తుతం ఉన్న పరిశ్రమల తరలింపుకు ఎలాంటి గడవు నిర్ధారించకపోవడం, పరిశ్రమలు తరలి వెళ్తాయా లేదా అన్న అంశాన్ని ప్రకటించకపోవడం వంటి అనేక లోపభూహిష్ఠమైన పాలసీని కేవలం డబ్బులు దండుకోవడమే ఏకైక లక్ష్యంగా తీసుకువచ్చిందని పేర్కొన్నారు. తరలించాలనుకునే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ స్థలాలను ఈ విధానం గుర్తించలేదని, ఈ భూముల ట్రాన్స్ఫర్ వలన కలిగి ఆవరణ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వంటి లోపాలు పాలసీలో ఉన్నాయని కెటిఆర్ లేఖలో ప్రస్తావించారు. దీనివల్ల నగరంలో కొత్త పారిశ్రామికాభివృద్ధికి బదులుగా, పాత పారిశ్రామిక యూనిట్ల స్థానంలో ఆకాశహర్మ్యాలు, వాణిజ్య సముదాయాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ విధానం కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు, పలుకుబడి గల రియల్ ఎస్టేట్ గ్రూపులు, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకు, కుటుంబంలోని వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందించబడిందని ఆరోపించారు. ఈ అవినీతికి రాహుల్గాంధీ అడ్డుకట్ట వేయాలి బిఆర్ఎస్ ప్రభుత్వం భూ వినియోగ మార్పిడికి పారిశ్రామిక యూనిట్లు ఎస్ఆర్ఒ విలువలో 100 నుండి 200 శాతం చెల్లించాలని కఠినమైన నిబంధనలను అమలు చేసిందని కెటిఆర్ గుర్తు చేశారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు సరైన పరిహారం అందేలా చూసుకుందని వివరించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిబంధనలు తొలగించి, తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతల అనుచరులకు ఎటిఎంగా మార్చేశారని విమర్శించారు. పెద్దఎత్తున జరుగుతున్న అక్రమాల గురించి ఇప్పటివరకు తెలియకుంటే కనీసం ఇప్పుడైనా తెలంగాణలో జరుగుతున్న ఐదు లక్షల కోట్ల అవినీతి స్కామ్ని అడ్డుకోవాలని రాహుల్గాంధీని కోరారు. లేకుంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద భారీ భూ కుంభకోణంలో రాహుల్ గాంధీ మౌనంగా ఉంటే తనకు తన పార్టీకి భాగస్వామ్యం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం తెలంగాణలో జరుగుతున్నదని భావించాల్సి ఉంటుందని అన్నారు. రాహుల్ గాంధీ ఈ అంశంలో ఇప్పటికైనా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ అవినీతికి అడ్డుకట్ట వేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన అవినీతి కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఒప్పుకునేది లేదని, ప్రజల తరఫున బిఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. తన బహిరంగ లేఖకు సమాధానం ఇవ్వాలని, తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడాలని కెటిఆర్ డిమాండ్
Maktal |డిసెంబర్ 1న మక్తల్ కు సీఎం రేవంత్..
Maktal | డిసెంబర్ 1న మక్తల్ కు సీఎం రేవంత్.. మక్తల్, ఆంధ్రప్రభ
November Box-office: Below Par for Telugu Cinema
A heap of films tested their luck in November in Telugu cinema and most of them fell short of expectations and ended up as disasters at the box-office. During the first week of November, Sudheer Babu’s Jatadhara, Rashmika’s The Girlfriend, Premistunnaa and The Great Pre Wedding Show released. The Girlfriend performed well in multiplexes and […] The post November Box-office: Below Par for Telugu Cinema appeared first on Telugu360 .
సరూర్నగర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్పై యువకుడి దాడి #Crime #SaroorNagar #Hyderabad #TrafficPolice
66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర జ్యూడిషియల్ సర్వీసులో సివిల్ జడ్జిల (జూనియర్ డివిజన్) స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్-లైన్ పద్దతిలో అర్హుల నుండి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర హైకోర్ట్ రిజిస్ట్రార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలియచేశారు. ఈ సివిల్ జడ్జిల (జూనియర్ డివిజన్) పోస్టులకు డిసెంబర్ 8వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఆన్-లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ పోస్టుల పరీక్ష తేదీలు, హల్ టికెట్ల డౌన్ లోడ్, కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష ఇతర వివరాలను వెబ్-సైట్ లో ప్రకటించడం జరుగుతుందని రిజిస్ట్రార్ తెలిపారు. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం హై-కోర్ట్ వెబ్సైట్ http://tshc.gov.comను సంప్రదించాలని కోరారు.
Palnadu Mu*der|అక్క కళ్లల్లో నీళ్లు చూడలేక…
Palnadu Mu*der | అక్క కళ్లల్లో నీళ్లు చూడలేక… ఆంధ్రప్రభ, పల్నాడు బ్యూరో
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం#TamilNaduAccident #BusCollision #RoadAccident #Sivaganga
కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై కెటిఆర్ ఆవేదన..
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ ఆస్తి నష్టం.. ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం ఇవ్వాలి మాజీ ఎంఎల్ఎ సుంకె రవిశంకర్తో మాట్లాడిన కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆయన చొప్పదండి మాజీ ఎంఎల్ఎ సుంకే రవిశంకర్కు ఫోన్ చేసి మాట్లాడి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కోసం అప్పులు చేసి, ఎంతో కష్టపడి దుకాణాలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. షాపుల్లో ఉన్న సరుకు, బొమ్మలు, ఇతర సామాగ్రి సర్వం అగ్నికి ఆహుతి అయ్యాయని, దాదాపు 30 కుటుంబాల భవిష్యత్తు నాశనమైందని విచారం వ్యక్తం చేశారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంత భారీగా ఆస్తి నష్టం పెరగడానికి సకాలంలో ఫైర్ ఇంజన్లు రాకపోవడమే ప్రధాన కారణమని మండిపడ్డారు. జగిత్యాల ఫైర్ ఇంజన్ రిపేర్లో ఉండటం, వచ్చిన ఒక ఇంజన్ పని చేయకపోవడం, గంట తర్వాత కోరుట్ల, కరీంనగర్ నుంచి వాహనాలు రావడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన ఆస్తి నష్టం, పూర్తిగా దెబ్బతిన్న వ్యాపారాన్ని, దుకాణాలు ఏమాత్రం పనికిరాని స్థితికి చేరడాన్ని దృష్టిలో ఉంచుకొని, మానవతా దృక్పథంతో ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదం విషయం తెలియగానే అక్కడికి చేరుకుని, సహాయక చర్యల్లో పాల్గొని, బాధితులకు తక్షణ సాయంగా రూ. 5000 అందజేసిన మాజీ ఎంఎల్ఎ సుంకే రవిశంకర్ను కెటిఆర్ అభినందించారు. స్థానికులకు, నష్టపోయిన కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోకుంటే, పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కెటిఆర్ హెచ్చరించారు.
చిన్నారిని కాలితో తొక్కుతూ ఆయా పైశాచిక ఆనందం
హైదరాబాద్: నర్సరీ విద్యార్థినిపై ఆయా అమానవీయంగా ప్రవర్తించింది. చిన్నారిపై కాలు వేసి తొక్కుతూ ఆయా లక్ష్మి పైశాచిక ఆనందం పొందింది. జీడిమెట్ల పరిధి షాపూర్నగర్లోని పూర్ణిమా స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారిని ఆయా లక్ష్మి ఇష్టారీతిన కొట్టింది. చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల ముగిసిన గంట తర్వాత వచ్చారు. ఆయా తనని కొట్టినట్లు తల్లిదండ్రులకు చిన్నారి తెలిపింది. దీంతో ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఈ ఘటన కారణంగా చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చారు. దాడి జరిగిన సమయంలో పాఠశాల పక్కింటి వ్యక్తి ఆ ఘటనను వీడియో తీశాడు. ఆయా దాడి దృశ్యాలను ఆ వ్యక్తి తల్లిదండ్రులకు ఇచ్చాడు. దాడి దృశ్యాల ఆధారంగా చిన్నారి తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మాదాపూర్లో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు #Madhapur #Hyderabad #DemolitionDrive #Mindspace
Nagarkurnool |సర్పంచ్ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్య యత్నం..
నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ : సర్పంచ్ పదవి తనకు కేటాయించాలని కోరుతూ వచ్చిన కాంగ్రెస్
ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు.. 8 మంది మృతి
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టిసి బస్సులు ఢీకొనగా.. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. శివగంగ జిల్లా తిరువత్తూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుప్పూర్ నుంచి కారైకుడికి వెళ్తున్న ఓ బస్సు.. కారైకుడి నుంచి దిండిగల్కు వెళ్తున్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్లు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. బస్సుల నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
భారీ ధరకు ‘పెద్ది’ ఒటిటి రైట్స్.. ఎంతంటే..
రామ్చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంపై రామ్చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం రూపొందుతోంది. కొన్ని నెలల క్రితం వచ్చిన పెద్ది ఫస్ట్ షాట్ నుంచి ఈ మధ్యే వచ్చిన ‘చికిరి చికిరి’ అంటూ సాగే తొలి సింగిల్ వరకూ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకున్నాయి. అయితే విడుదలకు ముందే పెద్దికి వచ్చిన బజ్తో పలు ఒటిటి సంస్థలు దీని డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా రెండు ప్రముఖ ఒటిటి సంస్థలు ఈ పోటీలో ఉన్నాయి. అందులో నెట్ఫ్లిక్స్ సంస్థకు రైట్స్ దక్కినట్లు సమాచారం. దాదాపు రూ.130 కోట్లతో పెద్ది డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అన్ని భాషలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించనుందట. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో స్పోర్ట్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో చరణ్కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.
Big Breaking : ఘోర రోడ్డు ప్రమాదం ...11 మంది మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పదకొండు మంది మరణించారు
BRS|బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు..
BRS| జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని
Election |అక్కడ 11 ఏళ్ల తర్వాత.. !
Election | అక్కడ 11 ఏళ్ల తర్వాత.. ! ఉట్నూర్ మేజర్ గ్రామ
Two titles speculated for Venkatesh and Trivikram Film
Victory Venkatesh will soon kick-start the shoot of his upcoming movie directed by Trivikram Srinivas. The film is said to be a family entertainer with loads of entertainment and family emotions. The shoot commences during the mid of December and Trivikram is in plans to complete the shoot in quick schedules. There are two titles […] The post Two titles speculated for Venkatesh and Trivikram Film appeared first on Telugu360 .
రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో…. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు లేదా వ్యాఖ్యలు
Honor |సేవలకు ప్రజల ఆదరణ గొప్ప
Honor | సేవలకు ప్రజల ఆదరణ గొప్ప Honor | జన్నారంరూరల్, ఆంధ్రప్రభ
Basara |టెట్ పై టెన్షన్ వద్దు….
Basara | టెట్ పై టెన్షన్ వద్దు…. బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ
MLA | ప్రతీ గింజా కొంటాం.. రైతులు అధైర్య పడొద్దు..బాధ్యత నాదిగుడివాడ ఎమ్మెల్యే
Congress |కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి..
Congress | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
ఆంధ్రప్రభ, పల్నాడు బ్యూరో : సత్తెనపల్లి మండలం దూళ్లిపాళ్ళలో దారుణం జరిగింది. ఆదివారం
Panchayathi election |ఇదో రకమైన హామీ!
Panchayathi election | బీజేపీ అభ్యర్థి గెలిస్తే… స్మశానవాటికకు ఐదు లక్షల విరాళం
Financial help|చిన్ననాటి స్నేహితునికి ఆర్థికసాయం
Financial help| చిట్యాల, ఆంధ్రప్రభ : చిన్నప్పుడు ఒకే పాఠశాలలో చదువుకొని అనుకోకుండా
Awareness |కాన్సర్పై అవగాహన ర్యాలీ
Awareness | కాన్సర్పై అవగాహన ర్యాలీ Awareness | కర్నూలు, ఆంధ్రప్రభ :
Maoists | 37 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యంలో మావోయిస్టులు లొంగిపోయారు. దక్షిణ బస్తర్ ప్రాంతానికి చెందిన మొత్తం
‘జైలర్-2’లో బాలకృష్ణ బదులు ఆ స్టార్ హీరో
సూపర్స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ చిత్రం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే తొలి భాగంలో శివరాజ్ కుమార్, మోహన్లాల్ వంటి స్టార్ హీరోలో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. అలాగే రెండో భాగంలో కూడా అతిథి పాత్రలో పలువురు స్టార్స్ కనిపిస్తారని వార్తలు వైరల్ అయ్యాయి. అందులో ప్రధానంగా నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తారనే పుకార్లు వినిపించాయి. కానీ, ఇప్పుడు ఆ వార్తలు అవాస్తవమంటూ మరిన్ని రూమర్స్ వస్తున్నాయి. బాలకృష్ణ ఈ సినిమాలో నటించడం లేదని.. ఆయన స్థానంలో ఆ పాత్రలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కూడా ఇప్పటివరకూ క్లారిటీ లేదు. జైలర్లో బాలకృష్ణను తీసుకుందామని తాను అనుకున్నట్లు నెల్సన్ ఓ సందర్భంలో చెప్పారు. కానీ, బాలకృష్ణ ఇమేజ్ తగ్గట్లు ఆ పాత్ర లేకపోవడంతో ముందుకు వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో జైలర్ సీక్వెల్లో అయిన బాలకృష్ణ కనిపిస్తారని అభిమానులు భావించారు. రజనీ, బాలకృష్ణలను ఒకే ఫ్రేమ్లో చూస్తామని అంతా ఆశపడ్డారు. కానీ, ఇప్పుడు సడెన్గా విజయ్ సేతుపతి పేరు తెరమీదకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే.. చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
Minister |ఘనంగా మంత్రి వివేక్ జన్మదిన వేడుకలు
Minister | చెన్నూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉపాధి కార్మిక మంత్రి గడ్డం
Sarpanch post is no more a ‘bed of roses’
Panchayath elections have arrived in Telangana and nominations are going on, with aspirants filing nominations with full josh. While election fever has gripped villages, there is also a palpable sense of tension in Sarpanch post aspirants. The reason for cautiousness is, severe financial troubles faced by outgoing Sarpanchs. The previous Sarpanchs, who had served during […] The post Sarpanch post is no more a ‘bed of roses’ appeared first on Telugu360 .
DEMAND |సీసీఐ నిబంధనలు సడలించాలి
DEMAND | సీసీఐ నిబంధనలు సడలించాలి తేమ శాతంతో నిమిత్తం లేకుండా పత్తిని
Promotions |జీవో ఇచ్చారు సరే..
Promotions | జీవో ఇచ్చారు సరే.. Promotions | అనంతపురం, ఆంధ్రప్రభ బ్యూరో
Praja Darbar |సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా దర్బార్
Praja Darbar | సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా దర్బార్ కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రభ
మేడపిలో బైక్ దొంగలు హల్చల్ #Crime #Prakasam #Police #BikeTheft #latestnews #viralvideo
Gopal Ratna Award |జాతీయ గోపాల్ రత్న అవార్డు గ్రహీత అనురాధ సేవలు ప్రశంసనీయం..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : విధి నిర్వహణలో పశువులకు సేవ చేస్తూ, జాతీయ
రాయదుర్గం.. అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తులో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: రాయదుర్గం పరిధి..అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేశారు. సోఫాపై దీపం పడి మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Medical Camp |మూర్చ పట్ల అప్రమత్తంగా ఉండాలి
Medical Camp | నర్సంపేట, ఆంధ్రప్రభ : మూర్చ వ్యాధి పట్ల అప్రమత్తంగా
ఆంధ్రప్రభ విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి
Kurnool | అక్రమం..ఇక సక్రమం కర్నూలులో స్పెషల్ డ్రైవ్బీపీఎస్–ఎల్ఆర్ఎస్ పై ఫోకస్ Kurnool
కార్మికులు ఐక్య పోరాటాలు నిర్మించాలి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో, నవంబర్ 30 (జనంసాక్షి) కూరపాటి రమేష్ ,సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. సిరిసిల్ల సిఐటియు జిల్లా …
eye testing | 96 మందికి కంటి పరీక్షలు
eye testing | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట లో ఈ
Collector | 1100 సేవలను వినియోగించుకోండి
Collector | 1100 సేవలను వినియోగించుకోండి Collector | నరసరావుపేట, ఆంధ్రప్రభ :
Collector |ఉట్నూర్ ఎన్నికల క్లస్టర్ ను సందర్శించిన కలెక్టర్
Collector | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల క్లస్టర్
murder |పెద్దేముల్ మండలంలో దారుణం
murder | పెద్దేముల్ మండలంలో దారుణం murder | పెద్దేముల్, ఆంధ్రప్రభ :
Temple | ధర్మకర్త ఇక లేరు.. Temple | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ
ఓటీటీలోకి ‘ది గర్ల్ఫ్రెండ్’..#thegirlfriend #rashimkamandanna #netflix #TeluguPost #telugu #post
సత్తెన్నపల్లిలో తల్లి, కుమారుడిపై దుండగుల హత్యాయత్నం
అమరావతి: పల్నాడు జిల్లా సత్తెన్న పల్లి మండలం ధూళిపాళ్ళలో దారుణం చోటు చేసుకుంది. దుండగులు ఇంట్లోకి చొరబడి తల్లి, కుమారుడిపై హత్యాయత్నం చేశారు. కుమారుడు మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తల్లి కృష్ణకుమారి, కుమారుడు సాంబశివరావుగా గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు, : తిరుపతి జిల్లా వేలంపాడు గ్రామంలో ఇటీవల జరిగిన ప్రమాదంతో ఎల్పీజీకి
Cyclone |దిత్వా దూకుడు.. కర్నూలు గజగజ
Cyclone | దిత్వా దూకుడు.. కర్నూలు గజగజ Cyclone | కర్నూలు బ్యూరో,
Namination Centers |నామినేషన్ కేంద్రాల పరిశీలన
Namination Centers | నిజాంపేట, ఆంధ్రప్రభ : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో
Kidnapping |సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ కలకలం!
Kidnapping | సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ కలకలం! Kidnapping | ఉమ్మడి
University |ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
University | ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు University | ఆంధ్రప్రభ ( భద్రాద్రి
MLC FIRE : ప్చ్.. అసలు బాగోలేదు
( పులివెందుల , ఆంధ్రప్రభ) : పులివెందుల పట్టణం, బాకరపురం సమీపంలోని సాంఘిక
విరాట్, రోహిత్ విధ్వంసం.. తొలి వన్డేలో అర్థ శతకాలు
రాంచీ: సౌతాప్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రకా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు 4వ ఓవర్లో షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (18) కీపర్ డికాక్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కి వచ్చిన విరాట్ కోహ్లీ.. ప్రోటీస్ బౌలర్లపై విరుచుకుపడ్డా. 48 బంతుల్లో అర్థశతకం సాధించాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా నిలకడగా ఆడుతు.. హాఫ్ సెంచరీ మార్క్ను దాటేశాడు. అయితే 22వ ఓవర్లో రోహిత్ శర్మ(57) ఎల్బిడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. విరాట్, రోహిత్ విధ్వంసం.. తొలి వన్డేలో అర్థ శతకాలుదీంతో 22 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. క్రీజ్లో కోహ్లీ (73), గైక్వాడ్ (1) ఉన్నారు.
Nomination |మారిన నామినేషన్ కేంద్రం..
Nomination | నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండలంలోని జలాల్ పూర్, అచ్చయపల్లి
Manikanta | 4న మణికంఠుడి గ్రామోత్సవం
Manikanta | ( ఆంధ్రప్రభ, పులివెందుల అర్బన్ ) : ఏడాదికి ఒక
Schools |నెల్లూరు జిల్లాలో బడులకు సెలవు
జేసీ వెంకటేశ్వర్లు ప్రకటన Schools | ( నెల్లూరు, ఆంధ్రప్రభ ప్రతినిధి) :
TG|వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి
TG| వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి TG| ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణ
Quiz |పోటీతత్వం తోనే గెలుస్తాం
క్విజ్ విజేతలకు బహుమతుల పంపిణీ Quiz | ఆంధ్రప్రభ, సుండుపల్లె (అన్నమయ్య జిల్లా)
రోడ్డు బాగు చేయకుంటే ఎన్నికలను బహిష్కరిస్తాం
వెల్దుర్తి, నవంబర్30 ( జనం సాక్షి): వెల్దుర్తి మండలం లో నాలుగు గ్రామాల ప్రజల ధర్నా జిల్లా …
నెల రోజుల్లోనే ఒటిటిలోకి రష్మిక మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..
హీరోయిన్గా కెరీర్ ఆరంభించిన కొంతకాలంలోనే స్టార్ స్థాయిని సంపాదించుకున్న నటి రష్మిక మంధాన్న. పాన్ ఇండియా రేంజ్లో సినిమాలతో ఈ బ్యూటీ ప్రేక్షకాదరణను సంపాదించుకుంది. ఇక రష్మిక నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్ఫ్రెండ్’. నవంబర్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ఒటిటిలో విడుదలకు సిద్ధమైంది. తండ్రి చాటున ఉండే ఒక అమ్మాయి నగరానికి వచ్చి.. ఓ అబ్బాయితో ప్రేమలో పడి.. ఆ తర్వాత ఆ అమ్మయి ఎదురుకునే పరిస్థితులు ఏంటి అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో రష్మిక భూమా అనే పాత్రలో, దక్షిన్ శెట్టి విక్రమ్గా, అను ఇమ్మానుయేల్ నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.డిపెంబర్ 5 నుంచి నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
అదిలాబాద్లో ఘోర ప్రమాదం బస్సు–లారీ ఢీ #Adilabad #RoadAccident #NH44 #Hyderabad #Gorakhpur
డిసెంబర్ 1 సోమవారం యధాతధంగా జిల్లాలో ‘మీకోసం’ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక — కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు డిసెంబర్ 1వ తేదీ సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ/వార్డు సచివాలయ స్థాయిల్లో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమం’’ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల […] The post యధాతధంగా జిల్లాలో ‘మీకోసం appeared first on Visalaandhra .

20 C