సర్పంచ్ గా గెలిపిస్తే ఉచిత వైఫై..#telugupost #sarpanchelections #mulugudistrict
Dr.BR | వైసీపీ ఆధ్వర్యంలో.. Dr.BR | పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు
MSG Sasirekha Promo: blockbuster
In Mana Shankara Vara Prasad Garu, music seems to breathe the very soul of celebration. The film’s composer Bheems Ceciroleo, known for his peppy, crowd-pleasing tunes, is turning the soundtrack into a musical centerpiece. Following the massive success of the first song Meesala Pilla, the makers have now teased with a glimpse of the second […] The post MSG Sasirekha Promo: blockbuster appeared first on Telugu360 .
BJP| అంబేద్కర్ కు ఘన నివాళులు BJP| రాజాపేట, ఆంధ్రప్రభ : డాక్టర్
Suspicious |బైక్ కాలువలో పడి..
Suspicious | బైక్ కాలువలో పడి.. వివాహిత మృతి.. కుమారుడి గల్లంతు Suspicious
Medical |పశు వైద్యాధికారి కావలెను..
Medical | పశు వైద్యాధికారి కావలెను.. Medical | ఘంటసాల, ఆంధ్రప్రభ :
IndiGo Flight Meltdown Continues. Railways Step In With Extra Coaches and Special Trains
India’s largest airline IndiGo faced another day of severe disruption as hundreds of its flights were cancelled across the country. The carrier scrapped more than 550 flights in a single day, a scale of interruption never seen in its 20 year history. The chaos left thousands of passengers stranded at airports for hours with no […] The post IndiGo Flight Meltdown Continues. Railways Step In With Extra Coaches and Special Trains appeared first on Telugu360 .
POLICE | కారులో మంటలు.. POLICE | గన్నవరం, ఆంధ్రప్రభ : హనుమాన్
ఇండిగో సిబ్బందిని గౌరవించండి #telugupost #latestnews #sonusood #indigoflight
Regards |రాజ్యంగ శిల్పి.. అంబేద్కర్
Regards | రాజ్యంగ శిల్పి.. అంబేద్కర్ Regards | ఘంటసాల, ఆంధ్రప్రభ :
Rajini |అంబేద్కర్ అడుగుజాడల్లో..
Rajini | అంబేద్కర్ అడుగుజాడల్లో.. Rajini | ఘంటసాల, ఆంధ్రప్రభ : భారత
గ్లోబల్ ఫ్యాక్ట్-చెక్ బాట్ (GFC)లో సభ్యత్వం పొందిన తెలుగుపోస్ట్
తప్పుడు సమాచారంపై ప్రపంచ వ్యాప్తంగా పోరాటం చేస్తున్న పలు ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్గనైజేషన్స్ లో తెలుగు పోస్ట్ సంస్థ ఒకటి. ఇప్పుడు తెలుగు పోస్ట్ కు అరుదైన స్థానం దక్కింది.
పిల్లలు సినిమాల పిచ్చిలో పడకూడదు #PawanKalyan #AP #Education #Parents #Students
loudly |కాంగ్రెస్ అభ్యర్థి విస్తృత ప్రచారం
loudly | కాంగ్రెస్ అభ్యర్థి విస్తృత ప్రచారం loudly | వాజేడు, ఆంధ్రప్రభ
Leaders |అది అంబేద్కర్ పెట్టిన భిక్ష
Leaders | అది అంబేద్కర్ పెట్టిన భిక్ష పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు
ప్రపంచానికి గాజా, ఉక్రెయిన్ అనే రెండు సమస్యలు చాలవన్నట్లు వెనిజుయేలా, జపాన్ రూపంలో రెండు కొత్త సమస్యలు తయారవుతున్నాయి. ఈ నాలుగింటికి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలతో నిమిత్తం ఉండటం గమనించదగ్గది. సంవత్సరాలుగా సాగుతున్న గాజా, ఉక్రెయిన్ యుద్ధాల గురించి తెలిసిందే. ఇపుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లుండి దక్షిణ అమెరికాలోని వెనిజుయేలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో లేని పేచీలు మొదలుపెట్టారు. మరొకవైపు, అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన జపాన్ అధ్యక్షురాలు సనే తకాయిచీ అదే పద్ధతిలో చైనాతో అక్కరలేని తగవును లేవనెత్తారు. గాజా విషయం తెలిసిందే. ఆ ప్రాంతం పాలస్తీనాలో భాగం. పాలస్తీనాను 27 సంవత్సరాల క్రితం బలవంతంగా విభజించి ఇజ్రాయెల్ను సృష్టించిన పాశ్చాత్య కూటమి, ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడగలవని స్వయంగా ప్రకటించి కూడా, ఆ మేరకు ఐక్యరాజ్య సమితిలో తీర్మానించి కూడా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. పాలస్తీనా ప్రజలు అందుకు ఆగ్రహించటం వల్ల ఆవిర్భవించిందే గాజా ప్రాంతంలో హమాస్ చేసిన తిరుగుబాటు. స్వతంత్ర పాలస్తీనాకు అనుకులంగా ప్రపంచమంతా గొంతెత్తినా లెక్కచేయని ఇజ్రాయెల్, అమెరికాలు, గాజా ప్రాంతాన్ని, వెస్ట్ బ్యాంక్ను కూడా ఆక్రమించి ఇక పాలస్తీనా దేశమున్నదే లేకుండా చేయాలని రకరకాల కుయుక్తులు పన్నుతున్నాయి. దీనంతటిలో అమెరికా అధ్యక్షుని ప్రత్యక్ష పాత్ర ఉంది. ఉక్రెయిన్ విషయానికి వస్తే, ఆ సమస్య పరిష్కారానికి ట్రంప్ పలు విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు పైకి తోస్తుంది. కాని వాస్తవంలో ఆ సమస్యకు మూలమే అమెరికా. అందులో వ్యక్తిగతంగా ట్రంప్ పాత్ర కూడా ఉంది. సోవియెట్ యూనియన్, దానితో పాటు వార్సా సైనిక కూటమి 1991 లో రద్దయిన వెనుక ఇక ప్రచ్ఛన్న యుద్ధమంటూ లేని స్థితిలో, పాశ్చాత్య దేశాల ‘నాటో’ సైనిక కూటమిని కూడా రద్దు చేయటానికి బదులు అమెరికా, యూరప్ కలిసి అదే విధంగా కొనసాగించాయి. నాటో రద్దు కాకపోయినా కనీసం మరింత విస్తరించబోమంటూ రష్యాకు ఇచ్చిన హామీని ఉల్లంఘించి, ఇంకొక 12 దేశాలను కొత్తగా చేర్చుకుని రష్యా సరిహద్దుల వైపు విస్తరించాయి. అదే క్రమంలో ఉక్రెయిన్ను కూడా నాటోలో చేర్చుకుని రష్యాను ఇక పూర్తిగా చక్రబంధంలోకి తెచ్చే ప్రయత్నం సాగటం వల్ల మాత్రమే ఆ ప్రమాదాన్ని నిరోధించేందుకు ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలైంది. ఉక్రెయిన్, యూరప్లను ట్రంప్ ఇపుడు తప్పు పడుతున్నారు గాని, వాస్తవానికి ఆయన గత పర్యాయం అధ్యక్షునిగా ఉన్నపుడు నాటో విస్తరణకు అనుకూలురే. దానినట్లుంచితే, ఈసారి అయినా ఉక్రెయిన్ యుద్ధ పరిసమాప్తికి ఆయన ప్రయత్నాలు దోబూచులాట వలెనే ఉన్నాయి తప్ప ఖచ్చితమైన విధానం కనిపించదు. చివరకు ఏమి జరిగేదీ, ఎప్పుడు జరిగేదీ తెలియకుండా కొనసాగుతున్నదా సమస్య. పాలస్తీనా వలెనే ఉక్రెయిన్ సమస్య కూడా అమెరికా నాయకత్వాన పాశ్చాత్య దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఉనికిలోకి వచ్చి కొనసాగుతున్నాయి. అవి రెండు అట్లుండగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు వెనిజుయేలా పై దాదాపు యుద్ధ సన్నాహాలనదగ్గవి మొదలుపెట్టారు. ఆయన తన ఎన్నికల ప్రచార సమయంలో, ఎన్నికైన తర్వాత కూడా, తను యుద్ధాలకు వ్యతిరేకమని, జరుగుతున్న యుద్ధాలను ఆపగలనని ప్రకటించారు. కొన్ని యుద్ధాలను ఆపినట్లు కూడా చెప్పుకున్నారు. కాని ఇపుడు వెనిజుయేలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై కత్తిగట్టారు. అందుకు ఏకైక కారణం ఆయన సోషలిస్టు కావటం. మదురో కన్నా ముందు అధ్యక్షుడు అయిన హ్యూగో ఛావేజ్ కూడా సోషలిస్టే. ఆయన అమెరికాను బలంగా వ్యతిరేకించారు. లాటిన్ అమెరికా మొత్తాన్ని అమెరికా మొదటి నుంచి పూర్తిగా తన నియంత్రణలో ఉండవలసిన ప్రాంతంగా పరిగణిస్తూ వస్తున్నది. అటువంటి చోట తనను ఏ దేశం ఎంతమాత్రం ధిక్కరించినా, స్వతంత్రంగా వ్యవహరించినా అక్కడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో జోక్యం చేసుకుని ఆ ప్రభుత్వాలను పడగొట్టడం, తమకు అనుకూలురను అధికారంలోకి తేవటం ఒక సర్వసాధారణ క్రీడగా మారింది. ఆ విధంగా గత 200 సంవత్సరాలలో కనీసం 20 సార్లు జోక్యం చేసుకున్నారు. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో విషయంలో వైఫల్యం, చిలీలో అలెండీ ప్రభుత్వ పతనం కేసులు సుప్రసిద్ధమైనవి. ఈ చర్యలు అన్నింటికి అన్నీ అమెరికన్ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం చేసినవే. ఆయా ప్రభుత్వాలు వామపక్ష సిద్ధాంతాలు గలవి. అయితే ఇక చెప్పనక్కర లేదు. వెనిజుయేలాకు సంబంధించి ఈ రెండు కారణాలు కలిసి వచ్చాయి. ఛావేజ్ సోషలిస్టు కాగా, ఆయన వారసుడు మదురో కూడా సోషలిస్టు. ఇక ఆ దేశంలో చమురు నిల్వలు మొత్తం ప్రపంచంలోనే సౌదీ అరేబియాను కూడా మించి అత్యధికం కాగా, అమెరికన్ కంపెనీల చేతిలో ఉండిన ఆ నిల్వలను ఛావేజ్ జాతీయం చేశారు. మదురో అదే విధానాన్ని కొనసాగించటంతో, ట్రంప్ తన మొదటి పాలనా కాలంలోనే ఆయన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. అవే ప్రయత్నాలు ఈ రెండవ విడత పాలనలో కొనసాగిస్తున్నారు. అయితే అందుకు ఒక సాకును ముందుకు తెచ్చారు. అది, వెనిజుయేలా నుంచి కొకైన్, ఫెంటానిల్ తదితర మాదకద్రవ్యాలు అమెరికాకు రవాణా అవుతున్నాయని, అటువంటి ఉత్పత్తి, రవాణా సంస్థకు స్వయంగా మదురో అధిపతి అన్నది ట్రంప్ ఆరోపణ. కాని అది ఎంత మాత్రం నిజం కాదని మదురో నిరాకరించటమే కాదు. అమెరికా సహా ఇతర పాశ్చాత్య స్వతంత్ర సంస్థలు, నిపుణులు కూడా కాదనటం గమనించదగ్గది. కాని ట్రంప్ వంటి ధోరణి గల నాయకులకు ఏ విషయంలోనూ నిజానిజాలతో నిమిత్తం లేదన్నది ఈసరికి ప్రపంచానికి అర్థమైపోయిన విషయం. అందుకు అనుగుణంగానే ఆయన మదురోపై నిరాధారమైన ఆరోపణలు, అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే హెచ్చరికలు చేయటం మొదలుపెట్టారు. వెనిజుయేలా సమీపానికి, కరిబ్బియన్ సముద్రంలోకి ఇప్పటికే యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు పంపారు. వెనిజుయేలాలో రహస్య కార్యకలాపాలు సాగించవలసిందిగా సిఐఎను ఆదేశించినట్లు బహిరంగంగానే ప్రకటించారు. మదురోను పడగొడితే అయిదు కోట్ల డాలర్లు ఇవ్వగలమంటూ అక్కడి సైన్యాధికారులకు ఆశపెట్టారు. ఇక ఇటీవల అయితే, మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నాయని ఆరోపిస్తూ సుమారు 20 వెనిజులా పడవలపై వైమానిక దాడులు జరిపి, దాదాపు 80 మందిని చంపించారు. అవన్నీ మామూలు మత్సకారుల పడవలని మదురో ప్రకటించారు. ఆ పడవలలో మాదక ద్రవ్యాలున్నట్లు ఆధారాలేమిటని అమెరికన్ మీడియా ప్రశ్నించగా ట్రంప్ జవాబు ఇవ్వలేకపోవటం గమనించదగ్గది. దానితో ఆయనపై అమెరికాలోనే విమర్శలు మొదలయ్యాయి. తన చర్యలు అమెరికా చట్టాలకు, అంతర్జాతీయ చట్టాలకు కూడా విరుద్ధమని నిపుణులు ఎత్తిచూపారు. దీనికిదే సమస్య కాగా, కొద్ది రోజుల క్రితం ఒక పడవపై దాడిలో కొందరు మరణించిన తర్వాత ఇద్దరు ఇంకా జీవించి ఉండగా, మరొక విడత దాడి జరిపి వారిని కూడా చంపివేయటంతో రిపబ్లికన్ సహా అమెరికన్ సెనెటర్లు సైతం తీవ్ర విమర్శలు చేస్తూ, అందుకు రక్షణ మంత్రి పీట్ హెగ్ సెట్పై విచారణ జరపగలమని ప్రకటించారు. ఎవరూ మిగలకుండా దాడి చేయాలని సైన్యాన్ని ఆయన ఆదేశించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. అటువంటి రెండవ దాడిని తాను సమర్థించబోనని స్వయంగా ట్రంప్ వ్యాఖ్యానించటం విశేషం. ఈ వివరాలు ఎట్లున్నా, అసలు ఈ పరిణామాలన్నిటికి మూలం లాటిన్ అమెరికాకు వ్యతిరేకంగా ట్రంప్ సామ్రాజ్యవాదంలో ఉందన్నది తిరుగులేని వాస్తవం. మరొక వైపు, జపాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన తకాయి ఒకవేళ చైనా సైన్యం తైవాన్ను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే, తైవాన్కు మద్దతుగా, తమ ఆత్మరక్షణ కోసం, తమ సైన్యాన్ని పంపగలమని ప్రకటించి ఒక పెద్ద వివాదాన్ని సృష్టించారు. తైవాన్ చైనాలో భాగమనే ఒకే చైనా విధానాన్ని స్వయంగా జపాన్ కూడా పాటిస్తున్నప్పుడు ఇటువంటి ప్రకటన చేయటం చైనాకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దానితో వెంటనే తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ, జపాన్కు ఆర్థికపరమైన నష్టాలు కలిగించే చర్యలు తీసుకోవటం ఆరంభించింది. ఒకవేళ జపాన్ సైనిక చర్యలకు పాల్పడినట్లయితే ఆ దేశాన్ని ధ్వంసం చేయగల సైనిక శక్తి తమకున్నదని చైనా సైన్యం వరుస హెచ్చరికలు జారీ చేస్తున్నది. ఈ ఆకస్మిక పరిణామాలు జపాన్లోనే గాక, ప్రపంచమంతటా పెద్ద కలకలం సృష్టించాయి. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో జపాన్ ప్రధాని ఇటువంటి ప్రకటనలు చేయటం పట్ల ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అమెరికా మద్దతు లేనిదే, మద్దతు ఉందన్న ధైర్యం లేనిదే, జపాన్ వంటి దేశం చైనా వంటి దేశంపై ఇటువంటి వైఖరి తీసుకోజాలదని వేరే చెప్పనక్కర లేదు. రెండు దేశాల మధ్య యుద్ధం జరగకపోవచ్చుగాక, కాని లోగడ చైనాను, తైవాన్ను కూడా ఆక్రమించిన చరిత్ర గల జపాన్ తిరిగి ఈ విధంగా వ్యవహరించటం ప్రమాదకర సంకేతాలను పంపుతున్నది. టంకశాల అశోక్ దూరదృష్టి
చాలా మంది మేధావులు, విద్యావేత్తలు సమాజాన్ని మార్చాలనుకుంటారు. అందుకోసం ఎన్నో అన్వేషణలు, విశ్లేషణలు చేస్తుంటారు. అందుకు గల కారణాలను, పరిష్కారాలను సూచించాలని భావిస్తారు. అందుకోసం సత్యాన్వేషణ చేస్తారు. కాని కొందరు మాత్రమే ఆ సత్యానికి సమీపంలోకి వస్తారు. ఆ సమాజం దశ దిశను మార్చడానికి ఒక తాత్వికతను అందిస్తారు. అటువంటి వాళ్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు. భారతదేశ సామాజిక నేపథ్యానికి సరిపోయే సిద్ధాంతాన్ని, ఆచరణను, చట్టపరమైన శక్తిని అందించారు. భారత దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకు బాబా సాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఎందుకు సరియైన సమాధానాన్ని అందించారు? ఇది అందరికీ రావాల్సిన ప్రశ్న. దానికి బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం, అనుభవాలు ప్రేరణ. కుటుంబం, ఉపాధ్యాయుల రోజువారీ దిన చర్యలు, అందించిన చైతన్యం దానికి ఒక ఉత్ప్రేరకం. అంతేకాకుండా ఆయన అమెరికాలో అభ్యసించిన చదువు ఆయనను ఒక తాత్వికుడుగా మలిచాయి. ఆ తాత్వికత దాదాపు నలభై సంవత్సరాల రాజకీయ, సామాజిక జీవితంలో ఎన్నో సవాళ్లను, సంకటాలను అధిగమించి రెండు వేల సంవత్సరాల కుల వ్యవస్థ విషపు కోరలను పీకగలిగే సమరశక్తిని అందించాయి. బాల్యంలో, విద్యార్థి దశలో ఆయన అనుభవించిన కుల వివక్ష, అమానుషమైన అంటరానితనం ఒక అనుభవాన్ని అందించింది. కుల వివక్ష, అంటరానితనం, పుట్టుపూర్వోత్తరాలను శోధించే ఆలోచనను కలిగించాయి. దానికి కుటుంబంలో నిత్యం బోధించే కబీర్ తత్వాలు ఒక పునాదిగా ఏర్పరిచాయి. అనుభవం, ఆలోచనల నుంచి కులం గురించి అధ్యయనం చేయాలనే కాంక్షను రగిలించాయి. దానికి అమెరికా చదువు ఉపయోగపడింది. అందులో ముఖ్యంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గురువు ప్రముఖ విద్యావేత్త, జాన్ డ్యూయి ప్రతిపాదించిన ప్రజాస్వామ్య తత్వశాస్త్రం సిద్ధాంత బలాన్ని కలిగించింది. ఆ తర్వాత బాబా సాహెబ్ అంబేద్కర్ భారత దేశానికి తిరిగి వచ్చి ఆచరణ రూపకమైన కార్యాచరణను రూపొందించుకున్నారు. అది భారత దేశ రూపురేఖలను మార్చివేసింది. భారతదేశ సమాజం ఆనాడు కులవివక్ష, అంటరానితనం చాలా దుర్మార్గంగా సమాజాన్ని పట్టిపీడిస్తున్నది. అందుకే ఆయన మొదట సామాజిక అన్వేషణ కులం పుట్టుకపైన సాగించారు. 1916లోనే కులం పుట్టుక పైన ఒక సిద్ధాంత వ్యాసాన్ని పరిశోధన పత్రంగా సమర్పించారు. అందులో కులం పుట్టుకకు ప్రధానమైన కారణం సమాజంలో చదువు, జ్ఞానం కలిగిన ఒక వర్గం తమ స్వార్థం, ఆధిపత్యం కోసం తమను తాము వేరుపరుచుకొని, తామే ఉన్నతులమని ప్రకటించుకోవడం వల్ల కులానికి బీజాలు పడ్డాయని, అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ఆ వర్గమే పూజారి వర్గం, ఆ తర్వాత బ్రాహ్మణులుగా తమకు తాము గిరి గీసుకొని తమ చుట్టూ కంచే వేసుకున్నారని, ఇది మిగతా తెగలకు ఒక నమూనాగా మారిందని కూడా అంబేద్కర్ తేల్చి చెప్పారు. అయితే కుల వ్యవస్థ హిందూ మతం బోధనలు, మత గ్రంథాల మీద ఆధారపడి ఉన్నదని, అంటరానితనం కూడా అందులో భాగమేనని అంబేద్కర్ వివరించారు. ఈ పరిశోధన అనంతరం మరొక ఇరవై సంవత్సరాల తర్వాత కుల నిర్మూలన జరగకుండా భారత సమాజంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే భావనలకు స్థానం లేదని కూడా అంబేద్కర్ స్పష్టం చేశారు. కుల నిర్మూలన అంబేద్కర్ ప్రాథమిక లక్షం. అయితే అందరి లాగా కుల సమస్య కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదని, ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైన సమస్యల కలయికగా చూడాలని కూడా అంబేద్కర్ ప్రకటించారు. అంబేద్కర్ 40 సంవత్సరాల రాజకీయ, అధ్యయన, పోరాట జీవితంలో ఈ విషయం మీదనే అధ్యయనం, ఆచరణ సాగించారు. కులంలో ఆర్థిక దోపిడీ, సామాజిక అణచివేత, రాజకీయ ఆధిపత్యం కలగలిపి ఉన్నాయి. కులం పుట్టుకకు కారణమైన బ్రాహ్మణ వర్గం ఈ మూడు అంశాలను తమ గుప్పిట్లో పెట్టుకొని చాతుర్వర్ణంలోని క్షత్రియ, వైశ్య వర్ణాలను తనతో భాగస్వామ్యం కల్పించింది. అందువల్ల కులాధిపత్యంలో ఒకరికి ముగ్గురు తోడయ్యారు. అందువల్ల కుల సమస్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలుగా విస్తరించింది. అందువల్ల బాబా సాహెబ్ అంబేద్కర్ మూడు సమస్యలకు మూడు పరిష్కారాలను చెప్పారు. మొదటిగా సామాజిక సమస్యలైన విద్య, ఉపాధి, ఉద్యోగాలకు అంటరాని కులాలకు, ఇతర వెనుకబడిన కులాలకు, ఆదివాసులకు ప్రత్యేక ఏర్పాట్లు జరగాలని, దానికి ఆయా రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించారు. దీని వల్ల ఇప్పటి వరకు విద్య, విజ్ఞాన రంగాల్లో వేళ్లూనుకునిపోయిన వర్గాలతో సమానంగా ఎదగడానికి ఉపయోగపడుతుందని భావించారు. అదే విధంగా రాజకీయంగా ప్రాతినిధ్యం వహించడానికి ఆధిపత్య కులాలతోపాటు ప్రభుత్వ విధి విధానాలలో పాల్గొనడానికి, విధిగా అణగారిన వర్గాలకు ఓటు హక్కుతో పాటు రాజకీయ పదవులను అందుకోవడానికి రాజకీయ రిజర్వేషన్లు డిమాండ్ చేశారు. వీటితోపాటు ఆర్థికంగా, స్వశక్తిగా ఎదగడానికి ఆర్థిక సహాయంతోపాటు, దేశంలోని భూమిని, పరిశ్రమలను, ఆర్థిక సంస్థలైన బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను జాతీయం చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ అంశాలు మాత్రం రాజ్యాంగంలోకి రాకుండా ఆనాటి జాతీయ నాయకులంతా అడ్డుకున్నారు. కుల వివక్ష, అంటరానితనం తొలగించడానికి కొన్ని రక్షణ చట్టాలను ప్రతిపాదించారు. ఇవన్నీ రాజ్యాంగంలోకి వచ్చాయి. బాబా సాహెబ్ అంబేద్కర్ తన అధ్యయనంతో కూడిన ప్రతిపాదనలన్నింటిని సాధించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అందులో కొన్నింటిని రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయత్నించి సఫలీకృతమయ్యారు. మరి కొన్ని విషయాలను ఆయన రాజ్యాంగంలోకి తీసుకు రాలేకపోయారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ లక్షం కులరహిత సమాజం. దానికి పైన పేర్కొన్న చర్యలు సాధనాలు మాత్రమే. రాజ్యాంగ రచన కూడా అందులో భాగమే. కేవలం రాజ్యాంగం మాత్రమే అంబేద్కర్ లక్షం కాదు. బాబా సాహెబ్ అంబేద్కర్ లక్షం కుల నిర్మూలన అనే విషయాన్ని మనం ఇప్పటికే చెప్పుకున్నాం. పైన పేర్కొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులతో పాటు కులానికి మూల కారణమైన హిందూమతం తనను తాను సంస్కరించుకోవాలని ప్రతిపాదించారు. కులం, అంటరానితనం మనుగడకు హిందూ ధర్మశాస్త్రాలే కారణమని ఆయన బలమైన విశ్వాసం. ధర్మ శాస్త్రాలన్నింటా కులం, బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం ఇమిడి ఉన్నాయని, వాటిని తిరగరాయాలని, వివక్ష, అణచివేత, వెలివేత లాంటి అంశాలను ప్రతిపాదించే విషయాలను అందులో నుంచి తొలగించి ఒక ప్రత్యేకమైన గ్రంథం రూపొందించాలని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాకుండా హిందూమతంలో పూజారి వ్యవస్థను సంస్కరించాలని హిందువులలో అందరికీ పూజారి అయ్యే అవకాశం ఉండాలని, దానికి ప్రభుత్వం ఒక బోర్డును స్థాపించి, ఎవరైతే హిందూమతం విధానాలకు అర్హులవుతారో వారిని ప్రభుత్వమే నియమించాలని కూడా తన కుల నిర్మూలన పుస్తకంలో పేర్కొన్నారు. ఇటువంటి విధానాలు మాత్రమే కులాన్ని నిర్మూలిస్తాయని పేర్కొన్నారు. అందువల్లనే బాబా సాహెబ్ అంబేద్కర్ సంస్కర్తగా కాకుండా విప్లవకారుడుగా నిలిచారు. కుల వివక్షపైన మహాత్మాగాంధీతో పాటు ఎంతో మంది వ్యాఖ్యానాలు చేశారు. కాని ఎవ్వరూ ఇటువంటి విప్లవాత్మకమైన పరిష్కారాన్ని చూపలేకపోయారు. బాబా సాహెబ్ అంబేద్కర్ తాత్కాలిక ఉపశమనాలతో పాటు సంపూర్ణంగా మార్చివేయగలిగే విప్లవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందువల్ల బాబా సాహెబ్ అంబేద్కర్ చాలా మంది సంస్కర్తలకు భిన్నంగా భారతదేశ దశ దిశ నిర్దేశకుడుగా, సామాజిక విప్లవకారుడుగా చరిత్రలో నిలిచిపోయారు. చరిత్రలో ఒకడిగా కాకుండా తానే ఒక చరిత్రగా నిలిచిపోయాడు. మల్లేపల్లి లక్ష్మయ్య దర్పణం
మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ హిందూ దేవతలను అవమానించారని బిజెపి, దాని అనుబంధ భావజాలం కలిగిన కొందరు నానారభస చేస్తున్నారు. ఈ మధ్య హిందూమతం మీద కానీ, దేవీదేవతల మీద కానీ ఎవరేం మాట్లాడినా వీళ్లు వెంటపడుతున్నారు. ఆ మాట్లాడిన దానితో సంబం ధం లేకుండానే వీళ్ల మనోభావాలు దెబ్బతినడం మనదేశంలో మాత్రమే కనిపించే ఎనిమిదవ వింత. మనోభావాలు అంటే ఏమిటో, అవి ఎలా ఉంటాయో వీళ్ళయినా పాపం ప్రజలకు ఏనాడూ చెప్పిన పాపాన పోలేదు. ప్రజలకెవరికీ లేని, రాని మనోభావాల గొడవ సదరు గుంపు వారికే కలగటం వారికి రాజకీయంగా సంక్రమించిన హక్కు కావొచ్చు. ముఖ్యమంత్రి మాటల దగ్గరకి వస్తే -ఆయన హిందూమతం లోని బహు దేవతారాధనను ప్రస్తావించారు. ఎవరికినచ్చిన దేవుణ్ణి వారు మొక్కుతారు అన్నట్టు మాట్లాడారు. ఎవరి మనస్తత్వానికి దగ్గరగా వుండే దేవుడిని వారు మొక్కుతారని అన్నారు. ఇదంతా ఆయన కేవలం దైవసంబంధమైన చర్చలో భాగంగా మాట్లాడింది కాదు. ఆనాటి సభలో కాంగ్రెస్ పార్టీలో గల స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ, పార్టీలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారని చెప్పి, దానికి సమర్థనగా మాత్రమే ఈ ప్రస్తావన తెచ్చారు. ఆయన ఉద్దేశంలో తప్పు లేదు. ఆయన మాటల్లో కూడా తప్పులేదు. దేవతలను కించపరచటం అన్న సమస్యే అందులో లేదు. కానీ ఈ రభస చేస్తున్న వాళ్లకు మాత్రం అందులో తప్పు కనిపించింది. ఇదే గమ్మత్తు. మొన్న నాకు దేవుని మీద నమ్మకం లేదన్న పాపానికి దర్శకుడు రాజమౌళిని ఇలాగే ఇబ్బందిపెట్టారు. ముఖ్యమంత్రి దేవుళ్లను విశ్వసించని వ్యక్తి కూడా కాదు. ఆయన కూడా హిందువే కదా! ఫలానా పార్టీలో ఉన్న హిందువులు మాత్రమే నిజమైన హిందువులుగా, మిగిలిన వారు కానట్టుగా, వాళ్లకు మతం మీద కానీ, దేవుళ్ళ మీద కానీ మాట్లాడే హక్కు లేదన్నట్టుగా ఉంది వీళ్ల ప్రవర్తన. ఆలయాల్లోకి తోటి హిందువులైన దళితులను అనుమతించకుండా అవమానిస్తుంటే దాని మీద స్పందించకుండా మౌనవ్రతాన్ని పాటించే ఈ అపర భక్తశిఖామణులు ఇట్లాంటి అనవసర రాద్ధాంతాలు దేవుళ్ల పేరుతో చేయటంలోని ఆంతర్యం ఏమిటో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వీళ్లకు మతం మీద రాజకీయాలు చేయటం తప్ప ప్రజల కష్టనష్టాలు పట్టవు. సదరు వ్యక్తులు తమ రాజకీయ జీవితంలో ప్రజలకోసం కనీసం ఒక్క శాతమైనా సమయాన్ని కేటాయించారో లేదో తెలియదు. కానీ తొంభై తొమ్మిది శాతం మాత్రం ఈ మత రాజకీయాలకే కేటాయిస్తారు. అయితే హిందూమతం మీద గుత్తాధిపత్యం ఉన్నట్లుగా మాట్లాడే వీళ్లకు ఆ మతం తాలూకు చరిత్ర, దాని లోతులు గానీ తెలియవు. తెలిసే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల కోసం వాడుకోవడం తప్ప మతాన్ని అధ్యయనం చేసి దాని సారాన్ని ప్రజలకు తెలియజేయాలనే సంకల్పం ఉన్నవాళ్లు కాదు. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామంచంద్రా’ అని ఆవేదనతో భక్త రామదాసు పలికిన మాటల్లో భక్తి లేదా? నిష్కల్మషమైన భక్తితో తిన్నడు శివునికి మాంసం నైవేద్యంగా సమర్పించటాన్ని ఎవరైనా దోషంగా చూడగలరా? ఇట్లాంటి ఉదంతాలు హిందూమతంలో కుప్పలుగా దొరుకుతాయి. భక్తికి సంబంధించి ప్రాచీన కాలం నుంచి ఎవరి మార్గం వారికుంది. భాగవతంలో ప్రస్తావనకు వచ్చిన నవవిధ భక్తిమార్గాలకు తోడుగా అనేక మార్గాలు దేవుడనే భావనచుట్టూ రూపొందాయి. దేవుడికి, భక్తునికి మధ్య ఇలాంటివాళ్ల జోక్యం ఎందుకో మరి? మొన్నటికి మొన్న గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారక్కల్ని అవమానిస్తూ వాళ్ళసలు దేవుల్లే కాదన్నాడు చినజీయర్ స్వామి. ఇప్పుడు నానాయాగి చేస్తున్న ఈ గుంపులోని వారు ఒక్కరూ నోరెత్తలేదు. షిరిడి సాయిబాబా మీద ఒక వర్గం వారు కించపరుస్తూ మాట్లాడినప్పుడు వీళ్ల మనోభావాలు దెబ్బతినలదు. కోట్లాది హిందువులు అటు సమ్మక్క సారక్కలను, ఇటు సాయిని కొలుస్తున్న సంగతి వీళ్లకు తెలియదా? మతం మీద శ్రద్ధ వల్లనో, దేవుని పట్ల భక్తి చేతనో వీళ్ళు రోడ్లెక్కటం లేదు. కేవలం రాజకీయాలలో భాగంగానే మతాన్ని, దేవుళ్లను పావులుగా వాడుకుంటున్నారు. మతానికి మేమే రక్షకులం అన్నట్టు వీళ్లకు వీళ్ళే కితాబిచ్చుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో మతం కానీ, దేవుళ్ళు కానీ వారి స్వంత ఆస్తి. అందుకే దేవతల ప్రస్తావన ఎవరు తెచ్చినా అందులో ఉన్న సమాచారంతో సంబంధం లేకుండా వారి మీద అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి సాధారణ ప్రజల మద్దతు ఉన్నదనే భ్రమల్లో వాళ్ళున్నారు. పాపం వాళ్ళది భ్రమ అన్న సంగతి వాళ్లకు ఎప్పుడర్థమవుతుందో? తోకల రాజేశం 96767 61415
అమ్రాబాద్లో కనువిందు చేసిన పెద్దపులి #Wildlife #Amrabad #TigerReserve #NagarKurnool #Telangana
స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత.. అతడిని దాటేశాడు..
బ్రిస్బేన్: ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తన కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించాడు. ఈ తరంలో ఉత్తమ టెస్ట్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ ఒకడని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం జరుగుతున్న యాసెస్ సిరీస్లో స్మిత్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు మార్నస్ లబుషేన్ పేరిట ఉండేది. అయితే యాషెస్ రెండో టెస్ట్ మ్యాచ్లో అర్థ శతకం సాధించిన స్మిత్ ఈ క్రమంలో లబుషేన్ని దాటేశాడు. ప్రస్తుతం లబూషేన్ ఖాతాలో 4350 పరుగులు ఉండగా.. స్టీవ్ ఖాతాలో 4358 పరుగులు ఉన్నాయి. మొత్తంగా డబ్ల్యూటిసి అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ పేరిట ఉంది. రూట్ డబ్ల్యూటిసిలో 6226 పరుగులు చేశాడు. రూట్ తర్వాతి స్థానంలో స్టీవ్ స్మిత్ ఉండగా.. అతడికి, రూట్కి మధ్య దాదాపు 2వేల పరుగుల వ్యత్యాసం ఉంది. ఇక యాషెస్ రెండో టెస్ట్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 334 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటింగ్లో జో రూట్ (138) సెంచరీ సాధించగా,, క్రాలీ (76), ఆర్చర్ (38) పరుగులు చేశారు. అనంతరం ఆస్ట్రేలియా వికెట్లు కాపాడుకుంటూ స్కోర్ చేస్తూ వచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసి 44 పరుగులు ఆధిక్యంలో ఉంది. క్రీజ్లో అలెక్స్ క్యారీ (46), నీసర్(15)ఉన్నారు.
Telangana : నేడు రేవంత్ శంకుస్థాపనలు చేసే కార్యక్రమాలివే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి మధ్యాహ్నం దేవరకొండ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
TDP | నేత వెంకట్రామయ్య మృతి TDP, మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి
క్రిస్మస్ వేడుకల్లోకి దూసుకెళ్లిన కారు: పది మంది మృతి
పారిస్: ఫ్రాన్స్ దేశంలో ఓవర్సీస్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గ్వాడెలోప్లోని సెయింట్ ఆన్లో క్రిస్మస్ వేడుకలు జరగుతుండగా వారిపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కారు డ్రైవర్ అనారోగ్య సమస్యలు తలెత్తడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదం జరిగిన తరువాత డ్రైవర్ అక్కడే ఉన్నాడు. ఫ్రాన్స్ పౌరులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Akahnda 2 : అఖండ 2 మూవీ విడుదల ఇప్పట్లో లేదటగా?
అఖండ 2 మూవీ ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
Sarpanch Elections |అభివృద్దికి పట్టం కట్టండి..
Sarpanch Elections | అభివృద్దికి పట్టం కట్టండి.. Sarpanch Elections, షాద్ నగర్,
Sankranthi 2026 Release Dates Updated
The Sankranthi 2026 release chart of Telugu films is almost finalized and there is a mad rush. Chiranjeevi, Prabhas, Ravi Teja, Sharwanand and Naveen Polishetty will test their luck with their respective films along with dubbed films of Vijay and Sivakarthikeyan. The release dates of all these films got finalized and the release plans for […] The post Sankranthi 2026 Release Dates Updated appeared first on Telugu360 .
Ayyappa |స్వామి దర్శనానికి వెళితే..
Ayyappa | స్వామి దర్శనానికి వెళితే.. దత్తిరాజేరు (విజయనగరం), ఆంధ్రప్రభ : తమిళనాడు
సుప్రీంకోర్టుకు ఇండిగో సంక్షోభం
దేశ వ్యాప్తంగా తలెత్తిన ఇండిగో విమాన సంస్థ సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది.
BJP | ఎవరీ.. బెనారస్ బాబు.. BJP, ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల
India vs South Africa : నేడు భారత్ - దక్షిణాఫ్రికా మూడో వన్డే.. విశాఖ స్టేడియం ఎవరికి అనుకూలం?
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేడు వన్డే సిరీస్ ను డిసైడ్ చేసే మ్యాచ్ జరగనుంది
Hyderabad : హైదరాబాద్ లో పోలీసులు ఆపరేషన్ కవచ్
హైదరాబాద్ లో ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో పోలీసులు భారీ స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహించారు
Ambedkar |మహానీయుడు స్ఫూర్తితో..
Ambedkar | మహానీయుడు స్ఫూర్తితో.. Ambedkar, గుడివాడ, ఆంధ్రప్రభ : భారతరత్న డాక్టర్
రైల్వే పట్టాలపై ఆగిన కారు.. నిలిచిన రైళ్లు. #Railway #Peddapalli #Koonaram #Accident #Safety
చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ’నారి నారి నడుమ మురారి’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. నారి నారి నడుమ మురారి 2026లో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.
India : విమాన ప్రయాణికులకు భారీ ఊరట
విమాన షెడ్యూళ్లలో అంతరాయం కొనసాగుతుండడంతో పౌర విమానయాన శాఖ శుక్రవారం తక్షణ చర్యలు చేపట్టింది.
Netflix Proposes Christmas Date for Akhanda 2: What’s Next?
Akhanda 2 which was aimed for December 5th is now postponed. The makers are now busy resolving the ongoing financial hurdles and they made it clear that the film will not release this weekend. The next best available date is December 25th. Digital giant Netflix has acquired the digital rights of the film and they […] The post Netflix Proposes Christmas Date for Akhanda 2: What’s Next? appeared first on Telugu360 .
పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం లాంటి ’సైక్ సిద్ధార్థ’
యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ’సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సహకారంతో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలిం గ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా నుంచి ధుమ్ ఠకుమ్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ “నందు, వరుణ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. రాఘవేంద్రరావుతో పాటు చాలా మందికి ఈ సినిమా చూపించాము. అందరు కూడా చాలా ప్రశంసించారు. పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం తర్వాత అంత స్పెషల్ ఎఫర్ట్ పెట్టి సినిమా ఇదనిపించింది”అని అన్నారు. హీరో శ్రీనందు మాట్లాడుతూ “సురేష్ బాబు ఎంతోమందిని హీరోలుగా చేశారు. ఆయన ఈ సినిమా కొన్న రోజు నా ఆనందానికి హద్దులు లేవు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ యామిని భాస్కర్, మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.
Rain Alert : నేడు కూడా వానలు..అలెర్ట్ గా ఉండాల్సిందే
దిత్వా తుపాను ప్రభావంతో నేడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది
Venkatalachimi |పోస్టర్ తో షాక్ ఇచ్చిన పాయల్..
Venkatalachimi | పోస్టర్ తో షాక్ ఇచ్చిన పాయల్.. Venkatalachimi, ఆంధ్ర్రప్రభ వెబ్
Gold Price Today : బంగారం కొనుగోలు చేయడం భవిష్యత్ లో కష్టమేనట
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తన నటనతో సకుటుంబ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. ఆమె నటిగా ఎంత ప్రతిభావంతురాలో, పవర్ లిఫ్టింగ్ లోనూ అంతకంటే ఎక్కువ టాలెంటెడ్. జిల్లా, ప్రాంతీయ, సౌతిండియాతో పాటు జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ ఆమె గెల్చుకోవడం విశేషం. ఈ ఏడాది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న ప్రగతి, కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారు పతకం గెల్చుకుంది. ఇక శనివారం టర్కీలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో ప్రగతి పాల్గొంటున్నారు.
From Subway Commute to Chanel Spotlight – The Rise of Bhavitha Mandava
Hyderabad-born Bhavitha Mandava makes history by opening Chanel Mtiers d’Art 2026 show in NYC Bhavitha Mandava — a 25-year-old originally from Hyderabad — has captured global attention after she opened Chanel’s Mtiers d’Art 2026 collection show in New York City, marking one of the most inspiring success stories this fashion season From Architecture Student to […] The post From Subway Commute to Chanel Spotlight – The Rise of Bhavitha Mandava appeared first on Telugu360 .
అమరావతి: ఓ వ్యక్తి ఖర్జూరం తింటుండగా గొంతులో ఇరుక్కోవడంతో అతడు దుర్మరణం చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తోటగేరిలో గంగాదర్(42) అనే వ్యక్తి భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఖర్జూరాలు తింటుండగా ఒకటి గొంతులో ఇరుక్కోవడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తోటగేరిలో విషాదచాయలు అలుముకున్నాయి.
Revanth Reddy : నేడు నల్లగొండ జిల్లాకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.
Gram Panchayat |ఒక్క ఛాన్స్ ఇస్తే..
Gram Panchayat | ఒక్క ఛాన్స్ ఇస్తే.. Gram Panchayat, రామన్నపేట, ఆంధ్రప్రభ
Chandrababu : నేడు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు
నేడు చంద్రబాబు మంగళగిరిలోని పార్టీకేంద్ర కార్యాలయానికి రానున్నారు
Tirumala : తిరుమలకు వెళ్లే వారికి నేడు అలెర్ట్.. వేచి ఉండాల్సిన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
మోత్కూర్ మండలంలో సర్పంచ్ 90, వార్డు సభ్యులకు 349 నామినేషన్ లు
మోత్కూరు మండలంలో వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్ నామినేషన్ల వివరాలు: అనాజిపురం-13 దాచారం-6 దత్తప్పగూడెం-18 ముశిపట్ల-5 పాలడుగు-11 పాటిమట్ల-7 పనకబండ-7 పొడిచేడు-10 రాగిబావి-6 సదర్శాపురం-7 మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మండలం 10 గ్రామ పంచాయతీలలో 10 సర్పంచ్ స్థానాలకు 90 నామినేషన్లు, 88 వార్డులకు 349 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామాలలో వార్డుల వారిగా నామినేషన్ దాఖల వివరాలు ఇలా ఉన్నాయి. 10 గ్రామ పంచాయితీ లోని 88 వార్డులకు 349 మంది అభ్యర్థులు నామినేషన్ లు వేశారని అధికారులు తెలిపారు. అనాజీపురం లో 8 వార్డులకు 24,దాచారం లో 10 వార్డులకు 22, దత్తప్పగూడెం లో 10 వార్డులకు 41,ముషిపట్ల లో8 వార్డులకు 19, పాలడుగు లో10 వార్డులకు 38, పాటిమట్ల లో8 వార్డులకు 22, పనకబండ లో 8 వార్డులకు 23,పొడిచేడు లో 10 వార్డులకు 35, రాగిబావి లో8 వార్డులకు 18, సదర్శాపురం లో 8 వార్డులకు 17 మంది అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేశారు.
Road Accident : తమిళనాడులో ఐదుగురు ఏపీకి చెందిన భక్తులు మృతి
తమిళనాడులోని రామనాధపురంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీకి చెందిన వారు మరణించారు.
Mega star |చిరు, వెంకీ మూవీ ఇంట్రెస్టింగ్ న్యూస్..
Mega star | చిరు, వెంకీ మూవీ ఇంట్రెస్టింగ్ న్యూస్.. Mega star,
కాలువలో పడిన బైక్... భార్య మృతి, కుమారుడు గల్లంతు... భర్తే హత్య చేశాడా?
అమరావతి: దంపతులు బైక్పై వెళ్తుండగా బొలెరో వాహనం అడ్డురావడంతో భార్య, కుమారుడు కాలువలో పడిపోయారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా కుమారుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావు పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రొంపిచర్ల మండలం కొత్తపాలెం గ్రామంలో శ్రీకాంత్(30), త్రివేణి(25) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఏడు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. బాలుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కుమారుడిని ఆస్పత్రికి బైక్పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఓ కాలువ వద్ద బొలెరో వాహనం అడ్డురావడంతో ద్విచక్రవాహనం కాలువలో పడిపోయింది. శరత్, త్రివేణి, బాలుడు కాలువలో పడ్డారు. భార్య, కుమారుడు గల్లంతు కావడంతో వెంటనే శరత స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. భార్య మృతదేహం కనిపించగా బాలుడి ఆచూకీ కనిపించలేదు. భార్య, కుమారుడిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య శరీరంపై గాయాలు ఉన్నాయని బంధువుల ఆరోపణలు చేస్తున్నారు.
విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలం రామన్నపాలెం లో శుక్రవారం నాడు ఆమెన్ ట్రస్ట్ ఏలూరు శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు ఆమెన్ ట్రస్ట్ మేనేజర్ అశోక్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్ మాట్లాడుతూ పౌష్టిక ఆహారం కూరగాయలు తీసుకోవడం ద్వారా కంటి సమస్యలు రాకుండా ఉంటాయని అన్నారు ఆనంద్ మాట్లాడుతూ సెల్ ఫోన్లు ఎక్కువగా […] The post ఉచిత కంటి వైద్య శిబిరం appeared first on Visalaandhra .
Indigo : నేడు కూడా విమానాలు ఎగరవట
ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు
ఇరు జట్లకు కీలకం నేడు విశాఖలో భారత్, సఫారీ చివరి వన్డే విశాఖపట్నం: సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో, చివరి వన్డేకు సాగర తీర నగరం విశాఖపట్నం సిద్ధమైంది. భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం విశాఖ వేదికగా ఆఖరి వన్డే జరుగనుంది. ఇందులో గెలిచే టీమ్కు సిరీస్ దక్కుతుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. తొలి వన్డేలో భారత్, రెండో పోరులో సఫారీ టీమ్ జయభేరి మోగించాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారికే సిరీస్ దక్కుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఇరు జట్లు పరుగుల వరద పారించాయి. విశాఖలో కూడా భారీ స్కోర్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. రాయ్పూర్లో భారత్ భారీ స్కోరు సాధించినా లక్ష్యాన్ని కాపాడుకోలేక పోయింది. మొదటి వన్డేలో కూడా 349 పరుగులు చేసినా అతి కష్టం మీద విజయం సాధించింది. ఇరు జట్లకు బౌలింగ్ సమస్య వెంటాడుతోంది. అయితే బ్యాటర్లు జోరుమీదుందడం కలిస వచ్చే అంశంగా చెప్పాలి. దూకుడుమీదున్న విరాట్ ఓపెనర్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లిలు ఫామ్లో ఉండడం భారత్కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. వీరికి తోడు కిందటి వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ కళ్లు చెదిరే శతకంతో అలరించాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా నిలకడైన బ్యాటింగ్తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈసారి భారీ స్కోరు సాధించాలనే లక్షంతో ఉన్నాడు. రోహిత్తో కలిసి జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించాలని భావిస్తున్నాడు. ఇద్దరు శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే కోహ్లి, రుతురాజ్లు ధాటిగా ఆడేందుకు వీలుంటుంది. వరుసగా రెండు మ్యాచుల్లో శతకాలతో చెలరేగిన కోహ్లి ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. కోహ్లి విజృంభిస్తే భారత్కు మరోసారి భారీ స్కోరు ఖాయం. రుతురాజ్, రాహుల్లు కూడా తమ బ్యాట్లకు పనిచెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ను బరిలోకి దించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. జోరుమీదున్న సఫారీ ఇక సౌతాఫ్రికా కూడా జోరుమీదుంది. మార్క్రమ్ కిందటి మ్యాచ్లో మెరుపు శతకం సాధించాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే క్వింటన్ డికాక్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. కానీ కెప్టెన్ బవుమా, మాథ్యూ బ్రిట్జ్కి, డెవాల్డ్ బ్రెవిస్ ఫామ్లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. అంతేగాక జాన్సన్, బోస్చ్, మహారాజ్ వంటి ఆల్రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికా ఈ మ్యాచ్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇదిలావుంటే ఇరు జట్లను బౌలింగ్ సమస్య వెంటాడుతోంది. తొలి రెండు వన్డేల్లో బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో రెండు జట్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాయి. విశాఖ మ్యాచ్లోనైనా బౌలర్లు మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Bigg Boss Telugu 9: Kalyan wins Ticket to Finale amidst Controversies & Collusion
As the Ticket to Finale race intensified, today ‘s episode delivered drama, disputes and decisive victories. What began as a routine continuation of tasks quickly escalated into one of the most contentious episodes of the season, ultimately producing the first confirmed finalist. A Completed Task Reopens: Tanuja Questions Ritu’s Win The episode resumed at the […] The post Bigg Boss Telugu 9: Kalyan wins Ticket to Finale amidst Controversies & Collusion appeared first on Telugu360 .
Panchayat Elections |ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా..
Panchayat Elections | ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా.. Panchayat Elections,
Nara Lokesh : నేటి నుంచి నారా లోకేశ్ విదేశీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు
Modi, Putin |ఒత్తిళ్లకు అతీతం.. మన బంధం..
Modi, Putin | ఒత్తిళ్లకు అతీతం.. మన బంధం.. Modi, న్యూఢిల్లీ ఆంధ్రప్రభ
Visakha : నేడు విశాఖలో భారత్ - దక్షిణాఫ్రికా మూడో వన్డే
నేడు విశాఖపట్నంలో భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది
Akhanda 2 |న్యూ రిలీజ్ డేట్ అప్ డేట్..
Akhanda 2 | న్యూ రిలీజ్ డేట్ అప్ డేట్.. Akhanda 2,
గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ కావాలి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మీర్ఖాన్పేటలో డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తూ లేఖ రాశారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగా ణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక భూమి క పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశా రు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీ ణ వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ మూడంచెల వ్యూహం తో తెలంగాణ ముందుకు సాగుతోందని సోనియా గాంధీ ఈ లేఖలో ప్రస్తావించా రు. తెలంగాణలోని మానవ వనరులు, సహజ వనరులు, ప్రజల వ్యాపార నైపు ణ్యం, అంతర్జాతీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి సమ్మిట్ మరింత తోడ్పడుతుందని ఆమె తెలిపారు. సమ్మిట్లో పాల్గొనేవారందరికీ సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలిపారు.
Nari Nari Naduma Murari |సంక్రాంతి బరిలో శర్వా..
Nari Nari Naduma Murari | సంక్రాంతి బరిలో శర్వా.. Nari Nari
మన తెలంగాణ/హైదరాబాద్: లక్ష కోట్లు లక్షం గా రాష్ట్రం ప్రభుత్వం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఫ్యూచర్ సిటీ లో ఏ రంగంలోనైనా సరే పెట్టుబడులు పెట్టేలా పె ట్టుబడిదారులను తెలంగాణ ప్రభుత్వం ఆకర్షిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మక కార్యాచరణను అమలు చేస్తోంది. దాదాపు 3 నెలల పాటు కసర త్తు చేసిన రూపొందించిన ఫ్యూచర్ సిటీ 4.0 ఫా ర్ములాను ప్రపంచం ముందు ఆవిష్కరించనుంది. డిసెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగా ణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047కు అనేక మంది ప్రముఖులు తరలి రానున్నారు. అనేక పరిశ్రమల అధినేతలతో పాటు ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లను తెలంగాణ ప్రభుత్వం ఒకే వేదికపైకి తీసుకురానుంది. సదస్సుకు 4,800 మందికి ఆహ్వానాలు పంపింది. చాలా మంది ప్రముఖులు సదస్సుకు వచ్చేందుకు అంగీకరించారు. 2 వేల మందికిపైగా అతిథులు వస్తారని సర్కారు అంచనా వేస్తోంది. కా గా ఫ్యూచర్ సిటీలో 70 ఎకరాల విస్తీర్ణంలో వరల్ ట్రేడ్ సెంటర్ నిర్మించే ఛాన్స్ ఉంది. ఈ సదస్సుకు గౌతమ్ అదానీ, అనంత్ అంబానీ, ఎరిక్ స్త్వ్రడర్ ఆనంద్ మహీంద్రా వంటి వారు కూడా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పె ట్టేందుకు పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. విద్య, నైపుణ్య,క్రీడా, పర్యాటక, పరిశ్రమ రంగాల్లో ప్రభుత్వంతో సుమారు 90కి పైగా పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 8, 9 న జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రూ.వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకునేందుకు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా పెట్టుబడుల ఆకర్షణను కీలక అంశంగా ప్రభుత్వం పరిగణిస్తోంది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించేలా ప్రణాళికలు రచిస్తోంది. స్థిరమైన విధానాలు, ప్రపంచస్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, వ్యాపార సౌలభ్యం, బలోపేతమైన ఆవిష్కరణ వ్యవస్థలు అన్నింటికి మించి మెరుగైన జీవన నాణ్యత ఈ ఐదు అంశాలు ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మార్చాయనే విషయాన్ని సదస్సులో సర్కార్ ప్రస్తావించనుంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులకు ఇప్పటికే 50 కంపెనీలు సంసిద్ధత తెలిపాయి. పలు సంస్థలతో ఒప్పందాలు ఫ్యూచర్ సిటీలో రూ.3 వేల కోట్లతో 3 హోటళ్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కన్వెన్షన్ను నిర్మించనున్న ఫుడ్ లింక్ ఎఫ్అండ్బీ హోల్డింగ్-ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. వంతారా రిలయన్స్ గ్రూప్తో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నైట్ సఫారీపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అజయ్ దేవగన్తో ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై ఒప్పందం, ఐఐఎఫ్ఏతో ఫిల్మ్ ఇన్ తెలంగాణ కార్యక్రమంలో భాగస్వామ్యం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ తో పర్యాటక శాఖ పీఎంయూ స్థాపన ఒప్పందం చేసుకోనున్నారు. బౌద్ధ పర్యాటక సర్క్యూట్ ప్రోత్సాహంపై ఏసియన్ రాయబారులతో, కొత్వాల్ గూడలో ఆర్టిఫిషియల్ బీచ్పై స్పెయిన్కు చెందిన పూయిడ్రాతో ఒప్పందం చేసుకోనున్నారు. రూ.850 కోట్లతో ఫ్యూచర్ సిటీలో అర్బన్ బీచ్తో కూడిన ఎంటర్టైన్మెంట్ హబ్ కోసం యూఎస్ఏకు చెందిన క్రిస్టల్ లగూన్స్ అండ్ గ్రీన్ పాంథర్స్ ప్రాపర్టీస్ లిమిటెడ్తో ఎంవోయూ కుదుర్చుకోనుంది. రూ.70 వేల కోట్లతో హైపర్ వాల్ట్ డేటా సెంటర్ల ఏర్పాటుపై టీసీఎస్-టీపీజీతో సర్కార్ ఒప్పందం చేసుకోనుంది. రూ.850 కోట్లతో ఏఐ కార్యక్రమాలు, డేటా సెంటర్లకు అక్విలోన్ నెక్సస్ లిమిటెడ్ అండ్ నార్త్స్టార్ ఆపర్చునిటీస్ ఫండ్తో అవగాహన కుదుర్చుకోనున్నారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ విస్తరణకు చందన్పల్లిలో భూమి కేటాయించనున్నారు. రూ.8 వేల కోట్లతో జహీరాబాద్లో హ్యుండాయ్ టెస్ట్ ట్రాక్, తయారీ ప్లాంట్తో పాటు రూ.400 కోట్లతో ప్లాంట్ల విస్తరణకు మహీంద్రా అండ్ మహీంద్రాతో ఒప్పందం చేసుకోనున్నారు. ఫాక్స్కాన్తో ఫిట్ పేజీ -2 విస్తరణ ఒప్పందం చేసుకోనున్నారు. రూ.1500 కోట్లతో ఎంఎస్ఎన్, రూ.200 కోట్లతో బయోలాజికల్-ఈ తో పరిశోధన అభివృద్ధి హబ్ల ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకోనుంది. లులు-హైపర్తో విమానాశ్రయానికి సమీపంలో లులు హైపర్ మాల్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. పెట్టుబడులకు ప్రముఖ కంపెనీల ఆసక్తి రూ.150 కోట్లతో హౌజింగ్ ఎక్విప్ తయారీ ప్లాంటుకు జపాన్కు చెందిన లిక్సిల్ గ్రూప్తో అవగాహన ఒప్పందాన్ని సర్కార్ కుదుర్చుకోనుంది. టీసీసీఐతో కొంగరకలాన్ సమీపంలోని తైవాన్ మినీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఎంవోయూ చేసుకోనున్నారు. సింగపూర్కు చెందిన సెంబ్కార్ప్తో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్కు, ట్రంప్ మీడియా అండ్ టెక్ గ్రూప్ బీ టెక్స్తో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఆల్ట్ మిన్తో ఎస్సీసీఎల్, కబిల్ భాగస్వామ్యంతో దేశంలోనే తొలి లిథియం రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. మొత్తం 250 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఫేజ్-1లో 50 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేలా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కానుంది. రూ.4 వేల కోట్లతో నేపియర్ గడ్డి ఆధారంగా చేసుకునే 25 సీబీజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అధిరాథ్ హోల్డింగ్స్తో ఒప్పందం చేసుకోనున్నారు. హార్ట్ ఫోర్డ్ ఇన్సూరెన్స్, జురిచ్ ఇన్సూరెన్స్, నెట్ఫ్లిక్స్, ఎల్-ఓరియల్ ఓఎస్ఎఫ్ డిజిటల్ జీసీసీల ఏర్పాటుకు అవగాహన కుదరనుంది. రూ.350 కోట్లతో సనౌఫీ జీసీసీ విస్తరణతో పాటు పంచ్ ఏఐ ఆధ్వర్యంలో ఏఐ టెక్ సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకోనున్నారు. టామ్కామ్తో కలిసి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జర్మనీకి చెందిన నెక్స్వేవ్ మొబిలిటీ, తైవాన్ నియామకాలు, అపోలో మెడ్స్కిల్స్తో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. హైదరాబాద్లో ఆఫ్షోర్ క్యాంపస్ ఏర్పాటు చేసేలా యూనివర్సిటీ ఆఫ్ లండన్తో ఒప్పందం జరగనుంది. దుబాయ్ జీఎంఆర్ స్పోర్ట్ వెంచర్స్తో ఫ్యూచర్ సిటీ శాటిలైట్ స్పోరట్స్ సిటీ అభివృద్ధికి అవగాహన కుదుర్చుకోనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫిఫా ఐఎఫ్తో మహిళల ఫుట్బాల్ అకాడమీ, పురుషుల ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ప్రధాన క్రీడా టోర్నమెంట్ల నిర్వహణపై సదస్సులో ప్రకటన చేయనున్నారు. సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ ఫండ్ను ఆవిష్కరించనున్నారు. దేశ తొలి సమగ్ర తారామండల్ ఆర్బిటల్ వాహన వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. బ్లూ ఎర్త్ క్లైమెట్ తో కలిపి నెట్ జీరో ప్రాజెక్ట్ పెట్టనున్నారు. స్టెప్తో స్కూల్ ఆఫ్ టూరిజం కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కోసం టవర్స్ ఏర్పాటు సుమారు 3 వేల మంది దేశ, విదేశీ అతిథులు ఈ సదస్సుకు హాజరు అవుతారని అంచనా. సీఎం, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఇతర సేవలందించే వారిని కలుపుకుంటే సుమారు 5 వేల మంది వరకు ప్రాంగణం లోపల, బయట ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరందరికీ సెల్ ఫోన్ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు సెల్ టవర్ ఆన్ వీల్స్ విధానంలో బీఎస్ఎన్ఎల్, జియో, వొడాఫోన్, ఎయిర్టెల్ తదితర నెట్వర్క్ల టవర్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మొబైల్ నెట్వర్క్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వంద ఎకరాల్లో భారీ ఏర్పాట్లు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వంద ఎకరాల్లో ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. యాభై ఎకరాల్లో పార్కింగ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ఒకవేదికపై ప్రతినిధులు ప్రసంగించడానికి, మరొక వేదికను తెలంగాణ సాంస్కృతిక కళాకారులు విభిన్న ప్రదర్శనలు చేయనున్నారు. వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు చర్చించుకోవడానికి ప్రత్యేక లాంజ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించనుంది.
రెఫరెండం అన్నవారిని బండకేసి కొట్టారు
మన తెలంగాణ/నర్సంపేట: జూబ్లీహిల్స్ ఉప ఎ న్నికను రెఫరెండంగా ప్రకటించిన వారిని ఓటర్లు బండకేసి కొట్టారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్ప ష్టం చేశారు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో ఓ టమిపాలవుతున్నా జనంలో తిరుగుతున్నారని ఆక్షేపించారు. ‘రాష్ట్ర ప్రజలంతా నాకు అండగా ఉండండి.. ఢిల్లీని ఢీకొడతా.. ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా.. కేంద్ర మంత్రులను కలిసి నిధులు తీసుకొ స్తా. నాకు వయస్సు ఉంది. ఓపిక ఉంది’ అని రే వంత్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా పాల న.. ప్రజా విజయోత్సవాల సభ వరంగల్ జిల్లా, నర్సంపేట పట్టణ కేంద్రంలో శుక్రవారం జరిగిం ది. ఈ సందర్భంగా సుమారు రూ.508.84 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభకు నర్సంపేట ఎంఎల్ఎ దొంతి మాధవరెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, పలువురు ఎంఎల్ఎ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సిఎం మాట్లాడుతూ.. 2023, డిసెంబరు 3న గడిల పాలనను బద్దలుకొట్టి ఓటు అనే ఆయుధంతో ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయి.. అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశించగా తెలంగాణ రావడంతో వాళ్ల ఆస్తులు పెరిగాయి.. ఫాంహౌస్లు కట్టుకున్నారు. హెలికాఫ్టర్లు కొనుక్కున్నారని పరోక్షంగా గత పాలకులను ఉద్దేశించి తీవ్రంగా ఆరోపించారు. గత ముఖ్యమంత్రి వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని, రైతులకు ఉరే అని మీ దిక్కున్నచోట చెప్పుకోమంటే..తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గింజ లేకుండా సన్న వడ్లు కొనుగోలు చేసి రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ వస్తే రైతులకు 24 గంటలు కరంటు ఉండదన్న వారి గడీల్లో కరంటు లేకుండా పోయి రైతులకు 24 గంటల కరంటు ఇస్తున్నామన్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉచిత విద్యుత్ను అమలుచేశారని, ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్దేనని అన్నారు. ఎకరాకు గత ప్రభుత్వం రైతు బంధు రూ.10 వేలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.12 వేలు ఇచ్చి రైతులకు భరోసా ఇచ్చిందన్నారు. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు రూ.20.614 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. దేశంలోనే అత్యధిక శాతం ధాన్యం పండిస్తున్నది తెలంగాణ రాష్ట్రమని, మన దగ్గర పండిన 56 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశామన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని ప్రతీ గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకుంటున్నామని అన్నారు.రాష్ట్రంలో గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిన దిక్కులేదని కాంగ్రెస్ ప్రభుత్వం 1.10 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే ఏ ఒక్కరూ అవి తినకుండా మళ్లీ రేషన్ షాపు డీలర్కే అమ్ముకొని రీసైక్లింగ్ చేసుకొనేవారని అన్నారు. తాము అలా కాకుండా ప్రతీ పేద వాడు సన్న బియ్యం తినాలని 3.10 కోట్ల మంది ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నామని అన్నారు. ఈ పథకం వల్ల సంవత్సరానికి రూ.13 కోట్లు భారం అయినప్పటికీ పేదల శ్రేయస్సు కోసం భరిస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఉండని గ్రామం లేదు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా హనుమాన్ గుడి లేని గ్రామం ఉండదని.. కానీ ఇందిరమ్మ ఇల్లు ఉండని గ్రామం లేదన్నారు. తెలంగాణలో ప్రతీ నియోజకవర్గానికి గూడు కల్పించాలనే లక్షంతో 3,500 ఇళ్లు మంజూరు చేశామన్నారు. వచ్చే బడ్జెట్లో నర్సంపేట నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాను గత ప్రభుత్వం అభివృద్ధిలో పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణలో కనీసం రెండో ఎయిర్పోర్టును ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా గత ప్రభుత్వం చేయలేదని వ్యాఖ్యానించారు. గత కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్లో ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుచేసిందన్నారు. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలని, మామునూరులో ఎయిర్పోర్టు, నగరంలో అండర్ డ్రైనేజీ, ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. మార్చి 31 వరకు వరంగల్లో ఎయిర్పోర్టు పనులు ప్రారంభించబోతున్నామని అన్నారు. తెలంగాణలో కోటి మంది మహిళలకు పుట్టింటి సారె ఇవ్వాలనే లక్షంతో ఓ అన్నలా ప్రతీ ఆడబిడ్డకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇప్పటివరకు 65 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ జరిగిందని, కొన్ని గ్రామాల్లో ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీ చేయలేదని, ఎన్నికల అనంతరం వాటిని పూర్తి చేస్తామన్నారు. పట్టణాల్లోని మహిళల్లో 35 వేల మందికి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మహిళలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, ప్రతీ ఒక్కరూ విద్యపై దృష్టి ఉంచి ఐఏఎస్, ఐపిఎస్, ఇంజినీర్లుగా, డాక్టర్లుగా రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేకంగా విద్యపైనే దృష్టి పెట్టాలని చదువుతోనే జీవితంలో మార్పు వస్తుందని, విద్యారంగం ముందుకెళ్లడానికి బాధ్యత తనదే అన్నారు. త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 61 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నిరుద్యోగ యువత పోటీపడి ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలను సాధించాలని సూచించారు. గ్రామాల్లో జరిగే ఎన్నికలపై యువత దృష్టి పెట్టవద్దని.. ఎన్నికల్లో ఎప్పుడైనా పోటీ చేయవచ్చని ప్రభుత్వ ఉద్యోగానికి మాత్రం వయస్సుతో ముడిపడి ఉంటుందన్నారు. విద్యతోనే అన్ని రంగాల్లో రాణించవచ్చని అందుకు తాను, ఇక్కడున్న మంత్రులు సీతక్క, సురేఖ ఉదాహరణ అన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల మనస్సులు గెలుచుకోండి స్థానిక ఎన్నికల్లో ప్రజల మనస్సులు గెలుచుకోండి. పైసలు ఖర్చు పెట్టకండి గ్రామాభివృద్ధే లక్షంగా ఎవరైతే గ్రామంలో సమస్యల పరిష్కారానికి మంత్రి వద్దకు వెళ్లి కృషిచేసే అవకాశాలున్న వ్యక్తులను ఎంచుకొని వారిని గెలిపించుకోవాల అన్నారు. ‘మీరు ఎన్నుకోబోయే సర్పంచ్ ప్రభుత్వ పథకాలను సాధించగలిగే వ్యక్తి కావాలని.. మహిళలకు ఎవరికైతే ఇందిరమ్మ చీరలు రావో వారికి కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ చేసే బాధ్యత ఆ గ్రామ సర్పంచ్దే’ అని స్పష్టం చేశారు. జనవరిలో మేడారం జాతరకు వచ్చి తల్లులను దర్శించుకుంటానని తెలిపారు. ఈ సభలో మహబూబాబాద్ ఎంపి పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంఎల్ఎలు రేవూరి ప్రకాశ్రెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, రామచంద్రునాయక్, ఎంఎల్సి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బంధం బలోపేతానికి ఐదేళ్ల ప్రణాళిక
న్యూఢిల్లీ: అమెరికా భారీగా విధిస్తున్న సుంకాలు, ఆం క్షల నేపథ్యంలో భారతదేశం రష్యా వచ్చే ఐదేళ్లలో ఆర్థి క, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఓ ప్రణాళికపై శుక్రవారం నాడు నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశం - రష్యా మధ్య ఎనిమిది దశాబ్దాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, మరింద దృఢంగా కొత్త పుంతలు తొక్కేలా చేసేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. రష్యా - భారతదేశం వార్షిక శిఖరాగ్ర చర్చల సందర్భంగా ఉభయు లూ ప్రసంగిస్తూ, రెండు దేశాల స్నేహబంధం ఎప్పటికీ కొనసాగుతుందని, భౌగోళిక, రాజకీయ గందరగోళ పరిస్థితులు ఉన్నా, స్నేహబంధం దృవనక్షత్రంలా స్థి రంగా ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పరస్పర గౌరవం, దృఢ నమ్మకంపై నిర్మించిన ఈ స్నేహబంధం ఎల్లప్పుడూ కాలపరీక్షకు నిలిచిందని. ఈ పునాది మరింత బలోపేతం చేయడానికి అన్నిరంగాలలో సహకారంపై శుక్రవారం నాడు చర్చించామని, ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యం అన్నారు ప్రధాని మోదీ. 2030 ఆర్థిక కా ర్యక్రమాన్ని ఖరారు చేయడంతో పాటు, ఆరోగ్యం, ఆ హార భద్రత, షిప్పింగ్ రంగాలతో పాటు వలసలు, ప్ర జల మధ్య పరస్పర మార్పిడి వంటి అనేక రంగాలలో సహకారాన్ని విస్తరించడానికి సంబంధించిన అనేక ఒ ప్పందాలపై ఉభయపక్షాలు సంతకాలు చేశాయి. ర ష్యా పౌరులకు భారతదేశం త్వరలో 30 రోజుల ఉచిత ఈ- టూరిస్ట్ వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసాలను ప్రవేశపెడుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. రెండు పక్షాలు వార్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతం ఉన్న 64 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచాలని చూస్తున్నాయని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తెలిపారు. భారతదేశం ఇంధన అవసరాలను తీర్చడానికి రష్యా చమురు, గ్యాస్, బొగ్గు వంటి ఉత్పత్తుల నమ్మకమైన సరఫరాదారు అని పుతిన్ స్పష్టం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం ఇంధనాన్ని నిరంతరాయంగా రవాణా చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. భారత ఉత్పత్తులకు రష్యా మార్కెట్ కల్పిస్తుందని, చిన్న, మాడ్యులర్ అణు రియాక్టర్లు, తేలియాడే అణువిద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సహకారం కోసం ఇరు పక్షాలు ఆసక్తితో ఉన్నాయని కూడా పుతిన్ తెలిపారు వైద్య, వ్యవసాయ రంగాలలోనూ రష్య సహాయం అందించగలదని తెలిపారు. మోదీ మాట్లాడుతూ, ఇంధన భద్రత ఉభయదేశాల భాగస్వామ్యానికి బలమైన పునాది అన్నారు పౌర అణుశక్తి రంగంలో సహకారం చాలా కీలకమని పేర్కొన్నారు.
బంగారు భవిష్యత్ ఎమ్మెల్యే బత్తుల
విద్యార్థుల బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వ లక్ష్యంగా అనేక సంస్కరణలతో ముందుగు సాగుతుంది అని రాజానగరం నియోజకవర్గఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ , ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గార్ల సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం సీతానగరం మండలం […] The post బంగారు భవిష్యత్ ఎమ్మెల్యే బత్తుల appeared first on Visalaandhra .
కుటుంబ విలువలు బంధాలు పెరుగుతాయి
విశాలాంధ్ర – కొవ్వూరు: కుటుంబాలు, బంధాలు, విలువలు విద్యార్థులు లో పెరిగేందుకు పేరెంట్స్ టీచర్స్ మీట్ దోహదపడుతుంది అని పూర్వ విద్యార్థి, జిల్లా టిడిపి వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు మద్దుల సత్యనారాయణ అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర ఎయిడెడ్ పాఠశాల లో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ చిట్టెం బాలకృష్ణ, స్కూల్ మేనేజ్మెంట్ […] The post కుటుంబ విలువలు బంధాలు పెరుగుతాయి appeared first on Visalaandhra .
త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు
మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రా ష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. తొలి విడత లో 4లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశా లు జరుగుతాయని తెలిపారు. 3 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, జూన్ నా టికి మరో 2లక్షల గృహ ప్రవేశాలు జరుగనున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏ డాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పారు. పార్టీలతో సంబంధం లే కుండా, కులమత బేధాలు లేకుండా పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపా రు. లబ్దిదారుల ఖాతాలకే నేరుగా నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో కొంతమంది పంచాయతీ కార్యదర్శులను విధుల నుంచి తొలగించామని అన్నారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతోపాటు భవిష్యత్తులో పేదల ఇండ్లకు ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పథకాలను వివరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని పేర్కొన్నారు. పేదలకు ఇళ్లు..ఆత్మగౌరవం, భద్రత, భరోసా అని వ్యాఖ్యానించారు. పేదలకు ఇండ్ల నిర్మాణంపై తమ ఎన్నికల వాగ్దానాలను అమలు చేసేలా తమ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కార్యాచరణ చేపడుతుందని తెలిపారు. రాబోయే మూడేళ్లలో అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందుగా ఇంటి స్థలం ఉన్నవారు ఇండ్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు. మూడో విడతలో వచ్చే ఏడాది ఇంటి స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కొత్త పథకం తీసుకురానున్నట్లు వెల్లడించారు. నగరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రణాళిక రాష్ట్రంలోని జిహెచ్ఎంసితో సహా అన్ని పట్టణాలు, నగరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రణాళిక సిద్దమైందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందుకోసం ముంబయి, బెంగుళూరు, ఢిల్లీ నగరాలలో అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించామని చెప్పారు. త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రకటిస్తామని అన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యను శాస్త్రీయంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే జి ప్లస్ 3 లేదా జి ప్లస్ 4 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే విధంగా త్వరలో పాలసీని ప్రకటించబోతున్నామని వెల్లడించారు. పట్టణాలలో నివాసం ఉండే చిరువ్యాపారులకు, చిన్న చిన్న పనులు చేసుకునే కుటుంబాలకు చెందిన వారికి దూరం ప్రాంతాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తే వారు అక్కడ నివాసం ఉండటం లేదని, వారు మళ్లీ నగరంలోని మురికివాడల్లోనే నివాసం ఉంటూ తమ జీవనోపాధికి అవసరమైన పనులు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో నగరంలోనే పేదలకు ఇండ్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివాసం ఉండని వారిని గుర్తించి వారికి కేటాయించిన ఇండ్లను ఆయా ప్రాంతాలలో అర్హులైన పేదలకు ఇస్తామని తెలిపారు. నగరంలో నివాసం ఉండే చిరువ్యాపారులు, చిన్న చిన్న పనులు చేసుకునే వారి కోసం నగరంలోనే ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. మధ్యతరగతి ప్రజలకు ఇండ్ల కోసం త్వరలో కొత్త పాలసీ మధ్యతరగతి ప్రజల సహా అందరికీ అందుబాటులో ఉండే విధంగా(అఫర్డబుల్ హౌజింగ్ స్కీం) రెండు మూడు నెలల్లో పాలసీని ప్రకటించబోతున్నామని పేర్కొన్నారు. దీనికోసం ఓఆర్ఆర్ చుట్టూ నాలుగు స్థలాలను గుర్తించామని తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో తీసుకువచ్చిన రాజీవ్ స్వగృహ పథకం తరహాలో పట్టణ ప్రాంతాల ప్రజలకు ఇండ్ల నిర్మాణం కోసం త్వరలో కొత్త పథకం తీసుకురానున్నట్లు వెల్లడించారు. గృహ నిర్మాణ శాఖను పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను పూర్తిగా రద్దు చేస్తే పేదలకు పక్కా ఇండ్లు నిర్మించాలన్న ఆలోచనతో తిరిగి గృహ నిర్మాణ శాఖను పునరుద్దరించామని, దీనికోసం 394 మంది డిఇలను వెనక్కి రప్పించి 800 మంది కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకున్నామని తెలిపారు. వివిధ శాఖల నుంచి అధికారులను డిప్యూటేషన్పై తీసుకుని వ్యవస్థను పటిష్టం చేశామని వివరించారు. హౌజింగ్ బోర్డు లీజుకు వచ్చిన సుమారు వెయ్యి ఎకరాలను స్వాధీనం చేసుకుని ప్రహరీ గోడలు నిర్మించామని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నవాటిని తొలగించి హైరైజ్ అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని అన్నారు. గృహ జ్యోతి పథకంతో పాటు గతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మధ్యలోనే వదిలేసిన సుమారు 15 వేల మందికి కొత్త పథకం వర్తించేలా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హిల్ట్ పాలసీపై కెటిఆర్ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ హిల్ట్ పాలసీపై బిఆర్ఎస్ విమర్శలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిప్పికొట్టారు. మీడియా సమావేశంలో హిల్ట్ పాలసీపై బిఆర్ఎస్ ఆరోపణలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానమిచ్చారు. హిల్ట్ పాలసీలో రెండు అంశాలు బిఆర్ఎస్ పాలనలో వచ్చినవే అని, ఆ ఫైల్పై మంత్రిగా కెటిఆర్ సంతకం చేసిన సంగతి మరిచారా...? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కోకాపేట, నియోపోలిస్ ప్లాట్లు వేలం వేశారని అన్నారు. హిల్ట్ పాలసీని దోపిడీ పాలసీ అంటున్న కెటిఆర్కు ఇవి గుర్తులేవా..? అని అడిగారు. ఓఆర్ఆర్ నిర్వహణను కూడా వేలం వేశారని విమర్శించారు. తండ్రి ముఖ్యమంత్రిగా కొడుకు పరిశ్రమల శాఖ మంత్రిగా కావలసిన వారి దగ్గర ముడుపులు తీసుకొని భూములను కన్వర్షన్ చేశారు.. ప్రభుత్వ భూములు వేలం వేశారని అన్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాది ఎకరాలు వేలం వేశారని మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బి నగర్లోని దాదాపు 40 ఎకరాల స్ధలాన్ని పివి రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇచ్చిందని, అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ తోటి భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన కూడా చేశారని గుర్తు చేశారు. ఈ కెమికల్ ఇండస్ట్రీని రెసిడెన్షియల్ జోన్గా మార్చింది బిఆర్ఎస్ కాదా..? అని ప్రశ్నించారు. ఈ ఫైలుపై అయ్యా కొడుకులు సంతకాలు చేయలేదా.. ఏ పాలసీతో ఈ కన్వర్షన్ చేశారు..? అంటూ నిలదీశారు. ఐడిపిఎల్లో కూడా ఇదే విధంగా చేశారని అన్నారు. కెటిఆర్ కడుపునిండా విషమే ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిల్ట్ పాలసీపై బిజెపి, బిఆర్ఎస్ది ఒకే డ్రామా అని, స్క్రిప్ట్ రాసేది ఒకరు... డెలివరీ చేసేది మరొకరు అని విమర్శించారు. నా కొడుకైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు: మంత్రి పొంగులేటి తప్పు చేస్తే తన కుమారుడైనా, తాను అయినా శిక్షకు అర్హుడేలమే అని, చట్టం ముందు అందరూ సమానమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తన కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థపై నమోదైన భూ వివాదం కేసుకు సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారని అన్నారు. తాము ప్రభుత్వంలో ఉన్నామని తన కుమారుడిపై కేసు నమోదు చేయవద్దని చెప్పే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. కేసు నమోదైన తర్వాత విచారణలో నిజ నిర్ధారణ జరుగుతుందని పేర్కొన్నారు.
పట్టు వదలని విక్రమార్కుడు.. ఎమ్మెల్యే ముప్పిడి
కొవ్వూరు నియోజకవర్గం లో ఏళ్ళనాటి సమస్యలకు పరిష్కారం.. పుష్కరాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదనలు అందజేత.. విశాలాంధ్ర – కొవ్వూరు : ఆయన పేరు ముప్పిడి వెంకటేశ్వరరావు.. కొవ్వూరు నియోజకవర్గానికి కొత్త అయినా, పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రక్కన వున్న గోపాలపురం నియోజకవర్గం నుంచి వచ్చి పోటీ చేసినా ఆయనలోని పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎక్కడా ఇసుమంతైనా చెక్కు చెదరలేదు. కొవ్వూరు నియోజకవర్గంలోని టిడిపి నాయకులను కలుపుకుని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి […] The post పట్టు వదలని విక్రమార్కుడు.. ఎమ్మెల్యే ముప్పిడి appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – నల్లజర్ల : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యం అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు అన్నారు. నల్లజర్ల మండలం దూబచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పి.టీఎం3.0 ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను […] The post మండలంలో ఘనంగా మెగా పిటిఎం3.0 appeared first on Visalaandhra .
న్యూఢిల్లీ: ఇండిగో విమాన యాన సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని, మూడు రోజుల్లో పూర్తి స్థా యిలో విమాన సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రమ్మోహన్ నాయుడు శుక్రవారం అన్నారు. ఇం డిగో విమానాల రద్దు, విమానాల రాకపోకల జాప్యం నివారణకు, కొత్త విమాన డ్యూటీ నిబంధనలను పక్కన పెట్టామని, వివిధ కార్యాచరణ చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. గత నాలుగు రోజులుగా వందలాది ఇండిగో విమానాల రద్దు, జాప్యానికి దారితీసిన కారణాలు కనిపెట్టి, జవాబుదారీ ఎవరద్దని నిర్ధారించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపించేందుకు నిర్ణయించింది. విమానాల షెడ్యూల్ లో, ముఖ్యంగా ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాల షెడ్యూల్ లో కొనసాగుతున్న సమస్యల పరిష్కారానికి పౌరవిమానయాన మంత్రిత్వశాఖ అత్యవసర చర్యలు చేపట్టినట్లు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) నిర్దేశించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్ డిటిఎల్) ఆదేశాలను తక్షణమే నిలిపివేశారు. విమాన భద్రత విషయంలో రాజీ పడకుండా, ముఖ్యంగా విమాన ప్రయాణంపై ఆధారపడే సీనియర్ సిటిజన్లు, ఇతర పౌరుల ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పౌర విమానయాన శాఖమంత్రి ఆదేశాలతో విమాన సర్వీసులు వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా చర్యలు మొదలయ్యాయి. మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో పైలట్ల విధుల నిబంధనల్లో మార్పులు న్యూఢిల్లీ : స్వదేశీ సంస్థ ఇండిగో విమాన సర్వీసుల గందరగోళంతో వేలాది మంది ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఇండిగోకు ఊరట కలిగించేలా పైలట్ల విధుల నిబంధనలను సవరించింది. గతంలో పైలట్లకు వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచగా, ఇప్పుడు ఈ విశ్రాంతి సమయాన్ని సెలవుగా పరిగణించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అంతకు ముందు ఈ వీక్లీ రెస్ట్ను సెలవుగా పరిగణించే అవకాశం లేదు. వీక్లీ రెస్ట్ పీరియడ్, సెలవులను వేర్వేరుగా చూసేవారు. పైలట్ల అలసట సమస్యను పరిష్కరించేందుకు ఈ కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇండిగో సర్వీసుల రద్దు నేపథ్యంలో ఈ నిబంధనను ఇండిగో అభ్యర్థనపై సడలించారు. పైలట్లు వరుసగా రెండు కంటే ఎక్కువ రాత్రి షిఫ్టులు చేయకూడదనే నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు డీజీసీఎ తెలిపింది. ఇండిగో సంస్థ పైలట్లు వారంలో ఆరు నైట్డ్యూటీలు నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం కొనసాగుతున్న గందరగోళాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీజీసీఎ తెలిపింది. ఈ మినహాయింపులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వరకు అమలులో ఉంటాయని వెల్లడించింది.న అంతేగాక, ప్రతి 15 రోజులకోసారి వీటిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది. ఇదంతా ప్రభుత్వ గుత్తాధిపత్య ఫలితమే : రాహుల్ న్యూఢిల్లీ : ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలకు ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మరోసారి సాధారణ పౌరులో ఈ నిస్సహాయతకు మూల్యం చెల్లించుకోవలసి వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితి మరోసారి ఎదురుకాకుండా ఉండేలా విమానయాన రంగంతోసహా అన్నింటిలోనూ న్యాయమైన పోటీ ఉండాలని ,అంతేతప్పమ్యాచ్ ఫిక్సింగ్, గుత్తాధిపత్యాలు కాదంటూ మండిపడ్డారు . కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి పవన్ఖేరా విమానాశ్రయాల్లో ఈరోజు గుత్తాధిపత్యమే జరుగుతోందన్నారు. ఇద్దరు వ్యక్తులు పార్టీని నడిపిస్తారు. ఇద్దరు ప్రభుత్వాన్ని పాలిస్తారు. ఇద్దరు వాణిజ్యాన్ని నిర్వహిస్తారు. అందువల్ల ఏం జరుగుతుంది ? అని ప్రశ్నించారు. ‘విమానయాన రంగంలో 92 శాతం వాటా కేవలం రెండు కంపెనీల ఇండిగో, టాటా చేతుల్లో ఉంది. ప్రభుత్వం వారి ముందు మోకరిల్లుతోంది. ఈ కంపెనీల ఒత్తిడి వల్ల నూతన ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు వదులుకోవలసి వస్తుంది ’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ దేశం మొత్తం మీద చాలా సంస్థలు కేవలం కొంతమంది చేతుల్లో ఉంటున్నాయని , అదే ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ఇది దేశానికి, ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన పరిణామం కాదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒకప్పుడు పోటీ ఉండే ఈ పరిశ్రమను కేవలం ఇద్దరి వరకే పరిమితం అయ్యేలా మోడీ ప్రభుత్వం దిగజార్చిందని విమర్శించారు.
మన తెలంగాణ/సికింద్రాబాద్: పోలీసుల కళ్లుగప్పి ఏడాది కాలంగా తప్పించుకు తిరుగుతున్న కేటగాళ్లను బోయిన్పల్లి పోలీసులు ఆరెస్టు చేసి వారి వద్ద నుండి 4.05 కోట్ల రూపాయల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. నార్త్జోన్ డిసిపి కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి రష్మీ పెరుమాల్ వివరాలను వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. 2024 డిసెంబర్లో నాగోల్కు చెందిన విశ్వనాథచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్పల్లిలో చీటింగ్ కేసు నమోదు చేశారు. విశ్వనాథచారి ఆయన మి త్రులు ప్రదీప్, రవిలు మధ్యవర్తి మహ్మద్ సుబాన్ కు 50 లక్షల రూపాయల నగదును అందజేశా రు. ఆర్టిజిఎస్ ఎక్సైంజ్ ద్వారా 60 లక్షలు ఇస్తామని నమ్మబలికి వారికి తిరిగి ఇవ్వకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు గత సంవత్పరం డిసెంబర్లో బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా పెట్టిన బోయిన్పల్లి పోలీసులు ప్రధాన నిందితుడు ప్రకాష్ మోతిబాయ్ ప్రజాపతి (30)తోపాటు మరో నిందితుడు ప్రగ్నేష్ కీర్తిబాయ్ ప్రజాపతి (28)లను మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల పోలీస్ స్టేషన్ పరిధిలో హుండాయ్ కారులో ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించగా 50 లక్షలు తీసుకొని ఫిర్యాదుదారుని మోసం చేసినట్టు అంతేకాకుండా 4.05 కోట్ల నగదును హవాలా మార్గంలో నాగ్పూర్ నుండి బెంగళూరుకు తరలిస్తున్నట్టు తెలిపారు. 4.05 కోట్ల నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు గుజరాత్కు చెందిన వారిగా గుర్తించారు. హవాలా ద్వారా నగదును బదిలీ చేయడం, అదిక మొత్తం చెల్లిస్తామని నమ్మబలికి డబ్బులు వసూలు చేయడమే వృత్తిగా కొనసాగుతున్నట్టు దర్యాప్తులో తేలిందని తెలిపారు. కేసును ఛేదించడంలో సహకరించిన బోయిపల్లి పోలీస్స్టేషన్ డిఐ ఎంఎన్ ఆనందర్, డిఎస్ఐ కె. చందర్, నార్త్జోన్ సైబర్ సెల్ ఎస్ఐ శ్రీధరన్, కార్కాన ఎస్ఐ అశోక్ రెడ్డి తో పాటు సిబ్బందిని ఆమె అభినందించారు. ఆత్యాశకు పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దని , అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తామనే మోసగాళ్ల మాటలు నమ్మవద్దని ఆమె ప్రజలకు సూచించారు.
శనివారం రాశి ఫలాలు (06-12-2025)
మేషం మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృషభం చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మిధునం వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. కర్కాటకం వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విభేదాలు మానసికంగా చికాకుగా వస్తాయి. సింహం చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్య పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. స్థిరస్తి వివాదాలలో శిరో బాధలు తప్పవు. తుల వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వృశ్చికం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు . ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. మకరం ఉద్యోగులకు పనిఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పనుల్లో ఆటంకాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కుంభం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.
06 Dec Cartoon 2025 |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
భారీ బ్యాటరీతో రెడ్మి 15సి 5జి ఫోన్
షియోమీ ఇండియా రెడ్మి 15సి 5జిను విడుదల చేసింది. ఈ మొబైల్ ఫీచర్లు చూస్తే, 17.53 సెం.మీ. భారీ డిస్ప్లే, స్లిమ్ 3డి క్వాడ్ కర్వ్ డిజైన్, 50ఎంపి ఎఐ కెమెరా, 6000 ఎంఎహెచ్ బ్యాటరీ, 33డబ్లు టర్బో ఛార్జింగ్ వంటివి ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 16జిబి వరకు ర్యామ్, 1టిబి స్టోరేజ్, హైపర్ ఓఎస్2తో వస్తుంది. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. షియోమీ సిఎంఒ అనుజ్ శర్మ మాట్లాడుతూ, ఈ ఫోన్ రోజువారీ వినియోగదారుల అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ఫోన్ ధరలు రూ.12,499 నుంచి ప్రారంభమవుతాయి.
హైదరాబాద్: సోమాజిగూడలోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. రెస్టారెంట్ కిచెన్ నుంచి
స్మార్ట్ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ నిరతంరం యాక్టివేట్
స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి చేయాలన్న యోచన నుంచి విరమించుకున్న కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ఆలోచనకు ముందుకొస్తోంది. స్మార్ట్ఫోన్లలో లోకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ను నిరతంరం యాక్టివేట్ చేయడం తప్పనిసరి చేసేందుకు యోచన చేస్తోంది. టెలికాం పరిశ్రమల నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు ఆయా ఫోన్ తయారీ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చేందుకు సంసిద్ధమవుతోంది. అయితే దీనికి యాపిల్ లాంటి కంపెనీలు ససేమిరా అంటున్నట్లు సమాచారం. ఇది యూజర్ల గోప్యతకు భంగం కలిగిస్తుందని ఆయా కంపెనీలు అభ్యంతరకం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు సెల్యూలార్ టవర్ డేటాపై లొకేషన్ కోసం ఆధారపడుతున్నాయి. దాన్ని అధిగమించడంతో పాటు విచారణ మరింత వేగవంతంగా జరిగేందుకు వీలుగా లోకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ నిరంతరం యాక్టివేషన్ సాయపడుతుందని ఆయా దర్యాప్తు సంస్థలు చేసిన సూచనల మేరకు ఈ ప్రతిపాదనపై కేంద్రం సీరియస్గా ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.
శ్రీకన్య రెస్టారెంట్లో అగ్నిప్రమాదం
పంజాగుట్టలోని శ్రీకన్య రెస్టారెంట్లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్లోని కిచెన్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటితో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రావడంతో రెస్టారెంట్లోని కస్టమర్లు, సిబ్బందిని బయటికి పంపించి మంటలను ఆర్పివేశారు.బిల్డింగ్ 5వ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ నుండి పొగలు రావడంతో స్థానికులు, బిల్డింగ్ లో ఉన్న వాళ్లు భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
వైజాగ్ వన్డేకు కట్టుదిట్టమైన బందోబస్తు….
ఆంధ్రప్రభ, విశాఖపట్నం : ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా
మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండలం, పంచాయతీ కార్యదర్శి గొర్లపల్లి రాజ్ కుమార్ ఎసిబికి చిక్కాడు. వివరాల్లోకెళ్తే ..కన్నేపెల్లి పంచాయతీకి చెందిన ఓ లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు బిల్లుల డబ్బులు ఇప్పించేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల ప్రకారం.. పంచాయతీ కార్యదర్శికి బెల్లంపల్లిలో డబ్బులు ఇస్తానని చెప్పడంతో అక్కడికి పంచాయతీ కార్యదర్శి వచ్చాడు. బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో బాధితుడు రూ.5 వేలు డబ్బులు ఇస్తుండగా ఎసిబి డిఎస్పి మధు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
హైదరాబాద్ లో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం
ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 హైదరాబాద్లో శుక్రవారం అద్భుతంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతికవేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరై వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు. యూరోపియన్ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్లో ఈ స్థాయి ఫెస్టివల్ను నిరంతరం నిర్వహించడంలో సారథి స్టూడియోస్ మద్దతు ఎంతో కీలకం అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎంఎస్ఆర్వి ప్రసాద్, ఈయు ప్రతినిధి బృందం, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు కెవి రావు, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఇక డిసెంబర్ 5 నుంచి 14 వరకు హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్, సారథి స్టూడియోస్, అలియెన్స్ ఫ్రాన్సైజ్ వేదికల్లో సినిమా ప్రదర్శనలు జరుగనున్నాయి.
రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, నారాయణపురం పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. మూడో విడతలో జరగాల్సిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ లేకుండానే ఫలితం తేలిపోయింది.ఈనెల 9న ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. ఎస్సి జనరల్కు రిజర్వ్ అయిన ఈ స్థానానికి గ్రామాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా గ్రామ పెద్దలు, అన్ని పార్టీల నాయకులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు ఒకే అభిప్రాయంతో ముందుకొచ్చారు. రాజకీయాలను పక్కనబెట్టి కాంగ్రెస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ ఏకగ్రీవానికి మంత్రి పొంగులేటి సోదరుడు, పార్టీ రాష్ట్ర నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. గ్రామంలోని అన్ని వర్గాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి అభిప్రాయ భేదాలను సర్దుబాటు చేసి ఏకాభిప్రాయాన్ని కల్పించారు. దీంతో పంచాయతీ పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఏర్పడే దిశగా మార్గం సుగమమైంది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వర్లుకు మంత్రి శ్రీనివాసరెడ్డి, అతని సోదరుడు ప్రసాద్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపురం అభివృద్ధి పథంలో ఇది శుభ సూచికమని మంత్రి వ్యాఖ్యానించారు.
మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం నా నైజం కాదు : బున్నె రవి
నిజామాబాద్/మోపాల్, డిసెంబర్ 5 : ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఊరి ప్రజలందరిపై నమ్మకంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నానని, సుదీర్ఘ అనుభవాన్ని, ఊరి …
ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధం: దానం నాగేందర్
ఎన్నికల్లో పోటీ చేసి, గెలవడం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం హిమాయత్ నగర్ డివిజన్ లో రూ. 1.40 కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై దానం నాగేందర్ స్పందించారు. రాజీనామా ప్రస్థావన ఇంకా రాలేదని, సీఎం రేవంత్రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, ఇప్పటికి 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర తనకి ఉందని చెప్పారు. అనర్హత కేసు అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, తన వైపు నుండి వాదనలు వినిపిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. రైజింగ్ తెలంగాణ కోసం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పవన్, ప్రవీణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి.రామన్ గౌడ్, అశోక్, యాదగిరి, యతితిరాజ్, ప్రభాకర్, నయీమ్, రాజేంద్రప్రసాద్, గణేష్, మన్సూర్, జాకి, సోహెల్, అజార్, ఫారుక్, ఓం ప్రకాష్, జ్ఞాని, నందు, మల్లేష్, సర్ఫరాజ్, శ్రీనాథ్, అశ్విన్, అనీష్, ప్రియ రాజ్, పూర్ణచందర్, రమేష్, బాలకృష్ణ, మహేష్,జ్యోతి రెడ్డి, మాధవి, సుజాత,హమీద్, పాషా, అఖిల్, హాసన్, అభిషేక్, జై కృష్ణ, మోసిన్, శేఖర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
'సిగ్మా'లో కేథరీన్ స్పెషల్ సాంగ్
విజనరీ సుభాస్కరన్ నేతృత్వంలోని లైకా ప్రొడక్షన్స్... జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్- అడ్వెంచర్ కామెడీ సిగ్మాను తెరకెక్కిస్తోంది. ఇందులో సందీప్ కిషన్ హీరో పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా, మగలక్ష్మి సుదర్శనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక అతిధి పాత్రలు వున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ కేథరీన్ థ్రెసా... సందీప్ కిషన్తో కలిసి డ్యాన్స్ చేయనుంది. తమన్ పవర్ ఫుల్ ట్రాక్ను కంపోజ్ చేశారు, ఇది సినిమాకి ఒక హైలైట్గా ఉంటుందని హామీ ఇస్తుంది. భారీ, కలర్ఫుల్ సెట్లో చిత్రీకరించబడిన ఈ పాటలో సందీప్ కిషన్, కేథరీన్ థ్రెసా హై-ఎనర్జీ తో స్క్రీన్ను ఉర్రూతలూగించనున్నారు. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది.
Birmingham |అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మంటలు…
అమెరికాలోని బర్మింగ్హామ్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక వెస్టిండీస్ టీమ్ పోరాడుతోంది. భారీ లక్షంతో బ్యాటింగ్కు దిగిన విండీస్ శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే చివరి రోజు విండీస్ మరో 319 పరుగులు చేయాలి. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు చందర్పాల్ (6), జాన్ కాంప్బెల్ (15) విఫలమయ్యారు. వన్డౌన్లో వచ్చిన అథనాజె (5), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (4) కూడా నిరాశ పరిచారు. దీంతో విండీస్ 72 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ దశలోఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను షాప్ హోప్ తనపై వేసుకున్నాడు. అతనికి జస్టిన్ గ్రీవ్ 55(బ్యాటింగ్) అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హోప్ 15 ఫోర్లు, ఒక సిక్స్తో అజేయంగా 116 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు కివీస్ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 466 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది.
విమానాల రద్దు ప్రభావం.. ఆన్లైన్లోనే కొత్త జంట రిసెప్షన్
ఇండిగో విమానసర్వీసుల రద్దు ప్రభావం నూతన వధూవరుల రిసెప్షన్పై చూపించింది. ఇటీవలనే పెళ్లి చేసుకున్న ఈ నవదంపతులు ఆన్లైన్లోనే రిసెప్షన్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక లోని హుబ్బళ్లికి చెందిన మేధా క్షీరసాగర్, ఒడిశా లోని భువనేశ్వర్కు చెందిన సంగమ దాస్లు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. నవంబరు 23న భువనేశ్వర్లో వీరి పెళ్లి జరిగింది. వధువు స్వస్థలం వద్ద బుధవారం రిసెప్షన్ ఏర్పాటైనా, భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానసర్వీసుల్లో అంతరాయం వల్ల వీరు వెళ్లలేక పోయారు. రిసెప్షన్కు అతిధులు హాజరవ్వడంతో ఇక చేసేది లేక రిసెప్షన్ హాల్లో స్క్రీన్ ద్వారా వధూవరులను చూపించ వలసి వచ్చింది.
AP CM Chandrababu gets invite for Telangana Rising Summit
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu got invited for the Telangana Rising Global Summit. Telangana Roads and Buildings Minister Komatireddy Venkat Reddy visited Amaravati on Friday, to personally invite AP CM for the prestigious event conducted by the Revanth Sarkar. The Revanth Reddy Government is holding Telangana Rising Global Summit – 2025 on a […] The post AP CM Chandrababu gets invite for Telangana Rising Summit appeared first on Telugu360 .
Ambati Rambabu Accuses Chandrababu of Derailing Polavaram
Former minister Ambati Rambabu has accused Chandrababu Naidu of damaging the Polavaram project and reducing it to nothing more than a barrage. Speaking to the media in Tadepalli on Friday, he said that the State government had taken over Polavaram from the Centre only to misuse funds, even though the project was originally mandated to […] The post Ambati Rambabu Accuses Chandrababu of Derailing Polavaram appeared first on Telugu360 .

24 C