SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

ఆలయంలో రచ్చ రవి సందడి..

ఆలయంలో రచ్చ రవి సందడి.. వరంగల్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని భద్రకాళి

ప్రభ న్యూస్ 25 Mar 2026 1:29 pm

గురుకుల కళాశాలలోమెగా ప్లేస్మెంట్ డ్రైవ్ లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులు

వరంగల్ ఈస్ట్, మార్చ్ 25 (జనం సాక్షి)టీజీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి వరంగల్ ఈస్ట్ కాలేజీ నందు నిర్మాన్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మెగా ప్లేస్మెంట్ …

జనం సాక్షి 25 Mar 2026 1:27 pm

రాధా కృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ట

కౌటాల జనం సాక్షి..మండలంలోని తాటిపల్లి గ్రామ పం చాయతీ పరిధిలోని గోవర్హెట్టి గ్రామంలో శ్రీరాధాకృష్ణ ఆలయంలో శ్రీ రాధాకృష్ణ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామస్తులు …

జనం సాక్షి 25 Mar 2026 1:23 pm

Resignation |చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేశా…

Resignation | చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేశా… Resignation | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 25 Mar 2026 1:22 pm

ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేతకు పరామర్శ..

ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేతకు పరామర్శ.. శ్రీరామ్ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పిన

ప్రభ న్యూస్ 25 Mar 2026 1:21 pm

బిఆర్ఎస్ పార్టీ లోకి బారి చేరికలు….

బిఆర్ఎస్ పార్టీ లోకి బారి చేరికలు…. డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్

ప్రభ న్యూస్ 25 Mar 2026 1:20 pm

డీజిల్ పెట్రోల్ కోసం అవస్థలు: బంకుల్లో బారులు తీరీన ప్రజలు

మిడ్జిల్. మార్చి 25: (జనం సాక్షి)పెట్రోలు డీజిల్ పై వస్తున్న కొరత వార్తలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుధవారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులలో పెట్రోలు డీజిల్ …

జనం సాక్షి 25 Mar 2026 1:18 pm

ఏడాది పెండింగ్ వేతనాలు చెల్లించాలి..

ఏడాది పెండింగ్ వేతనాలు చెల్లించాలి.. -తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర

ప్రభ న్యూస్ 25 Mar 2026 1:17 pm

సీనియర్ న్యాయవాది అకాల మరణం…

సీనియర్ న్యాయవాది అకాల మరణం… కాపు నాయకుడి మృతి బాధాకరం : దేవినేని

ప్రభ న్యూస్ 25 Mar 2026 1:16 pm

పెట్రోల్, డీజిల్‌ కొరత లేదు... ఇతర దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది: బిపిసిఎల్

హైదరాబాద్:  భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ కొరత వదంతులు పూర్తిగా నిరాధారమైనవని బిపిసిఎల్ తెలిపింది. భారత్‌లో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, బిపిసిఎల్ పూర్తిస్థాయిలో పనిచేస్తోందన్నారు. దేశమంతా ఇంధన సరఫరా నడుస్తోందని, దేశంలో ఇంధనం కొరత అంటూ పుకార్లు వస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని తెలియజేశారు.  భారతదేశంలో ఇంధన కొరత లేదని, వాస్తవానికి, భారత్ పెట్రోల్, డీజిల్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోందని, ముడి చమురు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థలో ఎలాంటి అభ్యంతరాలు లేవు అని, భారత్ పెట్రోలియం సంస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తోందని, అంతరాయం లేని సరఫరాను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని బిపిసిఎల్ ప్రకటించింది. ప్రజలు భయాందోళనతో అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేయవద్దని, పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉందన్నారు. 

మన తెలంగాణ 25 Mar 2026 1:11 pm

జన్నారంలో విధుల్లో నిర్లక్ష్యం..

జన్నారంలో విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్.. జన్నారం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 25 Mar 2026 1:09 pm

పలమనేరు అసెంబ్లీ మహిళలకు రిజర్వ్ ?

పలమనేరు అసెంబ్లీ మహిళలకు రిజర్వ్ ? ప్రశ్నార్థకంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి

ప్రభ న్యూస్ 25 Mar 2026 1:05 pm

Breaking : సిలిండర్ బుకింగ్ నిబంధనలు మార్చలేదు

సిలిండర్‌ బుకింగ్‌ నిబంధనను మార్చలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది

తెలుగు పోస్ట్ 25 Mar 2026 12:53 pm

Allu Arjun and Aditya Dhar: PR Strategy or Pan-Indian Plan?

Days after Dhurandhar: The Revenge emerged as an industry hit, there are publications across national media that Dhurandhar director Aditya Dhar will soon work with Icon Star Allu Arjun. The predictions are quite early as Aditya Dhar is one director who is never in a hurry. The collaboration of Allu Arjun and Aditya Dhar is […] The post Allu Arjun and Aditya Dhar: PR Strategy or Pan-Indian Plan? appeared first on Telugu360 .

తెలుగు 360 25 Mar 2026 12:42 pm

Chandrababu Pushes for Lower Power Costs Without Burdening Consumers

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has directed officials to take a focused and structured approach to reducing the cost of power procurement. During a high-level review meeting at the Secretariat, he made it clear that the goal is not just to cut costs but to do so without placing any additional burden on […] The post Chandrababu Pushes for Lower Power Costs Without Burdening Consumers appeared first on Telugu360 .

తెలుగు 360 25 Mar 2026 12:38 pm

వికారాబాద్ లో సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... పలువురికి గాయాలు

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి సమీపంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని బట్టి ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు ధాటికి లోపల పనిచేస్తున్న పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది.​ అయితే, ఈ ప్రమాదం పై కంపెనీ యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. భారీ పేలుడు జరిగినా కూడా కేవలం లారీ టైర్ పేలిందని చెబుతూ కంపెనీ ప్రతినిధులు బుకాయిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు లోపలికి అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గాయపడిన కార్మికులను రహస్యంగా ఆసుపత్రికి తరలించారా అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇదే ఫ్యాక్టరీ వద్ద గతంలో గంజాయి విక్రయిస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న ఘటన మరువకముందే, ఇప్పుడు ఈ పేలుడు సంభవించడం కలకలం రేపుతోంది.

మన తెలంగాణ 25 Mar 2026 12:34 pm

Telangana |సిరిసిల్ల నేతన్నల సమస్యలపై విజ్ఞప్తి

Telangana | సిరిసిల్ల నేతన్నల సమస్యలపై విజ్ఞప్తి Telangana | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 25 Mar 2026 12:28 pm

25thMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

25thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 25thMarchCartoon | ట్రంప్-మోడీ కాల్…

ప్రభ న్యూస్ 25 Mar 2026 12:27 pm

TDP : ట్రాక్ రికార్డును చూసిన తర్వాతనే ఈసారి టీడీపీ టిక్కెట్లట

తెలుగుదేశం పార్టీ ఈసారి కూడా సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లను ఖరారు చేయనున్నారు

తెలుగు పోస్ట్ 25 Mar 2026 12:23 pm

హైదరాబాద్ లో జాబ్... అరకులోయలో హత్య

అమరావతి: ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్లివలస గ్రామానికి చెందిన నాగేళ్ల సురేష్ అనే యువకుడు (25) హైదరాబాద్‌లోని ఓ జువెల్లరీ షాపులో పని చేస్తున్నాడు. గతంలో అరకు లోయ రిసార్ట్ లో కూడి పని చేసినట్టు తెలుస్తోంది. అరకులోయ సమీపంలోని రూప రిసార్ట్ వద్ద సురేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్‌తో కొట్టి అనంతరం కత్తితో పొడిచి చంపేశారు. గంజాయి మత్తులో హత్య చేసి ఉంటారా లేక మరేదైనా కోణంలో చంపేశారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య ప్రస్తుతం గర్భవతి ఉంది.

మన తెలంగాణ 25 Mar 2026 12:23 pm

పెట్రోల్ పంపులు వద్ద జన సందోహం

పెట్రోల్ పంపులు వద్ద జన సందోహం పెట్రోల్ కొరతా ఉంటుంద భారీగా జనాలు

ప్రభ న్యూస్ 25 Mar 2026 12:23 pm

అక్రమ అరెస్టులతో అణచివేయలేరు

అక్రమ అరెస్టులతో అణచివేయలేరు నర్సింహులపేట, ఆంధ్రప్రభ : హక్కుల సాధన కోసం పోరాటం

ప్రభ న్యూస్ 25 Mar 2026 12:14 pm

చర్చి స్థలం అమ్మకానికి కుట్ర..

చర్చి స్థలం అమ్మకానికి కుట్ర.. సంఘం సభ్యులను బెదిరింపులు… కాజీపేట, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 25 Mar 2026 12:11 pm

Revanth Reddy : నేడు రేవంత్ పెట్రోలు, గ్యాస్ కొరతపై సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరతపై సమీక్షించనున్నారు

తెలుగు పోస్ట్ 25 Mar 2026 12:10 pm

Telangana : ఏడుగురు ఎమ్మెల్యేలు, స్పీకర్ కు హైకోర్టు నోటీసులు

తెలంగాణ హైకోర్టు స్పీకర్ తో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది

తెలుగు పోస్ట్ 25 Mar 2026 12:03 pm

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత.. వికారాబాద్, ఆంధ్రప్రభ : పరిసరాలను పరిశుభ్రంగా

ప్రభ న్యూస్ 25 Mar 2026 12:01 pm

​మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు రద్దు..

​మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు రద్దు.. చిట్యాల, ఆంధ్రప్రభ : మతమార్పిడి చేసుకున్న

ప్రభ న్యూస్ 25 Mar 2026 11:57 am

Amaravathi : అమరావతిలో పనులు ప్రారంభించిన నారాయణ

రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పనులను ప్రారంభించారు

తెలుగు పోస్ట్ 25 Mar 2026 11:56 am

పెట్రోల్, డీజిల్ కొరత లేదు... వదంతులు నమ్మొద్దు: స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని వదంతులు నమ్మొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వాహనదారులు అనవసరంగా ఎక్కువ పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని హెచ్చరించారు. సోమవారం ఒక్క రోజే 1500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు బంక్ లకు పంపిణీ చేశామని, సుమారు 20 వేల కిలో లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందన్నారు. రోజు వారి అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయని స్టీఫెన్ రవీంద్ర వివరించారు. 

మన తెలంగాణ 25 Mar 2026 11:52 am

మున్సిపల్ చైర్మన్ వార్డు సందర్శన

మున్సిపల్ చైర్మన్ వార్డు సందర్శన ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్

ప్రభ న్యూస్ 25 Mar 2026 11:50 am

పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి..

పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి.. కడెం, ఆంధ్రప్రభ : పశువులకు ఉచిత గాలికుంటు

ప్రభ న్యూస్ 25 Mar 2026 11:48 am

చమురు ధరలు 150 డాలర్లకు చేరుకుంటే.. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తోంది

టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియడం లేదని అమెరికా అసెట్ మేనేజ్‌మెంట్ దిగ్గజం బ్లాక్‌రాక్ సిఇఒ లారీ ఫింక్ తెలిపాడు. ఇలాగే యుద్దం కొనసాగితే చమురు ధరలు 150 డాలర్లకు చేరుకుందని, దీంతో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తోందని హెచ్చరించారు. ఒకే వేళ ఘర్షణలు ముగిసి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇరాన్‌ను ప్రపంచం ఆమోదిస్తే చమురు ధరల ఒక్కసారిగా పడిపోతాయని వివరించారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఫింక్ తెలిపారు. ఇప్పటికే యుద్ధం ముగించేందుకు ఇరాన్‌తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌కు అమెరికా కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న అణుసామర్థాలను తప్పనిసరిగా నిర్వీర్యం చేయడంతో పాటు నతాంజ్. ఇస్ఫహాన్, ఫోర్తో అను కేంద్రాలను ధ్వంసం చేయాలని అమెరికా డిమాండ్ చేసింది. అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయకూడదని, అణుశుద్ధి చేయకూడదని, 450 కిలోల యురేనియాన్ని వరల్డ్ అటామిక్ ఎనర్జీ ఎజెన్సీకి అప్పగించాలనే డిమాండ్లు ఇరాన్ ముందు అమెరికా పెట్టినట్లు తెలుస్తోంది. 

మన తెలంగాణ 25 Mar 2026 11:48 am

NTR to Host a Lavish Party

Young Tiger NTR is completely busy with the shoot of Dragon directed by Prashanth Neel. The upcoming schedule is taking place in Hyderabad. Tomorrow marks the birthday of NTR’s wife Lakshmi Pranathi and the actor is in plans to host a lavish party. The entire team of Dragon along with the close friends of NTR […] The post NTR to Host a Lavish Party appeared first on Telugu360 .

తెలుగు 360 25 Mar 2026 11:42 am

ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు

దాదాపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి చిరునామాగా ఉన్న ఢిల్లీలోని అక్బర్ రోడ్ కార్యాలయంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ శనివారం (మార్చి 28)లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. 1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు 24, అక్బర్ రోడ్ భవనం కేంద్రంగా ఉంది. ఈ కార్యాలయంతో పాటు, 5 రైసినా రోడ్‌లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్‌ను కూడా […] The post ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Mar 2026 11:35 am

Parliament |గ్యాస్ సిలిండర్లతో కేంద్రంపై విమర్శలు

Parliament | గ్యాస్ సిలిండర్లతో కేంద్రంపై విమర్శలు Parliament | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 25 Mar 2026 11:26 am

TG |పెట్రోల్ బంకుల వద్ద బారులు

TG | పెట్రోల్ బంకుల వద్ద బారులు నో స్టాక్ బోర్డులువాహనదారుల ఇబ్బందులు

ప్రభ న్యూస్ 25 Mar 2026 11:23 am

Fuel Panic in Hyderabad: Dealers Clarify No Shortage of Petrol or Diesel

Rumours of a fuel shortage triggered panic buying across Hyderabad on Wednesday. Long queues formed at several petrol stations as motorists rushed to fill their tanks. The situation escalated quickly in key areas such as Begumpet, Banjara Hills, and Falaknuma. Many people arrived not just with vehicles but with plastic drums and metal containers. They […] The post Fuel Panic in Hyderabad: Dealers Clarify No Shortage of Petrol or Diesel appeared first on Telugu360 .

తెలుగు 360 25 Mar 2026 11:23 am

విజయవాడ టెర్రర్ లింకుల కేసులో పురోగతి

విజయవాడ టెర్రర్ లింకుల కేసులో పురోగతి లభించింది

తెలుగు పోస్ట్ 25 Mar 2026 11:16 am

అమెరికా ఎలా చెబితే మోదీ అలానే చేస్తారు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శ న్యూదిల్లీ: ప్రదాని మోదీపై రాహుల్ గాంధీ మర్కొసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా, ఇజ్రాయిల్ ఎలా చెబితే మోదీ అలా చేస్తారని విమర్శించారు. ఆయనకు దేశ ప్రయోజనాలు కంటే అమెరికా ప్రయోజనాలే ఎక్కువని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు ప్రధాని కషి చేయరని తాను రాతపూర్వకంగా చెప్పగలనన్నారు. మన విదేశాంగ విధానంపైన మాట్లాడుతూ…మన విదేశాంగ విధానం ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా మారిపోయిందని, అంతర్జాతీయ జోక్‌గా మిగిలిందని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఆవరణలో […] The post అమెరికా ఎలా చెబితే మోదీ అలానే చేస్తారు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Mar 2026 11:13 am

Incident |ఎగిసిపడ్డ మంటలు

Incident | ఎగిసిపడ్డ మంటలు Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ

ప్రభ న్యూస్ 25 Mar 2026 11:13 am

మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలిద్దాం –ఏసిపి వసుంధర యాదవ్

డ్రగ్స్ వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ టీం ఫోర్స్ పెనుబల్లి, మార్చి 25(జనం సాక్షి) మత్తు పదార్థాల వినియోగం నేడు సమాజంలో ప్రధాన …

జనం సాక్షి 25 Mar 2026 11:08 am

Hyderabad : పెట్రోలు కొరత లేదు : డీలర్స్ అసోసియేషన్

హైదరాబాద్ లో పెట్రోలు, గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి

తెలుగు పోస్ట్ 25 Mar 2026 11:07 am

Petrol Pumps |పుకార్లను నమ్మవద్దన్న డీలర్స్ అసోసియేషన్

Petrol Pumps | పుకార్లను నమ్మవద్దన్న డీలర్స్ అసోసియేషన్ Petrol Pumps |

ప్రభ న్యూస్ 25 Mar 2026 10:59 am

నవ్విపోదురుగాక ట్రంప్‌నకేటి సిగ్గు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో.. ఆయనంత వేగంగా తాను రంగులు మార్చలేనందుకు! గోబెల్స్ బతికుండి ఉంటే, తలదించుకునేవాడేమో.. ట్రంప్‌లా తాను అలవోకగా అబద్ధాలు చెప్పలేకపోయినందుకు! అభూత కల్పనలను అసలు సిసలైన వాస్తవాలుగా నమ్మబలకడంలో ట్రంప్‌ను మించినవారు వర్తమాన కాలంలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. గతంలో ఆయన ఆడిన అబద్ధాలను అలా ఉంచి, ప్రస్తుతం ఇరాన్‌తో సాగిస్తున్న యుద్ధం విషయాన్నే చూసుకుంటే అమెరికా అధినేత ఆడిన అబద్ధాలను చూసి ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. గత జూన్‌లో ఇరాన్‌పై అమెరికా దాడులు జరిపినప్పుడు ఇకపై ఇరాన్ అణు కార్యక్రమానికి పాల్పడటానికి వీల్లేనంతగా దెబ్బతీశామని ట్రంప్ స్వయంగా ప్రకటించుకున్నారు. అదే నిజమైతే, ఇక ఈ తాజా దాడులు ఎందుకనేది ప్రశ్న. పది రోజుల క్రితం కూడా ఆయన ఇదే తరహాలో అబద్ధాన్ని అందంగా వల్లె వేశారు. ఇరాన్ ను కోలుకోలేనంతగా దెబ్బతీశామని, ఇక యుద్ధం ఎన్నో రోజులు కొనసాగదని అన్నారు. కానీ, వాస్తవంలో జరుగుతున్నది వేరు. యుద్ధం మొదలై మూడు వారాలు దాటినా ఇరాన్ తగ్గలేదు సరికదా, దీర్ఘశ్రేణి క్షిపణులను సైతం ప్రయోగిస్తూ, అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యుద్ధం ప్రారంభమైన రెండు రోజులకే ఇరాన్ లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 175మందికి పైగా పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఈ దాడి జరిపింది ఇరానేనంటూ ట్రంప్ నమ్మబలికేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ, అమెరికా క్షిపణి పొరబాటున పాఠశాలను తాకడమే ఈ ప్రమాదానికి కారణమంటూ ఆ దేశ రక్షణ శాఖ జరిపిన దర్యాప్తులో తేలడంతో ట్రంప్ తన నోటికి తాళం వేసుకోవలసి వచ్చింది. ఇరాన్‌తో చర్చలు జరుపుతున్న కారణంగా, దాడులను వారం రోజులపాటు నిలిపివేస్తున్నట్లు తాజాగా ట్రంప్ మరో అబద్ధాన్ని వండివార్చారు. కానీ, ఈ వాదనను ఇరాన్ కొట్టిపారేసింది. తాము అమెరికాతో చర్చలు జరవడం లేదంటూ తేల్చిచెప్పింది. తాను ఒక అగ్రరాజ్యానికి అధినేతననీ, తన మాటలు, చేతలూ దేశప్రతిష్ఠను ఇనుమడింపజేసే విధంగా ఉండాలే తప్ప, దిగజార్చకూడదన్న ఇంగితాన్ని విస్మరించి నిస్సిగ్గుగా అసత్యాలను, అర్ధసత్యాలను పలికే దేశాధినేతల జాబితాను ఎవరైనా తయారు చేస్తే, అందులో అగ్రస్థానం ట్రంప్‌దే కావచ్చుననడంలో సందేహం లేదు. మొదటిసారి అమెరికా అధ్యక్ష పదవిని వెలగబెట్టినప్పుడు ఆయన సగటున రోజుకు ఎనిమిది అబద్ధాలు ఆడేవారని సిఎన్‌ఎన్ జరిపిన ఒక సర్వేలో తేలడం విశేషం. రాజకీయ జీవితం గురించే కాదు, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా గతంలో ఆయన ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఎప్‌స్టీన్‌తో తనకున్న సంబంధాల గురించి, ఒక మోడల్‌తో వెలగబెట్టిన ప్రేమాయణం గురించి ఆయన చెప్పినవి అవాస్తవాలని రుజువైనా, తప్పు సరిదిద్దుకోకుండా, రెట్టించిన ఉత్సాహంతో అబద్ధాలాడుతూ ఉండటం ఆయనకే చెల్లు. ఇరాన్‌తో యుద్ధం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంలోనూ ట్రంప్ దారుణంగా విఫలమయ్యారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం చేస్తుందని, గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభిస్తుందని అంచనా వేయడంలో ట్రంప్ అండ్ కో బొక్కబోర్లాపడ్డారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను తాను ఊహించలేదని స్వయంగా అంగీకరించడం ఆయన వైఫల్యానికి నిదర్శనం. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ విద్యుత్కేంద్రాలపై దాడులు జరుపుతామన్న ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ లొంగలేదు సరికదా, అదే జరిగితే పశ్చిమాసియా వ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, ఇంధన వసతులను నాశనం చేస్తామని హెచ్చరించింది. దీంతో ట్రంప్ తోకముడిచారు. నాటో దేశాలను కలుపుకుపోవాలన్న ఆయన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. ఇరాన్ తో యుద్ధం కారణంగా అమెరికాకు జరిగిన నష్టం కూడా తక్కువేమీ కాదు. ఇప్పటివరకూ పన్నెండుమంది సైనికులు కన్నుమూయగా, వందమందికి పైగా క్షతగాత్రులయ్యారు. గల్ఫ్ దేశాల్లోని పలు అమెరికన్ స్థావరాలు ధ్వంసమయ్యాయి. అమెరికా వైమానిక దళానికి వెన్నుదన్నుగా నిలిచే ఎఫ్-35 వంటి యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేయడం మరో ఊహించని దెబ్బ. యుద్ధం కారణంగా అమెరికాలోనూ పెట్రోలు, డీజిల్, ఇతర నిత్యావసరాల ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. తాను అధికారంలోకి రావడానికి ముందు, ‘నిరంతరం యుద్ధాలలో మునిగితేలుతున్నారు’ అంటూ డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన ట్రంప్ ఇప్పుడు చేస్తున్నదేమిటి? ప్రపంచదేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం ద్వారా తాను బావుకున్నదేమిటి? ఇంటాబయటా కావలసినంత అప్రదిష్ట మూటగట్టుకున్న ట్రంప్ మహాశయులు ఇక చేయవలసింది ఒక్కటే. దౌత్యమార్గాల ద్వారా ఇరాన్‌తో చర్చలకు ఉపక్రమించడం. భారత ప్రధాని అన్నట్లుగా పశ్చిమాసియా సంక్షోభానికి చర్చలే పరిష్కారాన్ని చూపాలి. అందుకు భారత్ వంటి తటస్థ దేశాలు నడుం బిగించడం అభిలషణీయం.

మన తెలంగాణ 25 Mar 2026 10:52 am

పెండింగ్ బకాయిలు చెల్లించాలి..

పెండింగ్ బకాయిలు చెల్లించాలి.. కడెం, ఆంధ్రప్రభ : ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ పిఆర్సి

ప్రభ న్యూస్ 25 Mar 2026 10:48 am

పింఛనులో కోత.. వృద్ధులకు గుండెకోత

‘పెన్షన్’ అనేది సామాజిక భద్రతా పథకం. శ్రమనే పెట్టుబడిగా పెట్టి జీతంతో కడుపు నింపుకునే ఉద్యోగులు వయసుపై పడటంవల్ల ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పేదరికంలోనికి వెళ్ళిపోకుండా కాపాడేది. మన దేశం శ్రేయో రాజ్యం. ఈ శ్రేయో రాజ్యంలో ప్రజల శ్రేయస్సును కాపాడే బాధ్యత ప్రభుత్వాలది. దేశంలోని పాత పెన్షన్ దారులకు హాని చేసే విధంగా పెన్షన్ ధృవీకరణ చట్టాన్ని 25 మార్చి, -2025 నాడు 2025- 2026 ఆర్థిక బిల్లులో భాగంగా గుట్టుచప్పుడు కాకుండా పార్లమెంటు ఆమోదించింది. పెన్షనర్లను పాత, కొత్త పెన్షనర్లుగా విడదీయడం ఈ బిల్లులోని ముఖ్య విషయం. ఈ చట్టంలోని సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వ పౌరసేవల (సివిల్ సర్వీసెస్) పెన్షన్ నిబంధనలు 1972, 2021, అసాధారణ పెన్షన్ నిబంధనలు 2023లో మార్పులు వస్తాయి. కొత్త సవరణలద్వారా వేతన సవరణల ఫలితంగా వచ్చే లాభాలను వేతన సవరణ కమిషన్ సిఫార్సులు అమలైన తేదీ తర్వాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులకే వర్తిస్తాయి. ఆ తేదీకి ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు పే కమిషన్ సిఫార్సు చేసిన లాభాలు వర్తించవు. పే కమిషన్ సిఫార్సులను ఎప్పుడూ, ఎలా అమలు చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీని ద్వారా పెన్షన్ హక్కులు ఎవరికి వర్తించాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఎనిమిదో వేతన సవరణ సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుండి అమలు చేయవలసి ఉంది. ఇప్పుడు ఈ చట్టం ద్వారా పెన్షనర్లు రెండు గ్రూపులు అవుతారు. అంటే 01- జనవరి, 2026 ముందు పదవీ విరమణ చేసినవారు, తర్వాత పదవి విరమణ చేసినవారు. అట్లే ఈ చట్టం ద్వారా వేతన కమిషన్ అమలు చేసిన తేదీ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ ప్రకారం పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే ఆర్థిక లాభం చేకూరుతుంది.మిగిలిన వారికి ఆర్థిక లబ్ధి ఉండదు. వారికి ప్రస్తుతం పొందుతున్న పెన్షన్ మాత్రమే వస్తుంది. అట్లే ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ 01 మార్చి, 2025 తేదీన పదవీ విరమణ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘ సిఫార్సులు 01 జనవరి 2026 నుంచి అమలు చేస్తే, ముందు పదవీ విరమణ చేసిన వారు ఎవరికి ఈ చట్టం ప్రకారం ఆర్థిక లబ్ధి రాదు. అంటే 1 జనవరి, 26 తదుపరి పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వేతన సంఘం సిఫార్సుల లబ్ధి వర్తిస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను ఉటంకిస్తూ పెన్షన్ చెల్లింపు అనేది డిఫర్డ్ వేజ్‌గా గుర్తిస్తున్నామని, అందుకే పెన్షన్ చెల్లింపు ఉందని పేర్కొంటూనే, 1950, 1960, 1970లలో పని చేసిన ఉద్యోగికి 1986 లో పెన్షన్ చెల్లించాల్సిన అవసరం ఏమిటని, ఉద్యోగి పనిచేసిన కాలపు డిఫర్డ్ వేజ్‌ను పెన్షన్‌గా ఇప్పటికే ఆ పెన్షనర్ కు చెల్లిస్తున్నాం. కనుక పెన్షన్ పెంపుదల అవసరం లేదని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. పెన్షనర్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా వేరు చేయడం అసమంజసమని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ సవరణ చట్టం ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును నిర్వీర్యం చేస్తూ పెన్షనర్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా నిర్ణయించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పిస్తోంది. ప్రభుత్వం పెన్షన్ పెరుగుదల అంశాన్ని మరింత విశదీకరిస్తూ మూడో వేతన సంఘం నుండి ఇప్పటి ఏడవ వేతన సంఘం దాకా పెన్షన్ పెరుగుదలపై విస్తృత చర్చ జరగాలని అన్ని వేతన సంఘాలు చెప్పాయని, కనుక ఇకపై వేతన సంఘం ఏర్పాటు తర్వాత ఆయా సిఫార్సులను అమలు చేయాల్సిన తేదీ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికు మాత్రమే వేతన సంఘం సిఫార్సులు వర్తిస్తాయని అంతకు ముందు రిటైర్ అయిన వారికి కాదని పేర్కొన్నారు. ఫైనాన్స్ బిల్లుపై సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండడం, న్యాయ పరిధిలో చాలెంజ్‌కు నిలబడే అవకాశాలు తక్కువ ఉండడం ఈ సందర్భంగా గమనించాలి. 1977 సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన వారికి చాలా తక్కువగా వచ్చే పెన్షన్లలో వివిధ కారణాల పేరుతో కోతలు విధించేవారు. 1979 లో కేంద్ర ప్రభుత్వం లిబరలైజ్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకటించి 1979 నాటికి సర్వీస్‌లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వులు ఇచ్చారు. ఇది 1979కి ముందు రిటైరైన వారికి శాపంగా మారింది. ఆనాడు అత్యధికంగా రూ. 675 మాత్రమే పెన్షన్ ఉండేది. ఆ పెన్షన్‌తో కుటుంబ జీవనం గడపడం కష్టతరమయ్యేది. కేంద్ర ప్రభుత్వ సరళీకృత పింఛన్ విధానం ద్వారా లభించే ఆర్థిక, ఇతర సౌలభ్యాలు 1979 మార్చి 31 నాటికి సర్వీసులో వున్నవారికి వర్తిస్తాయని, అంతకు పూర్వం పదవీ విరమణ చేసినవారికి వర్తించవని 1979 మే 25న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి పెన్షన్‌దారులను కుంగదీసాయి. అరకొర పెన్షన్‌తో జీవించడం కన్నా మరణమే మేలు అనే మానసిక భావనకు పెన్షన్‌దారులు గురయ్యారు. స్వయంగా బాధితుడైన నకారా, మరికొంతమంది పెన్షన్ బాధితులతో కలసి సుప్రీంకోర్టులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.వి చంద్రచూడ్ తోపాటు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, వాటి పూర్వాపరాలను పరిశీలించి 1982 డిసెంబర్ 17న చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించినది. అందులో- ‘పింఛను అనేది యజమాని ఇష్టాయిష్టాలతో, దయతో ఇచ్చే దానం కాదు. అది పింఛనుదారుని హక్కు; గతంలో ఉద్యోగిగా అతడు చేసిన సేవలను గుర్తించి చెల్లించేదే పింఛన్; ఉద్యోగి పదవీ విరమణ అనంతరం వృద్ధాప్య జీవితం సుఖసంతోషాలతో, గౌరవంతో సమాజంలో జీవించేందుకు చెల్లించేదిగా పింఛన్‌ను పరిగణించాలి; పింఛన్‌దారుడు స్వశక్తిపై ఆధారపడి జీవించడానికి కల్పించబడిన ఆర్థిక, న్యాయపరంగా ప్రభుత్వం తీసుకోవలసిన చర్య పింఛన్; కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఒక తేదీని ఎంచుకొని దానికి ముందు గాని, తరువాత గాని రిటైర్ అయిన వారిని విభజించి చూడటాన్ని భారత రాజ్యాంగ ఆర్టికల్ 14కి విరుద్ధం. నిర్ణీత తేదీకి ముందు రిటైర్ అయిన వారికి కూడా, ఆ తేదీ తరువాత రిటైర్ అయిన వారితో సమానంగా పెన్షన్ సవరణ లాభాలు ఇవ్వాలి; పెన్షనర్స్ అందరినీ ఒక తరగతిగా పరిగణించి ఒకే ఫార్ములాతో పెన్షనరీ ప్రయోజనాలు వర్తింపజేయాలి. పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు’ అనే ముఖ్యాంశాలున్నాయి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు జీతాల సవరణ జరిగినట్టుగా సామాజిక భద్రతగా చెల్లిస్తున్న పెన్షన్లకు కూడా వేతన సవరణల సందర్భంగా ఇచ్చే లాభాలను వర్తింప చేయడంతో వృద్ధాప్యంలో పెన్షనర్లు ప్రశాంత జీవనం గడపగలుగుతారు. వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పెన్షన్లలో పెరుగుదల సహాయంగా ఉంటుంది. ఇక నుండి వృద్ధులైన పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కేంద్రం తెచ్చిన పెన్షన్ ధృవీకరణ చట్టం రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరి మెడకు చుట్టుకుంటుంది. వాలిడేషన్ ఆఫ్ సిసిఎస్ (పెన్షన్) నిబంధనల చట్టం- 2025ని రద్దు చేయడంతోపాటు, ఎనిమిదో వేతన సవరణ కమిషన్ నిబంధనలను సవరించాలి. ఎన్‌పిఎస్/యుపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఒపిఎస్ విధానాన్ని అమలు చేయాలి. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ కాలాన్ని 11 ఏండ్ల మూడు నెలలకు తగ్గించాలి. 2017 జనవరి ఒకటి నుంచి జరగాల్సిన బిఎస్‌ఎన్‌ఎల్ , ఎంటిఎన్‌ఎల్ పెన్షనర్ల పెన్షన్ సవరణను వెంటనే చేపట్టాలి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసుల ప్రకారం పెన్షన్‌ను వెంటనే మంజూరు చేయాలి. ఇపిఎస్- 95 పెన్షనర్లకు కరువు భత్యంతో కూడిన కనీస పెన్షన్ నెలకు రూ. తొమ్మిది వేలు చెల్లించాలి. కోల్ మైన్ పెన్షనర్లకు కరువు భత్యంతో కూడిన కనీస పెన్షన్ నెలకు రూ. 15 వేలు చెల్లించాలి. పెన్షన్లకు కోతలు పెట్టే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెన్షనర్లతోపాటు,అఖిలభారత స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు సంఘటితమై దేశవ్యాప్తంగా సుదీర్ఘ సమరాన్ని సాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్, న్యూఢిల్లీ వారి పిలుపుమేరకు పెన్షన్‌కు కోతలు పెట్టే పెన్షన్ ధృవీకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మార్చి 25, 2026 నాడు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ఆందోళనకు పిలుపు నిచ్చింది. గత సంవత్సరం మార్చి 25 నాడు ఈ చట్టం ఆమోదం పొందిన నాడు నిరసన ప్రదర్శన నిర్వహించి, జిల్లా కలెక్టర్ల ద్వారా భారత ప్రధానికి వినతి పత్రాన్ని అందజేస్తున్నారు.

మన తెలంగాణ 25 Mar 2026 10:47 am

Attack |చమురు ట్యాంక్ పేలుడు.. మంటలు

Attack | చమురు ట్యాంక్ పేలుడు.. మంటలు Attack | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 25 Mar 2026 10:44 am

వృద్ధుల భద్రత దిశగా ముందడుగు

తెలంగాణలో కుటుంబ విలువలను కాపాడే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం ఆమోదించిన తల్లిదండ్రుల మద్దతు బిల్లు వృద్ధుల సంరక్షణను చట్టబద్ధ బాధ్యతగా మలుస్తోంది. వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితుల్లో కుటుంబ బంధాలు సడలుతున్న నేపథ్యంలో తీసుకున్న ఈ చర్య సమయోచితమనే చెప్పాలి. తల్లిదండ్రులపట్ల బాధ్యతను విస్మరించేవారికి కఠిన సందేశం ఇస్తూనే, వృద్ధుల గౌరవానికి భరోసా కల్పించే దిశగా ఈ బిల్లు ముందడుగుగా నిలుస్తోంది. భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ అనే సూత్రం శాశ్వతమైనది. కానీ ఆధునిక జీవనశైలిలో వేగంగా పెరుగుతున్న నగరీకరణ, వలసలు, వ్యక్తివాదం వంటి పరిణామాల నేపథ్యంలో కుటుంబ బంధాలు క్రమంగా సడలుతున్నాయి. ఈ మార్పుల ప్రభావం అత్యంత స్పష్టంగా కనిపిస్తున్న వర్గం వృద్ధులు. ఆర్థిక అసురక్షితత, ఆరోగ్య సమస్యలు, భావోద్వేగ ఒంటరితనం- ఇవి వారి దైనందిన వాస్తవాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో జనవరి 12, 2026న సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్టుగా, బడ్జెట్ సెషన్‌లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు కేంద్ర Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007ని రాష్ట్ర స్థాయిలో కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదించిన బిల్లు ప్రకారం, తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా రూ. 10,000 (ఏది తక్కువైతే అది) కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధానం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది -కుటుంబ బాధ్యతను విస్మరించడం సహించబోమని. ఇది నైతిక బాధ్యతను చట్టబద్ధ బాధ్యతగా మలచే ప్రయత్నంగా చెప్పాలి. అయితే ఈ బిల్లులో అత్యంత గమనార్హ అంశం-దాని అమలు విధానంలో ఉన్న సమతుల్యత. తల్లిదండ్రుల ఫిర్యాదు వచ్చిన వెంటనే శిక్ష విధించడం కాకుండా, సంబంధిత ఉన్నతాధికారుల సమగ్ర విచారణ అనంతరం మాత్రమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రశంసనీయం. కుటుంబ విభేదాలు అనేక కోణాల్లో ఉండే సందర్భంలో, ఒకపక్ష నిర్ణయాలకు తావు లేకుండా వ్యవస్థను రూపొందించడం పరిపక్వతకు నిదర్శనం. ఈ విధానం చట్ట దుర్వినియోగ అవకాశాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో అమల్లో ఉన్న వృద్ధులకు చట్టపరమైన రక్షణను అందిస్తున్నప్పటికీ, దాని అమలులో అనేక పరిమితులు ఉన్నాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు, ఆ చట్టాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేసే దిశగా ఒక పూరక చర్యగా నిలుస్తోంది. ముఖ్యంగా ప్రత్యక్ష ఆర్థిక మద్దతు విధానం, వృద్ధులకు తక్షణ ఉపశమనాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రివర్గం మొత్తం ఈ నిర్ణయాన్ని సమగ్రంగా పరిశీలించి ఆమోదించడం, కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక సమస్యలపై ఎంత సున్నితంగా స్పందిస్తోందో స్పష్టం చేస్తోంది. ఈ బిల్లుతోపాటు ఆమోదించిన హేట్ స్పీచ్ నిరోధక చట్టం, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం (4.2 లక్షల మందికి రిజిస్ట్రేషన్, సంక్షేమ బోర్డు)కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు భాగం. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు మాత్రమే కాకుండా సమాజం మొత్తానికి ఇది ఒక నైతిక హెచ్చరిక- బాధ్యతలను విస్మరించడాన్ని ప్రభుత్వం సహించదనే సందేశం. సామాజికంగా చూస్తే, ఈ నిర్ణయం ఒక హెచ్చరిక మాత్రమే కాదు ఒక అవగాహన పిలుపు. కుటుంబ విలువలను చట్టం ద్వారా కాపాడే ప్రయత్నం అరుదైనదే అయినప్పటికీ, అవసరమైనదిగా మారింది. పాఠశాల స్థాయి నుంచి సమాజం వరకు వృద్ధులపట్ల గౌరవాన్ని పెంపొందించే చర్యలు కూడా సమాంతరంగా సాగాల్సిన అవసరం ఉంది. చట్టం కేవలం నియంత్రణ సాధనం మాత్రమే కానీ విలువల మార్పు అవగాహన ద్వారానే సాధ్యం. అయితే, ఈ బిల్లును అమలు చేసే ప్రక్రియలో సవాళ్లు లేవని చెప్పలేం. తల్లిదండ్రులను ఆదరించడం లేదనే అంశాన్ని కొలిచే ప్రమాణాలు స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సంబంధాలు స్వభావత: సంక్లిష్టమైనవి. ఆర్థిక సహాయం ఉన్నా భావోద్వేగ దూరం ఉండవచ్చు; లేదా వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వ్యవస్థ ఎలా స్పందిస్తుంది అన్నది కీలకం. అలాగే ప్రైవేటు రంగంలో వేతనాల నుంచి కోత విధించే విధానం చట్టపరంగా, సాంకేతికంగా స్పష్టత అవసరం. ఇంకా ఒక కోణంలో చూస్తే, ఈ బిల్లు సామాజిక భద్రతా వ్యవస్థలో ఉన్న లోటును కూడా ప్రతిబింబిస్తుంది. వృద్ధులు పూర్తిగా పిల్లలపై ఆధారపడకుండా ఉండేలా పింఛన్‌లు, ఆరోగ్య భద్రత, వృద్ధాశ్రమాలు వంటి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన చర్యలు మరింత విస్తరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి బలమైన భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తోంది. పింఛన్ పథకాలు, ఆరోగ్య సేవలు, ‘ఇందిరమ్మ లైఫ్ ఇన్సూరెన్స్’ వంటి కార్యక్రమాలు కుటుంబాలపై ఒత్తిడి తగ్గించి, పరస్పర గౌరవం పెంచుతాయి. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం సామాజిక భద్రతా లోటును పూర్తి చేస్తూ, ‘ఇందిరమ్మ రాజ్యం’ స్ఫూర్తిని భావనాత్మకంగా అమలు చేస్తోంది. మొత్తానికి, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇందిరమ్మ రాజ్యం స్ఫూర్తిని ప్రతిబింబించే సంస్కరణ. ఇది కేవలం చట్టపరమైన మార్పు కాదు సామాజిక విలువలను పునరుద్ధరించే ఉద్యమం. సరైన అమలు, ప్రజల సహకారం ఉంటే, ఈ పథకం దేశానికి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. చివరగా ఒక స్పష్టమైన సందేశం ‘తల్లిదండ్రులను చూసుకోవడం కేవలం బాధ్యత కాదు, అది మన సంస్కృతి’. ఆ విలువలను కాపాడేందుకు ప్రభుత్వం ముందడుగు వేయగా, ప్రతి పౌరుడు కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. అమరవాజీ నాగరాజు (టిపిసిసి చీఫ్ పిఆర్‌ఒ)

మన తెలంగాణ 25 Mar 2026 10:43 am

తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలిన ఎమ్మెల్యే

తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలిన ఎమ్మెల్యే కోడూరు – ఆంధ్రప్రభ : ఆలీవ్

ప్రభ న్యూస్ 25 Mar 2026 10:41 am

స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీధర్

స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో

ప్రభ న్యూస్ 25 Mar 2026 10:39 am

AP |ఘోర రోడ్డు ప్రమాదం..

AP | ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రవేట్ ట్రావెల్ బస్సు టైర్ పెలి

ప్రభ న్యూస్ 25 Mar 2026 10:37 am

543 Seats |ప్రజలపై మరింత భారం…

543 Seats | ప్రజలపై మరింత భారం… 543 Seats | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 25 Mar 2026 10:28 am

మహిళ రైలు ఎక్కుతుంటే..

మహిళ రైలు ఎక్కుతుంటే.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫార్మ్

ప్రభ న్యూస్ 25 Mar 2026 10:26 am

Andhra Pradesh : విజయవాడలో ఉగ్రమూలాలు.. జనం మధ్యలోనే ఉంటూ?

ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రమూలాలు కలకలం రేపుతున్నాయి

తెలుగు పోస్ట్ 25 Mar 2026 10:17 am

కర్నూల్ లో యువకుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టి

అమరావతి: ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. ఎర్రకోట గ్రామ శివారులో జిన్నింగ్ మిల్లు సమీపంలో పొలంలో కాలిపోయిన మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన వ్యక్తి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ కాల్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. అక్రమ సంబంధాలు లేక పాత కక్షల నేపథ్యంలో హత్యలు చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం ఎవరిదో తెలిస్తే నిందితులను త్వరంగా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు. 

మన తెలంగాణ 25 Mar 2026 10:17 am

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్..

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 25 Mar 2026 10:16 am

నేడు జీవన్ రెడ్డి రాజీనామా

నేడు జగిత్యాల సీనియర్ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నారు

తెలుగు పోస్ట్ 25 Mar 2026 10:11 am

గ్యాస్ బుకింగ్ లో నిబంధనలు కఠినం

సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ను మరింత ఆయిల్‌ కంపెనీలు కఠినతరం చేశాయి

తెలుగు పోస్ట్ 25 Mar 2026 10:05 am

నిరుపేదల పక్షపాతి సురవరం

అసాధారణ మేధస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి, రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణశీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం మొదలైన లక్షణాలన్నింటిని తనలో మూర్తీభవింపజేసుకొని అపురూప మార్క్సిస్ట్ మేధావిగా రూపుదిద్దుకున్న ‘ఆదర్శ కమ్యూనిస్టు’ కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి. ఆయన ఒక సాధారణ కార్యకర్త నుండి అంచెలంచెలుగా ఎదిగి, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, నవచరిత్రని సృష్టించి, మేరు శిఖరంగా నిలిచారు. ‘మార్క్సిజం వెలుగులో ఎర్రజెండా నీడ’లో అంతిమ శ్వాస వరకు ఎత్తిన జెండా దించకుండా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఒకే పార్టీలో కొనసాగి ఎందరికో ఆదర్శప్రాయుడుగా నిలిచారు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలోనే కాకుండా అంతర్జాతీయం గాను కూడా ఆయన అనేక ప్రజాపోరాటాలలో గొంతులేనివారి గొంతుకగా ఉద్యమించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోడేరు మండలంలో గల కొండ్రావుపల్లి గ్రామంలో సురవరం వెంకట్రామిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు 1942 మార్చి 25 నాడు ప్రథమ సంతానంగా జన్మించిన సురవరం సుధాకర్‌రెడ్డి తండ్రి నుండి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్నారు. గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు, పెదనాన్న అయిన సురవరం ప్రతాపరెడ్డి కొనసాగించిన సాంస్కృతిక ఉద్యమ ఆదర్శాలను ఆయన అనుసరించారు. స్వగ్రామమైన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి మండలం కంచుపాడుపై ఉన్న మమకారంతో ఆయన తన తండ్రి వెంకట్రామిరెడ్డి పేరు మీద విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎందరినో విజ్ఞానవంతులుగాను, ఆదర్శవంతులుగాను తీర్చిదిద్దారు. సురవరం సుధాకర్‌రెడ్డి చిన్ననాటి నుండి ఆదర్శ భావాలతో నడుచుకునేవారు. విద్యార్థి - యువజన నాయకుడిగా ఆయన అనేక సమస్యల పరిష్కారాల కోసం ఉద్యమించి క్రమంగా భారత కమ్యునిస్టు పార్టీలో చేరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి రెండుసార్లు నల్గొండ నుండి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారాల కోసం ప్రజాగొంతుకగా నినదించారు. సురవరం సుధాకర్‌రెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడుసార్లు ఎన్నికై సరికొత్త చరిత్రను సృష్టించారు. చండ్రరాజేశ్వర రావు తరువాత సి.పి.ఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం సుధాకర్‌రెడ్డి చరిత్ర సృష్టించారు. ఆయన పార్లమెంట్ సభ్యులుగా కొనసాగిననూ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిననూ కూడా తనను అతి సామాన్యమైన వ్యక్తిగానే భావించుకున్నారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సురవరం సుధాకర్‌రెడ్డి తొలిసారిగా కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో మిగులు భూములపై భూపోరాటంలో పాల్గొన్నారు. క్రమంగా ఆయన అనేక జిల్లాలో అనేక భూపోరాటాలలో పాల్గొని పేదలకు అండగా నిలిచారు. విద్యుత్ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పెట్టుబడిదారీ -సామ్రాజ్యవాద విధానాలను సురవరం సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ప్రతిఘటించారు. అలాగే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన లౌకిక ప్రజాతంత్ర ఉద్యమాల ద్వారా తీవ్రంగా నిరసించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అనారోగ్యంతో ఉన్నా కూడా అంతిమ శ్వాస దాకా పార్టీ ఆశయాల కోసం ఆయన పరితపించారు. ఆదర్శాలు చెప్పడం వేరు. ఆ ఆదర్శాలను కడదాకా ఆచరించి ఆదర్శంగా నిలవడం వేరు. ముఖ్యంగా ‘తాము ఆదర్శ కమ్యూనిస్టులం’ అని గొప్పలు చెప్పుకుంటూనే పెట్టుబడిదారీ లక్షణాలను ప్రదర్శిస్తూ ప్రజలను మభ్యపెడుతున్న వారెందరో ఉన్నారు. కాని వారిలో ఆదర్శ కమ్యూనిస్టు లక్షణాలు ఏ ఒక్కటి కూడా లేకపోవడం చాలా సృష్టంగా తేటతెల్లం అవుతూనే ఉంటుంది. కాని కొందరు కమ్యూనిస్టులు మాత్రమే ఆ ఆదర్శాలను కడదాకా ఆచరించి భావి సమాజానికి ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. ఆ కోవలోనే సురవరం సుధాకర్‌రెడ్డి ‘ఆదర్శ కమ్యూనిస్టు’ గాను నిలిచారు. సురవరం సుధాకర్‌రెడ్డి తన జీవితాన్ని మొత్తం కష్టజీవులకు అంకితం చేసి వారి కష్టాలతో సహవాసం చేశారు. ‘అసమానతలు లేని సమాజం ఆవిష్కరింపబడాలి’ అని ఆయన బలంగా ఆకాంక్షించారు. ఆ ఆశయ సాధన కోసమే ఆయన అనుక్షణం ఆరాటపడేవారు. ఆయన అనేక సవాళ్లను అధిగమించి సాధారణస్థాయి నుండి ఉన్నత స్థానానికి ఎదిగిననూ కూడా అతి సాధారణ జీవితాన్ని గడిపి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు. పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్రవేసిన సురవరం సుధాకర్‌రెడ్డి 2025 ఆగస్టు 22 నాడు మరణించారు. ఆయన మరణించిననూ నిప్పురవ్వలై ఎగిసే ప్రతి ప్రజా పోరాటంలోనూ ఆయన ‘ఉదయించే సూర్యుడు’లా వెలుగుచూస్తూనే ఉన్నారు. ఆయన మరణం కష్టజీవులకు, భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ఆయన కోరిక మేరకు పరిశోధనల నిమిత్తం పార్ధీవ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి దానం చేయడం తద్వారా ఆయన చావు అనంతరం కూడా ప్రజాసేవకు అంకితం చేయబడడాన్ని సమున్నతంగా ఎత్తిపడుతుంది. చివరి క్షణం వరకు తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు సాగిన సురవరం సుధాకర్‌రెడ్డి ఎందరికో ఆదర్శప్రాయుడుగా నిలిచి భారత కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించుకున్నారు. అంతిమంగా చండ్ర రాజేశ్వరరావు అడుగుజాడలలో పురోగమించిన సురవరం సుధాకర్‌రెడ్డి భావితరాలకు ‘ఆదర్శ కమ్యూనిస్టు’ గాను వెలుగొందుతూనే ఉంటారు. (నేడు సురవరం సుధాకర్‌రెడ్డి జయంతి) జె.జె.సి.పి. బాబూరావు  

మన తెలంగాణ 25 Mar 2026 10:03 am

ഫാക്ട് ചെക്ക്: ഇറാൻ യുദ്ധത്തിന് ബ്രിട്ടിഷ് അന്തർവാഹിനി? പ്രചാരണം വ്യാജം

ആണവ അന്തർവാഹിനിയായ എച്ചഎംഎസ് ആൻസൺ അറബിക്കടലിലെത്തിയെന്നാണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 25 Mar 2026 10:02 am

Fact-check: Viral claim that Sanju Samson was appointed DSP in Kerala Police is false

Authorities confirmed that the circulating claim is false and that no such appointment announcement has been made so far

తెలుగు పోస్ట్ 25 Mar 2026 9:59 am

పశ్చిమాసియా సంక్షోభంపై నేడు అఖిలపక్ష సమావేశం

పశ్చిమాసియా సంక్షోభంపై నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది

తెలుగు పోస్ట్ 25 Mar 2026 9:58 am

రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు హామీని నిలబెట్టుకోవాలి..

రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు హామీని నిలబెట్టుకోవాలి.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో

ప్రభ న్యూస్ 25 Mar 2026 9:58 am

ఇషాన్ కిషన్‌కు సవాల్..

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026కి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. మాజీ విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మార్చి 28న జరిగే మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమవుతోంది. కాగా, ఆరంభ మ్యాచ్‌లకు రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం కావడంతో అతని స్థానంలో భారత యువ సంచలనం ఇషాన్ కిషన్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించారు. కమిన్స్ గెర్హాజరీలో ఇషాన్ జట్టును నడిపించనున్నాడు. అయితే విపరీత పోటీ ఉండే ఐపిఎల్‌లో జట్టును ముందుండి నడిపించడం అనుకున్నంత తేలికేం కాదు. కమిన్స్‌తో పోల్చితే ఇషాన్ అనుభవం అంతంత మాత్రమే. ఇలాంటి స్థితిలో ఇషాన్ తన బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ తన నాయకత్వం ప్రతిభతో జార్ఖండ్‌ను విజేతగా నిలిపాడు. బ్యాట్‌తో ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేయి పోయాడు. అంతేగాక సారథిగా కూడా సత్తా చాటాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సన్‌రైజర్స్ యాజమాన్యం ఇషాన్‌ను కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగే ఐపిఎల్‌లో జట్టును విజయపథంలో నడిపించడం చాలా కష్టంతో కూడుకున్నఅంశం. కానీ ఇషాన్ మాత్రం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న హైదరాబాద్ ఈసారి భారీ ఆశలతో బరిలోకి దిగనుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, లివింగ్‌స్టోన్ వంటి స్టార్ ఆటగాళ్లు సన్‌రైజర్స్ టీమ్‌లో ఉన్నారు. దీంతో హైదరాబాద్ కూడా ఐపిఎల్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

మన తెలంగాణ 25 Mar 2026 9:56 am

Union Cabinet : నేడు కేంద్ర కేబినెట్‌ భేటీ

నేడు కేంద్ర కేబినెట్‌ భేటీ జరగనుంది

తెలుగు పోస్ట్ 25 Mar 2026 9:47 am

రోడ్ ప్రమాదాల నివారణ కోసం..

రోడ్ ప్రమాదాల నివారణ కోసం.. హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హన్మకొండ, కరీంనగర్

ప్రభ న్యూస్ 25 Mar 2026 9:46 am

నేడు గుంటూరుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు

నేడు గుంటూరుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు

తెలుగు పోస్ట్ 25 Mar 2026 9:41 am

Gold Prices Today : పతనమవుతున్న బంగారం.. నేలచూపులు చూస్తున్న వెండి

. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

తెలుగు పోస్ట్ 25 Mar 2026 9:35 am

నేడు గుంటూరుకు గురు శిష్యులు..

నేడు గుంటూరుకు గురు శిష్యులు.. విజయవాడ, ఆంధ్రప్రభ : గుంటూరులో నేడు రాజకీయ–సామాజిక

ప్రభ న్యూస్ 25 Mar 2026 9:35 am

జిల్లాలో పండుగ వాతావరణం..

జిల్లాలో పండుగ వాతావరణం.. రాప్తాడు, ఆంధ్రప్రభ : జిల్లాలోని పేద కుటుంబాలకు, విద్యార్థులకు,

ప్రభ న్యూస్ 25 Mar 2026 9:14 am

Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో తెలిస్తే?

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 25 Mar 2026 9:13 am

ఎండిపోయిన చెట్టు.. పరిశీలిస్తున్న అధికారులు..

ఎండిపోయిన చెట్టు.. పరిశీలిస్తున్న అధికారులు.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని

ప్రభ న్యూస్ 25 Mar 2026 9:06 am

అర్ధరాత్రి మొరం తవ్వకాలు.. చేస్తుంది ఎవరు..?

అర్ధరాత్రి మొరం తవ్వకాలు.. చేస్తుంది ఎవరు..? బోధన్, ఆంధ్రప్రభ : కఠిన నిబంధనలు

ప్రభ న్యూస్ 25 Mar 2026 8:56 am

పెద్ది షూటింగ్ లో గాయపడిన రామ్ చరణ్

హైదరాబాద్: పెద్ది సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తన్నారు. ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. చరణ్‌కు జోడిగా హీరోయిన్ జాన్వీకపూర్ నటిస్తున్నారు. స్పెషల్ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ మెరువనున్నారు. రామచ్ చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్రయత్నిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలనే లక్షంతో షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్ గాయపడినట్టు తెలుస్తోంది. కంటికి దెబ్బతగిలినట్టు సమాచారం. ఇది చిన్న గాయమేనని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారు. దీంతో పెద్ది సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్, బోమన్ ఇరానీ, దివ్వేందు తదితరలు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి రెండు పాటలు విడుదల చేయడంతో యూ ట్యూబ్‌లో ట్రెండ్‌లోకి వచ్చాయి. 

మన తెలంగాణ 25 Mar 2026 8:55 am

Road Accident : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 25 Mar 2026 8:51 am

ఇది ప్రజాపాలన కాదు.. ప్రజావ్యతిరేక పాలన..

ఇది ప్రజాపాలన కాదు.. ప్రజావ్యతిరేక పాలన.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రభ న్యూస్ 25 Mar 2026 8:49 am

పెద్దిరెడ్డి కంపెనీకి సుప్రీంకోర్టులో దక్కని ఊరట

వైసీపీ నేత పెద్దిరెడ్డి కంపెనీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు

తెలుగు పోస్ట్ 25 Mar 2026 8:45 am

విలీనం చేయకుంటే సమ్మె చేస్తాం..

విలీనం చేయకుంటే సమ్మె చేస్తాం.. నర్సంపేట, ఆంధ్రప్రభ : ప్రజా పాలన కాంగ్రెస్

ప్రభ న్యూస్ 25 Mar 2026 8:40 am

నేడు ఎమ్మెల్యేల అనర్హత పై బీఆర్ఎస్ పిటీషన్ పై

పార్టీ పిరాయింపుల ఎమ్మెల్యే లపై స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడంతో మరోసారి బిఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది

తెలుగు పోస్ట్ 25 Mar 2026 8:38 am

చందనోత్సవం ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

సింహాచలంలో జరగనున్న చందనోత్సవం ఏర్పాట్లపై మంత్రి డీఎస్‌బీవీ స్వామి సమీక్ష నిర్వహించారు.

తెలుగు పోస్ట్ 25 Mar 2026 8:32 am

High Court offers a Relief for Pawan Kalyan

Tollywood actor and AP Deputy Chief Minister Pawan Kalyan has been balancing his political and film career. The actor-turned-politician is focused on AP politics after he completed his shoots. A petition has been filed in the AP High Court restricting Pawan Kalyan from acting in films. The High Court has dismissed the petition and made […] The post High Court offers a Relief for Pawan Kalyan appeared first on Telugu360 .

తెలుగు 360 25 Mar 2026 8:19 am

Hyderabad : హైదరాబాద్ లో పెట్రోలు కోసం పడిగాపులు

హైదరాబాద్‌లో బంకుల వద్ద భారీగా వినియోగదారులు భారీగా బారులు తీరారు

తెలుగు పోస్ట్ 25 Mar 2026 8:19 am

విజయవాడలో టెర్రర్ లింక్స్..... సంచలన నిజాలు వెలుగులోకి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మొత్తం 12 మంది పాత్ర ఉన్నట్టు ఐజి ఎస్ ఎస్ త్రిపాటి వెల్లడించారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా రెండు గ్రూపులు ఐక్యూఐఎస్, ఐసిస్ పేర్లతో నిందితులు గ్రూపు ఏర్పాటు చేసుకొని తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఒక గ్రూపులో ఐదుగురు మరో గ్రూపులో ఏడుగురు సభ్యులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళంతా ఒక గ్రూప్ గా ఏర్పడి పోస్టింగ్స్ పెడుతున్నట్లుగా తెలియజేశారు. ముగ్గురు నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు,ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని,  తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించడంతో పాటు యువతను ఆకర్షించడమే వీరి లక్ష్యామని తెలియజేశారు. ఈరోజు అరెస్టయిన ముగ్గురు విజయవాడకు చెందిన వాళ్ళేనని, ప్రస్తుతం ఆయా గ్రూపులలో ఉన్న వాళ్ళంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళే ఉన్నారని, డబ్బుల కోసం పని చేస్తున్నారా లేక మరేదైనా కారణం చేత పని చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాయి త్వరలోనే మిగిలిన వారిని అదుపులోకి తీసుకుంటామని ఐజి  స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 25 Mar 2026 8:15 am