SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

Pallichattambi Thrilling and Intriguing teaser presents Tovino Thomas in new avatar

“Pallichattambi” is a big-budget film starring Malayalam star Tovino Thomas. The film is being produced by Noufal, Brijeesh, and Chanukya, Chaitanya, Charan under the banners of Worldwide Films and C Cube Bros Entertainments. It is directed by Dijo Jose Antony, with Kayadu Lohar playing the female lead. The movie has generated huge expectations at a […] The post Pallichattambi Thrilling and Intriguing teaser presents Tovino Thomas in new avatar appeared first on Telugu360 .

తెలుగు 360 24 Mar 2026 11:29 am

కుల గణనతోనే గిరిజనులకు అధికార భాగస్యామ్యం

గిరిజన హక్కుల్ని కాలరాయడానికే ‘వనవాసి’ పదం‘ఆదివాసి అధికార్ సంవిధాన్ సమ్మేళన’లో రాహుల్ గాంధీ వడోదరా: దేశంలో కుల గణన జరిగితే…గిరిజనులకు అధికారం, సంపదలో భాగస్వామ్యం లభిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్‌లోని వడోదరాలో సోమవారం జరిగిన ‘ఆదివాసి అధికార్ సంవిధాన్ సమ్మేళన’లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. వేదికపై గిరిజనుల సాంప్రదాయ విల్లంబులను ఎక్కు పెట్టారు. బీజేపీ, ఆరఎసఎస్‌లు గిరిజనులను ‘వనవాసి’ అని పిలవడాన్ని రాహుల్ ఖండించారు. అనిదిగా…జలాలు, […] The post కుల గణనతోనే గిరిజనులకు అధికార భాగస్యామ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Mar 2026 11:28 am

BRS |గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో ఆందోళన

BRS | గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో ఆందోళన BRS | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:27 am

Atrocious |భార్య, ప్రియుడిని కాల్చి చంపిన భర్త

Atrocious | భార్య, ప్రియుడిని కాల్చి చంపిన భర్త Atrocious |ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:23 am

కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం.. 66 మంది దుర్మరణం

కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కొలంబియన్ వైమానిక దళానికి చెందిన ఓ విమానం ఈక్వెడార్ సరిహద్దు సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 66 మంది సిబ్బంది, ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సైనిక సిబ్బందితో పాటు వారి కుటుంబసభ్యులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 120 మంది ఉన్నారని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు పలువురిని కాపాడినట్లు తెలుస్తోంది.విమానం […] The post కొలంబియాలో కుప్పకూలిన సైనిక విమానం.. 66 మంది దుర్మరణం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Mar 2026 11:21 am

Aditya dhar |అసలు ప్లాన్ ఏంటి..?

Aditya dhar | అసలు ప్లాన్ ఏంటి..? Aditya dhar | ధురంధర్

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:20 am

Mallareddy |నా నియోజకవర్గాన్ని నిర్లక్షం చేయొద్దు

Mallareddy | నా నియోజకవర్గాన్ని నిర్లక్షం చేయొద్దు Mallareddy | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:16 am

Telangana : గ్యాస్ కొరత పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ఎల్.పి.జి గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 24 Mar 2026 11:15 am

Telangana | 13మందికి గాయాలు

Telangana | 13మందికి గాయాలు Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:07 am

Attacks |అసిస్టెంట్ ఎంవీఐ ఇంట్లో తనిఖీలు

Attacks | అసిస్టెంట్ ఎంవీఐ ఇంట్లో తనిఖీలు Attacks | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:00 am

AP |పైపుల గోదాంలో అగ్నికీలలు..

AP | పైపుల గోదాంలో అగ్నికీలలు.. AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 24 Mar 2026 10:55 am

బీఆర్ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టు..

బీఆర్ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టు.. నిజాంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో

ప్రభ న్యూస్ 24 Mar 2026 10:48 am

Election |ఈ రోజు.. ఆంధ్రప్రభలో.. ప్రత్యేక కథనం..

Election | ఈ రోజు.. ఆంధ్రప్రభలో.. ప్రత్యేక కథనం.. Election | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 24 Mar 2026 10:44 am

యూరియాపై పశ్చిమాసియా ప్రభావం

రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి యూరియా నిల్వలు తగినంతగా ఉన్నాయని, వ్యవసాయానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పరిస్థితులు అనూహ్యంగా ఉంటున్నాయి. మార్చి 10 నాటికి భారత్‌లో యూరియా నిల్వలు 61.5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉన్నాయని, అంటే గత ఏడాది ఇదే సమయంలో ఉండే నిల్వల కన్నా 10 లక్షల టన్నుల వరకు అధికంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ వాణిజ్యాన్ని అల్లకల్లోలం చేస్తోం ది. ఈ సంక్షోభం వ్యవసాయానికి ప్రధాన అవసరమైన యూరియా తయారీకి కావలసిన లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ (ద్రవీకృత సహజవాయువుఎల్‌ఎన్‌జి) సరపరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యుద్ధం ప్రకంపనలు ఇప్పటికే భారత్ యూరియా సరఫరాను దెబ్బతీస్తున్నాయి. ఆదివారం (మార్చి 22) నాటికి భారత్ లోని యూరియా ప్లాంట్లు సగం సామర్థంతో నడుస్తున్న పరిస్థితి ఏర్పడింది. కొన్ని యూరియా కంపెనీలు ప్లాంట్లను మూసివేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్ అతిపెద్ద ఎల్‌ఎన్‌జి దిగుమతిదారైన పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి సంస్థ ఖతార్ నుండి దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా గ్యాస్ సరఫరాను నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. ఇటీవల ఖతార్‌లోని రాస్‌లాఫాన్‌లో యుద్ధంవల్ల గ్యాస్ సరఫరా వ్యవస్థకు నష్టం జరగడంతో ఒప్పందం ప్రకారం సరఫరా చేయలేనని పెట్రోనెట్ చేతులుఎత్తేసింది. ఈ చర్య కేంద్ర ప్రభుత్వ యాజమాన్యం లోని గెయిల్ (ఇండియా), ఇండియా ఆయిల్ కార్పొరేషన్ సంస్థ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి గ్యాస్ పంపిణీదారుల ద్వారా సరఫరా కోతకు దారి తీసింది. ఎల్‌ఎన్‌జి సరఫరా కోసం భారత్ భారీగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. భారత్ రోజూ 4.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును, అంటే తన అవసరాల్లో 88%, అలాగే 47% సహజవాయు డిమాండ్ కోసం ద్రవీకృత సహజవాయువును విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్‌లో యూరియా ధరలు పెరగడమే కాకుండా ఎరువులపై భారత ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలపై కూడా ప్రభావంపడే అవకాశం కనిపిస్తోంది. యూరియా కొరతవల్ల వ్యవసాయ ఉత్పాదక ఖర్చులు పెరగడమే కాకుండా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. 2025లో అంతర్జాతీయ మార్కెట్ నుంచి 50% పైగా సహజవాయువు (ఎల్‌ఎన్‌జి)ను భారత్ దిగుమతి చేసుకుంది. ప్రపంచం మొత్తంమీద భారీస్థాయిలో ఎల్‌ఎన్‌జి నాలుగో కొనుగోలుదారు భారత్‌యే. 2025లో 261 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జిని భారత్ దిగుమతి చేసుకుంది. ఇందులో 40% ఖతార్ నుంచి మిగతా 20% యుఎఇ, ఒమన్ ద్వారా సరఫరా అవుతుంది. ఈ ఎల్‌ఎన్‌జి అంతా హోర్ముజ్ జలసంధి ద్వారానే నౌకల మీదుగా రవాణా అవుతుంది. మొత్తం మీద భారత్ దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జి 60% వరకు హోర్ముజ్ జలసంధి మూసివేయడంవల్ల అంతరాయం ఏర్పడుతోంది. భారత్‌లో అమోనియా తయారీకి తద్వారా ఎరువుల తయారీకి ప్రధానంగా సహజవాయువునే వినియోగిస్తుంటారు. 2026లో భారత్‌కు సరఫరా అయిన ఎల్‌ఎన్‌జిలో 30% ఎరువుల తయారీకే వినియోగం కావడం గమనార్హం. యూరియా ఉత్పత్తికి ఎల్‌ఎన్‌జి ప్రధాన వనరు. దేశంలో ఎరువులుగా యూరియానే ఎక్కువగా వాడుతుంటారు. యూరియా ఉత్పత్తి అత్యంత ఇంధన వినియోగతో కూడిన ప్రక్రియ. ఈ యూరియా ప్లాంట్లు తక్కువ ఉద్గారాలను విడుదల చేసే సహజవాయువు వినియోగంలోకి మారాయి. జాతీయ స్థాయిలో యూరియా వినియోగం గత దశాబ్దకాలంలో క్రమంగా పెరిగి 2025లో 387 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. 2025లో స్వదేశీ యూరియా ఉత్పత్తి కూడా దాదాపు 306 లక్షల మెట్రిక్ టన్నుల వరకు జరిగినా దేశం మొత్తం మీద డిమాండ్‌ను నెరవేర్చలేకపోతోంది. అందువల్ల భారత్ యూరియా దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం స్వదేశీ యూరియా ఉత్పత్తిని, సరఫరాను దెబ్బతీస్తోంది.2025లో భారత్ యూరియా దిగుమతులు 2300 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉన్నాయి. ఈ దిగుమతుల్లో 71% పశ్చిమాసియా నుంచి రావలసి ఉండగా, ఇందులో 45% ఒమన్, సౌదీఅరేబియా, ఖతార్, యుఎఇ నుంచి సరఫరా అవుతుంటాయి. ఈ మొత్తం సరఫరా హోర్ముజ్ జలసంధిద్వారా రవాణా కావలసి ఉంది. ఈ నేపథ్యంలో సహజవాయువు సరఫరా నియంత్రణ ఉత్తర్వు 2026ను భారత ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో ఎరువుల రంగాన్ని ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. రెండు మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పుడు కూడా ఇంధనం, ఎరువుల సరఫరా విషయంలో కూడా భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఎరువుల తయారీకి ప్రాధాన్యం ఇచ్చి స్వదేశీయంగా సబ్సిడీ ధరకు గ్యాస్ లభిస్తేనే ఎరువులు ఉత్పత్తి అవుతాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా పొటాష్ సరఫరా దెబ్బతింది. ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే యూరియాలో 14% ఒక్క రష్యా నుంచే సరఫరా అవుతోంది. డిఎపిలో రష్యా సరఫరా దాదాపు 10% వాటాతో రెండో ఉత్పత్తిదారుగా రష్యా ఉంటోం ది. పొటాష్‌లో కావలసినవి 50% రష్యా, బెలారస్ నుంచే రప్పించుకోక తప్పదు. భారత్ డిఎపి డిమాండ్‌లో దాదాపు 60% చైనా, సౌదీఅరేబియా నుంచే లభిస్తోంది. ఇప్పుడు సౌదీఅరేబియా కూడా యుద్ధ బాధిత దేశంగా ఉండడంతో డిఎపి సరఫరా దెబ్బతింటోంది. భారతదేశానికి సరఫరాలో ఇబ్బందులే కాకుండా దిగుమతుల వ్యయం బిల్లుకూడా అమాంతంగా పెరిగే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని వాణిజ్యవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.  

మన తెలంగాణ 24 Mar 2026 10:43 am

బెంగాల్‌లో గెలుపు ఎవరిది?

2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఇప్పటికీ ఆ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గట్టిగానే కనిపిస్తోంది. అయితే అది కేవలం గతం జ్ఞాపకంగా నిలిచిపోలేదు; 2026 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అది మారుతూ, మరింత స్పష్టమైన సూచనగా కనిపిస్తోంది. ఒకప్పుడు అనేక పార్టీల మధ్య జరిగిన పోటీ, గత దశాబ్దంలో క్రమంగా కుదించుకుపోయి, ఇప్పుడు ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య ద్వైపాక్షిక పోరాటంగా మారింది. ఇదే సమయంలో వామపక్షాలు తమ రాజకీయ ప్రాధాన్యాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, వాటి విజయాలు పరిమితంగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఎవరు ముందుంటారు అనేది మాత్రమే కాదు; 2021లో ఏర్పడిన రాజకీయ సమతుల్యత స్థిరమా లేక సున్నితమైనదా అనేదే కీలకం. 2021 ఎన్నికల ఫలితం చూస్తే అది స్పష్టమైన విజయం. మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి మూడింట రెండు వంతుకుపైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని, దాదాపు సగం ఓట్లను సంపాదించింది. అయితే ఆ విజయంలో ఒక ముఖ్యమైన మార్పు కూడా దాగి ఉంది. బిజెపి అట్టడుగు స్థాయినుంచి ఎదిగి, ఒక బలమైన ప్రతిపక్షంగా మారింది. దాదాపు ఐదో వంతులో రెండో వంతు ఓట్లను సంపాదించి, వామపక్ష, కాంగ్రెస్ కూటమిని పక్కకు నెట్టింది. ఈ మార్పు ప్రాధాన్యం చాలా గొప్పది. ఎన్నాళ్లుగా సిద్ధాంతపరమైన పోటీలు, వర్గాల పొత్తు రాజకీయాలతో సాగిన బెంగాల్ రాజకీయాలు, ఇప్పుడు రెండు వేర్వేరు రాజకీయ విధానాలను ప్రతిబింబించే పార్టీల మధ్య నేరుగా, స్పష్టమైన పోటీగా మారాయి. ఒకటి ప్రాంతీయ ఆధిపత్యం, సంక్షేమ కార్యక్రమాలపై ఆధారపడితే, మరొకటి జాతీయ ఏకీకరణ, గుర్తింపు రాజకీయాలపై దృష్టి పెట్టింది. ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా, టిఎంసి ఆధిపత్యం ఎంతకాలం నిలబడుతుందన్నది. ‘కొనసాగింపు, అలసట’ అనే రెండు అంశాల మధ్య జరుగుతున్న సంక్లిష్ట సమతుల్యతపై ఆధారపడి ఉంది. పార్టీకి ఉన్న ప్రధాన బలం దాని బలమైన సంస్థాగత వ్యవస్థ, అలాగే సంక్షేమ పథకాల ద్వారా ఓటర్ల విశ్వాసాన్ని సంపాదించే సామర్థ్యం. మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాలను లక్ష్యంగా పెట్టుకున్న పథకాలు, స్థిరమైన సామాజిక మద్దతును ఏర్పరచాయి. ఇప్పటివరకు ఈ మద్దతు, ప్రభుత్వ వ్యతిరేక భావన, తీవ్రమైన రాజకీయ ప్రచారాలను కూడా తట్టుకుని నిలిచింది. అంతేకాదు, మమతా బెనర్జీ వ్యక్తిగత ప్రజాదరణ కూడా పార్టీకి కీలక బలం. ఆమె నాయకత్వం పార్టీ కథనాన్ని బలపరచడమే కాకుండా, అంతర్గత విభజనలను తగ్గించడంలో సహాయపడుతోంది. అయితే, అధికారంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల అసంతృప్తి సహజంగానే పెరుగుతుంది. అవినీతి ఆరోపణలు, పార్టీలో వర్గపోరాటాలు, స్థానిక స్థాయిలో కార్యకర్తలలో ఉన్న అసహనం-- ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేక భావనకు దారితీశాయి. ఇవి తాత్కాలిక సమస్యలుగా కొట్టిపారేయలేనివి. ఈ బలహీనతలను టిఎంసి నాయకత్వం గుర్తించినట్లే కనిపిస్తోంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేయడం, కొత్త తరాన్ని ముందుకు తీసుకురావడం వంటి చర్యలను చేపడుతోంది. అయితే ఇవి ఎంతవరకు ప్రభుత్వ వ్యతిరేక భావనను తగ్గిస్తాయన్నది కీలక అంశంగా మారనుంది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ ప్రదర్శన, దాని స్థిరత్వాన్ని సూచించినప్పటికీ, అత్యంత కీలకమైన అసెంబ్లీ పోటీలో పార్టీ పట్టు కోల్పోయే అవకాశాన్ని ఇవి పూర్తి తొలగించలేవు. బిజెపికి ఎదురయ్యే సవాలు భిన్నమైనది. బెంగాల్‌లో పార్టీ విస్తరణ ఇప్పటికే రాష్ట్ర రాజకీయ సమీకరణలను మార్చేసింది. అయితే 2021 తర్వాత దాని ప్రస్థానం, పురోగతి కంటే ఎక్కువగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికే పరిమితమైంది. ఉత్తర బెంగాల్ ప్రాంతాల్లో, అలాగే గుర్తింపు రాజకీయాలు, పాలనపై పార్టీ ఇచ్చిన సందేశాలకు స్పందించిన వర్గాల్లో బిజెపికి గట్టి ఓటు బ్యాంక్ ఉంది. అయినప్పటికీ, ఓట్ల వాటాకు, సీట్ల మార్పిడికి మధ్య ఉన్న అంతరం ఒక కీలకమైన అడ్డంకిగా మిగిలిపోయింది. ‘ఫస్ట్ -పాస్ట్ -ది- పోస్ట్’ విధానం సంస్థాగత బలహీనతలను మరింత స్పష్టంగా బయటపెడుతోంది. ఈ విషయంలో బిజెపి, టిఎంసిలో పాతుకుపోయిన క్షేత్రస్థాయి యంత్రాంగం కంటే వెనుకబడి ఉంది. బిజెపి ఎదుగుదలకు మరో ముఖ్యమైన అడ్డంకి నాయకత్వ సమస్య. జాతీయ స్థాయి నాయకులు పార్టీకి గుర్తింపు, ఉత్సాహం తీసుకువచ్చినా, మమతా బెనర్జీకి సమానంగా రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపగల నాయకుడు లేకపోవడం పార్టీకి పెద్దలోటుగా మారింది. బెంగాల్ రాజకీయాల్లో ఎప్పటినుంచో ప్రాంతీయ భావజాలం, వ్యక్తిగత నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అయితే బిజెపి ప్రధానంగా కేంద్రస్థాయి కథనాలపై ఆధారపడటం వల్ల, అవి స్థానిక స్థాయిలో పూర్తిగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ లోటును పూడ్చాలంటే, పార్టీకి కేవలం ఓట్ల శాతం పెరగడమే కాకుండా, మరింత సమర్థవంతమైన సంస్థాగత నిర్మాణం, స్పష్టమైన రాష్ట్రస్థాయి నాయకత్వ వ్యూహం అవసరం. ఇక వామపక్షాల పరిస్థితి చూస్తే, అది చారిత్రక పతనాన్నీ, తాత్కాలిక పట్టుదలనూ ప్రతిబింబిస్తోంది. మూడు దశాబ్దాలపాటు ఏకపక్ష ఆధిపత్యం చూపిన వామపక్షాలు, ఇప్పుడు శాసనసభలో దాదాపు కనిపించని స్థితికి చేరాయి. 2021లో వారి సంప్రదాయ మద్దతుదారులు బిజెపి వైపు మళ్లడం, బిజెపి సిద్ధాంతానికి మద్దతు పలకడం కంటే, టిఎంసిని ఓడించాలనే వ్యూహాత్మక నిర్ణయాన్ని ఎక్కువగా భావించాలి. అయితే ఈ విధమైన వ్యూహాత్మక ఓటింగ్ వల్ల ప్రస్తుతం రాజకీయాలు రెండు పార్టీల మధ్యే కేంద్రీకృతమయ్యే పరిస్థితి మరింత బలపడింది. ఇదే పరిస్థితి వామపక్షాల పునరుద్ధరణకు అడ్డంకిగా మారుతోంది. అయినప్పటికీ, వామపక్షాల ఉనికి కొంతమేర మిగిలి ఉంది అనేందుకు ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతలో, అలాగే పట్టణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో కొంత మద్దతు కనిపిస్తోంది. చిన్న పోటీల్లో ఓట్ల శాతం క్రమంగా పెరగడం, పడిపోతున్న స్థితి కొంతవరకు స్థిరపడిందని సూచిస్తున్నప్పటికీ, దాని పునరుజ్జీవనానికి ఉన్న నిర్మాణాత్మక అడ్డంకులు మాత్రం చాలా బలంగా ఉన్నాయి. తీవ్రంగా విభజన చెందిన రాజకీయాల్లో, గెలిచే అవకాశాలు లేవని భావించే మూడో పార్టీకి ఓటేయడానికి ప్రజలు సాధారణంగా ముందుకురారు. బలమైన నాయకత్వం లేదా కొత్త రాజకీయ దిశ లేకపోతే, వామపక్షాలు అధికారానికి కాకుండా, కేవలం తమ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకోవడానికే పరిమితమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలను మరింత అనిశ్చితంగా మారుస్తోన్న ప్రధాన అంశం స్వల్ప తేడాతో నిర్ణయించబడే నియోజకవర్గాల ప్రాధాన్యం. 2021లో గణనీయమైన సంఖ్యలో స్థానాలు చాలా తక్కువ ఓట్ల తేడాతోనే నిర్ణయించబడ్డాయి. అంటే, ఓటర్ల ప్రాధాన్యతల్లో చిన్న మార్పు వచ్చినా, సీట్ల ఫలితాల్లో అసమానమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఒకవైపు రెండు పార్టీల మధ్య స్థిరమైన పోటీ ఉన్నప్పటికీ, మరోవైపు అనిశ్చితిని కూడా పెంచుతోంది. ప్రాంతాల వారీగా చూస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా కనిపిస్తోంది. బెంగాల్ ఉత్తర జిల్లాల్లో బిజెపికి బలమైన స్థానం ఏర్పడగా, దక్షిణ ప్రాంతాల్లో టిఎంసి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ భౌగోళిక విభజనను రెండు పార్టీలూ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయనున్నాయి. మరింత లోతుగా చూస్తే, ఈ పోటీ పరిపాలన, సంక్షేమం అనే పరస్పర విరుద్ధమైన కథనాల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. టిఎంసి లక్ష్యంగా పెట్టుకున్న సామాజిక సంక్షేమ పథకాలు, స్థానికంగా వాటి అమలు విధానంపై దృష్టిపెట్టగా, బిజెపి అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యం, జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానం వంటి విస్తృత అంశాలను ముందుకు తీసుకురానుంది. ఓటర్లు తక్షణ ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారా లేక దీర్ఘకాల పాలనా హామీలను విశ్వసిస్తారా అన్నది ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారనుంది. అలాగే, గుర్తింపు రాజకీయాలు, సాధారణ ఆర్థిక సమస్యలకు మధ్య ఉండే పరస్పర ప్రభావం కూడా రెండు పార్టీల వ్యూహాలను పరీక్షించబోతోంది. అయితే, ఈ ఎన్నికలను కేవలం పార్టీల మధ్య పోటీగా మాత్రమే చూడటం సరళీకృత దృక్పథంగా మారుతుంది. బెంగాల్ ఓటర్లు వ్యూహాత్మకంగా ఓటు వేయగల సామర్థ్యం, ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని గతంలోనే నిరూపితమైంది. అప్పట్లో ప్రచార ఉత్సాహం, మీడియా కథనాలు, సంస్థాగత విస్తరణ.. అన్నీ ఉన్నప్పటికీ అవి వాటంతట అవే ఎన్నికల విజయంగా మారవని 2021 ఫలితం ఉదాహరణగా నిలిచింది. స్థానిక అభిప్రాయాలు, నాయకత్వంపై విశ్వాసంతో సరిపోలకపోతే అవి విజయంలోకి మారవని స్పష్టమైంది. అదే సమయంలో, బలంగా స్థిరపడిన ఆధిపత్యం కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేయకపోతే క్రమంగా క్షీణించే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, టిఎంసి తన బలమైన సంస్థాగత నిర్మాణం, నాయకత్వానికి ఉన్న ప్రజాదరణ కారణంగా స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. బిజెపి మాత్రమే విశ్వసనీయమైన ప్రధాన ప్రత్యర్థిగా మిగిలింది. అయితే అధికారాన్ని అందుకోవాలంటే దాని పురోగతి తర్వాత నుండి కొనసాగుతున్న నిర్మాణాత్మక, వ్యూహాత్మక సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది. వామపక్షాలు ఇకపై ప్రధాన శక్తి కానప్పటికీ, అవి ఒక నిద్రాణమైన ఉనికిగానే ఉన్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితులకు తగినట్లు మార్పులు చేసుకునే సామర్థ్యంపైనే వాటి భవిష్యత్తు గమనం ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో, 2026 ఎన్నికలు ముందే నిర్ణయించబడిన ఫలితం కంటే, అవి పోటీ పడుతున్న సామర్థ్యాలకు మధ్య జరిగే పరీక్షగా నిలుస్తాయి. అధికారంలో కొనసాగేందుకు టిఎంసి సామర్థ్యం, మద్దతును విజయంగా మలచుకోవడంలో బిజెపి సామర్థ్యం, తమ ప్రాధాన్యాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలో అంటూ వామపక్షాల సామర్థ్యం ఇవన్నీ ఈ ఎన్నికల దిశను నిర్ణయిస్తాయి. ఈ దశలో బెంగాల్ ఒక కీలక మలుపులో ఉంది. ఇక్కడ కొనసాగింపు, మార్పు రెండూ పరస్పరం విరుద్ధం కాకుండా పెనవేసుకుపోయాయి. చివరికి ఫలితం రాజకీయ పార్టీల వ్యూహాలపై మాత్రమే కాకుండా, ఓటర్ల భావజాలంలో జరిగే సూక్ష్మ మార్పులపై కూడా ఆధారపడి ఉంటుంది.  - గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు

మన తెలంగాణ 24 Mar 2026 10:35 am

జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్న టిపిసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: జగిత్యాలలో ఎంఎల్ సి జీవన్ రెడ్డికి బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, ఎఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ లు జీవన్ రెడ్డి నివాసానికి  చేరుకొని ఆయనతో మాట్లాడుతున్నారు.  పార్టీ మార్పుపై పట్టు వీడేదిలేదని, ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకని గతంలో జీవన్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే. మంత్రి శ్రీదర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ను పార్టీలో కొనసాగాలని కోరడంతో మీకో దండం అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ససేమిరా అనడంతో పాటు నిర్ణయంలో మార్పులేదని, పూర్తి వివరాలు 25న వెల్లడిస్తానని జీవన్ రెడ్డి అన్నారు.  కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే.  రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

మన తెలంగాణ 24 Mar 2026 10:28 am

విద్యకు కేటాయింపులు పెరిగాయి కానీ..!

ఒక సమాజం సాధించే ప్రగతికి, వ్యక్తిత్వ వికాసానికి విద్య అనేది పునాది వంటిది. విద్య కేవలం అక్షరాస్యతను పెంచడమే కాకుండా, విచక్షణ జ్ఞానాన్ని అందించి మనిషిని సామాజిక బాధ్యత కలిగిన పౌరుడిగా తీర్చిదిద్దుతుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పేదరికాన్ని నిర్మూలించడానికి విద్య అతిపెద్ద ఆయుధం. మూఢ నమ్మకాలను తొలగించి, లింగ వివక్షలేని సమానత్వ సమాజాన్ని నిర్మించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో కొత్త పరిశోధనలకు, అద్భుతమైన ఆవిష్కరణలకు విద్యాక్షేత్రాలే వేదికలు. క్రమశిక్షణ, నైతిక విలువలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. విద్యా రంగం అభివృద్ధి చెందాలంటే బడ్జెట్‌లో తగినంత నిధులు కేటాయించాలని దశాబ్దాలుగా అనేక కమిషను, జాతీయ విద్యా విధానాలు సిఫార్సు చేస్తూనే ఉన్నాయి. కొఠారి కమిషన్ (1964 -66) దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో కనీసం 6% విద్యకు కేటాయించాలని సిఫార్సు చేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి2020) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విద్యా రంగానికి చేసే ప్రభుత్వ వ్యయాన్ని జిడిపిలో 6% కి చేర్చాలని స్పష్టంగా పేర్కొంది. ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికలో రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 18% నిధులను విద్యా రంగానికి కేటాయించాలని ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి నేటి వరకు విద్యా బడ్జెట్ కేటాయింపులు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 2014- 15లో రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది బడ్జెట్‌లో విద్యకు అత్యధికంగా 10.89% కేటాయించారు. అయితే, ఆ తర్వాత ఏళ్లలో ఈ శాతం క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2023 -24 నాటికి ఇది 6.5% కనిష్ట స్థాయికి చేరుకుంది. గత రెండేళ్లుగా కేటాయింపుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. 2024- 25లో 7.7%, 2025- 26లో 7.9% నిధులు కేటాయించారు. తాజాగా 2026- 27 బడ్జెట్‌లో రూ. 26,674 కోట్లను (8.22%) కేటాయించడం గమనార్హం. గత దశాబ్దకాలంలో మొత్తం బడ్జెట్ పరిమాణం సుమారు 200% పెరిగినప్పటికీ, విద్యారంగ కేటాయింపులు మాత్రం దాదాపు 126% మాత్రమే పెరిగాయి. 2026 -27 తెలంగాణ బడ్జెట్‌లో విద్యాశాఖకు చేసిన కేటాయింపులు, విద్యా ప్రాధాన్యతకు తగినట్లు ఉన్నాయా లేదా అనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం దీనిని ‘విద్యా బడ్జెట్’గా అభివర్ణిస్తుండగా, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరేలా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు రూ. 26,674 కోట్లకు పెరిగాయి. ఇది గత బడ్జెట్ కంటే దాదాపు 15% ఎక్కువ. ఉస్మానియా వంటి పురాతన యూనివర్శిటీలకు, మహిళా యూనివర్శిటీలకు భారీగా నిధులు కేటాయించడం శుభపరిణామం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’, ‘ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలనే లక్ష్యం కనిపిస్తోంది. కానీ మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో విద్య వాటా కేవలం 8.22% మాత్రమే. కొత్త భవనాల నిర్మాణానికి నిధులు ఇస్తున్నప్పటికీ, ఇప్పటికే ఉన్న వేల సంఖ్యలోని జిల్లా పరిషత్ (జడ్‌పిహెచ్‌ఎస్), ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు (మరుగుదొడ్లు, తాగునీరు) కల్పించడానికి కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రంలో వేల సంఖ్య లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిఎస్‌సి ద్వారా కొత్త నియామకాలు, కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణ వంటి అంశాలకు ఈ బడ్జెట్‌లో స్పష్టమైన ఆర్థిక భరోసా కనిపించడం లేదు. తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికలో సూచించిన అంశాలకు, ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది. కమిషన్ కోరినది 18% బడ్జెట్ వాటా. అయితే ప్రభుత్వం ఇచ్చింది 8.22% బడ్జెట్ వాటా మాత్రమే. ప్రభుత్వం విద్యపై ‘దృష్టి’ పెట్టిందన్నది వాస్తవం. కానీ అది ‘పూర్తి స్థాయి ప్రాధాన్యత’గా మారలేదు. కేటాయింపులు పెరిగినప్పటికీ, అవి పెరిగిన అవసరాలకు సరిపోవు. ముఖ్యంగా సామాన్య విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మరిన్ని నిధులు అవసరం. తెలంగాణ (8.23%)తో పోలిస్తే దేశంలోని పలు రాష్ట్రాలు విద్యకు తమ బడ్జెట్‌లో చాలా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వం తన మొత్తం బడ్జెట్‌లో సుమారు 22% నుండి 25% నిధులను కేటాయిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. బీహార్: 18% -19%, చత్తీస్‌గఢ్: 18%, అసోం: 15%16%, ఆంధ్రప్రదేశ్: 12% 13% నిధులను కేటాయిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు సగటున 14% నుండి 15% వరకు కేటాయిస్తుండగా, తెలంగాణ కేటాయింపులు జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఢిల్లీ వంటి రాష్ట్రాలు మౌలిక వసతులు, ఉపాధ్యాయ శిక్షణపై పెట్టిన పెట్టుబడి వల్ల అక్కడి ప్రభుత్వ పాఠశాలల ఫలితాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. దేశవ్యాప్త సగటు ప్రస్తుతం జిడిపిలో 4.1% - 4.6% మధ్య ఉండగా, తెలంగాణలో ఇది ఇంకా తక్కువగానే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర బడ్జెట్‌లో 15% నిధులను విద్యకు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. అయితే, ప్రస్తుత కేటాయింపు (8.23%) ఆ హామీలో సగం మాత్రమే. విద్యారంగ కేటాయింపులు ఖర్చు కాదు, భవిష్యత్తుపై పెట్టుబడి. సాధారణంగా ప్రభుత్వం చేసే ఖర్చులను అనుత్పాదక వ్యయాలుగా భావిస్తారు. కానీ విద్యారంగంపై చేసే ఖర్చు మాత్రం దేశ భవిష్యత్తును నిర్మించే అత్యుత్తమ పెట్టుబడి. భౌతిక వనరుల కంటే మానవ వనరులే ఒక దేశానికి అసలైన సంపద. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, బాధ్యతాయుతమైన పౌరులు తయారవుతారు. విద్యపై పెట్టే ప్రతి రూపాయి పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది పేదరికాన్ని తగ్గించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ కలిగిన సమాజాన్ని నిర్మించడంద్వారా సామాజిక రుగ్మతలు తగ్గుతాయి. అందుకే, బడ్జెట్‌లో విద్యకు ఇచ్చే ప్రాధాన్యతను కేవలం అంకెల్లో చూడకూడదు; అది రాబోయే తరాల అభివృద్ధికి వేసే పునాదిగా గుర్తించాలి. - జె నారాయణయాదవ్ 94940 19270

మన తెలంగాణ 24 Mar 2026 10:24 am

فیکٹ چیک: کیا آر ایس ایس نے مغربی ایشیا کی جنگ میں اسرائیل کی حمایت میں کوئی ریلی نکالی؟ جانئے پوری حقیقت

وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ آر ایس ایس کارکن اسرائیلی جھنڈے کے ساتھ اسرائیل۔ایران کی جنگ میں تل ابیب کی حمایت میں مارچ کر رہے ہیں۔ تحقیق سے واضح ہوا کہ یہ پرانی اور ترمیم شدہ تصویر ہے، آر ایس ایس نے 2016 میں خاکی نیکر ختم کر دی تھی۔

తెలుగు పోస్ట్ 24 Mar 2026 10:20 am

What Next for Harish Shankar?

Harish Shankar is one of the talented writers and directors of Telugu cinema. He has delivered mass entertainers in his career. After a debacle like Mr Bachchan, he had big hopes on Ustaad Bhagat Singh featuring Pawan Kalyan in the lead role. But the film has turned out to be the biggest embarrassment for the […] The post What Next for Harish Shankar? appeared first on Telugu360 .

తెలుగు 360 24 Mar 2026 10:16 am

ప్రమాదాల నివారణకు ఎఐ చేయూత

యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని తెలంగాణలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సరికొత్త సాంకేతికతద్వారా నగరంలోని ట్రాఫిక్ నమూనాలను విశ్లేషించి ఎక్కడ రద్దీఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించవచ్చు. దీనివల్ల సిగ్నల్ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆటోమెటిక్‌గా నియంత్రించి వాహనాల రాకపోకలు సుగమం చేయడానికి వీలవుతుంది. రోడ్డు భద్రత మెరుగుపడడమే కాకుండా సిబ్బంది పనితీరు కూడా పెరుగుతుంది. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణలో ఎఐ సాంకేతికత ఎంతవరకు ఉపయోగపడుతుందో చర్చకు వచ్చింది. 2024లో దేశవ్యాప్తంగా 4,87,705 రోడ్డు ప్రమాదాలు జరగ్గా తెలంగాణలో 25,986 వరకు ప్రమాదాలు పెరిగాయని పెరిగాయి. తెలంగాణలో రోజుకు సగటున 70 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 20మంది వరకు మరణిస్తుండడం బాధాకరం. దీనిలో బైక్ ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయి. తెలంగాణలో ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడంతో మరణాలు సగటున 8000 వరకు ఉన్నాయని, సుమారు 15 వేల మంది తీవ్ర గాయాల పాలై కుటుంబానికి భారమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో హైవేల మీద జరిగే ప్రమాదాల్లో అధికశాతం.. రోడ్డుపక్కన ఆగి ఉన్న లేదా పాడైపోయిన వాహనాలను వెనుకనుండి వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లనే జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి ఎఐ కెమెరాలు, డ్రోన్లు ఉపయోగపడతాయి. హైవే పై ఎక్కడైనా వాహనం నిలబడి ఉంటే వెంటనే ఇవి గుర్తిస్తాయి. కంట్రోల్ రూమ్ ద్వారా వెనుక వచ్చే వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు పంపుతాయి. దీనివల్ల డ్రైవర్లు అప్రమత్తమై వేగాన్ని అదుపు చేయడానికి వీలవుతుంది. చౌరస్తాలు, జంక్షన్లలో ఎఐ కెమెరాలు ఉపయోగించి వాహనాల మధ్య ఉండే దూరాన్ని, వాటి వేగాన్ని విశ్లేషిస్తారు. వాహనాలు ఎంత దగ్గరగా వస్తున్నాయి, ఎక్కడ ఎక్కువ ముప్పు పొంచి ఉందనే అంశాల ఆధారంగా ఒక మ్యాప్ రూపొందిస్తారు. ఇది ఆ జంక్షన్‌లో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. భవిష్యత్తులో వాహనాలే వాటంతట అవే డ్రైవర్ అజాగ్రత్తగా ఉన్నా వెంటనే బ్రేక్‌వేసి ఆపడం లేదా దారి మార్చుకోవడం వంటివి ఎఐ వల్ల సాధ్యమవుతాయని చెబుతున్నారు. ఎఐ కెమెరాలు, డ్రోన్లు మన రోడ్లపై పహారా కాస్తే భవిష్యత్తులో రోడ్డు ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుందనడంలో సందేహం లేదు. పుణె వంటి నగరాల్లో ప్రజారవాణా వ్యవస్థలు స్మార్ట్ కెమెరాలను వినియోగించడం ప్రారంభించాయి. డ్రైవర్లు మగతగా ఉన్నారా? పరధ్యానంలో ఉన్నారా? సిగ్నల్స్ దాటుకుని స్పీడుగా వెళ్తున్నారా? ఇలాంటి అపసవ్య విధానాలను ఈ స్మార్ట్ కెమెరాలు పట్టేస్తాయి. కెమెరాల నుంచి, స్టీరింగ్ నమూనాల నుంచి, బ్రేకుల ఒత్తిడినుంచి డేటా సేకరిస్తారు. అలాగే డ్రైవరు ఎన్నిసార్లు కనురెప్పలు మూస్తూ తెరుస్తున్నాడో, తరచుగా వాహనం ఎన్నిసార్లు అదుపు తప్పిందో, రెడ్‌లైట్ సిగ్నల్ వద్ద డ్రైవర్ ఎలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నాడో తెలిసిపోతుంది. అలాంటి సమయాల్లో హెచ్చరికలు వస్తాయి. కొన్నిసార్లు కీచుమని శబ్దంరూపం లోనూ, మరికొన్ని సార్లు స్టీరింగ్ వీల్ ప్రకంపించడం ద్వారానూ హెచ్చరికలు వస్తుంటాయి. డ్రైవర్ల జీవితం ఎక్కువగా రోడ్లపైనే సాగుతుంది. ఎఐ వ్యవస్థ డ్రైవింగ్ అవర్స్‌ను ట్రాక్ చేయడమే కాదు, వారు స్మార్ట్‌గా డ్రైవ్ చేయడానికి సహాయపడుతుంది. ఎప్పుడు కళ్లు మత్తుతోపడినా లేదా సిగ్నల్స్‌కకు స్పందించే సమయం జారిపోయినా, విపత్తును పసిగట్టి తక్షణం విశ్రాంతి తీసుకోవాలని డ్రైవర్లకు హెచ్చరిస్తుంది. ఓవర్ స్పీడ్‌తో వాహనం వెళ్తున్నప్పుడు స్వయం చాలకంగా నియంత్రించడం, ముందున్న వాహనానికి, ఈ వాహనానికి మధ్య దూరాన్ని గమనించి అవసరాన్ని బట్టి వేగాన్ని తగ్గించటం లేదా పెంచడం చేస్తుంది. డ్రైవర్లు ఒత్తిడికి గురికాకుండా సౌకర్యవంతంగా ఉండేవరకు ఏకాగ్రతను పెంచుతుంది. దేశంలో బస్సుల్లో డ్రైవర్లకు సహాయక హెచ్చరికల పైలట్ ప్రణాళికలను కొన్నిచోట్ల అమలు చేయగా, ప్రమాదాలు చాలావరకు తగ్గాయని తేలింది. రవాణా వ్యవస్థలో కృత్రిమమేధ సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఏమంత కష్టం కాదు. ఇటీవల కృత్రిమ మేధ సాయంతో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఢిల్లీ గురుగ్రామ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవేపై అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తీసుకురావడం చెప్పుకోతగిన విశేషం. దీంతో దేశంలోనే మొట్టమొదటి ఎఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవేగా ఈ రహదారి గుర్తింపు పొందింది. రోడ్డు భద్రత యాజమాన్య వ్యవస్థలో సాంకేతికత కీలకమైన పాత్ర వహిస్తుందని రోడ్ రవాణా, జాతీయ రహదార్ల మంత్రిత్వశాఖ (ఎంఒఆర్‌టిహెచ్) భాగస్వామ్య సంస్థ జార్జి ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సూచించింది. రోడ్డు భద్రతను మరింత పెంచడానికి ఐఆర్‌ఎడి/ ఇడిఎఆర్ వంటి డిజిటల్ వ్యవస్థలను సరిగ్గా వినియోగించకపోవడంతో సమగ్రంగా ట్రాఫిక్ నిర్వహించడం కానీ, ప్రమాదాలను అదుపు చేయడం కానీ జరగడం లేదనీ నివేదిక పేర్కొంది. వాహనాలు ఢీకొనడం వంటి ప్రమాదాల్లో 90% మానవ ప్రమేయం వల్లనే జరుగుతున్నాయని 2022 లోని రోడ్డు భద్రత నివేదిక వెల్లడించడం గమనార్హం. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వి. పట్టాభిరామ్ కూడా ఇదే అభిప్రాయాన్ని గతంలో వెలిబుచ్చడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. ఈ ప్రమాదాలను నివారించాలంటే ప్రజల ప్రవర్తనలో మార్పు రావాలని కేంద్ర రోడ్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పదేపదే హెచ్చరిస్తున్నారు. కృత్రిమ మేధ (ఎఐ) వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థల సాయం తీసుకుంటేనే కానీ ఈ ప్రమాదాల నివారణ అంతగా సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. - కె.యాదగిరిరెడ్డి 98667 89511

మన తెలంగాణ 24 Mar 2026 10:11 am

Telangana : జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ

జగిత్యాల నేత జీవన్ రెడ్డితో నేడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు

తెలుగు పోస్ట్ 24 Mar 2026 10:08 am

న్యూయార్క్‌లో అగ్నిమాపకయంత్రాన్ని ఢీకొట్టిన విమానం.... వీడియో వైరల్

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో లాగార్డియా విమానాశ్రయంలో అగ్నిమాపకయంత్రాన్ని విమానం ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ అనే విమానం రన్ వేపై దిగుతుండగా అదే సమయంలో అగ్నిమాపకయంత్రం రన్‌వేపైకి రావడంతో ఢీకొన్నాయి. ఈ ఘటనలో పైలట్, కో పైలట్ మృతి చెందాడు. రన్‌వేపై ట్రక్కు, విమానం పక్కపక్కనే ప్రయాణిస్తున్నాయి. ట్రక్కును విమానం ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ మంటల్లో పైలట్, కో పైలట్ సజీవదహనమయ్యారు. 24 మైళ్ల వేగంతో విమానం ప్రయాణిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా స్పందించారు. ఇది చాలా భయంకరమైన ప్రమాదం అని ట్రంప్ అభివర్ణించారు. ఈ ఘటనపై రెండు దేశాలు కలిసి దర్యాప్తు చేస్తున్నాయని విమానయాన శాఖ పేర్కొంది.  

మన తెలంగాణ 24 Mar 2026 10:06 am

Nara Lokesh : తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు

తెలుగు పోస్ట్ 24 Mar 2026 9:59 am

అభివృద్ధి కోసం కృషి చేస్తా –విజయ్ కుమార్..

అభివృద్ధి కోసం కృషి చేస్తా – విజయ్ కుమార్.. ఆలేరు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 24 Mar 2026 9:58 am

అమరావతిలో మరోసారి భారీ అగ్నిప్రమాదం

రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్నిప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 24 Mar 2026 9:54 am

ఎండిపోయిన చెట్టును తీసేయండి మహాప్రభో..

ఎండిపోయిన చెట్టును తీసేయండి మహాప్రభో.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని

ప్రభ న్యూస్ 24 Mar 2026 9:50 am

ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోలేరు..

ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోలేరు.. సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యార్థుల ఫీజు

ప్రభ న్యూస్ 24 Mar 2026 9:44 am

మంచి హాస్యం ఉన్న సినిమా

డిఫరెంట్ ఎంటర్‌టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్.. రైటర్,- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలాన్ని చేకూరుస్తూ, దిల్ రాజు థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసి, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్ డేట్ ప్రకటన ప్రెస్ మీట్‌లో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ “టీజర్ చాలా నచ్చింది. తర్వాత మొత్తం కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. దీంతో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మేము రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాం. మంచి హాస్యం ఉన్న సినిమా ఇది. ఈ సినిమాని మా ఎస్విసి ద్వారా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నాం. మే 1 ఈ సినిమా రిలీజ్ అవుతుందని రిలీజ్ డేట్ ప్రకటించడం జరిగింది. అయితే దానికి కూడా కండిషన్స్ అప్లై. ఎందుకంటే ఇదివరకే ఏప్రిల్ 30కి పెద్ది సినిమా విడుదల అని ప్రకటించారు. ఆ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమాకి థియేటర్స్ మేమే ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కండిషన్స్ అప్లై అని చెప్పాము. మళ్ళీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరమనకుంటే ఒక వారం రోజులు వెనక్కి జరుపుకునే అవకాశం కూడా ఉంటుంది”అని అన్నారు. ప్రొడ్యూసర్ భాను కిరణ్ మాట్లాడుతూ తమలాంటి యంగ్ ఫిలిం మేకర్స్‌ని సపోర్ట్ చేస్తున్న దిల్ రాజుకి ధన్యవాదాలు అని తెలిపారు. పవన్ సాదినేని మాట్లాడుతూ “ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

మన తెలంగాణ 24 Mar 2026 9:43 am

5daysbreak |అక్కడ యుద్ధవిరామం…తీరేనా గ్యాస్ సంక్షోభం?

5daysbreak | అక్కడ యుద్ధవిరామం…తీరేనా గ్యాస్ సంక్షోభం? 5daysbreak | ఇరాన్ యుద్ధం

ప్రభ న్యూస్ 24 Mar 2026 9:39 am

Vijay Sethupathi about a Surprise from Slumdog

For the first time, Tamil actor Vijay Sethupathi is working with sensational Tollywood director Puri Jagannadh. The film is titled Slumdog – 33 Temple Road and the shooting formalities are completed. The makers are closing the non-theatrical deals to announce the release date of the film. Vijay Sethupathi is all excited about the film. During […] The post Vijay Sethupathi about a Surprise from Slumdog appeared first on Telugu360 .

తెలుగు 360 24 Mar 2026 9:38 am

Weather Report :మార్చి నెలాఖరు వరకూ తీపి కబురు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది

తెలుగు పోస్ట్ 24 Mar 2026 9:37 am

Big Stress on Mythri Movie Makers

After proving their mettle in Telugu cinema, Mythri Movie Makers emerged as one of the leading production houses of the country and they have films lined up in all the languages. They have produced Ustaad Bhagat Singh with Pawan Kalyan and the film is heading towards the biggest loss venture for the producers. The production […] The post Big Stress on Mythri Movie Makers appeared first on Telugu360 .

తెలుగు 360 24 Mar 2026 9:37 am

రెండో పాట వచ్చేస్తోంది

యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నా రు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. పోస్టర్లు, గ్లింప్స్, టీ జర్, అలాగే మొదటి సాంగ్ ‘రుబారు’.. అన్నీ ప్రే క్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతూ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. డెకాయిట్ సెకండ్ సింగిల్ చిచ్చుబుడ్డి మార్చి 28న రిలీజ్ కానుంది. ఇది అదిరిపోయే డాన్సింగ్ నెంబరు. ఈ సాంగ్‌లో అడివి శేష్ డాన్సింగ్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఈ మూవీని ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మాణంలో, సునీల్ నారంగ్ సహనిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతోంది ఈ చిత్రం. ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతున్న ‘డెకాయిట్’ లవ్, హార్ట్‌బ్రేక్, అద్భుతమైన యాక్షన్‌తో ప్రేక్షకులకి మరచిపోలేని అనుభూతిని ఇవ్వనుంది.

మన తెలంగాణ 24 Mar 2026 9:32 am

Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

తెలుగు పోస్ట్ 24 Mar 2026 9:32 am

‘సంబరాల ఏటిగట్టు’లో బ్రిటిషుగా..

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్- ఇండి యా మూవీ ‘ఎస్‌వైజి’ (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నెక్స్ లెవెల్‌లో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. సోమవారం శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన్ని బ్రిటిషుగా పాత్రలో చూపిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రతి గా యాన్ని ఒక పతకంలా ధరించే సైనికుడుగా ఆయన లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వ స్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ పాన్- ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది సంబరాల ఏటిగట్టు సినిమా. 

మన తెలంగాణ 24 Mar 2026 9:22 am

కలిసి జీవించడం లేదని... స్నేహితుడిని 20 సార్లు పొడిచి... గొంతు కోసి

ముంబయి: తనతో కలిసి ఉండడం లేదని స్నేహితుడిని ఓ యువకుడు 20 సార్లు పొడిచి అనంతరం గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ధారావిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... అశ్విన్ శివ కుమార్ నాదర్ అనే యువకుడికి అషిక్ అసిమ్ అక్తర్ ఖాన్ అనే స్నేహితుడు ఉన్నారు. ఇద్దరు కలిసి జీవించేవారు. గత కొన్ని రోజులుగా అషిక్‌ను శివ కుమార్ దూరం పెడుతున్నాడు. తనతో కలిసి జీవించాలని పలుమార్లు కోరాడు. శివ నిరాకరించడంతో అతడిపై అషిక్ పగ పెంచుకున్నాడు. శివను కత్తితో 20 సార్లు పొడిచి అనంతరం గొంతు కోసి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 24 Mar 2026 9:21 am

Telagnana : ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక మలుపు

ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక మలుపు చోటు చేసుకుంది.

తెలుగు పోస్ట్ 24 Mar 2026 9:21 am

బాలికను గర్భిణీగా తప్పుడు నిర్ధారణ చేయడంతో..

బాలికను గర్భిణీగా తప్పుడు నిర్ధారణ చేయడంతో.. నర్సంపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోని వరంగల్

ప్రభ న్యూస్ 24 Mar 2026 9:12 am

Gold Prices Today : బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? తెలుసుకోండిలా

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో భారీ తగ్గుదల కనపించింది

తెలుగు పోస్ట్ 24 Mar 2026 9:07 am

ఘంటసాలలో ప్రజా దర్బార్..

ఘంటసాలలో ప్రజా దర్బార్.. ఘంటసాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన

ప్రభ న్యూస్ 24 Mar 2026 9:01 am

నరేందర్ రెడ్డి ఇకలేరు..

నరేందర్ రెడ్డి ఇకలేరు.. -చిరకాల మిత్రుడి కోల్పోవడం తీరని లోటు…-మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నాను-కాంగ్రెస్‌కు

ప్రభ న్యూస్ 24 Mar 2026 8:55 am

బీఆర్ఎస్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం..

బీఆర్ఎస్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం.. హసన్ పర్తి, ఆంధ్రప్రభ : టీఆర్ఎస్ ప్రభుత్వ

ప్రభ న్యూస్ 24 Mar 2026 8:48 am

ఎస్సీ కార్పొరేషన్ రుణాల గడువు పెంచాలి..

ఎస్సీ కార్పొరేషన్ రుణాల గడువు పెంచాలి.. చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా

ప్రభ న్యూస్ 24 Mar 2026 8:40 am

ఇస్రో ప్రోగ్రాం కోచింగ్ కి ఎంపికైన గొంది శంకర్..

ఇస్రో ప్రోగ్రాం కోచింగ్ కి ఎంపికైన గొంది శంకర్.. దమ్మపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 24 Mar 2026 8:31 am

Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది

తెలుగు పోస్ట్ 24 Mar 2026 8:27 am

తిమ్మంపేట పాఠశాలలో మార్కెట్ డే..

తిమ్మంపేట పాఠశాలలో మార్కెట్ డే.. ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండలంలోని తిమ్మంపేట

ప్రభ న్యూస్ 24 Mar 2026 8:26 am

విజయవాడలో ఉగ్రవాదలింకులున్న ముగ్గురు అరెస్ట్

విజయవాడలో ఉగ్రవాదులతో లింకులున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

తెలుగు పోస్ట్ 24 Mar 2026 8:17 am

షహాలిబండలో హత్యాయత్నం... ముగ్గురు రౌడీషీటర్లు పరారీ

 హైదరాబాద్: పాతబస్తీలోని షహాలిబండలో హత్యాయత్నం కేసు కలకలం సృష్టించింది. ముగ్గురు పరారీలో ఉన్న నిందితులపై పోలీసులు రౌడీ షీట్లు నమోదు చేశారు. షహబాజ్ ఖాన్, అర్బాజ్ ఖాన్, షహెద్ ఖాన్ లు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. రౌడీషీటర్ అయూబ్ ఖాన్ కుమారులే నిందితులుగా ఉన్నారు. నేర చరిత్ర ఉన్న కుటుంబంగా పోలీసుల గుర్తించారు. నిందితులు ప్రజాశాంతికి ముప్పుగా మారారు. పలుమార్లు ప్రయత్నించినా నిందితులు పట్టుబడడంలేదు. అయూబ్ ఖాన్‌తో కలిసి ముగ్గురు పరారీలో ఉన్నారు. ముగ్గురు గురించి సమాచారం ఇస్తే గోప్యత హామీ కలిగించవని డిసిపి విజ్ఞప్తి చేశారు. కీలక సమాచారం అందించిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. నిందితులకు సహాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీయిజంపై హైదరాబాద్ పోలీసుల ‘జీరో టాలరెన్స్’ హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో వేట కొడవళ్ళతో ఆర్బాజ్ అనే యువకుడు హల్ చల్ చేశాడు. రెండు నెలల క్రితం ముస్లిం మాటర్నిటీ ఆసుపత్రి సమీపంలో చచ్చా భాయ్ కే బచ్చే హే హమ్ అంటూ ఓ సెల్ ఫోన్ షాపులో యువకులు దౌర్జన్యానికి దిగారు.  కేవలం రూ.60 స్క్రీన్ గార్డ్ విషయంపై గొడవ పెట్టుకుని, షాపు యజమానిని బెదిరిస్తూ ప్రతీ నెలా మామూలు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు మళ్లీ దాడి చేసి షాపులో సామగ్రిని ధ్వంసం చేసి ఆర్బాజ్ కు చెందిన గ్యాంగ్ పారిపోయింది. చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

మన తెలంగాణ 24 Mar 2026 8:11 am

24thMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

24thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 24thMarchCartoon | ట్రంప్ నిర్ణయం

ప్రభ న్యూస్ 24 Mar 2026 7:55 am

బ్లడ్‌ తీసుకోకుండానే బ్లడ్‌ రిపోర్టులో డ్రగ్స్‌ అని ఎలా వచ్చింది: పుట్టా మహేష్ తండ్రి సుధాకర్

అమరావతి: తన కుమారుడు డ్రగ్స్‌ తీసుకోలేదని, పోలీసుల విచార‌ణే స‌క్ర‌మంగా లేదని ఎంపి పుట్టా మహేష్ తండ్రి సుధాకర్ యాదవ్ తెలిపారు. డ్ర‌గ్స్ తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన టిడిపి ఎంపి పుట్టా మ‌హేష్‌కు తండ్రి సుధాకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. సర్జరీ చేయించుకున్న తన కుమారుడు డ్రగ్స్‌ తీసుకోకూడ‌దని తెలియజేశారు. ఫామ్‌ హౌస్‌లో పక్కనున్న వారు డ్రగ్స్‌ తీసుకుంటుంటే వెనక్కి రావాలనుకున్నాడని, కానీ సమయానికి వాహనం అందుబాటులో లేక రాలేకపోయాడని వివరించారు. బ్లడ్‌ తీసుకోకుండానే బ్లడ్‌ రిపోర్టులో డ్రగ్స్‌ అని ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మాజీ ఎంఎల్ఎ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఎంపి పుట్టా మ‌హేష్‌, మాజీ ఎంఎల్ఎ రోహిత్ రెడ్డితో పాటు మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని ఈగల్ ఎస్ పి గిరిధర్ తెలిపారు. 

మన తెలంగాణ 24 Mar 2026 7:52 am

Iran - Israel War : పుంజుకున్న స్టాక్ మార్కెట్లు...ట్రంప్ వ్యాఖ్యలతో ఊరట

ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం మళ్లీ పుంజుకున్నాయి

తెలుగు పోస్ట్ 24 Mar 2026 7:29 am

Iran Israel wara : పశ్చిమాసియా యుద్ధం ముగిసినట్లేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు పోస్ట్ 24 Mar 2026 7:14 am

మంగళవారం రాశి ఫలాలు (24-03-2026)

మేషం బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విబేదిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగం అదనపు బాధ్యతలు సాగుతాయి. వృషభం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మండకోడిగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. మిధునం ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది. కర్కాటకం ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. దాయదులతో భూ వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. సింహం ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల కలలు నిజమవుతాయి. కన్య వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తప్పవు. తుల సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టి పనులు సకాలంలో పూర్తి సారు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. వృశ్చికం నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువులతో ఒక విషయంలో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మకరం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అవసరం లేని వస్తువుల పై ధన వ్యయం చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. కుంభం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలానాలు కలుగుతాయి. మీనం చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరస్తి వివాదాల పరిష్కారమవుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. కీలక వ్యవహారంలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.  

మన తెలంగాణ 24 Mar 2026 7:13 am

అవగాహనతోనే క్షయ వ్యాధి నియంత్రణ సాధ్యం

క్షయవ్యాధి (టిబి) అనేది తీవ్రమయ్యే అవకాశం ఉన్న వ్యాధి, కానీ సరైన యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తే దానిని నయం చేయవచ్చు. అందువల్లనే ప్రతీ ఏటా మార్చ్ 24వ తేదీన ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఈ వ్యాధిపై అవగాహన పెంచడానికి, వ్యాధి నిర్మూలన ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి అవసరమైన కసరత్తు జరుగుతుంది. నేడు ప్రపంచ టీబీ డే సందర్భంగా ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మనోజ్ రెడ్డి అందిస్తున్న సూచనలు, సలహాలు దగ్గు లేదా తుమ్ముల నుంచి వెలువడే చిన్న తుంపరలను పీల్చడం ద్వారా వ్యాపించే ఒక బాక్టీరియా సంక్రమణ ఈ క్షయ వ్యాధి. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బాక్టీరియా క్షయవ్యాధికి కారణమవుతుంది.ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది, కానీ కడుపు (ఉదరం), గ్రంథులు, ఎముకలు, నాడీ వ్యవస్థతో సహా శరీరంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేయగలదు. క్షయ అనేది తీవ్రమయ్యే అవకాశం ఉన్న వ్యాధి, కానీ సరైన యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తే దానిని పూర్తిగా నయం చేయవచ్చు. అందువల్లనే ప్రజల్లో కనీస అవగాహన పెంచడానికి ప్రతి ఏటా ఈ రోజున వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. క్షయ వ్యాధి లక్షణాలు... క్షయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి గాలి ద్వారా, ముఖ్యంగా దగ్గినప్పుడు, ఆ వ్యాధిని వ్యాపింపజేస్తాడు. ఫలితంగా, క్షయ వ్యాధి ఉన్నవారు, తమ వ్యాధి ఇతరులకు సోకని స్థితికి వచ్చేంత వరకు, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. మూడు లేదా మూడు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు రక్తం లేదా శ్లేష్మంతో కూడిన దగ్గు ఛాతీ నొప్పి, లేదా శ్వాస తీసుకునేటప్పుడు, దగ్గేటప్పుడు నొప్పి అనుకోకుండా బరువు తగ్గడం అలసట (సాధారణ బలహీనత),జ్వరం, రాత్రిపూట చెమటలు, చలి వంటివి ప్రధాన లక్షణాలు. క్షయ వ్యాధి సంక్రమణను నివారించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వ్యాధి ఉన్న వ్యక్తులతో సంపర్కాన్ని తగ్గించుకోవడం, తరచుగా చేతులు కడుక్కోవడం, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోటిని రక్షించుకోవడం, సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం, సరైన నిద్రతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడి, క్షయవ్యాధి సోకే అవకాశాలను తగ్గించవచ్చు. వైద్యుడు సలహా ఇచ్చిన విధంగా టీబీ చికిత్సను పూర్తిగా తీసుకోవడం వల్ల మందులకు లొంగని టీబీ వచ్చే ప్రమాదం తగ్గి, అది మళ్లీ రాకుండా నివారించవచ్చు. గుప్త క్షయ ఇన్ఫెక్షన్కు యాంటీబయాటిక్స్తో చికిత్స చేయడం ద్వారా, ఆ ఇన్ఫెక్షన్ క్రియాశీల క్షయగా మారకుండా నిర్మూలించే అవకాశం ఉంది. డాక్టర్ మనోజ్ రెడ్డి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి , ముషీరాబాద్

మన తెలంగాణ 24 Mar 2026 7:00 am

ట్రంప్ పీఛేముడ్!

వాషింగ్టన్: పశ్చిమాసియాలో హోరాహోరీ యుద్ధం, దాడు లు.. ప్రతిదాడులకు హెచ్చరికలు సాగుతున్న క్రమంలో అ మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రకటన చేశా రు. 48గంటల్లోగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్, ఇంధన కేంద్రాలను లక్షంగా చేసుకుంటామని ప్రకటించిన ట్రంప్ ఆ దాడులను ఐదు రోజు ల పాటు వాయిదా వేసినట్లు తాజాగా వెల్లడించారు. ఈ మేరకు తమ బలగాలను కూడా ఆదేశించినట్లు సోమవారంనాడు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పేర్కొన్నా రు. ఇరాన్‌తో చర్చల పురోగతిపైనే తమ భవిష్యత్ కార్యాచారణ ఆధారపడి ఉంటుందని కూడా వివరించారు. ఇరాన్ అణు, విద్యుత్, ఇంధన కేంద్రాలపై మరో 5 రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ ఎటువంటి దాడులకు దిగబోవని ప్రకటించారు. ఇరాన్‌కు చెందిన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తితో తన అల్లుడు కుష్నర్, విట్‌కాఫ్‌లు ఆదివారంనాడు రాత్రి చర్చలు జరిపారని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌తో చర్చల విషయం, దాడులు తాత్కాలిక నిలిపివేత విషయం ప్రకటన వెలువడగానే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గాయి. గంటల వ్యవధిలోనే బ్యారెల్ ముడిచమురు ధరలు 17 డాలర్ల చొ ప్పున తగ్గుముఖం పట్టి 97డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అసలు ట్రంప్ చెబుతున్నట్లు ప్రత్యక్షం గా, పరోక్షంగా కానీ ఆయనతో ఎలాంటి చర్చలు జరగలేదని కుండ బద్ధలు కొట్టింది. ఈ మేరకు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ తెలిపినట్లు ఇరాన్‌కు చెందిన అధికారిక వార్త సంస్థతో సహా రెండు ప్రధాన వార్తాసంస్థలు తెలిపాయి. చమురు ధరలు తగ్గుముఖం పట్టేందుకే ట్రంప్ ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేసింది. అదే సమయంలో చర్చల ప్రతిపాదన వచ్చినా తాము తిరస్కరించినట్లు ఇరాన్ పేర్కొంది. యుద్ధ నివారణకు గల్ఫ్ దేశాలు చొరవ తీసుకున్నాయని, కానీ చొరవ తీసుకోవాల్సింది యుద్ధం మొదలు పెట్టిన దేశం కదా అని ఎదురు ప్రశ్నించింది. మా హెచ్చరికలకు భయపడే ఇప్పుడు ట్రంప్ వెనక్కి తగ్గారని స్పష్టం చేసింది. అంతకుముందు ఉదయం తమ విద్యుత్, ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తే అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల విద్యుత్ కేంద్రాలను కూడా మేము దెబ్బతీస్తామని, హర్మూజ్‌ను శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరించింది. ట్రంప్ బెదిరింపులకు భయపడేదిలేదని ఇరాన్ తెలిపింది. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. తాను టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య సంప్రదింపులకు టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. గల్ఫ్‌దేశాలను పూర్తి స్థాయిలో దెబ్బతీస్తామని, రక్షణ వలయాలను పటిష్టపర్చుకుంటామన్నారు. తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉన్నామని కూడా అరాగ్చీ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం అరబ్ ఏమిరేట్స్‌పై దూసుకువచ్చిన ఇరాన్ క్షిపణిని దెబ్బతీసినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు చర్చలు బెదిరింపులతో ప్రసక్తి లేకుండా ఇజ్రాయెల్ సేనలు సోమవారం ఉదయం నుంచే టెహరాన్ ఇతర ప్రాంతాలపై దాడులు తీవ్రతరం చేశాయి. ఇరాన్ కీలక స్థావరాలను ఎంచుకుని తమ దాడులు సాగిస్తామని వెల్లడించారు. అయితే ట్రంప్ చర్చల ప్రస్తావనకు ముందు ఈ ఘటనలు జరిగాయి. ఇరాన్‌తో చర్చలు ఫలిస్తే హర్మూజ్‌పై సంయుక్త ఆధిపత్యం హర్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ సోమవారం కీలక ప్రకటన వెలువరించారు. ఇరాన్‌తో తమ దౌత్యం ఫలిస్తే అంతా సుఖాంతం అవుతుందని తెలిపారు. త్వరలోనే హర్మూజ్ జలసంధి మార్గం తెరుచుకుంటుంది. పైగా ఇరాన్ నూతన నాయకత్వంతో కలిసి ఈ మార్గంపై తమ సంయుక్త ఆధిపత్యం ఉంటుందని కూడా వెల్లడించారు. తాము ఇప్పటి అధినేత మొజ్తాబాను నాయకుడిగా గుర్తించడం లేదన్నారు. అయితే ట్రంప్ తాజా ప్రకటనపై ఇరాన్ నుంచి ఎటువంటి స్పందనా వెలువడలేదు. ఇరాన్‌తో యుద్ధం దాదాపు ముగిసినట్లే అని ప్రకటించిన ట్రంప్, ఇరాన్‌తో 15 అంశాలతో కూడిన ఒప్పందం ఖరారు కానుందని చెప్పారు. హర్మూజ్‌పై ఉమ్మడి నియంత్రణ కీలకం అన్నారు. ఇరాన్‌పై తమ దేశ దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపిన ట్రంప్ ఈ ప్రాంతంలో అసాధారణ రీతిలో సముద్ర జలాల భద్రతకు వీలేర్పడుతుందని, ఇప్పటి ఉద్రిక్తత ఇకపై తలెత్తకుండా చేస్తామని కూడా వివరించారు. హర్మూజ్‌పై తమకు, ఇరాన్ నాయకత్వానికి మధ్య ఉమ్మడి అదుపు ఉంటుందని తెలిపారు. ఇప్పటి తమ చర్చలలో ప్రధానాంశం కేవలం ఇరాన్ ఇకపై అణ్వాయుధాలు సంతరించుకోకుండా ఉండటమే. ఇదే తమ లక్షం అని తేల్చిచెప్పారు. భవిష్యత్తులో యుద్థాలు తలెత్తకుండా చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు శాంతి ఒప్పందంలో ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌తో కీలక ఒప్పందం అత్యవసరం, కాదనలేనిది అని స్పష్టం చేశారు. ఇక్కడో మెలిక పెట్టారు. ఇరాన్‌తో చర్చలకు నూతన నాయకత్వం ఎంచుకుంటున్నట్లు ప్రకటించారు. 

మన తెలంగాణ 24 Mar 2026 6:00 am

24thMarch 2026 |మంగళవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

24thMarch 2026 | మంగళవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 24thMarch

ప్రభ న్యూస్ 24 Mar 2026 6:00 am

కన్నవాళ్లకు భరోసా

మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రివర్గం పలు బిల్లులకు ఆమో దం తెలిపింది. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు అసెంబ్లీ క మిటీ హాల్‌లో సుమారు రెండుగంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించింది. అందులో భాగంగా విశ్వ విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన రోహిత్ వేముల చట్టం విధి, విధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ఉప సంఘం సభ్యులుగా మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్‌బాబు, ఉత్త మ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను నియమించింది. వృద్ధాప్యం లో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా రూ.10వేలు ఏదీ తక్కువైతే ఆ మొత్తం వేతనాల నుంచి కట్ చేసి తల్లిదండ్రులకు అందజేసే తల్లిదండ్రుల మద్దతు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఎల్‌అండ్‌టి కంపెనీ నుంచి మెట్రోను స్వాధీనం.. హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్ అండ్ టి కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రుణభారం సహా మొత్తం రూ.15వేల కోట్లకు ప్రభుత్వం ఎల్‌అండ్‌టికి చెల్లించి ఫేజ్ 1 ప్రాజె క్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే సబ్ కమిటీ నివేదికను సమర్పించింది. ప్రభుత్వం తరపున ఈ నిధుల చెల్లింపులు, లావాదేవీల బాధ్యతను నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు అప్పగించింది. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ అడ్వకే ట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదులపై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ఈ బిల్లును రూపొందించారు. గతంలో జరిగిన అడ్వకేట్ దంపతులు వామనరావు హత్యల నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను ఆమోదించిన కేబినెట్ రాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఇండిపెండెంట్ ఎక్స్‌ఫర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదిక తయారు చేసింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను కేబినెట్ చర్చించింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. 2024 నవంబర్ 06వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు 50 రోజుల పాటు రాష్ట్రమంతటా సర్వే నిర్వహించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026)ను మంత్రివర్గం ఆమోదించింది. మత సామరస్యాన్ని భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. గిగ్‌వర్కర్స్, ప్లాట్‌ఫాం కార్మికుల సంక్షేమం, భద్రత కోసం దీంతోపాటు గిగ్‌వర్కర్స్, ప్లాట్‌ఫాం కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ) యాక్ట్ , 2026’ బిల్లును కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్ తో పాటు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లు ప్రకారం గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయడంతో వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ దీనిని ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం పిసిసి అధ్యక్షుడితో పాలు పలువురితో సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సమావేశమయ్యారు. సభలో చర్చించాల్సిన విషయాలు, సభలో సభ్యులు వ్యవహారించాల్సిన తీరు తదితర అంశాలపై కేబినెట్ చర్చించినట్టుగా తెలిసింది.

మన తెలంగాణ 24 Mar 2026 5:30 am

బియ్యం ఎగుమతులపై సభా సంఘం వేయాలి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఫిలిప్పీన్స్ దేశానికి చేస్తున్న బియ్యం ఎగుమతుల వ్యవహారంలో భారీ కుభంకోణం దాగి ఉందని బి ఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆ రోపించారు. దీనిపై సభా సంఘం వేసి అందులో తనను సభ్యుడిగా నియమించాలని హరీశ్‌రావు డి మాండ్ చేశారు. సోమవారంనాడు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఉత్తమ్, హరీశ్‌రావు నడుమ ఈ అంశంపై వాడీవేడి చర్చ జరిగింది. ఇ తర దేశాలకు బియ్యం ఎగుమతి చేసేందుకు సల హాదారుగా వేల కోట్ల బ్యాంకింగ్ ఫ్రాడ్, బంగా రం స్మగ్లింగ్, ఇడి, సిబిఐ, కేసులు ఉన్న ప్రేమ్ చం ద్ గార్గ్‌ను నియమించుకున్నారా? లేదా? అని ప్ర శ్నించారు. ఆయన ఇచ్చిన సలహాల వల్లే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పది లక్షల మొట్రిక్ టన్నులకు ఎంఓయు కుదుర్చుకుని, 22, 750 మెట్రిక్ టన్నుల వద్ద ఎందుకు ఎగుమతులు ఆగాయని నిలదీశారు. నాఫెడ్ ఎండి ఎగుమతుల అవకాశం నాఫెడ్‌కు ఇవ్వాలని లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇవ్వకుండా ప్రయివేట్ సంస్థలకు ఎలా ఇస్తారని, దీని వెనుక ఉన్న మతలబు ఏమిటని నిలదీశారు. కాకినాడ పోర్టులో ఏడాది నుంచి సుమారు 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఉందని, ఏడాది నుంచి బియ్యం ఉంటే అవి పాడయిపోతాయని, వాటికి సంబంధించి గిడ్డంగి, నిర్వహణ చార్జీలు ఎవరు చెల్లిస్తున్నారని, ఇతర ఖర్చులు ఎవరు భరించాలిని అడిగారు. వాటాలు కుదరకపోవడం వల్లనే బియ్యం ఎగుమతులు ఆగిపోయాయని హరీష్ రావు ఆరోపించారు. బియ్యం ఎగుమతులు ప్రారంభించడానికి హెలికాఫ్టర్‌లో వెళ్లారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగం సంస్థలు అడ్వాన్స్‌గా డబ్బులు ఇస్తామన్నా ఎగుమతి అవకాశం ఇవ్వలేదని, స్కాం నిరూపించడానికి హౌస్ కమిటీ వస్తే పూర్తివివరాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు హరీశ్‌రావు చెప్పారు. బియ్యం ఎగుమతుల్లో స్కాం జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరిందని విమర్శించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సూటిగా సమాధానాలు చెప్పకుండా దాట వేస్తూ సభను పక్కదోవ పట్టిస్తున్నారని హరీశ్‌రావు మంత్రిపై మండపడ్డారు. మంత్రి సత్యదూరమయిన మాటలు సభలో మాట్లాడుతున్నారని, ఈ విషయం ప్రజలు గమనిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పారదర్శకంగా ఉంటే, తప్పు చేయలేదని బావిస్తే ఈ కుంభకోణాలపై హౌజ్ కమిటీ వేయాలని, ఆధారాలతో నిరూపిస్తామని హరీశ్‌రావు సవాల్ విసిరారు. దీంతో పాటుగా రైతులకు యాసంగికి సంబంధించి రూ.1,200 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉందని వాటిని ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఈ దశలో పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుబంద ప్రశ్నలు అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం వరి దిగుబడి లెక్కలు అస్తవ్యస్థంగా ఉన్నాయని, పంటల కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారని, ఆలస్యంగా ప్రారంభించడంతో రైతులు దళారుల వలకు చిక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 24 Mar 2026 5:00 am

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఏప్రిల్ 9లోగా చెల్లించండి

మన తెలంగాణ/హైదరాబాద్: కో ర్టు ధిక్కరణ అంశాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప దవి విరమణ చేసిన ఉద్యోగు ల బకాయిలు ఏప్రిల్ 9లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని హైర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ధిక్కరించిన ఫైనాన్స్ సెక్రటరీపై తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని గత ఏడాది ప్రభుత్వానికి, ఫైనాన్స్ సెక్రెటరీకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయినా కూ డా బకాయిలు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించా రు. దీంతో సోమవారం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం పిటిషన్లు విచారించింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉ ద్యోగుల బకాయిలను చెల్లించాలన్న కోర్టు ఆదేశాలను రా ష్ట్ర ప్రభుత్వం పాటించడంలో విఫలమవడంతో ఆర్థిక కార్యదర్శి వ్యక్తిగత హాజరు నుండి మి నహాయింపు ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్లీడర్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రా జేశ్వరరావు తిరస్కరించారు. దీంతో వ్యక్తిగతంగా ఫైనాన్స్ సెక్రటరీ హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నూ సోమవారం విచారణకు హాజరు కావాల్సిందేనని సెక్రటరీని హైకోర్ట్ ఆదేశించింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆయన హాజరు కాలేకపోయారని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు స్పందిస్తూ అర్ధరాత్రి వరకు కోర్టు హాలులోనే ఉంటామని, వ్యక్తిగత హాజరుకు ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో ఫైనాన్స్ సెక్రటరీ సాయంత్రం ఆన్‌లైన్‌లో కోర్టు విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ కష్టార్జితాన్ని చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న విపరీతమైన జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, తమ డబ్బు అందక తీవ్ర మనోవేదనకు గురై 80 మందికి పైగా విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. కోర్టు పట్టుబడితే, ప్రభుత్వం తన ఇతర ప్రాధాన్యతలను పక్కన పెట్టి, మార్చి 31 నాటికి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలన్నింటినీ చెల్లిస్తుందని ఫైనాన్స్ సెక్రటరీ కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే, ఈ బకాయిలను చెల్లించడానికి మరో 30 రోజుల గడువు ఇస్తే ప్రభుత్వానికి మరింత సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 3,656 మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు నమోదై ఉన్నాయని ఆర్థిక కార్యదర్శి సుల్తానియా కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇప్పటివరకు 1,056 మంది ఉద్యోగుల బకాయిలను చెల్లించిందని, ప్రస్తుతం మరో 2,600 మంది ఉద్యోగుల బకాయిల చెల్లింపు పెండింగ్‌లో ఉందని ఆయన వివరించారు. బకాయిల చెల్లింపు కోసం ఆర్థిక కార్యదర్శి కోరినట్లుగా 30 రోజుల గడువు ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి నామవరపు రాజేశ్వరరావు, ప్రభుత్వం పదవీ విరమణ బకాయిలను చెల్లించడానికి ఏప్రిల్ 9వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. లేదంటే, ఈ కేసులు విచారణకు వచ్చిన ప్రతిసారీ ఆర్థిక కార్యదర్శి స్వయంగా కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనికి కట్టుబడి ఉంటామని ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోర్టుకు తెలిపారు. అది వారి సొంత డబ్బని, ఏప్రిల్ 9వ తేదీలోగా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆ శుభవార్తను తెలియజేయండి, అని న్యాయమూర్తి రావు ఆదేశించారు. కాగా, గత రెండేళ్లుగా వేలాది మంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, జిపిఎఫ్, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవు, సరెండర్ సెలవు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి తమ పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పందిస్తూ, బకాయిలను ఆరు నుంచి పది వారాల్లోగా చెల్లించాలని హైకోర్టు గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను పాటించడంలో ప్రభుత్వం విఫలమవడంతో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్థిక కార్యదర్శితో సహా ప్రభుత్వ ప్రతినిధులపై కోర్టు ధిక్కార చట్టం నిబంధనల కింద చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు. ప్రభుత్వ ప్రతినిధులకు ధిక్కార నోటీసులు జారీ చేసినప్పటికీ, ప్రభుత్వ న్యాయవాది కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి గడువు కోరుతూ వాయిదాలు అడుగుతూనే ఉన్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆదేశాలను పాటించకపోవడం, అలాగే ధిక్కార నోటీసులకు స్పందించకపోవడం పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, గత విచారణ సందర్భంగా ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ఫారం-1 నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో జరిగిన వైఫల్యంపై వివరణ ఇవ్వడానికి, ఆయన స్వయంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.

మన తెలంగాణ 24 Mar 2026 4:00 am

వాళ్ల యుద్ధంతో మనకు సవాళ్లు

న్యూఢిల్లీ ః పశ్చిమాసియా సంక్షోభ నివారణకు దౌత్యం, చర్చలు అత్యవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. చమురు సరఫరాకు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధి ఆటంకాలు ఆమోదయోగ్యం కాదని హితవు పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి గల్ఫ్ యుద్ధం తీవ్ర ప్రకంపనలకు దారితీసింది. ప్రజల నిత్యావసరమైన వంటగ్యాస్, చమురు సరఫరాలపై ప్రభావం పడింది. ఆర్థిక వ్యవస్థలకు విఘాతం ఏర్పడుతోంది. ఈ అంతర్జాతీయ ప్రభావిత అంశంపై ప్రధాని లోక్‌సభలో సోమవారం ప్రస్తావించారు. ఏ సమస్యకు అయినా యుద్ధం పరిష్కారం కాదు. ఘర్షణలతో సమస్యలు మరింత ప్రజ్వరిల్లుతాయని, పరిస్థితి చేయి దాటుతుందని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి మార్గం అత్యంత కీలకం. ఈ దారిలో వాణిజ్య నౌకలను అడ్డగించడం అనుచితం. అదే విధంగా ఈ ప్రాంతాన్ని దెబ్బతీయాలనుకోవడం కూడా విచక్షణారహితం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రజల చమురు, గ్యాసు అవసరాల విషయంలో ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తోంది. ఈ విషయంలో ఎటువంటి నిర్లక్షం లేదని స్పష్టం చేశారు. ఇక్కడి ఇంధన అవసరాలను తీర్చేందుకు మన దేశం సరఫరాదార్లతో సంప్రదింపులు జరుపుతోంది. సరుకు సక్రమంగా చేరేందుకు వీలు కల్పిస్తోందని హామీ ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ దశలో ప్రధాని మోడీ తొలిసారిగా దేశ ప్రజలకు పరిస్థితిని లోక్‌సభలో సమగ్ర ప్రకటన ద్వారా వెలువరించారు. ఇంధన నిల్వలపై సమీక్ష..ఆహార భద్రతకు సంసిద్ధం ఇప్పటి యుద్ధం కేవలం సంబంధిత పక్షాల సంబంధితం కాదు. దీని ప్రభావం అన్ని దేశాలపై పడుతోంది. ప్రత్యేకించి చమురు సరఫరాల వ్యవస్థ దెబ్బతింటోంది. దీనిని గుర్తించి , పలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంధన సరఫరా జరిగేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రధాని తెలిపారు. దేశంలో ఇప్పుడు అన్ని విద్యుత్ కేంద్రాలకు అవసరం అయిన బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహర సమస్య తలెత్తకుండా చూసుకుంటున్నాం. ఆహార భద్రత విషయంలో అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. శాంతియుత పద్ధతుల ద్వారానే సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. సంక్షోభాలకు దారితీయరాదనేదే భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని వివరించారు. 

మన తెలంగాణ 24 Mar 2026 3:30 am

పార్టీ ఫిరాయింపుల కేసులో..ఎంఎల్ఎ దానంకు హైకోర్టు నోటీసు

పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతికి కూడా నోటీసు జారీ చేసింది. 2023లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ 2024లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తాము ఇదివరకే అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా, పార్టీ ఫిరాయించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని స్పీకర్ కేసు కొట్టి వేశారని పిటిషనర్ ఏలేటి తరఫున న్యాయవాది తన వాదన వినిపించారు. స్పీకర్ తరపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరుకాగా, అడ్వకేట్ జనరల్‌గా ఉంటూ స్పీకర్ తరపున ఎలా వాదిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ సీనియర్ న్యాయవాదిగా వాదించాలనుకుంటున్నానని చెప్పారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి చెబుతూ కేసును వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేశారు.

మన తెలంగాణ 24 Mar 2026 3:00 am

బెదిరిన ట్రంప్

దాడులు 5 రోజులు ఆపేస్తున్నట్లు ప్రకటన . తెహ్రాన్‌తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ట్రంప్ భయపడి పారిపోయారు… చమురు ధరల తగ్గింపు కోసమే నాటకాలు: ఇరాన్. చర్చలు జరగలేదని స్పష్టీకరణ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులు వాషింగ్టన్/తెహ్రాన్: హోర్మూజ్ జలసంధిని 48గంటల్లోగా తెరవని పక్షంలో విద్యుత్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అల్టిమేటం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకంజ వేశారు. రెండురోజులుగా ఇరాన్‌తో చర్చలు ఫలవంతంగా జరగడంతో విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను […] The post బెదిరిన ట్రంప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Mar 2026 12:00 am

పరిశ్రమలకుఏపీ సరైన వేదిక

. యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. ఇది స్టీల్‌ప్లాంట్ కాదు…స్టీల్ సిటీకి శంకుస్థాపన. దేశ ఉక్కు అవసరాలు తీర్చేలా ప్రభుత్వ ప్రణాళిక. ఏఎం`ఎనఎస్ భూమి పూజలో సీఎం చంద్రబాబు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రాభివృద్ధి: కుమారస్వామి విశాలాంధ్ర- పాయకరావుపేట (అనకాపల్లి జిల్లా): పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ తిరుగులేని వేదికని, ఇక్కడ అన్ని రకాల వనరులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకా పల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద రూ.1.35 లక్షల కోట్లతో […] The post పరిశ్రమలకుఏపీ సరైన వేదిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:56 pm

యుద్ధ సవాళ్లను ఐక్యంగా ఎదుర్కొందాం

. ఇంధన సరఫరా ఆగకుండా చర్యలు తీసుకున్నాం. ఎల్పీజీ ఉత్పత్తి పెంచాం. పశ్చిమాసియా ఉద్రికత్తలపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రకటన న్యూదిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశంలోని అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆయన లోక్‌సభలో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాకుండా ప్రజల జీవన విధానంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. యుద్ధం కారణంగా దేశంలో […] The post యుద్ధ సవాళ్లను ఐక్యంగా ఎదుర్కొందాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:48 pm

ఎల్పీజీ స్థానంలో పీఎన్జీ

. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే పరిష్కారం. గ్యాస్ సరఫరా సమస్య నివారణకు చంద్రబాబు సూచన. శ్రీకాకుళం-కాకినాడ పైప్‌లైన్ పునరుద్ధరణకు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పీఎన్జీ […] The post ఎల్పీజీ స్థానంలో పీఎన్జీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:45 pm

గ్రామ కంఠాల గోస

నాడు అంగీకరించి… నేడు విచారణేంటి?అధికారుల ద్వంద్వ వైఖరిపై నిరసనగొంతు నొక్కేందుకే ‘రీ-సర్వే’ అంటున్న రాజధాని రైతులు విశాలాంధ్ర – సచివాలయం: రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల భూములు త్యాగం చేసిన అమరావతి రైతులపై ప్రభుత్వం మరోసారి తన ప్రతాపం చూపుతోంది. జీఓ నంబర్ 50 రూపంలో కొత్త అస్త్రాన్ని ప్రయోగించి… భూములిచ్చిన రైతులను నేరస్తులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే సర్వేలు పూర్తి చేసి… అథారిటీ తీర్మానాల మేరకు ఇచ్చిన మినహాయింపులను ఇప్ప్పుడు ‘అక్రమాలు’గా […] The post గ్రామ కంఠాల గోస appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:43 pm

ఇక 10 కిలోల గ్యాస్ సిలిండర్లు

న్యూదిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. భవిష్యత్‌లో వంటగ్యాస్ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడిం చాయి. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్‌పీజీ సరఫరా సమస్యలు తలెత్తే […] The post ఇక 10 కిలోల గ్యాస్ సిలిండర్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:40 pm

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్ప్పు

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ఐఈఏ ఆందోళన పారిస్: పశ్చిమాసియా ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఇంధన సంక్షోభం అంతకంతకూ తీవ్రరూపు దాలుస్తున్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. సోమ వారం ఆస్ట్రేలియా నేషనల్ ప్రెస్ క్లబ్ సమావేశం వేదికగా ఫాతిహ్ బిరోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, అమెరికా – ఇజ్రాయిల్ యుద్ధం వల్ల పశ్చిమాసియా లోని […] The post ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్ప్పు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:36 pm

యుద్ధం వల్ల అన్నీ నష్టాలే

సర్వేలో అమెరికన్ల నిరసనవాషింగ్టన్: ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అమెరికన్లు భావిస్తున్నారు. గ్యాస్ ధరలు మరింత పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధం వల్ల స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా తమకు నష్టాలే జరుగుతాయనే అభిప్రాయంతో వారు ఉన్నారు. ఓ అమెరికన్ మీడియా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈవిషయం వెల్లడైంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం ఇప్పటికే ప్రారంభమైందని సర్వేలో పాల్గొన్న అనేమంది అమెరికన్లు చెప్పారు. […] The post యుద్ధం వల్ల అన్నీ నష్టాలే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:34 pm

అమెరికా కఠిన వీసా విధానాలతోభారత్, చైనాపై అధిక ప్రభావం

వాషింగ్టన్: విదేశీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష పోకడలప్రభావం భారత్, చైనాపై ఎక్కువగా పడుతోంది. ముఖ్యంగా విద్యా ర్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వీసాల జారీ గణనీయంగా తగ్గినట్టు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెల్లడిం చింది. 2024తో పోల్చితే 2025 తొలి ఎనిమిది నెలల్లో సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయినట్లు ఆ నివేదిక తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినట్లయితే… 2025 […] The post అమెరికా కఠిన వీసా విధానాలతోభారత్, చైనాపై అధిక ప్రభావం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:33 pm

రన్‌వేపై అగ్నిమాపక ట్రక్కును ఢీకొన్న విమానం

న్యూయార్క్ విమానాశ్రయంలో ఘటన న్యూయార్క్: రన్‌వేపై వెళ్తున్న విమానం ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన ఘటన అమెరికా లోని న్యూయార్క్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందగా… మరో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయ పడ్డారు. న్యూయార్క్ లోని లాగార్డియా విమానాశ్రయంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కెనడాలోని మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ సీఆర్‌జే-900… లాగార్డియా విమానాశ్రయంలోని నాలుగో రన్‌వేపై దిగింది. […] The post రన్‌వేపై అగ్నిమాపక ట్రక్కును ఢీకొన్న విమానం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:32 pm

కూలిన కొలంబియా విమానం.. 80 మంది సైనికులు సజీవదహనం

బోగోటా : కొలంబియాలో ఓ సైనిక రవాణా విమానం సోమవారం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని దాదాపు 80 మంది సైనికులు చనిపోయ్యారని అధికారులు తెలిపారు. సైనికులను తరలించేందుకు వినియోగించే సి 130 హర్కులస్ విమానం ప్యూర్టో లెగూయి.జమో నుంచి బయలుదేరిన వెంటనే సాంకేతికలోపాలతో కూలింది. మంటలు చెలరేగి , ఇందులోని రెండు ప్లాటూన్ల సైన్యం దుర్మరణం చెందినట్లు కొలంబియా రక్షణ మంత్రి కూడా నిర్థారించారు. ఈక్వెడార్ సరిహద్దుల్లో జరిగిన ప్రమాదానికి కారణాలు వెల్లడికాలేదు. సాధారణంగా ఈ విమానంలో వంద మంది వరకూ సైనికులను కల్లోలిత ప్రాంతాలకు తరలిస్తారు. సరిహద్దులో ఘర్షణల అణచివేతకు సైన్యాన్ని తరచూ వినియోగిస్తున్నారు.

మన తెలంగాణ 23 Mar 2026 11:30 pm

హోర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలపై భారీగా ‘టోల్‌’

ఇరాన్ నిర్ణయం!తెహ్రాన్: అమెరికా, ఇజ్రాయిల్‌తో కొనసాగుతున్న ఘర్షణల నడుమ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలకు కీలకమైన హోర్మూజ్ జలసంధి గుండా వెళ్లే కొన్ని నౌకలపై భారీగా టోల్ వసూలు చేయాలని నిర్ణయించి నట్లు సమాచారం. ఒక్కో నౌకపై సుమారు 2 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.18 కోట్ల వరకు పన్ను విధించనున్నట్లు ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత కమిటీ సభ్యుడు అలాఎద్దీన్ బొరూజెర్దీ వెల్లడించారు. ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థకు […] The post హోర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలపై భారీగా ‘టోల్‌’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:28 pm

కల్కి సీక్వెల్ కోసం ప్రత్యేక సెట్?

హైదరాబాద్: ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం (సీక్వెల్) శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ లో దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్‌లకు సంబధించి కీలక సన్నివేశా లను చిత్రీకరిస్తున్నారు. అయితే, ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ ప్రత్యేక మైన సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ప్రభాస్ పై ఎంట్రీ సాంగ్ ను చిత్రీకరిస్తారట. ఈ పాటలో […] The post కల్కి సీక్వెల్ కోసం ప్రత్యేక సెట్? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:26 pm

కోలీవుడ్‌లో రోజా వరుస సినిమాలు

చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సీనియర్ నటీమణుల పునరాగమనం నడుస్తోంది. శోభన వంటి నటీమణుల బాటలోనే మాజీ మంత్రి రోజా కూడా మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ తమిళ సినిమాలకు దూరమైన రోజా… 12 రోజుల తర్వాత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైన చిత్రం ‘అన్బే డయానా’. పారి ఎలవళగన్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో రోజా ఒక ముఖ్య […] The post కోలీవుడ్‌లో రోజా వరుస సినిమాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:24 pm

వైభవ్‌కు ఏబీడీ కితాబు

జైపూర్: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుండగా… ఇప్పుడు అందరి దష్టి రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పడింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే గత సీజన్‌లో ఐపీఎల్‌లో సెంచరీ కొట్టి రికార్డు సృష్టించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్… ఆ తర్వాత భారత అండర్-19 జట్టు తరఫున కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో అతనిపై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో అతని ఆటతీరు, ప్రొఫెషనలిజంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాఫ్రికా […] The post వైభవ్‌కు ఏబీడీ కితాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:20 pm

ఇంప్యాక్ట్ నిబంధన నాకు నచ్చదు: అక్షర్

న్యూదిల్లీ: ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అక్షర్ పటేల్ ఐపీఎల్‌లోనూ జోరు చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అక్షర్ ఈసారి జట్టుకు టైటిల్‌ను అందించేందుకు అవసరమైన వ్యూహాలు పన్నుతున్నాడు. మరో ఐదు రోజుల్లో పంతొమ్మిదో సీజన్ మొదలవ్వనున్న నేపథ్యంలో సహచరులతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్‌తో బిజీగా ఉన్న అక్షర్ పటేల్… ‘ఇంప్యాక్ట్ ప్లేయర’ నిబంధనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అన్నీ ఒకే.. కానీ, ఈ ఒక్క నిబంధనే తనకు నచ్చదని […] The post ఇంప్యాక్ట్ నిబంధన నాకు నచ్చదు: అక్షర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:15 pm

కొడంగల్‌లో ఆయిల్‌పామ్, రిఫైనరీ ఫ్యాక్టరీ ఏర్పాటు

కొడంగ్‌లో నూతన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ వెల్లడించారు. సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెరుగుతున్న డిమాండ్ దృష్టా సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కొడంగల్‌లో మరోక ఆయిల్ పామ్, రిఫైనరీ ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇకో పామ్ ఆయిల్, ఫ్యాట్స్ ప్రయివేట్ లిమిటెడ్‌కు చెందిన కంపెనీ గంటకు పది టన్నుల సామర్ధం కలిగిన మిల్లు ఏర్పాటుకు అంగీకారం తెలిపినట్లు చెప్పారు. మిల్లు ఏర్పాటు చేయడానికి 50 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలియజేశారు. భూ కేటాయింపులు జరిగిన సంవత్సరం కాలంలో రూ. 75 కోట్లతో మిల్లు పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మిల్లు ఏర్పాటుతో ప్రత్యక్షంగా వంద మందికి, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. కాగా, జాతీయంగా పామాయిల్ డిమాండ్ కోటి మెట్రిక్ టన్నులుగా ఉందని, భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి దిగుమతుల ద్వారా వంట నూనెల లోటును సమకూర్చుకుంటున్నామన్నారు. వంట నూనెల దిగుమతుల్లో పామాయిల్ వాటా సుమారు 60 శాతం ఉందని, పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే దేశంలో సుమారు 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడం అవసరమని అంచనా ఉన్నట్లు వివరించారు. దీంతో రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఆయిల్ పామ్‌సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో సిఎం ఆదేశాలతో కొడంగల్‌లో ఏర్పాటు చేయనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు రాష్ట్ర రైతులకు మేలు చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉద్యానవన సంచాలకులు యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 23 Mar 2026 10:20 pm

సంతోష్ నగర్‌లో యువకుడి హత్య

గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన నగరంలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పాతబస్తీ, సంతోష్‌నగర్, మెయిన్‌బాగ్‌కు చెందిన సయీద్ లయీక్(31)ను మెయిన్‌బాగ్, మసాన్ గట్టి ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. క్లూస్‌టీం వచ్చి ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతోష్ నగర్ పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 23 Mar 2026 10:13 pm

గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినేట్

గిగ్‌వర్కర్స్, ప్లాట్‌ఫాం కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్ ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ) యాక్ట్ , 2026’ బిల్లును కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్ తో పాటు వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లు ప్రకారం గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయడంతో వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ దీనిని ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం పిసిసి అధ్యక్షుడితో పాలు పలువురితో సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సమావేశమయ్యారు. సభలో చర్చించాల్సిన విషయాలు, సభలో సభ్యులు వ్యవహారించాల్సిన తీరు తదితర అంశాలపై కేబినెట్ చర్చించినట్టుగా తెలిసింది.

మన తెలంగాణ 23 Mar 2026 9:53 pm

Did Pawan Kalyan Hint of Taking a Break?

Pawan Kalyan’s recent film Ustaad Bhagat Singh released last weekend and the film turned out to be a huge embarrassment for the actor. He is badly criticized and his fans trolled him badly. The actor’s production house Pawan Kalyan Creative Works has issued a statement to put an end to the speculations. “As of now, […] The post Did Pawan Kalyan Hint of Taking a Break? appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 9:47 pm

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. హేట్‌ స్పీచ్‌ బిల్లుకు, గిగ్‌ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే,పేరెంట్స్‌ సామాజిక భద్రత బిల్లుకు, అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు, కులగణనపై నిపుణుల క‌మిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రోహిత్ వేముల చ‌ట్టం విధివిధానాల రూప‌క‌ల్పన‌కు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తీర్మానించింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులుగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌, పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనరసింహా, శ్రీధర్‌బాబు వ్యవహరించనున్నారు. ఎల్ అండ్ టీ నుండి మెట్రో స్వాధీనం వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మన తెలంగాణ 23 Mar 2026 9:40 pm

Janhvi Kapoor’s Stand for Telugu Films

Sridevi’s daughter Janhvi Kapoor made her debut in Bollywood. Though she enjoys stardom, the actress hasn’t delivered a huge success in Hindi. She was paired up beside NTR in Devara and the actress’ performance was appreciated. She even became more popular after her portrayal in Devara and she is the leading lady in Ram Charan’s […] The post Janhvi Kapoor’s Stand for Telugu Films appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 9:31 pm

కీడు సోకిందని ఊరు ఖాళీచేసిన గ్రామస్తులు

జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా వరుసగా 28 మంది వివిధ కారణాలతో మరణించడంతో గ్రామంలో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రామానికి ఏదో కీడుసోకిందని బలంగా నమ్మిన గ్రామస్తులు, పురోహితుడి సూచన మేరకు వింత నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజంతా గ్రామస్తులు ఊరు మొత్తం ఖాళీ చేసి వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి కీడు వంటలు వండుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం సోమవారం తెల్లవారు జామునే ఇళ్లకు తాళాలు వేసి గ్రామంలో డప్పు చాటింపు వేయించి మరీ ఊరి బయటకు వెళ్లారు. ఇలా చేస్తేనే గ్రామానికి పట్టిన (కీడు) పీడ విరుగడవుతుందని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.

మన తెలంగాణ 23 Mar 2026 9:20 pm

హార్మూజ్ జలసంధి మీదుగా రెండు భారతీయ ఎల్పీజీ ట్యాంకర్లు

దేశానికి సుమారు ఒకరోజుకుర సరిపడా వంటగ్యాస్‌ను తీసుకువెళ్తున్న భారత జెండా కలిగిన మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు, యుద్ధ వల్ల దెబ్బతిన్న హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. ఇవి రాబోయే రెండు రోజుల్లో భారత తీరానికి చేరుకుంటాయని భావిస్తున్నారు. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం, ‘పైన్ గ్యాస్, జగ్ వసంత్’ అనే ఈ ఎల్పీజీ ట్యాంకర్లు సోమవారం ఉదయం పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరి, పరస్పరం సమీపంగా ప్రయాణిస్తూ హార్మూజ్ జలసంధిని దాటాయి. ఈ రెండు నౌకలు కలిపి సుమారు 92,000 టన్నుల ఎల్పీజీని తీసుకొస్తున్నాయి. పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ, ఈ నౌకలు గల్ఫ్ ప్రాంతం నుంచి భారత్‌కు చేరేందుకు సాధారణంగా రెండు నుంచి రెండున్నర రోజులు పడుతుందని తెలిపారు. ఈ ట్యాంకర్లు ఇరాన్‌కు చెందిన లారాక్ మరియు క్వేశ్మ్ దీవుల మధ్యగా ప్రయాణించాయి. హార్మూజ్ జలసంధిని దాటే ముందు ఇరాన్ అధికారులకు తమ గుర్తింపును స్పష్టంగా తెలియజేయడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి దాదాపు మూసివేయబడటంతో పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన 22 భారత జెండా నౌకల్లో ఈ రెండు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ‘ఎంటీ శివాలిక్’, ‘ఎంటీ నందా దేవి’ అనే ట్యాంకర్లు సుమారు 92,712 టన్నుల ఎల్పీజీతో సురక్షితంగా భారత తీరాలకు చేరుకున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైనప్పుడు మొత్తం 28 భారత జెండా నౌకలు హార్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉన్నాయి. వాటిలో 24 నౌకలు పశ్చిమ భాగంలో, నాలుగు తూర్పు భాగంలో ఉన్నాయి. గత కొన్ని రోజుల్లో రెండు వైపుల నుంచి రెండు నౌకలు చొప్పున సురక్షితంగా బయటపడ్డాయి. ‘శివాలిక్’ నౌక మార్చి 16న గుజరాత్‌లోని ముండ్రా పోర్టుకు చేరగా, ‘నందా దేవి’ మరుసటి రోజు కాండ్లా పోర్టుకు చేరింది. మరో రెండు ఎల్పీజీ నౌకలు మార్చి 13న ప్రయాణం ప్రారంభించి, మార్చి 14న హార్మూజ్ జలసంధిని దాటాయి. ఇక యూఏఈ నుంచి 80,886 టన్నుల క్రూడ్ ఆయిల్ తీసుకువచ్చిన ‘జగ్ లాడ్కీ’ నౌక మార్చి 18న ముండ్రాకు చేరింది. అలాగే ఒమన్ నుంచి ఆఫ్రికాకు పెట్రోలు తీసుకెళ్తున్న ‘జగ్ ప్రకాష్’ ట్యాంకర్ కూడా ముందుగా సురక్షితంగా జలసంధిని దాటి ప్రస్తుతం టాంజానియాకు వెళ్తోంది. ఇంకా యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ఉన్న 24 భారత జెండా నౌకల్లో, 22 నౌకలు పశ్చిమ భాగంలో 611 మంది సిబ్బందితో ఉన్నాయి. మిగిలిన రెండు నౌకలు తూర్పు భాగంలో కొనసాగుతున్నాయి.

మన తెలంగాణ 23 Mar 2026 9:10 pm

Mega Steel Plant in Anakapalli Marks New Industrial Era for Andhra Pradesh

Andhra Pradesh has taken a major step forward in its industrial journey with the foundation of a massive steel plant in Rajayyapeta, Anakapalli district. Chief Minister Chandrababu Naidu laid the foundation stone for the ArcelorMittal Nippon Steel India project and described it as a turning point for the state’s economy. The project is set to […] The post Mega Steel Plant in Anakapalli Marks New Industrial Era for Andhra Pradesh appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 9:01 pm