SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

37    C
...

అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి

అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:28 pm

శిలాఫలకాలపై ఎమ్మెల్యే కీలక నిర్ణయం…

శిలాఫలకాలపై ఎమ్మెల్యే కీలక నిర్ణయం… అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రత్యేక కార్యక్రమాలకు మినహా

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:24 pm

Hyderabad : మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక నిందితుడి అరెస్ట్

మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును పోలీసులు అరెస్ట్ చేశారు

తెలుగు పోస్ట్ 16 Apr 2026 7:21 pm

అక్రమ‌ కల్లు దుకాణాన్ని ప్రోత్స‌హిస్తున్న అధికారులు …

అక్రమ‌ కల్లు దుకాణాన్ని ప్రోత్స‌హిస్తున్న అధికారులు … సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:20 pm

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి…

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి… దుర్గి, ఆంధ్రప్రభ : విద్యుత్ షాక్

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:17 pm

ఒక్క దెబ్బతో నౌకలన్నీ ముంచేస్తాం

16 పరశురాం  అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక సందేశం పంపింది. హర్మూజ్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సన్నిహితుడు, సైనిక సలహాదారు రెజాయి ఒక ప్రకటన విడుదల చేశారు. హర్మూజ్‌లో అమెరికా పెత్తనం కొనసాగితే తమ తొలి క్షిపణ దాడికే అమెరికా నౌకలన్నీ మునిగిపోతాయని హెచ్చరించారు. ప్రాణనష్టం కూడా తీవ్రంగా ఉంటుందన్నారు. హర్మూజ్‌కు సెక్యూరిటీ గార్డ్ పనిచేయడమే మీ పనా? ఒక అమెరికా అధక్షుడు ఈ స్థాయికి దిగజారి పోతారా? అని ఎద్దేవా చేశారు. జలసంధిపై ఆధిపత్యం కోసం ఒక శక్తివంతమైన దేశం, శక్తివంతమైన సైన్యం చేయాల్సిన పని ఇదేనా? అని ప్రశ్నించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మా క్షిపణి దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. విమానాలు రద్దు చేయాల్సి వస్తుందేమో? హర్మూజ్ సంక్షోభం ఇలాగే కొనసాగితే విమానయాన రంగానికి తీవ్ర విఘాతం కలుగుతుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఇఎ) ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపా వద్ద విమానాల ఇంధనం కేవలం వారం రోజులకు సరిపోయేంత మాత్రమే ఉందని, అది కూడా అయిపోతే విమాన సరీసులు రద్దు చేసే పరిస్థితి తలెత్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. హర్మజ్‌లో గ్యాస్, ఇంధన సరఫరా నిలిపివేయడంతో మునుపెన్నడూ లేని కొరత వేధిస్తోందని ప్రకటించింది. 

మన తెలంగాణ 16 Apr 2026 7:13 pm

ఆన్‌లైన్ స్నేహం…

ఆన్‌లైన్ స్నేహం… ప్రమాదపు అంచుల దాకా పయనం48 గంటల్లో ఇద్దరు బాలికలను కాపాడిన

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:11 pm

మహిళ హక్కులకు బీజేపీ ఛాంపియన్ కాదు : ప్రియాంక

బిల్లును ఎవరూ వ్యతిరేకించలేదని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు

తెలుగు పోస్ట్ 16 Apr 2026 7:11 pm

Modi Assures No State Will Lose Representation in Delimitation Push, Calls for Unity on Women’s Reservation

Prime Minister Narendra Modi delivered a clear message in the Lok Sabha as concerns over the proposed delimitation exercise continued to grow across political circles. Addressing Members of Parliament, he assured the nation that no state would face discrimination and that the existing balance of representation would remain intact. The Prime Minister stated that the […] The post Modi Assures No State Will Lose Representation in Delimitation Push, Calls for Unity on Women’s Reservation appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 7:11 pm

ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో దారుణం..

 ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది.కామినేని హాస్పిటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నరేష్ అనే వ్యక్తి మృతి చెందాడు.  వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంకు చెందిన నరేష్ (38) అనే వ్యక్తి నారాయణ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తాడు. గుండెలో చిన్న నొప్పి ఉందని నడుచుకుంటూ హాస్పిటల్ కి వచ్చాడు. పరీక్షించిన వైద్యులు 8 లక్షలు ఖర్చు అవుతుందని  చెప్పారు. 5 లక్షలు రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొని ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ చేశాక నరేష్ మృతి చెందాడు. జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేశారని, మాకు న్యాయం చేయాలంటూ కామినేని హాస్పిటల్ ముందు మృతుడి బందువులు ఆందోళన చేపట్టారు. నారాయణ కాలేజీ లెక్చరర్స్ కలసి కామినేని ఆసుపత్రి ముందు న్యాయం మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా.. మా నారాయణ లెక్చరర్స్ మృతి కి కామినేని ఆసుపత్రి వైద్యులు కారణమని వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని కామినేని డౌన్ కామినేని డౌన్ తోటి ఉద్యోగులు. నినాదాలు చేశారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మన తెలంగాణ 16 Apr 2026 7:10 pm

రీ-సర్వే సమస్యల పరిష్కారమే ధ్యేయం

రీ-సర్వే సమస్యల పరిష్కారమే ధ్యేయం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జలుమూరు(నరసన్నపేట),

ప్రభ న్యూస్ 16 Apr 2026 7:07 pm

Andhra Pradesh : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 16 Apr 2026 7:02 pm

చెన్నైతో మ్యాచ్ కు ముందు సన్‌రైజర్స్ కు ఎదురుదెబ్బ..

హైదరాబాద్: రాజస్థాన్ పై సూపర్ విక్టరీ సాధించి మంచి జోష్ లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా విదేశీ సీమర్ డేవిడ్ పేన్ ఐపీఎల్ 2026 నుండి తప్పుకున్నాడు. జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ ఇంగ్లాండ్ బౌలర్.. మధ్యలోనే టోర్నీ నుంచి వైదొలిగాడు. సన్ రైజర్స్ తరుఫున కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే ఆడిన 35 ఏళ్ల పేన్ పెద్దగా రాణించలేదు. బిగ్ బాష్ లీగ్ (BBL)లో పెర్త్ స్కార్చర్స్ తరఫున ఆరు మ్యాచ్‌లలో 7.95 ఎకానమీ రేటుతో 11 వికెట్లు పడగొట్టిన అద్భుత ప్రదర్శన చేయడంతో పేన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే, ఐపీఎల్‌లో అదే ఫామ్ ను చేయడంలో విఫలమయ్యాడు. కాగా, గత మ్యాచ్ లో ఇద్దరు యువ బౌలర్లు ప్రఫుల్ హింజ్, షకీబ్ హుస్సేన్ ఎంట్రీ ఇచ్చి.. ఎస్ఆర్ హెచ్ కు అదిరిపోయే విజయాన్ని అందించారు. ఇక, తర్వాతి మ్యాచ్ లకు కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీంతో పేన్ తప్పుకున్న హైదరాబాద్ కు ఇబ్బంది ఏం ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, తమ తదుపరి పోరులో హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లోనూ గెలిచి సత్తా చాటాలని హైదరాబాద్ పట్టుదలగా ఉంది.

మన తెలంగాణ 16 Apr 2026 7:00 pm

మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యం..

మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యం.. మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:56 pm

తోడికోడలి నాలుగేళ్ల కుమారుడిని చంపేందుకు పిన్ని కుట్ర

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కుమారుడిని తాత పట్టించుకోవడం లేదన్న కోపంతో.. తోడికోడలి నాలుగేళ్ల కుమారుడిని చంపేందుకు పిన్ని కుట్ర చేసింది. ఎవరూ లేని సమయం చూసి జ్యూస్ అని చెప్పి చిన్నారికి యాసిడ్‌ తాగించింది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. పర్వతం సతీష్ కుమార్, అంజమ్మ దంపతులు బోడుప్పల్ శ్రీనివాస కాలనీలో నివసిస్తున్నారు. వీరికి నాగరాజు, జగదీష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరి కుమారులకు వివాహాలు అయ్యాయి. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు నాగరాజుకు నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అయితే ఇంట్లో తాత సతీష్ కుమార్ పెద్ద కుమారుడి కొడుకుపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని తన కుమారుడిని పట్టించుకోవడం లేదని చిన్న కోడలు మంజుల మనసులో కక్ష పెంచుకుంది. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో జ్యూస్ అని చెప్పిబాలుడికి యాసిడ్ తాగించింది. దీంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 16 Apr 2026 6:51 pm

వాహ‌నాలు న‌డిపే ప్ర‌తి ఒక్క‌రు సీట్ బెల్ట్, హెల్మెట్ ధ‌రించాలి..

వాహ‌నాలు న‌డిపే ప్ర‌తి ఒక్క‌రు సీట్ బెల్ట్, హెల్మెట్ ధ‌రించాలి.. బాలనగర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:50 pm

ఒక్క దెబ్బతో నౌకలన్నీ ముంచేస్తాం.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

టెహ్రాన్ : అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక సందేశం పంపింది. హర్మూజ్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సన్నిహితుడు, సైనిక సలహాదారు రెజాయి ఒక ప్రకటన విడుదల చేశారు. హర్మూజ్‌లో అమెరికా పెత్తనం కొనసాగితే తమ తొలి క్షిపణ దాడికే అమెరికా నౌకలన్నీ మునిగిపోతాయని హెచ్చరించారు. ప్రాణనష్టం కూడా తీవ్రంగా ఉంటుందన్నారు. హర్మూజ్‌కు సెక్యూరిటీ గార్డ్ పనిచేయడమే మీ పనా? ఒక అమెరికా అధక్షుడు ఈ స్థాయికి దిగజారి పోతారా? అని ఎద్దేవా చేశారు. జలసంధిపై ఆధిపత్యం కోసం ఒక శక్తివంతమైన దేశం, శక్తివంతమైన సైన్యం చేయాల్సిన పని ఇదేనా? అని ప్రశ్నించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మా క్షిపణి దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. విమానాలు రద్దు చేయాల్సి వస్తుందేమో? హర్మూజ్ సంక్షోభం ఇలాగే కొనసాగితే విమానయాన రంగానికి తీవ్ర విఘాతం కలుగుతుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఇఎ) ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపా వద్ద విమానాల ఇంధనం కేవలం వారం రోజులకు సరిపోయేంత మాత్రమే ఉందని, అది కూడా అయిపోతే విమాన సరీసులు రద్దు చేసే పరిస్థితి తలెత్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. హర్మజ్‌లో గ్యాస్, ఇంధన సరఫరా నిలిపివేయడంతో మునుపెన్నడూ లేని కొరత వేధిస్తోందని ప్రకటించింది. 

మన తెలంగాణ 16 Apr 2026 6:47 pm

ప్రతినిత్యం ప్రజాసేవ… ప్రతి ఆలోచన ప్రజా సంక్షేమం కోసం

ప్రతినిత్యం ప్రజాసేవ… ప్రతి ఆలోచన ప్రజా సంక్షేమం కోసం తనదైన మార్క్ అభివృద్ధితో

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:40 pm

ఉస్మానియా ఆస్పత్రి హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య, కుటుంబసభ్యుల ఆందోళన

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలోని పిజి హాస్టల్‌లో సురేశ్ అనే వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్‌లో మత్తు ఇంజిక్షన్, నిద్ర మాత్రలు తీసుకున్నాడు. అయితే, అతడి మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల క్రితమే ఉస్మానియా కళాశాలలో పిజిలో చేరినట్లు చెబుతున్నారు. ర్యాగింగ్ వల్లే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్ద సురేశ్ కుటుంబసభ్యులు, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి.

మన తెలంగాణ 16 Apr 2026 6:31 pm

పాలకమండలి సభ్యునిగా ప్రియదర్శిని నవీన్ బాబు….

పాలకమండలి సభ్యునిగా ప్రియదర్శిని నవీన్ బాబు…. ఖ‌మ్మం, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:24 pm

AP Women Ready to Lead the Nation, Says MP Byreddy Sabari in Lok Sabha

Speaking in the Lok Sabha during the discussion on key bills related to women’s reservation and delimitation, Nandyal MP Byreddy Sabari highlighted the growing strength and confidence of women in the state. Sabari stated that the Andhra Pradesh government has been actively promoting women across sectors. She said women are playing a major role in […] The post AP Women Ready to Lead the Nation, Says MP Byreddy Sabari in Lok Sabha appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 6:24 pm

యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా సుధాకర్ గౌడ్.

బిక్కనూరు, ఆంధ్రప్రభ ; తెలంగాణ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా సుధాకర్ గౌడ్

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:23 pm

రోడ్డు భద్రతకు పోలీసుల వినూత్న చర్యలు

రోడ్డు భద్రతకు పోలీసుల వినూత్న చర్యలు అచ్చంపేట, ఆంధ్రప్రభ ; రహదారి ప్రమాదాల

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:18 pm

Swayambhu Ra Ra Dheevara: Goosebumps Galore Song

Nikhil Siddhartha has undeniably set a new benchmark for cinematic grandeur with his upcoming Pan-India film, Swayambhu. Directed by Bharat Krishnamachari the movie is an orchestrated magnificent epic, brought to life on a staggering scale by producers Bhuvan and Sreekar. The makers have now unveiled first single, Ra Ra Dheevara from this highly anticipated film. […] The post Swayambhu Ra Ra Dheevara: Goosebumps Galore Song appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 6:17 pm

బ్లేజ్‌వాడ ఎండల్లోనూ ఇంద్రకీలాద్రి పటిష్టత…

బ్లేజ్‌వాడ ఎండల్లోనూ ఇంద్రకీలాద్రి పటిష్టత… ముమ్మరంగా సాగుతున్న ఎన్ ఐ ఆర్ ఎం

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:16 pm

ఏఐ నగరాన్ని ఏర్పాటు చేస్తాం: ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విజయ్

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్.. గురువారం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను లక్ష్యంగా చేసుకుని పలు సంక్షేమ పథకాలను విజయ్ ప్రకటించారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా విజయ్ మాట్లాడుతూ..టీవీకే నిజాయితీతో కూడిన పరిపాలనను తన సిద్ధాంతంగా స్వీకరించింది. అందుకే మా పార్టీ తొలి ఎన్నికల మేనిఫెస్టో కూడా నిజాయితీకి హామీ అని మేము చెబుతున్నాము. మేము స్టాలిన్ లాగా ప్రజలను తప్పుదోవ పట్టించము. ప్రజలకు ఉత్తుత్తి వాగ్దానాలతో కూడిన మేనిఫెస్టోను తయారు చేయలేదు. డిఎంకెతోపాటు మిగతా పార్టీలు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలను తీసుకుని పోల్చి చూడండి. ఒకటి రెండు అంశాలు ఒకేలా ఉన్నా ఫర్వాలేదు. కానీ వారు ఏం చేశారో మీకు తెలుసా? ఒకరు రూ.10,000 ఇస్తామని వాగ్దానం చేస్తే, మరొకరు రూ.8,000 కూపన్‌ను అందిస్తున్నారు. ఒకరు రిఫ్రిజిరేటర్ ఇస్తే, మరొకరు రిఫ్రిజిరేటర్ కొనడానికి టోకెన్ ఇస్తున్నారు. ఇందులో ఏ విధంగా చూసినా, వారిద్దరూ కేవలం పేరు, రంగు మార్చి ఒకే ఎన్నికల ప్రణాళికను సమర్పించారు. మేము వారి లాగా.. ప్రజలను ఎన్నటికీ మోసం చేయము అని చెప్పారు. రాష్ట్రంలో 60 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం అందిస్తామని విజయ్ తెలిపారు. ప్రతి కుటుంబానికి ఏటా ఆరు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లను కూడా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు మద్దతుగా, టీవీకే అధినేత వివాహానికి సహాయం, 8 గ్రాముల బంగారం, నాణ్యమైన పట్టు చీరతో సహా అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే అవినీతి రహిత, సమర్థవంతమైన పాలన అందిస్తామని హామీ ఇస్తూ, ఏఐ మంత్రిత్వ శాఖ, ఏఐ విశ్వవిద్యాలయం, ఏఐ నగరాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ప్రతి కళాశాల విద్యార్థికి మద్దతుగా, అండర్ గ్రాడ్యుయేట్ నుండి డాక్టరేట్ వరకు విద్యా రుణాల కోసం రూ. 20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణ హామీని అందిస్తాము. ఏఐ సహకారంతో ఉచిత పోటీ పరీక్షల కోచింగ్ అందిస్తాము. ఉపాధి కార్యాలయాలలో నమోదు చేసుకున్న ప్రతి గ్రాడ్యుయేట్ యువతకు నెలకు రూ.5,000 అందుతాయి. 5 వార్షిక కేటాయింపు గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.10,000, ఐటిఐ, డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ. 8,000 స్టైపెండ్‌తో లక్షల ఇంటర్న్‌షిప్‌లు అందిస్తాం అని విజయ్ హామీలను ప్రకటించారు. కాగా.. తమిళనాడులో పోలింగ్ ఏప్రిల్ 23న ఒకే దశలో జరగనుంది, కాగా ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు. 

మన తెలంగాణ 16 Apr 2026 6:15 pm

రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామానికి

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:12 pm

స్వీయ గణనకు కలెక్టర్ శ్రీకారం చుట్టారు…

స్వీయ గణనకు కలెక్టర్ శ్రీకారం చుట్టారు… శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : స్వీయ గణన

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:11 pm

ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలి…

ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలి… మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఆదేశం కోటబొమ్మాళి,

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:06 pm

బల్మూర్‌లో గుర్తుతెలియని వృద్ధుడి మృతి

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:06 pm

ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన కాంగ్రెస్..

చండీగఢ్: హర్యానాలో ఐదుగురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా 'క్రాస్-ఓటింగ్'కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గురువారం (ఏప్రిల్ 16) కాంగ్రెస్.. ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసింది. మాజీ ఎంపీ ధరంపాల్ మాలిక్ నేతృత్వంలోని పార్టీ హర్యానా విభాగపు క్రమశిక్షణా చర్యల కమిటీ (DAC), ఎమ్మెల్యేలు మహమ్మద్ ఇలియాస్ (పునహానా), మహమ్మద్ ఇస్రాయిల్ (హథిన్), రేణు బాలా (సధౌరా), షాలీ చౌదరి (నరైన్‌గఢ్), జర్నైల్ సింగ్ (రాటియా) లను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని నిర్ధారించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రావు నరేందర్ సింగ్ తెలిపారు. రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్య తీసుకున్నామని, దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు.

మన తెలంగాణ 16 Apr 2026 6:01 pm

ఆలయంలోని స్వయంగా లడ్డు ప్రసాదం తయారీ…

ఆలయంలోని స్వయంగా లడ్డు ప్రసాదం తయారీ… ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు

ప్రభ న్యూస్ 16 Apr 2026 6:01 pm

ఎయిర్‌పోర్టులో అకాసా, విమానాన్ని ఢీకొట్టిన స్పైస్‌జెట్ విమానం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో స్పల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న అకాసా విమానాన్ని రన్‌వేపై స్పైస్‌జెట్ విమానం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. రన్‌వేపై ఉన్న అకాసా విమానాన్ని పార్కింగ్ వైపు వెళ్తున్న స్పైస్ జెట్ విమానం తాకుతూ వెళ్లింది. ఈ ప్రమాదంలో స్పైస్‌జెట్ కుడివైపు రెక్క భాగం ధ్వంసమవ్వగా.. అకాసా విమానం ఎడమవైపు భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదంపై అకాసా ఎయిర్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటనతో ప్రయాణికులు, సిబ్బందిని వెంటనే విమానం నుంచి కిందికి దింపాం. వారి భద్రత మా ప్రథమ ప్రాధాన్యం. ప్రయాణికులను హైదరాబాద్ పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని వెల్లడించారు. అటు స్పైస్‌జెట్ కూడా ఈ ఘటనను ధృవీకరించింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. 

మన తెలంగాణ 16 Apr 2026 5:48 pm

Chandrababu : సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న చంద్రబాబు

స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు

తెలుగు పోస్ట్ 16 Apr 2026 5:33 pm

ఘనంగా చేనేత కార్మిక సంఘం 90 వ ఆవిర్భావ దినోత్సవం

విశాలాంధ్ర -ధర్మవరం; చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ లను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణం లో స్థానిక కదిరి గేట్ దగ్గర గల చేనేత విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 90వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి […] The post ఘనంగా చేనేత కార్మిక సంఘం 90 వ ఆవిర్భావ దినోత్సవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 5:32 pm

తేజస్వి సూర్య ఒక తెలివిలేని మూర్ఖుడు : మంత్రి పొన్నం

ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 16 Apr 2026 5:27 pm

Singer Mangli’s Clarification on Allegations

Telugu singer Mangli has been named in a Micro Finance scam worth Rs 150 crores and the news created a sensation. A couple of times, Mangli interacted with the media, urged everyone not to spread fake news and she made it clear that she is not involved in any fraud. She issued an open statement […] The post Singer Mangli’s Clarification on Allegations appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 5:27 pm

Akhil Akkineni’s Lenin: Yetta Yetta is a Peppy Melody

The makers of Lenin are clearly aiming to strike a chord with the masses through their music. The film starring Akhil Akkineni and Bhagyashri Borse in lead roles. Thaman composed the chartbuster first single titled VaareVaa VaareVaa. Now, he brings another groovy melody full of vibrant beats. This is a high-energy track that leans into […] The post Akhil Akkineni’s Lenin: Yetta Yetta is a Peppy Melody appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 5:24 pm

Delhi Airport |స్వల్ప ప్రమాదం.. ప్రయాణికులు క్షేమం

Delhi Airport | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండు

ప్రభ న్యూస్ 16 Apr 2026 5:21 pm

రాష్ట్ర విభజనపై తేజస్వి సూర్య సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 16 Apr 2026 5:20 pm

One More Biopic for Aamir Khan?

Bollywood Mr Perfect Aamir Khan is lining up a bunch of new projects. He was last seen in Sitaare Zameen Par that released last year. As per the reports, Aamir Khan will soon feature in the biopic of Ashneer Grover. The discussions have been going on from sometime and Aamir Khan has given his nod […] The post One More Biopic for Aamir Khan? appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 5:19 pm

యురేకా సైన్స్ ఎక్స్పో- 2026 లో రాష్ట్ర స్థాయి విజేతలు గా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు..

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషువిశాలాంధ్ర ధర్మవరం;;జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన యురేకా సైన్స్ ఎక్స్పో -2026 సైన్స్ ప్రయోగాల పోటీలలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ , సత్యనిర్ధారన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు అరుణా దేవి, కల్యాణి,పద్మశ్రీ, కవిత , ఉమాదేవి […] The post యురేకా సైన్స్ ఎక్స్పో- 2026 లో రాష్ట్ర స్థాయి విజేతలు గా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 5:19 pm

Ponnam |అడ్డగోలుగా మాట్లాడితే ఖబడ్దార్

Ponnam | అడ్డగోలుగా మాట్లాడితే ఖబడ్దార్ Ponnam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 16 Apr 2026 5:19 pm

ఇంటర్ ఫలితాలలో విజయదుందుభి మోగించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు..

ప్రిన్సిపాల్ వనిత వాణివిశాలాంధ్ర ధర్మవరం; ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు విజయదుందుభి మోగించడం జరిగిందని ప్రిన్సిపాల్ వనిత వాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరపు లో 141 మంది పరీక్షలు రాయగా 117 మంది ఉత్తీర్ణత సాధించి 83 శాతంనమోదు కావడం జరిగిందన్నారు. ఒకేషనరీ విభాగంలో 85 మంది కు గాను 71 మంది ఉత్తీర్ణులు కాగా 84 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. టాపర్లుగా ఎస్. భవాని […] The post ఇంటర్ ఫలితాలలో విజయదుందుభి మోగించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 5:15 pm

Tejasvi Surya Compares TG-AP to India-Pakistan, Triggers Massive Telangana Outrage

A political controversy has erupted after BJP MP Tejasvi Surya reportedly compared the formation of Telangana to the India-Pakistan Partition, drawing sharp reactions from leaders across Telangana. The remarks were widely condemned by Congress, BRS and other parties, who called them insensitive, historically inaccurate, and an insult to the statehood movement. Telangana Govt Seeks Action […] The post Tejasvi Surya Compares TG-AP to India-Pakistan, Triggers Massive Telangana Outrage appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 5:12 pm

Narendra Modi : ఈ బిల్లు చారిత్రాత్మకం.. వ్యతిరేకిస్తే ఓటమి తప్పదు

దేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలుంటాయని, ఇది అలాంటి సమయమేనని ప్రధాని మోదీ అన్నారు

తెలుగు పోస్ట్ 16 Apr 2026 5:10 pm

అఖిల్ ‘లెనిన్‌’ నుంచి ‘ఎట్టా ఎట్టా’ వీడియో సాంగ్ రిలీజ్

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అఖిల్.. ఇప్పటికీ సరైన హిట్‌ దొరక్క ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకూ అతను చేసిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు. ఇప్పుడు అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’. ఈ చిత్రం గురించి ప్రకటన వచ్చి చాలాకాలమే అయినా.. సరైన అప్‌డేట్స్ మాత్రం రాలేదు. అయితే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని నెలల క్రితం చిత్రం నుంచి తొలి సాంగ్‌ని విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎట్టా ఎట్టా’ అంటూ సాగే పాట వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్‌లో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేతో కలిసి స్టెప్పులు ఇరగదీశాడు. ఇక తమన్ అందించిన సంగీతం పాటని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా.. శ్రీకృష్ణ అలపించారు. ఇక కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 16 Apr 2026 5:06 pm

గర్భిణీలు, బాలింతలకు పోష్టికాహారం తప్పనిసరి.. సూపర్వైజర్ సునీత

విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : గర్భిణీలు బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు గురువారం కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలంలో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు మాలకొండ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త పార్వతి అధ్యక్షతన పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ కే సునీత హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు […] The post గర్భిణీలు, బాలింతలకు పోష్టికాహారం తప్పనిసరి.. సూపర్వైజర్ సునీత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 4:59 pm

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అమర్నాథ్ రెడ్డి

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అమర్నాథ్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ చురుకైన

ప్రభ న్యూస్ 16 Apr 2026 4:56 pm

పెన్నహోబిలం దేవస్థానంలో లడ్డు ప్రసాదంపై కీలక సంస్కరణలు

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : భక్తుల సౌకర్యం, విశ్వాస పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఇకపై దేవస్థానం ఆవరణంలోనే శుచిశుభ్రతతో, అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తయారు చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రేగాటి నాగరాజు ప్రకటించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవస్థాన ప్రతిష్టను మరింతగా పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, కార్యనిర్వాహణాధికారి […] The post పెన్నహోబిలం దేవస్థానంలో లడ్డు ప్రసాదంపై కీలక సంస్కరణలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 4:48 pm

మహిళల స్వావలంబన ఉంటేనే అది సంపూర్ణ వికసిత్ భారత్: మోడీ

న్యూఢిల్లీ: దేశ పార్లమెంటరీ చరిత్రలో ఈరోజును మరిచిపోలేం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లోక్‌సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మోడీ మాట్లాడారు. ఈ చారిత్రక సమయంలో పాలు పంచుకోవడం తన అదృష్టంగా మోడీ అభివర్ణించారు. మహిళ రిజర్వేషన్‌ బిల్లు దేశ చరిత్రలోనే గొప్ప బిల్లు అని అన్నారు. 30 ఏళ్ల పాటు ప్రయత్నాలు జరిగినా గతంలో ఇది సాకారం కాలేదని తెలిపారు. దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర చాలా కీలకమైందని పేర్కొన్నారు. మహిళలను కలుపుకుని ముందుకెళ్తున్నామని అన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని స్పష్టం చేశారు. దేశానికి సరికొత్త దశ, దిశను ఇస్తున్నామని తెలిపారు. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని.. మహిళల స్వావలంబన కూడా ఉంటేనే.. అది సంపూర్ణ వికసిత్ భారత్ అని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకమని ప్రధాని మోడీ అన్నారు. ‘‘మహిళా బిల్లును వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరు. బిల్లును వ్యతిరేకించే పార్టీలకు, నేతలకు మహిళలు బుద్ధి చెబుతారు. మహిళల బిల్లు విషయంలో అందరూ కలిసి రావాలని కోరుతున్నాం. మహిళ రిజర్వేషన్ బిల్లును దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారు. ఈ బిల్లును తేవటంలో ఎలాంటి రాజకీయ దురుద్ధేశం లేదు. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదు.. దేశ ప్రజల కోసం తెచ్చిన బిల్లు. 30 ఏళ్ల క్రితమే మహిళా బిల్లు తెచ్చామంటున్నారు.. మరి ఎవరికైనా మేలు జరిగిందా? తమకు అన్యాయం చేసిన వారిని మహిళలు సమయం చూసి దెబ్బ కొడతారు. మహిళా బిల్లుకు పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతివ్వాలి. మహిళలు తమ హక్కులపై 30 ఏళ్లుగా గొంతు విప్పుతున్నారు. క్షేత్రస్థాయిలో మహిళలు 30 ఏళ్లుగా పోరాడుతున్నారు’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. రాజకీయాల్లో శక్తిసామర్ధ్యాలు చూపించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని.. ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా.. వారి సామర్థ్యం తెలుస్తుందని మోడీ వివరించారు. ‘‘మహిళా బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే మనుగడ ఉంటుంది. గ్రామీణస్థాయిలో రిజర్వేషన్ల వల్ల మహిళలకు రాజకీయ అవగామన వచ్చింది. ఇప్పటికే గ్రామీణస్థాయి మహిళలు నాయకులుగా రాణిస్తున్నారు. ఒక్కసారి 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చి చూస్తే.. మహిళ శక్తి ఏంటో చూస్తారు. మహిళా బిల్లు నిర్ణయం ఒక్క రాత్రిలో జరిగింది కాదు.. ఈ బిల్లును అందరం మనస్ఫూర్తిగా స్వాగతించాలి. 2023లో అందరి ఏకగ్రీవంగా నారీ శక్తి బిల్లును ఆమోదించుకున్నాం. కొవిడ్ వల్ల 2021లో జనగణన చేపట్టలేకపోయాం’’ అని మోడీ తెలిపారు. ఈ బిల్లు తీసుకురాగానే కొందరు విభజన రాజకీయాలు చేస్తున్నారని మోడీ ధ్వజమెత్తారు. ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ‘‘విభజన రాజకీయాలు చేసే వారిని ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం.. అనే భేదాలు మాకు లేవు. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాం. ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని వాగ్దానం చేస్తున్నాం. దేశంలోని మహిళలకు వారి హక్కులు కల్పిస్తున్నాం. అనేక పార్టీలు మహిళల హక్కులను ఇన్నాళ్లూ అడ్డుకున్నాయి. దాన్ని గుర్తించే మేం ఇప్పుడు మహిళలకు వారి హక్కులు కల్పిస్తున్నాం’’ అని మోడీ స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 16 Apr 2026 4:47 pm

Ntr – Rukmini |త్యాగానికి ఫలితం దక్కేనా..?

Ntr – Rukmini | త్యాగానికి ఫలితం దక్కేనా..? Ntr – Rukmini

ప్రభ న్యూస్ 16 Apr 2026 4:46 pm

Stimulate |వేడికి గురైన వెంటనే చల్లటి నీరు తాగితే శరీరానికి ఏం జరుగుతుంది?

Stimulate | వేడికి గురైన వెంటనే చల్లటి నీరు తాగితే శరీరానికి ఏం

ప్రభ న్యూస్ 16 Apr 2026 4:43 pm

కొండ పైకి సులభ మార్గం – లత్తవరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రహదారి పూర్తి

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలోని కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రాకపోకలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణం విజయవంతంగా పూర్తైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టడం జరిగింది.గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప, ప్రముఖులు కొర్రపాటి మల్లికార్జున ఆధ్వర్యంలో హిటాచీ, జేసీబీ యంత్రాలతో సుమారు 40 రోజుల పాటు నిరంతర […] The post కొండ పైకి సులభ మార్గం – లత్తవరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రహదారి పూర్తి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 4:42 pm

BJP MP |కాంగ్రెస్ నిర్ణయాల వల్లే ఇప్పటికీ విభేదాలు…

BJP MP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లోక్‌సభలో డీలిమిటేషన్ అంశంపై

ప్రభ న్యూస్ 16 Apr 2026 4:27 pm

Peddi |రిలీజ్ డేట్ ఎందుకు చెప్పలేదు..?

Peddi | రిలీజ్ డేట్ ఎందుకు చెప్పలేదు..? Peddi | పెద్ది రిలీజ్‌పై

ప్రభ న్యూస్ 16 Apr 2026 4:14 pm

Strong Pre-Release Talk Surrounds Thiruveer’s “Papam Prathap”

Thiruveer’s Papam Prathap is arriving in cinemas tomorrow, carrying steady pre-release momentum and industry interest. The film, backed by ETV Win, has generated attention through its aggressive promotions and relatable theme. Positioned as a rural entertainer, the film is expected to balance comedy with emotional depth. Early inputs suggest a fun-filled first half supported by […] The post Strong Pre-Release Talk Surrounds Thiruveer’s “Papam Prathap” appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 4:05 pm

Andhra Prabha Smart Edition |AP|డిజిటల్​ గణన/లోక్​సభలో ఓటింగ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 16-04-2026, 4.00PM ap డిజిటల్​ గణన.. ఏపీలో

ప్రభ న్యూస్ 16 Apr 2026 4:05 pm

Andhra Prabha Smart Edition |TS|పార్లమెంట్​లో/లిటిగేషన్​

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 16-04-2026, 4.00PM ts దక్షిణాదికి ముప్పు.. పార్లమెంట్​లో

ప్రభ న్యూస్ 16 Apr 2026 4:01 pm

భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర

27న విశాఖ నుంచి ప్రారంభం The post భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 4:00 pm

ఉరవకొండలో ఎండకు చల్లని ఉపశమనం… విశ్రాంతి ఉద్యోగుల సేవా కార్యక్రమం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) ఉరవకొండ పట్టణంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు విశ్రాంతి ఉద్యోగుల యూనియన్ ముందుకొచ్చింది. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉచిత మజ్జిగ మరియు మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి, సబ్ ట్రెజరీ అధికారి నాగేంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతి ఏడాది వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు, ఎండ వేడిమి నుంచి రక్షణ కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశ్రాంతి ఉద్యోగుల యూనియన్ ప్రత్యేకతగా […] The post ఉరవకొండలో ఎండకు చల్లని ఉపశమనం… విశ్రాంతి ఉద్యోగుల సేవా కార్యక్రమం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 3:54 pm

summer|తెలంగాణ‌లో ఠారెత్తిస్తున్న ఎండ‌లు

summer| తెలంగాణ‌లో ఠారెత్తిస్తున్న ఎండ‌లు ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో భానుడు

ప్రభ న్యూస్ 16 Apr 2026 3:51 pm

పార్వతీపురం మన్యంజిల్లాలో ప్రారంభమైన స్వీయ గణన( సెల్ఫ్ ఎన్యుమురేషన్)

విశాలాంధ్ర,పార్వతీపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వీయగణనః (సెల్ఫ్ ఎన్యూమరేషన్) కార్యక్రమం జిల్లావ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈకార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తన వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్ ద్వారా స్వయంగా నమోదుచేసి శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుతాయన్నారు. ప్రజలే స్వయంగా వివరాలు నమోదు చేయడంవల్ల తప్పులు దొర్లే అవకాశం […] The post పార్వతీపురం మన్యంజిల్లాలో ప్రారంభమైన స్వీయ గణన( సెల్ఫ్ ఎన్యుమురేషన్) appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 3:40 pm

కరీంనగర్ –జగిత్యాల హైవే పనుల్లో వేగం పెంచాలి

కరీంనగర్ – జగిత్యాల హైవే పనుల్లో వేగం పెంచాలి ఢిల్లీ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 16 Apr 2026 3:39 pm

water melon |ప్ర‌యోజ‌నాలు మీకు తెలుసా..

water melon |ప్ర‌యోజ‌నాలు మీకు తెలుసా.. ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భానుడు నిప్పులు

ప్రభ న్యూస్ 16 Apr 2026 3:29 pm

అశోకచక్రం ప్రదర్శనకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

జాతీయ పతాకంపై ఉండే అశోక చక్రంను ఎలా ప్రదర్శించాలనే దానిపై దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి అంశాలపై భావోద్వేగాలకు లోనుకావాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. వారణాసిలోని ఒక కూడలిలో ఏర్పాటు చేసిన అశోక చక్రాన్ని ఉదాహరణగా చూపుతూ సచిన్ గుప్తా అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ […] The post అశోకచక్రం ప్రదర్శనకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 3:27 pm

కేవలం మోడీ వల్లే మహిళ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందింది: తేజస్వీ

న్యూఢిల్లీ: తాజాగా ప్రవేశపెట్టిన బిల్లుల ద్వారా మహిళ రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయాలని కేంద్రం యోచిస్తుందని ఎంపి తేజస్వీ సూర్య అన్నారు. లోక్‌సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. 2029 నుంచి మహిళ రిజర్వేషన్ల అమలులో దేశ అభివృద్ధిలో కొత్త చరిత్ర అని అన్నారు. బిల్లు ద్వారా మహిళలకు మరిత శక్తి లభించబోతుందని స్పష్టం చేశారు. జాతి నిర్మాణంలో మహిళల పాత్ర మరింత కీలకం కాబోతుందన్నారు. మూడు బిల్లులను తెస్తున్న కేంద్రానికి అభినందనలు తెలిపారు. 1996లో మొదలైన మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశం ఇప్పుడు కొలిక్కి వస్తోంది హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశం 30 ఏళ్లుగా ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. మహిళ రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాలు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నాయని తేజస్వీ మండిపడ్డారు. గతంలో బిల్లు ప్రవేశ సమయంలో సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జెడి తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. మహిళ రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించడాన్ని దేశం ఎప్పటికీ మరువదు అని తెలిపారు. కేవలం నరేంద్ర మోడీ వల్లే 2023లో మహిళ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిందని అన్నారు. ఈ బిల్లుపై విపక్షాలు కొత్త వాదనతో ముందుకొస్తున్నాయని.. ఆటంకం సృష్టించి మహిళ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ సాకుతో మహిళ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. 2023లోనే ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఏకగ్రీవంగీ ఆమోదం పొందిందని తెలిపారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలుకు అన్నిపార్టీలు అంగీకరించాయన్నారు. ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షాలు యూ టర్న్ తీసుకుని డీలిమిటేషన్‌ చేపట్టవద్దని చెబుతున్నాయని పేర్కొన్నారు.

మన తెలంగాణ 16 Apr 2026 3:15 pm

దళిత రత్న అవార్డు అందుకున్నకలకొండ యాదగిరి

వెల్దండ, ఆంధ్రప్రభ ; హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు

ప్రభ న్యూస్ 16 Apr 2026 3:10 pm

Registrar Office |విజిలెన్స్ తనిఖీలు

Registrar Office | విజిలెన్స్ తనిఖీలు Registrar Office | కరీంనగర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:59 pm

మహిళలకు 33శాతం రిజర్వేషన్లకు మద్దతిస్తున్నాం : అఖిలేష్ యాదవ్

న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీ ఎప్పుడూ మహిళల పక్షాన ఉంటుందని లోక్‌సభ సభ్యుడు అఖిలేష్ యాదవ్ తెలిపారు. మహిళల అభివృద్ధికి కారణంగా సమాజ్ వాదీ పార్టీ కృషి చేసిందని అన్నారు. లోక్‌సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా చర్చ ప్రారంభించిన అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లకు మద్దతిస్తున్నామని, ఎన్డిఎ హయాంలో మహిళలకు అనేక పథకాలు తెచ్చినట్లు చెప్పారని, లింగసమానత్వంలో భారత్ ఎక్కడ ఉందో గమనించాలని అఖిలేష్ యాదవ్ సూచించారు. లింగ సమానత్వంలో 146 స్థానాల్లో భారత్ 127 స్థానాల్లో నిలిచిందని, దేశంలో 21 రాష్ట్రాలు, యూటీల్లో ఎన్డిఎ పాలన ఉందని తెలియజేశారు. ఎన్డిఎ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందరో మహిళా సిఎంలు ఉన్నారని, ఢిల్లీలో ఉన్న మహిళా ముఖ్యమంత్రి.. కేవలం సగం సిఎం మాత్రమేనని అన్నారు. మహిళ అయినందుకు సగం సిఎం అయ్యారని..అధికారాలు మాత్రం లేవని..ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి వద్ద అధికారాలు ఉన్నాయని అన్నారు. అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బిజెపి పాలిత రాష్ట్రాల్లో తమ సంఖ్య ఎంతని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. 

మన తెలంగాణ 16 Apr 2026 2:52 pm

Arjun Ram Meghwal |ఆ రిజర్వేషన్ అమలు సమయం ఆసన్నమైంది

Arjun Ram Meghwal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లోక్‌సభ స్థానాల

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:52 pm

పాలిసెట్-2026కు సర్వం సిద్ధం

పాలిసెట్-2026కు సర్వం సిద్ధం పకడ్బందీ ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశం శ్రీకాకుళం, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:50 pm

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసి చైర్మన్

వేంసూరు, ఆంధ్రప్రభ : చౌడవరం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:45 pm

అగ్ని ప్రమాదాలపై విస్తృత అవగాహన

అగ్ని ప్రమాదాలపై విస్తృత అవగాహన విజయవాడ, ఆంధ్రప్రభ : ​అగ్నిమాపక వారోత్సవాలు మూడవ

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:45 pm

పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేయాలి

పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేయాలి వికారాబాద్, ఆంధ్రప్రభ : పోషణ్ అభియాన్

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:43 pm

కంటి చూపే సురక్షిత ప్రయాణానికి మూలం

కంటి చూపే సురక్షిత ప్రయాణానికి మూలం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:39 pm

రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సూర్యుడు విశ్వరూపం చూపిస్త్తున్నాడు. భానుడి భగభగలతో రాష్ట్రం ఉడికిపోతుంది. మండిపోతున్న ఎండల కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం, శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. రానున్న మూడు రోజుల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు క్రమేపీ.. ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మన తెలంగాణ 16 Apr 2026 2:38 pm

జగనూ.. ఎందుకిక డైరెక్ట్ గా బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చుగా భయ్యా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు అన్నీ ఒక తాను ముక్కలే

తెలుగు పోస్ట్ 16 Apr 2026 2:25 pm

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి… మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అశ్వారావుపేట, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:16 pm

Delimitation |ఆ బిల్లుపై మజ్లిస్ పార్టీ అభ్యంతరం

Delimitation | ఆ బిల్లుపై మజ్లిస్ పార్టీ అభ్యంతరం Delimitation | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:08 pm

Fact Check: Viral video of Pakistani panelist mocking Chitra Tripathi on ABP News is edited

Original ABP news broadcast shows no such exchange took place

తెలుగు పోస్ట్ 16 Apr 2026 2:06 pm

కేంద్రం.. డీలిమిటేషన్ ను రాజకీయ అస్త్రంగా వాడుతుంది : గౌరవ్ గొగోయ్

ఢిల్లీ: మహిళా బిల్లు సభలో ప్రవేశపెట్టడం ఇది తొలిసారి కాదని లోక్ సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఇంత హడావుడిగా బిల్లును ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా చర్చ ప్రారంభించిన  గొగోయ్ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని.. డీలిమిటేషన్ కు మాత్రమే వ్యతిరేకమని తెలియజేశారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదని, అందుకే మార్పులు చేస్తున్నారని విమర్శించారు. జనగణన తర్వాత డీలిమిటేషన్ అన్నారని, డీలిమిటేషన్ ను రాజకీయ అస్త్రంగా వాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు.. మహిళా రిజర్వేషన్లకు, డీలిమిటేషన్ కు లింక్ పెడుతున్నారని, మూడేళ్లలో ఏం మారిందని, 815 స్థానాలు వస్తాయని కేంద్రం ఎలా నిర్ణయిస్తుంది..? గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారని, జనగణన, నియోజకవర్గాల పురర్విభజనకు చాలా సమయం పడుతుందని తమరే చెబుతున్నారని అన్నారు. జనగణన ప్రక్రియ చేపట్టాలని హోమంత్రి అమిత్ షా చెబుతున్నారని, ఈ విషయం ఆధారంగా మహిళల పక్షాన కేంద్రం లేదని అర్థమౌతుందని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్లపై పలుమార్లు వేర్వేరు ప్రకటనలు చేస్తున్నారని, మహిళల రిజర్వేషన్ల అమలును మరింత ఆలస్యం చేసే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సులువుగా ఆమోదం పొందే బిల్లుకు అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారని, 2023లోనే కాంగ్రెస్ మాట విని ఉంటే 2024లో మహిళా రిజర్వేషన్లు అమలయ్యేవని పేర్కొన్నారు. మహిళల రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టవద్దని సూచించారు. ప్రస్తుతం ఉన్న 543 సభ్యుల సంఖ్యా బలంతో మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని, కేంద్రం చేస్తున్న రాజకీయాలు.. మూడు బిల్లుల్లో ప్రస్ఫూటం అవుతున్నాయని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయవద్దని యోచన చేయండని గౌరవ్ గొగోయ్ కోరారు.

మన తెలంగాణ 16 Apr 2026 2:03 pm

వీదికుక్కల దాడి…

వీదికుక్కల దాడి… నలుగురికి తీవ్ర గాయాలు..రెండు ఆవులపై దాడి.. జన్నారం రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Apr 2026 1:49 pm

Sunny Leone |బికినీ అందాలు చూసొద్దాం రండి..

Sunny Leone | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : శృంగార తార సన్నీ లియోన్..

ప్రభ న్యూస్ 16 Apr 2026 1:45 pm

భారత్‌లో LPG సంక్షోభం తగ్గడానికి ఇంకా 4 ఏళ్లు పడొచ్చు

భారత్‌లో LPG (వంట గ్యాస్) సరఫరా సమస్యలు త్వరగా సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు.ఈ సమస్య పూర్తిగా సర్దుబాటు కావడానికి ఇంకా 3 నుంచి 4 ఏళ్లు పడొచ్చని ఒక నివేదిక చెబుతోంది.ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న దిగ్బంధం, అలాగే ఇరాన్ నుంచి ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి.దీంతో భారత్ సహా దక్షిణాసియా దేశాలకు వంట గ్యాస్ సరఫరా తీవ్రంగా దెబ్బతింటోంది.కీలక సరఫరాలు నిలిచిపోవడంతో గ్యాస్ సరఫరా […] The post భారత్‌లో LPG సంక్షోభం తగ్గడానికి ఇంకా 4 ఏళ్లు పడొచ్చు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 1:43 pm

Pinni | 4 ఏళ్ల చిన్నారికి యాసిడ్ తాగించి…

Pinni | 4 ఏళ్ల చిన్నారికి యాసిడ్ తాగించి… Pinni | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 16 Apr 2026 1:42 pm

పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నిందితుడి అరెస్ట్

పంజాబ్‌లో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఉగ్ర కుట్రను పోలీసులు తాజాగా భగ్నం చేశారు.పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థతో సంబంధాలు కొనసాగిస్తున్న ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద నుంచి నాలుగు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.అమృత్‌సర్, మొహాలి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రత్యేక విభాగంతో కలిసి పంజాబ్ పోలీసుల ప్రతిఘటన విభాగం సంయుక్తంగా చర్యలు చేపట్టింది.ఈ చర్యల్లో నిందితుడి వద్ద నుంచి నాలుగు గ్రనేడ్లతో పాటు రెండు విదేశీ తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన […] The post పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నిందితుడి అరెస్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 1:33 pm

డ్రైవర్ నిద్ర మత్తే ఘోర ప్రమాదానికి కారణం…

డ్రైవర్ నిద్ర మత్తే ఘోర ప్రమాదానికి కారణం… ఎస్పీ విక్రాంత్ పాటిల్..పర్మిట్ లేకుండా

ప్రభ న్యూస్ 16 Apr 2026 1:30 pm