ఉత్తరాంధ్రకు వడగాలుల హెచ్చరిక..
ఉత్తరాంధ్రకు వడగాలుల హెచ్చరిక.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేడు
Lebenon - Israel War : లెబనాన్ తో నేరుగా చర్చలకు ఇజ్రాయిల్ సిద్ధం
లెబనాన్తో నేరుగా చర్చలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు
కోల్కతా: ఐపిఎల్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్ మూడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన లక్నో ఇన్నింగ్స్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు మిఛెల్ మార్ష్ (15), ఐడెన్ మార్క్రమ్ (22) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బడోని 7 ఫోర్లు, 2 సిక్స్లతో 54 పరుగులు చేశాడు. చివర్లో ముకుల్ చౌదరి చిరస్మరణీయ ఇన్నింగ్స్తో పంజాబ్కు అద్భుత గెలుపును అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ముకుల్ 27 బంతుల్లోనే ఏడు సిక్స్లు, 2 ఫోర్లతో అజేయంగా 54 పరుగులు చేశాడు. అంతకుముందు కోల్కతా టీమ్లో రహానె (41), రఘువంశీ (45), పొవెల్ (39), గ్రీన్ (32) పరుగులు చేశారు.
ఆత్మవిశ్వాసంతో రాజస్థాన్.. నేడు బెంగళూరుతో పోరు
గౌహతి: హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ రాజస్థాన్ జయకేతనం ఎగుర వేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇక బెంగళూరు ఆడిన రెండు మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లలోనూ ప్రతిభాంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగాడు. జోరు సాగిస్తారా.. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో అసాధారణ బ్యాటింగ్తో చెలరేగి పోయారు. ఇద్దరు విధ్వంసక బ్యాటింగ్తో రాజస్థాన్కు భారీ స్కోరు సాధించి పెట్టారు. ఈ మ్యాచ్లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్న ముంబైపై వీరు సునామీ ఇన్నింగ్స్లతో విరుచుకు పడ్డారు. బెంగళూరుపై కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యారు. యువ ఆటగాళ్లు జోరుమీదుండడం రాజస్థాన్కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇద్దరు చెలరేగితే రాజస్థాన్కు మరోసారి భారీ స్కోరు సాధించడం కష్టం కాకపోవచ్చు. రియాన్ పరాగ్, హెట్మెయిర్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అంతేగాక ఆర్చర్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇక బెంగళూరులో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఛాలెంజర్స్ ఆలవోక విజయాలను సాధించింది. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రజత్ పటిదార్, జితేశ్ శర్మ, విరాట్ కోహ్లి, పడిక్కల్, ఫిలిప్ సాల్ట్, డేవిడ్, షెఫర్డ్, కృనాల్ పాండ్య వంటి స్టార్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్లో బెంగళూరుకు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి.
బంధువుల ఆరోపణ వరంగల్ జిల్లా ఎకె తండాలో దారుణం జాతీయ రహదారిపై ధర్నా మన తెలంగాణ/వర్ధన్నపేట/రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మం డల పరిధిలోని ఏకే తండాలో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. బుధవారం రాత్రి ఏకే తండాకు చెందిన చిట్టి అనే యువతి(21) నలుగురు యువకులు అత్యాచారం చేసి ఉరి వేసి చంపారని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో యువతి మృతిచెందగా వర్ధన్నపేట మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ యువతి కుటుంబ సభ్యులు మార్చురీ ఎదుట జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. నలుగురు యువకులు ఎల్లప్పుడు గంజాయి మత్తులో ఉండేవారని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. గంజాయి మత్తులో నలుగురు యువకులు ఆ యువతి పై గ్యాంగ్ రేప్కు పాల్పడి చంపేశారని ఆరోపిస్తూ మృతురాలు కుటుంబ సభ్యులు వర్ధన్నపేట సెంటర్ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అమాయకురాలైన యువతిని కిడ్నాప్ చేసి ఆపై గ్యాంగ్ రేప్కు పాల్పడి హతమార్చారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.నిందితులను శిక్షించే దాకా మృతదేహానికి పోస్టుమార్టం చేసేది లేదంటూ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పడంతో వర్ధన్నపేట మార్చురీ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జెరూసలేం: లెబనాన్తో నేరుగా చర్చలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్నెతన్యాహు ప్రకటించారు. వీలైనంత త్వరగా ఈ చర్చలు ప్రారంభించాలని కేబినెట్కు ఆదేశించినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. లెబనాన్ ప్రభుత్వం పలుమార్లు నేరు గా చర్చలు ప్రారంభించాలని కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్చలు ప్రధానంగా హిజ్బొల్లా మిలిటెంట్ల నిరాయుధీకరణ, అలాగే ఇజ్రాయెల్లెబనాన్ మధ్య శాం తి సంబంధాల ఏర్పాటుపై కేంద్రీకృతమవుతాయ ని తెలిపారు. హిజ్బొల్లాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత లెబనాన్పై ఇజ్రాయెల్ చేపట్టిన అతిపెద్ద దాడుల్లో 200 మందికి పైగా మరణించిన నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ప్రాం తంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ చర్చలు కీలకంగా మారనున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగం కావాలని ఇరాన్ పట్టుబడుతుండగా, అమెరికాఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ ఈ ఒప్పందంలో భాగం కాదని స్పష్టం చేస్తున్నాయి.
నేడు ఢిల్లీకి సిఎం రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో నిర్వహించనున్న వర్కింగ్ కమిటీ (సీడబ్లూసి) సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. నేడు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు. నేడు మధ్యాహ్నాం ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించనున్నట్టుగా తెలిసింది. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ పర్యటనలో సిఎం వెంట వెళ్లనున్నారు. రాష్ట్రంలో పాలన పరంగా 28 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు, రాష్ట్ర అభివృద్ధి పనుల పురోగతిని సిఎం ఏఐసిసి అధిష్టానానికి వివరించనున్నారు. అలాగే, రాష్ట్ర కేబినెట్ విస్తరణ లేదా నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా అధిష్టానంతో సిఎం ప్రాథమిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. శుక్రవారం సాయంత్రం ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో ముఖ్యమంత్రి విడివిడిగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా సూర్యుడి భగ భగలు ఏప్రిల్ 12 నుంచి ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 12 నుంచి 22 వరకు 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుం డటంతో ఎండలు మండుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు తన భగభగలను మొదలుపెడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న మూడు రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉష్ణతరంగ పరిస్థితులు ఏర్పడనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర పరిస్థితులు నెలకొని, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా ఏప్రిల్ 12 నుంచి 22 వరకు వరుసగా 10 రోజుల పాటు 40-41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిం చారు. బుధవారం రాష్ట్రంలో 26 జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా, శనివారం 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ ఆలర్ట్ జిల్లాల్లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేసింది. మధ్యాహ్నం వేళల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు వేసవి తాపం నుండి రక్షణ పొందే మార్గాలు తీవ్రమైన వడగాల్పుల నుండి కాపాడుకోవడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ఈ సమయంలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృద్ధులు, పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ నుంచి రక్షణ కోసం దాహం వేయకపోయినా తరచుగా మంచినీరు తాగుతూ ఉండాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు, గొడుగు వాడాలి. కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్ ధరించడం వల్ల ఎండ వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. అధిక ప్రోటీన్, ఉప్పు, మసాలా, నూనె ఎక్కువ ఉండే ఆహారం తినకుండా ఉండాలి. సూర్యకాంతిలో బయటకు వెళ్తే షూస్ లేదా చెప్పులు తప్పక ధరించాలి. పగటిపూట (ముఖ్యంగా సూర్యకాంతి పడే వైపు) కిటికీలు, కర్టెన్స్ మూసి ఉంచండి. రాత్రి చల్లని గాలి రావడానికి తెరిచి ఉంచడం చేయాలి. బయటి పనులు ఉదయం, సాయంత్రం చల్లని సమయంలోనే చేయండి. ఇంట్లో తయారు చేసుకునే పానీయాలు సులువుగా ఇంట్లోనే లభించే నిమ్మరసం, మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్, ఉప్పు-చక్కర నీటి ద్వారా శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంచవచ్చని నిపుణులు చెపుతున్నారు. ప్రయాణం చేసేటప్పుడు నీళ్ల బాటిల్ తీసుకెళ్లండి. నీరు ఎక్కువగా ఉండే సీజనల్ పండ్లు, కూరగాయలు తినండి (వాటర్ మెలన్, మస్క్ మెలన్, ఆరెంజ్, ద్రాక్ష, అనాస, కాకరకాయ మొదలైనవి). ఎండ దెబ్బ లక్షణాలు ఎండ దెబ్బ గురయిన వ్యక్తి ఉండే లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు. ఎండ దెబ్బ తగిలిన వ్యక్తికి వికారం, వాంతులు, వేడి, ఎర్రటి, పొడి చర్మం, శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉండడం జరుగుతుంది. తలనొప్పి, ఆందోళన, మైకం, స్పృహ కోల్పోవడం, కండరాల బలహీనత, తిమ్మిర్లు, వేగవంతమైన హృదయ స్పందన, మానసిక గందరగోళం (గందరగోళం, కోపం, చిరాకు, సీజర్, కోమా) ఉంటాయని, వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య సహాయం తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు.
బిఆర్ఎస్లో చేరాలని ఆయనను ఆహ్వానించాం రెండు రోజుల్లో కెసిఆర్ను కలుస్తానన్నారు అధికార మత్తులో రేవంత్ ఇష్టారీతిలో మాట్లాడుతున్నారు: కెటిఆర్ మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: రాజకీయం గా 42 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న జీవన్రెడ్డికి బిఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పించడంతోపాటు ప్రజల్లో వారికి ఉన్న గుర్తింపుకు అనుగుణంగా గౌరవించుకుంటామని భారత రాష్ట్ర సమి తి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన జీవన్రెడ్డిని బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు కెటిఆర్ కరీంనగర్,నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బిఆర్ఎస్ నేతలతో కలిసి గురువారం జగిత్యాలలోని జీవన్రెడ్డి నివాసానికి వెళ్లి జీవన్రెడ్డితో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి అధికార మత్తులో తన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడన్నారు. తాము అధికారంలోకి వస్తే 420 హామీలు అమలు చేస్తామని చెప్పి గద్దె నెక్కిన రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని గొప్పలు చెప్పి ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టారని, రైతులకు ఇవ్వాల్సిన రూ. 27 వేల కోట్లు ఎగ్గొట్టి కాంగ్రెస్ రైతులకు తీరని ద్రోహం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీతో 42 ఏళ్ల అనుబంధం ఉన్న సీనియర్ నేత జీవన్రెడ్డిని అవమానానికి గురి చేయడం దురదృష్టకరమన్నారు. రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇటీవల బట్టి విక్రమార్క కొడుకు పెళ్లికి వెళ్లిన సందర్భంగా అక్కడ సుమారు 150 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు తనతో కరచాలనం చేసి అన్న వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పడాన్ని బట్టి చూస్తే కార్యకర్తలో రేవంత్ సర్కార్పై ఎంత అయిష్టత ఉందో స్పష్టమవుతోందన్నారు. ఇక ప్రజల్లో రేవంత్ సర్కార్పై ఉన్న వ్యతిరేకత గురించి చెప్పాల్సిన అవసరమే లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ద్ధంగా ఉన్నారన్నారు. జీవన్రెడ్డికి, కెసిఆర్తో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని కెటిఆర్ చెప్పుకొచ్చారు. 2014కు ముందు జీవన్రెడ్డిని టిఆర్ఎస్లోకి రావాలని కెసిఆర్ ఆహ్వానించారని, అయితే నిబద్ద్ధత గల నాయకుడిగా కాంగ్రెస్తో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేక ఆ పార్టీలోనే కొనసాగారన్నారు. 2014లో కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జీవన్రెడ్డి కరీంనగర్లో జరిగిన ఓ సమావేశంలో బోర్నపెల్లి వంతెనకు నిధులు మంజూరు చేయాలని కెసిఆర్ను కోరగానే అక్కడికక్కడే వంతెన నిర్మాణానికి రూ. 75 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే అసెంబ్లీలో జరిగిన చర్చలో నిజాం షుగర్స్ను తెరిపించాలని జీవన్రెడ్డి కోరగా వెంటనే స్పందించిన కెసిఆర్ మహారాష్ట్రలో కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా నడిపిస్తున్నారని, ఇక్కడ కూడా అలాగే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆ సొసైటీకి మీరే అధ్యక్షుడిగా ఉండాలని జీవన్రెడ్డి పేరును కెసిఆర్ ప్రతిపాదించినట్లు ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు. పార్టీలోకి రావాలని జీవన్రెడ్డిని సాదరంగా ఆహ్వానించామని, రెండు మూడు రోజుల్లో కెసిఆర్తో కలిసి అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత తన నిర్ణయం చెబుతానని జీవన్రెడ్డి చెప్పినట్లు కెటిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంఎల్సి ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, విద్యాసాగర్రావు, బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్గుప్తా, రసమయి బాలకిషన్, వొడితెల సతీశ్కుమార్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్రెడ్డి, రవీందర్సింగ్, తుల ఉమ, నారదాసు లక్ష్మన్రావు, జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం మరమ్మతులకు ప్రత్యేక కార్యచరణ
కాళేశ్వరం బ్యారేజీల మరమ్మత్తు పనులు వేగవంతం చేయండి మరమ్మత్తుల కోసం ప్రత్యేక కార్యాచరణ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మంత్రి ఉత్తమ్తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఎం సమీక్ష మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలకు మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ సూచనల మేరకు పనులను పూర్తి చేయాలన్నారు . వీలైనంత త్వరగా ఈ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సిఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పైన సమీక్ష నిర్వహించారు. మరమ్మత్తుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించిన ఏజెన్సీలన్నింటిని అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని ఆయన సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సిడబ్లుపిఆర్ఎస్) ఆధ్యర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణ ను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ , సిడబ్ల్యూపిఆర్ఎస్ , బ్యారేజీల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టేషన్స్ తో టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్లుసి) సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డ లో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజ్ ని అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తొవ్వాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్ లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబరు వరకు చేయాల్సిన పనులపైన పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలన్నారు. పనులలో జాప్యం జరగడానికి వీలు లేదన్న ముఖ్యమంత్రి నిధుల విషయంలో ఇబ్బంది కల్గనివ్వమని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభం అయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. సమావేశం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, సిఎం కార్యదర్శి మానిక్ రాజ్, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆలయాల్లో ప్రవేశంపై ఆంక్షలు హిందూ మతానికే నష్టం
సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక శబరిమలలో మహిళలకు నిషేధంపై దాఖలైన కేసులో కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరికీ అన్ని దేవాలయా లు, మఠాల్లో ప్రవేశం ఉండాలని, ఏదైనా వ ర్గాన్ని లేదా పంథాను వెలివేయడం హిందూమతంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు సమాజాన్ని విభజిస్తుందని గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మహిళలపై మతపరమైన స్థలాల్లో వివక్షకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇందులో సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించగా, న్యాయమూర్తులు బి.వి.నాగరత్న, ఎం.ఎం.సుందరేశ్, అహ్సానుద్దీన్ అమానుల్లా, అరవింద్ కుమార్, ఆగస్టిన్ జార్జ్ మసీహ్, ప్రసన్న బి.వరాలే, ఆర్.మహాదేవన్, జోయ్మాల్య బాగ్చి సభ్యులుగా ఉన్నారు. శబరిమల కేసు నేపథ్యం కేరళలోని శబరిమల ఆలయం సహా వివిధ మతస్థలాల్లో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు, మత స్వేచ్ఛ పరిమితులపై ఈ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, నాయర్ సర్వీస్ సొసైటీ, అయ్యప్ప సేవా సమాజం వంటి సంస్థల తరఫున వాదిస్తూ, ఒక నిర్దిష్ట పంథానికి చెందిన దేవాలయాలు తమ వర్గానికే పరిమితమయ్యే హక్కు ఉందని వాదించారు. అయితే న్యాయమూర్తి నాగరత్న స్పందిస్తూ, ప్రవేశ హక్కు విషయంలో ఒక వర్గాన్ని మాత్రమే అనుమతించడం హిందూమతానికి నష్టం కలిగిస్తుంది అని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ దేవాలయాలు, మఠాల్లో ప్రవేశం ఉండాలి. ఇతరులను నిరాకరించడం మతానికి మంచిది కాదు అని స్పష్టం చేశారు. న్యాయమూర్తి అరవింద్ కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇలాంటి విధానాలు సమాజాన్ని విభజిస్తాయని హెచ్చరించారు. “మన దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు కూడా ఉన్నాయి. దేవి భగవతి ఆలయంలో కొన్నేళ్లుగా ఇలాంటి ఆచారం కొనసాగుతోంది. ఇక కేరళలో ఓ ఆలయంలోకి అబ్బాయిలు మహిళల వేషధారణలో వెళ్తారు. అందుకోసం వారు బ్యూటీపార్లర్కు వెళ్లి మరీ అమ్మాయిల్లా తయారవుతాయి. కాబట్టి ఇది పురుషాధిక్య లేదా స్త్రీ ఆధిక్య మత విశ్వాసాలకు సంబంధించిన ప్రశ్న కాదు అని తుషార్ మెహతా పేర్కొన్నారు. న్యాయపరమైన అంశాలు దేవాలయాలు కేవలం తమ వర్గానికే సేవలు అందిస్తే, ప్రభుత్వం లేదా ప్రజల నుండి నిధులు స్వీకరించకూడదని వాదనలు వినిపించాయి. అలాగే ఏ చట్టమైనా ప్రజా శాంతి, నైతికత, ఆరోగ్య ప్రమాణాలను పాటించాల్సిందేనని న్యాయవాదులు పేర్కొన్నారు. గతంలో దేవరు కేసులో సుప్రీంకోర్టు మద్రాస్ ఆలయ ప్రవేశ చట్టాన్ని సమర్థిస్తూ, అన్ని హిందువులకు దేవాలయ ప్రవేశం అనుమతించాలనే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక ఆచారాలను మాత్రం నిర్దిష్ట వర్గాలకు పరిమితం చేయవచ్చని పేర్కొంది. విసృ్తత విచారణ కొనసాగుతోంది మత స్వేచ్ఛ పరిధిపై ఏడు కీలక ప్రశ్నలను ఈ రాజ్యాంగ బెంచ్ రూపొందించింది. 2018లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అనంతరం 2019లో ఈ అంశాన్ని మరింత విసృ్తతంగా పరిశీలించేందుకు ఉన్నత బెంచ్కు బదిలీ చేశారు. ఈ కేసు తీర్పు మత స్వేచ్ఛ, లింగ సమానత్వం, సామాజిక సమగ్రతపై దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశముందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
అసోంలో 85.04% పోలింగ్ 2021లో నమోదైన రికార్డుస్థాయి పోలింగ్ కన్నా ఎక్కువ కేరళంలో 77.38% నమోదు పుదుచ్ఛేరిలో రికార్డు స్థాయిలో 89.08% ఓటింగ్ న్యూఢిల్లీ: అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 296 నియోజక వర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కేరళ, పుదుచ్చేరిలో సాయంత్రం 6 గంటల వరకు నమోదైన ఓటింగ్ గణాంకాలు చూస్తే, పుదుచ్చేరిలో అత్యధికంగా 89.08శాతం పోలింగ్ నమోదు కాగా, అస్సాంలో 85.04శాతం, కేరళలో 77.38శాతం ఓటింగ్ నమోదైంది. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గం టల వరకూ రికార్డు స్థాయిలో 85.04 శాతం ఓటింగ్ నమోదైంది. 2021లో నమోదైన 82.04 శాతాన్ని మించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ దశాబ్దం తర్వాత తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. డాల్గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 94.57 శాతం ఓటింగ్ నమోదవగా, అమ్రి నియోజకవర్గంలో కనిష్ఠంగా 70.40 శాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 35 జిల్లాల్లోని 31,490 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 722 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గడువు సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఓటర్లకు టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. 6 గంటల వరకూ 77.38 శాతం పోలింగ్ నమోదై, 2021లో నమోదైన 74.06 శాతాన్ని మించింది. పుదుచ్చెరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ కూడా సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 89 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి స్థానిక స్వయం పాలన, పరిపాలనా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని పోటీ చేస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో నమోదైన అధిక ఓటింగ్ శాతం ప్రజల్లో ఎన్నికలపై ఉన్న ఆసక్తిని, రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లోనూ ఎఫ్ఆర్ఎస్
విద్యార్థుల హాజరు ప్రక్రియలో మార్పు ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే ప్రభుత్వ కాలేజీల్లో అమలు ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ‘దోస్త్’ నోటిఫికేషన్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లోనూ విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు(ఎఫ్ఆర్ఎస్) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్ అమలవుతుండగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రైవేట్లోనూ అమలు చేయనున్నారు. సంబంధిత విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని కళాశాలలకు సర్యులర్ జారీ చేసి ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని నిర్ణయించారు. అనేక డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోయినా వారి నుంచి భారీమొత్తంలో అదనపు ఫీజులు వసూలు చేస్తూ పరీక్షలకు అనుమతిస్తున్నట్లు విద్యాశాఖ దృష్టి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డిగ్రీ కాలేజీల్లో తప్పనిసరిగా ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారా..లేదా..? అనేది అధికారులు పర్యవేక్షించనున్నారు. సచివాలయంలో గురువారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్(పిఎంయు) సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, వివిధ వర్సిటీల వైస్ ఛాన్స్లర్లు, ఉన్నతాధికారులు పాల్గొని డిగ్రీ కోర్సులలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. ఈ నెల 13వ తేదీన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్ల సమావేశం నిర్వహించి కొత్త కోర్సులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసే ఆవకాశం ఉంది.
అవినీతి బయటపడడంతో ఆత్మరక్షణలో పడ్డ మంత్రి పొంగులేటి బూతులు, తిట్లు, పిట్టకథలు చెబుతున్నారని ఆగ్రహం సిఎం సహా మంత్రులందరూ అవినీతిపరులే అని పొంగులేటి ఒప్పుకున్నారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి వనపర్తి జిల్లాలో విలేకరుల సమావేశంలో హరీశ్రావు మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: పొంగులేటి కాదు.. పొంగు లూటీ పొగరులేటి.. బాంబులూటీ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మాజీ మంత్రి ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్ గ్రామంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. అత్యంత పవిత్రమైన సచివాలయంలో పొగురులేటి మాటలు విన్నాం.. అంబేద్కర్, బిర్లా మందిరం, అమ్మవారు, మసీదు, చ ర్చి పక్కనే ఉన్నా నిజాలు దాచి అబద్ధాలు మా త్రమే మాట్లాడారని అన్నారు. ఆయన బూతు లు చూస్తే ఆయన ఫ్రస్ట్రేషన్ తెలుస్తుందని అన్నారు. సరుకు లేనప్పుడు, సమాధానం లేనప్పు డు తిట్లు ఎత్తుకుంటారని, డిఫెన్స్లో పడ్డాడు పొగరులేటి అని, ఒక రాష్ట్ర మంత్రిగా కాకుం డా... రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడా రు. కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేసి పిట్ట కబుర్లు చెప్పి బయటపడాలని అనుకున్నాడని తెలిపారు. నేనొక్కన్నె అవినీతి పరుడున్ని కాదు.. అందరూ మంత్రులు అవినీతి పరులే అని తేల్చారు. జూపల్లి కృష్ణారావు, సీఎం, భట్టి సహా రాష్ట్రంలో అవినీతి కుంభకోణాల చిట్టా ఆయనే చదివారు. ఆయనతో పాటు అందరిని కలుపుకున్నాడని, పొంగులేటి కాదు.. పొంగులూటీ అని ఆయనే చెప్పకనే చెప్పిండు అని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు.. రాఘవ కన్స్ట్రక్షన్లో జరిగిన అవినీతి మా అధికారులే గుర్తు పట్టారు.. ఫైన్ కూడా కట్టారని సీఎం చెప్పారని తెలిపారు. అనుమతులు ఆలస్యం అవుతాయని మైనింగ్ మంత్రి చెప్పారని తెలిపారు. రెవెన్యూ ఎలక్ట్రిసిటీ పిసిబి మైనింగ్ నాలుగు శాఖల అధికారులు మైనింగ్ ఇన్స్పెక్షన్ చేసి ఇల్లీగల్ మైనింగ్ అని నిర్ధారించారు. పొంగులేటి చెప్పింది తప్పా...అధికారులు చెప్పింది తప్పా.. ముఖ్యమంత్రి చెప్పింది తప్పా? మైనింగ్ మంత్రి చెప్పింది తప్పా? నువ్వేమో సంబంధం లేదని చెప్తున్నావ్.. పొగరులేటి నీవి ఇంకా చాలా ఉన్నాయి.. అన్ని బయటపెడతామని తెలిపారు. పొగరు తగ్గించుకో పొంగులేటి రాఘవ కు మైనింగ్ లేదని ఎందుకు చెప్పలేదని, అసెంబ్లీ లో ఉండి కూడా నాది కాదని చెప్పలేదని ఆరోపించారు. సీఎం మైనింగ్ మంత్రి తప్పు అని చెప్పని, కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ పేరు ఎందుకు ఉంది.. కాంగ్రెస్ జెండా ఎందుకు ఉంది? పిసిబి, మైనింగ్ అధికారులు నోటీస్ ఇస్తే మీ ఉద్యోగి రిసీవ్ చేసుకున్న కాపీ నేను అసెంబ్లీలో చూపెట్టానని తెలిపారు. బాంబులేటి బుకాయిస్తున్నావ్..వాస్తవాలు అసెంబ్లీ లో ఎందుకు చెప్పలేదని తెలిపారు. నాదార్ గుల్ భూములు కాపాడింది బీ ఆర్ఎస్ పార్టీ.. నిషేధిత భూముల జాబితాలో పెట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. హై కోర్ట్ లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడిందని, సీలింగ్ భూములు అమ్మినవారి మీద.. కొన్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ తెచ్చింది బీఆర్ఎస్ అని తెలిపారు. ఎందుకు దాచి పెడుతున్నావని, డివిజన్ బెంచ్లో కేసు గెలిచింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా, మీరు చెప్పినట్లు నేడు అవి ప్రభుత్వ భూములు అయితే రోజుకొక పేరు ఎందుకు మారుతుందని తెలిపారు. రెండున్నర ఏండ్లుగా భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఎందుకు కంపెనీల బోర్డులు మారుతున్నాయి? శిల్పతో రాఘవ కంపెనీకి సంబంధాలు ఉన్నాయా లేవా? ఏ క్యూ స్క్వేయిర్ తో సంబంధాలు ఉన్నాయి నిజామా కాదా? మీరు అన్నట్లు ప్రభుత్వ భూములు అయితే హైడ్రా గడ్డి పీకుతుందా అని తెలిపారు. ఆర్డీవో ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ల్యాండ్ అని ఆర్డర్ ఉండగా హైడ్రా ఎందుకు కండ్లు మూసుకుందని తెలిపారు. నిజాయతీ ఉంటే, చిత్తశుద్ధి అక్రమణదారులపై చర్యలు తీసుకోండని తెలిపారు. పొంగులూటి పొగరులేటి నీ బాంబులు అన్ని తుస్సుమన్నాయని తెలిపారు. నీ విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా ఏం కాలేదని తెలిపారు. హైడ్రాను పంపి చిత్తశుద్ధి నిరూపించుకో తప్పు అయితే నాలుగు శాఖల మీద చర్యలు అయినా తీసుకో అని తెలిపారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ లో అబద్దం ఆడారు అని చెప్పించు, పొగరు లేటి నువ్వు బాంబు లూటీ ఇప్పటికైనా తప్పు ఒప్పుకో ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో తూతూమంత్రంగా ‘సర్’ ప్రక్రియ వెరిఫికేషన్లో బిఎల్ఓలకు బదులు వారి అసిస్టెంట్లు అక్షర జ్ఞానం లేని అసిస్టెంట్లతో అవస్థలు ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు ..బడా నేతల ఒత్తిళ్లు ఓటు హక్కు లేనివారి పేర్లూ జాబితాలో చేరుతున్న వైనం మన తెలంగాణ/సిటీ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ‘సర్’ సమర్థవంతంగా జరగడంలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్ఓ) నుండి యూజర్ ఐడి, పాస్వర్డ్ తీసుకుని ఇష్టారాజ్యంగా రివిజన్ నమో దు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాతనగరంలో రాజకీయ ఒత్తిడితో సర్ ప్రక్రియ తూతూ మంత్రంగా సాగుతోందనేది ప్రధాన ఆరోపణ. చాంద్రాయణగుట్ట, చా ర్మినార్, బహదూర్పుర, యాకుత్పురా తదిత ర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ‘సర్’ ఇష్టారాజ్యంగా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో ఓటరు సవరణలో అక్రమాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని, అధికంగా ఓటు హక్కులేని వార్ల పేర్లు కూడా చేరే ప్రమాదం లేకపోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో సమర్థవంతంగా, పొరపాట్లు, తప్పులు లే కుండా ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టాల్సిన జీహెచ్ఎంసి అధికార యంత్రాంగం ఇప్పుడు అక్రమాలకు మరోమారు తావిచ్చిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఓటరు సవరణకే పరిమితం కా కుండా మరింత లోతుగా ఓటరు డాక్యుమెంట్స్ను తనిఖీ చేసే ప్రక్రియ ను చేపట్టాల్సిన బి ఎల్ఓలు కేవలం తమ అసిస్టెంట్లను ఏ ర్పాటు చేసుకుని ‘సర్’ ప్రక్రియను పూర్తిచేస్తున్నట్టు ప్రచారంలోకి వచ్చింది. స్వీపర్లుగా కూడా బిఎల్ఓలుగా పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్వీపర్లు, నిరక్షరాస్యులు కూడా బిఎల్ఓలుగా ఉండటంతో వారి నుండి యూజర్ ఐడి, పాస్వర్డ్ తీసుకుని పలువురు ఇష్టారాజ్యంగా ‘సర్’లో వివరాలను నమోదు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. పలువురు ఓల్డ్ సిటీలో డ్యూటీలు చేసే బిఎల్ఓలు నేరుగా విధులను నిర్వహించకుం డా.. తమతమ అసిస్టెంట్లను వెరిఫికేషన్కు పంపించడంతో అసిస్టెంట్లు సర్ ప్రక్రియను పూర్తిచేయడంపైనే ఫోకస్ పెడుతున్నారే తప్ప కచ్ఛితంగా అవసరమయ్యే డాక్యుమెంట్లను మరింత లోతుగా తనిఖీలు చేయడంలేదనేది ప్రధాన ఆరోపణ. సర్ ద్వారా బోగస్ ఓట్లు, చ నిపోయిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉంటే వాటిని తొలగించాల్సి ఉంది. కానీ, ఈ ప్రక్రియను చేసేందుకు నిరక్షరాస్యులు వెల్లుతున్నందున సమర్థవంతంగా జరుగడంలేదనేది ప్రధాన ఆరోపణ. ప్రతి ఇంటికి.. బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్ఓ)లకు 2002 సంవత్సరంనాటి ఓటరు జాబితాను అందించడంతో పాటు బిఎల్ఓ యాప్ను వారి ఫోన్ల డౌన్లోడ్ చేసి ప్రక్రియను చేపడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళుతూ ఓటరు జాబితాలోని పేర్లను, వారి కుటుంబ సభ్యుల వివరాలతో పోల్చిచూస్తున్నారు. ఓటరుగా ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ను, వారి కుటుంబ సభ్యుల వివరాలను సరిపోల్చడం జరుగుతుంది. 18 సం.లు నిండినట్టు అధికారిక డాక్యుమెంట్లు ఉంటే కొత్తగా ఓటరు జాబితాలో నమోదు చేయడం జరుగుతుంది. వాస్తవానికి ఓల్డ్ సిటీలో చాలా వరకు డబుల్గా ఓటరు జాబితాలో ఉన్నట్టు బిఎల్ఓలు గుర్తిస్తున్నట్టు సమాచారం. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును కూడా ఈ ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల డూప్లికేట్ ఓట్లను సులభంగా గుర్తించి తొలగించేస్తున్నారు. చనిపోయిన వారు, ఇల్లు మారి వేరే చోటుకి వెళ్ళిపోయిన వారు, అనర్హులైన ఓటర్లను, ఒకటి కంటే రెండు చోట్ల ఓటర్లు ఉన్నవారిని ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇలా తొలగించే ముందు కుటుంబ సభ్యులకు పూర్తిగా వివరిస్తున్నారు.
సెకండియర్ విద్యార్థులను మోకాళ్లపై కూర్చోబెట్టి హింసించినట్లు ఆరోపణ హాస్టల్ నుంచి సీనియర్ల బహిష్కరణ కాలేజీ నుంచి మూడు నెలల సస్పెన్షన్కు అధికారుల సమాయత్తం మన తెలంగాణ/వరంగల్ కార్పొరేషన్: అధికారులు ఎన్ని కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ రాగింగ్ భూతం విద్యార్థులను వదిలిపెట్టడంలేదు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను మోకాళ్లపై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురిచేశారని జూనియర్ విద్యార్థులు కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీనియర్ విద్యార్థులపై చర్యలకు సిద్ద్ధమవుతున్నారు. రాగింగ్ అనగానే కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులు, సీనియర్స్ మధ్య ఉంటుందని అందరూ భావిస్తారు. ఇక్కడ మాత్రం ఎంబీబీఎస్ రెండు, మూడవ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థుల మధ్య రాగింగ్ జరిగింది. రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థుల వాట్సప్ గ్రూపులో మూడవ సంవత్సరం విద్యార్థుల గురించి తప్పుగా మాట్లాడుతున్నారన్న సమాచారం అందుకున్నారు. తమ గురించి జూనియర్స్ తప్పుగా మాట్లాడడం సరియైనది కాదు. వారికి బుద్ది చెప్పి తీరాల్సిందేనని సీనియర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో హాస్టల్ టెర్రస్ పైకి 20 మంది జూనియర్ మెడికోలను పిలిచి మోకాళ్లపై కూర్చోబెట్టి తప్పయిందని.. మరోసారి ఇలా చేయమని సారీ చెప్పించుకున్నారు. ఇతరత్రా ఇబ్బంది పెట్టారని సమాచారం. ఇది నచ్చని కొంత మంది జూనియర్ విద్యార్థులు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి దేశంలో సంబంధిత శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్కు బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో కళాశాల అధికారులు రంగంలోకి దిగారు.
శుక్రవారం రాశి ఫలాలు (10-04-2026)
మేషం దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన సంభందిత వ్యాపారాలు లాభాలు బాట పడతాయి. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృషభం బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిధునం ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి. వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. బంధు మిత్రుల ఆదరణ పొందుతారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కర్కాటకం నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వృత్తి వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సింహం వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కన్య విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నవి. తుల వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృశ్చికం దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారం సేకరిస్తారు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగమున విధులు సమర్ధవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ధనస్సు దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకరం ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. నూతన వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలుంటాయి. ఉద్యోగ విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుంభం సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు. గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీనం కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు అందుతాయి. మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి.
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు 254 మంది మృతి
బీరుట్ : లెబనాన్లో సెంట్రల్ బీరుట్, ఇతర ప్రాంతాల్లో బుధవారం ఇజ్రాయెల్ భీకర దాడులకు దాదాపు 254 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. వెయ్యిమందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. ఇజ్రాయెల్, లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లాకు గత ఐదు వారాలుగా జరుగుతున్న యుద్ధంలో ఒకే రోజు ఇన్ని మరణాలు సంభవించడం చాలా ఎక్కువని ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరించింది. ఇజ్రాయెల్ మిలిటరీ తాము హెజ్బొల్లా నివాసాలనే లక్షంగా చేసుకున్నామని ప్రకటించింది. అయితే బుధవారం మధ్యాహ్నం జనం రద్దీగా ఉన్న వాణిజ్య, నివాస ప్రాంతాల్లో ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయడంతో పౌరులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనీస్ అధ్యక్షుడు జోసెఫ్ అయోన్ ఈ దాడి కిరాతకమైన చర్యగా విమర్శించారు.
అందమైన ఊరి వాతావారణం చూపించే చిత్రం
కొత్త టాలెంట్ ను ప్రోత్సాహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ‘. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్గా పరిచయమవుతున్నారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ‘ చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హైదరాబాద్లో ‘తిమ్మరాజుపల్లి టీవీ‘ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ.. ‘అంతరించిపోయిన వస్తువులను మ్యూజియంలో పెడుతుంటారు. అలాంటి మ్యూజియం మీరు తెరపై చూడాలంటే మా సినిమాను ఈనెల 17న చూడండి. ఎందుకంటే మా సినిమా ఒక మ్యూజియంలా ఉంటుంది. అందులో అంతరించిపోతున్న మన కల్చర్, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే ఎమోషన్స్ ను చూస్తారు. ఇది తిమ్మరాజుపల్లి స్టోరీ మాత్రమే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల వారి స్టోరీ. మొత్తం ఏపీ, తెలంగాణలో 40 ఫ్లస్ ఏజ్ ఉన్నవాళ్లు దాదాపు 5 కోట్ల మంది ఉంటారు. వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫామిలీస్ కి అందరికీ ఈ సినిమా నచ్చతుంది” అని తెలియజేశారు. హీరో సాయి తేజ్ మాట్లాడుతూ.. “మన లైఫ్ లో మొదటిసారి ఎక్సిపీరియన్స్ చేసేవన్నీ ఒక మంచి ఫీల్ ను ఇస్తాయి. మొదటిసారి తిన్న అమ్మచేతి ముద్ద ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలా మన లైఫ్ లో చూసే స్వీట్ మెమొరీస్ ఈ చిత్రంలో ఉంటాయి‘ అని అన్నారు. నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “మా మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్కు థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే ఇంటిల్లిపాదీ థియేటర్స్ కు వెళ్లేవాళ్లం. మా చిన్నతనంలో టీవీలో కొత్త సినిమా వచ్చినా, వీసీడీల్లో కొత్త మూవీ చూసినా ఎంతో హ్యాపీగా ఉండేది. అలాంటి హ్యాపీనెస్ ఇప్పటితరం వారికి చూపించాలనే అప్పటి హీరో, హీరోయిన్స్ గెటప్స్ లో ఈ రోజు మీ ముందుకు వచ్చాం. చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు నాకు బాగా ఇష్టం. అందుకే ఈ రోజు చెన్నకేశవరెడ్డి గెటప్ లో వచ్చాను. బాలకృష్ణ కి థ్యాంక్స్. అలాగే వింటేజ్ హీరోలందరికీ థ్యాంక్స్. మా చిత్రంలో పనిచేసిన వాళ్లందరి కల సినిమా. ఆ కల తీరేందుకు ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ పట్టింది. వాళ్లు మా మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డారు.టెక్నికల్ బ్రిలియన్స్, ఆర్టిస్టుల బ్రహ్మాండమైన పర్ ఫార్మెన్స్లు, ఊరిలోని ఆహ్లాదకరమైన వాతావారణం.. ఈ మూడు చూసేందుకు మా మూవీకి వెళ్లండి. ఈ వేసవికి సమ్మర్ వెకేషన్ ఊరికి వెళ్లినట్లే. ఈ సారి మా తిమ్మరాజుపల్లికి రండి. మీ ఊరు గుర్తుస్తుంది, అప్పటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఇది నేను గ్యారెంటీ ఇస్తున్నా ‘ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో హీరోయిన్ వేద జలంధర్,తో పాటు చిత్ర బృందం పాల్గొంది.
ఇజ్రాయెల్ దాడులు.. అల్ జజీరా విలేకరి, ఇద్దరు జర్నలిస్టుల మృతి
బీరట్ : ఇజ్రాయెల్ దాడుల్లో గాజాకు చెందిన అల్ జజీరా కరస్పాండెంట్ , ఇద్దరు లెబనీస్ జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని జర్నలిస్టుల కమిటీ వెల్లడించింది. వెస్ట్గాజా సిటీలో మొహమ్మద్ విషాహ్ను ఇజ్రాయెల్ డ్రోన్ దాడి టార్గెట్ చేసుకుంది. విషాహ్ హమాస్ సభ్యుడని, హమాస్ మిలిటరీ విభాగంలో కమాండర్గా ఉన్నాడని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు.
Adivi Sesh’s Dacoit USA Premieres Today
Hero Adivi Sesh is riding high on momentum, delivering five consecutive blockbusters and now inching toward a rare double hat-trick. His much-awaited love-and-action drama Dacoit is set for a worldwide theatrical release tomorrow, with premieres kicking off today across the USA. Overseas distributor Moksha Movies is releasing the film on a grand scale in a […] The post Adivi Sesh’s Dacoit USA Premieres Today appeared first on Telugu360 .
ఎపి హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట..
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ నటుడు ఎం. మోహన్ బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తిరుపతి పోలీసులను ఎపి హైకోర్టు ఆదేశించింది. విద్యార్థి నాయకుడి కిడ్నాప్నకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై నమోదైన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎపి హైకోర్టులో మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ నిర్వహించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఈ మేరకు పోలీసులను ఆదేశించింది. కేసు సిడిని తమ ముందు ఉంచాలని పోలీసులకు కోర్టు స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి సమీపంలోని మోహన్బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూళ్లు చేస్తుం దంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సదరు యూనివర్సిటీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాలు నేతలు ఆందోళనకు పిలుపు నిచ్చారు. దీంతో విద్యార్థి సంఘం నేతలు వినోద్, అక్బర్లను మోహన్బాబు యూనివర్సిటీకి చెందిన బోన్సర్లు బలవంతంగా ఎత్తుకెళ్లా రు. ఈ నేపథ్యంలో మరో విద్యార్థి సంఘం నేత తిరుపతి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థి సంఘం నేతల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలను పోలీసులు రక్షించారు. బౌన్సర్ల తోపాటు వారి వాహనాలను తిరుపతి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మోహన్బాబుతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద పోలీ సులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి తొలి వారంలో చోటు చేసుకుంది.
AP High Court Grants Interim Relief to Mohan Babu in Student Kidnap Case
The Andhra Pradesh High Court has directed Tirupati police not to take any hasty action against veteran actor Mohan Babu in connection with a student leader kidnapping case. The court asked the police to place the case diary before it and said further action should wait until the next hearing. Mohan Babu approached the High […] The post AP High Court Grants Interim Relief to Mohan Babu in Student Kidnap Case appeared first on Telugu360 .
Botsa Cried, But Old Videos Still Tell a Different Story
Senior TDP leader Atchannaidu recalled past remarks allegedly made by Botsa Satyanarayana regarding the death of Y S Rajasekhara Reddy. The comments quickly triggered a reaction, with Botsa holding a sudden press meet in Visakhapatnam that turned emotional. During the media interaction, Botsa appeared visibly emotional about the statements made by Atchannaidu. But, he did […] The post Botsa Cried, But Old Videos Still Tell a Different Story appeared first on Telugu360 .
Iran Us Peace Talks : ఆ రెండే పీటముళ్లు Andhra Prabha Top Story
Iran Us Peace Talks : ఆ రెండే పీటముళ్లు Andhra Prabha
లక్ష్మీనారాయణకి కార్పొరేటర్ ఆగం రాజ్ ఘన నివాళి
విశాలాంధ్ర-దుండిగల్ : గురువారం లక్ష్మీనారాయణ ఆకస్మిక మరణం పట్ల బాచుపల్లి 17వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆగం రాజు ముదిరాజ్ కాలనీ ప్రజలతో కలిసి ఘన నివాళులర్పించారు. The post లక్ష్మీనారాయణకి కార్పొరేటర్ ఆగం రాజ్ ఘన నివాళి appeared first on Visalaandhra .
హరీష్ రావు జీవితమే బ్లాక్ మెయిల్: అద్దంకి
హరీష్ రావు బ్లాక్ మెయిల్ రావు ఎన్నిసార్లు చెప్పినా ఆయన బ్లాక్ మెయిల్ ఆగడం లేదు పొంగులేటి కుటుంబంపైన ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు పభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిల ఆగ్రహం మనతెలంగాణ/హైదరాబాద్: హరీష్ రావు బ్లాక్ మెయిల్ రావు అని, ఎన్నిసార్లు చెప్పినా ఆయన బ్లాక్ మెయిల్ ఆగడం లేదని, పొంగులేటి కుటుంబంపైన ఆధారం లేకుండా మాట్లాడుతున్నారని, పొంగులేటి కానీ, ఆయన కుటుంబానికి సంబంధం లేని కంపెనీలను హరీష్రావు అంటగడుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మిర్యాలగూడ, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సీఎల్పీ మీడియా సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శిల్పా ఇన్పోటెక్ కంపెనీలో పొంగులేటి లేదా ఆయన కొడుకు డైరెక్టర్లుగా లేరని, ఏక్యూ అండ్ ఏఎం బిల్డర్స్ , క్రిస్టల్ మ్యాన్క్షన్తో కూడా పొంగులేటికి సంబంధం లేదని వారు తెలిపారు. హరీష్ రావు జీవితమే బ్లాక్ మెయిల్ అని, ఆంధ్రా, తెలంగాణ పారిశ్రామికవేత్తలను ఉద్యమ సమయంలో బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర హరీష్ రావుదని వారు ఆరోపించారు. సొంత మామను బ్లాక్ మెయిల్ చేసి ఇరిగేషన్ మంత్రి అయ్యారని, తమ సీక్రెట్ ఫైల్స్ నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, కవిత కూడా నెమ్మదిగా రూపాంతరం చెందుతోందని, తండ్రిని మళ్లీ మంచి చేసుకోవడానికి కవిత ప్రయత్నాలు చేస్తోందని వారన్నారు. అనేక కంపెనీలను కెటిఆర్, హరీష్రావులు బ్లాక్ మెయిల్ చేశారని వారు ఆరోపించారు. మామ ఫాంహౌస్ నుంచి రాడనీ, బామ్మర్థి ఊర్లో లేడని, కవిత పార్టీలో లేదని, అందుకే హరీష్ రావు రెచ్చిపోతున్నారని వారు పేర్కొన్నారు. 2029 వరకు బిఆర్ఎస్లోనే ఉంటానని చెప్పే దమ్ము హరీష్ రావుకు ఉందా..? అని వారు ప్రశ్నించారు. 2014 నుంచి 2026 వరకు భూముల కేటాయింపులు, బదలాయింపులపైన విచారణకు ప్రభుత్వం సిద్ధమని వారు పేర్కొన్నారు.
పొంగులేటిపై ఆధారాలు చూపండి.. బిఆర్ఎస్ పై పిసిసి చీఫ్ ఫైర్
హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని.. ఆధారాలు ఉంటే గాంధీ భవన్కు వచ్చి ఇవ్వాలని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆధారాలు ఉంటే అప్పుడు కాంగ్రెస్ ఆలోచిస్తుందన్నారు. గురువారం గాంధీ భవన్లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆధారాలు తీసుకొని వస్తే తాను చర్చకు సిద్ధం అన్నారు. పస లేని ఆరోపణలు చేయొద్దని నాదర్గుల్ భూముల కుంభకోణం బిఆర్ఎస్ హయంలోనే జరిగిందని ఆయన ఆరోపించారు. తమపై బట్ట కాల్చి వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. బిఆర్ఎస్ దోపిడీ గురించి ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రులపై ఆరోపణలు సరికాదని హరీశ్ రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలన్నారు. తాము కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటివరకు ఎక్కడ గీత కూడా పడలేదని, అదే బిఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలిపోయిందని మహేష్ కుమార్ విమర్శించారు.
Shocker: Vijay’s Jana Nayagan Leaked Online
The makers of Vijay’s film Jana Nayagan are struggling to clear all the hurdles and release the film. With the Tamil Nadu Assembly elections nearing in this month, the election fever has gripped the state and Jana Nayagan will release only after the elections. Some of the scenes along with a song from Jana Nayagan […] The post Shocker: Vijay’s Jana Nayagan Leaked Online appeared first on Telugu360 .
Why is Tollywood waiting for Dacoit Result?
Almost all the top producers of Telugu cinema were present for the pre-release event of Adivi Sesh’s upcoming release Dacoit. Many felt that the producers rushed to the event for Adivi Sesh but it is for the producer Supriya Yarlagadda. Though she has not been actively producing films, Supriya plays a key role in the […] The post Why is Tollywood waiting for Dacoit Result? appeared first on Telugu360 .
Fire Accident on the sets of Spirit
A minor fire mishap took place on the sets of Prabhas’ upcoming film Spirit that is directed by Sandeep Reddy Vanga. One of the team members suffered minor injuries and he was rushed to the hospital. Some of the tents along with the shooting material on the sets were burned partially because of the fire […] The post Fire Accident on the sets of Spirit appeared first on Telugu360 .
RGIAలో డ్రగ్స్ కలకలం…13.2 కిలోల గంజాయి పట్టివేత #HyderabadAirport#DrugBust#Customs
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలి
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలి ఎన్ పి ఆర్ డి
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా.. రాయపర్తి, ఆంధ్రప్రభ : బాధిత కుటుంబాలకు అండగా
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి రాయపర్తి, ఆంధ్రప్రభ : పశువుల్లో గాలికుంటు
బృందావన్ కాల్వను శుద్ధిచేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి..
బృందావన్ కాల్వను శుద్ధిచేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్
Photos : Thimmarajupalli Tv Trailer Launch Event
The post Photos : Thimmarajupalli Tv Trailer Launch Event appeared first on Telugu360 .
గ్రామ అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర అతికీలకం
గ్రామ అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర అతికీలకం .. కామారెడ్డి డిఆర్డిఓ సురేందర్ జుక్కల్,
ఆ తర్వాతే.. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి:కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బిజెపి మోసపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈ బిల్లు అమలులో 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికగా తీసుకుంటామని చెప్పటం మహిళా లోకాన్ని మోసం చేయటమే అని పేర్కొన్నారు. మహిళా కోటాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో గురువారం ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం చేపట్టే జనగణనలో ఒబిసి గణన చేయాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులం కాలమ్ ఉన్నా వాళ్లు ఒబిసిలకు చెందుతారు అనే స్పష్టత లేదని అన్నారు. దీంతో బిసిల జనాభా ఎంత అనే లెక్క తేలదని పేర్కొన్నారు. జనగణనలో ఒబిసిలను లెక్కించి ఆ తర్వాతే మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా కోటా విషయంలో బిజెపి చేస్తున్న అన్యాయంపై పోరాటానికి బిసి మహిళలంతా సిద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు. డ్రాఫ్ట్ బిల్లు ముందే ఇవ్వాలి మహిళ రిజర్వేషన్ల బిల్లు అమలు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ సమావేశాలకు ముందే డ్రాప్ట్ బిల్లును అన్ని పార్టీలకు ఇవ్వాలని కవిత కోరారు. లేదంటే అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదని అన్నారు. బిల్లుపై చర్చ జరిగే రోజు ఉదయమే సభ్యులకు బిల్లు పత్రులను ఇస్తామని చెప్పటమంటే కచ్చితంగా ఇది అన్యాయం చేసే కుట్ర అని మండిపడ్డారు. డ్రాఫ్ట్ బిల్లును ముందే ఇచ్చే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దేశంలోని జాతీయ పార్టీల నేతలతో మాట్లాడతానని చెప్పారు. పార్లమెంట్లో మహిళ బిల్లు విషయంలో బిజెపి వైఖరిని నిరసిస్తూ మహిళలకు న్యాయం చేసే విధంగా అన్ని పార్టీలు ఒక్కలి కావాలని కోరారు. మహిళ బిల్లు రావటంలో జాగృతిదే కీలక పాత్ర దేశంలో మహిళ రిజర్వేషన్ల బిల్లు రావటంలో జాగృతిదే కీలక పాత్ర ఉందని కవిత చెప్పారు. ఈ బిల్లు కోసం ఢిల్లీలో దీక్ష చేసిన సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు. దేశంలోని 18 పార్టీలను ఏకం చేసి బిల్లు కోసం పోరాటం చేసే విధంగా కో ఆర్డినేట్ చేశామన్నారు. ఢిల్లీలో తాను చేసిన దీక్ష చేసిన సందర్భంగా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు ఢిల్లీకి వచ్చి పోరాటం చేశారని తెలిపారు. మహిళ బిల్లు కోసం జాగృతి వెలిగించిన దీపం ద్వారా దేశంలోని 29 రాష్ట్రాల మహిళలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు నోట్ బుక్ లు అందజేత…
విద్యార్థులకు నోట్ బుక్ లు అందజేత… దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని
మోడీ హయాంలోనే పల్లె సీమల అభివృద్ధి…
మోడీ హయాంలోనే పల్లె సీమల అభివృద్ధి… పట్టణాలకుదీటుగా గ్రామాల అభివృద్ధికికృషి.కేంద్ర ప్రభుత్వపథకాలుప్రజలకు వివరించండి.పల్లె
ఘనంగా రాంజీ గొండ్ వర్థంతి వేడుకలు…
ఘనంగా రాంజీ గొండ్ వర్థంతి వేడుకలు… దండేపల్లి, ఆంధ్రప్రభ : ఆదివాసులకు పోరాట
నూతన తహసిల్దార్ ను కలిసిన చిట్యాల గ్రామ సర్పంచ్…
నూతన తహసిల్దార్ ను కలిసిన చిట్యాల గ్రామ సర్పంచ్… చిట్యాల, ఆంధ్రప్రభ :
తేమ వచ్చిన 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు…
తేమ వచ్చిన 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు… అనధికార మిల్లర్లకు ధాన్యం పంపితే
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పుంజుకుంది: ఎమ్మెల్యే యెన్నం
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ముఖచిత్రం మార్చే దిశగా అడుగులు పడ్డాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సిఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వం సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయన వివరించారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు రూ. 24,000 కోట్ల రీ-స్ట్రక్చరింగ్తో ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టామని ఆయన తెలిపారు. మందగించిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పుంజుకుందని, ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో వాహనాల విక్రయాలు కూడా భారీగా పెరిగాయని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేవలం పేదలకు సాయం చేయడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక చక్రం తిరిగేలా చేస్తున్నాయని యెన్నం తెలిపారు. తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి కొత్త ఆర్థిక ఇంజన్గా మారబోతోందన్నారు. గ్రీన్ ప్లానింగ్, క్లీన్ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి వసతులతో దీనిని నిర్మిస్తున్నామని, మూసీ నది ప్రక్షాళన ద్వారా హైదరాబాద్కు కొత్త అందం రావడమే కాకుండా, టూరిజం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యూఏఈ సహా ప్రపంచ వేదికలపై తెలంగాణకు గుర్తింపు పెరిగిందని, గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా సాగుతోందని యెన్నం తెలిపారు. ఇప్పటికే 2,34,000 ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలైందని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మేస్త్రీలు, కార్మికులకు భారీగా ఉపాధి దొరుకుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. 28 నెలల కాంగ్రెస్ పాలనలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం జోడెద్దుల తరహాలో సాగుతూ తెలంగాణ జీడిపి వృద్ధికి బాటలు వేస్తున్నాయని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలి
వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలి 108ఉమ్మడి జిల్లా మేనేజర్ సామ్రాట్
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డికి సన్మానం
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డికి సన్మానం మంథని, ఆంధ్రప్రభ :
Ap Cm New Style : జనం కోసం.. .జనంతో Andhra Prabha Top Story
Ap Cm New Style : జనం కోసం.. .జనంతో Andhra Prabha
సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం
సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : రైతులు
IPL 2026: కోల్ కతాపై బౌలింగ్ ఎంచుకున్న లక్నో
ఐపిఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య మరికాసేపట్లో రసవత్తర పోరు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుని, కోల్ కతాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గత మ్యాచ్ కు దూరమైన కెకెఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న కెకెఆర్ ఈ మ్యాచ్ లోనైనా గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలగా కనిపిస్తోంది. జట్లు: కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే (సి), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (w), రింకు సింగ్, రోవ్మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగి లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్
వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ…
వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ… టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా
వినతి పత్రానికి స్పందించిన సింగరేణి అధికారులు
వినతి పత్రానికి స్పందించిన సింగరేణి అధికారులు మంథని, ఆంధ్రప్రభ : దుబ్బపల్లి గ్రామ
Video : Deputy Speaker Raghu Rama Krishna Raju Special Interview
The post Video : Deputy Speaker Raghu Rama Krishna Raju Special Interview appeared first on Telugu360 .
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్
BJP : పొత్తుతో ప్రమాదమే.. ప్రయోజనం లేదు.. ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న కమలం
తెలంగాణలో బీజేపీ ఇక ఒంటరిపోరుకే సిద్ధమవుతుంది
వీసీ.హెచ్.స్కూలుకు వితరణ…. పాయకాపురం, ఆంధ్రప్రభ : అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని వివేకానంద
Sandeep Vanga about Dhurandhar 2
Last night, Prabhas and Sandeep Reddy Vanga watched Dhurandhar: The Revenge in Allu Cinemas, Kokapet. Sandeep Reddy has taken to his social media page to post his review about the film. His words have been extremely strong and positive about the film. “Writers & actors built careers on propaganda, and the industry stayed quiet like […] The post Sandeep Vanga about Dhurandhar 2 appeared first on Telugu360 .
కార్మికులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సహపంక్తి భోజనాలు..
కార్మికులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సహపంక్తి భోజనాలు.. రణస్థలం, ఆంధ్రప్రభ :
ప్రతీ కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్థి
ప్రతీ కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్థి దేశ అభివృద్ధికి పరిశ్రమలు ఎంతో
జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్ చేశారు.
శేష జీవితంలో కెసిఆర్తో పని చేసే అవకాశం వచ్చింది: జీవన్ రెడ్డి
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన్ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. శేష జీవితంలో కెసిఆర్తో కలిసి పని చేసే అవకాశం వచ్చిందని అన్నారు. బిఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్తో కలిసి పని చేస్తే.. రాష్ట్ర భవిష్యత్కు పాటుపడవచ్చని పేర్కొన్నారు. ‘‘27 నెలలుగా చాలా క్షోభ అనుభవించాను. కాంగ్రెస్కు రాజీనామా చేసినప్పుడు.. భావోద్వేగానికి గురయ్యాను. బిఆర్ఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తారని కాంగ్రెస్కు ఓటేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచింది. 2014లోనే కెసిఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం వచ్చింది. అయినా కూడా కాంగ్రెస్లోనే కొనసాగాను. రాష్ట్ర అవసరాల కోసం ఇప్పుడు బిఆర్ఎస్తో కలిసి పని చేస్తా’’ అని జీవన్ రెడ్డి స్ఫష్టం చేశారు.
ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి..
ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.. మంథని, ఆంధ్రప్రభ : మత్స్యకారులను మంథని మండలం
జగన్ “మావిగన్ జోకర్” : వైఎస్ షర్మిల
వైఎస్ జగన్ పై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు..
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు.. టీబీ హారేగా.. దేశ్ జీతేగా నినాదంతో మున్ముందుకు..ఆరోగ్య
జోగినీలకు పునరావాసం కల్పించాలి: మంత్రి శ్రీహరికి వినతి
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; జోగినిలకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని కోరుతూ రాష్ట్ర పాడి
Forbesganj | ఇద్దరు బలి… Forbesganj | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Chandrababu : జగన్ ను అరెస్ట్ చేయడం నాకు నిమిషం పట్టదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు
కిడ్నీ వ్యాధితో వ్యక్తి మృతి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ ఎ.కొండూరు,
పారిశుద్ధ్యం పరిశుభ్రతపై అవగాహన
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; చౌటుప్పల్ మండల మహిళా సమాఖ్య భవనంలో గ్రామ సంఘ
జగన్కి పగుందని అమరావతి అభివృద్ధి ఆగదు
జగన్కి పగుందని అమరావతి అభివృద్ధి ఆగదు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యదర్శి పిళ్ళా
Pawan Kalyan Urges Youth to Become a Force for Change at AU Centenary Event
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan called on students to emerge as a powerful force that can transform systems and shape the future of the nation, while speaking at the centenary mega cultural fest of Andhra University in Visakhapatnam. Addressing the gathering, Pawan Kalyan said that youth must move beyond personal goals and think […] The post Pawan Kalyan Urges Youth to Become a Force for Change at AU Centenary Event appeared first on Telugu360 .
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఐదు గంటలు క్లోజ్
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఐదు గంటలు మూసివేశారు
మీడియా సమావేశంలో కంట తడిపెట్టిన బొత్స
వైఎస్సార్ గురించి మాట్లాడుతూ సీనియన్ నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికిలోనయ్యారు
రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ..
గొట్లూరు గ్రామపంచాయతీలో 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీవిశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామపంచాయతీలో ప్రభుత్వ, కలెక్టర్ ఆదేశాల మేరకు 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలను తహసిల్దార్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాజముద్ర తో కూడిన, ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు అర్హులైన రైతులకు, రీ సర్వేలో భాగంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సురేష్ […] The post రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ.. appeared first on Visalaandhra .
ఏసీబీ వలలో అంతర్గాం రెవెన్యూ ఇన్స్పెక్టర్
ఏసీబీ వలలో అంతర్గాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపల్లి జిల్లా
నిర్లక్ష్యానికి పరాకాష్ట –సర్వీసు రోడ్డుకు అడ్డంగా చేన్లోకి రోడ్డు
విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా) : మండల సమీపంలోని అశోక్ లేలాండ్ ఎదురుగా ఉన్న పొలాల్లో ఏర్పాటు చేసుకున్న ఓ ప్రైవేట్ షెడ్డుకు వెళ్లేందుకు ఏకంగా సర్వీస్ రోడ్డుకు అడ్డంగా భారీగా మట్టి మేటలు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ రోడ్డును మూసివేస్తూ ఇలా మట్టి తోలడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. దీనివల్ల అటుగా వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి వీలులేక ప్రమాదాలకు గురవుతున్నాయి. సర్వీస్ రోడ్లు ఆక్రమణకు గురికావడం, ఉన్న రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు […] The post నిర్లక్ష్యానికి పరాకాష్ట – సర్వీసు రోడ్డుకు అడ్డంగా చేన్లోకి రోడ్డు appeared first on Visalaandhra .
Minister |పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు..
Minister | పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు.. Minister | ఆంధ్రప్రభ, వెబ్
ഫാക്ട് ചെക്ക്: ഇറാൻ - യുഎസ് മധ്യസ്ഥതയിൽ പാകിസ്താനെ പ്രകീർത്തിച്ച് അമിത് ഷാ? പ്രചാരണം വ്യാജം
പാകിസ്താൻ അഖണ്ഡ ഭാരതത്തിൻ്റെ ഭാഗമാണെന്നും പാക് ജയം ഇന്ത്യയുടേതാണെന്നും അമിത് ഷാ പറഞ്ഞെന്നാണ് പ്രചാരണം
వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనం తెలుస్తుంది..
బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ సివి. శేషువిశాలాంధ్ర ధర్మవరం : వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనము తెలుస్తుందని బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ సివిశేషు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో బంకిం చంద్ర చటర్జీ వర్ధంతి వేడుకలను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చటర్జీ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శేషు మాట్లాడుతూ పసిపిల్లల నుంచి వృద్దుల దాకా గొప్ప స్ఫూర్తిని, ఉద్యమకాంక్షను వందేమాతరం రగిలించింది అని తెలిపారు. […] The post వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనం తెలుస్తుంది.. appeared first on Visalaandhra .
గొట్లూరులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు
– మంత్రి సత్య కుమార్ యాదవ్ తక్షణ స్పందనవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. గొట్లూరు గ్రామ ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గ్రామ ప్రజలు, బీజేపీ నాయకుడు ,సింగిల్ విండో డైరెక్టర్ గొడ్డిటి వెంకటేష్ కలిసి […] The post గొట్లూరులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు appeared first on Visalaandhra .
అర్హులైన చేనేత,పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంట్ సబ్సిడీ యూనిట్లు..
తెలుగుదేశం పార్టీ నాయకులు విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన చేనేత పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంటు సబ్సిడీ యూనిట్లు కూటమి ప్రభుత్వం చేస్తోందని టిడిపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ,ఎన్డీఏ ప్రభుత్వం చేనేతలకు పవర్లూమ్ కార్మికులకు ఉచిత కరెంటు సబ్సిడీ యూనిట్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మామాట్లాడుతూ […] The post అర్హులైన చేనేత,పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంట్ సబ్సిడీ యూనిట్లు.. appeared first on Visalaandhra .
రాయలసీమ హక్కులపై 12 ఏళ్లుగా సాగుతున్న మోసం..
రాయలసీమ హక్కులపై 12 ఏళ్లుగా సాగుతున్న మోసం.. రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ నాయకులు
తహసిల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు..
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : తహసిల్దార్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. జతపాతంలో పడి మగ్గురు మృతి
అనంతగిరి: సెల్ఫీ మోజు ముగ్గరి నిండు ప్రాణాలను బలిగొంది. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మిలో సెల్ఫీ దిగుతతూ నలుగురు బాలికలు జలపాతం లో పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గు బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బాలిక అంజలి పరిస్థితి విషమంగా ఉంది. అంజలిని అనంతగిరి మండలం లుంగపర్తి ఆసుపత్రికి తరలించారు. మృతులు త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర(16)ను హుకుంపేట మండలం జుంబువలస వాసులుగా గుర్తించారు. ఇటీవలే వీరంతా ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.
Waterfall |ముగ్గురి ప్రాణాలు తీసింది
Waterfall | ముగ్గురి ప్రాణాలు తీసింది Waterfall | అల్లూరి జిల్లా, ఆంధ్రప్రభ
మంథని, ఆంధ్రప్రభ : విద్యార్థుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ ; ఆర్మూర్ లోని విశాఖ నగర్ లో గల
24 నెలలుగా కొనసాగుతున్న అక్రమ అరుణ గోదాం నిర్మాణం..
24 నెలలుగా కొనసాగుతున్న అక్రమ అరుణ గోదాం నిర్మాణం.. మేడ్చల్, ఆంధ్రప్రభ :
Grocery Store |సింహం మాస్క్ ధరించి…
Grocery Store | సింహం మాస్క్ ధరించి… Grocery Store | ఆంధ్రప్రభ,
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత… భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణకు

28 C