EDITORIAL |మన రాజ్యాంగం పరవెూత్కృష్టం
EDITORIAL | మన రాజ్యాంగం పరవెూత్కృష్టం రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం దేశ ప్రజలు
Amaravati |వెంకన్న ఆలయం విస్తరణ పనులకు శ్రీకారం..
Amaravati | వెంకన్న ఆలయం విస్తరణ పనులకు శ్రీకారం.. ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ
Siddavatam |ఉరేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
Siddavatam | ఉరేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య సిద్దవటం, (ఆంధ్రప్రభ): మండలంలోని మాచుపల్లి
Amaravati |కాస్మోస్ ప్లానిటోరియం..
Amaravati | కాస్మోస్ ప్లానిటోరియం.. Amaravati, మంగళగిరి ఆంధ్రప్రభ : “ఇండియన్ ఇన్స్టిట్యూట్
అందరిచూపు తంబళ్ళ హట్టి గ్రామం వైపు….
అందరిచూపు తంబళ్ళ హట్టి గ్రామం వైపు…. మడకశిర, (ఆంధ్రప్రభ): అంధుల మహిళా క్రికెట్లో
Future City |ఫ్యూచర్ సిటీపై పెద్ద అంచనాలు
Future City | ఫ్యూచర్ సిటీపై పెద్ద అంచనాలు హైదరాబాద్,ఆంధ్రప్రభ: తెలంగాణ సీఎం
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా పులికాట్ గుర్తింపు పొంది ఉంది.
Mega Master Plan |ఫ్యూచర్ తెలంగాణ 3 వర్టికల్స్!
Mega Master Plan | ఫ్యూచర్ తెలంగాణ 3 వర్టికల్స్! హైదరాబాద్, ఆంధ్రప్రభ
కళాత్మకమైన నృత్య ప్రదర్శన తో చూపారుల హృదయాలను కట్టి పడేసిన “చిరంజీవి అభి” విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : చిన్నతనం నుండే తన తల్లి దండ్రుల అభిరుచి మేరకు , గురువర్యులు శ్రీ శివ సాయి కూచిపూడి కళా క్షేత్రం నిర్వహికురాలు కళా తపశ్వి శ్రీమతి తణుకు సాయి మాదవి శిక్షణలో జాతీయ స్థాయిలో జరిగిన కూచిపూడి పోటిల్లో అభి తన ప్రతిభను నిరూపించుకుంది .. అభి గృహంలో ఎటు చూసినా తను సాధించిన మెమోంటోలు , […] The post నృత్య ప్రదర్శన తో అభి appeared first on Visalaandhra .
కేంద్రం ను సందర్శించిన ఎంపీ దగ్గుబాటి
పూల పరిశోధన కేంద్రం ను సందర్శించిన ఎంపీ దగ్గుబాటి. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, వేమగిరి గ్రామంలో గల ఐసిఏఆర్ పూల పరిశోధన కేంద్రాన్ని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం సందర్శించారు. పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ డివీఎస్ రాజు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాయిల్ లెస్ మీడియా, ఆర్కిడ్ రకాలు, చీడపీడలు, తెగుళ్ల నియంత్రణ పద్ధతులు, జీవనియంత్రణ పద్ధతుల గురించి శాస్త్రవేత్తలు డాక్టర్ రాంపాల్, డాక్టర్ లక్ష్మీపతి, డాక్టర్ […] The post కేంద్రం ను సందర్శించిన ఎంపీ దగ్గుబాటి appeared first on Visalaandhra .
మురమండలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన.— అన్నందేవుల చంటి భూరి విరాళం. కడియం : కడియం మండలం, మురమండ గ్రామం, దొరగారి తోట కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి, శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. కాలనీ కి చెందిన రాజాన మాలునాయుడు దేవి దంపతులతో, పురోహితులు నాగదేవర విశ్వనాథ శర్మ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా రాజాన మాలునాయుడు మాట్లాడుతూ దాతల సహకారంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని, మాధవరాయుడు […] The post చంటి భూరి విరాళం appeared first on Visalaandhra .
ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలు. విశాలాంధ్ర – కడియం : కడియం శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. వంశపారంపర్య ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో తెల్లవారుజామునుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూలు, పడగలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కడియం స్వామివారి రధోత్సవంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. […] The post ఘనంగా షష్టి appeared first on Visalaandhra .
మన తెలంగాణ/రుద్రంగి: రాష్ట్రంలో మొట్టమొద టి సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ఈ ఘనత రా జన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలానికి ద క్కింది. సర్పంచ్ స్థానానికి అధికార కాంగ్రెస్ కై వసం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రుద్రంగి మండలం, ఉమ్మడి మానాల గ్రామం, రోప్లాతండాలో సర్పంచ్తోపాటు 8 మంది వార్డు సభ్యుల ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. పోటీ లేకుండా ఏకగ్రీవంగా తండావాసులు సర్పంచును ఎన్నుకోవడ మే కాదు.. గెలుపు సంబరాలు కూడా చేసుకున్నా రు. రోప్లా తండాలో సుమారు 390 మంది జనా భా ఉంటారు. అయితే నిధుల సమస్యలు లేకుం డా తండాను అభివృద్ధి చేసి చూపిస్తానని, పంచాయతీ పరిధిలోని అభివృద్ధికి ప్రజల సమస్యల పరిష్కారంలో తన వంతుగా కృషి చేస్తానని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన జవహర్లాల్ నాయక్ తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఉన్నందున ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తండావాసులు తెలిపారు. జిల్లాలోనే మొదటి ఏకగ్రీవ పంచాయతీగా ఈ తండా నిలిచింది. సర్పంచ్గా ఎన్నికైన జవహర్లాల్ నాయక్ను ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో తండావాసులు, స్థానిక పెద్దమనుషులు పాల్గొన్నారు.
‘మహా’నగరంలో మూడు కార్పొరేషన్లు?
మన తెలంగాణ/సిటీ బ్యూరో : హైదరాబాద్ మహానగరాన్ని మూడు కార్పోరేషన్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ద్ధమవుతోంది. శివారులోని 27 పురపాలికలను జిహెచ్ఎంసిలో విలీనం చేసి మహానగరంగా విస్తరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో దే శంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మహానగరం రూపుదిద్దుకోనున్నది. ఈ క్రమంలోనే పరిపాలనా సౌల భ్యం, మెరుగైన సేవలు అందించేందుకుగానూ గ్రేటర్ నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాల ని ప్రభుత్వం యుద్ద్ధ ప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కా ర్పొరేషన్లుగా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగు లు వేస్తుంది. గత ఏడాది మాదాపూర్లోని అసోచాం ఆ ధ్వర్యంలో నిర్వహించిన ‘అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్-2024’కు కోమటిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయబోతున్నట్టు సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ను ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడం, మూడు కార్పొరేషన్లు చేయడం తర్వాతనే జిహెచ్ఎంసికి ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయానికి వచ్చినట్టు అధికారవర్గాల్లో టాక్ మొదలైంది. ఔటర్ రింగ్ రోడ్ లోపలి వైపున ఉన్న మునిసిపాలిటీల విలీనం జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశం ఆమోదించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు సంబంధించిన జీఓను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ తర్వాతనే వెలువరించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం నగర పాలక సంస్థకు పాలకవర్గం ఉన్నది. ఇప్పుడు 27 మునిసిపాలిటీలను విలీనం చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు (జీఓ) విడుదల చేస్తే.. ప్రస్తుత మేయర్ ఓఆర్ఆర్ వరకు వర్తిస్తారనీ, ఇది న్యాయపరమైన అంశంగా మారుతుందనీ, జీఓ వెలువరిస్తే.. జిహెచ్ఎంసి పాలక సభ్యులు న్యాయపరమైన చిక్కులు తెచ్చే అవకాశాలున్నాయనీ గుర్తించిన ప్రభుత్వం.. గ్రేటర్లో పాలక వర్గం కాలపరిమితి ముగిసిన అనంతరమే జీఓను విడుదల చేయనున్నట్టు అధికార వర్గాల్లోని టాక్. ఈ రెండున్నర నెలలు అంటే ఫిబ్రవరి 10 వరకు విలీన ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన పనులన్నీ, ఆర్థిక, భౌగోలిక, రెవెన్యూ అంవాలకు సంబంధించిన విషయాలను పూర్తిచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. చర్యలు..ఒకటి తర్వాత ఒకటి.. ఓఆర్ఆర్ లోపలి వైపున ఉన్న గ్రామపంచాయితీల పాలక వర్గాల సమయం ముగియగానే వాటిని సమీపంలోని మునిసిపాలిటీలలో విలీనం చేశారు. మునిసిపాలిటీల్లో పాలకవర్గం కాల పరిమితి పూర్తయిన తర్వాత వాటిలో స్పెషల్ ఆఫీసర్ పాలనను తీసుకొచ్చి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసి పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ పాలనలోని మునిసిపాలిటీలను కార్పొరేషన్లో విలీనం చేసే ప్రతిపాదనను సంస్థ సర్వసభ్య సమావేశమందు ప్రవేశపెట్టి కౌన్సిల్చే ఆమోదించారు. ఇక ఇప్పుడు జీహెచ్ఎంసి పాలక మండలి గడువు వచ్చే ఏడాది 2026, ఫిబ్రవరి 10తో ముగియనున్నది. 2026, జనవరి 26 నాటికి మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు అంతర్లీనంగా పూర్తిచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఓ ఐపిఎస్, మరో ఐఏఎస్ అధికారులిద్దరితో పాటు జీహెచ్ఎంసి అధికారులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసి మూడు కార్పోరేషన్ల ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలపై నివేదికను తెప్పించుకోనున్నట్టు అధికారుల్లోని అభిప్రాయం. 2053.44 కి.మీ.లు.. జనాభా 1,25, 00,694 ప్రస్తుతం జీహెచ్ఎంసి విస్తీర్ణం 650 చ.కి.మీ.లు. జనాభా 1,02,00,000. మునిసిపాలిటీలు20+ మునిసిపల్ కార్పొరేషన్లు7 (27 పురపాలికలు 948.16 చ.కి.మీ.లు..విలీనమైన 33 గ్రామపంచాయితీల విస్తీర్ణం386.28 చ.కి.మీ.లు కలుపుకుని) 1334.44 చ.కి.మీ.లు. జనాభా 23,00,694గా ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విస్తీర్ణం 40.17 చ.కి.మీ.లు. జనాభా 4 లక్షలు, టిఎస్ఐఐసి/ఐలాలు61 విస్తీర్ణం 28.95 చ.కి.మీలు మొత్తంగా ఓఆర్ఆర్ లోపలి విస్తరిత ప్రాంతం 2053.44 చ.కి.మీ.లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీటిలో నుండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం, ఐలాస్ విస్తరిత ప్రాంతం (40.17+28.95) 69.12 చ.కి.మీ.లును తొలగిస్తే.. మొత్తం జీహెచ్ఎంసి విస్తరిత ప్రాంతం 1984.32 కి.మీ.లుగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని జనాభ 1,25,00,694లుగా ఉందని రికార్డులు పేర్కొంటున్నాయి. ఓఆర్ఆర్ లోపలివైపున ఉన్న 1984.32 చ.కి.మీ.ల విస్తరిత ప్రాంతాన్ని 641+642+701.32 చ. కి.మీ.లుగా హైదరాబాద్ (641చ.కి.మీ.లు), సైబరాబాద్ (642 చ.కి.మీ.లు), సికింద్రాబాద్ (701.32 చ.కి.మీ.లు) కార్పోరేషన్లుగా విభజించే అవకాశాలున్నట్టు అధికార వర్గాల్లోని అభిప్రాయం. వార్డులు.. జీహెచ్ఎంసిలో ప్రస్తుతం 150 వార్డులు. 20 మునిసిపాలిటీల్లోని వార్డులు 407, కార్పొరేషన్లు7లలోని వార్డులు 215.
Chandrababu |అతివేగానికి బ్రేకులేద్దాం
Chandrababu | అతివేగానికి బ్రేకులేద్దాం అమరావతి, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాష్ట్రంలో రహదార్లలో వాహనాల
స్థానిక రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు
మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిం ది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో బిసి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ బుధవారం పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్ల్లా వెల్దండ తిమ్మనోనిపల్లి వార్డుల రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టులో గ్రామస్థులు పటిషన్లు వేశారు. తిమ్మనోనిపల్లిలోని వార్డులన్నింటిని ఎస్సి, ఎస్టిలకే కేటాయించారని, తిమ్మనోనిపల్లిలో ఎస్సి, ఎస్టిల కంటే బిసిలు అధికంగా ఉన్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామా ల్లో సరైన రిజర్వేషన్ల పాటించడం లేదంటూ ఆంధోల్ మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచు ఆగమయ్య మరోక పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీఓ 46 తీ సుకొచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బిసిలకు 117 సర్పంచు స్థానాలనే రిజర్వు చేశారని చె ప్పారు. సంగారెడ్డి జిల్లాలో బిసి రిజర్వేషన్లు 19 శాతమే ఉందని పిటిషనర్ న్యాయవాది వెల్లడించారు. సంగారెడ్డి కలెక్టర్ జారీ చేసిన గెజిట్ను రద్దు చేసి మళ్లీ రిజర్వు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ కో ర్టును కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు 17 శాతం రిజర్వేషన్లు వస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 46కు ఈ రిజర్వేషన్లు విరుద్ధంగా ఉన్నాయని మరో పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవిదేవి బుధవారం విచారణ చేపట్టారు. తదపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
Exams |కొత్త పద్ధతిలో టెన్త్ పరీక్షలు
Exams | కొత్త పద్ధతిలో టెన్త్ పరీక్షలు హైదరాబాద్, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి: తెలంగాణాలో
మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా నదీ జలాలపై హక్కును వదులుకోబోమని ఎపి సిఎం చంద్రబాబు స్పష్టీకరించారు. కృష్ణాజలాల వాటా కేటాయింపులపై పునఃసమీక్షకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. బుధవారం అమరావతిలో జలవనరుల శాఖ అధికారులతో సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం బలమైన వాదన లు వినిపించాలని అధికారులను ఆదేశించారు. అయితే వరద జలాల వివాదాలను సామరస్యంగా వినియో గించుకోవడానికి ఎపి సిద్ధంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.ఈ మేరకు జలవనరుల శాఖ అధికారులకు సిఎం చంద్రబాబు దిశానిర్దేశన చేశారు.
రూ.50 వేల కోట్ల పవర్ స్కామ్కు తెర
మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా చేస్తే అందులో ఒక మిషన్ ఉంటుందని, అదే ‘కమీషన్’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.50 వేల కోట్ల పవర్ స్కామ్కు తెర లేపిందని ఆరోపించారు. ఇందులో పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో 30, 40 శాతం కమిషన్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కమిషన్లు ఎలా కొల్లగొట్టాలని మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని విమర్శించారు. వాటాల పంపిణీ విషయంలో మంత్రులు ఘర్షణ పడుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రుల కుటుంబ సభ్యులే బయటకు వచ్చి వాటాల అంశంపై మాట్లాడుతున్నారని, రాష్ట్రాన్ని అరాచకాలకు కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోందని అన్నారు. స్కాంలకు సమాధానం చెప్పకుండా ఎదురు దాడికి దిగుతున్నారని, 50వేల కోట్ల స్కామ్ బయటపెట్టామని, దమ్ముంటే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి స్కామ్లను వరుసగా ఆధారాలతో సహా బయటపెడతామని, త్వరలో హైదరాబాద్ అండర్ గ్రౌండ్ కేబుల్ స్కామ్, పంపుడ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ స్కామ్ బయటపెడతామన్నారు. రేవంత్రెడ్డి చేసిన ఇంటర్ స్టేట్ స్కాంను ఆధారాలతో సహా బయటపెడుతానని, 90శాతం సమాచారం సేకరించామని, ఇంకో 10శాతం రెండు మూడు రోజుల్లో వస్తుందని, వెంటనే మీడియా సాక్షిగా రేవంత్ రెడ్డి ఇంటర్ స్టేట్ స్కాంను బయటపెడుతామని చెప్పారు. కేబినెట్లో స్కాముల గురించి తప్ప స్కీముల గురించి చర్చించడం లేదని హరీష్ రావు విమర్శించారు. ఒక్క రామగుండం ప్రాజెక్టులోనే రూ.5-6 వేల కోట్ల కమీషన్ దండుకునేలా ప్లాన్ చేశారన్నారు. మంత్రులకు కమిషన్ల పంపకాల కోసమే మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయని, ప్రజల సమస్యలు, అమలు చేయాల్సిన పథకాలపై చర్చించడం లేదని దుయ్యబట్టారు. ఎన్టీపీసీ ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను ప్లే చేసి చూపించారు. ఎన్టీపీసీ ఒప్పందంపై మాట్లాడిన మాటలనే ఉదహరిస్తూ రామగుండం 800 మెగావాట్ల ప్రాజెక్టుకు యూనిట్ కు రూ.8 చొప్పున రూ.10,880 కోట్లు ఖర్చవుతుందని చెప్పారని, ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.15 వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందన్నారు. అప్పుడు ఒక యూనిట్ కు రూ.10 ఖర్చవుతుందని, రూ.5కే యూనిట్ విద్యుత్ అందిస్తామన్న సీఎం రామగుండం యూనిట్ ను అంత ఖర్చుతో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. పాల్వంచ, రామగుండం, మత్కల్ మూడు ప్రాంతాల్లో ఒక్కో చోట 800 మెగావాట్ల చొప్పున 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్లు పెడతానని సీఎం అంటున్నారని, అందుకు సుమారుగా రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందని హరీష్రావు వివరించారు. వీటిలో రూ.40 వేల కోట్లు అప్పుగా తీసుకువచ్చినా రూ.10 వేలకోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టాలన్నారు రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్ మెంట్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్కాలర్ షిప్, ఉద్యోగుల డీఏ పెంపుదలపై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి రూ.10 వేల కోట్లను ఎక్కడి నుంచి తీసుకు వస్తారని హరీష్ రావు ప్రశ్నించారు.
మంచిర్యాల జిల్లా, జన్నారం అటవీ డివిజన్, ఇందన్పల్లి రేంజ్లోని ఇందన్పల్లి నార్త్ బీట్లో మంగళవారం రాత్రి ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు బుధవారం సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇందన్పల్లి ఇన్ఛార్జి రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పెద్దపులి జన్నారం అడవుల్లో తిరుగుతోందని, ఎట్టి పరిస్థితులలో అడవిలోకి ఒకరిద్దరు వంతున వెళ్లవద్దని, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లకూడదని అన్నారు. అదేవిధంగా పులి సంచరిస్తోందంటూ ప్రజలు భయబ్రాంతులకు గురికావద్దని, వేట కోసం కరెంటు వైర్లు, ఉచ్చులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పులి దాడిలో మృతి చెందిన ఆవు యజమానికి ప్రభుత్వపరంగా పరిహారం చెల్లిస్తామని రేంజ్ తెలిపారు.
2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం
ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2030లో అహ్మదాబాద్ వేదికగా ఈ పోటీలు జరుగనున్నాయి. భారత్లో కామన్వెల్త్ క్రీడలు జరగడం ఇది రెండోసారి. తొలిసారి 2010లో రాజధాని ఢిల్లీ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ను నిర్వహించారు. బుధవారం గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్ వార్షిక సర్వసభ్య సమావేశంలో దీన్ని అధికారికంగా ధ్రువీకరించారు. నైజీరియా నగరం అబుజా కూడా రేసులో ఉండడంతో భారత్కు క్రీడలను నిర్వహించే ఛాన్స్ దొరుకుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కానీ బుధవారం జరిగిన కామన్వెల్త్ బోర్డు వార్షిక సమావేశంలో అహ్మదాబాద్లో నిర్వహించేందుకే మెజారిటీ సభ్య దేశాలు మొగ్గు చూపాయి. దీంతో క్రీడల నిర్వహణపై నెలకొన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. భారత్లోనే 2030 కామన్వెల్త్ గేమ్స్ను నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యింది. కాగా, భారత్కు మెగా పోటీలు నిర్వహించే అవకాశం దక్కడంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్ర విద్యుత్ రంగాన్ని బిఆర్ఎస్ నట్టేట ముంచింది: మంత్రి తుమ్మల
రాష్ట్ర విద్యుత్ రంగాన్ని బిఆర్ఎస్ నట్టేట ముంచిందని, ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పటంతో ఇప్పుడు మైండ్ కూడా దెబ్బతిన్నట్టు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బిఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. బిఆర్ఎస్శాసనసభ సభ్యుడు హరీశ్ రావు చేసిన అసత్య వ్యాఖ్యలను మంత్రి తుమ్మల బుధవారం ఓ ప్రకటనలో ఖండించారు. ఇష్టమొచ్చిన ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేసి, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, రాష్ట్ర డిస్కంలను బిఆర్ఎస్ ప్రభుత్వం రూ. 90 వేల కోట్ల అప్పుల్లో ముంచిందని తుమ్మల ఆరోపించారు. అవసరం లేకపోయినా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారని ఆయన ధ్వజమొత్తారు. బొగ్గు లేని దామరచర్లలో థర్మల్ పవర్ ప్లాంట్ కట్టి ప్రజలకు భారం - నాయకులకు లాభం అనే కుట్రను అమలు చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. భద్రాద్రిలో కాలం చెల్లిన టెక్నాలజీతో ప్లాంట్ నిర్మించి జెన్కోను దెబ్బతీశారని, ఎన్టిపిసి విద్యుత్తు విషయంలో బిఆర్ఎస్ నిర్లక్ష్యం, -కుట్ర బట్టయలయిందన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం- 2014 ప్రకారం ఎన్టిపిసి ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల ప్లాంట్లు రాష్ట్రానికి రావాల్సి ఉండగా, బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేవలం 1600 మెగావాట్లకు మాత్రమే ఒప్పందం చేసుకొని, మిగతా 2400 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్రానికి రాకుండా అడ్డుకుందని మంత్రి ఆరోపించారు. దామరచర్లలో తమ సొంత ప్లాంట్లకు లాభం చేకూర్చేందుకు ఎన్టిపిసి ప్లాంట్ ఆలస్యానికి కారణమైందని, అప్పుడే ఒప్పందం చేసుంటే ఇప్పుడు 2400 మెగావాట్ల విద్యుత్తు రాష్ట్రానికి అందుబాటులో ఉండేదని మంత్రి తెలిపారు. యాదాద్రి-, భద్రాద్రి విద్యుత్ నిర్మాణాల్లో జరిగిన అవినీతి పై ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్తో న్యాయ విచారణ చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. ఏ రోజైనా అవినీతి బయటపడుతుందనే భయం బిఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోందని, అందుకే హరీశ్ రావు ఏదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అన్ని నిబంధనలకు తిలోదకాలిచ్చి భద్రాద్రి, -యాదాద్రి ప్లాంట్లు ప్రారంభించి వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. కాంపిటేటివ్ బిడ్డింగ్లో ఫెయిల్ అయిన కంపెనీకి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చి, యూనిట్ విద్యుత్ రేటును తొమ్మిది రూపాయల వరకు పెంచారని, బొగ్గు-నీటి వనరులు లేని ప్రాంతంలో యాదాద్రి ప్లాంట్ నిర్మించి అవివేక నిర్ణయాలతో భారీ నష్టం కలిగించారని మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేశారు. సిటికి మధ్యలో ఉన్న ఇండస్ట్రియల్ జోన్లో పరిశ్రమల భూములను కన్వర్షన్ చేసుకునేందుకు ప్రభుత్వం జీఓ ఇవ్వకముందే రూ. 5 లక్షల కుంభకోణమని ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కెటిఆర్ కంటే నేనేం తక్కువా అన్నట్లు హరీష్ రావు రూ.50 వేల కోట్ల కుంభకోణం అని మరో అబద్ధం ఎత్తుకున్నాడని మండిపడ్డారు. కెటిఆర్, హరీష్రావు ప్రవర్తన చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
దేశ చరిత్రలోనే అతి పెద్ద భూ కుంభకోణం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
దేశ చరిత్రలోనే అతి పెద్ద భూ కుంభకోణం రాష్ట్రంలో జరిగిందని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.బుధవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ హిల్ట్ భూ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు ఇవేనని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన అనుచరులతో ఈ కుంభకోణానికి పథకం వేశారని ఆయన ఆరోపించారు. 22వ తేదీన జివో నెంబర్ 27 తీసుకుని వచ్చి 9292 ఎకరాలకు సంబంధించి 22 ఎస్టేట్లను మల్టీ జోన్స్గా మార్చేందుకు ఈ పథకం వేశారని ఆయన ఆరోపించారు. కేవలం ఎస్ఆర్వో వాల్యులో ముప్పై శాతానికే అప్పజెప్పి రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆస్తి విలువ సుమారు ఆరున్నర లక్షల కోట్లపైనే ఉంటుందని, దీంతో రాష్ట్ర అప్పును కూడా తీర్చేయవచ్చని అన్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తిని కొల్లగొడుతూ క్లిప్టొక్రిసి పాలన కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. సామాన్యులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గతంలో పారిశ్రామిక వాడలుగా గుర్తించిన ఈ భూములను, అవుటర్ రింగ్ రోడ్డు వెలుపల గల వేల ఎకరాల భూములకు ప్రభుత్వం లూఠీ చేసే ఆలోచనలో ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.హిల్ట్ పాలసీ సిఎం రేవంత్ రెడ్డికి లంకె బిందెల్లా దొరికాయని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి ముందుగానే తన అనుచరులను అక్కడి ఇరవై రెండు ఎస్టేట్లకు పంపించి అక్కడి కంపెనీలతో పథకం ప్రకారం ఒప్పందం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ విధానంతో రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుందో ముఖ్యమంత్రి వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరున్నర లక్షల ముప్పై వేల కోట్లను రాష్ట్ర ఖజానాకు తరలిస్తే, రాష్ట్ర అప్పు తీర్చవచ్చని లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాలకైనా వినియోగించవచ్చని ఆయన తెలిపారు. కేవలం తన స్వార్థం కోసం, దేశంలో రిచ్చెస్ట్ పొలిటీషీయన్ కావాలనే కాంక్షతో ఈ కుంభకోణానికి తెర లేపారని ఆయన దుయ్యబట్టారు. ఇటీవల ఒఆర్ఆర్ పరిథిలో కోకాపేటలో ఎకరాకు నూట ముప్పైఏడు కోట్ల రూపాయలు వేలం పలికిందన్నారు. ఈ లెక్కన సగానికి అనుకున్నా అరవై ఎనిమిది కోట్ల చొప్పున లెక్క వేసినా అరున్నర లక్షల కోట్ల రూపాయలు అవుతుందన్నారు. కనీసం టిజిఐఐసి రేట్ను కూడా లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎస్ఆర్వో వాల్యూలో ముప్పై శాతానికి చ్చి, వారికి సకల మర్యాదలు చేసి రాష్ట్ర ఖజానాకు గండి పడే విధంగా ఈ జివో ఎందుకు తీసుకుని వచ్చారో చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అనేక సార్లు రాష్ట్ర అప్పు గురించి చెబుతున్న ముఖ్యమంత్రికి ఈ ఆస్తితో రాష్ట్రాన్ని గాడిలో పెట్టవచ్చని తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై తమ పార్టీ ప్రజా ఉద్యమం చేస్తుందని, ప్రజా క్షేత్రంలో దోషులను నిలబెడుతుందని ఆయన హెచ్చరించారు.
ఘనంగా భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థం.. హాజరైన ప్రముఖులు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నందిని విక్రమార్కల పెద్ద కుమారుడి సూర్య విక్రమాదిత్య- సాక్షిల వివాహ నిశ్చితార్ధ వేడుక ప్రగతి భవన్ లో అంగరంగ వైభంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మెగాస్టార్ చిరంజీవి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బ్రహ్మానందం, టీ సుబ్బరామిరెడ్డి తదితరులు.. ఈ కార్యక్రమానికి హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. వీరితోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మొహమ్మద్ అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, కొండా సురేఖ, పలువురు రాజకీయ నాయకులు ఈ నిశ్చితార్ధ వేడుకకు హాజరయ్యారు.
మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటన…
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ మంగళగిరి
భారత రాజ్యాంగం తెలుగు వెర్షన్ విడుదల చేసిన సిఎం
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం తెలుగు వెర్షన్ ను బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాజ్యాంగాన్ని సులువుగా అర్దం చేసుకునేలా, అతి సామాన్యులు రాజ్యాంగంపై అవగాహాన పొందేలా తెలుగు వెర్షన్ రూపోందించినట్లు లా కార్యదర్శి బి. పాపిరెడ్డి సిఎంకు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రాంతీయ భాషలో రాజ్యాంగ అనువాదం మంచి నిర్ణయమన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని సులువుగా అర్దం చేసుకోవచ్చని సిఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లా అదనపు కార్యదర్శి కె.సునీత, సంయుక్త కార్యదర్శి కె.గీత తదితరులు పాల్గొన్నారు.
ప్లీజ్ వెయిట్..కాల్ చేస్తా: డికెకు రాహుల్ వాట్సాప్ సందేశం
న్యూఢిల్లీ: దయచేసి ఆగండి. నేను మీకు త్వరలోనే కాల్ చేస్తాను అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు డికె శివకుమార్కు ఓ సందేశం పంపించారు. రెండు మూడురోజుల్లోనే, డిసెంబర్ 1లోగానే కర్నాటక సిఎం పదవిపై తేలుస్తామని ఖర్గే ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ సమాచారం కీలకంగా మారింది. తాను ఈ నెల 29న సోనియాగాంధీతో ఈ విషయం చర్చిస్తానని కూడా రాహుల్ ఇప్పుడు డికెకు తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకుని రాహుల్ ఇటీవలే ఢిల్లీకి వచ్చారు. డికె తనను సంప్రదించేందుకు యత్నించారని, తానే ఆయనకు తన సందేశం పంపిస్తున్నానని తెలిపారు. మరో వైపు బుధవారం రాత్రి డికె, సిద్ధరామయ్యల మధ్య ఆంతరంగిక సమావేశం జరిగింది. మరో వైపు ఈ నెల 29నే సోనియా గాంధీని, రాహుల్ను ఇతర నేతలను కలిసేందుకు డికె ఢిల్లీకి వెళ్లుతున్నట్లు ఆయన సన్నిహితులు బెంగళూరులో తెలిపారు. ప్రస్తుత పరిణామాలతో కర్నాటక కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడి అందుకున్నాయి. మరో వైపు కర్నాటకకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడినట్లు స్పష్టం అయింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్…
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. సంగారెడ్డి
భారత క్రికెట్ను భ్రష్ఠు పట్టించారు.. అగార్కర్, గంభీర్లపై విమర్శలు
గౌహతి: సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా వైట్వాష్కు గురైన సంగతి తెలిసిందే. సొంత గడ్డపై స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ఇలాంటి చేదు ఫలితాన్ని చవిచూడడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రధాన కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ల వల్లే భారత్కు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందని వారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీనియర్లతో పాటు ప్రతిభావంతులైన క్రికెటర్లపై గంభీర్, అగార్కర్లు చిన్నచూపు చూడడం వల్లే టెస్టుల్లో టీమిండియా ఆట తీరు రోజురోజుకు తీసికట్టుగా మారుతుందని వారు వాపోయారు. ఇప్పటికైనా బిసిసిఐ ఈ విషయంలో స్పందించి అగార్కర్, గంభీర్లను పదవుల నుంచి తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
Ram’s Andhra King Taluka USA Premieres Today
Energetic Star Ram Pothineni’s much-awaited flick Andhra King Taluka is all set to hit theatres worldwide tomorrow, with USA premieres beginning today. The film is being released overseas by the reputed Prathyangira Cinemas. Director Mahesh Babu P has crafted Andhra King Taluka as a wholesome entertainer with a unique storyline, where the heart-touching elements serve […] The post Ram’s Andhra King Taluka USA Premieres Today appeared first on Telugu360 .
దుర్గాదేవి ఆలయానికి భూమి పూజ..
ములుగు, (సిద్దిపేట జిల్లా) ఆంధ్రప్రభ : దేవుడి దయతో రాష్ట్ర ప్రజలు సుఖ
హైదరాబాద్ చెన్నై మధ్య బుల్లెట్ రైలు
హైదరాబాద్, చెన్నై ప్రజల బుల్లెట్ రైలు కల త్వరలో సాకారం కానుంది. ఇంటర్ సిటీ ప్రయాణాన్ని పునర్నిర్మించే ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు మార్గానికి దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలో చేర్చేందుకు తుది అలైన్మెంట్ సమర్పించింది. హైస్పీడ్ మార్గం కారిడార్కు సమగ్ర ప్రాజెక్టు నివేదికపై రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించిన తరువాత నెలలోపు ఖరారు చేస్తామని సీయూఎంటీఏ (చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) సభ్య కార్యదర్శి ఐ.జయకుమార్ తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు గతంలో గూడూరు మీదుగా ప్రణాళిక రూపొందించిన స్థానంలో తిరుపతిలో స్టేషన్ను చేర్చడానికి మార్పులు చేశామని ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్-చెన్నై మధ్య ప్రయాణం 12 గంటలు సమయం పడుతోంది. నూతనంగా డిజైన్ చేసిన మార్గంతో వేగం పెరిగి 2.20 గంటల టైం తగ్గనుంది. కొత్త మార్గంలో రాష్ట్ర పరిధిలో చెన్నై సెంట్రల్, మీంజూరు సమీపంలోని చెన్నై రింగు రోడ్డులో నూతన స్టేషన్తో కలిపి 2 స్టేషన్లు ఉంటాయి. మొబిలిటీ, వాణిజ్య హబ్లు అందుబాటులోకి తేవడానికి రవాణా ఆధారిత అభివృద్ధి కోసం రైల్వేశాఖ ప్రతిస్టేషన్ చుట్టూ సుమారు 50 ఎకరాల స్థలాన్ని కోరింది. ఇటీవల రవాణాశాఖకు రాసిన లేఖలో దక్షిణ మధ్య రైల్వే అలైన్మెంట్, స్టేషన్కు స్థలాలు త్వరగా ఖరారు చేయాలని, భూమిని సేకరించేందుకు సూత్రప్రాయ ఆమోదం పొందాలని, రాష్ట్రంలో దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్లో రైలు కారిడార్ను కూడా చేర్చాలని కోరింది. రాష్ట్రంలోని హైస్పీడ్ నెట్వర్క్ నిర్మాణంలో 12 కి.మీ వరకు సొరంగ మార్గం ఉండనుంది. స్థల సేకరణపై జాప్యాన్ని నివారించేందుకు రైల్వేశాఖలు రాష్ట్ర అధికారులతో కలిసి ఉమ్మడిగా క్షేత్ర సందర్శనలకు అభ్యర్థించారు. దక్షిణాదిన ప్రణాళికలో ఉన్న 2 హైస్పీడ్ మార్గాలలో ఒకటి చెన్నై-హైదరాబాద్, రెండోది హైదరాబాద్- బెంగళూరు కారిడార్. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు నగరాలను కలిపేలా సర్వే జరుగుతోందని ఇటీవల విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో 61 కి.మీ విస్తీర్ణంలో 2 ప్రధాన స్టేషన్ల ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వ కన్సల్టెన్సీ సంస్థ ’రైట్స్’ లిమిటెడ్ నిర్వహించిన సర్వేల ఆధారంగా ఆలైన్మెంట్ రూపొందించారు. ప్రతిపాదిత మార్గానికి 223.44 హెక్టార్ల భూమి అవసరం. అటవీ భూమి ఇందులో లేదని రైల్వే అధికారులు గుర్తించారు. ఆ మార్గం 65 రహదారులు, 21 హైటెన్షన్ విద్యుత్తు లైన్లు దాటనుంది.
41 మంది మావోయిస్టుల లొంగుబాటు..
చర్ల, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్లో 12 మంది మహిళలతో పాటు 41 మంది
. ఉగ్ర క్రూరత్వానికి చెరగని గుర్తుగా 26/11. 12 చోట్ల రక్తపాతం – 166 మంది మృతి. తొమ్మిది మంది ముష్కరులు హతం. ప్రాణాలతో పట్టుబడ్డ కసబ్-ఆపై ఉరి. ముంబై ఉగ్రదాడులకు 17 ఏళ్లు ముంబై : నవంబరు 26వ తేదీ ప్రపంచాన్ని కుదిపివేసిన రోజు. 2008లో అంటే సరిగ్గా 17 ఏళ్ల కిందట ఇదే రోజు భారత దేశ ఆర్థిక రాజధాని చరిత్రలో కాళరాత్రిగా నిలిచింది. కాల్పులు, పేలుళ్లతో ముంబై నగరం దద్దరిల్లింది. 10 మంది […] The post ముంబై మరువలేని కాళరాత్రి appeared first on Visalaandhra .
చెన్నై నుంచే 2 లక్షలకు పైగా హెచ్ 1బి వీసాలు
వాషింగ్టన్ / చెన్నై: హెచ్ 1బి వీసా ప్రక్రియ యావత్తూ మోసం అని అమెరికా ఆర్థికవేత్త డేవ్ బ్రాట్ విమర్శించారు. చెన్నైకు చెందిన ఓ కన్సల్టెంట్ సంస్థ ఒక్కదానికే 2,20,000 హెచ్ 1 బి వీసాలు జారీ అయ్యాయని, భారతదేశం అంతటితో పోలిస్తే ఇది రెండింతలు పైగా ఉందని , ఇంతకంటే ఫ్రాడ్ మరోటి ఉంటుందా? అని ప్రశ్నించారు. అమెరికా మాజీ రాయబారి అయిన బ్రాట్ భారత్కు ఉన్న హెచ్ 1 బి వీసాల పరిమితి 85000 అని, అయితే చెన్పై కన్సల్టెంట్కు రెండున్నర లక్షల వీసాలు దక్కాయని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటకల హెచ్ 1బి వీసాల దరఖాస్తుల ప్రాసిసింగ్లో ఉండే ఈ కంపెనీకి ఇన్ని వీసాలు మంజూరు కావడం ఏమిటని ప్రశ్నించారు. దీనితో హెచ్ 1 బి వీసాల అంశం ఇప్పుడు మరోసారి వివాదాస్పదం అయింది. హెచ్ 1 బి వీసాల ప్రక్రియ అంతాకూడా పారిశ్రామిక వర్గాల స్థాయి స్కామ్లు పావులు ఎత్తుగడల గుప్పిట్లోకి జారుకుందని విమర్శించారు. చట్టబద్ధమైన అధికారిక పరిమితి దాటి వీసాలు జారీ అయితే ఇక ఈ ప్రక్రియకు విలువ ఏమిటని హెచ్ 1 బి వీసాల వాటాల్లో 71 శాతం వరకూ ఇండియాకు చెందుతాయి. కాగా చైనాకు కేవలం 12 శాతం కోటా దక్కుతోంది. భారత్కు సంబంధించి 85000 వీసాల పరిమితి ఉంది.అయితే కానీ ఇండియాలోని చెన్నై జిల్లా లేదా పూర్వపు మద్రాసు జిల్లకు రెండులక్షలకు పైగా హెచ్ 1 బి వీసాలు దక్కాయని రిపబ్లికన్ మాజీ ఎంపి అయిన డాక్టర్ బ్రాట్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగల వీసాల ప్రాసిసింగ్ సెంటర్గా చెన్నై కన్సల్టెంట్ సెంటర్ ఉంది. హెచ్ 1 బి వీసాల ప్రక్రియ ఇంత యధేచ్ఛగా మోసాల భరితం అయి ఉంటే ఇక అమెరికా వర్కర్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా), యాంటి ఇమిగ్రేషన్ అజెండా వంటివి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయని ప్రశ్నించారు.
విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ ఊరట..
వాషింగ్టన్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అమెరికా భారీ ఊరట కల్పించడానికి సిద్ధమైంది. ఈమేరకు ఎఫ్1 విద్యార్థి వీసాల్లో కీలక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం ఈ వీసాల జారీలో అనుసరిస్తున్న “ఇంటెంట్ టు లీవ్ ” నిబంధన రద్దు దిశగా డిగ్నిటీ యాక్ట్ 2025ను చట్టసభ్యులు ప్రతిపాదించారు. దీనివల్ల ఇకపై విదేశీ విద్యార్థులు (యుఎస్ స్టూడెంట్ వీసా) తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగి వెళ్తామని నిరూపించుకోవలసిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఎఫ్1 వీసా దరఖాస్తుల్లో (యుఎస్ వీసా రూల్స్) చాలా వరకు ‘ ఇంటెంట్ టు లీవ్ రూల్ కిందే తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ నిబంధన ప్రకారం దరఖాస్తుదారులు తాత్కాలిక స్టే తరువాత (చదువు పూర్తయిన వెంటనే ) అమెరికా విడిచి వెళ్లిపోతామని కాన్సులర్ అధికారి వద్ద నిరూపించుకోవలసి ఉంటుంది. దీనికోసం దరఖాస్తుదారులు తమ స్వదేశంలో ఉన్న తమ ఆస్తులు లేదా ఉద్యోగావకాశాలకు సంబంధించిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులకు ముఖ్యంగా భారతీయులకు ఈ నిబంధన కఠినంగా మారింది. ఈ ఏడాది భారత విద్యార్థులకు ఎఫ్1 వీసాల జారీ సంఖ్య భారీగా తగ్గింది. ఈ వీసాల తిరస్కరణల్లో అత్యధికం ‘ ఇంటెంట్ టు లీవ్’ ను నిరూపించుకోలేని అభ్యర్థులవే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యం లోనే తాజా చట్టం ఇలాంటి విద్యార్థులకు ఊరట కల్పించే అవకాశం ఉంది. ‘ తిరిగెళ్లే ఉద్దేశం ఉందా ? అనే ప్రశ్న లేకుండా వీసాలు జారీ చేస్తే.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు బిల్లు దశలోనే ఉన్నాయి. అమెరికా కాంగ్రెస్ ఉభయసభల్లో ఇది ఆమోదం పొంది అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాత ఈ డిగ్నిటీ చట్టం అమల్లోకి రానుంది. మరోవైపు ఎఫ్1 వీసాల్లో ‘డ్యూరేషన్ ఆఫ్ స్టే’ ను తొలగించే దిశగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ మార్పులు చేపట్టింది. ఎంతకాలం అంటే అంతకాలం చదవాలనుకునే వీలు లేకుండా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన విద్యార్థి వీసాలను మంజూరు చేయాలని ప్రతిపాదించింది.
AP | ఫిట్నెస్ భారం భరించలేం… ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్రస్థాయి
Gudivada |స్కానింగ్ సెంటర్లపై చర్యలు..
గుడివాడ, ఆంధ్రప్రభ : స్టేట్ పీఎస్సీ పి అండ్ డి టి యాక్ట్
రైతుల బలోపేతం కోసం ‘‘రైతన్న మీకోసం’’
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : రైతును ఆర్థికంగా బలోపేతం చేసే చర్యల్లో భాగంగా
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రైతుల క్షేమం, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. ప్రతి
Lokesh |రామ్ లాల్ జీతో మంత్రి నారా లోకేష్ భేటీ
Lokesh | రామ్ లాల్ జీతో మంత్రి నారా లోకేష్ భేటీ మంగళగిరి,
హసీనా అప్పగింతపై స్పందించిన భారత్
న్యూఢిల్లీ: మరణ శిక్ష పడ్డ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ అభ్యర్థనపై భారతదేశం స్పందించింది. ఈ విషయాన్ని తాము పరిశీలిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం తెలిపారు. అమానుష దాడుల అభియోగాల కేసులో గత వారం బంగ్లా నేత హసీనాకు అక్కటి ట్రిబ్యునల్ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. హసీనా ఇప్పుడు భారత్లో తలదాచుకుంటున్నారు. బంగ్లాదేశ్ సముచిత ప్రయోజనాల కోణంలో ఆమె అప్పగింత విషయాన్ని పరిశీలించి, తెలియచేస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి వివరించారు. జుడిషియల్, అంతర్గత న్యాయచట్టపరమైన కోణాలలో బంగ్లాదేశ్ డిమాండ్ను పరిశీలిస్తున్నట్లు జైస్వాల్ తెలిపారు.బంగ్లాదేశ్ ప్రయోజనాలకు భారత్ కట్టుబడి ఉంటుంది. శాంతి, ప్రజాస్వామ్యం, సమీకృత విధానం, స్థిరత్వం వంటి పలు కీలక విషయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై సంబంధితపక్షాలతో సంప్రదింపులు జరుగుతాయని వివరించారు.
Pulivendula |హద్దు దాటిన అభిమానం
Pulivendula | హద్దు దాటిన అభిమానం పులివెందుల, ఆంధ్రప్రభ : నాయకులపై అభిమానాన్ని
రాజ్యాంగపై దాడిని అడ్డుకుని తీరుతా: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిన వహిస్తున్నానని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చెప్పారు రాజ్యాంగంపై ఎటువంటి దాడిని అయినా తాము అనుమతించేది లేదని, ప్రతిఘటిస్తామని చెప్పారు. రాజ్యాంగంపై పడే దెబ్బకు అడ్డుగా తాను నిలబడి తీరుతానని ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణ తన విద్యుక్త ధర్మం అన్నారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాహుల్ మాట్లాడారు. రాజ్యాంగం ఓ పుస్తకమే అనుకోరాదు. ప్రతి పౌరుడికి భరోసా కల్పించే పవిత్ర వాగ్దానం, హక్కుల పరిరక్షణ, సమానత కల్పన, న్యాయం, సమాదరణ అనేవి కుల మత వర్గాలకు అతీంగా ప్రాంతాలు, భాషలతో నిమిత్తం లేకుండా, పేద ధనిక తారతమ్యాలు లేకుండా వర్తింపచేసేందుకు రాజ్యాంగం ఉపకరిస్తోందని తెలిపారు. రాజ్యాంగం పౌరుల అదికారాన్ని, హక్కులను నిలబెడుతుంది. సామాన్యుడి గొంతుకకు వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పారు. రాజ్యాంగం భద్రంగా ఉన్నంత కాలం, ప్రతి పౌరుడు సురక్షితంగా ఉంటారని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వయో వృద్ధులకు పెద్ద పీట : మంత్రి అడ్డూరి
వయో వృద్ధులకు రాష్ట్రంలో పెద్ద పేట వేస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ వివిధ పథకాలు అమలు చేస్తోందని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్రస్థాయి వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్జెం డర్స్ వ్యక్తుల సాధికారత శాఖ బంజారాహిల్స్లోని బాబు జగజ్జీవన్ రామ్ ఆడిటోరియం లో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వయో వృద్ధులకు పెన్షన్లు, ప్రతి జిల్లాలో వయో వృద్ధుల ఆశ్రమాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఇప్పటి వరకు మన రాష్రటంలో 13 జిల్లాల్లో వృద్ధ ఆశ్రమాలు ఏర్పాటు చేశామన్నారు. మిగతావి వివిధ దశలలో పూర్తి చేస్తామని అన్నారు. తల్లి దండ్రులు, వయో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం2007 ప్రకారముగా ప్రతి జిల్లాలో మెయింటెనెన్స్ ట్రిబునళ్లు, అప్పీల్లేట్ ట్రిబునళ్లను ఏర్పాటు చేశామన్నా రు. అంతేకాకుండా రాష్టంలోని ప్రతి జిల్లాలో వయో వృద్ధుల కోసం ఈ నెల 12 నుంచి 16 వరకు వారోత్సవాలు నిర్వహించామని తెలిపారు. ఇట్టి వారోత్సవాలకు ఆయా జిల్లాలో ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు, జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో వయో వృద్ధులకు ఆటల పోటీలు, జిల్లా స్థాయి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చారన్నారు. వయో వృద్ధుల సంక్షేమము కొరకు రాష్ట్ర స్థాయి కౌన్సిల్ను ఏర్పాటు చేస్తామని మంతరి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. త్వరలో రాష్ట్రంలో 33 జిల్లాల్లో 37 డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రుల, వయో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం2007 నియమాలను సూచిం చే పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఐఎఎస్ అనితా రామచంద్రన్, సంచాలకులు బి.శైలజ, రాష్ట్రస్థాయి అధికా రులు, వివిధ వయో వృద్ధుల సంఘాల ప్రతినిధులు, 1500 మంది వయో వృద్ధులు పాల్గొన్నారు.
கன்னியாகுமரியில் மலைப்பாம்பு ஊர்ந்து செல்வதாக பரவும் வீடியோ - உண்மை இதுதான்
கன்னியாகுமரியில் மலைப்பாம்பு சாலையில் ஊர்ந்து செல்வதாக தவறான தகவலுடன் வீடியோ வைரலாகிறது.
భారీ అగ్ని ప్రమాదం.. కాలిపోయిన 5 టవర్స్.. 13 మంది మృతి
హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం హాంకాంగ్లో తాయ్ పో జిల్లాలోని 5 భారీ అపార్ట్మెంట్ భవనాల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో చాలా మంది అపార్ట్మెంట్ భవనాల్లోనే చిక్కుకుపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 700 మంది నివాసితులను రక్షించి తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారని, మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఐదు బిగ్ టవర్స్ మంటల్లో కాలిపోయి పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
HYD |జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం
HYD | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం హైదరాబాద్ :
సౌతాఫ్రికాతో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. భారత్పై చారిత్రక విజయం సాధించిన దక్షిణాఫ్రికా టీమ్ రెండు మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. 549 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా బుధవారం ఐదో రోజు 63.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. పరుగుల పరంగా భారత్కు టెస్టుల్లో ఇదే అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం. మరోవైపు భారత గడ్డపై టెస్ట్ సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం సౌతాఫ్రికాకు ఇది రెండోసారి. గతంలో హాన్సి క్రోనే సారథ్యంలోని దక్షిణాఫ్రికా టీమ్ భారత గడ్డపై టెస్టు సిరీస్ను వైట్వాష్ చేసింది. తాజాగా తెంబబవుమా కెప్టెన్సీలో సఫారీ మరోసారి ఇలాంటి ఫీట్ను సాధించడం విశేషం. కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్ చేతిలో క్లీన్స్వీప్కు గురైన టీమిండియా మరోసారి సౌతాఫ్రికా చేతిలోనూ ఇలాంటి అవమానకర ఓటమిని చవిచూసింది. కివీస్ మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ను 30తో చిత్తుగా ఓడించింది. తాజాగా సౌతాఫ్రికా రెండు మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసి టీమిండియాకు కోలుకోలేని దెబ్బతీసింది. వరుస క్రమంలో.. ఓవర్నైట్ స్కోరు 27/2తో బుధవారం చివరి రోజు ఆటను తిరిగి ప్రారంభించిన భారత్కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్ (5) పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ మరోసారి నిరాశ పరిచాడు. రెండు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి తేలిపోయాడు. 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మారథాన్ ఇన్నింగ్స్ ఆడినసాయి సుదర్శన్ 139 బంతుల్లో 14 పరుగులు చేసి ఇంటిదారి పట్టాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజా 87 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. వాషింగ్టన్ సుందర్ (16) పరుగులు చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి, సిరాజ్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల వద్దే ముగిసింది. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హార్మర్ 37 పరుగులకే ఆరు వికెట్లు తీశాడు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లను పడగొట్టాడు.
సర్వీస్ రివాల్వర్ తాకట్టు పెట్టిన ఎస్ఐ
బెట్టింగ్కు బానిసగా మారిన ఎస్సై ఏకంగా సర్వీస్ రివాల్వర్ను తాకట్టుపెట్టి అప్పు తీసుకున్నాడు. అంతేకాకుండా చోరీ కేసులో రికవరీ చేసిన ఐదు తులాల బంగారం కూడా కుదువ బెట్టుకున్నట్లు బయటపడింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం...ఎపికి చెందిన భాను ప్రకాష్ 2020లో ఎస్సైగా ఎంపికయ్యాడు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పనిచేశాడు. ప్రస్తుతం అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఎస్సైగా పనిచేస్తున్నాడు. భానుప్రకాష్ బెట్టింగ్కు బానిసగా మారండంతో వచ్చే జీతం కుటుంబ అవసరాలకు, బెట్టింగ్ కట్టేందుకు సరిపోవడంలేదు. దీంతో తన వద్ద ఉన్న రివాల్వర్ను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు, రౌండ్స్ మాత్రం తన పిఎస్లోని తన డెస్క్లో దాచి పెట్టాడు. రౌండ్స్ కుదువ పెట్టుకున్న వ్యక్తికి ఇస్తే ఎక్కడైన ఫైరింగ్ చేస్తే తాను ఇరుక్కుంటానని భావించి ఇవ్వనట్లు తెలిసింది. కాగా ఇటీవల భానుప్రకాష్ ఎపిలో నిర్వహించిన గ్రూప్2లో ఎఎస్ఓగా ఎంపికయ్యాడు. ఆ ఉద్యోగంలో చేరాలంటు ఇక్కడ రిలీవ్ కావాల్సి ఉంటుంది, దానికి తన వద్ద ఉన్న అన్నింటినీ ఎస్హెచ్ఓకు హ్యాండ్ఓవర్ చేయాల్సి ఉంది. దీని కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన భానుప్రకాష్, డెస్క్ తన రివాల్వర్ మిస్సింగ్ అయిందని ఇన్స్స్పెక్టర్ కిరణ్కు చెప్పాడు. రౌండ్లు ఉన్నాయని, రివాల్వర్ మాత్రమే పిఎస్ నుంచి మిస్సింగ్ అయిందని చెప్పాడు. ఎందుకైనా మంచిది అని ఇన్స్స్పెక్టర్ కిరణ్ పిఎస్లో ఉన్న సిసిటివిల ఫుటేజ్ను పరిశీలిద్దామని చూశాడు. ఫుటేజ్లో భానుప్రకాష్ బంగారం తీసుకుని వెళ్తున్నట్లు బయటపడింది, దానిపై నిలదీయగా తాను కుదువ బెట్టుకున్నానని చెప్పాడు. వెంటనే ఇన్స్స్పెక్టర్ పై అధికారులకు సమాచారం ఇవ్వగా టాస్క్ఫోర్స్ పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. భానుప్రకాష్ను టాస్క్ఫోర్స్ పోలీసులు విచారించగా, బెట్టింగ్కు బానిసగా మారానని డబ్బుల కోసం రివాల్వర్ తాను కుదువ బెట్టానని ఒప్పుకున్నట్లు తెలిసింది. వెంటనే ఉన్నతాధికారులు భానుప్రకాష్ను సస్పెండ్ చేశారు. రివాల్వర్ బెట్టింగ్ కోసం కుదువబెట్టాడా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
న్యూఢిల్లీ: బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పలు అంశాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్(ఆర్ఇపిఎం) స్కీమ్ స్వయం సమృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.7,280 కోట్లతో ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ స్కీమ్ అమలు కానుంది. ఆర్ఇపిఎం ఎకో సిస్టమ్ ప్రోత్సాహానికి కేంద్ర కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు రూ.9,858 కోట్లతో పుణె మెట్రో విస్తరణను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రూ.1,457 కోట్లతో ద్వారా-కనాలుస్ రైల్వే డబ్లింగ్ లైన్కు.. బద్లాపూర్-కర్జత్ మధ్య మూడు, నాలుగో రైల్వేలైన్కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
Vijay Sethupathi joins Rajinikanth’s Jailer 2
Superstar Rajinikanth is shooting for his upcoming movie Jailer 2, a pan-Indian attempt which is high on expectations. The shoot of the film is happening currently in Goa and critically acclaimed actor Vijay Sethupathi has joined the sets of the film today in Goa. Vijay Sethupathi has a crisp role and he allocated dates for […] The post Vijay Sethupathi joins Rajinikanth’s Jailer 2 appeared first on Telugu360 .
వరుస బ్లాక్బస్టర్ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో హిస్టారికల్ ఎపిక్ ‘ఎన్బికె111’ చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్గా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు బుధవారం హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్ను నిర్మాతలకు అందజేశారు. బాలకృష్ణతో అనేక బ్లాక్బస్టర్లను అందించిన దర్శకుడు బి.గోపాల్ క్లాప్ కొట్టారు. బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్కు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చి బాబు సమిష్టిగా దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ దర్శకులు, నిర్మాతలు అనేక మంది ప్రముఖ అతిథులు హాజరయ్యారు. హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలు, అద్భుతమైన యాక్షన్, విజువల్ వండర్ గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోంది.
Rs.4.25 lakhs |ఫోన్ పోయిందా… ఖాతా ఖాళీ
Rs.4.25 lakhs | ఫోన్ పోయిందా… ఖాతా ఖాళీ Rs.4.25 lakhs |
అవినీతి అనకొండ రేవంత్రెడ్డి: కెటిఆర్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అవినీతి అనకొండ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దుయ్యబట్టారు. వరంగల్ జిల్లా, గీసుగొండ శివారులోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును బుధవారం పార్టీ నేతలతో కలిసి ఆయన సందర్శించారు. కిటేక్స్ కంపెనీకి చెందిన అత్యాధునిక స్పిన్నింగ్ ఇండస్ట్రీని, యంగ్ వన్ కంపెనీకి చెందిన గార్మెంటరీ ఇండస్ట్రీని ఆయన పరిశీలించారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఉత్పత్తికి సంబంధించిన వివరాలను, పార్కులో సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి వేల కోట్ల పెట్టుబడులను, కొత్త కంపెనీలను తెచ్చిందన్నారు. అందులో భాగంగానే వరంగల్లో ఏర్పాటు చేసిన దేశంలోని అతి పెద్దదైన మెగా టెక్స్టైల్ పార్కు అని గుర్తు చేశారు. కెసిఆర్ దార్శనికతకు నిలువుటద్దం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కు అని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పారిశ్రామిక విధానానికి తూట్లు పొడుస్తూ విలువైన భూములను ప్రయివేట్ వ్యక్తులకు అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ (హిల్టప్) ఎవరి ప్రయోజనం కోసం తెచ్చారని ప్రశ్నించారు. పారిశ్రామికవాడల్లోని రూ.5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి, ఆయన సోదరుల కనుసన్నల్లో కొల్లగొట్టే ప్రయత్నమే హిల్టప్ పాలసీ ఉద్దేశమని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి దోచుకున్న వేల కోట్ల రూపాయలను రాహుల్ గాంధీకి పంపే ఏర్పాట్లలో ముఖ్యమంత్రి ఉన్నారని ధ్వజమెత్తారు. ఇకా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని గొప్పలు చెప్పి, పంచాయతీ ఎన్నికల్లో 17 శాతానికే పరిమితం చేసినందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్, రేవంత్ రెండు చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్ పనులతో పాటు డ్రైనేజీ, ఇతర సౌకర్యాలు కల్పించి పార్కును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట జనగామ ఎంఎల్ఎ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంఎల్సి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంఎల్ఎలు చల్లా ధర్మారెడ్డి, వినయ్ భాస్కర్, నరేందర్, రాజయ్య, వెంకట రమణారెడ్డి, సుదర్శన్రెడ్డి తదితరులు ఉన్నారు. * నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు గీసుకొండ మండలం, ఊకల్ హవేలి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిరామారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ఆందోళన
ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వం దోచుకొని తనను తప్పుగా చిత్రీకరిస్తూ పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్న ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన చేపట్టింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా, కాసిపేటలో చోటుచేసుకుంది. కాసిపేట పోలీస్స్టేషన్ పరిధిలోని సోమగూడెం భారత్ కాలనీలో నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుడు ఎస్కె సలీం ఇంటి ముందు చొప్పరిపల్లె గ్రామానికి చెందిన ఎస్.అనూష బుధవారం ఉదయం బైఠాయించింది. ఆమెకు అంబేద్కర్ మహిళా సంఘం నాయకురాళ్లు మద్దతుగా బైఠాయించారు. ఈ సందర్భంగా ఆ యువతి మాట్లాడుతూ.. సలీం తనను ప్రేమిస్తున్నానని వెంటపడడ్డాడని, తాను ఒప్పుకోని పరిస్థితిలో అతని తల్లిని కూడా తన ఇంటికి రప్పించి, తన తల్లిని ఒప్పించాడని తెలిపింది. చనిపోతానని బెదిరించడంతో తాను సలీంను కూడా ప్రేమించానని, 8 సంవత్సరాలుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిపింది. ప్రేమ పేరుతో సర్వం దోచుకొని తనను అందరి మధ్య తప్పుడుగా చిత్రీకరిస్తూ మరో పెళ్లికి సలీం సిద్ధమయ్యాడని ఆరోపించింది. గతంలో కూడా తన పట్ల అమర్యాదగా వ్యవహరించడంతో సలీంపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానని తెలిపింది. సలీం నెల రోజులకు పైగా జైలుకు వెళ్ల్లివచ్చాడని, ఆయినప్పటికీ అతనిలో మార్పు రాలేదని, తనతోనే ఉంటూనే, తాను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు ఫోన్లో స్టేటస్లో పెట్టి మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయింది. సలీంతో తనకు వివాహం జరిపించి న్యాయం చేయాలని కోరింది. సలీం ఇంటి ముందు బైఠాయించడంతో సలీం కుటుంబీకులు ఘర్షణకు దిగడంతో పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. ఎఎస్ఐ బూర రవీందర్ సంఘటన స్థలానికి చేరుకొని అనూషకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సలీం ను మందమర్రి సిఐ వద్దకు పిలిపించామని, సమస్యను అక్కడ పరిష్కరించుకోవాలని ఆయన సూచించడంతో మహిళా సంఘాలు అనూష ను తీసుకొని సిఐ శశిధర్రెడ్డి వద్దకు తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా సిఐ వారిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇప్పటికే ఈ విషయం కోర్టులో నడుస్తోందని, ఇలా ఇంటి ముందు బైఠాయించడం సరికాదని, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మధ్యవర్తుల సహాయంతో సమస్యను పరిష్కారం చేసుకోవాలని, కోర్టు తీర్పు వరకు వేచిచూడాలని సిఐ వారికి సూచించారు. ఈ విషయంలో ఎవరు కూడా గొడవలకు వెళ్లవద్దని హితవు పలికారు. కాగా, బాధితురాలు అనూషకు మద్దతుగా మంచిర్యాల అంబేద్కర్ మహిళా సంఘం నాయకురాలు మద్దెల భవాని, కామెర అనూష సభ్యులు మద్దతు పలికారు.
11 crore |సహకార వ్యవస్థలో రాజకీయాలు ఉండకూడదు..
11 crore | సహకార వ్యవస్థలో రాజకీయాలు ఉండకూడదు.. 11 crore |
సోదరుడు ఇమ్రాన్ ఖాన్ జాడ చెప్పండి
తన సోదరుడి జాడ చెప్పాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరిలు ముగ్గురు డిమాండ్ చేశారు. రావల్పిండి జైలులో ఖైదీ అయిన తమ సోదరుడిని కలిసేందుకు అనుమతిని ఇవ్వాలని అధికారులను కోరారు. నెలరోజులుగా ఇమ్రాన్ను జైలులో ఎవరూ చూడటానికి వీల్లేకుండా అధికారులు ఆంక్షలు విధించారు. మరో వైపు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, చనిపోయాడని, దీనిని రహస్యంగా ఉంచుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఆయన ఎక్కడున్నాడు? ఏమైంది? అనేది తమకు తీవ్ర మానసిక ఆందోళన కల్గిస్తోందని ముగ్గురు సోదరిలు నూరెన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా తెలిపారు. తాము ఇటీవల రావల్పిండిలోని అడియాలా జైలు వద్దకు పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పిటిఐ) కార్యకర్తలతో కలిసి వెళ్లామని, ఆయనను కలిసేందుకు అనుమతి అడిగామని, అయితే ఈ దశలో తమపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. రావల్పిండి జైలులో 2023 నుంచి ఖాన్ నిర్బంధంలో ఉన్నాడు. మూడు వారాలుగా ఆయన పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదని ఇమ్రాన్ సోదరిలు వాపోయారు.
నాంపల్లిలో ఫిష్ క్యాంటీన్ ప్రారంభం
రాష్ట్ర మత్స శాఖ నాంపల్లిలో ఫిష్ క్యాంటీన్ను ప్రారంభించింది. నాంపల్లి గగన్ విహార్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్కుమార్ రెడ్డి, అనిల్ కుమార్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకే మత్స శాఖ ప్రధాన కార్యాలయం (మాసాబ్ ట్యాంక్) పక్కనే ఫిష్ క్యాంటీన్ ఉన్నది.
Bhimavaram |కలెక్టరమ్మ ముచ్చట్లు
Bhimavaram | కలెక్టరమ్మ ముచ్చట్లు Bhimavaram | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ :
ఇందిరమ్మ చీరలపై దుష్ప్రచారం చేయడం తగదు:మంత్రి సీతక్క
ఇందిరమ్మ చీరలపై దుష్ప్రచారం చేయడం తగదని, ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలు, మహిళా సంఘాలు ఎంపిక చేసుకున్న డిజైన్లలోనే చీరలను ఇస్తున్నామని, అయినా కలర్, డిజైన్ బాగాలేదని బిఆర్ఎస్ వాళ్లు విమర్శిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. సహజంగా ఆడవాళ్లు ఎదుగుతుంటే కెటిఆర్, హరీశ్రావులు ఓర్వలేరని మంత్రి సీతక్క విమర్శించారు. ఆడబిడ్డలు చీరలు తీసుకొని సంబరపడుతుంటే వారు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. బిఆర్ఎస్ మాదిరిగా ఇవి సూరత్ నుంచి కిలోల లెక్కన తీసుకొచ్చిన చీరలు కాదని, సిరిసిల్ల నేతన్నలు తమ చేతితో స్వయంగా నేసిన చీరలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కావాలంటే కెటిఆర్, హరీష్రావు, కవితలు స్వయంగా సిరిసిల్ల వెళ్లి నేతన్నలను అడిగి తెలుసు కోవాలని మంత్రి సీతక్క సూచించారు. కొందరు బిఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు కావాలని చీరలు బాగా లేవంటూ మాట్లాడటం సిరిసిల్ల నేతన్నలను అవమానించేలా ఉందన్నారు. చీరలను మహిళా సంఘాల వారికే ఇస్తున్నామని ఆరోపణలు అవా స్తవమని మహిళా సంఘాల సభ్యులకు ఇస్తూనే సభ్యత్వం లేని వారిని సైతం సంఘంలోకి ఆహ్వానిస్తూ వారికి సారె పెడుతున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఐఎఎస్, ఐపిఎస్,ఎన్ఐఏ అధికారినంటూ పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి బాడీగార్డులుగా పనిచేసిన ఇద్దరు పరారీలో ఉన్నారు. రెండు మొబైల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, రెండు వాకీటాకీలు, నకిలీ ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్జోన్ డిసిపి చింతమనేని శ్రీనివాస్ తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరలోని షేక్పేటకు చెందిన బత్తిని శశికాంత్(39) అమాయకులకు తాను ఐఎఎస్, ఐపిఎస్ ఆఫీసర్ నంటూ నమ్మిస్తూ మోసాలు చేస్తున్నాడు. అతడికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రవీణ్, విమల్ బాడీగార్డులుగా పనిచేస్తున్నారు. నిందితుడు కొందరికి డిప్యూటీ కమిషనర్ మైన్స్గా పనిచేస్తున్నట్లు, ఎన్ఐఏ అధికారి నంటూ చెప్పి పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాడు. నకిలీ ఐఏఎస్,ఐపిఎస్, ఎన్ఐఏ ఐడికార్డులను తయారు చేయించుకున్నాడు. తనతోపాటు ఇద్దరు బాడీగార్డులు, కారుకు సైరన్ పెట్టుకుని తిరుగుతుండడంతో పలువురు నిజంగానే ఆఫీసర్ అని భావించారు. కమ్యూనికేషన్ కోసం రెండు వాకీటాకీలను కూడా వాడేవారు. టిఎస్ఐఐసిలో ఇండస్ట్రీయల్ భూమి ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే గోల్డ్ జిమ్ యజమాని అలీ హసన్ వద్ద రూ.10,50,665 వసూలు చేశాడు. తర్వాత నుంచి కన్పించకుండా పోయాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.
Anganwadi |అంగన్వాడి కేంద్రానికి గ్రహణం
Anganwadi | అంగన్వాడి కేంద్రానికి గ్రహణం Anganwadi | ఎడపల్లి, ఆంధ్రప్రభ :
Keerthy Suresh responds about Eight-Hour Work Rule
The current discussion regarding working hours in the Indian films has received new focus after Deepika Padukone expressed her views. The latest to respond about it is national-award-winning actress Keerthy Suresh. She spoke about the increasing demands for an eight-hour workday for actors and crew, an issue that has created a conversation among those in […] The post Keerthy Suresh responds about Eight-Hour Work Rule appeared first on Telugu360 .
విజయ్ దేవరకొండ సినిమాలో హాలీవుడ్ యాక్టర్
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హిట్స్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది ‘కింగ్డమ్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు విజయ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా జూలైలో విడుదలైంది. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ మూవీ తర్వాత ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్తో జతకట్టాడు విజయ్. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీ ‘విడి14’ అనే వర్కింగ్ టైటిల్తో ప్రచారంలో ఉంది. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు, మమ్మీ చిత్రం విలన్ ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారనే వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే వినోద్ సాగర్తో కలిసి ఆర్నాల్డ్ వోస్లూ కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమాలో ఆర్నాల్డ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారా..? లేక మరేదైనా రోల్లో నటిస్తున్నారా.? అనే చర్చ కూడా జరుగుతోంది.
Video : Fight Masters Ram Lakshman Exclusive Interview
The post Video : Fight Masters Ram Lakshman Exclusive Interview appeared first on Telugu360 .
73 years |ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం..
73 years | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం.. 73 years |
Minister |రామ్ లాల్జీతో మంత్రి లోకేష్ భేటీ
Minister | రామ్ లాల్జీతో మంత్రి లోకేష్ భేటీ Minister | మంగళగిరి,
పెళ్లిలో చిప్స్ దోపిడీతో హంగామా! #UPNews #FunnyNews #ViralVideo #MassMarriage #Hamirpur
మాదాపూర్లో ఐటీ కంపెనీ పేరుతో ఘరానా మోసం..
హైదరాబాద్: నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూల్ చేసి ఓ ఐటి కంపెనీ బోర్డుతిప్పేసింది. ఈ ఘరానా మోసం నగరంలోని మాదాపూర్లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శిక్షణ ఇచ్చి, ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ నిరుద్యోగులను నమ్మించి భారీగా డబ్బులు వసూల్ చేసింది. దాదాపు 400 మంది విద్యార్థుల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.3 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేసిన కంపెనీ తర్వాత బోర్డు తిప్పేసింది. మొత్తం డబ్బును తీసుకుని కంపెనీ డైరెక్టర్ స్వామి నాయుడు పరారయ్యాడు. దీంతో బాధిత విద్యార్థులు సైబరాబాద్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారైన స్వామి నాయుడును పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
Temple | 18వ మహా పడిపూజ… Temple | ములుగు సిద్దిపేట జిల్లా,
ఆటో కిందపడి ఏడాదిన్నర చిన్నారి మృతి
బోధన్: సాలూర మండలం సాలంపాడ్ గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. ఇంటి ముందు ఆటోలో ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ వచ్చిన బోధన్కు చెందిన వ్యాపారి అబ్ధుల్ ఖాదర్ వద్దకు తల్లి అయేషా బేగం వెళ్లింది. ఆమె వెనకే చిన్నారి కూడా పాకుతూ బయటకు వచ్చింది. ఉల్లిగడ్డల బేరం కుదరకపోవడంతో తల్లి పక్కకు వచ్చింది. చిన్నారిని గమనించని ఖాదర్ ఆటోని ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆటో టైరు పాప తలపై నుంచి వెళ్లింది. పాపకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటివరకూ కళ్లముందే ఆడిన పసి పాప విగత జీవిగా మారడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతి చెందిన చిన్నారి సాలంపాడ్ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, అయేషాబేగం దంపతులకు మూడో సంతానం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై తెలిపారు.
Karimabad |హెల్త్ కార్డులను వెంటనే విడుదల చేయాలి
Karimabad | హెల్త్ కార్డులను వెంటనే విడుదల చేయాలి Karimabad | కరీమాబాద్,
వైద్య ఆరోగ్యశాఖలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి అధ్యక్షతన కార్యాలయ లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగం దాని ఆవశ్యకత పై వివరించడం జరిగింది అనంతరం రాజ్యాంగ పీఠిక చదివి వినిపించారు.అలాగే రాజ్యాంగ పీఠిక కు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించడం జరిగినది, ఈ సందర్భంగా డాక్టర్ డియం ఎచ్ ఓ ఈ బి దేవి మాట్లాడుతూ ఈరోజు […] The post వైద్య ఆరోగ్యశాఖలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ appeared first on Visalaandhra .
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.234కిలోల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. బోరబండ ప్రాంతంలో హుస్సేన్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే నిఘా పెట్టిన ఎక్సైజ్ సిబ్బంది బైక్పై గంజాయి తీసుకుని వచ్చి విక్రయిస్తున్న హుస్సేన్ను అదుపులోకి తీసుకున్నారు. 84 ప్యాకెట్లలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు రెహమాన్ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు కోసం హుస్సేన్ను బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
డిసెంబర్ 10న సిపిఐ శతాబ్ద ఉత్సవాలను విజయవంతం చేయాలి
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున పిలుపు విశాలాంధ్ర – అనంతపురం : డిసెంబర్ 10న సిపిఐ శతాబ్ద ఉత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున పిలుపునిచ్చారు.డిసెంబర్ 10న జరగబోయే సిపిఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ, అనంతపురం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హనుమంతరాయుడు అధ్యక్షతన, ఏఐవైఎఫ్,ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా […] The post డిసెంబర్ 10న సిపిఐ శతాబ్ద ఉత్సవాలను విజయవంతం చేయాలి appeared first on Visalaandhra .
అయోధ్య రాముడు ధర్మవరం పట్టువస్త్రాల్లో #Ayodhya #DharmavaramPattu #Handloom #Temple
Sports |రాష్ట్ర స్థాయి వాలీబాల్కు ఎంపిక..
Sports | రాష్ట్ర స్థాయి వాలీబాల్కు ఎంపిక.. Sports | లక్షేట్టిపేట, ఆంధ్ర
జూబ్లీహిల్స్ ఎంఎల్ఎ గా ప్రమాణం చేసిన నవీన్ యాదవ్
ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన వి. నవీన్ యాదవ్ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యాదవ్ తో ప్రమాణం చేయించారు. అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ ఛాంబర్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర మంత్రులు డి. శ్రీధర్ బాబు, అజహరుద్దీన్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. నవీన్ కుమార్ పార్టీ నాయకులతో, తన అనుచరులతో అసెంబ్లీకి ఊరేగింపుగా వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నిక ప్రచారం సమయంలో విపక్షాల నేతలు తనను, తన కుటుంబ సభ్యులను అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపినాథ్ మరణించకపోయినా ఉప ఎన్నిక జరిగేదని అన్నారు. మాగంటి మరణించడంతో తాము ఎన్నికల పిటిషన్ను ఉపసంహరించుకున్నామని ఆయన చెప్పారు. తనను గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి రుణాన్ని తీర్చుకుంటానని ఆనవీన్ యాదవ్ తెలిపారు. మజ్లీస్ పార్టీ నేతలకూ నవీన్ కృతజ్ఞతలు తెలిపారు.
Narayanapet |ఎస్.ఈగా బాధ్యతల స్వీకరణ
Narayanapet | ఎస్.ఈగా బాధ్యతల స్వీకరణ Narayanapet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
హెడ్మాస్టర్ సివి. శేషు విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని శివానగర్లో బ్రిలియంట్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని హెడ్మాస్టర్, కరెస్పాండెంట్ సివి. శేషు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్య చిన్నపిల్లల హాస్పిటల్ వారిచే ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం 600 మంది కు వైద్య పరీక్షలను నిర్వహించి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో […] The post ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన appeared first on Visalaandhra .
Commissioner |పట్టణ శుభ్రత, పచ్చదనం కోసం కృషి చేయాలి
Commissioner | పట్టణ శుభ్రత, పచ్చదనం కోసం కృషి చేయాలి Commissioner |
విషాదం: ఛతేశ్వర్ పుజారా బావమరిది ఆత్మహత్య
టీం ఇండియా క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఇంట్లో విషాదం చోటు చేుసకుంది. అతడి భార్య సోదరుడు జీత్ రిసిఖ్భాయ్ పబారీ బుధవారం రాజ్కోట్లోని నివాసంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ప్రాణం ఉందనే ఆశతో అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాలవీయనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. జీత్ ఆత్మహత్యకు గత కారణాలపై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. 2024లో జీత్ రసిఖ్భాయ్పై తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న యువతి అత్యాచార ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిగ్గా ఏడాది తర్వాత జీత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత సంవత్సరం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం జీత్ పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో లైంగిక సంబంధానికి బలవంతం చేశాడని ఆరోపించింది. వారి నిశ్చితార్థం తర్వాత కూడా వేధింపులు కొనసాగాయని.. ఆ తర్వాత అతను ఒక్కసారిగా బంధం తెంచుకున్నాడని పేర్కొంది.
అతిపెద్ద రాజ్యాంగ రూపకల్పన దేశం భారతదేశం
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ రూపకల్పన దేశం మన భారతదేశం అని ఓటిపిఆర్ఐ డైరెక్టర్ ఆచార్య జీవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తైల సాంకేతిక ఔషధ పరిశోధన సంస్థ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ రూపకల్పనలో పాల్గొన్న మహనీయుల విశేషాలను వివరించారు.విద్యార్థులచే ఉపాధ్యాయులచే మరియు బోధనా బోధన సిబ్బందిచే భారత రాజ్యాంగ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సి గోపీనాథ్ , […] The post అతిపెద్ద రాజ్యాంగ రూపకల్పన దేశం భారతదేశం appeared first on Visalaandhra .
'ఎల్లమ్మ' సినిమాపై స్పందించిన కీర్తి సురేష్..
బలగం డైరెక్టర్ వేణు తెరకెక్కించబోతున్న సెకండ్ మూవీ ఎలమ్మ. ఈ సినిమాపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నాచురల్ స్టార్ నాని, నితిన్ తోపాటు పలువురు యంగ్ హీరోలు ఈ సినిమాను రిజెక్ట్ చేశారని..ఎట్టకేలకు ఈ సినిమాకు హీరో దొరికాడని, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రూమార్స్ వస్తున్నాయి. అలాగే,ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై కీర్తి సురేష్ స్పందించింది. తన లేటెస్ట్ మూవీ ‘రివాల్వర్ రీటా’ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కీర్తి.. మీడియాతో మాట్లాడుతూ ఎల్లమ్మ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చింది. తాను ఈ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేసింది. కాగా, తమిళ్ లో క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కిన ‘రివాల్వర్ రీటా’ను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ తోపాటు రాధిక శరత్కుమార్, సునీల్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 28న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇక, తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి కీర్తి సురేష్ రౌడీ జనార్థనా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Rs. 28 crores |అభివృద్ధికి చిరునామాగా గుర్తింపు తెస్తా..
Rs. 28 crores | అభివృద్ధికి చిరునామాగా గుర్తింపు తెస్తా.. Rs. 28
Telangana |రాజ్యాంగంతోనే అందరికీ రక్షణ
Telangana | రాజ్యాంగంతోనే అందరికీ రక్షణ Telangana | లక్షెట్టిపేట, ఆంధ్రప్రభ :
Judicial Remand for iBomma Ravi
Piracy website iBomma organizer Immadi Ravi has been arrested and the court granted custody for five days. He was produced before the court after the custody got concluded. The Nampally Court has now granted 14 days judicial remand of Immadi Ravi today. The Cyber Crime cops have filed a PT warrant in the Nampally Court […] The post Judicial Remand for iBomma Ravi appeared first on Telugu360 .
Crime |ఆర్టీసీ డ్రైవర్పై దాడి.. ఇద్దరిపై కేసు..
Crime | ఆర్టీసీ డ్రైవర్పై దాడి.. ఇద్దరిపై కేసు.. Crime | నర్సంపేట,క్రైo,
127 అకౌంట్లతో ₹24 కోట్లు #Hyderabad #CyberCrime #BankFraud #TaskForce #KVBank

18 C