ఎమ్మెల్యే హామీతో శాంతించిన నిరసనకారులు
ఎమ్మెల్యే హామీతో శాంతించిన నిరసనకారులు ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ :
Ys Sharmila : సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగుల ఆందోళనపై కూటమి ప్రభుత్వం మొండి వైఖరి తగదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
శ్రీశైలం అష్టదిగ్భంధనం నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ
అనుమానాస్పద మృతి.. మంథని, ఆంధ్రప్రభ : మంథని పట్టణంలో గంగపురి ఇటుక బట్టి
Chandrababu : గల్ఫ్ దేశాల పర్యటనకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్ఫ్ దేశాల పర్యటనకు షెడ్యూల్ ఖరారయింది.
చోరీ కేసులో ఐదుగురు అరెస్టు నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట డివిజన్(Narsampet Division)లోని
వెస్ట్ ఇండీస్పై భారత్ క్లీన్ స్వీప్ #indvswi #cricketnews #TestSeries #bcci #indiancricket
బాసరలో లెక్కిస్తున్న హుండీలు బాసర, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా బాసర (basara)
Chandrababu : టీడీపీ కథ మళ్లీ మొదటికి వచ్చిందా.. క్యాడర్ ఏమంటుందంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే తాను 1995 ముఖ్యమంత్రిని అని ప్రకటించుకుంటున్నారు.
బీసీ రిజర్వేషన్ల జీఓపై సుప్రీంకోర్టులో సవాలు.. అర్ధరాత్రి పిటిషన్ దాఖలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ సోమవారం అర్ధరాత్రి అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.పెంచిన రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కృతనిశ్చయంతో ఉండటంతో ఈ వ్యవహారం దిల్లీకి చేరింద .గత కొన్ని రోజులుగా ఈ అంశంపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. హైకోర్టు స్టే […] The post బీసీ రిజర్వేషన్ల జీఓపై సుప్రీంకోర్టులో సవాలు.. అర్ధరాత్రి పిటిషన్ దాఖలు appeared first on Visalaandhra .
Midhun Reddy : మిధున్ రెడ్డి ఇంట్లో సోదాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి ఇంట్లో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు సోదాలు జరుపుతున్నారు
ప్రాంత అభివృద్ధికి అంకితభావంతో సేవలు
ప్రాంత అభివృద్ధికి అంకితభావంతో సేవలు కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమకు తాగునీరు,
గూగుల్ క్లౌడ్ సీఈవోతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.ఈ సమావేశం దిల్లీ వద్ద జరిగింది, ఇందులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.సమావేశంలో, విశాఖపట్టణంలో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్స్కేల్ డేటా సెంటర్ స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం చేసుకోవాలని చర్చ జరిగింది.వైజాగ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీగా అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్ట్ కీలకమైన పునాదులు వేసే […] The post గూగుల్ క్లౌడ్ సీఈవోతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ appeared first on Visalaandhra .
Komatireddy : కోమటిరెడ్డి కొత్త ట్విస్ట్.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకేనా?
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు
Mega 158: Malavika Mohanan in Talks?
The buzz around Chiranjeevi’s upcoming project, tentatively titled Mega 158, is growing as the makers enter the final stages of casting. Reports suggest that actress Malavika Mohanan is in discussions to play one of the female leads. Directed by Bobby Kolli and produced under the banner of KVN Productions, Mega 158 is shaping up to […] The post Mega 158: Malavika Mohanan in Talks? appeared first on Telugu360 .
Raja Singh : కిషన్ రెడ్డిపై రాజాసింగ్ హాట్ కామెంట్స్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. హైదరాబాద్లో మూడు రోజుల పాటు అలర్ట్
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాతావరణ శాఖ సూచనలతో పాటు, కచ్చితమైన అంచనాలకు పేరుగాంచిన తెలంగాణ వెదర్మ్యాన్ కూడా రాష్ట్రంలో వర్షాలపై కీలక అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా తీవ్రమైన ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొన్నారు. అలాగే, […] The post తెలంగాణలో మళ్లీ వర్షాలు.. హైదరాబాద్లో మూడు రోజుల పాటు అలర్ట్ appeared first on Visalaandhra .
Andhra Pradesh : గూగుల్ రాకతో ఏపీకి లాభమెంతంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది
మార్గం సుగమం చేయడం సామాన్యమైన విషయం కాదు: ట్రంప్ను పొగిడిన బైడెన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక ప్రథమ దశలో భాగంగా, హమాస్ చెరలో బంధిగా ఉన్న 20 మంది ఇజ్రాయెలీలను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చారు.ఈ చర్య ట్రంప్ ప్రయత్నాల కారణంగా ఇజ్రాయెల్,హమాస్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణకు దారితీసింది, దీనికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.చివరకు తన విధానాలను తీవ్రంగా విమర్శించే మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ట్రంప్ను అభినందించారు.గాజా డీల్ కుదిరేలా మార్గాన్ని సులభతరం చేయడం అంత సులభం కాదు […] The post మార్గం సుగమం చేయడం సామాన్యమైన విషయం కాదు: ట్రంప్ను పొగిడిన బైడెన్ appeared first on Visalaandhra .
India vs West Indies : వెస్టిండీస్పై భారత్ గెలుపు.. గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్
రెండోటెస్ట్ లోనూ భారత్ వెస్టిండీస్ పై విజయం సాధించింది
ఆయన నిజంగా శాంతిని కోరుకునేవాడు…
ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ ప్రధాని ఇజ్రాయెల్-హమాస్ల మధ్య నెలకొన్న యుద్ధానికి ముగింపు పలుకుతూ, ఈజిప్టులోని షర్మ్-ఎల్-షేక్లో శాంతి ఒప్పందంపై వివిధ దేశాధినేతలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రశంసలతో ముంచెత్తారు.ఆయనంత గొప్ప నాయకుడు లేడన్నట్లుగా పొగడ్తలు కురిపించారు.షరీఫ్ మాటలు విన్న ట్రంప్ ఆశ్చర్యపోయి, నవ్వులు ఆపుకోలేకపోయారు. చివరికి ఇప్పుడే నేను ఇంకేమీ మాట్లాడలేను… ఇంటికి వెళ్లిపోదాంఁ అంటూ చమత్కారంగా స్పందించారు. భారత్- పాక్ […] The post ఆయన నిజంగా శాంతిని కోరుకునేవాడు… appeared first on Visalaandhra .
NTR’s New Look Sparks Concern Among Fans
At the recent wedding of Narne Nithin, the brother of Jr NTR’s wife Pranathi, the star couple drew attention for their noticeably lean appearances. Both looked significantly slimmer, with Jr NTR appearing particularly restless throughout the event. This change has sparked curiosity and concern among fans, who couldn’t help but notice his frail frame and […] The post NTR’s New Look Sparks Concern Among Fans appeared first on Telugu360 .
క్యాన్సర్ తగ్గుతుందని వెళితే రోడ్డు ప్రమాదం కాటేసింది! #Kadapa #Accident #CancerBattle #telugupost
ఫుట్పాత్పై మరీ ఇలా వెళ్లాలా? #telugupost #viralvideo #footpaths #accidentnews #latestnews
Breaking : పోలీసుల ఎదుట మల్లోజుల లొంగుబాటు
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు పోలీసుల ఎదుట లొంగిపోయారు
మత్తు వదిలించే ఏఐ మిషన్ #DrugsControl #AI #Police #TelanganaEagle #SahayAI #ShieldAI #TeluguNews
పొరుగు దేశం పాకిస్తాన్ ఇంటాబయటా పెను సమస్యలతో సతమతమవుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోసి, ఆ మంటల్లో చలికాచుకుందామనుకున్న దాయాదిని ఇప్పుడవే మంటలు చుట్టుముట్టి, ఊపిరి సలపనివ్వడం లేదు. ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, దేశాన్ని ఎలా గట్టెక్కించాలో తెలియక పాక్ పాలకులు సతమతమవుతుంటే, ఉగ్రవాదం పెనుభూతమై కోరలు సాచి కబళించబూనడంతో దిక్కుతోచడం లేదు. గాజాలో పెచ్చుమీరుతున్న మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ వారం రోజుల క్రితం ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటైన తెహ్రీక్ -ఇ-లబ్బైక్ పాకిస్తాన్ కార్యకర్తలు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ వంటి ముఖ్య నగరాల్లో చేసిన ఆందోళనలు ఆ దేశంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంతగా క్షీణించిందో కళ్లకుకట్టాయి. ఆ అల్లర్లను అణచివేశామన్న సంతృప్తి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఒక్క రోజైనా మిగలకుండానే అఫ్గానిస్తాన్తో ఘర్షణలు పెచ్చుమీరాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఊపిరులూది, ఇండియాపైకి ఎగదోసి వినోదం చూద్దామనుకున్న దాయాది దేశానికి తెహ్రీక్-ఇతాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) సీమాంతర ఉగ్రవాదం ఎలా ఉంటుందో రుచి చూపిస్తోంది. అఫ్గాన్ గడ్డపైనుంచి పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ పాక్ ప్రభుత్వానికి కంటిమీద నిద్ర లేకుండా చేస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఇటీవల జరిపిన దాడుల్లో సైనిక నష్టం జరగడంతో పాక్ భగ్గుమంది. టిటిపి ప్రధాన నేతలను మట్టుబెట్టే ఉద్దేశంతో కాబూల్ పై బాంబు దాడులకు తెగబడటంతో తాలిబాన్ ప్రభుత్వం ఎదురు దాడులు ప్రారంభించింది. ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్, ఆపరేషన్ సిందూర్ ను తప్పుబట్టిన పాకిస్తాన్కు సీమాంతర ఉగ్రవాదం ఎంతటి ప్రమాద హేతువో ఇప్పుడు అర్థమవుతున్నట్లుంది. వాస్తవానికి అఫ్గానిస్తాన్ -పాకిస్తాన్ మధ్య సంబంధ బాంధవ్యాలు మొదటినుంచీ అంతంతమాత్రమే. ఇరుదేశాలనూ విభజిస్తున్న డ్యురాండ్ రేఖను తాము గుర్తించబోమంటూ అఫ్గాన్ మొదటినుంచీ తెగేసి చెబుతూ వస్తోంది. తాలిబాన్ల చేతికి పగ్గాలు వచ్చాక ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. దీనికి ప్రధాన కారణం తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ సంస్థే. 2007లో ఏర్పడిన ఈ సంస్థ షియా వ్యతిరేక ఉద్యమాన్ని నెత్తికెత్తుకుని, ఆత్మాహుతి బాంబుదాడులకు పాల్పడటంతో అనతికాలంలోనే నిషేధానికి గురైంది. అఫ్గానిస్తాన్లో అమెరికా ఆక్రమణలకు మద్దతు పలికిందన్న కారణంగా పాకిస్తాన్ పై టిటిపి కక్ష గట్టింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు టిటిపిని దారికి తెచ్చేందుకు తాలిబాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. కానీ, ఏ ఒప్పందమూ కుదరకముందే ఆయన జైలుపాలయ్యారు. తదనంతరం అధికారంలోకి వచ్చిన ప్రధాని షెహబాజ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడమే లక్ష్యంగా టిటిపి మరింతగా పేట్రేగిపోతోంది. గత ఎనిమిది నెలల్లో టిటిపి 2414 మంది పాక్ పౌరులను హతమార్చినట్లు పాకిస్తాన్కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ సంస్థ అధ్యయనంలో తేలింది. తాజాగా టిటిపి పాక్ సైనికులను లక్ష్యం చేసుకోవడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అఫ్గాన్-, పాక్ రాజకీయ సంక్షోభంపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించినా, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్తో సన్నిహిత సంబంధాలను ఆశిస్తున్న చైనా మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడనే విధంగా పాక్ తో వైరం అఫ్గానిస్తాన్ను భారత్కు దగ్గర చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటిస్తున్నప్పుడే పాక్- అఫ్గాన్ల మధ్య ఘర్షణలు తలెత్తడం కాకతాళీయమే అయినా, భారత్ కు ఈ పరిణామం కలిసివచ్చే అంశమే. ఇరుగుపొరుగు దేశాలతో భారత్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో అఫ్గాన్ దగ్గర కావడం ఒకింత హర్షించదగిన పరిణామం. అఫ్గాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించకపోయినా, పూర్తిగా ఆ దేశంతో దౌత్య సంబంధాలను తెంచుకోలేదు. తాజాగా అఫ్గాన్ విదేశాంగ మంత్రి పర్యటనతో సంబంధాలు మళ్లీ బలోపేతం కానున్నాయి. కాబూల్లో నాలుగేళ్ల క్రితం మూసివేసిన దౌత్య కార్యాలయాన్ని మళ్లీ తెరిచేందుకు భారత్ అంగీకరించడం ఒక శుభపరిణామం. అఫ్గానిస్తాన్ పునర్ నిర్మాణంలో భారత్ ఇప్పటికీ తన వంతు పాత్ర పోషిస్తోంది. తాజా బడ్జెట్ లోనూ 25 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ను కట్టడి చేసేందుకు అఫ్గాన్తో స్నేహం వెదకబోయిన తీగ కాలికి తగిలిన చందంగా ఉపయోగపడుతుందని ఆశిద్దాం.
Jubilee Hills Politics Heat Up as BJP Rethinks Its Strategy
The political temperature in Jubilee Hills is rising fast, with major parties recalibrating their strategies ahead of the by-election. Social and local equations are turning out to be the key factors shaping candidate selection. While the Congress and BRS have already announced their nominees, the BJP is taking its time for a surprising twist. Sources […] The post Jubilee Hills Politics Heat Up as BJP Rethinks Its Strategy appeared first on Telugu360 .
ఈశాన్యంలో రగులుతున్న విద్వేషాగ్నులు
ఎన్సిఆర్బి నివేదిక ఓ ఏడాది ఆలస్యంగా వెలు గులోకి రావడం, డేటా, సేకరణ, సర్వేలు, జనాభా లెక్కలలో వెనుకబాటుతనాన్ని ప్రతిబింబిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సకాలంలో డేటా చాలా ముఖ్యం. ఈ ప్రాంత భద్రతా వాతావరణం అస్థిరంగా ఉంది. తిరుగుబాటు జ్ఞాపకాలు, జాతిపరమైన లోపాలు, మాదకద్రవ్యాల వ్యాపారం, రవాణా వివరాలు నిరంతరం మారుతూ ఉంటాయి. తాజా లెక్కలు తెలిస్తే, అసలు నిజం తెలుస్తుంది. ఈ ప్రాంతంలో పోలీసు సిబ్బంది కొరత, శిక్షణ లేకపోవడం పెద్దలోపం. 2023లో మణిపూర్లో వైఫల్యాలు రాజకీయ, మతపరమైన ఒత్తిడిలో చట్టం అమలు ఎంత దారుణంగా విఫలమవుతుందో తేటతెల్లం చేస్తుంది. ఈ మధ్య విడుదలైన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి) నివేదిక 2023 మన దేశంలో అంతర్గత భద్రత, సామాజిక ప్రభావాలను తేటతెల్లం చేస్తోంది. గణాంకాలను పరిశీలించేటప్పుడు కాస్తజాగ్రత్త తప్పదు. రాష్ట్రాలలో విభిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో రిజిస్టర్ అయ్యే కేసులు, రిపోర్ట్ అయ్యే కేసులలో తేడా ఉంటుంది. విస్తృత జాతీయ ధోరణులు విధానపరంగా తక్షణం తీసుకోవల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నాయి.సైబర్ నేరాల పెరుగుదల, షెడ్యూల్డ్ తెగలవారిపై తీవ్రంగా పేరిగిన నేరాలు, మహిళలు, చిన్నపిల్లలపై నేరాల ప్రభావం ఈ నివేదికలో సుస్పష్టమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఈ నేరాలు భిన్నంగా ఉన్నాయి. జాతిపరమైన హింసాకాండ, డిజిటల్ విస్తరణతో పెరిగిన సైబర్ నేరాలు, నేరాలను అరికట్టడంలో సంస్థాగత బలహీనతలు ఈ ప్రాంతాన్ని సాంప్రదాయ, కొత్తనేరాల కేంద్రాలుగామార్చాయి. మణిపూర్లో జాతుల పరమైన హింస, అసోంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, అనేక రాష్ట్రాలలో మహిళలు, పిల్లలపై పెరుగుతున్న నేరాలు మొత్తంమీద ఈ సమాజాలను, పాలనా యంత్రాంగాలను తీవ్ర వత్తిడికి గురిచేస్తున్నాయి. 2023లో భారతదేశం అంతటా షెడ్యూల్డ్ తెగల (ఎస్టిలు)పై నేరాలు 28.8 శాతం పెరిగాయని ఎన్సిఆర్బి నివేదిక స్పష్టం చేసింది. ఇదేదో ప్రమాదవశాత్తూ పెరిగినది కాదు. ఇది ఓ ప్రాంతంలో తిరుగుబాటుకు అద్దం పడుతోంది. ముఖ్యంగా మణిపూర్లో ఎస్టిలపై నమోదైన నేరాలు 2022లో ఒకటి ఉంటే, 2023 లో 3,399 నేరాలకు పెరిగాయి. ఈ అసాధారణ పెరుగుదలకు కారణం 2023 మే నుంచి మణిపూర్ రాష్ట్రాన్ని అతలాకుతలంచేసి జాతిపరమైన హింసగా చెప్పవచ్చు. మణిపూర్ సంక్షోభం వేలాదిమందిని నిరాశ్రయులను చేసింది. గిరిజన గృహాలు, సంస్థలు విధ్వంసానికి దారితీసింది. శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయి. పాలకుల అసమర్థతను బహిర్గతం చేసింది. మణిపూర్లో హింసను తరచుగా జాతి ఘర్షణగా చిత్రీకరించినా అక్కడ హత్యలు, దాడులు గృహ దహనాలు, లైంగిక నేరాలు, ఆస్తుల దోపిడీ వంటి దారుణమైన నేరాలు జరిగాయి. గిరిజన జనాభాను తీవ్రంగా ఇబ్బందుల పాలు చేశాయని ఎన్సిఆర్బి డేటా స్పష్టం చేస్తోంది. ఈ గణాంకాలు అక్కడి ప్రజల బాధలకు కొలమానాలు, అసమర్థ పాలకుల పనితీరుకు నిదర్శనాలు. మణిపూర్తో పాటు మధ్యప్రదేశ్ , రాజస్థాన్లోనూ గిరిజనులపై అధికంగా నేరాలు జరిగినట్లు నమోదైంది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని గిరిజనులపై జరిగిన దాడులకు, ఈశాన్యప్రాంతంలో దాడులకు తేడా ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో గిరిజనులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.అందువల్ల ఇక్కడి గిరిజనులపై నేరాలు స్వల్ప సంఘటనలు కావు, బహుళ జాతులలో తీవ్ర ఉద్రిక్తతలకు సంకేతం. రాజకీయాలను, వనరులకు సంబంధించిన ఘర్షణలను తీవ్రతరం చేస్తాయి. అసోం, మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో గిరిజనుల గుర్తింపు రాజకీయాలు, భూమి పరులపాలు చేయడం, వలసల వంటి ప్రశ్నలతో ముడిపడి ఉంది. అందువల్ల ఎన్సిఆర్బి డేటాను శాంతిభద్రతల సమస్యలుగా కాక, పాలనాపరమైన, విధానపరమైన నిర్లక్ష్యానికి సంకేతంగా చూడాలి. స్పష్టమైన రక్షణాపరమైన యంత్రాంగం లేకపోవడం, సామాజికపరమైన హింసపై నెమ్మదిగా స్పందించడం వల్ల గిరిజనుల ఉనికికి ముప్పు ఏర్పడింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.ఎన్సిఆర్బి డేటా ప్రకారం 2023 లో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు 31.2 శాతం పెరిగిపోయాయి. దేశంలో డిజిటల్ పోలీసింగ్ మౌలిక సదుపాయాల కొరత ఇందుకు ప్రధాన కారణం. సైబర్ నేరాల స్థాయిని ఈ డేటా పూర్తిగా ప్రతిబింబించడం లేదు. ఈశాన్య భారతంలో ఈ మధ్య విపరీతంగా విస్తరించిన ఇంటర్నెట్ వ్యాప్తి, సైబర్ నేరాలను అరికట్టే చట్టపరమైన సంస్థలకు పెను సవాల్గా మారాయి. డిజిటల్ ఇండియా ప్రచారం, స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ చెల్లింపు వ్యవస్థల విస్తరణ కొత్త సమస్యలను సృష్టించింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్లలో ఆర్థిక మోసాలు, ఫిషింగ్ మోసాలు, ఆన్లైన్ ఉద్యోగాల రాకెట్లు, సోషల్ మీడియా దుర్వినియోగంవల్ల లైంగికపరమైన నేరాలు పెరిగిపోయాయని పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో సైబర్ నేరాలు అరికట్టడంలో శిక్షణ పొందిన సిబ్బంది, ఫోరెన్సిక్ ల్యాబ్ల కొరత తీవ్రంగా ఉంది. సైబర్ నేరాలు సర్వవ్యాప్తి అవుతున్నాయని ఎన్సిఆర్బి హెచ్చరిక ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సాధారణ నేరాలపై దృష్టి పెట్టే పోలీసు వ్యవస్థలు, ఆన్లైన్ మోసం, వేధింపులు వంటి నేరాల పరిష్కారంలో ఇబ్బందిపడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజలలో సైబర్నేరాలపట్ల అవగాహన పెంచేందుకు ప్రచారం, డిజిటల్ అక్షరాస్యత, పాఠశాల స్థాయిలో సైబర్ నేరాల పట్ల భద్రత బోధించే విద్య తక్కువగా ఉన్నాయి. డిజిటల్ విస్తరణ వేగానికి, డిజిటల్పరమైన నేరాలను అరికట్టే యంత్రాంగానికి మధ్య పొంతన లేదు. నేరాలను అరికట్టే యంత్రాంగం కన్నా ఎన్నో రెట్ల వేగంతో నేరస్థులు దోపిడీ చేసేస్తున్నారు. 2023లో పిల్లలపై నేరాలు 9.2 శాతం పెరిగాయని, దేశవ్యాప్తంగా 1,77,335 కేసులు నమోదయ్యాయని ఎన్సిఆర్బి నివేదిక హెచ్చరిస్తోంది. 96 శాతం కేసులలో నేరస్థులు బాధితులకు బాగా పరిచయమున్నవారు. పిల్లలపై అత్యాచారాలు ఎక్కువగా ఇళ్లు, పాఠశాలల పొరుగునే ఉన్న ప్రాంతాలలో జరుగుతున్నాయని చెబుతోంది. ఈశాన్య రాష్ట్రాలలోనూ ఈ నేరాలు ఎక్కువే. చట్టపరంగా నిషేధం ఉన్నా, అసోంలో బాల్యవివాహాలు, పిల్లల లైంగిక వేధింపుల రేటు దేశంలోనే అత్యధికం. లైంగిక నేరాలనుంచి పిల్లల రక్షణ చట్టం (పోస్కో) ముఖ్యంగా టీనేజ్లో పరస్పర అంగీకారంతో కూడిన సంబంధాల విషయంలో దుర్వినియోగం చర్చలకు దారితీసింది. ఈ నేరాల విషయంలో పిల్లలకు, పెద్దలకూ కూడా అవగాహన పెంచాల్సిన తక్షణ ఆవశ్యకతను ఎన్సిఆర్బి స్పష్టం చేసింది. ఇక్కడి సామాజిక కట్టుబాట్ల కారణంగా బాధితులు బయటకు చెప్పుకోలేని పరిస్థితి. మహిళలపై నేరాలు జాతీయ స్థాయిలో 0.4 శాతం అంటే స్వల్పంగా పెరిగాయి. వరకట్నాలకు సంబంధించిన మరణాలు మాత్రం 14.9 శాతం పెరిగాయి. హిందీ మాట్లాడే రాష్ట్రాలతో పోలిస్తే, ఇక్కడ వరకట్నాలు తక్కువే. కానీ, మహిళలపై హింస, గృహ హింస, లైంగిక వేధింపులు, ఆడపిల్లల అక్రమ రవాణా తీవ్రస్థాయిలోనే ఉంది. మానవ అక్రమ రవాణా కేసులు నమోదైన రాష్ట్రాలలో దేశంలోనే అసోం ఒకటి. మహిళలు, మైనర్ల శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ కోసం రాష్ట్ర, జాతీయ సరిహద్దులను దాటి మానవ రవాణా చేస్తున్నారు. ఎన్సిఆర్బి నివేదిక ఓ ఏడాది ఆలస్యంగా వెలుగులోకి రావడం, డేటా, సేకరణ, సర్వేలు, జనాభా లెక్కలలో వెనుకబాటుతనాన్ని ప్రతిబింబిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సకాలంలో డేటా చాలా ముఖ్యం. ఈ ప్రాంత భద్రతా వాతావరణం అస్థిరంగా ఉంది. తిరుగుబాటు జ్ఞాపకాలు, జాతిపరమైన లోపాలు, మాదకద్రవ్యాల వ్యాపారం, రవాణా వివరాలు నిరంతరం మారుతూ ఉంటాయి. తాజా లెక్కలు తెలిస్తే, అసలు నిజం తెలుస్తుంది. ఈ ప్రాంతంలో పోలీసు సిబ్బంది కొరత, శిక్షణ లేకపోవడం పెద్దలోపం. 2023లో మణిపూర్లో వైఫల్యాలు రాజకీయ, మతపరమైన ఒత్తిడిలో చట్టం అమలు ఎంత దారుణంగా విఫలమవుతుందో తేటతెల్లం చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఏజెన్సీల మధ్య సమన్వయం లేకపోవడం వ్యవస్థను మరింత బలహీనపరుస్తోంది. సరిహద్దు నేరాలు ఈశాన్య భారతం, బంగ్లాదేశ్, మయన్మార్ అంతటా నెట్వర్క్ కలిగిన నేరస్థులకు కళ్లెం వేసేందుకు పటిష్టమైన నిఘా అవసరం. విదేశీ సర్వర్ల ద్వారా సాగే సైబర్ నేరాలను అరికట్టేందుకు, సిఇఆర్టి -ఇన్, సిబిఐకు చెందిన సైబర్ యూనిట్ వంటి జాతీయ సంస్థల సహకారం ఎంతైనా అవసరం. ఈశాన్య రాష్ట్రాల దృక్కోణం నుంచి ఎన్సిఆర్బి 2023 నివేదికను పరిశీలిస్తే మూడు సందేశాలు అందుతాయి. 1. పాలనాపరమైన వైఫల్యం దుర్బలత్వాన్ని పెంచుతుంది. జాతి ఘర్షణలను రాజకీయంగా, పాలనాపరంగా పరిష్కరించకపోతే, నేరపూరిత విపత్తులుగా మారతాయని మణిపూర్ హింస స్పష్టం చేస్తుంది. ముందుగానే ఘర్షణలను పరిష్కరించడం, సమాజ పరంగా సంభాషణలు జరపడం, తటస్థ పోలీసింగ్తో కూడిన యంత్రాంగం నిర్మాణం అవసరం. 2. డిజిటల్ నేరాలకు కళ్లెం వేసేందుకు డిజిటల్ పాలనా యంత్రాంగం అవసరం. సాధారణ పోలీసులు వాటిని అరికట్టలేరు. ఈశాన్య రాష్ట్రాలలో సైబర్ ల్యాబ్లు, డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలు, సైబర్ అవగాహనకోసం ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యాలలో పెట్టుబడి పెట్టాలి. స్కూళ్లు, కాలేజీల్లో పాఠ్యాంశాల్లో డిజిటల్ విజ్ఞానం చేర్చి, విద్యార్థులలో సైబర్ నేరాల వైపు పోకుండా అవగాహన పెంచాలి. 3. పేద, బలహీన వర్గాలను రక్షించేందుకు చట్టపరమైన సంస్కరణలతోపాటు, సామాజిక సంస్కరణలు కూడా అవసరం. పోస్కో, వరకట్న నిషేధ చట్టం వంటి వాటిని సున్నితంగా అమలు చేయాలి. ఎన్సిఆర్బి 2023 డేటా కేవలం లెక్కలు అని కొట్టి పారేయకూడదు. అది అభివృద్ధి చెందుతున్న సమాజం ఆందోళనలకు అద్దం. ప్రభుత్వాలు, చట్టం అమలు చేసే సంస్థలు, పౌరసమాజం ముందున్న సవాల్ ఏమిటంటే, ఈ లెక్కలను పరిమితి చేసి, భద్రత, న్యాయబద్ధమైన విధానాన్ని అనుసరించడం. ఎన్సిఆర్బి నివేదిక నేరాల గురించి కన్నా పాలనా సంక్షోభం గురించి ఎక్కువ చర్చించింది. ఈశాన్య భారతంలో ఉన్నంత పాలనా పరమైన సంక్షోభం భారతదేశంలో ఎక్కడా కన్పించదు. ఈ సంక్షోభాన్ని, సమస్యను తక్షణం పరిష్కరించడం ఎంతైనా అవసరం. గీతార్థ పాఠక్
అర్జున్కు సువర్ణావకాశం.. తిరిగి జట్టులో చోటు..
టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తనని తాను నిరూపించుకోవడానికి కెరీర్ మొదటి నుంచి కృషి చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో అవకాశాలు వచ్చినా.. అతని కెరీర్ మాత్రం ఇంకా సెట్ కాలేదు అనే చెప్పుకోవాలి. ఐపిఎల్లో అడపదడప మ్యాచ్లు ఆడిన అర్జున్ దేశవాళి క్రికెట్లో మాత్రం సత్తా చాటాడు. కానీ, గత ఏడాదిగా అతడు మైదానంకి దూరమయ్యాడు. అయితే తాజాగా అర్జున్ని ఓ సువర్ణావకాశం వరించింది. రంజీ ట్రోఫీ 2025-26కి గాను గోవా జట్టులో అతడికి చోటు దక్కింది. దీంతో గత ఏడాది డిసెంబర్ తర్వాత అర్జున్ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఐపిఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ భాగమైనప్పటికీ.. అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అర్జున్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ను చివరిగా అరుణాచల్ ప్రదేశ్తో ఆడాడు. 2025-26 సీజన్లో గోవా ఎలైట్ గ్రూప్లో భాగంగా ఉంది. అక్టోబర్ 15న తమ తొలి మ్యాచ్లో చండీగఢ్తో తలపడుతోంది. ఆ తర్వాత మ్యాచ్లలో కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, కేరళతో గోవా ఆడనుంది. ఈ టోర్నీలో గోవా క్రికెట్ జట్టుకు దీప్రాజ్ గావోంకర్ నాయకత్వం వహిస్తున్నాడు. కొత్త సీజన్కి ముందు ఢిల్లీ నుంచి గోవాకి మకాం మార్చిన స్టార్ ఆల్ రౌండర్ లలిత్ యాదవ్కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.
విద్యార్ధుల జీవితాలతో చెలగాటం నకరికల్లు అక్టోబర్ 14 (ఆంధ్రప్రభ) : మండల కేంద్రమైన
తెలంగాణలో అక్రమమార్గంలో రవాణా అవుతున్న కల్తీ మద్యాన్ని అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ సత్ఫలితాలు సాధించేనా... తెలంగాణ ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టే రెవెన్యూ వనరుల్లో అబ్కారి శాఖ చెప్పుకోదగ్గ రెవెన్యూ సమకూర్చుతూ పెద్దన్న జిఎస్టి రెవెన్యూకు తోడుగా ఉందనే చెప్పుకోవచ్చు. గత పది సంవత్సరాలుగా ఎక్సైజ్ ఆదాయం 400 శాతం పెరిగిందని సాక్షాత్తు ఆ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. రెవెన్యూ అంచనాల ప్రకారం ఎక్సైజ్ ఆదాయం 2025- 26 సంవత్సరానికి గాను రూ. 54,193 కోట్లుగా నిర్ధారించి ఆ దిశగా ప్రభుత్వం, ఆ శాఖ యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే అనుకున్నట్లుగా కాకుండ ఆగస్టు 2025 నాటికి మొత్తం అనుకున్న టార్గెట్కు 28.09 శాతం మాత్రమే సాధించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఎక్సైజ్ చట్టం 1968 ప్రొహిబిషన్ చట్టం 1995 ప్రకారం ప్రభుత్వం రెవెన్యూ కంటే ప్రజల్లో మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలపై, నాటుసారా వల్ల కలిగే ఆరోగ్య సమస్యపై, వాటి ప్రభావం నుంచి తాగుడుకు బానిసైనవారికి డిఆడిక్షన్ సెంటర్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేందుకు సమీక్ష సమావేశంలో అబ్కారి మంత్రి తెలిపారు. అబ్కారి భవన్లో జరిగిన సమీక్ష సమావేశంలో కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని, ఎట్టి పరిస్థితుల్లోను కల్తీ మద్యం గ్రామాల్లో ప్రవేశించకుండ కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఎక్సైజ్ కమిషనర్ చేకూరి హరికిరణ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజివీ, ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ చేస్తూ అసలు మద్యాన్ని మరిపించేలా ఊడలా పాకుతున్న కల్తీ మద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్కుపాదంతో అణచివేయాలని గట్టిగ కోరారు. ఇదే కాకుండా ఎక్సైజ్ డ్యూటీ చెల్లించని ఎన్డిపిఎల్ మద్యం రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి విచ్చలవిడిగా పారుతుండడం తెలంగాణ ఖజానాను కలవరపరుస్తోంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ను బలోపేతం చేస్తూ, అవసరమైతే అబ్కారి ఉద్యోగులకు రివాల్వర్లూ అందచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఖాళీ మద్యం సీసాల్లో ఖరీదైనా బ్రాండ్లుగా మరిపిస్తూ, నకిలీ మద్యాన్ని అంటగట్టే ముఠాలు బార్లకు, మద్యం దుకాణాలకు, బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ ముఠాలు హైదరాబాద్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని, ఇతర రాష్ట్రాల మద్యంతోపాటు కల్తీ మద్యాన్ని కూడా సరఫరా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా దోచుకుంటున్నాయి. నకిలీ మద్యం ముఠాల ఆగడాలను కట్టడి చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ విభాగం గణనీయంగా కృషి చేస్తోందని చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, సింథటిక్ డ్రగ్స్ సరఫరాను కట్టడి చేయడంతోపాటు వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. నల్లబెల్లం తయారీ, అమ్మకంపై నిషేధించాలని, పట్టుకున్న నల్లబెల్లాన్ని సేంద్రియా ఎరువుల కోసం రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. అంతేకాకుండా నిషేధిత డ్రగ్స్ తయారీపై గట్టి నిఘా ఉంచి నాచారం, చర్లపల్లి వంటి పారిశ్రమికవాడల్లోనూ ఎప్పటికప్పుడు కనిపెట్టి ఉండాలని, అధికారులను అప్రమత్తంగా ఉంచాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలనుంచి ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రనుంచి రెక్టిఫయిడ్ స్పిరిట్ను అక్రమ రవాణా కాకుండా నియంత్రించాలని, నిఘా విభాగం పటిష్టం చేయాలని నిశ్చయించింది. అంతే కాకుండా ఎన్డిపిఎల్ మద్యం అక్రమంగా గోవా, హర్యానా, గుర్గాన్, కోల్ కత్తా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరలించకుండా చెక్ పోస్టులను పటిష్టపరిచారు. స్టేట్ టాస్క్ఫోర్స్, డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఎన్డిపిఎల్ను కంట్రోల్ చేస్తున్నాయి. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖంగా వడ్డెర బస్తీ, సుందరయ్య నగర్, ఖురషీద్ నగర్లో దేశిదారు అక్రమంగా తరలించే వారిని అబ్కారి అధికారులు అరెస్ట్ చేస్తున్నా ఆగడాలు ఆగడం లేదు. మహారాష్ట్ర నుంచి వచ్చే దేశిదారు పలు రుచుల్లో లభిస్తుండటంతో స్థానికులు అలవాటుపడి బానిసలుగా మారి దానికే అలవాటుపడ్డారు. ఈ దేశిదారు రాష్ట్ర ఆదాయానికి గణనీయంగా గండికొడు తుంది. ఇటీవలి దసరా ఉత్సవాలను ఆసరా చేసుకుని దేశిదారు అక్రమంగా తెలంగాణ జిల్లాల్లోకి ప్రవహిస్తున్నా అబ్కారి అధికారులు అడ్డుకట్టవేయలేక పోతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న తూ తూ మంత్రంగా విధులు కొనసాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని పెంగంగా పరీవాహక ప్రాంతాల గ్రామాల నుంచి దేశిదారు ఏరులై పారుతున్నది. ముఖ్యంగా భీంపూర్ మండలంలోని కరంజి, జైనథ్ మండలంలోని ఆనందపూర్, పెండల్వడ, కౌటా, పిప్పల్వాడ, సాంగిడి గ్రామాల వారు పెంగంగా నుంచి దేశిదారును అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రివేళ నది దాటిస్తూ ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవహించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న దేశిదారును అబ్కారి అధికారులు అప్రమత్తంగా ఉండి అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆరెంజ్, మ్యాంగో, సోంఫ్ ఫ్లేవర్లతో లభించే దేశిదారుకు తెలంగాణ ప్రజలు బానిసలై ధనప్రాణాలు కోల్పోకముందే అబ్కారి అధికారులు మేల్కొవలసిన అవసరం ఎంతైనా ఉంది. మహ్మద్ సాబీర్ 98492 31002 (ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి)
పర్వదినాలను ప్రజలు సంబరంగా జరుపుకోవడానికి ప్రభుత్వాలు సకల ఏర్పాట్లు చేయాలి. సదుపాయాల కల్పనే ప్రభుత్వ సామర్థ్యానికి రికార్డులు కావాలి. తెలంగాణలో మహిళలు ఘనంగా జరుపుకొనేది బతుకమ్మ పండుగ. పేద మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ 2024 లో చేయలేదు. ఈ పండుగకు ఇస్తామన్న మాట కూడా దాటి పోయింది. తమ పేరు కోసం మాత్రం తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను మరో రకంగా ఘనంగా జరిపింది. గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా ప్రభుత్వం సెప్టెంబర్ 29న హైదరాబాదులోని సరూర్ నగర్ స్టేడియంలో భారీ బతుకమ్మ ఏర్పాటు చేసింది. వాటిని పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు రెండు ప్రపంచ రికార్డులను నిర్వాహకులకు అందజేశారు. 63 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన తెలంగాణ మహాబతుకమ్మకు ఒక రికార్డు, బతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు తిరుగుతూ ఆడి పాడినందుకు మరో రికార్డు లభించాయి. ఈ రికార్డు పత్రాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, మేయర్ విజయలక్ష్మిలు అందుకున్నారు. అదే రోజు మంత్రి జూపల్లి అధికారులతో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసి రెండు రికార్డులను ముఖ్యమంత్రికి అందజేశారు. వాటిని సాధించేందుకు అన్ని విధాలా సహకరించిన సిఎంకు మంత్రి, ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలిపారు. బతుకమ్మను గిన్నిస్ బుక్తో ముడిపెట్టడం గత ప్రభుత్వంతోనే మొదలైంది. 2016 లో ఎల్బి స్టేడియంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళల సంఖ్య ఆధారంగా అప్పుడు గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది. అప్పుడు, ఇప్పుడు కేరళలోని ఓనం పండుగ సాధించిన రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంతో ఈ ఏర్పాటు జరిగాయి. ఓనం సందర్భంగా 2023 లో కేరళలోని త్రిసూరులో 7027 మంది స్త్రీలు సాంప్రదాయిక తిరువాతిర నృత్యంలో పాల్గొని రికార్డు సాధించారు. దీని నిర్వహణ కేరళ ప్రభుత్వం కాకుండా ఒక మహిళా స్వచ్ఛంద సంస్థ చేపట్టింది. 9 వేల మంది స్త్రీలను స్టేడియంకి రప్పించి ఆ రికార్డును తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తిరగ రాసింది. లండన్ కేంద్రంగా ఉన్న గిన్నిస్ సంస్థ ఈ సంవత్సరమంతా అందజేసిన కొత్త ప్రపంచ రికార్డులను జోడించి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ - 2026’ పుస్తకాన్ని తెస్తుంది. ఈ పుస్తకం కాపీలు ఏడాదికి 35 లక్షల దాకా అమ్ముడవుతున్నాయి. ప్రపంచంలోని 40 భాషల్లో ఇది లభిస్తుంది. ఇంగ్లీషు ప్రతి ధర రూ. 3 వేల దాకా ఉంటుంది. క్లబ్ లో తాగుతూ కొందరు మిత్రులు సరదాగా వేసుకున్న ప్రశ్నలకు సమాధానం దొరకకపోవడంతో వాటి సేకరణ మొదలుపెట్టారు. అవి వింతగా ఉండటంతో పుస్తకంగా తెచ్చారు. అలా ఈ రికార్డుల ప్రయాణం మొదలై మంచి లాభదాయక వ్యాపారంగా సాగుతోంది. రికార్డు సాధించిన వారికి ఈ సంస్థ ఎలాంటి పారితోషికం ఇవ్వదు. రికార్డును నమోదు చేసుకోవాలని అనుకొనేవారే నిర్వహణ వ్యయాన్ని భరించాలి. వ్యక్తిగతంగా సాధించే రికార్డు కోసం ఆయా వ్యక్తులు వీడియో రూపంలో రుజువులను, చూసిన వారి ధ్రువీకరణలు నమ్మి రికార్డు పత్రాన్ని పంపుతారు. సాధారణంగా ప్రభుత్వాలు ఈ రికార్డుల కోసం తాపత్రయపడవు. మామూలుగా వ్యక్తులే ఏదో కొత్తది సాధించి గిన్నిస్ బుక్లో ఎక్కాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రికార్డులకు ఇవి అవి అనే ప్రత్యేక నియమాలేవి లేవు. మీసాలు, గోర్లు పెద్దగా పెంచినా గిన్నిస్ వరల్డ్ రికార్డే. మరొకరు సెంటీ మీటరు ఎక్కువ పెంచినా పాత రికార్డు బుక్ లోంచి తొలగించబడుతుంది. ఎక్కువ పెన్సిళ్లు నోట్లో పెట్టుకున్నవాడు, ముక్కుతో టైపు చేసినవాడు, ఒంటికాలిపై ఎక్కువ దూరం నడిచినవాడు రికార్డు బ్రేకర్సే. దుబాయ్లో ఉండే రామ్ కుమార్ ఒంటి చేత్తో ఇప్పటికి 50 గిన్నిస్ రికార్డులు కొట్టేశాడు. సెంచరీ ఆయన టార్గెట్ అంట. ఇలా చిన్నాచితకా స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ పోతే గిన్నిస్ రికార్డు ఒక లక్ష్యమా అనిపిస్తుంది. ప్రభుత్వాలకు ఇది అవసరమా అని సామాన్యుడు కూడా అనుకుంటాడు. నిజానికి ఎవరైనా చేసిన గొప్ప విషయం రికార్డుల్లోకి ఎక్కాలి కానీ రికార్డుల కోసమే ఒక పని చేయడం అనేది అర్థం లేని విషయమే. ఒక నటుడు ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువ సినిమాల్లో నటించడం ఒక వరల్డ్ రికార్డే. కానీ ఆయన రికార్డు కోసం అన్ని సినిమాల్లో నటించలేదు. ఎంతో శ్రమపడి అన్ని అవకాశాలను పొందగలిగాడు. అనుకోకుండా రికార్డు దాటేశాడు. దాన్ని ఇంకొకరు దాటాలంటే కష్టసాధ్యంగా లేదా అసాధ్యంగా ఉండాలి. రికార్డు కొన్నేళ్లయినా నిలవాలి.అదీ రికార్డు అంటే. వీటితో పోల్చితే మన ప్రభుత్వం సాధించిన బతుకమ్మ రికార్డులు దాటేయడం తేలికే. వచ్చే సంవత్సరం ఒక వ్యక్తి తలచుకున్నా ఈ రికార్డులను బద్దలు కొట్టొచ్చు. 65 అడుగుల బతుకమ్మ పేర్చడం ఖర్చు, శ్రమతో కూడుకున్నదే కానీ పెద్ద కష్టమైన పనేమీ కాదు. అలాగే అమ్మలక్కల లెక్క దాటించడం కూడా సుసాధ్యమే. ఇలా చూస్తే ప్రభుత్వం భ్రమలో ఉందా లేక జనాన్ని మభ్యపెడుతుందా అనే అనుమానం కలగక మానదు. ప్రజాధనం పనికిరాని రికార్డుల కోసం కాకుండా ప్రజా ప్రయోజనం కోసం వెచ్చించబడాలి. బద్రి నర్సన్ 94401 28169
Tirumala : పరకామణి కేసులో సీఐడీ విచారణ ప్రారంభం
తిరుమలలో పరకామణి చోరీకి సంబంధించి సీఐడీ బృందం విచారణ జరుపుతోంది.
రెండు టెస్టులో టీమిండియా గెలుపు... సిరీస్ కైవసం
ఢిల్లీ: రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. వెస్టిండీస్ జరుగుతున్న రెండు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్ ను 2-0తో భారత జట్టు వశం చేసుకుంది. రెండో టెస్టులో వెస్టిండీస్పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 35.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి గెలుపొందింది. కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో(58) కదంతొక్కాడు. ధృవ్ జురెల్ ఆరు పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. గిల్ 13 పరుగులు చేసి రోస్టన్ చేస్ బౌలింగ్లో జస్టీన్ గ్రీవస్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాయి సుదర్శన్ 39 పరుగులు చేసి రోస్టన్ చేజ్ బౌలింగ్లో షాయ్ హోప్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ ఎనిమిది పరుగులు చేసి వర్రికన్ బౌలింగ్లో అండర్సన్ ఫిలిప్కు క్యాచ్ మైదానం వీడాడు. రెండో టెస్టులో ఎనిమిది వికెట్లు తీసుకున్న కుల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. రెండు టెస్టుల్లో ఒక్క సెంచరీతో చేయడంతో పాటు ఎనిమిది వికెట్లు తీసిన జడేజాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. ఇండియా తొలి ఇన్నింగ్స్: 518/5 వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248 వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్: 390
ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి కూడా..
ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి కూడా.. హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ (hyderabad)లో
Haryana : హర్యానా డీజీపీ సెలవులో.. పూరన్ కుమార్ బలవన్మరణం కేసు
హర్యానా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
My Role In Dude, Unlike Anything I Played Before: Mamitha
Youth sensation Pradeep Ranganathan, who has delivered two consecutive hits is all set to entertain this Diwali with Dude. Produced by Mythri Movie Makers, the film marks the directorial debut of Keerthiswaran. Mamitha Baiju, who tasted big success with her previous film Premalu, stars opposite Pradeep, with Sarath Kumar playing a pivotal role. Mamitha shares […] The post My Role In Dude, Unlike Anything I Played Before: Mamitha appeared first on Telugu360 .
Telangana : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది
పెట్రోలు పోసుకొని వృద్ధ దంపతుల ఆత్మహత్య
సూర్యాపేట: అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోట్యాతండాలో భూక్యా లచ్చు(65), భూక్యా వీరమ్మ(60) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతుకలు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉంది. గత కాలంగా దంపతులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. పిల్లలకు బారం కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. గది లోపల గడియ పెట్టుకొని వృద్ధ దంపతులు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. గదిలో నుంచి పొగలు, కేకలు వినిపించడంతో తండా వాసులు బలవంతంగా డోర్ ఓపెన్ చేసి ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వీరమ్మ అప్పటికే చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. లచ్చు మాత్రం చికిత్స పొందుతూ మృతి చెందారు. చిన్న కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Weather Report : మరోమూడు రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతంలో మాత్రమే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
బాబోయ్.. కిడ్నీ, క్యాన్సర్! #Health #Telangana #MedicalReport #KidneyCases #PublicHealth
Gold Price Today : ఆల్ టైం హైకి చేరుకున్న గోల్డ్.. వెండిని ముట్టుకోగలమా?
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి
Andhra Pradesh : డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఎన్ని రాయితీలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది
యూత్, ఫ్యామిలీస్కి నచ్చే సినిమా
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ’తెలుసు కదా’ టీజర్, రెండు పాటలతో సంచలనాన్ని సృష్టించింది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ “నేను టిల్లు లాంటి క్యారెక్టర్ నుంచి బయటికి రావాలంటే ఇలాంటి సినిమాలు చేయాలి. ఈ సినిమాలో నాది ఇంటెలిజెంట్ క్యారెక్టర్. నేను చేసిన వరుణ్ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇది యూత్కి ఫ్యామిలీస్కి నచ్చే సినిమా”అని అన్నారు. హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ “ఇది ఒక రాడికల్ సినిమా అవుతుంది. ట్రైలర్ చూసి చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత టిల్లుని మరిచిపోతారు. అంత నమ్మకం ఉంది”అని తెలిపారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ “ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. సినిమా విడుదల కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను”అని తెలియజేశారు. డైరెక్టర్ నీరజ కోన మాట్లాడుతూ “ఇది నా ఫస్ట్ ఫిలిం. చాలా స్పెషల్. ట్రైలర్లో చూసిన దానికి పది రెట్లు సినిమాలో ఉంది”అని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ మాట్లాడుతూ “ఈ కథ వినగానే నచ్చింది. యూత్ ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అవుతారు. బిగ్ స్క్రీన్ మీద సినిమా చూపించడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము”అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, వైవా హర్షత దితరులు పాల్గొన్నారు.
భారత్ గెలుపు దిశగా #Cricket #IndiaVsWI #TestMatch #SportsUpdate #Windies #TeamIndia
కొన్ని ఎమోషనల్ సీన్స్ సవాలుగా అనిపించాయి
లవ్ టుడే, డ్రాగన్లతో రెండు వరుస హిట్లను అందించిన హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ’ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మమిత బైజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఆ కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం వుంది. కురల్ పాత్ర చాలా డిఫరెంట్ గా వుంటుంది. ఇప్పటివరకూ అలాంటి పాత్ర చేయలేదు. -కురల్ తన భావోద్వేగాల పట్ల నిబద్ధతగా ఉంటుంది, చుట్టూ ఉన్న వారందరితో స్నేహంగా వుంటుంది. ఆమె చాలా సూటిగా మాట్లాడుతుంది. ఈ పాత్ర చేయడం చాలా మంచి అనుభవాన్నిచ్చింది. -ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ నాకు సవాలుగా అనిపించాయి. ఆ సీన్స్ కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. -ప్రదీప్ రంగనాథ్తో నటించడం మంచి అనుభవం. ఆయన మల్టీ టాలెంటెడ్. -శరత్ కుమార్ లాంటి సీనియర్ యాక్టర్స్ తో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. -డైరెక్టర్ కీర్తి ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఇందులో వుండే ఎమోషన్స్, ఫన్ చాలా యూనిక్గా ఉంటాయి”అని అన్నారు.
Tirumala : తిరుమలకు భక్తుల రద్దీ ఈ సీజన్ లో ఎన్నాళ్లో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు.
బాలానగర్ లో కవల పిల్లలను చంపి... భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పద్మ నగర్ ఫేస్ వన్ లో సాయి లక్ష్మి(27) అనే మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. దంపతులు రెండేళ్ల వయసు ఉన్న కవల పిల్లలు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బాబు, పాపను చంపి అనంతరం ఆమె మూడో అంతస్థు నుంచి దూకి చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Bigg Boss Wild Card Entrants Shake Up the House with Bold Feedback and Heated Nominations
The latest episode of Bigg Boss Telugu 9 turned the house upside down as newly joined wild card contestants stirred emotions, sparked new conflicts, and reshaped the nomination dynamics. With confrontations, tears, and strong opinions flying around, the house witnessed a fresh wave of drama — setting the tone for an intense week ahead. Wild […] The post Bigg Boss Wild Card Entrants Shake Up the House with Bold Feedback and Heated Nominations appeared first on Telugu360 .
Andhra Pradesh : నేడు మిధున్ రెడ్డి పిటీషన్ పై విచారణ
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది
తల్లి వద్దంది... అధికారులు చేరదీశారు... #TeluguPost #telugu #post #news
హంటర్ డాగ్.. చెట్టు నరికితే పట్టేస్తుంది #ForestCrime #Adilabad #KawalTigerReserve #HunterDog
Who Targeted Bunny Vas and Mithra Mandali?
It is a Long Journey for Bunny Vas in Telugu cinema. Starting his career as an associate for Allu Arjun, Bunny Vas emerged as a Key Member in Geetha Arts after Allu Aravind. He has been a part of several successful films till Little Hearts which released last month. Bunny Vas is always cautious and […] The post Who Targeted Bunny Vas and Mithra Mandali? appeared first on Telugu360 .
Srisailam : శ్రీశైలం అభివృద్ధికి భారీ ప్రణాళిక.. మోదీ ముందుంచనున్న ప్రతిపాదనలివే
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 14-10-2025
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 14-10-2025
రాయుడితో బలవంతంగా చెప్పించి... హత్య చేశారు: సుధీర్ రెడ్డి
అమరావతి: డ్రైవర్ రాయుడు వీడియోపై టిడిపి ఎంఎల్ఎ బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. రాయుడు వీడియో ఎఐ, మార్ఫుడ్ వీడియో అని తెలిపారు. రాయుడుతో బలవంతంగా మాట్లాడించి అనంతరం అతడిని చంపి ఉంటారని ఆరోపణలు చేశారు. శ్రీకాళహస్తి అభివృద్ధి కోసం తాను పని చేస్తున్నానని, తనపై బురద జల్లడానికి ఈ వీడియో విడుల చేశారని మండిపడ్డారు. డిపాజిట్లు రాని వారితో తనకు పని ఏంటని ప్రశ్నించారు. ఆమె తనకు రాజకీయ ప్రత్యర్థి కాదు అని, డిపాజిట్ కూడా రాని వినుత గురించి తాను ఎందుకు లక్షలు ఖర్చు చేస్తానని ప్రశ్నించారు. వినుత దంపతులు క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నారని, వాళ్ల డ్రైవర్ గురించి తనకు ఎలా తెలుస్తుందని బొజ్జల సుధీర్ రెడ్డి అడిగారు. వినుతకు బెయిల్ వచ్చిన తరువాత వీడియో విడుదల చేయడంలో అనుమానం ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో తన నియోజకవర్గంలో తన కోసం ఆమె ఎప్పుడు పని చేయలేదన్నారు. ఓటు వేయాలని వనిత ఇంట్లోకి తమ కుటుంబ సభ్యులు వెళ్తే రానివ్వలేదన్నారు. రాయుడి వీడియోపై దర్యాప్తు చేయాలని ఎంఎల్ఎ సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. టిడిపి ఎంఎల్ఎ సుధీర్ రెడ్డి బలవంతం చేయడంతో వినుత దంపతులకు సంబంధించిన వీడియోలు తీశానని రాయుడు వీడియోలో వెల్లడించిన విషయం తెలిసిందే. రాయుడు హత్య కేసులో దంపతులు అరెస్టు కావడంతో పాటు ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు.
Andhra Pradesh : నేడు గూగుల్ తో ఏపీ కీలక ఒప్పందం
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్ దిగ్గజం గూగుల్తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకోనుంది
India Vs West Indies ; క్లీన్ స్వీప్ దిశగా భారత్.. వెస్టిండీస్ పై పూర్తి ఆధిపత్యం
భారత్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తుంది
కరీంనగర్ లో బాలికపై అత్యాచారం.... సోషల్ మీడియాలో వీడియో వైరల్
కొత్తపల్లి: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.
సంక్షేమ హాస్టళ్లలో ముఖ గుర్తింపు
విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఫేషియల్ రికగైజేషన్ తప్పనిసరి వైద్యకళాశాలలతో హాస్టళ్ల అనుసంధానం విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ఆహార నాణ్యత పరీక్షకు ప్రత్యేక యాప్ సకాలంలో యూనిఫామ్లు, పుస్తకాల పంపిణీ ఖర్చులు, బకాయిలపై యాక్షన్ ప్లాన్ సంక్షేమ వసతి గృహాల సమీక్షలో సిఎం రేవంత్రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: బిసి, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) నుంచి రూ.60 కోట్లు కేటాయించింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు , తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వాటిని వినియోగించుకునే వెసులుబాటును కలిగించింది. హాస్టళ్లకు కేటాయించిన నిధుల చెక్కులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందజేశారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ఐసిసిసిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధన , బోధనేతర సిబ్బంది ముఖ గుర్తింపుకు ఏర్పాట్లు చేయాలని సిఎం ఆదేశించారు. పూర్తి స్థాయి డేటా జవాబుదారీతనం ఉండాలని ఆయన అన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు యాప్ను ఉపయోగించాలని సిఎం సూచించారు. విద్యార్థులకు విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన నాణ్యమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని దాంతో వారికి లభించే క్యాలరీలను తెలుసుకోవాలని సిఎం ఆదేశించారు. యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో... హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్బోర్డులో అప్లోడ్ చేయాలని సిఎం ఆదేశించారు. హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలని సిఎం సూచించారు. హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని సిఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని సిఎం సూచించారు. ఖర్చులు, బకాయిల చెల్లింపునకు అవసరమైన మొత్తానికి బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లకు స్కాలర్షిప్లు సిబ్బంది జీతాలు, డైట్ఛార్జీలు, నిర్మాణ ఖర్చులు, ఇతర ఖర్చులు, బకాయిల చెల్లింపు, హాస్టళ్ల నిర్వహణకు అయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపుకు అవసరమైన మొత్తానికి సంబంధించి కార్యాచరణను రూపొందించి సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్లను ఆదేశించారు. హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 24 గంటలూ ఆన్లైన్లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్లైన్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎడ్ టెక్ను ఉపయోగించుకోవాలని సిఎం సూచించారు. హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని, ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. వాటికి అవసరమైన యాప్లను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షకు ముందు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ హాస్టళ్లలోని పరిస్థితులపై ప్రజేంటేషన్ ఇచ్చారు. సమీక్షలో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల శాఖల అధికారులు జ్యోతి బుద్ధప్రకాష్ జ్యోతి , బి. షఫియుల్లా, అనితా రామచంద్రన్, క్షితిజ, నిర్మల క్రాంతి వెస్లీ, కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
20మంది ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్ ఇరుపక్షాలలో పండుగ వాతావరణం అయినవారిని చేరి ఆనందడోలికల్లో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇజ్రాయెల్ పార్లమెంట్ నీరాజనం ప్రపంచానికి మరింతమంది ట్రంప్లు కావాలని ఆకాంక్ష వచ్చే ఏడాది నోబెల్కు ప్రతిపాదిస్తామని స్పష్టీకరణ ట్రంప్కు బంగారు పావురాన్ని ప్రదానం చేసిన ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ఇజ్రాయెల్ చట్టసభల్లో ట్రంప్ ప్రసంగం ధాంక్యూ బీబీ..గొప్పపని చేశావ్: ట్రంప్ ప్రశంస ట్రంప్ నిజాయితీ ప్రయత్నాలకు మోడీ మద్దతు గాజా సిటీ: దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది. ఇజ్రాయెల్హమాస్ మధ్య కుదిరిన కొత్త కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ సోమవారం ఇజ్రాయెల్ సజీవ బందీలు 20 మందిని దశల వారీగా విడిచిపెట్టింది. మొదటి దశలో సోమవారం ఉదయం ఏడుగురిని, రెండోదశలో మిగతా 13 మందిని విడిచిపెట్టి రెడ్క్రాస్ సొసైటీకి అప్పగించింది. వారిని తీసుకుని రెడ్క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్కు బయలుదేరింది. ఇక హమాస్ వద్ద ఉన్న 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు కూడా త్వ రలోనే అప్పగించనుంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 2 ల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకరించింది. ఈలోగా కా ల్పుల విరమణకు మధ్యవర్తిగా వ్యవహరించిన అ మెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ ఈజిప్టులో గాజా శాంతి సదస్సులో పాల్గొనేందుకు ముందు గా ఇజ్రాయెల్కు విచ్చేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఆయన ప్రసంగించారు. కాల్పుల విరమణను స్వాగతిస్తూ “ గాజా యుద్ధం ముగిసింది. ఈరోజు చాలా గొప్పదినం.ఇది శుభారంభం ” అని ట్రంప్ అభివర్ణించారు. శాంతి ప్రణాళిక ప్రకారం హమాస్ నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. బందీల కుటుంబీకులను కూడా ట్రంప్ కలుసుకుంటారు. రెండేళ్ల తరువాత తమ ప్రియతములను చూడగానే ఆయా కుటుంబాలు భావోద్వేగానికి గురయ్యాయి. హమాస్ నుంచి విడుదలైన ఏడుగురి బందీలను ఐడీఎఫ్, ఐఎస్ఎ అధికారిక బృందాల సాయంగా ఇజ్రాయెల్కు తీసుకువస్తున్నట్టు పేర్కొంది. వారు చేరుకోగానే వైద్యపరీక్షలు జరుగుతాయి. మరికొంతమంది బందీలను ఈరోజు తరువాత రెడ్క్రాస్కు బదిలీ చేయడమవుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ఇజ్రాయెల్ నగరాల్లో ఆనందం వెల్లువ బందీల పరిస్థితులు ఎలా ఉన్నాయో వెంటనే లభ్యం కాకపోయినా, వారు విడుదలయ్యారన్న వార్తకు స్వదేశంలో అనేక చోట్ల ఆనందాతిశయా లు వెలువడ్డాయి. నగరాలు, పట్టణాల్లో జనం గుమికూడి విడుదల సంఘటనల లైవ్ బ్రాడ్కాస్ట్లను సందర్శిస్తుండటం కనిపించింది. టెల్ అవీవ్లో భారీ ఎత్తున బహిరంగంగా తెరలపై దృశ్యా లు ప్రదర్శించారు. చాలా మంది ఇజ్రాయెల్ పతాకాలను ఎగురవేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దంపతుల స్వాగతం బందీలు తిరిగి స్వదేశానికి తరలివస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని నెతన్యాహు, ఆయన భార్య సారా లిఖితపూర్వకమైన స్వాగతం పలికారు. తాము రాసిన నోట్లో “ఇజ్రాయెల్ ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. మీకో సం నిరీక్షిస్తున్నాం. మిమ్మల్ని ఆనందంగా హత్తుకుంటాం” అని పేర్కొన్నారు. తిరిగివచ్చిన బందీలు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన రిసెప్షన్ కిట్ అందుతుందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆ కిట్లో దుస్తులు, వ్యక్తిగత సామగ్రి, లాప్టాప్, ఫోన్, టాబ్లెట్ ఉంటాయి. బందీలు వచ్చే దారి పొడుగునా ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్వాగత పతాకాలను నెలకొల్పారు. థాంక్యూ బీబీ.. గొప్పపని చేశావ్: ఇజ్రాయెల్ చట్టసభలో ట్రంప్ ప్రసంగం బందీలను హమాస్ విడిచిపెట్టిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ చట్టసభలో మాట్లాడుతూ.. థాంక్యూ వెరీమచ్ బీబీ, గొప్పపని చేశావని ప్రధాని బెంజమిన్ నెతన్యాహును పొగిడారు. “మధ్య ప్రాచ్యంలో సరికొ త్త చరిత్ర ఉదయిస్తోంది. ఈ పవిత్ర భూమిలో శాంతి వీచికలు వీస్తుండగా ఆకాశం నిర్మలంగా మారింది. తుపాకులు మూగపోయాయి. ప్రస్తు తం అమెరికాలో ఉన్న స్వర్ణయుగం ఇజ్రాయెల్ లో ప్రారంభమైంది. బందీలు తిరిగి వచ్చారు. ఈ మాట చెప్పడం ఎంతో బాగుంది. కాల్పుల విరమ ణ ఒప్పందానికి సంబంధించి మేం సమయాన్ని వృథా చేస్తున్నామని చాలామంది అన్నారు. కానీ మేం సాధించాం” అని ట్రంప్ మాట్లాడారు. హో లోకాస్ట్ (రెండో ప్రపంచ యుద్ధంలో యూదులపై నాజీలు సాగించిన నరమేథాన్ని హోలోకాస్ట్ అం టారు) తర్వాత యూదులపై జరిగిన అత్యంత దారుణంగా అక్టోబర్ 7 దాడులను వ్యాఖ్యానించారు. అమెరికా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంద ని బాధిత కుటుంబాలను ఉద్దేశించి పేర్కొన్నారు. అలాగే మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న స్టీవ్ విట్కాఫ్, తన అల్లుడు, సలహాదారులు జేర్డ్ కున్నర్ను ఈ సందర్భంగా కొనియాడారు. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ట్రంప్ మాట్లాడుతోన్న సమయం లో కొందరు ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. మారణహోమం అంటూ నినాదాలు చేశారు. దాంతో వారిని చట్టసభ నుంచి బయటకు పంపివేశారు. ఈ నిరసనలపై ట్రంప్నకు స్పీకర్ క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారమంతా గమనించిన ట్రంప్ , సమర్థవంతంగా పనిచేశారని చమత్కరించారు. దాంతో సభ్యులంతా చిరునవ్వులు చిందించారు. ట్రంప్ అని నినాదాలు చేశారు.
సీతక్క, సురేఖలతో విభేదాలు లేవు వారిరువురు సమ్మక్క, సారక్కలా పని చేస్తున్నారు నాపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారంటే నమ్మశక్యంగా లేదు రూ.70కోట్ల కాంట్రాక్టు కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు నేనేంటో అందరికీ తెలుసు మంతి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: అటవీ శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో త నకు ఎలాంటి వివాదాలు లేవని వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ప ష్టం చేశారు. సోమవారం ములుగు జిల్లా, ఎస్ ఎస్ తా డ్వాయి మండలం, మేడారంలో సమ్మక్క, సారలమ్మ ఆల య అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతర వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల తనపై వచ్చిన విమర్శలపై మంత్రి స్పందిస్తూ..తానేంటే అందరికీ తెలుసునని, కేవలం రూ.70 కోట్ల విలువైన కాంట్రాక్టు కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తనపై తమ సహచర మంత్రులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారంటే నమ్మశక్యంగా లేదని వ్యా ఖ్యానించారు. అయినా..నాపై ఫిర్యాదు చేయడానికి ఏ ముందని ప్రశ్నించారు. అధిష్టానానికి ఎవరూ ఫిర్యాదు చే సే ఛాన్సే లేదన్నారు. తాను కూడా అలా జరుగుతుందని న మ్మడం లేదని అన్నారు. సిఎం రేవంత్రెడ్డి ఆలోచనల మేర కు అభివృద్ది పనులు చేస్తున్నామని అన్నారు. సమ్మక్క, సారలమ్మల వంటి సీతక్క, సురేఖ అక్కలతో తదుపరి మేడారం సమీక్ష సమావేశంలో పాల్గొంటానన్నారు. తన సహచర మహిళా మంత్రులు సీతక్క, సురేఖ ఇద్దరూ సమ్మక్క, సారక్కలా పనిచేస్తున్నారు అని అన్నారు. తదుపరి మేడారం సమీక్ష సమావేశంలో మంత్రి కొండా సురేఖతో పాల్గొంటానని అన్నారు. 2024లో జరిగిన జాతరకు విచ్చేసిన భక్తుల సంఖ్య కంటే 2026 జనవరిలో జరిగే మహా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారి అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్క, సారలమ్మ మేడారం మహా జాతర పునరుద్ధరణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణను జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఇన్ఛార్జి మంత్రికి అమ్మవార్ల పై ఉన్న భక్తితో ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సజావుగా అమ్మవార్ల దర్శనం జరగాలని మేడారం సమ్మక్క, సారమ్మ జాతర ప్రాముఖ్యత ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందాలనే ఉద్దేశంతో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి పొంగులేటికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓట్ల చోరీ
20 వేల దొంగ ఓట్లను నమోదు ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలి దొంగ ఓట్ల పైన విచారణ జరగాలి కాంగ్రెస్తో కుమ్మక్కైన అధికారులపైన చర్యలు తీసుకోవాలి జూబ్లీహిల్స్లో సామ, ధాన, భేద దండోపాయాలతో కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రయత్నం చేస్తుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తూ సిఇఒ సుదర్శన్రెడ్డికి కెటిఆర్ ఫిర్యాదు మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు పెద్ద కుట్రకు తెరలేపారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆక్షేపించారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటే.. ఇక్కడ చోరీ ఓట్లతో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తూ సోమవారం బిఆర్కె భవన్లో బిఆర్ఎస్ నేతలతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డికి కెటిఆర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పలు అంశాలని కెటిఆర్ ప్రస్తావించారు. అనంతరం పార్టీ నేతలు వేముల ప్రశాంత్రెడ్డి, సుధీర్రెడ్డి, ముఠా గోపాల్, పాడి కౌశిక్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, దాసోజు శ్రవణ్, క్రిశాంక్లతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 20 వేల దొంగ ఓట్లని సృష్టించారని పేర్కొన్నారు. ఈ అంశంపై ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కొవ్వూరి కార్తీక్ పేరుతో మూడు చోట్ల ఓట్లు ఉన్నాయని.. దీపక్ శర్మ అనే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని అన్నారు. 400 ఎన్నికల బూత్లలో కనీసం 50 దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ నమోదు చేసిందని కెటిఆర్ ఆరోపించారు. ఇలా కనీసం 20వేల దొంగ ఓట్లను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నమోదు చేయించిందని అన్నారు. ఒక్కొక్క వ్యక్తికి మూడు ఎన్నికల గుర్తింపు కార్డులు ఉన్నాయని.. ఒక్కటే అడ్రస్తో మూడు ఓట్లు.. నాలుగు ఓట్లు ఒక్కొక్కరు నమోదు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్కొక్క వ్యక్తికి రెండు మూడు ఓటర్ ఐడీలు ఉన్నాయని.. ఒకటే వ్యక్తికి చిన్న చిన్న అక్షరాలను మార్చి అనేక సార్లు ఓట్ల నమోదు చేయించారని ఆరోపించారు. తాము లేవనెత్తుతున్న ప్రతి అంశం ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నదే అని అన్నారు. ఇప్పటివరకు తమ దృష్టికి వచ్చినవి 20 వేల డూప్లికేట్, దొంగ ఓట్లు ఉన్నాయని.. ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఇంట్లో 150 నుంచి 200 ఓట్ల నమోదు జరిగిందని అన్నారు. ఆయా ఇళ్లకు సంబంధించి తాము వెళ్లి చూస్తే అక్కడ అవన్నీ బోగస్ ఓట్లు అని తేలిందని చెప్పారు. తమ పార్టీ నేతలు ఒక ఇంటికి వెళ్లి అడిగితే 23 ఓట్లు ఉన్న ఆ ఇంటి యజమాని ఆ ఓటర్లలో ఒకటి కూడా తమ వాళ్లు లేరని చెప్పారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఓట్లు ఉన్నవాళ్లకి ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ల ఓట్లను తొలగించకుండా జూబ్లీహిల్స్లో రాయించారన్నారు. ఈ అంశంలో సరైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కలిశామని తెలిపారు. దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా తమకు అనుమానం ఉందన్నారు. కుమ్మక్కైన అధికారులపైన చర్యలు తీసుకోవాలి కింది స్థాయి అధికారులు కాంగ్రెస్తో కుమ్మక్కై దొంగ ఓట్లను సృష్టించారని కెటిఆర్ మండిపడ్డారు. దొంగ ఓట్ల పైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్తో కుమ్మక్కైన కింది స్థాయి అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేలోపు 20 వేల దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగాలని కోరారు. జూబ్లీహిల్స్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలని అన్ని అడ్డదారుల్లో ప్రయత్నం చేస్తుందని కెటిఆర్ ఆరోపించారు. సామ, ధాన, భేద దండోపాయాలతో ప్రయత్నం చేస్తుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ నేతలు ప్రలోభపెడుతున్నారని, ఓటర్లను భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. మొత్తం రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిధులు లేవని సొంత పార్టీ ఎంఎల్ఎనే ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయగా, మరో ఎంఎల్ఎ వార్త పత్రికలో వ్యాసం రాశారని ఎద్దేవా చేశారు. అయితే జూబ్లీహిల్స్ గెలిస్తే మాత్రం అభివృద్ధి చేస్తామని మరోసారి ప్రజలను మోసం చేయడానికి కాగ్రెస్ ప్రయత్నం చేస్తుందని కెటిఆర్ మండిపడ్డారు.
నూతన మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్
జీఓ నెంబర్ 93 ని కొట్టేయాలని కోరిన పిటిషనర్ కమిషనర్కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఎక్సైజ్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో భాగంగా జారీ చేసిన జీఓ నెంబర్ 93 ను కొట్టివేయాలంటూ అనిల్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నూతన మద్యం పాలసీలో ఒక్కో దరఖాస్తు రుసుము మూడు లక్షలుగా నిర్ణయించటం పట్ల పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దరఖాస్తు దారులకు షాపు దక్కకపోతే సదరు రుసుము అబ్కారీ శాఖకు వెళుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లాటరీలో షాపు దక్కకపోతే మూడు లక్షల దరఖాస్తు రుసుము తిరిగి ఇచ్చే విధంగా ఆబ్కారీ శాఖను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ క్రమంలో పిటిషనర్ వాదలు విన్న ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ముద్దాయిన ధాన్యపు రాశులు దెబ్బతిన్న పత్తి.. పలుచోట్ల నేలకొరిగిన వరిపైళ్లు మణుగూర్లో సింగరేణి ఉపరితల గనుల్లోకి చేరిన వరదనీరు.. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం పొంగిపొర్లిన వాగులు, వంకలు యాదాద్రి నక్కలగూడెంలో 5వేల కోళ్ల మృత్యువాత మరో మూడురోజులు వర్షాలు మన తెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల నిష్క్రమణ నేపథ్యంలో ఏర్పడుతున్న స్వల్ప అలప్పీడనాలతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాష్ట్రంలో భద్రాద్రి కోత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మణుగూరు సురక్ష బస్టాండ్ ఏరియా చెరువును తలపించేలా మారింది. సింగరేణి గనికి సంబంధించిన వరద నీరు రోడ్లపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కోడిపుంజుల వాగు ఉదృతంగా ప్రవహించడంతో పరివాహక ప్రాంతాల్లోకి నీరు చేరడంతో నివాసితులు భయభ్రాంతులకు గురై ఆగ్రహంతో కోడిపుంజుల వాగుపై ఆందోళన నిర్వహించారు. మణుగూరు మండలంలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో మండలంలోని పలు గ్రామాలకు తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి ఉపరితల గనిలోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కరక గూడెం మండలంలో భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.అనంతరం కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులకు పద్మాపురం ఒర్రె వద్ద భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో విధులకు హాజరు కాలేక సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రేగళ్ల గ్రామంలోని ఓ రైతుకు చెందిన సుమారు మూడు ఎకరాల వరి పంట భయంకరమైన వీదురు గాలులతో కూడిన భారీ వర్షానికి నేల పాలయింది. ఖమ్మం జిల్లాల్లో ఏన్కూర్లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలో పత్తి నేలరాలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. భారీ వర్షానికి వలిగొండ, ఆత్మకూరు మండలాల్లో వరద నీరు డ్రైనేజీలో జామ్ కాడంతో వరద నీరు ఇండ్లలోకి చేరుకుంది. దీంతో ఇంట్లో ఉన్న నిత్యావసరాలు, బట్టలు తడిసి పోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వలిగొండలో సుమారు రెండు వేల క్వింటాళ్ల ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులలో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండంలోని లింగరాజుపల్లి, కూరెళ్ళ గ్రామాలలో కల్లాల్లో ఆరోబోసిన, కుప్పల్లో ఉన్న ధాన్యం తడిచిపోయింది. కూరెళ్ళ గ్రామంలోని వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగరాజుపల్లి గ్రామంలో 9 మంది రైతులకు సంబంధించిన వరి ధాన్యం వరద నీటితో కొట్టుకు పోయింది. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోగా, పలుచోట్ల కొట్టుకుపోయింది. మోత్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిపోయి నీటిలో కొట్టుకుపోయింది. మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచి విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాలడుగు, మోత్కూర్, బుజిలాపురంలో చెరువులు అలుగుపోస్తున్నాయి. గుండాల మండల పరిధిలోని పెద్దపడిశాల గ్రామంలో తోట సత్తమ్మ అనే మహిళ ఇల్లు కూలిపోయింది. నల్గొండ జిల్లా నాంపల్లిలో భారీ వర్షానికి పులుసు వాగు భారీ వరద ప్రవాహంతో ప్రవహిస్తూ పసునూరు పెద్ద చెరువు చిన్న చెరువులోకి ప్రవహిస్తుంది. దీంతో నాంపల్లి కొండమల్లేపల్లి మధ్య ముష్టిపల్లి గ్రామం వద్ద చెరువు కింద ప్రధాన ఆర్ అండ్ బి రోడ్డు పై బ్రిడ్జి పై నుండి భారీ వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లా చెన్నారావు పేటలో మొక్కజొన్న తడిపోయింది. మూడు రోజులు వర్ష సూచన రాష్ట్రంలో మూడు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
వర్షాలు తగ్గిన తరువాత వ్యాధులు విజృంభించకుండా చర్యలు తీసుకోవాలి గత ఏడాది కంటే తక్కువగా డెంగీ, మలేరియా, టైపాయిడ్ కేసులు సమీక్షా సమావేశంలో ఆరోగశాఖ మంత్రి దామోద ర్ రాజనర్సింహ మన తెలంగాణ/హైదరాబాద్ : గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల ప్రభావం తక్కువగా ఉండడం అభినందనీయమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మొత్తంగా చూసినప్పుడు కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్, మరో నాలుగైదు జిల్లాల్లో స్వల్పంగా కేసులు పెరిగాయని, ఆయా జిల్లాల్లో యాంటిలార్వల్ ఆపరేషన్ను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని, ఆయా జిల్లాల్లోని హాస్పిటళ్లలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర కేసులు గణనీయంగా తగ్గాయని హెల్త్ సెక్రటరీ, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీంద్ర నాయక్ మంత్రికి వివరించారు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ చికున్గున్యా కేసులు 361 నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 249 కేసులు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు. ఇదే సమయంలో గతేడాది 226 మలేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 209 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. అదేవిధంగా గతేడాది 10,149 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 4600 మాత్రమే నమోదయ్యాయని అధికారులు వివరించారు. గతేడాదితో పోలిస్తే డెంగీ కేసులు 2900 తక్కువగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు మంత్రికి నివేదిక అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ప్రబలే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసి, ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పర్యటించాలని మంత్రి ఆదేశించారు. ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకున్నట్టే, ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలను మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఒకవేళ సీజనల్ వ్యాధుల బారినపడితే, ప్రభుత్వ దవాఖాన్ల వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు
స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు పోక్సో కేసుతో పురుగుల మందు తాగి టీచర్ ఆత్మహత్య మన తెలంగాణ/కొణిజర్ల: మైనార్టీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడిపై అదే పాఠశాలలో పనిచేస్తున్న జువాలజీ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, అమ్మపాలెం మైనార్టీ పాఠశాలలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ సూరజ్ తెలిపిన వివరాల ప్రకారం... మైనార్టీ పాఠశాలలో జువాలజీ టీచర్గా పనిచేస్తున్న అరిగెల ప్రభాకర్ 8వ తరగతి మైనర్ బాలుడిని లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆ విద్యార్థి దసరా సెలవుల కోసం ఇంటికి వెళ్లి మళ్లీ హాస్టల్కు వచ్చేందుకు నిరాకరించాడు. తల్లిదండ్రులు వాకబు చేయగా జరిగిన సంఘటనను ఆ విద్యార్థి తల్లిదండ్రులకు వివరించాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేయగా పోలీస్లు సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ప్రభాకర్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ ఉపాధ్యాయుడు మృతి చెందాడు.
నేడు ఢిల్లీకి సిఎం రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్రెడ్డికి నేడు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. బిసి రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని సవాల్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా సీనియర్ లాయర్లతో సిఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో భేటీ కానున్నారు. కోర్టులో వాదించాల్సిన అంశాల గురించి వారితో సిఎం రేవంత్రెడ్డి చర్చించనున్నట్టుగా తెలిసింది.
Sree Vishnu Applauds Mithra Mandali Team, It’s Friendship and Fun at Its Best!
The buddy comedy Mithra Mandali, produced under BV Works, presented by Bunny Vas and Sapta Ashwa Media Works, promises to be a laughter riot from start to finish. The film features Priyadarshi and Niharika NM in the lead roles, Directed by VijayendarS. The ensemble cast includes Brahmanandam, Vennela Kishore, Satya, Vishnu Oi, Rag Mayur, Prasad […] The post Sree Vishnu Applauds Mithra Mandali Team, It’s Friendship and Fun at Its Best! appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్లో తొలిరోజు 10 నామినేషన్లు దాఖలు మన తెలంగాణ/సిటీ బ్యూ రో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు 10 మంది తమ నా మినేషన్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎన్నికల నోటిఫికేషన్ సోమవా రం విడుదల కావడంతో రిటర్నింగ్ అధికారి పి సాయిరాం నామినేషన్లను స్వీకరించారు. ఉ.11.00 నుంచి సా.3.00 గంటల వరకు పోటీకి ఆసక్తి ఉన్న పలువురు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో రెండు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు కాగా.. 8 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణా పునర్ నిర్మాణ సమితి తరుపున పూస శ్రీనివాస్ నామినేషన్ వేశారు. నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాస రావు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీ కాంత్, పెసరకాయల పరీక్షిత్రెడ్డి, చలిక చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్రెడ్డి, ఇబ్రహీంఖాన్, సయ్యద్ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్లు నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలకు కొద్ది గంటల ముందు షేక్ పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంను జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి కర్ణన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంను సందర్శించారు.
మంగళవారం రాశి ఫలాలు (14-10-2025)
మేషం- వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యధాతధంగా ఉంటాయి. ఎంతో శ్రమించి ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ వృత్తి వ్యాపారాలలో సాధారణ ఫలితాలు లభిస్తాయి. వృషభం- మీ నుండి ఉపకారం పొందిన వారి నుండే తిరిగి మీరు సహాయమును పొందవలసి వస్తుంది. కుటుంబ పురోగతి బాగుంటుంది. విద్యా సాంస్కృతిక కార్యక్రమాల కొరకు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మిథునం- జమా ఖర్చులకు సంబంధించిన వాటిలోని ఒడిదుడుకులు గుర్తించి మౌనంగా కార్యాచరణలో మార్పులు చేస్తారు. ఆర్థికపరమైన అంశాలు కొంతమేర ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటకం - వృత్తి ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. మీకు న్యాయం చేయవలసిన వాళ్ళు సంపూర్ణంగా న్యాయం చేయరు స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు ఓ పరిష్కార దిశకు చేరుకుంటాయి. సింహం - ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం దక్కదు. కళా, సాంస్కృతిక రంగాల్లోని వారికి పోటీ ఎదురవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కన్య- చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. శుభకార్యాల నిర్వహణకు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. తుల: మీలో నిద్రాణమైన ప్రతిభ వెలుగు చూస్తుంది. హోదాను పెంచే విధంగా ఒక ఒప్పందాన్ని చేసుకుంటారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చికం: శారీరక మానసిక శ్రమ అధికమవుతుంది. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ధనస్సు: చాకచక్యంగా వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. మకరం: పనివారు, సహ ఉద్యోగులు కొన్ని చికాకులు కల్పించిన వాటిని అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. బందు వర్గానికి ధన సహాయం చేయవలసి వస్తుంది. కుంభం: కొన్ని చర్చలు జరిపి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్టేషనరీ ప్రింటింగ్ సంబంధిత వ్యాపారాలు కొంతమేర అనుకూలంగా ఉంటాయి. మీనం: ప్రతి పని రెండోసారి సానుకూలపడుతుంది. స్వల్పకాలిక ట్రాన్సాక్షన్స్ లాభిస్తాయి. మిత్రులతోటి సుదీర్ఘమైన సంభాషణ సాగిస్తారు. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ పనులు సానుకూలపడతాయి.
20 రూపాయల బీమాతో రూ. 2లక్షల సాయం..
20 రూపాయల బీమాతో రూ. 2లక్షల సాయం.. ఉమ్మడి కరీంనగర్ బ్యూరో(ఆంధ్రప్రభ )
అంగన్వాడీ టీచర్ ను విచారించిన సిడీపీఓ
అంగన్వాడీ టీచర్ ను విచారించిన సిడీపీఓ కిరాణ దుకాణ యజమానికి గుడ్లు ఇచ్చిన
మీడియాతో మాట్లాడిన ఎంపీ కేశినేని శివనాథ్…
మీడియాతో మాట్లాడిన ఎంపీ కేశినేని శివనాథ్… దొంగ మద్యం వ్యాపారంలో వైసిపి…..ఎమ్మెల్యే వై.ఎస్.జగన్
ఐపిఎస్ అధికారి ఆత్మహత్య కారకులపై చర్యలు తీసుకోవాలి: భట్టీ
చంఢీఘడ్లో ఉన్న కుటుంబాన్ని పరామర్శించిన భట్టి ఫోన్లో పరామర్శించిన సిఎం రేవంత్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : చండీఘడ్లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపిఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను ఫోన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేంవత్ రెడ్డి పరామర్శించారు. సోమవారం చంఢీఘడ్కు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పూరన్ కుమార్ భార్య ఐఏఎస్ అమనీత్ ను కుటుంబ సభ్యులను ఓదార్చి, పూరన్కుమార్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పూరన్ కుమార్ భార్య ఐఏఎస్ అమనీత్, కుటుంబ సభ్యులతో సిఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో డిప్యూటి సిఎం మాట్లాడించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సిఎం హామీ ఇచ్చారని, పూరన్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటి సిఎం మాట్లాడుతూ హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకరమని అన్నారు. అధికారి సూసైడ్ నోట్పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, న్యాయం జరిగేలా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన అధికారి వై పురాన్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి తాను చండీగఢ్కు వచ్చానని విక్రమార్క చెప్పారు. హర్యానా డిజిపి శత్రుజీత్ కపూర్, రోహ్తక్ మాజీ ఎస్పి నరేంద్ర బిజార్నియాతో సహా ఎనిమిది మంది సీనియర్ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ పూరన్ కుమార్ నోట్ను వదిలిపెట్టారన్నారు. ఐపిఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం చాలా ఆందోళనకరమైన విషయమని పురాన్ కుమార్ సూసైడ్ నోట్లో ఇద్దరు అధికారులను ప్రస్తావించినట్లు డిప్యూటి సిఎం గుర్తు చేశారు. హర్యానా డిజిపి శత్రుజీత్ కపూర్, మాజీ రోహ్తక్ ఎస్పి నరేంద్ర బిజర్నియాలు తనను అవమానించడం తన ఆత్మహత్యకు మూల కారణమని పూరన్ కుమార్ పేర్కొనట్లు డిప్యూటి సిఎం వివరించారు. బిజర్నియాను శనివారం బదిలీ చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత, ఈ కేసుపై త్వరిత, నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తు కోసం చండీగఢ్ పోలీసులు ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. దేశంలోని చట్టం ప్రకారం, సాధారణంగా, సూసైడ్ నోట్ను తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటారని, ప్రభుత్వం దానిపై వెంటనే చర్య తీసుకుంటుందన్నారు. దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగి చాలా రోజులు గడిచినా, ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించడం లేదని, మరణించిన అధికారి మృతదేహం పోస్ట్మార్టం లేకుండా అలాగే పడి ఉందని, కుటుంబం మృతదేహాన్ని చూడలేకపోతున్నారని ఇది అమానవీయం ఘటన అని ఉప ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వం, చండీగఢ్ పోలీసులను డిమాండ్ చేశారు. పూరన్ కుమార్ అనేక విజయాలు సాధించిన ఐపిఎస్ అధికారి అని, గర్వంగా జీవించడానికి ప్రయత్నించాడని డిప్యూటి సిఎం అన్నారు. అటువంటి వ్యక్లి క్షమించండి, నేను జీవించలేను, నేను చనిపోవాలి’ అని నిర్ణయించుకోవడం పట్ల మృతుడు అనుభవించిన మానసిక సంఘర్షణ మీరు ఊహించగలరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం దీనిని అర్థం చేసుకుని కుటుంబం తరపున నిలబడాలని డిప్యూటి సిఎం కోరారు. సూసైడ్ నోట్ ప్రకారం చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వం గత ఏడు రోజులుగా ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు అధికారులపై చర్య తీసుకోవాలని ఆ కుటుంబం డిమాండ్ చేస్తోందని, అయినా ఎటువంటి స్పందన లేదని భట్టి ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజ్యాంగం, చట్టాన్ని కాపాడటం ఏ ముఖ్యమంత్రికైనా ప్రాథమిక బాధ్యతని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
The fake liquor scandal in Andhra Pradesh has taken a shocking new turn. A sensational video featuring the prime accused, Addhepalli Janardhan Rao, reveals a series of explosive allegations that could shake the political landscape of the state. In the video, Janardhan Rao claims that during the YSRCP regime, former minister Jogi Ramesh directed the […] The post Fake Liquor Case Turns Explosive: Janardhan Rao’s Video Names Former Minister Jogi Ramesh in Alleged Political Conspiracy appeared first on Telugu360 .
బీహార్ ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి షాక్..
ఢిల్లీ ప్రత్యేక కోర్డు ద్వారా కీలకమైన ఛార్జిషీట్ మోసం, కుట్ర, అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు రైల్వే మంత్రిగా అధికార దుర్వినియోగంపై సాక్షాలు? ఈ నెల చివరిలోనే విచారణ ప్రక్రియ ఆరంభం మహాఘట్బంధన్ ప్రధాన పార్టీ ఆర్జేడికి సంకటం న్యూఢిల్లీ : ఆర్జేడీ వ్యవస్థాపక నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం అభియోగాలు మోపింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రులు అయిన లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు, బీహార్లో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్లపై సంచలనాత్మక ఐఆర్సిటిసి స్కామ్ కేసులో రౌజ్ హౌస్ కోర్టు ఈ చార్జీషీట్కు దిగింది. లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు మోసం, కుట్రపూరిత చర్య, అవినీతికి పాల్పడటం ద్వారా భూములు కాజేశారనేది అభియోగం. ఈ క్రమంలో లాలూ కుటుంబానికి ప్రయోజనం చేకూరిందనేది వాదన. బీహార్లో రెండు దశల అసెంబ్లీ ఎన్నికలు మరో నెలరోజుల్లోనే జరగాల్సి ఉన్నదశలోనే ప్రధాన పార్టీ ఆర్జేడీకి కోర్టు చార్జీషీట్ షాక్ తగిలింది. లాలూ, తరువాత రబ్రీదేవి ముఖ్యమంత్రులుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఐఆర్సిటిసి మోసానికి పాల్పడ్డారనేది ప్రధానమైన ఆరోపణ. అభియోగాల నమోదు విషయాన్ని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారణ క్రమంలో వెల్లడించారు. భూముల బదలాయింపులకు సంబంధించి వీరి పాత్ర పూర్తి స్థాయిలో అనుమానాస్పదంగా ఉందని , ఈ మేరకు ప్రాధమిక సాక్షాధారాలు లభించినందున ఇప్పుడు తదుపరి ప్రక్రియలో భాగంగా అభియోగాలను నమోదు చేసినట్లు తెలిపారు. నవంబర్ 6, తరువాత 11 తేదీలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. బీహార్లో ఎన్డిఎను ఢీకొంటూ నిలిచిన మహాఘట్బంధన్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ముఖ్యమైన రాజకీయ పార్టీగా ఉంది. ఈ క్రమంలో ఈ కూటమి తరఫున తేజస్వీ యాదవ్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఆయనపై కూడా అభియోగాలు నమోదు కావడం కీలకమైంది. తేజస్వీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కేసు విచారణ ఈ నెలాఖరులోనే అభియోగాలు నమోదు కావడంతో లాలూ కుటుంబ సభ్యులపై సంబంధిత కేసులో విచారణ ఈ నెల చివరిలోనే ఆరంభమవుతుంది. ఎన్నికల ప్రచారం ఉధృతదశలో ప్రత్యర్థి పార్టీలు ఆర్జేడీపై విరుచకుపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. అభియోగాల నమోదు విషయం ఇప్పుడు ఎన్నికల బీహార్లో రాజకీయ వేడివేడి చర్చకు దారితీసింది. రెండు భారతీయ రైల్వే కేటరింగ్ సర్వీసులు రెండింటిని, ఐఆర్సిటిసి హోటల్స్ను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారని, ఇందుకు బదులుగా ఈ ఫ్యామిలీ భారీ స్థాయిలో విలువైన భూములను తమ సొంతం చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. వీరిపై అవినీతి నిరోధక చట్టం పరిధిలోని నిబంధనలకు అనుగుణంగా అభియోగాలు దాఖలు చేశారు. అభియోగాల్లోని కార్యనిర్వాహక భాగంలోని కొన్ని అంశాలను జడ్జి చదివి విన్పించారు. కాంట్రాక్టుకు బదులుగా ఈ కుటుంబానికి అతి చవక ధరలకు పొందిందని, సుజాత హోటల్స్కు బినామీగా లాలూ కుఉంబం ఉందని, భూమిని నామమాత్రపు ధరలకు పొందడం ద్వారా కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం కల్గించారని న్యాయమూర్తి తెలిపారు. ఈ వ్యవహారంపై గతంలో సిబిఐ దర్యాప్తు సాగింది. మూడు ఎకరాల భూమి , అత్యంత విలువైన ధర పలికేదానిని తమ పేరిట రాయించుకున్నారనే విషయంపై 2017లోనే లాలూపై ఎఫ్ఐఆర్ దాఖలు అయింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ కేసుకు సంబందించి తీవ్రస్థాయి అభియోగాలు న్యాయస్థానం ద్వారా దాఖలు అయ్యాయి. ఛార్జీషీట్లో వీరితో పాటు ఐఆర్సిటిసి జిఎంలు వికె అస్థానా, ఆర్కె గోయల్తో పాటు హోటల్ సుజాత డైరెక్టర్లు, ఛానక్య హోటల్ యజమానులు అయిన విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్లను కూడా చేర్చారు. లారా ప్రాజెక్టుగా చలామణి అయ్యే డిలైట్ మార్కెటింగ్ కంపెనీ , సుజాత ప్రైవేటు లిమిటెడ్లను ఛార్జీషీట్లో నిందితులుగా చేర్చారు. 2004 2009 మధ్యలో లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా వ్యవహరించారు.
యుద్ధం ఆపకపోతే టోమాహాక్ దాడులే.. పుతిన్కు ట్రంప్ వార్నింగ్
ఉక్రెయిన్తో యుద్ధం తక్షణం నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యాకు అమెరికా అధ్యక్షలు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. యుద్దం ఆపండి లేకపోతే తాము అమెరికా దీర్ఘశ్రేణి టోమాహాక్ క్షిపణులను ఉక్రెయిన్కు అందిస్తామని, తరువాత వారి ఇష్టం అని ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్కు ప్రత్యేక విమానంలో బయలుదేరిన ట్రంప్ తమ వెంట ఉన్న మీడియాతో మాట్లాడారు. అమెరికా శక్తివంతమైన క్షిపణుల శక్తి ఏమిటనేది రష్యాకు తెలిసిందే అని, యుద్ధం సమసిపోవల్సి ఉంది. లేకపోతే తాము వేరే విధంగ స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ నుంచి ఉక్రెయిన్కు అత్యంత కీలక ఆయుధాలు అందుతాయని పరోక్షంగా తెలిపి, రష్యా అధినేత పుతిన్పై ఒత్తిడి తెచ్చేందుకు యత్నించారు. తమ క్షిపణి చాలా శక్తివంతం. దీని దెబ్బతినకుండా రష్యా వ్యవహరిస్తుందనే తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీతో ట్రంప్ ఫోన్లో అంతకు ముందు మాట్లాడారు. ఈ దశలోనే ఈ మిస్సైల్స్ను ఉక్రెయిన్కు పంపిచేందుకు మాట ఇచ్చినట్లు వెల్లడైంది. రష్యా వైపు ఈ క్షిపణులు దూసుకువెళ్లాలని పుతిన్ కోరుకుంటున్నాడా? లేదనే అనుకుంటున్నాను. ముందుగా యుద్దం ఆగిపోవాలి. నానా విధాలుగా తాను పుతిన్కు నచ్చచెపుతున్నానని, ఇక ఈ మిస్సైల్ తమ దూకుడుకు మరో అడుగు అని అనుకున్నా ఫర్వాలేదని ట్రంప్ మీడియాతో చమత్కరించారు. ట్రంప్ ప్రస్తావించిన క్షిపణులు గరిష్టంగా 2500 కిలోమీటర్ల దూరం వరకూ, శబ్ధవేగాన్ని మించి దూసుకువెళ్లుతాయి. భూమికి అతి తక్కువ దూరం నుంచి వెళ్లగలిగే వీటిని నౌకల నుంచి చివరికి జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించే శక్తిసామర్థాలు సంతరించుకుని ఉన్నాయి.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) జీఎస్టీ సంస్కరణలతో ఎంఎస్ఎంఈల్లో నూతనుత్తేజం..డబుల్ ఇంజిన్
అన్ని విభాగాలలో అంతర్గత బదిలీలు…
అన్ని విభాగాలలో అంతర్గత బదిలీలు… సూపర్డెంట్లు, ఏఈఓలకు స్థాన చలనం..భక్తుల సౌకర్యాలు.. సేవలపై
కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల రుసుం పెట్టారని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లాటరీలో షాపు దక్కకపోతే రూ.3 లక్షలు ఆబ్కారీ శాఖకే వెళ్తాయని పిటిషనర్ పేర్కొన్నారు. షాపు దక్కకుంటే డబ్బు తిరిగి వచ్చేలా ఆబ్కారీ శాఖను ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. లిక్కర్ పాలసీపై జారీ చేసిన జివొ 93ను కొట్టివేయాలని పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
రుషికొండ ప్యాలెస్పై కొత్త దిశ #AndhraPradesh #Visakhapatnam #Tourism #Rushikonda #APGovernment
Bhagyashri Borse All Praises For Ram
The teaser of Ram Pothineni’s unique entertainer Andhra King Taluka was released yesterday to a phenomenal response. Ram is introduced as a passionate movie buff since childhood, and the film revolves around his deep love for cinema, his admiration for his favorite star, and his romantic journey with his girlfriend. Bhagyashri Borse, who plays Ram’s […] The post Bhagyashri Borse All Praises For Ram appeared first on Telugu360 .
టీచర్ పోస్టులకు ఇద్దరు కానిస్టేబుళ్లు ఎంపిక
అభినందించిన వన్టౌన్ సీఐ విశాలాంధ్ర – విజయవాడ (క్రైమ్): విజయవాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. 2018 బ్యాచ్కు చెందిన కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, నాగరాజు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్లుగా ఎంపికయ్యారు. నాగరాజు ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్గా, దుర్గాప్రసాద్ సోషల్ స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం వారిని వన్టౌన్ సీఐ గురుప్రకాష్ అభినందించి సన్మానించారు. వారిద్దరూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నతంగా […] The post టీచర్ పోస్టులకు ఇద్దరు కానిస్టేబుళ్లు ఎంపిక appeared first on Visalaandhra .
దరఖాస్తుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలి
దరఖాస్తుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలి కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :
సత్వర న్యాయమే లక్షంగా క్రిమినల్ చట్టాలు: అమిత్ షా
జైపూర్ ః దేశంలో తీసుకువచ్చిన మూడు కొత్త క్రిమినల్ లా చట్టాలు న్యాయ లక్షంతో కూడుకున్నవే, అంతేకానీ శిక్షలే ప్రధాన ఉద్ధేశంతో ఉండేవి కావని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భారతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను 21వ శతాబ్ధంలో భారీ స్థాయిలో సంస్కరించే దిశలోనే ఈ మూడు చట్టాలు రూపొందాయి. అమలులోకి వచ్చాయని వివరించారు.కేంద్ర హోం మంత్రి సోమవారం జైపూర్లోని కన్వెన్షన్ సెంటర్లో ఈ మూడు చట్టాల సమగ్ర స్వరూపం తెలిపే ఎగ్జిబిషన్ను ఆరంభించిన క్రమంలో ఆయన మాట్లాడారు. నూతన చట్టాల పరిధిలో జరిగే కేసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్ పద్థతుల గురించి ఆయన వివరించారు. ఇంతకు ముందటి చట్టాల పరిధిలో కేసుల విచారణకు 25 నుంచి 30 ఏండ్ల వరకూ కాలం పట్టేది. పైగా అనేక రకాల వేధింపులు, చివరికి కక్ష సాథింపు చర్యలు కూడా చోటుచేసుకునేవి. తీర్పులు లేకుండానే అనేకులు ఏళ్ల తరబడి జైలులో మగ్గిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకువచ్చిన చట్టాలతో పరిస్థితి మారింది. సరళీకృతంగా సత్వరంగా సంబందితులకు న్యాయం దక్కుతుందని వివరించారు. ఈ కొత్త చట్టాలు పాత చట్టాలలోని అంశాలను పోలుస్తూ సశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఈ చట్టాలపై అవగావహన విషయంలో తొలి ప్రక్రియగా నిలిచింది. న్యాయవ్యవస్థలో ఉన్న పద్దతులతో జనం ఎక్కువగా ఈ వ్యవస్థ పట్ల నిట్టూర్పులకు గురికావడం జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయాలను సరిదిద్దడం ద్వారా అందరికి న్యాయం సకాలంలో అందేందుకు మార్గాలు ఏర్పడ్డాయని వివరించారు.
ఆసుపత్రికి తరలిస్తుండగా అనంత లోకాలకు
ఆసుపత్రికి తరలిస్తుండగా అనంత లోకాలకు నిజాంపేట, ఆంధ్రప్రభ : ఉరి వేసుకుని వివాహిత
ట్రంప్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం
జెరూసలెం : గాజా ఒప్పందం కుదిర్చి, బందీల విడుదలకు కృషి చేసినందుకు గాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు అరుదైన గౌరవాన్ని అందించనున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ ‘ మెడల్ ఆఫ్ ఆనర్ ’ ను అమెరికా అధ్యక్షుడికి ప్రదానం చేయనున్నట్టు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ వెల్లడించారు. రానున్న నెలల్లో సమయం, వేదిక నిర్ణయించి అందజేయనున్నట్టు తెలిపారు. బందీల విడుదల చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని సాధించడంలో చేసిన కృషికి గాను ఈ గౌరవాన్ని అందుకోడానికి ట్రంప్ అర్హుడని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ లోనే కాకుండా మధ్య ప్రాచ్యంలో శాంతియుత భవిష్యత్తును నెలకొల్పడానికి ట్రంప్ పునాది వేశారని కొనియాడారు.