Iran - israel War : ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులు
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మరింత ముదిరింది
Iran - Israel War : హీలియం సరఫరాపై దెబ్బ.. చిప్ పరిశ్రమలో ఆందోళన
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించింది
కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి జి. అరుణ హెచ్చరిక..
కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి జి. అరుణ హెచ్చరిక.. గన్నవరం, ఆంధ్రప్రభ :
దుబాయ్: మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించింది. ఇరాన్లోని కీలక నాతాంజ్ అణు ఇంధన శుద్ధి కేంద్రంపై వైమానిక దాడి జరిగినట్లు అధికారిక ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడిలో ఇంధన శుద్ధి కేంద్రం దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి రేడియేషన్ లీకేజీ జరగలేదని పేర్కొంది. అయితే ఈ పరిణామం యుద్ధ తీవ్రతను మరింత పెంచే సంకేతంగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, వచ్చే వారంలో అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తీవ్రత గణనీయంగా పెరగనుందని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణి అవశేషాలు టెల్ అవీవ్ సమీపంలోని ఖాళీగా ఉన్న కిండర్ గార్డెన్పై పడ్డాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.టెహ్రాన్కు దక్షిణంగా సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాటాంజ్ అణు కేంద్రం అత్యంత కీలక యురేనియం శుద్ధి కేంద్రంగా గుర్తింపు పొందింది. యుద్ధం ప్రారంభ దశలోనే ఈ కేంద్రం ఒకసారి దాడికి గురైంది. తాజాగా జరిగిన దాడిపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) కూడా స్పందిస్తూ, బయటి ప్రాంతాల్లో రేడియేషన్ స్థాయిల్లో ఎలాంటి పెరుగుదల లేదని తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ వైమానిక దాడులు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఇంటెలిజెన్స్ కార్యాలయంపై డ్రోన్ దాడి జరిగి ఒక అధికారి మరణించారు. లెబనాన్లో హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. బీరూట్ దక్షిణ ప్రాంతాల్లో పేలుళ్లు, అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు సైనిక చర్యలను తగ్గించే అవకాశాన్ని సూచిస్తూనే, మరోవైపు అదనంగా మూడు యుద్ధ నౌకలు, సుమారు 2,500 మెరైన్లను మధ్యప్రాచ్యానికి పంపించారు. ఇప్పటికే అక్కడ 50,000 మందికి పైగా అమెరికా సైనికులు ఉన్నారు. ఈ విరుద్ధ సంకేతాలు అంతర్జాతీయంగా సందేహాలను రేకెత్తిస్తున్నాయి. యుద్ధ లక్ష్యాల సాధనకు దగ్గరగా ఉన్నామని ట్రంప్ పేర్కొనగా, అదే సమయంలో కాంగ్రెస్ నుంచి మరిన్ని నిధులు కోరడం గమనార్హం.హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి ప్రయత్నాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యను అవివేకపూరిత దాడిగా అభివర్ణిస్తూ, హార్మూజ్ జలసంధి భద్రతకు ముప్పుగా పేర్కొంది. బ్రిటన్ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా, అమెరికాకు తన స్థావరాలను వినియోగించుకునే అనుమతి ఇచ్చింది. యుద్ధ ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగి బ్యారెల్కు 106 డాలర్లకు చేరుకున్నాయి. యుద్ధానికి ముందు ఇది సుమారు 70 డాలర్ల వద్ద ఉండేది. ఈ పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, ఆహార ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అమెరికా ప్రభుత్వం ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. ఇరాన్ సైనిక ప్రతినిధులు ప్రపంచవ్యాప్తంగా పార్కులు, పర్యాటక ప్రాంతాలు కూడా లక్ష్యాలవుతాయని హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది మధ్యప్రాచ్యాన్ని దాటి ప్రపంచ భద్రతకు ముప్పుగా మారే అవకాశాన్ని సూచిస్తోంది. మొత్తంగా చూస్తే, నాటాంజ్ అణు కేంద్రంపై దాడి, ఇరాన్ ప్రతిస్పందనలు, అమెరికా సైనిక చర్యలు ఇవన్నీ కలిపి మధ్య ప్రాచ్య పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. యుద్ధం ముగిసే సూచనలు కనిపించకపోవడం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోంది.
22 March 2026 |ఆదివారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
22 March 2026 | ఆదివారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు
22MarSunday2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
22MarSunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో
ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బిఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్, కెటిఆర్ ప్రకటించారు. తాము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ను, శాసనమండలి చైర్మన్ను కలిసి కోరుతున్నామని అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే అయినందున ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం రోజున 6 గ్యారంటీల దస్త్రంపై సంతకం చేశారని, అభయహస్తం అనే దస్త్రంపై రేవంత్రెడ్డి తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. ఉభయ సభల్లో గత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ప్రసంగంలో చెప్పారని ప్రస్తావించారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీల్లో అరగ్యారంటీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కోరుతూ వచ్చే శుక్రవారం నాడు శాసనసభలో తాము ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. తెలంగాణ భవన్లో శనివారం బిఆర్ఎస్ సీనియర్ నేతలు, లీగల్ సెల్ విభాగంతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అంశంపై ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చించారు. అనంతరం బిఆర్ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఎన్టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. బిజెపి శాసనసభాపక్షనేత సి.హెచ్. విద్యాసాగర్ రావు ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే, గవర్నమెంట్ ఆహ్వానించి, దానిని చట్టం కూడా చేసిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన చరిత్ర అసెంబ్లీకి ఉందని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రైవేట్ మెంబర్ బిల్లును బిజెపి వ్యతిరేకించినా ఇబ్బంది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం కోటి మోసాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 840 రోజులు అయినా ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పెద్ద ఫ్రాడ్ అని ఎద్దేవా చేశారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిఎం సంతకం చేసిన ఫైల్ ఎందుకు దొరకడం లేదని నిలదీశారు. ఈ ఫైల్ ఢిల్లీ విమాన ప్రయాణంలో పోయిందా.. ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ సర్కార్ ఇంకా ఒక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉందని.. ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. చట్టం అయితే అన్ని వర్గాలకు లాభం ఆరు గ్యారంటీలు చట్టం అయితే అన్నివర్గాలకు లాభం కలుగుతుందని కెటిఆర్ చెప్పారు. ఆరు గ్యారంటీలు చట్టంగా మారితే ఆడబిడ్డలందరికీ ప్రభుత్వం రూ.2,500 ఇవ్వాల్సి వస్తుందని, రాష్ట్రంలోని వృద్ధులందరికీ రూ.4 వేల పెన్షన్ హక్కు వస్తుందని తెలిపారు.రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాల్సిన అనివార్యం ప్రభుత్వానికి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టం అయితే రైతన్నలకు రైతుబంధు ఎగగొట్టడానికి ప్రభుత్వానికి వీలుండదని అన్నారు. రైతుబంధుతో సహా ఇచ్చిన అన్ని హామీలు ప్రభుత్వం అమలు చేయాల్సి వస్తుందని చెప్పారు. ఈ చట్టం వలన అన్నదాతలకు, ఆటో అన్నలకు, మహిళలకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ లబ్ధి కలుగుతుందని తెలిపారు. కౌలు రైతులకు కూడా రూ.15,000 ఇస్తామని చెప్పారని, 5 లక్షల మంది దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సకాలంలో విడుదల చేస్తామని చెప్పారని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా దగా పడ్డ తెలంగాణ ప్రజల తరపున తాము ఆరు గ్యారంటీలకు చట్టభద్దత కోసం ప్రైవేట్ బిల్లును పెడతామని వెల్లడించారు. ఆరు గ్యారంటీలు చట్టంగా మారితే లబ్దిదారులు న్యాయస్థానాలను ఆశ్రయించి అయినా తమకు రావాల్సిన ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. ఎంఎల్ఎలపై ఒత్తిడి తేవాలి: ప్రజలకు కెటిఆర్ పిలుపు రాష్ట్రంలో ఆరు గ్యారంటీలకు చట్ట భద్దత కోసం తాము పెట్టే ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రజలు వారి నియోజకవర్గాల్లో ఎంఎల్ఎలపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత తాము అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరుతామని అన్నారు. ఆరు గ్యారంటీల బిల్లుకు మద్దతు కోసం అన్ని పార్టీలకు లేఖలు రాస్తామని చెప్పారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని, వెంటనే అమలు చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. పింఛను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామన్నారని, వెంటనే పెంచాలని అన్నారు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారని, వెంటనే ఇవ్వాలని, కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామన్నారని, అదీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము పెట్టే బిల్లు పాస్ అయితే హామీలన్నీ చట్ట ప్రకారంగా అమలవుతాయని స్పష్టం చేశారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీసి తమకు కావలసిన లబ్ధిని దక్కించుకునే హక్కు ప్రజలకు కలుగుతుందని చెప్పారు. హామీలన్నీ అమలు చేసినానని చెబుతున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే తెలంగాణలో ఎక్కడైనా సెక్యూరిటీ, పోలీసు బలగాలు లేకుండా ప్రజలతో చర్చకు రావాలని కెటిఆర్ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ వెళ్లిన అశోక్ నగర్ వస్తారా.. తెలంగాణలోని ఇతర ప్రాంతానికి వస్తారా..అనేది ఆయనే నిర్ణయించుకోవాలని అన్నారు.
నేడు నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
మన తెలంగాణ/నంగునూర్ : ఆయిల్ పామ్ పంట సాగులో తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలపాలని రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నంగునూ ర్ మండలం నర్మెట్టలో సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ యిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం నేపథ్యంలో అధికారుల తో కలిసి ఏర్పాట్లను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా రాష్ట్రానికే కేంద్ర బిందువులాగా ఉందని రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పండించిన పంటను నర్మెట పామ్ ఆ యిల్ ఫ్యాక్టరీకి తీసుకురావడానికి రైతులకు సులువుగా ఉం టుందని అన్నారు. తెలంగాణలోనే మొదటి ఆయిల్ పామ్ సి ఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని, రా ష్ట్రంలో సిద్దిపేట జిల్లా నుంచి ఆయిల్ సప్లై చేసే అదృష్టం నర్మెట్టకు దక్కిందన్నారు. గత 5 సంవత్సరాల నుంచి 30 జిల్లాల నుంచి రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావడంతో పాటు 30 జిల్లాలో ప్రైవేట్ కంపెనీలు కూడా ముందుకు వచ్చాయన్నారు. రాష్ట్రంలోని రైతులపై తనకున్న మమకారంతోనే వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత మొదటి సంతకం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి చేశానని గుర్తు చేశారు. యుద్ధ్దప్రాతిపదికన ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి 16 నెలల అతి తక్కువ సమయంలో దేశంలో పూర్తి చేసి న మొదటి ఫ్యాక్టరీ అని ఆయన పే ర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ 300 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినట్లు తెలిపారు. 30 టన్ను ల నుండి 120 టన్నుల వరకు దీని సామర్థ్యం ఉందన్నారు. హైదరాబాద్ మి నహా అన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి అవకాశం ఉందని, గతంలో రాష్ట్రం లో ఎక్క డ సాగు చేసిన దానిని అశ్వారావుపేటకి తీసుకెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిద్దిపేట జిల్లాలో తక్కువ సమయంలో ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేయడమే కాకుండా 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయ డం జరుగుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీలో విడుదలైన వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఇ క్కడే స్వతంత్రముగా ఆయిల్ రిఫైనరీ ప్రారంభానికి సిఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామి తెలిపారు. అంతే కాకుండా నేరుగా విజయ బ్రాండ్ ద్వారా లబ్ధిదారులకు ఆయిల్ వస్తుందన్నారు. తెలంగాణలో ఎక్కడ ఆయిల్ ఫామ్ సా గు చేసిన ఆయిల్ ఉత్పత్తి ఇక్కడి నుండే జరుగుతుందన్నారు. ఏ వాతావరణంలో అయినా ఆయిల్ పామ్ సాగు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చన్నారు. మల్లన్నసాగర్ రాకముందే ఇక్కడ మొక్కలు పెట్టడం జరిగిందని, కాళేశ్వరంతో పాటు ఆ ప్రాజెక్టు కింద ఉన్న డ్యాంలను బట్టి ఈ ఫ్యాక్టరీ ని ర్మించలేదన్నారు. మలేషియా కంటే కూడా మన దగ్గర అధిక ఆయిల్ ఇక్కడి నుండే వస్తుందన్నారు. ఈ ఫ్యాక్టరీ ప్రజలది, ప్ర జల సంపదతో నిర్మించింది కాబట్టి ఎప్పటికైనా ఈ ప్యాక్టరీ ప్రజలకే సొంతం అన్నారు. పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్లు పూర్తి చే సీ ప్రజల అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వాలది అని ఎల్లంపల్లి కాళేశ్వరానికి జీవనా డి ఎల్లంపల్లి అయితే ఎక్కడి నుండి నీళ్లు తరలించాలన్న ఎల్లంపల్లి కీలకం అవుతుందని, ఎల్లంపల్లి నుండి నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంతెస్తే స్విచ్ బిఆర్ఎస్ ప్రభు త్వం వాళ్ళు నొక్కారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం రా ష్ట్రానికి రావలసినది వాటాగా ఇస్తున్నారని అందులో కేం ద్రం ఇచ్చేది ఇచ్చేది ఏమి లేదన్నారు. తాను వచ్చిన తరువాత 5 ఫ్యాక్టరీలు సంతకం చేసిన ముందుగా పూర్తి చేసింది నర్మెట్ట అని అన్నారు. ఇది అన్ని జిల్లాలకు అనుగుణంగా మద్యలో ఉండడమే కాకుండా. హైదరాబాద్కి కూడా దగ్గరలో ఉంటుందన్నారు. ఈ ఫ్యాక్టరీ ఆయిల్ పామ్ రెమ్యునరేషన్ నుండి క ట్టిందని ఇది కేవలం ప్రజల డబ్బు. ప్రజల సొత్తేనన్నారు. గ తంలో టన్నులు ఉంటే తాను వచ్చాక 21 వేలు ట న్ను అయిందని మున్ముందు 25 వేలు అయ్యేలాగా కృషి చేస్తానన్నారు. రైతులంతా ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులంతా ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని రవా ణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ లో ఆయిల్ ఫామ్ అభివృద్ధి చేయడానికి తాను స్వయంగా ఆయిల్ పామ్ రైతుగా ఫ్యాక్టరీ నిర్మాణానికి పూర్తిక కార్యదీక్ష చేపట్టామన్నారు. గుజరాత్లో పాలకు కురియన్ మాదిరి ఆయిల్ పామ్కి తుమ్మల నాగేశ్వరరావు బ్రాండ్ అం బాసిడర్ అని కొనియాడారు. ఉత్తర తెలంగాణకు ఈ ఫ్యాక్టరీ ఆయిల్ ఫామ్ సాగు చేసిన వారికి సిద్దిపేట ప్రధాన కేంద్రంగా ఉండబోతుందన్నారు. ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభంతో పాటు రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారన్నారు. రైతులంతా ఆయిల్ పా మ్ సాగుపై దృష్టి సారించి ఎలాంటి నష్టాలు లేకుండా లాభా లు గడించాలన్నారు. గంటకు 30 టన్నుల నుండి 180 టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఈ ఫ్యాక్టరీ కి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి,సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ,ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పలు సంస్కరణలను అమలు చేస్తూ ప్రజలకు మరింత చేరువైంది. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి డిజిటల్ ట్రాకింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు భూమి రికార్డుల ఆధునీకరణలో భాగంగా భూ భారతీ చట్టం-2025 అమలు చేసి ప్రతి భూభాగానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ప్రవేశపెట్టిందని సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక ప్రశంసించింది. డిజిటల్ సేవల్లో ముందంజలో నిలుస్తూ టి-వాలెట్ ద్వారా పౌర సేవలను విస్తరించిందని పేర్కొంది. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, టీ సేఫ్ సేవలను బలోపేతం చేసిందని పేర్కొంది. డ్రగ్స్ నియంత్రణలో కఠిన చర్యలు తీసుకుంటూ ఈగల్ (యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) అనేక కేసులు నమోదు చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత, బాధ్యతాయుత పాలనకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి లక్ష్యాలను ప్రజల ఆశయాలకు అనుగుణంగా అమలు చేస్తోందని కితాబు ఇచ్చింది. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి, మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో ఫిర్యాదులు స్వీకరించి, ప్రత్యే క డిజిటల్ పోర్టల్ ద్వారా ట్రాకింగ్ సౌకర్యం కల్పించిందని పేర్కొంది. భూమి రికార్డుల ఆధునీకరణలో భాగంగా తెలంగాణ భూ భారతీ చట్టం-2025 అమలులోకి తీసుకువచ్చి, ప్రతి భూభాగానికి ప్రత్యేక గు ర్తింపు సంఖ్య (భూధార్) ప్రవేశపెట్టిందని పేర్కొం ది. భూ వివాదాల పరిష్కారానికి డిజిటల్ పోర్టల్, ఏఐ ఆధారిత చాట్బాట్, ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఏర్పా టు చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ టి---వాలెట్ వినియోగం పెరిగి, 2025 డిసెంబర్ నాటికి రూ. 2,974 కోట్ల లావాదేవీలు నమోదు అయ్యాయని పే ర్కొంది. అలాగే మీ టికెట్ యాప్ ద్వారా డిజిటల్ టికెటింగ్, యుటిలిటీ చెల్లింపులు అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొంది. విద్యా రంగంలో టీ- శా ట్ ద్వారా కోట్లాది మంది విద్యార్థులకు శాటిలైట్, డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా శిక్షణ అందిస్తోంద ని, అలాగే ఈ ప్రభుత్వం 67,763 ఉద్యోగాలను భ ర్తీ చేసి పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేసిందిదని పేర్కొంది. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కఠిన చర్యలు తీసుకుని 2025లో వేల కేసులు నమోదు చేసి అనేక మందిని అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్ వాడకం, వాటి వల్ల కలిగే అనార్థలకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన కల్పిస్తోందని పేర్కొంది. డిజిటల్ సేవలలో రా ష్ట్రం ముందంజలో ఉండిదని, వాట్సప్ యాప్ ద్వా రా పౌర సేవలు అందిస్తున్న తొలి రాష్ట్రంగా నిలిచిందని ప్రశంసించింది. పిల్లల రక్షణ కోసం ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో తప్పిపోయిన పిల్లలను గుర్తించి కు టుంబాలకు అప్పగించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొంది. గ్రామీణ, పట్ట ణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా ని ర్వహించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని, ప్రజా పాలన కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే చర్యలు అమలు చేస్తోందని పేర్కొంది.
కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య
మన తెలంగాణ /కరీంనగర్ : కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన అత్తవారింట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల ఆతని భార్య దివ్య కూడా ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ నగరంలోని టూటౌన్ పీఎస్లో చంద్రశేఖర్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కరీంనగర్ వన్టౌన్ పీఎస్ పరిధిలోని హనుమాన్నగర్లో చంద్రశేఖర్, దివ్య తమ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈనెల 18న దివ్యకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. దీంతో నొప్పిని భరించలేక ఆమె బలవన్మరణానికి యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికీ నయం కాకపోవడంతో అనంతరం ఆమెను హైదరాబాద్లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య మరణంతో ఎస్ఐ చంద్రశేఖర్ శోకసంద్రంలో మునిగిపోయారు. అతని భార్య మృతి చెందిన అనంతరం ఆయన అంత్యక్రియలకు ఆమె స్వగ్రామం సీతంపేటలోని అత్తవారింటికి వెళ్లారు. భార్య మృతితో మనస్తాపానికి గురై ఆ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పసితనంలోనే తల్లిదండ్రులకు దూరమై : చంద్రశేఖర్, దివ్య దంపతులకు పది, ఆరు సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. పసిప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన వారిని చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ప్రాంతం లో విషాదఛాయలు అలముకున్నాయి. అమ్మా, నాన్న మేము మీకు గుర్తుకు రాలేదా: కొడుకులు అశ్వద్ధామ, అభిమన్యు మమ్మల్ని ఒంటరిని చేసి వదిలిపోయారా నాన్న, అమ్మ అం టూ పిల్లలు ఏడుస్తుంటే గ్రామస్తులంతా తల్లడిల్లి పోయా రు. క్షణికావేశంలో తల్లి, తండ్రి ఇద్దరు ఐదు రోజుల వ్యవధిలో మరణించడంతో వీరిద్దరికి కలిగిన మగ పిల్లలు అశ్వద్ధామ (7 ), అభిమన్యు(5) అనాధలయ్యారు. అభం శుభం ఎరుగని ఈ పసిపిల్లలను చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డప్పుడు పిల్ల లు గుర్తుకు రాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మనతెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: సారీ శ్రీధర్... ఇంత కాలం ఓపిక పట్టాను. నాలుగు దశాబ్దాలుగా పార్టీ పటిష్టత కోసం పని చేసిన నాకు గౌరవం దక్కనప్పుడు, పార్టీని, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఇంకా పార్టీలో కొనసాగడం బాగుండదు. ఇంత దూరం వచ్చాకా నా నిర్ణయం లో మార్పు అనేది ఉండదంటూ జీవన్ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఎదుట కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారంటూ గత పక్షం రోజులుగా ప్రచారం జరుగుతుండగా శనివారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్రెడ్డి జగిత్యాలలోని జీవన్రెడ్డి ఇంటికి చేరుకుని ఆయనతో మంతనాలు జరిపారు. సుమారు అరగంటకు పైగా జీవన్రెడ్డితో మంత్రులు, ఎమ్మెల్యే మంతనా లు జరిపి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మీరు పార్టీని వీడొద్దని కోరినట్లు తెలుస్తోంది. అయితే గత 20 నెలలుగా పార్టీలో తనకు జరిగిన అన్యాయం, అగౌరవం గురించి మంత్రుల ఎదుట జీవన్రెడ్డి వాపోయినట్లు సమాచారం. ఎమ్మెల్యే సంజయ్కుమార్ను పార్టీలో చేర్చుకున్నప్పుడే పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చానని, అనాడు మీరు నా ఇంటికి వచ్చి మీ గౌరవానికి ఎక్కడా భంగం కలగదని, మీకు అండగా మేమున్నామంటూ మాట ఇవ్వడం వల్లే నేను ఓపిక పట్టి పార్టీలో కొనసాగానని చెప్పినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో ప్రాధాన్యత దక్కకపోగా, నేను ఎన్నో అవమానాలను ఎదుర్కొవాల్సి వచ్చిందని తన గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. ఇంకా అవమానాలు భరించుకుంటూ పార్టీలో కొనసాగడం నాతో కాదు ప్లీజ్... నన్ను వదిలేయండి అంటూ మంత్రులకు జీవన్ తేల్చి చెప్పినట్లు అయన అనుచరులు తెలిపారు. జీవన్రెడ్డి కాంగ్రెస్కు పెద్ద దిక్కు: మంత్రి శ్రీధర్బాబు జీవన్రెడ్డి కాంగ్రెకు పెద్ద దిక్కు, వారు బాధపడితే మేము కూడా బాధపడతాం. పార్టీ కష్టకాలంలో అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు. మేమంతా అభిమానించే నేత. జీవన్రెడ్డి మనసు నొచ్చుకున్న విషయమై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్తో పాటు పార్టీ పెద్దలందరికీ వివరించాం. వారు కూడా ఆయనతో మాట్లాడి పార్టీని వీడొద్దని కోరారు. పెద్దమనిషిని కలిసి అన్ని విషయాలు మాట్లాడేందుకే మేము వచ్చాం. వారు అన్ని విషయాలను మాతో పంచుకున్నారు. వారు చెప్పిన విషయాలన్నింటిని పార్టీ పెద్దలకు వివరిస్తామని, పార్టీ మారాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరగా ఆయన ఆలోచిస్తానని చెప్పారని మంత్రి శ్రీధర్బాబు విలేకరులకు వివరించారు.
నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం సరికాదు
` అది పారదర్శక విచారణకు ముప్పుగా మారుతాయి ` సుప్రీం ఆందోళన ` ఇంటి పనుల్లో భర్త కూడా సహాయపడాలి ` విడాకుల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య …
ఎమ్మెల్యే దానంకు క్లీన్చిట్పై హైకోర్టుకు బీజేపీ
` స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి న్యాయస్థానం చేరింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు సంబంధించి అసెంబ్లీ …
రాష్టాలకు ఎల్పీజీ కేటాయింపు పెంపు
` 20% అదనంగా సరఫరా చేసేందుకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ(జనంసాక్షి):వాణిజ్య గ్యాస్ కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం.. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా …
హిందు మహాసముద్రాన్ని తాకిన యుద్ధమంటలు
` బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగించిన ఇరాన్ ` నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి బాంబుల వర్షం ` ఖండించిన ఇరాన్.. అంతర్జాతీయ ఉల్లంఘనేనని …
రాజకీయాలకు డ్రగ్స్ పంకిలం.. పార్టీ పెద్దల ఉదాసీనం
కేంద్ర ప్రభుత్వం 2024- 25 సంవత్సరానికి గాను జరిపిన ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం భారతదేశంలోని అత్యంత ధనిక జిల్లాల జాబితాలో మొట్టమొదటగా నిలిచేది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ నగరానికి చుట్టుకుని ఉన్న పూర్వపు రంగారెడ్డి జిల్లా దేశంలోనే మహా నగరాలైన బెంగళూరు, నోయిడా, సోలన్, గోవా, ముంబై, అహ్మదాబాద్ వంటి అత్యంత సంపన్న నగరాలను, జిల్లాలను వెనక్కి నెట్టేసి ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలంలోనే రంగారెడ్డి జిల్లాకు ఈ ఖ్యాతి దక్కడం ఆ జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణం. ఒకప్పుడు హైదరాబాద్ జిల్లాలో భాగంగా ఉండిన ఈ ప్రాంతాన్ని వేరుచేసి 1978లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రముఖ రాజకీయవేత్త కొండ వెంకట రంగారెడ్డి పేరుతో జిల్లాగా ఏర్పాటు చేసే కాలం నాటికి ఈ ప్రాంతమంతా వ్యవసాయ భూములు. ఎక్కువగా కూరగాయలు, పళ్ళు పండించే ప్రాంతం. ద్రాక్ష తోటలకు ప్రసిద్ధి. అక్కడ పండించిన కూరగాయలు, పళ్ళు హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చి వాటిని విక్రయించి వచ్చిన డబ్బుతో జీవనం సాగించే పేద, మధ్యతరగతి రైతులే ఎక్కువమంది. కొద్దిమంది వేళ్ళమీద లెక్కించదగ్గ సంఖ్య లో, ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే, సంపన్న భూస్వాములు ఉండవచ్చు. కానీ మొత్తంగా సగటు జీవన స్థితిగతులున్న ప్రజలే ఎక్కువగా ఉండేవారు. తర్వాత కాలంలో బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్కి అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా వైపుకి నగరం విస్తరించిన కారణంగా, అట్లాగే కాలక్రమంలో పెద్ద ఎత్తున ఔషధ ఉత్పత్తి పరిశ్రమలు, సాఫ్ట్వేర్ పరిశ్రమ విస్తరించిన కారణంగా, వాటికి తోడు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇదే జిల్లాలో ఏర్పాటైన కారణంగా, ఇంకా ఔటర్రింగ్ రోడ్డు ఏర్పడిన కారణంగా ఆ జిల్లా దశ పూర్తిగా తిరిగింది. అట్లా ఇప్పుడు అది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దేశంలోనే మొట్టమొదటి సంపన్న జిల్లాగా ప్రసిద్ధికెక్కింది. రాష్ట్రంలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన పథక రచనలో భాగంగా ఆ జిల్లాభూభాగం లోనే ఫ్యూచర్ సిటీ ఏర్పడినట్లయితే ఇక రంగారెడ్డి జిల్లాను అందుకునే పరిస్థితి దేశంలోని ఏ ప్రాంతానికీ ఉండదు. 202425 ఆర్థిక సర్వే ప్రకారం రంగారెడ్డి జిల్లా తలసరి జిడిపి 11.46 లక్షల. ఇది దేశంలోని ఇంకే ఇతర నగరాల్లో కూడా లేని ఆదాయం. ఇంతకుఇంత సంపన్నమైన జిల్లాలో పేదరికం లేదా అంటే దానికి ఏం కొదువ లేదు, కానీ హైదరాబాద్ మహానగరానికి చేరువగా ఉన్నందున పని చేసుకుని బతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా గురించి ఎందుకు ఇంత మాట్లాడుకోవాల్సి వస్తున్నది అంటే దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా వచ్చిన కీర్తి మాత్రమే కాదు మరొక అపకీర్తిని కూడా మూటగట్టుకుని జాతీయస్థాయిలో వార్తల కెక్కుతుండటం దురదృష్టకరం. నగరం విస్తరిస్తున్న క్రమంలో రంగారెడ్డి జిల్లా అంతటా పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చిన ఫామ్ హౌస్లు. నడ మంత్రపు సిరితో ఒళ్ళు తెలియకుండా వ్యసనాలకు బానిసలు అవుతున్నవాళ్లు చేస్తున్న వికృత చేష్టలు పెరిగాయి. వీరు వారు అని లేకుండా అనేకమంది వ్యాపారులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇతర సంపన్న వర్గాలవారు నగర శివారులలోని ఈ ప్రాంతాల్లో పెద్దపెద్ద ఫామ్ హౌస్లు నిర్మించుకొన్న విషయం తెలిసిందే. వరుసగా ఐదు రోజులు తీవ్రమైన పని ఒత్తిడి తరువాత వారాంతంలో రెండురోజులు ప్రశాంతంగా నగర రణగొణ ధ్వని నుండి సేద తీరడానికి ఈ ఫామ్ హౌస్లను ఆశ్రయించే వారితో పేచీ లేదు. అటువంటి అనేకమందిని మనం దైనందిన జీవితంలో కలుస్తూ ఉంటాం. కొందరు అవకాశం దొరికినప్పుడు సమూహాలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. మనశ్శాంతి కోసం కుటుంబంతో ప్రత్యేకంగా గడపడం కోసం వెళ్లే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చర్చ వాళ్ళని గురించి కాదు, గతవారం జరిగిన ఒక సంఘటన గురించి. ఇది మొదటిసారి జరగలేదు. దాదాపు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండిన భారత రాష్ట్ర సమితికి చెందిన మాజీ శాసనసభ్యుడు పైలట్ రోహిత్రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఈగల్ టీంకు సంబంధించిన పోలీసులు పక్కా సమాచారం మేరకు దాడి చేసి కొంతమందిని పట్టుకొని పరీక్ష చేస్తే వాళ్లు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. అట్లా డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన వాళ్లలో రోహిత్రెడ్డి తోపాటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికారపక్షం లోకసభ సభ్యుడు పుట్టా మహేష్ యాదవ్ కూడా ఉన్నారు. ఈ ఆరుగురిని పోలీసులు చట్టానికి అప్పగిస్తే పార్లమెంట్ సభ్యుడు మహేష్ యాదవ్ మాత్రం స్టేషన్ బెయిల్పై విడుదలై నేరుగా ఢిల్లీ వెళ్లి లోకసభలో కూర్చున్నారు. బహుశా అప్పటికి ఇంకా ఆయన ఆ డ్రగ్ ప్రభావంనుంచి బయట కూడా పడి ఉండరు. ఎందుకంటే వాళ్లు తీసుకున్న డ్రగ్స్ మామూలు గంజాయి కాదు కొకై న్, ఎండిఎంఎ, మెథొఇథిపిన్ వంటి శక్తివంతమైన మాదకద్రవ్యాలు. వీటిని సిమ్లాలోని ఒక గుర్తు తెలియని వ్యక్తినుంచి కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మాజీ శాసనసభ్యుడు పైలట్ రోహిత్రెడ్డికి ఇప్పటికీ 24 సార్లు డ్రగ్ సరఫరా చేసారంటున్న అభిషేక్ సింగ్ను పోలీసులు శనివారం నాడు పట్టుకున్నారు. రోహిత్రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ ఈ అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి రోహిత్ రెడ్డికి ఇస్తూ ఉండేవాడని పోలీసుల కథనం ఈ సంఘటన జాతీయస్థాయిలో చర్చకు దారి తీయడానికి కారణం ఆంధ్రప్రదేశ్కు చెందిన లోకసభ సభ్యుడు దొరకడం, ఆయనను చాలా మామూలుగా స్టేషన్ బెయిల్మీద పంపించేయడం, ఆయన వెళ్లి లోకసభ సమావేశాల్లో పాల్గొనడం. ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దే సాయి సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక ట్వీట్లో ఇట్లా జరగడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లోకసభ సభ్యుడైతే మాత్రం అట్లా వదిలేస్తారా, డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదు అన్న మన ప్రభుత్వాల గంభీరోపన్యాసాల (జీరో టాలరెన్స్) మాట ఏమిటి అని ప్రశ్నించారాయన. ఒకసారి రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ పరిస్థితిని చర్చించడం అట్లా ఉంచి ఈ లోకసభ సభ్యుడి గురించి, ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించి లోకసభ పంపిన పార్టీ గురించి మాట్లాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ చాలా సీనియర్ నాయకుడు, నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుస్తున్నది. ఆయనే ఆ రాష్ట్రం ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా. తన పార్టీ ఎంపి డ్రగ్స్ తీసుకొని రెడ్హ్యాండెడ్గా దొరికిపోతే అంత సీనియర్ నాయకుడు ఏం చేయాలి? వెంటనే ఆ ఎంపిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా కూడా చెయించాలి. ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడం అనేది స్టేషన్ బెయిల్ ఇచ్చేంత మామూలు నేరం కాదు, ఈ దేశంలో మాదకద్రవ్యాల వినియోగం అనేది నిషేధం. అట్లాంటి నిషేధాలు విధించే నిర్ణయాలు తీసుకునే చట్టసభలో సభ్యుడుగా ఉన్న వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘిస్తే పార్టీ చేయాల్సిన పనేమిటి? తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే ఆ లోకసభ సభ్యుడిని కొంతకాలం పార్టీ కార్యకలాపాలకు దూరం ఉంచాలని నిర్ణయించింది. ఒక సంజాయిషీ నోటీసు కూడా ఇచ్చినట్టు ఉన్నది.పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం శిక్ష ఎట్లా అవుతుంది, చాలా విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామి జనసేన పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే, బాధితురాలు దానికి సంబంధించిన ఆధారాలు బయట పెడితే కూడా ఆ శాసనసభ్యుడిని కూడా కొంతకాలం జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచిందట. మన దేశంలో రాజకీయ పార్టీలు విచిత్రమైన కొత్త కొత్త శిక్షల్ని కనుగొంటున్నాయి. సరే ఇంకా కొంచెం లోతుకు వెళితే ఈ లోకసభ సభ్యుడు మహేష్ యాదవ్ తండ్రి పుట్ట సుధాకర్ యాదవ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అధ్యక్షుడు. ఈయనకు కూతురిని ఇచ్చిన మామ యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలోనే అత్యంత సీనియర్ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ స్పీకర్గా కూడా బాధ్యతలు నిర్వహించిన వారు. ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ ఎంపికి బంధువే. రాజకీయంగా ఇంత అనుభవం కలిగిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, తాను స్వయంగా ఒక చట్టసభలో బాధ్యతాయుతమైన సభ్యుడిగా ఉండి ఫాం హౌస్లలో డ్రగ్స్ తీసుకోవలసిన అవసరం ఏమి వచ్చింది? పొరుగు రాష్ట్ర లోకసభ సభ్యుడికి తెలంగాణ పార్టీకి సంబంధించిన మాజీ సభ్యుడితో ఫార్మ్హౌస్లో జరపాల్సిన మంతనాలు ఏం ఉంటాయి, విందు వినోదాల కోసమే వెళితే తుపాకీ ఎందుకు పేలింది? ఇక పైలట్ రోహిత్రెడ్డి విషయానికొస్తే ఆయనకు న్యాయస్థానం 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే ఆయన పార్టీ మాత్రం ఏడు రోజుల్లోనే సంజాయిషీ ఇవ్వాల్సిందిగా నోటీస్ ఇచ్చిందట. 14 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ లభిస్తే బయటికి వచ్చి కదా సంజాయిషీ ఇవ్వగలుగుతాడు, లోపల ఉండి ఏ విధంగా ఇస్తాడు? డ్రగ్స్ తీసుకు న్నట్టు పరీక్షల్లో బయటపడ్డ తర్వాత ఇంకా సంజాయిషీ నోటీసులు, బాబ్బాబు నువ్వేం చెప్పదలుచుకున్నావు అని గడ్డం పట్టుకుని బతిమాలడాలు రాజకీయ పార్టీల ప్రతిష్టకు తగని పని. ఇదే రోహిత్రెడ్డి ఫామ్హౌస్ గతంలో కూడా వార్తల్లోకెక్కింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న కాలంలో ఢిల్లీ నుండి వచ్చిన భారతీయ జనతా పార్టీ పెద్దలు కొందరు భారత రాష్ట్ర సమితి శాసన సభ్యులను కొనుగోలు చేయడానికి ఇక్కడే మంతనాలు జరుపుతూ దొరికిపోయిన వార్తలు విన్నాం. బహుశా అక్కడి నుండే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉండిన భారత రాష్ట్ర సమితికి మధ్య సంబంధాలు చెడిపోవడం మొదలైనట్టుంది. పైలట్ రోహిత్రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ కొందరు దొరికిపోవడాన్ని చెదురుమదురు సంఘటనగా చూడటానికి వీల్లేదు. ఇటీవలి కాలంలో రంగారెడ్డి జిల్లాలో ఫామ్ హౌస్పై పలు సందర్భాలలో డ్రగ్స్ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు, పోలీసులు డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని చెప్తున్నా అవి విరివిగా అందుబాటులో వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పబ్బులు, నగర శివారులోని ఫామ్ హౌస్ లూ ఈ డ్రగ్స్ పార్టీలకు అడ్డగా మారుతున్నాయి. దీనివల్ల ఎక్కువగా నష్టపోతున్నది, జీవితాలు నాశనం చేసుకుంటున్నది యువత. అంతేకాదు కొన్ని పాఠశాలల్లో కూడా డ్రగ్స్ మహమ్మారి ప్రవేశించి ముక్కుపచ్చలారని పిల్లలను కూడా వాటికి బానిసలను చేస్తున్న తీవ్ర ఆందోళనకరమయిన వార్తలు గతంలో మీడియా ద్వారా తెలుసుకున్నాం. ఎంత కఠినమైన చట్టాలు చేసినా, డ్రగ్స్ రవాణా, విక్రయాలను అడ్డుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమవుతున్నది అన్న ప్రశ్న తలెత్తుతున్నది. క్షేత్రస్థాయిలో చట్టాల అమలు కఠినంగా ఎందుకు జరగడం లేదు. ఒకప్పుడు అర్ధరాత్రి, అపరాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపే వారి కారణంగా జరిగే ప్రమాదాల సంఖ్య, మరణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఇవాళ నిజానికి హైదరాబాదులో ఈ సంఘటనలు దాదాపుగా లేవని చెప్పాలి. దానికి కారకుడు ఐపిఎస్ అధికారి సివి ఆనంద్. దేశంలో మద్యం మీద నిషేధం లేకపోయినా మద్యం సేవించి వాహనాలు నడిపితే పట్టుకొని కేసులు పెట్టే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆయనే. అది హైదరాబాద్ నగరం నుంచి పాకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు విస్తరించింది. బహుశా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది అమల్లో ఉంటే ఉండొచ్చు. హైదరాబాదులో ఆనాడు సివి ఆనంద్ అంత కఠినంగా వ్యవహరించి ఉండకపోతే, డ్రంక్ అండ్ డ్రైవ్ను కఠినమైన నేరంగా పరిగణించి ఉండకపోతే ఈ పరిస్థితి ఉండేది కాదు. డ్రగ్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఇంతే నిర్దాక్షిణ్యంగా, ఇంకా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఈ దేశంలో డ్రగ్స్ నిషేధం, దానికి సంబంధించి కఠినమైన చట్టాలు ఉన్నాయి, వాటిని కచ్చితంగా అమలు చేసి, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు అయినా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే అనే వాతావరణం ఏర్పడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. డ్రగ్స్ బెడద నిర్మూలించేందుకు తీవ్రంగా ప్రయత్నించి, నేరస్తుల వెన్నులో చలి పుట్టించిన మరో అధికారి అకున్ సబర్వాల్. ఆనాటి ప్రభుత్వం ఆయనను హటాత్తుగా ఆ పని నుండి తప్పించేసింది, ఏ ఒత్తిడి ఫలితంగా అది జరిగింది? అసలు ముందు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఫామ్ హౌస్ల లెక్కలన్నీ తీసి అవి ఎవరెవరివి, అక్కడ ఎవరెవరు, ఏమేం చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకొని ఈ అపకీర్తిని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే నిష్కృతి ఉండదు. Delete Edit
ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమపెళ్లి
ఓ ప్రేమ పెళ్లి ప్రాణాల మీదికి తెచ్చింది. వివాహం జరిగినప్పటి నుంచి కోపంతో అమ్మాయి వాళ్ళ బాబాయ్ సమయం కోసం ఎదురు చూసి తేదీ మార్చి18 బుధవారం రాత్రి 8:00 గంటల సమయంలో అబ్బాయిని ఇనుప రాడ్డులతో విచక్షణ రహితంగా చితకబాదరు. పైగా బండ బూతులు తిడుతూ నిన్ను చంపేస్తాను అని భయభ్రాంతులకు గురి చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని చితకబాదారు అమ్మాయి తరఫు బంధువులు ఈ ఘటన వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం గంగ్యడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధితున్నీ అతని అన్న బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. శివకుమార్ శరీరం నుంచి రక్తం బాగా పోయింది. సమయానికి ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. మొత్తంగా ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసీ దర్యాప్తు చేస్తున్న నవపేట్ పోలీసులు
స్నేహితుడితో కెసిఆర్ రంజాన్ వేడుకలు
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన చిన్ననాటి స్నేహితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మ హమ్మద్ జహంగీర్, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ఇతర ముస్లింలతో రంజాన్ వేడుక లు జరుపుకున్నారు. శనివారం ఎర్రవెల్లి నివాసం లో హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, మ హమ్మద్ జహంగీర్తో పాటు బిఆర్ఎస్ రాష్ట్ర నా యకుడు జుబేర్ మహమ్మద్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. మహమూద్ అలీ ముని మనుమడిని కెసిఆర్ ప్రత్యేకంగా ఆశీర్వదించా రు. ఈ సందర్భంగా కెసిఆర్ వారితో ఫొటోలు ది గి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో వారు కెసిఆర్కు సంప్రదాయ ఇస్లాం టోపీని బహూకరించగా, ఆయన దానిని ధరించారు. కొద్దిసేపే వారితో కలిసి స్నేహపూర్వకంగా పం డుగ సంతోషాన్ని పంచుకున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్: ఆరుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్
ఒడిశాలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలను బిజు జనతా దళ్ (బీజేడీ) పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల్లో బలిగూడా నియోజకవర్గానికి చెందిన చక్రమణి కన్హర్, జయదేవ్కు చెందిన నబా కిశోర్ మాలిక్, చౌద్వార్-కటక్ నుంచి సౌవిక్ బిస్వాల్, బస్తా నుంచి సుభాసిని జేనా, తిర్తోల్ నుంచి రామకాంత్ భోయి, బంకీ నియోజకవర్గానికి చెందిన దేవీ రంజన్ త్రిపాఠి ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలకు మార్చి 17న షోకాజ్ నోటీసులు జారీ చేయగా, వారు శుక్రవారం సాయంత్రం తమ వివరణలు సమర్పించారు. అయితే ఆ వివరణలు సంతృప్తికరంగా లేవని అసెంబ్లీలో బీజేడీ చీఫ్ విప్ ప్రమిళా మాలిక్ తెలిపారు. 147 సభ్యుల ఒడిశా అసెంబ్లీలో అధికార బీజేపీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం 82 మంది ఉండగా, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 93 ప్రాధాన్యత ఓట్లు సాధించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ అదనపు ఓట్లలో ఎనిమిది బీజేడీ ఎమ్మెల్యేలవి, మూడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలవి అని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం ఒడిశా రాజకీయాల్లో కలకలం రేపుతుండగా, బీజేడీ క్రమశిక్షణ చర్యలు పార్టీ అంతర్గత పరిస్థితులను స్పష్టంగా చూపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలిన భారత సంతతి జడ్జి
అమెరికాలో మనీ లాండరింగ్కు సంబంధించిన కేసులో భారత సంతతికి చెందిన ఓ న్యాయమూర్తి దోషిగా తేలారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఆయనపై నమోదైన అభియోగాలు నిర్ధారణ అయ్యాయి. ఈమేరకు జ్యూరీ తీర్పు వెలువరించింది. శిక్ష మాత్రం జూన్ 16న ఖరారు చేయనుంది. అక్కడి చట్టాలను అనుసరించి ఆయనకు రెండు నుంచి పదేళ్లవరకు జైలు శిక్ష, పదివేల డాలర్లు జరిమానా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. భారత సంతతికి చెందిన కేపీ జార్జ్ టెక్సాస్ లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ప్రచార నిధులు దాదాపు 46 వేల డాలర్లు తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్టు అభియోగాలు నమోదయ్యాయి. కోర్టు రూమ్ నుంచే ఆయనను అధికారులు అదుపు లోకి తీసుకోగా, స్థానిక జైలు నుంచి పూచీకత్తుపై బయటకు వచ్చారు.
జపాన్లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్లో ఉగాది పండుగను భారతీయులు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఉగాది సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అనంతరం వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు. పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ వంటి వినోదాత్మక పోటీలు నిర్వహించగా, పెద్దల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమం అనంతరం కొత్తగా వచ్చిన కుటుంబాలు పరస్పరం పరిచయం చేసుకుని, విదేశాల్లో భారతీయ సంప్రదాయాలను ఎలా కొనసాగించాలన్న దానిపై చర్చించారు.ఈ వేడుకల ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ(Telugu association of Japan)కమిటీ సభ్యులకు, అలాగే పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
పాన్ ఇండియా మార్కెట్లో ధురంధర్ 2 జోరు...#Dhurandhar2 #RanveerSingh #BoxOffice #PanIndia
అరటి తోటను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశా
అరటి తోటను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశా ఏఈఓ సాయిరామ్ ను సస్పెండ్ చేయాలని
బలి పశువును చేస్తారు.. పాక్ క్రికెట్ బోర్డుపై మాజీ కోచ్ విమర్శలు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ తీవ్ర విమర్శలు చేశారు. జట్టు సరిగ్గా ఆడనప్పుడు కోచింగ్ సిబ్బందిని బలిపశువులను చేస్తారని కిర్స్టన్ అన్నారు.పాకిస్థాన్ జట్టుకు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన కేవలం ఆరు నెలలకే.. ఒక్క వన్డేకు కూడా కోచ్ గ వ్యవహరించకుండానే గ్యారీ కిర్స్టన్ అక్టోబర్ 2024లో హెడ్ కోచ్ పదవి నుండి వైదొలగాడు. దీనిపై ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బోర్డులో ఇతరుల జోక్యం ఎక్కువగా ఉంటుందని.. ఇలాంటి పరిస్థితిని తానెక్కడా చూడలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్కు కోచింగ్ సిబ్బందిని బలిపశువులను చేస్తారన్నారు. వృత్తిపరమైన గౌరవం లేకపోవడంతో రిజైన్ చేసినట్లు తెలిపారు. జట్టు సరిగ్గా ఆడనప్పుడు, కోచ్ను సులభంగా బలిపశువును చేస్తారు. 'కోచ్ను తొలగిద్దాం' లేదా 'కోచ్పై ఆంక్షలు విధిద్దాం' అని అంటారు. ఎందుకంటే జట్టు సరిగ్గా ఆడనప్పుడు చేయడానికి అదే సులభమైన పని. కానీ నా దృష్టిలో అది ప్రతికూల ఫలితాలనిస్తుంది. బయటి నుంచి నిరంతరం గొడవ జరుగుతున్నప్పుడు, ఒక కోచ్ వచ్చి ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం చాలా కష్టం. అది చాలా కష్టంగా ఉంటుంది. అయినా, ప్రతీ సందర్భంలోనూ నిందలు వేయాలని చూసేటప్పుడు, అసలు కోచ్ను ఎందుకు నియమించుకోవాలి? అని కిర్స్టన్ విమర్శించారు. కాగా, ప్రస్తుతం కిర్స్టన్, శ్రీలంక జట్టుకు హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. ఏప్రిల్ 15న ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
హర్మూజ్ ను తెరవండి.. ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హర్మూజ్ జలసంధి తెరవాలని
దానం నాగేందర్ను పార్టీ ఫిరాయింపు కేసు.. స్పీకర్ తీర్పును ఛాలెంజ్ చేసిన ఏలేటి
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను పార్టీ ఫిరాయింపు కేసు వదలడం లేదు. దానం పార్టీ మారలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 11న ఇచ్చిన తీర్పును బిజెపి శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ ఏలేటి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్పై కోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఆ తర్వాత 2024లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి దానం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని ఏలేటి పిటిషన్లో పేర్కొన్నారు. దానం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ‘బి-ఫాం’ దాఖలు చేశారని, ఏఐసిసి ప్రకటించిన జాబితాలోనూ దానం పేరు ఉందని పిటిషనర్ ఏలేటి పేర్కొన్నారు. కాబట్టి దానంపై స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టి వేసి, ఇంత కాలం ఎమ్మెల్యేగా పొందిన జీతభత్యాలను వెనక్కి తీసుకోవాలని ఆయన పిటిషన్లో కోరారు. దానం నాగేందర్తో పాటు పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టి వేసిన సంగతి తెలిసిందే. మిగతా తొమ్మిది మంది ఊపిరి పీల్చుకున్నారు.
ఆరుగురు ఎమ్మెల్యేలపై బిజెడి వేటు..
భువనేశ్వర్: ఆరుగురు ఎమ్మెల్యేలపై బిజు జనతా దళ్ (BJD) పార్టీ వేటు వేసింది. ఇటీవల ఒడిశా నుండి నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో 'క్రాస్-ఓటింగ్'కు పాల్పడ్డారని శనివారం ఆరుగురు ఎమ్మెల్యేలను బిజెడి, పార్టీ నుండి సస్పెండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఈ పార్టీ, సదరు ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే తమ నిర్ణయానికి కారణమని పేర్కొంది. పార్టీ క్రమశిక్షణా కమిటీ జరిపిన పరిశీలన ఆధారంగానే ఈ సస్పెన్షన్లు విధించినట్లు BJD ప్రకటనలో తెలిపింది. కాగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP), గత సోమవారం పోలింగ్ జరిగిన ఒడిశాలోని నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని కైవసం చేసుకుంది. కాషాయ పార్టీ మద్దతుతో పోటీ చేసిన మరో స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం సాధించారు. మిగిలిన ఒక స్థానాన్ని పట్నాయక్ నేతృత్వంలోని BJD దక్కించుకుంది.
డిసెంబర్ నాటికి అల్వాల్, ఎల్.బి.నగర్ టిమ్స్
అల్వాల్, ఎల్.బి.నగర్లలో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రుల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.అల్వాల్లో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి పనులు ఇప్పటికే 70 శాతానికిపైగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి దీనిని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆసుపత్రి న్యూరో సైన్స్కు సెంటర్ ఆఫ్ ఎక్సిలెన్స్గా సేవలు అందించనున్నది. అలాగే ఎల్.బి.నగర్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. మరో ఆరు నెలల లోపే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆసుపత్రి గ్యాస్ట్రో సైన్స్కు సెంటర్ ఆఫ్ ఎక్సిలెన్స్గా సేవలు అందించనున్నది. బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో మరింత వేగంగా పనులు జరుగనున్నాయి. నగరంలో సనత్నగర్, ఎల్.బి.నగర్, అల్వాల్లో 1000 పడకల చొప్పున అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రులు ప్రారంభం అయితే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రధాన ఆసుపత్రులపై ప్రతిరోజూ దూర ప్రాంతాలకు వెళుతున్న రోగుల సంఖ్య గణనీయంగా తగ్గనున్నాయి. ప్రధాన ఆసుపత్రులలోని దీర్ఘకాలిక శస్త్రచికిత్సల వెయిటింగ్ లిస్ట్ను టిమ్స్కు బదిలీ చేయడం ద్వారా ఆయా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనున్నది. కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందడం వల్ల పేద ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుంది.
నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీలో బయో వ్యర్ధాలతో విద్యుత్ తయారీ
నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ తయారీతో పాటు నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో బయో పవర్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో పనిచేసే నీటి శుద్ధి కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆయిల్ పామ్ గెలల నుంచి నూనె ఉత్పత్తి ప్రక్రియలో మిగిలే వ్యర్థాలను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానంతో ఫార్యక్టరీకి అవసరమయిన విద్యుత్ స్వయంగా తయారు చేసుకునే విధంగా నిర్మాణం చేపట్టారు. దీంతో పాటు ఫ్యాక్టరీ ఆవరణలో నీటి సౌకర్యం ఏర్పాటు చేసి ఫ్యాక్టరీకి అవసరమయిన నీటిని సైతం అక్కడే రీసైక్లింగ్ ద్వారా స్టోర్ చేసి వినియోగించనున్నారు.
అరసవల్లి క్షేత్రానికి మహర్దశ..
అరసవల్లి క్షేత్రానికి మహర్దశ.. రూ. 4 కోట్లతో పుష్కరిణి పునరుద్ధరణ పనులుశంకుస్థాపన చేసిన
Hormuz Crisis : హూ ఈజ్ బిగ్ బాస్ Andhra Prabha SPL Story
Hormuz Crisis : హూ ఈజ్ బిగ్ బాస్ Andhra Prabha SPL
రోడ్డు ప్రమాదంలో 3వేల బాతులు మృత్యువాత
మండల పరిధిలోని ముష్టిబండ - మొద్దులగూడెం గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుండి లారీ బలంగా ఢీకొట్టిన ఘటనలో సుమారు 3,000 బాతులు మృత్యు వాత పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడువాయి గ్రామం నుండి తిరువూరుకు నాలుగు వేల బాతులతో వెళ్తున్న బొలెరో వాహనం, ముష్టిబండ సమీపంలోని ధాబా వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంది. అదే సమయంలో మొక్కజొన్న లోడుతో వస్తున్న లారీ అదుపు తప్పి ఆగి ఉన్న బొలెరోను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాద ధాటికి రెండు వాహనాలు రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో బొలెరోలో తరలిస్తున్న 4,000 బాతులలో సుమారు 3,000 బాతులు అక్కడికక్కడే మరణించాయి. లారీలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సకాలంలో స్పందించిన పోలీసులుహెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం అశ్వారావుపేట ఆసుపత్రికి తరలించారు. అనంతరం జేసీబీ సహాయంతో రోడ్డు పక్కన పడిపోయిన బొలెరో వాహనాన్ని, లారీని బయటకు తీయించి ట్రాఫిక్ పునరుద్ధరించారు.
6గ్యారంటీలు, 420 హామీలు ఎక్కడ?
6గ్యారంటీలు, 420 హామీలు ఎక్కడ? మూడు బడ్జెట్లు వచ్చినా ఎస్సీలకు లాభం లేదుదళిత
కోమటిరెడ్డి బ్రదర్స్పై చేస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారం
కోమటిరెడ్డి బ్రదర్స్పై చేస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారం మునుగోడు, ఆంధ్రప్రభ : కోమటిరెడ్డి
కల్తీ సమోసాల తయారీ కేంద్రంపై దాడి
పాడైపోయిన వస్తువులతో సమోసాలు తయారు చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్ ఫుడ్ అడాల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం, కుల్సుంపుర పోలీసులు కలిసి జియాగూడలో దాడి చేశారు. సమోసాలు తయారు చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.5లక్షల విలువైన పాడైపోయిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...జియాగూడలోని ఎస్బిఎ గార్డెన్ ఎదురుగా ఉన్న ఇంటిలో అబ్దుల్ రషీద్(73) అపరిశుభ్రమైన వాతావరణంలో కుళ్లిపోయిన గుడ్లు, పదే పదే మరిగించిన నూనెను ఉపయోగించి సమోసాలు తయారు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హెచ్ ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడాల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం), కుల్సుంపురా పోలీసులు సమన్వయంతో జియాగూడలోని ఒక అక్రమ ఆహార తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేసి సీజ్ చేశారు. తయారీ కేంద్రానికి ఎలాంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ లేదా ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు పాడైన గుడ్లతో ఎగ్ సమోసాలు , స్వీట్ కార్న్ సమోసాలు , ఉల్లిపాయ సమోసాలు తయారు చేస్తున్నాడు. అన్ని వస్తువులను సీజ్ చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం కుల్సుంపురా పోలీస్ స్టేషన్లో అ అప్పగించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సింగరేణి లో మెడికల్ బోర్డును పునరుద్ధరించి
సింగరేణిలో మెడికల్ బోర్డును పునరుద్ధరించి 300 మంది డిపెండెంట్ లకు ఉద్యోగాలు ఇవ్వాలిఏప్రిల్
ఉత్కంఠ పోరు.. మహిళల ఆసియా కప్ జపాన్ కైవసం
సిడ్నీ: హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి మహిళల ఆసియా కప్ను జపాన్ కైవసం చేసుకుంది. సిడ్నీలో జరిగిన ఈ తుది పోరులో, అతిథి జట్టు అయిన ఆస్ట్రేలియాపై జపాన్ విజయం సాధించింది. ఈ ఉత్కంఠ పోరులో ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతూ పై చేయి సాధించింది ఆస్ట్రేలియా. దీంతో తొలి కొన్ని నిమిషాల్లోనే జపాన్ను తీవ్ర ఒత్తిడికి నెట్టేసింది. కానీ జపాన్ ఒత్తిడిని తట్టుకుని నిలబడి విజయాన్ని అందుకుంది. కాగా, వచ్చే ఏడాది బ్రెజిల్లో జరిగే ప్రపంచ కప్కు ఇది అర్హత పోటీగా ఉపయోగపడింది. ఫైనల్ కు చేరుకున్న రెండు జట్లతో సహా పలు జట్లు అర్హత సాధించాయి. జపాన్, ఆస్ట్రేలియాతో పాటు, ఆసియా నుండి చైనా పీఆర్, కొరియా రిపబ్లిక్, ఫిలిప్పీన్స్, ఉత్తర కొరియా డీపీఆర్ జట్లు కూడా తదుపరి రౌండ్లకు అర్హత సాధించాయి. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న భారత్, ఆడిన మూడు మ్యాచ్లలోనూ ఓడిపోయి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
Top Actress to shake leg with Ram Charan?
The shoot of Mega Powerstar Ram Charan’s upcoming film Peddi is coming to an end and the film is slated for April 30th release across the globe. A special song will be shot in a massive set in the first week of April. The makers are on a hunt for the right actress to shake […] The post Top Actress to shake leg with Ram Charan? appeared first on Telugu360 .
మోత్కూర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు..
మోత్కూర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్
యుటిఎఫ్ వ్యవస్థాపక కార్యదర్శి ఏవీఎస్ కు నివాళి
యుటిఎఫ్ వ్యవస్థాపక కార్యదర్శి ఏవీఎస్ కు నివాళి దర్శి, ఆంధ్రప్రభ : యుటిఎఫ్
ప్రజలతో కలిసి భోజనం… సేవలపై నేరుగా సమీక్ష
ప్రజలతో కలిసి భోజనం… సేవలపై నేరుగా సమీక్ష అన్న క్యాంటీన్లో కలెక్టర్ లక్ష్మీశ
ఆ వర్గం ఎటువైపు… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అరడుగుల బుల్లెట్కు ఆపద వచ్చిందంట.
ఒక్కసారిగా 20 కోతుల మూక దాడి.. వృద్ధురాలి మృతి
ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కోతుల మూక దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. పెద్దిపాలెం గ్రామ శివారులో జీడిమామిడి తోటను ఆనుకొని ఉన్న ఇంట్లో దానబోయిన చిన్నబుల్లి (68) నివాసం ఉంటున్నారు. గేదెకు నీరు పెట్టేందుకు వెళ్లగా అక్కడ కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. 20కి పైగా కోతులు ఒక్కసారిగా దాడి చేయడంతో తప్పించుకొనేందుకు వీలు లేకుండా పోయింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నబుల్లి తనకు ఉన్న 3 ఎకరాల తోటలో తన కుమార్తె కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటోంది. ఈ ప్రాంతంలో కోతుల దాడిలో గాయపడిన ఘటనలు చాలా జరిగాయని.. అయితే ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారని గ్రామస్థులు వాపోయారు.
సాయి టవర్ అభివృద్ధికి కృషి… నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : సాయి
Temple |ఘనంగా శివ పార్వతుల కల్యాణం…
Temple | ఘనంగా శివ పార్వతుల కల్యాణం… Temple | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ
రాహుల్ గాంధీ.. బిజెపికి బి టీమ్: కేరళ సిఎం సంచలన ఆరోపణలు
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం సిఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ.. భారతీయ జనతా పార్టీ(బిజెపి)కి బీ టీమ్ లాంటి వాడని సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడని వ్యక్తి అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మెజారిటీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన మతతత్వ శక్తుల మద్దతును కూడగట్టుకోవడమే ఆ పార్టీ లక్ష్యమని విజయన్ ఆరోపించారు. CPI(M), LDF మతతత్వానికి పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. కాగా, కేరళలో ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మునుగోడు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని బట్ల
సోషల్ మీడియాపై 22న జాతీయ సదస్సు
విశాలాంధ్ర- హైదరాబాద్ : సోషల్ మీడియా-మంచీ- చెడూ (సోషల్ మీడియా- ఇంపాక్ట్-పాజిటివ్ అండ్ నెగెటివ్) అనే అంశంపై తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా (మెఫి) ఆదివారం హైదరాబాదులో ఒక జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాయి. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కే.విరాహత్ అలీ, మెఫీ మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్ ఒక ప్రకటనలో తెలిపారు. […] The post సోషల్ మీడియాపై 22న జాతీయ సదస్సు appeared first on Visalaandhra .
వచ్చే రంజాన్ నాటికి సీసీ రోడ్డు పూర్తి చేస్తాం…
వచ్చే రంజాన్ నాటికి సీసీ రోడ్డు పూర్తి చేస్తాం… స్టేషన్ ఘన్ పూర్,
ముస్లీం మైనార్టీలకు రంజాన్ తోఫా అందజేసి సత్యమూర్తి
విశాలాంధ్ర – మల్కాజిగిరి : ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ ప్రశాంత్ నగర్లో రంజాన్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా అందించిన ఈద్ కా తోఫాను కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సత్యమూర్తి ముస్లిం సోదరులకు అందజేశారు. వారిని శాలువాతో సత్కరించి స్వీట్స్ అందజేసి, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉందని, మల్కాజిగిరిలో మైనార్టీల అభ్యున్నతికి సహకరిస్తున్న మాజీ […] The post ముస్లీం మైనార్టీలకు రంజాన్ తోఫా అందజేసి సత్యమూర్తి appeared first on Visalaandhra .
అంగన్వాడీ భవనానికి శ్రీకారం… స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
ప్రజా ప్రభుత్వ బడ్జెట్ ఇది-ప్రజల ప్రశంసలు అందుకున్న బడ్జెట్
తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ షన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ విశాలాంధ్ర – హైదరాబాద్ : రాష్ట్ర అభివృద్ధే ద్యేయంగా, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు నిదర్శనం 2026-27 ఆర్థిక బడ్జెట్ అని, ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం, దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడగు వేస్తుందని అందుకు కాంగ్రెస్ నాయకత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు అందజేస్తున్నానని, తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి […] The post ప్రజా ప్రభుత్వ బడ్జెట్ ఇది-ప్రజల ప్రశంసలు అందుకున్న బడ్జెట్ appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గం ఈస్ట్ ఆనంద్ బాగ్ బండ చెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆర్యన్ గౌస్ గత కొద్ది రోజుల నుండి అనారోగ్యతో బాధపడుతున్నాడు. అతని ఆపరేషన్కి అయ్యే ఖర్చులు మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ బాబు సహకారంతో రూ. 3 లక్షల ఎలఓసి మంజూరు చేయడం జరిగింది. ఈ ఎలఓసి కాపిని బాదితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్ యాదవ్, బి.కె.శ్రీనివవాస్, గుండా నిరంజన్, కపిల్, […] The post బాదితునికి ఎలఓసి అందజేత appeared first on Visalaandhra .
Smartphones Turning Dangerous for Young Women, Warns Hyderabad CP Sajjanar
Hyderabad Police Commissioner V.C. Sajjanar has raised serious concerns over the growing misuse of social media and smartphones, especially among young women. He warned that what fits in the palm today is slowly becoming a source of danger for many. Sajjanar said the rise in social media usage has led to an increase in interactions […] The post Smartphones Turning Dangerous for Young Women, Warns Hyderabad CP Sajjanar appeared first on Telugu360 .
Video : Producer Niharika Konidela Exclusive Interview
The post Video : Producer Niharika Konidela Exclusive Interview appeared first on Telugu360 .
రెండు వారాల్లో రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభం
రానున్న రెండు వారాల్లో రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ముమ్మర ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా నిర్వహించడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. పౌరసరఫరాల భవన్లో రాష్ట్ర రైస్ మిల్లర్లతో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మిల్లర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అదనపు గోదాములను వెంటనే గుర్తించి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రవాణా ఏర్పాటు, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ధాన్యం అన్లోడ్ చేయడంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా, అన్ని కొనుగోలు కేంద్రాల్లో తగినంత మంది హమాలీలను (కార్మికులను) ఏర్పాటు చేయాలని అధికారులు, మిల్లర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో పని చేస్తామని రైస్ మిల్లర్లు అంగీకరించారు.
15 ఏళ్ల నిరీక్షణకు తెర…. రామవరప్పాడులో బీటీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన
పవిత్ర రంజాన్ మాసం మానవాళికి మార్గదర్శిగా నిలుస్తుంది
పవిత్ర రంజాన్ మాసం మానవాళికి మార్గదర్శిగా నిలుస్తుంది కంచికచర్ల, ఆంధ్రప్రభ : పవిత్ర
మసీద్ అభివృద్ధికి రూ.2.60 లక్షలు విరాళం…
మసీద్ అభివృద్ధికి రూ.2.60 లక్షలు విరాళం… విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : మండల
అత్యాధునిక పోలీస్ స్టేషన్ల నిర్మాణం…
అత్యాధునిక పోలీస్ స్టేషన్ల నిర్మాణం… గన్నవరం, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు
Mega Steel Plant in Andhra Pradesh: AMNS India Project Set to Transform Anakapalli
Andhra Pradesh is set to witness a major industrial boost with the launch of a massive steel plant project in Anakapalli district. Global steel giant ArcelorMittal Nippon Steel India has chosen the state for its greenfield integrated steel plant, marking one of the biggest industrial investments in recent years. The project involves an investment of […] The post Mega Steel Plant in Andhra Pradesh: AMNS India Project Set to Transform Anakapalli appeared first on Telugu360 .
ప్రతీ కార్యకర్తకూ టీడీపీ అండ… కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : ప్రతి కార్యకర్తకూ తెలుగుదేశం
నలభై ఏళ్ళ బంధం తెంచుకుంటున్నా: జీవన్ రెడ్డి
గతంలో సుమారు రెండు సంవత్సరాలుగా మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచీ ఆయనను బుజ్జగించేందుకు పార్టీ నాయకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆయనకు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదిలా ఉండగా జీవన్ రెడ్డి కాంగ్రెస్తో తనకు ఉన్న నలభై ఏళ్ళ బంధాన్ని తెంచుకుంటున్నందుకు బాధగా ఉందన్నారు. ఇరవై నెలలుగా పార్టీలో క్షోభకు గురయ్యానని ఆయన ఆవేదనతో చెప్పారు. మరో నాయకున్ని (ఎమ్మెల్యే కె. సంజయ్) ప్రోత్సహిస్తూ తనను అవమానించారని ఆయన పార్టీ నాయకత్వాన్ని విమర్శించారు. తనకు క్లీన్ ఇమేజ్ ఉందన్నారు. బిఆర్ఎస్లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి ప్రశ్నించగా, త్వరలో జగిత్యాలలో తన అనుచరులతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.
వీధి కుక్కల సమస్యల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు…
వీధి కుక్కల సమస్యల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు… విజయవాడ నగరపాలక సంస్థ
శ్రీ తిరుపతమ్మ ఆలయానికి భక్తులు విరాళం…..
శ్రీ తిరుపతమ్మ ఆలయానికి భక్తులు విరాళం….. పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న
హర్మూజ్ జలసంధిని తెరవండి.. ఇరాన్కు 22 దేశాల విజ్ఞప్తి..
గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఎన్నో కోట్ల విలువైన ఆస్తిలు ధ్వంసమయ్యాయి. ఇంత జరిగిన ఈ యుద్ధ వాతావరణం చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో ఇంధన లోటుతో పలు దేశాలు ఇబ్బందులు ఎదురుకుంటున్నాయి. తాజాగా హర్మూజ్ జలసంధిని తెరవాలని పలు దేశాలు ఇరాన్ను కోరాయి. దాడులను ఆపాలని కూడా ఇరాన్ను 22 సంయుక్త ప్రకటన చేశాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను పలు దేశాలు ఖండించాయి. యుఎఇ, బహ్రెయిన్, యుకె, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఈ దాడులను ఆపాలని విజ్ఞప్తి చేశాయి. ఇరాన్ చర్యల వల్ల అన్ని దేశాల ప్రజలపై దుష్ర్ఫభావం పడుతోందని ప్రకటించాయి.
టీడీపీ సీనియర్ నాయకుడు కన్నుమూత…
టీడీపీ సీనియర్ నాయకుడు కన్నుమూత… నవాబుపేటలో అంత్యక్రియలకు నేతల రాకకుటుంబానికి నెట్టెం రఘురాం
మీరాలం ఈద్గా వద్ద ముస్లిం ప్రార్థనలు..భారీగా హాజరైన ముస్లింలు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని మీరాలం ఈద్గా వద్ద శనివారం ముస్లింలు భారీ ఎత్తున్న ప్రార్థనలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ప్రార్థనల అనంతరం ఆయన చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులందరూ సుఖసంతోషాలతో, ప్రశాంతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రంజాన్ మాసమంతా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగియడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల షాపింగ్ అవసరాలకు, ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని, అందరి సహకారంతో వేడుకలు విజయవంతంగా జరిగాయని తెలిపారు. పండుగ ఏర్పాట్లలో సహకరించిన మత పెద్దలకు, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ సిపి సౌత్రేంజ్ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సిపి ట్రాఫిక్ డి.జోయల్ డెవిస్, జాయింట్ సిపి నార్త్ రేంజ్ ఎన్. స్వేతా, సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ డిసిపి ఆర్.వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ డిసిపి ఎస్. శ్రీనివాస్, ట్రాఫిక్ డిసిపి అవినాశ్ కుమార్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చిన్నారిపై వీధి కుక్కల దాడి.. కాపాడిన స్థానికులు..
వరంగల్: వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి గాయపడిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. 35వ డివిజన్లోని నాలుగు జెండాల ప్రాంతంలో ఒంటరిగా ఉన్న చిన్నారిపై వీధికుక్కలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో చిన్నారికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి కుక్కలను తరిమి కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. చిన్నారిపై కుక్కలు దాడి చేస్తున్న సమయంలో స్థానికులు చూసి గట్టిగా కేకలు వేయడంతో కుక్కలు పారిపోయాయి. ప్రస్తుతం గాయపడిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా
ఇంధన సరఫరాపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్ చమురు అమ్మకాలకు 30 రోజుల మినహాయింపు జారీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ఈ తాత్కాలిక చర్యతో 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్ లోకి వస్తుందన్నారు. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురు విక్రయించడానికి మాత్రమే ఈ అనుమతులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అదనపు ముడి చమురులేదు : ఇరాన్ స్పందన అమెరికా మినహాయింపులపై ఇరాన్ స్పందిస్తూ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు ముడి చమురు లేదని టెహ్రాన్ తెలిపింది. ఈమేరకు ఇరాన్ ఇంధన మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎక్స్లో పోస్టు పెట్టారు. చమురు సరఫరాపై ఆందోళనలు తగ్గించేందుకే యూఎస్ ఇలాంటి ప్రకటన చేసిందన్నారు.
బంగారం, వెండి భారీగా తగ్గుముఖం
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత దేశంలో బంగారం ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గుడ్ రిటర్న్ వెబ్సైట్ ప్రకారం శుక్రవారంనాడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,910 రూపాయలు పలుకగా, 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,550 రూపాయలుగా నడిచింది. శనివాంనాడు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 2,940 రూపాయలు, 22 క్యారెట్ బంగారంపై 2,750 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,970 రూపాయల దగ్గర.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,33,800 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పతనం అయ్యాయి.శుక్రవారంనాడు కిలో వెండి 2,60,000 రూపాయలు, 100 గ్రాముల వెండి 26,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. శనివారంనాడు కిలోపై 10 వేల రూపాయలు.. 100 గ్రాములపై వెయ్యి రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 2,50,000 రూపాయల దగ్గర, 100 గ్రాముల వెండి 25 వేల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
மாணவர்கள் உணவை குப்பையில் கொட்டும் வீடியோ.. சம்பவம் தமிழ்நாட்டில் நடந்ததா?
ஆந்திரா பள்ளியில் மாணவர்கள் உணவை குப்பையில் கொட்டும் வீடியோவை, தமிழ்நாட்டில் நடந்த சம்பவம் போல பொய்யாக பரப்பி வருகிறார்கள்.
రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. మహిళ వ్యాపారవేత్తకి టోకరా
హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా.. ఏదో మార్గంలో కొందరు కేటుగాళ్లు ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ వ్యాపారవేత్త, మాజీ డిజిపి మనుమరాలిని సైబర్ నేరగాళ్లు మోసం చేసి పెద్ద మొత్తంలో నగదు కాజేశారు. మహిళ వ్యాపారి దివ్యారెడ్డి, అకౌంటెంట్ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. 18 కంపెనీలకు మాజీ డిజిపి మనవరాలు డైరెక్టర్గా ఉన్నారు. ఈ నెల 13న ఆమె పేరు, ఫోటోతో ఉన్న వాట్సాప్ నెంబర్ నుంచి అకౌంటెంట్కు సైబర్ నేరగాళ్లు సందేశం పంపించారు. తాను మీటింగ్లో ఉన్నానని.. చెప్పిన ఖాతాకు రూ.1.20 కోట్లు పంపాలని పేర్కొన్నారు. కంపెనీ డైరెక్టర్ మెసేజ్ చేశారని భావించి రూ.1.20 కోట్లను అకౌంటెంట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నెల 17న మరోసారి డబ్బు పంపాలంటూ అకౌంటెంట్కు మళ్లీ వాట్సాప్ సందేశం వచ్చింది. డబ్బులు పంపేందుకు చెక్ అప్రూవల్ కోసం డెరెక్టర్ని అకౌంటెంట్ సంప్రదించారు. ఈ సందర్భంగా గతంలో చేసిన రూ.1.20 కోట్ల లావాదేవీ వివరాలను అకౌంటెంట్ వివరించారు. దీంతో తాను ఎలాంటి డబ్బు పంపమని చెప్పలేదని దివ్యారెడ్డి ఖంగు తిన్నారు. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Telangana : ఇక వరసగా బీజేపీ అగ్ర నేతల పర్యటనలు.. కారణమిదే
భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సిద్ధమవుతుంది
కనుమరుగవుతున్న ప్రకృతి సంపద.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని శాంతినగర్, నవాబుపేట, శివారులోని
Israel |గ్యాస్ సంక్షోభం నుంచి ఊరట….
Israel | గ్యాస్ సంక్షోభం నుంచి ఊరట…. Israel | ఆంధ్రప్రభ, వెడ్
పరకాలలో మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నేత పరామర్శ
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో ఇటీవల మరణించిన పలువురు కుటుంబాలను పరకాల పట్టణ
బ్రాహ్మణ వెల్లెంలతో నల్లగొండ సస్యశ్యామలం…
బ్రాహ్మణ వెల్లెంలతో నల్లగొండ సస్యశ్యామలం… నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : బ్రాహ్మణ వెల్లంల
Breaking : దానం నాగేందర్ పార్టీ మార్పుపై హైకోర్టుకు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు
SI Chandrasekhar |మొన్న భార్య… నేడు భర్త
SI Chandrasekhar | మొన్న భార్య… నేడు భర్త టూ టౌన్ ఎస్ఐ
Pezheshkian |మారుతున్న పరిస్థితులపై చర్చ
Pezheshkian | మారుతున్న పరిస్థితులపై చర్చ Pezheshkian | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్
సత్వర న్యాయం అందేలా చూడాలి సిరిసిల్ల, ఆంధ్రప్రభ : సమస్యలతో పోలీస్ స్టేషన్
పేదలకు గుడ్ న్యూస్... ఒకే సారి మూడు నెలల రేషన్
రేషన్ లబ్దిదారులకు కేంద్రం శుభవార్త అందించనున్నట్లు తెలుస్తోంది.
మొన్న హర్షిత్ దూరం.. తాజాగా కెకెఆర్కు మరో షాక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభం కావడానికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్రైడర్స్ జట్టుని గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే హర్షిత్ రాణా జట్టుకు దూరమయ్యాడు. తాజాగా కెకెఆర్కు మరో షాక్ తగిలింది. గత వేలంలో తీసుకున్న ఆకాశ్దీప్ కూడా లీగ్లో ఆడటం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆకాశ్దీప్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీలో చికిత్స పొందుతున్నాడు. ఐపిఎల్ ప్రారంభానికి కొద్ది రోజుల సమయమే ఉండటంతో అతడు ఈ లీగ్లో పాల్గొనడం కష్టమేనని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఆకాశ్కు గాయాలు కొత్తేమీ కాదు. 2022లో తొలిసారి ఐపిఎల్లో అడుగుపెట్టిన అతడు.. ఇప్పటివరకూ కేవలం 14 మ్యాచులు మాత్రమే ఆడాడు. గత సీజన్ వేలంలో ఆకాశ్ను కెకెఆర్ రూ.కోటికి సొంతం చేసుకుంది. అయితే హర్షిత్ రాణా గైర్హాజరీలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కెకెఆర్ కోచ్ అభిషేక్ నాయర్ అన్నారు. ఆకాశ్ దీప్కి ప్రత్యామ్నాయం గురించి మాత్రం ఆయన మాట్లాడలేదు.
Andhra Pradesh : రేషన్ కార్డులున్న వారికి గుడ్ న్యూస్
రేషన్కార్డు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఎర్రకట్ట స్పీడ్ బ్రేకర్ల పై జీబ్రా లైన్స్…… ఏవి?
ఎర్రకట్ట స్పీడ్ బ్రేకర్ల పై జీబ్రా లైన్స్…… ఏవి? 1.2 కిలో మీటర్
Will Prashant Kishor Switch Sides Again? Andhra Politics Heads for Strategic Battle
Political activity in Andhra Pradesh is already heating up as parties begin laying the groundwork for the 2029 elections. The ruling alliance and YS Jagan Mohan Reddy are both sharpening their strategies, each trying to outmanoeuvre the other well in advance. Jagan has been projecting confidence about a return to power, while also hinting at […] The post Will Prashant Kishor Switch Sides Again? Andhra Politics Heads for Strategic Battle appeared first on Telugu360 .
ఉమాదేవి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం..
విశాలాంధ్ర – నార్పల: మండల కేంద్రానికి చెందిన సాకే కృష్ణమూర్తి, కమలమ్మల కుమార్తె బుడగల ఉమాదేవి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె కుటుంబ సభ్యులు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఏడాది క్రితం స్వర్గస్తురాలైన ఉమాదేవి జ్ఞాపకార్థం నార్పల మండల కేంద్రం సమీపంలోని సత్యసాయి ఆశ్రమంలో నివసిస్తున్న చిన్నారులకు అన్నదానం నిర్వహించేందుకు రూ.4,000 నగదును అందజేశారు.దివంగత ఉమాదేవి భర్త, రాప్తాడు జర్నలిస్ట్ బుడగల శ్రీనివాసులు, కుమారుడు అక్షయ్ సాగర్, కుమార్తె నిత్యశ్రీలు కలిసి ఆశ్రమ నిర్వాహకులకు ఆర్థిక సహాయం […] The post ఉమాదేవి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం.. appeared first on Visalaandhra .
Breaking : కేంద్రం గుడ్ న్యూస్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వచ్చేస్తున్నాయ్
వాణిజ్య సిలిండర్ల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Andhra Pradesh : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్... పదవీ విరమణ వయసు పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాల ఉద్యోగుల కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

25 C