ఉగ్రవాదుల దాడి - ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి
పాకిస్తాన్ – శ్రీలంకలతో వచ్చే నెల జరగాల్సిన దేశీయ క్రికెట్ సిరీస్ నుంచి అఫ్ఘానిస్తాన్ వైదొలిగింది
K-Ramp Review – Humor Sparks in Second Half, but Story Runs Out of Fuel
K-Ramp Movie Review Telugu360 Rating: 2/5 Story: Kiran Abbavaram plays Kumar, a spoiled brat who performs miserably in EAMCET. His wealthy father pays a hefty donation to get him admitted into an engineering college in Kerala, where he goes along with his friend. There, Joy Mercy (Yukti) saves him from an accident, and their friendship […] The post K-Ramp Review – Humor Sparks in Second Half, but Story Runs Out of Fuel appeared first on Telugu360 .
Tirumala : తిరుమలలో నేటి రద్దీ ఎలా ఉందో తెలుసా?
తిరుమలలో భక్తుల భక్తుల రద్దీ కొనసాగుతుంది.
పిల్లలకు కానీ పెద్దలకు కానీ నీళ్ల విరేచనాలు వస్తే ఒఆర్ఎస్ ద్రావకం వాడాలి అనేది గత 30 ఏళ్లుగా ప్రాచుర్యం పొందిన ఒక వైద్య ప్రక్రియ. ఒఆర్ఎస్ ద్రావణంలో కొంత ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్ ఉంటుంది. దీని వలన ఎక్కువ వాటర్ అబ్జర్బ్ కావడం వలన డిహైడ్రేషన్ భారి నుంచి తప్పించుకోవడమే కాకుండా ఎలక్ట్రోలైట్స్ రిప్లేస్మెంట్స్ జరుగుతుంది. ఒకవేళ ఒఆర్ఎస్ ద్రావణం అందుబాటులో లేకుంటే నీళ్లలోకి కొంచెం ఉప్పు సోడాపొడి, నిమ్మకాయ రసం పిండుకొని తాగిన కానీ సరిపోతుంది. దానిలోకి ఒక స్పూను చక్కెర వేసుకోవాలి. కానీ చక్కెర మోతాదు ఎక్కువ అయితే ఆ మోషన్స్ ఇంకా ఎక్కువైపోయి డిహైడ్రేషన్ పెరిగిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. సరిగ్గా ఇదే విషయాన్ని ఓ పిల్లల వైద్య నిపుణురాలు గుర్తించింది. ఏమిటి అంటే కొందరు పిల్లలు ఒఆర్ఎస్ ద్రావకం తాగినా కానీ చనిపోతున్నారు. ఏమిటా ఒఆర్ఎస్ ద్రావకము అని చూస్తే అది అన్ని మెడికల్ షాపుల్లో అమ్ముతున్న ఒక బ్రాండెడ్ ద్రావకం. టెట్రా ప్యాక్ లో దానిని అమ్ముతూ ఉన్నారు. ఈ బ్రాండెడ్ ద్రావకం కూడా ఒఆర్ఎస్ అనే పేరుతో అమ్ముతూ దానిలో ఒక చిన్న లెటర్స్ లో దీనిని నీళ్ల విరేచనాలు వస్తే వాడరాదు అని రాశారు.. ఇందులో గ్లూకోజ్ కంటెంట్ చానా రెట్లు ఎక్కువ ఉండడమే కారణం. శివరంజని అనే హైదరాబాద్ కు చెందిన చిన్న పిల్లల డాక్టర్ ఇది కనుక్కొని దానిని పేరు మార్చుకోండి ఒఆర్ఎస్ అనేది డబ్ల్యు హెచ్ఒ రూల్ ప్రకారం దానిని దేనికంటే దానికి బ్రాండెడ్ గా ఉపయోగించరాదు. అని చెబితే ఎవరూ వినలేదు, దానికోసం ఆమె కోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించింది.. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎనిమిదేళ్ల న్యాయపోరాటం తర్వాత ఒక ఆర్డర్ పాస్ చేసింది ఒఆర్ఎస్ అనేది ఎటువంటి రూపంలో కూడా పేరును దేనికి సాఫ్ట్ డ్రింక్స్ కు ఉపయోగించరాదు.అది ఒక మందు అది ఒక కూల్డ్రింక్ కాదు అని వివరించింది. పిల్లల ప్రాణాల కోసం బాధపడి సామాజిక బాధ్యతగా ఎనిమిదేళ్లు న్యాయపోరాటం చేసిన ఆ శివరంజని చిన్నపిల్లల డాక్టర్ ను మనం అభినందిద్దాం. ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉండబట్టే మనకు కొంచెం న్యాయం జరుగుతోంది. లేకుంటే అందరూ నాకెందుకులే అని అనుకుంటే ఎంతోమంది సైలెంట్ గా చనిపోతూ ఉంటారు. కార్పొరేట్ కంపెనీల ధన దాహానికి బలి అయిపోతూనే ఉంటారు. నిజం అనేది నిష్టూరంగా ఉన్నా కానీ మొదట మన వాళ్లను ఎవరూ పట్టించుకోకపోయినా నిదానంగా అది బయటికి వస్తుంది అనేదానికి ఇదే ఉదాహరణ.. మీరేమంటారు? డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Exclusive: Prabhas lines up 7 New Films
Prabhas is the biggest and busiest pan-Indian actor of the country. He is juggling between the sets of some of the biggest projects and he has a heap of films lined up. The actor is shooting for Maruthi’s Raja Saab and the film releases in January 2026. He is also shooting for Hanu Raghavapudi’s Fauji […] The post Exclusive: Prabhas lines up 7 New Films appeared first on Telugu360 .
Bigg Boss Telugu 9: Dual Captaincy, and Fun Chaos Inside the House
This week’s Bigg Boss Telugu 9 episode was a rollercoaster — full of intensity, emotion, and laughter. The continuation of the captaincy task brought unexpected twists, emotional breakdowns, and light-hearted bonding moments, leaving audiences both entertained and surprised. Captaincy Task: Two Captains, One Tough Battle Bigg Boss announced a major twist — the house would […] The post Bigg Boss Telugu 9: Dual Captaincy, and Fun Chaos Inside the House appeared first on Telugu360 .
Telangana : బీసీ రిజర్వేషన్ల కోసం.. నేడు రాష్ట్ర బంద్
బీసీ రిజర్వేషన్ల కోసం నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది
పాక్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లు మృతి
కాబూల్: పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి చెందారు. పాక్టికా ప్రావిన్స్లో పాకిస్తాన్ వైమానిక దాడి జరిపింది. ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ల సహా 8 మంది చనిపోయారు. పాక్, శ్రీలంకతో ట్రైసిరీస్ ఆడేందుకువెళ్తుండగా ఈ దాడి జరిగింది. మృతి చెందిన క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్గా ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. విమానంలో క్రికెటర్లు ఉర్ఘున్ నుంచి షారానా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గత వారం రోజుల నుంచి పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో రెండు దేశాల సైనికులు కాల్పులు జరుపుకోవడంతో వందల మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో సైనికులు కూడా ఉన్నారు.
Andhra Pradesh : అనకాపల్లిలో మద్యం దుకాణాలు మూసివేత
మద్యం వ్యాపారం చేయలేమని యజమానులు అనకాపల్లి జిల్లాలో నిరసన తెలియజేశారు
హైదరాబాద్: తెలంగాణలో బిసి సంఘాల బంద్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ టిసి డిపోల ముందు బిసి సంఘాలు ఆందోళన చేపట్టాయి. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఆర్ టిసి బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. బిసి సంఘాలు, రాజకీయ పార్టీల పిలుపు మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలన్నీ మూసివేయాలని నిర్ణయించాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సైతం స్వచ్ఛందగా బంద్కు మద్దతు ప్రకటించి పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదిలావుండగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, వామపక్షాలతో పాటు తెలంగాణ ఉద్యోగుల జెఎసి బంద్ లో పాల్గొన్నాయి.
Hyderabad : హైదరాబాద్ - గోరఖ్ పుర్ రైలు రద్దు
హైదరాబాద్ - గోరఖ్ పుర్ మధ్య నడిచే రైలు రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు
Telangana Bandh : నేడు తెలంగాణ బంద్
తెలంగాణ వ్యాప్తంగా నేడు బంద్ ప్రారంభమయింది
ఛత్తీస్గఢ్లోని జగదల్పూరులో శుక్రవారం అత్యధిక సంఖ్యలో అజ్ఞాత నక్సలైట్లు లొంగిపొయారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఎదుట ఆయుధాలతో పాటు ఆత్మసమర్పణం చేసుకున్న వారిలో పలువురు కీలక సీనియర్ మావోయిస్టులు ఉన్నారు. ఇప్పుడు సరెండర్ అయిన వారిలో పార్టీ సీనియర్ సెంట్రల్ కమిటీ సభ్యులు తక్కెళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ అలియాస్ సతీష్ కూడా ఉన్నారు. దాదాపు కోటి రూపాయలకు పైగా రివార్డు ప్రకటితం అయి ఉన్న ఆశన్నతో పాటు మొత్తం 210 మంది వివిధ కేడర్స్కు చెందిన నక్సల్స్ ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారుల ముందు లొంగిపోయి, జనజీవన స్రవంతిలోకి తాము వస్తున్నట్లు ప్రకటించడం సంచలనాత్మకం , ఇదే దశలో మావోయిస్టుల ప్రాబల్య ఉద్యమం బీటలు స, తీవ్రస్థాయి బలహీనతకు అద్దం పటింది. అడవుల నుంచి వీరి తిరోగమనం సంకేతం అయింది. ఇప్పుడు లొంగిపోయిన వారిలో 110 మంది మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారు. 98 మంది పురుషులు వరుసగా వారి వారి పేర్లను అధికారులు పిలుస్తూ ఉండగా వచ్చి ఆయుధాలు వదిలి సరెండర్ అయ్యారు. మొత్తం 153 ఆయుధాలు వదిలిపెట్టారు. వీటిలో 19 ఏకె 47 రైఫిల్స్, 17 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 23 ఇన్సాస్లు, 303 రైఫిల్స్ 17 ఎన్ఎల్ఆర్ రైఫిళ్లు, 41 బోర్ షాట్గన్లు, పిస్టల్స్, నాలుగు కార్బైన్లు ఉన్నాయి ఇప్పటి వరకూ రాష్ట్రంలో నక్సల్స్ చరిత్రలో ఇది సామూహిక సరెండర్ ఘట్టం అయిందని అధికారులు తెలిపారు. కాగా ఈ శుక్రవారం ఓ చారిత్రక దినం అని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ స్పందించారు. ఇప్పటి సరెండర్లతో రాష్ట్రంలో గత మూడురోజులలో లొంగిపోయిన నక్సలైట్ల సంఖ్య 238కి చేరుకుంది. బుధవారం వేర్వేరు చోట్ల 28 మంది వరకూ లొంగిపోయారు. ఇప్పటి లొంగుబాట బస్తర్ ప్రాంతానికే కాకుండా యావత్తూ ఛత్తీస్గఢ్కు తద్వారా మొత్తం దేశానికి ఒక కీలక మైలురాయి అవుతుందని తెలిపారు. బస్తర్ జిల్లా ప్రధాన కేంద్రపట్టణం జగదల్పూరులో నక్సల్స్ తమ ఆయుధాలను పోలీసులు, పారామిలిటరీ దళాల అధికారులకు అప్పగించారు. సరెండర్ ప్రక్రియ వేదిక వెనుక బ్యానర్లో అడవిబాట నుంచి జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టులకు స్వాగతం అని స్థానిక గిరిజన భాషలో రాసి ఉంచారు. దేశంలో వామపక్ష తీవ్రవాదం పూర్తి స్థాయి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో సాగిస్తున్న పోరులో ఈ సరెండర్ ముఖ్య అధ్యాయం అయింది. లొంగిపోయిన నక్సల్స్ బృందంతో స్థానిక గిరిజనుల తెగల నేతలు, కొండదేవతల పూజారులు కూడా నిలబడి ఫోటోలు దిగారు. వారికి గులాబీలు అందించారు. నూతన ఆరంభానికి, శాంతియుత జీవిత ఆకాంక్షలతో స్వాగతం పలికారు. ఆ తరువాత సీనియర్ పోలీసు అధికారులు , పారామిలిటరీ అధికారులతో కలిసి గిరిజన తెగలతో కలిసి మరో ఫోటో దిగారు. నక్సలైట్ల లొంగుబాటు కోసం బస్తర్ పోలీసు అధికార యంత్రాంగం చాలారోజుల క్రితమే పునరావాస కార్యక్రమం పునామార్గెంను చేపట్టింది. ఈ పథకం పరిధిలో లొంగిన వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలకు హామీ ఇచ్చారు. లొంగుబాట్ల తరువాత సిఎం విష్ణుదేవ్ ఇక్కడనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ లొంగిపోయిన కేడర్కు సాధారణ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానం అని ప్రకటించారు. ఇంతకాలం తప్పుడు బాట పట్టిన వీరు సమాజానికి దూరం అయ్యారని, ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి రావడం సంతోషకరం అని తెలిపారు.రాజ్యాంగం పట్ల విధేయతను, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అవలంభించేందుకు ముందుకు వచ్చారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునారావాస, లొంగుబాట్ల పథకంలో లోంగిన వారికి పలు విధాలుగా మేలు జరుగుతుంది. వారికి ఆర్థిక సాయం ఉంటుంది. భూమి కల్పిస్తారు. నూతన పారిశ్రామిక విధానం పరిధిలో చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఉపాది కల్పన ఏర్పాట్లు కూడా జరుగుతాయని, సరెండర్ అయిన వారికి తమ నుంచి పూర్తి స్థాయి ఆసరా ఉంటుందని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో మరింతగా నక్సల్స్ దళాలు సరెండర్ అవుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. లొంగిపోయిన సీనియర్ నేతల పేర్లు ఇప్పుడు లొంగిపోయిన నక్సల్స్లో అగ్రస్థాయి నక్సల్స్లో ఆశన్నతో పాటు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ (డికెఎస్జడ్సి) సభ్యులు భాస్కర్ అలియాస్ రాజ్మన్ మండవి, రణిత , రాజు సలాం, ధనూ వెట్టి అలియాస్ సంతూ ఉన్నారు. ఇక ఈ సీనియర్ల జాబితాలోనే ప్రాంతీయ కమిటీ సభ్యులు రతన్ ఎలామ్ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పుడు లొంగిపోయిన నక్సల్స్ బృందం తమకు తాముగా 11 బారెల్ గ్రెనెడ్ లాంఛర్లను కూడా అప్పగించారు. దేశంలో నక్సలిజం సమస్యను పూర్తి స్థాయిలో 2026 మార్చి 31 నాటికి నిర్మూలించి తీరుతామని హోం మంత్రి అమిత్ షా ఇటీవలి కాలంలో పదేపదే చెపుతూ వస్తున్నారు.ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో ఇటీవలే పెద్ద ఎత్తున నక్సల్స్ అగ్రనాయకులు కేడర్తో పాటు సరెండర్ అవుతున్నారు. రెండు రోజుల క్రితం అత్యంత కీలక నక్సల్స్ నేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, అలియాస్ భూపతి 60 మందికి పైగా నక్సల్స్తో కలిసి మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్ ఎదుట గడ్చిరోలిలో లొంగుబాట పట్టారు. ఇప్పుడు రెండు మూడు రోజుల తీవ్ర ఉత్కంఠత నడుమ ఇప్పుడు ఆశన్న ఇతర కీలక కేడర్తో కలిసి సరెండర్కు దిగారు. బస్తర్ దాదాపుగా నక్సల్స్ విముక్తం అయిందని, ఇక మిగిలిన నక్సల్స్ ఎవరైనా ఉంటే లొంగిపోవల్సి ఉంటుంది. లేదా వారు ఇప్పటికీ గన్తోనే తిరుగుతూ ఉంటే తమ భద్రతా బలగాల తూటాలకు బలి కావడం తథ్యమని అమిత్ షా చెపుతూ తీవ్రస్థాయి హెచ్చరికలకు దిగుతూ వస్తున్న దశలోనే ఇప్పుడు ముందుగా మహారాష్ట్ర సిఎం ఎదుట అగ్రస్థాయి నేత, ఛత్తీస్గఢ్ సిఎం ముందు మరో టాప్ లీడర్ సరెండర్ కావడం కేంద్ర హోం శాఖ కీలక వ్యూహాత్మక కార్యాచరణ, ప్రత్యేకించి మావోయిస్టుల్లో తీవ్రస్థాయి భయాందోళనల దిశలో ముందుకు సాగే ప్రక్రియ అని వెల్లడైంది. లొంగుబాట ఆశన్నది తెలంగాణలోని ములుగు ప్రాంతం వరంగల్ ఫాతిమా కాలేజీ, ఆర్ఎస్యూ పూర్వరంగం నక్సల్స్ బలగం తరఫున పలు భీకర దాడులకు వ్యూహరచన సాగించిన ఇప్పుడు లొంగిపోయిన ఆశన్న స్వస్థలం తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. దాదాపు 60 సంవత్సరాల వయస్సున్న ఆశన్న 40 ఏండ్ల క్రితం అంటే తన 20 ఏండ్ల వయస్సులోనే పీపుల్స్ వార్ ఉద్యమం వైపు ఆకర్షితులు అయి అడవిబాట పట్టారు. తక్కెళ్లపల్లి వాసుదేవరావు అనబడే ఈ ఆశన్న విద్యాభ్యాసం ఎక్కువగా లక్ష్మిదేవిపేట ప్రభుత్వ స్కూల్లో సాగింది. తరువాత హన్మకొండ కాజీపేటలోని ఫాతిమా స్కూల్లో ఆ తరువాత వరంగల్లో కాకతీయ వర్శిటీలో చదివారు. ఎక్కువగా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కు నాయకత్వం వహించారు. తరువాతి క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. వరంగల్ కాలేజీల్లోనే ఆయనపై ఎక్కువగా విప్లవోద్యమ ప్రభావం పడింది, ఓ దశలో దండకారణ్య జోనల్ కార్యదర్శిగా రూపేశ్ పేరిట వ్యవహరించినప్పుడు ఆయన నిర్వహించిన దాడులు సంచలనాత్మకం అయ్యాయి. 999లో ఐపిఎస్ ఉమేశ్ చంద్ర , మరుసటి సంవత్సరం హోం మంత్రి మాధవరెడ్డి హత్య ఘటనల ప్రధాన వ్యూహకర్తగా , ప్రత్యేకించి జిలెటిన్ల ద్వారా పేలుళ్లకు దిగడంతో మెరుపుదాడుల కర్తగా పేరొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అంతకు ముందు నేదురుమల్లి జనార్దన రెడ్డిలపై భారీ స్థాయి పోలీసు బందోబస్తు , అత్యంత నిశిత నిఘా నడుమ కూడా బాంబులు పేల్చి హత్యాయత్నం జరిగిన ఘటనల్లో కూడా ఆశన్నదే కీలక పాత్ర అని నిర్థారణ అయింది. దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఆశన్న కోసం భద్రతాబలగాలు గాలిస్తూ ఉన్నాయి. ఇటివలికాలంలో మావోయిస్టుల్లో తనకు పైన ఉండే అగ్రస్థాయి నాయకుల వైఖరితో విసిగి వేసారి ఆయన సరెండర్కు నిర్ణయించుకున్నట్లు, ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో అణచివేతలు, పైగా తనకు కొన్ని వర్గాల నుంచి అందిన లొంగుబాటు దౌత్యం దశలోనే ఆయన ఇప్పుడు అదునుచూసుకుని ఇతరులతో పాటు లొంగుబాటుకు దిగినట్లు వెల్లడైంది.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర స్థానిక సం స్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామాలు చో టుచేసుకుంటున్నాయి. తాజాగా హైకోర్టులో మ రో పిటిషన్ దాఖలైంది. స్థానిక ఎన్నికలపై రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని సురేంద ర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న సిజె జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ను ప్రశ్నించింది. దీంతో బిసి రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ప్రభుత్వానికి లేఖ రాశామని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాది విద్యాసాగర్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహణపై స మాధానం చెప్పేందుకు ధర్మాసనం రెండు వారాల సమయం ఇచ్చింది. అనంతరం విచారణను 2 వా రాలకు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ వాదనలు వినిపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గత విచారణ సందర్భంగా ఆదేశించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని కోర్టు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను నిలుపుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వం మరోసారి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సైతం ఎన్నికలకు వెళ్లాలని సూచించింది కదా అని ధర్మాసనం గుర్తు చేసింది. దీంతో సుప్రీం కోర్టు మౌకికంగా చెప్పిందని, ఎక్కడా ఉత్తర్వుల్లో పేర్కొనలేదని ఇసి తరపు న్యాయవాది కొర్టుకు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి మూడు వారాల సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి రెండు వారాల గడువు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించి, తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 9 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీఓ ప్రకారమే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే హైకోర్టు ఈ జీఓని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టకుండానే అత్యున్నత న్యాయస్థానం సైతం రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేయడంతో రిజర్వేషన్ల పంచాయితీ అగమ్యగోచరంగా మారింది. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అటు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రాకపోతే పార్టీ పరంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కోరుతూ ఈ నెల 18 శనివారం చేపట్టిన తెలంగాణ బంద్కు భారీ ఎత్తు న మద్దతు పెరిగింది. అన్ని రాజకీయపార్టీలు, బిసి సంఘాలు, ప్రజా సంఘాలు ముక్త కంఠంతో మద్ద తు ప్రకటించాయి. బిసిలంతా ఏకమై తొలిసారి చే పడుతున్న రాష్ట్ర బంద్కు కనీవినీ ఎరుగని మద్దతు వస్తోంది. ‘బంద్ ఫర్ జస్టిస్’ నినాదంతో గతంలో జరిగిన సకల జనుల సమ్మెను గుర్తుకుతెచ్చేలా ఒకే మాటపై నిలబడి బంద్లో పాల్గొనేందుకు తె లంగాణ బీసీ జేఏసీ’ చైర్మన్ ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెం చిన రిజర్వేషన్లను రక్షించుకోవడానికి శనివారం చేపట్టే బంద్కు ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్, బిజె పి, బిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం టీజేఎస్, సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతోపాటు సామాజిక ఉద్యమ శక్తులైన ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఆదివాసి, గిరిజన, మైనార్టీ సంఘాలు, అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బిసి సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలన్నీ మూసివేయాలని నిర్ణయించాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సైతం బంద్కు మద్దతు ప్రకటించి పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదిలావుండగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, వామపక్షాలతో పాటు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ బంద్లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, మాల మహానాడు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ జేఏసీ నాయకులు రాజారాం యాదవ్ తదితరులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పల్లె నుండి పట్నం వరకు సంపూర్ణంగా బంద్ జరుగుతున్నందున రాష్ట్ర ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని బంద్ నిర్వాహక సంస్థలన్నీ ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. మద్దతు ప్రకటించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధికార కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం మాట్లాడుతూ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. బంద్ లో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారని వెల్లడించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని అన్నారు. రిజర్వేషన్లను అడ్డుకునే బీజేపీ ఎన్ని మాటలు చెప్పినా బీసీల హృదయాల్లో చోటు సంపాదించుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోందని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మధుయాష్కి గౌడ్ తెలిపారు. కొంతమంది కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం తదితర పరిణామాలతో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో ఇక క్షేత్రస్థాయి నుంచి, ప్రజల మమేకంతో పోరాటానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదనే పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీసీ సంఘాల పిలుపుతో శనివారం చేపట్టే రాష్ట్ర బంద్కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపింది. శుక్రవారం వివిధ విభాగాలలోని బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డిని, ఇతర జేఏసీ నాయకులను కలిసి బంద్ మద్దతు కోరారు. ఈ మేరకు బంద్కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. అలాగే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం నాడు నారాయణగూడ వైఎంసిఏ చౌరస్తా నుండి ఆర్టిసి క్రాస్ రోడ్ వరకు ఉదయం 11 గంటలకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. బంద్ విజయం కోరుతూ బిసి సంఘాల ర్యాలీ బంద్కు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ బీసీ సంఘాలు ఆల్ పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు. ఈ ర్యాలీలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, మాల మహానాడు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ జేఏసీ నాయకులు రాజారాం యాదవ్ పాల్గొన్నారు. అలాగే 42 శాతం రిజర్వేషన్ న్యాయబద్ధమైనది పేర్కొంటూ రాష్ట్ర బంద్ కు ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక పూర్తి మద్దతు తెలిపింది. నేడు సకలం బంద్: జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బంద్తో రాష్ట్రంలో సకలం బంద్ చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించడానికి తొలిసారిగా బీసీ బంద్కు మద్దతుగా ఇటు లెఫ్టిస్టులు ఆటో రైటిస్టులు, ఇంకొక వైపు లౌకిక శక్తులు సామాజిక శక్తులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ’బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతునివ్వాలని కల్వకుంట్ల కవితను కోరిన కృష్ణయ్య తెలంగాణ బీసీ జేఏసీ’ చైర్మన్ ఆర్. కృష్ణయ్య ’బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతునివ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కోరారు. ఈ మేరకు ఆమె నివాసానికి వెళ్లిన కృష్ణయ్యతో కవిత మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటిం కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీలకు అర్హత లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్లో పాల్గొంటోందని తెలిపారు. అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ముందుండి పోరాడుతున్న తెలంగాణ జాగృతి బంద్ కు సంపూర్ణ మద్దతునిస్తోందని ప్రకటించారు. ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహిస్తారని, ఈ మానవహారంలో కవిత పాల్గొంటారని జాగృతి వర్గాలు తెలిపాయి. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు: డిజిపి శివధర్రెడ్డి రాష్ట్రంలో 42 శాతం బిసి రిజర్వేషన్ల కోసం వివిధ పార్టీలు, ప్రజా సంఘా లు, బిసి సంఘాలు శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు బంద్ పరిస్థితులను పర్యవేక్షిస్తాయని డిజిపి శుక్రవారం స్పష్టం చేశారు. బం ద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సూచించారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిజిపి కోరారు.
వాషింగ్టన్: ట్రంప్ రెండోసారి అధికారంలోకి వ చ్చినప్పటి నుంచి అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ డైవర్సిటీ వీసా (డీవీ) లాటరీలో పాల్గొనేందుకు భారతీయులకు 2028 వరకు అవకా శం లభించదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమంలో గత ఐ దేళ్లలో అమెరికాకు తక్కువ వలసలు ఉన్న దేశాల దరఖాస్తుదారులను ఎంచుకుంటున్నట్టు తెలిపా యి. ఏటా 50వేల మంది లోపు అమెరికాకు వల స వచ్చే దేశాలకే అవకాశం ఇస్తున్నట్టు సమాచా రం. అమెరికాలో అన్ని దేశాలకు చెందిన వలసదారులకు అవకాశం ఇవ్వాలనే లక్షంతో ఇ లాంటి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వీసా లాటరీలో పాల్గొనడానికి అనుమతి ఉన్న దేశాలకు తాజా వీసా కేటాయింపులను ప్రకటించారు. గత కొన్నేళ్లుగా భారత్ నుంచి అమెరికాకు అధికంగా వలసలు ఉండడంతో భారతీయులకు ఈ వీసా కార్యక్రమానికి కావాల్సిన అర్హత పరిమి తి మించిపోయిందని, అందువల్లే ఈ లాటరీలో పా ల్గొనడానికి వారికి అవకాశం ఇవ్వట్లేదని సం బంధిత అధికారులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో , 93,450 మంది భారతీయులు అమెరికాకు వలస రాగా, 2022 లో ఈ సంఖ్య 1,27,010 గా ఉంది. ఇది అమెరికాకు వస్తున్న దక్షిణ అమెరికన్ (99,030), ఆఫ్రికన్ (89,570). యూరోపియన్ (75.610) వలసదారుల సంఖ్య కంటే ఎక్కువ. 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వల స వచ్చారు. ఈ రికార్డుల ఆధారంగా 2028 వర కు భారతీయులను యూఎస్ డైవర్సిటీ వీసా లా టరీలకు అనర్హులుగా నిర్ణయించినట్టు తెలిపింది. ఇప్పటికే ఇమిగ్రేషన్ విధానంలో అమెరికా తీసుకుంటున్న కఠిన చర్యలతో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. ఈ లాటరీకి 2026 వరకు అర్హత సా ధించని ఇతర దేశాల్లో చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్థాన్ ఉన్నాయి. వలసదారుల పెరోల్ ఫీజు 1,000 డాలర్లు పెరోల్ ఫేజుపై అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో కొన్ని రకాల వలసదారులకు అవసరమయ్యే పెరోల్ ఫీజును 1000 డాలర్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది. వీసా లేదా ఇతర అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించడానికి , ఉండడానికి పెరోల్ అనేది తాత్కాలిక అనుమతి. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనిపై విదేశీయులను అమెరికా లోకి అనుమతిస్తారు. ఇటీవల ట్రంప్ ప్రవేశ పెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఈ పెరోల్ ఫీజును తప్పనిసరి చేశారు. ప్రస్తుతం దీని ఆధారంగా అమెరికా లోకి ప్రవేశించాలంటే విదేశీయులు 1000 డాలర్ల పెరోల్ రుసుమును చెల్లించాలి. వీటిలో ప్రారంభ పెరోల్, రీ పెరోల్, పెరోల్ ఇన్ ప్లేస్ లేదా డీహెచ్ఎస్ కస్టడీ నుంచి పెరోల్ వంటివి ఉంటాయి. ఈ రుసుము ఇప్పటికే ఉన్న ఏదైనా ఇతర ఇమిగ్రేషన్ సర్వీస్ ఫైలింగ్ లేదా బయోమెట్రిక్ రుసుమును అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్ అధికారులు సూచించిన సమయం లోపు ఈ రుసుమును చెల్లిస్తేనే పెరోల్ పొందడానికి అనుమతినిస్తారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ దండుపాళ్యం ముఠాలా మా రిపోయిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు ఎద్దేవా చేశా రు. మంత్రుల పంచాయితీలు పరిష్కరించడానికే కేబినెట్ సమావేశాలు పె డుతున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒ కరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్ల కోసం, కబ్జాల కోసం ఒకరు అని మంత్రులు వర్గాలుగా విడిపోయారని ఆరోపించారు. కేబినెట్ భేటీలో మంత్రులు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కేబినెట్ ఆర డజను వర్గాలుగా విడిపోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అతుకుల బొంతగా తయారైందని అన్నారు. కేబినెట్ సమావేశంలో ప్రజలకు సంబంధించిన అంశాల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతారు అనుకున్నామని చెప్పారు. దసరాకు మొండి చేయి చూపారు, దీపావళి కానుకగా ప్రజలకు ఏదైనా తీపి కరుబు చెబుతరేమో అనుకున్నామని...కానీ, తీవ్ర నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చిందని ఆరోపించారు. వ్యాపారవేత్తలపై తుపాకులు ఎక్కుపెట్టే సంస్కృతిని రేవంత్ హయాంలో తీసుకొచ్చారని ఆక్షేపించారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా.. కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారని ఆక్షేపించారు. కెసిఆర్ హయాంలో నీళ్లు, నిధుల వాటాలు సాధించామని ఉద్ఘాటించారు. రేవంత్రెడ్డి హయాంలో మాత్రం అవినీతి వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలు, సినిమా ఇండస్ట్రీ, కాంటాక్టర్లను కాంగ్రెస్ నేతలు బెదిరించి లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ ఉద్యోగాల్లో 95 శాతం లోకల్ రిజర్వేషన్ సాధించారని, నీళ్లలో, నిధుల వాటా కోసం కొట్లాడారని చెప్పారు. కానీ, ఇప్పుడు మంత్రులు కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం, అక్రమ వసూళ్లలో వాటా కోసం మంత్రులు కొట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసం డిపార్టుమెంట్లే రద్దు చేస్తున్నారని అన్నారు. పారిశ్రామిక వేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సినిమా హీరోలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తప్పిదాల వల్ల టిఎస్ఐపాస్ వచ్చిన తర్వాత గత ఎనిమిదేళ్లలో అతి తక్కువ పరిశ్రమలు, పెట్టుబడులు రేవంత్ రెడ్డి హయాంలో వచ్చారని అన్నారు. 2024-25లో కేవలం 2049 పరిశ్రమలు, 50 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని, ఇది టిఎస్ఐపాస్ ఏర్పడిన తర్వాత అతితక్కువ పెట్టుబుడులు అని పేర్కొన్నారు. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ ఘన కార్యం అని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం టిఎస్ఐపాస్ తెచ్చి అనుమతులు సులభతరం చేశామని, రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చామని చెప్పారు. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వర్షం కురుస్తుంటే కెటిఆర్ స్వయంగా గొడుగుపట్టి ఆహ్వానించారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి సిఎం రేవంత్రెడ్డిపై కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేశారని హరీష్రావు గుర్తుచేశారు. మంత్రి కుటుంబ సభ్యుల ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించారని, ముఖ్యమంత్రే స్వయంగా జపాన్ నుంచి ఫైల్ ఆప్పించారని, ఒక మంత్రి టెండర్ వేయవద్దని తమకు హుకుం జారీ చేశారని, టెండర్ దక్కలేదని డిపార్ట్మెంట్నే మార్చివేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రే తమ్ముళ్ల కోసం ఫైల్స్ ఆపుతున్నారని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే కాంగ్రెస్, బిజెపి మధ్య అక్రమ సంబంధం ఉందని భావించాల్సి ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లు ఎందుకు నోరు మెదపటం లేదు..? అని నిలదీశారు. ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుతారు..? రేవంత్రెడ్డి హయాంలోని 23 నెలల్లో ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుతారు..? అని హరీష్రావు ప్రశ్నించారు. తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినందుకా... కమీషన్ల కోసం కేబినెట్లో గల్లాలు పట్టుకొని కొట్టుకున్నందుకా... మంత్రుల మధ్య తగాదాలు జరుగుతున్నందుకా... ఏం సాధించామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమవుతుంది..? నిలదీశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందని అన్నారు. అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా మోసం చేసినందుకు విజయోత్సవాలు జరుపుతారా..? అని ప్రశ్నించారు. నెలకు రూ. 2500 ఇస్తారేమోనని మహిళలు ఎదురు చూశారు..కానీ, కేబినెట్ భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయని వర్గం లేదని ఆరోపించారు. రైతుబంధు ఇవ్వనందుకు, రుణమాఫీ చేయనందుకు ఉత్సవాలు జరుపుతారా.. గురుకులాల్లో పిల్లలు పిట్టల్లా రాలుతున్నందుకు ఉత్సవాలు జరుపుతారా.. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా..? అని నిలదీశారు. పారిశ్రామిక వేత్తలు, పేదలకు బిఆర్ఎస్ అండగా ఉంటుంది పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేత్తలకు, సినిమా పెద్దలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పేదలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీష్రావు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకురావాలని, తాము కాపాడుతామని వ్యాపారులకు చెప్పారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల కోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని అన్నారు. డిజిపి శివధర్ రెడ్డి కాకీ బుక్లో మంత్రులకు రూల్స్ వేరేలా ఉన్నాయా..? అని ప్రశ్నించారు. టెండర్లు వేయొద్దని మంత్రులు బెదిరిస్తుంటే.. ముఖ్యమంత్రి సన్నిహితులు తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే వారి మీద కేసు లేదు. ఒక ట్వీట్కు రీట్వీట్ చేస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని హరీష్రావు ఆరోపించారు. హ్యాం పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తున్నారు హ్యాం పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తున్నారని హరీష్రావు విమర్శించారు. బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోతే జిఒ 53, 54లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేశారని అద్నరు. పేద, మధ్య తరగతి ప్రజలను రేవంత్రెడ్డి దొంగ దెబ్బ కొట్టారని మండిపడ్డారు. లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల రక్తం పీల్చుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హ్యాం మోడల్ అనేది ఒక బోగస్ అని, దాని పేరు చెప్పి కమీషన్లు దండుకోవడమే తప్ప ప్రభుత్వం చేస్తున్నదేం లేదని విమర్శించారు. హ్యాం మోడల్పై బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని హెచ్చరించారు.
ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
` ఆయనతో పాటు 208మంది సభ్యులు కూడా.. ` భారీగా ఆయుధాలు అప్పగింత ` పునరావాసానికి ఏర్పాట్లు చేస్తామన్న ముఖ్యమంత్రి ` మావోయిస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద …
కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగానే ఈ బంద్
` బీసీ బిల్లును అడ్డుకున్న పాపం బీజేపీదే ` దమ్ముంటే అఖిలపక్షాన్ని ఢల్లీికి తీసుకెళ్లాలి ` డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ ఖమ్మం,అక్టోబర్17(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ …
బీసీ రిజర్వేషన్ల సాధనకు నేడు రాష్ట్ర బంద్
` సంఫీుభావంగా అఖిలపక్ష, బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ` హాజరైన మందకృష్ణ, కోదండరాం ` బీసీ సంఘాలకు అన్ని పార్టీల మద్దతు ` బీజేపీ …
శనివారం రాశి ఫలాలు (18-10-2025)
మేషం - మీ పరపతి పెరుగుతుంది. అయినా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన విధంగానే అనుకూలిస్తాయి. కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. వృషభం - పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార పరమైన వ్యవహారాలలో గోప్యంగా వ్యవహరిస్తారు. మిథునం - వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఫలితాలు బాగుంటాయి. స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంటారు. యోగా మెడిటేషన్ ప్రకృతి వైద్యం పట్ల మక్కువ చూపిస్తారు. కర్కాటకం - బరువు బాధ్యతలు శుభకార్యాలు పూర్తి చేయడానికి అధిక ధనాన్ని వెచ్చిస్తారు. మీ కంపెనీకి ప్రజలలో నమ్మకం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మీరే ముఖ్య వ్యక్తి అవుతారు. సింహం - సాంకేతిక సిబ్బందికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిదని గ్రహిస్తారు. కన్య - భగవంతుడు అన్నీ ఇచ్చినా మిగతావి మనం చేసుకోవాల్సిన ముఖ్య కార్యక్రమాలు ఉన్నాయన్న భావంతో అవిశ్రాంతంగా శ్రమిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి రాజకీయపరమైన నిర్ణయాలు లభిస్తాయి. తుల - ఆర్థిక సంస్థలో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. మీ మంచితనాన్ని అసమర్ధతగా భావించిన వాళ్లు కీలక సమయంలో మీ చేతిలో భంగపడతారు. పుణ్యక్షేత్రాల సందర్శన. వృశ్చికం - నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థిక పరిస్థితి ఓ దారిన పడుతుంది. కొన్ని ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్టులు మీకు దక్కుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ధనుస్సు - ఆర్థిక పరిస్థితి ఓ మోస్తరుగా ఉన్న అవసరానికి ధనం చేతికంది వస్తుంది. విద్యా సంబంధమైన విషయాలలో మీరు కోరుకున్న పురోగతి లభిస్తుంది. అభివృద్ధి సంతృప్తికరంగానే ఉంటాయి. మకరం - చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్ని విషయాలు అరమరికలు లేకుండా పంచుకుంటారు. ఉన్నత స్థానాలను మేదస్సుతో సాధిస్తారు. దైవభక్తి శ్రద్ధ కలిగి ఉంటారు. కుంభం - అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏ పని చేయలేరు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగంలో బదిలీ మీ అభిష్టానికి వ్యతిరేకంగా జరుగును. ముఖ్యమైన బాధ్యతలను స్వీకరిస్తారు మీ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు. మీనం - శత్రువులు సమస్యలను సృష్టించిన అధిగమిస్తారు. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు.
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 18-10-2025
పాలు, బ్రేక్ఫాస్ట్ తో పాటు మెరుగైన వసతులు
రాష్ట్రంలోని విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో, వచ్చే విద్యా సంవత్సరం (2026
యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన
ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో స్వామివారికి లక్ష పుష్పార్చన పూజ మహోత్సవాన్ని శాస్త్రోక్త్తంగా వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు , అర్చక బృందం లక్ష పుష్పార్చన పూజ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ పుష్పాలతో స్వామివారిని అర్చిస్తూ నిర్వహించిన పూజను భక్తులు సేవించి దర్శించుకున్నారు. అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం ... యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీ ఆండాలమ్మకు అత్యంత ప్రీతికరమైన శుక్రవారం రోజు కావడంతో శాస్త్రక్తంగా ఊంజల్ సేవా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సాయంత్రం అమ్మవారిని ప్రత్యేక అలంకరణ గావించి ఆలయ అర్చకులు వేద పండితులు వేదమంత్రాలు ఉచ్చరిస్తుండగా మేళతాళాల మధ్య ఆలయ తిరువేదులలో ఊరేగించారు. ఆలయ ప్రకారం లోపల అద్దాల మండపంలో అమ్మవారిని కొలువు తెచ్చి ఊంజల్ సేవ మహోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. సేవా మహోత్సవంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి దీపారాధనతో దర్శించుకున్నారు. శ్రీవారి నిత్యారాబడి....
ధనత్రయోదశి, వివాహాల సీజన్లో కొత్త గరిష్టాలు..
ముంబై: ధనత్రయోదశి, దీపావళి పండుగల ముందు బంగారం ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా కొత్త
. నాలుగు డీఏలు పెండిరగ్. పీఆర్సీ, ఐఆర్, పెండిరగ్ సమస్యలనేకం. 17 నెలలుగా కనీసం చర్చించని సర్కార్. ప్రభుత్వ ఉద్యోగుల తీవ్ర అసహనం. పోరాటం తప్పదంటున్న సంఘం నేతలు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: దీపావళి పండుగ సమీపిస్తున్నా కరువు భత్యం(డీఏ) చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగులలో అసహనం వ్యక్తమవుతోంది. ప్రతి ఆరునెలలకు డీఏ విడుదల చేయడం సాధారణ పద్ధతి అయినా… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతున్నా ఆ దిశగా చర్యలు […] The post దీపావళికీ నిరాశే appeared first on Visalaandhra .
Siddu Jonnalagadda’s Telusu Kada Movie Review
Telusu Kada Movie Review Telugu360 Rating: 2.25/5 Siddu Jonnalagadda picked up a breezy romantic entertainer titled Telusu Kada. The film marks the debut of costumer Neeraja Kona as director and Rashi Khanna, Srinidhi Shetty are the leading ladies. Siddu Jonnalagadda said that Telusu Kada marks a new trend after the film’s release. Thaman is the […] The post Siddu Jonnalagadda’s Telusu Kada Movie Review appeared first on Telugu360 .
విలువ జోడిస్తే…మైనింగ్లో మెరుపులే !
రూ.30 వేల కోట్ల ఆదాయం ఆర్జించే అవకాశం. ఉచిత ఇసుక ప్రయోజనం అందరికీ దక్కాలి. తవ్వకాలపై శాటిలైట్, డ్రోన్లతో విశ్లేషణ. వడ్డెర్లకు మైనింగ్ లీజుల కేటాయింపుపై మార్గదర్శకాలు. గనులు, ఉచిత ఇసుక విధానంపై సమీక్షలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఖనిజాలకు విలువ జోడిరపుతో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఒడిశా లాంటి రాష్ట్రాల్లో వాల్యూ […] The post విలువ జోడిస్తే…మైనింగ్లో మెరుపులే ! appeared first on Visalaandhra .
. పన్ను వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం. పేరుకున్న బకాయిలు. ఆదాయం లేక కుంటుపడిన గ్రామాభివృద్ధి విశాలాంధ్ర-సచివాలయం: పల్లెల్లో పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం కారణంగా గ్రామాభివృద్ధి కుంటుపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,325 గ్రామ పంచాయతీలుండగా…దాదాపు సగం పంచా యతీల్లో పన్ను బకాయిలు భారీగానే పేరుకు పోయాయి. ప్రభుత్వం పన్ను వసూళ్లకు మెరుగైన చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి మారలేదు. పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడంతో పాటు పంచాయతీలకు రావాల్సిన ఆదాయం సకాలంలో రాకపోవడం వల్ల రహదారులు, తాగునీరు, […] The post పల్లె ప్రగతి తిరోగమనం appeared first on Visalaandhra .
హెచ్-1బీ వీసా ఫీజుపై ట్రంప్ సర్కార్కు షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయానికి ఆయన సొంత దేశంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై ఏకంగా లక్ష డాలర్ల (సుమారు రూ.88 లక్షలు) ఫీజు విధించాలన్న ఆయన ప్రతిపాదనను సవాలు చేస్తూ, దేశంలోని ప్రముఖ వాణిజ్య సంస్థ ‘యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్’ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు కొలంబియా జిల్లా కోర్టులో దావా దాఖలు చేసింది. ట్రంప్ సర్కార్ నిర్ణయం అమెరికా ఆవిష్కరణలను, పోటీతత్వాన్ని […] The post హెచ్-1బీ వీసా ఫీజుపై ట్రంప్ సర్కార్కు షాక్ appeared first on Visalaandhra .
అవసరమైతే రెండువైపులా యుద్ధం చేస్తాం
పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ఇస్లామాబాద్: సరిహద్దుల్లో భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోందంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఓ టెలివిజన్ ఛానెల్తో ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. అఫ్గాన్తో సరిహద్దు ఘర్షణల నడుమ భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా అందుకు ఆయన బదులిస్తూ… ‘కచ్చితంగా.. దాన్ని తోసిపుచ్చలేము. అందుకు […] The post అవసరమైతే రెండువైపులా యుద్ధం చేస్తాం appeared first on Visalaandhra .
కానిస్టేబుళ్ల ఫై దొంగ కత్తి తో దాడి..కానిస్టేబుల్ మృతి
కానిస్టేబుళ్ల ఫై దొంగ కత్తి తో చేసిన ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన నగరంలో వినాయక్ నగర్ లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. నగరంలోని హస్మి కాలనీ కి చెందిన ఓ నేరస్తుడు దొంగతనం కేసులో అనుమానితుడిగా భావించిన సీసీఎస్ కానిస్టేబుళ్లు విఠల్, ప్రమోద్ లు అదుపులోకి తీసుకోని బైక్ మీద శుక్రవారం సీసీఎస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సదురు అనుమానితుడు ఇద్దరు కానిస్టేబుళ్ల మీద కత్తి తో దాడి చేసి పారిపోయడు. కానిస్టేబుళ్లు ప్రమోద్ విఠల్ లకు గాయాలు కావడంతో వారిద్దరిని హుటాహుటిన చికిత్స కోసం ఆసుపత్రి కి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ చికిత్స పొందుతూ చనిపోయినట్లుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. మరో వైపు పారిపోయిన నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నారు.
జడేజా ఎమోషనల్ పోస్ట్ భారత క్రికెటర్ రవీంద్ర జడేజా తన సతీమణి రివాబా
నవంబర్ 11న విద్యాసంస్థలకు సెలవు..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: జూబ్లిహిల్స్ అసెంబ్లి నియోజకవర్గానికి నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనున్న
కర్ణాటక లోని కార్వర్కు చెందిన మత్సకారుడు అక్షయ్ అనిల్ మజలికర్ (24) అక్టోబర్ 14న సముద్రంలో బోటు అంచున ఉండగా, నీళ్లలో నుంచి ఎగిరి వచ్చిన ఒక చేప అతని కడుపులో పొడిచింది. ఈ చేప నోరు 10 అంగుళాల పొడవుతో మొన తేలి ఉండడంతో మత్సకారునికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం జరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత మృతి చెందాడు. ఆ చేప కందెరకమని చెబుతున్నారు. అనిల్ మృతికి వైద్యుల నిర్లక్షమే కారణమని అతని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
బంగ్లాదేశ్ - భారత్ మధ్య దౌత్య వివాదం
త్రిపురలో ఓ గ్రామంలో చొరబడి ముగ్గురు బంగ్లాదేశీయులు పశువులను దొంగిలించుకు పోతుండగా, అడ్డుకున్న గ్రామస్తుడిని చంపడంతో గ్రామస్తులు రెచ్చిపోయి వారు ముగ్గురినీ చంపివేశారు. అక్టోబర్ 15న జరిగిన ఈ ఘటన భారత -బంగ్లా మధ్య దౌత్యపరమైన వివాదానికి దారితీసింది. బంగ్లాదేశ్ ఈ ఘటన పై తీవ్ర నిరసన తెలిపింది. మృతులకు న్యాయం చేయాలని, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. బంగ్లా వాదనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కొట్టివేసింది.భారత భూభాగంలో 3 కిలోమీటర్ల దూరంలో బిద్యాబిల్ గ్రామంలో బంగ్లా అక్రమ వలసదారులు, పశువులను దొంగిలిస్తుండగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. వారిపై దొంగలు కత్తులతో దాడిచేసి, ఒకరిని చంపివేయడంతో స్థానికులు తమను తాము రక్షించుకునేందుకు వారితో ఘర్షణ పడి చంపివేశారని తెలిపింది. విషయం తెలిసి, అధికారులు ఆ గ్రామానికి చేరుకునేటప్పడికే ఇద్దరు చనిపోయారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. మృతదేహాలను బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జైస్వాల్ తెలిపారు.అక్రమ వలసదారులు కత్తులు, ఇతర ఆయుధాలతో స్థానిక గ్రామస్తులపై దాడిచేసి,ఒకరిని చంపివేయడంతో గ్రామస్తులు వారిని ప్రతిఘటించారని, ఘర్షణలో ఇద్దరు అక్కడికి అక్కడే, మరొకరు ఆస్పత్రిలో చనిపోయారని తెలిపారు. అక్రమ వలసలు ఆపేందుకు, స్మగ్లింగ్ ను అరికట్టేందుకు సరిహద్దుల్లో కంచెలను నిర్మించాలని జైస్వాల్ బంగ్లాదేశ్ కు సూచించారు.
బాసర పుణ్యక్షేత్రం చేరుకున్న శృంగేరి పీఠం జగద్గురు….
బాసర (ఆంధ్రప్రభ) : విజయ యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి బాసర శ్రీ
Priyadarshi criticised for his Choice of Films
Priyadarshi emerged as one of the most bankable and highest paid comedians of Telugu cinema. He soon switched paths to full-length roles. As a lead actor, Balagam and Court are the only impressive films that came from Priyadarshi and the Court’s content has been the major USP for the courtroom drama. He played lead roles […] The post Priyadarshi criticised for his Choice of Films appeared first on Telugu360 .
Pending Dues and DA: Big Announcement Likely Tomorrow in Andhra Pradesh
Andhra Pradesh government employees may finally hear the good news they’ve been waiting for. After several delays, the state is preparing to make a much-anticipated announcement that could bring relief to thousands of employees. While expectations were high during the previous Cabinet meeting, the announcement was postponed at the last minute. Now, with Diwali around […] The post Pending Dues and DA: Big Announcement Likely Tomorrow in Andhra Pradesh appeared first on Telugu360 .
‘శ్రమ్ శక్తి నితి2025’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే జాతీయ కార్మికఉపాధి విధానం ముసాయిదాను రూపొందిం చింది. ముసాయిదా విధానాన్ని చట్టంగా మార్చేముందు ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేసింది. న్యాయమైన, సమ్మిళితమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని సృష్టించడమే ఈ విధాన లక్ష్యమని మోదీ ప్రభుత్వం చెపుతోంది. కాకపోతే, ఈ ముసాయిదా విధానంలోని ప్రతి పేజీలోనూ ఏదో ఒక లోపం కన్పిస్తున్నప్పుడు, సమ్మిళిత శ్రామికశక్తిని ఇదెలా సృష్టిస్తుంది? మోదీ సర్కారు యథావిధిగా పెట్టుబడిదారీ విధానానికి […] The post శ్రమశక్తిని దోచుకోవడానికే! appeared first on Visalaandhra .
అదానీ-గూగుల్ డేటా సెంటర్ మనకు ఉపయోగమా?
చలసాని శ్రీనివాసరావు గూగుల్, అదానీ, ఎయిర్టెల్ కలిసి విశాఖపట్నంలో 1-గిగావాట్ మెగా డేటా సెంటర్ కాంపస్ (ఏఐ హబ్) పెడతారనే వార్తలు చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. రూ. 1.3 లక్షల కోట్లు అయిదు సంవత్సరాల్లో పెట్టుబడి పెడతారని, దీనివల్ల భారీగా ఉపాధి కల్పన జరుగుతుందని ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రైవేటీకరణే మా లక్ష్యం అని ప్రకటించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రత్యక్షంగా ఉద్యోగాలు డేటా సెంటర్లో […] The post అదానీ-గూగుల్ డేటా సెంటర్ మనకు ఉపయోగమా? appeared first on Visalaandhra .
పేదరిక నిర్మూలన విధానాలు అవశ్యం
జనక మోహనరావు దుంగ విశ్వగురువు’గా అవతరించడానికి భారతదేశం వేస్తున్న అడుగులు, ప్రపంచ వేదికపై సాధిస్తున్న ఆర్థిక వృద్ధి సాధిస్తే ప్రతి భారతీయుడికి గర్వకారణమే. మన దేశం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందని ప్రభుత్వం చెప్తోంది. అంతరిక్ష పరిశోధనలలో, సాంకేతిక రంగాలలో మన విజయాలు ప్రశంసనీయం. మెరిసే ఆకాశహర్మ్యాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, డిజిటల్ విప్లవం గురించి మనం గర్వంగా మాట్లాడుకుంటాం. అయితే, ఆర్థిక వృద్ధిలో, మన దేశంలో […] The post పేదరిక నిర్మూలన విధానాలు అవశ్యం appeared first on Visalaandhra .
రా బావ ఏంటి ఈరోజు ఊహల్లో ఊగుతూ ఈల వేసుకుంటూ వస్తున్నావు. అది సరేగాని నేనింకా 23 సంవత్సరాలు బతకాలని ఉంది. నా కొడుకు, మనవళ్లు ఆనందం చూసినాకెే మరణించాలని ఉంది. గతంలో ఇంద్ర లోకంలో అమృతం తాగి బతకాలనుకున్నంత కాలం బతికేవారట. ప్రస్తుతం ప్రభుత్వం అమ్మే మద్యం తాగి మధ్య వయస్కులే చనిపోతున్నారు. నాకు మాత్రం 2047 వరకు ఎంత ఖర్చు అయినా సరెే బతికి ప్రపంచంలోనే నంబర్ వన్గా మన రాష్ట్రం వెలిగే దశ […] The post ఇది మాయాలోకం…! appeared first on Visalaandhra .
Photos : Jatadhara Movie Trailer Launch
The post Photos : Jatadhara Movie Trailer Launch appeared first on Telugu360 .
Photos : Telusu Kada Movie Success Meet
The post Photos : Telusu Kada Movie Success Meet appeared first on Telugu360 .
సింగరేణి కార్మికులకు మరో శుభవార్త
దీపావళికి ముందు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. దీపావళి బోనస్ గా పిలుచుకునే పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (పిఎల్ఆర్) స్కీం బోనస్ కింద ఒక్కొక్క కార్మికునికి 1.03 లక్షల రూపాయల బోనస్ ను చెల్లింపునకు సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ఉద్యోగులందరికీ భట్టి విక్రమార్క దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయూత అందిస్తోందని పేర్కొన్నారు. దీపావళి బోనస్గా 400 కోట్ల రూపాయలను చెల్లించనున్నట్లు, ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1.03 లక్షలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తమ్మీద 39,500 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 18న (శనివారం) కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించనున్నట్లు సంస్థ ఛైర్మన్ , ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సింగరేణి నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మరింత అంకితభవంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు తన దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ బోనస్ సొమ్మును కుటుంబ అవసరాలకు సద్వినియోగం చేయాలని లేదా ప్రభుత్వ పొదుపు సంస్థల్లో పొదుపు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ దీపావళి బోనస్ కేవలం కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. అధికారులకు వర్తించదు. భూగర్భంలో 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనులు, సర్ఫేస్లో 240 మస్టర్లు పూర్తి చేసిన వారికి రూ 1.03 లక్షల పూర్తి బోనస్ అందుతుంది. అంతకంటే తక్కువ దినాలు పని చేసిన వారికి నిష్పత్తి ప్రకారం బోనస్ చెల్లిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో 30 మస్టర్లు పూర్తి చేసిన వారు ఈ బోనస్ పొందడానికి అర్హులు.
బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా.. ఇంటి యజమాని పై వివాహిత ఫిర్యాదు
బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టి కటకటాలపాలయ్యడు ఇంటి యజమాని. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...జవహర్నగర్, మధురానగర్కు చెందిన అశోక్ ఇంటిలో దంపతులు అద్దెకు ఉంటున్నారు. అక్టోబర్ 4వ తేదీన బాత్రూమ్లో బల్బు పాడైపోవడంతో ఇంటి యజమాని అశోక్, ఎలక్ట్రిషియన్ చింటూతో కలిసి కొత్తది ఏర్పాటు చేశాడు. హోల్డర్లో నిందితుడు సిసి కెమెరాలను అమర్చాడు. ఈ విషయం ఈ నెల 13వ తేదీన అద్దెకు ఉంటున్న దంపతులు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులపై అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్ను అరెస్టు చేయగా, ఎలక్ట్రిషియన్ చింటూ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎసిబి వలలో ఇద్దరు మత్స్యశాఖ అధికారులు
మత్స్యకారులకు మేలు చేయాల్సిన అధికారులు లంచాల కోసం వేధిస్తుండడంతో మత్స్యకారులు అవినీతి అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్ తో ఎసిబి అధికారులు విసిరిన వలలో వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధికారిణి నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ చిక్కుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ అవినీతి నిరోధక శాఖ డిఎస్పి సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... మాదన్నపేట మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్ 2023లో 124 మందికి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సభ్యత్వం ఖరారు కాకపోవడంతో అధికారులను ప్రశ్నించగా సభ్యత్వం నమోదు కావాలంటే హైదరాబాద్లోని పలు కార్యాలయాలతో ముడిపడి ఉందని మత్స్యశాఖ అధికారిణి నాగమణి తెలిపారు. కానీ నూతన సభ్యత్వాలు జిల్లాల పరిధిలోనే కేటాయించుకోవాలని 2025 ఆగస్టులో ప్రభుత్వం నుండి సర్కులర్ రావడంతో విషయం తెలుసుకున్న మత్స్యకారుల సంఘం ప్రెసిడెంట్ నర్సయ్య అధికారులను అడిగారు. నూతన సభ్యత్వాల కోసం ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ రూ.80 వేలు డిమాండ్ చేయగా డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ నాగమణికి ఫిర్యాదు చేశాడు. కానీ ఫీల్డ్ ఆఫీసర్ చెప్పిన డబ్బులను ఇస్తేనే నూతన సభ్యత్వాలు ఇస్తానని అధికారిణి నాగమణి చెప్పడంతో విసుగు చెందిన బాధితుడు ఎసిబి అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ హరీష్ రూ.75 వేలు రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి కోరిక మేరకే తాను మత్స్యకారుల సంఘం నుంచి లంచం తీసుకున్నట్లు హరీష్ ఒప్పుకున్నాడని, దీంతో వీరిద్దరినీ శనివారం కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు ఎసిబి డిఎస్పి సాంబయ్య తెలిపారు.
హీరోయిన్లు కేవలం గ్లామర్ డాల్: రాధిక ఆప్టే
హిందీ, తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్గా రాణించిన రాధిక ఆప్టే హీరోయిన్ల పట్ల జరిగే అన్యాయాన్ని వివక్షతను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాధిక ఆప్టే హీరోలను బాగా చూపిస్తూ.. హీరోయిన్లను తక్కువ చేసి చూపించే వారిపై మండిపడింది. ఆమె మాట్లాడుతూ.. “సినిమా కథలు ఎక్కువగా హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్గా చూపించడం వరకు మాత్రమే పరిమితం చేస్తారు. ఎప్పుడైనా సరే హీరోయిన్ హీరో వెనకాల ఉండేలా.. హీరోని కాపాడండి అని అడిగేలాంటి పాత్రల్లోనే చూపిస్తారు. హీరో ముందు ఉంటే హీరోయిన్ వెనకాల లేదా పక్కన నిల్చోవాలి అంతే. హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతారని అనుకుంటారు.. హీరోయిన్లను ఏ విధంగా వాడుకోవాలో కూడా తెలియడం లేదు”అని అన్నారు. అయితే రాధిక ఆప్టే చేసిన ఈ వ్యాఖ్యల్లో 100% నిజం ఉంది. ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా అందులో హీరోని ఎలివేట్ చేస్తూ హీరోయిజాన్ని చూపిస్తారు తప్ప హీరోయిన్ ని ఎవరు కూడా పట్టించుకోరు. కేవలం ఐటమ్ సాంగ్ లకు లేదా రొమాన్స్ చేసే పాత్రలకు మాత్రమే వారిని తీసుకుంటారు. మిగతా కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది.అందుకే రాధిక ఆప్టే ఇలాంటి కామెంట్స్ చేసింది.అయితే హీరోయిన్లను పెట్టి కూడా పవర్ ఫుల్ సినిమాలు తీయవచ్చని ప్రతిసారి ఈ అంశాన్ని ఎత్తి చూపుతుంది రాధిక ఆప్టే.
స్తంభంపల్లిలో దారుణం… జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ శివారులో విషాద
జపాన్ మాజీ ప్రధాని టోమిచి మురాయమా కన్నుమూత
తన దేశ దురాక్రమణకు గురైన ఆసియా బాధితులకు 1995లో ‘మురాయమా ప్రకటన’ ద్వారా క్షమాపణలు చెప్పిన జపాన్ మాజీ ప్రధాని టోమిచి మురాయమా శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 101 సంవత్సరాలు. జపాన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అధిపతి మిజుహో ఫుకుషిమా ప్రకటన ప్రకారం, మురాయమా తన స్వస్థలమైన నైరుతి జపాన్లోని ఓయిటాలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. 1994 నుంచి 1996 వరకు సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మురాయమా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ చర్యలకు చారిత్రాత్మక క్షమాపణలు తెలిపారన్నది గమనార్హం.
పరిగి అటవీ కార్యాలయంలో ఎసిబి దాడులు
వికారాబాద్ జిల్లా, పరిగి అటవీ శాఖ కార్యాలయంలో ఎసిబి అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఎసిబి డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరిగి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో సీతాఫలాల టెండర్లకు అనంతసాగర్ సమీపంలోని ఓ కాంట్రాక్టర్ రూ.15 లక్షలకు టెండర్లు వేయగా జిఎస్టి ఇతర ఖర్చులతో కూడిన మొత్తం రూ.18 లక్షల వరకు టెండర్లు దక్కించుకున్నాడు. సీతాఫలాలు అడవి, ఇతర ప్రాంతాల నుంచి తెంపి తరలించేందుకు ప్రతిరోజూ పర్మిట్లు అటవీ శాఖ అధికారులు ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా రూ.50 వేలు ఇవ్వాలని పరిగి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం సెక్షన్ ఆఫీసర్లు బి.సాయికుమార్,మహమ్మద్ మోహినుద్దీన్తో పాటు డ్రైవర్ బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఇందులో కాంట్రాక్టర్ పండ్లు తీసుకువెళ్లేందుకు రోజు వారి అనుమతులు పొందేందుకు రూ.50 వేలు ఇవ్వాలని సెక్షన్ అధికారులు డిమాండ్ చేశారు. అయితే, అంత డబ్బులు లేవని పండ్లు మురిగిపోతున్నాయని, అవి కుళ్లిపోతే తమకు నష్టం వస్తుందని బాధితుడు వారికి చెప్పాడు. దీంతో కనీసం రూ.40 వేలు అయినా లంచం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం బాధితుడు డబ్బులు తీసుకుని పరిగికి వచ్చినప్పుడు డ్రైవర్ సహాయంతో తీసుకున్నారు. వెంటనే సెక్షన్ అధికారులను ఎసిబి అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సెక్షన్ అధికారులతో పాటు డ్రైవర్పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్టు ఎసిబి డిఎస్పి తెలిపారు.
మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట..
ఏపీ మద్యం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి
రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
సిద్దిపేట జిల్లా, ములుగు తహసీల్దార్ కార్యాలయం వద్ద గల రాజీవ్ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్ రహదారి డివైడర్పై గడ్డి కటింగ్ చేస్తున్న ఇద్దరు కార్మికులను ఆర్టిసి గరుడ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ములుగు మండలం, కమలాబాద్కి చెందిన బోయిని సాయిలు (65), మర్కుక్ మండలం, పాములపర్తికి చెందిన లెంకల రాజమల్లు (55) అనే ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. కార్మికులను ఢీకొన్న బస్ గోదావరిఖని డిపోకు చెందినదిగా తెలిసింది. హైదరాబాద్ వైపు నుంచి గోదావరిఖనికి బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అతివేగంగా బస్ ను నడపడం ఈ ప్రమాదానికి కారణంగా తెలిసింది. ఘటనా స్థలానికి చురుకున్న పోలీసులు మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపడతున్నారు.
Pradeep Ranganathan’s Dude opens on a Strong Note
Pradeep Ranganathan has scored two resounding blockbusters like Love Today and Dragon. His recent offering Dude released in Telugu and Tamil languages today and the film opened on an impressive note. The film has been super strong in Tamil Nadu and dominated other releases. Across the Telugu states, Dude opened better than Siddhu Jonnalagadda’s Telusu […] The post Pradeep Ranganathan’s Dude opens on a Strong Note appeared first on Telugu360 .
51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
విజయవాడ (ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : 2025–26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 51
వృద్ధురాలి నుంచి రూ. 35.23లక్షలు దోచుకున్న సైబర్ నేరస్థులు
లండన్లో కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని వృద్ధురాలిని బెదిరించి రూ.35.23లక్షలు సైబర్ నేరస్థులు దోచుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...హైదరాబాద్కు చెందిన వృద్ధురాలు(61)కి వాట్సాప్ కాల్ వచ్చింది. బాధిత మహిళ కుమారుడు లండన్లో ఉంటున్నాడు. ఫోన్ చేసిన వ్యక్తి తాను డాక్టర్ స్టీవ్ రోడ్రీగుజ్ మాట్లాడుతున్నానని చెప్పాడు. సౌత్ మాంచెస్టర్ జనరల్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నానని చెప్పాడు. మహిళ కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాడు. తలకు తీవ్రగాయాలయ్యాయని, లగేజీ మిస్సయ్యిందని తెలిపాడు. ఆస్పత్రిలో అధికారికంగా చేర్చలేదని, అనదికారికంగా చేర్చామని చికిత్స కోసం వెంటనే డబ్బులు పంపించాలని చెప్పాడు. సైబర్ నేరస్థుడు చెప్పిన మాటలు నమ్మిన బాధితురాలు ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు పలు మార్లు రూ.35,23,070 ట్రాన్ఫ్ర్ చేసింది. మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో తన కుమారుడు చికిత్స పొందుతున్న ఫొటో చూపించాలని కోరింది. దానికి నిరాకరించిన సైబర్ నేరస్థులు బాధితురాలితో వాట్సాప్లో చేసిన ఛాటింగ్ను డిలీట్ చేశాడు . దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ నేరస్థులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఎంఐఎం మద్దతు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. పదేళ్లు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఆ పార్టీ అధికారంలోనూ ఉన్నప్పటికీ అభివృద్ధి జరగలేదని అసదుద్దీన్ విమర్శించారు. నియోజకవర్గంలో ఉన్న మురికివాడల్లో సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. సెంటిమెంట్ కంటే అభివృద్ధి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓట్లు సాధించిన గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 15 శాతం ఓట్లు మాత్రమే సాధించిందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.. బీఆర్ఎస్ ఓట్లన్నీ ఎంపీ ఎన్నికలలో బీజేపీకి మళ్లినట్లుగా స్పష్టమవుతోందని ఆయన విశ్లేషించారు. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా అసద్ స్పష్టం చేశారు. అయితే తాను ప్రచారంలో మాత్రం పాల్గొనబోనని విస్పష్టం చేశారు. త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయానికి ఎంఐఎం కార్యకర్తలు, నాయకులు సహకరించాలని కోరారు.
నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెప్తున్నా: మంత్రి సీతక్క
‘నా తల్లి తండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా, నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెపుతున్నా’ గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి రాద్దాంతం జరగలేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో రాద్దాంతం జరిగిందన్న అంశాన్ని బిఆర్ఎస్ నేత హరీష్రావు నిరూపించగలడా? అని ప్రశ్నించారు. క్యాబినెట్ అజెండా, ప్రజల సమస్యలు తప్పా ఇంకేమీ చర్చ జరగలేదని అన్నారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రి సీతక్క శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తన తల్లి తండ్రుల సాక్షిగా ప్రమాణం చేసి హరీష్ రావుకి సీతక్క సవాల్ విసిరారు. జరగని విషయాలను జరిగిందని మాట్లాడి హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విడివిడిగా సీఎంతో మాట్లాడినపుడు కూడా ఇతర మంత్రుల మీద చర్చ జరగలేదని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. అబద్ధానికి ఆరడుగుల సాక్ష్యం హరీష్ రావు అంటూ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలోనే రోడ్లపై అడ్వకేట్లను చంపింది బీఆర్ఎస్ నేతలేనని అన్నారు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్ఎస్ పార్టీనేనని మండిపడ్డారు. కేసీఆర్ ఫాం హౌజ్ కి పరిమితమైతే రేవంత్ రెడ్డి ప్రజా పాలన అందిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో తూతూ మంత్రంగా క్యాబినెట్ సమావేశాలు జరిగేవని అన్నారు.హరీష్ రావుపై కేసీఆర్ కూతురు కవిత అనేక విషయాలను బయట పెట్టారని, కవిత ఆరోపణలపై హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గన్ కల్చర్ తెచ్చిందే బీఆర్ఎస్. ఇబ్రహీం పట్నంలో రియల్ ఎస్టెట్ గొడవల్లో తుపాకులతో కాలిస్తే ఇద్దరు చనిపోయారని గుర్తు చేశారు. హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేట కేంద్రంలో సబ్ రిజిస్టార్ కార్యాలయ ఆవరణలో తుపాకితో కాల్పులు జరిపి 42 లక్షలు ఎత్తుకు పోయిన సంగతి మర్చిపోయారా..? అని నిలదీశారు. నాటి మంత్రులకు మాట్లాడే స్వేచ్చ లేదని అన్నారు అంతా పంజరంలో చిలుకలేనని, అయితే తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజలు స్వేచ్చగా మాట్లాడుకుంటున్నారని వివరించారు. గతంలో క్యాబినెట్ సమావేశాన్ని కెసిఆర్ నామమాత్రంగా మార్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పిస్తున్నారని అన్నారు.
దానికి ఇంకా చాలా టైం ఉంది.. ఇప్పడే ఆలోచించేది లేదు: అగార్కర్
ఇటీవలే ఆసియాకప్ విజేతగా నిలిచిన భారత్... ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్తో తలపడేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సిరీస్లో దాదాపు 7 నెలల గ్యాప్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మళ్లీ బ్యాట్ పట్టనున్నారు. దీంతో ఈ సిరీస్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు స్టార్లు.. 2027 ప్రపంచకప్ వరకూ జట్టులో కొనసాగాలని అంతా కోరుకుంటున్నారు. ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తాజాగా స్పందించారు. ప్రపంచకప్కి ఇంకా చాలా సమయం ఉందని.. ఇప్పుడే దాని గురించి ఆలోచించేది లేదని ఆయన అన్నారు. ‘‘ప్రస్తుతం భారత్.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ టీంలో రోహిత్, విరాట్ సభ్యులు. వారిద్దరూ అద్భుత ఆటగాళ్లను చాలాసార్లు చెప్పాను. జట్టుకు ఏది ముఖ్యమో అదే చేస్తాం. వన్డే ప్రపంచకప్కి ఇంకా రెండు సంవత్సరాల టైం ఉంది. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేము. ఇది కేవలం వారిద్దరి విషయంలోనే కాదు.. కుర్రాళ్లకు వర్తిస్తుంది. ఇప్పటికే పరుగుల పరంగానే కాకుండా చాలా ట్రోఫీలు గెలిచిన చరిత్ర వారిద్దరికి ఉంది. ఒక్క సిరీస్లో పరుగులు చేయనంత మాత్రాన పక్కన పెట్టేది లేదు. అలా అని భారీగా రన్స్ చేసినా వరల్డ్ కప్ గురించి ఇప్పుడే ఆలోచించేది లేదు. మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి’’ అని అగార్కర్ అన్నారు.
రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం
నల్గొండ (ఆంధ్రప్రభ) : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసు ఫ్లాగ్ డేను
మంథని, ఆంధ్రప్రభ : మంథని పట్టణంలో వ్యాపార పెట్టుబడుల పేరిట భారీ మొత్తంలో
బాసర ఆర్జీయూకేటీ వీసీకి సన్మానం
బాసర, (ఆంధ్రప్రభ) : బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్
Fact Check: Tamannaah, Samantha and Rakul Preet Not Registered as Jubilee Hills Voters
Tamannaah, Samantha and Rakul Preet Not Registered as Jubilee Hills Voters
ఏసీబీ వలకు చిక్కిన మత్స్య శాఖ అధికారి..
ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : వరంగల్ జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో రూ.75,000
ఖరీదైన వాచ్ను ధరించలేను#TeluguPost #telugu #post #news
ADB |డిసిసి చీఫ్ పదవి బొజ్జు పటేల్కే ఇవ్వాలి
ఉట్నూర్, (ఆంధ్రప్రభ) : అదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవిని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
రచ్చలేపుతున్న ‘కాంతార-1’.. కలెక్షన్లతో దూసుకుపోతుంది..
రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాంతార: ఛాప్టర్ 1’. 2022లో వచ్చి ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రచ్చలేపుతోంది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.717 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇందులో రూ.105 కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచ రాబట్టినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో కన్నడ సినిమాగా ‘కాంతార: ఛాప్టర్ 1’ నిలిచింది. ఈ లిస్ట్లో మొదటి స్థానంలో రూ.1200+ కోట్లతో ‘కెజిఎఫ్-2’ మొదటి స్థానంలో ఉంది. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ‘కాంతార: ఛాప్టర్ 1’ రిలీజ్ రోజే అత్యధిక వసూళ్లు (రూ.89+ కోట్లు) చేసిన కన్నడ సినిమాగా నిలిచింది. 24 గంటల్లో ‘బుక్ మై షో’లో 1.28 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ పోర్టల్లో ఈ ఏడాది ఈ రేంజ్లో టికెట్లు సేల్ కావడం విశేషం.
ములుగు, (ఆంధ్రప్రభ): జిల్లాలోని ములుగు రాజీవ్ రహదారి పై విషాదం చోటుచేసుకుంది. ఆర్టికల్చర్
ఆలయాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి..
వేములవాడ, (ఆంధ్రప్రభ) : రాజన్న ఆలయ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర
ఈ సిరీస్ మా వాళ్లకు అగ్నిపరీక్షే: వార్నర్
ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్లో తలపడేందుకు టీం ఇండియా ఆ దేశానికి వెళ్లింది. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా చాలా గ్యాప్ తర్వాత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడుతున్న సిరీస్ ఇది కావడంతో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సిరీస్ కోసం జట్లను ఎంపిక చేసిన విషయంలో సెలక్టర్లపై చాలానే విమర్శలు వచ్చాయి. అందులో సంజూ శాంసన్ని వన్డే జట్టులో ఎంపిక చేయకపోవడం ఒకటి. అయితే తాజా ఈ విషయంపై ఆసీస్ దిగ్గజ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. సంజూ శాంసన్, రింకూ సింగ్లపై ప్రశంసలు కురిపించాడు. సంజూ, రింకూలు జట్టులో తమ స్థానం సుస్థిరం చేసుకునేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ‘‘టిం ఇండియా టి-20 జట్టులో తమ స్థానం పదిలం చేసుకొనేందుక సంజూ, రింకూలు చాలా కష్టపడ్డారు. ఐపిఎల్లో అద్భుత ప్రదర్శనలు చేశారు. ముఖ్యంగా రింకూ ఐపిఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. భారత్లో ఇప్పటికే ఎందరో వరల్డ్క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు ఫియల్లెస్ యంగ్స్టర్లు కూడా వచ్చేశారు. ఇది భారత క్రికెట్కి శుభపరిణామం. ఆస్ట్రేలియాకు ఈ యువ ఆటగాళ్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియాకు అగ్ని పరిక్ష వంటిది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తొంభై వేల ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను’’ అని వార్నర్ అన్నాడు. అక్టోబర్ 19 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్, అక్టోబర్ 29 నుంచి ఐదు టి-20ల సిరీస్ జరుగనుంది.
Jublee Hills Bye Elections : జూబ్లీహిల్స్ ప్రజలు ముందుగానే ఫిక్సయిపోయారా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతుంది.
Dude Review : Lighthearted entertainer with a youthful vibe
Dude follows the story of Gagan (Pradeep Ranganathan) and his relative and childhood friend, Kundana (Mamitha Baiju). When Kundana falls in love with Gagan, he refuses — and vice versa. Another man, Pardhu (Hridhu Haroon), enters the picture, and unforeseen circumstances bring Kundana and Gagan together in marriage. The rest of the film delves into […] The post Dude Review : Lighthearted entertainer with a youthful vibe appeared first on Telugu360 .
తిరురపతి కలెక్టరేట్కు బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు
తిరుపతి: తిరుపతి కలెక్టరేట్కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కలెక్టరేట్ భవనాన్ని బంుతలో పేల్చేస్తామండటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్లో పేర్కొన్నారు. దీంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ బృందం రంగంలోకి దిగాయి. కలెక్టరేట్లోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్ ఛాంబర్తో పాటు కార్యాలయంలోని వివిధ శాఖలకు చెందిన గదులను పరిశఈీలించిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధరించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయ అధికారిక మెయిల్కు తమిళనాడు నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. గడిచిన 15 రోజుల్లో బాంబు బెదిపింపు మొయిల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది.
Midhun Reddy : ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డికి ఊరట
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది
Mega Prince Varun Tej has delivered a series of debacles which impacted his business. A couple of films got delayed and the actor was completely focused on Korean Kanakaraju. The actor completed major portions of the shoot of the film directed by Merlapaka Gandhi and he is on a paternity break. The actor will complete […] The post Varun Tej lines up a New Film appeared first on Telugu360 .
Telangana : రేపటి బంద్ కు కాంగ్రెస్ మద్దతు
రేపు బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది
ఉగ్రవాద సంస్థ ISI తో సంబంధమున్నఇద్దరు అరెస్టు
విశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి; ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి రాబడిన సమాచారం ఆధారంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ISI తో సంబంధమున్న ఉత్తర్ ప్రదేశ్ నివాసి సాజాద్ హుస్సైన్ , మహారాష్ట్ర నివాసి తౌఫీక్ ఆలం షేక్ లను ధర్మవరము పోలీసులు ఈనెల 16వ తేదీన అరెస్టు చేసినట్లు శ్రీ సత్య సాయి జిల్లా యస్.పి. సతీష్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారము జిల్లా పోలీసు కార్యలయం లోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్ లో ఈ కేసు వివరాలను […] The post ఉగ్రవాద సంస్థ ISI తో సంబంధమున్నఇద్దరు అరెస్టు appeared first on Visalaandhra .
క్యాన్సర్ చికిత్సకు ఎల్ఓసీ మంజూరు..
ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు
రిషి విద్యాలయ ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఋషి విద్యాలయంలో ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలలో భాగంగా, చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డీ భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్ స్వరూ కిరణ్ స్వరూప సింగ్ చేతులమీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి త్రీ మోడల్ లో శిశు కేంద్రీకృత విద్యాబోధనను అందిస్తూ, వ్యక్తంకర ,వ్యక్తం తగ్గత భేదాలను గుర్తిస్తూ వినూత్న బోధన చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక ను […] The post ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు appeared first on Visalaandhra .
కాకతీయ విద్యా నికేతన్ లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం
విశాలాంధ్ర -ధర్మవరం; ప్రపంచ ఆహార దినోత్సవమును పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శన గావించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నిర్మలాదేవి పాఠశాల డైరెక్టర్లు శెట్టిపి పద్మ ,శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు జింక్ ఫుడ్స్ కు దూరంగా ఉండవలెనని, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా 2025 ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా […] The post కాకతీయ విద్యా నికేతన్ లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం appeared first on Visalaandhra .
Cyber Crime : కొత్తదారుల్లో మోసానికి దిగుతున్న సైబర్ నేరగాళ్లు.. ఫేక్ యాక్సిడెంట్ పేరుతో ట్రాప్
సైబర్ నేరగాళ్లు కొత్త దారులతో మోసగించేందుకు సిద్ధమవుతున్నారు
మెగా రక్తదాన శిబిరమును విజయవంతం చేయండి..
రజిని హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్, రక్త బంధం ఆర్గనైజేషన్ సంస్థ.విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్లో ఈ నెల 21వ తేదీ పోలీస్ అమరవీరుల సంస్కరణ దిన సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం ధర్మవరం పోలీస్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రజిని హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్, రక్త బంధం ఆర్గనైజేషన్ నిర్వాహకులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బత్తలపల్లి లో తల సేమియా చిన్నారులు కు ప్రతినెల రక్తం ఎంతో […] The post మెగా రక్తదాన శిబిరమును విజయవంతం చేయండి.. appeared first on Visalaandhra .
‘లవ్ అండ్ బ్రేకప్’ అనే థీమ్తో హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రేమ, విరహం
మరోసారి దాతృత్వమును చాటుకున్న సందా రాఘవ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సంధర రాఘవ మరోసారి తన దాతత్వమును చాటుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని 27వ వార్డు వైయస్సార్ కాలనీకి చెందిన చేనేత కార్మికురాలు అన్నం రాజేశ్వరి గుండెపోటుతో మృతి చెందారు. ఐటీడీపీ టీం సభ్యులు ఆనంద్ రెడ్డి విషయం తెలియజేసిన వెంటనే చేనేత ప్రముఖులు టిడిపి నాయకులు సంద రాఘవ కు తెలియజేయగా, వారు అందుబాటులో లేనందున వారి తరఫున పదివేల రూపాయలు రాజేశ్వరి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం మీకు ఎల్లప్పుడూ అండగా […] The post మరోసారి దాతృత్వమును చాటుకున్న సందా రాఘవ appeared first on Visalaandhra .
మా హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యత ఇచ్చాం: హరీశ్ రావు
హైదరాబాద్: కాంట్రాక్టుల్లో వాటాల కోసం కాంగ్రెస్ నేతల మధ్య తగాదాలు వస్తున్నాయని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఈ ఏడాది అతి తక్కువ పరిశ్రమలు వచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లోహరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రుల పంచాయితీ చెప్పుకోవడానికే కేబినేట్ మీటింగ్ అని మంత్రులు గ్రూపులుగా విడిపోయారని, కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు. దండుపాళ్యంలో ముఠాకంటే అధ్వాన్నంగా మారిందని, కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సిఎం కెసిఆర్ ఢిల్లీకి తిరిగి లోకల్ రిజర్వేషన్ల వాట, నీళ్ల వాటాను సాధించారని కొనియాడారు. తమ హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. మీరు వ్యాపార వేత్తలకు తుపాకులు పెడుతున్నారని గన్ కల్చర్ తెచ్చారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ వాసికి రష్యాలో నరకం #telugupost #latestnews #viralvideo #indiangovt
బంద్ను విజయవంతం చేయాలి : బూడిద లింగయ్య యాదవ్
మునుగోడు, (ఆంధ్రప్రభ): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో,
పండుగ సీజన్కు లెగసీ విస్కీ ప్రత్యేక ప్యాక్స్
పండుగ సీజన్కు లెగసీ విస్కీ ప్రత్యేక ప్యాక్స్ హైదరాబాద్, ఆంధ్రప్రభ : బకార్డి
‘జటాధర’ ట్రైలర్ వచ్చేసింది.. అందరు యాక్టింగ్ కుమ్మేశారు..
హైదరాబాద్: స్టైలిష్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జటాధర’. ఫాంటసీ, హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ‘పూర్వం ధనాన్ని దాచిపెట్టి... మంత్రాలతో బంధనాలు వేసేవారు’ అనే డైలాగ్తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతోంది. ట్రైలర్లోని ప్రతీ షాట్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘ధనపిశాచి’ అనే పాత్రలో బాలీవుడ్ నటి సోనాక్షి నటన, నమ్రతా శిరోధ్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ నటన ఈ ట్రైలర్కే హైలైట్గా నిలిచాయి. సుధీర్ బాబు కూడా యాక్టింగ్ కుమ్మేశాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు గోస్ట్ హంటర్ పాత్రలో నటిస్తున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ట్రైలర్లో విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న విడుదల కానుంది.