SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

18    C
... ...View News by News Source

బుధవారం రాశి ఫలాలు (10-12-2025)

మేషం వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. వృషభం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తుల ఉండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిధునం అధికారులు అనుగ్రహంతో పదోన్నతుల పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. సహాయసహకారాలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కర్కాటకం ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం కొంత ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సింహం వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కన్య ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. తుల ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వృశ్చికం బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ధనస్సు మాతృ వర్గ బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మకరం సోదరుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. భాగస్వామి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుంభం వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. మీనం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కీలక సమయంలో సన్నిహితుల స్నేహితుల సలహాలు కలిసివస్తాయి. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.  

మన తెలంగాణ 10 Dec 2025 12:20 am

ఎన్టీఆర్, ఎంజీఆర్ మళ్లీ ఇప్పుడు వస్తే?

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మూవీ ‘అన్నగారు వస్తారు‘ ఈ నెల 12న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్, కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కార్తి మాట్లాడుతూ “70, 80 దశకాల్లోని మాస్ కమర్షియల్ సినిమాకు నివాళిలా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించారు. చిన్న స్థాయి నుంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్, ఎంజీఆర్ మనకు సూపర్ హీరోస్. అలాంటి వాళ్లు మళ్లీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ ఎంతో శ్రమకోర్చి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు”అని అన్నారు. హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ “దర్శకుడు నలన్ కుమారస్వామి ఈ చిత్రంలో ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ఆ వరల్డ్‌ను ఈ నెల 12న థియేటర్స్‌లో చూస్తారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబీ, సందీప్ కిషన్, మధుర శ్రీధర్ రెడ్డి, బన్నీవాస్, శశిధర్, శైలేష్ కొలను, రాహుల్ రవీంద్రన్, వివేక్ ఆత్రేయ, దేవ కట్టా, శివ నిర్వాణ, వెంకీ కుడుముల, రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 11:58 pm

గ్లోబల్‌ సమ్మిట్‌లో భారీ డ్రోన్‌ షోకు గిన్నిస్‌ రికార్డు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌

ప్రభ న్యూస్ 9 Dec 2025 11:33 pm

అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాలు..

ఆంధ్రప్రభ, విజయవాడ : పెట్టుబడులు తీసుకురావడంలో పోటీపడుతూ దేశంలోనే శరవేగంగా ఏపీ, తెలంగాణ

ప్రభ న్యూస్ 9 Dec 2025 11:12 pm

IND vs SA T20 |బోణీ అదిరింది…

కటక్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా సంచలన విజయంతో

ప్రభ న్యూస్ 9 Dec 2025 11:01 pm

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు

తొలి, మూడో విడత పోలింగ్ జరిగే గ్రామాలలో సెలవులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల కారణంగా పాఠశాలలకు వరుస సెలవులు లభించనున్నాయి. ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పాఠశాలల్లో ఏర్పాటు చేస్తుండటంతో, ప్రభుత్వం పలు దఫాలుగా సెలవులు ప్రకటించింది. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సుమారు ఆరు రోజుల పాటు విరామం దొరకనుంది. తొలి విడత పోలింగ్ నిర్వహణ, ఏర్పాట్ల కోసం డిసెంబర్ 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రెండో విడత ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 13, 14 తేదీల్లో జరగనుండగా, ఆ రోజులు రెండో శనివారం, ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు సాధారణ సెలవులుగానే ఉన్నాయి. మూడో విడత పోలింగ్ సందర్భంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పోలింగ్ సామగ్రిని సిద్ధం చేయడం, ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడం కోసం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 10:34 pm

Pension Cyber scam: నకిలీ బ్యాంకు అఫ్ బరోడా ప్రకటనతో రిటైర్డ్ Bank of Baroda ఉద్యోగి ఖాతా కి చిల్లు

Mehdipatnamలో 81 ఏళ్ల వ్యక్తి ఫిర్యాదు Bank of Baroda లోగోతో వచ్చిన ప్రకటనే మోసానికి కారణం

తెలుగు పోస్ట్ 9 Dec 2025 10:32 pm

11న టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా

ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 11న ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టిఆర్‌టిఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డిలు తెలిపారు. టిఆర్‌టిఎఫ్, ఎపిటిఎఫ్ (1938), ఐఫియా ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన విద్యా విధానం 2010 నిబంధనలో ఇన్ -సర్వీస్ టీచర్లకు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు. 2017లో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా 2010కి ముందున్న వారిని కూడా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 10:28 pm

Akhanda 2 Locks December 12 Release Date

The suspense is over. Nata Simham Nandamuri Balakrishna’s highly anticipated sequel Akhanda 2, directed by Boyapati Sreenu, is officially arriving in theatres on December 12th, while premiere shows are planned on 11th. Previously planned for a December 5 release, the film faced an unexpected delay. Now that all hurdles have been cleared, the team has […] The post Akhanda 2 Locks December 12 Release Date appeared first on Telugu360 .

తెలుగు 360 9 Dec 2025 10:27 pm

74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా.. భారత్ ఘన విజయం

తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు సౌతాఫ్రికా జట్టు కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 101 పరుగులు భారీ తేడాతో గెలుపొందింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టుకు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. ఓపెనర్ డిక్వాక్ డకౌటయ్యాడు. ఆది నుంచే టీమిండియా బౌలర్లు వికెట్లు తీస్తూ సౌతాఫ్రికాను కోలుకోకుండా దెబ్బ తీశారు.సౌతాఫ్రికా బ్యాటర్ లో బ్రేవిస్(22 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా టాప్ అర్డర్ బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 12.3 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 74 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. పాండ్యా, దూబేలు చెరో ఒక వికట్ తీశారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్ ల టీ20 సిరీలో 1-0తో ఆధిక్యం సాధించింది.

మన తెలంగాణ 9 Dec 2025 10:22 pm

గిన్నీస్ రికార్డు లో గ్లోబల్ సమ్మిట్ డ్రోన్ షో

భారత్ ఫ్యూచర్ సిటిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రోన్ షో గిన్నీస్ రికార్డుల్లోకెక్కింది. తెలంగాణ రైజింగ్..కమ్ జాయిన్ ద రైజ్ అనే అక్షరాల సమూహంతో డ్రోన్ షో నిర్వహించారు. ఈ డ్రోన్ షోలో తెలంగాణ రైజింగ్ 2047 లక్షాలను వివరించే విధంగా థీమ్‌లను ప్రదర్శించారు. మూడు వేల డ్రోన్లతో థీమ్ షో అతిధులను మైమరపింప చేసింది. మూడు వేల డ్రోన్లతో షో నిర్వహించడం ప్రపంచ రికార్డుగా గిన్నీస్ రికార్డులో నమోదు చేసి, గిన్నీస్ సంస్థ ప్రతినిధులు అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ఇప్పటి వరకు డ్రోన్లతో ఆకాశంలో అత్యంత పొడవయిన వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అబుదాబీ పేరిట ఉంది. ఈ సంవత్సరం (2025) నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2,131 డ్రోన్లతో హ్యాపీ న్యూయర్ అనే వాక్యాన్ని ప్రదర్శించి ఈ రికార్డు అందుకుంది. అంతకు మించిన సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించి గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో నిర్వహించిన అద్భుతమైన డ్రోన్ షో తెలంగాణ రైజింగ్ నినాదాన్ని గగనతలంలో ప్రదర్శించి ప్రపంచ రికార్డును అధిగమించింది.

మన తెలంగాణ 9 Dec 2025 10:20 pm

ఛాంపియన్: మనసుని హత్తుకునేలా ‘సల్లంగుండాలే...’ సాంగ్

ఫ్రెష్, ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ వెంచర్ ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ సల్లంగుండాలే రిలీజ్ చేశారు. వివాహానికి ముందు వధువు నిశ్శబ్దంగా కూర్చుని, తన ఇల్లు, గ్రామాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనతో బాధపడుతోంది. తండ్రి ఆమెను ఓదార్చడానికి వస్తాడు. అక్కడే పాట ప్రారంభమవుతుంది. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని అతను ఆశీర్వదించినప్పుడు కుటుంబం మొత్తం, గ్రామం వివాహ వేడుకల ప్రారంభాన్ని ఈ సాంగ్ అద్భుతంగా చూపించింది. ఈ పాటతో మిక్కీ జె మేయర్ మ్యాజిక్ సృష్టించాడు. సల్లంగుండాలే భావోద్వేగం, వేడుక రెండింటినీ కలిగి ఉన్న మరొక అద్భుతమైన పాట. చంద్రబోస్ సాహిత్యం, వివాహంలో జరిగే ప్రతి ఆచారం, భావోద్వేగాన్ని అందంగా చూపించింది. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన వధువు తల్లిదండ్రులుగా ఆకట్టుకోగా, రోషన్, అనశ్వర రాజన్ జోడి డ్యాన్స్ తో పాటకు ఉత్సాహాన్ని తెస్తారు. సల్లంగుండాలే సాంగ్ ప్రతి వివాహ వేడుకలో మ్రోగబోతుంది. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మన తెలంగాణ 9 Dec 2025 10:10 pm

ఆస్తి వివాదాలతోనే రియల్టర్ హత్య

సంచలనం సృష్టించిన రియల్టర్ హత్య కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆస్తి వివాదాలు, పాతకక్షలతోనే రియల్టర్ గంటా వెంకటరత్నంను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్‌లో వెంకటరత్నంను ఆరుగురు యువకులు సోమవారం ఉదయం హత్య చేసిన విషయం తెలిసిందే. ఎపిలోని విజయవాడకు చెందిన వెంకటరత్నం ధూల్‌పేట్‌కు చెందిన సుదేష్ సింగ్ వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. సుదేష్ సింగ్ గంజాయి, గుండుంబా, రౌడీయిజంతో నగరంలోని పలువురిని బెదిరిస్తూ డాన్‌గా ఎదిగాడు. ఇలా పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు, ఇలా వచ్చిన డబ్బులను తన వద్ద పనిచేస్తున్న బినామీల పేర్లపై ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అందులో వెంకటరత్నం పేరుపై కూడా వందల కోట్ల ఆస్తులు పెట్టినట్లు తెలిసింది. 2001లో సుదేష్ సింగ్‌ను ఎన్‌కౌంటర్ చేయడంతో అక్కడి నుంచి పారిపోయిన వెంకటరత్నం నగర శివారులో ఉంటున్నాడు. సుదేష్ సింగ్ తనను పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తాడని ముందుగానే తెలుసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సుదేష్ సింగ్ ఆచూకీ కోసం ఎంత వెతికినా పోలీసులకు దొరకకపోవడంతో వెంకటరత్నంపై ఒత్తిడి చేసి ఆచూకీ తెలుసుకున్నట్లు తెలిసింది. తర్వాత సుదేష్ సింగ్‌ను పట్టుకన్న పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో వెంకటరత్నం సుదేష్ సింగ్ కుటుంబ సభ్యుల నుంచి దూరంగా వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జవహర్ నగర్‌లో భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. వెంకటరత్నం వల్లే సుదేష్ సింగ్ ఆచూకీ పోలీసులకు తెలిసిందని, అంతేకాకుండా తన పేరుపై ఉన్న ఆస్తులు సుదేష్ సింగ్ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా పారిపోవడంతో వారు వెంకటరత్నంపై కక్ష పెంచుకున్నారు. అప్పటి నుంచి వెంకటరత్నం ఆచూకీ కోసం నగరంలో చాలా ఏళ్ల నుంచి గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటరత్నం ఉంటున్న ఏరియా గురించి ఇటీవలే సుదేష్ సింగ్ కుటుంబ సభ్యులకు తెలిసింది. రెక్కీ నిర్వహించిన సుదేష్ సింగ్ కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు ఆటోలో నలుగురు, బైక్‌పై ఇద్దరు వచ్చారు. వెంకటరత్నం ఇంటి నుంచి కూతురిని తీసుకుని పాఠశాలకు వెళ్లి, తిరిగి వస్తుండగా రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీకొట్టి కిందపడేశారు. వెంటనే తుపాకీతో కాల్చి, కత్తులతో పొడిచారు, తలపై బండరాయి వేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరుగురు నిందితులు హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో వారిని రాచకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.

మన తెలంగాణ 9 Dec 2025 10:08 pm

ఇండిగో సేవలు గాడిన పడుతున్నాయి..ఇండిగో సీఈఒ

ముంబై : దేశీయ విమాన సంస్థ ఇండిగో సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడి సాధారణ స్థితికి చేరుకుందని ఆ సంస్థ సీఈఒ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ఇండిగో సంస్థలో తలెత్తిన ఇబ్బందుల వల్ల , అత్యవసర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వేల మంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఈ విషయమై సీఈఒ క్షమాపణలు కోరారు. ఇండిగో విమాన సర్వీసుల్లో ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని పీటర్ హామీ ఇచ్చారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇండిగో విమానయాన సిబ్బంది అంతా తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రయాణికులే తమ తొలి ప్రాధాన్యమని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత కొన్ని రోజులుగా విమానసర్వీసులు రద్దవడంతో ఇప్పటికే లక్షలాది మంది ప్రయాణికులకు రీఫండ్ చెల్లింపు పూర్తి చేశామని , అలాగే సదరు ప్రయాణికుల లగేజీ కూడా వారి నివాసాలకు చేరవేశామని తెలిపారు. మిగిలిన మరికొన్ని బ్యాగేజీలనూ త్వరలోనే ఆయా ఇళ్లకు చేర్చడానికి తగిన ఏర్పాట్లు చేశామని ప్రకటించారు. తీవ్ర ఇబ్బందుల నడుమ డిసెంబర్ 5న 700 ఫైట్లను మాత్రమే నడప గలిగామని, అయితే సోమ,మంగళవారాల్లో పరిస్థితులు కాస్త మెరుగవ్వడంతో మొత్తం 1800 విమానాలను అందుబాటు లోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం 138 గమ్యస్థానాలకు ఇండిగో ప్రయాణాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. 

మన తెలంగాణ 9 Dec 2025 9:41 pm

సాగు–తాగునీటికి మొదటి ప్రాధాన్యతనిస్తా…

పెద్దపల్లి జిల్లా, ధర్మారం (ఆంధ్రప్రభ) : ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్

ప్రభ న్యూస్ 9 Dec 2025 9:38 pm

ఈసారి సంక్రాంతికి టఫ్ ఫైట్.. బరిలో మరో యంగ్ హీరో

చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజవరగమనతో బ్లాక్‌బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. ఇది ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇక మేకర్స్ 'నారి నారి నడుమ మురారి' సినిమా ఈ సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుందని ప్రకటించారు. ప్రీమియర్ షో సమయం - సాయంత్రం 5:49 అని మేకర్స్ తెలియజేశారు. సాధారణంగా సినిమాలు ఉదయం లేదా తెల్లవారుజామున షోలతో ప్రారంభమవుతాయి. కానీ మొదటిసారిగా ఈ సినిమా సాయంత్రం రిలీజ్ ని ఎంచుకుంటోంది. ముహూర్తం ఇంత త్వరగా ఖరారు కావడం టీమ్ ఖచ్చితమైన ప్లానింగ్‌ని తెలియజేస్తోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శర్వా స్టైలిష్‌గా కనిపిస్తూ, మెడలో పూల హారంతో నిల్చున్నారు. సంయుక్త ఆవేదనతో నిండిన లుక్‌లో కనిపిస్తే, సాక్షి వైద్య స్వచ్ఛమైన చిరునవ్వుతో ఫ్రేమ్‌కి ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది. 

మన తెలంగాణ 9 Dec 2025 9:34 pm

నలుగురు సర్పంచ్ లు.. 72 వార్డ్ మెంబర్ లు ఏకగ్రీవం !!

భీమ్‌గల్ రూరల్, (ఆంధ్రప్రభ) : భీమ్‌గల్ మండలంలో మూడవ విడత స్థానిక సంస్థల

ప్రభ న్యూస్ 9 Dec 2025 9:33 pm

ఐపిఎల్ వేలం బరిలో 350 మంది క్రికెటర్లు!

ముంబై: అబుదాబి వేదికగా డిసెంబర్ 16న జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మినీ వేలం పాటలో 350 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. ఐపిఎల్ వేలం పాట కోసం నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితా నుంచి బిసిసిఐ ఏకంగా 1005 మంది క్రికెటర్ల పేర్లను తొలగించింది. అబుదాబిలో జరిగే వేలం పాటలో 350 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఐపిఎల్ మినీ వేలం అబుదాబిలో జరుగుతుందని బిసిసిఐ ఆయా ఫ్రాంచైజీలకు అధికారికంగా తెలిపింది. ఈ మేరకు ఫ్రాంచైజీలకు మెయిళ్లను పంపించింది మొదట బిడ్డిం ప్రక్రియ, బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్లు/బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు అనే విభాగాల వారీగా వేలం పాట కొనసాగనుంది. తొలుత క్యాప్డ్ ఆటగాళ్లతో ప్రారంభమయ్యే ఆక్షన్ తర్వాత అన్‌క్యాప్ట్ ఆటగాళ్ల వేలంతో ముగుస్తోంది.

మన తెలంగాణ 9 Dec 2025 9:22 pm

రసవత్తరంగా ఉట్నూర్ పంచాయతీ ఎన్నిక..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డ్‌ మెంబర్‌ ఎన్నికల

ప్రభ న్యూస్ 9 Dec 2025 9:21 pm

Balotsavam |అదరహో అమరావతి బాలోత్సవం…

Balotsavam | అదరహో అమరావతి బాలోత్సవం… ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఎప్పుడెప్పుడా

ప్రభ న్యూస్ 9 Dec 2025 9:12 pm

From Films to Future Tech: Key Highlights of Telangana Rising Global Summit

Telangana is preparing for one of its most ambitious phases of development. At the Telangana Rising Global Summit, Chief Minister Revanth Reddy announced wide-ranging plans that aim to transform the state’s film industry, digital infrastructure and investment landscape. A Fresh Start for the Film Industry & As a Leading Film Destination During an exclusive interaction […] The post From Films to Future Tech: Key Highlights of Telangana Rising Global Summit appeared first on Telugu360 .

తెలుగు 360 9 Dec 2025 9:00 pm

12న వస్తున్న ‘అఖండ 2’

గత వారం డిసెంబర్ 5న రావాల్సిన ’అఖండ 2’ విడుదల ఆగిపోవడంతో నందమూరి అభిమానులు ఎంత నిరాశకు గురయ్యారో అందరికీ తెలిసిందే. సరిగ్గా ప్రీమియర్స్ పడాల్సిన సమయంలో బ్రేక్ పడటంతో ఆ హైప్ మొత్తం ఒక్కసారిగా చల్లబడినట్లయింది. అయితే ఇప్పుడు సమస్యలు ఓ కొలిక్కి రావడంతో మేకర్స్ మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, వారం తిరక్కముందే డిసెంబర్ 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించు కున్నారని తెలిసింది. ఈరోస్ ఇంటర్నేషనల్, - 14 రీల్స్ ప్లస్ మధ్య సమస్యలు ఉండటంతో ‘అఖండ 2’(Akhanda 2) చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కారమవడంతో ఈ సినిమా విడుదలకు సిద్ధమైందని సమాచారం. ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్సులు, డిస్ట్రిబ్యూటర్ల పెండింగ్ చెల్లింపులు పూర్తయితే ‘అఖండ 2’ని డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలిసింది. డిసెంబర్ 11న పెయిడ్ ప్రీమియర్లు, టికెట్ రేట్ల పెంపు కోసం కూడా టీమ్ మరోసారి దరఖాస్తు చేసిందట. ఇక గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త తదితరులు కీలక పాత్రల్లో నటించగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 8:58 pm

బౌండరీలతో విరుచుకుపడిన పాండ్యా.. దక్షిణాప్రికా టార్గెట్ ఎంతంటే?

భారత్ టాపార్డర్ చేతులెత్తేసిన వేళ హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చి రాగానే భారీ సిక్సులతో చెలరేగిపోయాడు. దీంతో భారత్ మంచి స్కోరు సాధించింది. కటక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్(04), అభిషేక్ శర్మ(17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈక్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(26) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భారీ షాట్ ఆడి క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్(23) కూడా వెనుదిరగాడు. దీంతో టీమిండియా 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఈ క్రమంలో పాండ్యా, శివమ్ దూబే(23)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధనా ధన్ బ్యాటింగ్ తో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. పాండ్యా 28 బంతుల్లో 6 ఫోర్లు,  4 సిక్సులతో 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక, చివర్లో జితేష్ శర్మ 5 బంతుల్లో 10 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

మన తెలంగాణ 9 Dec 2025 8:53 pm

ఎసిబి వలలో సివిల్ సప్లై అధికారి

రేషన్ డీలర్ వద్ద లంచం తీసుకుంటూ ఓ సివిల్ సప్లై అధికారి ఎసిబి వలలో చిక్కారు. రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ నాయక్ అవినీతి నిరోధక శాఖ ట్రాప్‌లో పడ్డారు. షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ రేషన్ డీలర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు ఏసిబి అధికారులు వెల్లడించారు. పిడిఎస్ రైస్‌కు సంబంధించిన కేసు క్లియరెన్స్ విషయంలో బాధితుడి వద్ద జిల్లా సివిల్ సప్లై విభాగం డిటి రవీందర్ నాయక్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసిబి తెలిపింది. నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు లంచం డిమాండ్ చేసినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఏసిబి అధికారులు ప్రజలకు సూచించారు.

మన తెలంగాణ 9 Dec 2025 8:49 pm

ఎసిబికి పట్టుబడ్డ వెల్దండ విద్యుత్ ఇన్‌ఛార్జి ఏఈ

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల విద్యుత్ ఇన్‌ఛార్జ్ ఏఈ వెంకటేశ్వర్లు రూ.15 వేల లంచం తీసుకుంటుండగా మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎసిబి డిఎస్‌పి జగదీష్ చందర్ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వెల్దండ మండల కేంద్రం పరిధిలోని చొక్కన్నపల్లి గ్రామ సమీపంలోని ఓ ఫామ్ హౌజ్‌లో విద్యుత్ మీటర్ ఏర్పాటు కోసం విద్యుత్ ఏఈ రూ. 20 వేలు డిమాండ్ చేయగా ఫిర్యాదు దారుడు రూ. 15 వేలకు ఒప్పందం కుదుర్చుకొని ఫామ్ హౌజ్‌లో నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలిపి వెల్దండ విద్యుత్ సబ్ స్టేషన్‌కు తరలించారు. ఫిర్యాదుదారుడు ఈనెల 5వ తేదీన ఎసిబి అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పూర్తి స్థాయి ఆధారాలతో దాడులు నిర్వహించి కస్టడీలోకి తీసుకున్నట్లు ఎసిబి డిఎస్పి పేర్కొన్నారు. ఇదే సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో గల ఏఈ నివాసంలో మరొక బృందం సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసిబి డిఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా పనులు చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ అధికారుల టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేసి సమాచారం అందజేయాలని ఏసిబి డిఎస్పి సూచించారు. అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటామని పేర్కొన్నారు. 

మన తెలంగాణ 9 Dec 2025 8:41 pm

ఆశీర్వదించండి… అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా

ఆలేరు, ఆంధ్రప్రభ : ఒక్కసారి ఆశీర్వదించండి… అభివృద్ధినే ధ్యేయంగా చేసుకుని పనిచేస్తాను అని

ప్రభ న్యూస్ 9 Dec 2025 8:30 pm

‘సర్’ కొనసాగేలా చూడండి.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

అడ్డుకుంటే మా వద్దకు రండి.. లేకపోతే అరాచకం అవుతుంది బిఎల్‌ఓల సమస్యలు మా దృష్టికి తీసుకురండి అవసరమైతే ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తాం: సుప్రీం కోర్టు  న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్)ను కొనసాగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సూచించింది. సర్ ప్రక్రియలో భాగమైన బూత్‌లెవెల్ అధికారులు (బిఎల్‌ఒ), ఇతర అధికారులు పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో బెదిరింపులకు గురవుతుండడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఈ పరిస్థితిని అధిగమించాలని ఆదేశించింది. లేకపోతే అరాచకం అవుతుందని హెచ్చరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ, దాని నిర్వహణలో ఎదురవుతున్న పరిస్థితులపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం చీఫ్‌జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బగ్చీ నేతృత్వం లోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. బిఎల్‌ఓలకు బెదిరింపులు, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే, వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. బీఎల్‌ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరించాలని పేర్కొంది. ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం కోర్టుకు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల రక్షణ కల్పించడానికి నిరాకరిస్తే స్తానిక పోలీసులను డిప్యుటేషన్ పై తీసుకోవలసి వస్తుందని, అప్పటికీ పరిస్థితి మారకుంటే కేంద్ర బలగాలను రప్పించ వలసి వస్తుందని ఎన్నికల సంఘం తరపున కోర్టుకు హాజరైన ద్వివేది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ సనాతని సంగ్సాద్ , ఇతరుల తరఫున సీనియర్ న్యాయవాది వి. గిరి హాజరయ్యారు. బిఎల్‌ఒలపై దాడులు , బెదిరింపులు జరగకుండా వారికి రక్షణ కల్పించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. 

మన తెలంగాణ 9 Dec 2025 8:29 pm

Massive Blaze in jakarta   ఇండోనేషియాలో  22 మంది ఆహుతి

Massive Blaze in Jakarta ఇండోనేషియాలో 22 మంది ఆహుతి 15 మంది

ప్రభ న్యూస్ 9 Dec 2025 8:20 pm

చెలరేగుతున్న దక్షిణాఫ్రికా బౌలర్లు.. ఐదో వికెట్ కోల్పోయిన భారత్

 ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో భారత్‌ ఐదో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్(04), అభిషేక్ శర్మ(17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈక్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(26) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భారీ షాట్ ఆడి క్యాచ్ ఔటయ్యాడు. దీంతో భారత్ 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం హార్దిక్ పాండ్యా, అక్షపటేల్.. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు. ఆ తర్వాత అక్షర్(23) కూడా వెనుదిరగాడు. ప్రస్తుతం టీమిండియా 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో పాండ్యా(15), శివమ్ దూబే(0)లు ఉన్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 8:17 pm

పట్టాలెక్కిన తిరుపతి - షిర్డీ ఎక్స్‌ప్రెస్

తిరుపతి సాయినగర్ షిర్డి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి. సోమన్న మంగళవారం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు ఎం.రఘునాథ్ రెడి, డాక్టర్ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఇందులో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమానికి ఎపి మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణచక్రవర్తి, శాసన సభ్యులు ఆరణీ శ్రీనివాసులు, ఇతర ప్రజా ప్రతినిధులు , దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి . సోమన్న మాట్లాడుతూ తిరుపతి - సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో నివసిస్తున్న భక్తులకు ఒక చారిత్రాత్మక రోజని అన్నారు. ప్రస్తుతం తిరుపతి, షిర్డీతో పాటు నెల్లూరు, గుంటూరు, సికింద్రాబాద్, బీదర్, మన్మాడ్, ఇతర ముఖ్యమైన స్టేషన్లోతో కలుపుకొని 31 స్టాప్‌లతో నేరుగా రైలు ద్వారా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఈ రైలు తీర్థయాత్రలు, పర్యాటకానికి , అనుసంధానాన్ని పెంపొందించుతుందని, ఈ మార్గంలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఈ నూతన రైలు మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, సికింద్రాబాద్ నుండి ప్రత్యక్ష అనుసంధానాన్ని అందిస్తూ ఈ మార్గంలోని ఒక ముఖ్యమైన శివాలయం అయిన పర్లి వైజ్‌నాథ్‌ను కూడా కలుపుతుందని తెలిపారు. 2014 నుండి ఆంధ్రప్రదేశ్ 100శాతం విద్యుదీకరణతో 1,580 కి.మీ నూతన ట్రాక్‌ను జోడించిందని, రాష్ట్రంలో ఇప్పుడు 73 అమృత్ స్టేషన్లు 3,125 కోట్ల రూపాయల వ్యయంతో ఉధునీకరణలో ఉన్నాయని తెలిపారు. భారత రైల్వేలు తిరుపతిలో రూ. 312 కోట్ల విలువైన తిరుపతి అమృత్ స్టేషన్‌తో సహా ఇతర ప్రాజెక్టు పనులను చేపట్టాయని పేర్కొన్నారు. తిరుపతి- పాకల-కాట్పాడి డబ్లింగ్, గూడూరు - రేణిగుంట 3 వ లైన్, నడికుడి - శ్రీకాళహస్తి కొత్త లైన్, విజయవాడ , -గూడూరు 3 వ లైన్, యేర్పేడు -పూడి బైపాస్ లైన్ వంటి ప్రధాన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 8:16 pm

పొద్దు తిరుగుడు పువ్వుల రాజకీయాలు మానుకో కడియం

లింఘాలఘన్‌పూర్ : లింఘాలఘన్ పూర్ మండలంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో

ప్రభ న్యూస్ 9 Dec 2025 8:14 pm

లోక్‌భవన్‌తో పాటు సిఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు

 రాష్ట్రంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ), లోక్ భవన్‌లను పేల్చడానికి కుట్ర జరుగుతోందని పేర్కొంటూ అగంతకుడు లోక్ భవన్ కార్యాలయానికి ఈమెయిల్ పంపాడు. ’వాసుకి ఖాన్’ అనే పేరుతో వచ్చిన ఈ బెదిరింపు మెయిల్‌లో వెంటనే విఐపిలను, ప్రముఖులను ఆ భవనాల నుంచి ఖాళీ చేయించాలని బెది రించినట్లు సమాచారం. ఈ మెయిల్ అందిన వెంటనే గవర్నర్ కార్యాలయం అప్రమత్తమైంది. గవర్నర్ కార్యాలయ సిఎస్‌ఒ శ్రీనివాస్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. హుటాహుటినా బాంబు స్కాడ్‌తో సీఎంవో, లోక్ భవన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అలాగే, బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు ఆ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది, దాన్ని ఎవరు పంపారు అనే దానిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 9 Dec 2025 8:12 pm

గెలిపించండి… సేవకురాలిగా పని చేస్తా

తొర్రూరు, ఆంధ్రప్రభ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఆశీర్వాదం చేసి

ప్రభ న్యూస్ 9 Dec 2025 8:09 pm

98 voters |రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీ బృందావనపురం

98 voters | రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీ బృందావనపురం 98 voters

ప్రభ న్యూస్ 9 Dec 2025 8:07 pm

University |ఉస్మానియా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

University | ఉస్మానియా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి University | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 9 Dec 2025 8:02 pm

తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగల కళేబరం

భారీ తిమింగల కళేబరం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన సంఘటన కన్యాకుమారిలోన కిల్మీదలం తీరంలో చోటుచేసుకుంది. కొట్టుకు వచ్చిన తిమింగలం సుమారు 10 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉంది. ఈ భారీ తిమింగలాన్ని చూడటానికి స్థానిక ప్రాంత ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా కోలాహలంగా మారింది. అంతకు ముందు భారీ తిమింగలం మత్స్యకారుల వలకు చిక్కింది. మత్స్యకారులు తిమింగలంను రక్షించేందుకు వలను కత్తిరించారు. కానీ తిమింగలం మృతి చెంది కళేబరం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. 

మన తెలంగాణ 9 Dec 2025 7:59 pm

funds |వేసి గెలిపించండి

funds | వేసి గెలిపించండి funds | ధర్మపురి, ఆంధ్రప్రభ : బ్యాట్

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:56 pm

Chiru’s MSG Songs @ 100 : Hype Levels Keep Rising

Megastar Chiranjeevi is all set to captivate with his highly anticipated family entertainer, Mana Shankara Vara Prasad Garu, directed by Anil Ravipudi. With Sankranti 2026 around the corner, the film has already ignited buzz with its first two songs. The first song- Meesala Pilla quickly took the internet by storm, racking up nearly 80 million […] The post Chiru’s MSG Songs @ 100 : Hype Levels Keep Rising appeared first on Telugu360 .

తెలుగు 360 9 Dec 2025 7:51 pm

RTC buses |ఆర్టీసీ బస్సుల్లో స్వీట్ల పంపిణీ

RTC buses | ఆర్టీసీ బస్సుల్లో స్వీట్ల పంపిణీ RTC buses |

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:50 pm

Observer |ఎన్నికల వేళ అధికారులు అలర్ట్‌గా ఉండాలి..

Observer | ఎన్నికల వేళ అధికారులు అలర్ట్‌గా ఉండాలి.. Observer | జనగామ,

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:46 pm

అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

భువనగిరి (రూరల్), ఆంధ్రప్రభ : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:43 pm

notification |ఫ‌స్టు ఫేజ్ ప్ర‌చారం క్లోజ్‌.. ప్ర‌లోబాల‌కు రెడీ!

notification | ఫ‌స్టు ఫేజ్ ప్ర‌చారం క్లోజ్‌.. ప్ర‌లోబాల‌కు రెడీ! notification |

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:29 pm

ట్రిబుల్ ఆర్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: ఎంపీ చామల

దేశంలోనే మొదటి అవుటర్ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో చామల కిరణ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ చుట్టూర సుమారు నాలుగు వందల కిలో మీటర్లు విస్తరించి సుమారు ఎనిమిది జిల్లాలను, పద్నాలుగు మండలాల్లో ట్రిబుల్ ఆర్ వస్తుందన్నారు. ఇందులో దాదాపు ఐదు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే ప్లై వోవర్లు ఉన్నాయని, వీటి అంచనా వ్యయం సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలని ఆయన వివరించారు. రాబోయే అవుటర్ రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తుందని ఆయన తెలిపారు. ఉత్తర భాగం, దక్షిణ భాగం సర్వే పూర్తి అయ్యిందని ఆయన చెప్పారు. హైదరాబాద్ ప్రాముఖ్యత, అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ఆయన తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, ఆవిష్కరణ, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించిందని, ఇది దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థకు, దేశపు ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్షానికి మరింత దోహదపడడమే కాకుండా వికసిత్ భారత్ యొక్క థీమ్, లక్షాన్ని సాధించడంలో కూడా సహాయపడుతుందన్నారు. ఈ రింగ్ రైల్ ప్రాజెక్టు ఆర్థిక కార్యకలాపాలను, ఐటి హబ్‌లను, ఫార్మాస్యూటికల్ క్లస్టర్లను లాజిస్టిక్ పార్కులు, అభివృద్ధి చెందుతున్న పట్టణ వృద్ధి కేంద్రాలను సృష్టిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వృద్ధి కారిడార్‌లను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుందని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 9 Dec 2025 7:23 pm

Tenth exams |మార్చి 14 నుంచి -టె-న్త్‌ పరీక్షలు

Tenth exams | మార్చి 14 నుంచి -టె-న్త్‌ పరీక్షలు Tenth exams

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:21 pm

గ్లోబల్ కాదు గోల్-మాల్ సమ్మిట్ :బిజెపి ఎంఎల్ఎ రాకేష్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్&గోల్ మాల్ సమ్మిట్‌లా ఉంది. అని బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విమర్శించారు. సమ్మిట్‌కు ఎంఎల్‌ఏలను ఆహ్వానించి అవమానించారని ఆయన విమర్శించారు. తాను వెళ్ళానని, అక్కడ ఎంఎల్‌ఏలను పట్టించుకునే నాధుడే లేరని ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. ఎంఎల్‌ఏలు కూర్చునేందుకు కనీసం కుర్చీలు లేవని ఆయన విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్‌లా లేదని, రియల్ ఎస్టేట్ బ్రోచర్ విడుదల చేసే కార్యక్రమంలా ఉందని ఆయన విమర్శించారు. ప్రజలను మభ్య పెట్టేందుకు ఏదో గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. రాబోయే రెండు వందల ఏళ్ళ తర్వాత జరిగే అభివృద్ధి ఎవరికి అవసరమని ఆయన ప్రశ్నించారు. ముందు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వదిలేసి గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివాసీలు, లంబాడిలు నివసించే తండాల్లో తాగు నీరు, రవాణా సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంఎల్‌ఏ రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 9 Dec 2025 7:19 pm

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుంచి 'దేఖ్ లేంగే సాలా' ప్రోమో రిలీజ్‌..

ఓజి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. 'దేఖ్ లేంగే సాలా' అనే తొలి లిరికల్ సాంగ్ ప్రమోను కొద్దిసేపటిక్రితమే రిలీజ్ చేశారు. చాలా రోజుల తర్వాత పవన్ డ్యాన్స్ తో అలరించనున్నట్లు ప్రోమో చేస్తే అర్థమవుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి సాంగ్ ను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వచ్చే ఏడాదిలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 7:16 pm

12 autos |బోధన్ బల్దియాలో చెత్త సేకరణకు కొత్త ఆటోలు..

12 autos | బోధన్ బల్దియాలో చెత్త సేకరణకు కొత్త ఆటోలు.. 12

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:13 pm

డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు: కెటిఆర్

 తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు డిసెంబర్ 9(విజయ్ దివస్) అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. ఈ సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించి నేటికి(డిసెంబర్ 9) 16 ఏళ్లు అని వ్యాఖ్యానించారు. నవంబర్ 29 (దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9 (విజయ్ దివస్) లేదు అని.. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు అని పేర్కొన్నారు. జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.

మన తెలంగాణ 9 Dec 2025 7:11 pm

నియోపోలిస్‌లో ఎకరం రూ.151.25 కోట్లకు దక్కించుకున్న కాస్కేడ్స్ డెవలపర్లు

హైదరాబాద్ నియోపోలిస్ రియాల్టీ మార్కెట్‌లో మరో రికార్డు నమోదైంది. “ది కాస్కేడ్స్ నియోపోలిస్” సంస్థ నియోపోలిస్ ప్లాట్ 15ను ఎకరానికి రూ. 151.25 కోట్లకు దక్కించుకున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండో అత్యధిక ల్యాండ్ బిడ్. నియోపోలిస్ ప్రాంతంలో ఇప్పటివరకు నమోదైన బిడ్లలో ఇదే అత్యధికం. జిహెచ్ఆర్ ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బన్‌బ్లాక్స్ రియాలిటీ డెవలపర్స్ సంయుక్తంగా ది కాస్కేడ్స్ నియోపోలిస్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) నిర్వహించిన ఫేజ్ 3 వేలంలో […] The post నియోపోలిస్‌లో ఎకరం రూ.151.25 కోట్లకు దక్కించుకున్న కాస్కేడ్స్ డెవలపర్లు appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 9 Dec 2025 7:10 pm

vote |అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా

vote | అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా vote | ధర్మపురి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:08 pm

Village |ప్రజలారా.. మాయ మాటలు చెప్పే వాళ్లను నమ్మొద్దు…

Village | ప్రజలారా.. మాయ మాటలు చెప్పే వాళ్లను నమ్మొద్దు… -సర్పంచ్ గా

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:03 pm

Officers |తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ..

Officers | తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ.. Officers | నాగర్ కర్నూల్

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:59 pm

IND vs SA T20: టాస్ గెలిచిన దక్షిణాప్రికా.. భారత్ జట్టు ఇదే

ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా కటక్ వేదికగా తొలి టీ20లో భారత్‌-సౌతాఫ్రికా జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను జట్టులోకి తీసుకోలేదు. ఎప్పటి లాగే అభిషేక్ శర్మ, గిల్ లు ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. చాలా రోజుల తర్వాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. సంజూ శాంసన్ కు బదులు వికెట్ కీపర్ గా జితేష్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. కాగా, వన్డే సిరీస్ విజయంతో జోష్ లో ఉన్న భారత జట్టు.. ఈ మ్యాచ్ లో గెలుపొంది సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, దక్షిణాఫ్రికా జట్టు కూడా తొలి టీ20లో విజయం సాధించి సిరీస్ లో ఆధిక్యాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది.  ఇరు జట్ల వివరాలు: భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్ దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్రామ్(c), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, లూథో సిపమ్లా, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే

మన తెలంగాణ 9 Dec 2025 6:54 pm

Great success |ఇంటింటా ప్రచారం

Great success | ఇంటింటా ప్రచారం Great success | పరకాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:52 pm

Apollo Hospitals Champions Health, Hope and Humanity in Telangana’s Growth Story

Under the leadership of Dr. Shobana Kamineni, Dr. Sangita Reddy, Upasana Konidela and Vishwajit Reddy, Apollo Hospitals has set in motion a transformational mission to uplift the health and well-being of every citizen in Telangana. A multi-year investment of ₹1,700+ Crore reaffirms Apollo’s commitment not just to hospitals, but to people. From pioneering Proton Therapy […] The post Apollo Hospitals Champions Health, Hope and Humanity in Telangana’s Growth Story appeared first on Telugu360 .

తెలుగు 360 9 Dec 2025 6:50 pm

Development |ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

Development | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి ..ఏకగ్రీవ గ్రామ పంచాయితీ సభ్యులకు సన్మానం..

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:48 pm

history |అమరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం

history | అమరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం history |

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:43 pm

UBS Dekhlenge Saala Promo: Pawan Kalyan sets dance floor on fire

Power Star Pawan Kalyan and maverick magician Harish Shankar are back together with their highly awaited Ustaad Bhagat Singh. Sreeleela and Raashii Khanna are playing leading roles in the film produced by Mythri Movie Makers. After a long time, Pawan Kalyan is gearing up to set dance floor on fire. He has been staying away […] The post UBS Dekhlenge Saala Promo: Pawan Kalyan sets dance floor on fire appeared first on Telugu360 .

తెలుగు 360 9 Dec 2025 6:40 pm

Telangana : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు

తెలుగు పోస్ట్ 9 Dec 2025 6:23 pm

Govt |సేవే మార్గం..అభివృద్ధి లక్ష్యంగా…

Govt | సేవే మార్గం..అభివృద్ధి లక్ష్యంగా… Govt | తాడ్వాయి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:22 pm

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో బుమ్రా

టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డులకు పెట్టింది పేరు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను బుమ్రా తిరశరరాశాడు... సృష్టించాడు కూడా. కాగా, బుమ్రా నేటి మ్యాచ్‌లో ఒక వికెట్ తీస్తే.. టి-20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. తద్వారా అన్ని ఫార్మాట్‌లలో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు లసిత్ మలింగ, షకిబ్ అల్ హసన్, టిమ్ సౌథీ, షహీన్ అఫ్రిది మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈరోజు మ్యాచ్‌లో బుమ్రా ఈ రికార్డు సాధించే అవకాశం ఉంది. అంతేకాక.. బుమ్రా ఇంకొక వికెట్ తీస్తే.. భారత్ తరఫున టి-20ల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటికే అర్ష్‌దీప్ సింగ్ (105) ఈ మైలురాయిని చేరుకున్నాడు. 

మన తెలంగాణ 9 Dec 2025 6:20 pm

టీచర్ల కొరత తీర్చండి..

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:19 pm

Kalvakuntla Kavita : మీరు రెండంటే.. వాళ్లు నాలుగంటారు కవితక్కా

కల్వకుంట్ల కవిత పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు

తెలుగు పోస్ట్ 9 Dec 2025 6:14 pm

అభివృద్ధి చేస్తా… ఆదరించండి

తొర్రూరు క్రైం, ఆంధ్రప్రభ : పత్తేపురం గ్రామ సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామాన్ని

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:13 pm

Urea |కేసీఆర్ దీక్ష దివస్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం..

Urea | కేసీఆర్ దీక్ష దివస్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం.. —

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:11 pm

In LS :  ప్రయాణికుల భద్రతే లక్ష్యం

In LS : ప్రయాణికుల భద్రతే లక్ష్యం ఇండిగోపై చర్య తప్పదు పార్లమెంటులో

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:08 pm

అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పించండి

ధర్మపురి, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధి కోసం అనుభవం ఉన్న తనకు మరోసారి

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:06 pm

Sharwa’s Special Release Plan For NNNM

Charming Star Sharwa is coming up with a feel-good family entertainer Nari Nari Naduma Murari, directed by Ram Abbaraju and produced by Ramabrahmam Sunkara under the AK Entertainments banner in collaboration with Adventures International Pvt. Ltd. The film as earlier announced will light up theatres this Sankranthi with a special release plan. Unlike the usual […] The post Sharwa’s Special Release Plan For NNNM appeared first on Telugu360 .

తెలుగు 360 9 Dec 2025 6:05 pm

School |ఆదరించండి…. అభివృద్ధి చేస్తా

School | ఆదరించండి…. అభివృద్ధి చేస్తా School | లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:04 pm

ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి

జకార్తా: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండోనేషియా రాజదాని జకార్తాలో ఏడు అంతస్తుల భవనంలో మంగళవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. స్థానిక మీడియా సమాచారం ప్రకారం, అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించిన మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. భవనం నుండి ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం సమయంలో భవనం మొదటి అంతస్తులో మంటలు అలుముకుని, ఆపై పై అంతస్తులకు వ్యాపించిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో కొంతమంది ఉద్యోగులు భవనంలో భోజనం చేస్తుండగా, మరికొందరు కార్యాలయం నుండి వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 6:04 pm

MAMATHA |ప్రతి నిత్యం అందుబాటులో ఉంటా..

MAMATHA | ప్రతి నిత్యం అందుబాటులో ఉంటా.. ఓటు వేసి గెలిపించండి MAMATHA

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:01 pm

Pradeep Ranganathan’s LIK Postponed for the Second Time

Pradeep Ranganathan scored two back-to-back blockbusters this year: Dragon and Dude. He had plans to release his third film Love Insurance Kompany (LIK) and the film is scheduled for December 18th release across the globe in Tamil and Telugu languages. Vignesh Shivan is the director of this romantic drama and Krithi Shetty is the leading […] The post Pradeep Ranganathan’s LIK Postponed for the Second Time appeared first on Telugu360 .

తెలుగు 360 9 Dec 2025 5:59 pm

Sabarimala : శబరిమల వెళ్లే భక్తులకు అలెర్ట్.. అక్కడకు వెళ్లొద్దు

అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేసింది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 5:53 pm

competition |గెలుపు బాటలో జోడు పవన్..

competition | గెలుపు బాటలో జోడు పవన్.. competition | టేకుమట్ల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 9 Dec 2025 5:29 pm

Akkapur |గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

Akkapur | గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా అక్కాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి

ప్రభ న్యూస్ 9 Dec 2025 5:26 pm

10th Ward |ఆశీర్వదిస్తే సేవ చేస్తా…

10th Ward | ఆశీర్వదిస్తే సేవ చేస్తా… 10th Ward | ధర్మసాగర్,

ప్రభ న్యూస్ 9 Dec 2025 5:26 pm

సివిల్స్ కోచింగ్ వదిలి… పంచాయతీ బరిలోకి..!

ఆంధ్రప్రభ, నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మేజర్ పంచాయతీకి విద్యావంతురాలు బానోత్

ప్రభ న్యూస్ 9 Dec 2025 5:24 pm

EX BRS MLA |వ్యాపారాస్తులకు నష్టం చేస్తే సహించేది లేదు

EX BRS MLA | వ్యాపారాస్తులకు నష్టం చేస్తే సహించేది లేదు మాజీ

ప్రభ న్యూస్ 9 Dec 2025 5:23 pm

Pensions |జైనూర్ గ్రామ అభివృద్ధే నా లక్ష్యం

Pensions | జైనూర్ గ్రామ అభివృద్ధే నా లక్ష్యం Pensions | జైనూర్,

ప్రభ న్యూస్ 9 Dec 2025 5:21 pm

Governer | 13న శ్రీ రాధా గోవింద రథయాత్ర

Governer | 13న శ్రీ రాధా గోవింద రథయాత్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌కు

ప్రభ న్యూస్ 9 Dec 2025 5:19 pm

ఇండోనేషియోలో ఘోర అగ్ని ప్రమాదం – 20 మంది మృతి

ఇండోనేసియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 5:17 pm

MIM |తర్జన బర్జనల మధ్య ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

MIM | తర్జన బర్జనల మధ్య ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ MIM |

ప్రభ న్యూస్ 9 Dec 2025 5:16 pm

Narender |అవినీతి లేని పాలన అందిస్తా

Narender | అవినీతి లేని పాలన అందిస్తా కాకర్లపహాడ్ సర్పంచ్ అభ్యర్థి పాశం

ప్రభ న్యూస్ 9 Dec 2025 5:14 pm

EX MLA |ఢిల్లీ మెడలు వంచిన కేసీఆర్

EX MLA | ఢిల్లీ మెడలు వంచిన కేసీఆర్ EX MLA |

ప్రభ న్యూస్ 9 Dec 2025 5:10 pm

‘ఇది నా బ్యాడ్‌లక్‌’ అన్న మోగ్లీ డైరెక్టర్.. సాయి దుర్గా తేజ్ సపోర్ట్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ-2’ చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండేది. కానీ, అనుకోని అడ్డంకుల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు అదే చిన్న సినిమాలను చిక్కుల్లోపడేసింది. ‘అఖండ-2’ కొత్త విడుదల తేదీ ప్రకటించకపోవడంతో చిన్న సినిమాల రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ ‘అఖండ-2’ చిత్రం డిసెంబర్ 12న విడుదలైతే.. ఆ రోజు విడుదల కావాల్సిన చిన్న సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందులో సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మోగ్లీ’ సినిమా కూడా ఒకటి. సందీప్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘కలర్ ఫోటో’ కూడా లాక్‌డౌన్ కారణంగా ఒటిటిలో విడుదలైంది. ఇప్పుడు మోగ్లీ చిత్రం కూడా వాయిదా పడే పరిస్థితులు రావడంతో సందీప్ భావోద్వేగంతో పోస్ట్ పెట్టాడు. ‘‘అసలు నా రెండు సినిమాలకు తాను కాకుండా వేరే వాళ్లు దర్శకుడిగా అర్హులేమో. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటే విడుదల విషయంలో దురదృష్టం ఎదురవడం. నేను నాదే బ్యాడ్‌లక్. అనుకుంటా. ‘డైరెక్టెడ్ బై సందీప్ రాజ్’ అని వెండితెరపై చూడాలి అనుకున్న కల రోజు రోజుకీ కష్టతరమవుతోంది. సిల్వర్‌స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందేమో. రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డివొపి మారుతి, మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ.. ఇలా అంకిత భఆవంతో ఎన్న ఎంతో మంది కష్టంతో ‘మోగ్లీ’ రూపొందింది. వారి కోసమైనా ఈ సినిమా విషయంలో మంచి జరగాలని ఆశిస్తున్నా’’ అని సందీప్ రాసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరో సాయి దుర్గా తేజ్ సందీప్‌కి భరోసా ఇచ్చాడు. ‘‘సందీప్.. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఊహించని విధంగా దక్కుతుంది. ధైర్యంగా ఉండండి. మీ విషయంలో మీరు గర్వపడండి. చివరకు సినిమా గెలుస్తుంది’’ అని సాయి దుర్గా తేజ్ పేర్కొన్నాడు. ‘‘డియర్ సందీప్.. జాతీయ అవార్డు చిత్రం ‘కలర్ ఫోటో’లో మీరు ఒక భాగం. ఈ అడ్డంకులన్నీ తాత్కాలికం. దిగులు పడొద్దు. మీ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు. మద్దతు ఇస్తారు. ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత ఎస్‌కెఎన్ అండగా నిలిచాడు.

మన తెలంగాణ 9 Dec 2025 5:06 pm