Hybrid seed |పత్తికి మద్దతు ధర..
Hybrid seed | పత్తికి మద్దతు ధర.. Hybrid seed | పెద్దపల్లి
ఇది ప్రజా పోరాటం.. పెద్ద ధన్వాడలో మిన్నంటిన సంబరాలు
రాజోలి (జనంసాక్షి) : కాలుష్య కారక ఫ్యాక్టరీ తరలిపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట …
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఏడి సర్వేయర్ శ్రీనివాస్ పై అవినీతి ఆరోపణలు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులో భాగంగా రంగారెడ్డి …
Navya Bharati Global School |సినిమా పాటల్లో సాహిత్యం..
Navya Bharati Global School | సినిమా పాటల్లో సాహిత్యం.. సినీ గేయ
Forest Region |అంజన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే
Forest Region | అంజన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే Forest Region |
Isha Glimpse stuns: Bunny Vas & Vamsi Nandipati releasing this horror thriller
The upcoming horror thriller Isha features Thrigun and Hebah Patel in lead roles with Akhil Raj, Siri Hanmanth and Prithveeraj also playing significant roles. The makers recently unveiled an thrilling glimpse at a special event, offering the audience a first look at the eerie world the film is set in. The glimpse opens with a […] The post Isha Glimpse stuns: Bunny Vas & Vamsi Nandipati releasing this horror thriller appeared first on Telugu360 .
పంచాయితీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఐటీ వింగ్ : పవన్
అమరావతి: ప్రజలకు సేవలందించడానికి డిడివో కార్యాలయాలు ఉపయోగపడతాయని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి కార్యక్రమాలకు ఉపయోగపడతాయని అన్నారు. చిత్తూరులో పవన్ కల్యాణ్ పర్యటించారు. చిత్తూరు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ గా కొత్త డిడివో కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..77 డిడివో ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. పంచాయతీ, గ్రామీణాభివృద్ధిలో భాగంగా 77 డిడివోలు ప్రారంభించామని, పదివేల మందికి ఉద్యోగాలకు పదోన్నతులు అందించామని తెలియజేశారు. పంచాయితీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఐటీ వింగ్ ఏర్పాటు చేశామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి గ్రామీణ అభివృద్ధిశాఖ పని చేస్తుందని పవన్ పేర్కొన్నారు.
16 Villages|సర్పంచ్ అభ్యర్థులు వీరే..
16 Villages| నిజాంపేట, ఆంధ్రప్రభ : నిజాంపేట మండల వ్యాప్తంగా 16 గ్రామ
BRS |పొలానికి రక్షణగా బీఆర్ఎస్ జెండా…
BRS | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఓ
AISF | ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. AISF, ఏలూరు, ఆంధ్రప్రభ : బుధవారం ఆంధ్రప్రభలో
KTR |రూ. ఐదు లక్షల కోట్ల కుంభకోణం
KTR | రూ. ఐదు లక్షల కోట్ల కుంభకోణం కాంగ్రెస్ కుట్రను బయటపెడుతాం
Minister |పడమటి ఆంజనేయ స్వామి సన్నిధిలో…
Minister | పడమటి ఆంజనేయ స్వామి సన్నిధిలో… Minister | మక్తల్, ఆంధ్రప్రభ
Chandrababu : నాయుడు గారి ల్యాండ్ బ్యాంక్ వెనక ఉన్నదెవరు?
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా, రాకపోతే మరోలా ఉంటారన్నది అందరూ చెప్పే మాట.
Ghantasala | ఘనంగా వేడుకలు.. Ghantasala, అవనిగడ్డ, ఆంధ్రప్రభ : గాన గాంధర్వుడు
CM| ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న తెలంగాణ
Bad Boy Karthik Pommante Single: Heart-wrenching
Naga Shaurya has been choosing different scripts and he is offering nice diverse films to audiences. Now, he is starring in Bad Boy Karthik in the direction of Ramesh and it is produced by Srinivasa Rao Chintalapudi, Vijaya Kumar Chintalapudi, Dr. Ashok Kumar Chintalapudi. The makers have released first single, Pommante, from the film. Upon […] The post Bad Boy Karthik Pommante Single: Heart-wrenching appeared first on Telugu360 .
Festival |వైభవంగా పడమటి అంజన్నబ్రహ్మోత్సవాలు
Festival | వైభవంగా పడమటి అంజన్నబ్రహ్మోత్సవాలు Festival | మక్తల్, ఆంధ్రప్రభ :
సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని బాలికపై కోడైరెక్టర్, కెమెరామెన్ అత్యాచారం
హైదరాబాద్: సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పి తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై కో డైరెక్టర్, కెమెరామెన్ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ ల్ లోని ఫిలింనగర్ లో జరిగింది. కో డైరెక్టర్, కెమెరామెన్, వారికి సహకరించిన బాలిక పెద్దమ్మను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ బాలిక (13) తొమ్మిదో తరగతి చదువుతూ తన పెద్దమ్మ ఇంట్లో ఉంటుంది. బాలిక పెద్దమ్మకు పరిచయమైన కడప జిల్లాకు చెందిన సినిమా కో డైరెక్టర్ బండి వెంకట శివారెడ్డి, కెమెరామెన్ పెనికెలపాటి అనిల్ ఆమె ఇంటికి తరచూ వస్తున్నారు. బాలికపై ఇద్దరు కన్నేసి సినిమాలు అవకాశాలు ఇప్పిస్తామని ఆశ కల్పించారు. ఇదే విషయాన్ని వారు బాలిక పెద్దమ్మకు తెలపగా, వారిద్దరికి సినీ పరిశ్రమలో మంచి పలుకుబడి ఉందని వారితో చనువుగా ఉంటే మంచి అవకాశాలు వస్తాయని బాలికను ఇద్దరు నమ్మించారు. పెద్దమ్మ మాటలు విని వారితో మాట్లాడుతున్న సమయంలో పలుమార్లు బాలికపై నిందితులు లైంగిక దాడికి పాల్పడ్డారు. జరిగిన విషయాన్ని బాలిక తన పాఠశాల ఉపాధ్యాయురాలికి తెలిపింది. ఉపాధ్యాయురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంకట శివారెడ్డి, పెనికెలపాటి అనిల్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Ditwah cyclone | విధ్వంసం.. Ditwah cyclone, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టుల సంచలన లేఖ
హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు లేఖను విడుదల చేశారు
Secretariat Union Polls Turn Into New Political Battleground in Andhra Pradesh
Andhra Pradesh has not seen any major elections after the YSRCP was defeated in last year’s Assembly polls and the NDA alliance came to power. The wait ends soon. The State Secretariat Employees’ Union is heading into a crucial election that has already started drawing political attention across the state. The term of the current […] The post Secretariat Union Polls Turn Into New Political Battleground in Andhra Pradesh appeared first on Telugu360 .
Digital Arrest |సైబర్ గ్యాంగ్ అరెస్ట్..
Digital Arrest | సైబర్ గ్యాంగ్ అరెస్ట్.. Digital arrest, భీమవరం బ్యూరో,
Nandigama Election |నందిగామ అంటేనే.. నాణ్యతకు చిరునామా..
Nandigama Election | నందిగామ అంటేనే.. నాణ్యతకు చిరునామా.. Nandigama Election |
Ys Jagan : రాష్ట్రమంతటా కల్తీ మద్యమే... రెడ్ బుక్ తో అక్రమ కేసులే
రెడ్ బుక్ పాలనలో వైసీపీ నేతలపై కక్ష సాధింపునకు దిగుతున్నారని వైఎస్ జగన్ అన్నారు
తుఫాన్ తో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా రాలేదు: జగన్
అమరావతి: ఎపిలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేలా కూటమి పాలన ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తమ హయాంలో వ్యవసాయాన్ని పండగలా చేశామని తెలియజేశారు. పండగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా మార్చారని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. మొంథా తుఫాన్ తో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా రాలేదని, రైతులకు హక్కుగా ఉన్న పంట బీమా పథకాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. కేజీ అరటిపండ్లు రూపాయంటే రైతులు ఎలా బతకాలి? అని జగన్ ప్రశ్నించారు. ఎపి నుంచి ఢిల్లీ, ముంబైకి రైళ్లలో 3 లక్షల టన్నుల ఎక్స్ పోర్టు చేశామని అన్నారు. రైతులకు ఏ పంటకూ మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజీలను మూసేశారని, ఈ క్రాప్ వ్యవస్థను ఎపి సిఎం చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని జగన్ ధ్వజమెత్తారు.
Engineering college |ఉపకార వేతనాలు..
Engineering college | ఉపకార వేతనాలు.. Engineering college, భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ
Andhra Pradesh : టీడీపీ vs జనసేన .. కూటమిలో క్రాక్స్...ఇక్కడ కూడా అంటుకున్నట్లేనా?
కూటమిలోని మిత్ర పక్ష పార్టీలకు ఒకరంటే ఒకరికి పొసగడం లేదు
Lord |దత్తాత్రేయునికి పంచామృత అభిషేకం..
Lord | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు శ్రీ షిరిడి సాయి దివ్య,
Akhanda : అఖండ 2 సినిమా విడుదలకు బ్రేక్.. హైకోర్టు సంచలన తీర్పు
అఖండ సినిమాకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
IMDB Most Popular Indian Stars of 2025
IMDB has announced the most Popular Stars of the country for the year. Saiyyara stars Ahaan Panday and Aneet Padda are on the top of the list and they surpassed several legendary actors. None from Telugu cinema are in the list. Aamir Khan, Ishaan Khatter and Lakshya made it to the top five. Rashmika Mandanna, […] The post IMDB Most Popular Indian Stars of 2025 appeared first on Telugu360 .
100కు పైగా ఇండిగో విమానాల రద్దు #Airlines #Hyderabad #IndiGo #DGCA #FlightCancellation
170 ఇండిగో విమాన సర్వీసులు రద్దు
ఢిల్లీ: వరుసగా రెండోరోజు ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. గురువారం 170 విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బుధవారం కూడా 200 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసింది సాంకేతిక లోపం కారణంగా విమానాలను రద్దు చేశారు. రేపు కూడా ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం తప్పదని ప్రకటించారు. ఇండిగో విమానాల్లో సాంకేతిక లోపం, ఆలస్యంపై డిజిసిఎ దర్యాప్తు చేస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 28 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సిన 27 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విమానాలు రద్దు కావడంతో ఎయిర్పోర్ట్లో అయ్యప్ప స్వామి భక్తుల ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలి : కెటిఆర్
హైదరాబాద్: పారిశ్రామిక భూములను చౌకధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. భూముల దోపిడీ ఆర్నెల్లుగా జరుగుతుందని, పాలసీ ఇప్పుడు బయటకొచ్చిందని అన్నారు. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై బిఆర్ఎస్ బృందం నిజనిర్థారణ చేశారు. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుత్బుల్లాపూర్ లోని షాపూర్లో హమాలీలతో కెటిఆర్, బిఆర్ఎస్ నేతలు మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలని సూచించారు. రూ. 5 లక్షల కోట్ల భూదోపిడికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలని కోరారు. రూ. 5 లక్షల కోట్ల భూకుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాడతామని, ఆషాడం సేల్ వంటి ఆఫర్ ను చూసి పారిశ్రామికవేత్తలు మోసపోవద్దని అన్నారు. రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో పారిశ్రామికవేత్తలు భాగం కావొద్దని, తమ ప్రభుత్వం వచ్చాక ఆ భూములు వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అవినీతి అనకొండ అని ఢిల్లీకి మూటలు పంపేందుకు.. దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసం భూములను ధారాదత్తం చేస్తున్నారు? అని కెటిఆర్ ప్రశ్నించారు.
Raging |పెట్రేగిపోతున్న ర్యాగింగ్ భూతం
Raging | పెట్రేగిపోతున్న ర్యాగింగ్ భూతం ఆంధ్రప్రభ, ఉమ్మడి మెదక్ బ్యూరో :
Disasters | కోతులు కూడా.. Disasters, పెడన, ఆంధ్రప్రభ : పెడన మండలం
Dubai Meeting for Ram Charan and Sukumar
Ram Charan is committed for a film with Sukumar and the top director is working on the script. Sukumar and his team are in Dubai and are busy completing the script work of the film. Sukumar and Ram Charan met for two days in Dubai to discuss about the script. Ram Charan has completed the […] The post Dubai Meeting for Ram Charan and Sukumar appeared first on Telugu360 .
Ys Jagan : మొంథా తుపాను పరిహారం ఎక్కడ బాబూ?
మొంథా తుపానుతో దెబ్బతిన్న పంటలకు ఇప్పటి వరకూ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాస్ పై ఎసిబి దాడి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాస్ పై ఎసిబి దాడి చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇండ్లలో ఎసిబి సోదాలు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల ఎసిబి అధికారులు సోదాలు చేస్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ ఇడిగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లు ఉండడంతో పాటు పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంతో పాటు రాయ్ దుర్గ మై హోమ్ భుజాలో ఎసిబి సోదాలు చేస్తోంది.
Gifted |రూ.కోటి విలువైన వెండి మండపం బహుకరణ
Gifted | మోపిదేవి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజుల్లుతున్న
పోలీసులకే సవాల్ విసురుతున్న హ్యాకర్స్.... పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్
హైదరాబాద్: సైబర్ హ్యాకర్ల దృష్టి పోలీస్ వెబ్ సైట్లపై పడింది. మరోసారి తెలంగాణ పోలీసు వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి రాష్ట్ర పోలీస్ సాంకేతిక విభాగానికి సవాల్ విసిరారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది రెండవసారి ఇలా పోలీస్ సైట్లను హ్యాక్ చేయడం జరిగింది. తాజాగా తెలంగాణ పోలీసు వెబ్ సైట్ సహా హైదరాబాద్ మహా నగర పరిధిలోని సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు చెందిన సైట్లను కూడా హ్యాక్ చేశారు. ప్రస్తుతం పోలీస్ విభాగానికి చెందిన సాంకేతిక నిపుణులు వెబ్ సైట్లను మళ్లీ పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద పోలీస్ సైట్లలోని కీలక సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Deputy CM | ఘన స్వాగతం.. Deputy CM, రేణిగుంట, ఆంధ్రప్రభ :
Fields |వరినాట్లకు సిద్ధమైన రైతన్నలు
Fields | వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్
Cyclone | నెల్లూరులో వర్షాలు.. Cyclone, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : దిత్వా
Bigg Boss 9 : ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం టిక్కెట్ లు ఫినాలే టాస్క్ లు జరుగుతున్నాయి.
Congress |సర్పంచ్ బరిలో కటికి కిరణ్ కుమార్
Congress| సర్పంచ్ బరిలో కటికి కిరణ్ కుమార్ Congress| తల్లాడ, ఆంధ్రప్రభ :
Delhi |వల్లభనేని బాలశౌరితో భేటీ..
Delhi | వల్లభనేని బాలశౌరితో భేటీ.. Delhi, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని
భౌగోళిక, రాజకీయ, దేశీయ పరిణామాల కారణంగా మన దేశ కరెన్సీ రూపాయి మారక విలువ ఇటీవల కాలంలో ఎన్నో ఒడిదుడుకులకు గురవుతోంది. డాలర్లో పోల్చితే రూపాయి మారకం విలువ తొలిసారి 90 స్థాయికి పతనమైంది. గత కొద్ది రోజులుగా అమెరికన్ కరెన్సీ ముందు అనేక కుదుపులకు బక్కచిక్కి మంగళవారం నాటికి చారిత్రకంగా కనిష్ఠ స్థాయికి పడిపోవడం గమనార్హం. గత కొద్ది నెలలుగా డాలర్లకు దిగుమతిదారుల నుంచి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దాంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. గత నెల 21న ఒక్క రోజే 98 పైసలు దిగజారడం గమనార్హం. భారతీయ రిజర్వుబ్యాంక్ కూడా ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకోకపోవడంతోపాటు ఇతర కారణాల కూడా ఈ పరిస్థితికి దోహదం చేశాయి. ఎగుమతి వృద్ధి మందగించడంతో వాణిజ్య లోటు పెరుగుతుండడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థిక వేత్త మదన్సబ్నవిస్ అభిప్రాయం వెలిబుచ్చారు. దేశీయంగా వృద్ధి మందగించడం, వాణిజ్య లోటు పెరగడం, దేశీయంగా పెట్టుబడులు సన్నగిల్లడం, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఆగకపోవడం తదితర కారణాలు రూపాయి విలువను మరింత దిగజారుస్తున్నాయి. గత ఏడాది కూడా ఇదే డిసెంబర్ నెలలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 85.20 కి కనిష్ఠ స్థాయికి చేరింది. అంటే గత ఏడాది డిసెంబరు నెలలోనే రెండుసార్లు రూపాయి విలువ అమెరికా డాలరుతో పోలిస్తే బాగా క్షీణించిందని స్పష్టమవుతోంది. గడచిన ఐదేళ్లలో రూపాయి విలువ 20 శాతం క్షీణించగా, వచ్చే ఐదేళ్లలో ఇదే స్థాయిలో పతనం కావచ్చని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 2030 నాటికి అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలరుతో రూపాయి మారకం విలువ 100 కు పడిపోవచ్చని నివేదికలు జోస్యం చెబుతున్నాయి. 2019 లో డాలరుతో రూపాయి మారకం విలువ 70 స్థాయిలో ఉండగా, మోడీ ప్రభుత్వకాలంలో 20 శాతం పతనమై ఇప్పుడు 90 స్థాయికి దిగజారింది. ఈ నేపథ్యంలో 2029 డిసెంబరు నాటికి 8788 స్థాయిల మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు రూపాయితోపాటు కొరియన్ వోన్, మలేసియన్ రిగింట్స్, ఇండోనేషియా రూపాయి విలువలు కూడా హెచ్చుతగ్గులవుతున్నాయి. అయితే ఇవేవీ అంతర్జాతీయ మారకపు కరెన్సీలుకావు. కేవలం డాలర్కే ఆ ప్రాధాన్యం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలరు ఒక్కటే లింకు కరెన్సీ. అంతర్జాతీయ మార్కెట్లో లావాదేవీలన్నీ డాలర్ల లోనే జరుగుతాయి. దిగుమతి సరకులన్నిటికీ డాలర్ లోనే చెల్లింపులు జరగాలి. మన ఎగుమతులు మన అవసరానికి మించి డాలర్లను సంపాదించినప్పుడే అంతర్జాతీయ వాణిజ్య లోటు తొలగుతుంది. లేదా పరిమితమవుతుంది. అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిడి అంటే అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం వల్ల కలిగే ఒత్తిడి. స్వదేశంలో ద్రవ్యోల్బణాన్ని పరిమితిలో ఉంచుకోడానికి అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతుంటుంది. మన రూపాయితోపాటు వర్ధమాన దేశాల కరెన్సీపై ఒత్తిడి పెంచుతోంది. ఈ క్రమం లోనే మనదేశంలో గత ఏడాది డిసెంబర్ 18న 84.94 స్థాయిలో ఉన్న రూపాయి మారకం విలువ డిసెంబర్ 19 ఉదయానికి 85.06 వద్ద ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. వరుసగా రూపాయి పతనం వల్ల దిగుమతి ఉత్పత్తులు భారంగా మారనున్నాయి. విదేశీ చదువులు, అంతర్జాతీయ ప్రయాణాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, చమురు, బంగారం, వంటనూనెలు, పప్పుదినుసులు తదితర ధరలు భారీగా పెరుగుతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల వీసాలు, వసతి కోసం వారి తల్లిదండ్రులు భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి నగదును డాలర్ల లోకి మారిస్తే మరిన్ని ఎక్కువ రూపాయిలు వెచ్చించాల్సి ఉంటుంది. మనం దిగుమతి చేసుకునే చమురుకు కూడా డాలర్ల లోనే చెల్లింపులు చేస్తుంటాయి. దీనివల్ల ఖజానాపై భారం పడడమే కాకుండా పెట్రోలు, డీజిల్ ధరలు మరింత పెరుగుతున్నాయి.అనవసరమైన దిగుమతులను మానుకోవడమో, తగ్గించుకోవడమో చేస్తే డాలర్తో రూపాయి పతనాన్ని పరిమితం చేయవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు 2022 లో మే నెలలో 107 టన్నుల బంగారాన్ని మనదేశం దిగుమతి చేసుకుంది. బంగారాన్ని డాలర్లు చెల్లించి తెచ్చుకోవలసి ఉంటుంది. అది అవసరమైన దిగుమతి కాదు కాబట్టి దాని దిగుమతిని నిరుత్సాహ పర్చడం ద్వారా డాలర్లను పొదుపు చేయాలని భావించి దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. మన దిగుమతుల్లో ముఖ్యమైనది క్రూడాయిల్. పెట్రోల్, డీజిల్కు మూలమైన క్రూడాయిల్ 85 శాతం ఇతర దేశాల వద్ద అంతర్జాతీయ రేటుకు విదేశీ మారక ద్రవ్యంతో కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటున్నాం. దాని రేటు పెరిగే కొద్దీ విదేశీ మారక ద్రవ్యాన్ని అమితంగా చెల్లించవలసి వస్తుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తదితర కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర అనూహ్యంగా పెరుగుతోంది. మనం దిగుమతి చేసుకుంటున్న సరకులను స్వదేశీయంగా ఉత్పత్తి చేసుకోగలిగితే రూపాయి పతనం నుంచి రక్షణ పొందవచ్చు. ఇదిలా ఉండగా ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ప్రధాని మోడీ పదేపదే ప్రచారం చేస్తున్నా, అంతర్జాతీయ మార్కెట్ స్థాయిలో నాణ్యమైన ఉత్పత్తులను అందించే పరిస్థితి ఇంకా మనకు ఏర్పడలేదు. నాణ్యమైన సరకులను ఉత్పత్తి చేయగలిగితేనే వాటికి విదేశాల్లో మంచి గిరాకీ ఏర్పడుతుంది. ఆమేరకు మనదేశం నుంచి ఎగుమతులు పెరుగుతాయి. దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది.
AP | మద్యం హోమ్ డెలివరీ.. AP, కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Kollywood |ఏవీఎం శరవణన్ ఇకలేరు
Kollywood | ఏవీఎం శరవణన్ ఇకలేరు.. Kollywood, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
భారత దేశంలో డిజిటల్ యుగంలో ప్రజల జీవితాలు మొబైల్ ఫోన్లతో ముడిపడి ఉన్నాయి. ప్రతి సందేశం, ప్రతి కాల్, ప్రతి లొకేషన్... ఇవన్నీ మన స్వేచ్ఛా జీవితాలలో భాగం. కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఒక ఆదేశం ఈ స్వేచ్ఛను ఆపదకు గురిచేస్తోంది. ‘సంచార సాథి’ అనే యాప్ను అన్ని స్మార్ట్ ఫోన్లలో బలవంతంగా ప్రీ -ఇన్స్టాల్ చేయాలని కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్, కంపెనీలను, యూనిట్స్ ను ఆదేశించింది. ఇది ఫోన్ దొంగతనాలు, స్కామ్లు నిరోధించడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ, ఈ వాదానికి వ్యతిరేక (సాంకేతిక నిపుణులు) వాదులు చెప్పేది ఏమిటంటే, ప్రైవసీ యాక్టివిస్టులు దీన్ని ‘స్నూపింగ్ యాప్’గా, పెగాసస్ 2.0 బ్రాండ్ అని పిలుస్తున్నారు. ఇది రక్షణ వాగ్దానమా లేక ప్రజలను పర్యవేక్షించే గూఢచార (స్పై) ఆయుధమా? ఈ వివాదం మన డిజిటల్ హక్కులపై లోతైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ‘సంచార సాథి’ యాప్ 2023 మే లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డాట్) చేత ప్రవేశపెట్టబడింది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ప్లాట్ ఫామ్గా, మొబైల్ యూజర్లకు ఫోన్ గుర్తింపు (ఐఎంఇఐ వెరిఫికేషన్), కోల్పోయిన డివైస్లు ట్రాకింగ్, అనధికార సిమ్లు బ్లాక్ చేయడం వంటి సౌకర్యాలు అందిస్తుంది. ప్రభుత్వం ప్రకారం, 2023 నుంచి 6 లక్షలకు పైగా కోల్పోయిన ఫోన్లు పునరుద్ధరించబడ్డాయి. ఒక్క క్షణానికి ఒక ఫోన్ ట్రేస్ అవుతోంది. 57 లక్షల సిమ్లు బ్లాక్ చేయబడ్డాయి, 17 వేల దొంగ ఫోన్లు అడ్డుకున్నాయి. ఇది ‘డిజిటల్ భారత్’ విజన్లో భాగంగా, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేస్తుందని యూనియన్ టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెబుతున్నారు. ‘ఇది ఐచ్ఛికం, డిలీట్ చేయవచ్చు’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం యాప్ ‘పర్సనల్ డేటా’ స్వయం చాలకంగా క్యాప్చర్ చేయదని, యూజర్ అనుమతి లేకుండా ఏమీ చేయదని వాదిస్తోంది. టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 కింద జారీ చేసిన ఈ ఆదేశం, 90 రోజుల్లో అమలు చేయాలని ఆపిల్, సామ్సంగ్, గూగుల్, షియోమీ వంటి కంపెనీలకు ఆదేశించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఇన్స్టాల్ చేయాలని కూడా చెప్పారు. కానీ ఈ ‘సేఫ్టీ ప్రామిస్’ వెనుక దాగిఉన్న వాస్తవాలు భయభ్రాంతులు కలిగిస్తున్నాయి. యాప్కు కాల్స్, మెసేజెస్, స్టోరేజ్, లొకేషన్, కెమెరా యాక్సెస్ అవసరమవుతుంది. ఇది (ఐఎంఇఐ) స్నూఫింగ్ను నిరోధిస్తుందని చెప్పినా, ఇది ప్రజల ఫోన్ యాక్టివిటీని పూర్తిగా మానిటర్ చేసే బ్యాక్ డోర్గా మారే అవకాశం ఉందని, అపోజిషన్ నేతలు (కొందరు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ సాంకేతిక నిపుణులు) దీన్ని ‘బిగ్ బ్రదర్’ వాచింగ్గా వర్ణిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ‘ఇది బిజెపి అధికారులతో ప్రజల మాటపై నిఘా పెట్టడానికి మరో ప్రయత్నం’ అని, ‘మరో డిక్టేటర్షిప్’ గా అభివర్ణించారు. ప్రియాంక గాంధీ ‘స్నూపింగ్ యాప్’ అని ‘ఫ్రాడ్ రిపోర్టింగ్, మధ్యలో ప్రతి పౌరుడు ఫోన్ను చూసే వ్యక్తి గత సమాచార సేకరణ’ అని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపి రేణుక చౌదరి పెగాసస్తో పోల్చి, ‘ఎంపిలు, ఎంఎల్ఎల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి’ అని ఆరోపించారు. ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసి ‘ప్రజల ప్రైవసీని ధ్వంసం చేసే మోడీ ప్రభుత్వం మరో ప్రయత్నం’ అని ట్వీట్ చేశారు. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ‘ఇది రీసెండ్ అయ్యే వరకు పోరాటం చేస్తాం’ అని ప్రకటించింది. ఈ విమర్శలు ఆధార్ రహితం కాదు. 2017లో సుప్రీం కోర్టు ప్రైవసీని ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా గుర్తించింది. కానీ, మోడీ ప్రభుత్వం అప్పటి నుంచి ప్రైవసీకి వ్యతిరేకంగా నిలబడింది. ‘పెగాసస్ స్కాండల్’ లో ప్రభుత్వం ‘జవాబుదారీతనం చూపలేదు’. ఇప్పుడు సంచార సాథి 73 కోట్ల స్మార్ట్ ఫోన్లలో బలవంతంగా రావడం, ఇది మాస్ సర్వెయిలెన్స్ టూల్గా మారే అవకాశం ఉంది. యాప్ ‘రెడిలీ విజిబుల్’ గా ఉండాలి, ‘డిసేబుల్’ చేయకూడదని ఆదేశం. ఇది యూజర్ ఎంపికను బలహీనపరుస్తుంది. ఆపిల్, సామ్సంగ్ వంటి కంపెనీలు ఇంకా కంప్లయి చేయడానికి మానసికంగా తమ సంసిద్ధతను చూపలేదు. ఆపిల్ ‘ప్రైవసీ రిస్క్లు’ అని చెప్పి, మధ్య మార్గంలో ప్రజలు నిత్యజీవితంపై 27X7 నిఘాను ఉంచాలని చూస్తోంది. ఇది ఆర్థిక బలవంతంపై కంపెనీలు భారత మార్కెట్ను కోల్పోవడానికి తోడ్పడతాయి. ప్రభుత్వ వాదనలు ఆకర్షణీయంగా ఉన్నా, వాటిలో లోపాలు ఉన్నాయి. (ఐఎంఇఐ) మిస్యూజ్ నిరోధం అవసరమే. కానీ.. దానికి మొత్తం పాపులేషన్ను స్కాన్ చేయాలా? యూరపులో (జిడిపిఆర్) వంటి చట్టాలు ప్రైవసీని ప్రాధాన్యత ఇస్తాయి. ఇక్కడ మాత్రం ‘సేఫ్టీ’ పేరుతో సర్వైలెన్స్ జస్టిఫై చేస్తున్నారు. ఈ యాప్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎవరు యాక్సెస్ చేస్తారు? పార్లమెంట్లో చర్చ లేకుండా రహస్యంగా జారీ చేయడం డెమోక్రసీకి విరుద్ధం అని విపక్షాలు విమర్శలు, హెచ్చరికలు చేస్తున్నాయి. వ్యతిరేకులు చెప్పేది సరైనదే. -ఇది డిసెంట్ను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీడియా రిపోర్టుల ప్రకారం, ఇది ‘పర్మినెంట్ సర్వెయి లెన్స్ బ్యాక్ డోర్’ గా మారవచ్చు. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, మోడీ ప్రభుత్వం ఇప్పటికే ‘లాఫుల్ ఇంటర్సెప్షన్’ సిస్టమ్ల ద్వారా స్నూపింగ్ చేస్తోంది. ఈ వివాదం మన డిజిటల్ భవిష్యత్తును ప్రశ్నిస్తోంది. సర్వైలెన్స్ రాజ్యంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడలేరు, రాజకీయాలు చేయలేరు. ప్రభుత్వం ‘సేవా తీర్థ్’ పేరుతో పిఎంఒను మార్చుకుంటుండగా, ప్రజల హక్కులు కోల్పోతున్నాయి. ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి. పార్లమెంటరీలో చర్చ జరిగి, ట్రాన్స్పరెంట్ పాలసీ రూపొందించాలి. యాప్ ఐచ్ఛికంగా ఉంచి, స్ట్రాంగ్ డేటా ప్రొటెక్షన్ లాస్ తీసుకు రావాలి. లేకపోతే, డిజిటల్ భారత్ ‘డిస్టోపియన్ భారత్’ గా మారిపోతుంది. ప్రజలు మొబైల్లను ఆఫ్ చేసి, ప్రైవసీకై పోరాడాలి. ఇది కేవలం యాప్ వివాదం మాత్రమే కాదు. మన స్వేచ్ఛా, స్వాతంత్య్రాలపై చట్ట రీత్యా యుద్ధం చేయటమే. - డా. కోలాహలం రామ్ కిశోర్ 9849328496
IBomma Ravi : ఐబొమ్మ రవి షాకింగ్ డెసిషన్.. పోలీసులు కంగుతిన్నారుగా?
ఐబొమ్మ రవిని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు
బెలూన్ల వల్ల మూతపడిన విమానాశ్రయం #Europe #Lithuania #Belarus #AirportSecurity #HybridAttack
ELECTIONS |ఎంపీడీవో, ఎంపీవో సస్పెండ్
ELECTIONS| ఎంపీడీవో, ఎంపీవో సస్పెండ్ ELECTIONS| నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : స్థానిక గ్రామ
అంతులేని ఆవేదనలకు పరిష్కారం ఎక్కడ?
చాలీచాలని సంపాదనతో, ఆర్థికంగా సతమతమవుతూ, బతుకుదెరువు బహు కష్టంగా మారిన నేపథ్యంలో మధ్య తరగతి జీవితాలు అల్లకల్లోల సాగరాన్ని తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులనుండి కాపాడి, ఒడ్డుకు చేర్చే శాశ్వత పరిష్కారాలను అన్వేషించడం అత్యవసరం. సమాజంలో పలు వైరుధ్యాలు తాండవిస్తున్నాయి. అహంకారమే తప్ప ఆలోచనా శక్తిలేని నూతన తరం రూపుదిద్దుకుంటున్నది. తరాల మధ్య అంతరం పెరిగింది. అంతరంగ మథనం లోపించింది. ‘తాను మునిగిందే గంగ, తాను వలచిందే రంభ..’ చందంగా మూర్ఖ భావజాలం, ఆధిక్యతా ధోరణి మానవ మస్తిష్కంలో తిష్ఠ వేసింది. స్వార్థ్ధం పరాకాష్ఠకు చేరింది. వంచనతో దర్జాగా బతికే వారు కొందరైతే, వ్యక్తిత్వంతో బతికలేక జీవశ్ఛవాల్లా జీవితాంతం మనోవేదనతో బతుకీడ్చేవారు మరికొందరు నేటి సమాజంలో అడుగడుగునా తారసపడతారు. తినడానికి తిండిలేక కొంతమంది విగతజీవులవుతుంటే, సకల సౌభాగ్యాలతో జీవిస్తూ, విలాసాల్లో తేలియాడుతూ ఏదో అసంతృప్తితో ఆత్మహత్యలకు పాల్పడేవారు మరికొందరు నేటి సమాజంలో మనకు అగుపిస్తున్నారు. యువశక్తి వ్యసనాలతో నిర్వీర్యమవుతున్నది. కలిమి కలత చెందుతున్నది. లేమి దిగులు చెందుతూ జీవనయానం సాగిస్తున్నది. ఒకవైపు మోదం, ఇంకోవైపు ఖేదం.. ఇదే సామాజిక వైపరీత్యం. అంబరాన్ని తాకే సంబరంతో ఆడంబరాలతో దిగంబరంగా మారుతున్న నూతన విన్యాసం ఒక వైపు... జానెడు పొట్ట నింపుకోలేక, కట్టుకోవడానికి సరైన గుడ్డలేక, ఉండడానికి సరైన గూడులేక అలమటించే అభాగ్యుల దీనగాథలు మరో వైపు మానవ జీవితం లోని అంతరాలను వెక్కిరిస్తున్నాయి. విందు వినోదాల ఉల్లాసాలు వికాసానికా? విలువల విధ్వంసానికా? ఇది ప్రగతికి బాటలు వేస్తున్నదా? బీటలు పెడుతున్నదా? ఒకవైపు మధ్య తరగతి జీవుల బతుకుల్లో హాలాహలం.. మరో వైపు బరువెక్కిన కరెన్సీని విలాసాలకు వెచ్చిస్తూ కాలయాపన చేస్తున్న యువతరం కోలాహలం. ఇది కలానికందని కల్లోలం. సగటు జీవుల బతుకుల్లోని వేదనలు కాలగర్భంలో దాగున్న కనబడని సుడిగుండాల వంటివి. కష్టాల సుడిగుండాలు బలపడి మృత్యు విహంగాలై జీవిత నావను తీరం దాటే తరుణంలో ప్రళయ ప్రభంజనమై ముంచేస్తున్నాయి. జీవన యానానికి ముగింపునిస్తున్న సన్నివేశాలు హృద్యం.. మరికొంతమందికి చోద్యం. కొందరి కంట కన్నీరు! కొందరి ఇంట సిరుల పన్నీరు! సేద్యంలో విలాపం.. స్వేదానికి దగ్గని ఫలితం. కొందరి స్వేదం మరికొందరికి కరెన్సీగా మారి, కొంత మంది ధనిక యువత చేతిలో ఖరీదైన మద్యం సీసాలా పరివర్తన చెంది వెక్కిరిస్తే ఇది సమాజ వికాసమా? విలాపమా? ఒక చెంత ‘మందు’తో తనువు చాలిస్తున్న కర్షకుడు! మరోచెంత మందుతో గాండ్రిస్తున్న భోగలాలసుడు! విందు విలాసాలే జీవిత పరమార్థంగా కొందరు బతికేస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయి అతి దీనంగా మరికొందరు బతుకీడ్చుతున్నారు. విలాసాల వినువీధుల్లో ఊరేగి, ఆశించింది అందక తనువు చాలిస్తున్నారు ఇంకొందరు! బతకాలని ఉన్నా బతకనీయని బడబాగ్ని జ్వాలలు చుట్టుముడుతుంటే, గరళాన్ని మింగుతున్న సగటు జీవుల వెతలు వర్ణనాతీతం. దేశానికి ‘ముద్ద’ పెడుతూ, ముద్ద లేక గతిస్తున్న కర్షకజన చరిత్ర ఆద్యంతం అత్యంత బాధాకరం. విలాసాల్లో మునిగి ప్రేమ అంచుల దాకా పయనించి పతనమవుతున్న యువతరానికి ఉరితాళ్ళే శరణ్య మవుతుంటే, కష్టాలను భరించలేని కర్షకునికీ ఆ ఉరితాళ్ళే ఆలంబన అవుతున్నాయి. మధ్య తరగతి జీవుల ఆర్థిక బాధలకు ఆత్మహత్యలే ఆఖరి అవకాశంగా మారుతున్నాయి. అందరి గమ్యం ఒకటై వెక్కిరిస్తుంటే చోద్యం చూడడం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా విలపిస్తున్నాం. ఒకరిది అర్థవంతమైన ఆవేదన, మరొకరిది అర్థంలేని మనోవేదన. ఇరువురూ విషాద గేయానికి పల్లవులే. నిద్దురలేని రాత్రులలో ప్రపంచం వెక్కిరిస్తుంటే పలకలేని గేయానికి చరణాలే. స్వరం తప్పిన గీతికలే. బతుకు వేదంలో శృతిలేని నాదాలే. ఇద్దరిదీ ఒకటే గమ్యం.. అదే మరణం. విలాసాల మోజుకు బానిసలై కడకు ‘మనీ’ లేక మినీ జీవితం గడపలేమని బలవుతున్న బడాయి జీవుల బతుకు చిత్రం ఒకరిదైతే, అహరహం స్వేదం చిందించి, దక్కని ఫలితంతో తనువు చాలిస్తున్న దైన్య చరిత మరొకరిది. ఇదే ఇరువురి జీవితాలలో కానరాని సారూప్యం.. అడుగడుగునా వైరుధ్యం. ఆశించినది దక్కక ఒకరు. హృదయం బరువెక్కి బతకలేక తనువు చాలిస్తున్నది మరొకరు.అర్థవంతమైన జీవితాలకు ముగింపు మరణమా? అర్థంలేని వ్యర్థవాదుల మనుగడకు మార్గమా ? విలాసాల విహంగంలా తేలియాడుతూ, కోరికల గుర్రాన్నెక్కి ఊహల్లో భ్రమిస్తూ పరిభ్రమిస్తున్న యువత తన లక్ష్యం మరచి, మత్తులో చిత్తవడం హాస్యాస్పదం. జల్సాలకు మరిగి, కోరింది దొరకలేదనే ఆవేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు, ఒక్క క్షణం ఇతరుల జీవితాల్లో ఎదురవుతున్న సమస్యలను తొంగిచూస్తే వారి సమస్యల ముందు తమ సమస్యలు అర్థంలేని చిందరవందర గీతలుగా అగుపించక మానవు. అర్థవంతమైన జీవితాలకు ముగింపు మరణం కారాదు. జీవన తీరానికి దారులు ఆత్మహత్యలు కావనే సందేశం నిజం కావాలంటే ప్రస్తుత పరిస్థితులు మారాలి. - సుంకవల్లి సత్తిరాజు 97049 03463
100 Years |మండలికి ఘనంగా నివాళులు..
100 Years | మండలికి ఘనంగా నివాళులు.. 100 Years, కోడూరు, ఆంధ్రప్రభ
విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు... సిఎం ఇంటి ముందు ధర్నా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని భవానీపురంలో హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టారు. దీంతో బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. 25 ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జోజినగర్ లోని 42 ఫ్లాట్ల బాధితులు చంద్రబాబు ఆదుకోవాలంటూ సిఎం ఇంటి ముందు ధర్నాకు దిగారు. సిఎంను కలిసే అవకాశం కల్పించాలంటూ పోలీసులతో బాధితులు మొర పెట్టుకుంటున్నారు. ఇళ్లు కూలగొట్టడంతో అక్కడ కూడా రోడ్ల మీదే పడుకోవడం కంటే చంద్రబాబు ఇంటి ముందే కూర్చున్నామని బాధితులు వాపోయారు. మా ఇండ్లు కూలగొట్టడంతో రోడ్డు పడ్డామని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు భారీ పోలీసు బందోబస్తు నడుమ భవానీపురంలో 42 ఫ్లాట్స్ కూల్చివే కూల్చివేశారు. 42 ఫ్లాట్స్ కూల్చివేతతో బాధితులు రోడ్డున పడ్డారు. విజయవాడ భవానీ పురంలో బాధితులు ఆందోళన చేపట్టారు. పెట్రోల్ పోసుకొని బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉదయం ఫ్లాట్స్ కూల్చుతున్న వేళ పట్టించుకోలేదని ఇప్పుడు ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు అని పోలీసులపై బాధితుల ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో సదరు సొసైటీ కూల్చివేసిన ప్రాంతం చుట్టూ గోడ కడుతున్నారు.
confusion | గుర్తుల గుబులు గందరగోళానికి ఛాన్స్అవకాశాలపై నీళ్లుఆందోళనలో అభ్యర్థులు confusion |
MSV: Chiru, Nayan’s Stylish Poses On Sasirekha
Megastar Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu is steadily amplifying the festive buzz for its Sankranthi 2026 release. After the electrifying success of the first song Meesala Pilla, which stormed past 75 million views, the team is now shifting attention to their next musical treat. Director Anil Ravipudi has lined up the second single titled […] The post MSV: Chiru, Nayan’s Stylish Poses On Sasirekha appeared first on Telugu360 .
Amaravathi : భూములు కొనేవారు లేరట.. నెవర్ ఎండింగ్ ల్యాండ్ పూలింగ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూసమీకరణకు నోటిఫికేషన్ విడుదలయింది
సాధారణంగానే మిలిటరీ రూల్స్ కఠినంగానే ఉంటాయి. అందులోని మాన్యువల్స్కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్షలు కూడా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి క్రమశిక్షణ ఉల్లంఘనలకు ఎలాంటి మన్నింపులు, మాఫీలు ఉండవు. సైన్యంలో చేరేముందే వీటన్నింటిని గురించి ఆలోచించుకోవాలి. సాధారణ పౌరుడికి లభించే స్వేచ్ఛ కూడా కొన్ని సందర్భాల్లో సైనికులకు నిరాకరించవచ్చు. కోర్టులు కూడా సైనికుడి వాదనను త్రోసిపుచ్చుతాయి. కవాతులో భాగంగా పరమత దేవాలయంలోకి వెళ్లి పూజను ఆచరించకున్నా క్రమశిక్షణ తప్పిన కిందికే లెక్క. క్రైస్తవ మతానికి చెందిన సైనిక అధికారి సామ్యూల్ కమలేశన్ తన రెజిమెంట్ పాటించే హిందూ మత ఆచారాలను పాటించనందుకు క్రమశిక్షణ చర్యగా 2021 లో తన ఉద్యోగం కోల్పోయాడు. ఆర్మీ చట్టంలోని సెక్షన్ 19, ఆర్మీ రూల్స్లోని రూల్ 14 ప్రకారం తమ చర్య సక్రమమే అని సైన్యం అంటోంది. తనను తిరిగి ఉద్యోగం లోకి తీసుకోవాలని ఆయన ఢిల్లీ హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లు కూడా ఫలితం ఇవ్వలేదు. రెండు కోర్టులు సైన్యం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాయి. పంజాబ్ లోని మూడవ కల్వరి రెజిమెంట్ లో సామ్యూల్ కమలేశన్ లెఫ్టినెంట్ కల్నల్ గా 2017 లో చేరాడు. ఆ యూనిట్లో హిందూ గుడి, గురుద్వారా మాత్రమే ఉన్నాయి. వారంలో ఒకసారి సైనికులంతా కవాతుగా వెళ్లి ఆ దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తుంటారు. వారితో గుడుల దాకా వెళ్లిన ఆయన హారతి సమయంలో బయటే ఉండిపోయేవాడు. ఈ ప్రవర్తన ఆర్మీ నిబంధనలకు విరుద్ధమని ఆయనకు పలుమార్లు చెప్పడం జరిగింది. ఆయన రెజిమెంటల్ పరేడ్లో పూర్తిగా పాల్గొన లేదని, ఆర్మీ చట్టంలోని సెక్షన్ 41 పై అధికారి ఆదేశాలను ఉల్లంఘించడం నేరమని కూడా పేర్కొంది. తన క్రైస్తవ విశ్వాసాలు ఇందుకు అనుమతించవని ఆయన అధికారులకు స్పష్టం చేశాడు. సుదీర్ఘ విచారణ తర్వాత అతను 2021 లో సర్వీస్ నుండి తొలగించబడ్డాడు. తన తొలగింపును సవాల్ చేస్తూ కమలేశన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే మతపరమైన కవాతులో పాల్గొననందుకు ఆయనను సర్వీసు నుంచి తొలగించడాన్ని హైకోర్టు కూడా సమర్థించింది. మన సైన్యం అన్ని మతాలు, కులాలు, ప్రాంతాల ప్రజలతో రూపొందించబడింది, దీని ఏకైక లక్ష్యం దేశాన్ని రక్షించడం మాత్రమే. సైన్యం ఐక్యత వారి యూనిఫాం ద్వారా ఏర్పడుతుంది. కమలేశన్ ప్రవర్తన సైన్యం లౌకిక సూత్రాలకు విరుద్ధంగా ఉంది. తన రెజిమెంట్లో గుడి, గురుద్వారా ఉన్నాయని, అయితే అన్ని మతాలకు సంబంధించిన ‘సర్వ ధర్మ స్థల్’ లేదని, చర్చి కూడా లేదని కమలేశన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని రెజిమెంట్ల పేర్లు లేదా సంప్రదాయాలు ఏదైనా మతం లేదా ప్రాంతంతో ముడిపడి ఉన్నప్పటికీ ఇది సైన్యం లౌకిక స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని కోర్టు పేర్కొంది. అధికారి ప్రవర్తన రెజిమెంట్ ఐక్యత, క్రమశిక్షణ, లౌకిక విలువలకు హాని కలిగిస్తుందని హైకోర్టు అంగీకరించింది. యుద్ధ పరిస్థితుల్లో సైన్యంలో ఇటువంటి ప్రవర్తన హానికరమని, కమలేశన్ తన సీనియర్ అధికారుల ఆదేశాల కంటే తన మతానికి ప్రాధాన్యత ఇచ్చాడని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. చివరకు సుప్రీంకోర్టు కూడా కమలేశన్ తొలగింపుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది. సుప్రీం కోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను ధర్మాసనం ఒప్పుకోలేదు. పూజ లేదా హారతి లాంటివి తన క్లయింట్ విశ్వాసానికి విరుద్ధం. రెజిమెంట్ వెంట తను వెళ్లేవాడు, కానీ లోపలికి వెళ్లి పూజలు చేయలేడు. అక్కడ ‘సర్వ ధర్మ స్థల్’ లేదు. దేవాలయాలు, గురుద్వారాలు మాత్రమే ఉన్నాయి. తనను ఏదైనా పూజ చేయిస్తారేమోనని భయపడ్డాడు అని న్యాయవాది వివరించగా కోర్టు ఆ మాటలని తోసిపుచ్చింది. సైనికుల మనోభావాలను మీ క్లయింట్ గౌరవించలేదు. ఆయనను ఎలాంటి పూజలు చేయమని ఎవరూ అడగలేదు. సైనికులతో కలిసి ఉండడం ఆయన విధి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి సెంటిమెంట్ను రక్షించదు. దేవాలయంలోకి అడుగు పెట్టడం క్రైస్తవ మతంలో ఎక్కడ నిషేధించబడింది అని ప్రశ్నించింది. ఇది భారత సైన్యం, ఇక్కడ సెక్యులరిజం అగ్రస్థానంలో ఉంటుంది. ఆయన తోటి సైనికుల మనోభావాలను గౌరవించలేదు. ఆయన వంద విషయాల్లో మంచివారు కావచ్చు, కానీ ఈ తప్పు చాలా పెద్దది. క్రమశిక్షణ విషయంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేము. హైకోర్టు ఆదేశాలను కొనసాగిస్తాం అని సుప్రీం నిర్ణయించింది. వ్యక్తిగత మత విశ్వాసాలు పక్కన బెట్టి సైన్యం లౌకికతకి విలువనీయడం గొప్ప విషయమే. కానీ దాని వల్ల అన్ని మతాల వారికి సమాన అవకాశాలు లభించాలి. దేవాలయ సముదాయం ఒక్క ఆవరణలో ఉంటే సైనిక క్రమశిక్షణకు తప్పే అవసరం ఎవరికీ పడదు. ఇలా ఓ మైనారిటీ వర్గానికి చెందిన అధికారి మత విశ్వాస నమ్మిక వల్ల ఉద్యోగానికే ముప్పు వాటిల్లే పరిస్థితులు రావడం విచారకరమే. అయితే ఈ కేసు కొత్తగా ఒక రాజ్యాంగపరమైన ప్రశ్నను లేవనెత్తింది అనవచ్చు. ఆర్టికల్ 25 ప్రకారం ఒక మత విశ్వాసాన్ని ప్రకటించే, ఆచరించే హక్కు సైనిక క్రమశిక్షణకు లోబడి ఉందా అనే చర్చ అవసరం. - బి.నర్సన్, 94401 28169
Chandrababu |అన్న క్యాంటీన్లో..
Chandrababu | అన్న క్యాంటీన్లో.. Chandrababu, అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర
హోమ్ లోన్ వడ్డీ రేట్లను నిర్ణయించే 4 ప్రధాన అంశాలు
హోమ్ లోన్ వడ్డీ రేట్ల నిర్ణయం అనేది కేవలం ఒక అంశంపై ఆధారపడదు. రుణగ్రహీత వ్యక్తిగత ప్రొఫైల్కు సంబంధించిన అంతర్గత అంశాలు, ఆర్థిక, నియంత్రణ వాతావరణానికి సంబంధించిన బాహ్య అంశాలు వడ్డీ రేటును ప్రభావితం చేస్తాయి. 1. క్రెడిట్ స్కోర్ (రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం) వ్యక్తిగత క్రెడిట్ స్కోర్ అనేది రుణగ్రహీత క్రెడిట్ చరిత్ర, ఆర్థిక ట్రాక్ రికార్డును అంచనా వేయడానికి బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉపయోగించే అత్యంత ముఖ్యమైన అంశం. రేటుపై ప్రభావం: […] The post హోమ్ లోన్ వడ్డీ రేట్లను నిర్ణయించే 4 ప్రధాన అంశాలు appeared first on Dear Urban .
అనారోగ్యంతో ప్రియుడు మృతి... భగ్న ప్రేమికురాలు ఆత్మహత్య
మెదక్: ప్రియుడి మృతిని తట్టుకోలేక భగ్న ప్రేమికురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా కొండపాక ప్రాంతం కుకునూరుపల్లి మండలంలో జరిగింది. కుకునూరుపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన శ్రావణి, దౌల్తాబాద్ మండలం మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేష్ ప్రేమించుకున్నాడు. శ్రావణి కుటుంబ సభ్యులు ఆమెను ఒక బాబా వద్దకు తీసుకెళ్లినప్పుడు అక్కడి మహేష్ పరిచయం కావడంతో ప్రేమలో పడ్డారు. మహేష్ ఇటీవల అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. ప్రియుడు మరణించడంతో శ్రావణి మానసికంగా కుంగిపోయింది. ఇంట్లో వాళ్లతో సరిగా లేకపోవడంతో తల్లి కూతురును పలుమార్లు ప్రశ్నించింది. ఒక అబ్బాయిని ప్రేమించానని, అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అతడు మృతి చెందాడని బాధతో తల్లికి చెప్పింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో శ్రావణి చీరతో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రావణి చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్ఐఏ అధికారులు 22 కోట్ల సోదాలు
ఎన్ఐఏ అధికారులు రెండు రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తున్నారు.
youth power | దేశానికి భవిత youth power | ఏ దేశానికైనా
YCP |వేలేరు వైసీపీ అధ్యక్షుడుగా..
YCP| వేలేరు వైసీపీ అధ్యక్షుడుగా.. YCP, హనుమాన్, ఆంధ్రప్రభ : బాపులపాడు మండలం
పైలట్ తెలివితో హైజాక్ విఫలం #International #SouthSudan #Hijack #Pilot #Aviation #Security
మేనమామ అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది
Missing case |కనిపించడం లేదు..
Missing case | కనిపించడం లేదు.. Missing case, కోడూరు, ఆంధ్రప్రభ :
Danger Mining |ఆరావళిలో ఏం జరుగుతోంది
Danger Mining | ఆరావళిలో ఏం జరుగుతోంది ఆరావళి పర్వతాలకు చారిత్రక ప్రశస్తి
Weather Report : దిత్వా.. ఇంకా ఉంది..నేడు కూడా జోరు వానలు
దిత్వా తుపాను ప్రభావం నేడు కూడా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది
Pawan kalyan |నగరవనం పార్క్ ప్రారంభం..
Pawan kalyan | నగరవనం పార్క్ ప్రారంభం.. pawan kalyan, అనంతపురం బ్యూరో,
Amaravathi : నేడు రాజధాని రైతులతో సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ కోసం నేడు గ్రామస్థులతో సీఆర్డీఏ అధికారులు సమావేశం కానున్నారు
యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ తమ చిత్రాలు ‘ప్రీ వెడ్డింగ్ షో’, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. బుధవారం మేకర్స్ ఈ చిత్రం టైటిల్ ’ఓ.! సుకుమారి’ని విడుదల చేశారు. ఆకట్టుకునే పోస్టర్ను మేకర్స్ ఆవిష్కరించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Pawan Kalyan : నేడు చిత్తూరు జిల్లాకు పవన్
నేడు చిత్తూరులో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటించనున్నారు
Gold Prices Today : రికార్డు బ్రేక్ చేస్తున్నాయిగా.. బంగారంపై ఆశలు వదులుకోండిక
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది
‘అఖండ 2’లో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ’అఖండ 2: తాండ వం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూ మి, ఆంధ్ర నా ఆత్మభూమి. ఈ చిత్రాన్ని వివిధ దేశాలలో 130 రోజుల్లోనే అద్భుతంగా చిత్రీకరించాం. దేవుని దయ లేకుండా ఇది సాధ్యం కాదు. ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు. భవిష్యత్ తరాలు ఈ సినిమా ద్వారా సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్తో వరుసగా హిట్లు కొట్టాం. ‘అఖండ 2’ ఆ జాబితాలో చేరుతుంది”అని అన్నా రు. డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ “ఈ సిని మా ఆడియన్స్ని కమర్షియల్గా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ పరమశివుడే మీ ముందుకు వచ్చి ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఆ సందే శం దేశం ధర్మం దైవం వేదం.. ఇది కమర్షిల్గా అద్భుతంగా చెప్పడం జరిగింది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైజి మహేంద్రన్, విజి చంద్రశేఖర్, కొట్టి పాల్గొన్నారు.
Tirumala | నేటి సమాచారం.. Tirumala, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శ్రీవారి
ప్రముఖ సినీ నిర్మాత ఎవిఎం శరవణన్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత ఎవిఎం శరవణన్ (85) కన్నుమూశారు. వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళ్, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలను శరవణన్ నిర్మించారు. దాదాపు 300 పైగా సినిమాలను ఎవిఎం సంస్థ నిర్మించింది. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు, మెరుపుకలలు, శివాజీ, లీడర్ సహా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు. శరవణన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.
panchayati elections |ఈసీ రూల్స్ గాలికి!
panchayati elections | ఈసీ రూల్స్ గాలికి! పరిధి దాటి హామీలను గుప్పిస్తున్న
Revanth Reddy : నేడు ఆదిలాబాద్ జిల్లాకు రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు
Gram Panchayat |నా లక్ష్యం అదే..
Gram Panchayat | నా లక్ష్యం అదే.. Gram Panchayat, పెద్దవంగర, ఆంధ్రప్రభ
Tirumala : తిరుమల వెళ్లేవారికి తీపికబురు.. స్వామిని కనులారా చూసేందుకు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.
Panchayat Elections |అలా చేస్తే.. కష్టాలు తీరుస్తా..
Panchayat Elections | అలా చేస్తే.. కష్టాలు తీరుస్తా.. Panchayat elections, కెరమెరి,
Chandrababu : నేడు సీఆర్డీఏ సమావేశంలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
కోహ్లి, రుతురాజ్ సెంచరీలు వృథా మార్క్రమ్ శతకం, బ్రిట్జ్కే,బ్రెవిస్ అర్ధ సెంచరీలు భారత్పై దక్షిణాఫ్రికా అద్భుత విజయం రాయ్పూర్: భారత్తో బుధవారం రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీ టీమ్ సిరీస్ను 11తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా 49.2 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్కు దిగిన సఫారీ అసాధారణ ఆటతో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ చిరస్మరణీయ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న మార్క్రమ్ 98 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 110 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన తెంబ బవుమా (46) తనవంతు సహకారం అందించాడు. కీలక ఇన్నింగ్స్తో అలరించిన మాథ్యూ బ్రెట్జ్కె (68) పరుగులు సాధించాడు. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు అర్ధ సెంచరీ సాధించి జట్టు విజయంలో తనవంతు పాత్రను సమర్థంగా నిర్వర్తించాడు. చెలరేగి ఆడిన బ్రెవిస్ 34 బంతుల్లోనే ఒక ఫోర్, ఐదు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. టోనీ డి జోర్జి (17) పరుగులు చేసి రిటెర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. కార్బిన్ బోస్చ్ 15 బంతుల్లోనే అజేయంగా 26 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. భారత బౌలర్ల పేలవమైన బౌలింగ్కు చెత్త ఫీల్డింగ్ తోడు కావడంతో భారీ స్కోరు సాధించినా భారత్కు ఘోర పరాజయం తప్పలేదు. కోహ్లి, రుతురాజ్ శతకాలు అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ను రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లిలు సెంచరీలతో ఆదుకున్నారు. కోహ్లి సిరీస్లో వరుసగా రెండో సెంచరీని సాధించాడు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కోహ్లి 93 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. ఇక చెలరేగి ఆడిన రుతురాజ్ 83 బంతుల్లోనే 12 బౌండరీలు, 2 సిక్సర్లతో 105 పరుగులు సాధించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 43 బంతుల్లోనే అజేయంగా 66 పరుగులు చేశాడు. దీంతో భారత్ స్కోరు 358 పరుగులకు చేరింది.
Breaking : ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ మృతి
ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ మరణించారు
Bigg Boss Telugu 9: Have the Top Three Contestants Already Emerged?
As Bigg Boss Telugu 9 races toward its finale, viewer conversations have intensified around one key question: Have the top three contestants already solidified their spots? Based on performance trends, voting behaviour and narrative shifts inside the house, a clear pattern seems to be forming. The season’s final outcome may still be uncertain, but indications […] The post Bigg Boss Telugu 9: Have the Top Three Contestants Already Emerged? appeared first on Telugu360 .
పోలీసుల నిర్లక్ష్యం.. విద్యార్థిని ఆత్మహత్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో ఓ ఇంటర్ విద్యార్థిని వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్పందన అనే విద్యార్థిని(17) ధర్మవరం పట్టణంలోని ఓ ప్రేవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన వంశీకృష్ణ అనే విద్యార్థి అదే కాలేజీలో చదువుతున్నాడు. నవంబర్ 26న బస్సులో వెళ్తుండగా విద్యార్థినికి అసభ్యకర సంజ్ఞలు చేశాడు. విద్యార్థిని ప్రశ్నించడంతో ఆమె చెంపచెళ్లుమనిపించాడు. దీంతో స్పందన తన తండ్రితో కలిసి ధర్మవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. దీంతో చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదే రోజు ఇంట్లోకి వెళ్లిన తరువాత విద్యార్థిని ఉరేసుకుంది. తల్లిదండ్రులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. పోలీసుల నిర్లక్ష్యంతోనే తన కూతురు చనిపోయిందని స్పందన తండ్రి తెలిపారు. సకాలంలో నిందితుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పట్టించుకోలేదన్న మనస్తాపంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులు మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యమే తన కూతురు ప్రాణాలు తీసిందని బాధను వ్యక్తం చేశాడు.

26 C