మనతెలంగాణ/హైదరాబాద్: అందె శ్రీ తనకు అత్యంత అప్తుడని, తన మనసుకు దగ్గరి వాడని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాచరికం, ఆధిపత్యం హద్దు మీరినప్పుడు కవులు, కళాకారులు తమ గొంగడి దుమ్ము దులిపి పోరాటంలోకి దూకారని ఆయన అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా బండి యాదగిరి బండెనక బండి కట్టి అని గళం విప్పితే సర్కార్ పీఠం కదిలిందన్నారు. సమైక్యవాదాలకు వ్యతిరేకంగా గద్దర్, గూడ అంజన్న, అందె శ్రీ, గోరెటి వెంకన్న తెలంగాణ విముక్తి కోసం మలిదశ ఉద్యమానికి పునాదులు వేశారని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. బడి ముఖం ఎరుగని అందెశ్రీ జయ జయ హే తెలంగాణ పాట రాసి స్పూర్తిని నింపారురని, ప్రతి తెలంగాణ గుండెకు జయ జయహే తెలంగాణ పాటను అందెశ్రీ చేర్చారని ఆయన తెలిపారు. జయ జయ హే తెలంగాణ పాట ను రాష్ట్ర అధికార గీతంగా అందరూ భావించారని, కానీ ఆ నాటి పాలకుల వల్ల జయజయ హే తెలంగాణ పాట మూగబోయిందన్నారు. అధికారం శాశ్వతం అని వారు ఆనాడు భావించారని, తెలంగాణ లో స్పూర్తిని నింపిన కవులు, కళాకారుల గానం తెలంగాణలో వినిపించకుండా కుట్ర చేశారని, పెన్నులపైన మన్ను కప్పితే గన్ను లై మొలకెత్తుతాయని, గడీలను కూల్చుతాని అందెశ్రీ నిరూపించారని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో శనివారం నిర్వహించిన అందెశ్రీ సంతాపసభలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులదే కీలక పాత్ర ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకంగా కనిపిస్తారు, కానీ, అమాయకులు కాదని ఆయన అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన ఎవరూ ఆధిపత్యాన్ని, అహంకారాన్ని సహించరన్నారు. నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఎంతోమంది కవులు, కళాకారులు తమ ఆట, పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులదే కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. వాళ్లు తీసుకొచ్చిన ఊపుతోనే తెలంగాణ కల సాకారమైందన్నారు. అందెశ్రీ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించుకోలేమని ఆయన అన్నారు. ఆయన పాటలు తెలంగాణ ప్రజలను ఎంతో ఉత్తేజపరిచాయని ఆయన వెల్లడించారు. ఉద్యమ సమయంలో ఆయన పాటలు మార్మోగాయని అదే సమయంలో ఉద్యమంలో ఆయన పాత్ర లేకుండా చేయాలని కూడా కొందరు కుట్ర చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం గురించి ఎక్కడ చర్చ వచ్చినా తెలంగాణకు రెండు కళ్ల లాంటి వారైన అందెశ్రీ, గద్దర్ కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే జయజయహే గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించామన్నారు. ప్రతి పాఠ్యపుస్తకంలో గీతాన్ని చేర్చామని సిఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సిఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. చదువుల్లోనే కాదు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లోనూ ఎస్సీల ప్రాతినిథ్యం పెరగాలని దానికి ప్రజాప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రివర్గంలోనూ ఎస్సీలకు సముచిత స్థానం ఇచ్చినట్లు సిఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ చరిత్రలో అందెశ్రీ ఒక కోహినూర్ వజ్రం అందె శ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం తన బాధ్యత అని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజా పాలన రావాలని గద్దర్, అందె శ్రీ కోరుకున్నారని, అందె శ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని, అందె శ్రీ స్మృతి వనాన్ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అందెశ్రీ పుస్తకం నిప్పుల వాగును ప్రతి గ్రంథాలయంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని సిఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది కవులకు 300 గజాల ఇంటిస్థలం ఇచ్చామని, భారత్ ప్యూచర్ సీటీలో వారికి ఇంటిని నిర్మించి ఇస్తామని, దేశంలో వర్గీకరణ అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, వర్గీకరణ అమలు వల్ల దళితుల్లో అత్యంత వెనుకబడిన వాళ్లు డాక్టర్లు అవుతున్నారని, తన మంత్రివర్గంలో నలుగురు దళితులు మంత్రులుగా ఉన్నారని, కవులు ఎంతమంది ఉన్నా తెలంగాణ చరిత్రలో అందె శ్రీ ఒక కోహినూర్ వజ్రంలా నిలిచిపోతారని ఆయన తెలిపారు.
అమెరికా లేకున్నా జీ20 డిక్లరేషన్
జొహనెస్బర్గ్: దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో జి 20 సదస్సు ఆరంభంలోనే ప్రధాన డిక్లరేషన్ను అసాధారణ రీతిలో ఆమోదించారు. దక్షిణాఫ్రికా ఆతిధ్యంలో తొలిసారిగా ఇక్కడ జి 20 సమ్మిట్ జరుగుతోంది. డిక్లరేషన్ వెలువడకుండా అమెరికా శతవిధాలుగా యత్నించినా , పట్టించుకోకుండా దీనిని ఏకగ్రీవంగా ఆమోదించి, వెలువరించడం కీలక అంశం అయింది. దక్షిణాఫ్రికాలో శక్తివంతమైన జి 20 సదస్సు నిర్వహణపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ నిరసనకు దిగాడు. తాను వెళ్లడం లేదని అలకవహించాడు. ప్రపంచ దేశాల పలువురు నేతలు , ప్రతినిధులు తరలివచ్చిన ఈ సమ్మిట్లో డిక్లరేషన్ ఆమోదం అమెరికా వైఖరికి ప్రతిఘటనగా నిలిచింది. సాధారణంగా తీర్మానం లేదా డిక్లరేషన్ను సమావేశంలో పలు స్థాయిల్లో జరిగే చర్చలు ఉప చర్చల తరువాత ఆమోదించడం జరుగుతుంది. కానీ ఈసారి ఇందుకు విరుద్ధంగా దీనిని శనివారం సదస్సుకు ఆరంభం ముందే ఆమోదించడం కీలకం అయింది. పైగా సర్వసమ్మతితోనే దీనిని వెలువరించారు. అమెరికా ప్రాతినిధ్యం లేకుండా జి 20 డిక్లరేషన్ కుదరదనే ట్రంప్ వాదనను జి 20 సదస్సు ఆరంభంలోనే కొట్టిపారేసింది. ఈ డిక్లరేషన్ ఆమోదం అత్యంత కీలకం అని , తమకు ఘననీయమైన క్షణం అని ఆ తరువాత దక్షిణాఫ్రికా అంతర్జాతీయ వ్యవహారాలు , సహకార మంత్రి రోనాల్డ్ లమోలా తెలిపారు. ఇది ఆఫ్రికా ఖండాన్ని విప్లవభరితం చేస్తుందని వ్యాఖ్యానించారు. పైగా డిక్లరేషన్ పూర్తిగా బహుళధృవ అంతర్లీనతను సంతరించుకుందని వివరించారు. ముందుగానే తమ దూతలు పలు దేశాల ప్రతినిధులతో మాట్లాడిన తరువాత డిక్లరేషన్కు రంగం సిద్ధం అయిందని తెలిపారు. ఆఫ్రికా ఖండానికి, ప్రపంచానికి అవసరం అయిన పలు కీలక విషయాలు ఈ డిక్లరేషన్లో ఉన్నాయని మంత్రి ప్రకటించారు. నేతలకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా గైర్హాజరీపై, ట్రంప్ విమర్శలపై రోనాల్డ్ తీవ్రంగా స్పందించారు. జి 20 ఓ వేదిక. అమెరికా ప్రాతినిధ్యం ఉన్నా లేకున్నా ఇది కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఆహ్వానితులు రాకపోవడంతో సదస్సు జరగకుండా పోదని, జరిగి తీరుతుందని లమోలా తెలిపారు. ట్రంప్ వైఖరిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు . ఇది బహుళపక్ష వేదిక. ఏ ఒక్కరి కోసం సాగేది కాదు. లేరని ఆగేది కాదని తేల్చిచెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాతి దశ నుంచి కూడా ఈ వేదిక అంతర్జాతీయ విషయాలలో కీలక పాత్ర వహిస్తూ వచ్చింది. అందుకే ఈ డిక్లరేషన్ను సగర్వంగా వినూత్నంగా వెలువరించడం జరుగుతోందని తెలిపారు. డిక్లరేషన్ విజయవంతం అయి తీరుతుంది. ప్రపంచం అంతా ఇక్కడనే ఉందని తెలియచేయదల్చుకున్నామని , ప్రస్తుత దశలో అంతర్జాతీయ సహకారం అత్యవసరం , దీనిని మించిన వాదన ఏదీ లేదని దక్షణాఫ్రికా మంత్రి పిలుపు నిచ్చారు. ట్రంప్ అసత్య ఆరోపణలు.. అమెరికా పట్ల గౌరవం హద్దుల మేరకే దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులపై సామూహిక హత్యాకాండ జరుగుతోందని ట్రంప్ చేస్తున్న ఆరోపణలను దక్షిణాప్రికా మంత్రి ఖండించారు. అటువంటిదేమీ లేదు. నేరాల ఘటనలు అందరిని ఇబ్బందిపెడుతాయి. తమ సవాళ్లు, సమస్యలు తమకు ఉండనే ఉన్నాయని ఆయన విశ్లేషించారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల గురించి స్పందించారు. అమెరికా అతి పెద్ద ఆర్థిక శక్తి, దక్షిణాఫ్రికాకు రెండో అతి పెద్ద వ్యాపార భాగస్వామ్య పక్షం, అమెరికాతో నిమిత్తం లేకుండా ఆఫ్రికా ముందుకు సాగదు. అయితే దౌత్యపరంగా సముచితంగా ఉంటున్న తమకు వేరే దేశం మితిమీరి వ్యవహరిస్తే ఇంకో విధంగా స్పందించాల్సి ఉంటుందని మంత్రి లమోలా అమెరికాకు చురకలు పెట్టారు. డిక్లరేషన్లో పలు కీలక విషయాల ప్రస్తావన జరిగింది. ఇందులో పేద దేశాల రుణాల పరిస్థితి, వడ్డీల భారం వంటివాటి ప్రస్తాన ఉందని తెలిపారు. కొన్ని వివాదాస్పద విషయాలు ఉండనే ఉంటాయి. వీటిని రెండు రోజుల సదస్సులో సంప్రదింపుల్లో చర్చించుకుని, మార్పులు చేర్పులకు దిగవచ్చు అని, ఈ క్రమంలో కొన్ని లాభనష్టాలు ఉండనే ఉంటాయని, ఏకాభిప్రాయం కీలకం అని తేల్చిచెప్పారు. వర్థమానదేశాలకు ప్రాధాన్యత కీలకం ..జి 20 డిక్లరేషన్ సంక్షుభిత ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో ఎదుగుతున్న దేశాల పట్ల ప్రాధాన్యత అత్యవసరం. దీనినే ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. వీధి పోరాటాలుగా మారుతున్న పలు అంతర్జాతీయ ప్రాంతీయ ఘర్షణల నివారణకు సత్వర చర్యలు అవసరం .ఇందుకు అంతా పాటుపడాలి. పేద దేశాలకు రుణాల పరపతి వ్యవస్థ బలోపేతం చేయాలి. వడ్డీ భారం కుదించాల్సి ఉంది. దీనిని స్థిరీకరించాల్సి ఉంది. ఉక్రెయిన్, ఆక్రమిత పాలస్తీనియా, సూడాన్, కాంగో రిపబ్లిక్ ప్రాంతాలలో శాశ్వత స్థిరమైన శాంతికి అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంది. యాంత్రీకరణ ప్రభావంతో తలెత్తుతున్న కాలుష్యం, వాతావరణ పరిసరాల సమస్యలపై శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంది. గ్లోబల్ వార్మింగ్ పరిణామాలపై మరింత స్పందన అవసరం. ప్రపంచవ్యాప్తంగా విలువైన అరుదైన ఖనిజాల గనుల నిక్షేపాల పరిరక్షణ, వీటిని కొన్ని దేశాలు తమ వాణిజ్యపరమైన ప్రయోజనాలకు కొల్లగొట్టకుండా చూడాల్సి ఉంది.
వార ఫలాలు (23-11-2025 నుండి 29-11-2025 వరకు)
మేష రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా చిన్నచిన్న ఆటంకాలు ఏర్పడతాయి. ఇంకా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఉండవు. ఆర్థికంగా మాత్రం కొన్ని ఇబ్బందులు వెంటాడుతాయి. ఏ పని మొదలుపెట్టిన వెనక్కి వెళుతుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు కూడా శివ అష్టోత్తరం చదవండి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వ్యాపార పరంగా మాత్రం లాభాలు బాగుంటాయి. అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధమైన విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. సమాజ సేవలో పాల్గొంటారు. శుభకార్యాలకు గాను ఆహ్వానాలు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ కి గాని ప్రమోషన్స్ కానీ లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్. మిధున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సినీ పరిశ్రమంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. హనుమాన్ వత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. కార్యాలయంలో ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్. కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ పరంగా స్థిరత్వం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మీరు ఆశించిన లాభాలు పొందుతారు. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయరంగంలో ఉన్నవారికి కలిసివచ్చే కాలంగా చెప్పవచ్చు. మీకు వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబపరంగా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. లేదు దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ. సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే దానిని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాములతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంటెంట్ వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి లాభాలు బాగుంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. పర్సనల్ లోన్లకి క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. కన్యా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి స్థాయిని సాధించగలుగుతారు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాటిని అదుపు చేసే ప్రయత్నం చేయాలి. నూతన వాహన యోగం ఏర్పడుతుంది. స్వగృహ యోగం ఏర్పడుతుంది. విదేశాలు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ప్రతిరోజు కూడా అరటి నారావత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తులారాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. విలువైన ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఉద్యోగ పరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార పరంగా కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు పైన శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో కొన్ని అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు బ్లూ. వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగుంది. వ్యాపారపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి. నరదిష్టి కొంతవరకు తగ్గుతుంది. మీరు చేస్తున్న పనిని గోప్యంగా ఉంచండి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. పదిమంది మెప్పు కోసం మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో తర్వాతే కాలంలో అవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. పాస్పోర్టు వీసా లభిస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్. ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మానసీకమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కెరియర్ పరంగా మీరు కోరుకున్న రంగంలో స్థిరత్వం లభిస్తుంది. చాలాకాలంగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం ప్రమోషన్ లభిస్తుంది. సినీ కళా రంగాలలో ఉన్నవారికి అంతంతమాత్రంగా ఉంటుంది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగుంటుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కెరియర్ పరంగా కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవారాధన ఎక్కువగా చేయండి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మీ మాట తీరుతో ఇంట బయట అందరిని ఆకట్టుకుంటారు. సంఘంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టినా పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బందు మిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు రెడ్. కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. సన్నిహితులతో మాత్రమే ముఖ్యమైన విషయాలను చర్చించండి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు. ప్రతిరోజు కూడా శివనామ స్మరణ చేయండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన పరిచయాలు పెరుగుతాయి. నూతన అరుణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ. మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ అందుతాయి. కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. నూతన ఉద్యోగాలలో ఎంపిక అవుతారు. మీరు మొదలుపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ప్రతి పనిలో కూడా దైవానుగ్రహం తోడుగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. మీరు సొంతంగా చేస్తే వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చదువుపై శ్రద్ధ వహిస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన నూతన కోర్సులను అభ్యసిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలమనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీరు ప్రారంభించిన వ్యాపారాలలో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలిగిపోతాయి. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. వివాహపరంగా స్వంత నిర్ణయాలు పనికిరావు. పెద్దవాళ్ల సలహాలు సూచనలు పాటించండి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయన చేయండి. శని గ్రహ స్తోత్రం కూడా చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బందు మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు.
మిస్టర్ జస్టిస్..మిగిలిన పెండింగ్ల మాటేమిటీ?
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పదిమంది శాసనసభ్యుల అనర్హత విషయమై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రానున్న నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి అని తీవ్రంగా వ్యాఖ్యానించడంతో ఎక్కడెక్కడ, ఏ ఏ వ్యవస్థల్లో, ఎన్నెన్ని కేసులు, పిటిషన్లు ఏళ్ళుపూళ్ళు గడిచిపోయినా, కాల పరిమితి ముగిసినా తుది నిర్ణయం రాకుండా పడి ఉన్నాయో, ఎంతమంది ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్న చర్చ జరగాల్సిన అవసరం ఏర్పడింది. ఇవ్వాళే జస్టిస్ బిఆర్ గవాయ్ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తుండటం కాకతాళీయం. తెలంగాణ స్పీకర్ చేసింది తీవ్రమైన కోర్టు ధిక్కారమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి అనడం అంటే నాలుగు వారాల్లోగా పార్టీ ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకోకపోతే జైలుకు పంపుతామని చెప్పడమే కదా. పార్టీ ఫిరాయింపుల మీద తాము విధించిన మూడు మాసాల గడువు దాటిపోయినా ఒక నిర్ణయం తీసుకోనందుకు తెలంగాణ స్పీకర్ మీద ఆగ్రహించిన ఇదే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తో కూడిన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పార్లమెంట్ లేదా వివిధ రాష్ట్రాల శాసన సభలూ ఆమోదించిన బిల్లులను త్వరగా పరిష్కరించాలని కోర్టులు జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నది. బిల్లులను సుదీర్ఘ కాలం పెండింగ్లో పెట్టుకునే అధికారం గవర్నర్లకు లేదంటూనే కోర్టులు గడువు విధించలేవని చెప్పింది. తమ పరిధిలో నిర్ణయాలు తీసుకునే విషయంలో రాజ్యాంగ వ్యవస్థలకు కాల పరిమితి అంటూ ఏమీ నిర్దిష్టంగా లేదు. గురువారం నాడు సుప్రీం కోర్టు కొద్ది కాలం క్రితం రాష్ట్రపతి లేవనెత్తిన సందేహాలకు ఇచ్చిన రాజ్యాంగ పరమయిన వివరణ లేదా విశ్లేషణతో ఆ విషయం అర్థ్ధం అవుతున్నది. న్యాయస్థానాలు, రాష్ట్రపతి, గవర్నర్లు, పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్ వ్యవస్థలు తమకు సంక్రమించిన రాజ్యాంగ పరిధిలో తీసుకునే నిర్ణయాలకు రాజ్యాంగం లేదా చట్టాలూ స్పష్టమైన కాల పరిమితి ఏదీ విధించలేదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న కనీసం నాలుగు రాష్ట్రాలలో 33 బిల్లులు గవర్నర్ల ఆమోదం కోసం వేచిచూస్తున్నాయి. ఇందులో అత్యధికంగా బిల్లులు పెండింగ్లో ఉన్నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఈ జాప్యం రాష్ట్ర ప్రభుత్వాలూ గవర్నర్ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఎటువంటి వివరణ లేకుండా సుదీర్ఘ కాలం బిల్లులు పెండింగ్లో పెడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల మీద సుప్రీం కోర్టు గడప తొక్కిన విషయం జగద్విదితం. పశ్చిమ బెంగాల్ ఉదాహరణే మళ్ళీ తీసుకుంటే ఆ రాష్ట్రం లో 2022 నుండి ఏడు బిల్లులు, 2023 నుండి ఒక బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ బిల్లులన్నీ యూనివర్శిటీ చట్టాలకూ, పట్టణ గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించినవి. అసంఖ్యాకంగా వచ్చే కోర్టు కేసులు కూడా పరిష్కరించడానికి రాజ్యాంగం స్పష్టంగా కాలపరిమితి ఏదీ విధించలేదు. న్యాయ వ్యవస్థ తానే రూపొందించుకున్న విధానాలు, నిబంధనల ఆధారంగా వ్యవహరిస్తుంది. అయితే విచారణ వేగవంతంగా జరగాలన్న అంశం రాజ్యాంగం లోని ఆర్టికల్ 21తో ముడిపడి ఉండటమేకాక కేసుల వాయిదాల సంఖ్యా తగ్గించే క్రమంలో నిబంధనల్లో మార్పులు చేయడం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలు కొంత అక్కర కొస్తున్నాయి. వాస్తవ పరిస్థితుల మీద ఒకసారి దృష్టి సారిస్తే దిగువ కోర్టుల్లో నాలుగు కోట్ల అరవై లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని అధికారిక లెక్కలు చెపుతున్నాయి. వివిధ హైకోర్టులలో 63 లక్షలు, సుప్రీం కోర్టు లో 87 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఈ ఏడాది జులై 31 నాటి గణాంకాలు. దిగువ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో అధిక భాగం భూతగాదాలకు సంబంధించినవే కావడం విశేషం. శాసన, న్యాయ వ్యవస్థలు రెండు రాజ్యాంగబద్ధమైన సంస్థలే. రెండు వ్యవస్థల అధికారాలు దేనివి దానికే ఉంటాయి. పార్టీ ఫిరాయింపుల మీద ఏ కారణం చేతనైనా ఒకవేళ తెలంగాణ శాసనసభ అధ్యక్షుడు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోలేకపోతే నిజంగానే ఆయనను జైలుకు కూడా పంపే అంతటి కఠిన నిర్ణయం సుప్రీం కోర్టు తీసుకునే అవకాశం ఉందా! అది న్యాయ వ్యవస్థ పరిధిని దాటి ఉంది అనిపించడం లేదా అన్న చర్చ జరుగుతున్నది. మరి వివిధ కోర్టు లలో పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న కోట్లాది కేసుల గురించి ఏం చెబుతారు. తెలంగాణ స్పీకర్ మీద సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య తీర్పులో భాగంగా వెలువరించింది కాదు. వాదనలు సాగుతున్న సమయంలో చేసిన వ్యాఖ్య మాత్రమే. సరే ఈలోగా గత రెండు మూడు రోజులుగా తెలంగాణ స్పీకర్ పదిమంది శాసనసభ్యుల ఫిరాయింపు వ్యవహారంలో విచారణ కూడా వేగవంతం చేశారు. నాలుగు వారాల్లోగా ఒక నిర్ణయం జరుగుతుందని స్పీకర్ తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన ఇద్దరు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, ముకుల్ రోహాత్గి కూడా సుప్రీం కోర్టు ధర్మాసనానికి హామీ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం అంతిమంగా ఎలా ఉంటుందో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. తెలంగాణ అసెంబ్లీ లో ప్రస్తుతం ఓ పదిమంది శాసన సభ్యులు భారత రాష్ట్ర సమితి నుండి అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అనర్హత వేటు పడుతుందేమో అన్న అనుమానం రావడంతో కండువా కప్పుకుంటే, నియోజక వర్గం అభివృద్ధి పనులకోసం ముఖ్యమంత్రిని కలిస్తే, సరదాగా కబుర్లు చెప్పుకుని చాయ్ తాగడానికి పిసిసి సభ్యుడిని కలిస్తే పార్టీ మారినట్టా అని బుకాయిస్తున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్టు 2014 లో రాష్ట్రం ఏర్పడి తాము అధికారం లోకి వచ్చిన దగ్గరినుండి అధికారం కోల్పోయే దాకా బిఆర్ఎస్ ఉజ్జాయింపుగా ఓ 38 మంది శాసన సభ్యులను ఇతర పార్టీల నుండి చేర్చుకున్న విషయం ఎవరయినా మరిచిపోతారా. అట్లా అని ప్రస్తుతం ఫిరాయించిన వారిని సమర్థించాల్సిన అవసరం లేదు. అయినా రాజకీయాల్లో నైతికత కోసం వెతకడం ఏమిటి నేతి బీరకాయల్లో నెయ్యి కోసం వెతికినట్టు. అయితే ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన వారిలో ఇద్దరి మీద మాత్రం వేటు తప్పనిసరి. అందులో ఒకరు ఖైరతాబాద్ శాసన సభ్యుడు దానం నాగేందర్, ఆయన 2023 లో బిఆర్ఎస్ తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికై 2024 లోక సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచి ఓడిపోయారు, పార్టీ మారిన ఆధారం స్పష్టంగానే ఉంది. ఈయన కాంగ్రెస్ నుండి తెలుగుదేశం పార్టీకి, అక్కడి నుండి మళ్ళీ కాంగ్రెస్కు తిరిగి బిఆర్ఎస్కు, ఇప్పుడు తిరిగి సొంత గూడు అంటూ కాంగ్రెస్కు చేరుకున్నారు ప్రజా సేవ కోసం. ఇక రెండో నాయకుడు కడియం శ్రీహరి, వీరు 2023 ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా స్టేషన్ఘనపూర్ నుండి గెలిచి ప్రజా సేవ కోసమే అధికార పక్షం లో చేరారు. అయితే కూతురికి కాంగ్రెస్ లోకసభ స్థానం నుండి టికెట్ ఇప్పించుకుని ఆమె గెలుపు కోసం కృషి చేయడం వల్ల అనర్హత తప్పేట్టు లేదు. శ్రీహరి రాజకీయాలతోబాటు పార్టీ ఫిరాయించడంలో కూడా సీనియర్యే. తెలుగుదేశం నుండి భారత రాష్ట్ర సమితికి అక్కడి నుండి కాంగ్రెస్కు మారారు. వీరిరువురూ వేటు పడక ముందే రాజీనామా చేస్తారని వార్తలొస్తున్నాయి. స్పీకర్ మీద సుప్రీం కోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యం లో ఒకవేళ వేటు పడితే ఆరు నెలల వరకూ పోటీచేసే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉన్నందున తామే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని అనుకుంటున్నారని సమాచారం. మొన్ననే జూబ్లీహిల్స్లో ఉపఎన్నిక గెలిచిన ఊపులో ఉంది అధికార పక్షం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యూహాత్మకంగా ఆ స్థానాన్ని పార్టీకి దక్కేట్టు చేసారు. ఆ పొరుగునే ఉన్న ఖైరతాబాద్ కూడా అదే ఊపులో గెలవచ్చన్న ధీమా ఉండొచ్చు. స్టేషన్ ఘనపూర్ గెలిస్తే కాంగ్రెస్ బలంలో ఒకటి పెరిగినట్టు, పోయినా అది ప్రతిపక్షానిదే కాబట్టి బెంగ లేదు. మిగిలిన ఎనిమిది మంది శాసన సభ్యుల విషయంలో ప్రతిపక్ష బిఆర్ఎస్ పశ్చిమ బెంగాల్లో జరిగింది చూసి కొంత ఉత్సాహం తెచ్చుకున్నది. ఇటీవల పశ్చిమబెంగాల్లో బిజెపి నుంచి తృణమూల్ కాంగ్రెస్కు ఫిరాయించిన శాసనసభ్యుడు ముకుల్రాయ్ బిజెపి వీడిపోయినట్టు ఆధారాలు లేవని ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రకటించడంతో బిజెపి వేసిన పిటిషన్ మీద హైకోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా ఒకవేళ అక్కడి స్పీకర్ లాగానే వీళ్ళంతా బిఆర్ఎస్ వీడిన ఆధారాలు లేవని తేల్చినట్టయితే కోర్టులు తమకు న్యాయం చేస్తాయన్నది ఆ పార్టీ ఆశ కావచ్చు. అదలా ఉంచితే ఒక విషయం ఇక్కడ తప్పనిసరిగా చర్చించాలి. 1985లో రాజ్యాంగ సవరణద్వారా ఏర్పాటైన పార్టీ ఫిరాయింపుల చట్టం పార్టీ ఫిరాయింపుల మీద శాసనసభ స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలి అన్న విషయంలో స్పష్టతనివ్వలేదు. నిజానికి ఈ చట్టం ఎంతో లోపభూయిష్టంగా ఉన్నదనడానికి చట్టం అమల్లోకి వచ్చిననాటి నుండి నేటివరకు జరిగిన అనేక ఉదంతాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2004 2009 మధ్య అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పదిమంది శాసన సభ్యులు పార్టీ నిర్ణయాన్ని కాదని శాసనమండలి ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేసిన కారణంగా వారందరి మీద అనర్హత వేటు వేయాలని టిఆర్ఎస్ కోరినప్పటికీ ఆనాటి స్పీకర్ ఆ శాసనసభ పదవీకాలం ముగిసే వరకు ఈ వ్యవహారాన్ని తేల్చకుండా చివరకు 2009లో సమావేశాలు ముగింపుకొచ్చిన సమయంలో వారిని అనర్హులుగా ప్రకటించారు. ఇటువంటి ఉదాహరణలు మనకు దేశంలోని పలు శాసనసభల్లో, రాజ్యసభలో కూడా అనేకం కనిపిస్తాయి. 2019 లో ఎన్నికలలో ఓడిపోగానే తెలుగు దేశం రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన వైనం ఉదాహరణే కదా, అంతకు ముందు అధికారం లో ఉండగా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సిపి నుండి 23 మంది శాసన సభ్యులను, ముగ్గురు లోక్సభ సభ్యులను తెలుగుదేశంలో చేర్చుకుని ఓ నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు కదా చంద్రబాబు నాయుడు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యుడు పార్టీకి రాజీనామా చేయకుండానే అప్పటి టిఆర్ఎస్ మంత్రివర్గంలో సభ్యుడిగా చేరారు. పార్టీ ఫిరాయింపుల చరిత్ర ఈ రోజుదా, 1967 లో హర్యానాలో గయా లాల్ అనే శాసన సభ్యుడు పక్షం రోజుల్లో మూడు సార్లు పార్టీ మారాడు, కాంగ్రెస్ నుండి యునైటెడ్ ఫ్రంట్కు మళ్ళీ తిరిగి కాంగ్రెస్కు అది జరిగిన తొమ్మిది గంటల్లోనే మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్కు మారి ఆయారాం గయారాం అనే నానుడిని వాడుకలోకి తెచ్చారు. గెలిచి వచ్చిన పార్టీకి రాజీనామా చేయకుండా అధికార పక్షంలోకి వలసపోయిన సందర్భాలు పలు శాసనసభల్లో బోలెడు. పార్టీ ఫిరాయింపుల విషయం అయినా, గవర్నర్ల దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులయినా, కోట్లాది కోర్టు కేసులయినా ఏ మాత్రం జాప్యం లేకుండా పరిష్కారం అయిపోయే మార్గం ఆలోచించాల్సిందే తప్ప పరస్పర విమర్శల వల్ల ఫలితంలేదు. అన్ని వ్యవస్థలూ అంతిమంగా ప్రజలకే కదా జవాబుదారీగా ఉండాలి. అప్పుడప్పుడు ఢిల్లీలో లోక్సభ స్పీకర్ అధ్యక్షతన రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పలు సమస్యలు చర్చకు వస్తాయి, పరిష్కారాల గురించి కూడా ఆలోచిస్తారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యానం నేపథ్యంలో తప్పనిసరిగా ఈసారి జరిగే స్పీకర్ల సమావేశం లో దీని మీద చర్చించి ఒక పరిష్కారాన్ని కనుగొంటే బాగుంటుంది. Delete Edit DeleteEdit
Cartoon 23 Nov 2025 |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
AP |పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రభ : ప్రముఖ పరకామణి కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కీలక
రాష్ట్రంలో 36 జిల్లాలకు కొత్తగా డిసిసి అధ్యక్షుల నియామకం
రాష్ట్రంలో 36 జిల్లాలకు కొత్తగా డిసిసి అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. డిసిసి అధ్యక్ష పదవులను బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కాంగ్రెస్ కేటాయించింది. ఆదిలాబాద్- జిల్లాకు నరేష్ జాదవ్, అసిఫాబాద్ జిల్లాకు- ఆత్రం సుగుణ, భద్రాద్రి కొత్తగూడెంకు తోట దేవీ ప్రసన్న, యాదాద్రి భువనగిరి జిల్లాకు బీర్ల అయిలయ్య, గద్వాల జిల్లాకు ఎం. రాజీవ్ రెడ్డి, హన్మకొండకు వెంకటరాంరెడ్డి, హైదరాబాద్కు ఖలీఫ్ సైదుల్లా, జగిత్యాలకు నందయ్య, జనగాంకు లఖావత్ ధనావతి, భూపాలపల్లికి- కరుణాకర్, కామారెడ్డికి మల్లికార్జున్, కరీంనగర్కు మేడిపల్లి సత్యం, కరీంనగర్ కార్పొరేషన్కు వి.అంజన్ కుమార్, ఖైరతాబాద్కు రోహిత్ ముదిరాజ్, ఖమ్మంకు నూతి సత్యనారాయణ, ఖమ్మం కార్పొరేషన్కు దీపక్ చౌదరి, మహబూబాబాద్కు భూక్య ఉమ, మహబూబ్నగర్కు సంజీవ్ ముదిరాజ్, మంచిర్యాలకు రఘునాథ్ రెడ్డి, మెదక్కు శివన్నగిరి ఆంజనేయులు గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరికి తోటకూర వజ్రేష్ యాదవ్, ములుగుకు పైడాకుల అశోక్, నాగర్ కర్నూల్కు - డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నల్గొండకు కైలాశ్ నేత, నారాయణ్పేట్కు కొల్లుకుదురు ప్రశాంత్ రెడ్డి, నిర్మల్కు వెడ్మ బొజ్జు, నిజామాబాద్కు నగేశ్ రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్కు- బొబ్బిలి రామకృష్ణ, పెద్దపల్లికి ఎంఎస్ రాజ్ ఠాకూర్, రాజన్న సిరిసిల్లకు సంగీతం శ్రీనివాస్, సికింద్రాబాద్కు దీపక్ జాన్, సిద్దిపేటకు ఆంక్షా రెడ్డి, సూర్యాపేట్కు గుడిపాటి నర్సయ్య, వికారాబాద్కు ధారాసింగ్ జాదవ్ను, వనపర్తికి శివసేనా రెడ్డి, వరంగల్కు మహ్మద్ అయ్యుబ్లను డిసిసి అధ్యక్షులుగా నియమిస్తూ శనివారం ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసిసి నియమించిన అభ్జర్వర్లు, సీనియర్ నాయకులతో చర్చించిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం డిసిసి అధ్యక్షుల నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
చిరుతడే కానీ...చిరుతతో పోట్లాడాడు. తనను తాను కాపాడుకుని, తోటి బాలుడిని కూడా కాపాడి, పులిని తరిమికొట్టాడు. మహారాష్ట్రలోని పల్ఘార్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 11 సంవత్సరాల బాలుడు మయాంక్ కువారా శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లుతుండగా మధ్యలో ఉన్నట్లుండి పొంచి ఉన్న చిరుత పులి వచ్చి ఈ బాలుడిపై దాడికి దిగింది. ఆదమరిచి ఉంటే క్షణాలలో బాలుడి ప్రాణాలను హరించివేసేది. అయితే మీద పడింది చిరుత పులి అని తెలిసినా భయపడకుండా ఈ బాలుడు పులిపై తిరగబడ్డాడు. తన తోటి బాలుడితో కలిసి రాళ్లతో, చేతిలోని బ్యాగుతో తలపడ్డాడు. ఓ వైపు బ్యాగ్తో తనను తాను కాపాడుకుంటూ, మరో వైపు దానితోనే పులిపై ఎదురుదాడికి దిగాడు. పెద్దగా అరుపులతో కలబడిన క్రమంలో అక్కడికి సమీపంలోని వారు ఉరికివచ్చారు. ఈ లోపునే చిరుత పులి ఈ బాలుడు ఘటికుడే, చేసేదేమి లేదని అడవుల్లోకి తోకజాడిస్తూ పారిపోయింది. ఈ బాలుడి ధైర్యసాహసాలకు ఊర్లు ఊర్లు అన్ని వారెవా అని ఆనందించాయి. చేతిలో బ్యాగ్లేకుండా ఉంటే ఏమి చేయలేకపోయేవాడినని ఈ బాబు తరువాత అక్కడి వారికి చెప్పాడు. పులి పంజా దెబ్బకు బాలుడి చేతికి గాయాలు అయ్యాయి. విక్రమ్గఢ్ ఆసుపత్రిలో కుట్లు వేసి చికిత్స జరిపారని అక్కడి వైద్యాధికారి తెలిపారు. విషయం తెలియగానే అక్కడి కంచడ్ అటవీశాఖ అధికారి స్వప్నిల్ మెహితే ఘటనాస్థలికి చేరారు. సిబ్బందితో కలిసి బాలుడిని అభినందించారు. ఈ ప్రాంతంలో స్కూళ్లను మధ్యాహ్నం నాలుగు గంటల వరకూ తెరిచి ఉంచాలని, పిల్లల విషయంలో జాగ్రత్తలు అవసరం అని కోరారు. ఈ ప్రాంతంలో జన సంచారంలో పులుల రాక తెలిపే ఎఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు.
ఎర్రకోట టెర్రర్ లింక్..ఎలక్ట్రిషియన్ అరెస్టు
ఎర్రకోట బాంబు పేలుడు కేసు విచారణ దశలో జమ్మూ కశ్మీర్లో ఓ ఎలక్ట్రిషియన్ను భద్రతా బలగాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి. ఈ వ్యక్తికి జైషే మహమ్మద్ ఉగ్రసంస్థతో ఉన్న సంబంధాలపై ఆరాతీస్తున్నారు. ఉగ్ర నెట్వర్క్ బాగా విస్తరించుకుని ఉంది. సాంకేతిక నిపుణులు, ఎలక్ట్రిషియన్లు, పలు దశల్లో పనిచేసే వారిని పావులుగా వాడుకుని ఫరీదాబాద్ డాక్టర్ టెర్రర్ నెట్వర్క్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఇప్పుడు పుల్వామాలో తుఫైల్ అహ్మద్ అనే వ్యక్తిని దర్యాప్తు బృందాలు అక్కడి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతం నుంచి అదుపులోకి తీసుకువెళ్లాయి. విచారణకు రంగం సిద్ధం అయింది.
AKT is one of my most proudest films in my career – Ram
Andhra King Taluka starring Ram Pothineni has built a huge following with blockbuster songs. The movie trailer has increased the buzz further but audio has been the most popular in recent times. Hence, the producers Mythri Movie Makers have conducted a huge scale event as a musical concert in Vizag, Today. The event became a […] The post AKT is one of my most proudest films in my career – Ram appeared first on Telugu360 .
నైజీరియాలో 303 మంది బాలల కిడ్నాప్
అబూజా : నైజీరియాలో ఓ సాయుధుడు 303 మంది స్కూలు పిల్లలను, 12 మంది టీచర్లను అపహరించుకుని , బందీలుగా తీసుకువెళ్లాడు. అక్కడి నార్త్ సెంట్రల్ నైగర్ స్టేట్లో ఈ ఘటన జరిగింది. అక్కడి క్యాథలిక్ విద్యా సంస్థ సెయింట్ మేరీస్ స్కూల్లోకి చొరబడ్డ దుండగుడు తుపాకీతో బెదిరించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ముందు రెండు వందల మంది పిల్లలనే అపహరించుకుపోయినట్లు తొలుత ప్రకటించారు. తరువాతి నిర్థారణలో ఈ సంఖ్య పెరిగింది. స్కూళ్లలోకి చొరబడి సాయ/ధ ముఠాలు కిడ్నాప్లకు పాల్పడటం నైజీరియాలో ఇటీవలి కాలంలో పెరిగిన నేరసంస్కృతికి అద్దం పడుతోంది. క్రిస్టియన్స్పై దాడుల నేపథ్యంలోనే క్యాథలిక్ విద్యాసంస్థలపై ఎక్కువగా మిలిటెంట్ల దాడులు జరుగుతున్నాయి.
మద్యం మత్తులో తల్లిని కొట్టి చంపిన కసాయి
మద్యం మత్తులో కన్నతల్లిని కొట్టి చంపాడు ఒక కసాయి కొడుకు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కాశిబుగ్గ రాములవారి వీధిలో నివాసం ఉంటున్న కూరపాటి వెంకటమ్మ (65)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వీరిందరికీ వివాహాలై ఎవరికి వారు కుటుంబాలతో జీవిస్తున్నారు. పెద్ద కొడుకు రాజు ఆటో డ్రైవర్. మద్యానికి బానిస కావడంతో 15 ఏళ్ల క్రితం భార్య అతనిని వదిలి పిల్లలతో సహా నెక్కొండ మండలం, రెడ్లవాడలో ఉన్న తన తల్లి ఇంటి వద్ద నివాసం ఉంటోంది. మద్యానికి బానిసైన రాజు ఆటో నడపగా వచ్చే డబ్బులతో నిత్యం మద్యం సేవిస్తూ వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని అకారణంగా మద్యం మత్తులో కొట్టేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటి వచ్చి తన తల్లిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అపస్మారక స్థితిలో ఆమె ఇంటి ఆవరణలో పడిపోవడంతో నిందితుడు తప్పించుకొని పారిపోయాడు. శనివారం ఆ ఇంటి పక్కన ఉన్నవారు మృతురాలు అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించి ఆమె చిన్నకొడుకు కూరపాటి కుమారస్వామికి సమాచారం ఇచ్చారు. కాశీబుగ్గలో నివాసం ఉంటున్న కుమారస్వామి వచ్చి తన తల్లిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో 108కు ఫోన్చేయగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వారు నిర్ధారించారు. మృతురాలి చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు ఇంతెజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
AICC |డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..
AICC | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ.. హైదరాబాద్,ఆంధ్రప్రభ : ఎట్టకేలకు జిల్లా
జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండల కేంద్రంలో ట్రాక్టర్ ఢీకొని కార్తీక్ (4) అనే బాలుడు మృతి చెందాడు. శనివారం ఎస్ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రంలోని బిసి కాలనీలో ఆ బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ వెనకాలకు రివర్స్ తీసుకుంటుండగా ట్రాక్టర్ ట్రాలీ ఆ బాలుడి తలకు బలంగా తగిలి, గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటివరకు ఆడుతూపాడుతూ ఉన్న తమ కుమారుడి అకాలమృతితో తల్లిదండ్రులు, బంధువులు విలవిల్లాడారు. మృతుడి తండ్రి విష్ణు కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
విహార యాత్రకు వెళ్లిన ఓ స్కూల్ విద్యార్థి అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిన మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమీర్పేటలోని సిస్టర్ నివేదిత స్కూల్లో దమరుక్ సూర్యతేజ ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాడు. ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను శుక్రవారం వండర్లా విహార యాత్రకు తీసుకుని వెళ్లారు. అక్కడ పిల్లలకు పలు యాక్టివిటీస్, గేమ్స్ ఆడించారు. ఈ సమయంలో దమరుక్తో ఉపాధ్యాయులు అతడి వయస్సుకు మించి యాక్టివిటీస్ చేయించడంతో తట్టుకోలేక అక్కడ కుప్పకూలినట్లు తెలిసింది. వెంటనే అక్కడి నుంచి పాఠశాల ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పినట్లు తెలిసింది. తమ కుమారుడిని విహారా యాత్రకు తీసుకుని వెళ్లి చనిపోయేలా చేశారని తల్లిదండ్రులు నిలదీయగా వారిని పాఠశాల యాజమాన్యం బెదిరించి విషయం బయటికి రాకుండా చూశారని తెలిసింది. విద్యార్థి మృతి తీరనిలోటుః పాఠశాల యాజమాన్యం విద్యార్థి దమరుక్ మృతి తమ పాఠశాలకు తీరని లోటని నివేది పాఠశాల యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. విద్యార్థిని రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేశామని, లాభం లేకుండా పోయిందని తెలిపారు. విద్యార్థుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
సిఐడి సిట్ విచారణకు హాజరయిన నటి మంచు లక్ష్మి
ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ కేసు దర్యాప్తులో భాగంగా పలువురు ప్రముఖులను సిఐడి సిట్ వరుసగా ప్రశ్నిస్తోంది. ఈ విచారణకు సంబంధించి శనివారం నటి మంచు లక్ష్మిని సిఐడి సిట్ అధికారులు విచారించారు. మంచు లక్ష్మిప్రమోట్ చేసిన యాప్ కాంట్రాక్టు వివరాలు, చెల్లింపు రికార్డులు, యాప్ ఆపరేటర్లతో లావాదేవీలపై సిట్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. కాగా, మంచు లక్ష్మియోలో 247 అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లి అక్కడ క్యూ లైన్లో నిలబడి ప్రముఖ యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. శ్రీవారి ప్రసాదంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, హిందూ సంఘాలు, నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ శివజ్యోతి తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శ నం కోసం క్యూ లైన్లో నిలబడి ఉన్న సమయంలో టిటిడి సేవకులు భక్తులకు అన్నప్రసాదం (సాంబార్ రైస్, పెరుగు అన్నం) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాదం అందుకున్న శివజ్యోతి, ఆమె స్నేహితుడు సంభాషించుకుంటూ తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం., తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే. అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ సంభాషణను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. సరదాగా చేసినప్పటికీ, ఈ వ్యాఖ్యలు పవిత్రమైన ప్రసాదాన్ని, తిరుమల క్షేత్ర పవిత్రతను అపహాస్యం చేసేలా ఉన్నాయని భక్తులు మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని భక్తులు భగవంతుని అనుగ్రహంగా భావిస్తారు. ఉచితంగా, భక్తితో ఇచ్చే ప్రసాదాన్ని అడుక్కుని తీసుకుంటున్నామని, బిచ్చగాళ్లం అని వ్యంగ్యంగా నవ్వుతూ వ్యాఖ్యానించడంపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుడి సన్నిధిలో పేద, ధనిక భేదం లేకుండా అందరూ సమానమేనని ప్రసాదాన్ని స్వీకరించే పద్ధతిని అపహాస్యం చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో రీల్స్, వీడియోలపై టిటిడి ఇప్పటికే నిషేధం విధించినప్పటికీ, శివజ్యోతి నిబంధనలు ఉల్లంఘించారని పలువురు ఆరోపిస్తున్నారు. పవిత్రమైన అన్నప్రసాదంపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో స్వామివారిని ఎంతో భక్తితో పూజించి, వ్రతాలు చేసి బిడ్డ కోసం మొక్కుకున్న శివజ్యోతి, ఇప్పుడు ప్రసాదంపై ఇలా మాట్లాడటం షాకింగ్కు గురి చేసిందని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మత పరమైన ప్రదేశాలలో మరింత విచక్షణతో ఉండాలని భక్తులు కోరుతున్నారు. ఈ వివాదంపై శివజ్యోతి లేదా టిటిడి అధికారులు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. యాంకర్ శివ జ్యోతి... ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ యాసలో తనదైన స్టైల్లో తీన్మార్ సావిత్రిగా ఈమె చెప్పిన వార్తలతోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. బిత్తిరి సత్తితో ఈమె చెప్పే ముచ్చట్లకు బుల్లి తెర ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ క్రేజ్తో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని షోలకు యాంకరింగ్ చేసినా ప్రస్తుతం స్పెషల్ ఈవెంట్స్ చేస్తున్నారు. అప్పుడప్పుడూ కొన్ని టీవీ షోల్లోనూ మెరుస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శివజ్యోతి... తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రసాదంపై కామెంట్స్... తిరుపతి శ్రీవారి దర్శనం క్యూ లైన్లో ఇచ్చే అన్న ప్రసాదంపై శివ జ్యోతి చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది. టీటీడీ క్యూ లైన్లో ఉన్నప్పుడు ఈ వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. తన ఫ్రెండ్ సోను అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రసాదాన్ని తీసుకుంటుండగా... ’సోను కాస్ట్ లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్.’ అంటూ నవ్వుతూ కామెంట్స్ చేసింది. ’జీవితంలో ఎప్పుడూ అడుక్కోలేదు. ఫస్ట్ టైం అడుక్కున్నా.’ అంటూ ఆమె ఫ్రెండ్ కామెంట్ చేశాడు. ’తిరుపతిలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం’ అంటూ నవ్వింది. ’అడుక్కున్నా కానీ... బాగుంది గాయ్స్.’ అంటూ శివజ్యోతి ఫ్రెండ్ అన్నాడు. భక్తులు, నెటిజన్ల ఆగ్రహం ప్రసాదంపై శివజ్యోతి నవ్వుతూ చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతుండగా... శ్రీవారి భక్తులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి అన్న ప్రసాదాన్ని, భక్తులను అవమానించిందని అంటున్నారు. ’ఇది ఆమె నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. యాత్రికులను బిచ్చగాళ్లతో పోల్చింది. ప్రసాదం అడుగుతున్న తమను తాము కుబేరులతో పోల్చుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. కర్మ సరైన టైంలో ఆమెకు బుద్ధి చెబుతుంది.’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా... ’ఈమెను టెంపుల్లోకి రాకుండా బ్యాన్ చేయాలి. టీటీడీ చర్యలు తీసుకోవాలి.’ అంటూ ఏకిపారేస్తున్నారు. మరి దీనిపై శివజ్యోతి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.
బెంగళూరు ఎటిఎం వ్యాను డబ్బు చోరీ కేసు- ఛేదన
కానిస్టేబుల్ సహా ముగ్గురు అరెస్టు - రూ.5.76 కోట్లు స్వాధీనం మన తెలంగాణ/హైదరాబాద్ : బెంగళూరులో పట్టపగలే జరిగిన ఎటిఎం వాహనంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ఓ కానిస్టేబు ల్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.5.76 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా మొత్తాన్ని సైతం స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. మొత్తం 30 మందిని విచారణ చేసిన తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. చోరీ కోసం నిందితులు 3 నెలలు పాటు ప్రణాళిక వేసుకున్నారన్నారు. గత 15 రోజుల నుంచి దోపీడీ చేయాల్సిన ప్రదేశంపై నిఘా ఉంచారని తెలిపారు. ఈ నెల 19 మధ్యాహ్నం 12.48 గంటల సమయంలో అశోక్ పిల్లర్-జయనగర్ దారి సర్కిల్ మార్గంలో నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న కారుతో వచ్చి, కస్టోడియన్ వాహనాన్ని అడ్డగించారన్నారు. తమను తాము ఆర్బిఐ కంట్రోల్ ఆఫీసర్లమని చెప్పుకున్నారని తెలిపారు. నిందితులు సదరు కస్టోడియన్ వాహనంలోకి ఎక్కి, డ్రైవర్ను డైరీ సర్కిల్ వైపు వెళ్లమని సూచించారన్నారు. తరువాత సెక్యూరిటీ గార్డు, కస్డోడియన్ సిబ్బంది వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను తీసుకుని బయటపడేశారని తెలిపారు. వారు ఎవరికీ దొరకకూడదనే ఉద్దేశంతో సిసిటివిలు లేని ప్రదేశాన్ని ఎంచు కున్నారన్నారు. ఈ దోపిడి గురించి తెలియగానే పోలీసులు బెంగళూరు సరిహద్దు జిల్లాల ఎస్పిలు, పొరుగు రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. అదనంగా బెంగళూరు పోలీసు శాఖలోని ఇద్దరు జాయింట్ కమిషనర్ల మార్గదర్శకత్వంలో ఇద్దరు డిసిపిలు సుమారు 200 మంది అధికారులు సిబ్బందితో కూడిన 11 బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లాయన్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వారిలో సిఎంఎస్ సెక్యూరిటీస్ కస్టోడియన్ వెహికల్ సూపర్వైజర్ రవి, మాజీ ఉద్యోగి జేవియర్, గోవింద్పూర్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ అన్నప్ప నాయక్ ఉన్నారన్నారు. వారి నుంచి రూ.5.76 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు నమోదైన 54 గంటల్లోనే ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. అయితే ఈ దోపిడీలో కనీసం 6 నుంచి 8 పాల్గొన్నట్లు సమాచారం. అందుకే మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ - సీమంత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అయితే త్వరితగతిన ఈ కేసులోని ముగ్గురు కీలక నిందితులను పట్టుకున్న బృందానికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే, వాస్తవానికి ఎటిఎంలో డబ్బులు వేసేందుకు వెళ్లే వాహనంలో డ్రైవర్తోపాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉండాలి. అలాగే ఇద్దరు కస్టోడియన్లు కచ్చితంగా ఉండి తీరాలి. కస్టోడియన్ వాహనాన్ని ఒకే సమయంలో, ఒకే మార్గంలో పదేపదే తీసుకెళ్ల కూడదు. సిబ్బందికి కచ్చితంగా డబ్బు నిర్వహణలో శిక్షణ ఇచ్చి ఉండాలి. సిబ్బంది బ్యాక్ గ్రౌండ్ కూడా కచ్చితంగా చెక్ చేయాలి. కస్టోడియన్ కంపెనీలోని ఏ ఉద్యోగిని తొలగించినా, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి. కానీ తాజా కేసులో సిఎంఎస్ సెక్యూరిటీస్ కంపెనీలో చాలా లొసుగులు ఉన్నాయని తేలింది. కనుక దీని గురించి ఆర్బిఐకు లేఖ రాస్తామని వివరించారు.
Mallikarjun |డీసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్
Mallikarjun | కామారెడ్డి ప్రతినిధి,(ఆంధ్రప్రభ): కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం ఎట్టకేలకు
മുക്കം മുനിസിപ്പാലിറ്റി വെൽഫെയർ പാർട്ടി സ്ഥാനാർഥിയുടെ 2020ലെ പോസ്റ്റർ എഡിറ്റ് ചെയ്താണ് പ്രചാരണം
Congress |కాంగ్రెస్ అధ్యక్షులు.. ఖరారు..!
Congress |ఖమ్మం ఉమ్మడి బ్యూరో – ఆంధ్రప్రభ : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను
ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి : చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న
KTR – Jagan |అన్నా బగున్నావా… !!
ఆంధ్రప్రభ : ఎందన్నా.. ఈ కేసుల గోల.. ఈ రేస్ తప్పేంటీ.. ఏదో
Pic Talk: Rakul Singh sizzles in Style
Rakul Preet Singh has done films with all the Telugu top actors and she slowly shifted her base to Hindi cinema. The actress got married to actor and producer Jackky Bhagnani and the actress is focused on doing Hindi films. The actress posed in a mini skirt showing off her toned abs. She looked super […] The post Pic Talk: Rakul Singh sizzles in Style appeared first on Telugu360 .
The Family Man: Season 3 is the Weakest
The Family Man: Season 1 happened to be the best ever web series made in India. Backed by Raj and DK, Amazon Prime backed this crime thriller with Manoj Bajpayee playing the lead role. The second season too was passable though it had enough flaws. The Family Man: Season 3 is now out and it […] The post The Family Man: Season 3 is the Weakest appeared first on Telugu360 .
Nimmala Fire on Jagan |ఎక్కడ నిద్రపోయారు….
పాలకొల్లు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కృష్ణానది జల వివాదాలకు సంబంధించి ట్రిబ్యునల్-2 ముందు
TRADERS MEET : బెస్ట్ మార్కెటింగ్ కల్పిద్దాం
TRADERS MEET : బెస్ట్ మార్కెటింగ్ కల్పిద్దాం ( కర్నూలు, ఆంధ్రప్రభ ప్రతినిధి)
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్గల్ మండలం జాగిర్యాల్ గ్రామానికి చెందిన జి.శ్రీచందన
Hospital |సమస్యల వలయంలో బాల్కొండ ఆసుపత్రి
బాల్కొండ, ఆంధ్రప్రభ : నేను రాను బిడ్డో… మన ఊరు దవాఖానకు అంటూ
WGL |మహా జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం…
ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : 2026 జనవరిలో జరగనున్న మహా జాతర ఏర్పాట్లను
visible Police |ప్రజా భద్రతే లక్ష్యం…
విజబుల్ పోలీసింగ్తో ప్రజలకు భరోసారామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్
Maoist Protest : మన్యంలో అలజడి
Maoist Protest : మన్యంలో అలజడి ఆంధ్రప్రభ , చింతూరు, (ఏఎస్ఆర్ జిల్లా)
Sharwanand’s Biker shifts Gears of Release
Sharwanand’s crazy film Biker is carrying good expectations and the makers announced a December 6th release for the film, a day after the release of NBK’s Akhanda 2. This is a bad decision and the distributors have mounted pressure on the makers of Biker to push the release. The movie is now pushed by a […] The post Sharwanand’s Biker shifts Gears of Release appeared first on Telugu360 .
Akhanda 2: NBK and Boyapati takes Lion’s Share
Akhanda 2 is the fourth collaboration of Nandamuri Balakrishna and Boyapati Srinu. The film is a crazy attempt and is in news right from the day the film was launched. Boyapati promised a record business for the film and 14 Reels Plus has spent lavishly on the film. They had strong belief that they would […] The post Akhanda 2: NBK and Boyapati takes Lion’s Share appeared first on Telugu360 .
Uttam | అదే టార్గెట్… హుజూర్నగర్, ఆంధ్రప్రభ : స్తానిక సంస్థల ఎన్నికల్లో
NLGD |ఎస్సీ బాలుర హాస్టల్ను దత్తత తీసుకోవాలి..
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ఎస్సీ బాలుర
డ్రైవర్కి గుండెపోటు.. అదుపు తప్పి బైక్లను ఢీకొట్టిన కారు..
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్కి గుండెపోటు రావడంతో కారు అదుపు తప్పి బైక్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ బైక్ గాల్లో ఎగిరి కిందపడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఠాణెలోని అంబర్నాథ్ ఫ్లైఓవర్పై ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసేన పార్టీకి చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వస్తుండగా.. కారు డ్రైవర్ లక్ష్మణ్ షిండేకు గుండెపోటు వచ్చింది. దీంతో కారు నియంత్రణ కోల్పోయి.. ముందున్న బైక్లతో పాటు ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి బైక్తో సహా ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డాడు. ఈ ఘటనలో డ్రైవర్ షిండేతో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడగా.. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. కిరణ్ చాబేను కూడా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Golden chariot |స్వర్ణరథంపై శ్రీ పద్మావతీ విహారం…
Golden chariot |తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు
18 చోరీ కేసుల్లో ఇద్దరు అరెస్టురూ. 33.25 లక్షల సొత్తు స్వాధీనంజిల్లా ఎస్పీ
CI Mandavi|అవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
శాంతి-భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలి..ఉట్నూర్ సీఐ మండావి ప్రసాద్ CI Mandavi|ఉట్నూర్, ఆంధ్రప్రభ
మందు బాబు వీరంగంఆలూరు పోలీసులు ఆశ్చర్యం Kurnool | కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో
Speaker Issues Notice to Kadiyam Srihari Amid Disqualification Row
Telangana Speaker Gaddam Prasad Kumar has issued a notice to MLA Kadiyam Srihari after the BRS filed a disqualification petition accusing him of shifting loyalty to the ruling Congress. The Speaker asked him to respond by November 23. However, Srihari has requested additional time to file his reply, according to official sources. He is one […] The post Speaker Issues Notice to Kadiyam Srihari Amid Disqualification Row appeared first on Telugu360 .
అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయో ప్రజలకు చెప్పాలి:కెటిఆర్
బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల మధ్య ఉన్న తేడాను కెటిఆర్ వివరించారు. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రతి పైసా ద్వారా ఆస్తులను సృష్టిస్తే ఈ ప్రభుత్వం మాత్రం అప్పుల సునామిని సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్ లెక్కల ప్రకారం పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 2.80 లక్షల కోట్ల అప్పులు తీసుకువస్తే, 23 నెలల కాలంలోనే దాదాపు రెండు లక్షల 30 వేల కోట్ల అప్పులను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని అన్నారు.ఆనాడు మిషన్ భగీరథ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి మిషన్ కాకతీయ వేలకోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం వంటి అనేక ఉత్పాదక ఆస్తులను సృష్టించిందని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకం లేకుండానే, ఒక్క ప్రాజెక్టు ప్రారంభం కూడా చేయకుండానే, కనీసం మౌలిక వసతుల కోసం ఒక్క ఇటుక పేర్చకుండానే రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువచ్చి ఏం చేసిందని ప్రశ్నించారు. అక్టోబర్ నెల కోసం విడుదల చేసిన కాగ్ నివేదికతో వడ్డీల వాదనలో డొల్లతనం బయటపడటంతో, ఇంత భారీ మొత్తంలో చేస్తున్న అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. వడ్డీల పేరుతో పదేపదే అబద్ధాలు చెబుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వాస్తవానికి ఈ అప్పులన్నింటినీ తమ అనుచరులు, మధ్యవర్తులు, ఢిల్లీకి మూటలను పంపడానికే ఉపయోగిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ‘స్కాంగ్రెస్ ఎటిఎం’ గా మార్చారని విమర్శించారు. ఇన్ని రోజులు వడ్డీల కోసమే అప్పులు చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొచ్చినా, కాగ్ నివేదికతో మరోసారి వాదనలోని డొల్లతనం బట్టబయలైనందున, ఈ అప్పులన్నీ దేని కోసం చేశారో వెంటనే ప్రజలకు వివరించాలని అన్నారు.
బెంగళూరుకు వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన వెళ్లనున్నారు. ఈ పర్యటన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత కీలకంగా మారింది. సిఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డిప్యూటీ సిఎం డికె శివకుమార్ల మధ్య వ్యక్తిగతంగా, పార్టీలో విభేదాలు తీవ్రం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లి పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. దీంతోపాటు నేడు (ఆదివారం) ఉదయం పుట్టపర్తి సాయిబాబా ఉత్సవాల్లో సిఎం రేవంత్రెడ్డి పాల్గొని నేడు (ఆదివారం) సాయంత్రం తిరిగి హైదరాబాద్కు రానున్నట్టుగా తెలిసింది.
ఖర్చు కంటే బాకీలకు వడ్డీ ఎక్కువ కడుతున్నాం:మంత్రి జూపల్లి
రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు అవుతున్న ఖర్చు కంటే కెసిఆర్ చేసిన బాకీకి కడుతున్న వడ్డీ ఎక్కువగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. కెసిఆర్ ప్రభుత్వం మితిమీరి చేసిన అప్పుల వల్లే ఇప్పుడు హామీల అమల్లో కొంత జాప్యం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులందరూ చేసిన అప్పు కంటే పదింతల అప్పులు చేసి రాష్ట్రాన్ని కెసిఆర్ అంధకారంలోకి నెట్టేశారని మంత్రి జూపల్లి ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా తాము ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న చీరలు గతంలో ఇందిరమ్మ కట్టిన చీరల్లాగే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నాణ్యతలో రాజీపడకుండా ప్రభుత్వం చీరలు తయారు చేయించిందన్నారు. మహిళా సంఘాల్లో లేని మహిళలకు సైతం చీరలు అందుతాయని, కొల్లాపూర్లో సరిగ్గా రోడ్లు కూడా లేవని గతంలో చంద్రబాబు నాయుడు హేళన చేశారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా కిరణ్కుమార్ రెడ్డిని పట్టుబట్టి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించామని ఆయన పేర్కొన్నారు.
అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక్క సభ జరగలేదు: సిఎం
హైదరాబాద్: తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో అందె శ్రీ సంతాప సభకు ఆయన హాజరయ్యారు. రేవంత్తో పాటు పలువురు మంత్రులు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఎంత అమాయకంగా కనిపిస్తారో.. అంత చైతన్యవంతులు అని కితాబిచ్చారు. ఈ గడ్డ మీద ప్రజలు అహంకారాన్ని, ఆధిపత్యాన్ని సహించలేరని అన్నారు. నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఎంతో మంది కళాకారులు తమ పాటలతో చైతన్యం కలిగించారని మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని.. ఉద్యమానికి కవులు, కళాకారులు ఇచ్చిన ఊపుతోనే తెలంగాణ సాకారమైందని పేర్కొన్నారు. ఎన్నడూ బడికి వెళ్లని అందెశ్రీ అద్భుతమైన ‘జయజయహే తెలంగాణ’ పాట రాశారని కొనియాడారు. అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక్క సభ కూడా జరగలేదని పేర్కొన్నారు. కానీ.. తెలంగాణ సాకారమైన తర్వాత ‘జయజయహే తెలంగాణ’ పాట మూగబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు అందెశ్రీ గీతంపై కుట్రలు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని కనుమరుగు చేసే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం రాగానే ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించామని తెలిపారు. ఇవాళ ప్రతి పుస్తకంలో మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’ పాట కనిపిస్తుందని పేర్కొన్నారు. ఉద్యమంలో అందరం పాడిన పాట, ప్రజలు మెచ్చిన పాటనే రాష్ట్ర గీతంగా ప్రకటించామని తెలిపారు. అందె శ్రీ, గద్దర్ కుటుంబాలను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణకు చెందిన 9 మంది కవులను, కళాకారులను గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు. 9 మంది కవులు, కళాకారులకు 300 గజాల ఇంటి స్థలం ఇచ్చామని అన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. చదువుల్లోనే కాదు.. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లోనూ ఎస్సీల ప్రాతినిధ్యం పెరగాలని అన్నారు. మంత్రి వర్గంలోనూ ఎస్సీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు.
చరిత్ర సృష్టించిన హెడ్.. 123 ఏళ్ల రికార్డు బ్రేక్
పెర్త్: ది యాషెస్ సరికొత్త సీజన్లోని తొలి మ్యాచ్లో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగియడం గమనార్షం. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్కి 205 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. ఇంగ్లండ్. ఈ లక్ష్యాన్ని 28.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి చేధించింది ఆస్ట్రేలియా. ఇక ఈ మ్యాచ్లో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ చెలరేగిపోయాడు. తనదైన శైలీ బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ హెడ్.. రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించాడు. కేవలం 69 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 83 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 16 ఫోర్లు, 4 సిక్స్లతో 123 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు రికార్డులను హెడ్ బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 4వ ఇన్నింగ్స్లో (ఛేజింగ్) అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా హెడ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ గిల్బర్ట్ జెస్సోప్ పేరిట ఉండేది. 1902లో అతడు ఆస్ట్రేలియాపై నాల్గవ ఇన్నింగ్స్లో 76 బంతుల్లో శతకం సాధించాడు. 123 ఏళ్ల తర్వాత ఈ రికార్డును హెడ్ బద్దలుకొట్టాడు. అంతేకాక.. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఓపెనర్గా డేవిడ్ వార్నర్(69 బంతులు) రికార్డును సమం చేశాడు హెడ్.
Telangana |రాష్ట్రస్థాయి కుస్తీకి మదర్ థెరిసా విద్యార్థులు
Telangana | రాష్ట్రస్థాయి కుస్తీకి మదర్ థెరిసా విద్యార్థులు Telangana | దండేపల్లి,
Viveka Murder : కట్టప్ప శంకరయ్య
Viveka Murder : కట్టప్ప శంకరయ్య ( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్
MLA |మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
MLA | మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
FUND | చేనేత కార్మికుల రుణమాఫీ FUND | మోత్కూర్, ఆంధ్రప్రభ :
POWER |తాటికొండకు ఎక్స్ ప్రెస్ ఫీడర్..
POWER | తాటికొండకు ఎక్స్ ప్రెస్ ఫీడర్.. POWER | స్టేషన్ ఘన్
CPM|రాప్తాడులో బ్రిడ్జి ఏర్పాటు చేయండి: సీపీఎం పార్టీ
CPM| రాప్తాడు, ఆంధ్రప్రభ: నాలుగు రోడ్లు వెంబడి నిత్యం వేలాది వాహనాలు భారీ
Chityala |మహిళాభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
Chityala | మహిళాభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ :
Telangana : తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. రెడీ అయిందిగా
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరు మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది
POLICE |నూతన ఎస్పీగా శ్రీ నితికా పంత్
POLICE |నూతన ఎస్పీగా శ్రీ నితికా పంత్ POLICE | ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ
డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి
సీనియర్ డివిజనల్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టు ప్రాంగణము నందు డిసెంబర్ 13వ తేదీ జాతీయ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ డివిజనల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు ఈ జాతీయలోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కచ్చిదారులు, పోలీసు వారు, బ్యాంకు […] The post డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి appeared first on Visalaandhra .
ఐబొమ్మ అరెస్ట్ పై ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు
సినిమాల పైరసీ, ఐబొమ్మ రవిపై రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు
COUNTRY|వారి సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు..
COUNTRY| వారి సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు.. COUNTRY| విజయవాడ, ఆంధ్రప్రభ: కవులు,
గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలి
ఎమ్మెల్యే ధర్మరాజుకు వినతిపత్రం విశాలాంధ్ర – గణపవరం(పశ్చిమగోదావరి జిల్లా) : ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలని మండలం అభివృద్ధి ప్రజల సంక్షేమ దృష్టిలో ఉంచుకొని గణపవరం మండలంలో ఉన్న అన్ని గ్రామాల అఖిలపక్ష నాయకులు ప్రజాప్రతినిధులు కలసి వినతి పత్రంన్ని శనివారం గణపవరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజుకు అందజేశారు. The post గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలి appeared first on Visalaandhra .
MLA |కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం…
MLA | కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం… ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
26న నిరసన ప్రదర్శన జయప్రదం చేయండి
విశాలాంధ్ర -నాగులుప్పలపాడు : రైతాంగ ,కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 26 వతేది ఒంగోలులో సంయుక్త కిసాన్ మోర్చా ,ట్రేడ్ యూనియన్ల ఆద్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు చుండూరి రంగారావు తెలిపారు శనివారం మండలంలోనే ఉప్పుగుండూరు గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతాంగం సంవత్సరం పాటు చేసిన పోరాటం నవంబరు 26 […] The post 26న నిరసన ప్రదర్శన జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
Perni Nani : చంద్రబాబు ఉంటే అతివృష్టి..లేకుంటే అనావృష్టి
చంద్రబాబు అధికారంలోకి వస్తే అతివృష్టి లేదా అనావృష్టి అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
ACCIDENT|రోడ్డు ప్రమాదం ఇద్దరి మృతి..
ACCIDENT| గంగాధర నెల్లూరు, ఆంధ్రప్రభ : గంగాధర నెల్లూరు మండలంలో శనివారం విషాదం
Makthal |నాణ్యమైన భోజనం అందించాలి…
Makthal | నాణ్యమైన భోజనం అందించాలి… మక్తల్ మైనార్టీ బాలికల పాఠశాలను సందర్శించిన
కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కు అయ్యాయి: హరీశ్ రావు
హైదరాబాద్: కీలకమైన భూములపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల బడ్జెట్కు సరిపడా నిధులు వచ్చే అంశంపై కనీస చర్చ జరగలేదని మండిపడ్డారు. మంత్రి మండలి, అసెంబ్లీలో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని.. రూ.5 లక్షల కోట్లు వచ్చే భూములకు కేవలం రూ.5 వేల కోట్లు ఎలా వస్తాయని? ప్రశ్నించారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూములను ఆగమేఘాల మీద ఎలా అప్పగిస్తారని అన్నారు. రెండు నెలల్లోనే ప్రక్రియ అంతా పూర్తి చేయటం వెనుక కుట్ర ఏమిటని? ఆరోపించారు. భూములను బహిరంగ మార్కెట్లో వేలం వేస్తే.. రూ.5 లక్షల కోట్లు వస్తాయని అన్నారు. ప్రభుత్వ అవసరాలకు కూడా లేకుండా భూములను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. కాలుష్యకారక పరిశ్రమలనే ఒఆర్ఆర్ అవతలకు పంపించాలనేది పాలసీ.. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం గ్రీన్ ఇండస్ట్రీలను కూడా బయటికి పంపిస్తోందని ధ్వజమెత్తారు. భారీ భూకుంభకోణంపై కేంద్రంలోని బిజెపి సర్కారు ఎందుకు స్పందించ లేదని.. కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.
రక్తదాన శిబిరమునకు విశేష స్పందన
రక్త బంధం ఆర్గనైజేషన్ నిర్వాహకులు కన్నా వెంకటేష్.విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేట హైస్కూల్ ఎదురుగా టిడిపి పట్టణ నాయకుడు సందా రాఘవ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని రక్త బంధం ఆర్గనైజేషన్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఈ శిబిరానికి 50 మంది రక్తదానం చేయడం జరిగిందని వారు తెలిపారు. సందా రాఘవ వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల్లో పాల్గొని తన వంతుగా […] The post రక్తదాన శిబిరమునకు విశేష స్పందన appeared first on Visalaandhra .
SPORTS |క్రీడా పోటీల్లో విద్యార్థునుల ప్రతిభ
ఎంపికైన విద్యార్థులను అభినందించిన హెచ్ఎం ఉపాధ్యాయులురాష్ట్రస్థాయి క్రీడలకు కోహినూర్ (కే) విద్యార్థినీల ఎంపిక
Telangana : చుక్కలు చూపిస్తున్న ఇమ్మడి రవి
పోలీసులవిచారణలో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసుల విచారణకు సహకరించడం లేదు
ARREST|ఏటీఎం దోపిడీ కేసులో ఐదుగురు అరెస్ట్
ARREST| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: బెంగళూరు పోలీసులు ఇటీవల చోటుచేసుకున్న ఏటీఎం క్యాష్
Bikkanoor |న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం….
Bikkanoor | న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం…. Bikkanoor | బిక్కనూర్,
మిషన్ భగీరథ పైప్లైన్ వాల్వ్ ధ్వంసం.. ఉవ్వెత్తున ఎగసిపడ్డ నీరు#TeluguPost #telugu #post #news
SABARI |అయ్యప్ప స్వామి నామస్మరణం
SABARI | అయ్యప్ప స్వామి నామస్మరణం పేటలో మారు మ్రోగిన అయ్యప్ప స్వామి
ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి..
విశాలాంధ్ర ధర్మవరం: ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున తెలిపారు.. ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర మహాసభల గోడపత్రికలను పట్టణ టూటౌన్ సీఐ రెడ్డప్ప ఆవిష్కరించారు. అనంతరం ధర్మవరం టూ టౌన్ సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 25వ మహాసభలు తిరుపతి నగరంలో డిసెంబర్ 12, 13 ,14 తేదీలలో జరుగునున్నాయి అని తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం […] The post ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.. appeared first on Visalaandhra .
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; పంచాయతీరాజ్ కమిషనర్ , గ్రామీణ అభివృద్ధి శాఖ వారి ఆదేశాల ప్రకారం ఈనెల 22వ తేదీ శనివారం ధర్మవరం మండలం నందు అన్ని గ్రామ పంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామసభల షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది అని ఈ సభలను విజయవంతం చేయాలని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కొత్త జాబ్ కార్డులు మంజూరుకు కొరకు దరఖాస్తుల […] The post గ్రామసభలు విజయవంతం చేయండి.. appeared first on Visalaandhra .
Telangana : భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్నారు
Tadwai |ప్రకృతి రమణీయత ఉట్టిపడాలి
Tadwai | ప్రకృతి రమణీయత ఉట్టిపడాలి ఎంఈఓ శ్రీనివాస్ Tadwai | తాడ్వాయి,
GOVERNMENT|మహిళ అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
GOVERNMENT| కడెం, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న
CONGRESS|మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
CONGRESS |మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యం . కోటి మంది మహిళలను కోటీశ్వరులు
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాం..
కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ సతీష్ కుమార్ విశాలాంధ్ర ధర్మవరం; ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తామని కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక నేసే పేటలోని కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచ్ ధర్మవరం పట్టణంలో స్థాపించి 50 సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా ఖాతాదారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరూర్ వైశ్యా బ్యాంక్ బ్యాంకింగ్ రంగంలో109 సంవత్సరాలుగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తోందని, […] The post ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాం.. appeared first on Visalaandhra .
Bejjanki | ఆటో బోల్తా పడి.. ఇద్దరికీ గాయాలు Bejjanki | బెజ్జంకి,
117వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును ప్రజలు సద్వినియోగం చేసుకోండి..
శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘంవిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయం ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 117 వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శిబిరంలో పాల్గొన్న రోగులకు ఉచిత వైద్య […] The post 117వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును ప్రజలు సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
తొలి రోజు ముగిసిన ఆట.. సఫారీల స్కోర్ ఎంతంటే..
గౌహటి: రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా గౌహటి బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు సౌతాఫ్రికా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సౌతాఫ్రికా ఓపెనర్లు తొలి వికెట్కి 82 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే బుమ్రా.. మార్క్రమ్(38) వికెట్ తీయడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత కొంత సమయానికే మరో ఓపెనర్ రికెల్టన్ (35) కూడా ఔట్ అయ్యాడు. అనంతరం స్టబ్స్, బవుమాల జోడీ సఫారీలకు అండగా నిలిచింది. వీరిద్దరు కలిసి మూడో వికెట్కి 84 పరుగులు జోడించారు. అయితే లంచ్ బ్రేక్ తర్వాత జడేజా ఈ జోడీకి బ్రేక్ వేశాడు. 166 పరుగుల వద్ద కెప్టెన్ టెంబా బవుమా(41) ఔట్ చేశాడు. డు. 166 పరుగుల వద్ద బవుమా(41) పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కుల్దీప్ బౌలింగ్లో రికల్టన్(49) హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. అనంతరం కుల్దీప్ ముల్డర్ని ఔట్ చేశాడు. ఈ నేపథ్యంలో డి జోర్జి, ముత్తుస్వామిలు మరో భాగస్వామ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ, సిరాజ్ బౌలింగ్లో జోర్జి(28) ఔట్ అయ్యాడు. దీంతో సౌతాఫ్రికా 81.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. భారత బౌలింగ్లో కుల్దీప్ 3, బుమ్రా, సిరాజ్, జడేజా తలో వికెట్ తీశారు.
నేత్రాలయ ఐ క్లినిక్ లో ఉచిత కంటి వైద్య పరీక్షలు
నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డివిశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని సుదర్శన కాంప్లెక్స్ పక్కన వివి కాంప్లెక్స్ (మునిసిపల్ కాంప్లెక్స్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల నేత్రాలయ ఐ క్లినిక్ అండ్ ఆప్టికల్స్ లో ఈనెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత కంటి వైద్య పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కంటి శుక్లములకు ఆధునిక పరీక్షలు, కార్నియా పరీక్ష, డయాబెటిక్ రెటీనో పతి […] The post నేత్రాలయ ఐ క్లినిక్ లో ఉచిత కంటి వైద్య పరీక్షలు appeared first on Visalaandhra .
హమాలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి..
జిల్లా గౌరవ అధ్యక్షులు ఓబులువిశాలాంధ్ర ధర్మవరం : హమాలీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష, జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ కాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు స్థానిక మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లైస్ వర్కర్స్ యూనియన్ సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు జి.ఓబులు కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ జిల్లా సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని,హమాలీలు కొందరికి పేర్లు నమోదు […] The post హమాలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.. appeared first on Visalaandhra .
ORPHANAGE |దైవంతో సమానం తల్లిదండ్రులే
ORPHANAGE | దైవంతో సమానం తల్లిదండ్రులే ORPHANAGE |తాడ్వాయి, ఆంధ్ర ప్రభ :
Telangana |అధికారుల పర్యవేక్షణ ఉండాలి
Telangana | అధికారుల పర్యవేక్షణ ఉండాలి లంబాడీ జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
2025 నవంబరు 21వ తేదీ భారత దేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక దుర్దినం
నాలుగు లేబర్ కోడ్ లు నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు తణుకు : దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు రద్దుచేసి కార్మికులకు తీవ్ర హాని తలపెడుతూ కార్పోరేట్ లు,బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా అమలు లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల అభివృద్ధి,సంక్షేమానికే నని నమ్మబలకడాన్ని మించిన మోసం మరొకటి లేదని ఏఐటీయూసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల […] The post 2025 నవంబరు 21వ తేదీ భారత దేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక దుర్దినం appeared first on Visalaandhra .
TRAFFIC|బుల్లెట్ సౌండ్ వస్తే చర్యలే..
TRAFFIC| బుల్లెట్ సౌండ్ వస్తే చర్యలే.. TRAFFIC| ఖమ్మం, ఆంధ్రప్రభ: పోలీస్ కమిషనర్
HOSPITAL |స్థల పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యం
HOSPITAL | స్థల పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం –

20 C