SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

ఇంటి భోజనం కావాలి : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరగనుంది

తెలుగు పోస్ట్ 18 Nov 2025 11:29 am

నేడు బీహార్ శాసనసభ పక్ష సమావేశం

నేడు బిహార్‌ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది

తెలుగు పోస్ట్ 18 Nov 2025 11:24 am

Harish Rao : నేడు వరంగల్ కు హరీష్ రావు

నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్‌రావు పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 18 Nov 2025 11:20 am

వెండితెరకు పైరసీ చీడ

పైరసీ పెనుభూతంగా మారి భారతీయ సినీ పరిశ్రమను కబళిస్తోంది. వందల కోట్లు పెట్టుబడి పెట్టి, వందలాది మంది టెక్నీషియన్లతో కొన్ని నెలలపాటు తీసే సినిమా, థియేటర్లలో విడుదలైన రెండు మూడు గంటల్లోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతోంది. హాలీవుడ్ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తదితర పేర్లతో పిలుచుకునే భారతీయ సినీ పరిశ్రమే ప్రపంచంలో అతి పెద్దది. ఇక్కడ రూపొందిస్తున్న సినిమాలు అమెరికా, జర్మనీ, చైనా, జపాన్ వంటి దేశాల్లో అమోఘమైన ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే, పైరసీ మహమ్మారి కారణంగా భారతీయ చిత్ర పరిశ్రమకు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఎర్నెస్ట్-యంగ్ సంస్థలు ఆ మధ్య సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో భారతీయ సినీ పరిశ్రమకు పైరసీ కారణంగా 2023వ సంవత్సరంలో ఒనగూడిన నష్టం అక్షరాలా 22,400 కోట్ల రూపాయలని తేలింది. ఇటీవల ఓ భారీ తెలుగు చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే ఆర్‌టిసి బస్సులో ప్రసారమైన సంఘటన పైరసీ పెనుభూతం గ్రామీణ స్థాయికి సైతం ఎంతలా పాకిందో తెలియజెప్పడానికి ఉదాహరణ. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత కొన్ని నెలల్లో అనేకమంది పైరసీదారుల ఆటకట్టించారు.అందులో చెప్పుకోదగినది తాజాగా ఐ బొమ్మ పేరిట సాగుతున్న పైరసీదారుణ్ని కటకటాల వెనక్కి నెట్టడం. కరేబియన్ దీవుల్లో తిష్టవేసుకు కూర్చుని, వచ్చిన సినిమాను వచ్చినట్లుగా పైరసీ చేసి, ఆన్‌లైన్‌లో పెడుతున్న ఐ బొమ్మ నిర్వాహకుడు విద్యాధికుడు. ఇంజినీరింగ్, ఎంబిఎ పట్టాలు తీసుకుని, రెండు కంపెనీలకు సిఇఒగా పనిచేసిన ఈ ప్రబుద్ధుడు ఈజీ మనీకి ఆశపడి, సినిమాల పైరసీకి శ్రీకారం చుట్టడం ఆశ్చర్యం గొలిపే విషయం. వందకు పైగా డొమైన్లతో, ప్రాక్సీ సర్వర్ల ద్వారా వేలాది సినిమాలను ఇతను పైరసీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఔపోసన పట్టిన ఇలాంటివారు తమ తెలివితేటలను అక్రమార్జనకు వినియోగిస్తున్నారు. నిర్మాతలు లేదా పంపిణీదారులనుంచి థియేటర్లకు చేరే సినిమా ‘కీ’ని బగ్ హంటింగ్, బర్ఫ్ స్యూట్ వంటి టెక్నాలజీల సాయంతో కాజేస్తున్నట్లు ఆ మధ్య బీహార్ కు చెందిన ఓ పైరసీదారు వెల్లడించడం ఐటి నిపుణులను సైతం ఆశ్చర్యానికి లోను చేసింది. పైరసీదారులకు మూడేళ్ల కారాగారం, సినిమా నిర్మాణ వ్యయంలో ఐదు శాతం జరిమానా విధించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించినా పైరసీదారులకు ముకుతాడు పడకపోవడానికి కారణం.. విదేశాలనుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారతీయ చట్టాలకు దొరకకుండా తప్పించుకుంటూ ఉండటమే. ‘మమ్మల్ని మీరేం చేయలేరు’ అంటూ ఐ బొమ్మ నిర్వాహకుడు అంత ధైర్యంగా మన పోలీసులకు సవాల్ విసరడం వెనుక విదేశాలలో ఉన్న తనను ఏమీ చేయలేరనే ధైర్యమే కారణం. అతను హైదరాబాద్‌కు రాకపోయి ఉంటే, మన పోలీసులు పట్టుకోగలిగేవారేనా అనేది ప్రశ్నార్థకం. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రపంచ దేశాల మధ్య సయోధ్య కొరవడటం వల్లే ఇలాంటి పైరసీదారులు పేట్రేగిపోతున్నారు. తమ వెబ్‌సైట్లకు గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చే ప్రకటనలే వీరికి కాసులు కురిపిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లలో సినిమాలు చూస్తున్న అమాయక జనం, ఇలాంటి యాప్‌ల ప్రభావానికి లోనవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఒకరిద్దరి అరెస్టులతో పైరసీ పెనుభూతం మటుమాయమవుతుందని భావించడం హాస్యాస్పదం. పైరసీ సినిమాలకు ప్రేక్షకాదరణ ఎందుకుంటోందని సినీ పరిశ్రమ పెద్దలు ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయమిది. ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో నెలకు 35 లక్షలమంది పైరసీ సినిమాలు చూస్తున్నారంటే అందుకు కారణమేమిటి? పేదవాడికి అందుబాటులో ఉండే వినోద సాధనం సినిమా. ప్రస్తుత పరిస్థితుల్లో అది అందని ద్రాక్షగా మారుతోంది. రిలీజైన రోజే సినిమా చూడాలంటే నలుగురు సభ్యులుగల కుటుంబం పదిహేను వందలనుంచి రెండువేల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక థియేటర్‌లో తినుబండారాల ధరల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పైరసీని అరికట్టడం గురించి తలలుబద్దలు కొట్టుకుంటున్న సినీపెద్దలు చిత్ర నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడంతోపాటు, టికెట్ రేట్లు సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉంచితే సెల్ ఫోన్‌లో పైరసీ సినిమా చూసే బదులు సగటు మనిషి వెండితెరపై సలక్షణంగా సిసలైన సినిమానే చూస్తాడనడంలో సందేహం అక్కర్లేదు. 

మన తెలంగాణ 18 Nov 2025 11:16 am

Breaking : మోస్ట్ వాంటెండ్ మావోయిస్టు హిడ్మా మృతి?

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందారని చెబుతున్నారు

తెలుగు పోస్ట్ 18 Nov 2025 11:15 am

Harish Rao |రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి…

Harish Rao | రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి… వరంగల్ మార్కెట్లో బీఆర్ఎస్

ప్రభ న్యూస్ 18 Nov 2025 11:12 am

Prajavani |ఫిర్యాదు పై విచారణ..

Prajavani | ఫిర్యాదు పై విచారణ.. Prajavani, బిక్కనూర్, ఆంధ్రప్రభ : ప్రజావాణిలో

ప్రభ న్యూస్ 18 Nov 2025 11:01 am

HYD |రోడ్లపైనే సిట్టింగ్‌…..

HYD | రోడ్లపైనే సిట్టింగ్‌….. అమీర్‌పేట్‌, (ఆంధ్రప్రభ) : నగరంలోని పలు వైన్స్‌ల

ప్రభ న్యూస్ 18 Nov 2025 10:58 am

హనుమంతుడిపై కామెంట్స్.. రాజమౌళిపై కేసు నమోదు

దిగ్గజ దర్శకుడు రాజమౌళి చిక్కుల్లో పడ్డారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో ఆయన తాజా చిత్రం టైటిల్ ప్రకటన ఈవెంట్‌ ఈ నెల 15వ తేదీన ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో టైటిల్ ప్రకటనతో పాటు చిత్రానికి సంబధించిన చిన్న గ్లింప్స్‌ని కూడా విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు బెడిసికొట్టాయి. రాజమౌళి ఈ ఈవెంట్‌లో హనుమంతుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉణ్నాయని.. రాష్ట్రీయ వానర సేన సభ్యులు ఫిర్యాదు చేశారు. మరి ఈ కేసుపై పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇక సినిమా విషయానికొస్తే.. ‘#SSMB29’ అనే టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో మహేశ్‌బాబు ‘రుద్ర’ పాత్రలో, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తున్నారు. ‘కుంభ’ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇంతకు మించి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ బయటకు రాలేదు.

మన తెలంగాణ 18 Nov 2025 10:55 am

Makhtal |డిసెంబర్ 6న కోర్టు ప్రారంభోత్సవం

Makhtal | డిసెంబర్ 6న కోర్టు ప్రారంభోత్సవం Makhtal | మక్తల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 18 Nov 2025 10:49 am

Encounter : ఆరుగురు మావోయిస్టుల హతం

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు

తెలుగు పోస్ట్ 18 Nov 2025 10:45 am

Chandrababu |అన్నదాత సుఖీభవ..

Chandrababu | అన్నదాత సుఖీభవ.. Chandrababu, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : రబీ

ప్రభ న్యూస్ 18 Nov 2025 10:39 am

iBomma Ravi: How was he Traced?

Immadi Ravi alias iBomma Ravi was finally caught and he is currently in the custody of Cybercrime cops of Hyderabad. The investigation is on and Ravi has revealed several facts about his journey. There are speculations that Ravi’s wife has passed the information about him reaching Hyderabad and this news is untrue. The Hyderabad cops […] The post iBomma Ravi: How was he Traced? appeared first on Telugu360 .

తెలుగు 360 18 Nov 2025 10:37 am

ప్రతిపక్షాలకు ‘బీహార్’ పాఠాలు

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ఓ రాష్ట్రానికి సంబంధించిన ఫలితం మాత్రమే కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి ఇది రాజకీయపరంగా మొదటి పెద్ద షాక్. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, ఇతర రాష్ట్రాలలో జరగనున్న కీలకమైన ఎన్నికలకు ముందు ఎన్‌డిఎ కూటమి మనోధైర్యాన్ని పెంచే తీర్పు. ఎన్నికల ఫలితాలు.. సంఖ్యలే సుస్పష్టం చేశాయి. బిజెపి, జెడి(యు), ఎల్‌జెపి (రామ్ విలాస్) నేతృ-త్వంలో ఎన్‌డిఎ, బీహార్‌లోని 243 సీట్లలో దాదాపు 202 సీట్లు అంటే.. మూడింట రెండు వంతులకు పైగా సీట్లు గెలిచింది. బిజెపి ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. నితీశ్ కుమార్ తన సత్తా చాటి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని స్థానాన్ని నిలుపుకున్నాడు. కాంగ్రెస్, ఆర్‌జెడి, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్ లేదా ఇండియా కూటమి చిన్నగా కుంచించుకుపోయింది. కనీసం 40 స్థానాలు కూడా దాటలేక చతికిలబడింది. ఈ ఎన్నికల వ్యవస్థను తీవ్రంగా విమర్శించిన వారిలో ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఒకరు. పోలింగ్‌కు చాలా ముందుగానే, బీహార్‌లో ఓటర్లజాబితా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (సర్) దాదాపు 47 లక్షల మందిని, ముఖ్యంగా 16 లక్షల మంది మహిళలను తొలగించిందని, లింగ నిష్పత్తిని దెబ్బతీసిందని, ఓటు హక్కు కోల్పోవడంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తిందని యోగేంద్ర యాదవ్ సుప్రీం కోర్టును హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యానాలు, ఇంటర్వ్యూలలో ఆయన మూడు అంశాలను ప్రస్తావించారు. 1, ఎన్‌డిఎకు గల నిర్మాణాత్మక ప్రయోజనం ప్రస్తుతం ఎన్‌డిఎ గతంలో కంటే విస్తృతమై సామాజిక పరంగా చక్కటి సంకీర్ణాన్ని కలిగి ఉంది. అగ్రకులాలు, ఒబిసిల నుంచి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎన్‌డిఎ వైపే ఉన్నారు. యాదవులు, ముస్లింలు ఆర్‌జెడికి సాంప్రదాయ పునాదిగా ఉన్నా, వామపక్షాలు వెంట ఉన్నా, ప్రతిపక్ష కూటమి తన పరిధిని విస్తరించుకోలేపోయింది. 2. రాజకీయ సాంకేతికతతో ఓటర్ల జాబితా సవరణ యాదవ్, ఇతర కార్యకర్తలు సర్ ను జాబితా ప్రక్షాళనగా కాకుండా, ముస్లింలు, మహిళలను ప్రభావితం చేసేందుకు చేపట్టిన ప్రక్రియగా చూశారు. ప్రతిపక్షం వైపు మొగ్గుచూపే అంశాలను పట్టించుకోలేదు. 3. సంస్థాగతమైన అసమానతలు ఎన్‌డిఎకు చెందిన బూత్ స్థాయి యంత్రాంగం, ఐటి మద్దతులో సాగిన ప్రచారం, సందేశాలు పంపడంలో అనుసరించిన క్రమశిక్షణ ఇండియా కూటమి ప్రయత్నాలు కచ్చితంగా గండికొట్టాయి. ఈ ఎన్నికలలో ఓ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఛత్ పండుగ సమయం కావడంతో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఓటు వేయడానికి తిరిగి వచ్చారు. అనేక నియోజకవర్గాలలో రికార్డుస్థాయి ఓటింగ్ నమోదు కావడానికి వారు తిరిగి రావడమే కారణమని వ్యాఖ్యాతలు గమనించారు. ఏళ్లుగా వలసలు బీహార్ దుస్థితికి అద్దంగా నిలిచాయి. 2025 లో వలసదారుల ఆలోచన మారింది. వారు కుటుంబాలను కలవడానికే కాక, రాజకీయ సృ్పహతో ఓట్లు వేసేందుకు తిరిగి వస్తున్నారు. ఇంతకీ వారు ఎవరికి ఓటు వేసి ఉంటారన్నడే మిలియన్ డాలర్ల ప్రశ్న. బిజెపి పాలిత అసోం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ కొద్ది ఏళ్లుగా ఒకే మాట అంటున్నారు. రాహుల్ గాంధీ ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే, బిజెపి ఓట్లు అంత ఎక్కువ పెరుగుతాయి అని. అసోంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే మాట చెప్పారు. రాహుల్ గాంధీ ఎన్నికలకు సంబంధించినంత వరకూ గుదిబండగా మారారని అంటున్నారు. బీహార్ ఫలితం చూస్తే ఇది పాక్షిక సత్యం కూడా. ఈ మధ్య అనేక రాష్ట్రాల ఎన్నికలలో హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, ఇప్పుడు బీహార్‌లలో రాహుల్ భారీగా ప్రచారం చేసిన నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు లేదా ఇండియా బ్లాక్‌కు తగిన ఫలితాలు లభించలేదన్నది నిజం. అయితే బీహార్‌లో ఎన్‌డిఎ భారీ విజయానికి రాహుల్ గాంధీకి ఆపాదించడం సులభం. కానీ, ఆ విజయానికి కారణం, శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలపై నితీశ్ కుమార్ ఆలోచన, స్థానికంగా ఆయనపై ఉన్న నమ్మకం, సంక్షేమ పథకాల ద్వారా మహిళల్లో మోడీకి ఉన్న ఆకర్షణ, అటు కులాల సెంటిమెంట్‌ను, ఇటు సంక్షేమ పథకాలను సమతూకం చేస్తూ ఎన్నికల వ్యూహంపై ఎన్‌డిఎ ఆధారపడి ఉంది. బలమైన నాయకత్వం లోపం తటస్థ ఓటర్లకు ఉన్న ఏకైక ప్రశ్న. రాహులా, మోడీయా అని కాదు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రతి రాష్ట్రంలోనూ స్థిరమైన, బలమైన నాయకత్వాన్ని అందించగలవా అన్నదే. బీహార్‌లో నితీశ్ కుమార్‌కు ప్రత్యామ్నాయంగా బలమైన నాయకత్వం అందించలేమని వారే నిరూపించుకున్నారు. విశ్లేషాత్మకంగా చూస్తే బిజెపి విజయాలకు రాహుల్ అసమర్థత కారణం కాదు. ప్రతిపక్షాల అస్తవ్యస్త పరిస్థితి. అధికార పార్టీ క్రమశిక్షణ అసలు కారణం. ముందుకు సాగాలంటే.. ప్రతిపక్షాలు వ్యూహాలను సమీక్షించుకోవాలి. బీహార్ ఓటమి ప్రతిపక్షాలకు ఓ గుణపాఠం. బిజెపి వ్యతిరేక భావన, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తాయని, ఎన్‌డిఎను చిత్తుగా ఓడిస్తాయన్న భ్రమలు మానుకోవాలి. వారి ఆలోచన మారాలి. వ్యూహాలను తిరిగి సమీక్షించుకోవాలి. పలు రాష్ట్రాల ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉంది. ప్రత్యేక వ్యూహ రచనకు పూనుకోవాలి. అన్ని రాష్ట్రాలలోనూ ఒకే మూస ధోరణి పనిచేయదు. ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని తిరిగి కల్పించాలి ప్రతిపక్షాలు ఎన్నికల సమగ్రతను చట్టపరమైన సాంకేతిక సమస్యగా కాక, ప్రధాన రాజకీయ సమస్యగా పరిగణించాలి. ఓడిపోయినప్పుడు అభ్యంతరాలను వ్యక్తం చేయడం కాకుండా, ఓటర్ల జాబితాలో తొలగింపులు, తప్పిపోయిన ఓటర్లు బూత్‌స్థాయి అవకతవకలను క్రమబద్ధంగా నమోదు చేయడంతోపాటు, ఓటర్ల జాబీతాలో వారి పేర్లను తనిఖీ చేసి పునరుద్ధరించడానికి పౌరులకు సహాయపడే విధంగా గ్రూస్ రూట్ ప్రచారాలు చేపట్టాలి. ఎన్నికల కమిషనర్ల నియామకం, ఇసి జవాబుదారీతనంలో సంస్కరణల కోసం ఓ స్పష్టమైన జాతీయ స్థాయి ప్రచారం సాగించాలి. మేం గెలిచినప్పుడు మాత్రమే ఇవిఎంలను గౌరవిస్తాం అన్న ధోరణికు స్వస్తి చెప్పాలి. కేడర్ కేంద్రీకృత రాజకీయాలకు మారాలి బిజెపి విజయానికి కారణం మోడీయో, నితీశ్ కుమారో, బిశ్వశర్మనో కాదు. బూత్ స్థాయి వ్యూహాన్ని అమలు చేయగల లక్షలాది మంది కార్యకర్తలు కూడా. ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో హడావుడి చేయడం కాకుండా ఎన్నికల సీజన్‌కు మించి స్పష్టమైన కేడర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా యువత, మహిళలు, వలసదారులతో బలమైన కేడర్ ఏర్పాటు చేసుకోవాలి. బిజెపికి దీటుగా దూకుడుగా డిజిటల్ సాధనాలను వాడుకోండి. పారదర్శకంగా, సమస్యల పరిష్కారానికి తోవచూపే సందేశాలతో ఆకట్టుకోండి. ఒకప్పుడు అగ్రవర్ణాలకే పరిమితమైన బిజెపి యాదవేతర ఒబిసిలు, దళితులు, మహిళా లబ్ధిదారులతోపాటు మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకుని తన కూటమిని విసృ్తతం చేసుకుంది. ప్రతిపక్ష మండల్ ఫార్ములాకే పరిమితం కాకుండా, సామాజిక న్యాయంపై మొగ్గు చూపాలి. ఉద్యోగాలు, సామాజిక భద్రత, ఆరోగ్యం, విద్య వంటి స్పష్టమైన ఆర్థిక ఎజెండాతో ఆకట్టుకోవాలి. ఎన్‌డిఎ నుంచి ప్రస్తుతం సంక్షేమం, గుర్తింపు మాత్రమే పొందుతున్న అసంఘటిత కార్మికులు, వలసదారులు, యువతను ఈవ్యూహం ఆకర్షిస్తుంది. నితీశ్ కుమార్ స్థానిక ఇమేజ్, మోడీ జాతీయ స్థాయి బ్రాండ్ బీహార్‌లో ఓ అపూర్వ విజయాన్ని అందించాయి. ప్రతిపక్షాలకు సంబంధించినంతవరకూ బెంగాల్‌లో మమతా బెనర్జీయే కీలకమైన నేతగా కొనసాగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు, ఆమెను బలహీనపరచాలనుకుంటున్నారా లేక విభేదాలు మరచి ఆమెతో కలిసి పనిచేయాలనుకుంటున్నారా అన్నది నిర్ణయించుకోవాలి. అసోంలో తరుణ్ గొగోయ్ తర్వాత ఓ శూన్యత ఏర్పడింది. సాంసృ్కతిక రంగంలో జుబీన్ లాగ ప్రతిపక్షంలో ఏ నాయకుడికీ అంతటి గౌరవం లేదు. తరుణ్ గొగోయ్ కొడుకు గౌరవ్ గొగోయ్ అసోంలో, జాతీయ రాజకీయాల్లో శక్తివంతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఎదుగుతున్నా, విద్యార్థి ఉద్యమాలు, పౌరసమాజం, చిన్న పార్టీలను ఏకంచేసి, ప్రాంతీయ నాయకుల రెండో శ్రేణి నిర్మాణం చాలా అవసరం. కేరళలో ఇప్పటికే పినరయి విజయన్, శశిథరూర్ వంటి ప్రాంతీయ నాయకులు ఉన్నారు. ఇండియా కూటమి జాతీయ స్థాయిలో విస్తరించాలంటే మరింత సమన్వయం అవసరం. నైతిక ఆగ్రహం, సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేయడం లేదా చివరిక్షణంలో సీట్ల సద్దుబాటు వల్ల ఎన్‌డిఎను ఓడించలేమన్నది ప్రతిపక్షాలకు బీహార్ నేర్పిన పాఠం. సంస్థాగతంగా బలపడడం, తెలివిగా సంకీర్ణాలు ఏర్పాటు, న్యాయం, అభివృద్ధి అజెండాతో ముందుకు సాగితేనే ప్రతిపక్షాలకు, ఇండియా కూటమికి భవిష్యత్తు.  - గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు

మన తెలంగాణ 18 Nov 2025 10:33 am

Srisailam |తెప్పోత్సవం వాయిదా..

Srisailam | తెప్పోత్సవం వాయిదా.. Srisailam, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల

ప్రభ న్యూస్ 18 Nov 2025 10:28 am

Medak |స్వీపర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

Medak | స్వీపర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. కొండపాక, ఆంధ్రప్రభ : కొండపాక

ప్రభ న్యూస్ 18 Nov 2025 10:23 am

TET |పాఠాలు చెప్పాలా..? టెట్‌ పరీక్షకు సిద్ధమవ్వాలా..?

TET | పాఠాలు చెప్పాలా..? టెట్‌ పరీక్షకు సిద్ధమవ్వాలా..? హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Nov 2025 10:20 am

Syllabus |డిసెంబర్లోగా సిలబస్‌ పూర్తి చేయండి..

Syllabus | డిసెంబర్లోగా సిలబస్‌ పూర్తి చేయండి.. హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పది,

ప్రభ న్యూస్ 18 Nov 2025 10:05 am

లొంగిపోతే పోయేది కొంతే!

యుద్ధంలో సైనికుడు చావుకు బెదరకుండా ముందుకు సాగుతాడు. ఆ తెగువ ఉన్నవాడి వల్లే సైన్యం కదులుతుంది. మనిషిలో జీవమున్నంత సేపే పోరాటంలో పాల్గొనడం సాధ్యపడుతుంది. విప్లవ సాయుధ పోరులోను ప్రాణాన్ని పణంగా పెట్టడం ఆ కార్యాచరణలో తొలిపాఠమే. ప్రాణంపోతే మనిషి జీవితం ముగిసినట్లే. పోతే తిరిగి తెచ్చుకోలేని ప్రాణం విలువ లెక్కకట్టలేనిది. అంతటి ఘనమైన త్యాగం వృథా కాకూడదు. గొప్ప లక్ష్యానికి జీవితకాలం వెచ్చించేందుకు సిద్ధపడ్డప్పుడు ప్రాణం కాపాడుకోవడం కూడా ఒక కొనసాగింపే. విషమ పరిస్థితుల్లో సాహసం కన్నా వ్యూహమే ప్రధానం. ఇక యుద్ధం ముందుకు సాగదనుకున్నప్పుడు అందరూ ప్రాణాలు పోగొట్టుకుంటే రేపటి పోరాటానికి ఏమి మిగలదు. బతికిఉంటే వంద యుద్ధాలు చేయవచ్చు. టాప్ కేడర్ పోలీసు తూటాకు బలి కావడమో లేదా లొంగిపోవడమో జరుగుతున్నప్పుడు పోరాటంలో భాగంగా వారికి, దళసభ్యులకు అంతా అగమ్యం గా ఉంటుంది. యుద్ధం ఒక మలుపు తీసుకుంటున్న తరుణంలో విజ్ఞత అవసరం. ఉద్యమం తుదికంటా లేకుండా అణచివేతకు రాజ్యం సిద్ధపడ్డప్పుడు తిరిగి మొలకెత్తేందుకు కొన్ని గింజలైనా మిగిలి ఉండాలి. శత్రువు వెదికివెదికి చంపుతున్నప్పుడు తెల్లజెండా చూపడం ఆపత్కాల నిర్ణయమే. తోడు నడిచినవారు వరుసగా నేల రాలుతుంటే ఆలోచనలు అతలాకుతలం అవుతాయి. చెదిరిపోయిన దళాల మధ్య సయోధ్య తెగిపోతుంది. స్వీయ నిర్ణయాల అనివార్యత ఏర్పడుతుంది. ఇలా చావడం కన్నా ఎలాగైనా బతకడం ఒక ఆప్షన్. చివరకు అందరం చచ్చిపోవడమేనేమో అనే తలంపు కొత్త ఆలోచనలకు మూలం కావచ్చు. చావును తప్పించుకోవడానికి తలవంచడం ఓ మార్గం. దాన్ని ఎలా విశ్లేషించాలి అనే విషయంలో ఏకాభిప్రాయం కష్టమే. విప్లవ సేనానిగా గుర్తింపు పొందిన మల్లోజుల వేణుగోపాలరావు ఆ రకమైన లొంగుబాటు పూర్తి గా అనూహ్యమే. నిజానికి మావోయిస్టుల్లో అగ్రనేతలుగా కొనసాగిన మల్లోజుల సోదరులవి చరిత్రకు ఎక్కదగ్గ పోరు జీవితాలు. కోటేశ్వరరావు వీరమరణం పొంది తన అంతిమయాత్రలో చిరస్మరణీయంగా పెద్దపల్లికి ఎరుపెక్కించి విప్లవతారగా మిగిలిపోయాడు. సుదీర్ఘకాలం ఉద్యమంలో కలిసి నడిచిన అన్నదమ్ముల బాట అంతిమంగా ఆచరణలో విడిపోయింది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. మావోయిస్టుల వేట ఎన్నడూ లేనంతగా ఇప్పుడు తీవ్రమైంది. అరణ్యం నిత్యం మావోయిస్టుల రక్తంతో తడుస్తోంది. చావును తప్పించుకొని బతికితే తప్పేంటి అనే ఆలోచన సిద్ధాంతాన్ని అపహాస్యం చేస్తున్నట్లు అనిపించవచ్చు. బతకడమా చావడమా అనేది ఎప్పుడైనా వ్యక్తిగత నిర్ణయమే. బాగా ఆడుతాడనుకొన్న ఆటగాడు డకౌట్ అయితే అభిమానులు తిట్టి పోస్తారు. ఆడలేకపోయిన పరిస్థితి ఆ ఆటగాడికే తెలుసు. నక్సలైట్లుగా పనిచేస్తూ లొంగిపోయినవారు ఎంతోమంది ఉన్నారు. వివిధ వృత్తుల్లో వారు జనజీవితం గడుపుతున్నారు. లొంగిపోయినవారి పునరావాసం, పోలీసులతో వారు పడుతున్న ఇబ్బందుల గురించి అప్పుడప్పుడు వార్తలు వచ్చాయి కానీ, ఈమధ్య అదంతా సద్దుమణిగింది. అ సిద్ధాంతం రక్తంలో ఇంకిపోయాక బయటికి వచ్చినా ఆలోచన ధోరణి ఆ వైపే ఉంటుంది. ఆ మార్గం వీడలేదన్నట్లు కొందరు వివిధ సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మంచి ఆదాయం ఉన్నవారు తమ ఆసక్తుల మేరకు కళాపోషక పాత్ర పోషిస్తున్నారు. విద్య, వ్యాపారాల్లో స్థిరపడినవారు దాతృత్వాన్ని చేపడుతున్నారు. ప్రజాస్వామిక సభలు, సమావేశాల్లో వారు కీలకంగా కనబడుతున్నారు. మొత్తానికి నిన్నటి ఆలోచనకు విరుద్ధమార్గంలో నడిచేవారు తక్కువే. అంటే లొంగిపోయినవారు అడవిలో నక్సలైటుగా కాకున్నా అర్బన్ నక్సలైటుగా జీవితం కొనసాగించవచ్చు. చట్టం పరిధిలో, రాజ్యాంగబద్ధంగా మన దేశంలో చేసేందుకు బోలెడు పనులున్నాయి. వాటికి కూడా సాహసం, త్యాగనిరతి అవసరమే. శక్తి, ఆసక్తి ఉన్నంత కాలం ఆ పాత్ర పోషిస్తే లొంగుబాటు వృథా కాదు. - బి. నర్సన్  -9440128169

మన తెలంగాణ 18 Nov 2025 10:04 am

ఢిల్లీ బాంబు పేలుడు కేసులో మరో అరెస్ట్

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ పురోగతి సాధించింది.

తెలుగు పోస్ట్ 18 Nov 2025 9:58 am

Weather Report : ఒకవైపు చలిగాలులు.. మరొకవైపు వానలు.. ఇదేందిరా అయ్యా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలుగు పోస్ట్ 18 Nov 2025 9:53 am

Road Accident : కావేరి ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్.. ముగ్గురి పరిస్థితి విషమం

ఆంధ్రప్రదేశ్ లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది

తెలుగు పోస్ట్ 18 Nov 2025 9:49 am

ఉప ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం?

పోటాపోటీగా ప్రచారం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలుపు అనంతరం సహజంగానే కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో మునిగిపోగా, ఓడిపోయిన బిఆర్‌ఎస్ పార్టీలో నిరాశ అలుముకొంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బిఆర్‌ఎస్, బిజెపిలకు ఒక సందేశాన్ని ఇచ్చాయి. భవిష్యత్‌లో రాష్ట్రంలో ఏ పార్టీ ఎలాంటి పాత్ర పోషించాలో స్పష్టత ఇచ్చాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఇక తిరుగులేదనే వాతావరణం లేదు. ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ చతికిలపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో గెలిచిన పార్టీ తర్వాత ఎలాంటి ఫలితాలు సాధించిందో పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.తెలంగాణలో ఉపఎన్నికల్లో గెలిచిన పార్టీ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో పరాజయం పొందినట్టు మెజారిటీ ఫలితాల్లో స్పష్టమైంది. ఉపఎన్నికల తీరును గమనిస్తే గతంలో కెసిఆర్ సర్కార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకే బాటలో ప్రయాణిస్తున్నట్టే ఉంది. ఉపఎన్నికల్లో గెలవగానే పూర్తి ప్రజామోదం లభించనట్టు కాదని గత ఉప ఎన్నికలు, తర్వాత జరగిన జనరల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. ‘ఇల్లు అలుకగానే పండుగా కాదు’ అనే సామెత గతంలో బిఆర్‌ఎస్‌కు, ఇప్పుడు కాంగ్రెస్‌కు వర్తిస్తుంది. జూబ్లీహిల్స్‌లో గెలిచినంతమాత్రాన ఆరు గ్యారెంటీలను అసంపూర్తిగా అమలుచేసినా ప్రజలు గెలిపించారని కాంగ్రెస్ భావిస్తే పప్పులో కాలేసినట్టే. మహిళలకు నెలకు రూ. 2500 పంపిణీ, పెంచుతామన్న చేయూత పింఛన్లు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ. 12000 వంటి హామీలు అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయం. గతంలో కెసిఆర్ కూడా ఉపఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలను పూర్తిగా అమలు చేయలేకపోవడంతో అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందినట్టు చరిత్రే చెబుతుంది. ఉపఎన్నికల్లో గెలుపోటములకు పలు కారణాలుంటాయి. అధికారంలో ఉండే పార్టీకి సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే సందర్భంలో అధికార పార్టీ అత్యుత్సాహం ప్రదర్శిస్తే కొన్నిసార్లు ఫలితం పూర్తిగా తిరగబడిన దాఖలాలున్నాయి. తెలంగాణలో జూబ్లీహిల్స్ కంటే ముందు జరిగిన ఎనిమిది ఉపఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాలతోనే ఫలితాలు వెలువడ్డాయి. ఆరుసార్లు అధికార పార్టీ గెలవగా, రెండు సార్లు ప్రతిపక్షం గెలిచింది. అధికారంలో పార్టీ ఉప ఎన్నికలను ప్రతిష్ఠగా తీసుకొని పెద్దఎత్తున మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో దింపడంతోపాటు పలు హామీలిచ్చి గెలిచే అవకాశాలుంటాయి. సాధారణ ఎన్నికల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ప్రజాప్రతినిధులకు ఎవరి నియోజకవర్గం వారికే ప్రాధాన్యతవుతుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో పెట్టినంత ప్రత్యేక దృష్టి సాధారణ ఎన్నికల్లో పెట్టడం సాధ్యం కాదని గత ఎన్నికల ఫలితాలే నిరూపిస్తున్నాయి. పాలేరు నియోజకవర్గానికి 2016లో జరిగిన ఉపఎన్నికల్లో మంత్రి హోదాలో బిఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు 26 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై గెలిచి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో 3% ఓట్ల తేడాతో ఓడిపోయారు. నారాయణఖేడ్‌లో సిట్టింగ్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ పి. కిష్టారెడ్డి మృతితో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన మహేంద్‌రెడ్డి 34.63% ఓట్లతేడాతో గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుండి గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019లో నల్గొండ ఎంపిగా గెలవడంతో ఎంఎల్‌ఎ పదవికి రావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేయగా అధికార బిఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి చేతిలో 21.65 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతిలో 20.85 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020లో దుబ్బాక ఉపఎన్నికల్లో బిజెపి తరఫున పోటీచేసిన రఘునందన్ రావు కేవలం 0.65 శాతం ఓట్ల తేడాతో గెలిచినా, 2023 సాధారణ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ చేతిలో 30.62 శాతం ఓట్లతో ఓడిపోయారు. ఈటల రాజేందర్ బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో 2021లో జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల్లో బిజెపి తరఫున ఈటల రాజేందర్ 11.58 శాతం ఓట్ల తేడాతో బిఆర్‌ఎస్‌పై గెలిచి, 2023 సాధారణ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ చేతిలో 8.06 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021 నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరఫున నోముల భగత్ 9.88 శాతం ఓట్ల తేడాతో గెలిచి, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో 27.64% ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామ చేసి బిజెపిలో చేరడంతో 2022లో జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలచింది. బిజెపి తరఫున పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో 4.57%ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరి 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 17.38 శాతం ఓట్ల తేడాతో గెలిచారు. 2025 జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 12.7 శాతం ఓట్ల తేడాతో గెలిచారు. హుజూర్‌గర్, హుజురాబాద్, మునుగోడులో మారిన రాజకీయ కారణాల నేపథ్యంలో ఉప ఎన్నికలు జరగ్గా, పాలేరు, నారాయణఖేడ్, దుబ్బాక, నాగర్జునసాగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థుల మరణంతో ఉపఎన్నికలు జరిగాయి. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందిత 13.88 శాతం ఓట్లతో బిజెపి అభ్యర్థి శ్రీగణేశ్‌పై గెలిచిన అనంతరం మూడు నెలల వ్యవధిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో 2024లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ అసెంబ్లీ సెగ్మంట్‌కు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. 2023లో ఇక్కడ బిజెపి నుండి పోటీ చేసి ఓడిపోయిన శ్రీగణేష్ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి 2024 ఉప ఎన్నికల్లో 10.06 శాతం ఓట్ల తేడాతో బిజెపిపై గెలిచారు. 2023లో గెలిచిన బిఆర్‌ఎస్ మూడో స్థానానికే పరిమితమైంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనం అనంతరం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉపఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగానే ఉన్నాయి. నంద్యాలలో 2014లో వైఎస్‌ఆర్‌సిపి నుండి గెలిచిన భూమా నాగిరెడ్డి అనంతరం అధికార టిడిపిలో చేరాక అకాల మరణం పొందారు. ఇక్కడ 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి టిడిపి నుండి పోటీ చేసి వైఎస్‌ఆర్‌సిపిపై 15.86 ఓట్ల శాతం తేడాతో గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాలలో బ్రహ్మానంద రెడ్డి వైఎస్‌ఆర్‌సిపి చేతిలో 17.50 శతం ఓట్లతో తేడాతో ఓడిపోయారు. ఆత్మకూరులో 2022 ఉప ఎన్నికల్లో గెలిచిన అధికార వైఎస్‌ఆర్‌సిపి 2024లో ఓడిపోయింది. ఇటీవల పులివెందులలో జరిగిన జెడ్‌పిటిసి ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఎలా జరిగియో బహిరంగ రహస్యమే. బిజెపి నేతల ప్రచారం శైలి కూడా తమ పార్టీ కంటే ఇతర పార్టీలకు మేలు చేసేదిగానే జరిగింది. కేంద్రమంత్రి బండిసంజయ్ ప్రచారం చివరి దశలో ముస్లిం మైనారిటీల లక్ష్యంగా చేసుకొని రేవంత్‌రెడ్డిని విమర్శిస్తూ ప్రసంగాలు చేయడంతో ముస్లిం ఓటు బ్యాంకు సంఘటితమై భారీగా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లింది. ఎపిలో టిడిపి, జనసేన, బిజెపి ఒకే కూటమిలో ఉన్నా జూబ్లీహిల్స్ లో టిడిపి బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించలేదు. జనసేన కూడా సంపూర్ణంగా బిజెపి కోసం పని చేయలేదు. సెటిలర్లు ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్‌లో టిడిపికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఉప ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధంతో కాంగ్రెస్ వైపు మళ్లింది. జూబ్లీహిల్స్‌లో 2023 శాసనసభ ఎన్నికలతో 2025 ఉప ఎన్నికల ఫలితాలను పోలిస్తే.. 2023లో బిఆర్‌ఎస్ 43.94 శాతం ఓట్లు పొందితే 2025లో 38.13 శాతం, కాంగ్రెస్ 2023లో 35.03% పొందితే, 2025లో 50.83%, బిజెపి 2023లో 14.11 శాతం పొందితే 2025లో 8.76 శాతం ఓట్లు సాధించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జూబీహిల్స్ సెగ్మంట్‌లో 36.64 శాతం సాధించిన బిజెపి ఇప్పుడు ఉపఎన్నికల్లో కేవలం 8.76% ఓట్లే పొందింది. బిఆర్‌ఎస్ విషయానికొస్తే 2024లో 10.42 శాతం ఓట్లే పొందిన ఆ పార్టీ ఉప ఎన్నికల్లో 38.13 శాతం ఓట్లు సాధించింది. అంటే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి పడ్డ ఓట్లు ఇప్పుడు దాదాపు బిఆర్‌ఎస్ పార్టీకి బదిలీ అయ్యాయి. అంటే జూబ్లీహిల్స్‌లో 2023లో గెలిచిన బిఆర్‌ఎస్ అక్కడ మళ్లీ పుంజుకుందని తేలింది. మాగంటి గోపినాథ్ అకాల మరణం తర్వాత కూడా బిఆర్‌ఎస్‌కు ఉన్న ఆ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన 50.83 శాతం ఓట్లను ఉప ఎన్నికల్లోనూ నిలబెట్టుకుంది. ఈ పార్టీకి వచ్చి ఓట్లను పరిశీలిస్తే జూబ్లీహిల్స్ సెగ్మంట్‌లో నిర్ణయాత్మకంగా ఉన్న మైనారిటీ ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ఇప్పుడు ఉపఎన్నికల్లో కూడా బిజెపి చేసిన ముస్లిం వ్యతిరేక ప్రచారంతో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్‌కే ఓటు వేశారు.తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉప ఎన్నికలు భారీ వ్యయంతో కూడుకున్న ఎన్నికలుగా మారుతున్నాయి. అధికారంలో ఉన్నవారు ఇతర ప్రతిపక్షాల కంటే అధికంగా ఖర్చు చేస్తున్నారు. గత ఉప ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో పార్టీలు మరింత అధికంగా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. భారీ ఖర్చుతో కూడుకున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలను లోతుగా గమనిస్తే గెలిచిన కాంగ్రెస్‌కు ఇది బలం కాదు వాపు మాత్రమే అని చెప్పవచ్చు. ఎన్నికల షెడ్యూల్ ముందే మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా అభివృద్ధి బాధ్యతలను అప్పగించి హడావుడిగా పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎంఎల్‌ఎలను, ఎంపిలను, ఇతర ప్రజాప్రతినిధులను నియోజకవర్గంలో పగలు రాత్రి మోహరించి పలు హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ వారికి ఎంఐఎం ఎంఎల్‌ఎలు, ఎంపి, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తోడయ్యి భారీ హామీలిచ్చారు. వాటినన్నింటినీ పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. ఒకానొక దశలోబిఆర్‌ఎస్ దూసుకుపోతుందనే వార్తలొచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ వీధివీధిన ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మైనారిటీ ఓట్ల మీద దృష్టి పెట్టి ఆగమేఘాల మీద అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. ఉద్యోగులకు డిఎ ప్రకటించారు. మరోవైపు బిఆర్‌ఎస్ ప్రజాక్షేత్రం కంటే సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడి చేతులు కాల్చుకుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలను తమ ప్రభుత్వ పనితీరుకు కొలమానమని విశ్వసిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలకు వెళ్లగలదా..? అప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ బలానికి నిదర్శనమా..? లేదా ఇది కేవలం తాత్కాలిక వాపా..? అని తేలుతుంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు ఒక గుణపాఠంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. - తోపుచర్ల నిఖిల్

మన తెలంగాణ 18 Nov 2025 9:45 am

Plastic ban |ప్లాస్టిక నిషేధంపై పర్యవేక్షణేదీ…

Plastic ban | ప్లాస్టిక నిషేధంపై పర్యవేక్షణేదీ… జోగిపేట, (ఆంధ్రప్రభ‌): నిత్యం ప్లాస్టిక్‌

ప్రభ న్యూస్ 18 Nov 2025 9:43 am

Chaudhapur |ఠాణా వచ్చేది ఎప్పుడో..

చౌడాపూర్‌, (ఆంధ్రప్రభ) : చౌడాపూర్‌ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటంచినప్పుడు చౌడాపూర్‌ (Chaudhapur)

ప్రభ న్యూస్ 18 Nov 2025 9:42 am

Amaravathi : చంద్రబాబు సర్కార్ కు రాజధాని రైతుల అల్టిమేటం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు సమావేశమయ్యారు

తెలుగు పోస్ట్ 18 Nov 2025 9:41 am

Suicide |శంషాబాద్ లో విషాదం..

Suicide | శంషాబాద్ లో విషాదం.. Suicide, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 18 Nov 2025 9:39 am

Supreme Court |వారం రోజుల డెడ్‌లైన్‌…

Supreme Court | వారం రోజుల డెడ్‌లైన్‌… ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి :

ప్రభ న్యూస్ 18 Nov 2025 9:25 am

Rains update |నెల్లూరు జిల్లాకు వర్ష సూచన..

Rains update | నెల్లూరు జిల్లాకు వర్ష సూచన Rains update, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 18 Nov 2025 9:16 am

Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారికి అలెర్ట్.. రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

తెలుగు పోస్ట్ 18 Nov 2025 9:04 am

Mopidevi temple |మంత్రి కొల్లు రవీంద్ర..

Mopidevi temple | మంత్రి కొల్లు రవీంద్ర.. Mopidevi temple, కృష్ణా ప్రతినిధి,

ప్రభ న్యూస్ 18 Nov 2025 8:56 am

Sabarimala : శబరిమలకు పోటెత్తిన భక్తులు.. కిలోమీటర్ల మేర క్యూలైన్

శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.

తెలుగు పోస్ట్ 18 Nov 2025 8:48 am

Mohan Babu’s MB50: Pearl White Tribute

Veteran Tollywood actor Mohan Babu has completed 50 glorious years in Telugu cinema and he hosted a lavish dinner for Telugu fraternity on Sunday in Hotel Daspalla. Several actors, technicians and close friends of the Manchu family attended the bash. Mohan Babu’s son Manchu Vishnu is planning one more grand event named ‘MB50: Pearl White […] The post Mohan Babu’s MB50: Pearl White Tribute appeared first on Telugu360 .

తెలుగు 360 18 Nov 2025 8:44 am

BC reservation |బీసీలకు అండగా ప్రభుత్వం..

BC reservation | బీసీలకు అండగా ప్రభుత్వం.. BC reservation, బిక్కనూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 18 Nov 2025 8:44 am

Andhra Pradesh : ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది.

తెలుగు పోస్ట్ 18 Nov 2025 8:42 am

Andhra Pradesh : నేడు వైసీపీ అధినేత కీలక భేటీ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నారు.

తెలుగు పోస్ట్ 18 Nov 2025 8:34 am

MP Mahesh Yadav |ఆకస్మిక తనిఖీ..

MP Mahesh Yadav | ఆకస్మిక తనిఖీ..‎ MP Mahesh Yadav, ఏలూరు,

ప్రభ న్యూస్ 18 Nov 2025 8:30 am

Ustaad Bhagat Singh Feast from December

Ustaad Bhagat Singh is the next prestigious film of Powerstar Pawan Kalyan and the actor has completed shooting for his part. The pending shoot is expected to be completed before December and the film releases during the first quarter of 2026. The film’s director Harish Shankar has revealed that the promotional activities of Ustaad Bhagat […] The post Ustaad Bhagat Singh Feast from December appeared first on Telugu360 .

తెలుగు 360 18 Nov 2025 8:27 am

Jagan’s Unreal Plan vs NDA’s Real Action: The Visakha Steel Contrast

Former Chief Secretary LV Subrahmanyam has made explosive comments about YS Jagan Mohan Reddy’s plans during his term as Chief Minister. In a recent interview, he revealed that Jagan once proposed removing the Visakhapatnam Steel Plant and building a new capital city on its land. Subrahmanyam said he was stunned when he first heard this […] The post Jagan’s Unreal Plan vs NDA’s Real Action: The Visakha Steel Contrast appeared first on Telugu360 .

తెలుగు 360 18 Nov 2025 8:24 am

‘టార్టాయిస్’ చిత్రం ఆరంభం

ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్‌కె గోల్డెన్ ఆర్ట్, చందమామ క్రియేషన్స్, ఎన్‌విఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం ‘టార్టాయిస్’. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రల్లో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ “టార్టాయిస్‘ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ, దర్శకుడు రిత్విక్ కుమార్ కథ చెప్పిన విధానం చాలా బాగుంది”అని తెలిపారు. దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ “రాజ్ తరుణ్ కి కెరీర్ లో బెస్ట్ సినిమా ఇదవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, హీరోయిన్ అమృత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్ ప్లేతో డిఫరెంట్ కథతో వస్తున్న మంచి థ్రిల్లర్ చిత్రమిది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం”అని అన్నారు.

మన తెలంగాణ 18 Nov 2025 8:23 am

Relationship |అమానవీయ ఘటన..

Relationship | అమానవీయ ఘటన.. దయనీయం.. మృతదేహంతో బేరం..! Relationship, మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 18 Nov 2025 8:20 am

Hyderabad : పిస్తా హౌస్ పై ఐటీ దాడులు

హైదరాబాద్ లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

తెలుగు పోస్ట్ 18 Nov 2025 8:18 am

Telangana : గుడ్ న్యూస్ నేటి నుంచి తెలంగాణలో మీ సేవ వాట్సప్ సేవలు

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. మీసేవ వాట్సప్ సేవలను అందుబాటులోకి తేనుంది

తెలుగు పోస్ట్ 18 Nov 2025 8:00 am

Manohar Lal Khattar |దక్షిణాది రాష్ట్రాల సమావేశం..

Manohar Lal Khattar | దక్షిణాది రాష్ట్రాల సమావేశం Manohar Lal Khattar

ప్రభ న్యూస్ 18 Nov 2025 7:55 am

కుల వ్యవస్థ మీద వ్యంగ్యంగా అద్భుతమైన కథ

నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం కలర్ ఫోటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ప్రధాన పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 25న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ టీజర్ లాంచ్ కోసం నిర్వహించిన ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ “మన సమాజంలోని కుల వ్యవస్థ మీద సెటైరికల్‌గా అద్భుతమైన కథను రాసుకున్నారు. బిందు మాధవి, నవదీప్, నందు బాగా నటించారు”అని అన్నారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని మాట్లాడుతూ .. “దండోరా’ టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా ఇంతకు మించి అనేలా ఉంటుంది”అని తెలిపారు. దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ.. “దండోరా’ టీజర్‌ను చూసి అల్లు అర్జున్ అభినందించారు. అదే మాకు పెద్ద సక్సెస్. ఇది చాలా మంచి చిత్రం. ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఇలాంటి సందేశాన్ని ఇంత ఎంటర్‌టైనింగ్‌గా చెప్పారా? అని మూవీని చూసిన తరువాత ఆడియెన్స్ అంతా సర్‌ప్రైజ్ అవుతారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవదీప్, నందు, బిందు మాధవి, మురళీకాంత్, రవికృష్ణ, మౌనిక, మణిక, సృజన అడుసుమిల్లి పాల్గొన్నారు.

మన తెలంగాణ 18 Nov 2025 7:50 am

Bigg Boss Telugu 9: Nomination Drama, Emotional Manipulation & Tanuja’s Power Play

This week’s nomination episode began even before Bigg Boss made an announcement. Tensions were high, emotions were fragile, and the game took a turn toward heavy manipulation — both by contestants and, surprisingly, by Bigg Boss itself. Morning Fight Sets the Tone: The day began with a petty fight between Pavan and Ritu, escalating into […] The post Bigg Boss Telugu 9: Nomination Drama, Emotional Manipulation & Tanuja’s Power Play appeared first on Telugu360 .

తెలుగు 360 18 Nov 2025 7:44 am

ACB |చెవిరెడ్డి పిటిషన్‌ పై విచారణ..

ACB | చెవిరెడ్డి పిటిషన్‌ పై విచారణ.. ACB, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 18 Nov 2025 7:43 am

Andhra Pradesh : నేడు పుట్టపర్తికి చంద్రబాబు

పుట్టపర్తి లో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు

తెలుగు పోస్ట్ 18 Nov 2025 7:42 am

Andhra Pradesh : అన్నదాతకు తీపికబురు.. రేపే డబ్బులు.. అందకుంటే ఇలా చేయండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తుంది.

తెలుగు పోస్ట్ 18 Nov 2025 7:28 am

‘జాజికాయ..’ వచ్చేస్తోంది

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలు సృష్టించాయి. మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. అఖండ 2 సెకండ్ సింగిల్ ‘జాజికాయ’ను నవంబర్ 18న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. ఈ సాంగ్ అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ గా ఉండబోతోంది. తమన్ థియేటర్స్ దద్దరిల్లే పాటని కంపోజ్ చేశారు. గ్రాండ్ సెట్ లో షూట్ చేసిన ఈ సాంగ్‌లో బాలకృష్ణ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ ని అద్భుతంగా అలరించనున్నాయి. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో బాలయ్య ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంది. వైజాగ్ జగదాంబ థియేటర్ లో గ్రాండ్ గా జరగనున్న సాంగ్ లాంచ్ ఈవెంట్ కి బాలకృష్ణ తో పాటు చిత్ర యూనిట్ హాజరుకానున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మన తెలంగాణ 18 Nov 2025 7:25 am

India Vs South Africa : క్లీన్ స్వీప్ చేయాలని దక్షిణాఫ్రికా.. పరువు నిలుపుకోవాలని భారత్

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది

తెలుగు పోస్ట్ 18 Nov 2025 7:08 am

Delhi Bomb Blast Case : పదిహేనుకు చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో మృతుల సంఖ్య 15కు చేరింది

తెలుగు పోస్ట్ 18 Nov 2025 7:03 am

Digital arrest |బెంగళూరు మహిళ డిజిటల్ అరెస్ట్..

Digital arrest | బెంగళూరు మహిళ డిజిటల్ అరెస్ట్.. Digital arrest, బెంగళూరు:

ప్రభ న్యూస్ 18 Nov 2025 7:01 am

కొలువుల పండుగ

` ఆరోగ్యశాఖలో పూర్తయిన 1284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ ` సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల చేసిన మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ` గడిచిన రెండేళ్లలో 9 …

జనం సాక్షి 18 Nov 2025 6:54 am

జూబ్లీహిల్స్‌ దెబ్బకు బీఆర్‌ఎస్‌, బీజేపీలు గల్లంతు

` మరో 15 ఏళ్లు కాంగ్రెస్‌దే అధికారం ` ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం ` ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధికి బాటలు వేస్తాం ` ఓ పార్టీకి …

జనం సాక్షి 18 Nov 2025 6:52 am

షేక్‌హసీనాకు ఉరిశిక్ష

` ఢాకా ట్రైబ్యునల్‌ కోర్టు సంచలన తీర్పు ` అల్లర్లలో కాల్పులకు ఆదేశించారన్న అభియోగంలో దోషిగా నిర్దారణ ఢాకా(జనంసాక్షి):ఢాకా అల్లర్లకు కారణమంటూ బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ …

జనం సాక్షి 18 Nov 2025 6:48 am

ఎమ్మెల్యే అనర్హతపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోండి

` స్పీకర్‌ సుప్రీం హుకుం న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ స్పీకర్‌ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై విూరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని …

జనం సాక్షి 18 Nov 2025 6:47 am

ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే ‘స్థానిక’ పోరు

` డిసెంబర్‌ రెండో వారంలో షెడ్యూల్‌ ` సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం ` ప్రజాపాలన వారోత్సవాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లో …

జనం సాక్షి 18 Nov 2025 6:45 am

మక్కాలో మహావిషాదం

` సౌదీ అరేబియాలో డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న టూరిస్ట్‌ బస్సు ` 45 మంది హైదరాబాదీల మృతి ` ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సజీవదహనం …

జనం సాక్షి 18 Nov 2025 6:42 am

India |అఖిలేష్ నేతృత్వం.?

India | అఖిలేష్ నేతృత్వం.? India kutami, న్యూఢిల్లీ : ఇండియా కూటమికి

ప్రభ న్యూస్ 18 Nov 2025 6:39 am

Winter |వామ్మో.. చలి

Winter | వామ్మో.. చలి Winter, న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : వామ్మో..

ప్రభ న్యూస్ 18 Nov 2025 6:20 am

మృత్యుకేళి

మన తెలంగాణ/హైదరాబాద్: సౌదీ అరేబియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున దాదాపు 1.30 గంటలకు హైదరాబాద్ యాత్రికులు వెళ్తున్న బస్సు, డీజిల్ ట్యాంకరుని ఢీకొంది. మక్కా నుంచి మదీనాకు వెళుతున్న యాత్రికుల బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనయ్యారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరం లో ఈ బస్సు చమురు ట్యాంకర్‌ను ఢీకొంది. వీరి లో 18మంది మహిళలు, 17మంది పురుషు లు, 10మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటంతో మృ తుల సంఖ్య ఎక్కువగా 45కు చేరిందని చెబుతున్నారు. బస్సులో ఉన్న వారందరూ హైదరాబాద్‌కు చెందినవారు. సిటి నుంచి 54మంది మక్కా యాత్ర కు వెళ్లగా అందులో 46మంది బస్సులో మక్కా నుంచి మదీనాకు వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో తీవ్ర విషాదం నెల కొంది. బస్సులో మంటలు చెలరేగి క్షణాల్లో మొత్తం వ్యాపించడంతో ఒక్కరు మినహా 45 మంది సజీవ దహనం అయ్యారు. బాధితుల శవాలు కాలిపోయి గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. డ్రైవర్ పక్కనే కూర్చొని ఉండటం వల్ల షోయబ్ గాయా లతో బయటపడ్డాడని అధికారులు వెల్లడిం చారు. ప్రస్తుతం సౌదీ జర్మన్ హాస్పిటల్ ఐసియులో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి నిలకడగా ఉంది. అతడి కుటుంబం హైదరాబాద్‌లో ఆందోళనలో ఉంది. రియాద్ భారత రాయబారి కార్యాలయం, జెద్దా కాన్సులేట్ పూర్తి సహాయం అందిస్తోంది. జెద్దా కాన్సులేట్‌లో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, టోల్‌ఫ్రీ నంబర్ 8002440003 అందుబాటులో ఉంది. చనిపోయి నవారి మృతదేహాలు గుర్తింపు కోసం డిఎన్‌ఎ టెస్టులు జరిపారు. సౌదీలోనే అంత్యక్రియలు జరపాలని కుటుంబాలు కోరుతున్నాయి. ఎఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఎల్‌ఎ మొహమ్మద్ మజీద్ హుస్సేన్ బాధిత కుటుంబాలతో సమావేశమై ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రభు త్వం ప్రత్యేక బృందాన్ని సౌదీ పంపుతోంది. అలాగే ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల బంధువులను సౌదీకి తీసుకెళ్లేదుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 18 మం ది మరణించారు. విద్యానగర్‌కు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబంతో కలిసి మ క్కాకు వెళ్లారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కుటుంబానికి చెందిన 18 మంది చనిపోయారు. నవంబరు 23 వరకు టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో నలుగురు వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్లగా మరో నలుగురు మక్కాలోనే ఉన్నారు. మిగతా 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయలుదేరగా ప్రమాదం జరిగింది. ఇందులో ఒక యువకుడు బతికాడు. మిగిలిన 45 మంది మరణించారు. సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ నుంచి వెళ్లిన 45 మంది మృతి చెందారని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. అబ్దుల్ షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారన్నారు. ఈ క్రమంలో సీపీ వివరాలు వెల్లడించారు. సౌదీలో దగ్ధమైన బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారని వివరాలు వెల్లడించారు. మొత్తం 54 మంది బృందం హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లిందని పేర్కొన్నారు. నవంబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు జెడ్డా టూర్ ప్లాన్ చేశారన్నారు. మృతులంతా హైదరాబాద్ వాసులే.. హజ్ కమిటీ సౌదీ ప్రమాదంలో 45 మంది మృతి చెందారని వారంతా హైదరాబాద్ వాసులేనని హజ్ కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా పర్యాటకులంతా జెడ్డాకు వెళ్లారని పేర్కొంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు బస్సు ప్రమాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌లోని సీనియర్ అధికారులు సౌదీ అరేబియా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సౌదీ అరేబియా మదీనాలో జరిగిన ప్రమాదంలో భారతీయులు మృతి చెందడంపై విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన భారతీయుల కుటుంబాలకు రియాద్‌లో భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ పూర్తి మద్దతు అందిస్తున్నట్లు చెప్పారు. సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో గత రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో ఉమ్రా యాత్రికులు మరణించడం పట్ల బాధిత కుటుంబాలకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ ఘటనపై సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ, స్థానిక అధికారులతో సంప్ర దింపులు కొనసాగిస్తున్నట్లు రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ తెలిపింది. అలాగే తెలంగాణ అధికారులతో, సంబంధిత కుటుంబాల తోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు పేర్కొంది. కాన్సులేట్ సిబ్బంది బృందం, భారతీయ వాలంటీర్లు వివిధ ఆస్పత్రిలో సహాయక చర్యల్లో నిమగ్న మైనట్లు తెలిపింది. దురదృష్టకరం: బండి సంజయ్ సౌదీ అరేబియా బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా, సౌదీ అరేబియా అధికారులతో మాట్లాడి, అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టాలని కోరినట్లు చెప్పారు. రూ.5లక్షల పరిహారం ప్రకటన సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభు త్వం రూ. 5లక్షల పరిహారం అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గం తీర్మానించింది. మక్కా నుంచి మదీనాకు యాత్రికులను తీసుకువెళుతున్న బస్సుకు ప్రమాదం జరిగిన దుర్ఘటనలో 45 మంది మృతి చెందిన విషయం విదితమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ప్రభుత్వ ప్రతినిధి బృందంగా మంత్రి అజారుద్దీన్, మజ్లిస్ ఎమ్మెల్యే, మరియు మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారి వెంటనే సౌదీ అరేబియాకు వెళ్లాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.మరణిం చిన వారి కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు మృతదేహాలను అక్కడే మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి, ఒక్కో బాధి త కుటుంబం నుంచి ఇద్దరు కుటుంబ సభ్యులను సౌదీ అరేబియాకు తీసుకువెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మన తెలంగాణ 18 Nov 2025 6:00 am

డిసెంబర్‌లో పల్లెపోరు

మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లో సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. దాదాపు నాలుగు గంటలపైనే ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో గిగ్ వర్కర్ల బిల్లుకు సై తం కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చ ర్చించింది. పార్టీపరంగానే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించారు. మొదటగా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ఆ తర్వాత ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలకు వె ళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన వారోత్సవాలను, డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 20 25ను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్-ను నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను గ్లోబల్ సమ్మిట్ వేదికగా 8వ తేదీన ప్రజలకు వివరించే కార్యక్రమాలుంటాయి. డిసెంబర్ 9 న తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం 15వ ఆర్ధిక సంఘం కాల పరిమితి వచ్చే 2026 మార్చి 31వ తేదీతో ముగియనుంది. అప్పటిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు రూ. 3 వేల కోట్లు రాకుండా పోతాయి. అందుకే ఈ డిసెంబర్ నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. డెడికేటెడ్ కమిషన్ బిసిలకు 42 శాతం ప్రకారం రిజర్వేషన్ల జాబితాను ఇప్పటికే ఇచ్చింది. దాని ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. కోర్టు కేసులతో ఎన్నికల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50 శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్‌లపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని కేబినెట్ తీర్మానం చేసింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదం పొందాలని సూచించింది. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చాకే ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేబినేట్ నిర్ణయించింది. ---------కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసి దాదాపు 20 నెలలు గడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయబావుట ఎగురవేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అందెశ్రీ మృతి పట్ల మంత్రివర్గం సంతాపం ప్రముఖ సహజ కవి అందెశ్రీ మృతి పట్ల మంత్రివర్గం సంతాపం తెలిపింది. అందెశ్రీ సేవలకు గుర్తుగా ‘అందెశ్రీ స్మృతివనం’ ఏర్పాటు, అలాగే ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న అంశాలపై కేబినెట్ చర్చించింది. అందెశ్రీ కుమారుడు ఎ. దత్త సాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందెశ్రీ రచించిన ‘జయ జయ హే తెలంగాణ‘ గీతాన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజహరుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మృతదేహాలను మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధితకుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి ఇద్దరిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్‌ఆర్‌ఎస్ పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్ కు మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (ఆర్‌డిఆర్) ఎస్‌ఆర్‌ఎస్ పీ స్టేజ్ 2 కెనాల్ అని పేరు మార్చనున్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న ఇండస్ట్రీయల్ ల్యాండ్‌ను మల్టీ యూజ్ జోన్‌గా మార్చేందుకు రూపొందించిన ‘హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హెచ్‌ఐఎల్‌టిపి)’కి కేబినెట్ ఆమోదం తెలిపింది.

మన తెలంగాణ 18 Nov 2025 5:00 am

గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం

మనతెలంగాణ/హైదరాబాద్: గిగ్, ప్లాట్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం తెలంగాణ ప్లాట్ ఫారం బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025 బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ పేర్కొన్నారు కేబినెట్ భేటీ అనంతరం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని, వారి కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ఆయన హామీనిచ్చారని అందులో భాగంగానే వారి కోసం గిగ్‌వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని ఆయన తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించిందని, ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోనే తొలిసారిగా సమగ్ర గిగ్ వర్కర్ల చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవుతుందని తెలిపారు. గిగ్ వర్కర్స్ బిల్లులోని కీలకాంశాలు ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లు ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం రవాణా (మొబిలిటీ), డెలివరీ, లాజిస్టిక్స్ రంగాల్లో పనిచేస్తున్నారు. వారు సాధారణంగా వారానికి 7 రోజుల పాటు రోజుకు 10 నుంచి-12 గంటల చొప్పున వర్క్ చేస్తున్నారు. వీరి ఆదాయంలో ప్లాట్‌ఫాంలు 20 శాతం నుంచి 30 శాతం వరకు కమిషన్‌గా వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గిగ్ వర్కర్లకు స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. తాజా బిల్లులో గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ‘తెలంగాణ ప్లాట్‌ఫాం -ఆధారిత గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ బోర్డు’ పేరుతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనుంది. ఈ బోర్డు గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు, నిధుల పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టనుంది. 1-2 శాతం వాటాను గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి అగ్రి గేటర్లకు (ప్లాట్‌ఫాంలు) చెల్లించే సొమ్ములో 1--2 శాతం వాటాను గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లీంచనున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తరఫున సిఎస్‌ఆర్ ఫండ్స్, విరాళాలు, గ్రాంట్లను ఈ నిధికి అందజేస్తుంది. ప్లాట్‌ఫాం చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అనేది పర్యవేక్షించేందుకు రియల్-టైమ్ ‘వెల్ఫేర్ ఫండ్ ఫీ వెరిఫికేషన్ సిస్టమ్ (డబ్ల్యుఎఫ్‌ఎఫ్ విఎస్)’ అందుబాటులోకి తీసుకురానున్నారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థ స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఉబర్, ఓలా వంటి ప్లాట్ ఫాంలు, కార్మికుల మధ్య తలెత్తే వివాదాలను ఇన్‌టైంలో పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముసాయిదాలో పొందుపరిచింది. ఇందులో భాగంగా గిగ్ కార్మికుల జీతాల చెల్లింపులో ఆలస్యం, మోసాలు, అకారణంగా అకౌంట్లు సస్పెండ్ చేయడం.. లాంటి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ రిడ్రెసల్ అధికారులను నియమిస్తారు.  

మన తెలంగాణ 18 Nov 2025 4:30 am

అది ధిక్కారమే

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పది మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చే సింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీ సుకోవాలా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం సూటి గా ప్రశ్నించింది. “ఎంఎల్‌ఎల అనర్హతపై ఈపాటి కి ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. ఇది తీవ్రమైన కోర్టు ధిక్కరణ. నూతన సంవత్సర వేడుకలను ఎక్కడ నిర్వహించుకోవాలో ఇక ఆయనే నిర్ణయించుకోవాలి” అని సుప్రీంకోర్టు సిజెఐ జస్టిస్ గవాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో జవాబు చెప్పాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి దాఖలైన మరో రెండు వేర్వేరు పిటిషన్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఈ సందర్బంగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని ముందే చెప్పామని గుర్తుచేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సిజెఐ గవాయ్ స్పష్టం చేశారు. దీంతో, స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఎంఎల్‌ఏల అనర్హతపై నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని ధర్మాసనానికి తెలిపారు.

మన తెలంగాణ 18 Nov 2025 4:00 am

కోటా దాటితే వేటే

న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కోటా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత 50 శాతం కోటా దాటరాదు. ఈ రేఖను పాటించి తీరాలని సుప్రీంకో ర్టు సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే నెలలో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నిక లు జరుగుతాయి. తాము విధించిన ఈ 50 శాతం లక్ష్మణ రేఖను దాటితే ఉల్లంఘిస్తే ఎన్నికలను నిలిపివేస్తామని ఘాటుగా హెచ్చరించింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, జాయ్‌మాలా బగ్చీతో కూ డిన ధర్మాసనం వెలువరించిన రూలింగ్ కోటా పెం పుదల నిర్ణయాలకు దిగనున్న పలు ఇతర రాష్ట్రాల కు షాక్‌గా మారింది. 2022 జెకె బంతియా కమిష న్ నివేదిక ముందటి పద్ధతిని పాటించాలి. అప్పటి రిజర్వేషన్ల ప్రాతిపదికననే ఎన్నికలు జరపాలి. కమిషన్ రిపోర్టులో ఇతర ఒబిసిలకు 27 శాతం కోటా అమలుకు సిఫార్సు చేశారు. 50 శాతం పరిమితి దాటరాదని పేర్కొన్న ధర్మాసనం ఈ దశలో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జ నరల్ తుషార్ మెహత అభ్యర్థన మేరకు తదుపరి వి చారణను బుధవారానికి వాయిదా వేశారు. అయి తే రాష్ట్ర ప్రభుత్వం తాము విధిస్తున్న కోటాను దాటరాదని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎన్నికలపై ప్రభావం పడరాదనే వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదేమీ కుదరదు. కో టా పరిమితి దాటితే తాము ఎన్నికలపై స్టే విధిస్తామని తెలిపారు. ఈ విషయంలో కోర్టు అధికారాల ను పరీక్షించరాదని చురకలు పెట్టారు. రిజర్వేషన్ల కోటా 50 శాతం దాటరాదని రాజ్యాంగ ధర్మాసనం తెలిపి ఉంది. దీనిపై తమ ద్విసభ్య ధర్మాసనం ఏమీ చేయలేదు. పైగా బంతియా కమిషన్ రిపోర్టు కోర్టు విచారణ పరిధిలోనే ఉంది. అంతకు ముందటి పరిస్థితులకు అనుగుణంగానే కోటా అమలు , ఎన్నికలు జరగాల్సిందే అని ధర్మాసనం తెలిపింది. కొన్ని సందర్భాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా 70 శాతం వరకూ చేరిందనే వాదనపై సుప్రీంకోర్టు సంబంధిత పక్షాలకు నోటీసులు వెలువరించింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ మెహతా తమ వివరణ ఇచ్చారు. నామినేషన్ల ఘట్టం తుది దశ సోమవారంతో అయిపోయింది. పైగా ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు మే ఆరవ తేదీన వెలువరించిన రూలింగ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై జస్టిస్ బగ్చీ స్పందించారు. అన్ని విషయాలు తమకు తెలుసునని , కమిషన్ ముందటి పరిస్థితి ఉండాలని తాము తెలియచేశామని చెప్పారు. ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని చెప్పడం జరిగితే దీని అర్థం కొన్ని వర్గాలకు 27 శాతం కోటా వర్తింపచేసుకోవచ్చునని చెప్పడమా? అని ప్రశ్నించారు. పరిమితి దాటవచ్చునని చెప్పడం జరిగితే , ఇక తమ ఇంతకు ముందటి పరిమితి దాటరాదనే రూలింగ్ మాట ఎటుపోతుందని ధర్మాసనం ప్రశ్నించింది. వేరే రూలింగ్ అమలుకు ఇంతకు ముందటిది చెల్లకుండా పోతుందా? ఒకదానికి పోటీగా మరోటి వెలురించినట్లుగా భావిస్తారా? అని ద్విసభ్య ధర్మాసనం సొలిసిటర్ జనరల్‌ను మందలించింది. 

మన తెలంగాణ 18 Nov 2025 3:30 am

మంగళవారం రాశి ఫలాలు (18-11-2025)

మేషం దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వృషభం కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మిధునం వాహన అనుకూలత కలుగుతుంది. ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కర్కాటకం నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. సింహం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. కన్య ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. సహనంతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. తుల ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. గృహమునకు చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వృశ్చికం ఆర్థిక పరంగా ఒత్తిడులు తప్పవు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ధనస్సు వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మకరం చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. కుంభం దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందువినోద కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి. మీనం విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మన తెలంగాణ 18 Nov 2025 12:10 am

ఒకే కుటుంబానికి చెందిన 18మంది మృతి

సౌదీ అరేబియా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యానగర్ ప్రాంతానికి చెందిన 18మంది మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 18మంది ఈ ఘటనలో అగ్నికి ఆహుతి కాగా వీరిలో 11 మంది ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇంటికి తాళం వేసుకుని పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన వీరంతా నిమిషాల వ్యవధిలోనే కాలి బూడిద కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదీనాకు బయలుదేరిన ట్రావెల్స్ బస్సు సౌదీ అరేబియా రహదారిపై డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు మొత్తం అగ్నికి ఆహుతి అయిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ బస్సులో విద్యానగర్ ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉన్నారు. విద్యానగర లోని మారక్స్ భవన్ పక్కన విశ్రాంత రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ (66) కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఉమ్రా యాత్ర కోసం నసీరుద్దీన్ సహ కుటుంబ సభ్యులు 18మంది ఈనెల 9వ తేదీన సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లారు. అల్ మక్కా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలో 14 రోజుల ప్యాకేజ్ పై నసీరుద్దీన్‌తోపాటు అతని భార్య అత్తర్ బేగం (60 ), చిన్న కుమారుడు సల్లావుద్దీన్ (38), చిన్న కోడలు ఫరానా( 35) సహ వీరి ముగ్గురు పిల్లలు జైన్, ఫరీదా, శ్రీజ, నసీరుద్దీన్ పెద్ద కోడలు సన(40), ఆమె ముగ్గురు పిల్లలు మెహరీన్, మోజా, అజర్ సహ నసీరుద్దీన్ ముగ్గురు కుమార్తెలు అమీనా బేగం, షబానా బేగం, రిజ్వాన బేగం, వీరి పిల్లలు హనీశ్, జాఫర్, మరియానా(12), సహజ(5)లు ఉమ్రా యాత్రకు వెళ్ళారు. అమెరికాలో ఉన్న నసీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్, ముషీరాబాద్, ముసారాంబాగ్ లో ఉండే ముగ్గురు అల్లుళ్ళు, మరో ఇద్దరు మనుమలు మాత్రం వారితో వెళ్ళలేదు. పెద్ద కుమారుడు అమెరికాలో ఉండగా, విద్యానగర్ లోనే ఉండే చిన్న కుమారుడు సలావుద్దీన్ అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఉమ్రా యాత్ర పూర్తిచేసుకుని మక్కా నుంచి మదీనాకు వెళుతున్న వీరంతా బస్సు ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని మృతిచెందారు. మొత్తం 8మంది పెద్దలు, 10 మంది పిల్లలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో విద్యానగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యానగర్ లోని నసీరుద్దీన్ ఇంటికి చేరుకున్న బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులందరిని తీసుకుని యాత్రకు వెళ్లివస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లారంటూ బంధువులు విలపించారు. సిరాజుద్దీన్ ఒక్కడే అమెరికాలో ఉన్నందున బతికిపోయాడని, మొత్తం మూడు తరాలు ఒకే సారి మంటల్లో కాలిపోయారని చెపుతూ బంధువులు బోరున విలపించడం అందరిని కంటతడి పెట్టించింది.

మన తెలంగాణ 17 Nov 2025 11:40 pm

فیکٹ چیک: 2023 کا سعودی عرب واقعہ کا ویڈیو حالیہ عمرہ بس حادثے کے گمراہ کن دعوے کے ساتھ وائرل

سوشل میڈیا میں وائرل ویڈیو میں دعویٰ کیا گیا ہیکہ یہ ویڈیو حالیہ سعودی بس حادثہ کا ہے جس میں 45 بھارتی عمرہ زائرین جاں بحق ہوئے۔ تاہم، تحقیقات سے پتہ چلتا ہے کہ یہ دراصل 2023 کا حادثہ ہے جو مقدس شہر مکہ کے قریب پیش آیا تھا۔

తెలుగు పోస్ట్ 17 Nov 2025 11:33 pm

ఢిల్లీ పేలుడు కేసులో మరో నిందితుడు అరెస్ట్

జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం నాడు శ్రీనగర్ లో జాసిర్ బిలాల్ వాని అనే కుట్రదారుడిని అరెస్ట్ చేసిందని అధికారులు తెలిపారు. గతవారం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ ఉన్ నబీకి జాసిర్ బిలాల్ వాని... క్రియాశీల సహ కుట్రదారుడుగా అధికారులు పేర్కొన్నారు.వాని జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని ఖాజీ గుండ్ నివాసి. అతడినికి డానిష్ అనే మారుపేరు కూడా ఉంది. నవంబర్ 10న కారు బాంబు పేలుడుకు ముందు డ్రోన్ లను సవరించడం, రాకెట్లను తయారు చేయడానికి ప్రయత్నించడం ద్వారా టెర్రరిస్ట్ దాడులు చేయడానికి సాంకేతిక సహాయం అందించాడని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన వాని వెనుక చురుకైన కుట్రదారుడు, దాడి ప్లాన్ చేయడానికి ఉమర్ ఉన్ నబీతో కలిసి పనిచేశాడని ఆ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 10న దేశ రాజధానిలో జరిగిన పేలుడు వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి ఏజెన్సీ వివిధ కోణాలను అన్వేషిస్తోంది. దాడిలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని గుర్తించడానికి రాష్ట్రాలలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.జాసిర్ బిలాల్ వాని పొలిటికల్ సైన్స్ చదివాడు. అతడిని ఉమర్ చేరదీసి కొన్నేళ్లపాటు ఆత్మాహుతి బాంబర్ గా మార్చే విధంగా తీవ్రంగా బ్రెయిన్ వాష్ చేశాడు. గత సంవత్సరం అక్టోబర్ లో కుల్గామ్ లోని ఒక మసీదులో డాక్యర్ మాడ్యూల్ ను కలవడానికి వాని అంగీకరించాడు. ఆ తర్వాత ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అద్దె ఇంట్లో చేరాడు.జమ్మూకశ్మీర్ పోలీసులు వానిని మొదట అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా మాడ్యూల్ లోని ఇతరులు తనను జేష్ -ఎ- మొహమ్మద్ లో ఉండాలని కోరినా, ఉమర్ తనను ఆత్మాహుతి బాంబర్ గా తయారయ్యేలా బ్రెయిన్ వాష్ చేశాడని పేర్కొన్నాడు.

మన తెలంగాణ 17 Nov 2025 11:30 pm

వాట్సాప్‌లో ‘మీ-సేవ’లు

 తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పదే పదే మీ-సేవ కేంద్రాలకు వెళ్లే శ్రమ తగ్గించడానికి, మీ-సేవకు సంబంధించిన అన్ని సేవలను ఇకపై వాట్సాప్ ద్వారానే అందించనుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో ఉదయం 11.30 గంటలకు ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారు. మీ-సేవ సెంటర్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్ అన్నీ వాట్సాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ ఆమోదం పొందితే ఆ సర్టిఫికెట్‌ను సైతం వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రజలకు మరింత సులభంగా, వేగంగా సేవలు అందించడానికి ఉద్దేశించిన ఈ అధునాతన సేవలను ప్రభుత్వం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభించనుంది.

మన తెలంగాణ 17 Nov 2025 11:10 pm

రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన పత్తి కోనుగోళ్లు

సిసిఐ నిబంధనలకు నిరసనగా జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సమ్మెకు దిగడంతో సోమవారం రాష్ట్ర వ్యప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి అమ్ముకునేందుకు సిసిఐ కేంద్రాలకు తీసుకుని వచ్చినా సమ్మెతో కొనుగోళ్లు జరగకపోవడంతో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. సిసిఐ విధించిన ఎల్1, ఎల్2, ఎల్3 సమస్యను పరిష్కరించాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. రెండు దఫాలుగా ప్రభుత్వానికి అసోసియేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం నుండి సానుకూల వైఖరి లేకపోవడంతో అసోసియేషన్ సమ్మె బాట పట్టింది. సిసిఐ అవలంబిస్తున్న అసమతుల్య అలాట్‌మెంట్, స్లాట్ బుకింగ్ విధానాలతో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం చేయడంతో అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్1, ఎల్2, ఎల్3 విధానంతో వెసులుబాటు కల్పించి అన్ని మిల్లులు నడిపేవిధంగా అమలు చేయకపోవడం, దీని ఫలితంగా జాబ్‌వర్క్ కొన్ని మిల్లులకే కేటాయించడంతో మిల్లులు నష్టపోతున్నట్లు మిల్లర్లు వాపోతున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్‌కు పని లేక వెనుదిరిగి పోతున్నారని, మిల్లుల నెలవారీ మెయింటనెన్స్ చార్జీలు అదనంగా మిల్లర్లపై పడుతున్నాయని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని, తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రైవేట్, సిసిఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తూ మిల్లర్లు సమ్మెకు వెళ్లారు. పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి పత్తిని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు భారీ సంఖ్యలో మిల్లుల ఎదుట బారులు తీరాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా కొనుగోలు నిలిపివేయడంతో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు ఎక్కిడికక్కడే నిలిపిచిపోయింది. ఎనుమాముల మార్కెట్ తో పాటు జిన్నింగ్ మిల్లుల్లో సైతం పత్తి కొనుగోళ్లు అగిపోయాయి. విషయం తెలియక పత్తి తీసుకొచ్చిన రైతులు పత్తి యార్డు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలోని అనుశ్రీ కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. కాగా, పత్తి కోనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో మిల్లర్లతో మంగళవారం జరిగే ప్రభుత్వం చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మన తెలంగాణ 17 Nov 2025 11:00 pm

కుమార్తెను హత్య చేసిన తండ్రి అరెస్ట్

కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుమార్తెను హత్య చేసి, కుమారునిపై హత్యాయత్నం చేసిన కేసులో వారి తండ్రి, నిందితుడు అనవేణి మల్లేష్ (38) సోమవారం త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అనవేణి మల్లేష్, పోసవ్వను 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి హర్షిత్ (కొడుకు), హర్షిత (కూతురు) అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. దురదృష్టవశాత్తు, ఆ ఇద్దరు పిల్లలు చిన్నవయస్సులోనే మానసిక, శారీరక అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వైద్య చికిత్స కోసం నిలోఫర్, ఉస్మానియా, నిమ్స్, నేషనల్ హ్యాండీక్యాప్డ్ హాస్పిటల్ (బోయినపల్లి), కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రులు, తిరుపతి బర్డ్స్ , స్విమ్స్ వంటి అనేక ఆసుపత్రులలో పరీక్షలు చేయించినా, పిల్లల పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. స్విమ్స్ వైద్యులు పిల్లల పరిస్థితి జీవితాంతం మారదని స్పష్టం చేయడంతో నిందితుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఈనెల 15న మధ్యాహ్నం నిందితుడి భార్య శనివారం మార్కెట్‌కు వెళ్లిన సమయంలో, మొదట కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నించగా, వారు నిరాకరించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.అనంతరం, నిందితుడు ఒక కాటన్ టవల్‌ను రెండు ముక్కలుగా చేసి, వాటిని ఉపయోగించి కూతురు (హర్షిత), కొడుకు (హర్షిత్) మెడకు ఉరి వేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ చర్యలో కూతురు మరణించగా, కొడుకుపై హత్యాయత్నం జరిగింది. హత్య అనంతరం, నిందితుడు టవల్ ముక్కలను బయట పారవేసి ఇంటినుంచి పారిపోయాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు అదే సాయంత్రం కరీంనగర్ నుండి హైదరాబాద్ జెబిఎస్‌కు చేరుకుని, అక్కడ ఒక లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. మరుసటి రోజు మంచిర్యాలలో తిరుగుతూ, పోలీసుల భయంతో తలదాచుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నట్లు సిఐ జాన్ రెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 17 Nov 2025 10:50 pm

రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా సంగక్కర

రానున్న ఐపిఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ ప్రధాన కోచ్‌గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర ఎంపికయ్యాడు. ఇప్పటికే సంగక్కర రాజస్థాన్ ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్‌గా ఉన్నాడు. తాజాగా జట్టు యాజమాన్యం టీమ్ ప్రధాన కోచ్‌గా కూడా నియమించింది. సంగక్కర వచ్చే సీజన్‌లో ఈ రెండు బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. విక్రమ్ రాథోడ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది.

మన తెలంగాణ 17 Nov 2025 10:38 pm

TG |బస్సు డ్రైవర్ అజాగ్రత్త !!

గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో హెచ్ఈసి

ప్రభ న్యూస్ 17 Nov 2025 10:29 pm

‘శ్రీ చక్ర’ హాస్పిటల్‌లో దారుణం

హనుమకొండలోని శ్రీ చక్ర హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం జ్వరంతో ఐలావోని మండలం, గార్లపల్లి గ్రామానికి చెందిన కల్పన (40) ఆర్‌ఎంపి డాక్టర్ ని సంప్రదించగా హన్మకొండ శ్రీ చక్ర హాస్పిటల్‌కి రెఫర్ చేయడంతో ఆమె అడ్మిట్ అయింది. డాక్టర్ వెంటనే పరీక్షలు నిర్వహించాలని, దానికి సంబంధించిన డబ్బులు కట్టాలని చెప్పగా వెంటనే ఆ మహిళ కూతురు, భర్త కలిసి రూ.20 వేలు చెల్లించారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయిందని, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంటూ డబ్బులు కట్టమని అడగగా వారి వద్ద ఉన్న మరో రూ.20 వేలు కట్టారు. ఒకరోజు గడిచిన తర్వాత మళ్ళీ ఇంకా డబ్బులు కావాలి.. లక్ష రూపాయల వరకు అవుతుంది.. డయాలసిస్ చేయాలని డాక్టర్ చెప్పగా ప్రస్తుతం తమ వద్ద డబ్బులు లేవని, రేపు ఉదయానికల్లా సర్దుబాటు చేసి కడతామని చెప్పగా డాక్టర్, సిబ్బంది వినకుండా పేషంటు భర్తను, వారి కుమార్తెను భయభ్రాంతులకు గురిచేశారు. డబ్బులు కట్టకుంటే వైద్యం చేయమంటూ పెట్టిన వెంటిలేషన్‌ను తీసివేయగా పేషంటు ప్రాణాలు పోయాయి. డబ్బులు కట్టకుంటే పేషెంట్ ప్రాణాలు తీస్తారా అంటూ మృతురాలి భర్త, వారి కుమార్తె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పేషంట్ బంధువులకు సమాచారం ఇవ్వగా బంధువులంతా హాస్పిటల్ చేరుకొని నిరసన తెలిపారు.

మన తెలంగాణ 17 Nov 2025 10:29 pm

WhatsApp stock trading scam: స్టాక్ ట్రేడింగ్‌ పేరుతో టెకీకి భారీ మోసం

ఎల్‌బీనగర్‌కు చెందిన 42 ఏళ్ల టెకీకి WhatsApp స్టాక్ ట్రేడింగ్‌ గ్రూప్‌ పేరుతో రూ.3.37 కోట్లు పోయాయి

తెలుగు పోస్ట్ 17 Nov 2025 10:17 pm

ప్రజా సమస్యలపై అలసత్వమెందుకు

కాలనీల సమస్యలను గాలికొదిలేస్తున్న అధికారులు ప్రజలంటే పట్టింపు లేదా-డిప్యూటీ కమిషనర్ నరసింహతో కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : ప్రజా సమస్యలపై అధికారులకు అలసత్వమెందుకని,కాలనీల సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మొద్దు నిద్రను వీడడం లేదని కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు సోమవారం కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి,సుభాష్ నగర్ 130 డివిజన్ లో నెలకొన్న సమస్యలపై స్థానిక ప్రజలతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నరసింహకు […] The post ప్రజా సమస్యలపై అలసత్వమెందుకు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 9:32 pm

– Anna Datha : మిల్లర్ల దగ్గరకు  వెళ్లొద్దు

– Anna Datha : మిల్లర్ల దగ్గరకు వెళ్లొద్దు పాలకోడేరు (భీమవరం), ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 17 Nov 2025 9:17 pm

వరి కోత మిషన్ లో పడి రైతు మృతి..

పెద్దమందడి, ఆంధ్రప్రభ : వరి కోత మిషన్ లో ప్రమాదవశాత్తు పడి రైతు

ప్రభ న్యూస్ 17 Nov 2025 9:14 pm

ADB |గంజాయి కేసులో నలుగురికి ఐదేళ్లు జైలు..

ADB | గంజాయి కేసులో నలుగురికి ఐదేళ్లు జైలు.. జైనూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Nov 2025 9:10 pm

గర్భంలోనే ఇద్దరు కవల పిల్లలతో భార్య మృతి..మనస్తాపంతో భర్త ఆత్మహత్య

భార్య కడుపులో ఇద్దరు కవలలు మృతి చెందాలని డాక్టర్లు చెప్పడంతో మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ ఆర్‌జిఐఎ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి అన్న ప్రవీణ్ ఫిర్యాదు మేరకు ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలను ఆర్‌జిఐఎ పోలీస్ స్టేషన్ ఐన్‌స్పెక్టర్ బాల్‌రాజ్ వివరించారు.. కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరు రాష్ట్రానికి చెందిన ముత్యాల విజయ్ (40) ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ శంషాబాద్‌లోని సామ ఎన్‌క్ల్యూవ్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. అతని భార్య శ్రావ్య ఎనిమిది నెలల గర్భవతి.. ఆమెకు చెకప్ చేయించేందుకు అత్తాపూర్‌లోని బట్టర్ ఫ్లై హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. వారి వెంట శ్రావ్య తల్లి కూడా వచ్చింది. డాక్టర్‌లు ఆమెకు చెకప్ చేసి కడుపులో ఇద్దరు కవలలు ఉన్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మెరుగైన చికిత్స అవసరం అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆమెను గుడిమల్కాపూర్‌లోని మైత్రి హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించిచడంతో హుటాహుటిన నగరంలోని సరోజిని హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతున్న శ్రావ్య కడుపులో ఇద్దరు కవలలు, శ్రావ్య మృతి చెందారు. విషయాన్ని శ్రావ్య తల్లికి డాక్టర్లు తెలిపారు. ఆమె తన అల్లుడు విజయ్‌కి ఫోన్ ద్వారా చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురై శంషాబాద్‌లోని తన రూమ్‌కు వెళ్లాడు. విజయ్ కోసం వెతికిన అతని మేనమామ ఫోన్ చేశాడు. కానీ రెస్పాండ్ కాకపోవడంతో హుటాహుటిన శంషాబాద్‌లోని రూమ్‌కు వచ్చిచూడగా విజయ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే విజయ్ అన్నయ్య ప్రవీణ్ కు ఫోన్ చేసి చెప్పగా హుటాహుటిన శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లూవ్‌కు చేరుకున్నాడు. తన తమ్ముడిని చూసిన ప్రవీణ్ శోకసముద్రంలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 17 Nov 2025 9:04 pm

భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త భార్యను రోకలి బండతో కొట్టి చంపాడు. అనంతరం పోలీస్ ఎదుట లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ గ్రామానికి చెందిన కారింగుల వెంకన్న, పద్మ దంపతులు.దంపతుల  మధ్య కొద్దిరోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం నెలకొని వెంకన్న భార్య(40)ను రోకలిబండతో తలపై కొట్టడంతో  తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతురాలి తల్లి సీతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజయ్ కుమార్ తెలిపారు.

మన తెలంగాణ 17 Nov 2025 9:00 pm

ഫാക്ട് ചെക്ക്: വനിതാസ്ഥാനാര്‍ഥിയുടെ ചിത്രമില്ലാത്ത തെരഞ്ഞെടുപ്പ് ബാനര്‍? വസ്തുതയെന്ത്

പ്രചാരണ ബോര്‍ഡില്‍ സ്ഥാനാര്‍ഥിയുടെ ചിത്രത്തിന് പകരം ഭര്‍ത്താവിൻ്റെ ചിത്രമെന്ന തരത്തിലാണ് പ്രചരിക്കുന്നത്

తెలుగు పోస్ట్ 17 Nov 2025 8:58 pm

గిరిజన ప్రాంతాల్లో కొరవడిన పాఠశాలలు:ఎంపి మధుయాష్కీ

ఆదివాసి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని పిసిసి ప్రచార కమిటి చైర్మన్, మాజీ ఎంపి మధుయాష్కి గౌడ్ అన్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన ఆదివాసి గిరిజన యువత ఇంట్రాక్షన్ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మధుయాష్కి అతిథిగా హాజరయ్యారు. మేరా యువ భారత్ అధ్వర్యంలో వ ట్రైబల్ యూత్ ఎక్సేంజ్ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు నగరంలో జరిగిన గిరిజన యువత సమ్మేళనంలో ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాలకు చెందిన యువతీ, యువకులు పాల్గొన్నారు. చివరి రోజున సోమవారం వారు రాజ్‌భవన్‌ను సందర్శించారు. వారం రోజుల పాటు వారు నేర్చుకున్న అంశాలను గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మధుయాష్కీ గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ ప్రసంగిస్తూ దేశానికి స్వాతంత్య్రం లభించి డ్బ్బై ఐదు సంవత్సరాలు దాటినా గిరిజన ప్రాంతాల్లో ఇంకా అవసరమైన మేరకు పాఠశాలలు, ఆసుపత్రులు లేవని, తాగు నీరు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఎవరు ఉన్నా ఆదివాసి యువత తమ హక్కుల కోసం ప్రశ్నించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యువజన అధికారి ఖుష్బు, రైల్వే బోర్డు సభ్యుడు నిర్మలా దేవి తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 17 Nov 2025 8:48 pm

నందీశ్వరుడి అభిషేకంలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డా. వాణి…

సూర్యాపేట రూరల్: కార్తీక సోమవారం సందర్భంగా మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాలను తెలంగాణ

ప్రభ న్యూస్ 17 Nov 2025 8:46 pm