SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

WAR |ఎక్సైజ్ సుంకం రూ.10 తగ్గింపు

WAR | ఎక్సైజ్ సుంకం రూ.10 తగ్గింపు WAR | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 27 Mar 2026 11:28 am

భారత్-అమెరికా వాణిజ్యంలో అసమానతలు

భారత్ అమెరికా మధ్య 2022 నుండి 2025 వరకు వాణిజ్య సంబంధాలు గణనీయంగా విస్తరించాయి. అయితే ఈ విస్తరణ వెనుక ఒక ముఖ్యమైన ఆర్థిక వాస్తవం దాగి ఉంది. వాణిజ్య లోటు (ట్రేడ్ డెఫిసిట్). భారత్‌కు అమెరికాతో ఉన్న వాణిజ్యం పరిమాణంలో పెరుగుతున్నప్పటికీ, సమతుల్యత లోపం మాత్రం మరింత స్పష్టమవుతోంది. ఈ కాలంలో ఎగుమతులు, దిగుమతుల గణాంకాలు మాత్రమే కాకుండా, వాటి నిర్మాణం, విధానపరమైన మార్పులు, గ్లోబల్ రాజకీయాల ప్రభావం కూడా ఈ అసమానతను అర్థం చేసుకోవడానికి కీలకం. 2022 సంవత్సరంలో భారత్ నుండి అమెరికాకు జరిగిన ఎగుమతులు సుమారు 75 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో అమెరికా నుండి భారత్‌కు దిగుమతులు సుమారు 50 బిలియన్ డాలర్ల వరకు నమోదయ్యాయి. అంటే భారత్‌కు సుమారు 25 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కనిపించింది. ఇది చూస్తే భారత్ కు లాభదాయకంగా అనిపించినా, ఈ లాభం కొన్ని ప్రత్యేక రంగాలపై అధికంగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఐటి సేవలు, ఔషధాలు, వస్త్రాలు వంటి రంగాలు ప్రధాన పాత్ర పోషించాయి. 2023లో ఈ వాణిజ్య పరిమాణం మరింత పెరిగింది. భారత్ ఎగుమతులు 78 బిలియన్ డాలర్లకు చేరగా, అమెరికా దిగుమతులు భారత్ లోకి 55 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ ఏడాది కూడా భారత్‌కు సుమారు 23 బిలియన్ డాలర్ల మిగులు ఉంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ కాలంలో అమెరికా భారత్‌కు ఎగుమతులు చేసే వస్తువుల విలువ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా రక్షణ సామగ్రి, ఇంధన వనరులు, సాంకేతిక పరికరాలు వంటి రంగాల్లో అమెరికా ప్రభావం పెరిగింది. 2024 నాటికి ఈ వ్యాపారం మరింత వ్యూహాత్మకంగా మారింది. భారత్ నుండి అమెరికాకు ఎగుమతులు సుమారు 82 బిలియన్ డాలర్లకు చేరగా, అమెరికా నుండి భారత్‌కు దిగుమతులు 60 బిలియన్ డాలర్లకు పెరిగాయి. వాణిజ్య మిగులు సుమారు 22 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణం భారత్ అమెరికా నుండి పెరుగుతున్న ఇంధన దిగుమతులు, ముఖ్యంగా క్రూడాయిల్, ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్). రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో మార్పులు చోటుచేసుకోవడం దీనికి కారణం. 2025లో ఈ ధోరణి మరింత స్పష్టమైంది. భారత్ ఎగుమతులు సుమారు 85 బిలియన్ డాలర్లకు చేరగా, అమెరికా నుండి దిగుమతులు 65 బిలియన్ డాలర్లకు పెరిగాయి. వాణిజ్య మిగులు 20 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంటే నాలుగేళ్లలో భారత్‌కు ఉన్న వాణిజ్య లాభం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇది ఒక ఆందోళనకరమైన సంకేతంగా భావించాలి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఒక స్పష్టమైన ధోరణి కనిపిస్తుంది. భారత్ ఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నప్పటికీ, అమెరికా నుండి దిగుమతులు మరింత వేగంగా పెరుగుతున్నాయి. దీని వెనుక ప్రధాన కారణం భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న నిర్మాణాత్మక బలహీనతలు. ముఖ్యంగా హైటెక్ తయారీ, అధునాతన రక్షణ ఉత్పత్తులు, ఇంధన స్వావలంబన లోపం వంటి అంశాలు భారత్‌ను అమెరికాపై ఆధారపడేలా చేస్తున్నాయి. విమర్శనాత్మకంగా చూస్తే ఈ వాణిజ్య సంబంధం సమాన భాగస్వామ్యం కంటే, ఆధారపడే సంబంధంగా మారుతున్నట్లు అనిపిస్తుంది. అమెరికా తన ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యాన్ని ఉపయోగించి భారత్ మార్కెట్‌ను విస్తరిస్తోంది. మరోవైపు భారత్ తన సేవా రంగం ద్వారా మాత్రమే ప్రతిస్పందిస్తోంది. ఇది దీర్ఘకాలంలో ప్రమాదకరమైన అసమతుల్యతకు దారితీయవచ్చు. మరొక ముఖ్యమైన అంశం గ్లోబల్ రాజకీయాల ప్రభావం. అమెరికా, -చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్ ఒక ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. కానీ అదే సమయంలో అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాలకోసం భారత్‌ను వినియోగించుకుంటోంది. రక్షణ ఒప్పందాలు, ఇంధన సరఫరా ఒప్పందాలు ఈ దిశగా స్పష్టమైన ఉదాహరణలు. 2022 నుండి 2025 వరకు అమెరికా- భారత్ వాణిజ్య సంబంధాలు విస్తరించినప్పటికీ, సమతుల్యత లోపం ఒక ప్రధాన సమస్యగా నిలుస్తోంది. గణాంకాల ప్రకారం భారత్‌కు ఇంకా మిగులు ఉన్నప్పటికీ, అది క్రమంగా తగ్గుతూ ఉండటం ఆందోళన కలిగించే విషయం. దీన్ని సరిదిద్దాలంటే భారత్ తన తయారీ రంగాన్ని బలోపేతం చేయాలి. ఇంధన స్వావలంబన సాధించాలి, సాంకేతికతలో ముందడుగు వేయాలి. లేకపోతే ఈ వాణిజ్య సంబంధం ఏకపక్షంగా మారే ప్రమాదం ఉంది. కోలాహలం రామ్‌కిశోర్ 98493 28496

మన తెలంగాణ 27 Mar 2026 11:27 am

ఇరాన్ ధాటికి చేతులెత్తేసిన డొనాల్డ్ ట్రంప్

హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్‌కు విధించిన 48 గంటల గడువు పూర్తి కాకుండానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా తాత్కాలికంగా యుద్ధం ఆపివేస్తున్నానని ప్రకటించడం చాలామందికి విస్మయం కలిగించింది. పశ్చిమాసియాలో 25 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో ఇంకేమాత్రం యుద్ధం చేయలేక ట్రంప్ చేతులెత్తేసారా? అనే అనుమానం నేడు ప్రపంచం అంతటా కలుగుతుంది. ఇరాన్‌లో ప్రభుత్వం మారాలి, ఆ దేశంలో అణుసామర్థ్యం పూర్తిగా తుడిచి పెట్టుకుపోవాలి, ఆ దేశం సైనిక సామర్థ్యం అంతరించిపోవాలి అంటూ నిత్యం ఎన్నెన్నో ప్రకటనలు చేస్తూ వచ్చిన ఆయన రాజీకోసం రెండు రోజులుగా ఇరాన్‌తో జరుపుతున్న చర్చల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మధ్యప్రాచ్యంలో మన మధ్య ఉన్న శతృత్వాలకు పూర్తి పరిష్కారంపై గత రెండు రోజులుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ మధ్య చాలా మంచి ఫలవంతమైన చర్యలు జరిగాయని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. లోతైన, విశ్లేషణాత్మక, నిర్మాణాత్మక చర్యలు ఈ వారంలో కూడా కొనసాగుతాయి. కొనసాగుతున్న సమావేశాలు, చర్చలు విజయవంతం కానున్నందున, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సాదుపాయాలపై అన్ని రకాల సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని నేను భద్రతా దళాన్ని ఆదేశించాను అని ప్రకటించారు. ట్రంప్ వాదనలను కొట్టిపారేసిన ఇరాన్ ట్రంప్ భయపడ్డారని ఎద్దేవా చేసింది. తాము ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేసింది. తమ హెచ్చరికలతోనే ట్రంప్ భయపడిపోయి వెనక్కి తగ్గినట్టు పేర్కొన్నది. తమ విద్యుత్ ప్లాంట్లను అమెరికా లక్ష్యంగా చేసుకొంటే, అదే రీతిన ప్రతిదాడులు చేయడంతోపాటు హర్మూజ్ జలసంధిని కూడా పూర్తిగా మూసివేస్తామన్న తమ హెచ్చరికలతోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్టు ఇరాన్ వెల్లడించింది. కానీ, ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవడానికి తహతహలాడుతున్నట్టు చెబుతున్న ట్రంప్ ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రతినిధులు ఇరాన్‌కు చెందిన ఓ గౌరవప్రదమైన నేతతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. ఏదిఏమైనా యుద్ధానికి తాత్కాలికంగా తెరపడటం మొత్తం ప్రపంచ ప్రజలకు ఊరట కలిగిస్తోంది. ఇటీవలకాలంలో మొత్తం ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురిచేసిన మరో యుద్ధం లేదని చెప్పవచ్చు. అందుకు ప్రధాన కారణం చమురు సరఫరాకు ఆటంకం కలగటమే. కాగా, పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన తర్వాతనే ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన చేశారని ఐరోపా పత్రికలు చెబుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం, ఇరాన్‌కు చెందిన ఉన్నత స్థాయి నాయకులతో ఈ వారంలోనే చర్చలు జరిపేందుకు ఇస్లామాబాద్‌ను ఒక వేదికగా పాకిస్తాన్ ప్రతిపాదించిందని తెలుస్తున్నది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ కూడా సోమవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో చర్చలు జరిపారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ‘అంతరాన్ని పూడ్చేందుకు’ పాకిస్థాన్, టర్కీ, ఈజిప్టులతో కలిసి ‘చురుకైన రహస్య దౌత్యం’లో నిమగ్నమై ఉందని, ఈ విషయాన్ని ఒక అధికారి ధృవీకరించారని పాకిస్తాన్ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘డాన్’ కూడా నివేదించింది.ఈ ప్రక్రియలో మధ్యప్రాచ్యానికి అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా పాలుపంచుకున్నారని ఆ అధికారి తెలిపారు. ఈ మొత్తం యుద్ధం సమయంలో ఓ విధంగా ‘ప్రేక్షక పాత్ర’ వహించిన భారత్ బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉద్రిక్తలను అదుపు చేసేందుకు క్రియాశీలకంగా వ్యవహరించే ఓ అద్భుత అవకాశాన్ని కోల్పోతున్నట్లు స్పష్టం అవుతుంది. ఇరాన్‌పై దురాక్రమణలను అరికట్టడంలోనూ, ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడంలోనూ బ్రిక్స్ కూటమి స్వతంత్ర పాత్ర పోషించాలని ఇరాన్ అధ్యక్షుడు డా. మసూద్ పెజెష్కియన్ ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి సూచించడం గమనార్హం. అణుకార్యక్రమం రద్దు చేసుకోవడమే కాకుండా, తమ దేశంలో ఈ విషయమై ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతోపాటు అమెరికా ప్రతినిధులు కూడా తనిఖీలు చేసుకొనేందుకు కూడా ఇరాన్ సమ్మతి తెలిపింది. ఆ తనిఖీల విషయమై తదుపరి సాంకేతికపరమైన చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో యుద్ధం ప్రారంభించారు. అయితే, వెనెజులాలో మాదిరిగా ఇరాన్ అత్యున్నత నేతలను చంపివేస్తే ఆ దేశం లొంగిపోతుందని అమెరికా, ఇజ్రాయెల్ వేసుకున్న అంచనాలు తలకిందులు కావడంతో ఆ దేశంనుండి వారెవ్వరూ ఊహించని విధంగా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. గత 20 ఏళ్లుగా ఇరాన్ ప్రభుత్వం తమ ఉనికిని ప్రశ్నిస్తున్న ఇజ్రాయెల్, అమెరికాల నుండి ముప్పు ఉందని, ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతుంది. ముఖ్యంగా గత జూన్ లో 12 రోజుల యుద్ధం జరిగినప్పటి నుండే పూర్తిస్థాయి యుద్ధం కోసం సన్నాహాలు ప్రారంభించింది. పైగా, ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకొంటూ, సొంతంగా ఆ దేశం ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకుందని గ్రహించలేకపోయారు. ఈ యుద్ధం గల్ఫ్ దేశాలకు సైతం ఓ పెద్ద గుణపాఠం అని చెప్పాలి. 200కు పైగా బిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికాతో ఏర్పాటు చేసుకున్న రక్షణ ఒప్పందాలు ఇరాన్ నుండి వాటికి భద్రతను కల్పించలేకపోయాయి. వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్‌పై కన్నా గల్ఫ్ దేశాలపై ఎక్కువగా డ్రోన్‌లను ప్రయోగించడం ద్వారా అమెరికా ప్రయోజనాలపై ఎవ్వరూ ఊహించని విధంగా దెబ్బతీశారు. అందుకనే భారీ వ్యయంతో ఆయుధాలను సమకూర్చుకోవడంకన్నా ఆధునిక కాలంలో దౌత్య సంబంధాలే గట్టి రక్షణ కల్పించగలవనే సందేశాన్ని ఇరాన్ ఇవ్వగలిగింది. ఈ సందేశం ప్రపంచంలో పొరుగుదేశాలతో ఘర్షణలు ఎదుర్కొంటున్న అన్ని దేశాలకు ఓ గుణపాఠం కాగలదు. తనను చంపటమే అమెరికా మొదటి లక్ష్యం అని ఖమేనీ ముందే గ్రహించారు. తాను చనిపోయినా అమెరికా ఒత్తిడులకు లొంగని నాయకత్వాన్ని ఆయన నిర్మించుకుంటూ వచ్చారు. అటువంటి ప్రణాళికలు, సన్నాహాలు అమెరికా, ఇజ్రాయెల్ లలో కనిపించడంలేదు. పైగా, అమెరికా సైన్యం ‘ప్రచ్ఛన్న శీతల యుద్ధం’ కాలంలో పోరాడే విధంగా, ఆధిపత్యం కోసం, కండరాలను వంచడానికి, తమ ఆర్థిక- సైనిక బలగాలను చూపి బెదిరింపులతో లొంగదీసుకోవడానికి పేరొందింది. పటిష్టమైన యుద్ధ సన్నద్ధతకు తోడు కంటికి కనిపించని, తేలికగా లొంగిపోని ‘మొజాయిక్ డిఫెన్స్’ అనే రక్షణ కోట వ్యూహాత్మక అడుగులు అమెరికాను ఆశ్చర్యపరిచాయి. ఈ దళానికి ఆద్యుడు మహమ్మద్ అలీ జఫారీ. వెనుజువెలా తరహాలో ఒక్కరోజులోనే ఇరాన్‌లో నాయకత్వ మార్పు తీసుకురావాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం బెడిసికొట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ, సైనిక అధికారులు, అణు ఇంధన శాస్త్రవేత్తలు నేలకొరిగినా ఇరాన్‌లోని మూడు వారాలు దాటినా ఇరాన్ సైన్యం ప్రతిఘటిస్తూనే ఉండటాన్ని మొత్తం ప్రపంచాన్నే నివ్వెరపరచేటట్లు చేసింది. కేంద్రీకృతంగా కాకుండా పలు అంచెలుగా విభజితమై శత్రుసేనల్ని కంగుతినిపించే సామర్ధ్యం కలిగిన మొజాయిక్ డిఫెన్స్ తమ స్టయిల్ దాడులతో అమెరికాను ఆశ్చర్యానికి గురిచేసింది. వీటన్నింటిని మించి ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేకులు ఎవ్వరూ ట్రంప్ లేదా అమెరికాను నమ్మటం లేదని ఈ సందర్భంగా స్పష్టం అయింది. అందుకనే గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ వీధులలో భీకర నిరసనలు తెలుపుతున్న మహిళలు, యువత, మరెవ్వరూ యుద్ధం ప్రారంభం కాగానే అమెరికాకు మద్దతుగా రాలేదు. ‘మీ ప్రభుత్వాన్ని మీరే ఎన్నుకోండి’ అంటూ ట్రంప్ వారిని రెచ్చగొట్టినా వారెవ్వరూ స్పందించలేదు. అమెరికన్ సైన్యం 21వ శతాబ్దపు ఆధునిక యుద్ధంతో పోరాడటానికి సిద్ధంగా లేదని పలువురు నిపుణులు భావిస్తున్నారు. అదీగాక, భారీ అమెరికా యుద్ధ యంత్రాంగం ఖరీదైనది. అది నిదానంగా, నెమ్మదిగా కదిలేది. వేగంగా, ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొట్టే విధంగా తిరగబడే స్వభావం దానికి లేదు. బలప్రదర్శనతో విర్రవీగడమే గాని వ్యూహాత్మకంగా అడుగులు వేసే అలవాటు లేదు. వీటన్నిటితోపాటు, అమెరికా సైన్యం అవినీతికి పేరొందింది. పెంటగాన్, జనరల్స్ ముడుపులు తీసుకొని ఆయుధాలు, యుద్ధ పరికరాలను అప్పగించడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రస్తుత యుద్ధంలో అమెరికా కన్నా ఇరాన్ వ్యూహాత్మకంగా ముందంజలో ఉందని ట్రంప్ వ్యవహారాలపై నిశితంగా అధ్యయనం జరుపుతున్న ప్రొఫెసర్ జియాంగ్ జోక్విన్ తెలిపారు. చలసాని నరేంద్ర 98495 69050

మన తెలంగాణ 27 Mar 2026 11:20 am

రాజన్న నిదర్శించుకున్న మంత్రి, విప్

రాజన్న నిదర్శించుకున్న మంత్రి, విప్ వేములవాడ ఆంధ్రప్రభ : శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ

ప్రభ న్యూస్ 27 Mar 2026 11:15 am

మాజీ ప్రొఫెసర్ కు సైబర్ నేరగాళ్లు కోటి టోకరా

వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్‌ ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు

తెలుగు పోస్ట్ 27 Mar 2026 11:15 am

కన్నుల పండుగగా రాములోరి కల్యాణం

కన్నుల పండుగగా రాములోరి కల్యాణం ఇల్లందకుంట ఆంధ్రప్రభ : అపర భద్రాద్రిగా పేరుగాంచిన

ప్రభ న్యూస్ 27 Mar 2026 11:12 am

రాష్ట్ర ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు..

రాష్ట్ర ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. మేడ్చల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలందరికి

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:54 am

Medical Services |ఏజెన్సీలో కలకలం

Medical Services | ఏజెన్సీలో కలకలం ట్రయల్ రన్‌లో అదుపుతప్పిన డ్రోన్ Medical

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:54 am

ఘనంగా శ్రీ సీతారాముల శోభాయాత్ర..

ఘనంగా శ్రీ సీతారాముల శోభాయాత్ర.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : శ్రీ రామనవమి పర్వదినాన్ని

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:46 am

ప్రాణంతో సావుకు ఎదురెళ్లే ఆట... పెద్ది గ్లింప్స్ విడుదల

హైదరాబాద్: హీర్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. పెద్ది మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా ఎఆర్ రహమాన్ సంగీతమందిస్తున్నాడు. పెద్ది అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా? ప్రాణంతో సావుకు ఎదురెళ్లే ఆట అనే డైలాగు బాగుంది. ఇప్పుడు సెప్పు ఉంటావా? పోతావా?.. ఆటే నా పొగరు అనే డైలాగ్ సూపర్‌గా ఉంది. రామ్ చరణ్‌కు తోడు జాన్వీ కపూర్ నటిస్తోంది. పెద్ది చిత్రం ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు సినిమా బృందం ప్రయత్నిస్తోంది. 

మన తెలంగాణ 27 Mar 2026 10:46 am

Video: Sri Gouri Priya Exclusive Interview

The post Video: Sri Gouri Priya Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 27 Mar 2026 10:40 am

Captains |ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే ఏమిటి?

Captains | ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే ఏమిటి? Captains | ఆల్‌రౌండర్లపై

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:37 am

శ్రీ సీతారాముల విగ్రహాల ఊరేగింపు..

శ్రీ సీతారాముల విగ్రహాల ఊరేగింపు.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:32 am

Srirama Navami : శ్రీరామనవమి ప్రసాదానికి ప్రత్యేకతలివే

హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగకో ప్రసాదం ఉంటుంది.

తెలుగు పోస్ట్ 27 Mar 2026 10:10 am

తాడిపత్రిలో బాలుడు హత్య... సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై బీర్ బాటిల్ తో దాడి... పోలీసులు కాల్పులు

అమరావతి: బాలుడిని కిడ్నాప్, హత్య చేసిన కేసులో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై నిందితుడు బీర్ బాటిల్ లో దాడి చేయగా అతడిపై పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా  తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోన ఉప్పలపాడు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  ఏడేళ్ల బాలుడిని బావ సర్వేష్ కిడ్నాప్ చేసి హత్య చేశాడు. సర్వేష్ ను పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు.  సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై నిందితుడు బీర్ బాటిల్ తో దాడి చేశాడు. బీరు బాటిల్ దాడిలో సిఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సర్వేష్  తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.  తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో డబ్బుల కోసం వేమచంద్ర (7) అనే బాలుడిని అక్క మొగుడు సర్వేష్ కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే.  

మన తెలంగాణ 27 Mar 2026 10:09 am

నలుగురు పేకాటరాయుళ్లు అరెస్టు..

నలుగురు పేకాటరాయుళ్లు అరెస్టు.. జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని సావర్

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:07 am

Ayodhya : అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు

అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు నేడు అత్యంత వైభవంగా జరగనున్నాయి

తెలుగు పోస్ట్ 27 Mar 2026 10:06 am

స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రి పోన్నం,విప్ అది

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మార్చి 27 (జనంసాక్షి):హరి హర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం సందర్భంగా …

జనం సాక్షి 27 Mar 2026 10:00 am

భారత ప్రభుత్వానికి ఇరాన్ గుడ్ న్యూస్

భారత ప్రభుత్వానికి ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 10:00 am

జనసందోహం నడుమ ఆశీర్వాదం అంత్యక్రియలు..

జనసందోహం నడుమ ఆశీర్వాదం అంత్యక్రియలు.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఎస్సీ

ప్రభ న్యూస్ 27 Mar 2026 9:58 am

Charan’s Peddi Pehelwan: Non-Stop Goosebumps

On the occasion of Mega Power Star Ram Charan’s birthday and Sri Rama Navami, the makers of Peddi unveiled a riveting glimpse- highlighting a journey carved out of pain, perseverance, and an unbreakable spirit. The glimpse opens with a powerful voiceover, declaring that wrestling isn’t a playful sport of bats and balls, but a life-or-death […] The post Charan’s Peddi Pehelwan: Non-Stop Goosebumps appeared first on Telugu360 .

తెలుగు 360 27 Mar 2026 9:54 am

Weather Report : ఈ నెలాఖరు వరకూ వానలే.. ఎల్లో అలెర్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 9:53 am

Dil Raju’s Two Big Deals in Bollywood

Successful Telugu producer Dil Raju has big plans in Bollywood. He produced the remakes of Jersey and HIT in Hindi but the results were discouraging. After years, Dil Raju is now in plans to make his comeback in Hindi cinema. He approached Superstars like Salman Khan and Akshay Kumar long ago and paid advances for […] The post Dil Raju’s Two Big Deals in Bollywood appeared first on Telugu360 .

తెలుగు 360 27 Mar 2026 9:51 am

అనంతపురం జిల్లాలో కాల్పులు

అనంతపురం జిల్లాలో కాల్పులు జరిగాయి.

తెలుగు పోస్ట్ 27 Mar 2026 9:45 am

26marchchintana |ఆదర్శ పురుషుడు.. మన రాముడు

26marchchintana| ఆదర్శ పురుషుడు.. మన రాముడు 26marchchintana | శ్రీరాముడు – ధర్మానికి

ప్రభ న్యూస్ 27 Mar 2026 9:41 am

భద్రాచలం శ్రీరామనవమి వేడుకకి వెళితే..

భద్రాచలం శ్రీరామనవమి వేడుకకి వెళితే.. భద్రాచలం (టౌన్) ఆంధ్రప్రభ : శ్రీరామనవమి సందర్భంగా

ప్రభ న్యూస్ 27 Mar 2026 9:37 am

Gold Prices Today : కొనాలా? వద్దా? బంగారం ధరల హెచ్చు తగ్గుదలతో మీమాంస

ఈరోజు దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

తెలుగు పోస్ట్ 27 Mar 2026 9:36 am

Narendra Modi : నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు

తెలుగు పోస్ట్ 27 Mar 2026 9:20 am

Breaking : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోలు, డీజిల్ పై సుంకం తగ్గింపు

దేశంలో పెట్రోలు, డీజిల్ పై పది రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 9:15 am

ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలి..

ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలి.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఓబీసీ సమస్యల పైన

ప్రభ న్యూస్ 27 Mar 2026 9:10 am

Tirumala : నేడు తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్.. క్యూ లైన్ లో ఎంతసేపు ఉండాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 9:02 am

ఏజెన్సీలో కూలిన భారీ డ్రోన్... వీడియో వైరల్

అమరావతి: ఏజెన్సీలో భారీ డ్రోన్ కుప్ప కూలిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా జిమాడుగుల మండలం బోయితల్లి గ్రామ శివారులో జరిగింది. రెడ్ వింగ్ సంస్థ ఏజెన్సీలో ఎమర్జెన్సీ వైద్య పరీక్షల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. బొయితిలి గ్రామ శివారులో డ్రోన్ దారి తప్పి చెట్లలో పడిపోయింది. రెడ్ వింగ్ సంస్థ ఉద్యోగులు అక్కడికి చేరుకొని డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ మినీ హెలికాప్టర్ లాగా కనిపించడంతో పలు గ్రామ ప్రజలు డ్రోన్ ను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. 

మన తెలంగాణ 27 Mar 2026 8:55 am

సీతారాముల దాంపత్యం అజరామరం..

సీతారాముల దాంపత్యం అజరామరం.. తిరువూరు, ఆంధ్రప్రభ : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:53 am

Jogi Ramesh : జోగి రమేష్ పై మరో కేసు

మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదయింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 8:48 am

శ్రీరాములూరి జీవితం అందరికీ మార్గదర్శకం..

శ్రీరాములూరి జీవితం అందరికీ మార్గదర్శకం.. విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:38 am

Amaravathi : అమరావతి అగ్నిప్రమాదాల కేసులో పురోగతి

అమరావతిలో వరుస అగ్నిప్రమాదాల కేసులో పురోగతి కనిపించింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 8:37 am

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్యాంసుందర్ ముదిరాజ్..

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్యాంసుందర్ ముదిరాజ్.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:33 am

విశాఖకు ఎల్‌పీజీ గ్యాస్‌ నౌకలు

విశాఖకు ఎల్‌పీజీ గ్యాస్‌తో నౌకలు చేరుకున్నాయి

తెలుగు పోస్ట్ 27 Mar 2026 8:32 am

మృతుని కుటుంబానికి జనసేన పరామర్శ..

మృతుని కుటుంబానికి జనసేన పరామర్శ.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జూకల్ లో

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:28 am

Ontimitta : నేడు ఒంటిమిట్టలో నవమి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి

తెలుగు పోస్ట్ 27 Mar 2026 8:26 am

పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం..

పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పేద

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:24 am

ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు... సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

ముంబయి: మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ తన నివాసంలో ఓ ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు మంత్రిపై విమర్శలు వస్తున్నాయి. నరహరిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. నాసిక్ జిల్లాలోని డిండోరి నియోజవర్గం నుంచి ఎన్‌సిపి తరఫున నరహరి ఎంఎల్‌ఎగా గెలిచారు. బిజెపికి ఎన్‌సిపి మద్దతు ఇవ్వడంతో నరహరికి ఆహార ఔషదాల నియంత్రణ మంత్రిత్వ శాఖ కేటాయించారు. నాసిక్ జిల్లాలో నరహరికి గిరిజన నేతగా మంచి గుర్తింపు ఉంది. ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలల వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఆయను మంత్రి వర్గం నుంచి తొలగించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ కుట్రతోనే ఆ వీడియోలను మార్ఫింగ్ చేశారని, తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.  సర్కార్ నామా సౌజన్యంతో 

మన తెలంగాణ 27 Mar 2026 8:22 am

Andhra Pradesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 8:14 am

Bhadrachalam : సీతారాముల కల్యాణ్యం చూతము రారండి

శ్రీరామ నవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబయింది.

తెలుగు పోస్ట్ 27 Mar 2026 8:05 am

రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళల పొడిగింపు..

రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళల పొడిగింపు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని

ప్రభ న్యూస్ 27 Mar 2026 7:50 am

Srirama Navami : శ్రీరాముడు చాటి చెప్పిందేమిటి? ఆయన చూపిన మార్గామేమిటో తెలుసా?

భారతదేశానికి సనాతమైన పరిపాలనకు మార్గదర్శిగా శ్రీరాముడిని ఉదాహరణగా చూపుతారు

తెలుగు పోస్ట్ 27 Mar 2026 7:38 am

Iran - America War : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న దాడులు.. చర్చల్లేవ్.. కొనసాగుతున్న యుద్ధం

అమెరికాతో ఇరాన్ చర్చలు జరపడం లేదు. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 7:34 am

ఇన్‌స్టాగ్రామ్ ఎంత పని చేసింది... ఇద్దరు పిల్లల తల్లితో ప్రేమపెళ్లి... కాలువలో దూకి

ఏలూరు: సోషల్ మీడియాలో పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు పిల్లల తల్లిని ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. గోడవలు జరుగుతుండడంతో ఇద్దరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో నాచుగుంట గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యర్రమళ్ల గ్రామానికి చెందిన మావుళ్లయ్య(25) ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడంతో పాటు చేపల ప్యాకింగ్ చేస్తూ తల్లిదండ్రులు సత్యనారాయణ, వీరమ్మలతో కలిసి ఉంటున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇర్రి రమతో(35) ఇన్‌స్టాగ్రామ్‌లో మావుళ్లయ్యకు పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. ఈ విషయం భర్తకు తెలియడంతో యర్రమళ్లకు వచ్చి మావుళ్లయ్య కుటుంబ సభ్యులతో అతడు గొడవకు దిగాడు.అనంతరం భార్య రమను తీసుకొని భర్త తన సొంతూరు సింగుపురానికి వెళ్లిపోయాడు. మావుళ్లయ్య తన అన్న కుమారుడు సతీష్‌కు ఫోన్ చేసి ఇద్దరం ఉంగుటూరులో ఉన్నామని, నాచుగుంటకు రమ్మని కబురు పంపాడు. అన్న కుమారుడు అక్కడికి చేరుకొనేసరికి కాలువ గట్టున మావుళ్లయ్య వస్తువు కనిపించడంతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని రమ, మావుళ్లయ్య మృతదేహాలను బయటకు తీశారు. దీంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయారు. 

మన తెలంగాణ 27 Mar 2026 7:32 am

Israel - Iran War : యుద్ధంతో నగరం మొత్తం నిర్మానుష్యం..ఇళ్లు ఖాళీ

రోమన్ శిథిలాలు, తెల్లటి ఇసుక తీరాలతో ప్రసిద్ధి చెందిన దక్షిణ లెబనాన్ తీరనగరం టైర్ ఇప్పుడు దాదాపు నిర్మానుష్యంగా మారింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 7:20 am

పసికందు గొంతునులిమి చంపి.. నాకు గుడ్ న్యూస్... నీకు బ్యాడ్ న్యూస్ అని భర్తకు ఫోన్ చేసిన భార్య

అమరావతి: ఆరు నెలల కూతురు ఏడుస్తుందని తల్లి పసికందును గొంతు నులిమి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకటేశ్, హేమ అనే దంపతులు ఎన్ఆర్ అగ్రహారంలో అద్దె ఇల్లు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. వెంకటేష్ ఓ ఇటుకల భట్టీలో పనిస్తుండగా భార్య ఇంట్లోనే ఉండి ఆరు నెలల కూతురు, ఐదేళ్ల కుమారుడిని చూసుకుంటుంది. గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆకలితో కూతురు ఏడుస్తుండడంతో భార్యను లేపాడు. అనంతరం పనికి వెళ్తున్నానని చెప్ప బయటకు వెళ్లాడు. కూతురు అలాగే ఏడుస్తుండడంతో గొంతు నులిమి భార్య కన్నబిడ్డను చంపేసింది. వెంటనే భర్తకు ఫోన్ చేసి తనకు గుడ్ న్యూస్, నీకు బ్యాడ్ న్యూస్ అని జరిగిన సమాచారం చెప్పింది. వెంటనే తండ్రి ఇంటికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 27 Mar 2026 7:18 am

27marcheditorial|ఆంధ్రప్రభలో నేటి సంపాదకీయం

27marcheditorial|ఆంధ్రప్రభలో నేటి సంపాదకీయం 27marcheditorial | ఐక్యరాజ్యసమితి శాంతి యత్నాలపై సందేహాలుహార్మూజ్ జలసంధి

ప్రభ న్యూస్ 27 Mar 2026 6:19 am

27marcheditorial |అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు..

27marcheditorial | అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. 27marcheditorial | ఐక్యరాజ్యసమితి శాంతి

ప్రభ న్యూస్ 27 Mar 2026 6:19 am

14 మంది సజీవదహనం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు మంటల్లో దగ్ధం కావడంతో 14 మంది సజీవ దహనమ య్యారు. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో గురువారం తెల్లవారు జామున 66.30 గంటల మధ్య ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ఢీకొట్టింది. టిప్పర్ చీమకుర్తి నుంచి కంకర్ లోడ్‌తో మార్కాపురం వైపు వెళ్తోంది. ప్రమాదంలో గాయపడ్డ 27 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వా స్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రమాదం తో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రైవేటు బస్సు హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టా రు. వేగంగా కంకర లోడుతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. తెల్లవారు జాము కావడంతో బస్సులో అందరూ నిద్రలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో తమ గమ్యస్థానాలకు వెళ్లే లోపు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో కోరుట్ల, జగిత్యాల ప్రాంతానికి చెందిన నలుగురు ఉన్నట్లు సమాచారం. జీవనోపాధి కోసం ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుతారీలు, కార్మికులు వచ్చి ఇక్కడ గృహ నిర్మాణ పనులు చేస్తుంటారు. ఎపిలోని కనిగిరి, పామూరు వాసులు ఉన్నట్లు తెలిసింది. 3 అగ్నిమాపక వాహనాలతో పోలీసులు మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. శుక్రవారం శ్రీరామనవమి పండగ కావడంతో ఎక్కువ మంది సొంతూళ్లకు బయలుదేరి వెళుతున్నారు. మరికొం దరు శుభకార్యాలకు వెళ్లేవారు కూడా ఉన్నారు. స్లీపర్ సీట్లో నిద్రిస్తున్నవారంతా చనిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కొందరు కిటికీ లు బద్దలు కొట్టి బయటకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. బస్సు వెను క భాగంలో ఉన్న వారు బయటకు రాలేక మృతిచెందినట్లు తెలిసింది. బస్సు ముందు భాగంలో ఉన్న సుమారు పది మంది ప్రాణాలతో బయట పడ్డారు. సంఘ టనా స్థలికి అధికారులు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై మార్కాపురం ఎస్‌పి వి.హర్షవర్ధన్ రాజు స్పందిస్తూ, మృతుల సంఖ్య 14కు చేరిందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్య లు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగింది? హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్ జగిత్యాల నుంచి పామూరు వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. టిప్పర్, బస్సు ఢీ కొనడంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు వెనువెంటనే బస్‌కు అంటుకున్నాయి. క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైందని మార్కాపురం డిఎస్‌పి నాగరాజు వెల్లడించారు. ప్రమాదం వెనుక సాంకేతిక లోపాలు కూడా ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. బస్ కండిషన్ సరిగా లేదని ప్రయాణికులు మొదట్లోనే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది యర్రగొండుపాలెం వద్ద గంటసేపు ఆపేసి రిపేర్ చేశారు. అనంతరం ప్రయాణం కొనసాగించారు. ఇది జరిగిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బస్ సిబ్బందిని విచారించగా స్టీరింగ్ స్ట్రక్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పినట్టు తెలుస్తోంది. పలువురిని రక్షించిన బాలరాజు...! ఈ బస్సు ప్రమాదంలో పలువురిని బాలరాజు అనే వ్యక్తి రక్షించాడు. బస్సు అద్దాలు పగలగొట్టి పలువురు తోటి ప్రయాణికులను బాలరాజు రక్షించాడు. ఈ క్రమంలో అతడికి కూడా గాయలయ్యాయి. ప్రస్తుతం బాలరాజు మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. బాలరాజు కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతుని పాడు మండలం తక్కెళ్లపాడు గ్రామనికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.అతడు బస్సు అద్దాలు బ్రేక్ చేయకపోయి ఉంటే మరికొందరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయే వారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాఢ నిద్రలో ఉండగా పెద్ద శబ్దం రావడం, క్షణాల్లో మంటలు, దట్టమైన పొగ బస్సును చుట్టుముట్టాయని బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు బస్సు అద్దాలు పగలకొట్టి బయటకు దూకేశారు. అలానే బాలరాజు అనే ప్రయాణికుడు మరోవైపు బస్సు అద్దాలను పగలగొట్టి కొందరి ప్రయాణికులను బయటకు పంపాడు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు : అంబటి అనిల్ (26), కుమారుడు అంబటి లియో (5 నెలలు), బండారి పద్మ (28), ముత్తంగి వెంకటేశ్వర్లు (45), తమ్మశెట్టి పిచ్చమ్మ, తమ్మిశెట్టి రుక్మిణి, ఉప్పు రమాదేవి, పొదిలి మహేంద్ర, ఎన్.ప్రభావతి (36), కత్తి జయరాములు, ఆత్మకో రు చిన్న, దేవేంద్ర రామయ్య, చైత్ర, జ్యోతి. ఎపి సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం ఘోర రోడ్డు ప్రమాదంపై ఎపి సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆయన అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై సమాచారం తెలుసు కున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడి నవారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని సిఎం చంద్రబాబు అధికారుల ను ఆదేశించారు. రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. 14 మంది సజీవ దహనం అయిన తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. అత్యంత విషాదకరం, బాధితులకు పరిహారం: ప్రధాని మోడీ మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ బాధితులకు ధైర్యం చెప్పారు. అదే విధంగా ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆకాంక్షించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇవ్వనున్నట్లు మోదీ స్పష్టం చేశారు. సిఎం రేవంత్ విచారం.. అధికారులకు కీలక ఆదేశాలు ఎపిలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 14 మంది సజీవ దహనం కావడం పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన తీవ్ర విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబా లకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి గురైన బస్సు తెలంగాణ లోని నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించా లని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను తెలుసుకునేందుకు ఎపి అధికా రులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమ వైద్య సంరక్షణ అందేలా చూడాలని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 27 Mar 2026 6:00 am

27thMarch 2026 |శుక్రవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

27thMarch 2026 | శుక్రవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 27thMarch

ప్రభ న్యూస్ 27 Mar 2026 6:00 am

విద్య, వైద్యం.. మా ప్రాధాన్యం

మన తెలంగాణ/హైదరాబాద్: విద్యం, వైద్యం ప్రభుత్వానికి ప్రాధ్యానతా అంశాలు అని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సిఎం మాట్లాడారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిల వల్ల ప్రయివేట్ ఆసుపత్రులు మూతపడున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆరోగ్యశ్రీ బకాయిలు గత ప్రభు త్వం చేసిన పనులకు వారసత్వంగా వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి నెలా ఆరోగ్యశ్రీ బిల్లుల కోసం సగటున రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. బిఆర్‌ఎస్ ప్రభు త్వం ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిందని, వాటిని మోస్తూనే పరిమితిని రూ.5లక్షల నుంచి పది లక్షలకు పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.627 కోట్లు పాత బకాయిలు ఉన్నాయని సిఎం చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 27 నెలల్లో ఆరోగ్యశ్రీకి రూ.2,408 కోట్ల చెల్లించగా, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.927 కో ట్లు, ప్రయివేట్ ఆసుపత్రులకు రూ.1,480 కోట్లు చెల్లించామని, ప్రస్తుతం ఉన్న బకాయిలు కేవలం రూ.727 కోట్లు మాత్రమేనని, బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ఉన్నామని, ఇవి గత ప్రభుత్వం ఇచ్చిన బకాయిలే అని సిఎం పేర్కొన్నారు. ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బకాయిలు చాలా తక్కువగా ఉన్నాయని, ఆరోగ్యశ్రీ లో వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య పెరిగిందని సిఎం తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి విషయంలో గతంలో అనేక అవకతవకలు జరిగాయని, కొంత మంది ఈ సహాయ నిధిని దుర్వినియోగం చేశారని, వారిపై కేసులు కూడా పెట్టిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆన్‌లైన్‌లో సిఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని, దీంతో అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని సిఎం వివరించారు. ఇప్పటికే సిఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 2,046 కోట్లు లబ్దిదారులకు ఇచ్చామని, ఆరోగ్యశ్రీ సుమారు రూ.2,400 కోట్లతో కలిపి ప్రభుత్వం ఏర్పడిన 27 నెలల్లో రెండు పథకాలకు రూ.4,500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని సిఎం వెల్లడించారు. రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, టీచింగ్ కాలేజీలకు రోగులు రావడం లేదని, ప్రభుత్వాసుపత్రులకు వైద్యం కోసం రోగులు వెళితే అక్కడ నాణ్యమయిన వైద్యులు ఉండటం లేదని తెలిపారు. దీన్ని పరిష్కరించేందుకు రాష్ట్రంలోని టీచింగ్ కాలేజీలకు ఆరోగ్యశ్రీని అనుసంధానం చేసే దిశగా ఆలోచిస్తున్నామని, ఆరోగ్యశ్రీతో పాటు సిఎం రిలీఫ్ ఫండ్‌ను ఈ ఆసుపత్రులకు ఇస్తామని సిఎం ప్రకటించారు. ఆసుపత్రుల్లో పనిచేసే ఉన్నత చదువులు చదివిన వైద్యులు, ఆసుపత్రుల నిర్వహణ, రోగుల వైద్యం చూసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉన్నట్లు గుర్తించామని, ఈ సమస్య పరిష్కారానికి ఆసుపత్రుల నిర్వహణకు గ్రూప్ 1 అధికారిని నియమించడంపై చర్చిస్తున్నామని, దీంతో నిర్వాహణ, వైద్య సేవలు వేరు వేరుగా ఉంటాయని సిఎం చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ కుటుంబ బీమాతో రాష్ట్రంలో కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా కల్పించబోతున్నామని, ఇందిరమ్మ బీమాతో, కుటుంబానికి ధీమా ఉంటుందని సిఎం పేర్కొన్నారు. విదేశాల్లోని రాష్ట్ర వైద్యులతో ప్రభుత్వాసుప్రతుల్లో వైద్యానికి ప్లాట్ పాం ఏర్పాటు రాష్ట్రానికి చెందిన విదేశాలల్లో పనిచేస్తున్న ఉన్నతమయిన డాక్టర్లతో రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందిచేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని సిఎం ప్రకటించారు. అనేక పనుల మీద విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వైద్యులు వారి పనులు ముగించుకున్న తరువాత మిగిలిన రోజుల్లో వారి వెసులుబాటుతో ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు అందించేందుకు ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేశామని త్వరలో తుదిదశకు చేరుకుంటుందని సిఎం తెలిపారు. వరంగల్, అల్వాల్, ఎల్‌బినగర్, సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రులను స్పెషలైజేషన్ ఆసుపత్రులుగా మారుస్తున్నామని, ఆరోగ్యశ్రీ, సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చే నిధులు అధికంగా ఈ ఆసుపత్రులకు కేటాయిస్తామని సిఎం తెలియజేశారు. గోషామహాల్‌లో మూడు వేల కోట్లతో 30 ఎకారాల్లో ఉస్మానియా నూతన ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, అదనంగా పదివేల బెడ్‌లు రోగుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నామని, టిమ్స్ ఆసుపత్రుల పనుల్ని వేగంగా పూర్తి చేస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు. గతంలో జరిగిన పోరపాట్లను సరిదిద్దుకుంటూ వస్తున్నామని, వైద్యంలో నిరంతరం కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, వైద్య ఆరోగ్యశాఖ సవాల్ లాంటిదని, శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు వైద్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉందని సిఎం తెలిపారు. భవిష్యత్తులో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నామని, పేదల విద్య, వైద్యం కోసం ఖర్చు చేసే వాటిలో కోత విధించమని, అవసరమయితే మరిన్ని నిధులు కేటాయిస్తామని సిఎం స్పష్టం చేశారు.

మన తెలంగాణ 27 Mar 2026 5:30 am

పిఆర్సీ కమిషన్ గడువు పెంపు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ గడువును ప్రభుత్వం పెంచింది. పిఆర్సీ గడువు సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది. ప్రస్తుత పిఆర్సీ కమిటీ గడువు మరో ఐదు రోజుల్లో (31 మార్చి)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు క మిటీ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పిఆర్సీ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. కొత్త పిఆర్సీ నివేదిక ఇంకా  ప్రభుత్వానికి చేరలేదు. ఈ తరుణంలో కొత్త పిఆర్సీ కోసం ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల సందర్భంగా విపక్షాలు సైతం ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా కొత్త పిఆర్సీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారని, కానీ, అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావొస్తున్నా పిఆర్సీ ఇవ్వలేదని ప్రశ్నించారు. మళ్లీ ఎక్స్‌టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకుని ఉద్యోగులకు కొత్త పిఆర్సీ ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలని రెండు రోజుల క్రితం బిఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మాత్రం మరోసారి పిఆర్సీ పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

మన తెలంగాణ 27 Mar 2026 5:00 am

సిఎంలతో ప్రధాని భేటీపై ఉత్కంఠ

న్యూఢిల్లీ: గల్ఫ్ యుద్ధం, తలెత్తుతున్న చ మురు సంక్షోభం ఇతర కీలక విషయాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మో డీ శుక్రవారం మాట్లాడనున్నారు. వర్చువల్ పద్ధతిలో ఇంటర్నెట్ ద్వారా పరిస్థితి ని సమీక్షిస్తారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు గురువారం తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలను మినహాయించి ఇతర రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మాట్లాడుతారు. ప్ర స్తుత దశలో రాష్ట్రాల సన్నద్ధత, తీసుకోవల్సిన చర్యలు సమీక్షిస్తారు. రాష్ట్రాల వారిగా ఆలోచనలను తెలుసుకుంటా రు. గల్ఫ్ యుద్ధం తీవ్రరూపం తరువా త ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష కు దిగడం ఇదే తొలిసారి. వీడియో కా న్ఫరెన్స్ సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుంది. సమస్య తలెత్తుతున్న దశలో దేశం అంతా జట్టుగా వ్యవహరించే క్రమంలో పూర్తి స్థాయి సమన్వయం పై దృష్టి సారించేందుకు ఈ సమావేశం ఏర్పాటు అవుతోంది. ఇంధన భద్రత, సరఫరాల వ్యవస్థలు, విదేశాల్లోని భారతీయుల రక్షణ, తరలింపు వంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి. అంతర్జాతీయ అస్థిరతల దశలో అంతర్గత సుస్థిరతల నిర్వహణ కీలక అంశం కానుంది. కోడ్ కారణంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల సిఎంలు ఈ సమీక్షలో పాల్గొనడం లేదు. మరో వైపు ఎన్నికలు జరిగే రాష్ట్రాలు తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రెటరీలు వేరుగా సమీక్ష జరుపుతారు. సిఎంలతో ప్రధాని అంతర్గత సమీక్ష, ప్రభుత్వాధికారుల సమావేశం క్రమంలో దేశంలో ఏదైనా విధాన నిర్ణయం అమలులోకి తీసుకువస్తారా? ఇంధన సరఫరాకు కేంద్రం నుంచి ఏదైనా విధివిధానాలు ప్రకటన ఉంటుందా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.

మన తెలంగాణ 27 Mar 2026 4:30 am

5 మండలాల్లో భూభారతి

మన తెలంగాణ/హైదరాబాద్: గత ప్ర భుత్వ హయాంలో ధరణి తెచ్చిన చిక్కుముడులను విప్పుతున్నామని, రాష్ట్రం లో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులకు అత్యంత పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా కొత్తగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ (ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ మేనేజిమెంట్ సిస్టమ్) ను వచ్చే నెల 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు మం త్రి పొంగులేటి ప్రకటించారు. గురువారం రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎన్‌ఐసీ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా భూపరిపాలన సేవలను మరింత వేగవంతంగా అందించడానికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ భూభారతి పోర్టల్‌ను అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రతి భూ లావాదేవీ వివరాలు కనిపించేలా పారదర్శకంగా పోర్టల్ ఉంటుందని ఆయన తెలిపారు. నక్షా లేని ఐదు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూధార్ నంబర్‌లు కేటాయించాం ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్‌ను నారాయణపేట జిల్లా కొస్గీ, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లో వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ పైలట్ మండలాల్లో మెరిట్- డీమెరిట్‌లను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి రెండో దశలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి భూ భారతి పోర్టల్‌ను కూడా తీసుకొచ్చామన్నారు. భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ, విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్‌ను జతపరిచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే నెంబర్‌కు ఆధార్ మాదిరిగానే భూధార్ నంబర్‌ను ఇస్తామన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నక్షా లేని ఐదు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూధార్ నంబర్‌లను కేటాయించినట్లు తెలిపారు. మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ ఒక క్లిక్‌తో రైతులకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా, చాలా సులువుగా, సులభతరంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను రూపొందించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే కావలసిన సమాచారం లభిస్తుందని ఆయన తెలిపారు. అదే విధంగా పోర్టల్లో ప్రధానంగా సమాచారం సేవలు, సర్వే సేవలు, కరెక్షన్ సేవలు, అప్పీల్ సేవలు, రిజిస్ట్రేషన్ సేవలతో పాటు సిటిజన్ డాష్ బోర్డు సేవలకు సంబంధించి మై ల్యాండ్ పోర్ట్ ఫోలియో, నాలా ఆర్డర్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలు, ఫీడ్‌బ్యాక్, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్‌ఓఆర్, భూధార్ నెంబర్, దరఖాస్తు వివరాలు, మ్యూటేషన్, ఈసీ, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నంబర్‌కు మ్యాప్, ఆర్‌ఓఆర్, గ్రామాల నక్షా, పాస్ బుక్ కరెక్షన్ వంటి పూర్తి సమాచారం ఉంటుందన్నారు. అన్ని రకాల సేవలు లభించేలా మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ భూ భారతి పోర్టల్‌ను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ చేయబోతున్నామని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్, ఇతర భూసేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి స్టేజ్ లో దాని వివరాలను తెలియజేస్తూ ఎస్‌ఎంఎస్ ద్వారా ఖాతాదారునికి సమాచారం అందుతుందన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎన్‌ఐసి అధికారులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 27 Mar 2026 4:00 am

పెట్రోలియం నిల్వలు సమద్ధిగా ఉన్నాయి

` దేశంలో ఇంధనానికి కొరత లేదు.. ` 60 రోజులకు సరిపడా స్టాక్ ` ప్రజలు ఆందోళన చెందొద్దు:కేంద్రం న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని కేంద్ర …

జనం సాక్షి 27 Mar 2026 3:14 am

ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ మతి

అబుధాబీలో క్షిపణి దాడి.. భారతీయుడి మతి అమెరికాను ఎదుర్కొనేలా ఇరాన్ ఎత్తులు ఖర్గ్ ఐలాండ్‌లో మందుపాతరలు పశ్చిమాసియా ఘర్షణల వేళ.. రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్లు..! టెహ్రాన్(జనంసాక్షి):ఇరాన్‌కు …

జనం సాక్షి 27 Mar 2026 3:13 am

అగ్నికీలల మారణహోమం

` టిప్పర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధమైన ప్రైవేటు ట్రావెల్ బస్సు ` ఘోర దుర్ఘటనంలో 13మంది ప్రయాణికుల మతి ` పలువురికి తీవ్ర గాయాలు ` మార్కాపురం …

జనం సాక్షి 27 Mar 2026 3:11 am

పేదల వైద్యం.. అత్యంత ప్రాధాన్యం

` ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2,408 కోట్లు చెల్లించాం ` గత ప్రభుత్వం 600 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లింది ` విద్య,వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం ` …

జనం సాక్షి 27 Mar 2026 3:08 am

మీ తీర్పుపై మాకు వివరణ ఇవ్వండి

మన తెలంగాణ/హైదరాబాద్: “బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై మీరు ఇచ్చిన తీర్పుపై మాకు వివరణ ఇవ్వండి..” అని హైకోర్టు ధర్మాసనం గురువారం స్పీకర్ (ట్రిబ్యునల్) గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆదేశించింది. అదేవిధంగా పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ తీర్పు ఇచ్చిన ఎమ్మెల్యేలకూ స్పీడ్ పోస్టు ద్వారా నోటీసులు పంపించాలని ధర్మాసనం ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి, కె. సంజయ్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహీయుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. కేసు విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. స్పీకర్‌తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.ఇదిలా ఉండగా బుధవారం ఏడు మంది ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి. ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేగా ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగుల సాక్షాధారాలను స్పీకర్‌కు అందజేసినా, స్పీకర్ ప్రసాద్ కుమార్ వారు పార్టీ ఫిరాయించారనడానికి ఆధారాలు ఏమీ లేవంటూ కేసులను కొట్టి వేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు గురువారం తన వాదన వినిపించారు. దీంతో ధర్మాసనం స్పీకర్‌తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ నోటీసులు పంపించాలని ఆదేశించింది. అనర్హత పిటిషన్లపై ఇచ్చిన తీర్పుపై తమకు వివరణ ఇవ్వాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది.

మన తెలంగాణ 27 Mar 2026 3:00 am

శుక్రవారం రాశి ఫలాలు (27-03-2026)

మేషం ఇతరులతో ఏర్పడిన వివాదాలలో ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. మిత్రుల నుండి విలువైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వృషభం ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువర్గంతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. మిధునం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కర్కాటకం ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. ధనపరంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. సింహం నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. కన్య సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. భూవివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. వృశ్చికం స్థిరస్తి వివాదాలు మరింత బాధిస్తాయి. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. మానసిక అశాంతి కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ముఖ్యమైన పనులలలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహవాతావరణం ఉంటుంది. ధనస్సు స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విషయమైన పెద్దల సలహా తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. దైవచింతన పెరుగుతుంది. మకరం విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. కుంభం బంధువులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగమను ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. మీనం ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వెయ్యవలసి వస్తుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.  

మన తెలంగాణ 27 Mar 2026 12:20 am

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, జగన్మాత సీతాదేవిని వివాహమాడే పర్వదినముగా శ్రీరామ నవమిని జరుపుకుంటారని తెలిపారు. భారతీయ సాంస్కృతిక సామాజిక కుటుంబ జీవన గమనంలో, సంప్రదాయాలు విలువలకు, ధర్మానికి ప్రాధాన్యతనిస్తూ సాగిన శ్రీ సీతారాముల భార్యాభర్తల బంధానికి, హిందూ మత సాంప్రదాయంలో పవిత్రమైన స్థానం ఉన్నదని పేర్కొన్నారు. పలు కష్టాలు త్యాగాలతో కాలపరీక్షలను నెగ్గి నిలిచిన సీతారాముల ప్రేమ బంధం అజరామరం, ఆదర్శనీయం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా శ్రీ సీతారాముల చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలకు అందాలని కెసిఆర్ ప్రార్ధించారు.

మన తెలంగాణ 26 Mar 2026 11:10 pm

నేను అధికారంలో ఉన్న పార్టీలో చేరలేదు : మంత్రి సీతక్క

సబితా ఇంద్రా రెడ్డి కాంగ్రెస్‌లో ఎంఎల్‌ఎగా గెలిచి, బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారని మంత్రి సీతక్క అన్నారు. తాను టిడిపిలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో లేదు అని, కాంగ్రెస్‌లో చేరినప్పుడు కూడా ఆ పార్టీ అధికారంలో లేదని చెప్పారు. బిఆర్‌ఎస్ హయాంలో అన్ని చేశాం..అన్నీ బాగున్నాయి అంటున్నారు, ఇపుడు ఒక్క రోడ్డు లేదు, వాటర్ ట్యాంక్ లేదు అంటున్నారు...ఇది ఎలా సాధ్యం..? అని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డికి తనపై ద్వేషం ఉండొచ్చు..కానీ తనకు ఎందుకు ఉంటుందని అని ప్రశ్నించారు. “ఆమె కేటగిరీ వేరు,నా కేటగిరీ వేరు, ఆమె రాజ్యం వేరు, నా రాజ్యం వేరు...వాళ్ళది హైదరాబాద్ సిటీ...మేము అడవి బిడ్డలం.. మాకు ఎక్కడ కూడా వాళ్లతో పోలిక లేదు” అని పేర్కొన్నారు. తమకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదు అని, వాళ్లు అన్న మాటలు ఒక్కసారి పరిశీలించుకోవాలని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డిలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

మన తెలంగాణ 26 Mar 2026 11:02 pm

రాహుల్ గాంధీపై కిరణ్ రిజిజు విమర్శలు..

కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ తన సలహాదారుల ప్రభావంలో ఉండి, వారు చెప్పినట్లే పార్లమెంట్‌లో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. సభలో టీ-షర్ట్ ధరించి హాజరుకావడం కూడా సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ‘టైమ్స్ నౌ సమ్మిట్’లో మాట్లాడుతూ, వ్యక్తిగతంగా రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి సమస్యలేదని, సభ బయట సౌహార్దంగా మాట్లాడుకుంటామని చెప్పారు. అయితే సభలో అధికారికంగా మాట్లాడేటప్పుడు నియమాలు, సంప్రదాయాలు, మర్యాదలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.రాహుల్ గాంధీ మనసు ఆయన కార్యకర్తలైన సలహాదారుల చేతుల్లో ఉంది. వారు చెప్పిందే ఆయన సభలో చెబుతున్నారు అని రిజిజు విమర్శించారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు వ్యక్తం చేసినా కొన్ని పరిమితులు పాటించిందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ దుస్తులపై ప్రశ్నించగా, ఆ పదవికి తగిన విధంగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఉందని, దుస్తులు కూడా అందులో భాగమేనని రిజిజు వ్యాఖ్యానించారు. టీ-షర్ట్ వేసుకోవడంపై అభ్యంతరం లేదు కానీ అది సభలో కాదు అని అన్నారు.లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీని ఉదాహరణగా పేర్కొంటూ, స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన దుస్తుల శైలిని మార్చుకుని మరింత గౌరవప్రదంగా కనిపించేవారని తెలిపారు. ప్రతిపక్షానికి నాయకుడిగా ఉండటం వల్ల, ఆ పదవికి తగిన ప్రతిష్ఠను ప్రతిబింబించేలా వ్యవహరించాలని సూచించారు. రాహుల్ గాంధీ రాజకీయ విధానం విరుద్ధతలతో నిండి ఉందని, ప్రభుత్వ విజయాలను ప్రతిసారీ ప్రశ్నించడం, ప్రతి చర్యను వ్యతిరేకించడం ఆయన ధోరణిగా కనిపిస్తోందని రిజిజు విమర్శించారు.

మన తెలంగాణ 26 Mar 2026 10:20 pm

హర్మూజ్ నౌకలకు ఇరాన్ టోల్ ఫీజు

హర్మూజ్ జలసంధి మీదుగా చమురు నౌకల ప్రయాణానికి ఇరాన్ భారీ స్థాయిలో టోల్ రుసుం వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని గల్ఫ్ సహకార మండలి సెక్రెటరీ జనరల్ జెసెమ్ మెహమ్మద్ అల్ బుదాయ్వి తొలిసారిగా తెలిపారు. ఇరాన్ చర్యను తప్పుపట్టారు. ఈ మార్గం గుండా ఒక్కసారి వెళ్లితే మొత్తం చమురులో 20 శాతం వరకూ ఫీజుగా ఇరాన్ దండుకొంటోందని ఆయన విమర్శించారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గల్ఫ్ దేశాల ఈ కూటమిలో సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, యుఎఇ, కువైట్, బహరైన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. సంక్షోభ సమయంలో ఇతరదేశాలను ఈ విధంగా దోచుకుంటున్నారని ఇరాన్‌పై నిప్పులు చెరిగారు.

మన తెలంగాణ 26 Mar 2026 10:10 pm

ఇరాన్‌కు రష్యా భారీ సాయం ?

ప్రస్తుత గల్ఫ్ యుద్ధం దశలో రష్యా ఇరాన్‌కు పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తోందా? అధునాతన డ్రోన్లు, ఆహార పదార్థాలు అవసరం అయిన డేటా సమకూరుస్తోందా? అవునని , ఇప్పటికే తొలివిడత సాయం ఇరాన్‌కు రష్యా నుంచి అందిందని పాశ్చాత్య ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వాదనను రష్యా అధికారిక కేంద్రం క్రెమ్లిన్ తోసిపుచ్చింది. ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా పోరు దశలో తమ దేశం ఎటువైపు నిలబడటం లేదని రష్యా స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియాలో వెలువడుతున్న కథనాలను తోసిపుచ్చింది. ఈ నెలలో డ్రోన్లు సరఫరా చేయడం ఆరంభం అయింది.ఈ ప్రక్రియ వేర్వేరు దశలలో నెలాఖరులోగా పూర్తి అవుతుందని వెల్లడించారు.ఇజ్రాయెల్ ఇటీవలే రష్యా ఇరాన్ మధ్య సైనిక ఆయుధ రవాణా మార్గాన్ని గుర్తించింది. ఈ క్రమంలోనే కాస్పియన్ సముద్రంలోని ఈ మార్గాన్ని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి రహస్యంగా ఇరాన్‌కు బారీ స్థాయిలోనే ఆయుధ సాయం అందుతున్నట్లు పసికట్టారు. చిరకాలంగా రష్యాకు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను, ఖమేనీని అంతమొందించడాన్ని రష్యా బహిరంగంగా ఖండించింది. లక్షాలను ఛేదించేందుకు అవసరం అయిన డేటా, శాటిలైట్ల ఛాయాచిత్రాలను ఎప్పటికప్పుడు ఇరాన్‌కు రష్యా మిత్రపక్షంగా చేరవేస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ జంటదాడులతో తల్లడిల్లుతున్న దశలో వెంటనే స్పందించడమే మిత్రధర్మమని రష్యా భావించింది. ఈ దిశలోనే సాయానికి దిగిందని వార్తలు వచ్చాయి. అయితే అటువంటిదేమీలేదని క్రెమ్లిన్ తెలిపింది.

మన తెలంగాణ 26 Mar 2026 9:59 pm

రోడ్డు భద్రతపై ప్రత్యేక ప్రదర్శన

రోడ్డు భద్రతపై ప్రత్యేక ప్రదర్శన హైవే ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:58 pm

గ్యాస్ డెలివరీలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు

గ్యాస్ డెలివరీలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు వెల్దుర్తి గ్యాస్ గోడౌన్‌పై కలెక్టర్

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:53 pm

అమ్మమ్మ కోసం మనవరాలు సజీవదహనం

ఇల్లు గడిచేదెలా..పిలల్లలను పోషించేదెలా? బస్సు ప్రమాదంలో ఇది ఇంటిపెద్దను కోల్పోయిన వారి ఆక్రందన ఇది! అయ్యో కష్టపడి కొనుక్కున్న వస్తువులు బూడిదయ్యాయే? ప్రాణాలతో బయటపడిన క్షతగాత్రుల ఆవేదన ఇది! మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతుంటే కళ్లు మూసినా, తెరిచినా అగ్నికీలలే గుర్తొస్తున్నాయంటూ క్షతగాత్రులు కలవరపడుతున్నారు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద బస్సు ప్రమాద మృతుల కుటుంబాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయి. ఈ బస్సు ప్రమాదంలో అమ్మమ్మను రక్షించే క్రమంలో మనవరాలు మృతిచెందిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ దుర్ఘటనలో కనిగిరి మండలానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామానికి చెందిన 80 ఏళ్ల తమ్మిశెట్టి పిచ్చమ్మ, ఆమె మనవరాలు తమ్మిశెట్టి రుక్మిణి మృతి చెందారు. ముందు ప్రాణాలతో బయటపడిన రుక్మిణి అమ్మమ్మను కాపాడేందుకు మళ్లీ బస్సులోకి వెళ్లారు. ఈ క్రమంలో క్షణాల్లో మంటలు వ్యాపించడంతో రుక్మిణీ కూడా ప్రాణాలు కోల్పోయారు. రుక్మిణి భర్త తిరుపాలుకు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో చల్లగిరగల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కనిగిరికి చెందిన పద్మ బేల్దారి పనుల నిమిత్తం తెలంగాణ వెళ్లి శ్రీరామనవమికి సొంతూరు వస్తూ బస్సు ప్రమాదానికి బలయ్యారు.

మన తెలంగాణ 26 Mar 2026 9:50 pm

నిర్మల్ లో వైద్యుల రాస్తారోకో

నిర్మల్ లో వైద్యుల రాస్తారోకో వైద్యుని పై దాడి చేసిన వారిని వెంటనే

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:48 pm

కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు..

కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు.. ఆస్పత్రి ముందు ధర్నా చేస్తున్న బాధితులుభువనగిరిలో

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:45 pm

రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్‌, భట్టి

శ్రీరామనవమి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. భద్రాద్రి రామాలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.351 కోట్లు కేటాయించామన్నారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యం దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు జరుపుకోవాలన్నారు. భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రజలకు డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి పాలన ఆదర్శంగా రాష్ట్రంలో ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని, ప్రతి రైతు తలెత్తుకుని జీవించేలా చేయాలని ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం కృత నిశ్చయంతో పాలన చేస్తోందని చెప్పారు. నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 సబ్సిడీకి గ్యాస్ సిలెండర్, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యను అందించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెల్ రెసిడెన్షియల్ స్కూల్స్, యువతలో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ యూనివర్శిటి ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతోందన్నారు. రూ.586 కోట్లతో ప్రజా ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టబోతుందని, గోదావరి పుష్కరాలకు ఘాట్‌ల అభివృద్ధి, రహదారులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు డిప్యూటి సిఎం వివరించారు.

మన తెలంగాణ 26 Mar 2026 9:40 pm

కౌన్సిలర్లు అంటే లెక్క లేదా…?

కౌన్సిలర్లు అంటే లెక్క లేదా…? వైరా మున్సిపాలిటీ కమిషనర్ తీరుపై మండిపడ్డ కౌన్సిలర్లువాడి

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:37 pm

Dhammaiguda |పొదల్లో మహిళ మృతదేహం..

Dhammaiguda | పొదల్లో మహిళ మృతదేహం.. Dhammaiguda | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:34 pm

రేపు మద్యం షాపులు బంద్

శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం షాపులు ముసివేయాలని కమిషనర్లు విసి సజ్జనార్, రమేష్, అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, మిలట్రీ క్యాంటీన్లు, క్లబ్బులను మూసివేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మన తెలంగాణ 26 Mar 2026 9:33 pm

‘నాగబంధం’ విడుదల అప్పుడే

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మైథలాజికల్ ఎపిక్ చిత్రం ‘నాగబంధం’. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూలై 3న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. వర్షాకాలం ప్రారంభంలోనే విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. ఈ మేరకు విడుదల తేదీ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రెండు రకాల గెటప్స్‌లో హీరో విరాట్ కర్ణ కనిపిస్తున్నారు. పై భాగంలో శివుడిగా హీరోగా పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక కింది భాగంలో మోడ్రన్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ రెండు లుక్స్‌తో డిజైన్ చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేస్తోంది.

మన తెలంగాణ 26 Mar 2026 9:30 pm

Alireza Tangsiri |ఇజ్రాయెల్ ప్రకటనతో ఉత్కంఠ..

Alireza Tangsiri | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ఇరాన్

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:29 pm

bus accident |ప్రాణాలతో బయటపడిన భార్య

bus accident | ప్రాణాలతో బయటపడిన భార్య bus accident | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:25 pm

Ap Heatwave Alert : తస్మాత్​ జాగ్రత్త Andhra Prabha Latest News

Ap Heatwave Alert : తస్మాత్​ జాగ్రత్త Andhra Prabha Latest News

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:25 pm

Gas cylinder |బస్సులో గ్యాస్ సిలిండర్ లభ్యం.. అనుమానాలు

Gas cylinder | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:24 pm

అన్ని శాఖల సమన్వంతో వెస్ట్ ను బెస్ట్ గా తీర్చిదిద్దాలి…

అన్ని శాఖల సమన్వంతో వెస్ట్ ను బెస్ట్ గా తీర్చిదిద్దాలి… పశ్చిమ నియోజకవర్గం

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:21 pm

మానవ అక్రమ రవాణా కేసులో మాజీ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డికి ఊరట

 కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎంఎల్‌ఎకు ఊరట లభించింది. జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత కుసుమ కుమార్‌లపై ఉన్న కేసుకు సంబంధించి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది ఇరువురిపై ఉన్న కేసును కొట్టివేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఎ1 గా ఉన్న తూర్పు జయప్రకాష్ రెడ్డి, ఎ3గా ఉన్న కుసుమ కుమార్‌ల కేసులో నేరాలు రుజువు కాలేదని పేర్కొన్న కోర్టు వారిని నిర్దోషుషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. జగ్గారెడ్డి, కుసుమ కుమార్ తరఫున న్యాయవాది జి. సంతోష్ రెడ్డి కేసును వాదించారు. జగ్గారెడ్డి ఎంఎల్‌ఎగా ఉన్న సమయంలో 2004 లో మానవ అక్రమ రవాణాకు పాల్ప డినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ నుంచి భార్య, కుమార్తె, కుమారుడి పేరున పాస్ పోర్టు లు పొందారని అప్పట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత అమెరికా వీసా పొంది తన వెంట ఒక మహిళ, యువకుడిని తీసుకెళ్లి ఇండియాకు తిరిగి ఒక్క రే వచ్చినట్లు ఆరోపణలు న్నాయి. ఫేక్ డాక్యుమెంట్లతో ముగ్గురు వ్యక్తులను దేశం దాటించారని. ఈ ప్రక్రియలో ఆర్థికంగా ప్రయోజనం పొందినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో 2018 లో అరెస్టై, ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా కేసును విచారించిన కోర్టు నేరాలు రుజువు కాలేదని కేసును కొట్టి వేస్తూ తీర్పును వెలువరించింది.

మన తెలంగాణ 26 Mar 2026 9:20 pm

హెచ్చరిక బోర్డుల వద్ద సిఐ,ఎస్ఐ

హెచ్చరిక బోర్డుల వద్ద సిఐ,ఎస్ఐ పోలీసుల ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెన్నారావుపేట,ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:13 pm