చెన్నూరులో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్..
చెన్నూరులో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్.. చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
Earth Quake : ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై ఎంతంటే?
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం వణికించింది
ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం..
ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి
శనివారం రాశి ఫలాలు (04-04-2026)
మేషం వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృషభం కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. మిధునం నూతన ఋణాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య ససమ్యలు చికాకు పరుస్తాయి. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కర్కాటకం ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సింహం నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కన్య ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. తుల బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికామౌతుంది. వృశ్చికం చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ధనస్సు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకరం వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. కుంభం ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తికావు. కొన్నిపనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. మీనం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.
Andhra Prabha SPL Story |శాస్త్రవేత్తల పనిని స్వయంగా చేసే కొత్త టెక్నాలజీ..
Andhra Prabha SPL Story | శాస్త్రవేత్తల పనిని స్వయంగా చేసే కొత్త
Andhra Prabha SPL Story |మోడీ గెలుపు తర్వాత కేరళ రాజకీయ సమీకరణాలు..
Andhra Prabha SPL Story | మోడీ గెలుపు తర్వాత కేరళ రాజకీయ
టెక్స్టైల్స్లోనూ అగ్రగామిగా ఎదుగుదాం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కేవలం ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా, ప్రపంచ వస్త్ర రంగంలోనూ అగ్రగామిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రపంచంలో ని ప్రతి దేశంలో తెలంగాణలో తయారైన దుస్తు లే ధరించేలా చే యాలన్నది తమ లక్షమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం హైటెక్స్లో జరిగిన 13వ ఏషియన్ టెక్స్టైల్స్ కా న్ఫరెన్స్ 2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పా ల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ టెక్స్టైల్స్ మన డిఎన్ఏలోనే ఉందన్నారు. తెలంగాణకు వస్త్ర రంగంతో విడదీయలేని అనుబంధం ఉందని సిఎం గుర్తుచేశారు. టెక్స్టైల్స్ అనేది మనకు కేవలం ఒక పరిశ్రమ కాదని, అది మ న జీవనాధారమని ఆయన అన్నారు. నిజాం కాలం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు వస్త్రాలు, ముత్యాల కోసం హైదరాబాద్కు వచ్చేవారన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వంటివి మన సంస్కృతీలో భాగమని ఆయన అన్నారు. రా ష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను సి ఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతూ తెలంగాణను దక్షిణాసి యా టెక్స్టైల్స్ రాజధానిగా తీర్చిదిద్దడం మా ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వరంగల్లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉందని, ఇందులో అనేక అపారెల్ పార్కులు ఉన్నాయని సిఎం తెలిపారు. నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ఇక్కడి పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి పేరుందని ఆయన పేర్కొన్నారు. లండన్, పారిస్, దుబాయ్ వంటి ఫ్యాషన్ నగరాల్లో తెలంగాణలో తయారైన దుస్తులు మెరవాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన చెప్పారు. సినిమా, ఫ్యాషన్, గ్రీన్ టెక్నాలజీ సినిమా రంగానికి అవసరమైన ఫ్యాషన్ అవసరాలను కూడా తెలంగాణ నుంచే తీర్చేలా ప్రోత్సహిస్తామన్నారు. అలాగే, పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ గ్రీన్ టెక్స్టైల్స్ హబ్’లను అభివృద్ధి చేస్తామని, మహిళలకు అధునాతన డిజైనింగ్, స్టిచింగ్లో శిక్షణ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. మీ దగ్గర విజన్ ఉంటే, మేము మీకు సరైన భాగస్వాములమని ఆయన తెలిపారు. భూమి, విద్యుత్, నీరు, వేగవంతమైన అనుమతులతో పాటు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రండి, కలిసి ఒక కొత్త భవిష్యత్ను నిర్మిద్దామని పెట్టుబడిదారులకు సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు, ఆపిల్ ఇయర్ఫాడ్స్ అందిస్తున్న తెలంగాణ ఇప్పుడు ప్రపంచం ధరించే దుస్తులను కూడా అందించే స్థాయికి చేరుకుంటుందని సిఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పత్తిపొలాల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్, ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో తాము అనేక కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఇప్పుడు కేవలం టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా, నెట్ఫ్లిక్స్ వంటి సంస్థల రాకతో హాలీవుడ్ స్థాయికి చేరుతోందని సిఎం అన్నారు. ఇటీవల నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించింద న్నారు. టాలీవుడ్, బాలీవుడ్లు ఇప్పటికే హైదరాబాద్ను తమ కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయని, ఇప్పుడు హాలీవుడ్ కూడా ఇందులో చేరిందని ఆయన తెలిపారు. సినిమారంగం తమ ఫ్యాషన్ను కూడా తెలంగాణ నుంచే పొందేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.
4thApril2026 |శనివారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
4thApril2026 | శనివారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 4thApril2026 |
దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం శుక్రవారం మరింత ప్రజ్వరిల్లింది. ఐదో వా రం దాటిన ఈ దాడుల క్రమంలో ఇరాన్ ఇప్పుడు మధ్యప్రాచ్యంలోని పలు స్థావరాలపై విరుచుకుపడింది. ప్రత్యేకించి అ మెరికా స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై క్షిపణుల దాడులను ఉధృతం చేసింది. కువైట్లోని అత్యంత కీలకమైన మినా అ ల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై జరిగిన దాడులలో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దేశ చమురు ఉత్పత్తిలో ఈ రిఫైనరీ అత్యంత ప్రధానమైనది. రోజువారిగా ఇక్కడ 3,64,000 బ్యారెల్స్ చమురు ఉత్పత్తి అవుతుంది. ఈ కర్మాగారం పనిచేయకపోతే కువైట్లోని వేలాది చమురు బావులలో ఉత్పత్తి అయ్యే ముడిచమురు శుద్ధి నిలిచిపోతుంది. చర్చల అస్పష్టతను పెంచిన తరువాత అమెరికా, ఇజ్రాయెల్ సేనలు సం యుక్తంగా ఇరాన్లోని టెహరాన్ ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులతో విధ్వంసానికి దిగాయి. ఇరాన్లోని అత్యంత కీలకమైన కరాజ్ వంతెన గురువారం నాటి అమెరికా దాడులలో పూర్తిగా దెబ్బతింది, కుప్పకూలింది. ఇరాన్ ప్రధాన సైనిక స్థావరాలను దెబ్బతీశామని అమెరికా అధ్యక్షులు ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ తమ దాడులతో ఏకకాలంలో అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్దేశాలపై శక్తివంతమైన దాడులు కొనసాగించింది. తమ బలాన్ని చాటింది. శుక్రవారం ఉదయం కువైట్లోని అతి పెద్ద మినా అల్ అహ్మదీ రిఫైనరీపై భారీ స్థాయి దాడికి దిగింది. ఈ యుద్ధం దశలో ఇప్పటికే ఈ రిఫైనరీ పలుసార్లు ధ్వంసం అయింది. శుక్రవారం చెలరేగిన మంటలను ఆర్పేందుకు పెద్ద ఎత్తున అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఇరాన్కు చెందిన పలు డ్రోన్లను తాము ధ్వంసం చేసినట్లు సౌదీ భద్రతా వర్గాలు తెలిపాయి. సౌదీలోని అత్యంత కీలకమైన అమెరికా రాడార్ను ఇరాన్ దెబ్బతీసింది. యుఎఇలో భారీ స్థాయిలో రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకున్నారు. ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు అనుక్షణం అప్రమత్తతతో వ్యవహరించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో ఇరాన్లోని కీలకమైన ఇస్ఫహాన్ నగరం మరో సారి దెబ్బతింది. అయితే ఇక్కడ నష్టం వివరాలు తెలియలేదు. ఇరాన్లోని అత్యంత కీలకమైన వంతెనలను , ఇతర నిర్మాణాలను లక్షంగా ఎంచుకుని దాడులు జరుపుతామని అమెరికా హెచ్చరించింది. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని చమురు స్థావరాలతో పాటు పలు పర్యాటక కేంద్రాలను , అక్కడి డ్యాంలను గురిచేసుకుని దాడులు చేస్తామని ప్రకటించింది. ఇరాన్లో అమెరికా ఎఫ్ 35, ఎఫ్ 15 ఫైటర్స్ కూల్చివేత ఎఫ్ 35 ఫైటర్ పైలట్ కిందికి దూకిన దృశ్యాలు ఇరాన్ వాయవ్య ప్రాంతంలో అమెరికా అత్యంత శక్తివంతమైన ఎఫ్ 35, ఎఫ్ 15 యుద్ధ విమానాలతో దాడికి దిగింది. వీటిని తమ సేనలు విజయవంతంగా నేలకూల్చాయని ఇరాన్ తెలిపింది. చాలా దూరం వరకూ శకలాలు పడినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇక ఇక్కడ తమ దాడుల సందర్భంగా యుద్ధ విమాన పైలట్ ప్రత్యేక పారాచూట్తో కిందికి దూకినట్లు ఇరాన్ తెలిపింది. సంబంధిత ఫోటోతో కూడిన వీడియోను ఇరాన్ స్థానిక టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి. అయితే దీనిపై అమెరికా నుంచి ఎటువంటి స్పందనా వెలువడలేదు. దాడి జరిగిన ప్రాంతంలో ఆ తరువాత ఎవరికి అయినా శత్రుదేశ పైలట్ లేదా పైలట్టు కనిపిస్తే సజీవంగా పట్టుకుని తమకు అప్పగించాలని , భారీ నజరానా ఉంటుందని ఇరాన్లోని బాయెర్ అహ్మద్ ప్రాంతపు అధికారులు వీడియో సందేశం వెలువరించారు. పెంటగాన్లోని యుఎస్ సెంట్రల్ కమాండ్ వర్గాలు కానీ వైట్హౌస్ కానీ ఇరాన్ టీవీ ఛానల్ వార్తలపై ఎటువంటి స్పందనకు దిగలేదు. హర్మూజ్పై భద్రతా మండలి కదలిక? హర్మూజ్పై ఇరాన్ ఆధిపత్యం, ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకంపై ఐరాస భద్రతా మండలి సమీక్షిస్తుంది. ఈ దారిని తిరిగి తెరిపించే బాధ్యత తమకు ఉందని అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రకటించారు. ఈ దశలో హర్మూజ్ వేదికగా పోరు తీవ్రతరం అవుతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా మండలి స్పందించింది. ఈ జలమార్గంలో నౌకల సురక్షిత ప్రయాణానికి వీలుకల్పించే తీర్మానం ఆమోదం పొందేలా మండలి సమావేశంలో సభ్యదేశాలు స్పందిస్తాయని వెల్లడైంది. బహరైన్ నుంచి ఈ మేరకు వెలువడ్డ ప్రతిపాదనపై చర్చకు రంగం సిద్ధం అయింది. ఈ మార్గం పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే రక్షణపరంగా కూడా చర్యకు దిగాలని కోరుతూ బహరైన్ ప్రతిపాదిత తీర్మానం నెగ్గితే ఈ మార్గంపై ఇప్పుడున్న పరిస్థితిలో కీలక కదలిక ఏర్పడుతుంది. అయితే బలప్రయోగానికి ఇరాన్ అనుకూలమైన వీటో దేశాలు రష్యా, చైనా తోడుగా ఫ్రాన్స్ కూడా వ్యతిరేకత తెలిపితీరుతాయని, వీటోను ప్రయోగిస్తాయని భావిస్తున్నారు.
ఒప్పుకుంటే చెక్కు.. లేకపోతే హైడ్రాతో చెక్
మన తెలంగాణ/హైదరాబాద్: హైటెక్ సిటీకి కూతవేటు దూ రంలో ఉన్న గోపాల్నగర్ యూఎల్సీ భూములపై భూ రాబందు ల కన్నుపడ్డది. వందల కోట్ల విలువైన ఈ భూములను హస్తగతం చేసుకోవడానికి గత కొన్నిరోజులుగా ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కూకట్పల్లి మండలం హైదర్నగర్ గ్రామ సర్వే నెంబర్ 148 నుంచి 155 వరకు సు మారు 10 ఎకరాల భూమి అప్పట్లో అర్బన్ల్యాండ్ సీలింగ్ కింద ప్రభుత్వం ప్రకటించింది. 1980 దశకంలో గోపాల్నగర్ కో ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ పేరుతో గ్రామ పంచాయతీ లే అవుట్తో ఏర్పడిన కాలనీలో భాగంగా మధ్యలో ఉన్న యూఎల్సీ భూముల్లో సైతం ప్లాట్లుగా చేసి విక్రయించారు. తెలిసో, తెలియకో చాలామంది సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందినవారు, చిరుద్యోగులు స్థలాలను కొనుగోలు చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఈ సొసైటీలోని 130 ప్లాట్లు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కిందికి వస్తాయని పేర్కొంటూ నిర్మాణాలను నిలిపివేశారు. ఇక్కడ ఎలాంటి పనులు చేయకుండా బోర్డులు కూడా ఏర్పాటుచేశారు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి పాట్ల బాధితులు న్యాయపోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు ఉన్నత న్యాయస్థానం బాధితులకు వెసులుబాటు కల్పిస్తూ తీర్పును వెలువరించింది. ప్రభుత్వం దీనిపై అప్పీల్కు వెళ్లకపోవడంతో బాధితులకు కొంత ఊరట కలిగించినట్లయ్యింది. ఎప్పటికైనా ప్రభుత్వం యూఎల్సీ భూములను మార్కెట్ విలువ ప్రకారం తీసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తుందన్న నమ్మకంతో ప్లాట్లలో చిన్నపాటి రూంలు నిర్మించి ఆదీనంలో ఉంచుకుంటూ వస్తున్నారు. అయితే, బాధితుల తరఫున న్యాయపోరాటం పేరుతో మాజీ సొసైటీ అధ్యక్షుడు తమ వద్ద నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. హైరైజ్డ్ బిల్డింగ్ పేరుతో నయా నాటకం ప్రభుత్వ పెద్దలతో తమకు సత్సంబంధాలున్నాయని, యూఎల్సీ వివాదం, ఇతరత్రా ఖర్చులు తాము చేసుకుని హైరెజ్డ్ బిల్డింగ్ల నిర్మాణం చేసుకుంటామని చెప్తూ బాధిత ప్లాట్ల యజమానులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం గత ఏడాదిన్నర కాలంగా జరుగుతున్నది. ప్లాట్ల యజమానులు దీనికి ససేమిరా అనడంతో ప్లాట్ల వివాదాలు సృష్టించడం, వేరేవారితో ఫేక్ అగ్రిమెంట్లతో ప్లాట్లను కబ్జా చేయడానికి యత్నించడం.. వివాదాలు పోలీసుస్టేషన్లకు వెళ్తున్నాయి. దీంతో సహజంగానే ప్లాట్ల యజమానుల్లో భయబ్రాంతులకు గురిచేస్తూ, నిలదీసేవారిపై కేసులు నమోదు చేయడం జరుగుతున్నాయని బాధితులు తెలుపుతున్నారు. కోట్ల విలువైన భూమిని అగ్గువకు కొట్టేసేందుకు యత్నం హైటెక్సిటీ, --కూకట్పల్లి, జేఎన్టీయూ రోడ్డు పక్కనే ఉన్న ఈ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో భూ మాఫియా బలవంతపు ఎంఓయూలకు సిద్ధమైంది. కోట్లాది రూపాయల విలువైన ఈ భూమిలో అభివృద్ధి చేసి హైరెజ్డ్ భవనాలు నిర్మిస్తామని, ఒప్పుకుంటే ప్లాటు ఇస్తామని చెప్పి లక్ష రూపాయలను చెక్కు రూపంలో ఒకరిద్దరు బాధిత ప్లాటు ఓనర్లకు ఇచ్చి ఎంఓయూలు చేసుకున్నారు. వీటిని మిగతా వారందరికి చూపిస్త్తూ ఇస్తే సరే సరి.. లేకుంటే హైడ్రా దిగుతుంది. ప్లాట్లలో పెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమి అని బోర్డు పడుద్దీ అని బెదింపులకు దిగుతున్నారు. మరోవైపు ఆదివారం (ఈ నెల 5) గోపాల్నగర్లో నిర్వహించే సమావేశానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ఎంఓయూలపై సంతకాలు చేసి తాము ఇచ్చే లక్ష రూపాయల చెక్కును తీసుకెళ్లాలని పేర్కొంటూ వాట్సప్లో మెసేజ్లు పెట్టడం గమనార్హం. దశాబ్దాలుగా కాని యూఎల్సీ క్లియరెన్స్లు ఎలా సాధ్యం? వందల కోట్ల విలువైన యూఎల్సీ భూములను కొల్లగొట్టి వేల రూపాయలు సంపాదించే వ్యూహంలో భాగంగా కో ఆపరేటీవ్ సొసైటీ మాజీ అద్యక్షుడిని పావుగా చేసుకుని బడా రియల్ మాఫియా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. నలబై హైదర్నగర్ గ్రామ శివారు సర్వేనెంబర్లు కలిగిన జేఎన్టీయూ సమీపంలోని సాయినగర్, వసంత్నగర్, సీబీసీఐడీ కాలనీ, ఎన్ఆర్ఎస్ఏ కాలనీ, వసంత్నగర్ కాలనీ, భగతసింగ్ నగర్ కాలనీల్లో ఇప్పటికీ యూఎల్సీ భూములంటూ, ప్రభుత్వ భూములంటూ రిజిస్ట్రేషన్లు నిలివేశారు. దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లియరెన్స్లు రాలేదని, ప్రత్యేకంగా గోపాల్నగర్ యూఎల్సీ భూములకు ఎలా క్లియరెన్స్ తెస్తారో చెప్పకుండా తమకు ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయని, స్థానిక ప్రజా ప్రతినిధులు తమకు పూర్తి సహకారం అందిస్తున్నారని నమ్మబలుకుతూ నయా నాటకాన్ని తెరలేపి మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎంఓయూల పేరుతో తమతో సంతకాలు చేయించుకుని తమను ముప్పుతిప్పలు పెట్టి వారు చెప్పిన ధరను తీసుకెని తమ ప్లాట్లు తమకు చెందకుండా చేసే వ్యవహారం చేస్తున్నారని, ఇందులో భాగంగానే గత కొన్ని నెలలుగా అనేక వివాదాలు సృష్టించి తమను కేసుల పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఒక సామాజికవర్గం ప్రజా ప్రతినిధులు తెరవెనుక ఉండి భూ మాఫియా వారితో చేతులు కలిపి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. గోపాల్నగర్ యూఎల్సీ భూములపై వాలుతున్న భూ రాబందుల ఆగడాలను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
మీ గ్యారంటీలకే దిక్కులేదు వాళ్లనొచ్చి చూడమంటారా?
మన తెలంగాణ/హైదరాబాద్: “మీ ఆరు గ్యారంటీలకే దిక్కు లేదు&కేరళం ప్రజలను రాష్ట్రానికి వచ్చి చూడమంటారా?” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కేరళంలో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఆ రు గ్యారెంటీలు అమలు చేశామని, కావాలంటే కేరళ ప్రజలు వచ్చి చూడాలని చెప్ప డం పూర్తిగా అసత్య ప్రచారం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఏ ఒక్క పథకం కూడా సమర్థవంతంగా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. అమలు చేయని పథకాలను అమలు చేసినట్టు చెప్పడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. ఇది సాధారణ అబద్ధం కాదు, ప్రజలను మోసం చేసే ప్రయత్నం అని ఆయన దుయ్యబట్టారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారని, పెన్షన్లు రూ.2,000 నుంచి రూ.4,000 చేస్తామని, దివ్యాంగులకు 3,000 నుంచి రూ.6,000 చేస్తామని హామీ ఇచ్చారని, దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామన్నారని, బిసిలకు లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పారని, రెండు సంవత్సరాల్లో ఒక్క ఏడాది కూడా రూ.20,000 కోట్లు ఇవ్వలేకపోయామని కేరళ ప్రజలకు చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకపోవడం ఒక మోసం అయితే, అమలు చేశామని చెప్పడం మరింత పెద్ద మోసం, తప్పుడు ప్రచారం, అబద్ధాలు చెప్పడం ప్రజలను దగా చేయడమే అవుతుందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పెళ్లయిన ఆడ బిడ్డలకు తులం బంగారం ఎక్కడ? ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కడ? నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? ఈ హామీలన్నీ ఎక్కడికి పోయాయి? అయినా కూడా గ్యారెంటీలు అమలు చేశాం అని కేరళంలో రేవంత్ రెడ్డి చెప్పడం ఎంత పెద్ద మోసమో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ మాటలను నమ్మకండి. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు కేరళం ప్రజలను మోసం చేశాయని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిని అడ్డుకున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అవినీతి మరింత పెరుగుతుందని ఆయన కేరళం ప్రజలను అప్రమత్తం చేశారు. తెలంగాణ నుంచి డబ్బులు పంపుతున్నారనే అనుమానాలు ప్రజల నుంచి వస్తున్నాయన్నారు. కెసిఆర్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా.. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మోసగించినట్లే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మోసగిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కాం విషయంలో తాము పూర్తి స్థాయి దర్యాప్తు కోరుతున్నామని, ప్రభుత్వం కేవలం మేడిగడ్డ, కొన్ని పిల్లర్ల విషయంపై మాత్రమే మాట్లాడుతున్నదన్నారు. మొత్తం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్దేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: వక్ఫ్బోర్డు సీఈఓ, చైర్మన్ల మధ్య సఖ్యత లేకపోవడం తో వక్ఫ్బోర్డు భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. వారిద్దరి మధ్య అంతర్గతంగా వివాదాలు ముదరడంతో వక్ఫ్బోర్డులో జరిగే నిధుల స్వాహాపై చర్యలు చేపట్టడం లేదని, రెండు వర్గాలుగా విడిపోయి తమ వారిని కాపాడుకోవడానికి వారిద్దరూ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. దీంతో వక్ఫ్బోర్డు ఆస్తులన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని ఆ శాఖ ఉద్యోగులు, మైనార్టీలు ఆరోపిస్తున్నారు. సుమారు రెండేళ్లుగా వక్ఫ్బోర్డు సమావేశాన్ని నిర్వహించకపోవడంతో సంబంధిత ఆస్తులు, నిధులు పక్కదారి పడుతున్నాయి. ఆడిటింగ్ లేకపోవడంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వక్ఫ్బోర్డు పరిధిలో ఉన్న దర్గాలకు సంబంధించిన ఆస్తు లు, భక్తుల నుంచి వచ్చే కానుకలు సైతం స్వాహా అవుతున్నాయని దీనిపై విచారణ చే యించాలని మైనార్టీ నాయకులు, ఆ శాఖ ఉ ద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వక్ఫ్బోర్డు పరిధిలో 5 పెద్ద దర్గాలు ఉండగా వాటి ద్వా రా సంవత్సరానికి కోట్ల రూపాయల ఆదా యం వస్తోంది. అయితే ఈ దర్గాల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు దర్గా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇవ్వాల్సి ఉండగా వాటిని కొందరు వక్ఫ్బోర్డు ఉద్యోగులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాన్సువాడలోని దర్గా, మహబూబ్నగర్ పరిధిలోని ఎంఎన్ నర్వ దగ్గర ఉన్న జహంగీర్ పీర్ దర్గా,నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ దగ్గర ఉన్న దర్గ హజరత్ జాన్ పహాడ్, వరంగల్లోని దర్గ హజరత్ అన్నారం షరీఫ్, నాంపల్లిలోని యూసుఫన్ షరీఫ్ దర్గాలు ఉండగా వాటితో పాటు మరికొన్ని చిన్నదర్గాలు ఉన్నాయి. అయితే, ఈ దర్గాల దగ్గర జాతరల సందర్భంగా అభివృద్ధి పనులను చేపట్టే సమయంలో కాంట్రాక్టర్ వేలం పాట ద్వారా పనులను చేపడుతారు. జాతర అనంతరం వచ్చిన డబ్బులను కాంట్రాక్టర్కు చెల్లించి మిగతా డబ్బులను వక్ఫ్బోర్డు ఖాతాలో వేస్తారు. అయితే, కొన్నేళ్లుగా ఈ దర్గాలకు భక్తులు ఇచ్చే కానుకలు, నిధులు స్వాహా అవుతున్నాయని, దీంతో కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు చెల్లించకపోవడంతో వారంతా వక్ఫ్బోర్డు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దర్గాల దగ్గర పనిచేసే కొందరు హుండీలోని డబ్బులను, భక్తులు ఇచ్చే కానుకలను స్వాహా చేస్తున్నారని అందుకే తమకు బిల్లులు చెల్లించడానికి నిధులు లేకుండా పోయాయని ఈ విషయమై వక్ఫ్బోర్డు సీఈఓ, చైర్మన్లకు ఫిర్యాదు చేశామని, అయినా తమకు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. 10వ తరగతి పాస్ కాకున్నా గెజిటెడ్ అధికారిగా పదోన్నతులు దీంతోపాటు వక్ఫ్బోర్డు ప్రధాన కార్యాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు ఒకే సెక్షన్లో 15 ఏళ్లుగా పనిచేస్తున్నారని, మరికొందరికి 10వ తరగతి పాస్ కాకున్నా గెజిటెడ్ అధికారిగా పదోన్నతులు కల్పించారని దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినా వారిపై కనీసం చర్య తీసుకోవడం లేదని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు కొందరు నిరుద్యోగులను డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకొని వారి ఉద్యోగాన్ని పర్మినెంట్ చేశారని, వారికి అర్హత లేకున్నా ఎలా ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటారని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇలా వక్ఫ్బోర్డు పరిధిలో పనిచేసే ఉద్యోగుల పదోన్నతులు, రిక్రూట్మెంట్, నిధుల స్వాహా, భూముల అన్యాక్రాంతంపై అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి, వక్ఫ్బోర్డు అధికారులకు వచ్చినా వాటిపై కనీసం బోర్డు సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెట్రో అధికారులు అద్దెకు అడిగినా ఇవ్వని వక్ఫ్బోర్డు వక్ఫ్బోర్డుకు సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో వేల కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. అయితే, ఈ భూములపైకన్నేసిన కొందరు అక్రమార్కులు వక్ఫ్బోర్డుకు చెందిన కొందరు ఉన్నతాధికారులతో కలిసి తప్పుడు పత్రాలను సృష్టించి ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని, దీనిపై వక్ఫ్బోర్డు ఫిర్యాదు చేయకుండా ప్రేక్షకపాత్ర వహిస్తుందని ఆ శాఖ ఉద్యోగులు, మైనార్టీలు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం వక్ఫ్బోర్డు ప్రధాన కార్యాలయం పక్కన ఉన్న పాత బిల్డింగ్ను నిర్మాణం పేరుతో 15 ఏళ్ల క్రితం దానికి పిల్లర్లు వేసి 7 అంతస్థులు గోడలు లేపినందుకు రూ.60 కోట్ల ఖర్చు చూపించారని, దీనిపై ఆడిటింగ్ నిర్వహించాలని గతంలో ప్రభుత్వం ఆదేశించినా దానిపై ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సగం నిర్మించిన ఈ భవనాన్ని గతంలో మెట్రో అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ కోసం అడిగారని, నెలకు రూ.20లక్షల కిరాయి ఇస్తామన్న దానిని ఇవ్వకుండా అలాగే వదిలేయడంతో నిర్మాణం కోసం వినియోగించిన రూ.60 కోట్ల నిధులు నిరుపయోగంగా మారాయని ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మన తెలంగాణ/గచ్చిబౌలి/ సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి కొండాపూర్లోని క్వాక్ ఎరినా పబ్లో గురువారం అర్ధరాత్రి ఈగల్ టీమ్ దాడులు జరిపింది. డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు ఈగల్ టీం, సైబరాబాద్ నార్కోటిక్, గచ్చిబౌలి పోలీసులు కలిసి పబ్బుపై ఆకస్మికంగా డాడి చేయడంతో డ్రగ్స్ తీసుకున్న ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. పబ్బులో గురువారం బ్లాక్ కాఫీ పేరుతో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించగా, ఇందులో 1,500 మంది పాల్గొన్నారు. పబ్బులో ఉన్న 64 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో ఏడుగురికి పాజిటివ్ వచ్చింది. వా రిలో వ్యాపారులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లున్నారు. ఆ రుగురు హైదరాబాద్కు చెందినవారు కాగా, మ హారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. పాజిటివ్ వచ్చిన వారిలో ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి కుమారుడు కూడా ఉండటం గమనార్హం. పోలీసు ల కథనం ప్రకారం.. డ్రగ్స్పై నిఘా పెట్టిన ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్లో ఉన్న క్వాక్ ఎరినా పబ్లో అంతర్జాతీయ డీజే ప్లేయర్తో బ్లాక్ కాఫీ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈవెంట్పై నిఘా పెట్టిన ఈగల్ పోలీసులు పబ్బులో డ్రగ్స్ ఉపయోగిస్తున్న వారిగురించి తెలుసుకున్నారు. ఆరు బృందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పబ్బులో ఉన్న 64 మందిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి గంజాయి, బెంజోడియాజెపైన్ ఆనవాళ్లు బయటపడగా ముగ్గురికి గంజాయి, మెథాంఫేటమిన్ పాజిటివ్ వచ్చింది. మోనిష్ ఉమేష్, పృథ్వీరాజ్, అభిషేక్, రిషబ్, ఆకెళ్ల హరిత్ సారంగ్ (ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణి కుమారుడు), రితేష్, జ్యోతిరాధిత్యలకు పాజిటివ్ వచ్చింది. వీరిని స్థానికంగా ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి శుక్రవారం ఉదయం పరీక్షలు నిర్వహించారు. అనంతరం పాజిటివ్ వచ్చినవారిపై ఎన్డీపీఎస్ 1985 సెక్షన్ 8 (సీ), 27(ఏ), 27(బీ) కింద కేసు నమోదు చేశారు. పాజిటివ్ వచ్చిన వారిని కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. పబ్బులో సినీ నటి హేమ.. పబ్బులో నిర్వహించిన ఈవెంట్కు సినీనటి హేమ హాజరు కాగా, ఈగల్ పోలీసులు ఆమెకు కూడా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగిటివ్గా వచ్చినట్లు తెలిసింది. స్పెయిన్కు చెందిన ఆర్టిస్టు అలెగ్జాండర్, డీజే ప్లేయర్ కేవీకి నెగిటివ్ వచ్చింది.
ఆరో తరగతి నుంచి త్రిభాషా సూత్రం
న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) 6 వ తరగతి విద్యార్థులకు కొత్తగా మూడు భాషల విధానాన్ని ప్రవేశ పెడుతోంది. అలాగే 9 వ తరగతి విద్యార్థులకు రెండు అంచెల వ్యవస్థతో మేథమెటిక్స్, సైన్సు 202627 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించనుంది. త్రిభాషా సూత్రం ప్రకారం న్యూనేషనల్ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఇపి)కింద ఆరోతరగతి విద్యార్థులకు 2026 నుంచే ప్రారంభిస్తారని అధికార వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. ఈ విధానంలో విద్యార్థులు కనీసం రెండు భారతీయ భాషలు, ఒక విదేశీ భాషను (ఇంగ్లీష్తోసహా )అభ్యసించాలి. ఇందులో ఇంగ్లీష్ను విదేశీ భాషగా పరిగణించి, మిగిలిన రెండు భారతీయ భాషలుగా ఎంచుకునే అవకాశం ఉంది. ఎన్ఇపి ప్రకారం త్రిభాష సూత్రాన్ని ఆర్1,ఆర్2,ఆర్3 దశల వారీగా బోధిస్తారు. 202627కు సంబంధించి ఆరో తరగతికి, 202728లో ఏడో తరగతికి,202829లో ఎనిమిదో తరగతికి, 202930 నాటికి తొమ్మిదో తరగతికి, 203132 నాటికి పదో తరగతికి మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని సిబీఎస్ఈ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆరో తరగతి చదివే వారు మూడు భాషలు చదవాల్సి వస్తుంది. ఇకపై పదో తరగతి వరకు ప్రతిఏటా ఇలాగే ఈ విధానం అమలవుతుంది.ప్రస్తుతం సీబీఎస్ఈలో రెండు భాషల విధానమే అమలవుతున్న సంగతి తెలిసిందే. 2020లో వచ్చిన సూచనలకు అనుగుణంగా ఈ మార్పు సీబీఎస్ఈ తీసుకొచ్చింది.ఈ బహుభాషా విధానం వల్ల భారతీయ భాషలకు ఆదరణ కూడా పెరుగుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ మార్గదర్శకాల ప్రకారం విదేశీ స్కూళ్ల నుంచి ఎవరైతే వస్తారో మూడో భాషగా భారతీయ ప్రాంతీయ భాషలను 8/9 తరగతి వరకు ఎవరైతే చదవలేదో వారికి మినహాయింపు కల్పించారు. వారు హిందీ కానీ లేదా స్కూలు అవకాశం ఇచ్చిన మరే భాషనైనా చదువుకోవలసి ఉంటుంది. వీరంతా ప్రామాణాల ప్రకారం అధ్యయనం చేసి కామన్ 80 మార్కుల మూడు గంటల పరీక్షకు హాజరు కావలసి ఉంటుంది.
హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎసిబి దాడి
హన్మకొండ వడ్డేపల్లిలో ఉన్న జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు అధికారులు అవినీతికి పాల్పడినట్టు గుర్తించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం హన్మకొండలోని సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఉంటున్న నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంలో రూ.24 లక్షల నగదు, కొంత బంగారం, రూ.30 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ కాగితాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే ఖమ్మంలోని సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఇంట్లోనూ ఎసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రూ.42 లక్షల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారని తెలిసి కొందరు ముఖ్యమైన డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. ఈ అవినీతి డాక్యుమెంట్ రైటర్ల భరతం పట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కరీంనగర్లో కన్నతండ్రి కిరాతకం
కన్నబిడ్డలకు రక్షణగా ఉండాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆడపిల్లలు పుట్టారని గొడవల నేపథ్యంలో ఇద్దరు కవల కుమార్తెలను తండ్రి బావిలో ముంచి చంపడం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీనగర్కు చెందిన కచ్చు శ్రీశైలంకు ఆరేళ్ల క్రితం మానకొండూరు మండలం లక్ష్మీపూర్కు చెందిన మౌనికతో వివాహమైంది. వీరికి గీతాంశీ, గీతాన్విక (4) అనే ఇద్దరు కవలు జన్మించారు. అయితే, కొంతకాలంగా ఆడపిల్లలు పుట్టారనే కారణంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం శ్రీశైలం తన ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకొని పొలానికి వెళ్లాడు. పొలానికి తీసుకువెళ్లిన పిల్లలను శ్రీశైలం కావాలనే బావిలో ముంచి చంపినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బావిలో గాలించగా గీతాంశీ మృతదేహం నీటిపై తేలింది. కాగా, మరో కుమార్తె గీతాన్విక ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు బావిలో, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ విజయ్కుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. నిందితుడు శ్రీశైలంను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో జూబ్లీనగర్లో ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉన్నందున, శాంతిభద్రతల దృష్ట్యా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ‘కుటుంబ గొడవల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు, గీతాన్విక ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది’ అని కరీంనగర్ రూరల్ సీఐ తెలిపారు.
మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు తమ కూంబింగ్ను కొనసాగిస్తూనే ఉన్నాయి. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కింద చేపట్టిన మిషన్ -2026 ముగిసినప్పటికీ భద్రతా బలగాలు అడవిలో ఉన్న మిగిలిన నక్సల్స్ కోసం వేటను ముమ్మరం చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారం మేరకు నక్సల్స్ డంప్లను స్వాధీనం చేసుకునే పనుల్లో బలగాలు నిమగ్నమయ్యాయి. బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్ద జోజెర్, లేండ్రా అటవీ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టులకు చెందిన రెండు భారీ డంప్లను సీఆర్పీఎఫ్ 85 బెటాలియన్ బృందం స్వాధీనం చేసుకున్నది. స్వాధీనం చేసుకున్న వాటిలో 303 రైఫిల్, స్టెన్గన్, బీజీఎల్ రౌండ్స్, డెటోనేటర్స్, జిలెటిన్ స్టిక్స్, వైర్, మావోయిస్టు సామగ్రి తయారుచేయడానికి ఉపయోగించే వస్తువులున్నాయి. బస్తర్లో మిగిలిన మావోయిస్టుల కోసం కూంబింగ్ ముమ్మరం చేసినట్టు ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ఆయుధాలు వీడి వస్తే మంచిదన్నారు.ఓ పక్క మిగిలిన మావోయిస్టులను వేటాడుతూనే, ఇంకో పక్క పోలీసులు నక్సల్స్ లొంగుబాటు ప్రయత్నాలు చేస్తున్నారు.
పొరుగున ఉన్న పాకిస్థాన్లో గల్ఫ్ యుద్ధ ప్రభావం తీవ్రస్థాయికి చేరింది. అక్కడి ప్రభుత్వం ఇప్పుడు పెట్రోలు అసాధారణ , విపరీత స్థాయిలో పెంచింది. పెట్రోలు ధరలలో లీటరుకు 43 శాతం, హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డి) ధరలలో 55 శాతం పెరుగుదలను ప్రకటించింది.గ్లోబల్ చమురు ఇంధన ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగే ధరలతో పెట్రోలు ధర లీటరుకు ఇప్పుడు 458.41 పైసలు చేరుతుంది. ఇంతకు ముందు ఇది రూ 327.17 గా ఉంది, ఇప్పుడు పెరిగిన రేటు లీటరుకు రూ 137 .23 పైసలు ఇక హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్కు రూ 184.49 పెంచారు. దీనితో ఇంతకు ముందు వరకూ ఉన్న లీటరు 335 ధర ఇప్పుడు లీటరుకు రూ 520 దాటుతుంది. ఇక సామాన్యుడికి అత్యవసరం అయిన కిరోసిన్ ధర లీటర్కు రూ 457 దాటింది. ఇది అత్యంత కష్టమైన నిర్ణయం అని, అయితే ఇప్పటి పరిస్థితుల్లో అనివార్యం అని దేశ పెట్రోలియం మంత్రి అలీ పర్వేయిజ్ మాలిక్ తెలిపారు. ఇంధన సంక్షోభంతో బంగ్లాదేశ్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకే కార్యాలయాలు మూసివేయాలని, ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశిస్తూ నిర్ణయాలు వెలువరించారు. దుకాణాలు, షాపింగ్ మాల్స్ను సాయంత్రం ఆరుగంటలకు మూసివేయాలి. బ్యాంకులను మధ్యాహ్నం మూడు గంటలకు బంద్ చేయాల్సి ఉంటుంది. అక్కడి కొత్త ప్రభుత్వానికి ఇప్పటి గల్ఫ్ యుద్ధం స్థితిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఏ దేశం సాయం తీసుకోవాలనే విషయంపై అధికారిక నిర్ణయాలకు సమయం పడుతోంది. ఈ దిశలోనే భారత్ నుంచి కొంత మేర ఇంధన సాయం తీసుకుంది.
Biker Is A Bumper Blockbuster: Sharwa
Charming Star Sharwa is basking in the overwhelming response to his sports-drama Biker, which hit theatres today. The team celebrated the film’s success soon after the release. Director Abhilash Reddy said that watching the film on the big screen was an incredibly joyful experience. “Everyone is praising the last 40 minutes. The mountain jump has […] The post Biker Is A Bumper Blockbuster: Sharwa appeared first on Telugu360 .
యుద్ధనౌక తారగిరిని ప్రారంభించిన రాజ్నాథ్
సముద్ర వాణిజ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా వాణిజ్య నౌకలను సమకూర్చుకోవడంలో భారత నేవీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ప్రశంసించారు. సంక్లిష్ట సమయాల్లో నేవీ ముందుంటుందని పేర్కొన్నారు. దేశ వాణిజ్యం లోని 95 శాతం రవాణా సముద్ర మార్గం నౌకల ద్వారా సాగుతోందన్నారు. ఆత్మనిర్భర్కు ప్రతీకగా స్వదేశీయంగా తయారైన యుద్ధనౌక ఐఎన్ఎస్ తారగిరిని ఆయన శుక్రవారం ప్రారంభించారు. పర్షియా జలసంధి యైనా, లేదా మలక్కా జలసంధి అయినా హిందూ మహాసముద్రంలో భారత నేవీ నిరంతరం నిర్వహణలోనే ఉంటుందని పేర్కొన్నారు. ఐఎన్ఎస్ తారగిరిని ప్రారంభించడం నేవీ శక్తిసామర్థాలను, విలువలు, అంకిత భావాన్ని మరింత పెంచుతాయన్నారు. ప్రాజెక్టు 17ఎ తరగతిలో నిర్మించిన నాలుగో స్టెల్త్ యుద్ధనౌక తారగిరి 6670 టన్నుల బరువుతో ఉంటుంది. ముంబైకు చెందిన మజగాన్ డాక్ షిప్యార్డ్ నిర్మించిన ఈ యుద్ధనౌకలో బ్రహ్మోస్ క్షిపణులు వంటివి అమర్చడమైంది. కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేసే ఈ యుద్ధనౌక బహుళ రకాల సముద్ర కార్యకలాసాలను నిర్వహించగలదు. ఐఎన్ఎస్ తారగిరి చేరికతో హిందూ పసిఫిక్ ప్రాంతంలో కీలకమైన నౌకాశక్తిగా భారత్ స్థానం మరింత పటిష్ఠం కానుంది.
’శంబాల’ చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ను అందుకున్నారు హీరో ఆది సాయి కుమార్. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన నెక్స్ ప్రాజెక్ట్ను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ’కె-ర్యాంప్’ సంచలన విజయంతో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా హాస్య మూవీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కృష్ణకాంత్ పరుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ సరసన బంధవి శ్రీధర్ కథానాయికగా నటిస్తున్నారు. ’సైరాబాను’ అనే ఆసక్తికరమైన టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని, ఆకట్టుకునే పోస్టర్ ద్వారా ఆవిష్కరించారు. ఫణి కృష్ణ సిరికి... రాజమండ్రి, హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథనంతో, హాస్యం మేళవించి ఒక ప్రత్యేకమైన హిందూ-, ముస్లిం ప్రేమకథను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ను శుక్రవారం పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో కిరణ్ అబ్బవరం క్లాప్ కొట్టారు. దర్శకుడు రామ్ అబ్బరాజు, సాయి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోన వెంకట్, కే రాంప్ డైరెక్టర్ నాని మేకర్స్కి స్క్రిప్ట్ అందించారు. తొలి సన్నివేశానికి దర్శకుడు యోగి గౌరవ దర్శకత్వం వహించారు.
దూసుకువచ్చిన ఇరాన్ ఆయుధ శకలాలు..అబూధాబిలో గాయపడ్డ భారతీయులు
అబూధాబిలో శుక్రవారం ఇరాన్ జరిపిన దాడుల క్రమంలో ఐదుగురు భారతీయులు స్వల్పంగా గాయపడ్డారు. ఇరాన్ క్షిపణులను అరబ్ ఎమిరేట్స్ బలగాలు అడ్డుకుని , దెబ్బతీశాయి.ఈ దశలో ఈ శకలాల ధాటికి మొత్తం 12 మంది గాయపడ్డారని , వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారని అబూధాబి మీడియా కార్యాలయం తెలిపింది. అబూధాబిలోని అజ్బాన్ ప్రాంతంలో ఈ శకలాలు చెల్లాచెదరుగా వచ్చిపడ్డాయి. వివిధ వృత్తులలో ఉన్నపౌరులు గాయపడగా వీరిలో మిగిలిన వారు నేపాలీలు అని అధికారులు తెలిపారు. ఒక నేపాలీకి తీవ్రగాయాలు అయినట్లు వెల్లడైంది. ఇరాన్ దాడులలో అబూధాబిలో పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున మంటలు కమ్ముకున్నాయి.
Photos : Rakasa Movie Success Celebrations
The post Photos : Rakasa Movie Success Celebrations appeared first on Telugu360 .
13న కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి..?
మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న జీవన్ రెడ్డి బిఆర్ఎస్లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఆ రోజు మంచి ముహూర్తం ఉండటంతో గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 6న అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే కెటిఆర్.. జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలిసింది.
Photos : Biker Movie Success Celebrations
The post Photos : Biker Movie Success Celebrations appeared first on Telugu360 .
రెండు రోజుల పాటు మీసేవా సేవలు బంద్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవా కేంద్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి రెండు రోజులపాటు సేవలు నిలిచిపోనున్నాయి. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. తిరిగి సోమవారం ఉదయం నుంచి యథావిధిగా మీసేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
1 Lakh Iran Human Shield : అదే బసిజ్ Andhra Prabha SPL Story
1 Lakh Iran Human Shield : అదే బసిజ్ Andhra Prabha
Video : Hero Adivi Sesh Exclusive Interview
The post Video : Hero Adivi Sesh Exclusive Interview appeared first on Telugu360 .
సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు విడ్డూరం: కల్వకుంట్ల కవిత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ను ఆగం చేసేలా ఉన్నారని కవిత విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, అమరావతి గురించి తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. మద్యం కేసు కొట్టి వేశారంటేనే ప్రకృతి తమకు సహకరిస్తుందని అన్నారు. అదృష్టవంతులను ఎవరూ ఆపలేరని, తమ ఎజెండా ప్రకటించాక చాలా మంది పార్టీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది విదేశాల్లో ఉన్నవారని, ఇతరులు పార్టీలో చేరుతామని అంటున్నారని పేర్కొన్నారు. పార్టీ తరపున క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని, శ్రమనే నమ్ముకుని ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు. ఆరు గ్యారంటీల గురించి కేరళంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. మహారాష్ట్ర, బీహార్లో కూడా ఇలాగే చెప్పారని, కాంగ్రెస్ను ప్రజలు ఓడించారని గుర్తు చేశారు.
డ్రగ్స్ రవాణా చేస్తున్న నైజీరియన్ మహిళ అరెస్టు
ముంబాయి నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తున్న నైజీరియాకు చెందిన మహిళను ఎక్సైజ్ డిటిఎఫ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి రూ.2.35 లక్షల విలువైన 7.5 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...నైజీరియా దేశానికి చెందిన జేమ్స్ టెస్లింగ్ యామ్యూనల్ ముంబాయిలో ఉంటోంది. దేశంలోని పలు నగరాలకు కొకైన్ డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకుని బయలు దేరినట్లు ఎక్సైజ్ డిటిఎఫ్ సిఐ సౌజన్య, ఎస్సై శికృష్ణకు తెలిసింది. దీంతో వీరు తమ సిబ్బందితో కలిసి జేమ్స్ టెస్లింగ్ కోసం సికింద్రాబాద్లోని సన్షైన్ ఆస్పత్రి సమీపంలో వేచి ఉన్నారు. ముంబాయి నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చిన టెస్లింగ్ ఆటోలో ఆస్పత్రి వద్దకు రాగానే ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆమె వద్ద ఉన్న 7.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబాయిలో గ్రాముకు రూ.15,000 చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్కు తీసుకుని వచ్చి రూ.30వేలకు విక్రయిస్తోంది. నిందితురాలిని అరెస్టు చేసిన ఎక్సైజ్ సిబ్బంది కేసు దర్యాప్తు కోసం సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. సిఐ సౌజన్య, ఎస్సై శివకృష్ణ, కానిస్టేబుళ్లు రాజు, రవి, శిల్ప కలిసి పట్టుకున్నారు.
పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే మీరా మాకు నీతులు చెప్పేది..?: సిఎం విజయన్
సొంత రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే వ్యక్తి, సామాజిక పురోగతి గురించి కేరళకు పాఠాలు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని తెలంగాణ సిఎం రేవంత్రెడ్డిని ఉద్దేశిస్తూ కేరళ సిఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. ఇటీవల కేరళలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర సర్కారుపై సిఎం రేవంత్రెడ్డి చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలపై కేరళ సిఎం పినరయి విజయన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కేరళలో అవినీతి, దుష్పరిపాలన ఉందని ఆరోపించే ముందు రేవంత్ రెడ్డి అధికారిక గణాంకాలను పరిశీలించాలని పినరయి విజయన్ సూచించారు. దేశంలోనే అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ అని ఆయనకు తెలియదా..? అని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ ఎస్డీజీ ఇండెక్స్ (2023 -24)లో కేరళ 79 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంటే, తెలంగాణ ఆరో స్థానంలో ఉందని అన్నారు. మీ రాష్ట్రంలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి కేరళను కించపరచడం చాలా విచారకరం అంటూ రేవంత్రెడ్డిని ఉద్దేశిస్తూ విజయన్ వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారమే కేరళలో పేదరికపు రేటు కేవలం 0.55 శాతం అని, ఇది దేశంలోనే అత్యల్పమని గుర్తుచేశారు. 2025 చివరి నాటికి తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలవబోతోందని తెలిపారు. అదే సమయంలో తెలంగాణలో పేదరికం 5.88 శాతంగా ఉందని, అక్కడి నిరుపేదలను ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదా..? అని ప్రశ్నించారు. కేరళలో అక్షరాస్యత 95.3 శాతం ఉండగా, తెలంగాణలో 76.9 శాతం వద్దే ఆగిపోయిందని పేర్కొన్నారు. కేరళలో శిశు మరణాల రేటు (ఐఎంఆర్) కేవలం 5గా ఉందని, ఇది అమెరికా (5.6) కన్నా మెరుగని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో ఈ రేటు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వ పాలనా నమూనాను రేవంత్ రెడ్డి విమర్శించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కేరళ సాధిస్తున్న సుస్థిర, సమ్మిళిత అభివృద్ధిని దెబ్బతీయాలనుకునే వారికి రేవంత్ రెడ్డి ఒక గొంతుకగా మారారని ఆరోపించారు. కేరళ, కేంద్ర ప్రభుత్వాల మధ్య లాలూచీ ఉందని రేవంత్ చేసిన ఆరోపణను విజయన్ కొట్టిపారేశారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు పదేపదే ఆలస్యం చేసే ప్రభుత్వం నడుపుతున్న ముఖ్యమంత్రి, కేరళకు నేర్పడానికి ఏమీ లేదని అన్నారు. పాలన, ప్రజా సంక్షేమం గురించి నిజమైన పాఠాలు నేర్చుకోవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రిని కేరళకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని పినరయి విజయన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ మళ్లింపులు.. ఆదివారం వన్ వే ట్రయల్ రన్ #HyderabadTraffic #KBRPark
Minister Nimmala Ramanaidu Warns Irrigation Officials
Andhra Pradesh Irrigation Minister Nimmala Ramanaidu has expressed strong displeasure over delays in the preparation of estimates for canal maintenance works. During a video conference with senior officials, including Engineer-in-Chief Narasimha Murthy and chief engineers across the state, the minister made it clear that negligence will not be tolerated. He questioned why estimates for works […] The post Minister Nimmala Ramanaidu Warns Irrigation Officials appeared first on Telugu360 .
మళ్లీ నిరాశ పరిచిన సంజూ.. పవర్ప్లేలో చెన్నై స్కోర్ ఎంతంటే..
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సిఎస్కె ఆటగాడు సంజూ శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో సిఎస్కె తొలుత బ్యాటింగ్కి దిగింది. అయితే బ్రాట్లెట్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి సంజూ(7) ప్రభ్సిమ్రాన్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చి ఆయుశ్ మాత్రే మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. దీంతో పవర్ప్లే ముగిసేసరికి చెన్నై 1 వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 1 వికెట్ కోల్పోయి.. 71 పరుగులు చేసింది. క్రీజ్లో మాత్రే(43), రుతురాజ్ గైక్వాడ్ (14) ఉన్నారు.
ఇరాన్లో అమెరికా ఎఫ్ 35, ఎఫ్ 15 ఫైటర్స్ కూల్చివేత
ఇరాన్ వాయవ్య ప్రాంతంలో అమెరికా అత్యంత శక్తివంతమైన ఎఫ్ 35, ఎఫ్ 15 యుద్ధ విమానాలతో దాడికి దిగింది. వీటిని తమ సేనలు విజయవంతంగా నేలకూల్చాయని ఇరాన్ తెలిపింది. చాలా దూరం వరకూ శకలాలు పడినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇక ఇక్కడ తమ దాడుల సందర్భంగా యుద్ధ విమాన పైలట్ ప్రత్యేక పారాచూట్తో కిందికి దూకినట్లు ఇరాన్ తెలిపింది. సంబంధిత ఫోటోతో కూడిన వీడియోను ఇరాన్ స్థానిక టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి. అయితే దీనిపై అమెరికా నుంచి ఎటువంటి స్పందనా వెలువడలేదు. దాడి జరిగిన ప్రాంతంలో ఆ తరువాత ఎవరికి అయినా శత్రుదేశ పైలట్ లేదా పైలట్టు కనిపిస్తే సజీవంగా పట్టుకుని తమకు అప్పగించాలని , భారీ నజరానా ఉంటుందని ఇరాన్లోని బాయెర్ అహ్మద్ ప్రాంతపు అధికారులు వీడియో సందేశం వెలువరించారు. పెంటగాన్లోని యుఎస్ సెంట్రల్ కమాండ్ వర్గాలు కానీ వైట్హౌస్ కానీ ఇరాన్ టీవీ ఛానల్ వార్తలపై ఎటువంటి స్పందనకు దిగలేదు.
టూత్పేస్ట్నూ కూడా కల్తీ....ఢిల్లీలో నకిలీ ముఠా బట్టబయలు #FakeProducts #ToothpasteScam #DelhiCrime
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో డికె అరుణ భేటీ
మహబూబ్ నగర్ ఖేల్ సంసద్ మహోత్సవ్ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలంటూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపి డికె అరుణ ఆహ్వానించారు. లోక్భవన్లో గవర్నర్తో శుక్రవారం ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే క్రీడా మహోత్సవం గురించి గవర్నర్కు వివరించారు. 24వ తేదీన మహబూబ్ నగ ర్ వేదికగా జరిగే ముగింపు వేడుకకు హాజరవుతానని గవర్నర్ సానుకూలంగా స్పందించారు.
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లో చెన్నై చిత్తుగా ఓడింది. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించి సీజన్లో గెలుపు ఖాతా తెరవాలని చెన్నై భావిస్తోంది. ఇక గుజరాత్పై ఘన విజయం సాధించిన పంజాబ్.. అదే విక్టరీ జోష్తో ఈ మ్యాచ్ బరిలో దిగుతుంది. ఈ మ్యాచ్లో చెన్నై మార్పు చేసింది. మాట్ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్ని జట్టులోకి తీసుకుంది. పంజాబ్ మాత్రం అదే జట్టుతో బరిలోకి దిగుతుంది. తుది జట్లు: సిఎస్కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబె, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్. పిబికెఎస్: ప్రబ్సిమ్రన్ సింగ్(కీపర్), కూపర్ కోన్లీ, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, నేహల్ వాదీరా, మార్కస్ స్టోయినస్, మార్కో యాన్సన్, జేవియర్ బ్రాట్లెట్, విజయ్ కుమార్ వైశ్యక్, అర్ష్దీప్ సింగ్, యుజవేంద్ర చాహల్.
కెసిఆర్ తరహాలోనే రేవంత్ ప్రజల్ని మోసం చేస్తున్నారు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేరళ ఎన్నికల ప్రచారంలో సిఎం రేవంత్ రెడ్డి బిజెపిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిలో ఎన్ని అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏం చేశారని, కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కెసిఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. బిసిలకు అన్యాయం చేశామని అంటున్నారు.. బిసిలకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగించింది కాంగ్రెస్ పార్టీయేనని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీల అమలు చేసినట్లు కేరళలో గొప్పలు పలుకుతున్న రేవంత్.. భవిష్యత్తులో తెలంగాణలోనూ అదే తరహా మాటలు చెప్పే ప్రమాదముందని అన్నారు.
పార్టీకి వివరణ ఇచ్చిన అరవిందబాబు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్బాబు వివరణ ఇచ్చారు
తమిళనాడు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు వీరే.. బరిలో తమిళసై
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక పార్టీ తర్వాత మరొక పాటు ఆ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయి. సినీ నటుడు విజయ్ కూడా పార్టీ పెట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ తమిళనాడులో మొత్తం 27 స్థానాల్లో పోటీ చేస్తోంది. తాజాగా ఆ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈసారి పోటీలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బిజెపి తరఫున పోటీలో దిగుతున్నారు. మైలాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తారు. వనతి శ్రీనివాసన్ కోయంబత్తూర్(నార్త్) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. బిజేపి చీఫ్ నైనార్ నాగేంద్రన్ అవనాశి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.
గన్నవరంలో సి-డాక్ కేంద్రం ఏర్పాటుకు వేగం
గన్నవరంలో సి-డాక్ కేంద్రం ఏర్పాటుకు వేగం గన్నవరం, ఆంధ్రప్రభ: గన్నవరం నియోజకవర్గాన్ని సమగ్రంగా
అంబులెన్స్ లోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రానికి
Renuka Choudhary : కుక్కను, కులాన్ని కొంగును కట్టుకుని తిరుగుతున్నావేంటమ్మా?
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నిత్యం వివాదాల్లో చిక్కుకుంటారు
నూతన బోర్వెల్ ను పరిశీలించిన చైర్మన్ సర్పంచ్ లు
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కృషితో
TG | యువకుడి గొంతు కోసిన భర్త TG | ఆంధ్రప్రభ, వెబ్
చేంగల్ లో భక్తి శ్రద్ధలతో గుడ్ఫ్రైడే వేడుకలు
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : ప్రజలందరిలో వసుదైక కుటుంబం అనే భావన వెల్లి
ఉరుసు రంగ సముద్రం బండ్ కు శంకుస్థాపన
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ ఉరుసు రంగసముద్రం బండ్ కు రాష్ట్ర
Petrol Prices : లీటర్ పెట్రోలు 459 రూపాయలు ఎక్కడంటే?
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి
చెన్నూరులో బహుజనమహనీయులకు ఘన నివాళి
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ
కొండగల్ లో హరీశ్ రావు రేవంత్ పై సెటైర్లు
కొడంగల్లో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటించారు
చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రత్యేక అధికారి ఎంఈవో
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్గల్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్
సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన వసతులపై దృష్టి పెట్టాలి..
సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన వసతులపై దృష్టి పెట్టాలి.. ఎస్సీ, బీసీ హాస్టళ్ల పనితీరును
Gold Rates Today : గోల్డ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్
మరోసారి భారీగా బంగారం ధరలు పెరిగాయి
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ఓర్సు చేరాలు గత కొద్దిరోజులుగా
ఉట్నూర్ ఏజెన్సీలో సబ్ కలెక్టర్ల క్షేత్ర పర్యటన
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలో రెండు రోజుల క్షేత్ర
ఇంకెన్నాళ్లు ఈ ఇబ్బందులు రాజాపేట, ఆంధ్రప్రభ : రాజాపేటకు వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు..నానాటికి
AP |రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం..
AP | రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం.. కోసిగి. ఆంధ్రప్రభ : మండల
చిన్నారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘన నివాళి
చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం వంగాలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు
Telangana |సుమారు 46.85 కిలోలు స్వాధీనం..
Telangana | సుమారు 46.85 కిలోలు స్వాధీనం.. Telangana | -పోలీసుల అప్రమత్తతతో
టెస్కో ఆర్డర్ల రద్దు చేనేత కార్మికులపై ప్రభావం
టెస్కో ఆర్డర్ల రద్దు చేనేత కార్మికులపై ప్రభావం కరీమాబాద్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం
రైతాంగ పోరాటంలో కొమరయ్య కీలక పాత్ర
రైతాంగ పోరాటంలో కొమరయ్య కీలక పాత్ర సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ
పదవులు పార్టీకి అలంకారప్రాయాలు..
పదవులు పార్టీకి అలంకారప్రాయాలు.. పాయకాపురం, ఆంధ్ర ప్రభ : పదవులు పార్టీకి అలంకారప్రాయాలని
రెండు గంటల్లోనే చైన్ స్నాచింగ్ నిందితుల అరెస్ట్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల ఆందోళన #Kondagattu #AnjaneyaSwamyTemple #DevoteesIssue
తెలంగాణలో బిజెపికి స్థానం లేదు: మహేష్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వేరుకుంపటితో బిఆర్ఎస్ రోడ్డున పడిందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిఆర్ఎస్ గురించి చెప్పాల్సింది ఏమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని, మాజీ సిఎం కెసిఆర్ ఫామ్ హౌజ్ కు పరిమితం అయ్యారని విమర్శించారు. ఎన్నికలు వస్తే దేవుళ్ల పేరు చెప్పడం బిజెపికి అలవాటని, తెలంగాణలో బిజెపికి స్థానం లేదని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు 100 సీట్లు వస్తాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఎండల నుంచి రిలీఫ్.. రానున్న మూడు రోజులు వర్షాలు
హైదరాబాద్: మండిపోతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడతాయని.. రేపు (శనివారం) ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆరు గ్యారెంటీలు అమలు చేశామని బడాయిలు చెబుతున్నారు: హరీశ్
నాగర్కర్నూల్: ఎస్టి కార్పొరేషన్ ద్వారా గత బిఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్లు ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని తిమ్మారెడ్డిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్కు రూ.100 కోట్లు ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఎస్టిల ఓట్లు కావాలిగానీ, వాళ్ల సంక్షేమం పట్టించుకోరా? అని ప్రశ్నించారు. కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని బడాయి మాటలు చెబుతున్నారని విమర్శించారు.
రాష్ట్ర రాజధాని అమరావతి.. సంబరాలు నిర్వహిస్తున్న టీడీపీ అధ్యక్షుడు రవికుమార్.టీడీపీ కార్యాలయంలో సంబరాలు.
Andhra Prabha Smart Edition |TS|రెండో విడతకు/హాయ్ అంటే.
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 03-04-2026, 4.00PM ts సాగుకు భరోసా.. రెండో
software2field |సాఫ్ట్వేర్ నుంచి సాగు వైపు.. యువత ఊళ్ళబాట
software2field |సాఫ్ట్వేర్ నుంచి సాగు వైపు.. యువత ఊళ్ళబాట software2field | ఐటీ
డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా చింతల శ్రీనివాస్
చెన్నూరు, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గా
ఆకట్టుకున్న ఏసుక్రీస్తు సిలువ వేసే సన్నివేశం
ఖమ్మం కల్చరల్, ఆంధ్రప్రభ ; ప్రజలందరిలో వసుదైక కుటుంబం అనే భావన వెల్లి
Vijay |నామినేషన్ చెల్లుబాటుపై సందేహాలు
Vijay | నామినేషన్ చెల్లుబాటుపై సందేహాలు Vijay | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Gas Supply |ఉత్పత్తి పెంపునకు కేంద్రం చర్యలు
Gas Supply | ఉత్పత్తి పెంపునకు కేంద్రం చర్యలు Gas Supply |
సీఎం పర్యటన ఏర్పాట్లపై పర్యవేక్షణ
బాసర (నిర్మల్ జిల్లా): ఈ నెల 6న, సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.
Dhurandhar is a Wakeup Call for Hindi Cinema
Dhurandhar is a massive hit and the film has been rewriting new records in Indian cinema. Aditya Dhar is appreciated as he released two parts in three months. Several filmmakers have been taking years for the sequel release while Aditya Dhar completed the shoot at a single stretch. Several spy films that released in Bollywood […] The post Dhurandhar is a Wakeup Call for Hindi Cinema appeared first on Telugu360 .
move2forward |నభా… కమ్బ్యాక్తో రేంజ్ మారుతుందా?
move2forward | నభా… కమ్బ్యాక్తో రేంజ్ మారుతుందా? move2forward | అడ్డంకుల మధ్య
గజవాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం
బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలలో
‘జెట్లీ’ నుంచి వీడియో సాంగ్ విడుదల.. సత్య డ్యాన్స్ ఇరగదీశాడు..
హైదరాబాద్: కామెడియన్ సత్యని హీరోగా పరిచయం చేస్తూ.. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జెట్లీ’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమా చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పలు మేకింగ్ వీడియోలను విడుదల చేసి అంచనాలను పెంచేశారు తాజా ఈ సినిమా నుంచి ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ అంటూ సాగే ఓ పాటని విడుదల చేశారు. ఈ పాటకి కాల భైరవ సంగీతం అందించగా.. సాయి సోమయాజులు సాహిత్యం అందించారు. శ్రావణ భార్గవి ఈ పాట పాడారు. ఈ పాటలో హీరోయిన్ రియా సింగ్తో కలిసి సత్య డ్యాన్స్ ఇరగదీశాడు. విజయ్ పొలాకి ఈ పాటకి కొరియోగ్రాఫీ అందించారు ప్రస్తుతం ఈ పాట సోషల్మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ సినిమాను చిరంజీవి(చెర్రీ), హేమలత నిర్మిస్తున్నారు. ఈ వేసవిలోనే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.
వైభవంగా స్వామి వారి నిత్య కళ్యాణం
ఆంధ్రప్రభ ప్రతినిధి, యాదాద్రి ; భువనగిరి పట్టణ కేంద్రంలోని స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో శుక్రవారం
యేసుక్రీస్తు త్యాగాన్ని మనుష్యులు మరచిపోకూడదు…
యేసుక్రీస్తు త్యాగాన్ని మనుష్యులు మరచిపోకూడదు… గుడ్ ఫ్రైడే సందర్భంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొండా
గుడివాడ పురవీధులలో సాగిన సిలువ యాత్ర..
గుడివాడ పురవీధులలో సాగిన సిలువ యాత్ర.. గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పురవీధులలో
Jeevan Reddy |రేవంత్ పోవాలనే పరిస్థితి వచ్చింది
Jeevan Reddy | రేవంత్ పోవాలనే పరిస్థితి వచ్చింది Jeevan Reddy |
yadagirigutta |నారసింహుని సేవలో ఎమ్మెల్యే కుంభం దంపతులు
yadagirigutta | నారసింహుని సేవలో ఎమ్మెల్యే కుంభం దంపతులు yadagirigutta | ప్రముఖ
సింహగిరిపై అప్పన్న కళ్యాణ మహోత్సవాలు
సింహగిరిపై అప్పన్న కళ్యాణ మహోత్సవాలు భక్తులను బందీలను చేసి విచారించిన వైనంఉంగరం తీసుకొస్తేనే
ପଶ୍ଚିମବଙ୍ଗର ମାଲଦାରେ ନ୍ୟାୟିକ ଅଧିକାରୀମାନଙ୍କୁ ୯ ଘଣ୍ଟା ଧରି ବନ୍ଦୀ କରି ରଖାଯିବା ଘଟଣାରେ ସୁପ୍ରିମକୋର୍ଟ ପଶ୍ଚିମବଙ୍ଗ ସରକାରଙ୍କୁ ତୀବ୍ର ଭର୍ତ୍ସନା କରିଛନ୍ତି। ଏହି ଘଟଣା ପରେ ମମତା ସମସ୍ତ ଦୋଷ ବିଜେପି ଉପରେ ଲଦିଛନ୍ତି। ସାଗରଡିଗିଠାରେ ଏକ ଜନସଭାକୁ ସମ୍ବୋଧିତ କରି ମମତା ନିଜକୁ ଏହି ଘଟଣାରୁ ଦୂରେଇ ରଖିବା ସହିତ ରାଜ୍ୟରେ ଚାଲିଥିବା ଏସ୍ଆଇଆର୍କୁ ନେଇ ଲୋକଙ୍କ ଭିତରେ ଥିବା ରୋଷର ଏହା ପ୍ରତିଫଳନ ବୋଲି କହିଛନ୍ତି। ମମତା କହିଛନ୍ତି, ମୋ ପାଖରେ କୌଣସି କ୍ଷମତା ନାହିଁ। ସେମାନେ ମୋ’ଠାରୁ ସବୁ କ୍ଷମତା ନେଇଯାଇଛନ୍ତି। ମାଲଦାରେ ଯାହା ଘଟିଗଲା ତାହା ବିଜେପିର କ୍ଷଡ଼ଯନ୍ତ୍ର। ପରାଜୟ ଭୟରେ ବିଜେପି ଚଳିତ ମାସ ହେବାକୁ ଥିବା ବିଧାନସଭା ନିର୍ବାଚନ ରଦ୍ଦ କରି ରାଷ୍ଟ୍ରପତି ଶାସନ ଲାଗୁ କରିବାକୁ ଚାହୁଁଛି। ନିର୍ବାଚନ ଆୟୋଗଙ୍କୁ ସମାଲୋଚନା କରି ଟିଏମ୍ସି ମୁଖ୍ୟ ମମତା ବାନାର୍ଜୀ କହିଛନ୍ତି ଯେ, ସେମାନେ ଆଇନ ଶୃଙ୍ଖଳା ବ୍ୟବସ୍ଥା ନିୟନ୍ତ୍ରଣ କରିବାକୁ ଚାହୁଥିଲେ, କିନ୍ତୁ ନ୍ୟାୟିକ ଅଧିକାରୀଙ୍କୁ ସୁରକ୍ଷା ଦେଇପାରି ନାହାନ୍ତି । ସୂଚନାଯୋଗ୍ୟ, ଏସ୍ଆଇଆର୍ ସମୟରେ ଭୋଟର ତାଲିକାରୁ ନାମ ବାଦ ଦିଆଯିବାକୁ ନେଇ ବୁଧବାର ମାଲଦାର କାଲିଆଛକ ୨ ବ୍ଲକ ଉନ୍ନୟନ କାର୍ୟ୍ୟାଳୟ ବାହାରେ ବିରାଟ ପ୍ରତିବାଦ ହୋଇଥିଲା। ଏହାକୁ ନେଇ ବିଜେପି ମହଲରେ ମମତାଙ୍କୁ ମଧ୍ୟ ବିରୋଧ ହୋଇଥିବା ଦେଖୁବାକୁ ମିଳିଛି । ଇତିମଧ୍ୟରେ ମମତାଙ୍କ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ମମତା ବିବାଦୀୟ ମନ୍ତବ୍ୟ ଦେଉଥିବାର ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଉକ୍ତ ଭିଡିଓ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଯଦି ଏକ ଶିବ ମନ୍ଦିର ଭାଙ୍ଗି ଦିଆଯାଏ, ତେବେ ବିଜେପି ଏହାକୁ ନେଇ କେତେ ନାଟକ ରଚନା କରେ । ସେ କ'ଣ ତାଙ୍କର ମୁଖ୍ୟ ଭୋଟରଙ୍କୁ କହୁଛନ୍ତି ଯେ ବିଜେପି କ୍ଷମତାକୁ ଆସିଲେ ସେମାନେ ମନ୍ଦିର ଭାଙ୍ଗି ପାରିବେ ନାହିଁ ? ଉକ୍ତ ୮ସେକେଣ୍ଡ ଭିଡିଓରେ ମମତା ଏକ ଶିବ ମନ୍ଦିର ଭାଙ୍ଗିବା ଏବଂ ଲୁଟ କରୁଥିବା ନେଇ କହୁଥିବାର ଶୁଣିବାକୁ ମିଳିଛି । “If a Shiva temple is demolished, how much drama BJP creates over it!” Is she telling her core voterbase that they won’t be able to break temples if BJP comes to Power? pic.twitter.com/DjwiHvhtfn — The Jaipur Dialogues (@JaipurDialogues) March 29, 2026 ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ଏଡିଟ କରି ମନ୍ଦ ଉଦେଶ୍ୟରେ ଭାଇରାଲ କରାଯାଉଥିବାର ଜଣାଯାଏ । ମୁଳ ଭିଡିଓରେ ମୂଳ ଭିଡିଓରେ କାଶୀ ବିଶ୍ୱନାଥ ପ୍ରକଳ୍ପ ଉନ୍ନତିକରଣ ସମୟରେ ଉଚ୍ଛେଦକୁ ନେଇ ବିଜେପିକୁ ସମାଲୋଚନା କରିଛନ୍ତି ମମତା । ଉକ୍ତ ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏଭଳି କୌଣସି ଖବର ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଆମର ହସ୍ତଗତ ହୋଇନଥିଲା । ଯଦି ମମତା ଏତେବଡ଼ ବିବାଦୀୟ ମନ୍ତବ୍ୟ ଦେଇଥାନ୍ତେ, ଏହା ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମର ମୁଖ୍ୟ ଖବରରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଉକ୍ତ ଦାବିନେଇ ଅଧିକ ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ପଶ୍ଚିମବଙ୍ଗର ସାମ୍ବାଦିକ ଅଗ୍ନିଶ୍ଵର ସର୍ଦାରଙ୍କୁ ଯୋଗାଯୋଗ କରିଥିଲୁ । ଉକ୍ତ ଦାବିକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ପ୍ରତ୍ୟାଖ୍ୟାନ କରିଥିଲେ ଅଗ୍ନିଶ୍ଵର । ସିଏ କହିଥିଲେ ଏହା ଅନ୍ୟୁନ୍ୟ ଗତ ମାସର ଭିଡିଓ ଅଟେ । ଏହା ଏକ ଅସମ୍ପୂର୍ଣ୍ଣ ଭିଡିଓ ଅଟେ । ତାଙ୍କ ଭାଷଣ ମୁଳ ଭିଡିଓକୁ ଦେଖିଲେ ହିଁ ପ୍ରକୃତ ସତ ଜନସାଧାରଣ ଜାଣିପାରିବେ । ଅଗ୍ନିଶ୍ଵର ଦେଇଥିବା ସୁଚନା ଅନୁଯାୟୀ ଆମେ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ୨୮ମାର୍ଚ୍ଚରେ ମମତାଙ୍କ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବାର ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ରାଣିଗଞ୍ଜର ଖଣ୍ଡରା ଫୁଟବଲ ପଡିଆରେ ଜନସାଧାରଣକୁ ଉଦବୋଧନ ବୋଲି ଭିଡିଓ ଉପରେ ଉଲ୍ଲେଖ ରହିଛି । ୪୫ ମିନିଟର ଉକ୍ତ ଲାଇଭ ଭିଡିଓରେ ମମତା ବିଭିନ୍ନ ପ୍ରସଙ୍ଗରେ ବିଜେପିକୁ ଘେରିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓର ଅନ୍ୟୁନ୍ୟ ୧୧:୧୭ ସମୟରେ, ଉକ୍ତ ଭାଇରାଲ ଭିଡିଓର ଅଂଶ ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଭିଡିଓରେ ମମତା କହିଛନ୍ତି, ବନ୍ଧୁଗଣ, ଯେତେବେଳେ ଗୋଟିଏ ଶିବ ମନ୍ଦିର ଭାଙ୍ଗି ଦିଆଯାଏ, ବିଜେପି ଏଥିରୁ ଏତେ ବଡ଼ କଥା ବାହାର କରେ । ମୁଁ କହୁନାହିଁ ଯେ, ଏହାକୁ ଭାଙ୍ଗିବା ଠିକ୍ କାମ । କିନ୍ତୁ ସେମାନେ କାଶୀ ବିଶ୍ୱନାଥ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବା ସମୟରେ କେତେ ମନ୍ଦିର ଭାଙ୍ଗିଥିଲେ ? ସେମାନେ ଦିଲ୍ଲୀର କାଳୀ ବାଡ଼ି ଭାଙ୍ଗି ଦେଇଥିଲେ। ସେସମୟର ବହୁ ଲୋକ ନିଜର ବ୍ୟବସାୟ ହରାଇଥିଲେ, ବୋଲି କହି ବିଜେପି ଉପରେ ବର୍ଷିଥିଲେ, ପଶ୍ଚିମବଙ୍ଗ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମମତା ବାନାର୍ଜୀ । ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ଏଡିଟ କରି ମନ୍ଦ ଉଦେଶ୍ୟରେ ଭାଇରାଲ କରାଯାଉଥିବାର ଜଣାଯାଏ । ମୁଳ ଭିଡିଓରେ କାଶୀ ବିଶ୍ୱନାଥ ପ୍ରକଳ୍ପ ଉନ୍ନତିକରଣ ସମୟରେ ଉଚ୍ଛେଦକୁ ନେଇ ବିଜେପିକୁ ସମାଲୋଚନା କରିଛନ୍ତି ମମତା ବାନାର୍ଜୀ ।
Ys Jagan : రాజకీయాల్లో రాజీ ధోరణి కలసి వస్తుంది బ్రదర్...తగ్గడం తప్పు కాదు సోదరా?
వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మరోసారి పార్టీని గందరగోళంలోకి నెట్టారని పిస్తుంది
సిలువ మోసిన ఎమ్మెల్యే పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు టౌన్ లో

28 C