శనివారం రాశి ఫలాలు(28-02-2026)
మేషం: నూతన ఋణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన కలుగుతుంది. వృషభం: వ్యాపారపరంగా భాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి. సంతానం విద్యా విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మిధునం: చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కర్కాటకం: చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. సింహం: అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు నుండి ఊహించని ఆహ్వానాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కన్య: కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు రావలసిన అవకాశాలు చేజారుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. తుల: సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృశ్చికం: పాత ఋణాలు తీర్చగలుగుతారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు పెద్దల సహాయం పొందుతారు. ధనస్సు: అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో మరోసారి నిరాశ తప్పదు. మకరం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాలలో స్థిర నిర్ణయాలు చేయలేరు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుంభం: కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. మీనం: రాజకీయవర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయికతో ఆనందం కలుగుతుంది. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
టి20 ప్రపంచకప్ సూపర్8లో ఇంగ్లండ్ వరుసగా మూడో విజయం సాధించింది. శుక్రవారం న్యూజిలాండ్తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ ఓటమితో కివీస్ తన సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విల్ జాక్స్ 32 (నాటౌట్), రెహాన్ 19 (నాటౌట్) జట్టును గెలిపించారు. టామ్ బాంటన్ (33), బ్రూక్ (26) తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్కు ఓపెనర్లు టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్ శుభారంభం అందించారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరు పోటీ పడి షాట్లు కొట్టడంతో స్కోరు వేగంగా పరిగెత్తించింది. దూకుడుగా బ్యాటింగ్ చేసిన సిఫర్ట్ 25 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్కు 64 పరుగులు జోడించాడు. ఆ వెంటనే అలెన్ కూడా పెవిలియన్ చేరాడు. 19 బంతుల్లో 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కివీస్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. రచిన్ రవీంద్ర (11), మార్క్ చాప్మన్ (15), డారిల్ మిఛెల్ (3), కెప్టెన్ సాంట్నర్ (9), మెక్ కొన్చి (14) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఫిలిప్స్ 39 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో రెహాన్, రషీద్, జాక్స్ రెండేసి వికెట్లను పడగొట్టారు.
కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను: కల్వకుంట్ల కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు.ఈ కేసులో అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించిందని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని వివరించారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని తాను ఎన్నోసార్లు చెప్పానని గుర్తు చేశారు. ఈ కేసు వల్ల తాను, తన కుటుంబం 5 నెలల పాటు క్షోభ అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. తన కుటుంబానికి దూరమై, 5 నెలలు జైలులో గడిపిన సమయాన్ని ఎవరు తిరిగిస్తారని ప్రశ్నించారు. కోర్టు తీర్పు రాకుండానే కొందరు అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. తనపై పెట్టిన కేసులపై మూడేళ్లుగా ఒంటరిగానే పోరాడుతున్నానని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి తనకు ఎప్పుడూ మద్దతు రాలేదన్నారు. తాను రాజకీయ పార్టీ పెట్టే ముందే కోర్టు తీర్పు రావటం సంతోషకరమన్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ’ కొత్త పోస్టర్ సంచలనం
పవర్స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా కొత్త పోస్టర్ విడుదలైంది.పవన్ కల్యాణ్ హ్యాట్ ధరించి స్టైలిష్గా కనిపిస్తున్న పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తక్షణమే పోస్టర్ వైరల్గా మారింది. పవన్ కల్యాణ్ లుక్కి అభిమానులు, సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఈ భారీ స్పందన మరోసారి చిత్రంపై ఉన్న అపారమైన క్రేజ్ను నిరూపించింది. […] The post ‘ఉస్తాద్ భగత్ సింగ’ కొత్త పోస్టర్ సంచలనం appeared first on Visalaandhra .
భీమవరంలో రౌడీ షీటర్ల హల్ చల్… కారుతో గుద్ది.. కత్తులతో వెంటాడిప్రత్యర్థిని హతమార్చేందుకు
ఉదయ్పూర్లో విజయ్-రష్మిక సందడి
హైదరాబాద్: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గురువారం వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారిగా కెమెరాల కంటపడ్డారు. పెళ్లయిన మరుసటి రోజు ఈ నూతన వధూవరులు ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమై సందడి చేశారు. కొత్త పెళ్లికూతురుగా రష్మిక ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ స్టైలిష్ ఇండో-వెస్ట్రన్ దుస్తుల్లో రాజసంగా కనిపించారు. గురువారం పెళ్లి వేడుకల అనంతరం మరుసటి రోజే ఈ కొత్త జంట ఎయిర్పోర్ట్లో కనిపించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ […] The post ఉదయ్పూర్లో విజయ్-రష్మిక సందడి appeared first on Visalaandhra .
జర్నలిస్ట్ అంజయ్యను పరామర్శించిన ఎంపీ
జర్నలిస్ట్ అంజయ్యను పరామర్శించిన ఎంపీ అంజయ్య కు ప్రభుత్వం అండగా ఉంటుందిఎంపీ చామల
skoch award : ఆప్కో’కు స్కోచ్ అవార్డు Andhra Prabha News
skoch award : ఆప్కో’కు స్కోచ్ అవార్డు Andhra Prabha News (
ప్రభుత్వాన్ని బదనాం చేయవద్దు..
ప్రభుత్వాన్ని బదనాం చేయవద్దు.. కుమ్మెర ఘటన సీఎం దృష్టికి తీసుకువెళ్తాంఈ ఘటనపై విచారణ
భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా మహిళా టీమ్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 20తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్గా దిగిన కెప్టెన్ అలీసా హీలీ ఆరు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. అయితే మరో ఓపెనర్ లిచ్ఫీల్డ్, వన్డౌన్లో వచ్చిన జార్జియా వోల్ అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. వరుస ఫోర్లతో స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు టీమిండియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు లిచ్ఫీల్డ్ అటు వోల్ అద్భుత షాట్లతో చెలరేగి పోయారు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన లిచ్ఫీల్డ్ 62 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 80 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఇదే క్రమంలో రెండో వికెట్కు 119 పరుగులు జోడించింది. మరోవైపు కీలక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న వోల్ 82 బంతుల్లోనే 13 బౌండరీలు, ఒక సిక్స్తో 101 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. బెథ్ మూనీ (31), ఆష్లే గార్డ్నర్ 19 (నాటౌట్) తమవంతు సహకారం అందించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ను ఓపెనర్లు ప్రతీక రావల్ (52), స్మృతి మంధాన (31) శుభారంభం అందించారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (54) పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించింది. మిగతా వారు విఫలం కావడంతో భారత్ స్కోరు 251 పరుగులకే పరిమితమైంది.
ఆస్పత్రి నుంచిభారతీరాజా డిశ్చార్జ్
చెన్నై: ప్రముఖ సినీ దర్శకులు భారతీరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎటువంటి కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. పైగా ఆయన వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో నగరంలోని ఆయన ఇంటికే పరిమితమయ్యారు. తన కుమారుడు మనోజ్ హఠాత్తుగా చనిపోవడంతో తీవ్రంగా కుంగిపోయిన భారతీరాజా… గత యేడాది డిసెంబరులో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై […] The post ఆస్పత్రి నుంచిభారతీరాజా డిశ్చార్జ్ appeared first on Visalaandhra .
మానవత్వం చాటుకున్న మంత్రి చిలకలూరిపేట, ఆంధ్రప్రభః మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవత్వం
. డ్రోన్లు, బాంబులతో పరస్పర దాడులు. 133 మంది అఫ్గాన్ సైనికుల మతి: పాక్. 55 మంది మరణం: అఫ్గాన్. ఎఫ్`16 కూల్చినట్లు తాలిబన్ల ప్రకటన. చైనా, ఇరాన్, రష్యా శాంతి పిలుపు కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారితీశాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. సరిహద్దుల వద్ద భీకర పోరు కొనసాగుతోంది. అఫ్గాన్పై బహిరంగ యుద్ధం ప్రకటించినట్లు పాక్ రక్షణ మంత్రి ఖాజా మహమ్మద్ ఆఫిస్ ‘ఎక్స’లో పేర్కొన్నారు. అఫ్గాన్లోని […] The post అఫ్గాన్పై పాక్ యుద్ధం appeared first on Visalaandhra .
ప్రపంచ ఆర్థిక ఫోరం సీఈఓబోర్గే బ్రెండే రాజీనామా
‘ఎప్స్టీన’ ఆరోపణలే కారణం జ్యూరిచ్: ప్రపంచ దేశాలను కుదిపివేసిన ఎప్స్టీన్ ఫైళ్ల ఉచ్చులో ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు, సీఈఓ బోర్గే బ్రెండే చిక్కుకున్నారు. ఎప్స్టీన్తో సంబంధాలపై ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీఈఓగా ఎనిమిదిన్నరేళ్లు పనిచేశానని చెప్ప్పుకున్నారు. రాజీనామా ప్రకటనలో ఎప్స్టీన్ పేరును ఆయన ప్రస్తావించలేదు. 2019లో జైలులో ఆత్మహత్య చేసుకున్న ఎప్స్టీన్కు సంబంధించిన 30 లక్షల పేజీల పత్రాలను […] The post ప్రపంచ ఆర్థిక ఫోరం సీఈఓబోర్గే బ్రెండే రాజీనామా appeared first on Visalaandhra .
‘ ప్రచండ్’ లో పర్యటించిన రాష్ట్రపతి ముర్ము
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం రాజస్థాన్లో జైసల్మేర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ “ ప్రచండ్” లో ప్రయాణించారు. ఫ్లైయింగ్ సూట్ ధరించిన ఆమె 25 నిమిషాల పాటు కో పైలట్గా వ్యవహరించారు. ప్రచండ్ దేశ స్వావలంబనకు చిహ్నం. జైహింద్, జైభారత్ అని కాక్పిట్ నుంచి దేశ ప్రజలకు సందేశం పంపారు. ఎల్సీహెచ్ “ ప్రచండ్” అనేది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ హెలికాప్టర్. అధునాతన ఏవియానిక్స్, స్టెల్త్ ఫీచర్లు, రాత్రి వేళల్లోనూ దాడులు చేయగల సామర్థం దీని సొంతం. క్షిపణులు, రాకెట్లు, 20 ఎంఎం గన్ వంటి ఆయుధాలను ప్రయోగించవచ్చు.
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. ఇది వీరిద్దరి రెండవ సమావేశం. నవంబరులో తొలిసారి భేటీ అయ్యారు. కాగా న్యూయార్క్ నగరంలో నూతన గహాల నిర్మాణానికి భారీ పెట్టుబడులపై మమ్దానీ, ట్రంప్ చర్చించారు. అధ్యక్షుడితో చర్చలు ఫలప్రదంగా సాగినట్లు మమ్దానీ అనంతరం ఎక్స్లో పేర్కొన్నారు. న్యూయార్క్లో మరిన్ని గహాల నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా, క్వీన్స్లోని సన్నీసైడ్ యార్డ్లో 12,000 కొత్త ఇళ్ల నిర్మాణానికి అనుమతి […] The post ట్రంప్తో మమ్దానీ రెండో భేటీ appeared first on Visalaandhra .
فیکٹ چیک: کیا بھارت میں پیغمبر اسلام کی حیات طیبہ پر مبنی فلم ریلیز ہورہی ہے؟ جانئے پوری حقیقت
سوشل میڈیا پر وائرل پیغام میں دعویٰ کیا گیا کہ بھارت میں اللہ بندے نامی فلم میں پیغمبر اسلام کا کردار ادا کرنے کی تصویر دکھائی گئی ہے۔ تحقیق سے ثابت ہوا کہ یہ دعویٰ جھوٹا اور پرانا ہے، اور قرآن سے منسوب کی گئی عبارت بھی غلط ہے۔
నన్ను చంపేందుకు ప్రయత్నం చేశారు
నన్ను చంపేందుకు ప్రయత్నం చేశారు 72 ఏళ్లలో 14 మంది ఎమ్మెల్యేలు అభివృద్ధిని
బంగ్లాదేశ్లో భూకంపం..కోల్కతాలో ప్రభావం
బంగ్లాదేశ్ ప్రధాన కేంద్రంగా శుక్రవారం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూ కంపం ప్రభావం ఆనుకుని ఉండే పశ్చిమ బెంగాల్ ఇతర ప్రాంతాలపై కూడా పడింది. మహానగరం కోల్కతా ఇతర బెంగాల్ ప్రాంతాల్లో జనం ఉరుకులు పరుగులతో బయటకు వచ్చారు. మధ్యాహ్నం 1.22 గంటలకు రెక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూ ప్రకంపనలు రికార్డు అయ్యాయని భారత భూకంపాల పరిశోధనా కేంద్రం తెలిపింది. బంగ్లాదేశ్లోని సత్కీరా జిల్లాలో భూమిలోపల పది కిలోమీటర్ల అడుగున భూ కంప ప్రధాన కేంద్రం నెలకొన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతం కోల్కతాకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరిహద్దు జిల్లా ప్రాంతం నార్త్ 24 పరగణా జిల్లా లోని టాకీకి ఈ భూకంప కేంద్రం పాతిక కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ పరిధిలోని పలు చోట్ల జనం ప్రకంపనలు ఎదుర్కొన్నారు. దాదాపు పది సెకండ్ల పాటు భూమి కంపించింది. పశ్చిమ బెంగాల్లో ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం ఘటనలు జరగలేదు. అయితే పలు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం సర్వం సమాయత్తంగా ఉంది.
ది కేరళ స్టోరీ2 విడుదలకు హైకోర్టు అనుమతి
వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ విడుదల కానుంది. చిత్ర ప్రదర్శనకు కేరళ హైకోర్టు శుక్రవారం అనుమతిని ఇచ్చింది. పదిహేను రోజులు చిత్ర విడుదలను నిలిపివేస్తూ ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును పూర్తిస్థాయి బెంచ్ నిలిపివేసింది. సినిమా నిర్మాత విపుల్ అమృత్లాల్ షా దాఖలు చేసిన అప్పీల్పై విచారణ జరిగింది. అంతకు ముందు విడుదల పై స్టేను ఎత్తివేస్తున్నట్లు న్యాయమూర్తులు శుశృత్ ధర్మాధికారి, పివి బాలకృష్ణన్తో కూడిన ధర్మాసనం రూలింగ్ ఇచ్చింది. సినిమాను పూర్తి స్థాయిలో చూడలేదు. కేవలం కొన్ని సన్నివేశాలను పరిశీలించే సింగిల్ జడ్జి తమ తీర్పును వెలువరించినట్లు ఉందని ధర్మాసనం పేర్కొంది. . సినిమా విడుదలకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. విడుదల తరువాత తలెత్తే పరిణామాలు ఏమైనా ఉంటే సరిగ్గా స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కేరళలో హిందూ మహిళలు ఇస్లాం మతం స్వీకరించిన నిజ సంఘటనల ఆధారంగా సినిమా తీశారు.
అభిషేక్పై అమీర్ విమర్శలు… అశ్విన్ కౌంటర్
నేటి మ్యాచ్శ్రీలంక x పాకిస్తాన్రా త్రి 7 గంటలకు న్యూదిల్లీ: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ చేసిన ‘స్లాగర’ విమర్శలను భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిప్పికొట్టాడు. వరుస వైఫల్యాల తర్వాత జింబాబ్వేపై అద్భుత అర్ధ సెంచరీతో ఫామ్లోకి వచ్చిన అభిషేక్కు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా మద్దతుగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్లో వరుసగా మూడు మ్యాచ్లలో డకౌట్ కావడంతో అభిషేక్ శర్మపై విమర్శలు […] The post అభిషేక్పై అమీర్ విమర్శలు… అశ్విన్ కౌంటర్ appeared first on Visalaandhra .
డ్రగ్స్ పై దండయాత్ర ఒక పవిత్ర యజ్ఞం
డ్రగ్స్ పై దండయాత్ర ఒక పవిత్ర యజ్ఞం డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్
కూటమితో పెట్టుబడులు సాధ్యం.. పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలువైసిపి హయాంలో పరిశ్రమలను
రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి
వన్డే సిరీస్ ఆసీస్ కైవసంసిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు తేలిపోయింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్ను ఆసీస్ కైవసం చేసుకుంది. శుక్రవారం హోబర్ట్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమఇండియాపై ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా… ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వికెట్లు కోల్పోయి […] The post రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి appeared first on Visalaandhra .
న్యాయస్థానాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి అలా మాట్లాడరు: మంత్రి పొన్నం ప్రభాకర్
హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల తర్వాత ఆ స్థలం ప్రభుత్వం అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న భూమిలో అక్రమంగా ఉన్నవారిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాక ర్ విమర్శించారు. శుక్రవారం కరీంనగర్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పు పేపర్లు కేంద్ర మంత్రి కి పంపిస్తామన్నారు. రాజకీయ ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతగా చేయాల్సి ఉంటుందని, వారికి ఆ విషయం పట్ల అవగాహన లేకుండా ఉండవచ్చునన్నారు. జిల్లా కలెక్టర్కి కోరుతున్న నివేదిక కోర్టు తీర్పు కేంద్ర మంత్రి కి పంపిస్తే దాని పట్ల అవగాహన వస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న మాట తెలుసునన్నారు. ఒక కాలేశ్వరానికి సంబంధించిన రుణభారంలో ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో 48 వేల కోట్లు కిస్తీలు కట్టిందన్నారు. రెండు బడ్జెట్లలో కేంద్రం నుండి రూపాయి నిధులు ఇవ్వలేదన్నారు. ఫెడరల్ సిస్టంలో తెలంగాణ తీర్చిన వయసు గల రాష్ట్రం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చే విధంగా నిధులు కాకపోయినా అందులో సగమైనా తెలంగాణ కు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణను ఆదుకోవాలనే ప్రయత్నం చేయాల్సిన కేంద్ర మంత్రి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకన్నా దౌర్భాగ్యం లేదన్నారు. తెలంగాణ మీద వివక్షపూరితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బిజెపి మోసంపై ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి మనం కడుతున్న పన్నులు, వచ్చే నిధులపై తెలియచేయాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కేంద్రమంత్రిని కోరుతున్నానన్నారు. రైతు భరోసాతో పాటు ఎన్నికలకు సంబంధించిన అన్ని హామీలు విఫలం కాకుండా అమలు చేస్తున్నామన్నారు. కోర్టు తీర్పు ఎవరైనా గౌరవించాల్సిందేనని, అక్కడ కేజ్రీవాల్, ఇక్కడ కవిత రాజకీయ కక్ష సాధింపు ధో రణిలో బిజెపి టాప్ అని విమర్శించారు. కవితకు కోర్టులో పూర్తిగా క్లీన్ చిట్ వచ్చినా ఒక అపవాదు మాత్రం ఉం దని, దానికి సంబంధించి తరువాత ప్రజలు చెబుతారని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
అంగన్వాడీలనూ బలోపేతం చేస్తాం..
అంగన్వాడీలనూ బలోపేతం చేస్తాం.. సుపోషణ్ అభియాన్లో ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి స్థానంఅంగన్వాడీ
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మారుతి సుజుకి 200వ నెక్సా స్టూడియో ప్రారంభం
న్యూదిల్లీ: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన 200వ నెక్సా స్టూడియో అవుట్లెట్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. మారుతి సుజుకి తన ప్రధాన ‘నెక్సా’ ఛానెల్కింద ప్రీమియం, వ్యక్తిగతీకరించిన కార్ యాజమాన్య అనుభవాన్ని అందించే ప్రయాణంలో ఇది మరో ముందడుగు. భౌగోళికం, అమ్మకాల సామర్థ్యాన్ని బట్టి, నెక్సా ఛానెల్ రెండు ఫార్మాట్లలో భావన చేయబడింది- నెక్సా ప్రధాన అవుట్లెట్లు, నెక్సా స్టూడియో అవుట్లెట్లు. మొత్తం మీద, నెక్సా సేల్స్ నెట్వర్క్ ప్రస్తుతం 530 కంటేఎక్కువ నగరాల్లో 740 కంటే […] The post మారుతి సుజుకి 200వ నెక్సా స్టూడియో ప్రారంభం appeared first on Visalaandhra .
అమేజాన్ బజార్లో రూ.299 కంటే తక్కువ ధరలకే హోలీ ఉత్పత్తులు
బెంగళూరు: అతి తక్కువ ధరలకు ప్రతి భారతీయుడు హోలీ పండగను సులభంగా సంబరం చేయడానికి అమేజాన్ బజార్ నాణ్యత, సరసమైన ధరలు రెండిటినీ తెచ్చింది. అత్యంత తక్కువ ధరలకే కస్టమర్లు హోలీ పండగకు అవసరమైనవి. పండగ సమయంలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులను విస్తృత శ్రేణి నుండి కొనుగోలు చేయవచ్చు. రూ. 299 కంటే తక్కువ ధరలకే కస్టమర్లు హోలీ వస్తువులను పొందవచ్చు. అదనంగా క్యాష్ బాక్ ను ఆనందించవచ్చు. అన్ని ఆర్డర్స్ పై ఉచిత డెలివరీమెగా డిస్కౌంట్లు […] The post అమేజాన్ బజార్లో రూ.299 కంటే తక్కువ ధరలకే హోలీ ఉత్పత్తులు appeared first on Visalaandhra .
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ ఆవిష్కరణ
ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్) కింద డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ని ఆవిష్కరించింది. స్థిరంగా డివిడెండ్లు చెల్లించడంలో మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉండి, ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవడంలో కస్టమర్లకు ఈ ఫండ్ సహాయకరంగా ఉంటుంది. “డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ అనేది స్థిరమైన డివిడెండ్ ట్రాక్ రికార్డు కలిగి ఉండి, ఫండమెంటల్గా పటిష్టమైనకంపెనీల్లో […] The post ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ ఆవిష్కరణ appeared first on Visalaandhra .
నెట్ఫ్లెక్స్లో సైకాలజికల్ డ్రామా అక్యూస్డ్కు అద్భుత రెస్పాన్స్
ముంబై: నిశ్శబ్దం అసహజంగా ఉంది. నిజం అనిశ్చితంగా ఉంది. సమాధానాలు రాకముందే తీర్పు వచ్చేస్తుంది. అక్యూస్డ్ ఇప్పుడు ప్రత్యేకంగా నెట్ఫ్లెక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. అనుభూతి కశ్యప్ దర్శకత్వంలో, ధర్మా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందిన అక్యూస్డ్ ఒక సైకాలజికల్గా లోతైన డ్రామా, ఆరోపణల అసౌకర్యంలో ప్రేక్షకులను నేరుగా నిలబెడుతుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర డా. గీతికా సేన్, ఆమె పాత్రను కొంకనా శర్మ పోషించారు. ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన ఆమె జీవితంలో లైంగిక దుర్వినియోగ ఆరోపణలు బయటకు […] The post నెట్ఫ్లెక్స్లో సైకాలజికల్ డ్రామా అక్యూస్డ్కు అద్భుత రెస్పాన్స్ appeared first on Visalaandhra .
వి.ఒ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీతో టాటా మోటార్స్ ఒప్పందం
టుటికోరిన్: నికర సున్నా ఉద్గారాల దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో కీలకమైన అడుగుగా, భారత దేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు టాటా మోటార్స్, తమిళనాడులోని టుటికోరిన్లోని వి.ఒ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ (వీఓసీపీఏ)తో 40 గ్రీన్ హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ పవర్డ్ (హెచ్ 2 ఐస్) ప్రైమ్మూ వర్లను పోర్టులో మోహ రించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్స మక్షంలో ఈ […] The post వి.ఒ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీతో టాటా మోటార్స్ ఒప్పందం appeared first on Visalaandhra .
మారుతి సుజుకి తన రోడ్డు భద్రతా ప్రయత్నాల విస్తరణ
చెన్నై: రోడ్డు భద్రతా ప్రయత్నాలను బలోపేతం చేస్తూ, తమిళనాడు ప్రభుత్వం రవాణా శాఖతో భాగస్వామ్యంతో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ రాష్ట్రంలో ఏడుఏడీటీటీలను ప్రారంభించినట్లు ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి గౌరవనీయులైన తిరువణ్ణామలై, కృష్ణగిరి, మధురై (ఉత్తర), శివగంగై, దిండిగల్, తిరుచిరాపల్లి(పశ్చిమ)లోని ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీఓలు)లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఏడీటీటీలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పది డ్రైవింగ్ టెస్ట్ట్రాక్లను ఆటోమేట్ చేయడానికి మారుతి సుజుకి మరియు తమిళనాడు ప్రభుత్వ రవాణా శాఖ మధ్య సంతకం చేయబడిన […] The post మారుతి సుజుకి తన రోడ్డు భద్రతా ప్రయత్నాల విస్తరణ appeared first on Visalaandhra .
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు
ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలో మరో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్నారన్న కోపంతో, ఒక వ్యక్తిని అతని భార్య సోదరులే దారుణంగా హత్య చేశారు. గురువారం రాత్రి ఈ ఘోరం జరి గింది. కులాంతర వివాహం చేసుకోవడమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లికి చెందిన పివివి సూర్యప్రకాశరావు (41) స్థానికంగా వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. మేడపాడు గ్రామానికి చెందిన అయినవిల్లి సంధ్య ప్రస్తుతం రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ క్లాస్మేట్స్ కావడంతో గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నా రు. అయితే, వీరిద్దరి కులాలు వేరు కావడంతో సంధ్య కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో వారు గురువారం ఉదయం అన్నవరంలో వివాహం చేసుకుని, అనంతరం వేములపల్లిలోని సూర్యప్రకాశ్ ఇంటికి చేరుకున్నారు. పెళ్లి విషయం తెలుసుకున్న సంధ్య సోదరులు చంద్రపాల్, గిరిబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఎలాగైనా సరే బావ సూర్యప్రకాశ్ ను చంపాలని ప్లాన్ చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి సూర్యప్రకాశ్ ఇంటికి వెళ్లిన భార్య సోదరులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరూ కలిసి బండరాయితో ఆయన ముఖంపై బలం గా బాదడంతో తీవ్ర రక్రస్త్రావమై సూర్యప్రకాశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు నిందితులు చంద్రపాల్, గిరిబా బులను పట్టుకుని చితకబాది, అనంతరం పోలీసులకు అప్పగించారు. మండపేట సీఐ, ఎస్ఐ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు చంద్రపాల్, గిరిబాబులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
వైసిపి నేత ‘బొత్స’కు బ్రెయిన్ స్ట్రోక్
వైసిపి మాజీ మంత్రి, ఎపి మండలిలో ప్రతిపక్ష నాయకుడు, బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యా రు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడి సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరా బాద్కు తరలిం చారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పారు. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతేడాది కూడా ఓసారి బొత్స సత్యనారాయమ అస్వస్థతకు గురుయ్యారు. గతేడాది జూన్లో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసిపి చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బొత్స ఒక్కసారిగా కుప్పకూలిపో యారు. వెంటనే విశాఖపట్నంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యా రు. అంతకుముందు 2013 లో హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో కూడా బొత్స చికిత్స తీసుకున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టగా చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఎపిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మండలిలో వైసిపి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్య నారాయణ పార్టీ తరపున కీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి సూటిగా ప్రశ్నలు సంధిస్తూ మండలిలో తన వాయిస్ ను వినిపిస్తున్నారు. కట్ చేస్తే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో ప్రస్తుతం మండలి సమావేశాలకు దూరమయ్యే అవకాశం ఉంది. బొత్స అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను: పవన్ కల్యాణ్ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ త్వరగా ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను‘ అని తన ప్రకటనలో పేర్కొన్నారు.
‘స్పిరిట్’లో పవర్ ఫుల్రోల్లో ఒబెరాయ్
రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాన్- వరల్డ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు వివేక్ ఒబెరాయ్. మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్లో ఒబెరాయ్ స్టైలిష్ లుక్లో కనిపించి తన పాత్ర ఎంత ప్రభావవంతంగా ఉండబోతోందో చూపించారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న ఆయన రాకతో కథలో కొత్త డైనమిక్ చేరింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో ఐశ్వర్య దేశాయ్ ను పరిచయం చేశారు మేకర్స్. ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతుంది. యానిమల్ సంచలన విజయం తర్వాత నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి బోల్డ్ క్రియేటివ్ విజన్తో స్పిరిట్ను రూపొందిస్తున్నారు. ప్రభాస్ కు జోడిగా తృప్తి డిమ్రి కనిపించనున్నారు. భారీ స్థాయిలో, అద్భుతమైన ఎమోషన్స్ తో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించబోతోంది. 8 భాషల్లో విడుదల కానున్న ఈ పాన్- వరల్డ్ ఎంటర్టైనర్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. గుల్షన్ కుమార్ టి సిరీస్ సమర్పణలో, టి-సిరీస్ ఫిలిమ్స్ , భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కథ, ఎడిటింగ్, దర్శకత్వం మొత్తం సందీప్ రెడ్డి వంగా వహిస్తుండగా, భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
అంతర్జాతీయ సైబర్క్రైమ్ నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: అంతర్జాతీయ సైబర్క్రైమ్ నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా.. చెన్నై విమానాశ్రయంలో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు విశాఖకు చెందిన పెదపూడి ప్రసన్నకుమార్గా గుర్తించారు. మ్యాట్రిమోనియల్, క్రిప్టో ఇన్వెస్ట్ మోసం కేసులో అతడు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. షాదీ డాట్ కామ్ ద్వారా నకిలీ ప్రొఫైల్ సృష్టించి బాధితులతో పరిచయం ఏర్పరచుకున్నాడని పోలీసులు తెలిపారు. యువతిగా నటిస్తూ పెళ్లి చేసుకుంటానన్న హామీతో మోసాలు చేశాడని అన్నారు. నకిలీ క్రిప్టో ట్రేడింగ్ ద్వారా పెట్టుబడి పెట్టాలని ప్రలోభాలకు గురి చేసినట్లు గుర్తించారు. ఒక బాధితుడి నుంచి రూ.11 లక్షలు కాజేసినట్లు విచారణలో తేలింది. విత్డ్రాకు ప్రయత్నించే వారిని మరింత పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. అక్రమంగా సుమారు 500 సిమ్లు సేకరించి నకిలీ ఖాతాలను తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల ముఠాతో ఈ నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.
పేదల ఇళ్లు కూల్చడంలో రేవంత్ రెడ్డి పోటీ: మంత్రి బండి సంజయ్
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు నిర్మించిందని, మోదీ పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇచ్చే విషయంలో పోటీ పడుతుంటే పేదల ఇళ్లను కూల్చడంలో రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలు నానా కష్టాలు పడుతూ అప్పోసప్పో చేసి బతకడానికి ఇళ్లు కట్టుకుంటే వాటిని కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పనితీరు మారకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారని చెప్పారు. తక్షణమే పేదల ఇళ్ల కూల్చివేతను ఆపాలని, లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు న ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతలు త ప్ప సాధించింది ఏముంది? నానా కష్టాలుపడి పేదలు ఇండ్లు కట్టుకున్నరు. పోనీ ఇల్లు కటే ్టటప్పుడు అధికారులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అప్పొసప్పో చేసి బతకడానికి చిన్ని ఇల్లు కట్టుకుంటే ఆ పేదల ఇండ్లను కూల్చడానికి మీకు మనసెలా వచ్చింది? పేదలు ఇండ్లు కట్టుకోవద్దా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు కట్టించా మన్నారు. మోదీ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టడానికి ముందుకు వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేదల ఇండ్లను కూల్చే విషయంలో పోటీ పడుతోందన్నారు. ప్రభుత్వం “రైతు భరోసా” ఇవ్వడం లేదు : రాష్ట్ర ప్రభుత్వం “రైతు భరోసా” ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారన్నారు.మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా వేస్తామని ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. ఇలాంటి హామీలు చాలా ఇచ్చారని మాట తప్పారని, వాస్తవానికి ముఖ్యమంత్రి నోటి నుండి ఏ మాట వచ్చినా శాసనం కావాలన్నారు. కానీ రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారన్నారు. నమ్మించి ఓట్లేయించుకుని మోసం చేస్తారన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పి, రూ.9 వేల కోట్లు రెడీగా ఉన్నాయని పదేపదే చెబుతూ వార్తలు రాయించుకున్నారన్నాని, కానీ ఇంతవరకు ఆ ఊసే లేదన్నారు. అధికారంలోకి వచ్చాక రైతు భరోసా ఒక దఫా ఎగ్గొట్టారన్నారు. ఎన్నికలొ స్తే ఏదో ఒక హామీని తూతూ మంత్రంగా అమలు చేసినట్లు నటించి వార్తలు రాయించు కోవడ, ఆ ఎన్నికలైపోగానే వాటిని మర్చిపోవడం వాళ్లకు అలవాటైందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చే సమయంలో మళ్లీ ఏదో ఒక డ్రామాలాడతారన్నారు. తక్షణమే రైతు భరోసాను చె ల్లించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి : రాష్ట్ర ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో 6 గ్యారంటీలను అమలు చేయకపోయినా, డీఏలు, ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోయినా ఓట్లేశారన్నారు. దీంతో కాం గ్రెస్ నేతల్లో అహంకారం పెరి గిపోయిందన్నారు. ఏ హామీని అమలు చేయకపోయినా ఓట్లే స్తున్నారని చెబుతున్నారన్నారు. అందుకే ఈసారి ప్రజలంతా కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. రైతు భరోసా గురించి కేబినెట్ లో ఎందుకు చర్చించలేదన్నారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒక్కటే : కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, మున్సిపల్ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేశాయని, కలిసే పదవులు పంచుకున్నాయన్నారు. ఇప్పడు ఒకరికి ఒకరు పడనట్లు డ్రామాలాడుతున్నారన్నారు. మరి వాళ్లిద్దరికి ఎక్కడ చెడిందో వాళ్లే చెప్పాలన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు గత ఎన్నికల్లో మాట్లాడారని, మేం కూడా అదే చెప్పామన్నారు. ఈ అంశంపై విచారణ జరిపే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే మేం విచారణ చేపట్టేందుకు సిద్ధమని ఆ మేరకు లేఖ రాయాలని సీఎంను కోరుతున్నానన్నారు.
నటుడు విజయ్కు విడాకుల నోటీసులు
టీవీకే పార్టీ అధినేత ,నటుడు విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక సినీ నటితో విజయ్కు వివాహేతర సంబంధమే కారణమని విడాకుల పిటిషన్లో సంగీత పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణకు కోర్టు అంగీకరించింది. ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్కు నోటీసులు జారీ చేసింది. విజయ్, సంగీత వివాహం 1999 లో జరిగింది. విజయ్ రెండేళ్ల క్రితం రాజకీయాల్లో అడుగు పెట్టిన తరువాత విజయ్ వివాహేతర సంబంధంపై అనేక ఆరోపణలు వచ్చాయి. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాగేంద్రన్ మాట్లాడుతూ త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని వ్యాఖ్యానించడం వివాదాలకు దారి తీసింది. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుతున్నారని విజయ్ విమర్శించారు. త్రిష కూడా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల కోసం వాడుకోకూడదని సూచించింది. దీంతో నాగేంద్రన్ తరువాత క్షమాపణలు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ వివాదం నటుడు విజయ్ రాజకీయ భవిష్యత్పై కొంతవరకు ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.
Video : Exclusive Interview with Actress Nayan Sarika & Director Yadunaath Maruthi Rao
The post Video : Exclusive Interview with Actress Nayan Sarika & Director Yadunaath Maruthi Rao appeared first on Telugu360 .
అఫ్ఘన్పై ఇక బహిరంగ యుద్ధమే: పాక్ రక్షణ మంత్రి
ఇరుగుపొరుగు దేశాలు పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ మధ్య పోరు తీవ్రతరం అయింది. తమ దేశం అఫ్ఘనిస్థాన్పై బహిరంగ ప్రత్యక్ష యుద్ధానికి దిగిందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా శుక్రవారం ప్రకటించారు. తరచూ దాడులకు దిగుతూ, పౌరుల ప్రాణాలను హరిస్తూ వచ్చిన అఫ్ఘనిస్థాన్ తమ ఓపికను పరీక్షిస్తూ వచ్చిందని, ఇక తమ బహిరంగ యుద్ధాన్ని ఎదుర్కొవాలని ఆయన సవాలు విసిరారు. పాక్ సేనలు ఇప్పటికే 130 మందికి పైగా తాలిబన్ సాయుధులు హతులయ్యారని ఇస్లామాబాద్లో అధికార వర్గాలు ధృవీకరించాయి. రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ 2611 కిలోమీటర్ల సరిహద్దును దురంద్ రేఖగా వ్యవహరిస్తారు. అయితే అఫ్ఘన్ అధికారికంగా దీనిని గుర్తించలేదు. ఇప్పుడిక తమది ప్రత్యక్ష యుద్ధమే. ఇప్పుడు ఇక దమా దమ్ మస్త్ కలందర్ అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. పాక్ సైన్యం సముద్ర మార్గం మీదుగా విరుచుకుపడదు. ఎంతైనా పొరుగు దేశం కదా? బలాలు బలహీనతలు అని తెలుసు. వీటిని గుర్తించే తగు విధంగా విరుచుకుపడుతామని ప్రకటించారు. ఇప్పటికే పాక్ సైన్యం ఆపరేషన్ గజబ్ లిల్ హక్ పేరిట అఫ్ఘన్లోని పలు ప్రాంతాలపై దాడులకు దిగింది. తమ వైమానిక స్థావరాలు, గ్రామాలపై తాలిబన్ల దాడులకు ప్రతీకారంగానే ఇప్పుడు యుద్థానికి దిగింది. అటువైపు నుంచి కవ్వింపు చర్యలు సాగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? ఏరిపారేస్తామని రక్షణ మంత్రి హెచ్చరించారు. దమా దమ్ మస్త్ కలందర్ సింధ్ సూఫీ ప్రవక్త లాల్ షెబాజ్ కలందర్ ఆధ్మాత్మిక గీతాన్ని ప్రస్తావించారు. రక్షణ మంత్రి ఆసిఫ్ ప్రకటనకు అఫ్ఘన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి నుంచి స్పందన వెలువడింది. సరిహద్దుల వెంబడి తమ సేనల ప్రతీకార దాడుల్లో 55 మంది పాక్ సైనికులు చనిపోయారని తెలిపారు. పాక్ సైన్యపు రెండు ప్రధాన స్థావరాలను,19 చెక్పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మరో వైపు పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ టర్కీ , సౌదీ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని వివరించారు. పాక్ ..సౌదీ మధ్య గత ఏడాది సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మూడో దేశం దాడులు జరిగితే వెంటనే పరస్పరం సహకరించాలని ఈ ఒప్పందంలో నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పుడు పాకిస్థాన్కు సౌదీ , టర్కీ నుంచి సాయం అందుతుందని వెల్లడైంది. అయితే ఈ రెండు దేశాలూ నేరుగా యుద్ధంలో చేరే అవకాశాలు లేవు. తమ దేశం శాంతి, దేశ ప్రాదేశికత సమగ్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పాక్ అధ్యక్షులు అసీఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. తమ భూభాగాలపై దాడులకు దిగి అప్ఘన్ చాలా పెద్ద తప్పు చేసింది. ఇక తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్, సిసోడియా విడుదల
ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. వారిని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారంనాడు కేసు నుంచి విడుదల చేసింది. కోర్టు 23 మంది నిందితులపై పెట్టిన కేసులను కొట్టివేసింది. ప్రాసిక్యూషన్ కేసుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాలు, కుట్ర ఆరోపణలను స్పష్టంగా నిరూపించలేకపోయిందని పేర్కొంది. ఎక్సైజ్ విధానం కేసు కారణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సిసోడియా లు జైలు పాలైన విషయం తెలిసిందే. తీవ్రమైన నేరారోపణలు చేసినప్పుడు బలమైన భౌతిక ఆధారాలను కూడా సమర్పించవలసి ఉంటుందని , కుట్రపూరిత పాత్రను ఆపాదించినంత మాత్రాన కేసు నిలబడదని కోర్టు పేర్కొంది. ప్రాసిక్యూషన్ ఆరోపణలకు ఆధారాలు లేవని తేలితే, ఉన్నత పదవులపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని కూడా కోర్టు హెచ్చరించింది. ఎక్సైజ్ పాలసీ వెనుక ఎలాంటి విసృ్తతమైన కుట్ర లేదా, నేరపూరిత ఉద్దేశ్యం లేదని కోర్టు పేర్కొంది. నిందితుడిని అప్రూవర్ గా మార్చడం ద్వారా నేరం చేసినవారి సంఖ్యను పెంచడం వంటి దర్యాప్తు పద్ధతుల పట్ల న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. అటువంటి పద్దతులు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని కోర్టు పేర్కొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఇతరులను విడుదల చేస్తూ కోర్టు పది ముఖ్యమైన విషయాలను పేర్కొంది. 1. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లేవు. కుట్రలో కేజ్రీవాల్ కు ఆపాదించే ఖచ్చితమైన ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు సంస్థ ధ్రువీకరించకుండా, ఒక సాక్షి ఆలస్యంగా ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన పేరు ప్రధానంగా బయటకు వచ్చింది. 2. సాక్షి బలహీనమైన వాంగ్మూలంపై ఆధారపడడం. కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణ ఒకే ఒకవాక్యం ఆధారంగా ఉంది. ఆధారాలు లేకుండా ఇది మాత్రమే కుట్రను నిరూపించబోదని కోర్టు పేర్కొంది. 3. విధాన పరమైన మార్పులు ప్రత్యక్షపాత్రకు ఆధారాలు కావు. కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎక్సైజ్ విధానాన్ని మార్చారని, ప్రయోజనాలు పొందారని చూపే ఆధారాలు లేవు, కేబినెట్ నిర్ణయాన్నిఆమోదించడం నేరపూరిత కుట్రగా పరిగణించబడదు. 4. దర్యాప్తులో పలు అంశాలు సరైనవి కావని తేలింది. దర్యాప్తు లోపాలపై న్యాయమూర్తి తీవ్రంగా వ్యాఖ్యానించారు. కొన్ని చర్యలు ముందస్తు తారుమారులా కన్పించాయనడం న్యాయమైన దర్యాప్తు కాదని పేర్కొన్నారు. 5. దర్యాప్తు అధికారిపై శాఖ పరమైన చర్యకు సిఫార్సు. ఆధారాలు లేకుండా నిందితుడిని అరెస్ట్ చేసినందుకు దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యలు చేయాలని కూడా కోర్టు సిఫార్సు చేసింది. సాక్ష్యాధారాల ఆధారంగా ప్రాసిక్యూషన్ సాగలేదని కోర్టు ఆందోళన ను ఇది బహిర్గతం చేసింది. 6. దాదాపు 36 పేజీల జిఎంఓ దర్యాప్తు కుప్పకూలింది. కుట్రకు సంబంధించి చూపిన 36 పేజీల ప్రింటవుట్ కీలకమైన ప్రాసిక్యూషన్ వాదన రికార్డులకు విరుద్ధంగా ఉన్నట్లు కన్పించింది. 7.సమావేశాలపై స్వతంత్ర ధ్రువీకరణ లేదు. విధాన చర్చలకు సంబంధించి ప్రధానంగా డాక్యుమెంటరీ లేదా ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ లేకుండా ఆమోద ప్రకటనలను చేశారు. 8. పుకార్లు, విరుద్ధ ప్రకటనలు ఈ కేసులో అనేక ఆరోపణలు సాక్ష్యాల వాంగ్మూలాలపై ఆధారపడిఉన్నాయి. అభియోగ దశలో ప్రాసిక్యూషన్ కేసును బలహీనపరచింది. 9. డిమాండ్ లేదా సరైన రుజువు లు లేవు. అవినీతి ఆరోపణలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం కింద అవసరమైన డిమాండ్ రుజువు లేకపోవడాన్ని కోర్టు గుర్తించింది. 10. స్పష్టమైన ప్రమాణాలను పాటించలేదు.అభియోగాలు మోపే దశలో కోర్టు రికార్డుల్లో ఉన్న విషయాల ఆధారంగా తీవ్రమైన అనుమానంను గుర్తించాలి. సినియర్ రాజకీయ కార్యకర్తలతో సహా నిందితులకు సంబంధించి ప్రాసిక్యూషన్ స్పష్టమైన రుజువులు సమర్పించలేకపోయిందని న్యాయమూర్తి పదేపదే పేర్కొన్నారు. సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల కోర్టు సీబీఏ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకోడానికి కోర్టు తిరస్కరించింది.
వెస్టిండీస్ని అంత తేలికగా తీసుకోవద్దు: సునీల్ గవాస్కర్
టి-20 ప్రపంచకప్లో ఆదివారం భారత్కి అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. సెమీస్కి చేరుకోవాలంటే.. వెస్టిండీస్తో జరిగే ఈ మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది. మరోవైపు వెస్టిండీస్కి కూడా ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యం.. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ భారత జట్టుకు పలు కీలక సూచనలు చేశారు. వెస్టిండీస్ జట్టును తక్కువ అంచనా వేయొద్దని ఆయన పేర్కొన్నారు. ‘‘దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో భారత బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బతింది. దీంతో టాప్ ఆర్డర్లో కుడి-ఎడమ కాంబినేషన్ను అమలు చేుయాల్సిన పరిస్థితి వచ్చింది. గత మ్యాచ్ల నుంచి పాఠాలను నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. ఇప్పుడు విండీస్తో సవాల్ భిన్నమైంది. వారు దేనిని తేలిగ్గా తీసుకోరు. వారి బ్యాటర్లంతా మంచి ఫామ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లూ రిథమ్తో బౌలింగ్ చేస్తున్నారు. ఏదైనా పొరపాట్లు చేస్తే శిక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. వారిని కట్టడి చేయాలంటే భారత్కు సరైన ప్లాన్ అవసరం. మరీ ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్పై ఓ కన్నేయాలి. తొలి బంతి నుంచే భారీ షాట్లకు దిగేస్తారు. ఆదివారం మ్యాచ్ తప్పకుండా సూపర్గా ఉండబోతుంది’’ అని గవాస్కర్ అన్నారు.
ఆయేషా మీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించిన సిబిఐ
ఎపిలో బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సుదీర్ఘ కాలంగా సిబిఐ ఆధీనంలో ఉన్న ఆయేషా శరీర అవశేషాలను విజయవాడలోని సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో గుండెలు అవిసేలా రోదించిన తల్లిదండ్రులను చూసి అక్కడి వారు చలించిపోయారు. ఆయేషా మీరా హత్య జరిగి సుమారు రెండు దశాబ్దాలు కావస్తున్నా, ఇప్పటికీ అసలు హంతకుడెవరో తేలకపోవడం గమనార్హం. గతంలో ఈ కేసులో సత్యంబాబును నిందితుడిగా భావించినప్పటికీ, కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టినప్పటికీ సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసును మూసివేసు ్తన్నట్లు కోర్టుకు వెల్లడించింది. తమ బిడ్డకు న్యాయం జరగలేదని, కనీసం ఆమె అవశేషాలనైనా అప్పగించాలని తల్లిదండ్రులు కోరడంతో కోర్టు ఈ మేరకు అనుమతినిచ్చింది. 2019లో ఈ కేసు విచారణలో భాగంగా శాస్త్రీయ ఆధారాల కోసం ఆయేషా మీరా భౌతిక కాయానికి సిబిఐ రీ-పోస్టు మార్టం నిర్వహించింది. ఆ సమయంలో ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఆమె శరీర భాగాలు, అవశేషాలను సేకరించి భద్రపరిచారు. ఇప్పుడు కేసు విచారణ ముగియడంతో ఆ అవశేషాలను తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ భాషాలకు అప్పగించారు. ఈ అవశేషాలను తమ సొంత ఊరు తెనాలికి తీసుకువెళ్లి అక్కడ ఇస్లాం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయేషా మీరా తల్లిదండ్రులకు మద్దతుగా మహి ళా , మానవ హక్కుల సంఘాలు కోర్టు వద్ద ఆందోళన చేపట్టాయి. సాక్ష్యాలను తారుమారు చేసిన అధికారులు, అసలు నిందితులపై ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదని వారు మండిపడ్డారు. 19 ఏళ్ల పోరాటం తర్వాత కూడా హంతకుడిని పట్టుకోలేకపోవడం వ్యవస్థల వైఫల్య మేనని ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. డబ్బు, అధికారం ఉన్న వారిపై ఆయేషా తల్లిదండ్రులు ఇన్నేళ్లుగా చేసిన పోరాటం సామాన్యమైనది కాదని బాధితులకు మద్దతుగా నిలిచిన నేతలు కొనియాడారు. ఎన్నో బెదిరింపులు ఎదురైనా, ఏ ప్రభుత్వాలు అండగా నిలవకపోయినా తమ బిడ్డకు న్యాయం కోసం వారు అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు. చివరికి హంతకుడిని శిక్షించలేకపోయినా, తమ బిడ్డ అవశేషాలకైనా గౌరవ ప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం లభించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆవేదన ఆధారాలు ఉన్నాయని, ఎఫ్ఐఆర్లో వయస్సు కూడా తప్పుగా నమోదు చేశారని ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. నేరం జరిగిన తర్వాత అన్ని తుడిచేశారని, అయేషా కేసులో పోలీసులు పూర్తిగా నిందితులకు సహకరించారని ధ్వజమెత్తారు. ఆయేషా అవశేషాల కోసం కోర్టుల చుట్టూ ఏళ్ల క్రితం నుంచి తిరిగామని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతి గృహంలో 2007లో బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన 9 నెలల తర్వాత 2008 ఆగస్టులో సత్యంబాబును ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సత్యంబాబుకు జీవితఖైదు, అత్యాచారం నేరం కింద 10 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ 2010 సెప్టెంబర్లో తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సత్యంబాబు 2010 అక్టోబర్లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ 2017 మార్చి 31న తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఆయేషా తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 నవంబర్లో ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కేసు మళ్లీ మొదటికే వచ్చినట్ల యింది. ఇప్పుడు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు కొట్టేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. తమకు న్యాయం జరగలేదంటూ ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్ కు విడాకుల నోటీసులు #Vijay #Sangeetha #DivorcePetition #TVKChief
గ్రామపంచాయతీలకు రూ. 389 కోట్లు విడుదల
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులు రూ. 389 కోట్లు విడుదల చేశారు. ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికల తరువాత అభివద్దే లక్షంగా పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిధులు విడుదలతో పంచాయతీల్లో అభివృద్ధి వేగంగా ముందుకు సాగనుందని నూతనంగా కొలువుదీరిన సర్పంచ్లు సంతోషం వ్యక్తం చేస్తోన్నారు.
కెపిహెచ్బిలో గజం భూమి ధర రూ. 2.65 లక్షలు
కెపిహెచ్బిలో గజం భూమి ధర రూ. 2.65 లక్షలు పలికింది. 1,400 ఎస్ఎఫ్టి ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్కు రూ. 1.10 కోట్ల ధర పలకడంతో మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు, ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. భూములు, ఫ్లాట్ల విక్రయంతో రూ.24.26 కోట్ల మేర ఆదాయం హౌజింగ్బోర్డుకు సమకూరింది. ఈ నేపథ్యంలోనే హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్ల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు పోటీ పడ్డారు. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది, డిమాండ్ ఉన్న కెపిహెచ్బి ప్రాంతంలోని ప్లాట్లు, ఫ్లాట్లను బహిరంగం వేలంలో రికార్డు ధరలకు కొనుగోలు చేశారు. ఫేజ్-1, 2 లోని ధర్మారెడ్డి కాలనీలోని 4 ఓపెన్ ప్లాట్లు, ఫేజ్ -15 లోని సంపూర్ణం అపార్ట్మెంట్ లోని 8 ఫ్లాట్లకు శుక్రవారం హౌజింగ్బోర్డు అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. ఓపెన్ ప్లాట్ల ద్వారా రూ.15.81 కోట్లు మొత్తం 40 మంది కొనుగోలుదారులు పాల్గొన్న ఈ వేలం పాటలో ఎల్ఐజి కేటగిరీకి చెందిన ప్లాట్ చదరపు గజం కనీస ధర రూ. 1.30 లక్షలుగా నిర్ధారించగా, చదరపు గజం రూ.2.65 లక్షలకు అమ్ముడుపోయిందని, మరో ప్లాట్ ను చదరపు గజం రూ.2.41 లక్షలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలో తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకోడానికి బిడ్డర్లు (కొనుగోలుదారులు) పోటీ పడ్డారని ఆయన తెలిపారు. అదే విధంగా సంపూర్ణం అపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు రూ .90 లక్షలను అప్సెట్ ధరగా నిర్దారించగా వీటిని కొనుగోలు చేయడానికి కూడా బిడ్డర్లు పోటీ పడి గరిష్టంగా రూ.1.10 కోట్లు, అలాగే ఇతర ఫ్లాట్లను రూ.1.08 కోట్లు, రూ.1.07 కోట్లు, రూ. 1.06 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ విధంగా శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ. 24.26 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వైస్చైర్మన్ విపి గౌతం వివరించారు. ఇందులో ఓపెన్ ప్లాట్ల ద్వారా రూ.15.81 కోట్లు, సంపూర్ణం అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల ద్వారా రూ. 8.45 కోట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం..
ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం.. కర్నూలు నగరంలో 722 మ్యాట్రిక్స్
విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటి సిఎం భట్టి భట్టి విక్రమార్క
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో మంత్రికి ప్రత్యేక ప్రోటోకాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకుని డిప్యూటి సిఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు భట్టికి వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ రంగారావు డిప్యూటి సిఎంకు అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. దర్శనం అనంతరం డిప్యూటి సిఎం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజుతో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కేంద్రీయ విద్యాలయంలో సందర్శన విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటుకేంద్ర జాయింట్ సెక్రటరీ దేవేంద్ర
ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కల్లు సొసైటీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం బరిగల ఎల్లమ్మ కుటుంబానికి ఆర్థిక సాయంమానవత్వం చాటుకున్నచంద్రయ్య,
apcm 5formulae : ఇక 5 సూత్రాల సేధ్యం Andhra Prabha Assembly
apcm 5formulae : ఇక 5 సూత్రాల సేధ్యం Andhra Prabha Assembly
పాక్-ఆఫ్ఘన్ మధ్య యుద్ధం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య భగ్గుమన్న సరిహద్దు వివాదం55 మంది
ETV Win announces 9 new Titles
ETV Win is slowly emerging as a prominent digital platform for the Telugu audience. Standing before the wave of digital giants like Netflix, Amazon Prime and others is not so easy. ETV Win has been picking up interesting projects that will appeal to the Telugu households and the family crowds. On the third anniversary of […] The post ETV Win announces 9 new Titles appeared first on Telugu360 .
ఇది తెలంగాణ వారసత్వం జీఐ ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ జిష్ణు
పెళ్లి తర్వాత తొలిసారి కలిసి కనిపించిన విజయ్ రష్మిక జంట #VijayDeverakonda #RashmikaMandanna
తొలిసారి ఫైనల్కు.. విజయం దిశగా జమ్ముకశ్మీర్
హుబ్లీ: తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్కు చేరిన జమ్ము కశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. తొలిసారి ఫైనల్కు చేరుకున్న ఈ జట్టు విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో జమ్ము కశ్మీర్ జట్టు 584 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో కర్ణాటక 293 పరుగులకే ఆలౌటై 291 పరుగుల వెనుకంజలో పడిపోయింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్ము కశ్మీర్ జట్టు 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ పకడ్బందీగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. 160 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సుతో 94 పరుగులు చేసి ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో జమ్ము కశ్మీర్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 477 పరుగల ఆధిక్యంలో ఉంది. క్రీజ్లో ఇక్బాల్తో పాటు సాహిల్ (16) ఉన్నాడు. ఈ మ్యాచ్లో జమ్ము గెలుపు ఇక లాంఛనమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇసుక తోడేళ్లపై పోలీస్ ఫైర్ స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
సమాచార హక్కు చట్టం దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు
సమాచార హక్కు చట్టం దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ
ఉపాధ్యాయ వేతనాలపై విద్యా కమిషన్ వ్యాఖ్యలు బాధాకరం
ఉపాధ్యాయ వేతనాలపై విద్యా కమిషన్ వ్యాఖ్యలు బాధాకరం తొర్రూరు, ఆంధ్రప్రభ : తెలంగాణ
గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు సహకరించాలి..
మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు సహకరించాలని ఎంపీడీవో గంగుల
విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలి
విశాలాంధ్ర – ధర్మవరం : విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని, ఇటువంటి అవకాశం కేవలం ఎన్సిసి ద్వారానే సాధ్యమవుతుందని పట్టణ ప్రముఖులు, టిడిపి నాయకుడు సంధ రాఘవ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్సిసి విభాగం రావడం జరిగింది. ఈ ఎన్సిసి లో ప్రభుత్వం 50 మంది ఎన్సిసి నేర్చుకునే విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేసే భాగంగా ముఖ్యఅతిథిగా వారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సంధ రాఘవ తో పాటు, […] The post విద్యార్థి దశ నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలి appeared first on Visalaandhra .
దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించండి…
మోదీకి సవాల్ విసిరిన కేజ్రీవాల్లిక్కర్ కేసులో క్లీన్చిట్ తర్వాత కేజ్రీవాల్ తొలి ప్రెస్ మీట్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని నాశనం చేసేందుకే కుట్ర పన్నారని ఆరోపించారు. దమ్ముంటే ఢిల్లీలో వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని కేంద్రానికి సవాల్ విసిరారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో క్లీన్చిట్ లభించిన అనంతరం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ […] The post దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించండి… appeared first on Visalaandhra .
ChilukurTemple |వంశపారంపర్య అర్చకుడిగా విశిష్ట సేవలు
ChilukurTemple | వంశపారంపర్య అర్చకుడిగా విశిష్ట సేవలు ChilukurTemple | చిలుకూరు బాలాజీ
Vivek Oberoi From Spirit: Icy Arrogance
Rebel Star Prabhas’ action entertainer Spirit, directed by Sandeep Reddy Vanga, is fast progressing with its shoot. As recently announced by the makers, the movie will grace the cinemas worldwide in nearly one year on March 5th, 2027. The makers who earlier unveiled first look of Prabhas and actress Tripti Dimri, have now unveiled the […] The post Vivek Oberoi From Spirit: Icy Arrogance appeared first on Telugu360 .
Kavitha : కవిత కుటుంబానికి, పార్టీకి మరింత దూరం అయ్యారా?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టులో క్లీన్ చిట్ లభించింది
‘స్పిరిట్’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్ ఫస్ట్లుక్ విడుదల
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా.. సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ని అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు సందీప్. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ ఫస్ట్లుక్ను ఆయన విడుదల చేశారు. ఈ పోస్టర్లో వివేక్ చాలా పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తెరపై ఇప్పటివరకూ చూడని సరికొత్త అవతారం ప్రభాస్ మనకు కనిపించనున్నారు. ఓ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పోలీసు కథతో పాటు, మాఫియా నేపథ్యాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా.. వివేక్ ఓబెరాయ్ విలన్గా నటిస్తున్నారు. సీనియర్ నటి కాంచన కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొమ్మిది భాషల్లో మార్చి 5, 2027న విడుదల కానుంది. Presenting you all, the antagonist of the film SPIRIT. Mr. Vivek Anand Oberoi. pic.twitter.com/e0imSbSDmm — Sandeep Reddy Vanga (@imvangasandeep) February 27, 2026
రాష్ట్రస్థాయి సీఎం కప్ క్రీడలలో సత్తా చాటిన విద్యార్థులు
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని నైన్ పాక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు
26yrs |సంగీత నుంచి విడాకుల పిటిషన్..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్కు
కేరళ స్టోరీ - 2 సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
కేరళ స్టోరీ - 2 సినిమా విడుదలకు హైకోర్టుగ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
వైసీపీ నేత బుర్రి బాబురావుకు నివాళులు..
వైసీపీ నేత బుర్రి బాబురావుకు నివాళులు.. విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ తూర్పు
ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి..
దండేపల్లి, ఆంధ్రప్రభ : రైతులు ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని
ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ భవన్లో మర్యాదపూర్వక భేటీ..
ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ భవన్లో మర్యాదపూర్వక భేటీ.. విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఏపీఎస్ఆర్టీసీ
చిలుకూరు బాలాజీ ఆలయ మాజీ పూజారి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ మరణించారు
Tamil actor Vijay is now a politician and he floated TVK. His political party is aiming to contest in all the Assembly constituencies of Tamil Nadu and the Election notification is due. Vijay is done with the shoot of his last film Jana Nayagan and the film releases soon. Vijay is completely occupied with his […] The post Big Shock for Vijay appeared first on Telugu360 .
బెల్లంపల్లిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం..
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి
సీఎం రిలీఫ్ ఫండ్ తో చిన్నారికి ప్రాణాధారం
సీఎం రిలీఫ్ ఫండ్ తో చిన్నారికి ప్రాణాధారం మోకాలి శస్త్రచికిత్సకు రూ.82,669 ఎల్ఓసీ
నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలి
డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు వారి కార్యాలయంలో పట్టణంలోని ప్రైవేట్ డాక్టర్స్ తో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ , జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆదేశానుసారము సమావేశం నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి, అలాగే అనుమతి ఉండాలి, హాస్పిటల్స్ […] The post నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలి appeared first on Visalaandhra .
Bonda Uma |రూ.20 కోట్లతో డిగ్రీ కళాశాల సాధ్యం..
Bonda Uma | రూ.20 కోట్లతో డిగ్రీ కళాశాల సాధ్యం.. Bonda Uma
పిట్లంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన..
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : రేపు పిట్లం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో
Breaking : టీవీకే చీఫ్ విజయ్ కు షాక్
తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే చీఫ్ విజయ్ కు షాక్ కుటుంబం నుంచి తగిలింది
Video : Vishnu Vinyasam Movie Review Analysis
The post Video : Vishnu Vinyasam Movie Review Analysis appeared first on Telugu360 .
రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాలలో రాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానితులను మొబైల్ స్కానింగ్ డివైస్ ద్వారా వారి యొక్క వేలిముద్రలతో తనిఖీ చేయడం జరిగిందని వారు తెలిపారు. దీనివలన ఎవరైనా గతంలో నేరాలలో పాల్గొనడం జరిగి ఉంటే వారిని ఈ యొక్క డివైస్ ద్వారా నేరస్థులుగా గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. ఇది నిరంతరము జరుగుతుందని తెలిపారు. అప్రమత్తమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. The post రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు appeared first on Visalaandhra .
క్రీడలతోనే సమాజానికి స్పూర్తి..
క్రీడలతోనే సమాజానికి స్పూర్తి.. విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల
ఆర్డీవో, ఎంపీడీవో, డీఎస్పీలు బదిలీ
వెంటనే రిలీవ్ కావాలని హైకోర్టు ఆదేశాలువిశాలాంధ్ర ధర్మవరం;; ఆర్డీవో మహేష్ ను, ఎంపీడీవో సాయి మనోహర్, డి.ఎస్.పి హేమంత్ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని కోరుతూ బదిలీ వేటు హైకోర్టు వేసింది. వివరాలకు వెళితే రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావడం జరిగిందని, అమరావతి లోని జిఏడీలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీఎస్పీ మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేసుకోవాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు […] The post ఆర్డీవో, ఎంపీడీవో, డీఎస్పీలు బదిలీ appeared first on Visalaandhra .
ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందిస్తా..
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థికంగా అండగా ఉంటామని విద్యార్థులకు
కవితకు న్యాయం జరిగిందంటూ కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్: మద్యం స్కామ్ పేరుతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఇదే కథ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి కారణమైందని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పుపై కెటిఆర్ ఎక్స్ లో స్పందించారు. మద్యం కేసులో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇవాళ న్యాయం జరిగిందని, తమ లీడర్లపై నమోదైన ప్రతి కేసు రాజకీయ కక్షలో భాగమేనని విమర్శించారు. నిజాలు బయటకు రానంతకాలం కాంగ్రెస్, బిజెపి దుష్ప్రచారాలను చూస్తూనే ఉంటామని తెలియజేశారు. ఏదేమైనా చివరకు న్యాయమే గెలుస్తుందని కెటిఆర్ పేర్కొన్నారు.
దళితులు ఆందోళన.. తుగ్గలి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం పరిధిలోని
పసుపు రైతులను మోసం చేసే సహించేది లేదు..
వేల్పూర్, ఆంధ్రప్రభ : పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రాష్ట్ర మరియు

24 C