భూతగాదాలో వదినపై మరిది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన ఇద్దరు మేనల్లుళ్లతో కలిసి ప్లాన్ చేసిన మరిది వ్యవసాయ బావి వద్ద ఒంటరిగా ఉన్న వదినపై కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో మెడపై నరికాడు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితులు, కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. ఈ దారుణ ఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... పాలడుగు గ్రామానికి చెందిన బొంత వెంకన్న, అశోక్ అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ములకు తండ్రి రామయ్య చెరో 8 ఎకరాల చొప్పున 16 ఎకరాల భూమి పంచి ఇచ్చాడు. తమ్ముడు అశోక్ జల్సాలకు అలవాటు పడి తన భాగానికి వచ్చిన భూమిలో సుమారు 5 ఎకరాల వరకు అమ్ముకున్నాడు. దీంతో అన్న వెంకన్న భూమిలో నుంచి కొంత భూమి తనకు ఇవ్వాలంటూ తమ్ముడు అశోక్ గత కొన్నేండ్లుగా గొడవ పడుతున్నాడు. భూతగాదాలతో అనారోగ్యం పాలైన అన్న వెంకన్న సుమారు ఆరు నెలల క్రితం చనిపోయాడు. దీంతో అన్న భూమిపై కన్నేసిన తమ్ముడు వదిన లక్ష్మీని రకరకాలుగా వేదిస్తూ దాడులు, గొడవలకు పాల్పడుతున్నాడు. ఇంటిపై దాడి చేసి ఇంట్లో వస్తువులన్నీ పగులకొట్టి భూమి పట్టాకాగితాలు, బంగారం ఎత్తుకపోయాడని బాధితురాలు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతని నుంచి ప్రాణ భయం ఉండటంతో స్వంత ఇంటిని వదిలి కూతురు, ఇద్దరు కొడుకులతో కలిసి అతని ఇంటికి దూరంగా ఓ పెంకుటింట్లో అద్దెకు ఉంటోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ బావి వద్ద పొలం నాటు వేయగా మంగళవారం కూలీలతో యూరియా చల్లించింది. కూలీలు వెళ్లిపోగా పని ఉండటంతో వదిన లక్ష్మీ బావి వద్దే ఉంది. మేనళ్లుళ్లతో కలిసి రెక్కీ నిర్వహిస్తూ మాటువేసిన మరిది అశోక్ వ్యవసాయ బావి వద్ద వదిన లక్ష్మీ ఒంటరిగా ఉన్నట్టు తెలుసుకుని బావి వద్దకు వెళ్లారు. మేనళ్లుల్లు లక్ష్మీని పట్టుకోగా మరిది అశోక్ కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో లక్ష్మీ మెడపై నరికాడు. చేతులతో అడ్డుకోబోగా రెండు చేతివేళ్లు తెగాయి. కత్తి వేటుతో లక్ష్మీ కేకలు వేయడంతో ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. రక్తస్రావం అవుతుండగా మెడకు టవల్ చుట్టుకుని లక్ష్మీ ఊళ్లోకి వచ్చింది. లక్ష్మీని తీవ్ర రక్తస్రావంలో చూసిన గ్రామస్తులు వెంటనే 108కు, పోలీసులకు ఫోన్ చేశారు. 108లో లక్ష్మీని చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. లక్ష్మీ కోమాలోకి వెళ్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మరిది అశోక్తో పాటు అతని మేనళ్లుల్లు పరారీలో ఉండగా, అశోక్ కుటుంబ సభ్యులు కూడా ఇంటికి తాళం వేసి పరారయ్యారు. మోత్కూరు సీఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడికి ఉపయోగించిన కొబ్బరిబోండాలు కొట్టే కత్తిని స్వాధీనం చేసుకున్నారు. భూతగాదా కారణంగా పెద్ద మనుషుల వద్ద పంచాది నడుస్తోందని, బాధితురాలు లక్ష్మీ పలుమార్లు మోత్కూరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. హత్యాయత్నంపై బాధితురాలు లక్ష్మీ అక్క చంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మీకి కూతురు రామేశ్వరి, కుమారులు రాంచరణ్, చంద్రశేఖర్ ఉన్నారు.
ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత మహిళా జట్టు ఓటమి పాలైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా టీమ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్కు దిగిన కంగారూ టీమ్ 38.2 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు అలీసా హీలీ, లిచ్ఫీల్డ్లు ఆస్ట్రేలియాకు శుభారంభం అందించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హీలీ 4 ఫోర్లతో 50 పరుగులు చేసింది. లిచ్ఫీల్డ్ ఆరు బౌండరీలతో 32 పరుగులు సాధించింది. వికెట్ కీపర్ బెథ్ మూనీ అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకుంది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మూడీ 79 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 76 పరుగులు సాధించింది. అనబెల్ సదర్లాండ్ 4 ఫోర్లు, ఒక సిక్స్తో అజేయంగా 48 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో స్మృతి మంధాన (58), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (53), రిచా ఘోష్ (23), కాశ్వి గౌతమ్ (43) మాత్రమే రాణించారు. ఆసీస్ బౌలర్లలో గార్డ్నర్ మూడు, మెగాన్ షుట్ రెండు వికెట్లు తీశారు.
AP DY.CM fIRE : నెయ్యిలో నెయ్యే లేదు Andhra prabha news
AP DY.CM fIRE : నెయ్యిలో నెయ్యే లేదు Andhra prabha news
మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువు తున్న భువన అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఆమె, సోమవారం రాత్రి తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం తోటి విద్యార్థి నులు ఈ విషయాన్ని గమనించి హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో హాస్టల్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భువన మృతి చెందిన విషయాన్ని యాజమాన్యం తమకు చాలా ఆలస్యంగా తెలిపిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాము హాస్టల్కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే యాజ మాన్యం పోలీసులకు సమాచారం అందించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువులో చురుగ్గా ఉండే భువన ఆత్మహత్య చేసుకునేంత బలహీనరాలు కాదని, ఆమె మృతి వెనుక ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం మంగళం పంచాయతీకి చెందిన రైతు సురేందర్ రెడ్డి, జానకి దంపతుల కుమార్తె అయిన భువన, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్న ఆశతో డేటా సైన్స్ కోర్సు చేస్తోంది. మరికొద్ది రోజుల్లో చదువు పూర్తి కావాల్సి ఉండగా, ఇలా విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. చదువుల ఒత్తిడి లేక మరేదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు హాస్టల్ సిబ్బందిని, స్నేహితులను విచారిస్తున్నారు. భువన తండ్రి స్పందన భువన తండ్రి స్పందించారు. తన కుమార్తె ఎందుకు ఇలా చేసిందో తెలియదని రూ. 17 లక్షల ప్యాకేజ్ తో ఉద్యోగం వచ్చిందని, తమ కష్టాలు తీరుతాయని అనే ఆనందంలో ఉండగా ఇలాంటి విషాద ఘటన జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. నాకు ఇద్దరు కుమార్తెలున్నారని మొదటి కుమార్తె భువన కాగా రెండో అమ్మాయి హర్షిత అదే కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోందని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంబీయూలో జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించాలంటూ విద్యార్థి సంఘాలు నినాదాలు చేశారు.
ap cm thown ycp : వైసీపీ హయాంలో మహాపాపం Andhra Prabha News
ap cm thown ycp : వైసీపీ హయాంలో మహాపాపం Andhra Prabha
రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ పై ఉన్న ధ్యాస..పేదలకు ప్రాణం పోసే హెల్త్ సిటీ పై లేదు: హరీష్ రావు
రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ పై ఉన్న ధ్యాస పేదలకు ప్రాణం పోసే హెల్త్ సిటీ పై లేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ పర్యటనలో హరీష్ రావు వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీందర్ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవ రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసుపత్రి పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మా దెబ్బకే సీఎంకు సోయి వచ్చింది మొన్న మేము దేవాదుల ప్రాజెక్టును సందర్శించినప్పుడు, సమ్మక్క బ్యారేజీలోని 10 మోటార్లలో కేవలం 6 మాత్రమే నడుస్తున్నాయని, రోజుకు 2700 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1700 క్యూసెక్కులు కూడా ఎత్తడం లేదని ఎత్తిచూపామన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఏ విధంగా దెబ్బతింటుందో ప్రజల ముందు ఉంచామని, ఆ దెబ్బకు తెల్లారి ముఖ్యమంత్రి హడావిడిగా రివ్యూ చేసి అన్ని మోటార్లు నడపాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఇది బీఆర్ఎస్ విజయమే కాదు, రైతుల విజయం అన్నారు. డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప.. పనులు కావడం లేదని, మంత్రులు దేవాదుల ప్రాజెక్టు తమ ప్రాధాన్యత అని పదేపదే చెప్తున్నారు కానీ చేతల్లో మాత్రం అది వారికి చివరి ప్రాధాన్యతగా మారిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో 7300 కోట్లు ఖర్చు పెట్టి 3 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందించామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు డెడ్ లైన్లు మార్చుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2027 మార్చి డెడ్ లైన్ పెట్టారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమో 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మరో కొత్త డెడ్ లైన్ పెట్టారన్నారు. రోజుకో డేట్ మారుతోందే తప్ప ప్రాజెక్టులో అంగుళం పని కూడా ముందుకు సాగడం లేదన్నారు. భూసేకరణకు నిధులు విడుదల చేయడం చేతకాని రేవంత్ రెడ్డి, ఉన్న మోటార్లను నడపలేక రైతుల పంటలు ఎండిపోయేలా చేస్తున్నారని, రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరిపై అనేక బ్యారేజీలు నిర్మించి, 312 కిలోమీటర్ల మేర గోదావరిని నిండుకుండలా సజీవంగా ఉంచిందన్నారు. 9 ఏళ్లలో మేం 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే, మీ రెండున్నరేళ్లలో కనీసం లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా?.. దేవాదులను పక్కనపెట్టి ఆంధ్రాకు నీళ్లు ఎలా వదులుతున్నావో, నల్లమల సాగర్ కు ఎలా సహకరిస్తున్నావో తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ముందు ఆ 10 శాతం పనులు పూర్తి చేసి రైతుల పొలాలకు నీళ్లివ్వు. బీఆర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల స్లాబులు పూర్తయిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని చూస్తుంటే బాధేస్తోంది. 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సింది. కేసీఆర్ గారు ఉండి ఉంటే ఈపాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. కానీ కాంగ్రెస్ వచ్చాక పనులు అటకెక్కి, రెండు దసరాలు పోయి మూడో దసరా వస్తున్నా కదలడం లేదు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ.. కేసీఆర్ కట్టిన ఈ హెల్త్ సిటీ మీద లేదు. ఫ్యూచర్ సిటీకి పెట్టిన శ్రద్ధలో 10 శాతం పెట్టినా ఈ పనులు ఎప్పుడో పూర్తయ్యేవి. కేసీఆర్ కి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ నిర్లక్ష్యం. ఈ హెల్త్ సిటీకి ఎన్ని నిధులు కావాలో బీఆర్ఎస్ ప్రభుత్వమే సమకూర్చి పెట్టింది. కానీ మీరు డిజైన్ల మార్పు పేరుతో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదు. జూన్ 2న ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్తున్నారు. 2000 పడకల ఈ ఆసుపత్రికి 2000 మంది నర్సులు, 1500 మంది డాక్టర్లు, 1000 మంది పారామెడికల్ సిబ్బంది కావాలి. ఇంత వరకు రిక్రూట్మెంట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందా? నోటిఫికేషన్ ఇచ్చారా? కనీసం సిబ్బంది లేకుండా హాస్పిటల్ ఎలా ప్రారంభిస్తారు? పేపర్లలో చూస్తే ఓపీ సేవలు ప్రారంభిస్తాం అని రాశారు. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటలా? లేక బస్తీ దవాఖానానా? వెంటనే ఎక్విప్మెంట్, సిబ్బంది నియామకం పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆసుపత్రిని ప్రారంభించాలి. వరంగల్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అసలు సోయి ఉందా? ఎంజీఎం పరిస్థితి చూస్తే వార్తలు రాసి రాసి పత్రికా విలేకరులే విసిగిపోయారు. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు వరంగల్ వచ్చినా ఒక్కసారైనా ఎంజీఎంను చూశారా? రెండున్నరేళ్లలో ఆరోగ్య మంత్రి అటువైపు వెళ్లారా? ఎంజీఎం ఇప్పుడు ఎలుకలు, పందికొక్కులకు నివాసంగా మారింది. వీల్ చైర్లు, స్ట్రెచర్లు, మంచాలు లేవు. టెస్టులకు మెటీరియల్ లేదు. ఎక్స్రే మిషన్లు పనిచేయవు. ఆయుష్ ఆసుపత్రిలో మందులు లేవు. ఎంజీఎంను తక్షణమే సమీక్షించి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి.పాత కబుర్లనే తీపి కబుర్లుగా సీఎం చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో మైసయ్య అనే రిటైర్డ్ ఎస్సై వైద్యానికి డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే పీఆర్సీ అమలు చేసి, బకాయిలు చెల్లించండి రెండున్నరేళ్లలో ఒక్కరికైనా కొత్త అక్రిడేషన్ కార్డ్ ఇచ్చారా? జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా జర్నలిస్టుల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. లేదంటే ప్రమాదవశాత్తు జర్నలిస్టులు మరణిస్తే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడతాయని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ను, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను సమానంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రి పూర్తయితే కొన్ని వేల మంది పేదలకు వైద్యం దొరుకుతుందని, కేసీఆర్ మీద పడి ఏడ్వడం మానేసి, 20 లక్షల స్క్వేర్ ఫీట్స్ తో కడుతున్న ఈ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని డిమాండ్ చేశారు.
Nani’s Aaya Sher From The Paradise: Monster Mad Anthem
Natural Star Nani isn’t just evolving. He’s erupting. With every new project, he leaves behind a version of himself and steps into a fiercer, bolder avatar. The Paradise, his second collaboration with director Srikanth Odela, marks his most untamed transformation yet. Aaya Sher, the first single released on Nani’s birthday, tears open the gates to […] The post Nani’s Aaya Sher From The Paradise: Monster Mad Anthem appeared first on Telugu360 .
కొణిదెలలో విషాదం.. మట్టి మీద కూలి వృద్ధురాలు మృతి నందికొట్కూర్, ఆంధ్రప్రభ :
Ranga Reddy |భర్తే కాలయముడు…
Ranga Reddy | భర్తే కాలయముడు… Ranga Reddy | మంచాల, ఆంధ్రప్రభ
குருமூர்த்தியுடன் மாணிக்கம் தாகூர் இருக்கும் புகைப்படம் வைரல் - உண்மை என்ன?
குருமூர்த்தியுடன் மாணிக்கம் தாகூர் இருப்பதாக புகைப்படம் தவறான தகவலுடன் வைரலாகி வருகிறது.
ఇసుక ట్రాక్టర్ సీజ్ కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం
వ్యాపారంలో నష్టం..ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
వ్యాపారంలో నష్టం వచ్చిందని తీవ్ర మనస్థాపానికి గురై ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఈ విషాద సంఘటన మంగళవారం అంబర్ పేటలో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ పేట బాపు నగర్ ప్రాంతంలో నివసించే కదేకర్ రామ్ రాజ్(54) పార్ట్నర్ షిప్ లో హోటల్ వ్యాపారం చేసినాడు. అందులో తీవ్ర నష్టం రావడంతో అప్పుల బాధ తట్టుకోలేక రామ్ రాజ్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవాలని ముందుగా నిర్ణయించుకుని ఈ ఆత్మహత్యలకు ఎవరికి సంబంధం లేదని లేఖ రాసి పెట్టారు. మంగళవారం ఉదయం ముందుగా భార్య కే. మాధవిని(50) దిండుతో ముఖంపై ఒత్తి చంపాడు. అనంతరం కొడుకు కె.శశాంక్ రాజు(27) తన మిత్రుడు రవికి మేము చనిపోతున్నామని ఫోన్లో మెసేజ్ పెట్టి తండ్రి రామ రాజ్ తో కలిసి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రవి ఉదయం 8 గంటలకు అంబర్ పేట లో నివాసానికి చేరుకోగా తలుపు ఓపెన్ ఉండటంతో తెరిచి చూడగా తండ్రి కొడుకులు ఫ్యాన్కు ఉరి వేసుకొని వేలాడుతున్నట్లు కనిపించారు. వెంటనే విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యురాలు కె. అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్ళగా ముగ్గురు మృతి చెందిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల దర్యాప్తు అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృతదేహాలు బంధువులకు అప్పగించారు. సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ట్రాఫిక్ నియమాలపై అవగాహన శిరస్త్రాణం శిరోభారం కాదు కుంటాల, ఆంధ్రప్రభ :శిరస్త్రాణం శిరోభారం
Minister | వివాహ వేడుకలు… Minister | కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలో
నవీన్ రాజ్ దంపతులకు పుష్పగుచ్చం అందజేత..
నవీన్ రాజ్ దంపతులకు పుష్పగుచ్చం అందజేత.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని
20 years | గొడవలే కారణమా… 20 years | హసన్ పర్తి,
రాష్ట్రంలోనే రెండో బహుమతి విద్యార్థిని అభినందించిన చైర్మన్ జన్నారం, ఆంధ్రప్రభ : రాష్ట్ర
పొలం వద్ద విద్యుత్ షాక్ గురై చిన్నారి మృతి
విద్యుత్ షాక్ కు గురై ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని మిర్జగూడ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మిర్జగూడ గ్రామానికి చెందిన ఇబ్రహీంపల్లి యాదయ్య - అనిత దంపతులకు కూతురు వర్షిణి (7), కొడుకు రుత్విక్ ఇద్దరు సంతానం. కాగా మంగళవారం చిన్నారులిద్దరూ తమ పెద్దమ్మ మౌనికతో కలిసి పొలానికి వెళ్లారు. చిన్నారుల పెదనాన్న మల్లేష్ తన పొలంలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అడవి పందుల బారి నుంచి మొక్కజొన్న పంటను రక్షించుకునేందుకు విద్యుత్ కంచెను పొలం చుట్టు వేశాడు. చిన్నారులిద్దరు తమ పెద్దమ్మ చేతులను విడిపించుకుని మొక్కజొన్న పంట వేసిన పొలంలోకి పరుగెత్తుకుని వెళ్లారు. అడవి పందుల బారి నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు పెదనాన్న మల్లేష్ వేసిన విద్యుత్ కంచె చిన్నారులిద్దరికి తగిలింది. చిన్నారులిద్దరూ విద్యుత్ షాక్ గురయ్యారు. ఇది గమనించిన పెద్దమ్మ మౌనిక చుట్టు పక్కల రైతుల సహాయంతో చిన్నారులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యుత్ షాక్ గురై వర్షిణి(7) అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. షాక్ గురై తీవ్ర గాయాలైన రుత్విక్ ను మెరుగైన వైద్య చికిత్సల కోసం హైదరాబాద్ నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారి వర్షిణి చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని నవ చైతన్య హై స్కూల్ లో చదువుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి వరకు తమ కళ్లముందు ఆడుకున్న చిన్నారులిద్దరిలో ఒకరు విద్యుత్ షాక్ గురై వర్షిణి చనిపోవడాన్ని జీర్ణించుకోలేక కన్నీరు కార్చారు. గాయాల పాలైన చిన్నారి రుత్విక్ ఆరోగ్యం కుదుట పడి తొందరగా ఇంటికి చేరుకోవాలని గ్రామస్తులు కోరుకున్నారు.
దేశ వ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్పివి వ్యాక్సిన్
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే హెచ్పీవీ వ్యాక్సిన్ ను 14 ఏళ్ల వయసు పైబడిన బాలికలకు ఉచితంగా అందించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు గార్డాసిల్ ఇంజెక్షన్ను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్ను నిరోధించే ఈ వ్యాక్సిన్ ఈ క్యాన్సర్కు కారణమయ్యే హెచ్పీవీ టైప్ 16.18,తోపాటు టైప్ 6,11 రకాల నుంచి రక్షణ కల్పిస్తుందని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఒక డోసు వ్యాక్సిన్ అందించడం వల్ల బాలికలకు సంబంధిత వైరస్ల నుంచి దీర్ఘకాల రక్షణ కల్పిస్తుందని దేశీయంగా అంతర్జాతీయంగా జరిపిన శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. 15 ఏళ్ల లోపు బాలికల కోసం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న గార్డాసిల్ 4 టీకాను రెండు డోసుల్లో తీసుకోవలసి ఉంటుంది. ఒక్కో డోసు ధర రూ.3927, అదే 15 ఏళ్ల వయసు పై బడిన బాలికలు మాత్రం మూడు డోసుల్లో తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ 2006లో అందుబాటు లోకి రాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 50 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు గణనీయంగా తగ్గినట్టు అంచనా. 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉండగా, వీటిలో 90 దేశాలు సింగిల్ డోసులో అందిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా, వీరిలో 15 లక్షల మంది భారతీయులే ఉన్నారు.
ఝార్ఖండ్ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం..ఏడు మృతదేహాలు కుటుంబీకులకు అప్పగింత
ఝార్ఖండ్ లోని చత్రా జిల్లా సిమారియా అడవిలో సోమవారం కూలిపోయిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి సంబంధించి ఏడుగురు మృతుల కుటుంబాలు తీరనిశోకంలో మునిగిపోయాయి. ఏడు మృతదేహాలను మంగళవారం మధ్యాహ్నం ఆయా కుటుంబాలకు అప్పగించారు. మృతుల్లో రోగితోపాఉ అతని కుటుంబ సభ్యులు,పైలట్, కోపైలట్, ఒక వైద్యుడు,పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఛత్రా లోని సాదర్ ఆస్పత్రిలో పోస్ట్మార్టమ్ నిర్వహించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించామని ఆరోగ్యవిభాగం అధికారి వెల్లడించారు. రాంచీ విమానాశ్రయం నుంచి సోమవారం రాత్రి 7.11 గంటలకు బయలుదేరిన ఈ విమానం రాత్రి 7.30 గంటలకు గల్లంతయ్యింది. బయలుదేరినదాదాపు 20 నిమిషాల తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. విమానం కూలిపోవడానికి ప్రతికూల వాతావరణం కారణం కావచ్చని రాంచీ ఎయిర్పోర్టు డైరెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. కానీ సమగ్రంగా దర్యాప్తు చేస్తేనే కానీ అసలు కారణం తెలీదన్నారు. మృతుల్లో కెప్టెన్ వికాస్ భగత్, కెప్టెన్ సవరాజ్దీప్ సింగ్, సంజయ్ కుమార్,డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చనా దేవి, ధురు కుమార్లను గుర్తించారు. ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్కుమార్ గంగ్వార్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఈ ప్రమాదంలో మృతులైన వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.
cops under cage : ఐపీఎస్ పక్షులు Andhara ptabha Analysis
cops under cage : ఐపీఎస్ పక్షులు Andhara ptabha Analysis (
వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత
వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత నిజామాబాద్, ఆంధ్రప్రభ : రైతులకు
లంచం తీసుకుంటుండగా ఎస్పిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ను ఎసిబి అధికారులు మంగళవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మామిడిసెట్టి శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్గా టిజిఎస్పిడిసిఎల్, మాసబ్ట్యాంక్ సెక్షన్లో ఎఈ ఆపరేషన్గా పనిచేస్తున్నాడు. ఓ విద్యుత్ వినియోగదారుడి మీటర్ను సీజ్ చేయకుండా ఉండాలంటే డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడు ఎఈని సంప్రదించడంతో రూ.16,000లు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు బాధితుడు ఎఈకి రూ.16,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు. ఎసిబి అధికారులు నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో ఎఈని అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో ఎఈ శ్రీనివాస రావును హాజరుపర్చడంతో ఎసిబి స్పెషల్ జడ్జి రిమాండ్ విధించారు. దీంతో ఎఈని ఎసిబి అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు.
ఓం గణేష్ మార్వాడి పాన్ బ్రోకర్ షాప్ సీజ్ చేయాలి..
ఓం గణేష్ మార్వాడి పాన్ బ్రోకర్ షాప్ సీజ్ చేయాలి.. స్టేషన్ ఘన్పూర్,
32 people |ప్రభుత్వ వైఫల్యమే డయేరియాకు కారణం…
32 people | ప్రభుత్వ వైఫల్యమే డయేరియాకు కారణం… 32 people |
High Court |రేపు విచారణకు రండి
High Court | రేపు విచారణకు రండి High Court | ఆంధ్రప్రభ,
Andhra Pradesh : చీఫ్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేసింది
Kiran Abbavaram |అంత పెంచేసాడా..?
Kiran Abbavaram | అంత పెంచేసాడా..? Kiran Abbavaram | వరుస సక్సెస్లతో
Journalists |సమస్యల పరిష్కారానికి వినతి..
Journalists | సమస్యల పరిష్కారానికి వినతి.. Journalists | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో
Telangana : మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ
మావోయిస్ట్ రహిత రాష్ట్రం గా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు
రూ.500 కోసం ఘర్షణ – పూజారిపై దాడి, ఆరోపణ.. నందికొట్కూరు, ఆంధ్రప్రభ :
Meenakshi Chaudhary |ఆ సంస్థలో నాలుగో సినిమా..?
Meenakshi Chaudhary | ఆ సంస్థలో నాలుగో సినిమా..? Meenakshi Chaudhary |
జనాభా లెక్కింపు మొదటి దశకు సంసిద్ధులు కావాలి
భారతదేశ జనాభా లెక్కింపు -2027 దేశ, రాష్ట్రాలు అభివృద్ధికి ప్రామాణిక డేటా అత్యంత ముఖ్యమైన జాతీయ కార్యక్రమం.. జనాభా లెక్కలు సేకరణలో పాల్గొనుట అదృష్టంగా భావించాలని మన సర్వీసుకు తీపిగుర్తులు అని, మనస్సుపెట్టి పనిచేసి లక్ష్యాలను అధిగమించాలి…. మూడు రోజులు శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని, భారతదేశ జనాభా లెక్కింపు మొదటి దశకు సంసిద్ధులు కావాలి… జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి… విశాలాంధ్ర ఏలూరు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం భారత జనాభా లెక్కింపు- 2027 […] The post జనాభా లెక్కింపు మొదటి దశకు సంసిద్ధులు కావాలి appeared first on Visalaandhra .
Collector |లూజ్ పాలు విక్రయాలపై దాడులు
Collector | లూజ్ పాలు విక్రయాలపై దాడులు విజయవాడలో విస్తృత తనిఖీలు7 శాంపిల్స్
Telangana : 'వాహన్' పోర్టల్ లోకి తెలంగాణ.. అన్నీ ఆన్ లైన్ లోనే
తెలంగాణలో వాహన యజమానులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే..
సంస్థ చైర్మన్ నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని లయోలా పాఠశాల పక్కన గల కృష్ణ చైతన్య మండలిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన దూలప్ప విచ్చేశారు. అనంతరం తలం నారాయణమూర్తి జగ్గా వేణుగోపాల్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా […] The post సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే.. appeared first on Visalaandhra .
రేపటి నుండి ఇంటర్ పరీక్షలు... నిబంధనలివే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి
Boyapati Srinu |యంగ్ హీరోతో సెట్ అయ్యిందా..?
Boyapati Srinu | యంగ్ హీరోతో సెట్ అయ్యిందా..? Boyapati Srinu |
jobs |డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావు …
jobs | డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావు … కర్నూలు ఎస్పీ విక్రాంత్
Electricity |విద్యుత్ షాక్తో…
Electricity | విద్యుత్ షాక్తో… Electricity | చేవెళ్ల, ఆంధ్రప్రభ : అడవి
Andhra Prabha Smart Edition |TS|ఆకలి కేక/కేటీఆర్ ఫైర్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 24-02-2026, 4.00PM ts అస్త్ర శాస్త్రాలతో అరిధమన్ విద్యార్థుల
వైభవంగా ‘అడ్డపల్లకి’గ్రామోత్సవం..
-ఆకట్టుకున్న సంప్రదాయ కళాకారుల నృత్యాలు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందిన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో గవిమఠం శ్రీస్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అడ్డపల్లకి-గ్రామోత్సవం వైభవంగా జరిగింది. పట్టణంలోని వెలిగొండ రహదారిలో ఉన్న విడిది మఠంలో పీఠాధిపతికి గవిమఠం సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్, అర్చకులు ప్రత్యేక పాదపూజ నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి శ్రీచెన్నబసవ రాజేంద్ర స్వాముల వారిని పల్లకిలో కూర్చోబెట్టి పురవీధుల […] The post వైభవంగా ‘అడ్డపల్లకి’ గ్రామోత్సవం.. appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |AP|ల్యాబ్ కళ్లు కప్పి/సృజనాత్మకత
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 24-02-2026, 4.00PM ap ల్యాబ్ కళ్లు కప్పి నెయ్యి
మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారం
విశాలాంధ్ర, ఉరవకొండ (అంతపురం జిల్లా) : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, మరియు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసుల కృషి వల్ల ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో కొలిమి లేఔట్ పయ్యావుల కాలనీ ఒకటిలో తాగునీటి సమస్య పరిష్కారమైనట్లు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మరియు పీఏసీ చైర్మన్ ప్యారం కేశవానంద, పెన్నహోబిలం దేవాలయం చైర్మన్ రేగటి నాగరాజు, ఉరవకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం పయ్యావుల […] The post మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారం appeared first on Visalaandhra .
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్జీ #Devji #Maoists #TelanganaPolice #Surrender
Bowrampet |నోట్లో బట్టలు కుక్కి.. కాళ్లు కట్టేసి..
Bowrampet | నోట్లో బట్టలు కుక్కి.. కాళ్లు కట్టేసి.. కన్న బిడ్డను కట్టెల
The alleged Tirumala laddu adulteration case has triggered a massive political storm in Andhra Pradesh. Chief Minister Chandrababu Naidu said that the episode was a grave sin committed during the previous YSRCP government. Speaking in the Assembly, he presented detailed figures and reports to support his claims. Deputy Chief Minister Pawan Kalyan strongly questioned why […] The post Tirumala Laddu Adulteration Case: Chandrababu Calls It a Grave Sin, Pawan Kalyan Questions Jagan’s Stand appeared first on Telugu360 .
Balakrishna |కథ చెప్పలేదా? అసలు నిజం ఏంటి?
Balakrishna | కథ చెప్పలేదా? అసలు నిజం ఏంటి?Balakrishna | బాలయ్య –
నటుడు నాని పుట్టినరోజు స్పెషల్ పోస్ట్ శ్రీకాంత్ ఓదెల భావోద్వేగ స్పందన #Nani #SrikanthOdela #Dasara
హెల్మెట్ స్ట్రాప్ బిగిస్తేనే పూర్తి రక్షణ
హెల్మెట్ స్ట్రాప్ బిగిస్తేనే పూర్తి రక్షణ డీసీపీ షరీన్ బేగం విజయవాడ, ఆంధ్రప్రభ
తమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ ‘చిన్నమ్మ’హవా మొదలుకాబోతోందా?
తమిళ ప్రజలకు త్వరలో శుభవార్త చెప్పబోతున్నా అంటూ శశికళ కీలక వ్యాఖ్యలు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలుతమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ ‘చిన్నమ్మ’ హవా మొదలుకాబోతోందా? ఇచ్చారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె స్మారకం దగ్గర శశికళ నివాళులు అర్పించారు. తమిళనాడుమాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ త్వరలో కొత్తపార్టీ పెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె స్మారకం దగ్గర శశికళ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె.. ‘తమిళ ప్రజలకు త్వరలో శుభవార్త […] The post తమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ ‘చిన్నమ్మ’ హవా మొదలుకాబోతోందా? appeared first on Visalaandhra .
వైసీపీలో ఆక్రమణ.. టీడీపీతో న్యాయం…
వైసీపీలో ఆక్రమణ.. టీడీపీతో న్యాయం… రాష్ట్ర డైరెక్టర్ ఎన్.సీ పరమేశ్వర్ రాప్తాడు, ఆంధ్రప్రభ
సామాజిక సేవలను విస్తృత పరచాలి తొర్రూరు, ఆంధ్రప్రభ : లయన్స్ క్లబ్ లు
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్జీ
తెలంగాణలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన నలుగురు సీనియర్ నాయకులు జనజీవనంలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (సీసీఎం) మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ రంగారం, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు […] The post పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్జీ appeared first on Visalaandhra .
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ : స్థానిక శ్రీనివాస్ నగర్లోని గీతాంజలి విద్యానికేతన్ పాఠశాల
దేశాన్ని కుదిపిన సీక్రెట్ సైబర్ ఆపరేషన్...104 మంది అరెస్ట్…#OperationOctopus #CyberCrime
కేరళ కాదు ఇకపై కేరళం .. కేంద్ర క్యాబినెట్ ఆమోదం
కేరళ రాష్ట్రం పేరు ఇకపై కేరళంఃగా మారింది. సంబంధిత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ నేడు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ నేడు ఆమోదం తెలిపింది. ఇకపై రాష్ట్రాన్ని ఃకేరళంః అని పిలిచేలా సంబంధిత బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మళయాళీ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రం పేరును మార్చాలనే ప్రతిపాదనలు మళయాళీ ప్రజల ఎప్పటినుంచో […] The post కేరళ కాదు ఇకపై కేరళం .. కేంద్ర క్యాబినెట్ ఆమోదం appeared first on Visalaandhra .
Chemicals |వారు ఒప్పుకుంటే ఇంత రచ్చ ఉండదు
Chemicals | వారు ఒప్పుకుంటే ఇంత రచ్చ ఉండదు Chemicals | ఆంధ్రప్రభ,
మురుగు కాలువలను శుభ్రం చేయాలి..
మురుగు కాలువలను శుభ్రం చేయాలి.. ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండల కేంద్రంలోని
జైనూర్ , ఆంధ్రప్రభ ; ప్రశ్నించే స్వరాన్ని అణిచివేయాలనే ప్రయత్నంగా ఆదివాసీ మహిళ
Festival-2026 |విదేశాల నుంచి లక్షలాది భక్తులు…
Festival-2026 | విదేశాల నుంచి లక్షలాది భక్తులు… మార్చి 6 నుంచి 8వ
హిందూ ధర్మ రక్షణకు సంఘటితంగా కృషి చేద్దాం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; హిందూ ధర్మ రక్షణకు సంఘటితంగా కృషిచేద్దామని నారాయణపేట విహెచ్
మావోయిస్టు దేవుజీతో పాటు ముగ్గురు కీలక నేతల లొంగుబాటు #Telangana #TelanganaPolice #MaoistSurrender
LG Face-2 |నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
LG Face-2 | నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి LG Face-2
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీకి జరిగినఎన్నికల్లో 5,8 వ వార్డుల నుండి
విద్యుత్ సమస్యపై స్పందించిన మున్సిపల్ వైస్ చైర్మన్
విద్యుత్ సమస్యపై స్పందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్
మావోయిస్టు పోలిట్బ్యూరో సభ్యుడి దేవుజీతో పాటు ముగ్గురు కీలక నేతల లొంగుబాటు
అగ్ర స్థాయి నిర్మాణం కూలిందన్న పోలీసులుపునరావాస విధానంలో రూ.90 లక్షల బహుమతి చెల్లింపు
రేవంత్ కు ఫ్యూచర్ సిటీపై ఉన్న ధ్యాస.. పేదలకు ప్రాణం పోసే హెల్త్ సిటీపై లేదు: హరీష్ రావు
వరంగల్: బిఆర్ఎస్ దెబ్బకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోయి వచ్చిందని బిఆర్ఎస్ నేత , మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మొన్న మేము దేవాదుల ప్రాజెక్టును సందర్శించినప్పుడు, సమ్మక్క బ్యారేజీలోని 10 మోటార్లలో కేవలం 6 మాత్రమే నడుస్తున్నాయని, రోజుకు 2700 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1700 క్యూసెక్కులు కూడా ఎత్తడం లేదని ఎత్తిచూపామన్నారు. వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, ఇతర బిఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఏ విధంగా దెబ్బతింటుందో ప్రజల ముందు ఉంచామని, ఆ దెబ్బకు తెల్లారి ముఖ్యమంత్రి హడావిడిగా రివ్యూ చేసి అన్ని మోటార్లు నడపాలని ఆదేశించారని, ఇది బీఆర్ఎస్ విజయమే కాదు, రైతుల విజయమని ప్రశంసించారు. డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప పనులు కావడం లేదని, మంత్రులు దేవాదుల ప్రాజెక్టు తమ ప్రాధాన్యత అని పదేపదే చెప్తున్నారు కానీ చేతల్లో మాత్రం అది వారికి చివరి ప్రాధాన్యతగా మారిందని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వంలో 7300 కోట్లు ఖర్చు పెట్టి 3 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందించామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు డెడ్ లైన్లు మార్చుకుంటూ కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2027 మార్చి డెడ్ లైన్ పెట్టారుని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమో 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మరో కొత్త డెడ్ లైన్ పెట్టారని ఎద్దేవా చేశారు. రోజుకో డేట్ మారుతోందే తప్ప ప్రాజెక్టులో అంగుళం పని కూడా ముందుకు సాగడం లేదని విమర్శలు గుప్పించారు. భూసేకరణకు నిధులు విడుదల చేయడం చేతకాని రేవంత్ రెడ్డి, ఉన్న మోటార్లను నడపలేక రైతుల పంటలు ఎండిపోయేలా చేస్తున్నారని, రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గోదావరిపై అనేక బ్యారేజీలు నిర్మించి, 312 కిలోమీటర్ల మేర గోదావరిని నిండుకుండలా సజీవంగా ఉంచిందని, 9 ఏళ్లలో మేం 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే, మీ రెండున్నరేళ్లలో కనీసం లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా? అని అడిగారు. ఇరిగేషన్ మీద అసెంబ్లీలో మాట్లాడతామని ముఖ్యమంత్రి అంటున్నారని, తాము మీ సవాల్ను స్వీకరిస్తున్నామని, మైక్ కట్ చేయకుండా, కెమెరా తిప్పకుండా చర్చకు పెట్టాలని, ఎన్ని రోజులైనా, ఏ ప్రాజెక్టు మీదైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజలే న్యాయ నిర్ణేతలు ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందామని సవాల్ విసిరారు. దేవాదులను పక్కనపెట్టి ఆంధ్రాకు నీళ్లు ఎలా వదులుతున్నావో, నల్లమల సాగర్ కు ఎలా సహకరిస్తున్నావో తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ముందు ఆ 10 శాతం పనులు పూర్తి చేసి రైతుల పొలాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల స్లాబులు పూర్తయిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని చూస్తుంటే బాధేస్తోందని, 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సిందని, కెసిఆర్ ఉండి ఉంటే ఈపాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చేదన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక పనులు అటకెక్కి, రెండు దసరాలు పోయి మూడో దసరా వస్తున్నా కదలడం లేదని, రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ కెసిఆర్ కట్టిన ఈ హెల్త్ సిటీ మీద లేదన్నారు. ఫ్యూచర్ సిటీకి పెట్టిన శ్రద్ధలో 10 శాతం పెట్టినా ఈ పనులు ఎప్పుడో పూర్తయ్యేవన్నారు. కెసిఆర్ గారికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ నిర్లక్ష్యమని, ఈ హెల్త్ సిటీకి ఎన్ని నిధులు కావాలో బిఆర్ఎస్ ప్రభుత్వమే సమకూర్చి పెట్టిందన్నారు. కానీ మీరు డిజైన్ల మార్పు పేరుతో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదని చురకలంటించారు. జూన్ 2న ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్తున్నారు. 2000 పడకల ఈ ఆసుపత్రికి 2000 మంది నర్సులు, 1500 మంది డాక్టర్లు, 1000 మంది పారామెడికల్ సిబ్బంది కావాలన్నారు. ఇంతవరకు రిక్రూట్మెంట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందా? నోటిఫికేషన్ ఇచ్చారా? కనీసం సిబ్బంది లేకుండా హాస్పిటల్ ఎలా ప్రారంభిస్తారు? అని ప్రశ్నించారు. పేపర్లలో చూస్తే 'ఓపీ సేవలు' ప్రారంభిస్తాం అని రాశారు. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటలా? లేక బస్తీ దవాఖానానా? అని నిలదీశారు. ఓపీ చూడ్డానికి ఈ హాస్పిటల్ ఎందుకు? బిఆర్ఎస్ హయాంలో వరంగల్ గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టామని, దీన్ని కూడా మరో బస్తీ దవాఖానా చేయకండన్నారు. వెంటనే ఎక్విప్మెంట్, సిబ్బంది నియామకం పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆసుపత్రిని ప్రారంభించాలని, లేదంటే బిఆర్ఎస్ పక్షాన ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణకు సంజీవని లాంటి వరంగల్ లో ఆరోగ్య శాఖ పరిస్థితి దయనీయంగా మారిందని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్ స్కీమ్ తెచ్చిందని, ఉద్యోగులకు 1% కంట్రిబ్యూషన్ తో, జర్నలిస్టులకు పూర్తిగా ఉచితంగా సేవలు అందించాలని నిర్ణయించామని, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం జర్నలిస్టులను చూస్తేనే విసుక్కుంటోందన్నారు. కెసిఆర్ 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు బడ్జెట్లలో జర్నలిస్టుల కోసం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా? అని నిలదీశారు. రెండున్నరేళ్లలో ఒక్కరికైనా కొత్త అక్రిడేషన్ కార్డ్ ఇచ్చారా? జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా జర్నలిస్టుల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని లేదంటే ప్రమాదవశాత్తు జర్నలిస్టులు మరణిస్తే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ను, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిన్న వరంగల్లో కార్పొరేటర్లను, మొన్న బాల్క సుమన్ను, ఆమన్గల్లులో బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని, కక్షలు కట్టడం కాదని ముందు ఆసుపత్రి కట్టు అని రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. ఆసుపత్రి పూర్తయితే కొన్ని వేల మంది పేదలకు వైద్యం దొరుకుతుందని, కెసిఆర్ మీద పడి ఏడ్వడం మానేసి, 20 లక్షల స్క్వేర్ ఫీట్స్ తో కడుతున్న ఈ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని డిమాండ్ చేస్తున్నమన్నారు. ఈ పర్యటనలో హరీష్ రావు వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీందర్ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవ రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Pradeep Ranganathan: Mad Rush and Remuneration Demand
Tamil actor Pradeep Ranganathan made an impressive debut with Love Today and he went on to do films like Dragon and Dude. All these films were massive hits at the box-office. He is now a Superstar in Tamil and his films also fared well in Telugu. Pradeep Ranganathan is in huge demand and he is […] The post Pradeep Ranganathan: Mad Rush and Remuneration Demand appeared first on Telugu360 .
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; ఇంటర్మీడియట్
Temple |మార్చి 8న మహా కుంభాభిషేకం..
Temple | మార్చి 8న మహా కుంభాభిషేకం.. అమ్మవారి కుంభాభిషేక మహోత్సవంమార్చి 6
తొలగించిన ప్రిన్సిపాల్ను తిరిగి నియమించొద్దు
తొలగించిన ప్రిన్సిపాల్ను తిరిగి నియమించొద్దు జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్
గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..
ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని షాంపూర్ సమీప వంతెనపై
Update on Rajinikanth’s Next Film
Superstar Rajinikanth is done with the shoot of Jailer 2 and his portions are completed. Nelson is the director and the film is aimed for August release this year. Rajinikanth has given his nod for his 173rd project and Cibi Chakaravarthi will direct the film. The pre-production work of the film is currently happening and […] The post Update on Rajinikanth’s Next Film appeared first on Telugu360 .
Dhurandhar Team’s Perfect Revenge Plan for Anupama Chopra
Dhurandhar is the biggest hit of the country for 2025 and all eyes are now eagerly waiting for the film’s sequel. The entire team has decided not to attend the awards event that is hosted by The Hollywood Reporter India and the video from the event is going viral all over. The host Neha Dhupia […] The post Dhurandhar Team’s Perfect Revenge Plan for Anupama Chopra appeared first on Telugu360 .
వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర : చంద్రబాబు
అమరావతి: బ్రిటీష్ పాలనలో కూడా తిరుమల వెంకటేశ్వరస్వామి జోలికి రాలేదని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ కులదైవం వెంకటేశ్వర స్వామి అని.. తనను కాపాడింది ఆ దేవదేవుడే అని..అన్నారు. ఎపి అసెంబ్లీలోతిరుమల లడ్డూలో కల్తీనెయ్యిపై చర్చ జరిగింది. అసెంబ్లీలో సిఎం ప్రసంగించారు. సుప్రీంకోర్టు సిట్ వేసిందని సిట్ ఛార్జిషీట్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసిదని, రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధన తొలగించారని విమర్శించారు. 2020 ఫిబ్రవరిలో టెండర్ నిబంధనలు మార్చారని, అంగీకరించక పోవడంతో తనిఖీలకు ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు నీరుగార్చారని, ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారని మండిపడ్దారు. కావాలని పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ఇందులో కుట్రకోణం ఉందని, సిండికేట్ గా తయారయ్యారని, 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని, దేవుడి కోసం తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించుకోవాలని అన్నారు. 2019-24 మధ్యలో 20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయని, ఎన్ డిడిబి రిపోర్టు రాగానే తాను ప్రకటన చేశానని, ఎన్ డిడిబి రిపోర్ట్ 2024 జులై 23న వచ్చిందని అన్నారు. కల్తీ నెయ్యి అని వచ్చినా రిపోర్ట్ ను తొక్కిపెట్టారని, సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి గానీ, కుట్రపూరిత ఆలోచన దీని వెనుక ఉంటుందని, కెమికల్స్ తో నెయ్యి తయారీ చేసి ఇంకా బుకాయిస్తున్నారని అన్నారు. ఈ పోరాటంలో భాగంగా కాలినడకన తిరుమల వస్తానని మొక్కుకున్నానని, తిరుమల తిరుపతి వెళ్లే ఆర్టిసి బస్సుల టికెట్ లో అన్యమత ప్రచారం చేశారని, అందుకే ఇది కుట్ర అని తాను అంటున్నానని చెప్పారు. ఆ జివోకు వ్యతిరేకంగా అసెంబ్లీలో పోరాటం చేశానని, తాను సిద్ధాంతపరంగా పోరాడానని అన్నారు. దేవాలయాల గురించి చాలా చులకనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసింది వాళ్లే భయపడి వెనక్కి తగ్గింది వాళ్లే, మళ్లీ దుష్ప్రచారం చేస్తుంది కూడా వాళ్లేనని సిఎం పేర్కొన్నారు. 2018 లో పింక్ డైమండ్ చోరీ జరిగిందని దుష్ప్రచారం చేశారని, మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఏం జరగలేదని అన్నారని, తిరిగి మనల్నే క్షమాపణ చెప్పమంటున్నారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఏడుకొండలు కాదు రెండు కొండలంటూ ఉత్తర్వులిచ్చారని, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లాలని తాము పరువు నష్టం దావా వేశామని అన్నారు. టిటిడిని రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేశారని, వైసిపి హయాంలో 85 మందితో జంబో బోర్డు వేశారని చెప్పారు. తాను కలలో కూడా ఏడుకొండలపై తప్పుగా మాట్లాడలేదని, కలియుగ దేవుడికి అపచారం చేయడం తగదని సూచించారు. ఇద్దరు టిటిడి ఛైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
వరల్డ్ ట్విన్స్ డే సందర్భంగా కవల అన్నదమ్ములతో కవల అక్కాచెల్లెళ్ల పెళ్లి...#WorldTwinsDay #Kamareddy
బిఆర్ఎస్ నేతల బుద్ది మందగిపు మాటలు
ఓర్మలేకనే…లేనిపోని ఆరోపణలు. అబివృద్ది చూసి ఓర్వలేకనే బురదజల్లే ప్రయత్నం.. బిఆర్ఎస్ అవగాహన లేక పోవడంతో ఓటమి. బిఆర్ఎస్ పాలనలో …
జనాభా లెక్కల సర్వే పక్కగా నిర్వహించాలి
జనాభా లెక్కల సర్వే పక్కగా నిర్వహించాలి పోలవరం (రంపచోడవరం) ఆంధ్రప్రభ ప్రతినిధి :
రాజమండ్రి కల్తీ పాల కలకలం... పలు పాల కేంద్రాల్లో అధికారుల తనిఖీలు #Rajahmundry #MilkAdulteration
తెలంగాణ నుంచి టీం లీడర్లుగా ముగ్గురికి అవకాశం
నిజామాబాద్, ఆంధ్రప్రభ : పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉక్రెయిన్
అతడిని జట్టులోకి తీసుకుంటే సరిపోతుంది...నెం:3 లో సూర్య రావాలి: ఇర్ఫాన్ పఠాన్
హైదరాబాద్: సూపర్-8లో దక్షిణాఫ్రికా జరిగిన మ్యాచ్ లో టీమిండియా 76 పరుగులతేడాతో ఓటమిని చవి చూసింది. దీంతో భారత జట్టు రన్ రేటు ఘోరంగా పడిపోయింది. మరో వైపు జింబాబ్వే పై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో గెలవడంతో రన్ రేటు ఆమాంతం పెరిగిపోయింది. సౌతాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే ఈ రెండు జట్లు సెమీ ఫైనల్ చేరుకుంటాయి. టీమిండియా జింబాబ్వే, విండీస్ పై గెలిచిన కూడా రన్ రేటు తక్కువగా ఉండడంతో భారత జట్టు ఇంటికి వెళ్లిపోతుంది. ఈ సందర్భంగా జింబాబ్వే, విండీస్ జట్లపై భారీ తెడాతో గెలిస్తేనే సెమీ ఫైనల్ చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ రావాలని సూచించాడు. ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ తో తొలుత బ్యాటింగ్ రావడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వాషింగ్టన్ సుందర్ కు బదులుగా అక్షర్ పటేల్ కు జట్టులోకి రావాలన్నారు. అక్షర పటేల్ తన బౌలింగ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇబ్బందులుకు గురిచేస్తాడన్నారు. అక్షర బ్యాటింగ్ నైపుణ్యం అద్భుతంగా ఉందని పఠాన్ తెలియజేశారు. సంజు శాంసన్, కుల్ దీప్ యాదవ్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి కానీ పెద్ద మొత్తంలో మార్పులు చేయకూడదని సలహా ఇచ్చారు. పెద్దగా మార్పులు చేయకుండా అక్షర్ ను తీసుకుంటే సరిపోతుందన్నారు.
Student | ఎక్కడంటే… Student | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇంజనీరింగ్
అటవీ సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అటవీ సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రంపచోడవరం రూరల్ (పోలవరం జిల్లా) ఆంధ్రప్రభ
ఘనంగా కళావేదిక కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం..
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, గ్రామీణ విద్యార్థుల
రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం
రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం చల్లపల్లి – ఆంధ్రప్రభ : రంజాన్
మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు ఘన సత్కారం
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన పెండెం లక్ష్మీ
డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడుతాం
డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడుతాం చల్లపల్లి – ఆంధ్రప్రభ : తమ న్యాయమైన
డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగింపు
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 15వ వార్డు పరిధిలో డ్రైనేజీల్లోని

23 C