SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
...

మొక్కజొన్న, జొన్న రైతులకు న్యాయం చేయాలి

మొక్కజొన్న, జొన్న రైతులకు న్యాయం చేయాలి వికారాబాద్, ఆంధ్రప్రభ : మొక్కజొన్న, జొన్న

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:26 am

అత్తాపూర్ నుంచి శివరాంపల్లి వరకు ఫుట్‌పాత్ ఆక్రమణలు కూల్చివేత

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో అత్తాపూర్ నుంచి శివరాంపల్లి వరకు అక్రమంగా నిర్మించిన ఫుట్‌పాత్ ఆక్రమణలపై జిహెచ్ఎంసి అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రజల నుండి స్పందన రాకపోవడంతో ఈరోజు టౌన్ ప్లానింగ్ ఎసిపి శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు నిర్వహించారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్మాణాలను కూడా కూల్చివేస్తామని జిహెచ్ఎంసి అధికారులు హెచ్చరించారు.

మన తెలంగాణ 18 Apr 2026 11:25 am

ప్రకాష్‌రాజ్‌పై పరువు నష్టం దావా

నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరువు నష్టం దావా వేశారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 11:24 am

ఉపాధి హామీ పనులను పరిశీలించిన జగత్ జయదేవ్ ఆర్య

బెజ్జంకి, ఆంధ్రప్రభ : జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (DRDA) పిడి శ్రీ

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:21 am

KTR |ఈ నెల 20న ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌

KTR | ఈ నెల 20న ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ KTR |

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:20 am

Loksabha : ఉభయ సభలు నిరవధిక వాయిదా

లోక్ సభ నిరవధికంగా వాయిదా పడింది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 11:18 am

బ్రిటన్ పార్లమెంట్ లో మాజీ ఎంపి సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం

హౌస్ ఆఫ్ లార్డ్స్ లో గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందజేత వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాన్ క్లేవ్ లో గ్రీన్ ఇండియా చాలెంజ్ పై ప్రశంసల వర్షం లండన్ : హరిత ఉద్యమాన్ని ఓ బాధ్యతగా భావించి ఆ దిశగా లక్షలాది మంది మొక్కలు నాటేలా ప్రభావితం చేసిన బిఆర్ఎస్ నేత,  రాజ్యసభ మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ కు బ్రిటన్ పార్లమెంట్ లో అరుదైన గౌరవం దక్కింది. పర్యావరణ సంరక్షణ కోసం పాటుపడిన వారి కోసం ఉద్దేశించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని బ్రిటన్ పార్లమెంట్ లో సంతోష్ కుమార్ కు అందజేశారు. శుక్రవారం (2026 ఏప్రిల్ 17న) హౌస్ ఆఫ్ లార్డ్స్ లో జరిగిన ప్రపంచ వాతావరణ సంరక్షకుల సదస్సు (వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాన్ క్లేవ్) లో ఆయనను ఈ అవార్డుతో సత్కరించారు. ఎంఆర్ నిక్ న్యూలాండ్ ఎస్నార్ వైస్ ప్రెసిడెంట్ యునెస్కో, బ్రిటిష్ పార్లమెంట్ సీనియర్ సలహాదారు డేవిడ్ తాంప్సన్, నికెల్ ఎడ్విన్ అడ్వైజర్ టు కౌంటీ కౌన్సిల్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ పలువురు ముఖ్య బ్రిటిష్ అధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులు ఈ కాన్ క్లేవ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా హౌస్ ఆఫ్ లార్డ్ష్ ప్రతినిధులు .. సంతోష్ కుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమానికి కితాబునిచ్చారు. లక్షలాది మంది పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టేలా స్ఫూర్తినిచ్చారంటూ శ్లాఘించారు.   పచ్చటి మొక్కలతోనే భవిష్యత్తంటూ.. ఇగ్నైటింగ్ మైండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులైన సంతోష్ కుమార్ పచ్చటి మొక్కలతోనే అందమైన భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎంపి సంతోష్ కుమార్ భావించారు. తెలంగాణలో హరితహారం ఇచ్చిన స్ఫూర్తితో వసుధైక కుటుంబం నినాదంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం నడిపారు. ఇందులో భాగంగానే.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు లక్షలాది మంది పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. తెలంగాణలో పలుచోట్ల చిట్టడవులు పచ్చగా కళకళలాడేలా చేయగలిగగారు.పర్యావరణ సంరక్షణలో సంతోష్ కుమార్ కృషిని గుర్తించిన వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాన్ క్లేవ్ .. గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని అందజేసింది.   సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది ... హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఈ అరుదైన పురస్కారం దక్కినందుకు నిజంగా గర్వంగా ఉందని మాజీ ఎంపి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తన ఒక్కడి ఘనతేనని భావించడం లేదని, తాము చేపట్టిన గ్రీన్ చాలెంజ్ ఉద్యమంలో లక్షలాది మంది పాలు పంచుకోవడం వల్లే తనకు ఈ పురస్కారం దక్కిందన్నారు. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారమే గ్రీన్ ఇండియా ఉద్యమానికి స్ఫూర్తి గా నిలిచిందని తెలియజేశారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో 280 కోట్ల మొక్కలు నాటడం చరిత్రలోనే ఓ మైలు రాయి అని, పర్యావరణ సమతుల్యత కోసం చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం అని ప్రశంసించారు.  ప్రకృతి హితం కోసం హరితహారం తమకు ఓ సంకల్పాన్ని అందించిందని, అందులోనుంచే గ్రీన్ ఇండియా చాలెంజ్ పుట్టిందని, ఆ ఉద్యమంలో భాగంగానే గ్రామస్థాయి నుంచి కాస్మొపాలిటన్ నగరాల వరకు లక్షలాది మంది మొక్కలు నాటారని సంతోష్ కుమార్ ప్రశంసించారు. హరిత ధరిత్రి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలనే భావనను గ్రీన్ ఇండియా చాలెంజ్ కలిగించిందని, లక్షలాది మైండ్ సెట్ మార్చగలిగిందన్నారు. ఈ పురస్కారం మరిన్ని బాధ్యతలను గుర్తు చేసిందని తెలిపారు. భవిష్యత్ తరాలను హరితమయం చేసే దిశగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలా ఈ అవార్డు స్ఫూర్తినిచ్చిందని సంతోష్ కుమార్ వివరించారు. 

మన తెలంగాణ 18 Apr 2026 11:14 am

2వ వార్డులో సమస్యలపై మున్సిపల్ చైర్మన్ సమీక్ష

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 2వ

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:14 am

కొమ్మలపాటి శ్రీధర్ కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం..

కొమ్మలపాటి శ్రీధర్ కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం.. చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : మాజీ

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:13 am

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : రోడ్డు భద్రత

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:11 am

Indian Cricket : యంగ్ ఇండియాతో ఐర్లాండ్ టూర్ లో ప్రయోగం

ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించిన వారికి బీసీసీఐ టీం ఇండియాలో స్థానం కల్పించేందుకు సిద్ధమయింది.

తెలుగు పోస్ట్ 18 Apr 2026 11:10 am

పిల్లల ప్రాణాలు హరిస్తున్న “సరదాలు”

పిల్లల ప్రాణాలు హరిస్తున్న “సరదాలు” సరదాలు.. ప్రమాదాలుజాగ్రత్తలు లేకుంటే తీరని నష్టమే మాచర్ల,

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:09 am

వెంకటేశ్వర్లుకు బ్రాంజ్ డిస్క్ అవార్డ్ రావడం పట్ల హర్షం

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ ఫైర్ స్టేషన్‌లో పనిచేస్తున్న జుట్టుకొండ వెంకటేశ్వర్లుకు దేశ

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:05 am

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష టన్నుల చెత్తతో దుర్గంధం భరించాం.!

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష టన్నుల చెత్తతో దుర్గంధం భరించాం.! మచిలీపట్నం –

ప్రభ న్యూస్ 18 Apr 2026 11:02 am

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు చేరిన పెరుగు పంచాయతీ... విచిత్ర దంపతులు

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య పెరుగు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. బక్కగా సన్నగా ఉన్నావని పెరుగు తింటే లావుగా అవుతావని భార్యను పలుమార్లు వేధించడంతో పాటు పెరుగు తిన్నాలని భర్త ఒత్తిడి తీసుకొచ్చాడు. పాల పదార్థాలు తనకు పడవని భార్య చెప్పడంతో దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో తన భార్య కనిపించడంలేదని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో భర్త ఫిర్యాదు చేశాడు. 

మన తెలంగాణ 18 Apr 2026 10:48 am

వలస కార్మికులపై యుద్ధప్రభావం

పశ్చిమాసియా లోని బహ్రయిన్, కువాయిట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లోని భారతీయ వలస కార్మికులు ఇరాన్ అమెరికా యుద్ధ బీభత్సం వల్ల ఉపాధి కోల్పోయి దిక్కుతోచక స్వదేశానికి తిరిగి తరలి వస్తున్నారు. గత మార్చి నుంచి తాము పనిచేస్తున్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి 3,75,000 మంది వలస కార్మికులు తిరిగి స్వదేశానికి తరలి వచ్చేశారు. గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాల భారతీయ వలస కార్మికుల నుంచి ఏటా భారత్‌కు 45 బిలియన్ డాలర్లు వరకు చెల్లింపులు జరిగేవి. అంటే భారత్ లోని అంతర్గత చెల్లింపుల వెల్లువలో దాదాపు సగం.ఈ నిధులు భారత వాణిజ్యంలో గణనీయంగా లోటును తీర్చేవిగా ఉంటున్నాయి. అయితే యుద్ధం నుంచి ఈ పరిస్థితి మారిపోయింది. వలస కార్మికుల నుంచి స్వదేశానికి నిధులు రావడం ఆగిపోయింది. విదేశాల్లో ఆర్థిక మాంద్యం, ఉపాధి కోల్పోవడం వల్ల కార్మికులు డబ్బు పంపలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని ఒక విధంగా ‘విదేశీ మారక ద్రవ్య సంపీడనం’ అని వ్యవహరిస్తున్నారు. డబ్బు రాకపోవడంతో స్వదేశం భారత్‌లో ఉన్నవారు ఉపాధి కోసం వెదుక్కుంటున్నారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న డబ్బుతో చాలీచాలని అవసరాలతో కొందరు సర్దుకుపోతున్నారు. ఇది కుటుంబాల జీవన ప్రమాణాలను, దేశ ఆర్థిక స్థిరత్వాన్ని, స్థానిక మార్కెట్లను కుదిపేసే నిజమైన ఆర్థిక సంక్షోభం. ఇది కేవలం ప్రభుత్వ సంక్షేమ గణాంకాలతో పరిష్కారమయ్యేది కాదు. కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గ్రామీణ జీవన ఆర్థిక పరిస్థితికి పెద్ద దెబ్బ. ఇంటి ఖర్చులకు, ఆస్తుల పెట్టుబడికి, పిల్లల చదువుకు తగిన ఆర్థికస్తోమతు లేకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉండగా అసంఘటిత కార్మికులు తీవ్ర పేదరికం లోకి నెట్టబడుతున్నారు. ఎల్‌పిజి వినియోగంలో 60% భారత్ దిగుమతి పైనే ఆధారపడుతోంది. ఈ మొత్తంలో 90% హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. మార్చి మొదటి వారంలో ఈ రవాణా మార్గం తీవ్ర ఒత్తిళ్లకు గురి కావడంతో సరకుల రవాణాకు, సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అసంఘటిత కార్మికులు 40కోట్ల మంది కార్మికులు పేదరికం లోకి నెట్టబడ్డారు. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల కోసం ఐదు కిలోల గ్యాస్ సిలిండర్లు దాదాపు 30,000 వరకు పంపిణీ చేస్తున్నా నమోదిత గృహ కనెక్షన్ల ద్వారానే ఈ పంపిణీ సాగుతుండడంతో వివిధ పరిశ్రమల్లో పనిచేసే వలస కార్మికులకు ఇవి చేరడం లేదు. దేశ తయారీ రంగానికి సంబంధించి వస్త్ర పరిశ్రమలు, నిర్మాణ రంగంలో కోట్లాది మంది వలస కార్మికులు పని చేస్తున్నారు. వస్త్ర పరిశ్రమలో సింథటిక్ ఫైబర్స్, డైస్, కోటింగ్‌లను వినియోగిస్తుంటారు. వీటికి పెట్రో కెమికల్స్ ముడి సరకులు. దీనికి తోడు నాఫ్తా, ఎల్‌పిజి, నిల్వల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉత్పత్తుల ధరలు కూడా అమాంతంగా పెరిగాయి. వస్త్రాల తయారీ యూనిట్లు ఏవైనా అధికారికంగా మూసివేసే ముందు కార్మికులు పనిచేసే షిఫ్టులను తగ్గిస్తుంటారు. ఉత్పత్తులు తగ్గడమే కాక, వేతనాలు సరిగ్గా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ఫ్యాక్టరీలు మూతపడటానికి దోహదం చేస్తుంది. వ్యవసాయం తరువాత వలస కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే రంగం నిర్మాణ రంగమే. పెట్రోల్ ఆధారిత మెటీరియల్ ధరలు పెరగడంతో ఇంధనానికి సంబంధించిన ఇతర సమస్యలు తలెత్తి నిర్మాణానికి కావలసినవేవీ అరుదైపోతున్నాయి. దాంతో నిర్మాణాలపై డెవలపర్లు పెట్టుబడులను తగ్గిస్తున్నారు. ఉదాహరణకు గుజరాత్‌లో నిర్మాణరంగం లోని కార్మికులు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. పోర్టు పనుల్లో పనిచేసే వారు, రవాణా రంగంలో పనిచేసేవారు దాదాపు లక్ష మంది కార్మికులు పని దొరకుతుందో లేదో అన్న సందేహంతో హోళీ పండగ తరువాత పనుల్లోకి రావడం లేదు. వ్యవసాయ రంగానికి సంబంధించి యూరియా ఉత్పత్తికి సహజవాయువు (నేచరల్ గ్యాస్) ఎంతో అవసరం. గ్యాస్ ధరలు పెరగడంతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలతో సంబంధం లేకుండా యూరియా ఉత్పత్తుల ధరలు, ఆహార రిటైల్ మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వలస కార్మికుడు ఒక పక్క ఎక్కువ ధరతో ఎల్‌పిజిని కొనుక్కోవలసి రావడం, మరో వైపు ఎక్కువ ధరలకు ఆహారాన్ని కొనుగోలు చేయడం తప్పడం లేదు. ఈ ఆర్థిక పరిణామాలు అర్బన్ లోను, గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అర్బన్ ఏరియాల్లోని పరిశ్రమలు కార్మికుల కొరతతో అల్లాడుతుండగా, తిరిగి స్వగ్రామాలకు తరలివస్తున్న వలస కార్మికులకు గ్రామాల్లో ఉపాధి దొరకడం లేదు. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దౌత్యమార్గాల ద్వారా హర్మూజ్ జలసంధి ద్వారా చిక్కుకుపోయిన ఎనిమిది ఎల్‌పిజి ట్యాంకర్లను దేశానికి రప్పించగలగడం కొంతవరకు మేలు బాట అవుతుంది. స్వదేశీ ఎల్‌పిజి ఉత్పత్తి దాదాపు 40% పెరిగింది. రిఫైనరీలు తమ సామర్థాన్ని మించి ఆపరేషన్ చేస్తున్నాయి. వీటన్నిటివల్ల దేశంలో తయారీ, నిర్మాణ రంగాల్లో సరఫరాకు ఆటంకాలు కొంతవరకు నివారించగలిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక మూడవ శ్రేణి ఆర్థిక పరిణామాలకు అంటే పరిశ్రమలు మూతపడడం, పెట్టుబడులు వేరే దేశానికి తరలిపోవడం, నైపుణ్యాలు తగ్గిపోవడం వంటి వ్యవస్థాగత మార్పుల్లో తగిన స్పందనలు రావలసి ఉందని భావిస్తున్నారు. వలస కార్మికులు తమ ఇళ్లకు తరలిపోయే పరిస్థితి రాకుండా పాలనా పరమైన విధానాలతో ఆయా పరిశ్రమలను పర్యవేక్షించడం తప్పనిసరి. వేతనాలకు గ్యారంటీ కల్పించడంతోపాటు పునరావాసం కల్పించడం వంటి చర్యలు తక్షణం చేపట్టవలసి ఉంది. 

మన తెలంగాణ 18 Apr 2026 10:43 am

దిగ్బంధనం కొనసాగితే…హోర్మూజ్‌ను మూసేస్తాం: ఇరాన్

తెహ్రాన్: ఉద్రిక్తితల నడుమ 47 రోజుల తర్వాత చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో వాణిజ్య నౌకల రవాణాకు అడ్డంకులన్నీ తొలగినట్లు అంతా భావించారు. అయితే, ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం కొనసాగుతుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఉద్రిక్తతలను మరోసారి పెంచింది. ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన ఇరాన్. దిగ్బంధనం కొనసాగితే హోర్మూజ్‌ను మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. […] The post దిగ్బంధనం కొనసాగితే…హోర్మూజ్‌ను మూసేస్తాం: ఇరాన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 10:35 am

రెండో విడతలో తేలేనా?

అమెరికా ఇరాన్ మధ్య రెండవ విడత చర్చలంటూ జరిగితే ఈసారైనా ఒక రాజీ అంటూ జరిగేనా? ఎవరూ చెప్పలేరు. చర్చలు ఎపుడు జరగవచ్చు? ప్రస్తుత సూచనలను బట్టి బహుశా వచ్చే వారం. మొదటి చర్చలు 12న విఫల మైన తర్వాత రెండు రోజులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనంతట తానే తిరిగి చర్చలు ‘రెండు మూడు రోజుల్లో’, మళ్లీ ఇస్లామాబాద్‌లోనే అన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇటువంటి తీవ్రమైన విషయమై దౌత్య చర్చలు మొదటి విడతలోనే ఒక కొలిక్కి రావటం జరగదు. ఒకోసారయితే నెలలు, సంవత్సరాల తరబడి చర్చలు సాగుతూనే ఉంటాయి. ప్రస్తుత యుద్ధంలో ఇమిడి ఉన్న అంశాలు చాలా తీవ్రమైనవి. వాటికి దశాబ్దాల నేపథ్యం ఉందన్నది తెలిసిందే. అమెరికా ఇరాన్‌ల మధ్య సమస్య ఇరాన్ ప్రధానమంత్రి మొసాదెగ్ ప్రభుత్వాన్ని అమెరికన్ సిఐఎ, బ్రిటిష్ ఎంఐ6 లు కలిసి అక్కడి చమురు కోసం 1953లో కూలదోయటం నుంచి మొదలై పలు కారణాలతో, పలు రూపాలలో నేటికీ కొనసాగుతున్నది. పశ్చిమాసియా అంతటా తనదే ఆధిపత్యం కావాలని, గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పడాలని, స్వతంత్ర పాలస్తీ ఎన్నటికీ ఏర్పడరాదని, ఈ లక్షాల కోసం ఇరాన్ విచ్ఛన్నం కావాలని కోరుకునే ఇజ్రాయెల్ అందుకు తోడైంది. ఇరుపక్షాల వివాదానికి మధ్యలో ఇరాన్ అణుపరిశోధనల వివాదం వచ్చి చేరింది. ఈ మౌలికమైన చిక్కుముళ్లు తేలకుండా, తన స్వాతంత్య్రానికి, సార్వభౌమతకు, అంతర్జాతీయ హక్కుల పరిరక్షణలు భరోసా అన్నది ఇరాన్‌కు లభించకుండా ఎన్ని విడతల చర్చలు జరిగినా సమస్య తేలుతుందా అన్నది ప్రశ్న. ఎంతో కొంత కాలం కాల్పుల విరమణలు ఏవో కొన్ని రాజీలు కుదరటం వేరు, శాశ్వత మైన పరిష్కారాలు వేరు. మొదటి విడత చర్చలకు ముందు, ఇపుడు రెండవ విడత చర్చలు జరగనుండగా కూడా అమెరికా కోరుకుంటున్నది తాత్కాలిక విరామాలను మాత్రమే. అంతేతప్ప తన ఆధిపత్య ఆలోచనలను వదలుకునే లక్షణాలు చూపటం లేదు. ఇరాన్ మాత్రమే ప్రతిసారి కేవలం కాల్పుల విరమణలు కాదు, శాశ్వత పరిష్కారాలు అవసరమని, తాత్కాలికాల వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేస్తున్నది. ఈ పరిస్థితి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని గుర్తు చేస్తుంది. అక్కడ ఉభయుల మధ్య వివాదంలో ఇతర అంశాలు ఎట్లున్నా, నాటో సైనిక కూటమిలో ఉక్రెయిన్ చేరకపోవటం తమకు అన్నిటికన్న ప్రధానమని, అందుకు ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్, నాటో కూటమి, అమెరికా హామీ ఇస్తే అపుడు సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని, అట్లాగాక స్వల్పకాలిక యుద్ధ విరమణల వల్ల ఉపయోగమేమిటని రష్యా ప్రశ్నిస్తున్నది. ఇరాన్ వైఖరి కూడా అటువంటిదే. కాని అమెరికా ఆ జోలికి వెళ్లకుండా, తాత్కాలికమైన వేవో చేసి, ఇరాన్‌ను రకరకాలుగా ఒత్తిడి చేస్తూ, తమ ప్రయోజనాలను నెరవేర్చుకొనజూస్తున్నది. ఇజ్రాయెల్ గురించి అయితే చెప్పనక్కర లేదు. వారికి అసలు తాత్కాలిక విరమణలు గాని, అరకొర పరిష్కారాలు గాని సరిపడవు. ఏదో విధంగా అమెరికాను ఉపయోగించుకుంటూ ఇరాన్‌ను ఛిన్నాభిన్నం చేయటమే వారికి కావలసింది. ఈ మాట ఇతరులు అంచనా వేయనక్కర లేకుండా స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తరచు బహిరంగంగానే అంటుంటారు. ఇది ఇటీవలనే రెండుసార్లు రుజువైంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు అమెరికా ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదరనుండగా దానిని భంగపరచేందుకు ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. మొన్న మొదటి విడత చర్చలకు గల షరతులలో లెబనాన్ పై కూడా దాడుల విరమణ అన్నది ఒకటి కాగా, అందుకు పాకిస్థాన్ ద్వారా మొదట ఒప్పుకుని అంతలోనే ఉల్లఘించటం మొదలుపెట్టారు. అదేమిటని ఇరాన్ ప్రశ్నించగా, కాల్పుల విరమణ ఒప్పందంలోకి లెబనాన్ రాదని ఇజ్రాయెల్ ఆ తర్వాత ట్రంప్ వాదించారు. అక్కడ కూడా విరమణ జరిగితే తప్ప తాము చర్చలలో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేయటంతో, లెబనాన్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని అపుడన్నారు. అవి ఎక్కడ తేలేదీ, తేలనిదీ చెప్పలేమన్నది అట్లుంచితే, మొత్తం మీద చర్చలు, పరిష్కారాలపట్ల ఎవరి వైఖరి ఏమిటన్నది ఈ వివరణలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మొదటి విడత వైఫల్యం తర్వాత కూడా అమెరికా అధ్యక్షుని తీరు ఎంతమాత్రం మారలేదు. ప్రతిసారీ ఒకవైపు చర్చలు, మధ్యలోనే దాడులు అనే కనీవినీ ఎరుగని ధూర్తమైన దౌత్యాన్ని ప్రదర్శించే ఆయన, ఈసారి చర్చలు ముగిసినాక రెండవసారి చర్చలని అంటూనే హర్మూజ్ జలసంధి దిగ్బంధాన్ని ప్రకటించారు. ఆ విధంగా ఇరాన్ ఒత్తిడికి లోనై లొంగిపోతుందని తన అంచనా అనుకోవాలి. కాని ఏమైంది? ఒకవైపు ఇరాన్ ముప్పు, మరొక వైపు అమెరికా ముప్పుతో రవాణా స్తంభించిపోయింది. ఇరాన్ రేవుల నుంచి రవాణా తగ్గింది గాని పూర్తిగా ఆగలేదు. వారు ఇతర ప్రత్యామ్నాయాల కనిపెట్టారు. నిత్యావసర సరకుల రవాణా చైనాలోని శియాన్ నగరం నుంచి మధ్య ఆసియా మీదుగా రైలు మార్గంలో మొదలైంది. హర్మూజ్‌లో కుడి వైపున ఇరాన్ రేవులు పెద్దవి మూడు మాత్రమే ఉండగా, ఎడమ వైపున అమెరికా మిత్రులైన గల్ఫ్ రాజ్యాలవి తొమ్మిది ఉన్నాయి. అమెరికా దిగ్బంధంతో ఎవరికి ఎక్కువ నష్టం? అందుకే వెంటనే సౌదీ అరేబియా దిగ్భంధం తగదని అమెరికాను హెచ్చరించింది. విషయం అంతటితో ఆగలేదు. యుద్ధం మొదలైన తర్వాత చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మొదటిసారిగా మాట్లాడుతూ, ఇరాన్‌తో తమ వాణిష్య సంబంధాలు తామిద్దరి స్వేచ్ఛ తప్ప, అందులో దిగ్భంధనాల ద్వారా జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసారు. దానితో దిగివచ్చిన ట్రంప్, చైనా నౌకలపై ఏ ఆంక్షలు లేవన్నారు. నిజానికి చైనా నౌకలు అప్పటికే యథేచ్ఛగా ప్రయాణిస్తున్నాయి. స్వయంగా ఇరాన్ కూడా, మొదటి విడత చర్చల సమయానికే తనంతట తానుగా ఇండియా, ఫ్రాన్స్ సహా పలు దేశాలుపై ఆంక్షలు ఎత్తివేయటం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్‌తో సహకరిస్తున్న వారిపై మాత్రమై ఆంక్షలు ఉంటాయన్నది. ఇపుడు రెండవ విడతకు ముందు అమెరికా హర్మూజ్‌ను దిగ్భంధించగా, అందుకు ప్రతిగా తాము, హూతీలు కలిసి పర్షియన్ గల్ఫ్‌తోపాటు బాబ్ అల్ మెందర్, ఎర్ర సముద్రాలను మూసివేయగలమని హెచ్చరించింది. హర్మూజ్ మూసివేత వల్లనే ఇంతటి కల్లోలం ఏర్పడి 20 శాతం రవాణా స్తంభించగా, తక్కిన రెండు చోట్ల కూడా అది జరిగితే 35 శాతం వరకు ఆగి ఇక ఏమి జరిగేదీ ఎవరైనా ఉహించవచ్చు. ఈ నేపథ్య వివరాలన్నీ ఇంతగా చెప్పుకోవటం ఎందుకంటే, కనీసం రెండవ విడత నాటికైనా అమెరికా అధ్యక్షునికి వివేకం కలుగుతుందా? నెతన్యాహూ ప్రభావం నుంచి కొంతైనా బయటపడగలరా అన్నది ఈ పరిస్థితులను బట్టి వేచిచూడవలసి ఉంటుంది. మొదటి విడత వైఫల్యం తర్వాత ట్రంప్ అన్నది, యురేనియం శుద్ధి, అణ్వస్త్రాల తయారీపై తప్ప అన్ని అంశాలపై అంగీకారం కుదిరినట్లేనని. వాస్తవానికి అది కూడా ఒక సమస్య కానేకాదని ప్రపంచానికంతా తెలుసు. ట్రంప్, నెతన్యాహూలకు కూడా తెలుసుగాని, ఇతర లక్షాల కోసం దానిని ఒక సాకుగా ముందుకు తెస్తున్నారు. శాంతియుత అవసరాల కోసం అణు శుద్ధి హక్కు, అంతర్జాతీయ అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం దారుగా ఇరాన్‌కు చట్టబద్ధంగా లభించింది. అణ్వస్త్ర తయారీకి కావలసిన శుద్ధి 90 శాతం కాగా, వారు 60 శాతాన్ని ఎప్పుడూ మించలేదు. వారి అణు కేంద్రాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్‌స్పెక్టర్లు తరచు తనిఖీ చేస్తూనే ఉన్నారు. తాము అణ్వస్త్రాలు తయారు చేయబోమని అయతొల్లా ఒకటికి రెండుసార్లు ఫత్వా సైతం జారీ చేసారు. అయినా స్వయంగా అణ్వస్త్రాలు గల అమెరికా, ఇజ్రాయెల్‌లు ఈ విధంగా ప్రవర్తిస్తున్న స్థితిలో, రెండవ విడత చర్చలలో రాగల షరతులేమిటో, కుదరగల రాజీలేమిటో, అంతా దైవాధీనం అన్నట్లుగా తయారయింది పరిస్థితి.  - టంకశాల అశోక్ (దూరదృష్టి) - రచయిత సీనియర్ సంపాదకులు 

మన తెలంగాణ 18 Apr 2026 10:29 am

నేడు జగిత్యాలకు కేటీఆర్, హరీష్ రావు

నేడు జగిత్యాలకు కేటీఆర్, హరీష్ రావు బయలుదేరి వెళుతున్నారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 10:26 am

Rashmika trains eight hours non-stop for Mysaa

Rashmika Mandanna is leaving no stone unturned for her highly anticipated action thriller, Mysaa. The actress has flown to Bangkok and is currently undergoing intense martial arts and stunt training. Working closely with the renowned Jaika Stunt Team, she is dedicating a grueling eight hours every day to perfect her combat skills and hand-to-hand techniques. […] The post Rashmika trains eight hours non-stop for Mysaa appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 10:25 am

ధోని ఈరోజైనా దిగుతాడా?

హైదరాబాద్: హోరాహోరీగా సాగుతోన్న ఐపీఎల్ పోటీల్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. అయిదు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఒకే స్థితిలో ఉన్న ఈ జట్ల మధ్య పోరుకు శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా నిలవనుంది. గాయం కారణంగా తొలి అయిదు మ్యాచ్‌ల్లో ఆడని చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్‌లో అయినా ఆడతాడా లేదా అన్నది ఆసక్తి […] The post ధోని ఈరోజైనా దిగుతాడా? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 10:24 am

గుంజపడుగు సోలార్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన నాబార్డ్ అధికారులు

మంథని, ( జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామ శివారులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.3.40 కోట్ల వ్యయంతో పిఎం కుసుమ్ …

జనం సాక్షి 18 Apr 2026 10:18 am

టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. భీమదేవరపల్లి:ఏప్రిల్ 18(జనం సాక్షి)తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంయుక్త చర్య కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో …

జనం సాక్షి 18 Apr 2026 10:15 am

ఆంధ్ర నేతల ఢిల్లీ విధేయత సంక్షోభానికి సంకేతం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు, వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి, పవన్ కళ్యాణ్.. రాజ్యాంగ సవరణ బిల్లుపై భారతీయ జనతా పార్టీకి విధేయత చూపుతూ, దక్షిణ భారత రాష్ట్రాల సహకారాన్ని విరమించుకోవడం రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో ఉన్న లోతైన నైతిక సంక్షోభాన్ని సూచిస్తోంది. వివిధ చర్యలు, లోపాల ఆరోపణలను ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిద్ధాంతపరంగా బలహీనంగా మారి, ఢిల్లీ దర్బార్ ముందు వినయపూర్వకంగా నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తరువాత, పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ కోల్పోయిన బిజెపి మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ మూడు పార్టీలు వివిధ అంశాలపై బిజెపికి మద్దతు ఇస్తూ వచ్చాయి. అయితే, జనాభా, ఆర్థిక పరంగా మెరుగైన ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై పార్లమెంటరీ శక్తి సమతౌల్యాన్ని దెబ్బతీయాలనే ప్రతిపాదనపై ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి విడిపోయి తీసుకున్న నిర్ణయం రాజకీయ విధేయతకు మించిన సేవాభావాన్ని సూచించే చర్యగా భావించాల్సి వస్తోంది. విచిత్రంగా, తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ‘తెలుగువాడి ఆత్మగౌరవం’ అనే భావనపై ఆవిర్భవించాయి. టిడిపి స్థాపకుడు ఎన్.టి. రామారావు ‘కేంద్రం అనేది ఒక భావనాత్మక మిథ్’ అని పేర్కొంటూ, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అమలు చేసిన అధికార కేంద్రీకరణ విధానాన్ని సవాలు చేశారు. ఆయన ఒత్తిడితో కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై సర్కారియా కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా, జగన్ మోహన్‌రెడ్డి తన తండ్రి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ ఆధారిత వర్గం తన కుటుంబంపట్ల ఎలా ప్రవర్తించిందనే విషయంపై నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ‘ఆత్మగౌరవం’ అనే భావనతో రాజకీయంగా ఎదిగిన నాయకులకు, తెలుగువారిలో పెద్దగా ప్రాధాన్యం లేని ఒక జాతీయ పార్టీ నాయకత్వానికి లొంగిపోవాల్సిన పరిస్థితి నిజం గా అవమానకరంగా మారింది. రాజకీయ ప్రాధాన్యత, అధికారాన్ని కాపాడుకోవాలనే ఆశతో వారు చూపుతున్న విధేయత, కొత్త ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకత్వంలో ఉన్న లోతైన సంక్షోభాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. మరోవైపు, రాజ్యాంగ సవరణ అంశంపై తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీల స్పందన పూర్తిగా భిన్నంగా కనిపించింది. భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్ పూర్వం తెలంగాణ రాష్ట్ర సమితి), కాంగ్రెస్ పార్టీలు ఇతర దక్షిణాది రాష్ట్రాలతో కలిసికట్టుగా నిలిచాయి. ఇది కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మలుపుని సూచిస్తోంది. ప్రాంతీయ పార్టీగా బిఆర్‌ఎస్ తన ప్రాంత ప్రయోజనాలపట్ల నిబద్ధత చూపడం సహజమే. అలాగే, కర్ణాటక, తెలంగాణలో రాష్ట్ర స్థాయి బలమైన నాయకత్వం కింద ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో ఐక్యతను ప్రదర్శించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనను ప్రాంతీయ నాయకుడిగా ప్రతిష్టించుకునే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఈ వేదికను బిఆర్‌ఎస్ ఏకాధిపత్యంగా మార్చకుండా నిలబడ్డారు. తెలంగాణ అభివృద్ధి పట్ల బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకత్వం చూపిన కట్టుబాటు, ఆ రాష్ట్ర రాజకీయాల్లో బిజెపిని పక్కకు నెట్టడం లో కీలక పాత్ర పోషించింది. ప్రారంభంలో హిందుత్వ అజెండాతో కొంత చురుకుదనం ప్రదర్శించిన బిజెపి, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం కోల్పోయిన స్థితికి చేరుకుంది. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో అసలు సంక్షోభం ఏమిటి? ఇది పాలనాపరమైన సంక్షోభం. వరుసగా అధికారంలోకి వచ్చిన నాయకత్వాల అధిక అవినీతి కారణంగా పరిపాలన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా, ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది ఇద్దరు ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు, జగన్‌రెడ్డి. ఇద్దరూ జైలుశిక్ష అనుభవించిన వారు. ఇక్కడ అవినీతి సమస్య ఎంత తీవ్రమో, అంతకంటే లోతుగా విస్తరించినది కులవాదం. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు, మూడు ప్రధాన కులాలకు ప్రతినిధులుగా మారాయి. తెలుగు దేశం పార్టీపై కమ్మ కుల ఆధిపత్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై రెడ్డి కుల ఆధిపత్యం, జనసేనపై కాపు సమాజ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పరిపాలన, రాజకీయాలు, వ్యాపారాల్లో కులవాదం విస్తృతంగా వ్యాపించింది. రాష్ట్ర సమస్యలను మరింత తీవ్రతరం చేసిన అంశం, దాని దారుణమైన ఆర్థిక పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆధారపడాల్సి వస్తుందని ప్రారంభం నుంచే స్పష్టమైంది. ఏకీకృత ఆంధ్రప్రదేశ్ కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ప్రాంతం సృష్టించిన మిగులు ఆదాయంపై ఆధారపడి ఉండేది. హైదరాబాద్ అభివృద్ధి దానికి ప్రధాన కారణం. హైదరాబాద్ లేకుండా కొత్త ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడిన స్థితిలోనే ప్రారంభమైంది. ఇలాంటి పాలనాపరమైన సవాళ్లను ఆంధ్ర రాజకీయ పరిస్థితులు మరింత క్లిష్టం చేశాయి. అధికారంలోకి తిరిగి వచ్చిన చంద్రబాబు నాయుడు, ఆశయపరుడైన పవన్ కళ్యాణ్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. మరోవైపు, ఇంకా ఎక్కువ ఆశలు పెట్టుకున్న తన కుమారుడు నారా లోకేష్, తండ్రి స్థానాన్ని త్వరగా స్వీకరించాలనే తపనతో ముందుకు వస్తున్నారు. టిడిపిలో తరాల మార్పు రాజకీయాలు కూడా పాలనపై ప్రభావం చూపుతున్నాయి. ఎన్‌టిరామారావు కుటుంబం ఇప్పటికీ నాయుడు తన మామగారిని ఎలా మోసం చేశాడనే విషయంపై అసంతృప్తితో ఉండటం, అలాగే లోకేష్ త్వరగా నాయకత్వం చేపట్టాలని కోరుకోవడం వంటి అంశాలు రాష్ట్ర పాలనను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అమరావతిని కొత్త రాజధానిగా నిర్మించాలనే చంద్రబాబు నాయుడు ఆకాంక్ష, రాష్ట్రంలో అత్యవసరమైన పట్టణాభివృద్ధి సవాళ్లపై దృష్టిని మళ్లించింది. కఠిన మౌలిక సదుపాయాల నిర్మాణం (హార్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)తో పాటు పట్టణీకరణకు అవసరమైన సామాజిక -ఆర్థిక వ్యవస్థల (సాఫ్ట్ సూపర్‌స్ట్రక్చర్) అభివృద్ధి వంటి కీలక అంశాలు పక్కన పడిపోయాయి. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రాంతానికి వ్యాపార వర్గాలు మారాల్సి ఉంటుందని భావించారు. తెలంగాణ నాయకత్వం, హైదరాబాద్ అభివృద్ధి ప్రయోజనాలను స్వాధీనం చేసుకుంటూ, ప్రాంతీయ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆంధ్ర వ్యాపార వర్గాలపై విమర్శలు చేసింది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర వ్యాపార, ప్రొఫెషనల్ వర్గాలను దూరం చేయకుండా ఉంచాలనే టిఆర్‌ఎస్ నాయకుడు కెటిఆర్ (కె.టి. రామారావు) తీసుకున్న తెలివైన నిర్ణయం, హైదరాబాద్‌లోనే మూలధనం, ప్రతిభ నిలిచేలా చేసింది. దీనివల్ల ఆ నగరం నిరంతర అభివృద్ధి సాధించింది. ఆంధ్రాలోని కమ్మ, రెడ్డి వర్గాల వ్యాపార ప్రముఖులు హైదరాబాద్‌లోనే పెట్టుబడులు పెట్టడం లేదా విదేశాల్లో, ముఖ్యం గా అమెరికాలో స్థిరపడటాన్ని కొనసాగించారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఇప్పటికీ తిరిగి రాలేదు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు నాయుడు, జగన్‌రెడ్డి నాయకత్వాలకు పెద్దగా సవాల్ విసరలేకపోవడంతో, రాష్ట్ర రాజకీయాలు వ్యక్తిగత ప్రతిష్టా పోరాటం, కుల రాజకీయాల మధ్య చిక్కుకుపోయాయి. 1969-72 మధ్య జరిగిన మొదటి ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాల తర్వాత, హైదరాబాద్ అనేక ప్రభుత్వాల పాలనలో స్థిరమైన అభివృద్ధిని సాధించింది. చంద్రబాబు నాయుడు భారత వ్యాపార వర్గాలకు ప్రీతిపాత్రుడిగా ఎదిగినా, ఆయన తరువాత ముఖ్యమంత్రులైన వై.ఎస్. రాజశేఖరరెడ్డి, కె. చంద్రశేఖరరావు కూడా నగర అభివృద్ధిని కొనసాగించే దిశగా చర్యలు తీసుకున్నారు. దీని ఫలితంగా, 1980 నుంచి 2015 వరకు దాదాపు మూడు దశాబ్దాలపాటు ఆంధ్ర వ్యాపార వర్గాలు, ప్రతిష్ఠాత్మక వర్గాలు హైదరాబాద్‌ను తమ కేంద్రంగా చేసుకున్నాయి. కొత్త ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఢిల్లీపై ఆధారపడాల్సిన పరిస్థితి, రాష్ట్ర నాయకత్వంపై విచారణ సంస్థల ప్రభావం, అలాగే ఆంధ్ర ఎలైట్ వర్గాలు హైదరాబాద్‌పైనే చూపుతున్న మక్కువ.. ఇవన్నీ కలిసివచ్చి రాష్ట్ర రాజకీయ నాయకత్వాన్ని బలహీనపరిచాయి. ఫలితంగా, వారు ఢిల్లీ దర్బార్‌కు ఆధీనంగా మారే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ ఆంధ్రా వర్గాలను ఆకర్షించే కేంద్రంగా కొనసాగుతున్నంత కాలం, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలు ఆధునిక పట్టణ, సాంసృ్కతిక కేంద్రాలుగా అభివృద్ధి చెందడంలో ఆలస్యం అనివార్యం. ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఉన్న నగరాల చుట్టూ స్థానిక వ్యాపార, విద్యా, సాంసృ్కతిక కేంద్రాలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలి. భారీ ఖర్చుతో కూడిన అమరావతి రాజధాని ఒక మాయాజాల కేంద్రంగా మారుతుందనే ఆశపై ఆధారపడడం కంటే, స్థిరమైన, సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేయడం అవసరం. - సంజయ్ బారు

మన తెలంగాణ 18 Apr 2026 10:13 am

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసలు

దిల్లీ: ఇటీవల దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరణ్‌జీత్ సింగ్ సంధూపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ఆయన ఈ మేరకు ట్రూత్ సామాజిక వేదికగా సోస్టు చేశారు. ‘దిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన తరణ్‌జీత్ సంఇంగ్ సంధూకి అభినందనలు. అమెరికా మాజీ రాయబారిగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు తరణ్‌జీత్ ఎంతో నిబద్ధత చూపించారు’. అని తన పోస్టులో రాసుకొచ్చారు. ఇది వరకు ఆయనతో దిగిన ఫొటోను పంచుకున్నారు. […] The post దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 10:12 am

Summer Effect : రోళ్లు పగులుతున్నాయ్.. రోడ్లపై ఆమ్లెట్ వేసుకునేంతగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 10:11 am

ముల్కనూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ భీమదేవరపల్లి:ఏప్రిల్ 17 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో …

జనం సాక్షి 18 Apr 2026 10:10 am

Chandrababu: రెండో విడత భూ సమీకరణపై చంద్రబాబు

రెండో విడత భూసమీకరణపై రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారు.

తెలుగు పోస్ట్ 18 Apr 2026 10:06 am

Telangana : తెలంగాణలో మొరాయించిన సర్వర్లు..నిలిచిన రిజిస్ట్రేషన్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి

తెలుగు పోస్ట్ 18 Apr 2026 10:01 am

బరువుబాధ్యతల వేతనజీవులు

రాష్ట్ర పరిపాలన అనే విస్తారమైన వ్యవస్థలో ఒక అచంచలమైన సత్యం ఉంది. ప్రజల సంక్షేమం కోసం రూపుదిద్దుకున్న ప్రతి పథకం, ప్రతి నిర్ణయం చివరికి కార్యరూపం దాల్చేది ప్రభుత్వ ఉద్యోగుల చేతుల మీదుగానే. పాలన అనే యంత్రాంగం ఎంత శక్తివంతంగా కనిపించినా, దానికి ప్రాణం పోసేది ఉద్యోగులే. వారి కర్తవ్య నిబద్ధత, నిజాయితీ, సేవాభావం లేకపోతే ప్రభుత్వ లక్ష్యాలు కేవలం కాగితాలకే పరిమితమైపోతాయి. ప్రజల ఆశలు, ప్రభుత్వ సంకల్పాల మధ్య నిలిచే సజీవ వారధి -అదే ప్రభుత్వ ఉద్యోగి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంప్లాయిస్, టీచర్స్, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజిఇ జెఎసి) నిన్న 17 ఏప్రిల్ రోజున చేపట్టిన కార్యాచరణను ఒక సాధారణ నిరసనగా చూడలేం. ఇది ఒక బాధ్యతతో కూడిన వినతి, వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోని నిశ్శబ్ద ప్రతిఘటన, న్యాయమైన హక్కుల కోసం వినిపిస్తున్న గంభీర స్వరం. ఉద్యోగులు ఎంచుకున్న మార్గం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. విధులను విస్మరించకుండా, ప్రజాసేవలకు అంతరాయం కలగకుండా, క్రమశిక్షణతో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లడం. రాష్ట్రవ్యాప్తంగా మండల, డివిజనల్ కేంద్రాలలో భోజన విరామ సమయంలో తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించడం. ఇది ఒక ప్రతీకాత్మక చర్య మాత్రమే కాదు; ఇది ప్రభుత్వ వ్యవస్థపై ఉద్యోగులకు ఉన్న గౌరవాన్ని ప్రతిబింబించే చర్య. రోడ్లపై ఆందోళనలు, నినాదాలకంటే, విధి నిర్వహణలో భాగంగానే తమ గళాన్ని వినిపించడంద్వారా వారు ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రతిష్ఠించారు. ఈ వినతి పత్రాలలో ప్రతిఫలించిన అంశాలు ఉద్యోగుల జీవన వాస్తవాలను, వారి భవిష్యత్ భద్రతను ప్రతిబింబిస్తున్నాయి. పిఆర్‌సి అమలు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ పునరుద్ధరణ, పెండింగ్ డిఎల విడుదల, 61 సంవత్సరాలు నిండిన విఆర్‌ఎల సమస్యల పరిష్కారం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, సాధారణ బదిలీల నిర్వహణ, ఉద్యోగుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర కార్యాచరణ. ఇవి కేవలం ఆర్థిక అంశాలు మాత్రమే కాదు; ఇవి ఉద్యోగుల గౌరవం, భద్రత, స్థిరత్వానికి సంబంధించిన మూల సూత్రాలు. ప్రభుత్వ ఉద్యోగి పాత్రను సమగ్రంగా పరిశీలిస్తే, అది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఒక బాధ్యత, ఒక ధర్మం. గ్రామంలో భూమి సమస్య పరిష్కారం నుండి పట్టణంలో సంక్షేమ పథకాల అమలు వరకు, విద్యా రంగంలో ఉపాధ్యాయుడిగా జ్ఞానాన్ని పంచడం నుండి ఆరోగ్యరంగంలో సేవలను చేరవేయడం వరకు. ప్రతి రంగంలో ఉద్యోగుల పాత్ర అపారమైనది. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందుండి సహాయక చర్యలు చేపట్టేది ఉద్యోగులే; ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియను సజావుగా నడిపేది ఉద్యోగులే; సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేసేది కూడా వారే. ప్రజలకు ప్రభుత్వం అనిపించేది చాలాసార్లు ఒక కార్యాలయంలో కూర్చున్న ఉద్యోగి రూపంలోనే. ఒక రైతు సమస్యకు పరిష్కారం చూపినప్పుడు, ఒక పేద కుటుంబానికి పింఛన్ అందినప్పుడు, ఒక విద్యార్థికి స్కాలర్షిప్ చేరినప్పుడు, ప్రభుత్వం అంటే ఇదే అన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టేది ఉద్యోగులే. అందుకే వారి సేవ కేవలం విధి నిర్వర్తన కాదు; అది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే శక్తి. అయితే ఈ సేవామార్గంలో ఉద్యోగులు ఎదుర్కొనే సవాళ్లు కూడా చిన్నవి కావు. పెరుగుతున్న పనిభారం, పరిమిత వనరులు, సమయపాలన ఒత్తిడి, ప్రజల అంచనాలు ఇవన్నీ ఒక ఉద్యోగిని నిరంతరం పరీక్షిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో వారి సంక్షేమం, ఆర్థిక భద్రత, సేవా నిబంధనల పరిరక్షణ మరింత ముఖ్యమవుతుంది. ఉద్యోగి బలంగా ఉంటేనే పరిపాలన బలంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగి వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం ఆశలు, ఆర్థిక బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు all these depend on the employee. ఒకవైపు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత, మరోవైపు కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత, ఈ ద్వంద్వ పాత్రలో ఉద్యోగి జీవితం సాగుతుంది. అయినప్పటికీ, అతను తన కర్తవ్యాన్ని ఎప్పుడూ ముందుకు ఉంచుతాడు. అదే అతని సేవాతత్వం. ప్రభుత్వం ప్రజల మధ్య ఉన్న అనుబంధం ఒక భావోద్వేగ సంబంధం. ఆ బంధాన్ని బలపరచేది ఉద్యోగులే. ప్రజల సమస్యలను వినిపించి, పరిష్కారం చూపే సమయంలో వారు చూపే సహానుభూతి, సహనం, సేవా దృక్పథం ఇవి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతాయి. అదే విధంగా ప్రభుత్వం కూడా ఉద్యోగులను కేవలం యంత్రాంగంగా కాకుండా, తమ వ్యవస్థలో కీలక భాగస్వాములుగా చూడాలి. రాబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2కు ముందే ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఉద్యోగులు కోరడం వెనుక ఉన్న భావన గంభీరమైనది. అది ఒక గడువు మాత్రమే కాదు; అది ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, ఆశ, విశ్వాసానికి ప్రతీక. అలాగే వచ్చే నెల 5వ తేదీన జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు అందజేయడానికి సిద్ధమవడం. ఇది వారి పోరాటం శాంతియుతంగా, క్రమబద్ధంగా కొనసాగుతుందనే సంకేతం. ఈ దశలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అత్యంత కీలకం. ఉద్యోగుల సమస్యలను వేరుచేసి చూడకుండా, పరిపాలనా వ్యవస్థలో భాగంగా పరిగణించి, ఒక సమగ్ర, సమయబద్ధ పరిష్కారం అందించాల్సిన అవసరం ఉంది. ఒకసారి సమస్యలు పరిష్కారమైతే, ఉద్యోగుల్లో నూతనోత్సాహం పుడుతుంది. ఆ ఉత్సాహం ప్రజా సేవల నాణ్యతలో ప్రతిఫలిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం. ఉద్యోగులు కేవలం జీతం కోసం పనిచేసే వారు కాదు; వారు సమాజానికి సేవ చేయాలని నమ్మే వ్యక్తులు. వారి పనిలో ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. ఆ విలువను గుర్తించడం, గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. మొత్తానికి, ఈ ప్రతిఘటన ఒక విరోధం కాదు, ఇది ఒక విజ్ఞప్తి. ఒక న్యాయమైన, సమంజసమైన అభ్యర్థన. ప్రజల సేవలో అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించడం సహజం. ఈ పిలుపును ప్రభుత్వం సానుకూలంగా స్వీకరిస్తే, అది ఉద్యోగులకే కాదు, ప్రజా సేవల నాణ్యతకు, రాష్ట్ర అభివృద్ధికి, సమాజ స్థిరత్వానికి కూడా దోహదపడుతుంది.  - (రచయిత తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒఎస్‌డి) 

మన తెలంగాణ 18 Apr 2026 9:52 am

పంజాగుట్టలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

పంజాగుట్ట: హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....  ఓ యువతి పంజా గుట్ట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని మరో పోలీసు కానిస్టేబుల్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 18 Apr 2026 9:52 am

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం సాధారణమే.. అదే కారణమా?

తిరుమలలో భక్తుల రద్దీ కొంత సాధారణంగానే ఉంది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 9:37 am

రొటీన్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా సినిమా బ్యాడ్ బాయ్ కార్తీక్. ఒకప్పుడు ‘ఛలో’ సహా కొన్ని మంచి విజయాలందుకున్న నాగశౌర్య మూడేళ్లు గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ఇది. శుక్రవారం ఈ హీరో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఏమేరకు ప్రేక్షకులను అలరించిందో తెలుసుకుందాం. కథ: కార్తీక్ (నాగశౌర్య)కు లాయర్ అయిన తన అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ తానై చూసుకున్న అక్కకు ఏ చిన్న కష్టం వచ్చినా కార్తీక్ తట్టుకోలేడు. తెర వెనుక ఉండి ఆమెకు ఏ ఇబ్బందీ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటిది తన అక్కను ఎవరో చంపే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి.. వాళ్ల సంగతేంటో తేల్చడానికి సిద్ధమవుతాడు కార్తీక్. ఈ క్రమంలోనే కదిరికి వస్తాడు. ఆ ప్రాంతానికే చెందిన రాజకీయ నాయకుడు గోవిందప్ప (మీమ్ గోపి)నే తన అక్కను టార్గెట్ చేశాడని తెెలుసుకుని అతడిని కస్తూరి కళ్ల ముందే చంపేస్తాడు కార్తీక్. అయితే కదిరికే చెందిన మరో రాజకీయ నాయకుడు వరదా రెడ్డి (సముద్రఖని) రూపంలో కస్తూరి కి ఇంకా పెద్ద ముప్పు పొంచి ఉందని కార్తీక్ తెలుసుకుంటాడు. ఇంతకీ గోవిందప్ప, వరదారెడ్డిలతో కస్తూరికి ఉన్న గొడవేంటి.. ఈ ఇద్దరి నేపథ్యం ఏంటి.. గతం తెలిశాక కార్తీక్ ఏం చేశాడు.. తన అక్కను ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగతా కథ. కథనం, విశ్లేషణ: హీరో నాగ శౌర్య తన అక్కను కాపాడుకునే తమ్ముడి పాత్రలో పర్వాలేదనిపించాడు. కథలో అంతబలం లేకపోయి నా, తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయ త్నం చేశాడు. అయితే అవుట్‌డేటెడ్ కథ, కథనాలే ఈ సినిమాకు మైనస్ అని చెప్పాలి. చాలా రొటీన్ కథని ద ర్శకుడు ఈ సినిమా కోసం తీసుకున్నాడు. ఇదే కథ, కథనాలతో తెలుగులో ఎన్నో సినిమాలు మనం చూశాం. దీంతో ఈ సినిమా రొటీన్ మాస్ ఎమోషనల్ డ్రామాగా అనిపిస్తుంది. అలాగే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకోదు. అసలు వారి మధ్యలో ప్రేమ ఎప్పుడు పుట్టిందో కూడా అర్ధం కానీ విధంగా వీరి నడుమ సీన్స్ ఉంటాయి. ఇక టాలీవుడ్ మాస్ హీరోలు దశాబ్దాల ముందు చేసిన యాక్షన్ విన్యాసాలను ఇందులో నాగశౌర్య ప్రయత్నించాడు. తనకు ఏమాత్రం సెట్ కానీ ఎన్నెన్నో మాస్,యాక్షన్ విన్యాసాలు చేశాడు శౌర్య. ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్లు.. ఎవరినో అనుకరిస్తున్నట్లు అనిపిస్తుందే తప్ప.. ఎక్కడా ఒరిజినాలిటీ అన్న దే కనిపించదు. చాలా చోట్ల సీన్స్ బోర్ కొడతాయి. అలాగే కొన్ని చోట్ల కామెడీ సీన్స్ కూ డా వర్కవుట్ కాలేదు. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది.

మన తెలంగాణ 18 Apr 2026 9:25 am

నేడు ఢిల్లీతో ఆర్‌సిబి ఢీ

బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే నాలుగు విజయాలు సాధించిన ఆర్‌సిడి ఈసారి కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్‌లు జోరుమీదున్నారు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక కెప్టెన్ రజత్ పటిదార్, జితేశ్ శర్మ, దేవ్‌దుత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, రొమరియో షెఫర్డ్, కృనాల్ పాండ్యలతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. దీంతో పాటు భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, హాజిల్‌వుడ్, కృనాల్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక ఢిల్లీలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. కెఎల్ రాహుల్, నితీశ్ రాణా, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, డేవిడ్ మిల్లర్, కెప్టెన్ అక్షర్ పటేల్, నిసాంకా తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో కూడా ఢిల్లీ పటిష్టంగానే ఉంది. దీంతో ఢిల్లీ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.

మన తెలంగాణ 18 Apr 2026 9:23 am

ఫేవరేట్‌గా సన్‌రైజర్స్

నేడు ఉప్పల్‌లో చెన్నైతో పోరు మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా శనివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన చెన్నై ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలనే లక్షంతో కనిపిస్తోంది. ఇక రెండు మ్యాచుల్లో విజయం సాధించిన హైదరాబాద్‌కు కూడా ఈ పోరు కీలకంగా మారింది. కిందటి మ్యాచ్‌లో బలమైన రాజస్థాన్‌ను ఓడించడంతో సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇందులో కూడా గెలిచి పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానాన్ని సాధించాలనే లక్షంతో ఉంది. ఇటు చెన్నై అటు హైదరాబాద్‌లోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, కెప్టెన్ ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో కూడా సన్‌రైజర్స్ బాగానే ఉంది. కిందటి మ్యాచ్‌లో యువ బౌలర్లు ప్రఫుల్ హింగె, సకిబ్ హుస్సేన్‌లు, మలింగ తదితరులు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న సన్‌రైజర్స్‌కు సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం మరింత కలిసి వచ్చే అంశంగా మారింది. సమరోత్సాహంతో.. మరోవైపు వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన చెన్నై టీమ్‌లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే తహతహలాడుతోంది. కోల్‌కతా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతో జరిగిన మ్యాచుల్లో చెన్నై ఘన విజయాలను అందుకోంది. దీంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. సంజు శాంసన్ ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా మారింది. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యం జట్టును కలవర పెడుతోంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా రుతురాజ్ రాణించలేక పోయాడు. కనీసం ఈసారైన అతను మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. డెవాల్డ్ బ్రెవిస్, అయుష్ మాత్రె, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబె తదితరులతో చెన్నై బ్యా టింగ్ బలంగా కనిపిస్తోంది. అంతేగాక నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, జేమీ ఓవర్టన్, అకిల్ హుస్సేన్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. 

మన తెలంగాణ 18 Apr 2026 9:15 am

‘ఓ అందాల రాక్షసి’ రీ-రిలీజ్

మల్టీ టాలెంటెడ్ షెరాజ్ మెహదీ దర్శకత్వం లో తానే హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి, అనంతరం మీడి యా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ “మంచి కథా వస్తువుతో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపించడంతో పాటు, అలాంటి మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా అందిస్తున్నాం”అని అన్నారు.

మన తెలంగాణ 18 Apr 2026 9:14 am

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದ ಮುರ್ಷಿದಾಬಾದ್‌ನಲ್ಲಿ ಸ್ಥಳೀಯ ಹಿಂದೂಗಳು ಮುಸ್ಲಿಂ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಥಳಿಸಿದ್ದಾರೆ ಎಂದು 2022ರ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದ ಮುರ್ಷಿದಾಬಾದ್‌ನಲ್ಲಿ ಸ್ಥಳೀಯ ಹಿಂದೂಗಳು ಮುಸ್ಲಿಂ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಥಳಿಸಿದ್ದಾರೆ ಎಂದು 2022ರ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 18 Apr 2026 9:10 am

18thAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

18thAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’ 18thAprilCartoon సంఖ్యాబలం తెలియని అమాయకత్వమా.. లేక

ప్రభ న్యూస్ 18 Apr 2026 9:03 am

Chandrababu : నిడదవోలుకు నేడు చంద్రబాబు

నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 18 Apr 2026 8:53 am

మంచిర్యాలలో ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం.... పసికందుతో ధర్నాకు దిగిన ప్రియురాలు

మంచిర్యాల:  ఓ కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో ఓ యువతిని లొంగదీసుకున్నాడు. అనంతరం సదరు యువతిని గర్భవతిని చేసి అనంతరం బిడ్డ పుట్టగానే  వదిలేసి పారిపోయాడు. దీంతో పసికందుతో తల్లి ధర్నాకు దిగిన సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ముదిగుంట గ్రామానికి చెందిన సాయిరాజ్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ యువతిని లొంగదీసుకున్నాడు. సదరు యువతిని గర్భవతి చేసి బిడ్డ పుట్టగానే వదిలేసి పారిపోయాడు. దీంతో కానిస్టేబుల్ ఇంటి ముందుకు చేరుకొని పసికందుతో ధర్నాకు దిగింది. దీంతో కానిస్టేబుల్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో పారిపోయాడు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది. 

మన తెలంగాణ 18 Apr 2026 8:53 am

Ys Jagan : బిల్లు వీగిపోవడంపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ ఇదే

మహిళ రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 8:47 am

KTR : మహిళ బిల్లు వైఫల్యానికి బీజేపీదే బాధ్యత

మహిళా బిల్లు వైఫల్యానికి బీజేపీ పార్టీదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 8:41 am

Naga Shaurya’s Film Shocks Telugu Film Industry

After the debacle of Rangabali, Naga Shaurya has calmed down. After three years, he tested his luck with Bad Boy Karthik. The makers have spent Rs 30 crores on the film. The director was changed and the film underwent several unexpected changes. The trailer and the songs failed to generate the need buzz. Naga Shaurya […] The post Naga Shaurya’s Film Shocks Telugu Film Industry appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 8:36 am

Bandi Sanjay : కాంగ్రెస్ పై బండి ఫైర్

మహిళ రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 8:34 am

18aprilchintana |ధర్మం ఎందుకు క్షీణిస్తోంది?

18aprilchintana | ధర్మం ఎందుకు క్షీణిస్తోంది? 18aprilchintana | కలియుగ లక్షణాలు మరియు

ప్రభ న్యూస్ 18 Apr 2026 8:29 am

Exclusive: Ajay Bhupathi to work with Koratala Siva

Ram Gopal Varma’s protege Ajay Bhupathi made an impressive debut with RX 100. His second film Maha Samudram was a disaster and he bounced back with Mangalavaaram. The film’s technical aspects were well appreciated and he is currently busy with Srinivasa Mangapuram which introduces Ghattamaneni youngster Jaya Krishna to Telugu cinema. The film releases in […] The post Exclusive: Ajay Bhupathi to work with Koratala Siva appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 8:26 am

Union Cabinet : నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం

నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 8:02 am

IPL 2026 : కోల్ కతా కు సుడి లేదు... గుజరాత్ ను లక్కు వదలలేదు

గుజరాత్ టైటాన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తెలుగు పోస్ట్ 18 Apr 2026 7:52 am

అత్త పక్కనే పడుకున్న చిరుత.... కాపాడిన కోడలు

బెంగళూరు: చిరుత పులి బారి నుంచి అత్తను కోడలు కాపాడిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు నగరంలో జరిగింది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.... రాచనగరి మైసూరు నగరంలోని సిద్ధార్థనగర్‌లో సుజాత అనే మహిళ తన భర్త, అత్త శైలజతో కలిసి ఉంటుంది. అత్త పడుకున్న రూమ్‌లో కోడలు వెళ్లింది. మంచం కింద చిరుత పులిని గమనించి అత్తను చాకచక్యంగా బయటకు తీసుకొచ్చింది. అనంతరం ఆ రూమ్ గడియ వేసి పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. సుజాత సమయస్ఫూర్తిని స్థానికులు, అటవీ శాఖ అధికారులు ప్రశంసించారు. చిరుత పులి చూసిన కూడా ప్రాణ భయం లేకుండా అత్తను కాపాడిన కోడలు ధైర్య సహసాలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.   

మన తెలంగాణ 18 Apr 2026 7:50 am

18aprileditorial |రాజ్యాంగ సవరణ బిల్లు వీగింది..

18aprileditorial | రాజ్యాంగ సవరణ బిల్లు వీగింది.. 18aprileditorial | రాజ్యాంగ సవరణ

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:42 am

Strait of Hormuz : ఆంక్షలు కొనసాగితే.. మళ్లీ హోర్ముజ్ జలసంధి మూసేస్తామన్న ఇరాన్

హోర్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకలకు పూర్తిగా తిరిగి తెరిచినట్టు ఇరాన్ ప్రకటించింది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 7:33 am

కూతురి అశ్లీల వీడియోలు క్రియేట్ చేసి తండ్రికి పంపిన సైబర్ నేరగాళ్లు

 హైదరాబాద్‌: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరగాళ్ల వికృత చేష్టలకు పాల్పడ్డారు. కూతురు పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె తండ్రికి సైబర్ నేరగాళ్లు అశ్లీల వీడియోలు పంపారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచవానిసింగారం ప్రాంతంలో నివాసం ఉండే వ్యక్తి(50)కి తన కూతురి పేరిట నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సృష్టించి సైబర్ నేరగాళ్లు అశ్లీల వీడియోలు పంపారు. ఆ వీడియోలను బంధువులకు కూడా పంపిస్తామని బెదిరిస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 18 Apr 2026 7:32 am

Strait of Hormuz : హార్ముజ్ జలసంధి తెరుచుకున్నా… పెట్రోల్ ధరలు వెంటనే తగ్గవట

హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోవడతో చమురు ధరలు తగ్గాయి

తెలుగు పోస్ట్ 18 Apr 2026 7:16 am

దేశ రాజకీయ ముఖచిత్రం మార్చే కుట్ర

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల ముఖచిత్రాన్ని మా ర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇది దేశ వ్యతిరేక కార్యకలాపాల కిందికే వస్తుంద ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల కోటా చట్టానికి ప్రతిపాదిత సవరణలపై చర్చలో శుక్రవారం రాహుల్ గాంధీ మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు , మహిళ కోటాకు లింక్ పెట్టడం కేవలం బి జెపి ప్రభుత్వం రాజకీయ లబ్థికి దిగడమే అని రా హుల్ తెలిపారు. ఎన్నికల ముఖచిత్రం మార్చడం ద్వారా రాజకీయ స్వరూపం తమ చెప్పుచేతల్లో ఉండేలా చేసుకోవడమే ఈ ప్రభుత్వ ఆలోచన అని విమర్శించారు. కేంద్రం అత్యంత దుర్మార్గంగా డి లిమిటేషన్ ద్వారా దక్షిణాది, ఈశాన్య, చిన్న రా ష్ట్రాల సభా ప్రాతినిధ్యాలను దెబ్బతీస్తోంది. ఇది పూ ర్తి స్థాయిలో జరుగుతున్న దేశ వ్యతిరేక చర్య అని తెలిపారు. దేశంలోని మహిళల కొంగుచాటున సా గుతూ దేశ ఎన్నికల ముఖచిత్రం మార్చేందుకు ఈ మాయోపాయానికి దిగిందని విమర్శించారు. ఇ ప్పుడు ప్రభుత్వం తీసుకువచ్చింది మహిళా బిల్లు కాదని, ఇందులో మహిళా సాధికారికత విషయం ఏదీ లేదని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆమోదం పొంది ఉన్న 2023 మహిళా చట్టం అమలులోకి తీసుకురావచ్చు. ఇందుకు ప్రతిపక్షాలు అన్ని సహకరిస్తా యి. కాలాయాపన కూడా ఉండదన్నారు. ఈ ప్ర భుత్వానికి వెనుకబడిన వర్గాలకు , ఆదివాసీలకు ఇతర అణగారిన వర్గాలకు అధికారంలో సరైన ప్రా తినిధ్యం కల్పించే ఆలోచన లేదని, ఇందుకు ఈ విధమైన నానా దారులు వెతుక్కుంటోందని విమర్శించారు. కులగణనను నామమాత్రం చేస్తున్నా రు. వచ్చే 15 సంవత్సరాల వరకూ దీని వల్ల ఎటువంటి ప్రాతినిధ్యానికి వీలు ఉండదని తెలిపారు. ప్రధాని మోడీ పెద్ద జాదూగర్: రాహుల్ బిజెపి నిరసనలు ప్రధాని మోడీ పెద్ద మాంత్రికుడు అని, బాలాకోట్ , పెద్ద నోట్ల రద్దు, తరువాత ఆపరేషన్ సిందూర్ ఇ వన్నీ ఆయన తంత్రాలని లోక్‌సభలో మహిళా బి ల్లు చర్చ సందర్భంగా రాహుల్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు బిజెపి సభ్యులు అడ్డుతగిలారు. ప్రధా ని మోడీపై రాహుల్ అనుచిత పదజాలాలకు దిగారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజి జూ మండిపడ్డారు. పైగా రాహుల్ మరోసారి దేశ సైనిక బలగాలను కించపర్చే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసివేయాలని రక్షణ మంత్రి రాజ్‌నా థ్ సింగ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశా రు. దీనితో స్పీకర్ రాహుల్‌ను ఉద్ధేశించి సరిగ్గా మా ట్లాడాలని, విషయానికి పరిమితం కావల్సి ఉందని స్పష్టం చేశారు. తప్పుడు పదజాలాలను అనుమతించేది లేదన్నారు. ప్రధాని మోడీ, నేను భార్య బాదరబందీ లేనోళ్లమే రాహుల్ గాంధీ తమ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీకి, తనకు భార్య బాదరబందీ లేదన్నారు. అం దరికీ జీవితంలో మహిళల నుంచి ఏదో ఒక పాఠం అబ్బుతుంది. తనకు సోద రి తల్లి నుంచి ఆత్మీయత దక్కుతుంది. ఇదే విధం గా ప్రధాని మోడీకి కూడా ఇదే స్పందన ఉంది. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మం త్రి కిరెణ్ రిజిజూ సభలో మాట్లాడుతూ కేంద్ర న్యా యశాఖ మంత్రి అర్జున్ రామ్ తన భార్య గురించి కవిత చెప్పారని, అప్పటి నుంచి రాహుల్‌కు ఇంట్లో తిట్లు పడి ఉంటాయని నవ్వుతూ వ్యాఖ్యానించా రు. దీనిపై రాహుల్ స్పందిస్తూ అవును తనకు మోడీజి మాదిరిగానే ఈ అనుభూతి లేదు ఏం చేద్దామని చమత్కరించారు.

మన తెలంగాణ 18 Apr 2026 6:20 am

నారీ.. మరో సారీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రత్యేక సమావేశాలలో అత్యంత కీలకమైన మహిళా బిల్లుకు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీనితో చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోటా అమలు మరోసారి తీరని కల, కల్ల అయింది. ప్రధాని నరేంద్ర మోడీ సారధ్య ఎన్‌డిఎ ప్రభుత్వ కీలక విధాన నిర్ణయానికి చట్టసభలో ఎదురుదెబ్బ కలకలానికి దారితీసింది. 2029 నుంచి మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా , ప్రత్యేక సమావేశాల ద్వారా తీసుకువచ్చిన సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిం ది. బిల్లుపై ఓటింగ్ జరగగా అనుకూలంగా 298 మం ది ఓటు వేశారు. వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. అయితే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడ ంతో మూడింట రెండొంతుల మెజార్టీని ఎన్‌డిఎ సాధించలేకపోయింది. మొత్తం 528 మంది ఎంపిలు పాల్గొన గా, మెజార్టీ సంఖ్య 352 మద్దతును ప్రభుత్వం కూడగట్టుకులేకపోయింది. ఓటింగ్‌లో సవరణల బిల్లు నెగ్గలేదని, ఓడిపోయిందని స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ తరువాత ప్రకటించారు. ఓటింగ్ సమయంలో సభలో ప్ర ధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూ డా ఉన్నారు. ఈ కీలక బిల్లు వీగిపోవడంతో దీనికి అ నుబంధంగా వచ్చిన డిలిమిటేషన్ బిల్లు 2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణల బిల్లు 2026ను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్య వహారాల మంత్రి కిరణ్ రిజిజూ ప్రకటించారు. ఈబిల్లులను వెనకకు తీసుకుంటున్న విషయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు తెలియచేశా రు. దీనితో మూడు రోజుల పాటు సాగాల్సిన అంతకు ముందటి ఆర్బాటపు ప్రకటనల ప్రత్యేక సెషన్ రెండోరోజే ముగింపు దశకు చేరింది. చట్టసభలలో మహిళల కు 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే 33 శాతం కో టా అమలును 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన చే పట్టేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకువచ్చారు. ఇదే క్రమంలో ఈ కోటా అమలుకు వీలుగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ఇప్పుడున్న 543 నుంచి 850కు పెంచేందుకు, తద్వారా మహిళల కోటాను ఈ క్రమం లో 272కు పెంచేందుకు ఉద్ధేశించారు. ఇదే క్రమంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలో కూడా 33శాతం కోటాకు చర్యలు తీసుకోవాలని సంకల్పించారు. అయితే ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గకపోవడంతో ఇవన్నీ ప్రస్తుతానికి అటకెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోడీ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్‌లో ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు వీగిపోవడం ఇదే తొలిసారి అయింది. బిల్లు వీగిపోయిన ప్రకటన తరువాత స్పీకర్ ఓం బిర్లా సభను శనివారానికి వాయి దా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇది అత్యంత దుర్దినం, నారీ శక్తి వెలుగుకు చీకటి అమామాస్య అంటూ లోక్‌సభలో మహిళా బిల్లు వీగిపోయిన తరువాత అధికార ఎన్‌డిఎ ఎంపిలు నిరసన వ్యక్తం చేశారు. మహిళా శక్తి బలోపేతం కావడం ఇష్టం లేని ప్రతిపక్షాలు ఇప్పుడు చారిత్రక ద్రోహానికి పాల్పడ్డాయని బిజెపి, మిత్రపక్షాలకు చెందిన మహిళా ఎంపిలు పార్లమెంట్ ఆవరణలో నినాదాలతో ప్రదర్శనగా సాగారు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలకు దిగారు. ఏండ్ల తరబడి మహిళా సాధికారికత ప్రత్యేకించి చట్టసభలలో ఎండమావి అవుతూ వచ్చింది. ఈ అడ్డంకులను అధిగమించేందుకు మోడీ ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన రాజ్యాంగ కట్టుబాట్లకు దిగిందని ప్రతిపక్ష ఎంపిలు మీడియాతో చెప్పారు. ప్రతిపక్షాలకు దేశంలో మహిళా రాజకీయ సాధికారికత ఇష్టం లేదని, వారు ఎప్పుడూ వెనుకబడే ఉండాలని కోరుకుంటారని , ఇప్పుడు కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదంటూనే ఈ బిల్లు ఓడేలా చేశారని విమర్శించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే వెన్నుపోటు, అంతకు మించిన మహిళా ద్రోహం అయిందని మండిపడ్డారు. తమ నిరసనలు ఇక దేశవ్యాప్తంగా సాగుతాయని, ప్రతిపక్షాల మహిళా విద్వేషకర ధోరణిని ఎండగడుతామని ప్రకటించారు. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూ మాట్లాడుతూ ప్రతిపక్షాలు దేశ మహిళలను గౌరవించే చారిత్రక అవకాశం పోగొట్టుకున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం మహిళల హక్కులు పొందేందుకు నిరంతర పోరు సాగిస్తుందని ప్రకటించారు. చట్టసబలలో మహిళలకు రిజర్వేషన్ల కోటా అమలు వరకూ తాము విశ్రాంతి తీసుకునేది లేదన్నారు. మహిళా కోటా ఇప్పుడు అమలు చేసినా మద్దతిస్తాం: రాహుల్ గాంధీ చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల పేరిట తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఒక రకంగా రాజ్యాంగపై దాడి అని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. అందుకే ఆ బిల్లును ఓడించామన్నారు. మహిళలకు కోటా కల్పించడం దీని లక్షం కాదని, వారి పేరు మీద దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసే కుట్ర అని మండిపడ్డారు. లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీకి మళ్లీ చెబుతున్నా...2023 మహిళా బిల్లును అమలు చేయండి. మేం తప్పకుండా సహకరిస్తాం. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ముమ్మాటికీ మహి బిల్లు కాదు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఏకపక్షంగా మార్చే కుట్ర. అందుకే అడ్డుకున్నాం’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఆమోదించిన మహిళ రిజర్వేషన్ బిల్లును ఈ రోజు నుంచి అమలు చేసినా తాము సంపూర్ణంగా మద్దతు పలుకుతామన్నారు. అందుకు యావత్ ప్రతిపక్షం కూడా సిద్ధంగా ఉందన్నారు. బిల్లు వీగిపోయిన తరువాత హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె, సమాజ్‌వాది పార్టీలు ప్రదర్శించిన మొండివైఖరితోనే ఈ బిల్లు నెగ్గలేదని స్పందించారు. ఇప్పుడు ప్రతిపక్ష ఎంపిలు బయటకు వెళ్లి విజయోత్సవ సభలు చేసుకుంటున్నారని,ఇ ది గర్హనీయం అన్నారు. కాంగ్రెస్, మిత్రపక్షాలు ఇంతకు ముందు కూడా ఈ విధంగా తమ సంకుచిత బుద్థి ప్రదర్శించాయి. వారి వైఖరి ఎప్పుడూ మహిళా ప్రయోజనాల కోణంలో కానీ దేశ హితం పరిధిలో కాని లేదని ఆగ్రహించారు. ఇకపై ప్రతిపక్షాలు 2029లోనే కాకుండా ప్రతి ఎన్నికల్లోనూ మహిళా ఆగ్రహానికి గురి అయ్యి తీరుతారని అమిత్ షా వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 18 Apr 2026 6:00 am

18thApril2026 |శనివారం నేటి పంచాంగం

18thApril2026 | శనివారం నేటి పంచాంగం 18thApril2026 | ఈరోజు పంచాంగం ముఖ్య

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:00 am

నల్ల బిల్లులకు రెడ్‌ఫ్లాగ్

మనతెలంగాణ/హైదరాబాద్: లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెచ్చిన నల్ల బిల్లును ఇండియా కూ టమి చిత్తుగా ఓడించిందని వ్యాఖ్యనించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు కేంద్రం పన్నిన డీలిమిటేషన్ కుట్రను ప్రజాస్వామ్య శక్తులు సమర్థవంతంగా అడ్డుకున్నాయని ఆయన తెలిపారు. ఇది కేవలం ఒక బిల్లు వీగిపోవడం కాదు, సమాఖ్య స్ఫూర్తికి దక్కిన విజయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణల పేరుతో దేశ రాజకీయ సమతుల్యతను దెబ్బతీసేందుకు ఏ శక్తులు ప్రయత్నించినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వాటిని తిప్పికొడుతుందని ఈ ఓటింగ్ నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మన తెలంగాణ 18 Apr 2026 5:30 am

హర్మూజ్ ఓపెన్

టెహ్రాన్: పశ్చిమాసియాలో కీలక పరిణామం చో టు చేసుకుంది. ఇజ్రాయెల్‌లెబనాన్ మధ్య కా ల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రపంచ దేశాలకు పెద్ద ఉపశమ నం కలిగించేలా ఇరాన్ శుక్రవారం హార్మూజ్ జ లసంధిని అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు అ నుమతించనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అ బ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. లెబనాన్‌తో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకు న్న నేపథ్యంలో ఇరాన్ నుండి ఈ ప్రకటన వెలువడింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉ న్నంత వరకు హార్మూజ్ జలసంధి తెరిచే ఉం టుంది అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పరిణామంపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, లెబనాన్‌లో కాల్పుల విరమణకు అనుగుణంగా, హార్మూజ్ జలసంధి ద్వారా అన్ని వాణిజ్య నౌకలకు ప్రయాణం పూర్తిగా అనుమతించబడుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించిన సమన్వయ మార్గంలో, కాల్పుల విరమణ కాలం మిగిలిన భాగం వరకు ఈ అనుమతి అమల్లో ఉంటుంది అని వెల్లడించారు. ఈ నిర్ణయం వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టిని ఆకర్షించింది. ఆయన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందిస్తూ, హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచారని, అన్ని రవాణాలకు సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. ధన్యవాదాలు! అని పేర్కొన్నారు. అయితే, ఇరాన్ నౌకాశ్రయాల నుంచి వెళ్లే లేదా అక్కడికి వచ్చే నౌకలపై అమెరికా నౌకాదళ ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి పూర్తిగా తెరవబడి వ్యాపారానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇరాన్‌కు సంబంధించిన నౌకలపై నౌకాదళ ఆంక్షలు కొనసాగుతాయి. మా-కు, ఇరాన్ కు మధ్య ఒప్పందం పూర్తిగా ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది, ఎందుకంటే చాలా అంశాలు ఇప్పటికే చర్చించి, నిర్ణయించబడ్డాయి అని ట్రంప్ పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధి: ఘటనల కాలక్రమం మార్చి 2న, అమెరికాఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్ సైనిక మౌలిక వసతులు, ఉన్నతాధికారుల నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత, ‘స్నేహపూర్వకంగా లేని దేశాలకు’ చెందిన నౌకల రాకపోకలను హార్మూజ్ జలసంధిలో పరిమితం చేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారితీసింది. చమురు ధరలు వేగంగా పెరిగాయి. భారత్‌లో కూడా కొంతకాలం ఎల్‌పీజీ కొరత కనిపించింది, ఎందుకంటే హార్మూజ్ ప్రాంతంలో కొన్ని నౌకలు దెబ్బతిన్నాయి. అయితే, ఆ తర్వాత ఎల్‌పీజీ ట్యాంకర్లు సురక్షితంగా ఈ మార్గాన్ని దాటడంతో పరిస్థితి త్వరగా సాధారణమైంది. నేడు ఇరాన్ ప్రకటనతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెట్ ధర 8 శాతం మేర క్షీణించి 90 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ మే నెల కాంట్రాక్ట్ 9.8 శాతం క్షీణించి బ్యారెట్ ధర 85 డాలర్లకు చేరువైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి కాలంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్లు పైనే ట్రేడవుతూ వచ్చింది. క్రూడాయిల్ తగ్గుముఖం పట్టడం వల్ల దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు మేలు చేకూరుతుంది. 

మన తెలంగాణ 18 Apr 2026 5:00 am

కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతుకు స్టీరింగ్ కమిటీ

మన తెలంగాణ/హైదరాబాద్: మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, శాశ్వత ప రిష్కార మార్గాలను అన్వేషించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పనుల స మన్వయం, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక ఉ న్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కీల క నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణుడు, రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ పరిక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మెంబర్‌లుగా కె.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ (టెక్నికల్), ఎంఎస్‌ఎన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, సిడిఓ, సెల్వ బాలన్, అడిషనల్ డైరెక్టర్, సిడబ్లూపిఆర్‌ఎస్, సాయికృష్ణ, ఎండి, ఎంఎస్ ఆఫ్రి ఇండియా లిమిటెడ్, ఎస్.సురేష్‌కుమార్, జనరల్ మేనేజర్, ఎల్ అండ్ టి, మల్లికార్జున రావు, వైస్ ప్రెసిడెంట్, ఆఫ్రాన్స్, మాధవ్, ప్రాజెక్టు మేనేజర్, నవయుగ, టి.శ్రీనివాసరావు గుప్తా, సీఈ, రామగుండం (మెంబర్ కన్వీనర్‌గా) వ్యవహారించనున్నారు. ఈ కమిటీ మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం చేయడంతో పాటు నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకురానుంది. వారానికి రెండుసార్లు సమావేశమై పనుల పురోగతిని ఈ కమిటీ సమీక్షిస్తుంది. ప్రతిరోజూ జరిగే పనులపై రోజువారీ పురోగతి నివేదికలను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. మే 30వ తేదీ లోపు కసరత్తు పూర్తి.. వర్షాకాలం ప్రారంభం కాకముందే కీలకమైన పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. బ్యారేజీల పునాదుల పటిష్టతను తెలుసుకోవడానికి మే 30వ తేదీ లోపు జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు, అనుమతుల మేరకు మాత్రమే ఈ మరమ్మతు పనులు సాగనున్నాయి. ముందుగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి, మేడిగడ్డను పాక్షికంగానైనా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం ముందుకెళుతోంది. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ మెమో నెంబర్ 8141/ప్రాజెక్ట్ IV/A1/2023, తేదీ 13.04.2026 ఇరిగేషన్ సెక్రటరీ ఈ.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

మన తెలంగాణ 18 Apr 2026 4:30 am

30లక్షల ఎంటిల బాయిల్డ్ రైస్ సేకరించాలి

మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి పం టకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్ష ల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ధాన్యం యాసంగి పంట బాయిల్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలమని వారు కేంద్ర మం త్రికి తెలియజేశారు. గత ఆరు యాసంగి సీజన్‌లో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి జోషిని ఆయన నివాసంలో సిఎం, రాష్ట్ర మంత్రి శుక్రవారం ఉదయం కలిశారు. దేశవ్యాప్తంగా బా యిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణలో  ఈ యాసంగి సీజన్‌లో 90 ఎల్‌ఎంటి ధాన్యం ఉత్పత్తి అవుతుందని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్‌రెడ్డి తెలియజేశారు. తెలంగాణలో పండే యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 ఎల్‌ఎంటి బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్‌ఎంటి రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల బకాయిలను.. 201415 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని కేంద్ర మంత్రికి సిఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. పోషకాల లోపాల నివారణకు పోషకాహార బియ్యాన్ని.. పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతిగృహాలు, ఐసిడిఎస్‌ల పరిధిలో పంపిణీ చేసేవారని ఇటీవల దానిని నిలిపివేసినందున వెంటనే దానిని పునః ప్రారంభించాలని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషికి సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపి జితేందర్ రెడ్డి, సెక్రటరీ కో ఆర్డినేషన్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు

మన తెలంగాణ 18 Apr 2026 4:00 am

స్తంభించిన రిజిస్ట్రేషన్లు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తం గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. శుక్రవారం ఉద యం నుంచి సెంట్రల్ సర్వర్ మొరాయించడంతో రిజిస్ట్రేషన్‌ల కోసం వచ్చిన ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వర కు తరబడి వేచిచూశారు. 2002లో ఏర్పా టు చేసిన సర్వర్‌లో కొన్ని రోజులుగా సాంకేతిక ఇబ్బందులు ఏర్పడుతుండడంతో రెం డు, మూడు గంటల పాటు రిజిస్ట్రేషన్‌లకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రస్తుతం శుక్రవా రం ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తడంతో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. టెక్నికల్ టీంతో సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి సాయంత్ర 7 గం టల వరకు కృషి చేశారు. ఈ టీంలతో పాటు సబ్ రిజిస్ట్రార్‌లతో ఎప్పటికప్పుడు ఆ శాఖ డిఐజీ సుభాషిణి నిరంతరం సంప్రదింపులు జరిపారు. మరో 20 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే, 2002లో ఏర్పాటు చేసిన సర్వర్ స్థానంలో కొత్త సర్వర్‌ను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తో ఆ శాఖ ఉన్నతాధికారులు టెండర్‌లను సైతం పిలిచారు. నాలుగైదు నెలల్లో కొత్త సర్వర్ అనుసంధానం పూర్తయితే మరో 20 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి ఈ మధ్యన స్లాట్ బుకింగ్, ఈ సిగ్నచర్‌లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కొత్తగా అమల్లోకి తీసుకురావడంతో సర్వర్‌పై అదనపు భారం పడి అది మొరాయిస్తుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం సర్వర్ కొనుగోలు కోసం సుమారుగా రూ.12 కోట్ల నిధులను సైతం కేటాయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు పూర్తయితే రిజిస్ట్రేషన్‌లకు ఆటంకం ఏర్పడదని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. సర్వర్ మొరాయించడంతో శుక్రవారం బుక్ అయిన స్లాట్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లను శనివారం చేస్తామని, వీటితో పాటు శనివారం బుక్ చేసుకున్న స్లాట్‌లకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లను కూడా ఇదే రోజు పూర్తి చేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

మన తెలంగాణ 18 Apr 2026 3:30 am

కెపిహెచ్ బీ లో తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్ బస్సు

కెపిహెచ్ బీ పోలీస్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ నెంబర్ 734 దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జెఎన్టీయూ నుంచి కూకట్ పల్లి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించేశాడు. క్షణాల్లో మంటలు బస్సు అంతటా వ్యాపించడంతో బస్సు పూర్తిగా తగలపడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సహయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 18 Apr 2026 12:25 am

శనివారం రాశి ఫలాలు (18-04-2026)

మేషం నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభం చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిధునం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి. కర్కాటకం వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాటపట్టింపులు ఉంటాయి.చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహం నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. కన్య ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావలసిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి , ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. తుల కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చికం వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. ధనస్సు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు సంబందించి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయటపడతారు. మకరం వ్యాపారాలు మరింత మందగిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు. కుంభం ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీనం వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.  

మన తెలంగాణ 18 Apr 2026 12:10 am

గుజరాత్ ఉత్కంఠ విజయం

 ఐపిఎల్‌లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయం నమోదు చేసింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. కోల్‌కతాకు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్ 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. శుభ్‌మన్ గిల్ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 86 పరుగులు చేసి గుజరాత్‌ను గెలిపించాడు.

మన తెలంగాణ 17 Apr 2026 11:57 pm

కెటిఆర్ పాదయాత్ర ఇప్పుడెందుకు?

పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలను కలవని వారికి ఇప్పు డు ఒక్కసారిగా జ్ఞానోదయమై పాదయాత్రలు గుర్తొచ్చాయా..? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉం డి ఆయన ఎందుకు ప్రజల్లోకి పోలేదని నిలదీశారు. హరీష్‌రావుది అంతా కుట్ర రాజకీయం అని, ఆయనను తాను ఎప్పటికీ నమ్మను అని పేర్కొన్నారు. పార్టీ లో గ్రూప్ రాజకీయాలు పెంచి పోషించిందే హరీష్‌రావు అని ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, కొం దరు మాజీ ఎంఎల్‌ఎలు తనను కలిసి లోగుట్టు విప్పారని చెప్పారు. జాగృతి కార్యాలయంలో శుక్రవారం సిపియుఎస్‌ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రా ష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు కవితను కలిసి తమ మద్దతు తెలిపారు. అనంతరం కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు అధికారం దక్కాలన్నదే తన ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించుకొని 12 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటికీ కనీసం గ్రామ వార్డు పదవి కూడా పొందని కులా లు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భౌగోళిక తె లంగాణ సాధించుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ మాత్రం తెచ్చుకోలేకపోయామని అన్నారు. ఉద్యమ సమయంలోనే ఈ అంశాన్ని ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర ప్రస్తావించిన విషయాన్ని కవిత గుర్తు చేసుకున్నారు. భారత్‌కు స్వాతంత్రం వచ్చిన సమయంలో నూ గాంధీ, అంబేడ్కర్ ముందు కూడా ఇదే సమస్య వ చ్చిందని. భారత కుల వ్యవస్థలో ఈ అంశం నిరంత రం మన ముందుంటుందని జయశంకర్ సార్ అన్నారని చెప్పారు. ముందు మనం భౌగోళిక తెలంగాణ సా ధించుకొని ఆ తర్వాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని సూచించారని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడుస్తున్న ఇప్పటికీ ఎన్నో కులాలు అధికారానికి దూరంగా ఉ న్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు అధికారం కోసం జాగృతి నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. కులాలు బలంగా ఉన్నప్పుడే వారికి రా జకీయ అధికారం దక్కుతుందని బలంగా నమ్మిన వ్య క్తి మారోజు వీరన్న అని కవిత చెప్పారు. రాష్ట్రంలో కు ల సంఘాలకు కర్త, కర్మ, క్రియ ఆయనే అని గుర్తు చే శారు. కులాల అస్తిత్వాన్ని, విప్లవ ఉద్యమాలకు జత చే సి సామాజిక న్యాయం కోసం వీరన్న కృషి చేశారని పే ర్కొన్నారు. ఆయన మన ముందు పెట్టిన బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మోసం ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ దారుణంగా వంచిస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో కి వచ్చిన ఆరు నెలల్లో పిఆర్‌సి అమలు చేస్తామని న మ్మబలికి. ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదని మండిపడ్డా రు. ఎన్నికల హామీలైన సిపిఎస్ రద్దు, పాత పెన్షన్‌స్కీం పునరుద్ధరణను గాలికి వదిలేసి కాంగ్రెస్ తన నైజాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. మధ్యాహ్న భోజ న సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల నిరసనకు జాగృతి తరఫున మద్దతు ప్రకటించారు. 

మన తెలంగాణ 17 Apr 2026 11:17 pm

మహిళలను బిజెపి వంచించింది: కల్వకుంట్ల కవిత

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బిజెపికి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితం అయ్యిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ బిజెపి కుట్ర పూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన కీలక బిల్లు వీగిపోవడంపై శుక్రవారం కవిత వీడియో సందేశం విడుదల చేశారు. మహిళా కోటా బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును ముడి పెట్టడంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి లోక్‌సభలో బిల్లు వీగిపోయేలా చేశాయని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే బిజెపి ఈ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టీ పాస్ చేసి దానిని సెన్సెస్‌కు లింక్ చేశారని తెలిపారు. ఇప్పుడు 2011 సెన్సెస్ అధారంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెడుతున్నట్టు చెప్పి మరోసారి వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఆడబిడ్డలు బిజెపి మోసాన్ని గుర్తించాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళ నాయకత్వం వహిస్తోందని, ఈ మోసకారి బిజెపిని ఓడించి ఆ మహిళను గెలిపించాలని బెంగాల్‌లో ఉన్న మిత్రులకు చెప్పాలని రెండు రాష్ట్రాల మహిళలకు విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 17 Apr 2026 11:03 pm

రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా హరివంశ్ మళ్లీ ఏకగ్రీవ ఎన్నిక

నామినేటెడ్ సభ్యుడు హరివంశ్ శుక్రవారం రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి తరఫున సభా నాయకుడు జె.పీ. నడ్డా ప్రతిపాదించిన తీర్మానాన్ని ఎస్. ఫాంగ్నోన్ కొన్యాక్ మద్దతు ఇవ్వగా, వాయిస్ ఓట్ ద్వారా అది ఆమోదం పొందింది. హరివంశ్‌ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి మొత్తం ఐదు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ఆమోదం పొందిన అనంతరం, హరివంశ్ గారు రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ప్రకటిస్తున్నాను అని సభాపతి సి.పి. రాధాకృష్ణన్ వెల్లడించారు. తదుపరి, సభా నాయకుడు నడ్డా, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే హరివంశ్‌ను ఉపాధ్యక్షుని స్థానానికి తీసుకెళ్లాలని సభాపతి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో వారు ఆయనను ప్రతిపక్ష నాయకుడి పక్కన ఉన్న ఉపాధ్యక్షుని సీటుకు తీసుకెళ్లారు. హరివంశ్ పదవీకాలం ఏప్రిల్ 9న ముగియడంతో రాజ్యసభ ఉపాధ్యక్షుని పదవి ఖాళీగా మారింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను మళ్లీ రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారు. హరివంశ్ ఎన్నికపై ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అభినందనలు తెలిపారు. ఇది అనుభవానికి ఇచ్చిన గౌరవం, ఆయన సహజమైన పని విధానానికి గుర్తింపు అని మోదీ పేర్కొన్నారు. హరివంశ్ గారి నాయకత్వంలో సభ కార్యకలాపాల సామర్థ్యం పెరిగిన విధాన్ని మనందరం గమనించాం. ఆయన కేవలం సభను నడిపించడం మాత్రమే కాకుండా, తన జీవిత అనుభవాలను ఉపయోగించి సభను మరింత సమృద్ధిగా తీర్చిదిద్దుతున్నారు అని ప్రధాని అన్నారు. మూడోసారి ఈ పదవికి ఎన్నిక కావడం ద్వారా సభకు ఆయనపై ఉన్న నమ్మకం, ఆయన అనుభవం ఎంత గొప్పదో స్పష్టమవుతుందని మోదీ పేర్కొన్నారు. నామినేటెడ్ సభ్యుడు హరివంశ్ రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఒక నామినేటెడ్ సభ్యుడు ఈ పదవికి ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. హరివంశ్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ఉపాధ్యక్షుడు ప్రతిపక్షానికి తగిన సమయం కేటాయించి వారి అభిప్రాయాలను వినేలా చూడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తన మూడో పదవీకాలంలో హరివంశ్ ప్రతిపక్షానికి మరింత ప్రాధాన్యం ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. లోక్‌సభలో ఉప సభాపతి పదవి 2019 నుంచి ఖాళీగా ఉండటం రాజ్యాంగ ఆత్మకు విరుద్ధమని ఖర్గే వ్యాఖ్యానిస్తూ ఆ విషయం తనను బాధించిందన్నారు. ఇక హరివంశ్ ఎన్నిక సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలు నిరసనగా వాక్‌అవుట్ చేశాయి. హరివంశ్‌కు మద్దతుగా పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ మద్దతు తెలిపారు. మరో తీర్మానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టగా, బీజేపీ ఎంపీ సురేంద్ర సింగ్ నగర్ మద్దతు ఇచ్చారు. జేడీయూ ఎంపీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఝా ప్రవేశపెట్టిన మరో తీర్మానానికి ఆర్‌ఎల్‌ఎం ఎంపీ ఉపేంద్ర కుశ్వాహా మద్దతు తెలిపారు. అలాగే ఆర్‌ఎల్‌డీ ఎంపీ, కేంద్ర మంత్రి జయంత్ చౌధరి ఇచ్చిన నోటీసుకు శివసేన ఎంపీ మిలింద్ ముర్లీ దేవోరా మద్దతు తెలుపుతూ హరివంశ్ ఎన్నికకు మద్దతు ప్రకటించారు.

మన తెలంగాణ 17 Apr 2026 10:30 pm

ఆసియా కుబేరుడిగా గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం, అదానీ నికర ఆస్తి విలువ 92.6 బిలియన్ డాలర్లు (రూ.8.59 లక్షల కోట్లు) గా నమోదైంది. గతంలో మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రస్తుతం 90.8 బిలియన్ డాలర్ల (రూ.8.42 లక్షల కోట్లు) నికర విలువతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. అదానీ గ్రూప్ షేర్ల విలువ పెరగడంతో గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది 8.1 బిలియన్ డాలర్లు (రూ.75,110 కోట్లు) పెరిగింది. కేవలం ఒక్క రోజులోనే ఆయన ఆస్తి రూ.33,010 కోట్లు పెరిగింది. మరోవైపు, రిలయన్స్ షేర్ల విలువ తగ్గడం వల్ల అంబానీ సంపద ఈ ఏడాది రూ. 1.57 లక్షల కోట్ల మేరకు క్షీణించింది. అంతర్జాతీయంగా చూస్తే 656 బిలియన్ డాలర్ల ఆస్తితో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 

మన తెలంగాణ 17 Apr 2026 10:04 pm

మహిళా కోటా ఇప్పుడు అమలు చేసినా మద్దతిస్తాం: రాహుల్ గాంధీ

 చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల పేరిట తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఒక రకంగా రాజ్యాంగపై దాడి అని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. అందుకే ఆ బిల్లును ఓడించామన్నారు. మహిళలకు కోటా కల్పించడం దీని లక్షం కాదని, వారి పేరు మీద దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసే కుట్ర అని మండిపడ్డారు. లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీకి మళ్లీ చెబుతున్నా...2023 మహిళా బిల్లును అమలు చేయండి. మేం తప్పకుండా సహకరిస్తాం. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ముమ్మాటికీ మహి బిల్లు కాదు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఏకపక్షంగా మార్చే కుట్ర. అందుకే అడ్డుకున్నాం’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఆమోదించిన మహిళ రిజర్వేషన్ బిల్లును ఈ రోజు నుంచి అమలు చేసినా తాము సంపూర్ణంగా మద్దతు పలుకుతామన్నారు. అందుకు యావత్ ప్రతిపక్షం కూడా సిద్ధంగా ఉందన్నారు.

మన తెలంగాణ 17 Apr 2026 9:57 pm

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. శుక్రవారంనాడు హజారీబాగ్ జిల్లాలోని బటుకా ప్రాంతంలోని కెరెదారి పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు, పోలీసులకు నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం కూంబింగ్‌కు వెళ్లిన మావోయిస్టులు తారసపడడంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మృతి చెందిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో భద్రతా బలగాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు తెలిపారు. మృతుల్లో మావోయిస్టు నేత సహదేవ్ మహతో, రంజిత్ గంజూ, బుదన్ కర్మాలి, ఉన్నారు.  

మన తెలంగాణ 17 Apr 2026 9:30 pm

లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి

లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య పదిరోజుల కాల్పుల విరమణ శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. దీనితో ఇంతకాలం పరస్పర దాడులతో సాగుతూ వచ్చిన నరమేథం నుంచి బీరూట్ ఇతర ప్రాంతాలు విముక్తం అయ్యాయి. ప్రజలు తమ స్వస్థలాలకు, నివాసాలకు తిరిగి వెళ్లుతున్నారు. కాగా ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ సేనలకు, ఇరాన్ బలగాలకు మధ్య కూడా కాల్పుల విరమణ, తద్వారా హర్మూజ్ పునరుద్ధరణ, ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి శాంతికి అనువైన వాతావరణంపై ఆశలు తలెత్తాయి. లెబనాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన తాత్కాలిక సంధి ప్రక్రియలో హెజ్‌బోల్లా మిలిటెంట్లను కూడా చేర్చేంచేందుకు దౌత్యం సాగుతోంది. ఇప్పుడు ప్రత్యేకించి హర్మూజ్ మార్గంలో శాంతి స్థాపన, నౌకారవాణా సజావుగా సాగే దిశలో యూరప్ దేశాల నేతలు చర్చలకు సిద్ధం అవుతున్నారు. కాగా ఇంతకు ముందు నిలిచిపోయిన చర్చల ప్రక్రియ పునరుద్ధరణకు, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి స్థాపనకు పాకిస్థాన్ తిరిగి తన దౌత్య యత్నాలు ముమ్మరం చేసింది. 

మన తెలంగాణ 17 Apr 2026 9:20 pm

Unanimous Rejection for Ustaad Bhagat Singh on OTT

Ustaad Bhagat Singh is one of the biggest debacles of Telugu cinema in this year and it is the biggest flop in Pawan Kalyan’s career. Apart from criticism, the entire team was badly trolled and the makers lost big money. Ustaad Bhagat Singh is now streaming on Netflix since yesterday. Usually after the release of […] The post Unanimous Rejection for Ustaad Bhagat Singh on OTT appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 9:17 pm

రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 9మంది మృతి

కర్నాటకలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం చెందారు. శుక్రవారంనాడు సుర్పూర్ తాలుకాలోని శాంతపుర క్రాస్ వద్ద దుర్ఘటన జరిగింది. కారు, ఓ ప్రైవేటు బస్సు పరస్పరం ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కృష్ణనాయక్(52) ఆయన భార్య అనంతకళ(45)తో పాటు కుమారుడు, కోడలు, మనవలు, మనవరాళ్లు మొత్తం 9మంది మృత్యువాతపడ్డట్లు పోలీసులు వెల్లడించారు. దుర్ఘటన నుంచి 10 సంవత్సరాల బాలుడు విరాట్ గాయాలతో బయటపడ్డాడు. కారు రన్నింగ్‌లో ఉండగా టైరు పేలిపోవడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుర్ఘటన సమయంలో కారులో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారు. 

మన తెలంగాణ 17 Apr 2026 9:10 pm

Major Setback for Centre as Women’s Reservation-Linked Delimitation Bill Fails in Lok Sabha

In a significant political development, the Central government faced a major setback in Parliament today. A crucial Constitutional Amendment Bill linked to women’s reservation and Lok Sabha delimitation failed to secure approval in the Lok Sabha. The bill required a two-thirds majority to pass. However, the NDA government fell short during voting. The proposal could […] The post Major Setback for Centre as Women’s Reservation-Linked Delimitation Bill Fails in Lok Sabha appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 9:02 pm

సోనియా గాంధీని బలిదేవత అనలేదా ?: బండి సంజయ్

ఏఐసిసి అగ్ర నేత సోనియా గాంధీ చేసిన వల్లే తెలంగాణలో వెయ్యి మంది బలయ్యారని, ఆమె బలిదేవత అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లోగడ విమర్శించలేదా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడలేదా? అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అటువంటి ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మీరు మంత్రులుగా ఎలా కొనసాగుతున్నారని ఆయన బిజెపిని విమర్శిస్తున్న రాష్ట్ర మంత్రులనుద్ధేశించి ప్రశ్నించారు. 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి యూ టర్న్ తీసుకుంది కాంగ్రెస్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను దేశభక్తులుగా పోల్చుతూ బిజెపి ఎంపీ తేజస్వీ దేశ విభజన అంశాన్ని ప్రస్తావిస్తే వివాదం చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్, బ్రిటీషర్ల తప్పిదాలవల్లే లక్షల మంది చనిపోయింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. 2009లో తెలంగాణ ప్రకటించి కాంగ్రెస్ యూ-టర్న్ తీసుకోవడం వల్లే 1400 మంది యువకులు బలిదానమైంది నిజం కాదా? అని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంతో తమ పార్టీకి క్రెడిట్ వస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్, బిఆర్‌ఎస్ డ్రామాలు చేస్తున్నదని ఆయన విమర్శించారు.కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతలు ఫోన్లో మాట్లాడుకునే ఈ కుట్రలకు తెరదీశారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలెవరూ మోసపోవద్దని కోరుతున్నానని, రాష్ట్ర ఏర్పాటు కోసం మొదటి నుండి చిత్తశుద్ధితో పని చేసింది తమ పార్టీయేనని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తప్పిదాలను ఎండగడితే బిఆర్‌ఎస్ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు చత్తీష్‌ఘడ్, జార్ఝండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింద్న వాస్తవాలను ప్రజలకు చెబితే మీకు ఎందుకు అక్కసు అని ఆయన ప్రశ్నించారు.

మన తెలంగాణ 17 Apr 2026 9:00 pm

Satya’s Jetlee Locks Its Release Date

Satya has teamed up once again with director Ritesh Rana, reviving their successful collaboration for Jetlee, a film that leans heavily into offbeat humor and action-packed storytelling. Known for their distinctive style from the Mathu Vadalara series, the duo appears ready to deliver another entertaining ride filled with quirky moments and unexpected twists. Promotions for […] The post Satya’s Jetlee Locks Its Release Date appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 8:57 pm

ఈనెల 20న కాళేశ్వరానికి సిఎం రేవంత్‌రెడ్డి

ఈనెల 20వ తేదీన కాళేశ్వరం బ్యారేజీలను సిఎం రేవంత్‌రెడ్డి పరిశీలిస్తారని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శిస్తారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో ఎన్డీఎస్‌ఏ అధికారులతో కాశేశ్వరం గురించి చర్చించామని ఆయన చెప్పారు. కాళేశ్వరం మరమ్మతులో అంతర్జాతీయ సంస్థ ఆఫ్రీ భాగస్వామ్యం ఉందన్నారు. గోదావరిలోకి వరద వచ్చేలోపు సాయిల్ టెస్టులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. కాళేశ్వరం బిఆర్‌ఎస్ కట్టిందని వారి హయాంలోనే కూలిపోయిందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరంపై తమ ప్రభుత్వానికి దురుద్దేశం లేదన్నారు. ఎన్డీఎస్‌ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్తామని ఉత్తమ్ చెప్పారు.

మన తెలంగాణ 17 Apr 2026 8:40 pm

ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్ లోయలో పడ్డ ఘటనలో 10 మంది మృత్యువాతపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరయ్ ఘాట్ రోడ్డులో దుర్ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి వేగంగా వెళ్లి లోయలో పడిపోయింది. పైనుంచి కిందపడడంతో వ్యాన్ నుజ్జునుజ్జయింది. వ్యానులో ఉన్న పది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  

మన తెలంగాణ 17 Apr 2026 8:32 pm

పేద విద్యార్థినులకు లాప్‌టాప్‌ల పంపిణీ చేసిన కెటిఆర్

పేద విద్యార్థినుల విద్యా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న ‘టచ్ ఏ లైఫ్’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేద విద్యార్థులకు లాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. శుక్రవారం నందినగర్‌లోని నివాసంలో మాజీ కార్పొరేటర్ సామల హేమ సారధ్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతి జైన్, రీనా హిందోచా విద్యార్థినులతో కలిసి కెటిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని అన్నారు. స్వయం సమృద్ధి సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచుకుని, ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడాలని సూచించారు. ఈ సందర్బంగా కెటిఆర్ పంపిణీ చేసిన లాప్‌టాప్‌లను అందుకున్న నామాల రేష్మ, సలికంటి శ్రీవాణి, చింతగుట్ట వేదశ్రీ, ధుళ్ల రాజేశ్వరి, అతికా బారి, సనా సుల్తానా, కర్రె ఆర్తి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫౌండేషన్ చేస్తున్న కృషిని కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతి జైన్, రీనా హిందోచా మాట్లాడుతూ, తెలంగాణవ్యాప్తంగా బస్తీలు, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులను గుర్తించి, వారికి స్కాలర్‌షిప్‌లు, మెంటార్‌షిప్, నిరంతర మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే తమ లక్ష్యమని వివరించారు.

మన తెలంగాణ 17 Apr 2026 8:30 pm

మహిళా రిజర్వేషన్ల అంశంలో బహిర్గతమైన బీజేపీ కపట నీతి : మంత్రి సీతక్క

‘లక్ష్యం మాత్రమే కాదు, ఆ లక్ష్యాన్ని సాధించే మార్గాలు కూడా మంచివే కావాలని’ మహాత్మా గాంధీజీ చెప్పిన ఆలోచన ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మార్గదర్శకం కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల అంశంపై శుక్రవారం జరిగిన పరిణామాలు బీజేపీ కపట నీతిని బహిర్గతం చేశాయని ఆమె ఒక ప్రకటనలో విమర్శించారు. మహిళల సాధికారతపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, సింపుల్ మెజారిటీతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, కావాలని డీ లిమిటేషన్ అంశాన్ని జోడించి బిల్లును సంక్లిష్టం చేశారని ఆరోపించారు. ఇది మహిళల హక్కులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కాదని, రాజకీయ లాభాల కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమేనని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల దృష్టి కోణంతోనే ఈ బిల్లును ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం మీలో కనిపిస్తోందని మంత్రి విమర్శించారు. బిజెపి భావజాలమే మహిళా వ్యతిరేకమైనదని ఆమె విమర్శిస్తూ లోక్‌సభ సాక్షిగా బీజేపీకి మహిళా రిజర్వేషన్లపై నిజమైన నిబద్ధత లేదనే విషయం నిరూపితమైందని వెల్లడించారు. ఇది ప్రజాస్వామ్యానికి, మహిళల హక్కులకు మద్దతుగా నిలిచిన విజయంగా మంత్రి అభివర్ణించారు. ఈ దేశానికి మహిళా ప్రధానిని, మహిళా రాష్ట్రపతిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, విద్యా ఉపాధి అవకాశాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. మహిళల సమాన హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని మంత్రి ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్లను ఎలాంటి షరతులు లేకుండా, తక్షణమే అమలు చేయాలని తాము మరోసారి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

మన తెలంగాణ 17 Apr 2026 8:20 pm

2023 మహిళా చట్టం అమలులోకి

ఇంతకాలం మూలకు పడి ఉన్న మహిళా రిజర్వేషన్ల చట్టం 2023 గురువారం నుంచి అమలులోకి వచ్చింది. అత్యంత కీలకమైన అనివార్య సాంకేతిక కారణాలతో ఈ చట్టం ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ప్రస్తుతం పార్లమెంట్‌లో మహిళా చట్టం సవరణల రాజ్యాంగ బిల్లు చర్చకు వచ్చింది. అయితే ముందు చట్టం అమలులో ఉంటేనే , ప్రతిపాదిత సవరణలు వాస్తవికత దాల్చడానికి , వీటిపై చర్చకు వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తప్పనిసరిగా 2023 మహిళా చట్టం అమలులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించాల్సి వచ్చిందని సంబంధిత అధికారి ఒకరు వివరించారు. ఇంతకాలం ప్రభుత్వం ద్వారా మహిళా రిజర్వేషన్ల చట్టం తద్వారా వారికి అందే 33 శాతం కోటా వర్తింపును రాజ్యాంగంలో భాగం చేయలేదు. పలు కారణాలతో చట్టం అమలులోకి రాలేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. చట్టం అనేది అమలులో ఉంటేనే దానికి సవరణలు లెక్కలోకి వస్తాయనేది కీలక విషయం కావడంతో, పార్లమెంటరీ, రాజ్యాంగ నిపుణులు పరిస్థితిని సమీక్షించి తక్షణ సర్దుబాటు చర్యకు దిగారు. బుధవారం ఓ వైపు సవరణలపై తీవ్రస్థాయి చర్చలు జోరందుకున్న దశలోనే 2023 చట్టం అమలులోకి వచ్చిందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ చట్టం అమలులోకి వచ్చినట్లు రాత్రి పది గంటల సమయంలో నోటిఫికేషన్‌లో తెలిపారు. ఇప్పుడు దీని కొనసాగింపుగా ఈ చట్టం సవరణలపై పార్లమెంట్‌లో చర్చ తరువాత , చట్టం 2029 నుంచి అమలులోకి వస్తుంది. ఈ విధంగా మహిళా రిజర్వేషన్ల కోటా వర్తింపు ఆరు సంవత్సరాలకు కానీ కార్యరూపం దాల్చదు. ఇప్పుడు రిజర్వేషన్ల చట్టం అమలులోకి వచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు సాంకేతిక కారణాలతో రిజర్వేషన్లను అమలు చేయడం ఇప్పటి సభ ద్వారా కుదరదని అధికారులు తెలిపారు. తదుపరి జనాభా లెక్కల ప్రాతిపదికన జరిగే డిలిమిటేషన్ తరువాతనే మహిళలకు 33 శాతం కోటా కట్టబెట్టడానికి వీలుంటుంది. 2023 సెప్టెంబర్‌లో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నారీ శక్తి వందన్ అధినియమ్ పేరిట ఈ మహిళా రిజర్వేషన్ల చట్టం ఆమోదం పొందింది. ఈ చట్టం మేరకు దేశంలోని మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లు కేటాయింపు, తద్వారా వారికి చట్టసభలలో సాథికారికతకు వీలేర్పడుతుంది. అయితే మూడు సంవత్సరాలుగా ఈ కోటా చట్టం పెండింగ్‌లో ఉన్న దీనికి రాజ్యాంగ బద్ధత కల్పించకపోవడం కీలక విషయం అయింది.

మన తెలంగాణ 17 Apr 2026 8:05 pm

లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యంగ సవరణ బిల్లు

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డిఎ సర్కార్‌కి షాక్ తగిలింది. సర్కార్ ప్రవేశపెట్టిన 131వ రాజ్యంగ సవరణ బిల్లు కూడా మెజారిటీ సాధించలేకపోయింది. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ జరిగింది. అయితే ఎన్డిఎ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. మొత్తం 489 మంది సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. బిల్లు ఆమోదానికి 326 కావాల్సి ఉంది. అయితే బిల్లుకు అనుకూలంగా 278 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓవర్లు వచ్చాయి. దీంతో బిల్లు వీగిపోయింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై 528 సభ్యులు ఓటు వేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యంగ సవరణ బిల్లు వీగిపోయినందున మిగితా రెండు బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అనంతరం లోక్‌సభ వాయిదా పడింది.

మన తెలంగాణ 17 Apr 2026 7:56 pm

ప్రధాని మోడీ పెద్ద మాంత్రికుడు: రాహుల్ గాంధీ

ప్రధాని మోడీ పెద్ద మాంత్రికుడు అని, బాలాకోట్ , పెద్ద నోట్ల రద్దు, తరువాత ఆపరేషన్ సిందూర్ ఇవన్నీ ఆయన తంత్రాలని లోక్‌సభలో మహిళా బిల్లు చర్చ సందర్భంగా రాహుల్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు బిజెపి సభ్యులు అడ్డుతగిలారు. ప్రధాని మోడీపై రాహుల్ అనుచిత పదజాలాలకు దిగారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ మండిపడ్డారు. పైగా రాహుల్ మరోసారి దేశ సైనిక బలగాలను కించపర్చే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసివేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. దీనితో స్పీకర్ రాహుల్‌ను ఉద్ధేశించి సరిగ్గా మాట్లాడాలని, విషయానికి పరిమితం కావల్సి ఉందని స్పష్టం చేశారు. తప్పుడు పదజాలాలను అనుమతించేది లేదన్నారు. దీని తరువాత రాహుల్ గాంధీ తాను వాడిని ఇంద్రజాలికుడు పదం ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఆయన దేశంలోని సైనిక దళాలను తాను కించపర్చడం లేదని, బిజపి వారే ఈ విధంగా చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు. ఈ సందర్భంగా రాహుల్ పదేపదే అంతా 16 అంకెలో దాగి ఉందని వ్యాఖ్యానించారు. గురువారం ప్రధాని మోడీ తమ ప్రసంగం దశలో నీరసంగా కన్పించారు. ఎందుకు అని ఆరాతీశానని , వెంటనే 16వతేదీ గుర్తుకు వచ్చింది. 16 కిటుకు వేరే కూడా ఉందని రాహుల్ తెలిపారు.ఈ దశలో ఆయన ఈ ప్రభుత్వం 16 మంది టిడిపి ఎంపిల మద్దతుపై ఆదారపడి పనిచేస్తున్న విషయం పరోక్షంగా ప్రస్తావించినట్లు వెల్లడైంది. రాహుల్ గాంధీ తమ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీకి, తనకు భార్య బాదరబందీ లేదన్నారు. అందరికీ జీవితంలో మహిళల నుంచి ఏదో ఒక పాఠం అబ్బుతుంది. తనకు సోదరి తల్లి నుంచి ఆత్మీయత దక్కుతుంది. ఇదే విధంగా ప్రధాని మోడీకి కూడా ఇదే స్పందన ఉంది. అంతకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ సభలో మాట్లాడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ తన భార్య గురించి కవిత చెప్పారని, అప్పటి నుంచి రాహుల్‌కు ఇంట్లో తిట్లు పడి ఉంటాయని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ అవును తనకు మోడీజి మాదిరిగానే ఈ అనుభూతి లేదు ఏం చేద్దామని చమత్కరించారు. 

మన తెలంగాణ 17 Apr 2026 7:56 pm

Nagabandham’s Sura Promo: Visually Stunning

The Secret Treasure, directed by Abhishek Nama and starring Virat Karrna, is shaping up as a grand blend of mythology and action mounted on an impressive scale. The makers have now unveiled the promo of the film’s second single, Sura Sura, which is set for release on the 19th of this month. Going by the […] The post Nagabandham’s Sura Promo: Visually Stunning appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 7:52 pm

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని నిందితులను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 6.09 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...మురళీ అనే వ్యక్తి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి కొండాపూర్, మాదవహిల్ స్ట్రీట్ ప్రాంతంలో అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేస్తున్న వికాస్, భరత్ చౌదరి డ్రగ్స్ కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇద్దరు నిందితులను గతకొంత కాలం నుంచి ఇంటీరియర్ డిజైన్ పేరుతో లగ్జరీ కార్లలో తిరుగుతూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. నిందితులపై నిఘా పెట్టిన ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది వికాస్ ,భరత్ చౌదరి డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఎండిఎంఏ డ్రగ్స్ గ్రాముకు రూ.5,000 చొప్పున విక్రయిస్తున్నారు. నిందితులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మురళీ, మిగతా ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం ముగ్గురిని కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. సిఐ బిక్షా రెడ్డి, ఎస్సై బాలరాజు, సిబ్బంది నిందితులను పట్టుకున్నారు.

మన తెలంగాణ 17 Apr 2026 7:50 pm

Jai Bhim Combo Back on Cards

Jai Bhim has been a memorable film in the career of Suriya. The film had a direct digital release on OTT due to the ongoing coronavirus pandemic. The latest news is that Jai Bhim combo is back on cards. TJ Gnanavel will soon direct Suriya in one more film and it is said to be […] The post Jai Bhim Combo Back on Cards appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 7:49 pm

Big Breaking : ఎన్డీఏకు షాక్.. వీగిపోయిన బిల్లులు

లోక్ సభలో చారిత్రాత్మిక బిల్లులపై ఓటింగ్ జరిగింది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 7:36 pm

ఎంఎల్ఎ మల్‌రెడ్డి రంగారెడ్డి పారిపోయాడు: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

బహిరంగ చర్చకు రాకుండా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పారిపోయాడని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం యాచారం మండలంలోని మేడిపల్లిలో ఉదయం 10 గంటలకు పార్మాసిటీ భూములపై అవకతవకలు జరిగాయని చెప్పిన మల్‌రెడ్డి రంగారెడ్డి దమ్ము, ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నాడని మాజీ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. గత వారం రోజు క్రితం మేడిపల్లిలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేసిన మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం 9 గంటలకు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలోనే పోలీసులతో హౌస్ అరెస్టు చేసి బంధించారని గుర్తుచేశారు. పార్టీ కార్యాలయంలో మల్‌రెడ్డి రంగారెడ్డిపై వ్యతిరేకంగా నినాదాలు, సాగర్ రోడ్డుపై బైటాయింపు, మల్‌రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులు తమ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్మాసిటీపై ఇప్పటికైనా తప్పు తనదేనని ఒప్పుకోవాలని సవాల్ చేశారు. తప్పుడు మాటలు చెప్తూ ఎమ్మెల్యే కాలం వెళ్లదీస్తునారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండున్నరేండ్లలో కేవలం రూ.220 కోట్లు నిధులు తీసుకరావడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అనంతరం క్యామ మల్లేష్, ఎస్‌వీ రమణారెడ్డిలు మాట్లాడుతూ.. గతంలో మూడు సార్లు కిషన్‌రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలైన మల్‌రెడ్డి రంగారెడ్డి తప్పుడు మాటలు మానుకొని ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దండెం రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ప్రవీణ్, గూడూరి యాదగిరి, మండల పార్టీ అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు, జెర్కోని రాజు, నిట్టు జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 17 Apr 2026 7:33 pm