SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

గ్రీన్ అంబాసిడర్ల కు పరిశుభ్రత పై శిక్షణ

డి.ఎల్.డి.ఓ పర్యవేక్షణ విశాలాంధ్ర – తాళ్లపూడి: గ్రీన్ అంబాసిడర్లంతా మరింత చైతన్యవంతంగా పనిచేసి, గ్రామాలను పరిశుభ్రతలో అద్దం లా తయారు చేయాలని, దానికి అవసరమైన వసతులు సమకూర్చు తామని తాళ్లపూడి ఎంపీడీఓ వేణు గోపాలరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలం లోని అన్నదేవరపేట లో గ్రామ పంచాయతీ నందు గ్రామపంచాయతీ కార్యదర్శి డి. ఎస్. సి శ్రీనివాస్ ఆధ్వర్యం లో జరిగిన పచ్చదనం- పరిశుభ్రత గ్రామాలు పై ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీడీఓ […] The post గ్రీన్ అంబాసిడర్ల కు పరిశుభ్రత పై శిక్షణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 7:30 am

క్లీన్ అండ్ గ్రీన్

క్లీన్ అండ్ గ్రీన్ పై శిక్షణా కార్యక్రమం. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం జేగురుపాడు గ్రామంలో శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామాన్ని శుభ్రపరచడం ఎలా అనే అంశంపై రూపొందించబడిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, క్లాప్ మిత్ర, షెడ్డు మిత్ర లు పాల్గొన్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్ర వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇంటింట చెత్త సేకరణ, గ్రామ శివార్లలో […] The post క్లీన్ అండ్ గ్రీన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 7:26 am

అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

— ఎమ్మెల్యే గోరంట్ల. విశాలాంధ్ర – కడియం : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం, కడియపులంక గ్రామంలో పల్లాలమ్మ గుడి పక్కన ఉన్న సిసి రోడ్డు నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు నుండి 31 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం జేగురుపాడు పంచాయతీ పరిధిలోని […] The post అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 7:23 am

జాబ్ మేళా

పైడి ఐ.టి.ఐ ప్రాంగణంలో జాబ్ మేళా విశాలాంధ్ర – తాళ్లపూడి: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కొవ్వూరు నియోజకవర్గం లోని శ్రీ పైడి ఐటీఐ ప్రాంగణంలో నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ నేతృత్వం లో జరిగిన జాబ్ మేళాలో ప్రముఖ పాటిల్ గ్రూవ్, రాజేంద్ర ఎనర్జీ సొల్యూషన్ నందు […] The post జాబ్ మేళా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 7:20 am

ఖోఖో పోటీలకు

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన నల్లజర్ల విద్యార్థులు విశాలాంధ్ర – నల్లజర్ల :ఇటీవల గోపన్నపాలెం వ్యాయామ విద్యా కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి ఖో ఖో పోటీలలో. అండర్ 17 విభాగంలో నల్లజర్ల హై స్కూల్ ప్లస్ విద్యార్థినిలు బేత ఉదయ పోసేశ్వరి మైనం దుర్గ భవానీలు ప్రతిభ కనబరిచి నందున. ఈనెల 23. 24. 25.వ. తేదీలలో విజయనగరంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తరఫున పాల్గొననున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చాగంటి కోమలి […] The post ఖోఖో పోటీలకు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 7:16 am

పరిసరాల పరిశుబ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

పరిసరాల పరిశుభ్రతను పాటించాలి విశాలాంధ్ర – నిడదవోలు : పరిసరాలను పరిశుబ్రత ప్రతి ఒక్కరూ బాధ్యత అని మండల అభివృద్ధి అధికారి టివి సత్యనారాయణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరిశుభ్రం,పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఉనకరమిల్లిలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎంపీడీవో టి.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను, పారిశుద్ధ్య పని తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రతగా ఉంచాలన్నారు. నూరుశాతం […] The post పరిసరాల పరిశుబ్రత ప్రతి ఒక్కరి బాధ్యత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 7:13 am

కులమతాలకు అతీతంగా కంబాల

కులమతాలకు అతీతంగా జీవించాలి– సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలి– బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావువిశాలాంధ్ర – రాజానగరం : మనమంతా భారతీయులమని కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవించాలని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు,బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావుఅన్నారు. రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భవాని సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు గురువారం రాత్రి జరిగిన లక్ష దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కంబాల శ్రీనివాసరావును ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానించి సత్కరించారు.అలయంలో […] The post కులమతాలకు అతీతంగా కంబాల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 7:04 am

గ్రంధాలయాలు విజ్ఞాన జ్ఞాన సంపద

విశాలాంధ్ర – దేవరపల్లి : గ్రంధాలయాలు విజ్ఞాన జ్ఞాన సంపదని విద్యార్థులు గ్రంధాలయాన్ని సద్విని చేసుకోవాలని దేవరపల్లి ఎంపీపీ కేవీకే దుర్గారావుగోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డి సువర్ణ రాజు అన్నారు దేవరపల్లి మండలం దేవరపల్లి శాఖ గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు గ్రంథాలను చదువుకొని విద్య ఉద్యోగ అవకాశాలు పెంపొందించుకోవాలని ఆయన సూచించారు గ్రంధాలయాల్లో వివిధ కాంపిటీషన్ పుస్తకాలు […] The post గ్రంధాలయాలు విజ్ఞాన జ్ఞాన సంపద appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 6:59 am

పచ్చదనం పరిశుభ్రతకు

విశాలాంధ్ర – దేవరపల్లి : గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు పచ్చదనం పరిశుభ్రతకు గ్రామపంచాయతీలు కార్యదర్శులు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజలతో మమేకం కావాలని దేవరపల్లి ఎంపీడీవో సిహెచ్ నాగార్జున రావు పేర్కొన్నారు దేవరపల్లి పంచాయితీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పరిసరాల పరిశుభ్రత పచ్చదనం పరిశుభ్రతపై గ్రామ కార్యదర్శులకు పారిశుద్ధ్య కార్మికులకు డ్వాక్రా వివో ఏ లకు గత మూడు రోజుల నుండి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు శుక్రవారం నాడు దేవరపల్లిలో పల్లంట్ల రోడ్డులో గల చెత్త నుండి […] The post పచ్చదనం పరిశుభ్రతకు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 6:54 am

వేటుకు ముందే రాజీనామా?

మన తెలంగాణ/హైదరాబాద్:అనర్హత వేటుకు ముందే తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చే సేందుకు ఎంఎల్‌ఏలు దానం నాగేందర్, కడి యం శ్రీహరి సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ వర్గాల విశ్వసనీయవర్గాల సమాచారం. బిఆర్‌ఎస్ నుం చి ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని 10 మంది ఆరోపణలు ఎ దుర్కొంటున్న విషయం తెలిసింది. వీరిలో ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీక ర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇదివరకే విచారణ జరిపారు. కాగా, మరో ఇద్దరు ఎంఎల్‌ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి నెల రోజుల క్రితమే తమకు సమాధానం చెప్పేందుకు గడువు కావాల ని కోరారు. ఈ నేఫథ్యంలో నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో స్పీకర్ ఎంఎల్‌ఏల విచారణను వేగవంతం చేయడమే కాకుండా తాజాగా మిగతా ఇద్దరు ఎంఎల్‌ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి తాజాగా మరోసారి నోటీసు పంపించా రు. ఈ నెల 23 వ తేదీలోగా కౌంటర్ దాఖలు చే యాల్సిందిగా స్పీకర్ తన నోటీసులో పేర్కొన్నా రు. ఈ నేపథ్యంలోనే ఎటూ తేల్చుకోలేక డైలమాలో ఉన్న కడియం శ్రీహరి శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి తనకు మరి కొంత గ డువు కావాలని కోరారు. నాలుగు వారాల్లో తా ను నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబ ట్టి తాను ఎక్కువగా సమయం ఇవ్వలేనని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆయనతో చెప్పినట్లు తెలిసింది. దీంతో కడియం శ్రీహరి ఈ నెల 27న రాజీనా మా చేస్తారన్న ఊహగానాలు నెలకొన్నాయి. కా గా దానం నాగేందర్ ఒకటి, రెండు రోజుల్లో స్పీకర్‌ను కలిసి గడువు కోరకుండా రాజీనామా చేస్తారన్న ప్రచారంకూడా జరుగుతున్నది. ఇదిలాఉండగా ఫిరాయింపు ఎంఎల్‌ఏలు దానం నాగేంద ర్, కడియం శ్రీహరి ,దానం నాగేందర్, కడియం శ్రీహరితో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ నాయకత్వం సీరియస్‌గా ఆలోచన చేస్తున్నది. వారిరువురితో రాజీనామా చేయించి, తిరిగి పోటీ చేయించి గెలిపించుకుంటే మంచిదన్న భావనతో ఉంది. వారితో రాజీనామా చేయించకపోతే స్పీకర్‌కు గత్యంతరం లేక వారిపై అనర్హత వేటు వేస్తే, రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం వారు వచ్చే ఆరేళ్ళ వరకూ చట్ట సభలకు పోటీ చేయకుండా అనర్హులవుతారు. కాబట్టి ముందుగానే రాజీనామ చేయించినట్లయితే ఫిరాయింపుల నిరోధక చట్టం వేటు నుంచి తప్పించుకోవచ్చన్న ఆరోచన చేస్తున్నట్లు సమాచారం. రాజీనామాకు దానం సిద్దం& శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎంఎల్‌ఏ దానం నాగేందర్ ఘంటాపథంగా చెబుతున్నారు. తాను సునాయసంగా విజయం సాధిస్తానన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ నేతల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పవచ్చు. జూబ్లీ ఉత్సాహంతోనే ఖైరతాబాద్‌లో ఘన విజయం సాధించవచ్చన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పార్టీ నాయకత్వం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దానంకు పొంచి ఉన్న ప్రమాదం కాగా దానం నాగేందర్ రాజీనామా చేయకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. బిఆర్‌ఎస్ నుంచి ఎంఎల్‌ఏగా ఎన్నికైన దానం ఆరు నెలల తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం బహిరంగ రహస్యమే. ఇంత స్పష్టమైన ఆధారం ఉంది కాబట్టి అనర్హత వేటు పడే ప్రమాదం ఉందని పార్టీ నాయకులూ ఆందోళనలో ఉన్నారు. కడియంపై సందిగ్ధత.. మరోవైపు కడియం శ్రీహరి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే తిరిగి పోటీ చేయించే విషయంలో సందిగ్ధత నెలకొంది. అందుకు కారణం, ఎంఎల్‌ఏగా తనకు ఇదే చివరి ఎన్నికలని పలు పర్యాయాలు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కడియం తిరిగి పోటీ చేసినా గెలుపొందుతారా? అనే సందేహాలూ నేతలకు లేకపోలేదు. కడియం శ్రీహరి కుమార్తె లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నందున, ఇంకా ఆయన్ను గెలిపించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయని పార్టీ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కడియం రాజీనామా చేసినట్లయితే స్టేషన్ ఘన్‌పూర్ స్థానాన్ని చురుకైన నాయకురాలు ఇందిరకు దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది. అనర్హత వేటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి రాజీనామా చేయడమే ఉత్తమేనన్న భావనతో పార్టీ నాయకత్వం ఉంది. కోల్‌కత్తా హైకోర్టు కీలక తీర్పు.. ఇదిలాఉండగా ఇటీవల కోల్‌కత్తా హైకోర్టు పార్టీ ఫిరాయింపులపై కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి తరపున పోటీ చేసి ఎంఎల్‌ఏగా గెలుపొందిన ముకుల్ రాయ్ ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బిజెపి నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ముకుల్ రాయ్ శాసనసభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మన తెలంగాణ 22 Nov 2025 6:00 am

శ్రామిక సంస్కరణలకు శ్రీకారం

న్యూఢిల్లీ: మనదేశంలో కార్మిక రంగంలో అతి పెద్ద సంస్కరణలకు కేంద్ర ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం నాలుగు కార్మిక కోడ్‌లను అమలులోకి తె చ్చింది. కొత్త గా అమలులోకి తెచ్చిన కోడ్ లు - వేతనాల కోడ్(2019) పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020) సామాజిక భద్రత కోడ్ (2020) వృత్తి పరమైన భద్రత, ఆ రోగ్యం, పని పరిస్థితుల కోడ్ (ఓఎస్ హెచ్ డబ్లుసి) కోడ్ 2020. ఈ కోడ్ ల తో ఇప్పటికే అమలులో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను రదుచేయడమో, హేతుబద్దీకరించడమో జరుగుతుంది. కొత్త కొడ్‌లు ఓ చారిత్రాత్మక నిర్ణయం అని కేంద్రప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల దశాబ్దాలుగా అమలులో ఉన్న కార్మిక నియమాలను సులభతరం చేస్తుందని, కార్మిక సంక్షేమాన్ని పెంచడంతో పాటు, భద్రతా ప్రమాణాల ను బలోపేతం చేస్తుందని పేర్కొంది. 2025 నవంబర్ 21నుండి అ మలులోకి వచ్చిన ఈ కోడ్ ల వల్ల భారతదేశ కార్మికవ్యవస్థ ప్రపంచంలో అత్యుత్తమ పద్ధతులకు దీటుగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ కోడ్ ల లక్ష్యం భవిష్యత్ లో అవసరాలకు అనుగుణమైన రక్షితమైన శ్రామిక శక్తిని కల్పించడమేనని పేర్కొంది. ఈ విప్లవాత్మక మార్పు ఉపాధి కల్పనకు తోడ్పడమే కాక, ఆత్మనిర్భర్ భారత్ అమలుకు సంబంధించిన కార్మిక సంస్కరణలను ముందుకు తీసుకువెళ్తుందని ప్రభుత్వం పేర్కొంది. నాలుగు కొత్త కోడ్ ల అమలు వల్ల కలిగే ప్రయోజనాలు 1. నియామకాలలో పారదర్శకత కోసం, ప్రతి కార్మికుడికీ నియామక పత్రం జారీ తప్పనిసరి. 2. సార్వత్రిక సామాజిక భద్రతా కవరేజ్ కింద గిగ్ , ప్లాట్ ఫామ్ కార్మికులతో సహా అందరికీ, పెన్షన్ ఫండ్, ఈఎస్ ఐ సి, బీమా, ఇతర ప్రయోజనాలు. 3. కార్మికులు అందరికీ కనీస వేతనాలకు చట్టబద్ధమైన హక్కు. 4. కార్మికులలో 40 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా ప్రతిఏటా ఆరోగ్య పరీక్షలు, రోగ నివారణ, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రోత్సాహకాలు 5. వేతనాలను సకాలంలో చెల్లించడం తప్పని సరి చేయడం.వివక్షణ తొలగింపు 6. మైనింగ్, ప్రమాదకర పరిశ్రమలతో సహా అన్ని రంగాలలో మహిళల భద్రతా చర్యలు వారి అంగీకారంతోనే రాత్రి షిఫ్టులలో పని చేయడానికి అనుమతి. 7. చిన్న పరిశ్రమలు, ప్రమాదకరమైన సంస్థలతో సహా దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలలో ఈఎస్‌ఐసి కవరేజ్. 8. సింగిల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్, రిటర్న్ తో సహా చాలా భారాలను తగ్గిస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కీలక రంగాలను లక్ష్యంగా చేసుకుని ఈ సంస్కరణలు అమలు చేస్తున్నారు. రంగాలవారీగా ఈ నాలుగు కోడ్ లు భారతదేశంలో సమగ్ర కార్మిక రక్షణకు అద్దంపడతాయి. భారతదేశంలో సామాజిక భద్రత పెరగడంతో 2015లో 19 శాతం ఉన్న శ్రామిక శక్తి, 2025లో 64 శాతం కన్నా పెరిగింది. నాలుగు కోడ్ లు ప్రగతిశీల కార్మిక పరమైన సంస్కరణలు - ప్రధాని స్వాతంత్రం తర్వాత అత్యంత ప్రగతిశీల సంస్కరణలకు ఈ నాలుగు కార్మిక కోడ్ లు సంకేతాలు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కార్మికుల సాధికారత కల్పనలో ఇవి తోడ్పడతాయని ఆయన అన్నారు. ఈ సంస్కరణలతో వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని ప్రోత్సహింస్తుందని ఎక్స్ వేదికగా శుక్రవారం నాడు ప్రధాని పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల మరిన్ని ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, ఉత్పాదకత పెరిగి, వికసిత భారత్ వైపు మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మన తెలంగాణ 22 Nov 2025 5:30 am

5 లక్షల కోట్ల భూ కుంభకోణం

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారని కెటిఆర్ ఆరోపించారు.తెలంగాణ భవన్‌లో శుక్రవా రం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. 9,292 ఎకరాలు అంటే సు మారు 9,300 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసుందుకు రేవంత్‌రెడ్డి ముఠా కుట్ర చేస్తోందని ఘా టు విమర్శలు చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ము ఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలకు భూములను అప్పజెప్పే యత్నం జరుగుతోందని ఆరోపించారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ వ్య క్తులకు అప్పజెప్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియ ల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హెచ్‌ఐఎల్‌టిపి) పేరిట ముఖ్యమంత్రి రూ. 5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణం అనిపేర్కొన్నారు. క్యాబినెట్ మీటింగ్‌లోనే ప్రభుత్వం ఈ భారీ స్కామ్‌కు తెరలేపిందని అన్నారు. ఈ విధానం ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే రూపొందించబడిందని ధ్వజమెత్తారు. పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించాల్సిన భూమిని పెద్ద పెద్ద గద్దలకు దారాదత్తం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి భూకుంభకోణంపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. సిఎం రేవంత్ రెడ్డి ట్రాప్‌లో పారిశ్రామికవేత్తలు పడొద్దని సూచించారు. పెరిగిన భూముల విలువను.. రేవంత్ పెటిఎంగా మార్చుకున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన ఆరోపణలు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. మెట్రో భూములు, సెంట్రల్ యూనివర్శిటీ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని, ఇప్పుడు పరిశ్రమల భూములపై దృష్టి సారించారని ఆరోపించారు. ప్రజల ఆస్తిని ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు అప్పజెప్తున్నారని.. బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా విచారణ జరుపుతామని వెల్లడించారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్‌ఐఎల్‌టిపి వాస్తవానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళ ఉపయోగ విలువైన రియల్ ఎస్టేట్‌గా మార్చడానికి రూపొందించబడిందని పేర్కొన్నారు. ఇది కేవలం పాలసీ కాదు అని, రూ. 5 లక్షల కోట్ల స్కామ్ కోసం రూపొందించిన బ్లూప్రింట్ అని ఆరోపించారు. ప్రభుత్వ ధర కంటే మార్కెట్ ధర నాలుగైదు రెట్లు ఎక్కువ పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో, రేవంత్ రెడ్డి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపారని కెటిఆర్ అన్నారు. బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, అజామాబాద్‌తో సహా హైదరాబాద్‌లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్‌లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం ఎకరాకు రూ. 40 నుంచి 50 కోట్ల వరకు ఉందని, దీని మొత్తం విలువ రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. ఆ భూములను రేవంత్ కేవలం ప్రభుత్వ విలువలో 30 శాతానికే అప్పగించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు, ప్రభుత్వ ధర కంటే 100 నుండి 200 అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశామన్నారు. మార్కెట్ ధరలు, ఎస్‌ఆర్‌ఓ విలువ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని, కేవలం 30 శాతానికి మాత్రమే తీసుకుంటున్నారని మండిపడ్డారు. మిగిలిన లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తాయని ఆరోపించారు. మేము ఆ ప్రతిపాదనలను తిరస్కరించాం ఉద్యోగాల కల్పన, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి చారిత్రకంగా పారిశ్రామిక భూములను చాలా తక్కువ ధరలకు లేదా ఉచితంగా కేటాయించారని కెటిఆర్ చెప్పారు.ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వాలు రాయితీ ధరలకే పారిశ్రామిక భూమిని ఇచ్చాయని, కానీ ఇప్పుడు, అవే భూములను ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం క్రమబద్ధీకరిస్తున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మంది భూ యజమానులు, బ్రోకర్లు అత్యంత తక్కువ ధరలకు క్రమబద్ధీకరణ కోసం తనను సంప్రదించారని, అయితే తాము ఆ ప్రతిపాదనలను తిరస్కరించామని గుర్తు చేశారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ ప్రయోజనం కోసం చౌకగా ఇవ్వలేము అని చెప్పామని అన్నారు. కానీ,ఇప్పుడు రేవంత్ ఆ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ పాలసీలో 7 రోజుల్లో దరఖాస్తులు, 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయమని చెప్పడంపై కెటిఆర్ అనుమానం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల విలువైన భూముల అంశంలో ఎందుకీ తొందర..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సోదరులు, అనుచరులు మరియు మధ్యవర్తులు ఇప్పటికే ఈ భూముల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. పాలసీ ఆమోదం పొందడానికి ముందే డీల్స్ కుదిరాయని తెలిపారు. ప్రజల భూమిని చౌక ధరలకు అప్పగిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్లు, స్మశాన వాటికలకు కూడా స్థలం లేని హైదరాబాద్‌లో, ప్రభుత్వం ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లేదా స్మశాన వాటికలకు కూడా భూమి దొరకని నగరంలో, రేవంత్ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని లేదా ముంబై మాదిరిగా బహిరంగ వేలం వేయాలని అన్నారు. దానికి బదులుగా, వారు రూ. 5 లక్షల కోట్లు దోచుకోవాలని, కనీసం రూ. 50,000 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జేబులో వేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఈ లావాదేవీలు నిలబడవు అని, ఆ భూమిని తిరిగి తీసుకుంటామని చెప్పారు. బిఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమబద్ధీకరణను రద్దు చేసి, పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని అన్నారు. ఈ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని కెటిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై స్పందించాలని కేటీఆర్ బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దీనిని వ్యతిరేకించాలి. మౌనంగా ఉంటే, కాంగ్రెస్, బీజేపీ కలసిపోయాయని అర్థం, అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది అభివృద్ధి కాదు, ఇది పగటిపూట దోపిడీ అన్నారు. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదు ఫార్ములా ఈ రేసు కేసులో సిఎం రేవంత్‌రెడ్డి తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చేసుకుపోనివ్వండని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌లో తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహరంపై లై డిటెక్టర్ టెస్ట్‌కు కూడా తాను సిద్ధమే అని మరోసారి తెలిపారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏమీ లేదని రేవంత్‌రెడ్డికి కూడా తెలుసు అని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ స్పీకర్ పార్టీ మారిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేస్తే ప్రభుత్వం పరువు పోతుందని, ఆ ముప్పు నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ రాజీనామా డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. దానం నాగేందర్‌తో రాజీనామా చేపించి.. కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దానం దొరికిపోయారని చెప్పారు. సాకేంతిక సాకులు చూపి కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ ఎన్నికలొస్తాయని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు. 

మన తెలంగాణ 22 Nov 2025 4:30 am

మీ జీవోలే అమలు చేస్తున్నాం

మన తెలంగాణ/హైదరాబాద్: పారిశ్రామిక భూ ముల కన్వర్షన్ కోసం ఇంపాక్ట్ ఫీజు వసూలు చే యాలని నిర్ణయిస్తే దానిని 5-లక్షల కోట్ల కోణంగా చిత్రీకరిస్తూ కేటీఆర్ దుష్ప్రచారం సాగిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వం పరిశ్రమల కు లీజుకిచ్చిన భూములపై యాజమాన్య హక్కు లు కల్పిస్తూ ‘ఫ్రీహోల్డ్’ రైట్స్ పేరిట 2023 ఆగస్టు లో మూడు జిఓలు ఇచ్చింది వారి ప్రభుత్వ హ యాంలో కాదా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఆరోపణలను ఆధారాలతో సహా తిప్పికొట్టారు. కేటీఆర్ చెబుతున్న 9,292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసి కేటాయించినది 4740 ఎకరాలే అని, మిగిలిన భూమి రోడ్లు, డ్రెనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం జరిగిందన్నారు. ఈ కేటాయింపులు ఒక్కరోజులో చేసినవి కాదని, పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల కాలంగా ఇస్తూ వచ్చినవని, ఆజమాబాద్, కూకట్ పల్లి, హఫీజ్ పేటల్లోని పరిశ్రమల భూములను ఫ్రీ హోల్ పేరిట యాజమాన్య హక్కులు కల్పించినది బిఆరెఎస్ ప్రభుత్వమే అని వెల్లడించారు. కూకట్ పల్లి, ఆజమాబాద్, హఫీజ్ పేట భూములకు సంబంధించి పరిశ్రమల శాఖ జిఓ ఎంస్ 19, 20, 21 లను 2023 ఆగస్టు 29 న జారీ చేసిందని, ఇప్పుడు ఆ భూములకు కన్వర్షన్ అవకాశం కల్పిస్తున్నామన్నారు. 30, 50 శాతం శ్లాబ్ లతో ఇంపాక్ట్ ఫీజు నిర్ణయిస్తూ ఈనెల 17 న జరిగిన కేబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. 2023లో ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఫ్రీహోల్ హక్కులు కల్పించారని, అప్పుడు ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసుకున్నారో చెప్పాలన్నారు. ఆ జిఓల విషయం దాచిపెట్టి ప్రభుత్వంపై నిరాధార నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఓటమితో కేటీఆర్ కు పగలే చుక్కలు : జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటమితో కేటీఆర్ కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. వారి పార్టీ ప్రసార సాధనాలు ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తున్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాయని, ఇప్పుడు వారి పత్రికలే లేని దానిని కుంభకోణంగా అభివర్ణిస్తే నమ్మే పరిస్థితి లేదన్నారు. అసలు కుంభకోణమో, స్కామో జరిగి ఉంటే వారి హయాంలోనే జరిగి ఉండాలని, పరిశ్రమల యజమానులు హక్కుల పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100 శాతం చెల్లించాలని, అవి చేతులు మారితే 200 శాతం కట్టాలని జిఓలు ఇచ్చారన్నారు. ఆ భూములు మరొకరి పరమైతే హక్కులు ఎలా కల్పిస్తారో వారికే తెలియాలని, వారిచ్చిన యాజమాన్య హక్కులు ఉన్నవారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రమే తాము కల్పించామన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల కమిషనర్లు పరిశ్రమల సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట 30 శాతం, 50 శాతం శ్లాబ్‌లను ప్రతిపాదించారని వివరించారు. అభూత కల్పనలు ప్రచారం చేస్తారా : సిఎం సోదరులు అగ్రిమెంట్లు చేసుకున్నారని నోటికొచ్చినట్లు మాట్లాడారని, వారెవరూ ప్రభుత్వంలో లేరని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పదేండ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా అభూత కల్పనలు ప్రచారం చేయడం దుర్మార్గం అని, ఆధారాలేవైనా బయటపెడితే ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుందని, ఇప్పటికైనా ఆయన ఆలోచనల్లో మార్పు రావాలని కోరుకుంటున్నామన్నారు. కన్వర్షన్ ఇంపాక్ట్ ఛార్జీల వల్ల రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నామన్నారు. యాజమాన్య హక్కులు లేనివారు కన్వర్షన్ కు దరఖాస్తు చేసుకోలేరని, ఆర్థిక ఆరాచకత్వానికి పాల్పడి వెళ్లి పోతే రెండేళ్లుగా దానిని సరిదిద్దుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు గండికొట్టాలని చూడటమే బిఆరెస్ ప్రధాన కార్యక్రమంగా మారిందని విమర్శించారు. బెదిరింపు ధోరణులు మానుకోవాలి : హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు పాటుపడుతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు. ప్రతిపక్షంగా సహకరించక పోయినా ఫర్వాలేదని, అబద్ధాలతో ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని, బెదిరింపు ధోరణులు మానుకోవాలని హితవు పలికారు. ఓఆర్ ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను వెలుపలకు తరలిస్తామని, మొదటి నుంచి చెబుతున్నామని, గాలి, నీరు కాలుష్యం లేకుండా చేయడానికి పరిశ్రమలను బయటకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. పరిశ్రమలను ఆకర్షించడానికి కొన్ని రాష్ట్రాలు ఎకరం భూమిని 99 పైసలకే కేటాయించడం చూస్తున్నామన్నారు. విద్యుత్తు, పన్ను రాయితీలను 20 ఏళ్ల పాటు ఇస్తున్నారని, పరిశ్రమలకు అనుకూలమైన ఎకోసిస్టం ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.

మన తెలంగాణ 22 Nov 2025 4:00 am

కొండెక్కిన కోడిగుడ్డు!

మన తెలంగాణ/హైదరాబాద్: రోజు రోజుకీ కోడిగుడ్డు సామాన్యుడికి అందకుండా పోతోంది. రి టైల్ మార్కెట్‌లో కోడి గుడ్డు ధర కూరగాయలతో పోటీపడుతోంది. ఇదివరకు కోడి గుడ్డు ధర తక్కు వ ఉండి, కూరగాయల ధరలు ఎక్కువగా ఉండడంతో కోడి గుడ్లను వినియోగించుకునేందుకు ఆ సక్తి చూపించే వినియోగదారులు ఇప్పుడు కోడి గు డ్డు ప్రస్తుత ధర రూ.8 పైబడే అమ్ముతుండడంతో కొనలేక గుడ్లు తేలేస్తున్నారు. ఇలా కోడిగుడ్లు, కూ రగాయల ధరలు చుక్కలనంటుతుంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 670 నుంచి రూ.700 వరకు అమ్ముతుంటే, అదే రిటైల్ మార్కెట్‌లో ఆయా స్థానిక పరిస్థితులను బట్టి వంద కోడి గుడ్లు రూ-.800కి పైగానే అమ్ముతున్నారు. వారం పది రోజుల కిందట రూ.6 ఉన్న కోడి గుడ్డు రిటైల్ ధర శుక్రవారానికి రూ.8కి చేరింది. ఈ ధర ఇంకా పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. కోడి గుడ్ల ఉత్పత్తి, వినియోగంలోనూ దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో ఈ పరిస్థితి ఉంటే ఉత్పత్తి చాలా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో రిటైల్ ధర పరిస్థితి ఇంకెలా ఉంటుందని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణలోనే కాకుండా ఉత్పత్తి ఎక్కువ, వినియోగంలోనూ ఎక్కువ ఉండి దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. సహజంగానే ధరతో సంబంధం లేకుండా కోడి గుడ్ల వినియోగం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వ అవసరాలైన వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్ల సరఫరా పెద్ద ఎత్తున జరుగుతుంది. వినియోగదారుల అవసరాలు భారీగా ఉండడంతో డిమాండ్ ఎప్పుడు ఫుల్‌గా ఉంటుంది. దీంతో అటు ఉత్పత్తి తగ్గినా, డిమాండ్ ఒక్కసారి పెరిగినా కోడి గుడ్ల ధరలపై ప్రభావం పడుతుంది. ఇప్పుడు కూడా ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు రికార్డు స్థాయికి కోడి గుడ్డు ధర చేరింది. దేశంలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, ప్రపంచ దేశాల్లో భారతదేశం మూడో స్థానంలో ఉందని ఫౌల్ట్రీ వర్గాల సమాచారం. ఏపి తర్వాత తెలంగాణ కోడిగుడ్ల లభ్యత, వినియోగంలో రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో కోళ్ల పరిశ్రమ ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కామారెడ్డి జిల్లా, నాగర్ కర్నూల్ వంటి జిల్లాల్లో కేంద్రీకృతమై ఉంది. కామారెడ్డిలో అతిపెద్ద పౌల్ట్రీ ఫామ్‌లు ఉండగా, హైదరాబాద్‌లో అనేక ఫామ్‌లు, హేచరీలు, ఫీడ్ మిల్లులు ఉన్నాయి. కోడి గుడ్లకు డిమాండ్ పెరగడం వెనుక కారణం ఇదీ.. మార్కెట్ వర్గాల అంచనా మేరకు కోడిగుడ్ల ధరలు వారం పది రోజుల్లో పెరగడానికి కారణం రెండు రకాలుగా చెబుతున్నారు. కోళ్లు పలు విధాలుగా చనిపోవడం వల్ల ఉత్పత్తి తగ్గడం ఒక కారణమైతే, ఉత్తరాది రాష్ట్రాలకు కోడి గుడ్ల ఎగుమతులు పెరగడం వల్ల డిమాండ్ అనూహ్యంగా పెరగడం మరో కారణంగా విశ్లేషిస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణలో కోళ్ల ఫామ్‌లలో వ్యాధుల కారణంగా అధిక సంఖ్యలో కోళ్లు మరణించడంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని చెబుతున్నారు. గుడ్డు పౌష్టికాహారమని, రోజూ తినాలని డాక్టర్లు సూచిస్తుండడంతో వీటి వినియోగం క్రమేణా పెరుగుతూ వచ్చింది. కోడిగుడ్డును తమ రోజువారీ ఆహారంగా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే రోజుకు కోటి కోడి గుడ్లకు పైగా ఆహారంలో భాగంగా స్వీకరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రోజుకు వినియోగించే గుడ్ల సంఖ్య మూడు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా. అయితే వర్తక వర్గాల సమాచారం మేరకు దేశ వ్యాప్తంగా రోజుకు 30 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతుండగా తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 6 కోట్లకు పైగానే కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ఉత్పత్తి అంచనాలు ప్రతి రోజు స్థిరంగా ఉండకపోయినప్పటికీ కొంచెం ఎక్కువ, తక్కువ ఉన్నా ఇదే స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచే కోడి గుడ్లు ఉత్పత్తి ఎక్కువ అవుతుండగా, వాటి వినియోగంలో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువగా ఉండడంతో డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం వల్ల కోడి గుడ్ల ధరలు పతాక స్థాయికి చేరుతున్నాయని చెబుతున్నారు. కోడిగుడ్లు ఇప్పుడు డజన్ ధర రూ.70 నుంచి 80 మధ్య అమ్ముతుంటే రానున్న నెల రోజుల్లో డజన్ గుడ్లు వందకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కోడిగుడ్లతో సరిపెట్టుకునే మధ్య తరగతి కుటుంబాలకు ఇలా కోడిగుడ్ల ధరలు రోజు రోజుకీ పెరగడం మరింత భారంగా వాపోతున్నారు. కార్తీక మాసం ముగియడంతో కోడిగుడ్ల వినియోగం కూడా పెరగడంతో ధరలు పెరిగేందుకు దోహదపడిందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో వినియోగం ఎక్కువ కోడి గుడ్లను వినియోగించే వారిలో ఏపి, తెలంగాణ తర్వాత మిజోరాం, అసోం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిగుడ్డు వినియోగం, లభ్యతలో దేశంలోనే ప్రధమస్థానంలో ఉందని కేంద్ర పశు సంవతర్ధక మంత్రిత్వ శాఖ 2022 సర్వే-లో తెలిపింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్లో తలసరి గుడ్ల లభ్యత చాలా ఎక్కువగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి గుడ్ల తలసరి లభ్యత 501గా ఉందని సర్వే వివరాలు తెలుపుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం గుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. కాగా తెలంగాణలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. తెలంగాణలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత 442 కాగా దేశ వ్యాప్తంగా తలసరి గుడ్ల లభ్యత 95గా ఉంది. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో టాప్ ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్నాటక రాష్ట్రాల్లోనే 64.56 శాతం గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని సర్వే పేర్కొంది. ఉత్పత్తిలో ఎక్కువ భాగంగా ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాలకు పంపించడం వల్ల స్థానిక వినియోగానికి తక్కువ అవుతున్నాయి. దీంతో ధరల పెరుగుదలకు దోహదపడుతుందని చెబుతున్నారు.

మన తెలంగాణ 22 Nov 2025 3:30 am

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము

బేగంపేట(జనంసాక్షి): భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర …

జనం సాక్షి 22 Nov 2025 2:07 am

రిజర్వేషన్లపై డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికకు కేబినెట్‌ ఆమోదం

` నేడు జీవో విడుదల చేయనున్న పంచాయతీ రాజ్‌ శాఖ హైదరాబాద్‌(జనంసాక్షి): గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ శనివారం …

జనం సాక్షి 22 Nov 2025 2:06 am

సిద్ధరామయ్యే ఐదేళ్లు సీఎం

` డికే శివకుమార్‌ స్పష్టీకరణ ` సీఎం మార్పుపై ప్రచారానికి తెర బెంగుళూరు (జనంసాక్షి): కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ప్రచారానికి ఎట్టకేలకు తెరపడిరది. ముఖ్యమంత్రిగా …

జనం సాక్షి 22 Nov 2025 2:04 am

అసత్య ప్రచారం ఆపండి

` అభివృద్ధి చూసి ఓర్వలేకే ఆరోపణలు ` అబద్దాల ప్రచారంలో కేటీఆర్‌ దిట్ట ` గతంలో లాగా అడ్డగోలు నిర్ణయాలకు మేం దూరం ` ఉపాధి, ఉద్యోగాల …

జనం సాక్షి 22 Nov 2025 2:02 am

రాష్ట్రంలో భారీ భూ కుంభకోణం

` మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపణ ` 4 లక్షల కోట్ల విలువచేసే భూమికి రెక్కలు ` భూములపై వాలిపోతున్న రేవంత్‌ ముఠా ` నన్ను అరెస్ట్‌ …

జనం సాక్షి 22 Nov 2025 2:00 am

శనివారం రాశి ఫలాలు (22-11-2025)

మేషం దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలకు మందకోడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృషభం వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిధునం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటకం అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొందరు ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు. నేత్ర సంబంధిత అనారోగ్యాలను కొంత బాధిస్తాయి. సింహం మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతాన వివాహ విషయమై గృహమున ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. కన్య మీ ఆలోచనలు ఇతరులకు నచ్చే విధంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలసి రావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. తుల ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. దూరప్రాంత బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృశ్చికం వృత్తి వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక వ్యవహారానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్త్రా భరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. ధనస్సు ఇంటా బయట విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని విషయాలను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తవుతాయి. మకరం బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుంభం ఆర్థిక పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సోదరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిని. స్వల్ప అనారోగ్య సమస్యను ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. మీనం సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. రుణబాధలు నుండి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీ సంబంధిత ధన లాభ సూచనలు ఉన్నవి.  

మన తెలంగాణ 22 Nov 2025 12:10 am

కాప్ సదస్సులో అగ్ని ప్రమాదం

 బ్రెజిల్ లోని బెలెమ్‌లో నిర్వహిస్తున్న కాప్ 30 సదస్సులో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది గాయాల పాలయ్యారు. మైక్రోవేవ్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. గురువారం బ్లూజోన్‌లో మంటలు చెలరేగడంతో వేలాది మంది భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు లోకీ తీసుకురాగలిగారు. ప్రమాద సమయంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఇక్కడే ఉన్నారు. భద్రతా రక్షణ అధికారులు వెంటనే వారిని బయటకు తరలించారు. 

మన తెలంగాణ 21 Nov 2025 11:23 pm

సెమీస్‌లోనే భారత్ ఔట్

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారతఎ జట్టు పోరాటం సెమీ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత సెమీస్ సమరంలో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ సూపర్ ఓవర్‌లో భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ హబిబుర్ రహ్మాన్ ఐదు సిక్సర్లు, 3 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జీషాన్ ఆలం 14 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు. చివర్లో ఎస్‌ఎమ్ మాహ్బ్ 18 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 48 పరుగులు చేశాడు. యాసిర్ అలీ 17 (నాటౌట్) కూడా చెలరేగడం బంగ్లా భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ఎ టీమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా అయ్యింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లోనే 38, ప్రియాన్ష్ ఆర్య 23 బంతుల్లో (44) పరుగులు చేసి శుభారంభం అందించారు. జితేశ్ శఱ్మ (33), నెహాల్ వధెరా 32 (నాటౌట్)లు కూడా రాణించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. తర్వాత సూపర్‌లో ఫలితాన్ని తేల్చారు. తొలి బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే ఆలౌటైంది. తర్వాత బంగ్లా టీమ్ ఒక పరుగు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

మన తెలంగాణ 21 Nov 2025 10:40 pm

కార్మికులపై చావుదెబ్బ

. నాలుగు లేబర్‌కోడ్‌ల అమలు. ఇకపై పాత 29 కార్మిక చట్టాలుండవు. కార్పొరేట్‌ యాజమాన్యాలు చెప్పిందే వేదం. కార్మిక సంస్కరణల పేరుతో హక్కుల కోత. కేంద్ర కార్మిక సంఘాల ఆగ్రహం న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అదునుచూసి దెబ్బకొట్టింది. ప్రతి కార్మికుడికి గౌరవాన్ని కల్పించాలన్న పేరుతో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ శుక్రవారం నుండి దేశంలో నాలుగు కార్మిక స్మృతులను (లేబర్‌ కోడ్‌లను) అమలులోకి తెచ్చినట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న 29 […] The post కార్మికులపై చావుదెబ్బ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 10:26 pm

మార్చి 16 నుంచి పది పరీక్షలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : పదోతరగతి పరీక్షల మార్చి2026 షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్టు అధికారులు శుక్రవారం షెడ్యూలు విడుదల చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 16న ఫస్టు లాంగ్వేజ్‌ పరీక్ష (గ్రూప్‌`ఏ), 18న ద్వితీయ లాంగ్వేజ్‌, 20న ఇంగ్లీషు, 23న మ్యాథ్స్‌, 25న […] The post మార్చి 16 నుంచి పది పరీక్షలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 10:24 pm

26న నిరసనలు

కేంద్ర కార్మిక సంఘాల పిలుపు న్యూదిల్లీ: బానిసత్వం దిశగా దేశం అడుగులు వేస్తోందని, లేబర్‌ కోడ్ల అమలులో భావితరాల ఆశలు, ఆకాంక్షలు ఆవిరవుతాయని, వినాశకర పరిణామాలు తప్పబోవని కేంద్ర కార్మిక సంఘాలు హెచ్చరించాయి. కార్మిక కోడ్లను తక్షణమే రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. వీటిని అమలు చేయడం శ్రామిక వర్గంపై యుద్ధం ప్రకటించడమే అవుతుందని, దీనికి నిరసనగా కార్మిక`శ్రామిక వర్గం పోరు బాట పట్టాలని పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ […] The post 26న నిరసనలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 10:22 pm

పాకిస్థాన్‌లో బాయిలర్ పేలి 15 మంది మృతి

 పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ఫైసలాబాద్‌లో ఓ గ్లూ (గమ్) తయారు చేసే ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ప్రమాదం తరువాత ఫ్యాక్టరీ యజమాని పరారయ్యాడు. మేనేజర్‌ను స్థానిక పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనంతోపాటు చుట్టుపక్కల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. పంజాబ్ సిఎం మరయం నవాజ్ షరీఫ్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత ఏడాది ఇదే ఫైసలాబాద్‌లో బాయిలర్ పేలి 12 మంది మరణించారు. వారం రోజుల క్రితం కరాచీ లోని ఓ బాణాసంచా తయారీ కేంద్రం లోనూ పేలుడు సంభవించి నలుగురు చనిపోయారు.

మన తెలంగాణ 21 Nov 2025 10:17 pm

Vivekanda Murder case  : సీఐ  నీరుగార్చాడు

Vivekanda Murder case : సీఐ నీరుగార్చాడు ( కడప , ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Nov 2025 10:16 pm

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

 అప్పుల బాధతో కూరగాయలు వ్యాపారం చేసే భార్యా భర్తలు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపేట మార్గదర్శి కాలనీ రోడ్డు నెంబర్ 4లో గడ్డమిది మల్లేష్ (45), సంతోషి (37) భార్యాభర్తలు నివాసం ఉంటూ కూరగాయలు వ్యాపారం చేస్తుంటారు. ఇద్దరు తెల్లవారు జామున 5.30 గంటలకే ప్రతి రోజు వాకింగ్ వెళుతుంటారు. శుక్రవారం ఉదయం వారి కూతుళ్లు మేఘన, మౌనికలు నిద్రపోతుండగా 5ః30 నిమిషాలకే వాకింగ్ బయల్దేరారు. రోజు వచ్చే వారు ఇంత వరకు రాలేదని కూమారుడు 7.45 నిమిషాలకు తండ్రి మల్లేష్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కూమారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసి స్పందన లేకపోవడంతో కూమారుడు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెతుకుతున్న క్రమంలో నాగోల్ ఠాణా పరిధిలో తట్టిన్నారం ప్రాంతంలో ఓ జంట విషం సేవించారని తెలిసింది. విషం సేవించిన సంతోషి అక్కడిక్కడే మృతి చెందంగా , పోలీసులు విషమంగా ఉన్న మల్లేష్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మల్లేష్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

మన తెలంగాణ 21 Nov 2025 10:13 pm

మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు

. ప్రతి మూడు నెలలకు సామూహిక గృహప్రవేశాలు. వచ్చే ఉగాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు. సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రానున్న మూడేళ్ల కాలంలో 17 లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహ నిర్మాణ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర […] The post మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 10:11 pm

నిర్మాణానికే పీపీపీ

. నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే. 70 శాతం పడకలు, వైద్యసేవలు ఉచితం. వైద్య కళాశాలలు పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకూ ఆధునిక వైద్యం. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు వివరణ. ఏప్రిల్‌1 నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ అమలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మెడికల్‌ కాలేజీలను పబ్లిక్‌ ప్రైవేట్‌ పాట్నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో చేపడుతున్నప్పటికీ అది నిర్మాణం వరకేనని, పర్యవేక్షణ, అజమాయిషీ ప్రభుత్వమే చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన […] The post నిర్మాణానికే పీపీపీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 10:10 pm

విశ్వ సుందరి మెక్సికో భామ

. వివాదం నుంచి విజయం వరకు. కిరీటం దక్కించుకున్న ఫాతిమా బాష్‌ బ్యాంకాక్‌: విశ్వ సుందరి`2025గా మెక్సికో భామ కిరీటం దక్కించుకున్నారు. మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ను ఫాతిమా బాష్‌ గెలుచుకున్నారు. థాయిలాండ్‌లోని నంతాబురి ప్రావిన్స్‌లో అందాల పోటీల చివరి అంకం వైభవంగా సాగింది. ఫాతిమాకు కిరీటాన్ని మాజీ మిస్‌ యూనివర్స్‌ డెన్మార్క్‌ భామ విక్టోరియా కెజార్‌ హెల్విగ్‌ అందజేశారు. 120 మందికి పైగా భామలు ఈ పోటీల్లో పాల్గొనగా.. 25 ఏళ్ల ఫాతిమా విజేతగా నిలిచారు. ఫస్ట్‌ […] The post విశ్వ సుందరి మెక్సికో భామ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 10:07 pm

27న ఐపిఎల్ మినీ వేలం పాట

రానున్న ఐపిఎల్ సీజన్ 2026 కోసం ఆటగాళ్ల మినీ వేలం పాటను నవంబర్ 27న నిర్వహించనున్నారు. రాజధాని ఢిల్లీ వేదికగా ఈ వేలం పాట జరుగనుంది. వేలం పాటలో పాల్గొనే ఆటగాళ్ల తుది వివరాలను భారత క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈసారి జరిగే వేలం పాటలో 277 మంది క్రికెటర్లు బరిలోకి నిలువనున్నారు. ఇందులో 194 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 52 మంది కాప్డ్ ప్లేయర్లు, మరో 142 మంది అన్ కాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అంతేగాక 66 మంది కాప్డ్ విదేశీ క్రికెటర్లు కూడా వేలం పాటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరో 17 మంది అన్ కాప్డ్ విదేశీ ఆటగాళ్లు కూడా బరిలో నిలువనున్నారు. కాగా, ఐపిఎల్‌లోని ఫ్రాంచైజీలు కలిపి మినీ వేలం పాటలో 73 మంది క్రికెటర్లను కొనుగోలు చేయనున్నాయి.

మన తెలంగాణ 21 Nov 2025 10:00 pm

మిస్ యూనివర్స్ 2025గా మెక్సికో ఫాతిమా బాష్

థాయ్‌లాండ్‌లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఫాతిమా బాష్‌ను అందాల కిరీటం వరించింది. గత ఏడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ , ఫాతిమాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు. పోటీలో తొలిరన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీనర్ సింగ్, రెండో రన్నరప్‌గా వెనెజువెలాకు చెందిన సిఫానీ అబాసలీ నిలిచారు. తరువాతి స్థానాల్లో ఫిలిప్పైన్స్‌కు చెందిన 28 ఏళ్ల అహతిస మనాలో, ఐవరీ కోస్ట్‌కు చెందిన 27 ఏళ్ల ఒలైవా యాస్ వచ్చారు. భారత్‌కు తీవ్ర నిరాశ ఈ పోటీల్లో భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నప్పటికీ టాప్ 30 వరకు మాత్రమే రాగలిగింది. ఆ తర్వాత న్యాయ నిర్ణేతలను ఆకట్టుకోవడంలో విఫలమైంది. టాప్ 12లో స్థానం సంపాదించలేకపోయింది. దీంతో భారత్‌కు ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం చేజారింది. జైపూర్‌లో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న మణిక మిస్ యూనివర్స్‌కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడానికి అర్హత సాధించినా చివరకు ఫలితం దక్కలేదు. గళాన్ని గట్టిగా వినిపించిన ఫాతిమా ఈ పోటీలు ప్రారంభమైనప్పటినుంచే మిస్ యూనివర్స్ ఫాతిమా పేరు మీడియాలో చక్కర్లు కొట్టింది. థాయ్‌లాండ్ అధికారికి , ఈమెకు మధ్య జరిగిన వాగ్వివాదం ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్ అయి చివరికి బహిరంగ క్షమాపణలకు దారి తీసింది. ఆ సమయంలో ఫాతిమా తన గళాన్ని బలంగా వినిపించారు. అలాగే మిస్ యూనివర్స్ ఫైనల్లోనూ మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, మార్పులను ప్రస్తావించి జడ్జిల మనసు ఆకట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఈ పోటీల్లో ఫాతిమా ఒక షూట్‌కు హాజరు కాలేదు. మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాత్ ఆమె గైర్హాజరుపై ప్రశ్నించారు. తెలివితక్కువ వ్యక్తి అనే అర్థం వచ్చేలా ఆమెను నిందించడంతో ఆమె దీటుగా బదులిచ్చారు. “మీరు మమ్మల్ని గౌరవించినట్టే మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఇక్కడ నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా దేశ సంస్థతో మీకు ఏదైనా సమస్య ఉంటే అందులోకి నన్ను లాగకండి” అని తీవ్రంగా స్పందించారు. “ తొలుత నా మాట విని ,తర్వాత వాదించండి ” అంటూ నవాత్ బదులిచ్చారు. ఈ వాగ్వాదం ఫేస్‌బుక్‌లో లైవ్‌స్క్రీమింగ్ కావడం సంచలనం కలిగించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించిన ఫాతిమా , మరికొందరు అందాల తారలు వేదిక నుంచి వాకౌట్ చేశారు. బయటకు వచ్చి మీడియా ముందు అసహనం వెలిబుచ్చారు. “ మీ డైరెక్టర్ గౌరవంగా వ్యవహరించలేదు. మనమంతా సాధికారత కలిగిన మహిళలం. ఇది మన గళాన్నివినిపించే వేదిక ” అని స్పష్టం చేశారు. ఆమె వాదాన్ని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా కొనియాడారు. మరోవైపు దీనిపై నవాత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొని బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ సంఘటనను మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. 25 ఏళ్ల ఫాతిమా మెక్సికోమోడల్‌గా రాణించారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ సెప్టెంబర్‌లో మిస్‌యూనివర్స్ మెక్సికోను దక్కించుకున్నారు. చిన్నప్పుడు డిస్లెక్సియా, హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు. తోటి పిల్లల నుంచి హేళనలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ తనను సేవామార్గం వైపు నడిపించాయని ఓ సందర్భంలో ఆమె వెల్లడించారు. ఈ ఆధునిక యుగంలో ఒక మహిళగా మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించేందుకు మీరు ఈ కిరీటాన్ని ఎలా ఉపయోగిస్తారు ? అని తుది రౌండ్‌లో జడ్జీలు ప్రశ్నించగా “ భద్రత , సమాన అవకాశాల విషయంలో నేటికీ మహిళలు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. అలా అని నేటితరం తమ భావాలను వ్యక్తం చేసేందుకు ఏమాత్రం వెనుకాడదు. మార్పు కోరుకునే ధైర్యాన్ని కలిగి ఉన్నారు. మా గళాన్ని వినిపించేందుకు, మార్పు కోసం ఇక్కడ నిల్చొని ఉన్నాం. కలిసికట్టుగా చరిత్ర సృష్టిస్తాం ” అని ఆమె చెప్పిన సమాధానం న్యాయ నిర్ణేతల ప్రశంసలు చూరగొంది. 

మన తెలంగాణ 21 Nov 2025 9:53 pm

Dil Raju’s Big Bet on Akhanda2

Akhanda 2 is the next big film in Telugu cinema and this pan-Indian attempt releases on December 5th across the globe. The makers have been quoting big numbers for the theatrical rights and all the deals for the film are closed except for Nizam. Popular producer and distributor Dil Raju has bagged the Nizam theatrical […] The post Dil Raju’s Big Bet on Akhanda2 appeared first on Telugu360 .

తెలుగు 360 21 Nov 2025 9:19 pm

Cartoon 22 Nov 2025 |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !

Cartoon 22 Nov 2025 | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !

ప్రభ న్యూస్ 21 Nov 2025 8:52 pm

స్టైలిష్‌గా వింటేజ్ లుక్‌లో ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘రాజా సాబ్‘ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ పాటను ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్‘ ఫస్ట్ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రభాస్ స్టైలిష్‌గా, వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమా కోసం క్రేజీ సాంగ్స్ కంపోజ్ చేశారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ‘రాజా సాబ్‘ సినిమా వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ‘రాజా సాబ్‘ ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మన తెలంగాణ 21 Nov 2025 8:34 pm

Breaking |సీఐ శంకరయ్య డిస్మిస్..

Breaking | సీఐ శంకరయ్య డిస్మిస్.. వివేకానంద హత్యకేసులో తొలి దర్యాప్తు అధికారి

ప్రభ న్యూస్ 21 Nov 2025 8:27 pm

Breaking news |సీఐ శంకర్ డిస్మిస్..

Breaking news | సీఐ శంకర్ డిస్మిస్.. వివేకానంద హత్యకేసులో తొలి ఐఓ

ప్రభ న్యూస్ 21 Nov 2025 8:27 pm

NBK’s Akhanda 2 Trailer: Power of Indian Dharma to World

God of Masses Nandamuri Balakrishna and highly regarded director Boyapati Srinu have formed a formidable combination with blockbuster after blockbuster. Now, they are back with the sequel to Akhanda, and the movie takes the stakes higher than ever with Akhanda 2. 14 Reels Plus have produced this massive visual action epic on a scale never-seen-before. […] The post NBK’s Akhanda 2 Trailer: Power of Indian Dharma to World appeared first on Telugu360 .

తెలుగు 360 21 Nov 2025 8:26 pm

SHABARISH |మహబూబాబాద్ జిల్లాకు కొత్త ఎస్పీ

SHABARISH | మహబూబాబాద్ జిల్లాకు కొత్త ఎస్పీ నియమితులైన డాక్టర్ పి. శబరిష్

ప్రభ న్యూస్ 21 Nov 2025 8:24 pm

బంగ్లాదేశ్‌లో భూకంపం.. ఆరుగురు మృతి

బంగ్లాదేశ్ లోని ఢాకాలో శుక్రవారం ఉదయం 10.38 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.7 గా నమోదైంది. అనేక చోట్ల భవనాలు ధ్వంసమై, అగ్ని ప్రమాదాలకు దారి తీసింది. ఢాకాకు ఈశాన్యంగా 50 కిమీ దూరంలో ఉన్న నర్సింగ్‌డిలో 10 కిమీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు బంగ్లాదేశ్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఢాకాలో ముగ్గురు చనిపోగా, నారాయణ్‌గంజ్ రేవు పట్టణంలో నాలుగో వ్యక్తి, నర్సింగ్‌డిలో మరో ఇద్దరు చనిపోయారు. పాత ఢాకా లోని ఆర్మనిటోలలోఐదంతస్తుల భవనం వెదురు పరంజా,శిధిలాలు కూలి ముగ్గురు చనిపోయారని, అక్కడే రోడ్డు పక్కన ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని ఢాకా డిప్యూటీ పోలీస్ కమిషనర్ మల్లిక్ ఆసన్ యుద్దిన్‌సైనీ తెలియజేశారు. మృతుల్లో ఒకరు మెడికల్ స్టూడెంట్ అని నిర్ధారించారు. ఢాకా లోని శివారు ప్రాంతం బరిధారలో భూప్రకంపనలకు ఒక నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించిందిన. సబర్బన్ మున్షిగంజ్‌లో గాజారియా ఏరియాలో నివాస భవనంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. భారత్ లోనూ భూకంప ప్రభావం కోల్‌కతాతోపాటు ఉత్తర భారతంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. కోల్‌కతాలో ఉదయం 10.10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. బెంగాల్ లోని కూచ్‌బెహార్, దక్షిణ్, ఉత్తర దినాజ్‌పూర్ సహా అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి.అస్సోం లోని గువాహటి,అగర్తల, షిల్లాంగ్ వంటి నగరాల్లో భూమి కంపించింది. ఈ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

మన తెలంగాణ 21 Nov 2025 8:10 pm

ABUL KALLAM |మౌలానా.. మాఫ్ కరో..!

ABUL KALLAM | మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా

ప్రభ న్యూస్ 21 Nov 2025 8:09 pm

కాంగ్రెస్ పార్టీకి రివేంజ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి రివేంజ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఫార్ములా- ఈ రేసు కేసులో కెటిఆర్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయన అన్నారు. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అవసరం లేదన్నారు. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని ఆయన తెలిపారు. కెటిఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, కూట్రపూరితంగానే ఫార్ములా-ఈరేసు కేసులో ఇరికిస్తున్నారని బిఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమను నమ్మి అధికారం ఇచ్చారని, ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 21 Nov 2025 7:59 pm

నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులతో పాటు 108కి సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన స్థలాన్ని ఎస్‌ఐ నాగరాజు పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్‌ఐ నాగరాజు వెల్లడించారు. ఈ బస్సులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి పోలీసులు రంగంలో దిగారు.

మన తెలంగాణ 21 Nov 2025 7:54 pm

BELLAMPALLI |బెల్లంపల్లిలో గంజాయి కలకలం

1030 గ్రాముల గంజాయి స్వాధీనంవివరాలు వెల్లడించిన వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ కే. శ్రీనివాస్

ప్రభ న్యూస్ 21 Nov 2025 7:54 pm

క్రేన్‌ కూలి ఉపాధ్యాయురాలు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని రాజనగరం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం..పాఠశాల ఆవరణలో కళావేదిక నిర్మాణం జరుగుతోంది.కళావేదిక కు శ్లాబ్ వేసేందుకు క్రేన్ సహాయంతో సామాగ్రిని తరలిస్తుండగా క్రేన్ కూలి ఇంగ్లీష్ టీచర్ జోష్నా భాయ్(45) పై సామాగ్రి పడింది. ఈ ఘటనలో టీచర్ కు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చనిపోయారు.పాఠశాల సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మన తెలంగాణ 21 Nov 2025 7:47 pm

సెమీ ఫైనల్‌లో సూపర్ ఓవర్.. భారత్ ఓటమి

దోహా: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్‌లో భారత్‌ ఎ జట్టు సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ ఎ జట్టుతో జరిగిన ఈ పోరులో సూపర్ ఓవర్‌లో ఓటమిని చవి చూసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఎ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎ నిర్ణీత 20 ఓశర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో హబీబుర్ రెహమాన్ సోహన్ 65, మెహరబ్ 48 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ను గెలిపించేందుకు అందరూ ఆటగాళ్లు సమిష్టిగా కృషి చేశారు. ప్రియాంశ్ ఆర్య 44, వైభవ్ సూర్యవంశీ 38, జితేశ్ శర్మ 33, నేహల్ వదేరా 32 పరుగులతో రాణించారు. కానీ, భారత్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. సూపర్ ఓవర్‌లో బంగ్లా బౌలర్ రిపొన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీశాడు. అనంతరం భారత్ తరఫున సుయాష్ శర్మ కూడా తొలి బంతికి వికెట్ తీశాడు. కానీ, రెండో బంతి వైడ్‌గా వేయడంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో భారత్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం రాత్రి పాకిస్థాన్ ఎ, బంగ్లాదేశ్ ఎ మధ్య జరిగే మరో సెమీ ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుతో బంగ్లాదేశ్ నవంబర్‌ 23న జరిగే ఫైనల్లో తలపడనుంది.

మన తెలంగాణ 21 Nov 2025 7:25 pm

కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలి: మాజీ మంత్రి జోగు రామన్న

పంట కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో అఖిలపక్ష సమన్వయ కమిటీ ఆదిలాబాద్ బోరజ్ వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. బిఆర్‌ఎస్‌తో సహా అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈధర్నాలో మాజీ మంత్రి జోగు రామన్న, అఖిలపక్ష, రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులతో కలిసి నేతలు రోడ్డుపై రొట్టెలు తిని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పోలీసులను పూర్తిస్థాయిలో మోహరించిన ధర్నా కార్యక్రమానికి రైతులు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేశారు. వివిధ గ్రామాల నుంచి రైతులు ఎడ్ల బండ్లపై తరలివచ్చి నిరసనలో,భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ..సిసిఐ నిబంధనలు, తొలగించాలని, క్వింటాళ్ల పత్తి పరిమితిని తీసివేయాలని డిమాండ్ చేశారు. కపాస్ కిసాన్ యాప్ తో పాటు సిసిఐ నిబంధనల కారణంగా రైతులు పడరాని పాట్లు పడుతున్నప్పటికీ స్థానిక ఎంఎల్‌ఎ, ఎంపి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల పాటు రైతులకు ఇబ్బంది లేదని మాయమాటలు చెప్పిన స్థానిక ఎంఎల్‌ఎ రైతుల నుండి వస్తున్న వ్యతిరేకతతో, సిఎం రేవంత్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలుస్తున్నారని, రైతులతో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రైతుల ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్, న్యూడెమోక్రసీ రాష్ట్రనాయకుడు టి. శ్రీనివాస్, సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు నంది రామయ్య, అఖిలపక్ష రైతు నాయకులు బండి దత్తాత్రి, విజ్జగిరి నారాయణ, కొండ రమేష్, గోవర్ధన్ యాదవ్, లోకారి పోశెట్టి, చిలుక దేవిదాస్, కేమ లక్ష్మణ్, జగన్, వెంకట నారాయణ. అలాల్ అజేయ్, యూనిస్ అక్బనీ, సాజిత్ ఉద్దీన్, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 21 Nov 2025 7:22 pm

భూ భారతి.. భూ హారతిగా మారిందా..?: హరీష్‌రావు

 ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు... రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన సిఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయాల వద్ద, తహసిల్దార్ కార్యాలయాల వద్ద జరుగుతున్న రైతు ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూమి సమస్యలు పరిష్కరిస్తామని అన్న హామీ ఏమైందని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం భూమి రిజిస్ట్రేషన్, ఇతర భూ సమస్యలతో ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్న ఘటనలపై హరీష్‌రావు ప్రకటన విడుదల చేశారు. ‘ధరణి’పై అడ్డగోలుగా మాట్లాడి గొప్పగా తెచ్చిన ‘భూ భారతి’ భూముల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు విఫలమైంది..? అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో భూ భారతి ‘భూ మేత’ అయ్యిందా... భూ భారతి.. భూ హారతిగా మారిందా..? అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి అయ్యిందా...? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, మీరు తెచ్చిన రెవెన్యూ చెత్త సంస్కరణలు పేరు దిబ్బ ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నదని విమర్శించారు. భూముల రికార్డులు సరిచేస్తాం, రైతుల హక్కులు కాపాడతామని చెప్పి రెండేళ్లుగా కుంటి సాకులు చెబుతూ రిజిస్ట్రేషన్లు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా సాదాబైనామా దరఖాస్తుదారులు ఎందుకు పరిష్కరించడం లేదు..కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెసులుబాటు కల్పించడం లేదని అడిగారు. రైతు భూమి మీద ఆ రైతుకే హక్కు లేకుండా చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది అని, ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అని పేర్కొన్నారు. ఆపదకో, అవసరానికో ఉన్న భూములు అమ్ముకోలేక.. అధిక వడ్డీకి రుణాలు తీసుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి.. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి... ధరణి పేరు మార్చి తెచ్చిన భూ భారతి ఏమైంది.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రైతులు, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారమవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల 700 పైగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. రుణమాఫీ కాక, రైతు భరోసా అందక, పంట బోనస్ ఇవ్వక పోవడంతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని అన్నారు.రిజిస్ట్రేషన్ల పేరిట మధ్యవర్తులు, ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు..రైతుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు...? అని అడిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మేలుకుని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 21 Nov 2025 7:12 pm

భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన

భారత పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో గెలిచిన సఫారీ జట్టు శనివారం జరిగే రెండో మ్యాచ్‌‌లోనూ విజయం సాధించి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. వన్డే జట్టుకు కెప్టెన్‌గా టెంబా బవుమా, టి-20 జట్టుకు కెప్టెన్‌గా ఎయిడెన్ మార్క్రమ్ వ్యవహరించనున్నారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే టి-20 జట్టులో ఎంపికయ్యాడు. తాజాగా పాకిస్థాన్‌పై ఆరంగేట్రం చేసిన రూబిన్ హెర్మన్ వన్డే జట్టులో కొనసాగుతున్నాడు. క్వింటన్‌ డికాక్‌, ఎయిడెన్ మార్క్రమ్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే రాంచీ వేదికగా జరగగా.. డిసెంబర్ 3, 6 తేదీల్లో రాయ్‌పూర్, విశాఖ వేదికగా రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం ఐదు టి-20ల సిరీస్ డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, ముల్లాన్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది. భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహారాజ్, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలన్‌ సుబ్రాయన్‌. భారత్‌తో జరిగే టి-20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్‌ స్టబ్స్‌.

మన తెలంగాణ 21 Nov 2025 7:08 pm

కొండాపూర్‌లో రూ. 700 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

 రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్ల్లి మండలం కొండాపూర్‌లో బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలకు బై నంబర్లు వేసి కాజేయాలని చేసే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. దాదాపు 4 ఎకరాల మేర పార్కులు, ప్రజావసరాలకు స్థలాన్ని కాపాడి.. చుట్టూ ఫెన్సింగ్‌ను హైడ్రా ఏర్పాటు చేసింది. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పాతింది. ఈ ప్రాంతంలో ఎకరం రూ. 200ల కోట్లు వరకు ధర పలుకుతోంది. ఇలా కాపాడిన భూమి విలువ దాదాపు రూ. 700ల కోట్ల వరకు ఉంటుందని అంచనాకు హైడ్రా వచ్చింది. కొండాపూర్ విలేజ్‌లో 57.20 ఎకరాల విస్తీర్ణంలో 627 ప్లాట్లతో వేంకటేశ్వర హెచ్ ఏ ఎల్ కాలనీని 1980 దశకంలో ఏర్పాటు చేశారు. 1.20 ఎకరాల చొప్పున 2 పార్కులు, 2 ఎకరాల పరిధిలో మరో పార్కుతో పాటు.. 1000 చ.గ.ల మేర ప్రజావసరాలకు స్థలాలను కేటాయించారు. ఇప్పుడవే ఆక్రమణలకు గురయ్యాయి. పార్కులను బైనంబర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. ఇదే విషయమై దశాబ్దాలుగా పోరాడుతున్న శ్రీ వేంకటేశ్వర హెచ్‌ఏఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా ప్రజావాణిలో సంబంధిత ప్రత్రాలతో ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే చర్యలు.... ప్రజావాణి ఫిర్యాదును హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కులు ప్లాట్లుగా మారినట్టు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు గుర్తించారు. అబ్బినేని అనసూయతో పాటు ఇతరుల దగ్గర నుంచి వైబీకే రావు జీపీఏ కుదుర్చుకుని 1980 దశకంలో లే ఔట్ వేశారు. ఆ లేఔట్ ప్రకారం ప్లాట్లు కొన్నవారు ఆయా ప్లాట్లను, నిర్మించిన భవనాలను ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ ద్వారా రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు. 1.20 ఎకరాల మేర ఉండాల్సిన పార్కును 3 భాగాలుగా విడదీసి 11 ప్లాట్లు చేసి అమ్మేసినట్టు నిర్ధారణ అయింది. మరో రెండు పార్కులను కూడా అలాగే బై నంబర్లతో పలువురికి అమ్మేశారు. ఇక్కడ లావాదేవీలు నిర్వర్తించిన వారికి ఎన్.ఆర్.ఐ. లే ముడిసరుకుగా మారారని అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా అధికారులకు తెలిపారు. ఇక వీళ్ల దగ్గర నుంచి సింహా డెవలపర్స్ , వాసవి నిర్మాణ సంస్థలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కొని బౌచర్లను పెట్టి.. పార్కులవైపు మళ్ళ డం కాదు కదా.. చూడ్డానికి కూడా అవకాశం లేకుండా చేశారని.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారుల ముందు అక్కడ నివాసం ఉన్న వారు వాపోయారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్కులతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడాలని హైకోర్టు కూడా సూచించింది. హైడ్రాను ఈ దిశగా మార్గంసుగమం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డులను హైడ్రా ఏర్పాటుచేసింది. దీంతో అక్కడి స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. ఫిర్యాదు చేసిన వెంటనేహైడ్రా స్పందించి పార్కులను కాపాడిందంటూ దన్యవాదాలు తెలిపారు.

మన తెలంగాణ 21 Nov 2025 7:05 pm

శ్రీ సత్యసాయి మహా సమాది దర్శనం సంతోషకరం: ఫడ్నవీస్

పుట్టపర్తి, విశాలాంధ్ర: శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం ఆనందానిచ్చిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. శుక్రవారం ఆయనకు సాయి శ్రీనివాస అతిథి గృహంలో సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రాజ రత్నాకర్ స్వాగతం పలికారు.అనంతరం ఫడ్నవీస్ మహాసమాధిని దర్శించి కొంతసేపు ఆధ్యాత్మిక ధ్యానంలో మునిగిపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ కుటుంబం గత 50ఏళ్లుగా శ్రీ సత్యసాయిని ఆరాధిస్తున్నదని, ఆ ఆరాధన వల్ల తమ జీవితంలో ఎన్నో మరిచిపోలేని అనుభవాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.సత్యసాయి “అందరినీ ప్రేమించండి, […] The post శ్రీ సత్యసాయి మహా సమాది దర్శనం సంతోషకరం: ఫడ్నవీస్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 7:03 pm

ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 25వ తేదీన సచివాలయంలో ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్‌లు, డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్‌లో పెట్టి ఆమోదించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. అదేవిధంగా పత్తి కొనుగోలు, రైజింగ్ తెలంగాణ- 2047 లక్ష్యాలు, గిగ్ వర్కర్స్ బిల్లు, సౌదీ బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు తదితర అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లుగా తెలుస్తోంది.

మన తెలంగాణ 21 Nov 2025 6:52 pm

రేపటి నుంచి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీ ప్రారంభం

ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. నల్లమల అటవీ అందాల మధ్య కృష్ణా నదిలో ప్రయాణించాలనుకునే వారి కోసం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీనీ నేటి నుంచి పర్యాటక శాఖ మళ్లీ అందుబాలోకి తీసుకురానుంది. గతంలోనూ ఈ జర్నీ అందుబాటులోకి వచ్చినా కొన్ని కారణాల వల్ల దానిని వాయిదా వేశారు. మళ్లీ తిరిగి ఈ ప్రయాణం నేటి నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ లాంచీ ప్రయాణం చేసే వారు ముందుగా నాగార్జున సాగర్ చేరుకోవాలి. అక్కడి నుంచి ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. పర్యాటకుల కోసం ప్రతి సంవత్సరం లాంచీ జర్నీ ఏర్పాటు చేస్తున్నామని పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది. దట్టమైన నల్లమల అటవీ అందాలు, కృష్ణానది పరవళ్ల మధ్య నాగార్జునసాగర్ టు శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణ పర్యాటకులకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇవ్వనుంది. 100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా లాంచీ ఏర్పాటు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీలో వెళ్లి వచ్చేందుకు పెద్దలకు 3,250 రూపాయలు టికెట్ ధర నిర్ణయించగా పిల్లలకు 2,600 రూపాయలుగా ధర ఫిక్స్ చేశారు. అయితే, కేవలం సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లేందుకు పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు 16వందల రూపాయలుగా టూరిజం శాఖ ధర నిర్ణయించింది. అయితే, లాంచీలో సాగర్ నుంచి నంది కొండ మీదుగా ఏళేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అందాలను ఎంజాయ్ చేసేలా ఈ ప్రయాణం ఏర్పాటు చేశామని టూరిజం అధికారులు వెల్లడించారు. నదిలో 110 కిలోమీటర్ల దూరం ఆరుగంటల ప్రయాణంలో ప్రయాణికులకు భోజనం ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి ప్రతి శనివారం టికెట్లు బుకింగ్ చేసుకున్న వారిని బట్టి లాంచీ ప్రయాణం ప్రారంభిస్తామని పర్యాటశాఖ అధికారులు తెలిపారు. అయితే సోమవారం నుంచి శుక్రవారం వరకు 100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

మన తెలంగాణ 21 Nov 2025 6:49 pm

బస్సు సర్వీసులు కోరుతూ విద్యార్థుల రాస్తారోకో..

ఉరవకొండ, విశాలాంధ్ర: తమ గ్రామాలకు బస్సు సర్వీసులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పలువురు ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు శుక్రవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో ముందు రాస్తారోకో నిర్వహించారు.పాల్తూరు, దర్గా హోన్నూరు, గోవిందవాడ, బొల్లనగుడ్డం, కలవల్లతిప్ప గ్రామాల విద్యార్థులు మాట్లాడుతూ..ఉరవకొండ నుంచి తమ గ్రామాలకు సకాలంలో బస్సులు లేక పోవడంతో కళాశాలలకు చేరడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కొద్ది సర్వీసులు కూడా నిర్లక్ష్యంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు.సమస్యపై పలుమార్లు విన్నవించినా స్పందన రాకపోవడంతో […] The post బస్సు సర్వీసులు కోరుతూ విద్యార్థుల రాస్తారోకో.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 6:44 pm

అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారు:కెటిఆర్

దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారని కెటిఆర్ ఆరోపించారు. 9,292 ఎకరాలు అంటే సుమారు 9,300 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసుందుకు రేవంత్‌రెడ్డి ముఠా కుట్ర చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలకు భూములను అప్పజెప్పే యత్నం జరుగుతోందని ఆరోపించారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హెచ్‌ఐఎల్‌టిపి) పేరిట ముఖ్యమంత్రి రూ. 5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణం అనిపేర్కొన్నారు. క్యాబినెట్ మీటింగ్‌లోనే ప్రభుత్వం ఈ భారీ స్కామ్‌కు తెరలేపిందని అన్నారు. ఈ విధానం ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే రూపొందించబడిందని ధ్వజమెత్తారు. పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించాల్సిన భూమిని పెద్ద పెద్ద గద్దలకు దారాదత్తం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి భూకుంభకోణంపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.సిఎం రేవంత్ రెడ్డి ట్రాప్‌లో పారిశ్రామికవేత్తలు పడొద్దని సూచించారు. పెరిగిన భూముల విలువను.. రేవంత్ పెటిఎంగా మార్చుకున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన ఆరోపణలు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. మెట్రో భూములు, సెంట్రల్ యూనివర్శిటీ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని, ఇప్పుడు పరిశ్రమల భూములపై దృష్టి సారించారని ఆరోపించారు. ప్రజల ఆస్తిని ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు అప్పజెప్తున్నారని.. బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా విచారణ జరుపుతామని వెల్లడించారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్‌ఐఎల్‌టిపి వాస్తవానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళ ఉపయోగ విలువైన రియల్ ఎస్టేట్‌గా మార్చడానికి రూపొందించబడిందని పేర్కొన్నారు. ఇది కేవలం పాలసీ కాదు అని, రూ. 5 లక్షల కోట్ల స్కామ్ కోసం రూపొందించిన బ్లూప్రింట్ అని ఆరోపించారు.

మన తెలంగాణ 21 Nov 2025 6:41 pm

Samantha’s post about Transformation and Muscle Gain

Samantha has seen the best and the worst in her career. She is diagnosed with Myositis and she has taken a long break from work. She recovered well and she is busy with several crazy projects. Samantha has taken her social media page to post about her transformation, challenges and other things over the years. […] The post Samantha’s post about Transformation and Muscle Gain appeared first on Telugu360 .

తెలుగు 360 21 Nov 2025 6:37 pm

Andhra Pradesh : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.

తెలుగు పోస్ట్ 21 Nov 2025 6:23 pm

బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపండి..వామపక్షాలు

అనంతపురం, విశాలాంధ్ర బ్యూరో: మారేడుమిల్లి సహా పలు ప్రాంతాల్లో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లును కేంద్ర ప్రభుత్వం ఆపాలని అనంతపురం వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.క్లాక్‌టవర్ వద్ద శనివారం సాయంత్రం నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి ఏర్పాట్లపై శుక్రవారం సిపిఐ కార్యాలయంలో వామపక్ష నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శులు సి.మల్లికార్జున, జె.రాజారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి. రమణయ్య,శ్రీశైలం రాజేష్ గౌడ్,సిపిఐ ఎంల్ న్యూడెమోక్రసి జిల్లా అధ్యక్షులు […] The post బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపండి..వామపక్షాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 6:19 pm

Telangana : స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వీరి సారధ్యమేనా?

తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టు నిలుపుకోవడం ఒక సవాల్ గా మారనుంది.

తెలుగు పోస్ట్ 21 Nov 2025 6:09 pm

MEDICAL |బాలుడి చికిత్సకు దాతలు సహయం..

MEDICAL | బాలుడి చికిత్సకు దాతలు సహయం.. MEDIACAL | దండేపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Nov 2025 6:02 pm

Sabarimala |అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం

Sabarimala | అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం Sabarimala |

ప్రభ న్యూస్ 21 Nov 2025 6:01 pm

Telangana : తెలంగాణలో 32 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణలో 32 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

తెలుగు పోస్ట్ 21 Nov 2025 5:58 pm

NTR|ఏడవలిలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ..

NTR| పత్తికొండ, ఆంధ్రప్రభ: తెలుగు జాతి గర్వానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు, దివంగత

ప్రభ న్యూస్ 21 Nov 2025 5:58 pm

MP |సిసిఐ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ

MP | సిసిఐ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ MP | దండేపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Nov 2025 5:52 pm

కర్ణాటక సంక్షోభం పై డీకే ఏమన్నారంటే?

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ప్రచారానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెరదించారు

తెలుగు పోస్ట్ 21 Nov 2025 5:51 pm

Dubai Air Show : IAF fighter jet crashes, pilot killed

In an unfortunate incident, an Indian Air Force pilot was killed after a Tejas fighter jet crashed during a demonstration at the Dubai Air Show on Friday afternoon. At around 02:10 pm local time, while performing an aerial manoeuvre before a large crowd, the Indian HAL Tejas plane plunged to ground and reduced to ashes […] The post Dubai Air Show : IAF fighter jet crashes, pilot killed appeared first on Telugu360 .

తెలుగు 360 21 Nov 2025 5:45 pm

Drugs |డ్రగ్స్‌ తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం

Drugs | డ్రగ్స్‌ తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం యువత యాంటి డ్రగ్

ప్రభ న్యూస్ 21 Nov 2025 5:39 pm

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారం కేసులో వేగం పెంచిన సీఐడీ

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారం కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసింది

తెలుగు పోస్ట్ 21 Nov 2025 5:38 pm

FIRE |ప్రమాదాల నివారణ..

FIRE | ప్రమాదాల నివారణ.. FIRE | కల్వకుర్తి, ఆంధ్రప్రభ : కల్వకుర్తి

ప్రభ న్యూస్ 21 Nov 2025 5:32 pm

శపథం చేసిన మావోయిస్టులు.. 23న భారత్ బంద్

జనంసాక్షి వెబ్ డెస్క్ : మారేడుమల్లి ఎన్కౌంటర్‌పై సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ్ పేరుతో ప్రెస్ నోట్ విడుదలైంది. నిరాయుధులైన మాడ్వి హిడ్మా రాజేల …

జనం సాక్షి 21 Nov 2025 5:22 pm

WELFARE|మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

WELFARE| మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు WELFARE| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలోని

ప్రభ న్యూస్ 21 Nov 2025 5:22 pm

Ys Jagan : చంద్రబాబుకు వైఎస్ జగన్ ఘాటు లేఖ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు

తెలుగు పోస్ట్ 21 Nov 2025 5:21 pm

రాజ్యాంగ రక్షణకు ధర్మవరం న్యాయవాదుల ఐక్య సంకల్పం

: గుంటూరు మహాసభకు ఘన మద్దతువిశాలాంధ్ర ధర్మవరం; రాజ్యాంగ పరిరక్షణకు ఈనెల 22వ తేదీన గుంటూరులో కాన్స్టిట్యూషన్ డే జరుగుతున్న సందర్భంగా ధర్మవరం కోర్టు ఆవరణంలో దానికి సంబంధించిన పోస్టర్లు న్యాయవాదులు విడుదల చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణకు, న్యాయ వ్యవస్థ బలోపేతానికి, ప్రజాస్వామ్య విలువల నిలబెట్టడానికి ధర్మవరం న్యాయవాదులు ఐక్యంగా సంకల్పం ప్రకటించారు. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 22, న గుంటూరులో జరగబోయే రాజ్యాంగ దినోత్సవ మహాసభకు ధర్మవరం తరఫున ఘన […] The post రాజ్యాంగ రక్షణకు ధర్మవరం న్యాయవాదుల ఐక్య సంకల్పం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 5:18 pm

Sagar Canal breach : సాగర్​ కాలువకు గండి

Sagar Canal breach : సాగర్​ కాలువకు గండి ( ఆంధ్రప్రభ, పల్నాడు

ప్రభ న్యూస్ 21 Nov 2025 5:17 pm

FISHERMAN|ఘనంగా మత్స్యకారుల దినోత్సవం…

FISHERMAN| చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం

ప్రభ న్యూస్ 21 Nov 2025 5:11 pm

ప్రపంచకప్‌ నెగ్గిన చోట స్మృతికి మరో సర్‌ప్రైజ్

నవీ ముంబై: టీం ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన కొద్ది రోజుల క్రితం ప్రపంచకప్‌ను ముద్దాడింది. సౌతాఫ్రికా మహిళ జట్టుతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్ గెలిచిన చోట స్మృతికి మరో సర్‌ప్రైజ్ లభించింది. ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ మేరకు పలాష్ ఆమెకు జీవితంలో మర్చిపోలేని విధంగా ప్రపోజ్ చేశాడు. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో స్మృతికి పలాష్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ముందుగా స్మృతి కళ్లకు గంతలు కట్టి స్టేడియం మధ్యలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె కళ్ల గంతలు విప్పి.. మెకాళ్లపై కూర్చొని చేతిలో ఎర్ర గులాబీ బొకే, డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. ఈ ఊహించని సర్ ప్రైజ్‌తో స్మృతి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం పలాష్ వేలికి ఆమె ఉంగరాన్ని తొడిగింది. చివరికి ఇద్దరు తమ ఎంగేజ్‌మెంట్ రింగ్స్‌తో కెమెరాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.  View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal)

మన తెలంగాణ 21 Nov 2025 5:09 pm

ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి రజత పతకం

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామములో ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం విక్రాంత్ 45 కేజీల విభాగంలో రెండవ స్థానములో నిలుస్తూ తద్వారా రజత పతకం సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ సబ్ జూనియర్ జూడో పోటీలలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి రజత పతకం సిల్వర్ తెలంగాణలోని హైదరాబాదులో 16వ తేదీ నుంచి జరుగుతున్న జాతీయ సబ్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి […] The post ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి రజత పతకం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 5:07 pm

PhonePe |రోజుకు రూ.12కే కుటుంబ ఆరోగ్య రక్షణ

PhonePe | రోజుకు రూ.12కే కుటుంబ ఆరోగ్య రక్షణ PhonePe, HDFC ERGO

ప్రభ న్యూస్ 21 Nov 2025 5:02 pm

జూబ్లీహిల్స్ ఓటమితో బిఆర్ఎస్ కు చుక్కలు కనిపిస్తున్నాయి : శ్రీధర్ బాబు

హైదరాబాద్: పదేళ్లు మంత్రిగా అనుభవం ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై కెటిఆర్ ఆరోపణలు చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కెటిఆర్ బాధ్యతాయుతంగా మాట్లాడలేదని, గత ప్రభుత్వంలో ఎవరికీ సంబంధం లేకుండా జివోలు ఇచ్చారని తెలియజేశారు. అనుమతులు లేకుండా ఎప్పుడూ చెల్లింపులు చేయలేదని, రాష్ట్ర ప్రజలకు కెటిఆర్ అసత్యాలు చెప్పారని, మొత్తం 9,292 ఎకరాల భూమి గురించి కెటిఆర్ మాట్లాడారని విమర్శించారు. పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భూములను తక్కువ ధరకు ఇస్తుందని, 2023లో బిఆర్ఎస్ ప్రభుత్వం మూడు జివోలు ఇచ్చిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జివో ప్రకారం హైదరాబాద్ లోని భూములను ట్రాన్స్ ఫర్ కు అనుమతి ఇచ్చారని, ప్రభుత్వ భూమి అమ్ముకున్నట్లు కెటిఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. 6 నెలలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫ్రీహోల్డ్, ల్యాండ్ లీజ్ కు తేడాలేకుండా కెటిఆర్ మాట్లాడారని మండిపడ్డారు. 2023లో బిఆర్ఎస్ తెచ్చిన జివో ప్రకారమే భూములు ఇస్తున్నామని, భూమి హక్కుల ఉన్నవారికి మేలు చేయాలని చూస్తున్నామని చెప్పారు. బిఆర్ఎస్ హయాంలో చాలా భూములు బదిలీ చేశారని, పరిశ్రమలకు ఉపయోగపడాలని గ్రిడ్ పాలసీ తీసుకున్నారని అనుకున్నామని అన్నారు. పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టకూడదని, రాష్ట్ర ప్రగతిలో భాగంగా పాలసీ తీసుకున్నామని తెలిపారు. పెట్టుబడులు రాకూడదని, రాష్ట్ర అభివృద్ధి జరగకూడదనేది కెటిఆర్ ఆలోచనని దుయ్యబట్టారు. ఆధారాలు ఉంటేనే కెటిఆర్ మాట్లాడాలని సూచించారు. కెటిఆర్ కొంతమంది పేర్లు చెప్పారని, వారు ప్రభుత్వంలో లేరని అన్నారు. ఆధారాలు ఉంటే చెప్పండి.. చర్యలు తీసుకుంటామని, జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత బిఆర్ఎస్ కు చుక్కలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పెట్టుబడులు రావాలని, రాయితీలు కూడిన పాలసీలు తీసుకుంటామని హామి ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే భూములు ఇస్తున్నారని, పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలి అనేదే తమ లక్ష్యం శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.  

మన తెలంగాణ 21 Nov 2025 4:55 pm

టెన్నిస్ పోటీలలో రాష్ట్రస్థాయి మూడవ స్థానం పొందిన వ్యాయామ ఉపాధ్యాయుడు బి శివకృష్ణ

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నివాసంగా ఉంటూ కొత్తచెరువు మండలంలో వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న బి శివకృష్ణ విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ లాండ్ టెన్నిస్ పోటీలలో రాష్ట్రస్థాయి పోటీల్లో మూడవ స్థానమును పొందడం జరిగిందని టెన్నిస్ క్రీడాకారుడు బి. శివకృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గుజరాత్లో డిసెంబర్ 16వ తేదీ నుండి జరగబోవు జాతీయ సాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని వారు తెలిపారు. ఇందులకు ఆ […] The post టెన్నిస్ పోటీలలో రాష్ట్రస్థాయి మూడవ స్థానం పొందిన వ్యాయామ ఉపాధ్యాయుడు బి శివకృష్ణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 4:50 pm

CRICKET |మహేష్ ఎంపిక

CRICKET | మహేష్ ఎంపిక CRICKET | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్

ప్రభ న్యూస్ 21 Nov 2025 4:50 pm

PETITION|మంత్రి ఫ‌రూక్ కు వినతి పత్రం అందజేత‌..

PETITION| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూనెపల్లి ప్రాంతం 127

ప్రభ న్యూస్ 21 Nov 2025 4:46 pm

NZB |ముదిరాజులకు అధిక సీట్లు కేటాయించాలి …

NZB | ముదిరాజులకు అధిక సీట్లు కేటాయించాలి … బిక్కనూరు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Nov 2025 4:42 pm

ముగిసిన 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలు

విశాలాంధ్ర -అనంతపురం : 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలను గురువారం సాయంత్రం ముగింపు సమావేశాన్ని ఘనంగా నిర్వహించినట్లు భారత సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ ముగింపు సమావేశానికి నా కేంద్రం ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కస్తూరీ/ ఆర్.ఆర్. కాలేజి ఆఫ్ ఫిజియోథెరపీ, అనంతపురము ప్రొఫెసర్ డాక్టర్ బత్తలపల్లి సత్య రంగా రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సహకార వారోత్సవాల ప్రాముఖ్యతను […] The post ముగిసిన 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Nov 2025 4:39 pm

Andhra Prabha Smart Edition |డేంజర్​లో పుడమి/ మెక్సికో భామకు/ఆత్మ వీలునామా

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 21-11-2025, 4.00PM డేంజర్​లో పుడమి.. దూసుకొస్తున్న తోకచుక్క మెక్సికో

ప్రభ న్యూస్ 21 Nov 2025 4:35 pm