SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

ఆరో తరగతి నుంచి త్రిభాషా సూత్రం

న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) 6 వ తరగతి విద్యార్థులకు కొత్తగా మూడు భాషల విధానాన్ని ప్రవేశ పెడుతోంది. అలాగే 9 వ తరగతి విద్యార్థులకు రెండు అంచెల వ్యవస్థతో మేథమెటిక్స్, సైన్సు 202627 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించనుంది. త్రిభాషా సూత్రం ప్రకారం న్యూనేషనల్‌ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఇపి)కింద ఆరోతరగతి విద్యార్థులకు 2026 నుంచే ప్రారంభిస్తారని అధికార వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. ఈ విధానంలో విద్యార్థులు కనీసం రెండు భారతీయ భాషలు, ఒక విదేశీ భాషను (ఇంగ్లీష్‌తోసహా )అభ్యసించాలి. ఇందులో ఇంగ్లీష్‌ను విదేశీ భాషగా పరిగణించి, మిగిలిన రెండు భారతీయ భాషలుగా ఎంచుకునే అవకాశం ఉంది. ఎన్‌ఇపి ప్రకారం త్రిభాష సూత్రాన్ని ఆర్1,ఆర్2,ఆర్3 దశల వారీగా బోధిస్తారు. 202627కు సంబంధించి ఆరో తరగతికి, 202728లో ఏడో తరగతికి,202829లో ఎనిమిదో తరగతికి, 202930 నాటికి తొమ్మిదో తరగతికి, 203132 నాటికి పదో తరగతికి మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని సిబీఎస్‌ఈ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆరో తరగతి చదివే వారు మూడు భాషలు చదవాల్సి వస్తుంది. ఇకపై పదో తరగతి వరకు ప్రతిఏటా ఇలాగే ఈ విధానం అమలవుతుంది.ప్రస్తుతం సీబీఎస్‌ఈలో రెండు భాషల విధానమే అమలవుతున్న సంగతి తెలిసిందే. 2020లో వచ్చిన సూచనలకు అనుగుణంగా ఈ మార్పు సీబీఎస్‌ఈ తీసుకొచ్చింది.ఈ బహుభాషా విధానం వల్ల భారతీయ భాషలకు ఆదరణ కూడా పెరుగుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ మార్గదర్శకాల ప్రకారం విదేశీ స్కూళ్ల నుంచి ఎవరైతే వస్తారో మూడో భాషగా భారతీయ ప్రాంతీయ భాషలను 8/9 తరగతి వరకు ఎవరైతే చదవలేదో వారికి మినహాయింపు కల్పించారు. వారు హిందీ కానీ లేదా స్కూలు అవకాశం ఇచ్చిన మరే భాషనైనా చదువుకోవలసి ఉంటుంది. వీరంతా ప్రామాణాల ప్రకారం అధ్యయనం చేసి కామన్ 80 మార్కుల మూడు గంటల పరీక్షకు హాజరు కావలసి ఉంటుంది. 

మన తెలంగాణ 4 Apr 2026 12:00 am

చెన్నై పై పంజాబ్ విజయం

 ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. పంజాబ్‌కు ఇది వరుసగా రెండో గెలుపు కాగా, చెన్నై ఆడిన రెండింటిలోనూ పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (28) పరుగులు చేయగా సంజు శాంసన్ (7) మరోసారి విఫలమయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన అయూష్ మాత్రే అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. దూకుడుగా ఆడిన మాత్రె 43 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఐదు సిక్స్‌లతో 73 పరుగులు చేశాడు. ధాటిగా బ్యాటింగ్ చేసిన శివమ్ దూబె 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సర్ఫరాజ్ ఖాన్ 12 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 18.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (39), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (43) శుభారంభం అందించారు. కూపర్ కొనోలి (36) మరోసారి జట్టుకు అండగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ 29 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ అలవోక విజయం అందుకుంది.

మన తెలంగాణ 3 Apr 2026 11:46 pm

హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎసిబి దాడి

 హన్మకొండ వడ్డేపల్లిలో ఉన్న జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు అధికారులు అవినీతికి పాల్పడినట్టు గుర్తించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం హన్మకొండలోని సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఉంటున్న నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంలో రూ.24 లక్షల నగదు, కొంత బంగారం, రూ.30 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ కాగితాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే ఖమ్మంలోని సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఇంట్లోనూ ఎసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రూ.42 లక్షల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారని తెలిసి కొందరు ముఖ్యమైన డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. ఈ అవినీతి డాక్యుమెంట్ రైటర్ల భరతం పట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మన తెలంగాణ 3 Apr 2026 11:30 pm

కరీంనగర్‌లో కన్నతండ్రి కిరాతకం

 కన్నబిడ్డలకు రక్షణగా ఉండాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆడపిల్లలు పుట్టారని గొడవల నేపథ్యంలో ఇద్దరు కవల కుమార్తెలను తండ్రి బావిలో ముంచి చంపడం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీనగర్‌కు చెందిన కచ్చు శ్రీశైలంకు ఆరేళ్ల క్రితం మానకొండూరు మండలం లక్ష్మీపూర్‌కు చెందిన మౌనికతో వివాహమైంది. వీరికి గీతాంశీ, గీతాన్విక (4) అనే ఇద్దరు కవలు జన్మించారు. అయితే, కొంతకాలంగా ఆడపిల్లలు పుట్టారనే కారణంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం శ్రీశైలం తన ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకొని పొలానికి వెళ్లాడు. పొలానికి తీసుకువెళ్లిన పిల్లలను శ్రీశైలం కావాలనే బావిలో ముంచి చంపినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బావిలో గాలించగా గీతాంశీ మృతదేహం నీటిపై తేలింది. కాగా, మరో కుమార్తె గీతాన్విక ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు బావిలో, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ విజయ్‌కుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. నిందితుడు శ్రీశైలంను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో జూబ్లీనగర్‌లో ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉన్నందున, శాంతిభద్రతల దృష్ట్యా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ‘కుటుంబ గొడవల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు, గీతాన్విక ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది’ అని కరీంనగర్ రూరల్ సీఐ తెలిపారు.

మన తెలంగాణ 3 Apr 2026 11:20 pm

మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు తమ కూంబింగ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాయి. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కింద చేపట్టిన మిషన్ -2026 ముగిసినప్పటికీ భద్రతా బలగాలు అడవిలో ఉన్న మిగిలిన నక్సల్స్ కోసం వేటను ముమ్మరం చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారం మేరకు నక్సల్స్ డంప్‌లను స్వాధీనం చేసుకునే పనుల్లో బలగాలు నిమగ్నమయ్యాయి. బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్ద జోజెర్, లేండ్రా అటవీ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టులకు చెందిన రెండు భారీ డంప్‌లను సీఆర్పీఎఫ్ 85 బెటాలియన్ బృందం స్వాధీనం చేసుకున్నది. స్వాధీనం చేసుకున్న వాటిలో 303 రైఫిల్, స్టెన్‌గన్, బీజీఎల్ రౌండ్స్, డెటోనేటర్స్, జిలెటిన్ స్టిక్స్, వైర్, మావోయిస్టు సామగ్రి తయారుచేయడానికి ఉపయోగించే వస్తువులున్నాయి. బస్తర్‌లో మిగిలిన మావోయిస్టుల కోసం కూంబింగ్ ముమ్మరం చేసినట్టు ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. ఆయుధాలు వీడి వస్తే మంచిదన్నారు.ఓ పక్క మిగిలిన మావోయిస్టులను వేటాడుతూనే, ఇంకో పక్క పోలీసులు నక్సల్స్ లొంగుబాటు ప్రయత్నాలు చేస్తున్నారు.

మన తెలంగాణ 3 Apr 2026 11:14 pm

లీటర్ పెట్రోలు రూ 458..

పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో గల్ఫ్ యుద్ధ ప్రభావం తీవ్రస్థాయికి చేరింది. అక్కడి ప్రభుత్వం ఇప్పుడు పెట్రోలు అసాధారణ , విపరీత స్థాయిలో పెంచింది. పెట్రోలు ధరలలో లీటరుకు 43 శాతం, హైస్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డి) ధరలలో 55 శాతం పెరుగుదలను ప్రకటించింది.గ్లోబల్ చమురు ఇంధన ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగే ధరలతో పెట్రోలు ధర లీటరుకు ఇప్పుడు 458.41 పైసలు చేరుతుంది. ఇంతకు ముందు ఇది రూ 327.17 గా ఉంది, ఇప్పుడు పెరిగిన రేటు లీటరుకు రూ 137 .23 పైసలు ఇక హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్‌కు రూ 184.49 పెంచారు. దీనితో ఇంతకు ముందు వరకూ ఉన్న లీటరు 335 ధర ఇప్పుడు లీటరుకు రూ 520 దాటుతుంది. ఇక సామాన్యుడికి అత్యవసరం అయిన కిరోసిన్ ధర లీటర్‌కు రూ 457 దాటింది. ఇది అత్యంత కష్టమైన నిర్ణయం అని, అయితే ఇప్పటి పరిస్థితుల్లో అనివార్యం అని దేశ పెట్రోలియం మంత్రి అలీ పర్వేయిజ్ మాలిక్ తెలిపారు. ఇంధన సంక్షోభంతో బంగ్లాదేశ్‌లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకే కార్యాలయాలు మూసివేయాలని, ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశిస్తూ నిర్ణయాలు వెలువరించారు. దుకాణాలు, షాపింగ్ మాల్స్‌ను సాయంత్రం ఆరుగంటలకు మూసివేయాలి. బ్యాంకులను మధ్యాహ్నం మూడు గంటలకు బంద్ చేయాల్సి ఉంటుంది. అక్కడి కొత్త ప్రభుత్వానికి ఇప్పటి గల్ఫ్ యుద్ధం స్థితిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఏ దేశం సాయం తీసుకోవాలనే విషయంపై అధికారిక నిర్ణయాలకు సమయం పడుతోంది. ఈ దిశలోనే భారత్ నుంచి కొంత మేర ఇంధన సాయం తీసుకుంది.

మన తెలంగాణ 3 Apr 2026 11:06 pm

యుద్ధనౌక తారగిరిని ప్రారంభించిన రాజ్‌నాథ్

సముద్ర వాణిజ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా వాణిజ్య నౌకలను సమకూర్చుకోవడంలో భారత నేవీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశంసించారు. సంక్లిష్ట సమయాల్లో నేవీ ముందుంటుందని పేర్కొన్నారు. దేశ వాణిజ్యం లోని 95 శాతం రవాణా సముద్ర మార్గం నౌకల ద్వారా సాగుతోందన్నారు. ఆత్మనిర్భర్‌కు ప్రతీకగా స్వదేశీయంగా తయారైన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ తారగిరిని ఆయన శుక్రవారం ప్రారంభించారు. పర్షియా జలసంధి యైనా, లేదా మలక్కా జలసంధి అయినా హిందూ మహాసముద్రంలో భారత నేవీ నిరంతరం నిర్వహణలోనే ఉంటుందని పేర్కొన్నారు. ఐఎన్‌ఎస్ తారగిరిని ప్రారంభించడం నేవీ శక్తిసామర్థాలను, విలువలు, అంకిత భావాన్ని మరింత పెంచుతాయన్నారు. ప్రాజెక్టు 17ఎ తరగతిలో నిర్మించిన నాలుగో స్టెల్త్ యుద్ధనౌక తారగిరి 6670 టన్నుల బరువుతో ఉంటుంది. ముంబైకు చెందిన మజగాన్ డాక్ షిప్‌యార్డ్ నిర్మించిన ఈ యుద్ధనౌకలో బ్రహ్మోస్ క్షిపణులు వంటివి అమర్చడమైంది. కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో పనిచేసే ఈ యుద్ధనౌక బహుళ రకాల సముద్ర కార్యకలాసాలను నిర్వహించగలదు. ఐఎన్‌ఎస్ తారగిరి చేరికతో హిందూ పసిఫిక్ ప్రాంతంలో కీలకమైన నౌకాశక్తిగా భారత్ స్థానం మరింత పటిష్ఠం కానుంది. 

మన తెలంగాణ 3 Apr 2026 10:20 pm

‘సైరాబాను’- సినిమా షురూ

’శంబాల’ చిత్రంతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నారు హీరో ఆది సాయి కుమార్. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన నెక్స్ ప్రాజెక్ట్‌ను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ’కె-ర్యాంప్’ సంచలన విజయంతో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కృష్ణకాంత్ పరుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ సరసన బంధవి శ్రీధర్ కథానాయికగా నటిస్తున్నారు. ’సైరాబాను’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని, ఆకట్టుకునే పోస్టర్ ద్వారా ఆవిష్కరించారు. ఫణి కృష్ణ సిరికి... రాజమండ్రి, హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథనంతో, హాస్యం మేళవించి ఒక ప్రత్యేకమైన హిందూ-, ముస్లిం ప్రేమకథను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌ను శుక్రవారం పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో కిరణ్ అబ్బవరం క్లాప్ కొట్టారు. దర్శకుడు రామ్ అబ్బరాజు, సాయి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోన వెంకట్, కే రాంప్ డైరెక్టర్ నాని మేకర్స్‌కి స్క్రిప్ట్ అందించారు. తొలి సన్నివేశానికి దర్శకుడు యోగి గౌరవ దర్శకత్వం వహించారు.

మన తెలంగాణ 3 Apr 2026 10:10 pm

దూసుకువచ్చిన ఇరాన్ ఆయుధ శకలాలు..అబూధాబిలో గాయపడ్డ భారతీయులు

అబూధాబిలో శుక్రవారం ఇరాన్ జరిపిన దాడుల క్రమంలో ఐదుగురు భారతీయులు స్వల్పంగా గాయపడ్డారు. ఇరాన్ క్షిపణులను అరబ్ ఎమిరేట్స్ బలగాలు అడ్డుకుని , దెబ్బతీశాయి.ఈ దశలో ఈ శకలాల ధాటికి మొత్తం 12 మంది గాయపడ్డారని , వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారని అబూధాబి మీడియా కార్యాలయం తెలిపింది. అబూధాబిలోని అజ్బాన్ ప్రాంతంలో ఈ శకలాలు చెల్లాచెదరుగా వచ్చిపడ్డాయి. వివిధ వృత్తులలో ఉన్నపౌరులు గాయపడగా వీరిలో మిగిలిన వారు నేపాలీలు అని అధికారులు తెలిపారు. ఒక నేపాలీకి తీవ్రగాయాలు అయినట్లు వెల్లడైంది. ఇరాన్ దాడులలో అబూధాబిలో పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున మంటలు కమ్ముకున్నాయి.  

మన తెలంగాణ 3 Apr 2026 10:00 pm

పంజాబ్ కింగ్స్ విజయ లక్ష్యం 210

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయూశ్ మాత్రే(73: 43 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ లు) హాఫ్ సెంచరీ చేశాడు.రుతురాజ్ గైక్వాడ్(28: 22 బంతుల్లో 2 ఫోర్లు),సర్ఫరాజ్(32: 12 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్స్) పరుగులు చేశారు. శివమ్ దూబె (45: 28 బంతుల్లో ), ప్రశాంత్ వీర్ (6: 6 బంతుల్లో) నాటౌట్ గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ 2, చావల్, మార్కో జన్సన్, బార్లెట్ తలో వికెట్ పడగొట్టారు.

మన తెలంగాణ 3 Apr 2026 9:51 pm

Photos : Rakasa Movie Success Celebrations

The post Photos : Rakasa Movie Success Celebrations appeared first on Telugu360 .

తెలుగు 360 3 Apr 2026 9:49 pm

13న కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లోకి జీవన్ రెడ్డి..?

మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న జీవన్ రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఆ రోజు మంచి ముహూర్తం ఉండటంతో గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 6న అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే కెటిఆర్.. జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలిసింది.

మన తెలంగాణ 3 Apr 2026 9:47 pm

Photos : Biker Movie Success Celebrations

The post Photos : Biker Movie Success Celebrations appeared first on Telugu360 .

తెలుగు 360 3 Apr 2026 9:38 pm

రెండు రోజుల పాటు మీసేవా సేవలు బంద్

 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవా కేంద్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి రెండు రోజులపాటు సేవలు నిలిచిపోనున్నాయి. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. తిరిగి సోమవారం ఉదయం నుంచి యథావిధిగా మీసేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.

మన తెలంగాణ 3 Apr 2026 9:36 pm

Video : Hero Adivi Sesh Exclusive Interview

The post Video : Hero Adivi Sesh Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 3 Apr 2026 9:15 pm

సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు విడ్డూరం: కల్వకుంట్ల కవిత

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్‌ను ఆగం చేసేలా ఉన్నారని కవిత విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, అమరావతి గురించి తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. మద్యం కేసు కొట్టి వేశారంటేనే ప్రకృతి తమకు సహకరిస్తుందని అన్నారు. అదృష్టవంతులను ఎవరూ ఆపలేరని, తమ ఎజెండా ప్రకటించాక చాలా మంది పార్టీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది విదేశాల్లో ఉన్నవారని, ఇతరులు పార్టీలో చేరుతామని అంటున్నారని పేర్కొన్నారు. పార్టీ తరపున క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని, శ్రమనే నమ్ముకుని ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు. ఆరు గ్యారంటీల గురించి కేరళంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. మహారాష్ట్ర, బీహార్‌లో కూడా ఇలాగే చెప్పారని, కాంగ్రెస్‌ను ప్రజలు ఓడించారని గుర్తు చేశారు.

మన తెలంగాణ 3 Apr 2026 9:12 pm

డ్రగ్స్ రవాణా చేస్తున్న నైజీరియన్ మహిళ అరెస్టు

ముంబాయి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్న నైజీరియాకు చెందిన మహిళను ఎక్సైజ్ డిటిఎఫ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి రూ.2.35 లక్షల విలువైన 7.5 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...నైజీరియా దేశానికి చెందిన జేమ్స్ టెస్లింగ్ యామ్యూనల్ ముంబాయిలో ఉంటోంది. దేశంలోని పలు నగరాలకు కొకైన్ డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకుని బయలు దేరినట్లు ఎక్సైజ్ డిటిఎఫ్ సిఐ సౌజన్య, ఎస్సై శికృష్ణకు తెలిసింది. దీంతో వీరు తమ సిబ్బందితో కలిసి జేమ్స్ టెస్లింగ్ కోసం సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రి సమీపంలో వేచి ఉన్నారు. ముంబాయి నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చిన టెస్లింగ్ ఆటోలో ఆస్పత్రి వద్దకు రాగానే ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆమె వద్ద ఉన్న 7.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబాయిలో గ్రాముకు రూ.15,000 చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి రూ.30వేలకు విక్రయిస్తోంది. నిందితురాలిని అరెస్టు చేసిన ఎక్సైజ్ సిబ్బంది కేసు దర్యాప్తు కోసం సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. సిఐ సౌజన్య, ఎస్సై శివకృష్ణ, కానిస్టేబుళ్లు రాజు, రవి, శిల్ప కలిసి పట్టుకున్నారు.

మన తెలంగాణ 3 Apr 2026 9:04 pm

Suriya’s Karuppu Coming In Telugu As Veerabhadrudu

Suriya is set to ignite the summer box office with his upcoming film Karuppu. Veerabhadrudu is the official title of the Telugu version of the movie. The team has now confirmed that the film will hit theatres this summer on May 14th. The newly unveiled poster captures Suriya in a raw, commanding avatar. Clad in […] The post Suriya’s Karuppu Coming In Telugu As Veerabhadrudu appeared first on Telugu360 .

తెలుగు 360 3 Apr 2026 9:01 pm

పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే మీరా మాకు నీతులు చెప్పేది..?: సిఎం విజయన్

సొంత రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే వ్యక్తి, సామాజిక పురోగతి గురించి కేరళకు పాఠాలు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ కేరళ సిఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. ఇటీవల కేరళలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర సర్కారుపై సిఎం రేవంత్‌రెడ్డి చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలపై కేరళ సిఎం పినరయి విజయన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కేరళలో అవినీతి, దుష్పరిపాలన ఉందని ఆరోపించే ముందు రేవంత్ రెడ్డి అధికారిక గణాంకాలను పరిశీలించాలని పినరయి విజయన్ సూచించారు. దేశంలోనే అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ అని ఆయనకు తెలియదా..? అని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ ఎస్‌డీజీ ఇండెక్స్ (2023 -24)లో కేరళ 79 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంటే, తెలంగాణ ఆరో స్థానంలో ఉందని అన్నారు. మీ రాష్ట్రంలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి కేరళను కించపరచడం చాలా విచారకరం అంటూ రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ విజయన్ వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారమే కేరళలో పేదరికపు రేటు కేవలం 0.55 శాతం అని, ఇది దేశంలోనే అత్యల్పమని గుర్తుచేశారు. 2025 చివరి నాటికి తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలవబోతోందని తెలిపారు. అదే సమయంలో తెలంగాణలో పేదరికం 5.88 శాతంగా ఉందని, అక్కడి నిరుపేదలను ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదా..? అని ప్రశ్నించారు. కేరళలో అక్షరాస్యత 95.3 శాతం ఉండగా, తెలంగాణలో 76.9 శాతం వద్దే ఆగిపోయిందని పేర్కొన్నారు. కేరళలో శిశు మరణాల రేటు (ఐఎంఆర్) కేవలం 5గా ఉందని, ఇది అమెరికా (5.6) కన్నా మెరుగని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో ఈ రేటు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వ పాలనా నమూనాను రేవంత్ రెడ్డి విమర్శించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కేరళ సాధిస్తున్న సుస్థిర, సమ్మిళిత అభివృద్ధిని దెబ్బతీయాలనుకునే వారికి రేవంత్ రెడ్డి ఒక గొంతుకగా మారారని ఆరోపించారు. కేరళ, కేంద్ర ప్రభుత్వాల మధ్య లాలూచీ ఉందని రేవంత్ చేసిన ఆరోపణను విజయన్ కొట్టిపారేశారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు పదేపదే ఆలస్యం చేసే ప్రభుత్వం నడుపుతున్న ముఖ్యమంత్రి, కేరళకు నేర్పడానికి ఏమీ లేదని అన్నారు. పాలన, ప్రజా సంక్షేమం గురించి నిజమైన పాఠాలు నేర్చుకోవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రిని కేరళకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని పినరయి విజయన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

మన తెలంగాణ 3 Apr 2026 8:47 pm

Minister Nimmala Ramanaidu Warns Irrigation Officials

Andhra Pradesh Irrigation Minister Nimmala Ramanaidu has expressed strong displeasure over delays in the preparation of estimates for canal maintenance works. During a video conference with senior officials, including Engineer-in-Chief Narasimha Murthy and chief engineers across the state, the minister made it clear that negligence will not be tolerated. He questioned why estimates for works […] The post Minister Nimmala Ramanaidu Warns Irrigation Officials appeared first on Telugu360 .

తెలుగు 360 3 Apr 2026 8:12 pm

మళ్లీ నిరాశ పరిచిన సంజూ.. పవర్‌ప్లేలో చెన్నై స్కోర్ ఎంతంటే..

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిఎస్‌కె ఆటగాడు సంజూ శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో సిఎస్‌కె తొలుత బ్యాటింగ్‌కి దిగింది. అయితే బ్రాట్‌లెట్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి సంజూ(7) ప్రభ్‌సిమ్రాన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చి ఆయుశ్ మాత్రే మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై 1 వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 1 వికెట్ కోల్పోయి.. 71 పరుగులు చేసింది. క్రీజ్‌లో మాత్రే(43), రుతురాజ్ గైక్వాడ్ (14) ఉన్నారు.

మన తెలంగాణ 3 Apr 2026 8:11 pm

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో డికె అరుణ భేటీ

 మహబూబ్ నగర్ ఖేల్ సంసద్ మహోత్సవ్ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలంటూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపి డికె అరుణ ఆహ్వానించారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో శుక్రవారం ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే క్రీడా మహోత్సవం గురించి గవర్నర్‌కు వివరించారు. 24వ తేదీన మహబూబ్ నగ ర్ వేదికగా జరిగే ముగింపు వేడుకకు హాజరవుతానని గవర్నర్ సానుకూలంగా స్పందించారు.

మన తెలంగాణ 3 Apr 2026 7:29 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో చెన్నై చిత్తుగా ఓడింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌లో గెలుపు ఖాతా తెరవాలని చెన్నై భావిస్తోంది. ఇక గుజరాత్‌పై ఘన విజయం సాధించిన పంజాబ్.. అదే విక్టరీ జోష్‌తో ఈ మ్యాచ్‌ బరిలో దిగుతుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై మార్పు చేసింది. మాట్ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్‌ని జట్టులోకి తీసుకుంది. పంజాబ్ మాత్రం అదే జట్టుతో బరిలోకి దిగుతుంది. తుది జట్లు: సిఎస్‌కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబె, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్. పిబికెఎస్: ప్రబ్‌సిమ్రన్ సింగ్(కీపర్), కూపర్ కోన్లీ, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, నేహల్ వాదీరా, మార్కస్ స్టోయినస్, మార్కో యాన్సన్, జేవియర్ బ్రాట్‌లెట్, విజయ్ కుమార్ వైశ్యక్, అర్ష్‌దీప్ సింగ్, యుజవేంద్ర చాహల్.

మన తెలంగాణ 3 Apr 2026 7:23 pm

upto94matches |ఐపీఎల్ విస్తరణ… లాభాల వెనుక ….

upto94matches | ఐపీఎల్ విస్తరణ… లాభాల వెనుక …. upto94matches |ఆటగాళ్లపై పెరుగుతున్న

ప్రభ న్యూస్ 3 Apr 2026 6:59 pm

కెసిఆర్ తరహాలోనే రేవంత్ ప్రజల్ని మోసం చేస్తున్నారు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: కేరళ ఎన్నికల ప్రచారంలో సిఎం రేవంత్ రెడ్డి బిజెపిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిలో ఎన్ని అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏం చేశారని, కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కెసిఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. బిసిలకు అన్యాయం చేశామని అంటున్నారు.. బిసిలకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగించింది కాంగ్రెస్ పార్టీయేనని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీల అమలు చేసినట్లు కేరళలో గొప్పలు పలుకుతున్న రేవంత్.. భవిష్యత్తులో తెలంగాణలోనూ అదే తరహా మాటలు చెప్పే ప్రమాదముందని అన్నారు.

మన తెలంగాణ 3 Apr 2026 6:45 pm

పార్టీకి వివరణ ఇచ్చిన అరవిందబాబు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్​బాబు వివరణ ఇచ్చారు

తెలుగు పోస్ట్ 3 Apr 2026 6:36 pm

తమిళనాడు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు వీరే.. బరిలో తమిళసై

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక పార్టీ తర్వాత మరొక పాటు ఆ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయి. సినీ నటుడు విజయ్ కూడా పార్టీ పెట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ తమిళనాడులో మొత్తం 27 స్థానాల్లో పోటీ చేస్తోంది. తాజాగా ఆ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈసారి పోటీలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బిజెపి తరఫున పోటీలో దిగుతున్నారు. మైలాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తారు. వనతి శ్రీనివాసన్ కోయంబత్తూర్(నార్త్) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. బిజేపి చీఫ్ నైనార్ నాగేంద్రన్ అవనాశి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.

మన తెలంగాణ 3 Apr 2026 6:32 pm

అమెరికాకు ఇరాన్ భారీ షాక్

అమెరికాకు ఇరాన్ మరో సారి షాక్ ఇచ్చింది

తెలుగు పోస్ట్ 3 Apr 2026 6:18 pm

అంబులెన్స్ లోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రానికి

ప్రభ న్యూస్ 3 Apr 2026 6:09 pm

Renuka Choudhary : కుక్కను, కులాన్ని కొంగును కట్టుకుని తిరుగుతున్నావేంటమ్మా?

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నిత్యం వివాదాల్లో చిక్కుకుంటారు

తెలుగు పోస్ట్ 3 Apr 2026 6:04 pm

నూతన బోర్వెల్ ను పరిశీలించిన చైర్మన్ సర్పంచ్ లు

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కృషితో

ప్రభ న్యూస్ 3 Apr 2026 6:04 pm

Kadem |కారులో తరలిస్తుండగా రోడ్డుప్రమాదం…

Kadem | కారులో తరలిస్తుండగా రోడ్డుప్రమాదం… Kadem | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 3 Apr 2026 6:03 pm

TG |యువకుడి గొంతు కోసిన భర్త

TG | యువకుడి గొంతు కోసిన భర్త TG | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 3 Apr 2026 5:55 pm

చేంగల్‌ లో భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : ప్రజలందరిలో వసుదైక కుటుంబం అనే భావన వెల్లి

ప్రభ న్యూస్ 3 Apr 2026 5:54 pm

ఉరుసు రంగ సముద్రం బండ్ కు శంకుస్థాపన

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ ఉరుసు రంగసముద్రం బండ్ కు రాష్ట్ర

ప్రభ న్యూస్ 3 Apr 2026 5:48 pm

Petrol Prices : లీటర్ పెట్రోలు 459 రూపాయలు ఎక్కడంటే?

పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి

తెలుగు పోస్ట్ 3 Apr 2026 5:46 pm

కొండగల్ లో హరీశ్ రావు రేవంత్ పై సెటైర్లు

కొడంగల్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటించారు

తెలుగు పోస్ట్ 3 Apr 2026 5:39 pm

చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రత్యేక అధికారి ఎంఈవో

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ మండలంలోని బాబాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్

ప్రభ న్యూస్ 3 Apr 2026 5:36 pm

సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన వసతులపై దృష్టి పెట్టాలి..

సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన వసతులపై దృష్టి పెట్టాలి.. ఎస్సీ, బీసీ హాస్టళ్ల పనితీరును

ప్రభ న్యూస్ 3 Apr 2026 5:34 pm

ఒటిటిలోకి మిస్టీరియస్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఒటిటిలు అందుబాటులోకి వచ్చాక.. ప్రేక్షకులకు వినోదం మరింత చేరువైంది. థియేటర్ల వరకూ వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో నుంచి తమకు నచ్చిన సినిమాలను చూసే వీలు కలిగింది. అయితే సినిమాలతో పాటు ఒటిటిలు అంటే మనకు గుర్తొచ్చేది వెబ్ సిరీస్‌లు. రకరకాల జానర్లలో వెబ్‌సిరీస్‌లు ఒటిటిల్లో విడుదలై ఎంతో సక్సెస్‌ని సాధించాయి. అలా ఒప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆసక్తికర వెబ్‌సిరీస్ ‘పోచమ్మ’. మిస్టీరియస్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో సీరియల్ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ అంబటి అర్జున్ ప్రధాన పాత్రలో నటించాడు. శృతి నాయుడు నిర్మించిన ఈ సిరీస్‌కి రమేష్ చంద్ర దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ గ్లింప్స్‌ని ‘పెద్ది’ డైరెక్టర్ బిచ్చిబాబు విడుదల చేశారు. గ్లింప్స్‌ని బట్టి చూస్తే ఈ సిరీస్‌లో మిస్టరీతో పాటు డివైన్ టచ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. పోచమ్మ దేవత గొప్పతనం, ఆమె మహిమ తెలియక తప్పులు చేసిన కొందరిని ఆమె ఎలా శిక్షించింది అనేది ఈ సిరీస్ కాన్సెప్ట్‌ అని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. పోచమ్మకు కాపాడటం తెలుసు, వేధించడం తెలుసు, అవసరమైతే చంపడం కూడా తెలుసు అనే డైలాగ్ ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో చెబుతోంది. ఇక ఈ సిరీస్‌ ఏప్రిల్ 17 నుంచి ఆహా ఒటిటిలో స్ట్రీమింగ్ కానుంది.

మన తెలంగాణ 3 Apr 2026 5:31 pm

Gold Rates Today : గోల్డ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్

మరోసారి భారీగా బంగారం ధరలు పెరిగాయి

తెలుగు పోస్ట్ 3 Apr 2026 5:30 pm

మృతుడి కుటుంబానికి పరామర్శ..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ఓర్సు చేరాలు గత కొద్దిరోజులుగా

ప్రభ న్యూస్ 3 Apr 2026 5:28 pm

ఉట్నూర్ ఏజెన్సీలో సబ్ కలెక్టర్ల క్షేత్ర పర్యటన

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలో రెండు రోజుల క్షేత్ర

ప్రభ న్యూస్ 3 Apr 2026 5:20 pm

ఇంకెన్నాళ్లు ఈ ఇబ్బందులు

ఇంకెన్నాళ్లు ఈ ఇబ్బందులు రాజాపేట, ఆంధ్రప్రభ : రాజాపేటకు వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు..నానాటికి

ప్రభ న్యూస్ 3 Apr 2026 5:14 pm

చిన్నారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘన నివాళి

చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం వంగాలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు

ప్రభ న్యూస్ 3 Apr 2026 5:09 pm

Telangana |సుమారు 46.85 కిలోలు స్వాధీనం..

Telangana | సుమారు 46.85 కిలోలు స్వాధీనం.. Telangana | -పోలీసుల అప్రమత్తతతో

ప్రభ న్యూస్ 3 Apr 2026 5:08 pm

టెస్కో ఆర్డర్ల రద్దు చేనేత కార్మికులపై ప్రభావం

టెస్కో ఆర్డర్ల రద్దు చేనేత కార్మికులపై ప్రభావం కరీమాబాద్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం

ప్రభ న్యూస్ 3 Apr 2026 5:04 pm

BSS & Kavya: Engagement & Wedding Dates Announced

Hero Bellamkonda Sai Sreenivas gets ready to marry Kavya Reddy. The couple, who formalized their union with a traditional and beautifully arranged Roka ceremony in the month of March, are now moving into the next big celebrations with family blessings and industry well-wishers surrounding them. With the celebrations now in full swing, the families have […] The post BSS & Kavya: Engagement & Wedding Dates Announced appeared first on Telugu360 .

తెలుగు 360 3 Apr 2026 5:01 pm

రైతాంగ పోరాటంలో కొమరయ్య కీలక పాత్ర

రైతాంగ పోరాటంలో కొమరయ్య కీలక పాత్ర సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 3 Apr 2026 4:58 pm

పదవులు పార్టీకి అలంకారప్రాయాలు..

పదవులు పార్టీకి అలంకారప్రాయాలు.. పాయకాపురం, ఆంధ్ర ప్రభ : పదవులు పార్టీకి అలంకారప్రాయాలని

ప్రభ న్యూస్ 3 Apr 2026 4:57 pm

రెండు గంటల్లోనే చైన్ స్నాచింగ్ నిందితుల అరెస్ట్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం

ప్రభ న్యూస్ 3 Apr 2026 4:53 pm

ఎండల నుంచి రిలీఫ్.. రానున్న మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్: మండిపోతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడతాయని.. రేపు (శనివారం) ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

మన తెలంగాణ 3 Apr 2026 4:39 pm

ఆరు గ్యారెంటీలు అమలు చేశామని బడాయిలు చెబుతున్నారు: హరీశ్

నాగర్‌కర్నూల్: ఎస్టి కార్పొరేషన్ ద్వారా గత బిఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్లు ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని తిమ్మారెడ్డిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఎస్టిల ఓట్లు కావాలిగానీ, వాళ్ల సంక్షేమం పట్టించుకోరా? అని ప్రశ్నించారు. కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని బడాయి మాటలు చెబుతున్నారని విమర్శించారు. 

మన తెలంగాణ 3 Apr 2026 4:31 pm

రాష్ట్ర రాజధాని అమరావతి..

రాష్ట్ర రాజధాని అమరావతి.. సంబరాలు నిర్వహిస్తున్న టీడీపీ అధ్యక్షుడు రవికుమార్.టీడీపీ కార్యాలయంలో సంబరాలు.

ప్రభ న్యూస్ 3 Apr 2026 4:27 pm

Andhra Prabha Smart Edition |AP|శాసనం చేశాం/లాంఛనంగా ప్రవేశం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 03-04-2026, 4.00PM ap వాళ్లు నాశనం చేస్తే..

ప్రభ న్యూస్ 3 Apr 2026 4:27 pm

Andhra Prabha Smart Edition |TS|రెండో విడతకు/హాయ్​ అంటే.

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 03-04-2026, 4.00PM ts సాగుకు భరోసా.. రెండో

ప్రభ న్యూస్ 3 Apr 2026 4:23 pm

software2field |సాఫ్ట్‌వేర్ నుంచి సాగు వైపు.. యువత ఊళ్ళబాట

software2field |సాఫ్ట్‌వేర్ నుంచి సాగు వైపు.. యువత ఊళ్ళబాట software2field | ఐటీ

ప్రభ న్యూస్ 3 Apr 2026 4:22 pm

డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా చింతల శ్రీనివాస్

చెన్నూరు, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గా

ప్రభ న్యూస్ 3 Apr 2026 4:21 pm

ఆకట్టుకున్న ఏసుక్రీస్తు సిలువ వేసే సన్నివేశం

ఖమ్మం కల్చరల్, ఆంధ్రప్రభ ; ప్రజలందరిలో వసుదైక కుటుంబం అనే భావన వెల్లి

ప్రభ న్యూస్ 3 Apr 2026 4:16 pm

Gas Supply |ఉత్పత్తి పెంపునకు కేంద్రం చర్యలు

Gas Supply | ఉత్పత్తి పెంపునకు కేంద్రం చర్యలు Gas Supply |

ప్రభ న్యూస్ 3 Apr 2026 4:08 pm

సీఎం పర్యటన ఏర్పాట్లపై పర్యవేక్షణ

బాసర (నిర్మల్ జిల్లా): ఈ నెల 6న, సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.

ప్రభ న్యూస్ 3 Apr 2026 4:06 pm

Dhurandhar is a Wakeup Call for Hindi Cinema

Dhurandhar is a massive hit and the film has been rewriting new records in Indian cinema. Aditya Dhar is appreciated as he released two parts in three months. Several filmmakers have been taking years for the sequel release while Aditya Dhar completed the shoot at a single stretch. Several spy films that released in Bollywood […] The post Dhurandhar is a Wakeup Call for Hindi Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 3 Apr 2026 4:04 pm

TG |మెదక్ జిల్లాలో ఘటన

TG | మెదక్ జిల్లాలో ఘటన TG | కౌడిపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 3 Apr 2026 4:04 pm

move2forward |నభా… కమ్‌బ్యాక్‌తో రేంజ్ మారుతుందా?

move2forward | నభా… కమ్‌బ్యాక్‌తో రేంజ్ మారుతుందా? move2forward | అడ్డంకుల మధ్య

ప్రభ న్యూస్ 3 Apr 2026 3:27 pm

గజవాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలలో

ప్రభ న్యూస్ 3 Apr 2026 3:25 pm

‘జెట్లీ’ నుంచి వీడియో సాంగ్ విడుదల.. సత్య డ్యాన్స్ ఇరగదీశాడు..

హైదరాబాద్: కామెడియన్ సత్యని హీరోగా పరిచయం చేస్తూ.. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జెట్లీ’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమా చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పలు మేకింగ్ వీడియోలను విడుదల చేసి అంచనాలను పెంచేశారు తాజా ఈ సినిమా నుంచి ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ అంటూ సాగే ఓ పాటని విడుదల చేశారు. ఈ పాటకి కాల భైరవ సంగీతం అందించగా.. సాయి సోమయాజులు సాహిత్యం అందించారు. శ్రావణ భార్గవి ఈ పాట పాడారు. ఈ పాటలో హీరోయిన్ రియా సింగ్‌తో కలిసి సత్య డ్యాన్స్ ఇరగదీశాడు. విజయ్ పొలాకి ఈ పాటకి కొరియోగ్రాఫీ అందించారు ప్రస్తుతం ఈ పాట సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను చిరంజీవి(చెర్రీ), హేమలత నిర్మిస్తున్నారు. ఈ వేసవిలోనే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.

మన తెలంగాణ 3 Apr 2026 3:16 pm

వైభవంగా స్వామి వారి నిత్య కళ్యాణం

ఆంధ్రప్రభ ప్రతినిధి, యాదాద్రి ; భువనగిరి పట్టణ కేంద్రంలోని స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో శుక్రవారం

ప్రభ న్యూస్ 3 Apr 2026 3:09 pm

గుడివాడ పురవీధులలో సాగిన సిలువ యాత్ర..

గుడివాడ పురవీధులలో సాగిన సిలువ యాత్ర.. గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పురవీధులలో

ప్రభ న్యూస్ 3 Apr 2026 2:52 pm

Jeevan Reddy |రేవంత్ పోవాలనే పరిస్థితి వచ్చింది

Jeevan Reddy | రేవంత్ పోవాలనే పరిస్థితి వచ్చింది Jeevan Reddy |

ప్రభ న్యూస్ 3 Apr 2026 2:44 pm

yadagirigutta |నారసింహుని సేవలో ఎమ్మెల్యే కుంభం దంపతులు

yadagirigutta | నారసింహుని సేవలో ఎమ్మెల్యే కుంభం దంపతులు yadagirigutta | ప్రముఖ

ప్రభ న్యూస్ 3 Apr 2026 2:44 pm

సింహగిరిపై అప్పన్న కళ్యాణ మహోత్సవాలు

సింహగిరిపై అప్పన్న కళ్యాణ మహోత్సవాలు భక్తులను బందీలను చేసి విచారించిన వైనంఉంగరం తీసుకొస్తేనే

ప్రభ న్యూస్ 3 Apr 2026 2:41 pm

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: କାଶୀ ବିଶ୍ୱନାଥ ପ୍ରକଳ୍ପ ଉନ୍ନତିକରଣ ସମୟରେ ଉଚ୍ଛେଦକୁ ନେଇ ବିଜେପିକୁ ସମାଲୋଚନା କରିଛନ୍ତି ପଶ୍ଚିମବଙ୍ଗ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ

ପଶ୍ଚିମବଙ୍ଗର ମାଲଦାରେ ନ୍ୟାୟିକ ଅଧିକାରୀମାନଙ୍କୁ ୯ ଘଣ୍ଟା ଧରି ବନ୍ଦୀ କରି ରଖାଯିବା ଘଟଣାରେ ସୁପ୍ରିମକୋର୍ଟ ପଶ୍ଚିମବଙ୍ଗ ସରକାରଙ୍କୁ ତୀବ୍ର ଭର୍ତ୍ସନା କରିଛନ୍ତି। ଏହି ଘଟଣା ପରେ ମମତା ସମସ୍ତ ଦୋଷ ବିଜେପି ଉପରେ ଲଦିଛନ୍ତି। ସାଗରଡିଗିଠାରେ ଏକ ଜନସଭାକୁ ସମ୍ବୋଧିତ କରି ମମତା ନିଜକୁ ଏହି ଘଟଣାରୁ ଦୂରେଇ ରଖିବା ସହିତ ରାଜ୍ୟରେ ଚାଲିଥିବା ଏସ୍‌ଆଇଆର୍‌କୁ ନେଇ ଲୋକଙ୍କ ଭିତରେ ଥିବା ରୋଷର ଏହା ପ୍ରତିଫଳନ ବୋଲି କହିଛନ୍ତି। ମମତା କହିଛନ୍ତି, ମୋ ପାଖରେ କୌଣସି କ୍ଷମତା ନାହିଁ। ସେମାନେ ମୋ’ଠାରୁ ସବୁ କ୍ଷମତା ନେଇଯାଇଛନ୍ତି। ମାଲଦାରେ ଯାହା ଘଟିଗଲା ତାହା ବିଜେପିର କ୍ଷଡ଼ଯନ୍ତ୍ର। ପରାଜୟ ଭୟରେ ବିଜେପି ଚଳିତ ମାସ ହେବାକୁ ଥିବା ବିଧାନସଭା ନିର୍ବାଚନ ରଦ୍ଦ କରି ରାଷ୍ଟ୍ରପତି ଶାସନ ଲାଗୁ କରିବାକୁ ଚାହୁଁଛି। ନିର୍ବାଚନ ଆୟୋଗଙ୍କୁ ସମାଲୋଚନା କରି ଟିଏମ୍‌ସି ମୁଖ୍ୟ ମମତା ବାନାର୍ଜୀ କହିଛନ୍ତି ଯେ, ସେମାନେ ଆଇନ ଶୃଙ୍ଖଳା ବ୍ୟବସ୍ଥା ନିୟନ୍ତ୍ରଣ କରିବାକୁ ଚାହୁଥିଲେ, କିନ୍ତୁ ନ୍ୟାୟିକ ଅଧିକାରୀଙ୍କୁ ସୁରକ୍ଷା ଦେଇପାରି ନାହାନ୍ତି । ସୂଚନାଯୋଗ୍ୟ, ଏସ୍‌ଆଇଆର୍‌ ସମୟରେ ଭୋଟର ତାଲିକାରୁ ନାମ ବାଦ ଦିଆଯିବାକୁ ନେଇ ବୁଧବାର ମାଲଦାର କାଲିଆଛକ ୨ ବ୍ଲକ ଉନ୍ନୟନ କାର୍ୟ୍ୟାଳୟ ବାହାରେ ବିରାଟ ପ୍ରତିବାଦ ହୋଇଥିଲା। ଏହାକୁ ନେଇ ବିଜେପି ମହଲରେ ମମତାଙ୍କୁ ମଧ୍ୟ ବିରୋଧ ହୋଇଥିବା ଦେଖୁବାକୁ ମିଳିଛି । ଇତିମଧ୍ୟରେ ମମତାଙ୍କ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ମମତା ବିବାଦୀୟ ମନ୍ତବ୍ୟ ଦେଉଥିବାର ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଉକ୍ତ ଭିଡିଓ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଯଦି ଏକ ଶିବ ମନ୍ଦିର ଭାଙ୍ଗି ଦିଆଯାଏ, ତେବେ ବିଜେପି ଏହାକୁ ନେଇ କେତେ ନାଟକ ରଚନା କରେ । ସେ କ'ଣ ତାଙ୍କର ମୁଖ୍ୟ ଭୋଟରଙ୍କୁ କହୁଛନ୍ତି ଯେ ବିଜେପି କ୍ଷମତାକୁ ଆସିଲେ ସେମାନେ ମନ୍ଦିର ଭାଙ୍ଗି ପାରିବେ ନାହିଁ ? ଉକ୍ତ ୮ସେକେଣ୍ଡ ଭିଡିଓରେ ମମତା ଏକ ଶିବ ମନ୍ଦିର ଭାଙ୍ଗିବା ଏବଂ ଲୁଟ କରୁଥିବା ନେଇ କହୁଥିବାର ଶୁଣିବାକୁ ମିଳିଛି । “If a Shiva temple is demolished, how much drama BJP creates over it!” Is she telling her core voterbase that they won’t be able to break temples if BJP comes to Power? pic.twitter.com/DjwiHvhtfn — The Jaipur Dialogues (@JaipurDialogues) March 29, 2026 ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ଏଡିଟ କରି ମନ୍ଦ ଉଦେଶ୍ୟରେ ଭାଇରାଲ କରାଯାଉଥିବାର ଜଣାଯାଏ । ମୁଳ ଭିଡିଓରେ ମୂଳ ଭିଡିଓରେ କାଶୀ ବିଶ୍ୱନାଥ ପ୍ରକଳ୍ପ ଉନ୍ନତିକରଣ ସମୟରେ ଉଚ୍ଛେଦକୁ ନେଇ ବିଜେପିକୁ ସମାଲୋଚନା କରିଛନ୍ତି ମମତା । ଉକ୍ତ ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏଭଳି କୌଣସି ଖବର ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଆମର ହସ୍ତଗତ ହୋଇନଥିଲା । ଯଦି ମମତା ଏତେବଡ଼ ବିବାଦୀୟ ମନ୍ତବ୍ୟ ଦେଇଥାନ୍ତେ, ଏହା ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମର ମୁଖ୍ୟ ଖବରରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଉକ୍ତ ଦାବିନେଇ ଅଧିକ ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ପଶ୍ଚିମବଙ୍ଗର ସାମ୍ବାଦିକ ଅଗ୍ନିଶ୍ଵର ସର୍ଦାରଙ୍କୁ ଯୋଗାଯୋଗ କରିଥିଲୁ । ଉକ୍ତ ଦାବିକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ପ୍ରତ୍ୟାଖ୍ୟାନ କରିଥିଲେ ଅଗ୍ନିଶ୍ଵର । ସିଏ କହିଥିଲେ ଏହା ଅନ୍ୟୁନ୍ୟ ଗତ ମାସର ଭିଡିଓ ଅଟେ । ଏହା ଏକ ଅସମ୍ପୂର୍ଣ୍ଣ ଭିଡିଓ ଅଟେ । ତାଙ୍କ ଭାଷଣ ମୁଳ ଭିଡିଓକୁ ଦେଖିଲେ ହିଁ ପ୍ରକୃତ ସତ ଜନସାଧାରଣ ଜାଣିପାରିବେ । ଅଗ୍ନିଶ୍ଵର ଦେଇଥିବା ସୁଚନା ଅନୁଯାୟୀ ଆମେ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ୨୮ମାର୍ଚ୍ଚରେ ମମତାଙ୍କ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବାର ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ରାଣିଗଞ୍ଜର ଖଣ୍ଡରା ଫୁଟବଲ ପଡିଆରେ ଜନସାଧାରଣକୁ ଉଦବୋଧନ ବୋଲି ଭିଡିଓ ଉପରେ ଉଲ୍ଲେଖ ରହିଛି । ୪୫ ମିନିଟର ଉକ୍ତ ଲାଇଭ ଭିଡିଓରେ ମମତା ବିଭିନ୍ନ ପ୍ରସଙ୍ଗରେ ବିଜେପିକୁ ଘେରିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା ।  ଉକ୍ତ ଭିଡିଓର ଅନ୍ୟୁନ୍ୟ ୧୧:୧୭ ସମୟରେ, ଉକ୍ତ ଭାଇରାଲ ଭିଡିଓର ଅଂଶ ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଭିଡିଓରେ ମମତା କହିଛନ୍ତି, ବନ୍ଧୁଗଣ, ଯେତେବେଳେ ଗୋଟିଏ ଶିବ ମନ୍ଦିର ଭାଙ୍ଗି ଦିଆଯାଏ, ବିଜେପି ଏଥିରୁ ଏତେ ବଡ଼ କଥା ବାହାର କରେ । ମୁଁ କହୁନାହିଁ ଯେ, ଏହାକୁ ଭାଙ୍ଗିବା ଠିକ୍ କାମ । କିନ୍ତୁ ସେମାନେ କାଶୀ ବିଶ୍ୱନାଥ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବା ସମୟରେ କେତେ ମନ୍ଦିର ଭାଙ୍ଗିଥିଲେ ? ସେମାନେ ଦିଲ୍ଲୀର କାଳୀ ବାଡ଼ି ଭାଙ୍ଗି ଦେଇଥିଲେ। ସେସମୟର ବହୁ ଲୋକ ନିଜର ବ୍ୟବସାୟ ହରାଇଥିଲେ, ବୋଲି କହି ବିଜେପି ଉପରେ ବର୍ଷିଥିଲେ, ପଶ୍ଚିମବଙ୍ଗ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମମତା ବାନାର୍ଜୀ । ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ଏଡିଟ କରି ମନ୍ଦ ଉଦେଶ୍ୟରେ ଭାଇରାଲ କରାଯାଉଥିବାର ଜଣାଯାଏ । ମୁଳ ଭିଡିଓରେ କାଶୀ ବିଶ୍ୱନାଥ ପ୍ରକଳ୍ପ ଉନ୍ନତିକରଣ ସମୟରେ ଉଚ୍ଛେଦକୁ ନେଇ ବିଜେପିକୁ ସମାଲୋଚନା କରିଛନ୍ତି ମମତା ବାନାର୍ଜୀ ।

తెలుగు పోస్ట్ 3 Apr 2026 2:40 pm

Ys Jagan : రాజకీయాల్లో రాజీ ధోరణి కలసి వస్తుంది బ్రదర్...తగ్గడం తప్పు కాదు సోదరా?

వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మరోసారి పార్టీని గందరగోళంలోకి నెట్టారని పిస్తుంది

తెలుగు పోస్ట్ 3 Apr 2026 2:36 pm

సిలువ మోసిన ఎమ్మెల్యే

సిలువ మోసిన ఎమ్మెల్యే పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు టౌన్ లో

ప్రభ న్యూస్ 3 Apr 2026 2:36 pm

దివ్య సత్ప్రసాద స్థాపన..

దివ్య సత్ప్రసాద స్థాపన.. గుడివాడ, ఆంధ్రాప్రభ : గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పునీత

ప్రభ న్యూస్ 3 Apr 2026 2:33 pm

నిండుకుండలా పాకాల చెరువు

వరి పంటలకు సాగునీరు కరువు.. ఖానాపురం ఏప్రిల్ 3 (జనం సాక్షి):ఖానాపురం మండలం కొత్తూరు గ్రామం తుంగబంధం ఆయకట్టు అన్నదాతలకు పాకాల సాగునీరు అందకపోవడంతో వరి పండిస్తున్న …

జనం సాక్షి 3 Apr 2026 2:23 pm

Gas Supply |ఉత్పత్తి పెంపుకు కేంద్రం చర్యలు

Gas Supply | ఉత్పత్తి పెంపుకు కేంద్రం చర్యలు Gas Supply |

ప్రభ న్యూస్ 3 Apr 2026 2:22 pm

మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన పాలకవర్గం సభ్యులు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖమంత్రి

ప్రభ న్యూస్ 3 Apr 2026 2:22 pm

Actresses Hiking Fee despite Flops

When was the last time Pooja Hegde was seen in a Telugu film featuring a star. The actress is receiving offers despite flops but the remuneration quote is forcing the filmmakers to think of other options. The actress lost close to ten Telugu films in the past two years because of the remuneration demand. Telugu […] The post Actresses Hiking Fee despite Flops appeared first on Telugu360 .

తెలుగు 360 3 Apr 2026 2:20 pm

ధోనీ, కపిల్ దేవ్‌కు యువరాజ్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

టీం ఇండియా మాజీ ఆల్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మాజీ సారథులు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు క్షమాపణ చెప్పాలంటూ యవీ అన్నాడు. కపిల్ హయాంలో తనకు, ధోనీ హయాంలో తన కుమారుడు యువీకి అన్యాయం జరిగిందని యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఇటీవల ఓ చోట వ్యాఖ్యానించారు. భారత్‌కు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌లపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ సోషల్‌మీడియాలో అభిమానులు మండిపడ్డారు. తాజాగా దీనిపై యువరాజ్ సింగ ఓ పాడ్‌క్యాస్ట్‌లో ఇరువురు కెప్టెన్లకు క్షమాపణలు కోరాడు. ‘‘ఈ సందర్భంగా కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీకి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నా. మా నాన్న ఇచ్చిన ఇంటర్వ్యూలన చూశా. అలాంటివి నేనూ విన్నా. ఇప్పటికే పలుమార్లు ‘ఇది సరైంది కాదు’ అని చెప్పా. అందుకే, ఆయన తరఫున నేను వారిద్దరకీ క్షమాపణలు చెబుతున్నా’’ అని యువరాజ్ తెలిపాడు.

మన తెలంగాణ 3 Apr 2026 2:20 pm

అత్యంత భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే శిలువ యాత్ర

అత్యంత భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే శిలువ యాత్ర ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: గుడ్ ఫ్రైడే

ప్రభ న్యూస్ 3 Apr 2026 2:19 pm

కల్వరి చర్చిలో మిన్నంటిన ‘గుడ్ ఫ్రైడే’ వేడుకలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మానవాళి పాప విముక్తి కోసం లోకరక్షకుడైన యేసుక్రీస్తు తన

ప్రభ న్యూస్ 3 Apr 2026 2:19 pm

పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 03 జనం సాక్షి :తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని …

జనం సాక్షి 3 Apr 2026 2:18 pm

అభిమానుల కోసం ఐపీఎల్ ఫ్యాన్ పార్క్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 3: (జనం సాక్షి)ఐపీఎల్ క్రికెట్ అంటే ఇష్టపడని అభిమానులు ఉండరు. పట్టణాలలోని స్టేడియంలోకి వెళ్లి చూసి ఆనందించే అవకాశం తక్కువ మందికే …

జనం సాక్షి 3 Apr 2026 2:10 pm

‘స్వచ్ఛాయుధం’తో ప్లాస్టిక్ రహిత మచిలీపట్నం వైపు అడుగులు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా, శుభ్రంగా, పచ్చదనంతో

ప్రభ న్యూస్ 3 Apr 2026 2:10 pm

Kavitha |నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్

Kavitha | నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్ Kavitha | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 3 Apr 2026 2:06 pm

నా పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది: కవిత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. పాత పేరు..కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆడబిడ్డకు ఓటు వేయాలన్న అంశం కంటే మించిన ఎమోషన్ ఏముంటుంది? అని ప్రశ్నించింది. తమ పార్టీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందని, తమ పార్టీకి బిహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని, పునర్విభజన అయినా.. కాకపోయినా తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటుందని కవిత పేర్కొన్నారు. సిద్ధిపేట స్థానం మహిళలకు రిజర్వు కాదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గుంటనక్క మధ్య అవగాహనతో ఏం చేస్తారో? అని ప్రశ్నించారు. సిఎం ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ ను ఆగం చేసేలా ఉన్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, అమరావతి గురించి తమకు అవసరం లేదని, తాను కేసు కొట్టి వేశారంటేనే ప్రకృతి తనకు సహకరిస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ అజెండా ప్రకటించాక.. చాలా మంది పార్టీలోకి వస్తారని అన్నారు. ఆరు గ్యారెంటీల గురించి కేరళలో రేవంత్ రెడ్డి మాటలు విడ్డూరంగా ఉన్నాయని, మహారాష్ట్ర, బీహార్ లో కూడా ఇలాగే చెప్పారని..కాంగ్రెస్ ను ఓడించారని  దుయ్యబట్టారు. ప్రైవేట్ పాఠశాలలు 25 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచాయని, నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖ సిఎం వద్దే ఉన్నా.. ఫీజుల విషయంలో, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని కవిత మండిపడ్డారు.   

మన తెలంగాణ 3 Apr 2026 2:06 pm