SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

అభిషేక్, ఇషాన్ ఔట్

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అభిషేక్ శర్మ 11 బంతుల్లో పది పరుగులు చేసి అకిల్ హోస్సేన్ బౌలింగ్ లో హెట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇషాన్ కిషన్ ఆరు బంతుల్లో పది పరుగులు చేసి జోషన్ హోల్డర్ బౌలింగ్ లో హెట్ మేయర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ప్రస్తుతం క్రీజులో సంజూ శామ్సన్ లు(20), సూర్య కుమార్ యాదవ్(01)లతో బ్యాటింగ్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది.

మన తెలంగాణ 1 Mar 2026 9:27 pm

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మలిదశ తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:24 pm

అభిషేక్ శర్మ ఔట్

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా మూడు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అభిషేక్ శర్మ 11 బంతుల్లో పది పరుగులు చేసి అకిల్ హోస్సేన్ బౌలింగ్ లో హెట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్(1), సంజూ శామ్సన్ లు(19) బ్యాటింగ్ చేస్తున్నారు.  తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది.

మన తెలంగాణ 1 Mar 2026 9:18 pm

వరాహ స్వామిని వెలికి తీసిన వానరం

వరాహ స్వామిని వెలికి తీసిన వానరం భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్‌ మండలంలోని

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:15 pm

మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్

మార్చి 8 నుండి మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ఈ మెగా ఈవెంట్‌కు వేదిక కానున్న గచ్చిబౌలి హాకీ స్టేడియం మన తెలంగాణ/హైదరాబాద్: క్రీడా రంగంలో దేశంలోనే అత్యంత చురుకైన నగరంగా పేరొందిన హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా వేడుకకు వేదిక కానుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ద హాకీ (ఎఫ్‌ఐహెచ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్‌ను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించబడింది. ఈ పోటీలు ఈ నెల 8 నుండి 14 వరకు హైదరాబాద్‌లో నూతనంగా పునర్నిర్మించబడిన గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరుగనున్నాయి. క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొననున్న 8 దేశాల జట్లు ఈ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది దేశాల జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ టోర్నమెంట్ 2026 మహిళల హాకీ వరల్ కప్‌కు అర్హత సాధించేందుకు కీలకమవుతుంది. కాగా ఈ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ కోసం ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించింది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాల ఆస్ట్రో టర్ఫ్, అత్యున్నత భద్రతా ఏర్పాట్లు, క్రీడాకారులు, అధికారుల కోసం ప్రీమియం వసతి అందుబాటులో ఉంచారు. అలాగే హాకీ ఇండియా, (ఎఫ్‌ఐహెచ్) ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న జట్లు భారత జట్టు, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉరుగ్వే జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. అన్ని జట్లకు అంతర్జాతీయ ప్రమాణాల వసతి, ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించబడ్డాయి. ఈ టోర్నమెంట్ సందర్భంగా నగరానికి విచ్చేసే క్రీడాకారులు, అంతర్జాతీయ ప్రతినిధుల కోసం ప్రత్యేక వారసత్వ పర్యటనలు, వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల తెలంగాణలో అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయి. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 నిర్వహణతో హైదరాబాద్ మరోసారి ప్రపంచ క్రీడా పటంలో తన స్థానాన్ని మరింత బలపరుచుకోనుంది. ఈ సందర్భంగా అన్ని జట్లు, అధికారులు, అభిమానులను తెలంగాణ ప్రభుత్వం హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది.

మన తెలంగాణ 1 Mar 2026 9:14 pm

మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది..

మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది.. 15లోపు పట్టాలిస్తాం.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాంవెలుగుమట్ల

ప్రభ న్యూస్ 1 Mar 2026 9:09 pm

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని ఖండించిన : ఎంసిపిఐ(యు)

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇరాన్‌ను కట్టడి చేసే పేరుతో ఇజ్రాయెల్ ను ముందుంచి అమెరికా సాగిస్తున్న అకారణమైన సైనిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆప్ ఇండియా ( యూనైటెడ్) ఆలిండియా కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఎంసిపిఐ (యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఈ మేరకు హైదరాబాద్ ఓంకార్ భవన్ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈ దాడి ఇరాన్ దేశ అధ్యక్షుడు ఖమేనీ మీదనే కాకుండా వర్తమాన అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది హెచ్చరిక అని వారన్నారు. గతంలో వెనుజువెలా దేశ అధ్యక్షుడు మదురో పై దాడి చేసి అరెస్టు చేసి అమెరికా కస్టడీలో పెట్టుకొని ఆ దేశ సహజ వనరుల పై ఆధిపత్యం చెలాయిస్తున్న తీరు గమనించిన వారందరికీ అమెరికా - ఇజ్రాయెల్ జోడి యుద్ద ఉన్మాదం అర్థం అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ న్యాయ సూత్రాలను ధిక్కరించి ఇతర దేశాల సార్వభౌమత్వం లో జోక్యం చేసుకుని సాగిస్తున్న ఈ దాడులు రానున్న కాలంలో మానవ మనుగడకు పెనుముప్పు గా మారే నర ఉన్మాదం తో సాగిస్తున్న ఈ సైనిక దాడులను యావత్ ప్రపంచం, అభ్యుదయ, ప్రజా తంత్ర ప్రగతిశీల శక్తులు తీవ్రంగా ఖండిస్తూ ప్రజా ఉద్యమాలు నిర్మాణం లో ముందు వరుసలో ఉండాలని వారు పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 1 Mar 2026 9:00 pm

అగ్ని ప్రమాద బాధితునికి వృత్తి పనిముట్లు అందజేత

అగ్ని ప్రమాద బాధితునికి వృత్తి పనిముట్లు అందజేత రూ.37,116 విలువ గల పనిముట్లు

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:58 pm

రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు : మంత్రి పొన్నం

మన తెలంగాణ / హైదరాబాద్ : రోడ్డు రవాణా శాఖ పై తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఆర్‌టిసి నియామకానికి, ఆర్‌టిసికి ఎలాంటి సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌టిసి నియామకాలు పోలీసు రిక్రూట్మెంట్ సెల్ పరిధిలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. డ్రైవర్‌కు 6 అడుగులు అనే తప్పుడు ప్రచారం సరికాదని ఆయనన్నారు. డ్రైవర్ పోస్ట్‌కు మోటారు వాహన చట్టం ప్రకారం 5.3 అడుగులు(160 సెంటిమీటర్లు) ప్రామాణికమని తెలిపారు. టికెట్ యాప్‌లో ఎలాంటి సమస్యలు లేవని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మనుకోకపోతే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

మన తెలంగాణ 1 Mar 2026 8:56 pm

ఆయిల్ ఫామ్ రైతులకు మహర్దశ

ఆయిల్ ఫామ్ రైతులకు మహర్దశ టన్ను గెలలు ధర 21,546 దమ్మ పేట,

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:50 pm

టీమిండియా లక్ష్యం: 196

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. భారత మందు 196 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.  విండీస్ బ్యాట్స్ మెన్లు రోస్టన్ చేజ్(40), రోవన్ పావెల్(34 నాటౌట్), జెసన్ హోల్డర్(37 నాటౌట్), సాయి హోప్(32), సిమ్రాన్ హెట్ మెయిర్ (27) పరుగులు చేసి ఆలౌటయ్యారు. షెర్ఫన్ రూథర్ పోర్డు (14) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రోవన్ పావెల్(03), రోమారియో జెషన్ హోల్డర్ (6) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి, హార్ధిక్ పాండ్యా చెరో ఒక వికెట్ తీశారు. 

మన తెలంగాణ 1 Mar 2026 8:48 pm

Nani stuns with his bulky transformation for The Paradise

Natural Star Nani has been pushing the boundaries for each of his film. His script choices and performance has made him a huge star in Telugu Cinema. Now, the actor is working with Srikanth Odela, who delivered mass cult actioner, The Paradise. The transformation to play Jadal in the film is shocking everyone. He released […] The post Nani stuns with his bulky transformation for The Paradise appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 8:39 pm

బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ప్రవేట్ బిల్లు పెట్టాలి

రెండు రాజ్యసభ స్థానాలు బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకివ్వాలి ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలి రాహుల్ గాంధీకి జాజుల శ్రీనివాస్ గౌడ్ బహిరంగ లేఖ మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టాలని బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీకి బిసి డిమాండ్లపై శ్రీనివాస్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన జరిగి, జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి చట్టబద్ధంగా దక్కాలన్న రాహుల్ గాంధీ నినాదాన్ని, ఆచరణలో చూపించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సామాజిక న్యాయానికి ఒక మోడల్ గా చేయాలని ఆయన రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. అతి త్వరలో భర్తీ చేయబోయే రెండు రాజ్యసభ స్థానాలలో ఒకటి బిసికి, రెండవది ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి సంబంధం లేని వారిని, ఇప్పటికే తమ జనాభా దామాషా కంటే ప్రాతినిధ్యం ఎక్కువగా రాజకీయంగా ఉన్న అగ్రకులాలకు అవకాశం ఇవ్వకుండా బిసిలకే ఇవ్వాలని ఆయన కోరారు. కామారెడ్డి బిసి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించే నామినేటెడ్ పోస్టుల్లో, ప్రభుత్వ కాంట్రాక్టులలో, రాష్ట్ర బడ్జెట్ లో, అన్ని స్థాయిల్లోనూ తెలంగాణలో జరిగిన కులగణన ఆధారంగా బిసిలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాదిమంది ఉన్నత విద్యను అభ్యసించే పేద బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, ఈబిసి విద్యార్థులకు స్కాలర్షిప్ లు, ఫీజుల రియింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ఆదేశించాలని ఆయన కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకుల ఆధిపత్య వర్గాల దాడిలో రెండు నెలల పసికందు మరణించిన విషయంలో రాహుల్ గాంధీ తక్షణమే జోక్యం చేసుకొని నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని, బిసి కుటుంబాలను ఆదుకోవాలని, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా బిసి రక్షణ చట్టం తేవాలని జాజుల డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 1 Mar 2026 8:39 pm

CIJ Visit : వావ్ ..సూర్య‌చంద్రోద‌యం Andhra Prabha News

CIJ Visit : వావ్ ..సూర్య‌చంద్రోద‌యం Andhra Prabha News హైకోర్టు జ‌డ్జీల

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:37 pm

వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటాం

వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటాం మార్చి 15 నాటికి బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:31 pm

కళలు, సంస్కృతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

దేవాలయాలు, టూరిజం, కల్చర్ తో యాక్షన్ ప్లాన్ డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఎల్బీ స్టేడియంలో ఘనంగా రామదాసు జయంతి ఉత్సవాలు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కళలు, సంస్కృతికి పెద్దపీట వేస్తోందని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో రామదాసు జయంతి ఉత్సవాలలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నేల గర్వించదగ్గ గొప్ప వాగ్గేయకారుడు, భద్రాచల రామదాసు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని కళాకారులకు, సాంస్కృతిక వైభవానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అనేక విజయాలను రాష్ట్ర అభివృద్ధి గురించి సంగీత నాటక అకాడమీ ఆధ్యర్యంలో అనేక కార్యక్రమాలతో ప్రజలకు వివరించారు. కళారూపాల్లో ప్రజలు పాల్గొనడంతో పాటు స్పందించిన తీరు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సంగీత నాటక అకాడమీ విరివిగా కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ముందుంటుందని, అవసరమైన ఆర్థిక అవసరాలను తీరుస్తామని డిప్యూటి సిఎం భరోసా ఇచ్చారు. నేలకొండపల్లిలో జన్మించిన గోపన్న తన భక్తితో, కీర్తనలతో భక్త రామదాసుగా చిరస్థాయిగా నిలిచిపోయారని భట్టి విక్రమార్క కొనియాడారు. ఆయన కట్టిన భద్రాచలం ఆలయం, రాసిన కీర్తనలు ప్రతి తెలుగువారి గుండెల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మన ప్రాంత వాగ్గేయకారుల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఇటువంటి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. చైతన్యానికి కళలే ఆయువు పట్టని, తెలంగాణ గ్రామాల్లోని ప్రతి సమస్యకు కళారూపాల ద్వారానే పరిష్కారాన్ని, చైతన్యాన్ని తీసుకువచ్చిన చరిత్ర మనదని డిప్యూటి సిఎం గుర్తుచేశారు. కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రజలను జాగృతం చేసేందుకు కళలు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప వంటి ప్రపంచ వారసత్వ కట్టడాలు, రాష్ట్రంలోని పురాతన ఆలయాలను కలుపుతూ పర్యాటకం, సంస్కృతి మేళవించిన ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంగీత నాటక అకాడమీని ఆయన ఆదేశించారు. కళల పట్ల ప్రజలకు ఉన్న మక్కువ చూస్తుంటే సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.

మన తెలంగాణ 1 Mar 2026 8:27 pm

చింతకాని వాగులో విష్ణుమూర్తి విగ్రహం లభ్యం

చింతకాని వాగులో విష్ణుమూర్తి విగ్రహం లభ్యం కాటారం,ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:22 pm

నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్

కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విండీస్ 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.  విండీస్ బ్యాట్స్ మెన్లు రోస్టన్ చేజ్(40), సాయి హోప్(32), సిమ్రాన్ హెట్ మెయిర్ (27) పరుగులు చేసి ఆలౌటయ్యారు. షెర్ఫన్ రూథర్ పోర్డు (14) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రోవన్ పావెల్(03), రోమారియో జెషన్ హోల్డర్ (6) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 

మన తెలంగాణ 1 Mar 2026 8:20 pm

వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ

వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆత్మ

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:16 pm

100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ

100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రయాణానికి ప్రాణం నిత్య శాఖ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:12 pm

6వ వార్డ్ లో మున్సిపల్ పనుల పరిశీలన

6వ వార్డ్ లో మున్సిపల్ పనుల పరిశీలన లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:10 pm

చరిత్రలోనే గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు

ఎన్‌పిడిసిఎల్ చరిత్రలోనే గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌పిడిసిఎల్) చరిత్రలోనే ఆదివారం అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,267 మెగావాట్లు నమోదయినట్లు సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. శనివారం నమోదైన 6,057 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను అధిగమిస్తూ, ఆదివారం 6,267 మెగావాట్లకు చేరుకోవడం ఎన్‌పిడిసిఎల్ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఇది సంస్థ ముందస్తుగా తీసుకున్న ప్రణాళికాబద్ధమైన చర్యల ఫలితమని ఆయన స్పష్టం చేశారు. రోజు రోజుకు ఎండలు పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. డిమాండ్ పెరిగినా ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ నిరంతర పర్యవేక్షణ, దిశానిర్దేశంతో వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే వేసవిలో డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకు సంస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నామని సిఎండి వివరించారు.

మన తెలంగాణ 1 Mar 2026 8:08 pm

స్వామి గౌడ్ దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే

స్వామి గౌడ్ దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 1 Mar 2026 8:02 pm

Wedding Celebrations Begin in Allu Family

Mega Producer Allu Aravind’s younger son Allu Sirish is all set to get married and the wedding will be a restricted ceremony and it will witness family members and close friends. The wedding celebrations have begun today in the residence of Allu Aravind. The Pelli Koduku ceremony took place today in the presence of family. […] The post Wedding Celebrations Begin in Allu Family appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 7:59 pm

రెండేళ్లు పూర్తి చేసుకున్న సిఎం ప్రజావాణి

74 శాతం సక్సెస్ రేటు ఇంచార్జ్ చిన్నా రెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి ప్రజావాణి ప్రజల సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తోందని ఇంచార్జ్ చిన్నా రెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతుండడంతో రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు భారీ ఎత్తున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న సిఎం ప్రజావాణికి తరలివస్తున్నారన్నారు. సుమారు 25 నెలల క్రితం ప్రారంభమైన సిఎం ప్రజావాణి ప్రతి వారంలో మంగళ, శుక్రవారాలలో నిర్వహిస్తూ ఇప్పటివరకు 24 సెషన్స్ పూర్తి చేసుకుందని తెలిపారు. రెండేళ్ల కాలంలో సిఎం ప్రజావాణిలో మొత్తం ఒక లక్షా 12 వేల 245 దరఖాస్తులు నమోదు కాగా, అందులో 64 వేల 558 దరఖాస్తులు పరిగణలోకి తీసుకొని 47 వేల 935 దరఖాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు. మిగిలిన 47, 687 దరఖాస్తులు ప్రభుత్వ పథకాలు, విధానపరమైన ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాల్సినవి కావడం, ఉద్యోగాల కోసం సంబంధించినవి ఉన్నట్లు వెల్లడించారు. వీటిని పరిష్కరించాలని కోరుతూ సంబంధిత శాఖలకు సిఫార్సు చేశామన్నారు. సిఎం ప్రజావాణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారం 74 శాతం మేరకు ఉండడంతో ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందని, ప్రజల్లో భరోసా పెరిగిందని, దీంతో వారంలో రెండు రోజులు సుమారు వేయి దరఖాస్తులు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. గల్ఫ్ లోని ఏడు దేశాలు సహా ఇతర దేశాలలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిఎం ప్రవాసి ప్రజావాణి కేంద్రాన్ని కూడా ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజావాణిలో దరఖాస్తులు రాసి ఇచ్చేందుకు హెల్ప్ డెస్క్, ప్రతి శాఖ నుంచి అధికారులతో ప్రత్యేక డెస్కులు, వైద్య సహాయం కోసం మెడికల్ క్యాంపు, వృద్ధులు దివ్యాంగుల రవాణా కోసం బ్యాటరీ బగ్గి, వీల్ చైర్స్, అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్, ప్రజలకు మంచినీటి సౌకర్యం, జీ.హెచ్.ఎం.సీ. ఆర్థిక సహకారంతో హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా ఐదు రూపాయల భోజనం వంటివి ప్రజావాణిలో కల్పించినట్లు తెలిపారు. సిఎం ప్రజావాణి రానున్న రోజుల్లో పరిష్కార శాతాన్ని మరింత మెరుగు పర్చేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 1 Mar 2026 7:58 pm

Vajpayee |ఖమ్మం సభలో సంచలన వ్యాఖ్యలు

Vajpayee | ఖమ్మం సభలో సంచలన వ్యాఖ్యలు కులం కంటే గుణమే మిన్న..

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:58 pm

ఉప్పరపల్లిలో 800 ఏళ్ల శివాలయానికి పునర్జీవం

సర్పంచ్ గీత అమరేందర్ రెడ్డి కృషిని కొనియాడిన డా. ఈమని శివనాగిరెడ్డి

తెలుగు పోస్ట్ 1 Mar 2026 7:55 pm

ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం

ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:55 pm

మహిళల భద్రత గాలికి..

మహిళల భద్రత గాలికి.. హామీల అమలులో ప్రభుత్వం విఫలంఅభయహస్తం హామీలు ఏమయినట్లు?మాలగురుజాల సదస్సులో

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:34 pm

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన నటి రష్మిక

రేవంత్ ఫ్యామిలీతో గడపడం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన రష్మిక ఆదివారం సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ నెల 4న నగరంలో జరుగనున్న విజయ్ దేవరకొండ,- రష్మిక వివాహ రిసెప్షన్‌కు సిఎం కుటుంబసభ్యులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కుటుంబ సభ్యులతో ఆమె కొద్దిసేపు ఆప్యాయంగా గడిపారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. సిఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన అర్ధాంగి గీత, ఆయన కుమార్తె నైమిషలను కలవడం చాలా సంతోషంగా ఉందని రష్మిక పేర్కొన్నారు. వారితో గడిపిన సమయం, జరిపిన సంభాషణలు చాలా మధురంగా సాగాయని తెలిపారు. ఈ కలయికలో సిఎం అర్ధాంగి గీత, రష్మికకు ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఆ గిఫ్ట్ పట్ల మురిసిపోయిన రష్మిక, ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత ఇచ్చిన బహుమతి చాలా అందంగా ఉందని, దీన్ని తాను కచ్చితంగా ఏదైనా అత్యంత ప్రత్యేకమైన సందర్భంలో ధరిస్తాను అని రష్మిక పేర్కొన్నారు.

మన తెలంగాణ 1 Mar 2026 7:33 pm

స్వర్ణకారులు అన్ని రంగాల్లో ఎదగాలి…

స్వర్ణకారులు అన్ని రంగాల్లో ఎదగాలి… స్వర్ణకార సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:29 pm

దేవస్థానం అభివృద్ధికి ధర్మకర్తలు కృషి చేయాలి…

దేవస్థానం అభివృద్ధికి ధర్మకర్తలు కృషి చేయాలి… నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ఉభయ నాగేశ్వర

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:24 pm

సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం అండగా ఉంటంది మంత్రి శ్రీధర్ బాబు మనతెలంగాణ/హైదరాబాద్ : కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపం వల్లనే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబు కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి... అక్కడి రాజ శ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందని అన్నారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అసలు విషయం తెలిసిన వెంటనే శారదా పీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకొని కొందరు బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమది బుల్డోజర్ సంస్కృతి కాదని, కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడటం చూసి ఓర్వలేకే కొందరూ తమపై కావాలనే బురద చల్లుతున్నారని మండిపడ్డారు. బాపు ఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని స్థానికులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 1 Mar 2026 7:23 pm

ప్రభుత్వమే దాడి చేయించింది…

ప్రభుత్వమే దాడి చేయించింది… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రభుత్వం సినీఫక్కీలో పోలీసులతో కలిసి

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:20 pm

అంగన్‌వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం…

అంగన్‌వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం… పాయకాపురం, ఆంధ్ర ప్రభ : అంగన్‌వాడీలకు అండగా

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:17 pm

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనారంభం

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనారంభం వేద మంత్రోచ్చారణల నడుమ అంకురార్పణ, అభిషేకాలతో

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:09 pm

నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ జైనూర్,ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 1 Mar 2026 7:03 pm

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత జట్టు

హైదరాబాద్: టి20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా సూపర్ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.  భారత జట్టు: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకేల్ హోసేన్, గుడాకేష్ మోతీ, షమర్ జోసెఫ్

మన తెలంగాణ 1 Mar 2026 6:58 pm

కోగంటి సరోజినికి నివాళులు…

కోగంటి సరోజినికి నివాళులు… కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : ఇటీవల మృతి చెందిన కోగంటి

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:55 pm

రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాల పంపిణీ

రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాల పంపిణీ మునుగోడు,ఆంధ్రప్రభ: రైతులకు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:52 pm

భారత చట్టాలపై అవగాహన : సిఐ శ్రీ హర్ష

భారత చట్టాలపై అవగాహన : సిఐ శ్రీ హర్ష రాప్తాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:52 pm

ఇరాన్, గల్ఫ్‌లో తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రేవంత్

సిఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ సూచన మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఇరాన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుందని అన్నారు. ఇరాన్ మరియు ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తున్నదని తెలిపారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఆయా దేశాల్లో ఉన్న భారత ఎంబసీలు, కాన్సులేట్‌తోనూ సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జాగ్రత్తగా ఉండండిః మహేష్ కుమార్ గౌడ్ ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగువారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు సూచించారు. అక్కడ పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి చెందిన కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత యుద్ధ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మిసైల్ దాడుల భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన కోరారు. యుద్ధ ప్రభావంతో కొన్ని చోట్ల విమానాశ్రయ సేవలు అంతరాయం కలిగినట్లు సమాచారం అందుతోందని, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు కార్మికులు, ముఖ్యంగా తెలంగాణకు చెందిన వారు ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు వస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ గారు ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకుని తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. యూఏఈ, ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని, భారత రాయబార కార్యాలయాలతో నిరంతర సంబంధం కొనసాగించాలని సూచించారు.

మన తెలంగాణ 1 Mar 2026 6:31 pm

సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి

సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి విజయవాడ, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:28 pm

ప్రేమ పెళ్లి: భార్యను హత్య చేసిన భర్త

నల్గొండ: వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆ మురిపెం పట్టుమని మూడు నెలలు కూడా ఉండలేదు. ఏమైందో తెలియదు కానీ, భార్యని భర్త దారుణంగా హత్య చేసి చంపేశాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం గూడూరులో చోటు చేసుకుంది. భర్త తవీర్ భార్య మనీషా చారును దారుణంగా హత్య చేశాడు. మూడు నెలల క్రితమే మనీషా-తవీర్‌లు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం మనీషా-తవీర్‌ దంపతులు ఒడిశా నుంచి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. గూడూరులోని ఓ ఇటుక బట్టీలో వీరిద్దరు పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మన తెలంగాణ 1 Mar 2026 6:27 pm

వైభవంగా ఎదురుకోల ఉత్సవం

వైభవంగా ఎదురుకోల ఉత్సవం గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మండలంలోని నెమలి

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:15 pm

Operation Ajai 2.0 ఇండియా రెడీ Andhra Prabha Spl News

Operation Ajai 2.0 ఇండియా రెడీ Andhra Prabha Spl News (ఆంధ్ర‌ప్ర‌భ‌,

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:14 pm

అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం

అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం పటమట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు,

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:13 pm

30 years |గ్రామ మ‌లుపు వ‌ద్ద‌…

30 years | గ్రామ మ‌లుపు వ‌ద్ద‌… 30 years | ఇంద్రవెల్లి,

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:11 pm

సైన్స్ ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచుతాయి

తిరువూరు, ఆధ్రప్రభ : పాఠశాలల్లో తరచు సైన్సు ప్రదర్శనలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:10 pm

UBS: Pawan Kalyan to rock with his swag

Power Star Pawan Kalyan and Harish Shankar have formed a cult combination with the blockbuster, Gabbar Singh. The movie gave the Power Star, a big break from underperformers. Hence, audiences have been waiting for his next collaboration with Harish Shankar from long time and Ustaad Bhagat Singh is releasing soon. Exactly in 25 days, the […] The post UBS: Pawan Kalyan to rock with his swag appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 6:04 pm

టీచర్ల జీతాలపై విద్యాకమిషన్ నివేదిక..

టీచర్ల జీతాలపై విద్యాకమిషన్ నివేదిక.. రాబోయే తరానికి ప్రమాద సూచిక.ఉపాధ్యాయుల కొరత ఏర్పడి

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:59 pm

supreme leader |కౌన్సిల్‌ చేతికి పగ్గాలు

supreme leader | కౌన్సిల్‌ చేతికి పగ్గాలు ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:57 pm

Decades |మోదుగు చెట్టుకి హొలీ పువ్వు…

Decades | మోదుగు చెట్టుకి హొలీ పువ్వు… మోత్కూర్ లో హొలీ, శ్రీ

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:52 pm

ఆర్‌టిసి బస్సు - కారు ఢీ.. ముగ్గురు మృతి

అనంతపురం: ఆర్టిసి బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గువనపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ముదిగలకు చెందిన చెల్లెలు చంద్రకళ(32), తన సోదరులు శివకుమార్(36), హనుమంత రాయుడు(40) కారులోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం నుంచి రాయదుర్గానికి వెళ్తున్న ఆర్టిసి బస్సు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. కర్ణాటకలోని మొలకల్మూర్‌లో జరిగే వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డిఎస్పి రవిబాబు, సిఐ హరినాథ్ తమ సిబ్బందితో సంఘటన స్థలికి వెళ్లి పరిశీలించారు. మృతదేహఆలను పోస్టుమార్టం నిమిత్తం కలంద్రం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మన తెలంగాణ 1 Mar 2026 5:45 pm

Ram Charan begins dubbing for most anticipated Peddi

Mega Power Star Ram Charan has officially kickstarted the dubbing process for his highly anticipated sports drama, Peddi. As the film moves into its crucial post-production phase, the actor shared a light-hearted and candid video from the dubbing studio alongside director Buchi Babu Sana. In a humorous exchange, Ram Charan was seen playfully teasing the […] The post Ram Charan begins dubbing for most anticipated Peddi appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 5:41 pm

బీసీ మహాధర్నాను విజయవంతం చేయాలి

సూర్యాపేట (జనంసాక్షి): ఈ నెల 2న హైదరాబాదులో జరిగే బిసి మహాధర్నాను విజయవంతం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నల్గొండ …

జనం సాక్షి 1 Mar 2026 5:14 pm

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు భూమి పూజ

మునుగోడు, ఆంధ్రప్రభ : మునుగోడు పట్టణంలోని దుబ్బ కాలువ రోడ్డులో రూ.200 కోట్ల

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:14 pm

Indian |ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గించాలి

Indian | ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గించాలి చర్చల ద్వారా చేసక్కటి పరిష్కారం..యుద్ధం సమస్యలకు

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:11 pm

Workshop |ప్రాచీన కళలు మానసికోల్లాసానికి వారధులు..

Workshop | ప్రాచీన కళలు మానసికోల్లాసానికి వారధులు.. ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ డా.

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:07 pm

నవాబుపేటలో మాదిగ అమరవీరులకు నివాళులు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని నవాబుపేటలో మాదిగ అమరవీరులకుఎమ్మార్పీఎస్ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:06 pm

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:01 pm

అమరవీరులకు ఘనంగా నివాళ్ళు

అమరవీరులకు ఘనంగా నివాళ్ళు ప‌ర‌కాల‌, ఆంధ్రప్రభ : పట్టణంలోని అమరధామంలో మాదిగ అమరవీరులకు

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:56 pm

4thMarchHoli |గ్రహణం రోజున హోలీ పండుగ జరుపుకోవడం ఎందుకు శుభం కాదు?

4thMarchHoli | గ్రహణం రోజున హోలీ పండుగ జరుపుకోవడం ఎందుకు శుభం కాదు?

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:48 pm

మృతురాలికి నివాళులు..

మృతురాలికి నివాళులు.. పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన మృతురాలి

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:35 pm

కచ్చితమైన డేటా సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి..

కచ్చితమైన డేటా సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.. విజయవాడ, ఆంధ్రప్రభ : జనగణన విధులను

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:29 pm

భీకర యుద్ధం.. పాకిస్థాన్-ఇంగ్లండ్ క్రికెట్ సిరీస్ రద్దు

అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడులకు ఇరాన్‌ కూడా ప్రతి దాడులు చేస్తుంది. ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం ఖమేనీ మరణించారు. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ యుద్ధం ప్రభావం ఓ క్రికెట్ సిరీస్‌పై పడింది. పాకిస్థాన్ షాహీన్స్‌తో (ఎ జట్టు), జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ని ఇంగ్లండ్ లయన్స్ (ఎ జట్టు) రద్దు చేసుకుంది. నిజానికి ఈ సిరీస్ అబుదాబీ వేదికగా జరగాల్సి ఉంది. కానీ, అమెరికా ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా ఇరాన్ అబుదాబీపై దాడులు చేస్తోంది. దీంతో ఇంగ్లండ్ లయన్స్ జట్టు మరియు సపోర్ట్ స్టాఫ్ అక్కడే చిక్కుకుపోయారు. అయితే భారతకాలమానం ప్రకారం మార్చి 1న ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ లయన్స్-పాకిస్థాన్ షాహీన్స్ మధ్య రెండో వన్డే జరగాల్సి ఉండింది. అయితే భద్రతా కారణఆల వల్ల ఈ మ్యాచ్‌తో పాటు మిగతా సిరీస్ మొత్తం రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. ‘‘జట్టు భద్రత మా ప్రాధాన్యం పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నాం’’ అని ఇసిబి ఓ ప్రకటనలో పేర్కొంది. 

మన తెలంగాణ 1 Mar 2026 4:27 pm

వైరా మున్సిపాలిటీకి ‘చికిత్స’ అవసరం

వైరా మున్సిపాలిటీకి ‘చికిత్స’ అవసరం వైరా, ఆంధ్రప్రభ : నూతనంగా వైరా మున్సిపాలిటీ

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:18 pm

స్నేహితురాలికి భరోసా కల్పించిన మిత్ర బృందం..

స్నేహితురాలికి భరోసా కల్పించిన మిత్ర బృందం.. చిట్యాల, ఆంధ్రప్రభ : తనతో పాటు

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:11 pm

Andhra Prabha Smart Edition|TS|మూసీ తీరంలో/ఖమేనీ హతం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 01-03-2026, 4.00PM ts ఖమేనీ హతం..అమెరికా, ఇజ్రాయెల్​

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:11 pm

అమర వీరుల త్యాగాల వలనే ఎస్సి వర్గీకరణ

అమర వీరుల త్యాగాల వలనే ఎస్సి వర్గీకరణ దండేపల్లి, ఆంధ్రప్రభ : మాదిగ

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:11 pm

అమ్మ‌వారి ఉత్సవాలను జయప్రదం చేయాలి..

అమ్మ‌వారి ఉత్సవాలను జయప్రదం చేయాలి.. ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఏప్రిల్ మూడవ వారంలో

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:10 pm

Andhra Prabha Smart Edition |AP|ఖమేనీ హతం/సెమీస్​ ఆశలు..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 01-03-2026, 4.00PM ap ఖమేనీ హతం, విండిస్​ ఫైట్​..

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:07 pm

అన్ని ఏఐ అంటావ్.. నిజం ఒప్పుకో

అన్ని ఏఐ అంటావ్.. నిజం ఒప్పుకో బీఆర్‌ఎస్ కార్యకర్తల కష్టాన్ని మరిచిపోయావురాజ్యాంగాన్ని కించపరిస్తే

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:05 pm

చింతపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో వివాదం..

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా చింతపల్లి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:04 pm

ప్రజా ప్రభుత్వం కాదు.. పేదల వ్యతిరేక ప్రభుత్వం: రామచందర్ రావు

ఖమ్మం: వెలుగుమట్లలోని భూదాన్ భూములను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పరిశీలించారు. భూనిర్వాసితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారని మండిపడ్డారు. ‘‘భూదాన్ బోర్డు పట్టాలున్న పేదల ఇళ్లను కూల్చివేశారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. పేదల వ్యతిరేక ప్రభుత్వం. పేదల ఇళ్లు కూలగొట్టి ఏం సాధించారు? బాధితుల పక్షాన బిజెపి పోరాడుతుంది. కూల్చిన చోట పేదల 100 గజాలలో ఇల్లు నిర్మించి ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పేదలను పంపించేస్తున్నారు’’ అని ఆరోపించారు.

మన తెలంగాణ 1 Mar 2026 3:31 pm

పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీల‌న‌…

పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీల‌న‌… 20 ప్రత్యేక టీమ్స్ తో పర్యవేక్షణశానిటేషన్ సిబ్బంది

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:27 pm

ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ: కడెం మండలంలోని ఏలగడప గ్రామంలో గల శ్రీ

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:23 pm

world cup|ఇంటికా.. సెమీస్‌కా..?

world cup| ఇంటికా.. సెమీస్‌కా..? నేడు భార‌త్‌, వెస్టిండీస్ ఢీకోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:21 pm

ఫలించిన సాధన కమిటీ కృషి..

ఫలించిన సాధన కమిటీ కృషి.. పట్టణానికి మణిహారం కానున్న అర్బన్ ప్రైమరీ హెల్త్

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:20 pm

6,432 hectares |ఆశాజనకంగా రబీ పంటల సాగు

6,432 hectares | ఆశాజనకంగా రబీ పంటల సాగు ఖరీఫ్ కంటే మెరుగైన

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:10 pm

విద్యా కమిషన్ సిఫారసులు ఆక్షేపణీయం

విద్యా కమిషన్ సిఫారసులు ఆక్షేపణీయం ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆకునూరి మురళి అధ్యక్షతన ఏర్పాటు

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:09 pm

war| 400 విమానాలు ర‌ద్దు

war| 400 విమానాలు ర‌ద్దు ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:03 pm

సయ్యద్ సేవానిరతికి సముచిత సత్కారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మందనపల్లి లోని ప్రభుత్వ పాఠశాల

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:01 pm

నేర నివారణే లక్ష్యంగా..

నేర నివారణే లక్ష్యంగా.. జిల్లా లో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన

ప్రభ న్యూస్ 1 Mar 2026 2:59 pm

శతకాలతో చెలరేగిన అలీసా, మూనీ.. భారత తడబాటు

హోబార్ట్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హోబార్ట్ వేదికగా భారత మహిళ జట్టుతో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళ జట్టు భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆసీస్ కెప్టెన్ అలీసా హేలీ ఉతకి ఆరేసింది. 98 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సులతో 158 పరుగులు చేసింది. కీపర్ బెత్ మూనీ 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సుతో 106 పరుగులు చేసింది. జార్జియా వోల్ (62), నికోలా క్యారీ (34) రాణించారు. దీంతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. అయితే ఈ భారీ లక్ష్య చేధనలో భారత్ 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ (21), హర్లిన్ డియోల్ (14) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ మరో 301 పరుగులు చేయాలి. 

మన తెలంగాణ 1 Mar 2026 2:50 pm