క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికతల ప్రతీక రంజాన్
ప్రతి పండుగ వెనుకా పరమార్థం ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, చరిత్ర గతి మార్చిన వీరులను స్మరించుకోవడం పర్వదినాల్లో సర్వసామాన్య అంశం. వీటితోపాటు మనిషికి క్రమశిక్షణ నేర్పి, ధర్మాన్ని, దయాగుణాన్ని ప్రబోధించే పండగలు కూడా ఉన్నాయి. వాటిలో రంజాన్ ఒకటి. ముస్లింలకు అతి పెద్ద పండగ ఇది. ఇస్లాం ధర్మానికి మూలమైన ఖురాన్ రంజాన్ నెలలో అవతరించింది. ఈ పండుగ వెనక మానసిక, శారీరక వికాసం వంటి మరెన్నో ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి. నెలవంక దర్శనంతో మొదలై, మళ్లీ నెలవంక దర్శనంతోనే ముగిస్తుంది. మానవాళి అంతా.. బాగుండాలని కోరుకునే పండగనే రంజాన్. ముస్లింల పవిత్ర పండగైనప్పటికీ అందులో సమాజానికి సేవ చేయాలనే సంకల్పం ఆచరణ కన్పిస్తుంది. పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. ‘పండుగ’ మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ‘రంజాన్’ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘రంజాన్’ మాసం. రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు, సంపన్నులైనవారు రంజాన్ నెలలో ‘జకాత్ ’ అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని ‘జకాత్’అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30% చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితోపాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ‘జకాత్’ ఉపయోగపడుతుంది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ఉపవాసవ్రతం’. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘రోజా అని అంటారు. రోజా అనే ఉపవాస దీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. సుమారు నెలరోజులకు పైగా ఉపవాస దీక్షలు చేయడం వల్ల సమాజంలో ఆకలి విలువను తెలుసుకోవడాని రోజాను పాటిస్తారు. అలాగే రంజాన్ నెల మాసంలో కుల, మత భేదాలు లేకుండా ఇఫ్తార్ విందులు. ఈ విందులు పరస్పర ఆత్మీయతకు దోహదపడేలా.. విశాల ఆలోచన దృక్పథానికి నిదర్శణం నిలుస్తుంది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ఉపవాసవ్రతం’. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘రోజా’ అని అంటారు. సౌమ్ అని పిలుస్తారు. రంజాన్ నెల అంతా పవిత్ర కార్యక్రమాలతో ముగుస్తూనే ‘షవ్వాల్’ నెలవంక ప్రత్యక్షమవుతుంది. ఈ నెలవంక దర్శనమిస్తేనే ముస్లిం సోదరులు ఉపవాస వ్రతాన్ని విరమించి మరుసటి రోజు ‘రంజాన్ ’ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, సంతోషానందాలతో జరుపుకుంటారు. ‘షవ్వాల్’ నెల మొదటి రోజున జరుపుకునే రంజాన్ పండుగను ‘ఈదుల్ఫితర్’ అని అంటారు. మానవహితాన్ని, పరస్పర సోదర భావాన్ని, ఎదుటి వారి బాధలను అర్థం చేసుకొని వారికి అండగా ఉండేలా మానవ సమాజహితాన్ని ఆకాంక్షిస్తుంది. అలాగే ఈ ఇఫ్తార్ విందుతో అంటరానితనం దూరం చేసే ఆలోచన.. అందరూ సమానమనే భావన ముడిపడి ఉంది. అందుకు మనం జాతీయ ఉద్యమ నాయకుడు మౌలానా హస్రత్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విప్లవం వర్ధిల్లాలి, సంపూర్ణ స్వాతంత్య్రం వంటి నినాదాలు భారత జాతియోద్యమ చరిత్రను మహత్తర మలుపు తిప్పినట్టు అందరికీ తెలుసు. వీటిని రూపొందించిన సుప్రసిద్ధ ఉర్దూ కవి, జాతియోద్యమ నాయకుడు మౌలానా హస్రత్ మోహానీ గురించి మాత్రం ఈ తరంలో చాలా మందికి తెలిసివుండకపోవచ్చు. దళిత్- ముస్లిం ఇఫ్తార్ సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది ఆయనే. అంబేడ్కర్ చేతితోఇచ్చిన నీళ్లను ముట్టుకోవడానికి కూడా జాతీయోద్యమ మహానాయకులు సైతం వెనుకాడుతున్న కాలం అది. అప్పుడు మౌలానా హస్రత్ మోహానీ ఇఫ్తార్ విందుకు అంబేద్కర్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఒకే పళ్లెంలో ఆయనతో కలిసి భోజనం ఆరగించారు. అటువంటి సమానత్వాన్ని, ఆకలి బాధలు, దాతృత్వాన్ని చాటి చెప్పే గొప్ప పండగ రంజాన్.. హస్రత్ మెహనీ చూపిన మార్గం.. ఆ సాంప్రదాయం భవిష్యత్తులో కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - సంపత్ గడ్డం, 78933 03516
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు..
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు.. ఘంటసాల, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని
పర్యాటక కేంద్రాలను టార్గెట్ చేస్తాం: ఇరాన్
టెహ్రాన్: గల్ఫ్ దేశాలకు ఇరాన్ మరోసారి హెచ్చరికలు పంపింది. గల్ఫ్లోని పర్యాటక కేంద్రాలను టార్గెట్ చేస్తామని హెచ్చరించింది. పార్కులు, వినోద కేంద్రాలు, టూరిస్ట్ డెస్టినేషన్స్పై దాడులు చేస్తామని ఇరాన టాప్ మిలిటరీ కమాండర్ జనరల్ షెకార్చి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న టూరిజంను దెబ్బకట్టే ప్లాన్ లా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ నివాస సముదాయాలనూ టార్గెట్ చేసే అవకాశం ఉంది. బాగ్దాద్లోని అమెరికన్ ఎంబసిపై మరోసారి దాడులు చేశారు. ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. పశ్చిమ యుద్ధం అత్యంత భీకర రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఆయా దేశాల్లోని సైనిక, వైమానిక, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యక్తులనే లక్ష్యంగా చేసుకున్న ఇరు పక్షాలు తాజాగా ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇజ్రాయె ల్ తన కీలక సహజ వాయు క్షేత్రంపై దాడి చేసిన నేపథ్యంలో, ఇరాన్ ప్రతీకార చర్యల ను మరింత ముమ్మరం చేసింది. గల్ఫ్ ప్రాంతంలోని పలు ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరిపింది. సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్ర తీరంలోని రిఫైనరీపై దాడి చేయగా ఖతార్లోని ఎల్ఎన్జీ కేంద్రాల్లో, కువైట్లోని రెండు చమురు శుద్ధి కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఖతార్ రాజధాని దోహాకు దగ్గర్లోని రస్ లఫాన్లో ఉన్న అత్యంత భారీ గ్యాస్ చమురు క్షేత్రంపై దాడి చేసింది. ఇక్కడి నుంచే ఆసియా, ఐరోపా ఖండాలకు భారీ మొత్తంలో ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయు క్షేత్రంగా భావించే సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇరాన్ దాడులకు దారి తీసింది. ఇరాన్ విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 80 శాతం దీనిపైనే ఆధారపడటం వల్ల, ఈ దాడి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కువైట్లోని మీనా అల్- అహ్మది రిఫైనరీపై డ్రోన్ దాడితో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా, సమీపంలోని మీనా అబ్దుల్లా రిఫైనరీ కూడా మంటల్లో చిక్కుకుంది. సౌదీలోని అరామ్ కో రిఫైనరీపై కూడా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరానికి సమీపంలో ఒక నౌక అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.
బుల్లెట్ నుంచి బ్యాలెట్ వైపు..
పీపుల్స్ వార్ ప్రభావిత ప్రాంతపు గోడలపై ‘పార్లమెంట్ పందులదొడ్డి’ అనే నినాదం కనబడేది. ఎన్నికల ద్వారా కాకుండా, సాయుధ విప్లవం ద్వారానే సామాన్యుల ఆకాంక్షలు నెరవేరే పాలన దేశంలో సాధ్యపడుతుందని ఆ పార్టీ నమ్మినందువల్ల ఆ నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చింది. 2004లో మరో విప్లవ పార్టీతో కూడిన పీపుల్స్ వార్.. మావోయిస్టు పార్టీగా అవతరించినా అదే మాటపై కట్టుబడి ఉంది. దేశంలో ఎన్నికలు వచ్చిన సమయంలో ‘ఎన్నికలను బహిష్కరించండి’ అని పిలుపునిచ్చేది. అలాంటి ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం సిబ్బందికి కత్తిమీద సాములా ఉండేది. ఒడిశా రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత 11 జిల్లాల్లో 1998 నుండి 25 ఏళ్ల పాటు ఏ ఎన్నికా ప్రశాంతంగా జరగలేదు. 2024లో మాత్రమే మావోయిస్టుల చర్యలు లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా సాధ్యపడింది అని అక్కడి పత్రికలు రాశాయి. ఇవే పరిస్థితులు చత్తీస్గఢ్లోను కొనసాగాయి. రవాణా సౌకర్యం సరిగ్గా లేని అటవీప్రాంతాల్లో ఎన్నిక నిర్వహణ ఓ యుద్ధ వాతావరణాన్ని తలపించేది. 2017లో వచ్చిన న్యూటన్ అనే హిందీ సినిమాలో చత్తీస్గఢ్ గ్రామీణ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ బహిష్కరణకు సంబంధించిన సన్నివేశాలు చూడవచ్చు. కాల మార్పును సూచించే మరో సంఘటన ఏమిటంటే చత్తీస్గఢ్లో లొంగిపోయిన తీవ్రవాద యువతకు అక్కడి ప్రభుత్వం ఉద్యోగాల్లో భర్తీ చేసుకుంది. ఓటేసినట్లు వేలుకి ఇంకు కనబడితే ఆ వేలుని నరికేస్తామని గ్రామీణులను హెచ్చరించిన వ్యక్తి ఇప్పుడు ఎన్నిక సిబ్బందిలో ఉంటూ ఆ వేలుకు ఇంకు పూయడం సమూల మార్పుకు నిదర్శనంగా భావించాలి. ఆపరేషన్ కగార్లో భాగంగా ప్రభుత్వాల ముందుకు వచ్చిన మావోయిస్టు నేతలు న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తమ భవిష్యత్ కార్యక్రమాల గురించి వారిని ప్రశ్నించినపుడు తమ పార్టీపై నిషేధం ఎత్తివేయాలని ముఖ్యమంత్రిని కోరామని, అదే సాధ్యపడితే చట్టపరిధిలో తమ పార్టీ పని చేసేలా చూస్తామని వారు అంటున్నారు. బుల్లెట్పై నమ్మకం పోయినవారు బ్యాలెట్ మార్గాన్ని ఆచరిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత అవసరం. ఎన్నికల్లో పాల్గొంటారా అని ఒకరు అడిగిన ప్రశ్నకు అది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఓటర్లకు పంచడానికి కోట్లలో ధనం వాడుతున్నారు అని సమాధానం వచ్చింది. సాయుధ పోరాటానికి స్వస్తి పలికామని చెబుతున్న వారు ఎన్నికల బహిష్కరణను కూడా విరమించుకున్నారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.ఎన్నికల విషయంలో అన్ని నక్సలైటు పార్టీలు ఒకే విధానాన్ని పాటించడం లేదు. 1980 నుండి చండ్ర పుల్లారెడ్డి ఎన్నికల్లో పాల్గొంటుంది. 1970 ప్రాంతం నుండి ఉత్తర తెలంగాణలో తమ విప్లవ కార్యకలాపాలకు నెరిపిన సిపిఐ (మార్క్సిస్టు లెనినిస్టు) పార్టీకి చండ్ర పుల్లారెడ్డి నాయకత్వం వహించేవారు. గ్రామాల్లో వేళ్లూనుకుపోయి ఉన్న వెట్టి చాకిరీ, దొరతనం పోవాలన్నా, అప్పులు ఇచ్చి లేదా బెదిరించి గుంజుకున్న భూములు విముక్తి కావాలన్నా గడీలపై దాడులు తప్పనిసరి. అందుకోసం ఊర్లలో వివిధ సంఘాలను ఏర్పరచి యువకులను సమాయత్తం చేసింది. గ్రామాల్లో నక్సలైట్ ఉద్యమ బహిరంగ కార్యకలాపాలు ఉధృతం అయ్యాక భూస్వామ్య వర్గాలు విప్లవ సంఘాల ప్రతినిధులపై దాడులకు పాల్పడ్డాయి. వాటిని తిప్పి కొట్టేందుకు వర్గ శత్రు నిర్మూలన అవసరమనే చర్చ పార్టీలో మొదలైంది. అలాంటి సైద్ధాంతిక, ఆచరణాత్మక విభేదాల కారణంగా పార్టీ 1980 ప్రాంతంలో నాయకుల పేరిట వర్గాలుగా చీలిపోయింది. పీపుల్స్ వార్ పేరిట ఏర్పడ్డ చీలిక వర్గానికి కొండపల్లి సీతారామయ్య నాయకుడు. పుల్లారెడ్డి వర్గం ఎన్నికల్లో పోటీ చేయగా కెఎస్ గ్రూపు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తూ అదే మార్గాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ముందు లొంగిపోతున్న మావోయిస్టులు నాటి కెఎస్ గ్రూపుకు చెందినవారే. ఎన్నికల్లో పాల్గొన్న సిపి వర్గం పోటీ చేసిన కొన్ని ప్రాంతాల్లో విజయం సాధించడం గొప్ప విషయమే. డబ్బుతో కూడుకున్న ఎన్నికల్లో ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడం సామాన్యమైనది కాదు. అదే గ్రూపుకు చెందిన ఎన్వి కృష్ణయ్య 1989 లో సిరిసిల్లా నియోజకవర్గంనుండి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. సిపిఐ (మా లె) న్యూడెమోక్రసి నుండి ఒకరు ఐదు పర్యాయాలు ఎంఎల్ఎగా గెలవడం నక్సలైట్ల చరిత్రలోనే ఓ మైలురాయి. ఆ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లేనందువల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గుమ్మడి నర్సయ్య 1983 నుండి (ఒక టర్మ్ మినహా) 2009 వరకు ఇల్లెందు ఎంఎల్ఎగా ఉన్నారు. సైకిలుపై తిరుగుతూ ప్రజలతో కలిసి ఉండే ప్రజాప్రతినిధిగా ఆయనకు ఎంతో పేరుంది. ఈయన జీవిత కథ సినిమాగా వస్తోంది. ఎన్నికలకు డబ్బే సర్వస్వం అయిన ఈ రోజుల్లో ప్రజలతో కలిసి ఉన్నవారు చట్ట సభల్లో అడుగు పెట్టచ్చు అనడానికి వీరే తార్కాణాలు. సాధారణంగా లొంగిపోయిన నక్సలైట్లు సొంత జీవితం గడుపుతుంటారు. రాజకీయాల్లో చేరాలనుకొనేవారు తక్కువే. అయితే ఇప్పుడు లొంగిపోయినవారు సారథులు. వారి రాకతో పోరుబాటకు తెర పడింది అని చెప్పవచ్చు. వందల్లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులే కాకుండా వారి కార్యకలాపాలకు రహస్యంగా సాయపడినవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. మైదాన ప్రాంతాల్లో సానుభూతిపరులు ఇంకా పార్టీ వెంటే ఉండవచ్చు. ఇంత నెట్ వర్క్ ఉన్న మావోయిస్టు నేతలు తమ కార్యకలాపాలు లీగల్గా కొనసాగించేందుకు అవకాశాలు మెండుగానే ఉన్నాయనిపిస్తోంది. ప్రజాభిమానం ఉంటే డబ్బు లేకుండానే ఎన్నికల్లో కూడా గెలవవచ్చని తోటి కామ్రేడ్స్ ఇప్పటికే నిరూపించారు. యాభై ఏండ్ల ప్రజాజీవితాన్ని తిరిగి ఆ ప్రజల కోసమే వెచ్చించేందుకు ఎన్నో ద్వారాలు తెరిచి ఉన్నాయి. భారీ బహిరంగ సభలను నిర్వహించిన అనుభవం వారికుంది. తమ సరికొత్త నిర్ణయాలు ప్రకటించేందుకు ప్రభుత్వ అనుమతితో ఓ సభ నిర్వహిస్తే ప్రజల స్పందన తెలిసే అవకాశం ఉంది. ఆయుధం వదిలేసినా ప్రజల్లోనే ఉండి, వారి కోసం చట్టపరిధిలో ఉద్యమాలు కొనసాగిస్తామన్నవారి మధ్య నిర్మాణాత్మకమైన సుదీర్ఘ చర్చలు జరగాలి. ప్రజల సమస్యలపై నిజాయితీగా పోరాడే శక్తుల అవసరం ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఉంది. - బి.నర్సన్, 9440128169
Telangana : వాహనదారులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది
Andhra Pradesh : జాతీయ రహదారి విస్తరణకు అడ్డు తొలగినట్లేనా?
హైద రాబాద్ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణపై అడ్డంకులు తొలిగాయి
Israel Attack : లెబనాన్లో వైద్య కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి
దక్షిణ లెబనాన్లోని బుర్జ్ ఖలౌయియా గ్రామంలో ఆరోగ్య కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి తీవ్ర విషాదానికి దారితీసింది
Chandrababu |అన్నప్రసాదాలు వడ్డించిన ముఖ్యమంత్రి, కుటుంబసభ్యులు..
Chandrababu | అన్నప్రసాదాలు వడ్డించిన ముఖ్యమంత్రి, కుటుంబసభ్యులు.. తిరుమలలో అన్నప్రసాదాలు వడ్డించిన ముఖ్యమంత్రిభక్తులతో
స్టార్ కంపోజర్-, హీరో జివి ప్రకాష్ కుమార్ నటిస్తున్న మూవీ ’హ్యాపీ రాజ్’. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రా ల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సం దర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్స్ శివ నిర్వాణ, వెంకీ అట్లూరి ఈ ఈ వెంట్కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో హీరో జీవి ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ “మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి ద్వారా ఈ సినిమా రిలీజ్ కావ డం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఫన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఒక అందమైన సందేశం ఉంది. సినిమా చూసిన తర్వాత ఆ ఈ కథ మీ మనసులను హత్తుకుంటుంది”అని అన్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ “జీవి ప్రకాష్ కుమార్ సినిమాకి మ్యూజిక్ చేసిన, నటించినా ప్రాణం పెట్టి చేస్తారు. హీరోగా దాదాపు 20 సినిమాలు చేశారు. ఇప్పుడు హ్యాపీ రాజ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ సినిమా అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. మూవీ డైరెక్టర్ మరియా రాజా మాట్లాడుతూ “ఈ సినిమా కేవలం నవ్వించడమే కాదు చాలా భావోద్వేగాలతో అలరిస్తుంది. తప్పకుండా ఇది ప్రేక్షకులకి గుర్తుండిపోయే సినిమా”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైత్రి మూవీ మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ, నిర్మాత జైవర్ద పాల్గొన్నారు.
Weather Report : వర్షాలు.. ఎండలు... వాతావరణ శాఖ కీలక అప్ డేట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు కూడా వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపా
‘కామాఖ్య’ అమ్మవారి నేపథ్యంలో..
సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ మూవీ ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో సముద్రఖని మాట్లాడుతూ “ఈ సినిమా టైటిల్ కామాఖ్య అని చెప్పగానే మరో ఆలోచన లేకుండా చేసేద్దాం అని చెప్పాను. ఇది అద్భుతమైన మూవీ”అని అన్నారు. డైరెక్టర్ అభినయ కృష్ణ మాట్లాడుతూ “నా మొదటి చిత్రం చిరంజీవా. ఆ చిత్రంలో యమధర్మరాజుకి ఒక గుడి ఉందని, అది తెలంగాణలోనే ఉందని చెప్పడం జరిగింది. కామాఖ్య అమ్మవారి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సముద్రఖని, అభిరామి, సమైరా... ఇలా అద్భుతమైన నటీనటులందరూ కూడా వాళ్ల కోసమే ఈ పాత్రలు సృష్టించామా అన్నంత సహజంగా వారి పాత్రల్లో ఒదిగిపోయారు”అని తెలియజేశారు. ప్రొడ్యూసర్ వాణినాథ్ మాట్లాడుతూ “ఇది చాలా స్పెషల్ ప్రాజెక్టు. మా టీం ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిరామి, సమైరా పాల్గొన్నారు.
అకాల వర్షాలతో అన్నదాత కుదేలు..
అకాల వర్షాలతో అన్నదాత కుదేలు.. ఎన్టీఆర్ జిల్లా పైనే అధిక దెబ్బ…వేల ఎకరాల్లో
తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే తెలంగాణకు రానున్నారు
ర్యాష్ డ్రైవింగ్, ముగ్గురిపై కేసులు నమోదు..
ర్యాష్ డ్రైవింగ్, ముగ్గురిపై కేసులు నమోదు.. ఏటూరు నాగారం, ఆంధ్రప్రభ : ఏటూరునాగారం
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన ఆశిష్ హీరోగా, సక్సెస్ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న చిత్రం ’దేత్తడి’. ఈ ప్రాజెక్ట్ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్డ్రాప్లో కొత్త స్టోరీని చూపిస్తున్నారు. ఆశిష్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా గ్లింప్స్ను మార్చి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ చేసిన గ్లింప్స్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆశిష్ పూర్తిగా మాస్ లుక్లో కనిపించడమే కాకుండా, ఒరిజినల్ హైదరాబాద్ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ను జునైద్ కుమార్ అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్ప్లే, డైలాగ్స్తో పాటు క్రియేటివ్ హెడ్గా కూడా పని చేస్తున్నారు.
రాజుపేట వద్ద కారు బోల్తా.. ఏటూరునాగారం, మంగపేట, ఆంధ్రప్రభ : మంగపేట మండలంలోని
Gold Price Today : భారీగా దిగివస్తున్న బంగారం.. వెండి ధరలు..ఇంకా ఎంతకాలమంటే?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి
పేద ముస్లింలకు కిట్ల పంపిణీ.. నార్సింగి, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసంలో
Nara Chandrababu Naidu |శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు..
Nara Chandrababu Naidu | శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు.. Nara Chandrababu
Tirumala : తిరుమలకు వెళ్లేవారికి అలెర్ట్.. శనివారం.. దర్శన సమయం?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది
తిరుమల వేంకటేశ్వర స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు
విజయ్ దేవర కొండ, రష్మిక లడ్డూలు పెడుతుర్రు.... చిన్నారి చిట్టి పలుకులు
హైదరాబాద్: లిటిల్ ఫ్యాన్ కుటుంబానికి నూతన దంపతులు విజయ్ దేవర కొండ, రష్మిక మందనా సర్ ప్రైజ్ ఇచ్చారు. రష్మిక- విజయ్ పెళ్లికి పిలవలేదని వీడియో చేసిన చిన్నారి కుటుంబాన్ని దేవరకొండ ఫ్యామిలీ ఇంటికి పిలిచింది. ఆ చిన్నారి కుటుంబంతో కలిసి విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు, ఆనంద్ దేవరకొండ భోజనం చేశారు. విజయ్ ఇంట్లో చిన్నారి సందడి చేసింది. తనని భోజనానికి పిలిచి లడ్డూలు, అన్నదానం పెడుతున్నారని చిన్నారి చిట్టి పలుకులు పలికింది. ఇద్దరితో స్నేహంగా ఉంటానని చిన్నారి తెలిపింది.
Reanth reddy : రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు
కౌన్సిలర్లకు సన్మానం.. ఉగాది పురస్కారాలు అందజేత చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణంలోని
Ramdan : హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
ఈరోజు దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు
Pawan Kalyan’s Ustaad Bhagat Singh Drops Big
Pawan Kalyan’s recent offering Ustaad Bhagat Singh released with decent expectations in theatres on Ugadi holiday. The film fell short in registering big openings due to various reasons. The overseas premieres reported negative word of mouth and the film also opened to poor word of mouth in the Telugu states. Trade circles predicted that the […] The post Pawan Kalyan’s Ustaad Bhagat Singh Drops Big appeared first on Telugu360 .
NTR’s Heavy Discipline for his Transformation
Young Tiger NTR has lost big weight, turned lean and surprised everyone with his transformation for Dragon, a high-voltage action drama that is directed by Prashanth Neel. NTR’s transformation worried his fans and there are a lot of speculations about his health. The actor remained tight-lipped and he continued shooting for Dragon. His transformation is […] The post NTR’s Heavy Discipline for his Transformation appeared first on Telugu360 .
ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు..
ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు.. మున్సిపల్ చైర్మన్ పందిరి గీత చిట్యాల,
కామారెడ్డిలో కవలలను పెళ్లాడిన కవలలు... నదిలో దూకి నవవరుడు ఆత్మహత్య
కామారెడ్డి: ట్విన్స్ డే రోజున కవలలను కవలలు పెళ్లాడిన జంటల్లో నవవరుడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ అనే ఇద్దరూ కవలలను దేమికలాన్కు చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే మరో ఇద్దరు కవలలు ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకున్నారు. దుంపటి వినయ్ కుమార్ (31) అనే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఉగాది పండుగ రోజు ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వినయ్ హైదరాబాద్ నగరంలోని ఒక కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి వినయ్ మృతికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు.
ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు..
ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.. రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్
21st March 2026 |తిరుమల సమాచారం..
21st March 2026 | తిరుమల సమాచారం.. తిరుమల, ఆంధ్రప్రభ : వైకుంఠం
Iran - Israel - Amercia War : ఇరాన్ చమురు ఆంక్షలకు నెలరోజుల విరామం
అమెరికా అధికారులు కీలక నిర్ణయం ప్రకటించారు
Iran - Israel War : ఇరాన్ కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో వ్యాపారాలపై ప్రభావం
ఇరాన్లో యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది
Iran - Israel War : మధ్యప్రాచ్యానికి అమెరికా క్షిపణుల మళ్లింపు...నాటో భద్రతపై ఆందోళన
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం 22 రోజులవుతుంది
నీటి ఏనుగు దాడిలో పశు వైద్యురాలు మృతి
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం శివమొగ్గలో నీటి ఏనుగు దాడి చేయడంతో ఓ పశు వైద్యురాలు మృతి చెందింది. త్యావరకొప్ప టైగర్-లయన్ సఫారీలో సమీక్ష రెడ్డి అనే యువతి ఒప్పంద పద్దతిలో పశు వైద్యురాలుగా ఉద్యోగం చేస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో నీటి ఏనుగు నిండు గర్భంతో ఉంది. ఈ నీటి ఏనుగుకు (హిప్పపొటమస్) ఉష్ణోగ్రత ఎక్కువగా థర్మల్ కెమెరాతో సమీక్ష రెడ్డి పరీక్షిస్తుంది. నీటి ఏనుగు ఆమెపై ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే జూ సిబ్బంది ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పశు వైద్యురాలు చనిపోయింది. ఈ ఘటనపై కర్నాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆమె కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
విజనగరంలో ట్రావెల్స్ బస్సులో మంటలు... ఎంఎల్ఎతో సహా 37 మంది సేఫ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో రామభద్రపురం మండలంలో ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. తారాపురం గ్రామ శివారులో భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వెళ్తున్న బస్సు వెనుక టైర్ పేలింది. వెంటనే బస్సుకు మంటలు అంటుకోవడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించాడు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రాణ నష్టం తప్పడంలో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 37 మంది ప్రయాణికులతో పాటు ఒడిశాకు చెందిన ఎంఎల్ఎ కూడా ఉన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: 2026 -27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు శాసనసభలో శుక్రవారం, డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు. మొత్తం రూ. 3,24,234 కోట్లతో రాష్ట్ర పద్దును ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం - రూ.47,267 కోట్లుగా వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి రాష్ట్ర తలసరి ఆదాయం, అప్పు లు, రెవెన్యూ వ్యయం తదితర వివరాలను వెల్లడించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో పాలన సాగిస్తున్నట్లుగా భట్టి విక్రమార్క తెలిపారు. మహాత్మాగాంధీ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుం టూ ఈ రెండేళ్ళ పాలనలో ప్రజలకు తాము ఇ చ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ వస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ, పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టామని పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే, ప్ర జలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్ర జానీకం పట్ల, వారి అభ్యున్నతి పట్ల అత్యున్నతమైన చిత్తశుద్ధితో ఈ బడ్జెట్ను రూపకల్పన చేశామని అన్నారు. మేం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం అని వ్యాఖ్యానించారు. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలుకాదు అని, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు అని వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రజల జీవనస్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు పెద్దపీట తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి,సాంప్రదాయాలకు, పండుగలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని భట్టి విక్రమార్క తెలిపా రు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కవులు, కళాకారులు, ప్రముఖులను తమ ప్రభుత్వం సత్కరించిందని చెప్పారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రైతు శ్రామిక మహిళ రూపురేఖలతో స్థానిక సంప్రదాయాలు ఉట్టిపడేలా రూ పొందించామని తెలిపారు. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగానిర్వహించామన్నారు. వనదేవతల గద్దెల ప్రాంగణా న్ని చారిత్రకకట్టడాల మాదిరిగా రాతి తో నిర్మించామని తెలిపారు. కోయవంశీయుల చరిత్రను ఆ ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలు గా ఆదివాసీ పద్ధతిలో చెక్కించామని, తెలుగు చలన చిత్రాలకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ పేరుతో అవార్డులను అందజేస్తున్నామని అన్నారు. అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థలుగా మన వర్సిటీలు ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల తరహాలో మన యూనివర్సిటీల్లో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహార్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపరచడం, పెట్టుబడులను ఆకర్షించడంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరిచిందని పేర్కొన్నారు. దేశానికి బలమైన ‘గ్రోత్ ఇంజిన్’గా తెలంగాణ 2025-26 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణస్థూల రాష్ట్రదేశీయోత్పత్తి (జిఎస్డిపి) ప్రస్తుత ధరల ప్రకారం 17 లక్షల 82 వేల 198 కోట్ల రూపాయలు అని అని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు10.7 శాతంగా నమోదు అయ్యిందని తెలిపారు. ఇదే సమయంలో, దేశ జిఎస్డిపి 3 కోట్ల 57 లక్షల 13 వేల 886 కోట్ల రూపాయలుకాగా, వృద్ధిరేటు 8 శాతంగా ఉందని అన్నారు. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. అదే విధంగా దేశ జిడిపిలో రాష్ట్ర జిఎస్డిపి 5.0 శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన ‘గ్రోత్ ఇంజిన్’గా తెలంగాణ నిలుస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కాగా, వృద్ధి రేటు10.2 శాతం అని పేర్కొన్నారు. దేశతలసరి ఆదాయం రూ.2,19,575 కాగా,వృద్ధి రేటు కేవలం 6.9 శాతం అని చెప్పారు. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరిఆదాయం రూ.1,99,356 ఎక్కువ అని, అంటే 1.9రెట్లు ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 200 బిలియన్ యుఎస్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ప్రభుత్వం 2014 నుండి 2023 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల (సిఎస్ఎస్) నిధులను సరైన రీతిలో వినియోగించలేదని అన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితిని వెంటనే గుర్తించి 2014-15 నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు సిఎస్ఎస్ కింద బకాయి పడ్డ నిధులన్నింటినీ సంబంధిత శాఖలకు సుమారు 3 వేలకోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసినట్లు వెల్లడించారు. అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకున్నాం ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు, గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ.25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరించిందని అన్నారు. ఈ రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా 2025-26 నుండి 2031-32 దాకా చెల్లించాల్సిన 34 వేల 58 కోట్ల రూపాయల నుంచి 11 వేల 915 కోట్లకు తగ్గిందని, దీనిద్వారా రాష్ట్రానికి 22 వేల 142 కోట్ల రూపాయలు క్యాష్ అవుట్ ఫ్లో తగ్గి నగదు వెసులుబాటు కలిగిందని తెలిపారు. గతంలో టియుఎఫ్ఐడిసి సంస్థ 10.2 శాతం వడ్డీతో తీసుకున్న 172.02 కోట్లు అని, తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పోరేషన్ 9.7 శాతం వడ్డీతో తీసుకున్న 2,204.06 కోట్ల రూపాయల రుణాలను 8.6 శాతం వడ్డీకి రీస్ట్రక్చర్ చేసుకున్నామని చెప్పారు. దీనిద్వారా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 27,988 కోట్ల అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకున్నామని వివరించారు. 67,763 మందికి నియామక పత్రాలు అందజేత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలలో అత్యంత కీలకమైన ఉద్యోగ నియామకాల భర్తీకి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిందని, టిజిపిఎస్సి ద్వారా నిర్వహించే అత్యున్నతమైన గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేక, పరీక్షాపత్రాలు లీక్ కావడంతో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టిజిపిఎస్సి నవ్వులపాలు అయిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుపిఎస్సి స్థాయిలో టిజిపిఎస్సిని పునర్ వ్యవస్థీకరించి, నిరుద్యోగుల ఆకాంక్షలను గుర్తించి, ఇప్పటివరకు 67,763 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు వీలుగా రాష్ట్రంలో సివిల్స్ సాధించే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. సివిల్స్ మెయిన్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించామని అన్నారు. ఈ సహాయం అందుకున్న అభ్యర్థులలో 51 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని, వారికి అదనంగా రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించామని చెప్పారు. వారిలో 20 మంది యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ఫలితాలలో మంచి ర్యాంకులు సాధించి, తెలంగాణ రాష్ట్ర యువత,తమ సత్తాను చాటారని అన్నారు. డిజిటల్ విధానంలో జనగణన జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు.పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఏర్పాట్లు, రిజర్వేషన్ల అమలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలకు జనగణన మూలాధారం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన ఇది అని, దీనిలో స్వీయ నమోదు విధానం, కుల గణన అంశం ఉన్నాయని చెప్పారు. మొదటి దశ జనగణన మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించబడుతుందని, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు కొనసాగుతుందని అన్నారు. రెండవ దశ దేశవ్యాప్తంగా 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తారని, తదుపరి, మార్చి 1, 2027 తేదీని రిఫరెన్స్ డేట్గా తీసుకుంటారని వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూళ్లు రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్(వైఐఐఆర్) పాఠశాలలను మంజూరు చేయాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ సమాజం ఒక ఉమ్మడి వసుధైక కుటుంబంగా ఎస్సి,ఎస్టి, బిసి, మైనారిటీ, ఒసి విద్యార్థులు ఒకేచోట చదువుకునేందుకు వీలుగా అధునాతన వసతులతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 79 స్కూళ్ళు మంజూరు చేశామని, 44 చోట్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1,362 ప్రీ-ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని 2,000 నుండి 2,500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు 2025-26 విద్యా సంవత్సరంలో 93 కెజిబివిలను యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రకటించి, 120 కెజిబివిలను ఇంటర్మీడియట్ స్థాయికి పెంచామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి టిమ్స్ ప్రారంభం 2026 చివరి నాటికి సనత్నగర్, ఎల్.బి.నగర్, అల్వాల్లోని (టిమ్స్) ఆసుపత్రులతో పాటు నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. అలాగే మరో 6,582 టెర్షియరీ కేర్ పడకలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. సెకండరీ కేర్ ఆసుపత్రులలో 12,720 పడకలు ఉన్నాయని, దీంతో, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం టెర్షియరీ కేర్ పడకల సంఖ్య 44,029కు చేరుకుంటుందని అన్నారు. భారత ప్రజా ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక పడక ఉండాలన్న నిబంధనను మనం గణనీయంగా అధిగమించడం మనందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుందని తెలిపారు. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ఈ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత, భరోసా అని పేర్కొన్నారు. ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రయివేట్ ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చని చెప్పారు. అలాగే ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కల్పిస్తుందనడానికి ఇది నిదర్శనం అని వ్యాఖ్యానించారు. కొత్తగా డా.బి.ఆర్.అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మాణం లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డా.బి.ఆర్.అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా నింబోలి అడ్డ కాచిగూడలో బాబూ జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఈ బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.12,511 కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు రూ.6 కోట్లు రాష్ట్రంలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ, ఒసి వర్గాలకు చెందిన యువతకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని భట్టి విక్రమార్క తెలిపారు. సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుందని అన్నారు. ఈ పథకం అమలుకు 6 వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండడం వారి ఆత్మ గౌరవానికి చిహ్నం అని, దీనిని గుర్తించి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనే పవిత్రమైన ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ఐటీ శాఖకు 875 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర జిఎస్డిపి పరిశ్రమల రంగం వాటా 3 లక్షల 4 వేల 217 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు. వివిధ పరిశ్రమలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఒయుల అమలు, పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్పీడ్ విభాగాన్ని ఏర్పాటు చేసి దానిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇటీవల నగరంలో నిర్వహించిన 23వ బయోఏషియా అంతర్జాతీయ సదస్సుకు విశేష స్పందన లభించిందని, ఈ సదస్సులో రూ. 1,700 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ఆసక్తి వ్యక్తపరిచారని చెప్పారు. వి హబ్ ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాలలో 700 పైగా మహిళా వ్యాపార వేత్తలకు మద్దతు ఇస్తూ వారి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నామని తెలిపారు. పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్లో రూ.3,490 కోట్లు ప్రతిపాదిస్తున్నామని వెల్లడించారు. మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ కోటి మహిళలకు కోటి చీరలు కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో మాదిరి కాకుండా, రాష్ట్రంలోని ఆడపడుచులు ఈ వస్త్రాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. చేనేత రంగానికి రూ. 258 కోట్లు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఈ బడ్జెట్లో గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. పంచాయతీ రోడ్లకు మహర్దశ కల్పిస్తున్నామని అన్నారు. 2025 డిసెంబర్లో 12,702 గ్రామ పంచాయితీలకు ఎన్నికలను నిర్వహించామని, తద్వారా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం 1,597 కోట్ల రూపాయలను విడుదల చేసిందని తెలిపారు. ఎన్నిక అయిన సర్పంచ్లందరికీ 5 రోజుల సమగ్ర శిక్షణని అందించామని చెప్పారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ ఎంపిక చేసిన రహదారులను హైబ్రీడ్ ఆన్యుటీ మోడ్(హ్యామ్) విధానంలో నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో రూ.33,688 కోట్లు ప్రతిపాదిస్తున్నామని వెల్లడించారు. అలాగే నీటి పారుదల శాఖకి రూ.22,615 కోట్లు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. రవాణా, రోడ్డు, భవనాల శాఖకు రూ. 12,789 కోట్లు, న్యాయ శాఖకు రూ. 2,367 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు వెల్డలించారు. హైడ్రా ద్వారా వెయ్యి 45 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం పాత జిహెచ్ఎంసి సంస్థకి ఉన్న అధిక వడ్డీ అప్పుల గురించి సంబంధిత బ్యాంకులతో చర్చించి, వడ్డీ రేటును 9.15 శాతంనుండి 7.95 శాతానికి తగ్గించామని తెలిపారు. దీనితో సంస్థకు గణనీయమైన ఉపశమనం లభించిందన్నారు. హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం హెచ్ సిటి పథకం కింద 2 వేల 654 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. హైడ్రా సంస్థ ప్రజా ఆస్తుల రక్షణ, విపత్తు నిర్వహణ కోసం స్థాపించబడిందని తెలిపారు. ఇప్పటివరకు వెయ్యి 45 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుండి తిరిగి స్వాధీనం చేసుకుందని అన్నారు. వీటి విలువ సుమారు 60 వేల కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బమ్-రుక్-ఉద్దీన్-దౌలా చెరువులను పునరుద్ధరించామని, ఈ చెరువులు భవిష్యత్తులో అభివృద్ధి కేంద్రాలుగా మారి లేక్ ఎకనామిని పెంపొందించడంలో సహాయపడతాయని వివరించారు. వర్షాకాలంలో వరదలను నివారించేందుకు కాలువలు, నాలాలు శుభ్రపరిచే పనులు చేపట్టబడ్డాయని, చెరువుల సంరక్షణకు సిసిటివి వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మూసీ బఫర్ జోన్లో ఉన్న ప్రజలకు పునరావాసం కల్పిస్తాం మూసీనది పునరుద్ధరణ కోసం 55 కి.మీ పరిధిలో భారీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉంటుందని చెప్పారు. ఈ మూసీ పునరుద్ధరణలో భాగంగా గోదావరి ప్రాజెక్టు ద్వారా 2.5 టిఎంసిల నీరు మూసీకి అందించబడుతుందని చెప్పారు. మూసీనది బఫర్ జోన్లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం హైదరాబాద్, హైదరాబాద్ చుట్టు ప్రక్కల వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి వివిధ సంస్థల ద్వారా సుమారు 43 వేల 592 కోట్ల 88 లక్షల రూపాయల పనులను మంజూరు చేసిందని తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో 17,907 కోట్లు ప్రతిపాదిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నిలువరించడంలో పోలీస్ శాఖ మంచి ఫలితాలను కనబరుస్తున్నదని చెపారు. నక్సలిజాన్ని గత ప్రభుత్వం,ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతి -భద్రతల సమస్యగానే పరిగణించి, పోలీసు, సైనిక బలగాలతో అణచివేసే ప్రయత్నం చేశాయని అన్నారు. కానీ, తమ ప్రభుత్వం ఈ సమస్య మూలాలను విశ్లేషించి సామాజిక -ఆర్థిక వాస్తవాన్ని గుర్తించి అనుసరించిన దార్శనిక విధానం దేశానికే ఒక ఆదర్శన మూనాగా నిలిచిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి -2023 వరకు 347 మంది మావోయిస్టులు లొంగిపోగా, తమ ప్రభుత్వం ఏర్పడిన 2023 డిసెంబర్ 7 నుండి ఈ ఏడాది మార్చి 8 వరకు 732 మంది వివిధ స్థాయి కేడర్ మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. ‘సమగ్ర సంక్షేమం, ఉపాధి ద్వారానే నిజమైన సామాజిక మార్పుసాధ్యం అని తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శనం చేసిందని తెలిపారు. హోం శాఖకు ఈ బడ్జెట్లో రూ.11,907 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు. ఉభయ సభలు సోమవారానికి వాయిదా శాసనసభలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క,శాసనమండలిలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉయభ సభల్లో బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన అనంతరం శాససనసభ, శాసనమండలి సోమవారానికి వాయిదా వేశారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2026--/2027 వార్షిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కొత్తగా 9 పథకాలను ప్రకటించింది. వీటిలో & ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం-పేద, మధ్యతరగతి, ధని క అనే తేడా లేకుండా జూన్ 2, 2026 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీ అందించనున్నారు. ఈ పథకానికి బడ్జెట్లో రూ.4,000 కోట్ల కేటాయించింది. చేయూత పథకం: చే యూత పథకం కింద అ ర్హులైన లబ్ధిదారులకు 2 లక్షల కొత్త పెన్షన్లు మం జూరు చేయనున్నట్టు పే ర్కొంది. ఈ పథకానికి రూ.14,861 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్: ఎంపిక చేసిన ప్ర భుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా అభివృద్ధి చేయనుంది. ప్రతి పాఠశాలలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు సుమారు 1,500 మంది విద్యార్థులకు విద్య అందించనున్నారు. ఈ పథకానికి రూ.500 కోట్ల కేటాయించింది. విద్యార్థులకు అల్పాహారం: 2026-27 విద్యా సంవత్సరంనుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారం అందించే కొత్త పథకం అమలు చేయనుంది. అలాగే వారంలో మూ డు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగి జావ అందించనుంది. ఈ పథకానికి రూ.800 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించనుంది. ఈ పథకానికి రూ.100 కోట్ల కేటాయించింది. క్యాష్లెస్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్: ఉద్యోగులు, పెన్షనర్లు వారిపై ఆధారిత కుటుం బ సభ్యులకు క్యాష్లెస్ ఆరోగ్య రక్షణ పథకం అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా సుమారు 23.51 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు చేయనున్నది. ఉద్యోగుల ప్రమాద బీమా: దేశంలో తొలిసారిగా ఉద్యోగుల కోసం సమగ్ర ప్రమాద బీమా పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద: * ప్రమాద మరణం సంభవిస్తే రూ.1.2 కోట్ల పరిహారం * 60 ఏళ్ల వయస్సు వరకు రూ.10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ * విమాన ప్రమాద మరణానికి అదనంగా రూ.2 కోట్ల కవరేజీ ఈ పథకం ద్వారా 7.57 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఆరోగ్య, బీమా పథకాల కోసం కలిపి రూ.1,056 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 8. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్: యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నది. ఈ పథకం కింద: * నైపుణ్య శిక్షణ * భాషా శిక్షణ * వీసా మార్గదర్శకం * ప్రయాణ సాయం, రక్షణ,హెల్త్కేర్, హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్, లాజిస్టిక్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ పథకానికి రూ.1,056 కోట్ల కేటాయించింది. 9. ఏటీసీ ట్రైనీలకు స్కాలర్షిప్: ఏటీసీలలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు నెలకు రూ.2,000 స్కాలర్షిప్ అందించనున్నారు.ఈ పథకానికి రూ.80 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించింది.
మన తెలంగాణ/హైదరాబాద్: తాము సంకల్పించిన తెలంగాణ రైజింగ్ లక్షానికి రాష్ట్ర బడ్జెట్లో పెద్ద పీ ట వేయడం జరిగిందని, అభివృద్ధి, సంక్షేమానికి స మాన ప్రాధాన్యమిచ్చామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఇక పదవ తరగతి పరీక్షలు ఉండకపోవచ్చన్నారు. అయితే జాతీయ విద్యా విధానానికి అ నుగుణంగా కమిషన్ సమర్పించిన నివేదిక ఫైనల్ కా దని, దీనిపై నియమించిన అధ్యయన కమిటీ సిఫార్సులు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమం త్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో బడ్జె ట్ ప్రతిపాదించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడు తూ ‘ఇది ప్యూచరిస్టిక్ బడ్జెట్’ అని వ్యాఖ్యానించారు. రాష్రాభివృద్ధి, భవిష్యత్ ఆర్ధిక వృద్ధి ని దృష్టి లో పెట్టుకొని మౌలిక వసతుల కల్పనకు సరిపడే విధంగా నిధుల కేటాయింపు జరిగిందన్నారు. దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కు టుంబానికి ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ప్రవేశ పెట్టామని, ఈ పధకం ద్వారా రూ. 5 లక్షల బీమా పరిహారం అందుతుందని ఆయన చెప్పారు.దీంతో రాష్ట్రంలోని దాదాపు 1కోటి 15లక్షల కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందని ఆయన వివరించారు. విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు, ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక నిధులు కేటాయించామని, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా మార్పులు తీసుకువస్తామన్నారు. ప్రీ ప్రై మరీ నుంచి ప్లస్ టూ వరకు విద్యార్థులు ఒకే చోట ప్రభు త్వ స్కూల్లో చదివే విధానాన్ని అమ లు చేయనున్నట్లు ఆయ న తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు లు తీసుకుని రాబోతున్నామని, ఇకపై ఎస్ఎస్సి బోర్డు లేనట్లేనని, పదో తరగతి పరీక్షలు ఉండబోవని ఆయన పరోక్షంగా అన్నారు. విద్యా వ్యవస్థలో మా ర్పులపై ఎడ్యుకేషన్ కమిషన్ నివేదిక ఫైనల్ కాద ని, దీనిపై అధ్యయనం చేసేందుకు నియమించిన కమిటీ సిఫార్సులు చేయాల్సి ఉందని ఆయన వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.47లక్షల కోట్లు అని చెబుతూ ఇందులో గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకే రూ. 3.30 లక్షల కోట్లు చెల్లించామని ఆయన తెలిపారు. తాము వివిధ పథకాలకు ఖర్చు చేసింది పదిహేడు వేల కోట్ల రూపాయలేనని ఆయన చెప్పారు. జాతీయ జిడిపి కంటే రాష్ట్ర జిడిపి పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. జిఎస్టి వసూళ్ళు రెండు నెలల్లో నాలుగు వేల కోట్ల రూపాయలు దాటిందన్నారు.
ప్రీమియం పెట్రోల్ ధర రూ.2 పెంపు
న్యూఢిల్లీ: ప్రీమియం లేదా హైయ్యర్ గ్రేడ్ పెట్రోలియం ధర లీటరుకు రూ.2 పెంచా రు. ఇక ఇండస్ట్రీయల్ డీజిల్ రేటును లీటరుకు రూ.22 మేర పెంచారు. సాధారణ పెట్రోలు, డీజిల్ ధరలు యధాతథంగా ఉం టాయి. ఈ వివరాలను కేంద్ర పెట్రోలి యం, సహజవాయువు మంత్రిత్వశాఖ సం యుక్త కార్యదర్శి సుజాత శర్మ శుక్రవారం మీడియాకు తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధర పెరగడంతో దీని ప్రభావం ఇక్కడి మా ర్కెట్ పడింది. పెరిగిన ధరల మేరకు ఢిల్లీలో ప్రీమియం 95అక్టెన్ పెట్రోలు ధర ఇంత కు ముందు రూ.99.89 ఉండగా ఇది ఇ ప్పుడు రూ.101.89కు చేరుతుంది. పరిశ్రమలలో వాడకానికి ఉపయోగించే పెట్రో లు, లేదా బల్క్ పెట్రోలు ధర ఇంతకు ముం దు లీటరుకు రూ.87.67 ఉండగా ఇప్పుడిది రూ.109.59 కి చేరుతుంది.
వాషింగ్టన్: నాటో దేశాలను అమెరికా అధ్యక్షు లు డొనాల్డ్ ట్రంప్ తిట్టిపోశారు. ఆయాదేశాల నేతలు పిరికిపందలు అని స్పందించారు. ఇరాన్తో తమ యుద్ధం వేళ నాటో నుంచి సరైన మ ద్దతు లేకపోవడం తప్పిదమని, దీనిని అమెరికా గుర్తు పెట్టుకుంటుందని హెచ్చరించారు. అమెరికా మద్దతు లేకపోతే ఈ సైనిక కూటమి వట్టి చేతకాని కాగితం పులి అవుతుందని విమర్శించారు. ఓ వైపు ఇరాన్ అణ్వాయుధ సంపన్నదే శం అవుతోంది. దీనిని అడ్డుకునేందుకు అమెరి కా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో తమతో పాటు కలిసిరావాల్సిన బాధ్యత నాటోకు లే దా? అని నిలదీశారు. ఈ యుద్ధంలో చేతులు కలపాలనే తమ విజ్ఞప్తిని నాటో తిరస్కరించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ పోరు లో పెద్దగా నష్టం లేకుండా తమ సైన్యం విజయం దక్కించుకుందని వివరించారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ ఆధీనం నుంచి తప్పించేందుకు నాటో దేశాలు యుద్ధనౌకలను తరలించాలని వరుసగా ట్రంప్ కోరుతూ వస్తున్నారు. అయితే దీనికి పెద్దగా స్పందన వెలువడలేదు. ఈ క్రమంలో ఆయన తమ ట్రూత్ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా స్పందించారు. నాటో దేశాల వైఖరి విచిత్రంగా ఉంది. ఇరాన్ చర్యలతో ఓ వైపు చమురు ధరలు భారీగా పెరిగితే వారు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇరాన్కు వ్యతిరేకంగా పోరులో కలిసిరావాలంటే కిమ్మంటున్నారని మండిపడ్డారు. హర్మూజ్ సమస్య వల్లనే చమురు ధరలు పెరిగాయి. దీనిని కూడా నాటో గ్రహించకపోవడం దారుణం అని వ్యాఖ్యానించారు. నాటో మిలిటరీకి పెద్దగా నష్టం ఏమీ ఉండదు. అయినా ఈ పోరులో కలిసిరావడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. హర్మూజ్ జలసంధి సంక్షోభంపై పలు ప్రపంచదేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ సంక్షోభ నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని జర్మనీ, ఫ్రాన్స్ , జపాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, బ్రిటన్లు సంయుక్త ప్రకటనను వెలువరించాయి. అయితే ట్రంప్ పిలుపు గురించి ప్రస్తావించలేదు. ప్రస్తుత పోరు ముగింపు దిశలోనే ఎటువంటి చర్యలు అయినా ఉండాలని ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ తెలిపారు. ఉద్రిక్తతల సడలింపు చర్యలు, అంతర్జాతీయ చట్టాల కట్టుబాట్లు అవసరం అని బ్రస్సెల్స్లో జరిగిన యూరోపియన్ యూనియన్ సమ్మిట్లో పేర్కొన్నారు. పోరు విరమణతోనే అన్ని సమస్యలకు పరిష్కారం కుదురుతుంది. ఇంతకంటే ఉత్తమ మార్గం లేదని, అయినా ఇప్పటి పోరుకు తాము భాగస్వామ్యపక్షం కాదని ఫ్రాన్స్ నేత స్పష్టం చేశారు. తమ బాధ్యతలేనప్పుడు తమ దేశం హర్మూజ్ విముక్తి దిశలో పాలుపంచుకోవల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. దీనిపై అమెరికా అధ్యక్షులు పరోక్షంగా మండిపడ్డారు.
శనివారం రాశి ఫలాలు (21-03-2025)
మేషం:- అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం:- ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. మిధునం:- చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. కర్కాటకం:- సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. కుటుంబ విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సింహం:- కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. గృహనిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కన్య:- ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత రాణిస్తారు. తుల:- వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు జరుగుతాయి. ఇంటాబయట కొందరు ప్రవర్తన మానసిక చికాకు కeలిగిస్తుంది. బంధువర్గం నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృశ్చికం:- ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అవసరానికి ధనసహాయం లభిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. ధనస్సు:- వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. నూతన రుణయత్నాలు చేస్తారు. వ్యాపార విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మకరం:- స్నేహితులతో మాటపట్టింపులు ఉంటాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంతమందికోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. కుంభం:- చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. మీనం:- చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధన పరంగా చికాకులు తొలగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి. వ్యాపారమున అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించిన బడ్జెట్ అంతా బోగస్ అని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు అ న్నారు. ఇదొక ఝూటా బడ్జెట్ అని మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్తో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల ను, ఆర్టిసి కార్మికుల సమస్యలను, నిరుద్యోగల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చిన పించన్ పెంపు హామీలను కూడా సర్కారు మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అంకెలగారడీ, మాటల గారడీ తప్ప ప్రభుత్వానికి పేదలపట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమయ్యిందని హరీష్ రావు అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకొచ్చి మూడేళ్లు కాలేకపోయినా మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేసిందని, తెచ్చిన ఆ అప్పుతో ఏం చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా భట్టి అంబేద్కర్ సూక్తులు, రాజ్యాంగ విలువలను వల్లెవేశారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనుక కూసోబెట్టుకుని రాజ్యాంగ విలువల గురించి ఆయన మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలకు భట్టి ఘోరీ కట్టారని, కాగితాల మీద అంకెలు తప్ప, ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసం కోసం 6వేల కోట్లు , ఈసారి కూడా 6 వేల కోట్లు అన్నారని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనే అదే జరిగిందని, ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క పైసా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు.
హోర్ముజ్ జలసంధి వద్ద నౌకలో కెప్టెన్ రంజన్ మృతి
హోర్ముజ్ జలసంధి సమీపాన చమురు రవాణా వాణిజ్యనౌకలో మృతి చెందిన కెప్టెన్ రాకేష్ రంజన్ మృతదేహాన్ని తిరిగి తీసుకు రావడంలో సహకరించాల్సిందిగా ఆయన కుటుంబం కేంద్ర ప్రభుత్వానికి, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాంచీకి చెందిన రంజన్ (43) ప్రైవేట్ కంపెనీకి చెందిన వాణిజ్యనౌక ‘ఎఎస్పి అవనాఆర్పిఎస్ఎల్ ఎంయుఎం172’ లో ఫిబ్రవరి 2న చేరారు. గుండెపోటుతో మార్చి 18న చనిపోయినట్టు ఆయన కుటుంబం వెల్లడించింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధికి 14 నాటికల్ మైళ్ల దూరంలో ఫిబ్రవరి 28 నుంచి ఈ నౌక నిల్చిపోయింది. “ వీలైనంత త్వరగా తన సోదరుని మృతదేహాన్ని రప్పించేందుకు సహకరించాలని జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ను అభ్యర్థించాను. తన సోదరునికి రావలసిన ఆర్థిక బకాయిలు చెల్లింపులో కంపెనీ నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం పర్యవేక్షించాలి” అని ఆయన పెద్దన్న ఉమేష్ సింగ్ చెప్పారు. “ కేంద్ర ప్రభుత్వాన్ని , దుబాయ్ లోని భారత దౌత్యకార్యాలయాన్ని, కంపెనీని తన సోదరుని మృతదేహాన్ని వేగంగా రప్పించాలని విజ్ఞప్తి చేశాను ” అని ఉమేష్ సింగ్ చెప్పారు. ఈమేరకు సిఎం సోరేన్కు, రాంచీ ఎంపీ సంజయ్ సేథ్కు లేఖలు రాశానని తెలిపారు. “ నౌకలోకెప్టెన్ విధుల్లో ఉన్న తన సోదరుడు అపస్మారక స్థితిలో తన కుర్చీ నుంచి పడిపోయినట్టు మార్చి 18న కంపెనీ తెలిపింది. వైద్యసాయం అందించడానికి ప్రయత్నాలు జరిగాయి. విమానంలో ఆయనను తరలించడానికి అనుమతించలేదు. ఆ తరువాత ఆయన బోటులో దుబాయ్ లోని రషీద్ పోర్టుకు తరలించారు. అక్కడ ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. ” సింగ్ చెప్పారు. కెప్టెన్ రంజన్ పోస్ట్మార్టమ్ నివేదిక కోసం కుటుంబం నిరీక్షిస్తోంది. రషీద్ పోర్టులో పోలీస్ కస్టడీలో మార్చురీలో రంజన్ మృతదేహం భద్రపర్చి ఉంచారు.
22 Indian Ships Stranded : ఆయిల్ కష్టాల్లో భారత్ Andhra Prabha News
22 Indian Ships Stranded : ఆయిల్ కష్టాల్లో భారత్ Andhra
విశాలాంధ్ర – మార్కాపురం : మార్కాపురం జిల్లా తొలి నూతన కలెక్టర్గా ఎం.విజయ సునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం మార్కెటింగ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 30న ఏర్పాటు చేసిన నూతన మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్గా 2014 బ్యాచ్ కి చెందిన మహిళా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది గతంలోనే జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులను ప్రభుత్వ నియమించింది. The post జిల్లా కలెక్టర్గా విజయ సునీత appeared first on Visalaandhra .
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 10 ప్రధాన హామీలతో రూపొందించిన ఈ మ్యానిఫెస్టోలో సంక్షేమ పథకాల విస్తరణ, ప్రజలకు మరింత చేరువైన ఆరోగ్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఓటర్లను ఆకర్షించి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ హామీలను విడుదల చేస్తూ, రాబోయే ఐదేళ్ల పాలనకు ఇవే మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ అమలు చేస్తున్న ‘లక్ష్మీర్ భండార్’ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని టీఎంసీ నిర్ణయించింది. ఈసారి తిరిగి అధికారంలోకి వస్తే.. ప్రతి నెలా మహిళలకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ. 500 పెంచనున్నట్లు ప్రకటించింది. అంటే జనరల్ కేటగిరీ మహిళలకు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళలకు రూ.1,700 చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 1500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రజల ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించే ‘డువారే చికిత్స’ పథకం మేనిఫెస్టోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి సులభంగా ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రం లోని వేలాది పాఠశాలలను ఆధునికీకరించడంతో పాటు ఈలెర్నింగ్ సదుపాయాలను కల్పిస్తామన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు, ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా అందేలా చూస్తామని ప్రకటించింది. రాష్ట్ర అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలని, ప్రతి ఇల్లూ సంతోషం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ 10 హామీలు బెంగాల్ ప్రజల భవిష్యత్తు అభివృద్ధికి బాటలు వేస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
కువైట్ రిఫైనరీపై ఇరాన్ మళ్లీ దాడులు . కువైట్ నుంచి యూఏఈ వరకు డ్రోన్లు, క్షిపణులు. భూమ్మీద రక్షణ లేకుండా చేస్తాం: అమెరికా, ఇజ్రాయిల్కు హెచ్చరిక. సైనికాధికారి మహమ్మద్ నయినీ మృతి. హోర్ముజ్ కోసం ఒక్కటైన ఆరు దేశాలు తెహ్రాన్/దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం మూడవ వారం భీకరంగా సాగుతూ ప్రమాదక స్థాయికి చేరుకుంది. ఈ దశలో చమురు క్షేత్రాలపై దాడులు తీవ్రతరమ య్యాయి. అమెరికా`ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై విరుచుకుపడున్నాయి. ఇరాన్ కూడా తమ ప్రతీకార దాడులతో శుత్రువుల […] The post ఆరని చమురు మంటలు appeared first on Visalaandhra .
న్యూదిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వేళ మోదీ సర్కారు పెట్రోలు ధరలు పెంచేసింది. ప్రీమియం పెట్రోలు ధర లీటర్కు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోలు ధర పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బీపీసీఎల్ స్పీడ్, ఐవోసీఎల్ ఎక్స్పీ95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధర పెంచాయి. సవరించిన […] The post పెట్రోలు ధర రూ.2.35 పెంపు appeared first on Visalaandhra .
అత్యంత కనిష్ఠానికి రూపాయి పతనం
ముంబై: పశ్చిమాసియా యుద్ధం అన్నిరంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆల్టైమ్ కనిష్టానికి రూపాయి పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 86 పైసలు క్షీణించి 93.75 వద్ద ఆల్టైమ్ కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,559.38 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో దాదాపు వెయ్యి పాయింట్ల మేర లాభపడి 75,286.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెన్సెక్స్ 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం […] The post అత్యంత కనిష్ఠానికి రూపాయి పతనం appeared first on Visalaandhra .
మణిరత్నం లవ్ స్టోరీలో సాయి పల్లవి..
ప్రేమకథా చిత్రాలకు సమకాలీన అంశాలని జోడించి వెండితెరపై అందమైన దృశ్యకావ్యాలుగా ఆవిష్కరించడంలో మణిరత్నం మాస్టర్ అన్నది తెలిసిందే. రోజా నుంచి ఓకే బంగారం సినిమాల వరకు ఈ విషయాన్ని నిరూపించాయి. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మణిరత్నం రొమాంటిక్ లవ్ స్టోరీతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మంగా తెరపైకి తీసుకురాబోతోంది. మద్రాస్ టాకీస్ సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో కథానాయికగా సాయి పల్లవి నటిస్తోంది. సాయి పల్లవి లాంటి సహజ నటితో తొలిసారి పని చేస్తున్న మణిరత్నం తనని ఎలా చూపిస్తాడు? అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
జెరూసలేం: పశ్చిమాసియా యు ద్ధంలో ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీసి నట్లు ఇజ్రాయిల్ ప్రకటించుకుంది. యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యాన్ని ఇరాన్ కోల్పోయిందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. నిర్దేశించుకున్న మూడు లక్ష్యాలు సాధించడమే ఇరాన్పై యుద్ధం ముఖ్య ఉద్దేశంగా తెలిపారు. ఇరాన్ నుంచి అణుముప్ప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను అణగదొక్కడం, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించడమే అజెండాగా నెతన్యాహు చెప్పారు. ఇరాన్కు భారీగా నష్టం కలిగించా మని, క్షిపణి నిల్వలు, వాటి […] The post ఇరాన్ యురేనియం శుద్ధి చేయలేదు appeared first on Visalaandhra .
నెతన్యాహు`ముజ్తబా వీడియో రుజువులు తెహ్రాన్/తెల్ అవీవ్: పశ్చిమాసియాలో యుద్ధం తారస్థాయికి చేరుకున్న తరుణంలో ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ మరణించినట్లు అమెరికా అనుకూల వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టాయి. అటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జాడలేరని, ఆయన ప్రాణాలతోనే ఉన్నారా అంటూ ఇరాన్ మీడియా అనుమానాలు రేకెత్తించింది. దీంతో ఆ ఇద్దరు నాయకులు తామింకా బతికే ఉన్నామని రుజువు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నెతన్యాహు కొన్ని వీడియోలు విడుదల చేయడం, ఇటీవల అమెరికా […] The post బతికే ఉన్నాం appeared first on Visalaandhra .
వాషింగ్టన్: తన చైనా పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేసుకున్నారు. సుమారు నెలన్నర రోజులు పాటు ఈ పర్యటన వాయిదా పడింది. ఇదే విషయాన్ని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ‘చైనా పర్యటనను నెలన్నర రోజులు వాయిదా వేసుకున్నా. ఇది ఖరారైంది కానీ, చైనాలో పర్యటించాలని ఎదురు చూస్తున్నా’ అని ఓవల్ కార్యాలయంలో ట్రంప్ వెల్లడించారు.ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు వద్దని ఇజ్రాయిల్కు సూచించినట్లు ఆయన తెలిపారు. ‘మా దేశాలకు సమన్వయం కుదిరింది కానీ ఇజ్రాయిల్ […] The post ట్రంప్ చైనా పర్యటన వాయిదా appeared first on Visalaandhra .
పెరగనున్న బ్రిటన్ వీసా చార్జీలు
లండన్: బ్రిటన్ స్టూడెంట్, విజిటర్, వర్క్ వీసాలతో పాటు అన్ని రకాల వీసా రుసుములు పెరగనున్నాయి. ఈ మేరకు బ్రిటన్ హోమ్ ఆఫీస్ ప్రకటించింది. దీంతో విదేశీయులపై సుమారు ఆరు శాతం నుంచి ఏడు శాతం నుంచి వరకు అదనపు ఆర్థిక భారం పడనుంది. గతంలో 524 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.65,730)గా ఉన్న విద్యార్థి వీసా రుసుము ఇప్ప్పుడు 558 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.69,814) పెరిగింది. మూడేళ్ల కాలపరిమితిగల […] The post పెరగనున్న బ్రిటన్ వీసా చార్జీలు appeared first on Visalaandhra .
విదేశాలకెళ్లొద్దు… ఇంటి నుంచే పని: ఐఈఏ
పారిస్: పశ్చిమాసియాలో ఇంధన కేంద్రాలపై దాడుల క్రమంలో చమురు సంక్షోభం మరింత పరిగే పరిస్థితుల్లో అంత ర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) శుక్రవారం కొన్ని ప్రతిపాదనలు చేసింది. విదేశీ ప్రయాణాలు నివారించాలని, ఇంటి నుంచి పని సౌకర్యం కల్పించాలని సూచనలు చేసింది. తద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో చమురు ధరలపై ఒత్తిడిని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. ముడి చమురు ధరల పెరుగుదలతో వ్యూహాత్మక నిల్వల నుంచి రికార్డు స్థాయిలో 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు […] The post విదేశాలకెళ్లొద్దు… ఇంటి నుంచే పని: ఐఈఏ appeared first on Visalaandhra .
ఎన్టీఆర్ జాతీయ పురస్కారంపై చిరంజీవిహైదరాబాద్: ఎన్టీఆర్ అంటే కళల సమ్మేళనమని, అలాంటి మహానుభావుడి పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ తనకు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తు న్నానని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నారు. తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడు అంటూ ఎన్టీఆర్ను కొనియాడారు. ‘దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపో యినా… కొన్ని పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ ఆయనది. రామా రావు జన్మించిందే సినిమాల కోసం […] The post గొప్ప గౌరవంగా భావిస్తున్నా… appeared first on Visalaandhra .
సేతుపతి- సాయిపల్లవితో మణిరత్నం సినిమా
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం కొత్త సినిమాకు సంగీత దర్శకుడి విషయంలో కోలీవుడ్లో చర్చ సాగింది. రొటీన్కు భిన్నంగా ఈసారి తన చిత్రం కోసం వర్ధమాన సంగీత దర్శకుడిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్ ఇచ్చిన అప్డేట్తో ఈ రూమర్లకు చెక్ పడినట్లైంది. తమ సినిమా ఆడియో రైట్స్ సోనీ మ్యూజిక్ సొంతం చేసుకొందని తెలియజేస్తూ ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. […] The post సేతుపతి- సాయిపల్లవితో మణిరత్నం సినిమా appeared first on Visalaandhra .
వెస్టిండీస్తో జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా మహిళా టీమ్ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల సిరీస్లో 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ బేథ్ మూపీ అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 79 పరుగులు సాధించింది. ఇక ఎలిసె పేరి (36) పరుగులు చేసి తనవంతు సహకారం అందించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ ఖియానా జోసెఫ్ (45), స్టెఫాని (28) రాణించినా ఫలితం లేకుండా పోయింది.
హైదరాబాద్: ఆది సాయి కుమార్ హీరోగా ఎస్జీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై జి.సురేష్ నిర్మిస్తున్న ‘ఈగో రాజా’ మూవీని గురు శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆదితో పాటుగా నటుడు సతీష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలను ఉగాది సందర్భంగా వెల్లడించారు. యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్తో రాబోతోన్న ఈ మూవీ అద్భుతంగా ఉండబోతోందని టీం నమ్మకంగా చెబుతోంది. ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ ఆది సాయి […] The post ‘ఈగో రాజా’గా సాయికుమార్ appeared first on Visalaandhra .
వన్డే ప్రపంచ కప్ : 20 మంది ప్రాబబుల్స్ సిద్ధం
ముంబై: ఓ వైపు ఐపీఎల్ 2026 సీజన్ సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లోనే మెగా లీగ్ ప్రారంభం కానుంది. ఇది పూర్తయ్యే వరకూ ఏ భారత క్రికెటరూ అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం ఉండదు. కానీ, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం నిశ్శబ్దంగా మహాసంగ్రామం కోసం జట్టును సిద్ధం చేసే పనిలో ఉంది. ఇప్పటికే ఓ 20 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ కోసమేనని […] The post వన్డే ప్రపంచ కప్ : 20 మంది ప్రాబబుల్స్ సిద్ధం appeared first on Visalaandhra .
ఈ నెల 23న ‘వాహన్ పోర్టల్’ ప్రారంభం
రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పారదర్శక, వేగవంత, సులభమైన సేవలను అందించేందుకు ‘వాహన్ పోర్టల్’ను ఈ నెల 23న ప్రారంభించ నున్నట్లు రవాణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.. ఈ పోర్టల్ను రవాణా, బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ వాహన్ పోర్టల్ ద్వారా దేశ వ్యాప్త వాహనాల సమాచారం ఒకే చోట లభ్యమౌతుందని తెలిపారు. వాహన్తో అనుసంధానం వల్ల తెలంగాణకు చెందిన వాహనాలు జాతీయ డేటా బేస్ లోకి వెళ్ళనున్నాయి. అంతే కాకుండా రెండవ వాహనాలకు వర్తించే అదనపు 2 శాతం జీవితకాలపు పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రద్దు మార్చి 23 నుండి అమలులోకి వస్తుందని తెలిపారు.
దళిత సంక్షేమానికి పెద్ద ఎత్తున కేటాయింపులు
దళిత సంక్షేమానికి పెద్ద ఎత్తున కేటాయింపులు అంబేద్కర్ నాలెడ్జ్ టవర్తో దళిత విద్యార్థుల
ఇక్కత్ చేనేత చీరలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి
ఇక్కత్ చేనేత చీరలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి ఇక్కత్ చేనేత చీరలు,
పోకిరిల పై చర్య తీసుకోవాలి.. ఎస్సై కి వినతిపత్రం అందజేసిన ఏబీవీపీ నేతలు
పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు ఎంతో కీలకం
గోదావరిఖని, జనంసాక్షి : ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్bకుమార్ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో భాగంగా మొబైల్ టవర్లు, కాలుష్యం, పచ్చదనం తగ్గిపోవడం …
అంకెల గారడీ బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేది శూన్యం
అంకెల గారడీ బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేది శూన్యం మహిళలు,పేద ప్రజలను, నిరుద్యోగులను
1.6 లక్షల కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు 856 కోట్ల 98 లక్షల పన్ను మినహాయింపు
ఎలక్ట్రిక్ వాహన విధానం కింద 1 లక్ష 6 వేలఎలక్ట్రిక్ వాహనాలకు 856 కోట్ల 98 లక్షలపన్ను మినహాయింపులు ఇచ్చి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా రవాణా శాఖ పనితీరు, కేటాయింపులపై మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి రాబడి తగ్గినా పర్యావరణ పరిరక్షణ విషయంలో వెనుకడుగు వేయడం లేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ పరిధిలో 1 కోటి 82 లక్షల నమోదిత వాహనాలు ఉండగా వ్యవసాయ, త్రిచక్ర వాహనాలకు చెందిన 11 లక్షల 75 వేల వాహనాలకు, 105 కోట్ల 16 లక్షలరూపాయల పన్ను మినహాయింపులు చేశామని తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలు సారథి, వాహన్ లను తెలంగాణలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వాహన్ సేవలను వచ్చే ఆరు నెలల్లో పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్ అండ్బి రోడ్లను హామ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ అండ్ బి రోడ్డు నిర్మాణంతో పాటు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాల నినిర్ణయించామని డిప్యూటీ సిఎం భట్టి వెల్లడించారు.
బురదలో గార్ధేబాల పరుగు… కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆచార సంప్రదాయాలకు కర్నూలు
పెద్ద వెంకటాపురంలో వడగండ్ల వాన
పెద్ద వెంకటాపురంలో వడగండ్ల వాన ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో గురువారం
అత్యంత నిరాశజనక బడ్జెట్ : బిజెపి రామచందర్రావు
తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజ నకంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఆర్థిక మంత్రి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క బహుశా పొరపా టున గత ఏడాది బడ్జెట్ నే చదివారేమో అన్న అనుమానం కలుగుతోందని, ఎందుకంటే పోయినసారి బడ్జెట్ కన్నా ఇందులో పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా, ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో, ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పుకోవడానికి ఒక్క రిజల్ట్ కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా విద్యా రంగానికి ఈ బడ్జెట్లో తీరని అన్యాయం జరి గిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి గత ఏడాది కంటే రూ. 1000 కోట్లు పెంచినట్లు చూపిస్తున్నా, ఓవరాల్ బడ్జెట్లో దీని వాటా కేవలం 8 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (13 శాతం), బీహార్ (21శాతం) తమ బడ్జెట్లో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతలో సగం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ’ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు’ అని గొప్పలు చెప్పడం తప్ప, విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ఒక్క ప్రయత్నం కూడా కనిపించడం లేదన్నారు.
గల్ఫ్లో చమురు కేంద్రాలపై దాడులు ఉధృతం అయ్యాయి. తమ ప్రతీకార దాడుల్లో ఇరాన్ శుక్రవారం కువైట్ లోని మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్లతో దాడికి దిగింది. ప్రస్తుత పోరు గల్ఫ్లోని ఇంధన వ్యవస్థలను దెబ్బతీయడం అంతర్జాతీయంగా చమురు సంక్షోమ తీవ్రతకు దారితీసన దశలోనే కువైట్లోని రిఫైనరీకి భారీ నష్టం సంభవించింది.ప్రతిరోజూ 7,30,00 బ్యారెల్స్ శుద్ధి సామర్థం గల ఈ రిఫైనరీ వరుసగా రెండో రోజు కూడా దాడులకు గురైంది. చమురు సంపన్న గల్ఫ్ దేశం కువైట్లో ఉన్న మూడు రిఫైనరీలలో మినా రిఫైనరీ ఒకటి. పర్షియన్ గల్ఫ్లోని తమ భారీ సహజవాయువు ఉత్పత్తి సౌత్ పార్స్ కేంద్రంపై ఇజ్రాయెల్ బుధవారం జరిపిన దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్లోని పలు చమురు క్షేత్రాలపై దాడులకు దిగుతోంది. ఇంతకు ముందే దెబ్బతిని ఉన్న కువైట్ రిఫైనరీ ఇప్పటి దాడులతో మరింత ధ్వంసం అయింది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ దాడుల క్రమంలోనే ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా మొజ్తాబీ నుంచి అరుదైన ప్రకటన వెలువడింది.ఇక ఇరాన్ శత్రువులు తమ భద్రతను గాలికి వదిలిపెట్టాల్సిందే అని ఆయన తరఫున ప్రకటనను వార్తా సంస్థలు వెలువరించాయి. మరో వైపు ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజాము నుంచే టెహరాన్పై దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ క్షిపణుల దాడులలో పలు ప్రాంతాలో మంటలు చెలరేగాయి. పర్షియన్ న్యూ ఇయర్ దశలోనే ఈ దాడులు ముమ్మరం అయ్యాయి. ఇరాన్ దాడులకు దెబ్బతింటున్న దుబాయ్లో శుక్రవారం కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. స్థానికంగా ఈదుల్ ఫితర్కు ప్రజలు సిద్ధమైన దశలోనే క్షిపణులు, డ్రోన్ల దాడుల భయాలు నెలకొన్నాయి. బహరైన్లో ఓ ఆయుధగిడ్డంగిపై దాడి జరిగింది. సైదీ అరేబియాలోని చమురు సంపన్న తూర్పు ప్రాంతంలో పలు డ్రోన్లను భద్రతా దళాలు నేలకూల్చాయి. ఇరాన్కు చెందిన గ్యాస్ ఫీల్డ్లపై మరోసారి దాడులకు దిగబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. చమురు సంక్షోభ తీవ్రత దశలో ట్రంప్ చేసిన విజ్ఞప్తి మేరకు తాము స్పందించినట్లు వివరించారు. ఇప్పటికే ఇరాన్ ఖండాంతర క్షిపణుల ఉత్పత్తి సామర్థాన్ని దెబ్బతీశామని తెలిపారు. ఈ వాదనను ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ వర్గాలు తోసిపుచ్చాయి. ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడుల్లో సిరియాలోని కొన్ని మిలిటెంట్ స్థావరాలు దెబ్బతిన్నాయి. డ్రూజే ప్రాంతంలో ఇంతకు ముందు జరిగిన దాడులకు ప్రతిగా సిరియాలోని స్థావరాలను లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్ స్పందించింది.
వాస్తవ పరిస్థితులకు భిన్నంగా రాష్ట్ర బడ్జెట్
వాస్తవ పరిస్థితులకు భిన్నంగా రాష్ట్ర బడ్జెట్ రాజీవ్ యువవికాసం పేరుతో ఉద్యోగు లను
పన్నులు పెంచలేదు…సవరణలే చేశాం మున్సిపాలిటీగా మారిన తర్వాత ఆస్తుల పునఃపరిశీలన చేసాంఅండర్ అసెస్డ్
కుమార్తెతో కలిసి ట్యాంకర్ పై కిమ్ షికారు
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్జూయే మరోసారి వార్తల్లో నిలిచారు. సైనిక విన్యాసాల్లో ఆమె ట్యాంకర్ నడిపిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సియోల్ నుంచి వచ్చిన సమాచార ప్రకారం, తండ్రి పర్యవేక్షణలో జరిగిన సైనిక శిక్షణలో కిమ్జూయే ట్యాంకర్ను నడిపిన దృశ్యాలు బయటకు రావడంతో, ఆమెను భవిష్యత్ వారసురాలిగా తయారు చేస్తున్నారనే ఊహాగానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, కిమ్ జోంగ్ ఉన్ సైనిక ట్యాంకర్ దళాలు, సైనికులతో కూడిన వ్యూహాత్మక విన్యాసాలను పర్యవేక్షించి, యుద్ధ సన్నద్ధతను పూర్తి చేయాలని సైన్యానికి పిలుపునిచ్చారు. విడుదలైన వీడియోలు, చిత్రాల్లో ఆయన కుమార్తె ఒక ఆకుపచ్చ రంగు ట్యాంకర్ డ్రైవర్ హ్యాచ్ నుంచి బయటికి చూసుకుంటూ వాహనాన్ని నడుపుతుండగా, కిమ్ పైభాగంలో కూర్చొని చిరునవ్వుతో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సుమారు 13 సంవత్సరాల వయస్సు గల కిమ్ జూయే, 2022 చివరి నుండి తండ్రితో కలిసి పలువురు కీలక సైనిక, ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపిస్తోంది. ఉత్తర కొరియా మీడియా ఆమెను అత్యంత ప్రియమైన, గౌరవనీయమైన సంతానంగా పేర్కొంటూ, ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని చూపించే దృశ్యాలను తరచుగా ప్రసారం చేస్తోంది. ఇటీవల ఒక ఆయుధ తయారీ కేంద్రాన్ని సందర్శించినప్పుడు తండ్రితో కలిసి తుపాకీ కాల్పులు జరపడం, రాకెట్ ప్రయోగాల పరీక్షలను వీక్షించడం వంటి కార్యకలాపాల్లో కూడా ఆమె పాల్గొంది. గత సెప్టెంబర్లో బీజింగ్ పర్యటనలో తండ్రిని అనుసరించిన ఈ యువతి, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయనకు చెంపపై ముద్దు పెట్టిన దృశ్యాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. దక్షిణ కొరియా గూఢచారి సంస్థ ఇటీవల ఆమెను వారసురాలిగా ప్రకటించే దిశగా కిమ్ అడుగులు వేస్తున్నారని అంచనా వేసింది. అయితే కిమ్ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
రైతుల కోసం అసెంబ్లీలో గళమెత్తిన కడియం..!
రైతుల కోసం అసెంబ్లీలో గళమెత్తిన కడియం..! మొక్కజొన్న రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యేవెంటనే
వెల్దండలో అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష..
వెల్దండలో అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష.. వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ
Ashish’s DeThadi Interesting Glimpse Poster
Young hero Ashish who made his mark with films like Rowdy Boys and Love Me is presently starring in a rustic and culturally rooted Hyderabad based film DeThadi, being produced by Dil Raju and Shirish under Sri Venkateswara Creations with Aditya Rao Gangasani making his directorial debut. The project is swiftly moving through its shoot. […] The post Ashish’s DeThadi Interesting Glimpse Poster appeared first on Telugu360 .
ముస్లిం సోద్రులకు సిఎం రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ (ఈద్- ఉల్- ఫితర్) పండుగను ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్య్మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అలా ్ల దువా ఉండాలని ముఖ్య్మంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఫ్యాక్ట్ చెక్: రైలులో సీట్ కోసం గొడవ అంటూ స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు
రైలులో సీట్ కోసం గొడవ అంటూ స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా..
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు..
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు.. ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా పాయకాపురం, ఆంధ్రప్రభ :
ముస్లింలకు కెసిఆర్ రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లిం సహోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభం నుంచి చివరి రోజు వరకు, ప్రతి రోజూ ప్రత్యేక దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధలతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని అన్నారు.ఈ సందర్భంగా పరస్పర శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలు పరిమళిస్తాయని పేర్కొన్నారు. లౌకికవాద విలువలకు ప్రాధాన్యతనిస్తూ, విభిన్న మతాల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ, గంగా-జమున తహజీబ్కు ప్రతీకగా బిఆర్ఎస్ పాలన కొనసాగిందని తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, ప్రగతి కోసం విద్య తదితర రంగాల్లో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారి జీవన విధానంలో గుణాత్మక మార్పుకు దోహదం చేశాయని అన్నారు. ప్రగతి తిరిగి పుంజుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కెసిఆర్ ఆకాంక్షించారు.
సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత..
సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత.. భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ
ప్రతి అర్జీపై బాధ్యతాయుత చర్యలు
ప్రతి అర్జీపై బాధ్యతాయుత చర్యలు సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు పాయకాపురం,ఆంధ్ర ప్రభ :
ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు
ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని
అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్
అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ నిజామాబాద్ జిల్లా
కనకదుర్గమ్మవారికి బంగారు కానుక
కనకదుర్గమ్మవారికి బంగారు కానుక విలువైన మంగళసూత్రాలు కానుక ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడ
ఫ్యాక్ట్ చెక్: ఇరాన్ భారత్ కు చెందిన నౌకపై దాడి చేసిందంటూ ఏఐ వీడియోను షేర్ చేస్తున్నారు
ఇరాన్ భారత్ కు చెందిన నౌకపై దాడి చేసిందంటూ
వినియోగదారులకు షాక్.. ఆ ఫీజు పెంచేసిన జొమాటో..
పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ప్లాట్ఫామ్ ఫీజును జొమాటో పెంచేసింది. కంపెనీ యాప్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వినియోగదారులు ఒక్కో ఆర్డర్కు ఇక నుంచి రూ.2.40 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే వసూలు చేస్తున్న ఫీజు రూ.12.50 నుంచి 14.90కి పెరిగింది. జొమాటో, దాని పోటీ సంస్థ స్విగ్గీ ఒకే తరహాలో ధరల ట్రెండ్ను అనుసరిస్తుంటాయి. అన్ని పన్నులు కలుపుకొని ప్రస్తుతం స్విగ్గీ వసూలు చేస్తున్న ప్లాట్ఫామ్ ఫీజు రూ.14.99గా ఉంది. యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు డెలివరీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఫీజు పెంపునకు అది ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
పారదర్శకంగా పంట నష్టాల నివేదికలు
పారదర్శకంగా పంట నష్టాల నివేదికలు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదుఅకాల వర్షాలపై

25 C