కెటిఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు చీడ పురుగుల్లా అభివృద్ధి కి అడ్డుపడుతూ బ్యాడ్ బ్రదర్స్గా గుర్తింపు తెచ్చుకున్నారని సిఎం రేవంత్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ను ఓడించాలని, బిజెపికి డిపాజిట్ దక్కరాదని ఆయన ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రేవంత్రెడ్డి శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడు తూ బిఆర్ఎస్, బిజెపిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీ న్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004-2014 మధ్య కాలంలో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అ భివృద్ధి చెందిందని తెలిపారు. ఓఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్ర యం, మెట్రో రైలు ఇంకా ఎన్నెన్నో పథకాలను తీసుకుని వచ్చామని ఆయన వివరించారు. కాగా 2014 నుంచి కేంద్రంలో బిజెపి, రా ష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి చేసింది శూ న్యమని ఆయన విమర్శించారు. హైదరాబాద్లో ఎటువంటి అభివృ ద్ధి జరగలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు రూ. 16 వేల కో ట్ల మిగులు బడ్జెట్ ఉందన్నారు. 2023 సంవత్సరంలో కెసిఆర్ తెలంగాణను ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్కు ప్రభుత్వా న్ని అప్పగించారని ఆయన తెలిపారు. గతంలో ఐటిఐఆర్ను కూడా మంజూరు చేసి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదని ఆయన తెలిపారు. వరదలు వచ్చి హైదరాబాద్ నీట మునిగితే కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అణాపైసా కూడా లేదని ఆయన దుయ్యబట్టారు. అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా పేదల ఆస్తులు కోల్పోయి నష్టం జరిగితే వారికి ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. బిఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, కమాండ్ కంట్రోలు, సచివాలయం, ప్రగతి భవన్ నిర్మించారని, దీని వల్ల పేదలకు ఏమైనా ఉపయోగపడిందా? అని ఆయన ప్రశ్నించారు. కుమారున్ని సిఎం చేయడానికే, వాస్తు సరిగ్గా లేదన్న భావనతో మంచిగా ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్తగా నిర్మించారని ఆయన విమర్శించారు. దీంతో కొత్త ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. విపక్షాలపై, మీడియా వారిపై నిఘా పెట్టేందుకే బంజారాహిల్స్లో కమాండ్ కంట్రోలు పెట్టారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్ళలో కూలిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్, కెటిఆర్ మెట్రో రైలును పొడిగించలేదని, ఎల్అండ్టిని బెదిరించి, బ్లాక్మెయిల్ చేశారని ఆయన విమర్శించారు. మెట్రో విస్తరణకు రూ. 73 వేల కోట్లతో ప్రణాళికను కేంద్రానికి ఇచ్చామని ఆయన చెప్పారు. గతంలో కాంగ్రెస్ నేతలు పి. జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి కోసం పోరాడితే వారికి ‘హైదరాబాద్ బ్రదర్స్’ మంచి పేరు లభిస్తే, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కెటిఆర్ అభివృద్ధికి అడ్డుపడుతున్నందున బ్యాడ్ బ్రదర్స్గా గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన విమర్శించారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ప్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్కు ఇరవై టిఎంసిల జలాలు తేవాలనుకుంటే అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇంకా ఫైవోవర్ల నిర్మాణం, అండర్ పాస్లు, ఎలివేటెడ్ కారిడార్లకూ అడ్డుపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న కంటోన్మెంట్ నుంచి శామీర్పేట్, మేడ్చల్కు, ఎలివేటెడ్ కారిడార్లకు అనుమతి తెచ్చి ఐదు వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామని ఆయన వివరించారు. భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలన్న ఆలోచనతో 2047 విజన్ డాక్యుమెంట్తో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలు లోక్సభ ఎన్నికలతోనే సరిపోయిందన్నారు. మిగిలిన సంవత్సరంన్నర కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తేగలిగామని అన్నారు. లక్ష కోట్ల ఆదాయం లభించే ఓఆర్ఆర్ను ఏడు వేల కోట్ల రూపాయలకు గత ప్రభుత్వం అమ్ముకున్నదని ఆయన దుయ్యబట్టారు. దీపావళి రోజున డ్రగ్స్ పట్టుబడిన వారిని ఏమనాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పట్టుబడిన వ్యక్తి కెటిఆర్కు సన్నిహితుడని ఆయన తెలిపారు. స్కూల్ పిల్లలకు డ్రగ్స్ చాక్లెట్లు విక్రయించారని ఆయన చెప్పారు. మద్యం తాగితే పట్టుబడ్డ వారికి జరిమానా, జైలు శిక్ష ఉంది కానీ గంజాయి సేవించిన వారికి శిక్ష లేదన్నారు. ఈ విషయమై తాము వచ్చే అసెంబ్లీలో చర్చించి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. హైదరాబాద్లో నలభై నాలుగు చెరువులను కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. అంబర్పేటలో బతకమ్మ కుంటను కాపాడడమే కాకుండా అది ప్రజలకు ఉపయోగపడేలా చేశామని ఆయన తెలిపారు. ఈ కుంటను బిఆర్ఎస్కు చెందిన నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆక్రమించారని, దీనికి ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. నాగార్జునకు ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకపోతే ఎన్-కన్వెన్షన్ను కూల్చి వేసామని ఆయన తెలిపారు. అహ్మదాబాద్లో సబర్మతి ప్రక్షాళన, యూపీలో యమునా నది ప్రక్షాళన చేశారని, అయితే నగరంలో మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. అడుగడుగునా అవినీతి జరిగిందని, చివరకు యాదగిరి గుట్ట, కోవిడ్ను కూడా వదలలేదని ఆయన విమర్శించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూం నిర్మించుకున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తాను ప్రస్తుతం ఆ నివాసంలో ఉంటున్న డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్కను అడిగి తెలుసుకున్నానని అన్నారు. గతంలో సద్దాం హుస్సేన్కు ప్రాణ భయం ఉండేదని, దీంతో తనలాగే పోలిక ఉన్న ఆరుగురిని తయారు చేయించి, ముందుకు ఏదైనా కార్యక్రమానికి పంపించే వారని దీంతో దుండగులు దాడి చేసేందుకు అవకాశం ఉండేది కాదట అని చదివానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆగర్భ శ్రీమంతులు టివీలు, పేపర్లను స్థాపించారని ఆయన విమర్శించారు. ప్రజలను ఎంత కాలం మభ్య పెడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మాగంటి గోపి మరణంపై.. మాగంటి గోపినాథ్ మరణంపై రాజకీయాలు చేయవద్దని ఆయన కోరారు. అయితే మాగంటి గోపి తల్లి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా గోపి మరణంపై మాట్లాడడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, బండి సంజయ్ మాదాపూర్ పోలీసు స్టేషన్లో, లేదా డిజిపికి లేఖ రాసినా విచారణ జరిపిస్తామన్నారు. గద్దరన్న అవార్డులను ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
జూబ్లీహిల్స్లో నిశ్శబ్ద విప్లవం
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ని శ్శబ్ద విప్లవం రాబోతుందని బిఆర్ఎస్ పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి త న్నీరు హరీష్రావు అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతో రాష్ట్ర భవిష్యత్కు దశ దిశ ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. జూబ్లీహిల్స్ తీర్పు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రెండేళ్ల రేవంత్ పాలన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్ర జలు చరమగీతం పాడనున్నారని అన్నారు. కెసిఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో విధ్వంసం అని, జూబ్లీహిల్స్ ఎన్నిక వికాసానికి, వి ధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో ఎ న్నికలు నాలుగు లక్షల మంది భవిష్యత్తు కాదు అని, ఈ ఉప ఎన్నిక నా లుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తుందని స్పష్టం చే శారు. బిఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ. 5300 కోట్లతో పనులు చేశామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో ప్రజలు ఇచ్చే తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే మూడేళ్లపాటు నరకయాతన అనుభవించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఆలోచించి ఆత్మసాక్షిగా ఓటు వేయాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీష్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చెప్పుకోవడానికి ఏమీ లేకనే.. జూబ్లీహిల్స్లో రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ చేసి జూబ్లీహిల్స్లో ఓట్లు వేయించుకోవాలని రేవంత్ చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటు వేయకుంటే.. రేషన్ కార్డులు ఆగిపోతాయని, పెన్షన్లు రావని అంటున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు రేవంత్ ఇంట్లో నుంచి ఇస్తున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదని అన్నారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమాచార హక్కు చట్టం ఉపయోగించి రియల్ ఎస్టేట్ వర్గాలను, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ బెదిరింపులకు ఎవరూ భయపడద్దని, ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బిఆర్ఎస్ ప్రజల గొంతుగా పోరాడుతుందని తెలిపారు. జూబ్లీహిల్స్లో ప్రజలు ప్రశ్నించే గొంతును గెలిపించాలని కోకారు. రాష్ట్రంలో రెండే టీమ్లు ఉన్నాయని ఒకటి ఆరు గ్యారంటీఉల ఎగ్గొట్టిన టీమ్ అయితే రెండోది ఆరు గ్యారంటీల అమలుపై గల్లా పట్టి అడిగే టీమ్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో నలుగురు బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు రేవంత్రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదని హరీష్రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో నాలుగు కోట్ల ప్రజలు కాదు.. నలుగురు బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. హామీ ఇచ్చిన గ్యారంటీలు ఎగ్గొట్టిన ప్రభుత్వం రేవంత్రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ అడుగుతున్న కళాశాలను రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను కెసిఆర్ కొనసాగించారని గుర్తుచేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.19500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేశామని, కరోనా సమయంలో కూడా నిధులు ఆపలేదని చెప్పారు. రెండేళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు రూపాయలు కూడా ఇవ్వలేదని, దాంతో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కాలేజీ యాజమాన్యాలు నిరవధిక బంద్కు దిగాయని అన్నారు. ఆ కాలేజీల్లో చదువుతున్న పిల్లలు జూబ్లీహిల్స్లో కూడా ఉన్నారని చెప్పారు. ఆరోగ్య శ్రీ వైఎస్ఆర్ తెచ్చిన పథకం అని గొప్పలు చెప్పడం కాదు.. ఆ పథకం అమలు చేయడం లేదని విమర్శించారు.ఆరోగ్య శ్రీ బకాయిలు అడిగితే ఆసుపత్రులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కాలేజీలు, ఆసుపత్రులు బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు డిఎలు, పిఆర్సి అడిగితే ఉద్యోగులపై ఎసిబి దాడులు చేస్తున్నారని అన్నారు. దేశంలో అత్యధిక డి.ఎలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం మన తెలంగాణ అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇచ్చేందుకు డబ్బులు లేవు కానీ, కమీషన్లు వచ్చే మూసీ అభివృద్ధి పనులుకు, ఫ్యూచర్ సిటీ పనులకు డబ్బులు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. హైడ్రా విషయంలో డిప్యూటీ సిఎం భట్టి, సిఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. 13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చెరువులో ఉన్నాయని, ఆ ప్రాజెక్టులు ఎవరివి అయినా కూల్చివేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రెస్మీట్ చెప్పారని, తర్వాత వాటి గురించి మాట్లాడలేదని ఆరోపించారు. డిప్యూటీ సిఎం ప్రెస్మీట్ పెడితే, సిఎం సెటిల్మెంట్ చేసుకున్నారని ఆరోపించారు. హైడ్రా పేదల ఇళ్లను కూలగొడుతూ పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని అన్నారు. బిఆర్ఎస్ ఒత్తిడితోనే ముస్లింలకు మంత్రి పదవి కంటోన్మెంట్లో కడతామన్న ఆరు వేల డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎక్కడ..? అని హరీష్రావు సిఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి కంటోన్మెంట్లో గెలిచారని విమర్శించారు. బిఆర్ఎస్ ఒత్తిడితోనే ముస్లింలకు మంత్రి పదవి వచ్చిందని, తమ ఒత్తిడితోనే ఎన్టిఆర్, పిజెఆర్ విగ్రహాల హామీలు ఇస్తున్నారని పేర్కొన్నారు. రెండేళ్ళుగా అజహారుద్దీన్కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సినీ యాక్టర్స్ను జైల్లో పెట్టిన రేవంత్.. సినీ కార్మికులకు ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. 2023లో పిజెఆర్ కొడుకుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని అడిగారు. కాంగ్రెస్ అరాచకం, మంత్రి పదవి ఇవ్వకపోవటంతోనే పిజెఆర్ చనిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రభుత్వంపై సిఎంకు పట్టు లేదు బిఆర్ఎస్ నేతలు మర్రి జనార్థన్ రెడ్డి, రవీందర్ రావు ఇంటిపై దాడులను మాజీ మంత్రి హరీష్రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులను బెదిరిస్తోందదని మండిపడ్డారు. కాంగ్రెస్ అరాచకాలపై 20 ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి హోంమంత్రిగా, విద్యామంత్రిగా, మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ అయ్యారని, ముఖ్యమంత్రిగా అట్టర్ ఫెయిల్ అయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై రోజుకో కాంగ్రెస్ ఎంఎల్ఎ ఉత్తరాలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. సొంత ప్రభుత్వంపై ముఖ్యమంత్రికి పట్టు లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి హయాంలో క్రైం రేటు పెరిగిందని, రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చిందని అన్నారు. డిజిపికి నియామకపత్రం ఇచ్చిన ఏకైన సిఎం రేవంత్రెడ్డినే అని విమర్శించారు. రేవంత్రెడ్డి సచివాలయంలో సమీక్షలు చేయడం లేదని, కమీషన్ల కోసం కమాండ్ కంట్రోలు సెంటర్లో సిఎం సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. ముస్లింలకు రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ లేకుంటే.. ముస్లింలు లేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణం అని హరీష్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది..? ముస్లింలు ఎప్పుడు నుంచి ఉన్నారు..? అని నిలదీశారు. ముస్లింలను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బిజెపి నుంచి 8 మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అని హరీష్రావు విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. ప్రధాని చెప్పిన ఆర్ఆర్ టాక్స్పై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపిలు కలిసి బిసిలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదన్ తమ్ముడు వెంకట్ యాదవ్కు మూడు ఓట్లు ఉన్నాయని, ఈ విషయంపై, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్త ఓట్ల నమోదుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని, అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలని తమ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని హరీష్రావు తెలిపారు.
వందేమాతరానికి కాంగ్రెస్ కత్తెర
న్యూఢిల్లీ: జాతీయగీతం వందేమాతరంలోని ము ఖ్యమైన చరణాలను 1937లో తొలగించారని, ఈ పరిణామంతో దేశ విభజనకు బీజాలు నాటారని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. జాతీయగీ తం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా జరిగే కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై స్పష్టమైన దాడి చేశారు. అటువంటి విభజన మనస్తత్వం ఇప్పటికీ దేశానికి ఓ పెను సవాల్ గానే ఉందని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని జాతీయగీతం స్మారక ప్రత్యేక స్టాంప్ను, నాణేన్ని కూడా విడుదల చేశారు. వందేమాతరం గీతం భారత స్వా తంత్ర పోరాట స్వరంగా మారింది. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి మంత్రం అయింది. ప్రతిభారతీయుడి భావాలకు అద్దంపట్టింది. దురదృష్టవశా త్తూ, 1937లో ఆ గీతంలోని ముఖ్యమైన చరణాలను తొలగించారు. దీంతో దాని ఆత్మను తొలగించినట్లు అయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో మహామంత్రం అయిన గీతం లో ముఖ్యమైన భాగాలు తొలగింపుతో విభజన బీ జాలు నాటుకున్నాయని, ఈ అన్యాయం ఎందుకు జరిగిందో నేటితరం తెలుసుకోవాలని ఆయన అ న్నారు. ఈ విభజన మనస్తత్వం, ఇప్పటికీ దేశానికి ఓ సవాలుగా ఉందని మోదీ పేర్కొన్నారు. వందేమాతరం కేవలం స్వాతంత్ర పోరాట నినాదం కా దని, ప్రతి యుగంలోనూ, ప్రతి తరంతోనూ సం బంధించినదిగా ఉంటుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ను ప్రధాని ప్రస్తావిస్తూ, శత్రువులు ఉగ్రవాదాన్ని ఉపయోగించి మన భద్రత, గౌరవం పై దాడి చేసేందుకు సాహసించినప్పుడు , భారతదేశం దుర్గా రూపాన్ని ఎలా ఆవిష్కరించు కుం టుందో ప్రపంచం చూసిందని ప్రధాని అన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అది ప్రజలకు కొత్త ప్రేరణ ఇ స్తుందని, కొత్త శక్తిని, ఉత్తేజాన్ని నింపుతుందని ఆ యన అన్నారు. వందేమాతరం అనేది గొప్ప పదం, ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల,ఒక సంకల్పం, ఇది భరతమాత పట్ల భక్తి, ఆరాధన. ఇది మనల్ని మన చరిత్రతో అనుసంధానిస్తుంది అని ప్రధాని ఉ ద్ఘాటించారు. అంతే కాదు మన భవిష్యత్ కు కొత్త ధైర్యాన్ని ఇస్తుందన్నారు. భారతదేశం సాధించలేని సంకల్పం లేదు. భారతీయులు సాధించలేని ల క్ష్యంలేదు. అంటూ, విజ్ఞానం, సైన్స్, టెక్నాలజీ ఆ ధారంగా ప్రపంచంలోనే అత్యున్నత దేశాన్ని మ నం నిర్మించుకోవాలని ఆయన వివరించారు. 20 25 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకూ దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా వందేమాతరం 150వ వార్షికోత్సవాలను ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్పూర్తిగా నిలిచిన మహా గీతం వందేమాతరం. మహాకవి, రచయిత బంకిం చంద్ర ఛట ర్జీ 1875 నవంబర్ 7న ఈ గీతాన్ని రాశారు.
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ అభివృద్ధికి తలమానికమైన త్రిపుల్ ఆర్ను తానే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మాట్లాడి మంజూరు చేయించానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశను, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను తాను అడ్డుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగజారి అవాస్తవాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రానికి పట్టిన శని అని అన్నారు. తాను మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, అయితే తాను ఎక్కడ అడ్డుకున్నానో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్ అండ్ టీతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒప్పందమే చేసుకోలేదని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేయలేదని వెల్లడించారు. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను అడ్డుకున్నానని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదని హితవు పలికారు. హైడ్రా నిజంగానే న్యాయం వైపు ఉంటే, ఆక్రమణలనే కూల్చివేస్తే ఇప్పటివరకు ఎంఐఎం కాలేజీలను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. మూసీ బాధితులకు న్యాయం చేయాలనుకుంటున్నామని కిషన్రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ చెడ్డ కుటుంబాలేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కి ఓటేస్తే మజ్లిస్కి ఓటేసినట్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ, హైమావతి నగర్ చౌరస్తాలో శుక్రవారం జరిగిన బహిరంగ సభల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్కి ఓటు వేస్తే మజ్లిస్కి ఓటు వేసినట్లేనని అన్నారు. ఆ పార్టీ పూర్తిగా మజ్లిస్ చేతుల్లో బందీ అయిపోయిందని అన్నారు. వాసవి బృందావనంలో రాంచందర్రావు ప్రచారం జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా - వాసవి బ్రిందావనం రెసిడెన్సియల్ సొసైటీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. తన నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించి అక్కడ ఉన్న ఓటర్లను కలిసి ప్రజల సమస్యలపై చర్చించారు. అక్కడ ఉన్న నివాసితులతో పాటు ఉదయం వాకింగ్ చేసే వారితో ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల విషయంలో సంచలన ప్రకటన చేశారు. డయాబెటిస్, ఒబెసిటీ (ఊబకా యం) ఉన్నవారికి వీసా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈమేరకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ నిబంధనలు వెంటనే అ మలు చేయాలని ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాలకు ట్రం ప్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినట్టు అంతర్జాతీయ మీడి యా కథనాలు చెబుతున్నాయి. అమెరికా వీసా కోసం దరఖా స్తు చేసుకునే వారి ఆరోగ్య పరిస్థితిని ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలించేవారు. స్క్రీనింగ్ టెస్టుల ద్వారా క్షయవంటి అంటువ్యాధులు ఉన్నాయా లేదా అని తనిఖీ చేసేవారు. ఇప్పుడు తా జా నిబంధనల ప్రకారం డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే వారికి వీసా ఇచ్చే అవకాశం ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడేవారిని అమెరికాలోకి ఆహ్వానిస్తే భ విష్యత్తులో కొన్నిసమస్యలు తలెత్తుతాయని, ఆ సమస్యలు ప్ర భుత్వ ఖజానాపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. కాబ ట్టి కొన్ని వ్యాధులున్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకపోతే సమస్యలకు చెక్ పెట్టినట్టే అవుతుంది. ఇలాంటివన్నీ ఆలోచించే డయాబెటిస్, ఊబకాయం ఉండే వారికి అమెరికా వీసా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. హృద్రోగ సమస్యలు, శ్వాససంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు,మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేడారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లను ఖ ర్చు చేయవలసి ఉంటుంది. ఇక ఒబెసిటీ కారణంగాఆస్తమా, స్లీ ప్ఆప్నియా, హైబీపీ వంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి రో గులకు సుదీర్ఘకాలం వైద్య చికిత్స అవసరం అవుతుంది. ఇది కు టుంబ సభ్యులపై ఆర్థిక భారం మోపుతుంది. దీనికి ప్రభుత్వం ఏదైనా సాయం అందించాలా? లేదా ప్రభుత్వ సాయం లేకుం డా కుటుంబ సభ్యులే ఆ ఖర్చును భరించగలరా? అనే విషయంపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఇక కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అయితే ఈ వార్తలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించలేదు. వలసదారుల వల్ల అమెరికాలోఇబ్బందులు తలెత్తకూడదని ట్రంప్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది. విదేశీ విద్యార్థులు, ఎక్సేంజీ విజిటర్ల డ్యురేషన్ ఆఫ్ స్టేపై పరిమితి విధించడం, హెచ్1బీ వీసాపై వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలు వలసదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈజ్ ఆఫ్ డూయింగ్లో తెలంగాణ రోల్మోడల్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బి జినెస్లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన ‘తెలంగాణ’లో అవకాశాలు పుష్కలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా - యూ టా పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. వరల్ ట్రేడ్ సెంటర్ - యూ టా ఎండీ, సీవోవో డేవిడ్ కార్లెబాగ్ నేతృత్వంలోని ‘యూ టా పారిశ్రామికవేత్తల బృందం’ శుక్రవారం సచివాలయం లో ఆయనను ప్రత్యేకంగా కలిసింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వానస్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, ఏఐ ఆధారిత హెల్త్ కేర్, క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, స్కిల్స్ తదితర రంగాల్లో ‘యూటా-తెలంగాణ’ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాల పై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాక, గ్లోబల్ ఎకానమీకి సపోర్ట్ ఇచ్చేలా, లాంగ్-టర్మ్ వాల్యూ క్రియేషన్ కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తీసుకొచ్చిన సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఏయే రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం, పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలు, పారిశ్రామికవేత్తలకిచ్చే ప్రోత్సాహాకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం టీ-హబ్, టీ- వర్క్, వీహబ్లను వరల్ ట్రేడ్ సెంటర్ - యూటా, సిలికాన్ స్లోప్స్ అండ్ యూటా టెక్ స్టార్టప్లతో అనుసంధానించేలా చొరవ చూపాలని ప్రతినిధి బృందాన్ని ఆయన కోరారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో యూనివర్సిటీ ఆఫ్ యూటా, బీవైయూ, న్యూమాంట్ యూనివర్సిటీలతో కలిసి రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఉమ్మడి అకడమిక్, రీసెర్చ్ ప్రోగ్రామ్ లను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘యూటా’ రాష్ట్రంతో పటిష్ఠమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ద్వైపాక్షిక సహకారం పెట్టుబడులకే పరిమితం కాకుండా ఇన్నోవేషన్, స్కిల్స్, టెక్నాలజీ రంగాల్లోఉమ్మడి ఆవిష్కరణలకు దిక్సూచీగా మారాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. తెలంగాణ లాంటి ఫాస్ట్-గ్రోయింగ్, డైనమిక్, ప్రో-యాక్టివ్ రాష్ట్రంతో కలిసి పని చేసేందుకు ‘యూటా’ సిద్ధంగా ఉందని డేవిడ్ కార్లెబాగ్ అన్నారు. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడి విషయంలో తెలంగాణతో కలిసి చురుగ్గా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో యూటా హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ జేసన్ థాంప్సన్, మాట్ మాక్ఫెర్సన్, నికోల్ మాక్ఫెర్సన్, లైఫ్ టైం ప్రెసిడెంట్ బీజే హాకే, జేకేడీ ప్రెసిడెంట్ మైక్ నెల్సన్, మోనెరె ఏఐ సీఈవో, కో-ఫౌండర్ మౌ నంది, భారత్ వ్యాలీ అడ్వైజర్లు స్టీవ్ వుడ్, సున్హాష్ లోడే, ఎక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ ఫౌండర్ లక్ష్మినారాయణ, ఐఐఆర్ఎఫ్ గురు సౌలే తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 08-11-2025
వెల్దుర్తి, (ఆంధ్రప్రభ) : వెల్దుర్తి సమీపంలోని జాతీయ రహదారి–44పై హనుమాన్ సర్కిల్ వద్ద
క్షణాల్లో స్పందించిన ఇన్స్పెక్టర్..
గోదావరిఖని టౌన్ (ఆంధ్రప్రభ) : పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖని
మాగంటి ఆస్తులపై సిఎం రేవంత్, కెటిఆర్ కన్ను
జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ కన్నేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కమార్ వ్యాఖ్యానించారు. గోపీనాథ్కు చెందిన ఆస్తి పంపకాల్లో రేవంత్, ట్విట్టర్ టిల్లు మధ్య ఇటీవల గొడవలు వచ్చాయని బండి సంజయ్ కమార్ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీ అని స్వయానా ఆయన తల్లే ఆరోపించిందని చెబుతూ దీనిపై ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలెవరూ స్పందించకపోవడానికి కారణం ఇదేనని చెప్పారు. నిజంగా చిత్తుశుద్ధి ఉంటే గోపీనాథ్ మరణంతోపాటు ఆస్తిపాస్తులపై ముఖ్యమంత్రి సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ (ఐఎంసీ) మధ్యే పోటీ ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. హిందువులంతా తమ సత్తా ఏమిటో కాంగ్రెస్కు రుచి చూపాలని కోరుతున్నానని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మజ్లిస్ గెలిచినట్లే అరాచకాలు, అక్రమాలకు తావిచ్చినట్లేనని అన్నారు. ఫీజు బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తారా? అసెంబ్లీ సాక్షిగా ప్రతినెల రూ.500 కోట్ల చొప్పున ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తామని టోకెన్లు ఇచ్చి మోసం చేసింది నిజం కాదా?, ఆనాటి నుండి నేటి వరకు ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను మోసం చేస్తోంది నిజం కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీ సాక్షిగా ఎందుకు హామీ ఇచ్చినట్లు? అని అడిగారు. చట్టసభలో ఇచ్చిన హామీకే విలువ లేకుంటే ఇక అసెంబ్లీకి విలువ ఏముందని అన్నారు. అసలు ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగిస్తారా? ఎత్తి వేస్తారా? ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రోడ్డెక్కిన గ్రీస్ విద్యార్థులు
. 40 నగరాల్లో భారీ ర్యాలీలు. విద్యా రంగంలో సమస్యల పరిష్కారానికి డిమాండ్ఏథెన్స్: గ్రీస్లో విద్యార్థులు భారీస్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యా రంగంలో సమస్యల పరిష్కారానికి కదం తొక్కారు. అధ్యాపకుల నియామకాలు, వారి క్రమబద్ధీకరణ, మెరుగైన బోధనా పద్ధతులు, వేతనాల్లో పెంపుదల కోసం డిమాండ్ చేశారు. దేశంలోని 40 నగరాల్లో ర్యాలీలు జరిగాయి. లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు వారికి మద్దతు ఇచ్చారు. అధ్యక్షుడు తసౌలాస్ ప్రభుత్వం అనుసరించే కార్పొరేట్ […] The post రోడ్డెక్కిన గ్రీస్ విద్యార్థులు appeared first on Visalaandhra .
. రష్యా చమురు కొనడం ఆపేశారు. వచ్చే ఏడాది భారత్ వస్తా: ట్రంప్ వాషింగ్టన్: ‘రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చాలా వరకు ఆపేశారు. ఆ దేశంతో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయి. కాబట్టి వచ్చే ఏడాది భారత్కు వెళ్లాలని ఉంది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడిరచారు. ఓవల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భారత్తో వాణిజ్య చర్చలలో పురోగతి ఉన్నట్లు తెలిపారు. ‘అంతా గొప్పగా సాగుతోంది. ఆయన (మోదీ) రష్యా నుంచి […] The post మోదీ గొప్ప వ్యక్తి… మిత్రుడు appeared first on Visalaandhra .
స్వీడెన్ కమ్యూనిస్టు విప్లవానికి 30 ఏళ్లు
స్టాక్హోమ్: స్వీడెన్ కమ్యూనిస్టు విప్లవానికి 30 ఏళ్లు పూర్తి అయ్యాయి. మూడు దశాబ్దాల కిందట అంటే 1995 నవంబరు 4`5 తేదీల్లో స్వీడెన్ కమ్యూనిస్టులు నిర్ణయాత్మక ముందడుగు వేశారు. కమ్యూనిస్టు విప్లవాత్మకతను కొనసాగించాలని నిర్ణయించారు. ఆ తేదీల్లోనే స్వీడెన్ కమ్యూనిస్టు పార్టీ పేరును మరోమారు సొంతం చేసుకున్నారు. శ్రామికవర్గం ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ శక్తితో సోషలిజం కోసం పోరాటాలతో ఈ పేరు ముడిపడి ఉంది. ప్రస్తుతం జరుపుకునే 30వ వార్షికోత్సవం పార్టీ సంస్థాగత చరిత్రలో కీలక […] The post స్వీడెన్ కమ్యూనిస్టు విప్లవానికి 30 ఏళ్లు appeared first on Visalaandhra .
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం 60 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరి వెళతాయని పేర్కొంది. చర్లపల్లి, నర్సాపూర్, మచిలీపట్నం స్టేషన్ల నుండి రైళ్లు రాకపోకలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ రైళ్లు నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పలు తేదీల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. నవంబరు 17, 24 తేదీల్లో, డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో, జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లాంకు రైళ్లు నడుస్తాయి. నవంబరు 19, 26 తేదీల్లో, డిసెంబరు 3, 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 7, 14, 21 తేదీల్లో కొల్లాం నుంచి చర్లపల్లికి రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు పగిడిపల్లి, గుంటూరు, గూడురు, రేణిగుంట మీదుగా వెళతాయని తెలిపింది. నవంబరు 16, 23, 30 తేదీల్లో, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో, జనవరి 4, 11, 18 తేదీల్లో నర్సాపూర్ నుంచి కొల్లాంకు మరికొన్ని రైళ్లు తిరుగుతాయి. నవంబరు 18, 25, 30 తేదీల్లో, డిసెంబరు 9, 16, 23, 30 తేదీల్లో, జనవరి 6, 13, 20 తేదీల్లో కొల్లాం నుంచి నర్సాపూర్కు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు విజయవాడ, గూడూరు, రేణిగుంట మీదుగా వెళతాయి. నవంబరు 14, 21, 28 తేదీల్లో, డిసెంబరు 26, జనవరి 02 తేదీల్లో మచిలీపట్నం నుంచి కొల్లాంకు రైళ్లు నడుస్తాయి. నవంబరు 16, 23, 30 తేదీల్లో, డిసెంబరు 28, జనవరి 04 తేదీల్లో కొల్లాం నుంచి మచిలీపట్నంకు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. డిసెంబరు 05, 12, 19 తేదీల్లో, జనవరి 09, 16 తేదీల్లో మచిలీపట్నం నుంచి కొల్లాంకు, డిసెంబరు 7, 14, 21 తేదీల్లో, జనవరి 11, 18 తేదీల్లో కొల్లాం నుంచి మచిలీపట్నంకు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు గుంటూరు, నంద్యాల, కడప, రేణిగుంట మీదుగా వెళతాయి.
తిరుమలలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం
శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వైకుంఠ ద్వార దర్శనం తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన ’డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. దర్శనానికి సంబంధించిన ఆన్లైన్, ఆఫ్లైన్ టోకెన్ల జారీ విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలోనూ కీలక మార్పు చేసినట్లు ఈవో ప్రకటించారు. ఇప్పటివరకు అమలులో ఉన్న డిప్ విధానాన్ని రద్దు చేసి, ’ముందు వచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన టోకెన్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ ద్వారా అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు శ్రీవాణి, ఇతర దర్శన టోకెన్ల జారీ విధానాన్ని సమీక్షించేందుకు టీటీడీ బోర్డు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇతర కీలక నిర్ణయాలు ఇవీ : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో ప్రకటించారు. మరోవైపు, శ్రీవాణి ట్రస్టుకు అందిన రూ.750 కోట్ల నిధులతో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో 5 వేల భజన మందిరాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, అమరావతి రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాకారం, కల్యాణ మండపం, రాజగోపురం వంటి అభివృద్ధి పనులను ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు తెలిపారు. తిరుమల అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కాపాడి, పచ్చదనాన్ని పెంచేందుకు పదేళ్ల ప్రణాళికను బోర్డు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదాలు అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.
క్రికెటర్ శ్రీచరణికిభారీ నజరానా
గ్రూపు-1 ఉద్యోగం, రూ.2.5 కోట్ల నగదు, ఇంటి స్థలంమహిళలు సత్తా చాటారు: చంద్రబాబు, లోకేశ్ ప్రశంస విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీచరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో పాటు ఇల్లు నిర్మించుకునేం దుకు కడపలో 1000 చ.గ. స్థలం కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 1 అధికారిగా […] The post క్రికెటర్ శ్రీచరణికిభారీ నజరానా appeared first on Visalaandhra .
రాష్ట్రమంతటా ఘనంగా 150 ఏళ్ల వేడుక విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన ‘వందేమాతరం’ గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందేమాతరం అంటూ విద్యార్థులు నినదించారు. జాతీయ జెండా చేబూని ప్రదర్శనలు చేపట్టారు. 150 ఆకృతిలో నిలబడి వందేమాతరం గీతాన్ని పాడారు. విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెం పాఠశాలలో 3,086 మంది విద్యార్థుల గీతాలాపన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు […] The post మార్మోగిన వందేమాతరం appeared first on Visalaandhra .
క్లస్టర్వారీ పారిశ్రామికాభివృద్ధి
. మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో సీఎం చంద్రబాబు. రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు ఆమోదం విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల కోసం అవసరమైన భూముల్లో విద్యుత్ లభ్యత కూడా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఎస్ఐపీబీ ఆమోదించింది. […] The post క్లస్టర్వారీ పారిశ్రామికాభివృద్ధి appeared first on Visalaandhra .
ప్రజాసంపద కార్పొరేట్లకు ధారాదత్తం . ప్రభుత్వరంగ పరిశ్రమలను దెబ్బతీస్తున్న ప్రభుత్వ చర్యలు. 33 ఎంజీడీల నీటి కేటాయింపు ఒప్పందం రద్దు చేయాలి. ‘కూటమి’ నిర్ణయాలపై వామపక్ష, ప్రజాసంఘాల మండిపాటు విశాలాంధ్ర బ్యూరో- విశాఖపట్నం : కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, ప్రజల అవసరాలను దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి, వామపక్షాలు, కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. కారు చౌకగా కార్పొరేట్లకు భూములిస్తూ, ప్రభుత్వ రంగ పరిశ్రమలను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సెలార్ మిత్తల్ […] The post మిత్తల్కు ఊడిగం appeared first on Visalaandhra .
రాత్రి బస్సులపై స్పెషల్ ఫోకస్
కర్నూలు, (ఆంధ్రప్రభ): ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో కర్నూలు జిల్లా
అమరావతి నిర్మాణానికిమరో రూ.7,500 కోట్లు
ఎన్ఏబీఎఫ్ఐడీ నుండి రుణం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాజధాని నిర్మాణానికి రూ.7,500 కోట్ల రుణం అందించేందుకు నేషనల్ బ్యాంకు ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్ఏబీఎఫ్ఐడీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో అమరావతి నిర్మాణపనులు మరింత ఊపందుకోనున్నాయి. ఇప్పటికే సుమారు 40వేల కోట్లకు పైగా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రుణాలు సేకరించింది. ప్రస్తుతం 64వేల కోట్ల అంచనాలతో కూడిన నిర్మాణపనులకు టెండర్లు పిలిచింది. ఎట్టిపరిస్థితుల్లో మూడేళ్లలో రాజధాని […] The post అమరావతి నిర్మాణానికిమరో రూ.7,500 కోట్లు appeared first on Visalaandhra .
ఎస్వీయూలో మరోసారి చిరుత కలకలం !!
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మరోసారి చిరుత సంచారం
ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తారా ?: సిఎం రేవంత్ రెడ్డి
“ఫీజు రీయంబర్స్మెంట్ కోసం కళాశాలలను మూసి వేసి ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తారా?, విద్యార్థులతో జీవితాలతో చెలగాటమాడుతారా?, వచ్చే ఏడాది డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో&చూస్తా” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాలల బంద్ గురించి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్దకు ఎవరెవరూ ఏమేమీ పనుల కోసం వచ్చారో, వాటిని తాను తిరస్కరించినందున బంద్కు పిలుపునిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఏ కళాశాల ఎంత డొనెషన్లు వసూలు చేస్తున్నదో తనకు తెలుసునని అన్నారు. విద్య వ్యాపారం కాదు, సేవగా భావించాలని ఆయన తెలిపారు. మీ వెనకాల ఎవరు ఉన్నారో తనకు తెలుసునని అన్నారు. ఆరోరా రమేష్ ఎన్ని కళాశాలలకు అనుమతి కోరారో, మహబూబ్నగర్కు చెందిన జయప్రకాష్ హైదరాబాద్లో క్యాంపస్ కోరారని, వాటికి తాను సానూకలంగా స్పందించనందుకు కళాశాలలను మూసి వేయిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఫీజుల బకాయిలు ఈ రోజు కాకపోతే, రేపైనా వస్తాయన్నారు. కానీ బంద్తో విద్యార్థులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. మీ వెనుక బిజెపి నాయకులు ఉన్నారని ఆయన విమర్శించారు. సిట్ వేసి దర్యాప్తు చేయిస్తానన్నారు. ప్రభుత్వానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నదని అన్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైరెన వారికి చెల్లించడం వంటివి పోగా ఐదు వేల కోట్ల రూపాయలే మిగులుతున్నాయని, ఇందులో ఆరోగ్యశ్రీ, ఆర్టీసీకి చెల్లించడం, సన్న బియ్యం, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు చెల్లించాల్సి వస్తున్నదన్నారు. బిజెపి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అమాయకంగా వీరి ఉచ్చులో వడవద్దని ఆయన సూచించారు. మంద కృష్ణ మాదిగ, ఆర్. కృష్ణయ్య ముందుకు వస్తే వారి చేతికే చిట్టా ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
సానుభూతి ఓట్ల కోసం కెటిఆర్ ప్రాకులాట:మంత్రి పొంగులేటి
రాష్ట్ర ప్రజలకు చెందిన కోట్లాది రూపాయిల్ని కొల్లగొట్టిన కెసిఆర్ కుటుంబం జూబ్లీహిల్స్లో మాగంటి సునీత సెంటిమెంట్ను ప్రయోగించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తోందని రాష్ట్ర మంత్రి, రహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇంచార్జ్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బోరబండ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. బోరబండలోని సాయిబాబ నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ అసోసియేషన్ సభ్యులు, అర్చకులు మంత్రి పొంగులేటి సమక్షంలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రహమత్ నగర్ కార్పోరేటర్ సి.ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దివంగత మాగంటి గోపీనాథ్ విషయంలో కెటిఆర్ విలన్ అని సాక్షాత్తూ గోపినాథ్ తల్లి ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. గోపీనాథ్ మృతి ఓ మిస్టరీ అని ఆమె చెప్పడం చూస్తే కల్వకుంట్ల కుటుంభ వైఖరి అందరికీ అర్ధమవుతుందన్నారు. గతంలో వేలాది మంది యువకుల్ని తెలంగాణ ఉద్యమానికి ఆహుతిచ్చిన కెసిఆర్ తరువాత కాలంలో ఎందరో ఉద్యమ నాయకులను పాతాళానికి తొక్కేవారని మంత్రి విమర్శించారు. తాజాగా కవితను బయటకు పంపి కాళేశ్వరంలో వచ్చిన కమిషన్లో వాటా ఇవ్వకుండా వాటిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖర్చు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కవిత జాగృతి సంస్ధ కార్యకర్తలు ఈ ఎన్నికలో బిఆర్ఎస్కు బుద్ది చెబుతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హీన రాజకీయ చరిత్ర కలిగిన కెసిఆర్ కుటుంబ రాజకీయాలతో మాగంటి గోపీనాధ్ కుటుంబం రోడ్డున పడిందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ టిడిపి అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శాంతియుతంగా నిరసన తెలిపితే ఆ రాష్ట్రానికి పోయి ధర్నాలు చేసుకోవాలన్న కెటిఆర్, ఇప్పుడు తెలుగుదేశం సానుభూతి ప్రజల ఓట్ల కోసం ప్రాకులాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలకు ముఖం చూపించలేక అసెంబ్లీకి రాని కెసిఆర్ ఫాంహౌస్ దాటడం లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదలకు నెలకు 23వేల క్వింటాళ్ల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే ఇటువంటి పథకం రాష్ట్రంలోనే అమలు చేస్తుంటే ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సన్న బియ్యం ఆపేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు ఎక్కడా చెప్పకపోయినా, కేవలం ఓట్ల రాజకీయంతో కిషన్ రెడ్డి ఇలా మాట్లాడడం సరికాదన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
మోతె, (ఆంధ్రప్రభ): విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని
ఫ్యాక్ట్ చెక్: పులి అమాంతం దాడి చేసి ఓ వ్యక్తిని నోటకరుచుకుని వెళ్తున్న వీడియో ఏఐ సృష్టి
భారతదేశంలో పులుల సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. అడవుల్లో ఎక్కడో మనుగడ సాగిస్తూ
కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థిని మిస్సింగ్
చాగలమర్రి, నంద్యాల జిల్లా (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలోని చాగలమర్రి మండలంలోని కస్తూర్బా
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం !
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): ఓలూరు రాయల చెరువు ముంపులో నష్టపోయిన ప్రజలు ఎవరూ
చిట్టీల్లో రూ.4.80 కోట్ల టోకరా
నిందితుడి పట్టివేత.. వెంకటగిరి పోలీసులకు అప్పగింత ( వెంకటగిరి, ఆంధ్రప్రభ): వెంకటగిరి మండలం
Is Samantha making her Relationship Official?
Top actress Samantha has been quite selective with her films but she is in news frequently because of her relationship with Bollywood filmmaker Raj Nidimoru. Speculations say that Samantha and Raj are dating and their frequent presence together has sparked several rumors. They haven’t announced officially but Samantha has been posting pictures of her with […] The post Is Samantha making her Relationship Official? appeared first on Telugu360 .
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಭೂಗತ ಹೈಡ್ರಾಲಿಕ್ ಕಸದ ವ್ಯವಸ್ಥೆಯ ವೀಡಿಯೊ ಕರ್ನಾಟಕದ್ದು ಎಂದು ಟರ್ಕಿಯ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಭೂಗತ ಹೈಡ್ರಾಲಿಕ್ ಕಸದ ವ್ಯವಸ್ಥೆಯ ವೀಡಿಯೊ ಕರ್ನಾಟಕದ್ದು ಎಂದು ಟರ್ಕಿಯ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
Akhanda Thandavaam Song Pramo: NBK to rock the Nation
God of Masses Nandamuri Balakrishna is one of the biggest legends of Telugu and Indian Cinema. The biggest mass star in on a success streak that started with the Devotional blockbuster Akhanda. Now, he is starring in the sequel, Akhanda 2 Thandavaam. The movie marks the fourth collaboration of director Boyapati Srinu and NBK, who […] The post Akhanda Thandavaam Song Pramo: NBK to rock the Nation appeared first on Telugu360 .
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : నిత్యం వేల సంఖ్యలో రాష్ట్రం నలుమూలలతో పాటు
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.1.27 కోట్ల భారీ ప్యాకేజీ
వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. గతంలో రూ.88 లక్షల ప్యాకేజీని అధిగమించి ఈసారి అత్యధికమైన రూ.1.27 కోట్లు దేశీయ ప్యాకేజీ ఆఫర్ లభించింది. ప్లేస్మెంట్ సీజన్ 2025-=26 ప్రారంభ దశలోనే వచ్చిన అద్భుత ఫలితాలు సంస్థ బలమైన విద్యా పునాది, పరిశ్రమలతో ఉన్న సన్నిహిత బంధాలు, విద్యార్థుల అసాధారణ ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయి. నిట్ చరిత్రలో అత్యధిక దేశీయ ఆఫర్ రూ.1.27 కోట్ల జాబ్ ఆఫర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బిటెక్ విద్యార్థి నారాయణ త్యాగి దక్కించుకున్నాడు. బహుళజాతి కంపెనీ నుంచి రూ.1.27 కోట్ల సిటిసితో ఈ దేశీయ ఆఫర్ను పొందాడు. ఇది వరంగల్ నిట్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ప్యాకేజీ. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థి మొహమ్మద్ నహిల్ నష్వాన్ రూ.1 కోటి సిటిసితో దేశీయ ఆఫర్ను పొందారు. ఈ ఘనతతో సదరు విద్యార్థులు వరంగల్ నిట్ను దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటిగా నిలబెట్టారని, అంతర్జాతీయ ప్రమాణాల విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు మరోసారి నిరూపించాయని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి వ్యాఖ్యానించారు. 2025=-26 ప్లేస్మెంట్ డ్రైవ్ ప్రారంభమైన రెండు నెలల వ్యవధిలోనే విభిన్న శాఖల విద్యార్థులు అత్యుత్తమ అవకాశాలను సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్లేస్మెంట్ సీజన్ తొలి రెండు నెలల్లో రూ.70 లక్షలకు పైగా సిటిసితో ఆరుగురు విద్యార్థులు ఆఫర్లు పొందారని, రూ.50 లక్షలకుపైగా సిటిసితో 34 మంది, రూ.30 లక్షలకుపైగా సిటిసితో 125 మంది, రూ.25 లక్షలకుపైగా సిటిసితో 163 మంది, రూ.20 లక్షలకుపైగా సిటిసితో 200 మందికి పైగా విద్యార్థులు ఆఫర్లు పొందారని తెలిపారు. అక్టోబర్ 15 వరకు సగటు ప్యాకేజీ రూ.26 లక్షలను దాటిందని చెప్పారు. ప్లేస్మెంట్ సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉందని, ఇంకా చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థులు అవకాశాల కోసం అందుబాటులో ఉన్నారని అన్నారు. అనేక ప్రముఖ సంస్థలు తమ క్యాంపస్ సందర్శనకు సిద్ధంగా ఉన్నాయని, రాబోయే నెలల్లో మరిన్ని అధిక విలువ గల ఆఫర్లు వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కాగా, అత్యధిక ప్యాకేజీలు పొందిన విద్యార్థులందరికీ, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ప్లేస్మెంట్ సీజన్ విద్యార్థుల ప్రతిభ, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, సంస్థపై రిక్రూటర్ల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోందని అన్నారు. ఈ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ (సిసిపిడి) బృందానికి, హెడ్ ప్రొఫెసర్ పి.వి.సురేష్కు నిట్ డైరెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
సజ్జ గింజల లారీ ఇంజన్లో మంటలు
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం వెళ్తున్న లారీ ఇంజన్లో మంటలు చెలరేగాయి. బైక్పై వెళుతున్న వ్యక్తి మంటలను గమనించి లారీ డ్రైవర్కు చెప్పడంతో వెంటనే అపి దిగిపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం..మల్కాజ్గిరి నుండి సజ్జ గింజల లోడుతో వస్తున్న గూడ్స్ లారీ కర్నాటకకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శంషాబాద్ వద్ద ఫ్లైఓవర్పై నుండి వెళ్తోంది.ఆ సమయంలో ఇంజన్లో నుండి మంటలు చెలరేగాయి. అదేసమయంలో బైక్పై వెళుతున్న ఒక వ్యక్తి ఈ మంటలను గమనించి లారీ డ్రైవర్ మహమ్మద్ సద్దాంకు చెప్పాడు. దీంతో సద్దాం లారీని అక్కడే అపేసి కిందకు దిగిపోయాడు. వెంటనే ఫైర్ స్టేషన్ నెంబర్ కు ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. 722 సజ్జగింజల బస్తాల్లో దాదాపు 150 బస్తాలు మంటల్లో కాలిపోయాయి. లారీ ఇంజన్ ముందుభాగం కూడా పూర్తిగా దగ్ధంమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : పూర్తి ఆధ్యాత్మిక చింతన ఉండే కనకదుర్గమ్మ ఆలయంలో
హైదరాబాద్=ముంబై జాతీయ రహదారిపై రెడీమిక్స్ ట్రక్ బోల్తా
సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు పాత టోల్గేట్ వద్ద కాంక్రీట్ రెడీమిక్స్ లారీ శుక్రవారం బోల్తా పడింది. మండల పరిధిలోని పార్టీ గ్రామం నుండి లింగంపల్లి వైపు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. రెడీమిక్స్ వాహనం బోల్తా కొట్టడంతో హైదరాబాద్=ముంబై జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాహనాలను క్లియర్ చేయడానికి పోలీసులు నానాఅవస్థలు పడి ఎట్టకేలకు ట్రాఫిక్ను నియంత్రించారు.
నటీమణి సులక్షణ పండిట్ కన్నుమూత
ప్రముఖ గాయని, నటీమణి సులక్షణ పండిట్ (71) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శ్వాసతీసుకోవడం ఇబ్బంది కావడంతో ఆమెను గురువారం నానావతి ఆస్పత్రిలో చేర్చిన తరువాత చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు గుండెపోటు వచ్చి తుది శ్వాస విడిచారని ఆమె సోదరుడు లలిత్ పండిట్ తెలియజేశారు. తొమ్మిదేళ్ళ వయసులోనే పాటలు పాడడం ప్రారంభించిన సులక్షణ పండిట్ సోదరుడు మంధీర్తో కలిసి కెరీర్ ప్రారంభించారు. 1975లో సంజీవ్ కుమార్తో ఆమె నటించిన ఉల్జా చిత్రం ఘన విజయం సాధించడంతో అనేక అగ్రనటులతో నటించే అవకాశం ఆమెకు వరుసగా కలిగింది. 197080 ప్రాంతంలో సంజీవ్కుమార్, రాజేష్ ఖన్నా, వినోద్ఖన్నా, శశికపూర్, జితేంద్ర,శత్రుఘ్న సిన్హా, తదితర అగ్రనాయకులతో ఆమె నటించి పేరు పొందారు. ఆమె కెరీర్లో హేరా ఫేరీ, అప్నాపన్, ఖాండాన్, చెహ్రేపేచెహ్రా , ధరమ్కాంటా ,వక్త్ కి దీనార్ వంటి సినిమాలు బాగా ప్రేక్షకాదరణ పొందాయి.హిందీతోపాటు బెంగాలీ చిత్రాల్లోనూ ఆమె నటించారు. నటనతోపాటు పలుభాషా చిత్రాల్లో పాటలు కూడా పాడారు. గజల్ గాయనిగా కూడా పేరు పొందారు. కిశోర్ కుమార్, శైలేందర్ సింగ్, జేసుదాస్, మహేంద్ర కపూర్, ఉదిత్ నారాయణ వంటి ప్రముఖ గాయకులతో కలిసి యుగళ గీతాలు ఆలపించారు. చివరిసారి 1996లో ఖామోషీ,అనే సంగీత భరిత చిత్రంలో సాగర్కినారే దో దిల్ అనే పాటను పాడారు. ఈ పాటకు ఆమె సోదరులే స్వరపర్చడం విశేషం.
హైదరాబాద్: ఉన్నత విద్య ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీంతో బంద్ విరమిస్తున్నట్లు ఉన్న విద్యా ప్రైవేటు కళాశాలలు ప్రకటించాయి. డిప్యూటీ సిఎంతో చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో రేపటి నుంచి యధావిధిగా కళాశాలలు నడుస్తాయి. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు శుక్రవారం ప్రజాభవన్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా ప్రైవేటు కలేజీలకు ఫీజు బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తక్షణమే రూ.600 కోట్లు విడుదలకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. త్వరలోనే మరో రూ.300 కోట్లు చెల్లిస్తామని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం రూ.600 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించింది.
కుక్కునూరు ..బెస్తాగూడెం అయ్యప్పగా గుర్తింపు ( కుక్కునూరు, ఆంధ్రప్రభ) ఏలూరు జిల్లా కుక్కునూరు
గరియాభంద్లో ఏడుగురు మావోల లొంగుబాటు
మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం సైతం చత్తీస్గఢ్ రాష్ట్రం, గరియాభంద్ జిల్లా, ఉదంతి ఏరియా కమిటీ సభ్యులు ఏడుగురు శుక్రవారం ఆయుధాదాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఉదంతి ఏరియా కమిటీ కమాండర్ సునీల్ సెక్రటరీ అరీనా ఉన్నారు. శనివారం వీరిని మీడియా ముందుకు తీసుకురానున్నారు. గత కొద్దిరోజుల క్రితం ఉదంతి ఏరియా కమిటీ కమాండర్ సునీల్ పేరిట మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. మల్లోజుల వేణుగోపాల్ బాటలోనే తాము కుడా లొంగిపోతామని లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిం. శుక్రవారం మధ్యాహ్నం ఉదంతి అడవుల నుండి సునీల్, అరీనా, లుద్రో, విద్య, నందిని, మల్లేష్ ఆయన బృందం సభ్యులు గరియాబంద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎల్ఎల్ఆర్ 3 ఇన్సాస్, సింగలాట్, తుపాకులను ఈ సందర్భంగా పోలీసులకు అప్పగించారు.
భారత క్రికెట్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నుంచి అతడి భార్య హసిన్ జహాన్ తనకు, తన కుమార్తెకు ఇచ్చే నెలవారీ భరణాన్ని పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.తనకు నెలకు రూ. 1.5లక్షలు, కుమార్తెకు రూ. 2.5 లక్షలుగా జీవనోపాధిని నిర్ణయించిన కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను జహాన్ సవాలు చేశారు. షమీ సంపాదన, లైఫ్ స్టైల్ దృష్ట్యా ఈ మొత్తం సరిపోదని, భరణాన్ని పెంచాలని ఆమె తన పిటిషన్ లో కోరింది. పిటిషన్ విచారణ సందర్భంగా , నెలకు రూ. 4 లక్షలు ఇప్పటికే చాలా డబ్బు కాదా అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయినా, షమీ ని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తమ స్పందనను 4 వారాలలోగా తెలియజేయాలని ధర్మాసనం కోరింది. కేసు తదుపరి విచారణ డిసెంబర్ లో జరుగుతుంది.షమీ ఆదాయం, ఆస్తులు ప్రస్తుతం చెప్పుకుంటున్న దానికన్న చాలా ఎక్కువగా ఉన్నాయని జహాన్ తరుపు న్యాయవాది వాదించారు. షమీ చాలా డబ్బు సంపాదిస్తాడు. వందలకోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు ఉన్నాయి పదేపదే విదేశాలకు వెళ్తాడు. దుబారాగా జీవిస్తాడు అని ఆయన కోర్టుకు విన్నవించాడు. గృహహింస, వరకట్న వేధింపులు, ఆర్థిక వివాదాల ఆరోపణల నేపథ్యంలో 2018 లో షమీ, జహాన్ మధ్య ప్రారంభమైన న్యాయపోరాటంలో ఈ పరిణామం కొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది.
AP Rises Under Chandrababu and Lokesh: ₹1.01 Lakh Crore Investments, 85,000 Jobs Coming
Chief Minister N. Chandrababu Naidu has given the green signal for new investments worth ₹1,01,899 crore across Andhra Pradesh. These projects are expected to generate over 85,870 jobs, marking another major milestone in the state’s industrial growth. The approvals came during the 12th meeting of the State Investment Promotion Board (SIPB) held at the Secretariat. […] The post AP Rises Under Chandrababu and Lokesh: ₹1.01 Lakh Crore Investments, 85,000 Jobs Coming appeared first on Telugu360 .
భీమ్గల్ రూరల్, (ఆంధ్రప్రభ): భీమ్గల్ తహసీల్దార్ పరిధిలోని గోన్ గొప్పుల గ్రామంలో అక్రమంగా
విషాహారం తిని 25 గొర్రెలు మృతి
పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, పెరకపల్లి గ్రామంలో శుక్రవారం విషాహారం తిని 25 గొర్రెలు మృతి చెందాయి. ఇరు మల్లయ్యకు చెందిన 8, మట్టే తిరుపతికి చెందిన 6, అచ్చే రాజయ్యకు చెందిన 6, అచ్చే చంద్రయ్యకు చెందిన 5 గొర్రెలు మృతి చెందాయి. బాధితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఓరెం చిరంజీవి, పార్టీ సోషల్ మీడియా వారియర్ బుట్టి సాగర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అచ్చే తిరుపతి వెంటనే ఎస్సి, ఎస్టి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో. బాధితులతో స్వయంగా ఫోన్లో మాట్లాడిన మంత్రి వారికి తానున్నానంటూ భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి సమాచారం తీసుకెళ్లిన మంత్రి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సంఘటన స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడి పూర్తి నివేదిక అందించాల్సిందిగా జిల్లా పశు వైద్యశాఖ అధికారి విజయభాస్కర్ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పశువైద్యశాఖ అధికారి విజయభాస్కర్, మండల పశువైద్యాధికారి అజయ్ పెరకపల్లి గ్రామానికి చేరుకొని మృతి చెందిన గొర్రెలను పరిశీలించడంతోపాటు బాధితులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్కు సమాచారం అందిస్తామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ మండల నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని సమాచారాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి లక్ష్మణ్కుమార్ జిల్లా కలెక్టర్తో మాట్లాడి జిల్లా అధికార బృందాన్ని పంపించి తమకు న్యాయం చేసేందుకు కృషి చేయడం పట్ల బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
శరవేగంగా పేరేచర్ల హైవే పనులు…!
రూ.881.61 కోట్లతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్..! ( పల్నాడు , ఆంధ్రప్రభ ప్రతినిధి)
ఆంధ్రప్రభ, అమరావతి ప్రతినిధి : మహిళా వరల్డ్ కప్ క్రికెట్ టీం కెప్టెన్
ఎంపిని బురిడీ కొట్టించి.. రూ.56 లక్షలు కాజేశారు..
కోల్కతా: సైబర్ నేరగాళ్లకు చిక్కితే.. సామాన్యుడైనా.. పెద్ద సెలబ్రిటీ అయినా బలి కావాల్సిందే. తాజాగా ఓ ఎంపి విషయంలో ఇది అక్షరాల నిజమైంది. ఓ ఎంపిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు ఏకంగా అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.56 లక్షలు కాజేశారు. నకిలీ కెవైసితో వాళ్లు ఈ నేరానికి పాల్పడ్డారు . తృణమూల్ కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యులు కల్యాణ్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. ఈ బ్యాంక్ బ్రాంచ్ ఖాతా నుంచి సైబర్ కేటుగాళ్లు డబ్బు దోచేశారు. దీనిపై బ్యాంకులో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. బెనర్జీ ఖాతాను సంబంధించిన కెవైసిని అప్డేట్ చేయడానికి నకిలీ ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించారు. ఖాతాలకు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లను మార్చారు. ఈ వివరాలన్నీ మారిన తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పలు మార్లు లావాదేవీలు నిర్వహించారు. మొత్తంగా రూ.56 లక్షలు కాజేశారు. వాటిని వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేసి బంగారం కొనుగోలు చేసినట్లు సమాచారం. కొంత మొత్తాన్ని ఎటిఎం ద్వారా విత్డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎంపి బ్యాంకు అధికారులను అప్రమత్తం చేయడంతో వాళ్లు సైబర్ క్రైమ్ కింద ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని కోల్కతా సైబర్ క్రైమ్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
ఘనంగా రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలు ప్రారంభం
పెద్దపల్లి రూరల్, (ఆంధ్రప్రభ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 58వ తెలంగాణ రాష్ట్ర ఇంటర్-డిస్ట్రిక్ట్
కట్టుకున్న భార్యనే కిరాతకంగా..
మోతె (సూర్యాపేట జిల్లా): సూర్యాపేట జిల్లా విభలాపురం గ్రామంలో.. మద్యానికి బానిసైన ఓ
దాతృత్వంలో అగ్రగామి శివ్ నాడార్
హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన దానగుణాన్ని మరోసారి చాటుకున్నారు.
ధాన్యం దళారుల పాలు.. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు, (ఆంధ్రప్రభ) : మొంథా తుఫాన్
వ్యవసాయంలో పెరగనున్న టెక్నాలజీ వినియోగం
పల్నాడు బ్యూరో, ఆంధ్రప్రభ : వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మరింత సమర్థంగా.. సులభంగా
హీలియం గ్యాస్ గుంటూరులో పుట్టిందే
హీలియం గ్యాస్.. మనం బెలూన్ గ్యాస్ అని కూడా పిలుస్తాం. ఈ గ్యాస్ ను కనిపెట్టింది గుంటూరులోనే!
చేపలకు చికెన్ వేస్టేజీ కుళ్లిన గుడ్లు
జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణ, తుంగభద్ర నది తీర ప్రాంతాల్లో నిషేధిత క్యాట్ ఫిష్, ఫంగస్ చేపల పెంపకం సాగుతోంది.
విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి..
విశాలాంధ్ర-తాడిపత్రి: యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన డేరంగుల సుబ్బారాయుడు (63) విద్యుత్ షాక్ తగలి మృతి చెందాడు. తన ఇంటి ముందర మేడిచెట్టు కొమ్మలను మచ్చుకోడవలితో నరుకుచుండగా ఆకస్మాత్తుగా కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. కరెంట్ తీగలు తెగి సుబ్బారాయుడు ఎడమ మోకాలిపైన పడటంతో కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే చనిపోయాడు. మృతుడికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. భార్య రమణమ్మ పిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ శంకర నారాయణ కేసు నమోదు చేశాడని […] The post విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి.. appeared first on Visalaandhra .
మాగంటి మరణం వివాదంలోకి నన్ను లాగొద్దు: సిఎం
హైదరాబాద్: మాగంటి గోపినాథ్ మరణాన్ని తాను రాజకీయం చేయదలచుకోలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ మరణం వివాదాల్లోకి తనను లాగొద్దని కోరారు. గోపినాథ్ మరణంపై ఆయన తల్లి కొన్ని ఆరోపణలు చేశారని.. గోపినాథ్ మరణంపై అనుమానాలు ఉంటే బండి సంజయ్ ఫిర్యాదు చేయాలని అన్నారు. బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు. మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో గెలవాలని అన్ని ప్రధాన పార్టీలో కసరత్తు చేస్తున్నాయి. సిఎం రేవంత్ సైతం ఈ ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు హైదరాబాద్కు చేసింది శూన్యమని ఆయన అన్నారు.
నల్గొండ (ఆంధ్రప్రభ) : ర్యాగింగ్ చేస్తే కళాశాల నుండి బహిష్కరణతో పాటు క్రిమినల్
రాష్ట్రస్థాయి ఖోఖో, కబడ్డీ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక
మద్నూర్ (ఆంధ్రప్రభ) : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు
57 కిలోల సన్నబియ్యంతో సిఎం రేవంత్రెడ్డి చిత్రపటం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజును రాష్ట్ర ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వినూత్నంగా ఏర్పాటు చేశారు. నేటితో (శనివారం) 57 ఏళ్ల వయస్సులోకి అడుగుపెడుతున్న సిఎం రేవంత్కు 57 కిలోల సన్నబియ్యంతో అతని చిత్రపటాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ పేదల పెన్నిధిగా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి పేదల కోసం సన్నబియ్యం పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చారన్నారు. ధనిక, బీద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తినాలని సంకల్పించిన సిఎంను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలన్నారు. సిఎం బర్త్ డే రాష్ట్ర ప్రజలకు ఎల్లకాలం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలన్న తలంపుతో పుట్టినరోజు కానుకగా సన్న బియ్యంతో సిఎం చిత్రపటాన్ని తయారు చేయించానని మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. సన్నబియ్యం పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
సీఎం రేవంత్ ని కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఇటీవల
సొంత చెల్లిని, మాగంటి తల్లిని కెటిఆర్ మోసం చేశారు:మంత్రి సీతక్క
తన సొంత చెల్లిని, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మాగంటి గోపీనాథ్ తల్లిని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మోసం చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మాగంటి తల్లి ఆవేదన చూస్తుంటే కేటీఆర్ ఎంత పెద్ద మోసకారో అర్థమవుతుందని అన్నారు. 91 ఏండ్ల వృద్ధురాలు అని చూడకుండా మాగంటి తల్లిని అవమానపరిచారని తెలిపారు. జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు హడావుడి చూస్తే టిఆర్ఎస్ ఓటమి ఖాయంగా కనిపిస్తుందని అన్నారు. మాగంటి తల్లి చేసిన ఆరోపణలపై కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు నిశ్శబ్ద విప్లవం అంటూ ప్రగల్పాలు పలుకుతున్నారని అంటూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే నిశ్శబ్ద విప్లవమని అన్నారని, అయితే అ నిశ్శబ్ద విప్లవం మిమ్మల్ని నిండా ముంచిందని ఎద్దేవా చేశారు. ఓటమి తప్పదని తెలిసి అవస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో విధ్వంసం చేశారని విమర్శించారు. వైను, మైను, ల్యాండ్, సాండ్ అన్ని మాఫియాలతో తెలంగాణలో విధ్వంస పాలన చేశారని బిఆర్ఎస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్పారని అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని, పదేళ్లు కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వని దుష్ట పాలన కెసిఆర్దని అన్నారు. మీరు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఆ కబ్జాల నుంచి మేము ఆ భూములను విడిపిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ను నిండా ముంచింది మీరేనని, మీ పదేళ్ల పాలనలో హైదరాబాద్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపించారు. మహిళా సంఘాలకు రూ.3 వేల కోట్లు వడ్డీలు ఎగ్గొట్టిన వాళ్లకు మహిళలు ఓటెయ్యరని అన్నారు. మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు.ఉచిత బస్సు ప్రయాణం మొదలుకొని, కోట్ల రూపాయల వ్యాపారాలు మహిళలు చేపట్టేలా చేయూతనందిస్తున్నామని తెలిపారు. దాన్ని ఓర్చుకోలేక మహిళలను రికార్డు డాన్సు చేసుకోండి అని కేటీఆర్ అన్న మాటలను ఆడకూతుళ్లు మర్చిపోలేదని అన్నారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని మోసం చేసిన కేటీఆర్కు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు.
పదో తరగతిలో వందశాతం ఫలితాలే లక్ష్యం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం
మైసూరు జిల్లాలో మనిషిని ఎత్తుకెళ్లిన పులి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
మైసూరు జిల్లాలో శుక్రవారం పులి దాడిలో రైతు మరణించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నివాస గృహాల మధ్య మద్యం దుకాణాలు వద్దు
మోత్కూర్, (ఆంధ్రప్రభ) : మున్సిపల్ కేంద్రంలో నివాస గృహాల మధ్య మద్యం దుకాణాలు
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
విశాలాంధ్ర బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహళ్ గ్రామంలో గజగౌరీ దేవి అమ్మవారిఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రాతిదూలం లాగుడు పోటీలు శుక్రవారం హోరాహోరీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 15జతల వృషభాలు పోటీల్లో పాల్గొన్నాయి. మొదటి బహుమతి కింద గోవిందవాడ గ్రామానికి చెందిన నరసింహ వృషభాలు మొదటి బహుమతి రూ. 20వేలు, దాత శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన మస్తాన్ యాదవ్ వృషభాలు రెండో బహుమతి […] The post హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు appeared first on Visalaandhra .
ఉచిత మెగా ఆరోగ్య శిబిరం సద్వినియోగం చేసుకోండి
మక్తల్, ఆంధ్రప్రభ : బికెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న హైదరాబాద్
అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్గాంధీ నగర్ లో
Maganti Gopinadh : మాగంటి గోపీనాధ్ మరణం తర్వాత ఎందుకిలా జరుగుతోంది?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మాగంటి గోపీనాధ్ మృతి పై తలెత్తుతున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.
అక్కడా మనవాళ్లు తగ్గలేదు.. పాక్పై భారత్ విజయం
హాంకాంగ్ సూపర్ సిక్సెస్లో భాగంగా భారత్, పాకిస్థాన్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత ఘన విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఈ మ్యాచ్లో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఆ భారత బ్యాటింగ్లో ఊతప్ప 28, భరత్ చిప్లి 24, దినేశ్ కార్తీక్ 17(నాటౌట్) పరుగులు చేశారు. 87 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది పాకిస్థాన్. మూడు ఓవర్లు ముగిసేసరికి వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. తిరిగి ఆట కొనసాగే పరిస్థతి లేకపోవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బ్యాటింగ్లో ఖవాసా నఫే 18, అబ్దుల్ సమద్ 16 పరుగులు చేశాడు. భారత బౌలంగ్లో స్టువర్ట్ బిన్నీ 1 వికెట్ తీశాడు.
Unanimous Trolling for SS Rajamouli
SS Rajamouli is the country’s best director and his work received unanimous praise for all his films. He is known for his detailing in every craft. He is completely focused on GlobeTrotter, a stylish forest adventure featuring Mahesh Babu, Priyanka Chopra and Prithviraj Sukumaran playing the lead roles. The first look poster of Prithviraj Sukumaran […] The post Unanimous Trolling for SS Rajamouli appeared first on Telugu360 .
హెచ్ఎంను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశం
హెచ్ఎంను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశం సంగారెడ్డి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ఉచిత చేప పిల్లల పంపిణీతో ఆర్థిక ప్రగతి
ఎలుకలు.. కాదు పందికొక్కులు ( ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి) ఇది విన్నారా. ఈ
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం..
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనానికి సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఎంతో
The Family Man S3 Trailer comes with a Twist
Manoj Bajpayee’s The Family Man is one of the most successful Indian spy thrillers backed by Amazon Prime. After two successful seasons, the trailer of the third season is out and it comes with a twist. Srikant Tiwari played by Manoj Bajpayee is announced as the Most Wanted Criminal of the nation and he is […] The post The Family Man S3 Trailer comes with a Twist appeared first on Telugu360 .
సూచనలివ్వండి… బందరు ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానం..
మచిలీపట్నం, (ఆంధ్రప్రభ): నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటుగా, ప్రతి
విధులు ఒకచోట… జీతం మరోచోట! ఎవరి మెప్పుకోసం ఇలా?జిల్లా అధికారి దాటవేసిన సమాధానం
అమరావతి నిర్మాణానికి కొత్త ఊపు !
అమరావతి, ఆంధ్రప్రభ : రాజధాని నిర్మాణానికి మరోసారి ఊపునిచ్చే పరిణామం చోటుచేసుకుంది. అమరావతి
Revanth Reddy : ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
మాగంటి గోపీనాధ్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కారును తప్పించబోయి.. మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం#TeluguPost #telugu #post #news
ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉంది..
ప్రముఖ పర్యావరణ వేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడువిశాలాంధ్ర ధర్మవరం; ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉంది అని ప్రముఖ పర్యావరణవేత్త, రాజయోగి భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేయకుండా కాపాడుకోవాల్సిన దినంగా దీన్ని ప్రకటించారు అని తెలిపారు. దీన్ని మనం గుర్తించకపోతే జీవనోపాధిని , పర్యావరణ వ్యవస్థలను నిలబెట్టే సహజ వనరులు నాశనమైతే శాశ్వత శాంతి సాధ్యం కానందున, పర్యావరణంపై చర్య సంఘర్షణ నివారణ, శాంతి […] The post ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉంది.. appeared first on Visalaandhra .
జాతీయ సమైక్యతకు స్ఫూర్తి వల్లభాయ్ పటేల్
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్
రైతులకు అండ ప్రభుత్వం….. బిక్కనూర్, ఆంధ్రప్రభ : రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని
ఆదుకో కర్నూలు కలెక్టరమ్మ ,, ఆట్టేకల్లు పంచాయతీ ఆక్రందన ( ఆస్పరి, ఆంధ్రప్రభ)
స్వాతంత్ర్య స్ఫూర్తికి మూలం వందేమాతరం
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : స్వాతంత్ర్య స్ఫూర్తికి మూలం వందేమాతరం, మన ఐక్యతకు
విశాలాంధ్ర, ముదిగుబ్బ: మండల కేంద్రంలో ముదిగుబ్బలో వీధి కుక్కల బెడద పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గుంపులుగా తిరిగే వీధి కుక్కలు చిన్నపిల్లలు, వృద్ధులను భయపెడుతున్నాయి. కాలనీల్లో పిల్లలను స్కూల్కి పంపేటప్పుడు కుక్కల గుంపులను చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ మరియు పంచాయతీ అధికారులను […] The post ముదిగుబ్బలో వీధి కుక్కల బెడద… appeared first on Visalaandhra .
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి : రేవంత్
హైదరాబాద్: తమ ఆలోచనలను ప్రజల ముందు ఉంచామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం నిర్వహించిందని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..2004-2014 మధ్య కాలంలోనే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందిందని తెలియజేశారు. ఒఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయం, మెట్రో ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని, 2014 నుంచి హైదరాబాద్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. 2014 నుంచి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బిఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది శూన్యం అని విమర్శించారు. 2014 లో రూ. 16 కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, 2023లో మాజీ సిఎం కెసిఆర్ తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో పెట్టి మళ్లీ కాంగ్రెస్ కు అప్పగించారని మండిపడ్డారు. హైదరాబాద్ కు యూపిఎ ప్రభుత్వం ఇచ్చిన ఐటిఐఆర్ ను రద్దు చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. ఐటిఐఆర్ కూడా మంజూరు చేసి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేదని రేవంత్ పేర్కొన్నారు. వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోతే కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి వరదసాయంగా రూపాయి కూడా తేలేదని ధ్వజమెత్తారు. ఎవరికీ అనుమతి లేని విలాసవంతమైన భవనాలు మాత్రమే కెసిఆర్ నిర్మించారని, వాస్తు సరిగా లేదని.. బాగున్న సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించారని ఎద్దేవా చేశారు. కొత్త సచివాలయం నిర్మించడం వల్ల ఎవరికైనా కొత్తగా ఉద్యోగాలు వచ్చాయా?అని నిలదీశారు. ప్రతి పక్ష నేతల మీద, పాత్రికేయుల మీద నిఘా పెట్టేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారని, రైతుల కోసమని కట్టిన కాళేశ్వరం మాత్రం మూడేళ్లకే కూలిందని విమర్శించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన, పదేళ్ల బిఆర్ఎస్- బిజెపి పాలనను ప్రజలు పోల్చి చూడాలని, ఎవరి హయాంలో రాష్ట్రానికి ఏమి వచ్చిందో ప్రజలు గమనించాలని సూచించారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొనియాడారు. అప్పటికే మంజూరైన ఐటిఐఆర్ వంటి సంస్థలను కూడా బిజెపి రద్దు చేసిందని, గోదావరి జలాల ఫేజ్-1 ఫేజ్-2 లను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. పదేళ్లలో మెట్రో రైలును కొత్తగా కిలో మీటరు కూడా పొడిగించలేదని, మంజూరైన పాతబస్తీ మెట్రోను కూడా పక్కకు పెట్టారని, మెట్రోను నిర్మించిన ఎల్ అండ్ టి నష్టాలకు కూడా బిఆర్ఎస్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ అండ్ టి సంస్థలను బెదిరించి డబ్బు వసూలు చేసింది బిఆర్ఎస్ నేతలని, బిఆర్ఎస్ దిగిపోతూ కూడా ఒఆర్ఆర్ ను అమ్ముకున్నదని అన్నారు. లక్షల కోట్లు ఆదాయం వచ్చే ఒఆర్ఆర్ ను కేవలం రూ. 7 వేల కోట్లు అమ్ముకున్నది బిఆర్ఎస్ అని హైదరాబాద్ అభివృద్ధికని బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కెటిఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రూ. 5 వేల కోట్లతో సికింద్రాబాద్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టామని రేవంత్ స్పష్టం చేశారు.
World Cup Star Sree Charani meets Chandrababu Naidu and Nara Lokesh
Team India’s recent triumph in the Women’s ODI Cricket World Cup has brought immense pride to the nation. Among the stars of this historic victory was Kadapa’s talented left-arm spinner Nallapureddy Sree Charani Reddy, whose outstanding performance played a crucial role in India’s championship run. On Monday, Sree Charani met Andhra Pradesh Chief Minister N. […] The post World Cup Star Sree Charani meets Chandrababu Naidu and Nara Lokesh appeared first on Telugu360 .
స్వాతంత్రోద్యమానికి ఊపిరి పోసిన వందేమాతరం
స్వాతంత్రోద్యమానికి ఊపిరి పోసిన వందేమాతరం మక్తల్, ఆంధ్రప్రభ : వందేమాతరం అనే నినాదం

19 C