Breaking : జూబ్లీహిల్స్ రెండో రౌండ్ లో కాంగ్రెస్ కే ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నాడు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.... రెండు రౌండ్లలో కాంగ్రెస్ ముందంజ
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్, రెండు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యం సాధించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 8926 ఓట్లు రాగా బిఆర్ఎస్ 8864 ఓట్లు పడ్డాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ 62 ఓట్లు ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ 1091 ఓట్ల మెజారిటీ కలిగి ఉంది. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ 1153 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
Rajamouli has Numerous Options for GlobeTrotter
GlobeTrotter is the biggest ever film made in Indian cinema. SS Rajamouli has been in plans to take the film to international corners and the plans are on. There are a lot of speculations about Rajamouli collaborating with several international players but nothing has been finalized for now. The film’s producer KL Narayana is capable […] The post Rajamouli has Numerous Options for GlobeTrotter appeared first on Telugu360 .
TTD Ghee Adulteration Case: Workers Flagged the Issue Long Ago
The ghee adulteration scandal in the making of the sacred Tirumala laddus has taken a serious turn. New details show that TTD potu workers detected the problem during the previous YSRCP government and reported it directly to the then Executive Officer, A.V. Dharma Reddy. Their complaints, however, were set aside without action. Today, the case […] The post TTD Ghee Adulteration Case: Workers Flagged the Issue Long Ago appeared first on Telugu360 .
Wardhannapeta | సూపర్ పోలీస్.. Wardhannapeta, ఆంధ్రప్రభ: జాగృతి పోలీస్ కళా బృందం,
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
మైథిలి ఠాకూర్ తొలి ఫలితాల్లో ముందంజ అలీనగర్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు రౌండ్ల వారీగా వెల్లడి కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం బీహార్లోని …
Bigg Boss Telugu 9: Are TRP Ratings Dropping? What Went Wrong This Season?
Bigg Boss Telugu 9, one of the most anticipated reality shows, began with expectations of strong audience engagement, thanks to Nagarjuna’s return as host. But surprisingly, the show opened to one of the lowest-rated launches in its history, raising questions on whether the season has lost its grip over viewers. A Weak Launch: Second Lowest […] The post Bigg Boss Telugu 9: Are TRP Ratings Dropping? What Went Wrong This Season? appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అధిక్యత
మొదటి రౌండ్ ఫలితాలు.. కాంగ్రెస్- 8926 బీఆర్ఎస్- 8864 మొదటి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందంజ రెండో రౌండ్లోనూ కాంగ్రెస్దే ఆధిక్యం 1,114 …
Breaking : జూబ్లీహిల్స్ లో టఫ్ ఫైట్.. హోరా హోరీ గా పోలవుతున్న ఓట్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తొలి రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఎక్కువగా ఉంది
ఎర్రకోట పేలుడు తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి
CPI | శతజయంతి.. CPI క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : సీపీఐ పార్టీ
Bihar : బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ ముందంజ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది.
జూబ్లీహిల్స్ లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగిసింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలలో 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ముందుగా షేక్పేట డివిజన్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం ఓటర్లు 4,01,365 ఉండగా ఇందులో 48.49 శాతంతో 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 10 రౌండ్లు లెక్కింపు జరుగనున్నది. దాదాపు మ. 12. గంటల వరకు ఫలితం ఎటువైపు ఉందనేది అంచనావేయవచ్చని, రెండు రౌండ్ల ఫలితాలతో ఓటింగ్ సరళి తెలిసిపోతుందనేది రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Jubilee Hills |కౌంటింగ్ ప్రారంభం..
Jubilee Hills | కౌంటింగ్ ప్రారంభం.. Jubilee Hills, హైదరాబాద్, ఆంధ్రప్రభ –
చిన్నారుల అదృశ్యం కేసులో పటమట పోలీసులు రికార్డు ( ఆంధ్రప్రభ, విజయవాడ) చిన్నారుల
Diabetes |ముందుగా గుర్తిస్తే..
Diabetes | ముందుగా గుర్తిస్తే.. Diabetes, హైదరాబాద్, ఆంధ్రప్రభ – మధుమేహాం వల్ల
సమవుజ్జీల సమరం.. నేటి నుంచి భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు
కోల్కతా: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్ల ఫ్రిడమ్ ట్రోఫీ టెస్టు సిరీస్కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి కోల్కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్లో తొలి టెస్టు జరుగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్ల సిరీస్ ఆతిథ్య టీమిండియాకు సవాల్గా మారింది. సఫారీ టీమ్ కొంతకాలంగా టెస్టుల్లో అసాధారణ ఆటను కనబరుస్తోంది. డబ్లూటిసి ట్రోఫీతో దక్షిణాఫ్రికా టీమ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. భారత్తో జరిగే సిరీస్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక కొంత కాలం క్రితం సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్కు గురైన టీమిండియాకు సఫారీలతో పోరు పరీక్షగా మారింది. కివీస్ చేతిలో అనూహ్య ఓటమి పాలైన భారత జట్టు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇలాంటి స్థితిలో వరల్డ్ ఛాంపియన్ సౌతాఫ్రికా పోరు సవాల్గా తయారైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న దక్షిణాఫ్రికా టీమ్ నుంచి భారత్కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే సొంత గడ్డపై ఆడడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ బలంగానే ఉంది. అయితే నిలకడలేమీ జట్టుకు ప్రధాన సమస్యగా తయారైంది. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రాహుల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అంతేగాక సిరాజ్, బుమ్రా, కుల్దీప్, అక్షర్ ల్ల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్లతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ కూడా భారీ ఆశలతో సిరీస్కు సిద్ధమైంది. సౌతాఫ్రికా టీమ్లో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఐడెన్ మార్క్రమ్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ తెంబ బవుమా, యువ సంచలనం డెవాల్డ్ బ్రేవిస్, కైల్ వెర్రెన్నె, మార్కొ జాన్సన్, కేశవ్ మహరాజ్, రబడా, ముత్తు సామి వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు జట్టులో ఉన్నారు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... ఎన్డిఎ 36 స్థానాల్లో ముందంజ
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్డిఎ 36 స్థానాల్లో ముందంజలో ఉండగా మహాఘట్బంధన్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బిహార్లో 122 స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటే చేసే అవకాశం ఉంది. మొత్తం 243 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 243 కౌంటింగ్ పరిశీలకులు, అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో 243 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్ఒ)లు కౌంటింగ్ను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 4372 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను పరిశీలిస్తున్నారు. అభ్యర్థులు నియమించిన 18000 మంది కౌంటింగ్ ఏజెంట్లు కూడా కౌంటింగ్ను పరిశీలిస్తున్నారు. బీహార్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి.
Andhra Pradesh : నేటి నుంచి విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం కానుంది.
Vah Chef Brings Flavour and Drama in the BB Kingdom, Tanuja finally Wins
Bigg Boss Telugu 9 delivered a flavour-packed episode as celebrity chef Vah Chef Sanjay entered the house, brought humour, warmth and high-voltage energy into the ongoing BB Kingdom task. What began as a food festival quickly turned into a revolt, negotiations, tantrums and a crucial captaincy battle. Vah Chef Sanjay’s Surprise Visit: Royal Feast Turns […] The post Vah Chef Brings Flavour and Drama in the BB Kingdom, Tanuja finally Wins appeared first on Telugu360 .
Rajinikant and Kamal Haasan Film: Why So Much Confusion?
Legendary actors Rajinikanth and Kamal Haasan have decided to collaborate for a film together after decades. Initial discussions said that they would act together and soon Lokesh Kanagaraj came on board to direct the film. Things changed after the release of Rajinikanth’s Coolie. Lokesh Kanagaraj was dropped from the project. Soon, Kamal Haasan has decided […] The post Rajinikant and Kamal Haasan Film: Why So Much Confusion? appeared first on Telugu360 .
BRS : గెలుపు నాదే : మాగంటి సునీత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో న్యాయం, ధర్మం గెలుస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభించారు. 30 నిమిషాల తరువాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఇవిఎం) కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఇవిఎం కౌంటింగ్ చివరి రౌండ్ కు ముందే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ల (ఆర్ఒ) లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో అభ్యర్థులు లేదా వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్ట్ల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 243 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 243 కౌంటింగ్ పరిశీలకులు, అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో 243 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్ఒ)లు కౌంటింగ్ను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 4372 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను పరిశీలిస్తున్నారు. అభ్యర్థులు నియమించిన 18000 మంది కౌంటింగ్ ఏజెంట్లు కూడా కౌంటింగ్ను పరిశీలిస్తున్నారు. బీహార్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి.
Video: Jubilee Hills By Election Counting Live
The post Video: Jubilee Hills By Election Counting Live appeared first on Telugu360 .
Movie Clash |చరణ్, నాని.. తగ్గేదెవరు..?
Movie Clash | చరణ్, నాని.. తగ్గేదెవరు..? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
India vs South Africa : భారత్ - దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ మ్యాచ్ నేడు
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలిటెస్ట్ నేడు ప్రారంభం కానుంది. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Dulquer, Rana’s Kaantha USA Premieres Today
Dulquer Salmaan and Rana Daggubati’s much-awaited period drama Kaantha, directed by Selvamani Selvaraj, is all set for a grand release tomorrow. Jointly produced under Dulquer’s Wayfarer Films Pvt. Ltd. and Rana Daggubati’s Spirit Media, the film will have its USA premieres today, brought to overseas audiences by Hamsini Entertainment. From striking posters to an intriguing […] The post Dulquer, Rana’s Kaantha USA Premieres Today appeared first on Telugu360 .
Hyderabad : కౌంటింగ్ కు ముందు నవీన్ యాదవ్ ప్రత్యేక పూజలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ముందు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు
‘సంతాన ప్రాప్తిరస్తు‘ విజయంపై నమ్మకంగా ఉన్నాం
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ “సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ను వినోదం, సందేశంతో నిజాయితీగా చేశాం. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారా వస్తున్న స్పందనతో సంతృప్తిగా ఉన్నాం. ఇదే స్పందన సినిమా విడుదల తర్వాత థియేటర్లలో వస్తే ఇంకా సంతోషి స్తాం. సినిమా విజయంపై మా టీమ్ అంతా నమ్మకంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి రిలీజ్తో పాటు కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ సినిమా విడుదలవుతోంది. మన దగ్గర వచ్చే టాక్ ను బట్టి పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు డిమాండ్ వస్తుందని నమ్ముతున్నాం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ యూఎస్లో రిలీజ్ చేస్తున్నారు”అని అన్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ “సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమాలో మేము ఏ సీన్స్లో ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారని ఆశించామో వాటితో పాటు మేము ఊహించని సీన్స్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న సన్నివేశాలకు కూడా నవ్వుతున్నారు. ప్రివ్యూస్ వేసిన థియేటర్స్ నుంచి వస్తున్న స్పందనతో హ్యాపీగా ఉన్నాం. థియేట్రికల్గా వచ్చే స్పందన కోసం ఎదురుచూస్తున్నాం”అని తెలిపారు.
Safety Tips |అమ్మాయిలూ… ఒంటరిగా వెళ్తున్నారా?
Safety Tips | అమ్మాయిలూ… ఒంటరిగా వెళ్తున్నారా? ఆంధ్రప్రభ : అమ్మాయిలు ఒంటరిగా
కౌన్ ..బనేగా.. ప్రజాపతి కౌన్ ..బనేగా.. ప్రజాపతి (ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ )
Delhi Bomb Blast : 32 కార్లతో బాంబు పేలుళ్లు.. దేశంలో భారీ విధ్వంసానికి ప్లాన్
ఢిల్లీ ఎర్రకోటలో కారు బాంబు పేలుడు అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
Jubilee Hills Bye Elections : నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యయి
అవగాహన కల్పించేందుకు, మధుమేహ సంరక్షణ వ్యక్తులకు అందుబాటులోనికి తేవడం అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం జరుపుకుంటారు. ఈ దినోత్సవం అనేది మధుమేహం గురించి అవగాహన పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణ మరియు నివారణ ప్రాముఖ్యతను హైలైట్ చేయడం, అందరికీ చికిత్స, ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగైన సేవల కోసం చర్చించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రపంచ ఆరోగ్య ప్రచార దినం.. మధుమేహం అనేది ఒక జబ్బు కాదు అది ఒక సాధారణ స్థితి.. మన క్లోమగ్రంధి కావలసినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉన్న ఇన్సులిన్ మన శరీరంలోని కణజాలాలలోకి వెళ్లకపోవడం లాంటి సమస్యలతో వస్తుంది. నిర్దిష్ట మోతాదులో అనగా 90 నుంచి 110 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లేదా రాండమ్ 160 కంటే ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు మనకు డయాబెటిస్ ఉంది అని తెలుస్తుంది.. కానీ రాండం బ్లడ్ షుగర్ 180 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది డేంజరస్ గా మారుతుంది.. కిడ్నీ ద్వారా గ్లూకోజ్ బయటికి వస్తుంది. ఎక్కువ కాలం మధుమేహం ఉండడం వలన అనగా 20 లేదా 30 సంవత్సరాలు ఉన్నప్పుడు అది అన్ని ఆర్గాన్స్ను డ్యామేజ్ చేస్తుంది.. కొందరికి కళ్ళు కొందరికి కిడ్నీలు కొందరికి లివర్ కొందరికి హార్ట్ ఇలా అది డ్యామేజ్ చేయని ఆర్గాన్ అంటూ ఉండదు. దీనిని కనుక్కోవడం చాలా సులభం.. మీకు మూత్రం ఎక్కువగా వస్తూ ఉన్నా లేదా ఎక్కువగా ఆకలి అవుతున్న లేదా బాగా తిన్నగాని బరువు తగ్గుతూ ఉన్న డయాబెటిస్ ఉన్నట్లే అప్పుడు మీరు రక్తం పరీక్ష ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. దీనిని రివర్స్ కంప్లీట్ గా చేయలేము కేవలము మెయింటెన్ చేయగలము.. మీకు డయాబెటిస్ ఉంది అని నిర్ధారణ అయిందా మీరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు.. మీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు.. ప్రతిరోజు ఉదయం లేచి వాకింగ్ చేయండి.. మరియు తక్కువ పిండి పదార్థాలు గల ఆహారాన్ని తీసుకోండి.. దీనితో చాలామందికి కంట్రోల్ వస్తుంది అయినా కానీ కంట్రోల్ రాకుంటే ఇంకా మూడవ ప్రయత్నం గా మాత్రలు వాడొచ్చు. మీరు ఒక 900 రూపాయలు పెట్టి ఒక షుగర్ టెస్టింగ్ మిషన్ కొనుక్కొని వారానికి ఒకసారి పొద్దున లేస్తానే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండండి అంతే ఇంకా మీకు ఎటువంటి ప్రమాదము లేదు.. కొందరికి మాత్రలతో కంట్రోల్ కాకుంటే ఇన్సులిన్ వేసుకోవాల్సి వస్తుంది. కొందరికి టైప్ వన్ డయాబెటిస్ అని వాళ్లలో ఆటోఇమ్యూన్ డిసీస్ వలన క్లోమంలోని బీటా సెల్సు డామేజ్ అయిపోయి ఉంటాయి.. వారికి ఇన్సులిన్ వాడడం తప్పదు.. ఎవరైనా పిండి పదార్థాలు తినడం ఆపేసి కేవలము మటన్ చికెన్ తింటూ డయాబెటిస్ ను పూర్తిగా పోతుంది అంటే అది వారి అవగాహన లోపం లేదా వారికి దీని మీద ఎటువంటి అవగాహన లేదు అని అర్థం... అలా చేయడం వలన కొంత వెయిట్ లాస్ అయ్యి బరువు తగ్గడం వలన ఫ్యాట్ తగ్గడం వలన కొంచెం డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది. కానీ మీరు ఆ మాత్రలు పూర్తిగా ఆపేస్తే తిరిగి డయాబెటిస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది.. ఎందుకంటే అది డయాబెటిస్ అనేది ఒక రోగం కాదు అది ఒక మెటబాలిక్ అబ్నార్మాలిటీ. డయాబెటిస్ ఎప్పుడూ మనము కంట్రోల్ లోనే ఉంచుకోవాలి అంతేకానీ దానిని రూపుమాపడం అనేది కలగా ఉంటుంది. కావున చిట్కాలు మానేసి, వాటిని వినడం మానేసి, కేవలం తరచూ పరీక్షలు చేసుకోవడం, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, జిహ్వను అదుపులో పెట్టుకుని మనము తగినంత ఆహారాన్ని తీసుకోవడం పాటు అవసరమైతే ఇన్సులిన్ లేక మందులు వాడుతూ డయాబెటిస్ ను కంట్రోల్ లో పెట్టుకుంటే మీకు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఏ అవయవాలు చెడిపోయే అవకాశం ఉండదు. ఒకసారి డయాబెటిస్ వస్తే అది పోదు, కేవలం దానిని కంట్రోల్లో మాత్రమే పెట్టుకోగలము అది మీ చేతిలోనే ఉంది. మీరు ఏమంటారు? డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Bihar Elections Result : నేడు బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.
America |షట్ డౌన్ కు కారణం ఇదే..
America | షట్ డౌన్ కు కారణం ఇదే.. America, ఆంధ్రప్రభ –
నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
న్యూఢిల్లీ : దేశమంతా ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం (నవంబరు 14) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుందని ఎన్నికల కమిషన్ గురువారం వెల్లడించింది. మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తరువాత ఉదయం 8.30 గంటలకు ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఇవిఎం) కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇవిఎం కౌంటింగ్ చివరి రౌండ్ కు ముందే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తవుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ల (ఆర్ఒ)లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో అభ్యర్థులు లేదా వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్ట్ల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. ఇవిఎం కౌంటింగ్ సమయంలో కౌంటింగ్టేబుళ్ల వద్దకు కంట్రోల్ యూనిట్లు ఇవిఎంలను తీసుకు వస్తారు. వాటి సీళ్లను తనిఖీ కోసం కౌంటింగ్ ఏజెంట్లకు చూపిస్తారు. ఇవిఎంలో రికార్డయిన ఓట్ల సంఖ్యను ఫారం 17 సి ఎంట్రీలతో క్రాస్ చెక్ చేస్తారు. ఏదైనా సరిపోకపోతే వివిపిఎటి స్లిప్లతో సరిచూస్తారు. ఇవిఎం కౌంటింగ్ పూర్తయ్యాక నియోజకవర్గాల వారీగా ఐదు పోలింగ్ స్టేషన్లను యాధృచ్ఛికంగా ఎంపిక చేసుకుని వివిప్యాట్ పరిశీలిస్తారు. అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వివిప్యాట్ స్లిప్పులను ఇవిఎం ఫలితాలతో సరిచూస్తారు. రౌండ్ల వారీగా, నియోజకవర్గాల వారీగా లభించిన ఫలితాలను సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ సంకలనం చేసి అధికారిక ఇసి ఫలితాల పోర్టల్లో ప్రదర్శిస్తారు. ఫలితాల కచ్చితమైన సమాచారం కోసం అనధికారిక సమాచారంపై ఆధారపడకూడదని, ఇసి అధికారిక ఫలితాల పోర్టల్ లోనే చూసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈమేరకు టివి ఛానల్స్,ఇంటర్నెట్ మీడియా ఛానల్స్కు కూడా సూచించింది. 243 మంది రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ మొత్తం 243 నియోజకవర్గాల్లో ఈమేరకు విస్తృతంగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషన్ గురువారం వెల్లడించింది. 243 కౌంటింగ్ పరిశీలకులు, అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో 243 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్ఒ)లు కౌంటింగ్ను పర్యవేక్షిస్తారు. మొత్తం 4372 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కోటేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అభ్యర్థులు నియమించిన 18000 మంది కౌంటింగ్ ఏజెంట్లు కూడా కౌంటింగ్ను పరిశీలిస్తారు.
Jubilee Hills |నరాలు తెగే ఉత్కంఠ..
Jubilee Hills | నరాలు తెగే ఉత్కంఠ.. Jubilee Hills, హైదరాబాద్, ఆంధ్రప్రభ
వైద్యో నారాయణో హరి అన్న సూక్తి ప్రకారం రోగుల ప్రాణాలను కాపాడవలసిన వైద్యులే మారణకాండకు పాల్పడే ఉగ్రవాద భూతానికి ఆయుష్షు పోయడం విపరీతం. ఢిల్లీ ఎర్రకోట సమీపాన ఉగ్రవాద ఆత్మాహుతి బాంబు దాడి వెనుక కొంతమంది డాక్టర్ల పాత్ర ఉండడం దేశచరిత్రలో అత్యంత సంచలనాత్మక సంఘటన. ఇది పూర్తిగా ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కుట్రయే. దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో దాడులు సాగించడానికి ఫక్కా ప్రణాళిక సిద్ధమైంది. దీనికోసం ఎనిమిది మంది ఆత్మాహుతి బాంబర్లను సిద్ధం చేసినట్టు బయటపడింది. ఈ కుట్ర ప్రణాళికలో డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ కీలక పాత్ర పోషించినట్టు వారి డైరీల ద్వారా తేలింది. ఫరీదాబాద్లో అల్ ఫలా యూనివర్శిటీ లోని మెడికల్ కాలేజీ లోని బాయ్స్ హాస్టల్ గది ఒకటి కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలకు వ్యూహం రూపొందిందని దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఈ కుట్రకు నిందితులు దాదాపు రూ.20 లక్షల వరకు నిధులు సేకరించినట్టు తాజా సమాచారం. ఇంతవరకు కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతుండడం వాటిని భద్రతా దళాలు భగ్నం చేయడం పరిపాటిగా వస్తోంది. కానీ ఇప్పుడు దేశం లోపలే నగరాల్లో ఉగ్రకార్యకలాపాలకు సన్నాహాలు సాగుతుండడం కొత్తమలుపు. గత రెండు దశాబ్దాలుగా వందలాది ఉగ్రవాద పన్నాగాలను ఛేదించి దేశభద్రతను సంరక్షించడంలో భద్రతా దళాలు ముందంజ వేస్తున్నాయని ఘనతను సాధించుకున్నాయి. అయితే ఢిల్లీ ఎర్రకోట వద్ద ఉగ్రవాద ఆత్మాహుతి బాంబు దాడి గురించి లభించిన సాక్షాధారాల ప్రకారం ఇది తొందరపడి చేసిన చర్యగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ దురాగతానికి పాల్పడే వారిలో ఒకరు ముందుగానే అరెస్ట్ అయ్యారని తెలిసి ఈ వల నుంచి తప్పించుకుని పారిపోడానికి చేసిన ప్రయత్నమే ఆత్మాహుతి బాంబు దాడికి దారితీసిందని తేలింది. అయినప్పటికీ అనుకోలేని ఘోర విపత్తు జరిగిపోయింది. కుట్రదారుడు ఒకరు తప్పించుకుపోయాడంటే భద్రతా సంస్థల నిఘా ఎలా నిద్రపోతోందో స్పష్టంగా చెప్పవచ్చు. జమ్మూకశ్మీర్ ప్రాంతంలోపల, బయట నుంచి చొరబాట్లను రెగ్యులర్గా నియంత్రించే ఆపరేషన్లు సాగుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ కాకుండా ఫరీదాబాద్ వంటి నగర ప్రాంతాల్లో ఉగ్ర సంఘటనను నివారించడంలో భద్రతా సంస్థల ఘోరవైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. దేశంలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా వాయువేగంలో భద్రతా సంస్థలు నివారించి దేశ ప్రజల ప్రాణాలకు రక్షణ కలిగిస్తుంటాయి. అలాంటిది దేశ రాజధానిలో ఆత్మాహుతి బాంబు కదలాడుతుండడం గమనించలేకపోవడం శోచనీయం. కశ్మీర్ లోయలో జరిగే ఉగ్రకార్యకలాపాలకు ఫరీదాబాద్ నెట్వర్క్తో సంబంధం ఉందని అనుమానించవలసి వస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఒకె)లోను, పాకిస్థాన్ లోనూ ఆపరేషన్ సిందూర్ ప్రకంపనలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విష సర్పాలకు మరింత ద్వేషాన్ని రెచ్చగొట్టాయి. ప్రతీకార పన్నాగాలతో మూడు టన్నుల ప్రాణాంతక పేలుడు పదార్థాలతో దాడులకు సిద్ధమయ్యాయని భావిస్తున్నారు. వాటిని కానీ పట్టుకొనకపోతే మరీ భారీ విధ్వంసం జరిగి ఉండేది. అంతకు ముందే కశ్మీర్ లోయలో బెదిరిస్తూ పోస్టర్లు వెలిశాయి. కానీ భద్రతా దళాలు అంతగా పట్టించుకోలేకపోవడంతో ఫరీదాబాద్ ఉగ్రవాద పన్నాగం కొంతవరకు నెరవేరిందని చెప్పవచ్చు. దీనిని బట్టి నిఘా అన్నది అణువణువూ గాలించే నిరంతర చర్యగా ఉండాలన్నది తెలియజెప్తోంది. ఇవన్నిటి కన్నా కంపరం కలిగించేది ఈ భారీ కుట్రలో మెడికల్ ప్రొఫెషనర్లే కీలక పాత్ర వహించడం. వైద్య ధర్మ ప్రమాణ స్వీకారం చేసిన ఈ వైద్య గ్రాడ్యుయేట్లు ఉగ్రకుట్రలో భాగస్వాములు కావడం, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింప చేసి ఇతరులను మార్చడానికి నిరంతరం పనిచేయడం అనూహ్య పరిణామాలు. కనీసం ఐదుగురు డాక్టర్లు ఇందులో ప్రధాన బాధ్యత వహించారు. వీరిలో నలుగురు కశ్మీర్లో పుట్టి పెరిగిన వారే. ఇది పెద్ద సమస్యకు సంకేతం. విద్యావంతులైన వారు రహస్యంగా దేశ విద్రోహ చర్యలకు పూనుకుని వాటి కమ్యూనికేషన్కు సంబంధించిన అత్యంత ఆధునిక పరికరాలను సమకూర్చుకుని, వివిధ రకాల బాంబులను ఏయే రసాయనాలతో తయారు చేయవచ్చునో ఆన్లైన్ ద్వారా తెలుసుకుని, రిమోట్ కంట్రోలు ద్వారా వాటిని పేల్చడంలో తర్ఫీదు పొందడం, ఆయా కార్యకలాపాల్లో చేరడం ఇవన్నీ భద్రతా వ్యవస్థలకు పెద్ద సమస్య కావడమే కాక, అమాయక ప్రజల ప్రాణాలకు గండంగా తయారైంది. ఈ విధమైన వైట్కాలర్ టెర్రరిజం అనాగరిక చర్యల్లో కూడా విద్యావంతులు చురుకుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలకు రావడం భద్రతా సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్, బంగ్లాదేశ్లతో భౌగోళిక రాజకీయాల్లో మార్పు వచ్చింది. ఉగ్రవాద బెదిరింపులు ఇంతటితో సమసిపోవు. కశ్మీర్ లోయకు అతీతంగా తమ వేయితలలు అటూఇటూ చూస్తుంటాయి. ఉగ్రవాదులను లక్షంగా చేసుకుని దాడులు సాగించడంతో భద్రతా దళాల బాధ్యత తీరిపోదు. ఆయా ప్రాంతాల వారి మనుషులతో, వారి జీవన పరిస్థితులతో, వనరులతో మమేకమై జాతీయ స్థాయిలో ప్రయత్నాల సమన్వయంతో నిఘా సమాచారాన్ని సేకరించగలిగే సామర్థం పెంపొందించుకోవాలి. దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్రలు రూపొందుతున్నా తక్షణం భగ్నం చేసేలా వ్యవస్థలను తీర్చిదిద్దాలి. దీనికి సమయం అనుకూలించకపోవచ్చు. కానీ రాజకీయ కోణంలో భద్రతా విషయంలో పూర్తి నియంత్రణ కొనసాగిస్తూ జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను తిరిగి కట్టబెట్టడం సముచితం కావచ్చు.
మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా హైదరాబాద్ నిలిచిందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వే గవంతమైన వృద్ధి రేటుతో తెలంగాణ ముందుకు దూసుకెళుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు- భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (యూఎస్ఐఎస్పిఎఫ్) ముఖ్యమంత్రి ప్రసంగించా రు. ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 35 ఏళ్లుగా కాంగ్రెస్తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా ని లిచారని సిఎం వివరించారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖ ద్వారమని సిఎం తెలిపా రు. జీసిసిలకు గ్యమస్థానంగా ఉన్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని సిఎం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణా భివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థా యి నగరంగా హైదరాబాద్ను నిలపడమే తన ప్రథ మ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తె లిపారు. 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమం త్రి వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే నూతన నగరంగా మారుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీనదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సిఎం అన్నారు. డ్రైపోర్ట్, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్రోడ్డు, రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల మధ్య మాన్యు ఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతి గురించి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివరించారు. చైనా +1 మోడల్కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందన్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ఐవి లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో ఆఫ్షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టిసిఎస్, ఇన్ఫోసిస్ పేర్లు భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని హైదరాబాద్లో ఆ ట్రెండ్ను మార్చాలని తాము అనుకుంటున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని సిఎం పేర్కొన్నారు. ఈ సదస్సు ప్రారంభంలో తెలంగాణరైజింగ్ 2047 విజన్ను ప్రదర్శించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ఈ వార్షిక సమావేశంలో విశేష ఆదరణ పొందింది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాల గురించి సిఎం చేసిన ప్రసంగం అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది. రేవంత్ రెడ్డి విజన్ అచీవబుల్: జాన్ ఛాంబర్స్ జాన్ ఛాంబర్స్, సిస్కో మాజీ సీఈఓ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ పారదర్శకంగా, సాహసోపేతంగా (బోల్డ్), సాధించగలిగేలా ఉందన్నారు ఆయన చెప్పిన ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయన్నారు. గ్లోబల్ సమ్మిట్కు హాజరవుతాం: డా. ముఖేష్ ఆఘి, యూఎస్ఐఎస్పిఎఫ్ అధ్యక్షుడు డా. ముఖేష్ ఆఘి, యూఎస్ఐఎస్పిఎఫ్ అధ్యక్షుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తమ సభ్యుల్లో అత్యధికులం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరవుతామన్నారు. తెలంగాణ విజన్ను దగ్గరగా తెలుసుకోవాలని తామంతా ఆసక్తిగా ఉన్నామన్నారు.
పాలస్తీనాను ఇప్పటికే 150 దేశాల వరకు గుర్తించాయి. అటువంటి పరిస్థితులలో ఆ సమస్య పరిష్కారం కావాలనే ఆలోచన ట్రంప్కు నిజంగా ఉన్నట్లుయితే చేయవలసింది గాజా నుంచి, వెస్ట్బ్యాంక్ నుంచి ఇజ్రాయెల్ తన సేనలను, ఇతర ఆక్రమణలను, వేలాదిమంది అక్రమ సెటిలర్లను వెంటనే నిష్క్రమించేట్లు చేయటం. తర్వాత, ఇజ్రాయెల్ గుర్తించినా లేకున్నా తాము పాలస్తీనాను గుర్తించటం. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో అవసరమైన చర్యలు తీసుకోవటం. ఇది జరిగితే సమస్య ఆ గంటలోనే పరిష్కారమవుతుంది. పాలస్తీనా ప్రజలతో పాటు ప్రపంచం కోరుతున్నది అదే. గాజా, వెస్ట్బ్యాంక్ పునర్నిర్మాణాలు, అభివృద్ధి క్రమంగా జరుగుతాయి. అందుకు సహాయ పడేందుకు అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయి. గాజాపై 75 సంవత్సరాల ఇజ్రాయెల్ ఆక్రమణ ‘సంతృప్తికరంగా’ సాగటం లేదని, సమస్యలు ఎదురవుతున్నాయని భావించి కావచ్చు ఇపుడు తానే నేరుగా రంగప్రవేశం చేయాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇజ్రాయెల్ ఆక్రమణను స్థానిక పాలస్తీనా ప్రజలు తీవ్రంగా, సాయుధంగా, మునుపెన్నడూ లేని స్థాయిలో ప్రతిఘటిస్తుండగా, అమెరికా తోడ్పాటుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమాన్ని ప్రపంచం అంతే తీవ్రంగా ఖండిస్తున్నది. అమెరికా మిత్ర దేశాలు సైతం అందుకు గొంతు కలుపుతూ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించటం మొదలుపెట్టాయి. మరొక వైపు ఐక్యరాజ్యపమితి, భద్రతా సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ నేర న్యాయస్థానం, మానవహక్కుల సంస్థలు ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరిని స్పష్టంగా తీసుకుంటున్నాయి. వీటన్నింటి ఫలితంగా ఇజ్రాయెల్ దాదాపు ఏ కాకిగా మారింది. ఇజ్రాయెల్ ఆక్రమణ ‘సంతృప్తికరంగా’ లేదని అమెరికా భావించటానికి ఇవన్నీ కారణాలు. ఇటువంటి పరిస్థితుల వల్లనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలి వారాలలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పట్ల కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఖతార్పై దాడికి ఆగ్రహించిన ట్రంప్, అందుకు నెతన్యాహూ చేత ఖతార్ ప్రధానికి క్షమాపణలు చెప్పించటాన్ని ఇందుకు ఒక ఉదాహరణగా చెప్తున్నారు. అయితే, నెతన్యాహూ చర్యల మూలంగా ఆ ప్రాంతంలో తమ ప్రయోజనాలను అమెరికా కోల్పోబోదు. నెతన్యాహూ తాత్కాలికం. తమ ప్రయోజనాల దీర్ఘకాలికం. ఆ ప్రయోజనాల కోసమే పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్ను సృష్టించాయి. అందు కోసమే ఇతరత్రా ఎన్ని సమస్యలు ఎదురైనా ఇజ్రాయెల్ను కాపాడుతూ వస్తున్నాయి. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు ఆటంకాలు సృష్టిస్తూ వస్తున్నది కూడా అందుకోసమే. కనుక, ఇజ్రాయెల్ అనే ఒక సాధనం వల్ల సమస్యలు మొదలైనపుడు కొత్త సాధనాలను తయారు చేసుకోవాలి. ట్రంప్ అదే చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఆ మేరకు ఆయన ఒక ప్రతిపాదన తయారు చేసి భద్రతా సమితి సభ్యదేశాలు కొన్నింటికి మాత్రం పంపారు. ఆ పత్రం ఇపుడు వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం, గాజా నియంత్రణ, పరిపాలన కోసం ఒక అంతర్జాతీయ సైనిక దళం ఏర్పడి, అది ట్రంప్ అధ్యక్షతన ఏర్పడే ‘బోర్డ్ ఆఫ్ పీస్’ నిర్దేశాల ప్రకారం పని చేస్తుంది. ఆ దళం ఏమిటి, బోర్డు ఏమిటనే వివరాలలోకి వెళ్లేముందు కొన్ని విషయాలు చెప్పుకోవాలి. పాలస్తీనా ప్రజలు, ప్రపంచ దేశాలు కోరుతున్నది గాజా, వెస్ట బ్యాంక్లతో కూడిన స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు. దానితో పాటు ఇజ్రాయెల్ మరొక దేశం కావటం. అక్కడ పోరాటాలు 75 సంవత్సరాలుగా అందుకోసమే సాగుతున్నాయి. అందుకు ఏకైక ఆటంకం ఇజ్రాయెల్, అమెరికాలు. పాలస్తీనాను ఇప్పటికే 150 దేశాల వరకు గుర్తించాయి. అటువంటి పరిస్థితులలో ఆ సమస్య పరిష్కారం కావాలనే ఆలోచన ట్రంప్కు నిజంగా ఉన్నట్లుయితే చేయవలసింది గాజా నుంచి, వెస్ట్బ్యాంక్ నుంచి ఇజ్రాయెల్ తన సేనలను, ఇతర ఆక్రమణలను, వేలాదిమంది అక్రమ సెటిలర్లను వెంటనే నిష్క్రమించేట్లు చేయటం. తర్వాత, ఇజ్రాయెల్ గుర్తించినా లేకున్నా తాము పాలస్తీనాను గుర్తించటం. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో అవసరమైన చర్యలు తీసుకోవటం. ఇది జరిగితే సమస్య ఆ గంటలోనే పరిష్కారమవుతుంది. పాలస్తీనా ప్రజలతో పాటు ప్రపంచం కోరుతున్నది అదే. గాజా, వెస్ట్బ్యాంక్ పునర్నిర్మాణాలు, అభివృద్ధి క్రమంగా జరుగుతాయి. అందుకు సహాయ పడేందుకు అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయి. కాని అమెరికా అధ్యక్షుడు ఈ సూటి మార్గాన్ని అనుసరించే బదులు నిజాయితీలేని సరికొత్త ఎత్తుగడలు అనేకం వేస్తున్నారు. ట్రంప్ కన్నా ముందు కాలపు అధ్యక్షులు స్థూలంగా అనుసరించినవే అవన్నీ. ట్రంప్ విషయానికి వచ్చే సరికి, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినందున ఒక కొత్త పథకం గురించి మాట్లాడటం తెలిసిందే. అది, గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా ఖాళీ చేయించి అక్కడ రిసార్ట్ ఒకటి అభివృద్ధి పరచటం. దానిపై తీవ్ర విమర్శలు రావటంతో కొంత ఊగిసలాడి, మాటలు మార్చి అవే లక్షాల కోసం ఇపుడు ఒక కొత్త నమూనాను ప్రతిపాదించారు. దాని ప్రకారం, ఇజ్రాయెల్ దశల వారీగా ఉపసంహరించుకోగా హమాస్ వెంటనే అస్త్ర సన్యాసం చేస్తుంది. రాజకీయాలలో, పాలనలో ఎంత మాత్రం పాల్గొనదు. దాని ఆయుధ కర్మాగారాలను, టన్నెళ్లను పూర్తిగా ధ్వంసం చేస్తారు. అమెరికా ఎంపిక చేసే అంతర్జాతీయ వ్యక్తులతోపాటు రాజకీయాలతో సంబంధం లేని పాలస్తీనియన్లతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. అంతర్జాతీయ దళాలతో తాత్కాలిక సైనిక దళం ఏర్పడుతుంది. గాజాలో ఎటువంటి అభివృద్ధి ఎట్లా జరగాలో ట్రంప్ బోర్డు నిర్ణయిస్తుంది. ఆ ఏర్పాటు ఎన్నేళ్లు ఉండాలో వారే నిర్ణయిస్తారు. దీనంతటిలో వెస్ట్ బ్యాంక్ ప్రస్తావన, భవిష్యత్తు ఏమిటో మాత్రం ఏమీ చెప్పరు. అక్కడి పాలస్తీనా అథారిటీ పాత్ర ఉండదు. ఇక చివరిగా, పాలస్తీనా దేశం ప్రస్తావన అత్యంత అస్పష్టంగా మాత్రమే, ఒక కాలవ్యవధి అంటూ ఏమీ లేకుండా ఉంటుంది. మరొక వైపు, ఇజ్రాయెల్ సేనల పూర్తి ఉపసంహరణ మాట కూడా కన్పించదు. మరొక వైపు నెతన్యాహూ, తాము పూర్తిగా ఉపసంహరించుకోబోమని తమ పార్లమెంటులో ఇప్పటికే ప్రకటించారు. అందుకు ట్రంప్ కాదనలేదు. దీనంతటి సారాంశం ఏమిటో అర్థమవుతున్నదే గనుక మళ్లీ చెప్పనక్కరలేదు. ట్రంప్ వేసిన మొదటి పథకంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దానితో ఆయన రచించిన తాజా పథకమే, పైన పేర్కొన్న భద్రతా సమితి తీర్మాన ప్రతిపాదన. విచిత్రం ఏమంటే, అందులోనూ కొత్తదనం ఏమీ లేదు. ముసుగు మాత్రం కొత్తది. కాకపోతే అటువంటి ప్రతిపాదన తాము ప్రైవేటుగా చేసిన దానికన్న భద్రతా సమితి ద్వారా చేయించగలిగితే శంఖులో పోసి తీర్థంగా మార్చినట్లు అవుతుంది. అదిగాక, వివాదాస్పద భూభాగాలను ఏదో ఒక దేశానికో, కొన్ని దేశాలకో తాత్కాలిక పాలన కోసం ఉండేట్లుగా అప్పగించే సంప్రదాయం ఒకటి ఐక్యరాజ్య సమితిలో ఉంది. కనుక, ఆ నిబంధనను సౌకర్యవంతంగా ఉపయోగించుకున్నట్లుయితే, తమను విమర్శించేందుకు ఏమీ ఉండదన్నది ట్రంప్ ఎత్తుగడ. ఇజ్రాయెల్ ఏర్పాటుకు ముందు కూడా ఆ ప్రాంతంపై ఇంగ్లాండ్కు ఇటువంటి బాధ్యతనే సమితి ద్వారా అప్పగించారు. కనుక ట్రంప్ ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆ మాండేట్ ఎంత కాలం సాగేదీ ఎవరూ చెప్పజాలరు. పాలస్తీనా ఏర్పాటు ఏమయేదీ అంతకన్న తెలియదు. మొత్తానికి ఆ విధంగా అమెరికా, ఇజ్రాయెల్ కూటమి నియంత్రణ నిరాటంకంగా నిరవధికంగా సాగుతుందన్న మాట. ఈలోగా హమాస్ను ధ్వంసం చేస్తారు. అమెరికా పట్ల ప్రేమ గనుక అరబ్ దేశాలు మొక్కబడిగా తప్ప నోరెత్తవు. ఇపుడిక అమెరికా అధ్యక్షుని తాజా తీర్మానంలోని వివరాలను చూద్దాం. అమెరికాకు, ఆ బృందంలోని ఇతర దేశాలకు గాజాను 2027 చివరి వరకు పాలిస్తూ, భద్రత కూడా కల్పించే అధికారం లభిస్తుంది. ఆ గడువును పొడిగించే అవకాశమూ ఉంటుంది. మొదటి సైనిక దళాలను జనవరి నాటికి పంపుతారు. ఆ దళాలు శాంతిని కేవలం ‘పరిరక్షించటం’ గాక ‘అమలు’ పరుస్తాయి. అంటే బలప్రయోగంతో వేర్వేరు దేశాల సైనిక బృందాలు ట్రంప్ అధ్యక్షతన గల బోర్డ్తో సంప్రదింపుల ద్వారా నియామకమవుతాయి. ఆ దళాలు గాజాకు ఇజ్రాయెల్తో, ఈజిప్టుతో గల సరిహద్దులను కాపలా కాయటంతోపాటు పౌరులకు భద్రత కల్పించటం, ఒక కొత్త పాలస్తీనా పోలీసుకు శిక్షణ ఇవ్వటం చేస్తాయి. గాజాను నిస్సైనికంగా మార్చి, హమాస్ వంటి శక్తులను నిరాయుధం చేసి వాటి సైనిక సంపత్తిని టన్నెల్ నిర్మాణాలను ధ్వంసం చేస్తాయి. గాజా ఒప్పందం అమలుకు అవసరమైన ఇతర చర్యలు కూడా తీసుకుంటాయి. మరొక వైపు ఇజ్రాయెలీ సేనలు ‘క్రమక్రమంగా’ ఉపసంహరించుకుంటాయి. వెస్ట్బ్యాంక్లో పాలస్తీనా అథారిటీ ‘సంస్కరణలను’ చేపట్టి తనను తాను కూడా సంస్కరించుకుంటుంది. ఆ పనులు జరిగితే ‘దీర్ఘకాలంలో’ గాజా పాలనను కూడా చేపట్టగలదు. అంతే తప్ప స్వతంత్ర పాలస్తీనా ప్రస్తావన లేదు. ట్రంప్ బోర్డుకు ఆమోదయోగ్యమైన విధంగానే అంతర్జాతీయ దళాల ఏర్పాటు జరుగుతుంది. ఆ విషయంలో ఈజిప్టు, ఇజ్రాయెల్లను సంప్రదిస్తారు. గాజా పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను బోర్డు సమీకరిస్తుంది. పునర్నిర్మాణంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో బోర్డు నిర్ణయిస్తుంది. స్థూలంగా ఇవీ అమెరికా ప్రతిపాదిత తీర్మానంలోని అంశాలు. వీటిపై పాలస్తీనియన్ల స్పందన ఏమిటో చూడవలసి ఉంది. అట్లాగే భద్రతా సమితిలో ఎవరైనా వీటో చేయగలరేమో తెలియదు. ఒకవేళ ఆమోదం పొందితే మాత్రం జరగగలది ఏమిటో ఊహించటం కష్టం కాదు. ప్రత్యక్షంగా అమెరికా, పరోక్షంగా ఇజ్రాయెల్ కలిసి గాజాను, వెస్ట్బ్యాంక్ను దీర్ఘకాలం పాటు నియంత్రిస్తూనే ఉంటాయన్న మాట. టంకశాల అశోక్
మన దేశంలో చాలా మందికి అత్యంత ధనవంతులు ఎంత దానం చేస్తున్నారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక దీనిపైనా పలు సంస్థలు ఎప్పటికప్పుడు డేటా విడుదల చేస్తుంటాయి. ఈ సంవత్సరంలో ఏకంగా రూ. 10,380 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందులో మొత్తం 191 మంది దాతలు ఉన్నారు. వీరిలో 12 మంది కొత్తవారే ఉన్నారు. గత మూడేళ్లలో చూస్తే వీరి విరాళాల మొత్తం 85 శాతం పెరగడం గమనార్హం. టాప్-10 లిస్టులో ఉన్న వారి విరాళాల మొత్తమే రూ. 5,834 కోట్లుగా ఉంది. అత్యంత ధనవంతుల్లో అంబానీ, అదానీ వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ.. దాతృత్వంలో మాత్రం తొలి స్థానం శివనాడర్ దే. మనిషి సంఘజీవి. ఇతరులతో వ్యవహరించే క్రమంలో మనిషి.. ఆయా పరిస్థితుల్లో వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తుంటాడు. వీటిలో కొన్ని అనుకూల ధోరణికి ప్రతిబింబాలయితే, కొన్ని ప్రతికూల స్పందనలు. సుగుణాల విషయానికి వస్తే.. అందులో దయాగుణానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. సాటి మనిషితో దయతో వ్యవహరించాలని మన సంస్కృతి మనకు బోధిస్తుంది. మనం ఒక తల్లి బిడ్డలుగా మసలుకోవాలని, తోటివారి కష్టసుఖాలను ఓ కంటకనిపెట్టి వారిని ఆదుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్కృతుల్లోనూ ఈ భావన కనిపిస్తుంది. అయితే మానవుడి జీవన వేగం పెరగటం, ప్రపంచీకరణ వంటి పలు ప్రభావాలవల్ల మనిషి జీవన వేగం పెరిగింది. ఈ క్రమంలో తోటివారి సంగతి కాసేపు పక్కన పెడితే.. సొంత తోబుట్టువులు, తల్లిదండ్రులనే పట్టించుకోవటం లేదు. ఈ నేపథ్యంలో సొంతలాభం కొంత మాని.. పొరుగువారి గురించి ఆలోచించాలని మనకు గుర్తుచేస్తోంది.. 1997లో జపాన్లోని టోక్యోలో వరల్డ్ కైండ్నెస్ మూవ్మెంట్ మొదలైంది. వ్యక్తుల మధ్య మాత్రమే కాదు, జాతుల మధ్య, సమాజాల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య కూడా వెల్లివిరిసి ‘వసుధైక కుటుంబం’ అనే స్వప్నం సాకారం కావాలని జరిగిన తొలిసమావేశంలో నిర్వాహకులు ప్రకటించారు. మనకు అన్నీ ఇచ్చిన సమాజానికి మనవంతుగా ఏమైనా తిరిగివ్వాల్సిన బాధ్యత ప్రతి మనిషి మీదా ఉందనే సంకల్పాన్ని ఆ సమావేశంలో ప్రకటించారు. క్రమంగా ఈ సందేశం ఆస్ట్రేలియా, కెనడా, నైజీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అనేక దేశాలకు చేరింది. దీంతో ఆయా దేశాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. 1998 తర్వాత ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది, 2005లో యుకెలో, 2009 నాటికి సింగపూర్, 2010లో ఫ్రాన్స్, అమెరికా ఇలా 2019 నాటికి, ఈ ఉద్యమం 27 దేశాలకు వ్యాపించింది. 2025 నాటికి మరిన్ని దేశాలు ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన సమాజంలో ఆర్థికపరమైన అంతరాలు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతుండగా, ధనికుల వద్ద మరింత సంపద పోగుపడుతోంది. ఈ అంతరాలను గుర్తించిన ప్రభుత్వాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో సంపన్నుల నుంచి కొంత పన్ను వసూలు చేసి పేదలకు వెచ్చిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎపిలోని కూటమి సర్కారు ఈ ఏడాది ఉగాది నాడు.. పీ4 అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్ షిప్ అనే నాలుగు అంశాలతో కూడిన ఈ కార్యక్రమం కింద జనాభాలోని అత్యంత సంపన్నులైన 10% మంది పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్న 20 శాతం మందికి నేరుగా సాయం చేయనున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో విరాళాలు ఇచ్చే సంపన్న వ్యక్తులను మార్గదర్శకులుగా, పేద లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తారు. ప్రభుత్వం డిజిటల్ డాష్ బోర్డుల ద్వారా ఈ సాయం పురోగతిని గుర్తిస్తూ ఒక ఫెసిలిటేటర్ గా వ్యవహరిస్తోంది. సంపన్నుల నిధులను ఇళ్ల నిర్మాణం, పారిశుధ్యం, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, సోలార్, స్వయం ఉపాధి అందించటం వంటివాటికి ఖర్చు చేస్తున్నారు. అలాగే, మన దేశంలోని అనేక మంది సంపన్నులు దయాగుణంతో పేదల సేవకై ముందుకొస్తున్నారు. విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ ఒక్క ఏడాదిలో వారు రూ. 10 వేల కోట్లకు పైగా వెచ్చించారు. ‘ఎడెల్గివ్ హురున్ ఇండియా’ తాజాగా విడుదల చేసిన దాతృత్వ సంపన్నుల జాబితాలో ఈ ఏడాది కూడా నాడార్ కుటుంబమే అగ్రస్థానంలో ఉంది. 2024- 25లో శివ్ నాడార్ ఫౌండేషన్ అత్యధికంగా రూ. 2,708 కోట్ల విరాళాలు ఇచ్చింది. అంటే రోజుకు సుమారు రూ.7.4 కోట్లు అన్నమాట. తరవాతి స్థానాల్లో రూ. 626 కోట్లతో ముకేష్ అంబానీ, రూ. 446 కోట్ల విరాళాలతో మూడవస్థానంలో బజాజ్ కుటుంబం నిలిచాయి. హురున్ ఇండియా నిరుటి జాబితాలో 203మంది నిలవగా, తాజా జాబితాలో 191మంది చోటు దక్కించుకున్నారు.అయితే, సగటు విరాళం గతంతో పోలిస్తే రూ. 43 కోట్ల నుంచి రూ. 54 కోట్లు పెరిగింది. కాగా, తాజా జాబితాలోని దాతలు ఇచ్చిన విరాళం మొత్తం రూ.10,380 కోట్లు అని నివేదిక వెల్లడించింది. మన పొరుగుదేశం చైనా జిడిపి దాదాపు 20 ట్రిలియన్ డాలర్లు కాగా, ఇండియా జిడిపి 4 ట్రిలియన్ డాలర్ల మాత్రమే. కానీ, మనం దాతృత్వంలో చైనాతో సరితూగుతున్నామని, భవిష్యత్తులో దాతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా ఉంటుందని నివేదిక ప్రశంసించింది. ఇతరులకు సాయం చేయటానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని మన సమాజం వీలయిన మేర వినియోగించుకోవాలి. దానినో అరుదైన అవకాశంగా భావించాలి. మనకు అన్నీ ఇచ్చిన సమాజానికి మనం ఆ మాత్రం చేయలేకపోతే..మన సమాజంలో ఎంత సంపద, జ్ఞానం ఉన్నప్పటికీ,అది నరకప్రాయంగానే మారుతుంది. ఐనం ప్రసాద్, 98489 28787
న్యూఢిల్లీ : ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడింది వైద్యడు ఉమర్ నబీయే అని తేలిపోయింది. ఇప్పటి వరకు అతడ్ని అనుమానితుడిగా భావించిన దర్యాప్తు సంస్థలు పేలుడుకు ప్రధాన కారకుడు అతడేనని ధ్రువీకరించా రు. డిఎన్ఎ పరీక్షల తర్వాత పుల్వామాకు చెందిన ఉమర్ నబీయే కారు నడిపాడని, ఆ పేలుడులో అతడు కూడా మరణించాడని తేల్చారు. ఎర్రకో ట సమీపంలో సేకరించిన శరీరభాగాల నుంచి సేకరించిన నమూనాలు, అతడి తల్లి నుంచి తీసుకున్న శాంపిళ్లతో సరిపోలాయని, పూర్తి విశ్లేషణలతర్వాత ఉమర్ నబీయే కారు బాంబు పేలుడు సృష్టించాడని తేల్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వైట్కాలర్ టెర్రర్లో ఉమరే కీలక పాత్రధారి అని పేర్కొన్నారు. ఉమర్ కారు ప్రయాణం వీడియో... ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ తుది ప్రయాణం తెలిపే వివరాలను ఢిల్లీ పోలీసులు సిసిఫుటేజీలను విశ్లేషించిన తర్వాత పూర్తి వివరాలతో వీడియో రూపొందించారు. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఎర్రకోట వరకూ ఆయన ఉగ్ర జర్నీ ఏ విధంగా సాగిందనే విషయాన్ని పొందుపరిచారు. 50 సిసిటీవీ కెమెరాల రికార్డుల ద్వారా సేకరించుకుని పరిశీలిస్తున్నారు. హ్యూండాయ్ ఐ20 కారులో ఫరీదాబాద్లో సోమవారంనాడు ఉదయమే బయలుదేరి నింపాదిగా సమయం తీసుకుని ఢిల్లీ చేరుకున్నట్లు తేల్చారు. భారీ పేలుడు పదార్థాలతో తన కారు ప్రయాణానికి ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్వేను ఎంచుకున్నాడు. మార్గమధ్యంలో కొన్ని చోట్ల తినడం, విశ్రాంతి, మసీదుల్లోకి వెళ్లి రావడం చేశాడు. తన పై నిఘా సంస్థలకు అనుమానం తలెత్తకుండా మాస్క్ ధరించాడు. తొలుత ఫిరోజ్పూర్లోని జిర్కా చేరడం తరువాత అక్కడి దాబా వద్ద ఆపి కారులో గడిపాడు. పట్టణాల్లోకి ప్రవేశించకుండా కేవలం హైవేల మీదుగా సాగుతూ అందరిలో ఒకడిలా అనుకునే విధంగా చేశాడు. చిన్న చిన్న రోడ్డు సైడ్ దాబాలు, టిఫిన్ సెంటర్లనే ఎంచుకున్నాడు. కొంత సమయం వరకూ ఆయన కెమెరాల దృష్టిలోకి రాలేదు. బద్రపూర్ సరిహద్దు మీదుగా ఢిల్లీలోకి చేరాడు. అక్కడ సిసిటివికి చిక్కాడు. ఢిల్లీలో పలు చోట్ల కొద్ది సేపు కారు ఆపుతూ చివరికి ఎర్రకోట వద్ద మధ్యాహ్నం 3.18వద్ద పార్క్ చేశాడు. ఓ నిమిషం తరువాత 3.19కి కారును రెడ్ఫోర్టు కాంప్లెక్స్ సమీపంలో పార్కింగ్ ఏరియాలో ఉంచాడు. అక్కడ మూడు గంటలు దీనిని నిలిపి ఉంచాడు. తరువాత సాయంత్రం 6.22 గంటలకు పార్కింగ్ నుంచి బయలుదేరాడు. మెట్రోస్టేషన్ వైపు సాగాడు. అరగంట కాకముందే 6.52 ప్రాంతంలో కారులో భారీ పేలుడుకు కారణమయ్యాడు. అల్ ఫలాహ్లో ఎర్ర కారు... ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వర్శిటీలో దొరికిన ఎరుపు రంగు కారు పూర్వాపరాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ కారుకు ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే పేలుడు లింక్ ఉన్న రెండు మూడు కార్ల జాబితాలో ఈ మారుతి బ్రీజా కారు కూడా చేరింది. దీనిని జమ్మూ కశ్మీర్ పోలీసులు వచ్చి పరిశీలిస్తున్నారని ఫరీదాబాద్ అధికారులు తెలిపారు. ఈ కారు హర్యానా రిజిస్ట్రేషన్తో ఉండగా, ఫరీబాద్ నెట్వర్క్లో అరెస్టయిన మహిళా వైద్యురాలు డాక్టర్ షహీన్ సయీద్ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వర్శిటీ క్యాంపస్లోని పలు ఇతర కార్లు, వాహనాల గురించి కూడా పోలీసు వర్గాలు ఆరాతీస్తున్నాయి. మరోవైపు పేలుడులో గాయపడి చికిత్స పొందుతూ ఢిల్లీ ఎన్ఎన్జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి బిలాల్ గురువారం మృతి చెందాడు. దీనితో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పుడు 13కు చేరింది.
జాతికి నిజమైన సంపద బాలలే. వారిపై ఖర్చు పెట్టుబడిగా భావించాలి. బాలల అభివృద్ధి, వారికి లభించే నాణ్యమైన ఆహారం, ఆరోగ్యం, విద్య, వినోదం, కుటుంబ జీవనంపై ఆధారపడి ఉంటుం ది. అప్పుడే ఉత్తమ పౌరసమాజం నిర్మితమవుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఏటా జవహర్ లాల్ నెహ్రూ పుట్టి రోజైన నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. వాస్తవంగా భారతదేశంలో మొట్టమొదట విద్యాభివృద్ధికి కృషి చేసిన ఆదిదంపతులు జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలు. వారి కృషి వల్లనే నేడు బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే అవకాశం లభించింది. ఆ చదువును భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ చట్టబద్ధం చేశారు. భారతదేశంలో నేడు భారత రాజ్యాంగం, చట్టాల ద్వారా బాలలకు ప్రత్యేక రక్షణలు కల్పించారు. ఉన్నత వర్గాల బాలలతో పోలిస్తే... అట్టడుగు వర్గాల బాలల ఎదుగుదల నేటికి సవాల్ గానే నిలిచింది. బాలల అభివృద్ధికి మూలం విద్య. ఇందుకోసం విద్య హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. పేదరికంలో, ఆర్థికంగా ఇంకా దాదాపు 10 శాతానికి పైగా పిల్లలు విద్యకు దూరంగానే ఉన్నారు. మరోవైపు సంపన్న, పేద విద్యార్థుల మధ్య విద్య అంతరం కూడా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 92 శాతం బిసి, ఎస్సి, ఎస్టి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవగా.. సంపన్న శ్రేణి నుంచి కేవలం 8 శాతం మాత్రమే ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ అంతరాలు కనబడుతున్నాయి. మొన్న మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని పేపర్లో తినడం పలువురిని కలచివేసింది. మన దేశంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దుస్థితికి ఇది అద్దం పడుతుంది. భారతదేశం అభివృద్ధిలో దూసుకు పోతున్నప్పటికీ బాలల హక్కుల రక్షణలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. సామాజిక మాధ్యమాలతో పిల్లలో దుస్సంస్కృతి పెచ్చిరిల్లుతుంది. నైతిక విలువలు, క్రమశిక్షణ లోపిస్తోంది. దేశీయంగా పిల్లలపై ఒత్తిడి, వేధింపులు, దౌర్జన్యాలు, పిల్లల అపహరణ, అక్రమ రవాణా, వెట్టిచాకిరి, బాల్య వివాహాలు, లైంగిక దాడులు లాంటివి నిత్యకృత్యంగా కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి 2023లో దేశవ్యాప్తంగా 1.77 లక్షల కేసులు వెలుగుచూశాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. ప్రపంచ ఆకలి సూచిక 2024 ప్రకారం ఇప్పటికీ మనదేశంలో 13.7% పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మరోవైపు 5 ఏళ్ళ లోపు పిల్లలు 35.5 శాతం మంది వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోగా, 18.7 శాతం ఎత్తుకు తగిన బరువు లేరు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 5 ప్రకారం ఇప్పటికీ భారతదేశంలో 23 శాతం బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాలలో 41 శాతం బాల్య వివాహలు జరగడం ఆందోళనకరం. బాల్య దశలో ఎదుర్కొని అనేక సామాజిక రుగ్మతలకు అట్టడుగు వర్గాల పిల్లలే బాధితులవుతున్నారు. ఇవి వారి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. కావున బాలల శారీరక, మానసిక అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశ జనాభాలో 37 శాతం బాలలున్నారు. బాల్య దశలో పిల్లలు ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలకు పేద, బడుగు బలహీన పిల్లలే బలవుతున్నారు. వీరందరికీ ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి. పిల్లలను పేదరికంనుండి విముక్తి చేయడానికి కుటుంబ సామాజిక భద్రత కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. ఆడపిల్లల అభివృద్ధికి సుకన్య సమృద్ధి, మిషన్ వాత్సల్య వంటి ఆర్థిక సాధికారక కార్యక్రమాలు అమలుచేయాలి. పిల్లల్లో ఒత్తిడి, భయం, అభద్రత తదితర ప్రతికూల ప్రభావాలు తొలగించడానికి ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి మంచి నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలి. బాలల అభివృద్ది శిశుదశలోనే మొదలవ్వాలి. ఇందుకోసం ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయాలి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సమీకృత గురుకులాలు, మండలానికొక ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నది. వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. అధిక జనాభా గల భారతదేశం పిల్లల హక్కుల సంరక్షణకు చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. బాలల సహాయ కేంద్రానికి (1098) ప్రాచుర్యం కల్పించాలి. బాలల సంరక్షణ కోసం పోక్సో చట్టం 2012, బాలల న్యాయ చట్టం 2015, బాల హక్కుల పరిరక్షణ కమిషన్- 2005 లాంటివి ఉన్నాయి. ఇవి బాలల పట్ల కొనసాగుతున్న దుర్విచక్షణను అంతమొందించడానికి గట్టి కృషిచేయాలి. బాలల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యతనివ్వాలి. పేద బడుగు బలహీన వర్గాలు చదివే ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక భవనాలు, ప్రయోగశాలు, బస్ సౌకర్యం, కంప్యూటర్ విద్య, సరిపడా ఉపాధ్యాయులు కొరత వేధిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల బిసి, ఎస్సి, ఎస్టి, జెఎసి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, మౌలిక సదుపాయాలు కల్పనకు డిమాండ్ చేశారు. అట్టడుగు వర్గాలు చదివే ఈ పాఠశాలలో గౌరవప్రదమైన విద్యలో భాగం ఇవి. ఇప్పుడు తల్లిదండ్రులు కోరుకునేది కూడా గౌరవప్రదమైన విద్యనే. పిల్లలకు బాల్య దశ నుంచి ప్రశ్నించే తత్వం పెంపొంచే విద్యనందించాలి. వారి హక్కుల పట్ల ప్రభుత్వం, పౌర సమాజం విస్తృతంగా ప్రచారం చేయాలి. అప్పుడే బాలల సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడతాయి. సంపతి రమేశ్ మహారాజ్ 7989579428
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. శనివారం(నవంబర్ 15) నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది. ఈ నెల 29 వ రకు టెట్కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం క ల్పించారు. 2026 జనవరి 3 నుంచి 31 వరకు టెట్ ప రీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సం చాలకులు నవీన్ నికోలస్ వెల్లడించారు. సర్వీసులో ఉ న్న ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23వ తేదీన ఎన్సిటిఇ ఉత్తర్వులు జారీచేసింది. అప్పటికే సర్వీసులో ఉన్నవారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెట్ మినహాయింపును ఇవ్వగా, తాజాగా ఆ ఉత్తర్వులను విద్యాశాఖ సవరించింది. టెట్ పరీక్షను 2010 నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ ఉత్తీర్ణత సాధించి ఉన్నారు. అంతకుముందు నియమితులై సర్వీసు కొనసాగుతున్న వారిలో కొందరు మాత్రమే టెట్ ఉత్తీర్ణత సాధించగా, మరికొందరు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉన్నది. కాగా, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పును వెలువరించింది. తీర్పు ఇచ్చిన తర్వాత రెండేళ్లలో అంటే 2027 నాటికి టెట్ ఉత్తీర్ణులు కావాలని పేర్కొంది. అయితే ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయేవారికి మాత్రమే టెట్ అవసరం లేదని పేర్కొంది. అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాసవ్వాలని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేసి, టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా చొరవ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఏటా రెండు సార్లు టెట్ టెట్ పేపర్ -1కు డి.ఇడి, పేపర్ -2కు బి.ఇడి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఏటా జూన్, డిసెంబర్ లేదా జనవరి నెలల్లో టెట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఏడాదిలోనే రెండో టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సిఆర్టి) ఏటా రెండుసార్లు టెట్ను నిర్వహించాలి. అంతే కాకుండా టెట్ గడువును 7 ఏండ్ల నుంచి జీవితకాలానికి గతంలోనే ఎన్సిటిఇ పొడగించింది. అయితే గతంలో టెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సైతం వారి స్కోర్ పెంచుకునేందుకు ఎన్నిసార్లు అయినా టెట్ రాస్తారు. ప్రైవేట్, ప్రభుత్వం టీచర్లకు టెట్ తప్పనిసరి అనే నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత బి.ఇడి, డిఐఇడి కోర్సులను పూర్తిచేసిన వారు టెట్ పరీక్ష రాశారు. టెట్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్ రాసి, అందులో ఉత్తీర్ణత పొందాలి. గత జూన్లో జరిగిన టెట్ పరీక్షకు 1,83,653 దరఖాస్తులు వచ్చాయి. పేపర్ 1కు 63,261 మంది, పేపర్ -2కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకోగా.. రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారు 15 వేల మంది వరకు ఉన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్ర వ్యా ప్తంగా పలు జిల్లాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల చేపట్టిన ఆకస్మిక దా డులతో భారీగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడుల్లో రైస్ మిల్లర్లు కో ట్లాది రూపాయల విలువ చేసే సిఎంఆర్ ధాన్యం దారిమళ్లినట్టు అధికారులు కనుగొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, రం గారెడ్డిజిల్లా శంషాబాద్, మహబూబ్ నగ ర్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో ధాన్యం బస్తాలు మాయం అయినట్లు గుర్తించారు.నిర్మల్జిల్లా కడెం ప్రాంతంలో రైస్ మిల్లర్లు భారీగా సిఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్ళించారనే విశ్వసనీయ సమాచారం అందడంతో కరీంనగర్ విజిలెన్స్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన బాలాజీ రైస్ మిల్లులో సోదాలు నిర్వహించగా 2024,-25 రబీ సీజన్కు సంబంధించి 2,684 మెట్రిక్ ట న్నుల సిఎంఆర్ ధాన్యం దారి మళ్లించార ని, వీటి విలువ 6.22 కోట్లు ఉంటుందని తెలుసుకున్నారు. సదరు మిల్లు యజమానిపై తదుపరి చర్యలు తీసుకునేలా పౌరసరఫరాల శాఖకు నివేదిక అప్పగించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డా కూర్లో ఎంఎస్ కన్యకా పరమేశ్వరి ఆ గ్రో ఇండస్ట్రీస్లో ఆర్సీపురం ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ పౌర సరఫరాల శాఖతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో రబీ 2024,-25 సీజన్కు సంబంధించిన 3,752.80 క్వింటాళ్ల సిఎంఆర్ ధాన్యం (382 బస్తాలు) తక్కువగా ఉన్న ట్లు తేల్చారు. వీటి విలువ సుమారు రూ. 87,06,496 ఉంటుందని సదరు మిల్లు యజమానిపై చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల విభాగానికి సిఫార్సు చేశారు. ఈనెల 12వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలోని చాముండి రైస్ మిల్లు, వరాహి రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. రబీ, ఖరీఫ్ 2024,-25 సీజన్కు సంబంధించిన మొత్తం 1,47,375 బస్తాల సిఎంఆర్ ధాన్యం స్టాకును దారి మళ్లించినట్లు అధికురు నిర్ధారించారు. వీటి విలువ సుమారు రూ. 13.67 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్రస్థాయి అధికారులకు తెలియజేయనున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు. రూట్ చెకింగ్తో అధిక లోడ్ వాహనాలకు చెక్ అకస్మిక దాడులతో తనిఖీలు చేస్తుంటే, మరోవైపు రూట్ చెకింగ్తో అధికలోడ్ వాహనాలు, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా తప్పించుకున్న వాహనాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ రూరల్ యూనిట్ అధికారులు శంషాబాద్ నుండి మహబూబ్నగర్కు పిడిఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న ఒక డీసీఎం వాహనాన్ని అడ్డుకున్నారు. సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిమితులలోని పెద్ద షాపూర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి-44పై సుమారు రూ. 5 లక్షల విలువ చేసే 15 టన్నుల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్రిమినల్ కేసుతో పాటు ఈసీ చట్టం కింద 6ఏ కేసు నమోదు చేయాలని పౌర సరఫరాల అధికారికి సిఫార్సు చేశారు. అదే రోజున హైదరాబాద్ సిటీ-2 యూనిట్ అధికారులు రవాణా, మైనింగ్ శాఖ అధికారులతో కలిసి భూత్పూర్, జడ్చర్ల నుండి కొడంగల్ వరకు ఉన్న రాష్ట్ర రహదారిపై రూట్ లో నిర్వహించిన తనిఖీల్లో అధిక లోడ్ తో వెళ్తున్న వాహనానికి రూ. 2,80,000జరిమానా విధించారు. రాయల్టీ ఉల్లంఘించినందుకు రూ.40 వేలు జరిమానా విధించారు. సరైన పత్రాలు లేని రూ. 2 లక్షల విలువ కలిగిన ఒక వాటర్ ట్యాంకర్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 17 వాహనాలను స్వాధీనం చేసుకుని వాటిని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, తాడూరు పోలీస్ స్టేషన్లకు, మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల ఫైర్ స్టేషన్ కు తరలించారు. ధాన్యం దారి మళ్లిస్తున్నట్లు గుర్తిస్తే టోల్-ఫ్రీ నంబర్ 14432 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెట్ డైరెక్టర్ తెలిపారు.
ఢిల్లీ బాంబుదాడి ఘటన.. హైదరాబాద్ లో విస్తృతంగా తనిఖీలు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఢిల్లీలో బాంబుదాడుల నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు విస్కృతంగా తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని షాంపింగ్ మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు బాంబ్ స్కాడ్స్, డాగ్ స్కాడ్లు తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. బాంబు పేలుళ్లు జరిగినప్పటి నుంచి మూడు రోజుల నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఎక్కడ అనుమానస్పదంగా కన్పించినా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. షాపింగ్ మాల్స్లో కూడా తనిఖీలు చేస్తున్నారు, ఎక్కువ మంది షాపింగ్కు రావడంతో తనిఖీలు చేస్తున్నారు. మాల్స్లో మెటల్ డిటెక్టర్ పెట్టి లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీని అలర్ట్గా ఉండాలని ఆదేశించారు, ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. బస్టాండ్లలో ఎక్కువగా రద్దీగా ఉండడంతో వాటిని కూడా అనువణువు తనిఖీలు చేస్తున్నారు. బస్టాండ్లలో ఎలాంటి మెటల్ డిటెక్టర్లు లేకపోవడంతో పోలీసులను అక్కడ భద్రత కోసం ఉంచారు. కొందరు పోలీసులు బస్టాండ్ల పరిసరాల్లో మోహరించారు. అలాగే రాత్రి సమయంలో హైదరాబాద్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీకుని విచారిస్తున్నారు. ఉగ్ర కుట్రలో నగరానికి చెందిన వైద్యుడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద కారును పార్కింగ్ చేయడంతో కలకలం సృష్టించింది. కాచిగూడ నింబోలి అడ్డ వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి కింద రోడ్డుకు అడ్డంగా ఓ వ్యక్తి కారును పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి 7.30 గంటలకు కారు పార్క్ చేసి వెళ్లడంతో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఎవరినీ అటువైపు రానివ్వలేదు. వెంటనే బాంబ్ స్కాడ్, డాగ్ స్క్వాడ్ను పలిపించి కారులో తనిఖీలు నిర్వహించారు. కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించిన తర్వాత కారును పక్కకి తప్పించారు. ఈస్ట్జోన్ డిసిపి బాలస్వామి అక్కడికి వచ్చి తనిఖీలను పర్యవేక్షించారు. కారు బాలాజీ అనే వ్యక్తి పేరుపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
శుక్రవారం రాశి ఫలాలు (14-11-2025)
మేషం వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృషభం విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. వివాదాలకు సంభందించి విలువైన సమాచారం అందుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. మిధునం ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణ మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు తప్పవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబసభ్యుల నుంచి ధనపరమైన ఒత్తిడి తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కర్కాటకం వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగతాయి. ఇంటాబయట బాధ్యతలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సింహం పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో కీలక వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కన్య వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు సానుకూలమౌతాయి.ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. తుల వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. వృశ్చికం చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమౌతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ధనస్సు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. పాతబాకీలు వసూలవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మకరం కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. సంతాన విద్యా, ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభం ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో సమస్యలు అదిగమిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు. బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మీనం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కొన్ని పనులలో శ్రమ పడినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
Adivi Sesh Unveils ETV Win’s Raju Weds Rambai Trailer: Rooted & Emotional
ETV Win, known for its blockbuster content, is releasing an original production in theatres. After the success of Little Hearts, they are now releasing Raju Weds Rambai. Drector Venu Udugula who made critically acclaimed films like Needi Naadi Oke Katha and Virata Parvam donning producer hat. The film will be released by the blockbuster combo […] The post Adivi Sesh Unveils ETV Win’s Raju Weds Rambai Trailer: Rooted & Emotional appeared first on Telugu360 .
Cartoon 14th Nov ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
Andhra prabha effect |ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా…?
ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ) : ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా…? కూలింగ్ కెనాల్లోకి విద్యుత్ కేంద్ర
ఎమ్మెల్యే కొణతాల కుమార్తె వివాహానికి హాజరైన మంత్రి లోకేష్
భోగాపురం, ఆంధ్రప్రభ : అనకాపల్లి ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ కుమార్తె
రాజ్కోట్: దక్షిణాఫ్రికాఎతో గురువారం తొలి అనధికార వన్డే మ్యాచ్లో ఆతిథ్య ఇండియా టీమ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ఒక దశలో 53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా టీమ్ను డియాన్ ఫొరెస్టర్ (77), డెలానొ పొట్గిటర్ (90) ఆదుకున్నారు. జోమ్ ఫౌర్టిన్ (59) తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇండియాఎ జట్టు 49.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 129 బంతుల్లో 12 ఫోర్లతో 117 పరుగులుచేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ శర్మ (31), కెప్టెన్ తిలక్ వర్మ (39), నితీశ్ కుమార్ రెడ్డి (37), నిశాంత్ సింధు 29 (నాటౌట్) తమవంతు పాత్రను పోషించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు..
కోల్ కతా : సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడుగా కలకత్తా హైకోర్టు ప్రకటించింది. 2021లో బీజేపీ టికెట్ పై ఎన్నికై, తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోకి మారిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ ను ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కలకత్తా హోకోర్టు గురువారం అనర్హులుగా ప్రకటించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రాయ్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్ పై స్పీకర్ తన తీర్పులో ఆయన బీజేపీ ఎమ్మెల్యే అని పేర్కొన్నందున కోర్టు ఆ నిర్ణయాన్ని వికృతమైనదిగా పేర్కొంది. 2021 జూన్ 11 నుంచి అసెంబ్లీలో ఆయన సభ్యత్వం అనర్హతకు గురైనందున, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఏసి) చైర్మన్ గా రాయ్ నామినేషన్ ను కూడా ఇది పక్కన పెట్టింది. ముకుల్ రాయ్ ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చుతూ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ 2022 జూన్ 8న ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టడానికి తమకు ఎలాంటి సందేహం లేదని జస్టిస్ దేబాంగ్సు బసక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ముకుల్ రాయ్ ను అనర్హుడిగా ప్రకటించాలని అధికారి దాఖలు చేసిన పిటిషన్ తో సమానంగా విచారణకు వచ్చిన బిజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్ దాఖలు చేసిన మరో పిటిషన్ ను కోర్టు అనుమతించింది. 2021 జూన్ 11నుంచి అమల్లోకి వచ్చేలా భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ , 1986 నిబంధనల ప్రకారం ముకుల్ రాయ్ అనర్హుడిగా ప్రకటించినట్లు జస్టిస్ ఎండీ షబ్బర్ రషీది తో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2021 జూన్ 11న ముకుల్ రాయ్ బిజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ కు ఫిరాయించారని బీజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్ నిరూపించగలిగారని ధర్మాసనం పేర్కొంది.
Tourist attractions |ఓరుగల్లుకు పర్యాటక సొబుగులు..
Tourist attractions | ఓరుగల్లుకు పర్యాటక సొబుగులు.. ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ :
పశ్చిమ బెంగాల్ లో పార్టీ ఫిరాయించిన ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వం రద్దు
సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడుగా కలకత్తా హైకోర్టు ప్రకటించింది. 2021లో బీజేపీ టికెట్ పై ఎన్నికై, తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోకి మారిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ ను ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కలకత్తా హోకోర్టు గురువారం అనర్హులుగా ప్రకటించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రాయ్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్ పై స్పీకర్ తన తీర్పులో ఆయన బీజేపీ ఎమ్మెల్యే అని పేర్కొన్నందున కోర్టు ఆ నిర్ణయాన్ని వికృతమైనదిగా పేర్కొంది. 2021 జూన్ 11 నుంచి అసెంబ్లీలో ఆయన సభ్యత్వం అనర్హతకు గురైనందున, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఏసి) చైర్మన్ గా రాయ్ నామినేషన్ ను కూడా ఇది పక్కన పెట్టింది. ముకుల్ రాయ్ ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చుతూ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ 2022 జూన్ 8న ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టడానికి తమకు ఎలాంటి సందేహం లేదని జస్టిస్ దేబాంగ్సు బసక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ముకుల్ రాయ్ ను అనర్హుడిగా ప్రకటించాలని అధికారి దాఖలు చేసిన పిటిషన్ తో సమానంగా విచారణకు వచ్చిన బిజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్ దాఖలు చేసిన మరో పిటిషన్ ను కోర్టు అనుమతించింది. 2021 జూన్ 11నుంచి అమల్లోకి వచ్చేలా భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ , 1986 నిబంధనల ప్రకారం ముకుల్ రాయ్ అనర్హుడిగా ప్రకటించినట్లు జస్టిస్ ఎండీ షబ్బర్ రషీది తో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2021 జూన్ 11న ముకుల్ రాయ్ బిజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ కు ఫిరాయించారని బీజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్ నిరూపించగలిగారని ధర్మాసనం పేర్కొంది.
సీఐఐ సదస్సుకు ముందే అనూహ్య స్పందనరూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులుఒక్కరోజులోనే ఐదు రంగాల్లో 35 ఎంవోయూలురూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షల ఉద్యోగాలుచంద్రబాబు, లోకేశ్ సమక్షంలో ఒప్పందాలు విశాలాంధ్ర బ్యూరో- విశాఖపట్నం: గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖలో శుక్ర, శనివారాల్లో జరిగే 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఒకరోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వంతో వివిధ పారిశ్రామిక సంస్థలు పెద్దసంఖ్యలో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఉదయం […] The post పెట్టుబడుల వరద appeared first on Visalaandhra .
రిజర్వేషన్లు బడుగుల హక్కు.. జనాభా ప్రాతిపదికన వాటా దక్కాల్సిందే!
కేంద్రంపై ఒత్తిడికి అందరూ కలిసిరావాలి బిసిల ధర్మ పోరాట దీక్షలో వక్తలు ఐక్యంగా పోరాడాలన్న బండారు దత్తాత్రేయ బిసిలకు అండగా ఉంటామన్న కోదండరాం మన తెలంగాణ/విద్యానగర్: జనాభా లెక్కల ప్రాతిపదికన బలహీన వర్గాలకు సరైన వాటా ఇవ్వాల్సిందేనని, ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని పలువురు వక్తలు స్పష్టం చేశారు. బిసిల రాజకీయ హక్కుల సాధన కోసం అందరూ కలిసిరావాలన్నారు. బలహీన వర్గాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ చేయాలన్న డిమాండుతో గురువారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష పేరిట బారీ నిరసన ప్రదర్శన జరిగింది. బీసీ జేఏసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ దీక్షలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బి ఆర్ ఎస్ శాసనసభ పక్ష నేత మధుసూదనా చారి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, ఎల్ రమణ, మాజీ ఎంపీ, మధు యాష్కీ గౌడ్ పాల్గొని బలహీన వర్గాల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ జనాభాకు అనుగుణంగా అందరికి సమాన అవకాశాలు దక్కాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అన్ని పార్టీలు సహకరించాలని సూచించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అందరికీ న్యాయమైన హక్కులు దక్కాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ జరిగితే మంచిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బీసీ కోటా కోసం కేంద్రంపై వత్తిడి తీసుకురావడానికి సహకారం అందిస్తామని చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు ఎవరి దయాదక్షిణ్యాలు అవసరం లేదని, జనాభా ప్రాతిపదికన వాటా ఇవ్వాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపితే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇందుకోసం డిల్లీకి అఖిల పక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పాలకులకు హితవు పలికారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బీసీల ఉద్యమానికి మాల మహానాడు అండగా ఉంటుందని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. దీక్ష ముగింపు సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం అందరూ కలిసికట్టుగా ఉంటేనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుందనీ, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కోసం తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లతోనే విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో సమన్యాయం జరుగుతుందనీ, హక్కుల కోసం కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలోను ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలనీ, ఎంపీలందరూ కలిసి పార్లమెంటు సమావేశాలను స్తంభింప చేయాలన్నారు. పార్టీల పరంగా కాకుండా చట్టబద్ధంగా కోటా అమలుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. బీసీ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తూ అగ్రవర్ణాలపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లను సాధించుకోవాలని జాజుల పిలుపు ఇచ్చారు. బీసీలంతా కలిసి ఉద్యమించినప్పుడే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయని, లేదంటే ఉద్యమం నీరుగారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీసీ జేఏసీ కో ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, కుల్కచర్ల శ్రీనివాస్, నంద గోపాల్, వేముల రామకృష్ణ, గణేష్చారి, కనకాల శ్యామ్, శేఖర్, సాగర్, మణి మంజరి సహ 130 కుల సంఘాల నాయకులు, విద్యార్థి, ఉద్యోగ, మహిళా సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో గురువారం స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర ఒక్కరోజే దాదాపు రూ.3 వేలకు పైగా పెరిగి 1,30,800 కు చేరుకుంది. అమెరికాలో షట్డౌన్ ముగిసిపోవడం ఈ ధరలకు ఊతం ఇచ్చినట్టు వ్యాపారులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. 99.5 శాతం స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములకు రూ.3000 వంతున పెరిగి రూ.1,30,000 కు చేరింది. బుధవారం మార్కెట్ ముగిసేనాటికి 10 గ్రాములు ధర రూ.3000 వంతున పెరిగి రూ.1,27,300 వరకు పలికింది . అంతకు ముందు స్థానిక బులియన్ మార్కెట్లో రూ.1,27,000 ధర పలికింది. ఇక వెండి ధరలు అన్ని పన్నులు కలుపుకుని రూ.7700 వంతున పెరిగి కిలో రూ. 1,69,000 వరకు చేరింది. బుధవారం వెండి ధరలు రూ.5540 వంతున పెరిగి కిలో వెండి రూ.1,61,300 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సు మళ్లీ 4200 స్థాయిని దాటి 4218 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు 54.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీన్నిఅనుసరించి దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి.
. 32 కార్లతో దిల్లీలో పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకార కుట్ర. అల్-ఫలాప్ా యూనివర్సిటీలోనే పథక రచన. దిల్లీ పేలుడు కేసులో దిగ్భ్రాంతి కొల్పే వాస్తవాలు న్యూదిల్లీ: దిల్లీ ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు కేసు, ఫరీదాబాద్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు కనుగొన్న కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటన ఉగ్రవాద దాడిగా కేంద్రం ప్రకటించగా… నిందితులందరికి జైషే […] The post టార్గెట్ డిసెంబర్`6 appeared first on Visalaandhra .
తరుగు పేరుతో దోచుకుంటే చర్యలు తప్పవు..
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : తాలు, తేమ, తరుగు పేరుతో వరి రైతులను
నేడు బీహార్ ఓట్ల లెక్కింపుదేశవ్యాప్తంగా ఉత్కంఠ పట్నా: దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో ఏ కూటమిని విజయం వరించిందన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. గురువారం ఉదయం 8గంటల నుంచి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 38 జిల్లాల్లో 46 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడిరచింది. ప్రతి కేంద్రం వద్ద రెండంచెల భద్రత వ్యవస్థ ఉంటుందని పేర్కొంది. అలాగే లెక్కింపు కేంద్రం […] The post పీఠం ఎవరిదో? appeared first on Visalaandhra .
జిహెచ్ఎంసి ఆఫీస్ లో అగ్ని ప్రమాదం.. దగ్ధమైన ఫైల్స్
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: అనుమానాస్పద స్థితిలో కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి కార్యాలయంలో మంటలు చెలరేగాయి. రెవిన్యూ సెక్షన్లో మంటలు వ్యాపించి పలు ఫైల్స్ దగ్ధం అయ్యాయి. కూకట్పల్లి జోనల్ కమిషనర్ పరిధిలోని కత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి సర్కిల్ ఆఫీస్ మొదటి అంతస్తులో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో అనుమానాస్పద స్థితిలో సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లే సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మంటల ధాటికి పూర్తిగా మంటల్లో రెవిన్యూ విభాగం ఫైళ్లు కాలిపోయాయి. ఏళ్ల తరబడికి చెందిన డాక్యుమెంట్ల మూటలు నిల్వ చేసి ఉండటంతో మంటలు అధికమయ్యాయి. సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్ని మాపక సిబ్బంది, జీడిమెట్ల పోలీసులు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది దాదాపు గంట సేపు శ్రమించి కార్యాలయంలో అలుముకున్న దట్టమైన పొగ మధ్య మంటలను అదుపులోకి తెచ్చారు. జరిగిన అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి మంటలు చెలరేగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం నుండి సిబ్బంది ఉన్నప్పుడు రాని మంటలు విధులు ముగించుకుని బయటకు వెళ్ళగానే అగ్ని ప్రమాదం సంభవించడం పలు అనుమానాలకు తావు నిస్తుంది. రికార్డులు ఉన్న గదిలో అగ్నిప్రమాదం జరగడంపై అధికారులు కాస్త కలవరా పడుతున్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదం ప్రమాదవశత్తు జరిగిందా? లేక అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహాయంతో అధికారులు వెనకాల ఉండి అవకతవకలకు ఆధారాలు లేకుండా ఉండేందుకు ఈ దారుణానికి ఒడిగట్టరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా సిబ్బందికి అండగా నిలిచిన జీడిమెట్ల పోలీసులు కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంలో జీడిమెట్ల పోలీసులు సిబ్బందికి అండగా నిలిచారు.ప్రమాదం జరిగిన ఫ్లోర్తోపాటు పై ఫ్లోర్లో ఉన్న దాదాపు 8 మంది మహిళా సిబ్బంది చిక్కుకుని భయభ్రాంతులకు గురయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సిఐ గడ్డం మల్లేష్ సిబ్బందితో కలిసి నిచ్చెన ద్వారా మహిళా సిబ్బందిని రెస్కూ చేసి ప్రమాదం నుండి కాపాడారు. అధికారుల ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్నారు.
విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: ఇప్పటికే ఏపీలో చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా… వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నవంబరు 17, 18 తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ అధి కారుల అంచనా ప్రకారం నవంబరు 17న ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది వేగంగా బలపడి […] The post ఏపీకి మరోసారి భారీ వర్షాలు appeared first on Visalaandhra .
రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు పి.వి.శ్రీహరి తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 20 వరకు ఫీజు చెల్లించవచ్చని డైరెక్టర్ తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో ఈనెల 21 నుంచి 29 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2 నుంచి 11 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15 నుంచి 29 వరకు టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. గడువు లోగా పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
సంపద సృష్టి ఎక్కడచంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలపై ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరోకర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం రాక ముందు ఒక మాట వచ్చిన తరువాత మరోమాట మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. స్థానిక సీఆర్ భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్యతో కలసి గురువారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టించి… అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ […] The post రాష్ట్రం అప్పులమయం appeared first on Visalaandhra .
அமித்ஷா காலணியை பெண் துடைத்ததாக பரவும் வீடியோ - உண்மை என்ன தெரியுமா?
அமித்ஷாவின் காலணியை பெண் ஒருவர் துடைப்பதாக பரவும் வீடியோ போலியானது, ஏஐ மூலம் உருவாக்கப்பட்டது.
జీఎస్టి స్కాం.. రూ.11.79 కోట్ల ప్రభుత్వ సొమ్మును కొట్టేసిన కేటుగాళ్లు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి జీఎస్టి పేరుతో ప్రభుత్వాన్ని నిండాముంచిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు ష్త్రచేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు ప్రభుత్వం నుంచి రూ.11.79కోట్లు తీసుకుని మోసం చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఢిల్లీకి చెందిన అబ్దుల్లా (ప్రధాన నిందితుడు), సయ్యద్ ముజ్తబా హుస్సేని అలియాస్ అజామ్, అయితి రాజా శేఖర్, గుజరాత్ రాష్ట్రం, భావ్నగర్, మహువా, మెహందిబాద్కు చెందిన సోహిల్ మురాదాలీ లఖానీ అలియాస్ సోను (34)నగరంలోని అబిడ్స్లో ఉంటున్నాడు. హైదరాబాద్, అడిక్మెట్, రాం నగర్కు చెందిన మహ్మద్ అక్రమ్ హస్నుద్దీన్ను అరెస్టు చేశారు. సోహిల్, మహ్మద్ అక్రంను అరెస్టు చేయగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. నకిలీ సంస్థలను సృష్టించిన నిందితులు నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ టర్నోవర్, పత్రాలను ఫోర్జరీ చేసి చూపించారు. వీటి ద్వారా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటిసి)ను ప్రభుత్వం నుంచి క్లైయిమ్ చేశారు. నిందితులు ఎనిమిది రాష్ట్రాల్లో నెట్వర్క్ను ఎర్పాటు చేసి జిఎస్టిని క్లైమ్ చేస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డులు, పాన్కార్డులు, విద్యుత్ బిల్లులు, అద్దె ఒప్పందాలు, ఇతర ఫోర్జరీ పత్రాలను క్లైమ్ కోసం ఉపయోగించారు. తప్పుడు పేర్లతో సిమ్ కార్డులను తీసుకుని, జిఎస్టి పోర్టల్లో ఓటీపీ ఆధారిత ధృవీకరణను పూర్తి చేసి, నకిలీ సంస్థల కోసం జీఎస్టీ నంబర్ల కోసం నమోదు చేసుకున్నారు. జీఎస్టీ నంబర్లను పొందిన తర్వాత బోగస్ కొనుగోలు, అమ్మకపు ఇన్వాయిస్లను రూపొందించారు, నకిలీ టర్నోవర్ను సృష్టించారు, వస్తువుల భౌతిక కదలిక లేకుండానే ఐటిసిని క్లెయిమ్ చేశారు. అసలైన వాహన నంబర్ల ఛాసిస్ నంబర్లను ట్యాంపర్ చేసి నిజమైన వాహనాలుగా నమ్మించి నకిలీ వే బిల్లులను సృష్టించారు. నిందితులు 52 సంస్థలను పుట్టించి తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రల్లో క్లెయిమ్ చేశారు. రూ. 53.73 కోట్లు నకిలీ టర్నోవర్ చూపించి ఐటిసి కింద రూ. 11.79 కోట్లు క్లెయిమ్ చేశారు. నిందితులు 405 నకిలీ ఈవే బిల్లులు సృష్టించి రూ.11.79 కోట్లు క్లెయిమ్ చేశారు. ఏసీపీ ఎస్. రవీందర్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నాటు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఢాకాబస్సులకు, గ్రామీణ బ్యాంకు కార్యాలయానికి నిప్పు ఢాకా : బంగ్లాదేశ్లో మళ్లీ హింస చెలరేగింది. మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులలో సోమవారం (17వ తేదీ) ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడనుంది. దీంతో రాజధాని ఢాకాలో నాటు బాంబు పేలుళ్లు సంభవించాయి. అనేక ప్రాంతాలలో ఆస్తులు, బస్సులకు నిప్పుపెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తూర్పు బ్రహ్మనబరియాలోని గ్రామీణ బ్యాంకు శాఖ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఢాకాలో వినియోగంలోని రైలు పెట్టును […] The post బంగ్లాదేశ్లో మళ్లీ హింస appeared first on Visalaandhra .
వారసత్వ సంపద జోలికి వస్తే సహించం
ట్రంప్ అల్లుడి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బెల్గ్రాడ్లో ప్రజాందోళన బెల్గ్రాడ్: మా చరిత్ర, సాంస్కృతిక వారసత్వం మాకు ఎంతో ముఖ్యం, వాటి జోలికి వస్తే సహించేది లేదంటూ సెర్బియా రాజధాని బెల్గ్రాడ్ ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాడు బాంబు దాడిలో ధ్వంసమైన యుగొస్లేవ్ ఆర్మీ హెడ్క్వార్టర్స్ను పడగొట్టి అక్కడ విలాసవంతమైన హోటల్ కాంపెక్స్ నిర్మించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక భర్త జరేడ్ కుష్నెర్ […] The post వారసత్వ సంపద జోలికి వస్తే సహించం appeared first on Visalaandhra .
రాష్ట్రంలో పుష్కలంగా విద్యుత్ ఉత్పత్తి
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో ఎంత విద్యుత్తు డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామని రాష్ట్ర డిప్యూటీ సి ఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో కాకతీయ నాటి శివాలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన వారు తాము లేకపోతే కరెంటే ఉండదు రాష్ట్రం అంధకారమవుతుందని అన్న విషయాన్ని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు.ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసింది రైతులకు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అని ఆయన అన్నారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంత త్వరితగతిన ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేసుకుంటూ పోతాం అన్నారు. ఎన్నికలకు ముందు తాను చేపట్టిన పీపుల్స్ పాదయాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మందిని కలిసి మాట్లాడినట్టు తెలిపారు. ఇల్లు లేని పేదలు 10 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ పాలనలో ఎదురుచూసి కళ్ళు కాయలు కాసి అలసిపోయామని ప్రజలు తన చేయి పట్టుకొని తెలిపిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఆనాడే పాదయాత్ర సందర్భంగా తన చేయి పట్టుకొని ముదిగొండ మండలంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రియాంక అనే ఆడబిడ్డకు తాను హామీ ఇచ్చాను, నీ ఒక్కదానికే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇల్లు లేని పేదలందరికీ ఐదు లక్షలతో ఇల్లు నిర్మిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు నిర్మిస్తున్నాం, ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు ముదిగొండ మండలానికి చెందిన ప్రియాంకకు ఇల్లు కేటాయించామని తెలిపారు. ఒకటి కాదు రెండు కాదు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో 3500 చొప్పున నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈరోజు తాను వచ్చే క్రమంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని కలిసి వారితో ఆనందాన్ని పంచుకున్న విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగులు కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, తెలంగాణ దేవాదాయ శాఖ స్థపతి ఎన్. వాళ్ళినాయగం, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వర్ రావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గప్రసాద్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ లు అంబటి వెంకటేశ్వర్లు, నరసింహా రావు,కాంగ్రెస్ నాయకులు బుల్లెట్ బాబు, సామినేని వెంకటయ్య, ఏడుకొండలు పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ముంబైలోకి విధ్వంసకర బ్యాటర్ #TeluguPost #telugu #post #news
ఎన్నికల ఫలితాలపై జనం ఉత్కంఠకు సమాచారం వెల్లడిరచడానికి ప్రీపోల్ (ఎన్నికలకు ముందు) సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ (పోలింగ్ తరవాత) ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఎన్నికలకు ముందు సర్వేలకు అవకాశం లేకుండా పోయింది. ఎగ్జిట్ పోల్స్ కొన్ని మీడియా సంస్థలూ, కొన్ని ఇతర సంస్థలు నిర్వహిస్తాయి. బీహార్ ఎన్నికల తరవాత పోలింగ్ ముగిసీ ముగియక ముందే కనీసం డజను ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో అధిక శాతం బీహార్లో మళ్లీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేనే గెలుస్తుందని చెప్పాయి. మొదటి […] The post ఎగ్జిట్ పోల్స్ చిలక జోస్యం appeared first on Visalaandhra .
పరిహారం భిక్ష కాదు… రైతుల హక్కు!
బొల్లిముంత సాంబశివరావు మొంథా తుపాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అపారంగా పంటలకు నష్టం జరిగింది. రోడ్లు, భవనాల శాఖకు, విద్యుత్ సంస్థకు అపార నష్టం జరిగింది. నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. వందలాది గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక ఇళ్లు నేల కూలాయి. వేల కోట్లలో నష్టం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, సూర్యారావుపేట, నల్గొండ, హనుమకొండ, నాగర్కర్నూల్, మహబూబాబాద్, జనగాం, కరీంనగర్ మొదలైన […] The post పరిహారం భిక్ష కాదు… రైతుల హక్కు! appeared first on Visalaandhra .
ఆసియా ఆర్చరీలో భారత్కు స్వర్ణాల పంట
ఢాకా: ఇక్కడ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ స్వర్ణాల పంట పండించింది. గురువారం భారత్ మూడు స్వర్ణాలు, మరో రెండు రజత పతకాలను గెలుచుకుంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో తెలుగుతేజం జ్యోతి సురేఖ వెనమ్ స్వర్ణం సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సురేఖ 147145 పాయింట్ల తేడాతో భారత్కే చెందిన ప్రితీక ప్రదీప్ను ఓడించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. అంతకుముందు మహిళల కంపౌండ్ టీమ్ విభాగంలో భారత జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. దీపిక్ష,జ్యోతి సురేఖ వెనమ్, ప్రితీక ప్రదీప్లతో కూడిన భారత టీమ్ ఫైనల్లో జయకేతనం ఎగుర వేసింది. ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత టీమ్ 236234 పాయింట్ల తేడాతో కొరియాను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. కాగా, పురుషుల కంపౌండ్ టీమ్ విభాగంలో భారత్కు రజతం లభించింది. అభిషేక్ వర్మ, సాహిల్ జాదవ్, ప్రథమేశ్లతో కూడిన భారత బృందం ఫైనల్లో ఓటమి పాలైంది. కంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత జోడీకి పసిడి పతకం లభించింది. అభిషేక్ వర్మ, దీప్షికలతో కూడిన భారత జంట ఫైనల్లో విజయం సాధించి స్వర్ణం దక్కించుకుంది. ఫైనల్లో ఈ జోడీ బంగ్లాదేశ్ జంటను ఓడించింది.
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆధునిక సమాజం అభ్యుదయ భావాలతో అభివృద్ధి కాముకంగా ముందుకు మూడడుగులు వేసేటప్పటికి, ఆధునికత, నీతి, నిజాయితీకి, నిబద్దతకు నిరాడంబర నైజానికి తిలోదకాలిస్తూ, విధ్వంసక చర్యలకు వంతపాడుతూ మున్ముందుకు ఆరడుగులు వేయడానికి యత్నిస్తోంది. ఆర్థిక దోపిడీకి అలవాటుపడ్డ మేధావి వర్గాలు, సమస్త అకృత్యాలకు ఆలంబనంగా నిలుస్తూ, అడ్డదారి అక్రమాలకు తెర లేపుతూ, వ్యవస్థ బలహీనతలను తమకు అనుకూలంగా మలచుకుంటూ, కుల మతాల్లో అనైక్యతా కుంపట్లు రాజేస్తూ మనుషుల్ని మూర్ఖపు ముఠాలుగా తయారుచేస్తున్నారు. మనిషిలోని ఆత్మీయతానురాగాల్ని ఆర్థిక […] The post ఉగ్రవాదం అరికట్టాలంటే… appeared first on Visalaandhra .
ఐఫోన్ పెట్టుకునేందుకు 'పాకెట్'.. ధర తెలిస్తే షాక్! #telugupost #latestnews #iphonecover
ఎక్స్పోర్టు ప్రమోషన్ మిషన్కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ : ఎగుమతుల విషయంలో ప్రపంచ స్థాయిలో పోటీతత్వం పెరగడానికి, ఆత్మనిర్భర్ (స్వావలంబన) కలను సాకారం చేసుకోవడానికి సహాయపడే ఎక్స్పోర్టు ప్రమోషన్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను ప్రధాని నరేంద్రమోడీ గురువారం వెల్లడించారు. బుధవారం ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఎగుమతిదారులకు ప్రోత్సాహకంగా ఎక్స్పోర్టు ప్రమోషన్ మిషన్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ను ఆమోదించారు. ప్రపంచ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా (భారత్లో తయారీ) లక్షం ప్రతిధ్వనించేలా ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్కు నిర్ణయం తీసుకోవడమైందని , దీనివల్ల ఎగుమతుల్లో పోటీ తత్వం పెరుగుతుందని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, మొదటిసారి ఎగుమతులు చేపట్టేవారికి, కార్మిక శ్రమతో కూడిన రంగాలకు ఈ పథకం ప్రయోజనం కలిగిస్తుందన్నారు. గ్రీన్ ఎనర్జీకి కీలకమైన గ్రాఫైట్, సిసిఎం, రుబిడియం, జిర్కోనియం, తదితర ఖనిజాల రాయల్టీ రేట్ల విషయంలో హేతుబద్ధీకరణ జరుగుతుందన్నారు. వీటి సరఫరా చైను పటిష్టమై, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రధాని మోడీ ఆశాభావం వెలిబుచ్చారు.
ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం..
ఆంధ్రప్రభ, నందిగామ: ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న
Young Director turns Rude with his Producer
After scoring a huge blockbuster on his debut, a young director is working with the same producer and same hero in his second film. A massive budget is allocated for the project and the makers have spent a bomb on the pre-production work. The lead actor is already irritated for wasting his time on the […] The post Young Director turns Rude with his Producer appeared first on Telugu360 .
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక అత్యాచారినికి పాల్పడింది: ఎంఎల్సి దాసోజు శ్రవణ్
సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలో రూ. 3.48 లక్షల కోట్ల భారీ అప్పులు చేసి ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారని బిఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. ఇవి కాకుండా మరో లక్ష కోట్లు బడ్జెట్కు సంబంధం లేని అప్పులు తెచ్చారని అన్నారు. ఇన్ని కోట్ల అప్పు తెచ్చి చేసిందేమీ లేదని విమర్శించారు. కాగ్ రిపోర్ట్ సిఎం రేవంత్ రెడ్డి బట్టలు విప్పేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటే... ఇంతకంటే ఏం జరుగుతుందని అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం బిఆర్ఎస్ నేతలు సతీష్ రెడ్డి, హరి రమాదేవి, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కమీషన్లు, విచ్చలవిడి అవినీతికి అర్రులు చాస్తూ రేవంత్రెడ్డి రాష్ట్ర ఆర్ధిక రంగాన్ని కుదేలు చేశారని ధ్వజమెత్తారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ.. రేవంత్ రెండేండ్ల పాలనలో అధోగతి పాలైందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేశారని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ను రూ. 2 లక్షల 30 వేల కోట్లుగా ప్రతిపాదించారని, సెప్టెంబర్ నాటికి రూ. 76 వేల కోట్లు మాత్రమే విడుదలయ్యాయని తెలిపారు. నిర్ధేశించుకున్న లక్ష్యంలో 33 శాతం మాత్రమే చేరుకున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ వసూళ్లలో 40 శాతం మాత్రమే సాధించారని, జిఎస్టి వసూళ్లలో 42 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ను సర్వనాశనం చేశారని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా రూ. 19 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా రూ. 7 వేల కోట్లు మాత్రమే వసూలు అయ్యిందని చెప్పారు. ఎక్సైజ్ ఆదాయం కూడా 35 శాతంలోపే వచ్చిందని, అప్పులు మాత్రం 83 శాతానికి చేరుకున్నాయని పేర్కొన్నారు.హైడ్రా పేరుతో ఆర్ఆర్ టాక్స్తో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు.
ఎసిబి వలలో ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు
గృహ నిర్మాణానికి సంబందించిన పర్మిషన్ విషయంలో ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎసిబి వలలో చిక్కారు. ఎసిబి డిఎస్పీ శ్రీధర్ కథనం మేరకు వివరాలు.. బిల్డింగ్ పర్మిషన్ కోసం ఆదిభట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వర ప్రసాద్, అసిస్టెంట్ వంశీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఓ వ్యక్తి వద్ద లంచం డిమాండ్ చేశారు. నాలుగు వందల గజాల స్థలంలో నాలుగంతస్తుల భవన నిర్మాణం అనుమతి కోసం ఆ వ్యక్తి వద్ద లక్షన్నర డిమాండ్ చేసారు. ఎట్టకేలకు 80 వేల రూపాయలకు ఆంగీకారం తెలిపారు. ఈ మేరకు గురువారం బాదితుడి వద్ద నుండి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీ రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎసిబి డిఎస్పీ తెలిపారు. కాగా ఎవరైనా అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు.
ఎస్ఆర్బిసి కాలువలో విద్యార్థి గల్లంతు..
నంద్యాల, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణానగర్కు చెందిన వీరేష్
నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు
నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను మెహిదీపట్నం, సౌత్వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.4,75,000 నకిలీ రూ.500 నోట్లు, కారు, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. సౌత్వెస్ట్ ఎడిసిపి సిద్ధిఖీ గురువారం మెహిదీపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోస్గి, గుడిమల్ గ్రామానికి చెందిన కస్తూరీ రమేష్ బాబు తాండూరులో ఉంటూ కారు మెకానిక్గా పనిచేస్తున్నాడు. సైబరాబాద్, ఫిష్ బిల్డింగ్, సులేమాన్ నగర్కు చెందిన అబ్దుల్ వాహిద్, మహ్మద్ అబ్దుల్ ఖదీర్ అలియాస్ తాహా, మహ్మద్ సోహైల్, ఎండి ఫహద్, షేక్ ఇమ్రాన్, ఒమర్ ఖాన్, సయిద్ అల్తామాష్ అహ్మద్ డిగ్రీ చదువుతున్నాడు. తాండూరుకు చెందిన రమేష్ బాబు, అతడి సోదరి రామేశ్వరి కలిసి నకిలీ రూ.500 నోట్లను ముద్రిస్తున్నారు. ఇద్దరు కలిసి గతంలో కూడా నకిలీ నోట్లను ముద్రించడంతో గుజరాత్, చాంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. తాండూరులోని ఇంట్లోనే అన్నా, చెల్లి కలిసి నోట్లను ముద్రించి 1ః4 నిష్పత్తిలో పంపిణీ చేస్తున్నారు. నిందితులు జేకె బాండ్ పేపర్పై నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నారు. రమేష్ ఇన్స్టాగ్రాంలో వీడియో పోస్ట్ చేసి కింద తన మొబైల్ నంబర్ ఇచ్చాడు. వాటిని చూసిన నగరానికి చెందిన నిందితులు సంప్రదించారు. వారికి రమేష్ బాబు నకిలీ నోట్లు ఇవ్వడంతో నగరంలో చెలామణి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్స్పెక్టర్లు మల్లేషం, సంతోష్ కుమార్ తదితరులు దర్యాప్తు చేశారు.
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: ఇల్లు అద్దెకు కావాలని నటిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని
జూబ్లీహిల్స్ గెలుపుపై బిఆర్ఎస్ ధీమా
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయని బిఆర్ఎస్ పార్టీ ధీమాగా ఉన్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పార్టీ నిర్ణయించింది. ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ కోసం పార్టీ సీనియర్ నాయకులను, ప్రముఖులను ఎలక్షన్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించింది. ఈ ఏజెంట్లందరితో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు తదితర ముఖ్య నేతలు గురువారం తెలంగాణ భవన్లో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కౌంటింగ్ ఏజెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా అనుసరించాల్సిన అంశాలపై మార్గదర్శనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పోలింగ్ సందర్భంగా అన్ని రకాల అక్రమాలకు పాల్పడిందని, ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని బిఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్క కౌంటింగ్ ఏజెంట్, ఎలక్షన్ ఏజెంట్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు చేసే అవకాశం ఉందో వివరించినట్లు బిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిఆర్ఎస్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలోనూ జాగ్రత్తగా వ్యవహిరిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకున్నది.
Pretty Baby From Sharwa’s Biker: Beats, Romance & Swagger
Charming Star Sharwa is coming up with a sports and family entertainer Biker directed by Abhilash Reddy Kankara on UV Creations banner. Ghibran scored the music, and the promo of the first single Pretty Baby got superb response. Meanwhile, they released the song. Pretty Baby is every bit the explosive, high-voltage number. It starts with […] The post Pretty Baby From Sharwa’s Biker: Beats, Romance & Swagger appeared first on Telugu360 .
ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు నేనే చెల్లిస్తా: కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు అందరికి పరీక్ష ఫీజులు తానే చెల్లిస్తానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ముందుకొచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని విద్యార్థుల వివరాలను తనకు అందజేయాలని కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ కలెక్టర్ హరిచందనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం లేఖ రాశారు. ఇదే తరహాలో మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఇటీవల నిరుపేద పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తనకు ఇచ్చే వ్యక్తిగత వేతనం నుంచే వీరికి పరీక్ష ఫీజులు చెల్లించాలని నిర్ణయించుకుని ఆ ప్రకటన చేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేసేందుకు వీలుగా ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆయన లేఖలు కూడా రాసి పంపించారు. పరీక్ష ఫీజు చెల్లించలేక ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకుండా చూసేందుకు కేంద్రమంత్రులు ఇద్దరూ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన అంత్యోదయ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి పిల్లలకు తన వంతుగా సహాయం చేయాలని అనుకుంటున్నానని, అందుకే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులందరికీ తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు పరీక్ష ఫీజు మొత్తాన్ని తన జీతం నుంచి చెల్లించాలని నిర్ణయించినట్లు ఆయన ఢిల్లీ నుంచి ఒక ప్రకటనలో వివరించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని మస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పలు సేవా కార్యక్రమాలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు అవసరమైన వస్తువుల పంపిణీ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పాఠశాలల్లో మరుగు దొడ్ల నిర్మాణం, మెకనైజ్డ్ టాయిలెట్ క్లీనింగ్ మెషీన్స్ అందజేస్తున్నారు. దీంతోపాటుగా డబుల్ డెస్క్ బెంచీలను కూడా కిషన్ రెడ్డి సమయానుగుణంగా అందజేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో నోట్ బుక్స్ పంపిణీ, పలు పాఠశాలల్లో డిజిటల్ తరగతులకు కూడా కేంద్రమంత్రి సహకారం అందించిన సంగతి తెలిసిందే.

22 C