SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

17    C
... ...View News by News Source

పోలీసు కారుకు శవపేటిక కట్టి గ్రామస్థుల ఆందోళన

మన తెలంగాణ/ నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా, ఎర్గట్ల మండలం, దోమచంద్‌లో యువకుడి ఆత్మహత్య ఉదంతంతో పోలీస్ శాఖ లో ఉన్నత స్థాయి అధికారులు సైతం ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎర్గట్ల మండలం, దోమచంద్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి (29) ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అ క్కడే స్థిరపడ్డాడు. ఇక్కడ ఉన్నప్పుడే అంటే ఆరేళ్ళ క్రితం తన సామాజికవర్గానికి చెందిన ఏర్గట్ల గ్రా మానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డా డు. కుటుంబ సభ్యులు సైతం వీరిద్దరి ప్రేమకు సా నుకూలత వ్యక్తం చేశారు. ఇంకేముంది ప్రేమించి అమ్మాయితో పెండ్లికి లైన్ క్లియర్ అయిందని ఎం తో సంబరపడ్డాడు. ఆ కుటుంబానికి ఆర్థికంగా తనకు తోచిన మేరకు అండగా ఉంటూ వచ్చాడు. లండన్ నుండి పెళ్ళి పేరుతో ఇండియాకి రప్పించారు. ప్రేమించిన అమ్మాయితో పెండ్లి ఆశలు పెట్టుకొని స్వగ్రామానికి వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చిన ఆ యువకుడికి అమ్మాయి షాక్ ఇచ్చింది. ఆర్థికంగా మరింత బలమైన సంబంధం ఖరారు చేసుకున్నారు. చివరికి వేరే అబ్బాయితో ఈ నెల లో పెళ్లి చేయడానికి సిద్ధం చేశారు. కానీ ఆ పెం డ్లికి ఒక్కరోజు ముందే శ్రీకాంత్‌రెడ్డి ఈనెల 6న ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయ త్నం చేశాడు. సూసైడ్ నోటు కూడా రాశాడు. ఇదే విషయమై బాధిత కుటుంబ సబ్యులు అదే రోజున ఎర్గట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో శ్రీకాంత్‌రెడ్డిని హుటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించాడు. ఇంత జరిగినా పోలీసులు తమకేమీ సోయే లేదన్నట్లుగా వ్యవహరించారు. అందుకే ఉదాసీనతకు తగిన మూల్యం శుక్రవారం చెల్లించుకోక తప్పలేదు. బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన మృతదేహాన్ని పోలీస్ వాహనం మీదికి ఎక్కించారు. మృతుడి బంధువులు, గ్రామస్థులు శవంతో కలిసి పోలీస్ స్టేషన్ ముట్టడికి ప్రయత్నించగా మధ్యలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈఘటనతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డెక్కి వందలాది మంది పోలీసుల వైఫల్యాలపై దుమ్మెత్తిపోశారు. ఖాకీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి తగిన న్యాయం చేస్తామని సూసైడ్ నోట్ మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మన తెలంగాణ 29 Nov 2025 3:00 am

‘అఖండ2’లో బాలయ్య నట విశ్వరూపం

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ’అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ తమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక అద్భుతంగా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఆనాడు చత్రపతి శివాజీ సైన్యంలో కూడా అఘోరాలు ఉండేవారు. గొప్ప పోరాటం చేసేవారు. నా సినిమా ఉగాది పచ్చడి లాంటిది. అన్ని రసాలు ఉండాలి. ఈ సినిమాలో సంయుక్త చేసిన పాట కూడా చాలా మంచి సందర్భంలో వస్తుంది. ఆది పినిశెట్టి చాలా చక్కని పాత్ర చేశారు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మురళీమోహన్ ఇందులో చాలా అద్భుతమైన పాత్ర చేశారు. ఆకృత్యాలు మీరితే మనిషే ఆ దైవాన్ని తనలో ఆవహించుకుంటాడు అనేదే ఈ సినిమా. సినిమా అద్భుతంగా వచ్చింది. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ చాలా అద్భుతమైన పోరాటాలు సమకూర్చారు. నిర్మాతలు రామ్, గోపి లెజెండ్ తో మా ప్రయాణం మొదలైంది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా వారి బ్యానర్ లో చేయడం జరిగింది ‘అని అన్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘అఖండ ప్రజల్లోకి బాగా చొచ్చుకుని వెళ్లింది. తాండవం చేస్తే నిజంగా పరమేశ్వరుడే కనిపించాలి అనుకుని ఈ సినిమా ప్రారంభించాం. తీసి చూసుకున్న తర్వాత తెలిసింది అది భగవత్ కార్యక్రమమని. భగవంతుడే ఆ కార్యక్రమాన్ని మాతో చేయించాడు. ఇందులో మేము షూట్ చేసిన కొన్ని లొకేషన్స్ చూస్తే మీకు నమ్మసక్యంగా ఉండవు. ఆ భగవంతుడే మాకు దారి చూపించాడు. అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. వరల్ వైడ్ ప్రేక్షకులు ఈ సినిమాని ఆనందంగా చూడాలని కోరుకుంటున్నాను‘ అని పేర్కొన్నారు. నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ ‘కెమెరా ముందు మా బాలయ్య బాబు తాండవం. కెమెరా వెనకాల డైరెక్టర్ బోయపాటి తాండవం డిసెంబర్ 5న థియేటర్లో ప్రేక్షకులు తాండవం.. ఇది పక్కా. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. దానికి మించి ఇది డబల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. డిసెంబర్ 5న దేశం మొత్తం బాలయ్య బాబు నట విశ్వరూపం చూస్తుంది‘ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమన్, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి, పూర్ణ, మురళీ మోహన్, కబీర్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 29 Nov 2025 12:29 am

శనివారం రాశి ఫలాలు (29-11-2025)

మేషం భాగస్వామ్య వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. దూరప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. వృషభం నూతన వాహన సౌక్యం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిధునం చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ కష్టం ఫలించదు. కర్కాటకం ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్నిహితులు, వివాదాలు సర్దుబాటు కాగలవు. సింహం ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. కన్య వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలతో భారంగా మారతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. తుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని పనులలో రెండు రకములైన ఆలోచనలతో నష్టాలు తప్పవు. వృశ్చికం వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనస్సు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. మకరం వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆస్థి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుంభం ఒక విషయంలో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు. ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. మీనం నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.  

మన తెలంగాణ 29 Nov 2025 12:10 am

ఆధార్ అప్‌డేట్ ఇక తేలిక.. పూర్తిగా ఉచితం

ఇంటి నుంచే అంతా చకచక ఆన్‌లైన్ సెంటర్ల జంజాటం ..క్యూలైన్లకు చెల్లుచీటి సెల్‌ఫోన్‌తో ఆన్‌లైన్‌లో వచ్చే ఏడాది జూన్ వరకూ ఫ్రీ న్యూఢిల్లీ: దేశ పౌరులకు కీలక ఆధారం అయిన ఆధార్‌కార్డుల్లో మార్పులు చేర్పుల అప్‌డేట్ ఇక సులభతరం కానుంది. ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా అత్యంత సరళమైన పద్ధతుల ద్వారా ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు వీలేర్పడింది. ఈ మేరకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియల సాధికారిక సంస్థ ఉడాయ్ శుక్రవారం అధికారిక ప్రకటన వెలువరించింది. ఇంతకు ముందటి లాగా ఇందుకోసం ఈ సేవా కేంద్రాలకు తిరగాల్సిన అవసరం లేదు, రోజులు నెలల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు. ఆధార్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్లను ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా సరిచేసుకోవచ్చు. డిజిటల్ సిస్టమ్ ద్వారా ఎవరైనా ఈ దిద్దుబాటకు దిగవచ్చు. ఇందుకు వ్యక్తిగతంగా ఎవరూ కూడా సేవా కేంద్రాలను వెతుక్కుంటూ వెళ్లి క్యూల్లో పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు. సంబంధిత పత్రాలు, నిర్థారణల వంటి జంజాటం కూడా అవసరం లేకుండా చేశారు. ఆధార్ కార్డుల్లో ఉండే విశిష్ట ప్రాధికారిక సంఖ్య వ్యక్తుల గుర్తింపు నెంబరుగా ఉంటోంది. ఈ క్రమంలో మన ఆధార్‌కార్డు ద్వారానే ప్రభుత్వ పథకాల లబ్థికి, పాన్‌కార్డులు ఇతరత్రా గుర్తింపు కార్డులు పొందడానికి ఇది ప్రధానమైన అంశంగా ఉంటోంది. పౌరుల పలు రకాల సేవల వాడకం బిల్లులు ఎలక్ట్రిసిటీ లేదా వాటర్ బిల్లుల ప్రతులను సరైన చిరునామాల గుర్తింపుగా కూడా ఆమోదిస్తారు. సొంతంగా లేదా తగు విషయ పరిజ్ఞానం ఉన్న వారి ద్వారా ఆధార్ అప్‌డేట్‌కు వెళ్లవచ్చు. ఇందుకు చేయాల్సింది. * ఆధార్ అధికారిక పోర్టల్‌లోకి ఎంటర్ కావడం * మన స్మార్ట్ ఫోన్ కెమెరా ద్వారా ముఖ గుర్తింపు నిర్థారణ *మన రిజిస్టర్డ్ మొబైల్ కు ముందుగా ఆధార్ నెంబరను పంపించడం, తరువాత మనకు వచ్చే ఒటిపిని పొందుపర్చడం * అప్‌డేట్ ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకోవడం, సెలెక్ట్ చేసుకుని మనం మార్చాలనుకునే సమాచారం మార్చుకోవచ్చు * ఈ క్రమంలో అవసరం అయిన సమాచార డాక్యుమెంట్లను జతచేయడం * మన అభ్యర్థనను పొందుపర్చడం తరువాత దీని ప్రోగ్రెస్ గురించి ఆన్‌లైన్ ద్వారా నిర్థారించుకోవడం, ఒక్కసారి వెరిఫై తరువాత మార్పులు చేర్పులు మన ఆధార్ పూర్వాపరాలలో వాటంతట అవే కన్పించడం జరుగుతుంది. ఇది ఆధార్ అప్‌డేట్‌గా నిర్థారించుకోవచ్చు. 2026 జూన్ 14 వరకూ ఈ ప్రక్రియ ఉచితం ఆధార్ అప్‌డేట్ సరళీకృత విధానం గురించి ఉడాయ్ మరో కీలక విషయం వెల్లడించింది. దీని మేరకు వచ్చే ఏడాది జూన్ 14వ తేదీ వరకూ ఈ అప్‌డేట్‌ను ఎటువంటి చెల్లింపుల అవసరం లేకుండా ఉచితంగా నిర్వహించుకోవచ్చు. అప్పటిలోగా పౌరులు తమ ఆధార్‌కార్డుల్లో అవసరం అయిన సవరణలను ఉచితంగానే చేసుకోవచ్చు. అయితే మన రిజిస్టర్డ్ , మనం వాడే మొబైల్ నెంబర్ అప్పటికే ఆధార్‌కు అనుసంధానం అయ్యి ఉండాలి. 

మన తెలంగాణ 28 Nov 2025 11:56 pm

Akhanda 2 Is The Embodiment Of That Awakening: Boyapati

A spectacular pre-release event of Nandamuri Balakrishna’s Akhanda 2 celebrated today in Hyderabad. The entire cast and crew gathered to mark the occasion, setting the stage for the movie’s grand arrival on December 5th. Director Boyapati Sreenu expressed his gratitude to everyone involved in the making of the film. “Balakrishna is our strength and inspiration. […] The post Akhanda 2 Is The Embodiment Of That Awakening: Boyapati appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 11:51 pm

Maoist surrender | MMC జోన్‌కు భారీ దెబ్బ…

మహారాష్ట్ర–మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్‌కు చెందిన కీలక కమాండర్ సహా 11 మంది మావోయిస్టులు

ప్రభ న్యూస్ 28 Nov 2025 11:27 pm

మరో 10 మంది నక్సల్స్ లొంగుబాటు..

జగదల్‌పూర్: నక్సల్స్ సీనియర్ కేడర్, భయంకర చైతుతోసహా మొత్తం పది మంది నక్సల్స్ ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లాలో శుక్రవారం లొంగిపోయారు. వీరిలో తొమ్మిది మంది మహిళా నక్సల్స్ ఉన్నారు. వీరందరి తలపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉంది. సామాజిక ఏకీకరణ కోసం పునరావాసం (పూనా మార్గెం) అన్న సంకల్పంతో వారు తమంతట తామే జగదల్‌పూర్‌లోని సీనియర్ పోలీస్, సెంట్రల్ రిజర్వు పోలీస్, అధికారుల ముందు లొంగిపోయారని ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ పట్టిలింగం వెల్లడించారు. మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చైతు అలియాస్ శ్యామ్ దాదా(63) లొంగిపోవడం హింసాత్మక, ప్రజావ్యతిరేక మావోయిస్టు భావజాలం వేగంగా నశిస్తోందనడానికి స్పష్టమైన సంకేతంగా పోలీస్ అధికారులు పేర్కొన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన చైతు అసలు పేరు గిరడ్డి పవనానందరెడ్డి.1985లో మావోయిస్టుల్లో చేరాడు. మహారాష్ట్ర నుంచి దండకారణ్యకు 199192లో మారాడు. ఆయన తలపై రూ. 25లక్షల రివార్డు ఉంది. 

మన తెలంగాణ 28 Nov 2025 11:04 pm

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదాజియాకు తీవ్ర అస్వస్థత

ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా(80) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆదివారం రాత్రి ఢాకా లోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించినట్టు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని బిఎన్‌పి సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రూల్ ఇస్లాం అలంఘీర్ వెల్లడించారు. ఆమె త్వరగా కోలుకోవాలని పార్టీ ప్రత్యేక ప్రార్థనలు చేసింది. దివంగత బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియా ఉర్ రెహ్మాన్ భార్య ఖలీదా జియా. గత కొంతకాలంగా కాలేయం, మూత్రపిండాల సమస్యలతోపాటు, డయాబెటిస్, ఆర్థిరిటిస్, నేత్ర సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆమె ఏకైక కుమారుడు ,బిఎన్‌పి తాత్కాలిక ఛైర్మన్ తారిక్ రెహ్మాన్ 2008 నుంచి లండన్‌లో ఉంటున్నారు. మరో కుమారుడు అరాఫత్ రెహ్మాన్ 2025లో గుండెపోటుతో మృతి చెందారు.

మన తెలంగాణ 28 Nov 2025 10:53 pm

శ్రామికుల అవతారమెత్తిన పోలీసులు…

ఏ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలం దీప్లానగర్

ప్రభ న్యూస్ 28 Nov 2025 10:46 pm

Andhra King Taluka Overseas: Highest For Ram

Ram Pothineni’s latest outing, Andhra King Taluka, has sparked an impressive surge at the box office, proving once again how strong verdict from the audience can redefine a film’s trajectory. Directed by Mahesh Babu P and backed by Mythri Movie Makers, the film hit theatres on Thursday and began its journey on a good note […] The post Andhra King Taluka Overseas: Highest For Ram appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 10:40 pm

కాలోజీ వర్సిటీ వ్యవహారంపై సీఎం సీరియ‌స్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన కాళోజీ నారాయణరావు

ప్రభ న్యూస్ 28 Nov 2025 10:36 pm

హైకోర్టులో ఇమ్రాన్ సోదరి కోర్టు ధిక్కరణ పిటిషన్

ఇస్లామాబాద్ : జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ను కలుసుకోనివ్వకపోవడంపై అడియాలా జైలు సూపరింటెండెంట్, ఇతర అధికారులకు వ్యతిరేకంగా ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఖైబర్‌ఫక్తుంఖ్వాముఖ్యమంత్రి సొహాలి అఫ్రిడి , పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ)కి చెందిన ఇతర నేతలు వెంటరాగా ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న 73 ఏళ్ల ఇమ్రాన్‌ను వారానికి రెండుసార్లు కలుసుకోవచ్చని 2024 మార్చిలో ఇస్లామాబాద్ హైకోర్టు ఉత్తర్వు జారీ చేయడాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. అడియాలా జైలు సూపరింటెండెంట్ అబ్దుల్ ఘఫూర్ అంజుమ్, సద్దార్ బెరోని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఒ రాజా అయిజాజ్ అజీమ్, ఫెడరల్ ఇంటీరియర్ సెక్రటరీ కెప్టెన్ ’(రిటైర్డ్( ముహమ్మద్ ఖుర్రం, పంజాబ్ హోం విభాగం సెక్రటరీ నూరుల్ అమీన్‌లను ప్రతివాదులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను కలియనీయకపోవడంతో అలీమా, అఫ్రిడి 16 గంటల పాటు ధర్నా చేశారు. ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కూడా కలుసుకోవడానికి వీలు కల్పించకపోవడంతో తమ పార్టీ పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటుందని అఫ్రిడి వెల్లడించారు.

మన తెలంగాణ 28 Nov 2025 10:30 pm

హాంకాంగ్ అగ్నిప్రమాదం..128కి పెరిగిన మృతుల సంఖ్య

బీజింగ్/హాంకాంగ్ : హాంకాంగ్‌లోని ఏడు ఆకాశ హర్యాల భవనాల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 128 కి పెరిగింది. ఇంకా 200 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెప్పారు. 1984 అపార్టుమెంట్లలో దాదాపు 4600 మంది నివసిస్తున్న ఈ భవనాల్లో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు. భవనాల మరమ్మతుల కోసం వాడుతున్న పాలిస్టర్‌బోర్డులు, వెదురుబొంగులు, మెష్ వంటి పరికరాల వల్లనే మంటలు మరింత పెరిగాయని భావించడంతో ఆయా పనులు చేయిస్తున్న ఒక మహిళతోసహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

మన తెలంగాణ 28 Nov 2025 10:30 pm

రామ్, ఉపేంద్ర మ్యాజిక్ చేశారు..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ స్పందనతో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సమావేశంలో రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ.. “ఈ కథ విన్నప్పుడే థ్రిల్ అయిపోయాను. ఎమోషనల్‌గా అద్భుతంగా అనిపించింది. కానీ టైటిల్ ఆంధ్ర కింగ్ అని చెప్పినప్పుడు కాస్త టెన్షన్ అనిపించింది. నేను ఎలా ఆంధ్ర కింగ్ అవుతాను అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది... ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర కింగ్స్. నేను కింగ్ లాగా ఫీల్ అవుతున్నాను అంటే అది మీ గొప్పతనం. అంత పెద్ద మనసు మీది. నేను గత 25 ఏళ్లుగా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇది నా స్థానం అనిపిస్తుంది. డైరెక్టర్ మహేష్ అద్భుతమైన సినిమా తీశారు. హీరో, ఫ్యాన్ మధ్య వున్న డివైన్ ఎమోషన్‌ని అద్భుతంగా చూపించారు. సినిమాకి ఇంత అద్భుతమైన స్పందన ఇచ్చిన ఆడియన్స్‌కి ధన్యవాదాలు”అని అన్నారు. డైరెక్టర్ మహేష్ బాబు పి మాట్లాడుతూ.. “రామ్, ఉపేంద్ర మ్యాజిక్ చేశారు. ఒక మంచి టీంతో ప్రయాణం చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతం ఆంధ్ర కింగ్ తాలూకా”అని తెలిపారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ “ఈ సినిమాకి వచ్చిన స్పందన చాలా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ మహేష్ బాబుకి చాలా గొప్ప పేరు వచ్చింది. రైటింగ్, డైరెక్షన్ అద్భుతంగా చేశారు. ఇది చాలా లాంగ్ రన్ ఉన్న సినిమా. ఇది కేవలం ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు ఫ్యామిలీస్, పిల్లలు, యూత్ అందరూ ఎంజాయ్ చేసే కథ. అందరికీ నచ్చి మెచ్చే సినిమా ఇది”అని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్కేఎన్, వివేక్, మెర్విన్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 10:14 pm

గోవాలో రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

 భారతదేశంలో సాంస్కృతి పునరుజ్జీవనం మొదలైందని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం నాడు అన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం, వారణాశిలో కాశీ విశ్వనాథ్ ధామ్ నిర్మాణం, ఉజ్జయిని లో మహాకాల్ మహా లోక్ విస్తరణ దేశంలో సాంస్కృతిక పునర్వైభవాన్ని, పునరుజ్జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. గొవాలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన 77 అడుగుల శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. దక్షిణ గోవాలోని కాంకోనా లోని పర్తగలిలో శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠ్ మఠం 550వ వార్షికోత్సవంలో భాగంగా జరిగిన విగ్రహావిష్కరణ సభలో ప్రధాని పాల్గొన్నారు.అయోధ్యలో రామాలయ నిర్మాణం, వారణాశిలో విశ్వనాథ్ ధామ్, ఉజ్జయినిలో మహాకాల్ మహాలోక్ విస్తరణ భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వ పునరుద్ధరణ కు ప్రతిబింబమని ఈ శక్తితో దేశం పురోభివృద్ధి మార్గంలో సాగుతుందని, ఈపునరుజ్జీవనం భవిష్యత్ తరాలను వారి మూలాలతో అనుసంధానికి ప్రేరేపణగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. గోవా చరిత్రను ప్రస్తావిస్తూ, గోవాలో ఎన్నో మహోన్నత దేశాలయాలు, విధ్వంసం పాలైన సందర్భాలను గుర్తు చేశారు. గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠ్ ఎన్నో ఆటుపోట్లను, తుపానులను ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు. యుగాలు మారాయి, తరాలు మారాయి కానీ, మఠం దాని దిశను కోల్పేలేదని,ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రజలకు దిశానిర్దేశం చేసే కేంద్రంగా ఆవిర్భవించిందని ప్రధాని ప్రశంసించారు. వికసిత్ భారత్ వైపు ప్రయాణం సమైక్యత ద్వారా సాగుతుందని, సమాజం కలిసి వచ్చినప్పుడు ప్రతిప్రాంతం, ప్రతివర్గం మమేకమైనప్పుడే పురోభివృద్ధి సాధ్యమని ప్రధాని అన్నారు.దేశ సర్వతో పురోభివృద్ధికోసం దేశప్రజలు తొమ్మిది తీర్మానాలను చేసుకోవాలని ప్రధాని సూచించారు. అవి నీటి సంరక్షణ, చెట్లపెంపకం, పరిశుభ్రత, స్వదేశి వస్తువుల వాడకం, దేశ్ దర్శన్ ( దేశంలో కీలక ప్రాంతాల సందర్శన) సహజ వ్యవసాయం, ఆరోగ్యకరమైన జీవన శైలి, యోగ, క్రీడలు, పేదలకు సాయం చేయడం అనేవే ఈ తొమ్మిది తీర్మానాలు.ఈ సందర్భంగా రామాయణం ఆధారంగా ఓ థీమ్ పార్క్ ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఇవి రాబోయే తరాలకు ధ్యానం, ప్రేరణ, భక్తికి శాశ్వత కేంద్రాలుగా మారతాయన్నారు. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మఠం అధిపతి శ్రీమద్ విద్యాదీష్ తీర్థ స్వామి ఇతరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 10:14 pm

అయ్యప్పభక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభ వార్త

అయ్యప్పభక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభ వార్త తెలిపింది. శబరిమలకు విమానాలలో వెళ్లే అయ్యప్పస్వాములు తమ ఇష్టదైవపు ఇరుముడిని తమ వెంట ఉండే క్యాబిన్ లగేజ్‌లో తీసుకువెళ్లవచ్చు. దీనిని వారు చెక్ ఇన్ బ్యాగేజ్‌లలో పంపించాల్సిన అవసరం లేదు, భక్తులు తాము ఇరుమడి వెంట ఉంటేనే వెళ్లగల్గుతామని , ఇది స్వాముల ఆచార వ్యవహారం అని తేల్చిచెప్పారు. దీనితో ఇందుకు అనుగుణంగా ఇప్పుడు ఇరుముడిని వెంట తీసుకువెళ్లేందుక అనమతి కల్పించినట్లు పౌర విమానయాన మంత్రి కె రామ మోహన్ నాయుడు శుక్రవారం ప్రకటించారు. శుక్రవారం (నేటి) నుంచి వచ్చే ఏడాది జనవరి 20 వరకూ ఈ వెసులుబాటు అమలులో ఉంటుంది. అప్పటికి మకర దర్శన ఘట్టం ముగుస్తుంది. స్వాములు తిరుగు ప్రయాణం అవుతారు. పవిత్ర ఇరుముడి సంప్రదాయం అంతర్లీనంగా దాగి ఉన్న విశ్వాసాలను అర్థం చేసుకున్నామని ఈ మేరు భక్తులు ఇరుమడి తమ వెంట ఉండే బ్యాగ్‌లలో తీసుకువెళ్లేందుకు వీలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇక సంబంధిత అన్ని భద్రతా ఏర్పాట్ల నిబంధనలను పాటించడం జరుగుతుంది. స్వాములు తనిఖీలకు పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది. క్షుణ్ణంగా నిబంధనల మేరకు తనిఖీల తరువాత ఇరుముడిని వెంట తీసుకెళ్ల వచ్చు, అయితే తమ లగేజ్ బ్యాగ్‌లలో పెట్టుకుని ఉండాలి. భక్తుల విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

మన తెలంగాణ 28 Nov 2025 10:10 pm

అంగారకుడిపై మెరుపులు

 అంగారక గ్రహంలో మెరుపులను నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటీవల నాసాకు చెందిన ప్రత్యేక పరిశీలక రోవర్ ద్వారా అంగారకుడిలో తలెత్తే ఉరుములు మెరుపుల వాతావరణాన్ని పసిగట్టారు. ఈ అరుణ గ్రహంపై సుడులు తిరిగే గాలుల్లో మిళితం అయి ఉండే తుంపర్లను ఇదే క్రమంలో భయానక శబ్దాలను ఈ నాసా రోవర్ మైక్రోఫోన్ ద్వారా గుర్తించారు. ప్రధానంగా అంగారకుడిలో తలెత్తే దూమ్ము ధూళి తుపాన్ల క్రమంలోనే భీకరంగా లేచే సుడిగాలుల దశలో మెరుపులు కూడా సంభవిస్తాయని, ఈ దశలో గాలులలో అంటిపెట్టుకుని ఉండే తుంపర్లను గుర్తించామని సైంటిస్టులు తెలిపారు. అంతర్గత దట్టమైన విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రభావంతో ఈ మెరుపులు సంభవిస్తాయి. ఇవి ఏకంగా 58 సార్లు గుర్తించారు. రోవర్ చివరి భాగంలో అమర్చి ఉన్న కెమెరా ద్వారా అక్కడి మెరుపుల పరిణామం కనుగొన్నారు. అంగారకుడిపై జీవం ఉనికి , భూ వాతావరణానికి సారూప్యతతో ఉండే పరిస్థితులను గమనించారని వెల్లడైంది.

మన తెలంగాణ 28 Nov 2025 10:07 pm

మహిళల టి20 సిరీస్ షెడ్యూల్ ఖరారు.. విశాఖలో భారత్-శ్రీలంక పోరు

ముంబై: భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. భారత పర్యటనలో శ్రీలంక విమెన్స్ టీమ్ ఐదు మ్యాచ్‌లను ఆడనుంది. డిసెంబర్ 21న విశాఖపట్నంలో జరిగే తొలి టి20 మ్యాచ్‌తో సిరీస్‌కు తెరలేవనుంది. తొలి రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. రెండో టి20 డిసెంబర్ 23న విశాఖలోనే జరుగనుంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌లు తిరువనంతపురంలో జరుగనున్నాయి. డిసెంబర్ 26, 28, 30 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచకప్ వన్డే ట్రోఫీని సాధించిన తర్వాత భారత మహిళా టీమ్ ఆడుతున్న సిరీస్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

మన తెలంగాణ 28 Nov 2025 10:06 pm

భారత క్రికెట్ కలర్ పార్ట్‌నర్‌గా ఏషియన్ పెయింట్స్

మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా క్రికెట్ జోష్ శిఖరాలను తాకుతున్న వేళ ఏషియన్ పెయింట్స్, భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత క్రికెట్‌కు అధికారిక కలర్ పార్ట్‌నర్‌గా ఏషియన్ పెయింట్స్ ఎంపైకైంది. మూడేళ్ల భాగస్వామ్యంలో భాగంగా భారత్‌లో జరిగే పురుషులు, మహిళలు, దేశవాళీ క్రికెట్ సిరీస్‌లను ఏషియన్ పెయింట్స్ కవర్ చేయనుంది. దాదాపు 110పైగా మ్యాచ్‌లకు ఈ సంస్థ కలర్ పార్ట్‌నర్‌గా వ్యవహరించనుది. దశాబ్దాలుగా భారతీయ ఇళ్లలో రంగులు, సృజనాత్మకత, భావోద్వేగాలను ప్రతిష్ఠాత్మకమైన వేడుకగా మార్చిన ఏషియన్ పెయింట్స్ తన రంగుల ప్రస్థానాన్ని దేశపు అత్యంత పెద్ద అభిరుచి అయిన క్రికెట్‌కు విస్తరించింది. ఈ మేరకు భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ అమిత్ సింగిల్ ఒప్పందాన్ని భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 9:39 pm

హకీంపేట లో ఎక్స్ సర్వీసెమెన్ జాబ్ ఫెయిర్

జాబ్ ఫెయిర్ ద్వారా ఎక్స్ సర్వీసెమెన్ లకు ఉద్యోగ అవకాశాలు సులువుగా లభిస్తాయని రీ సెటిల్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ ఎస్. బి. కె సింగ్ అన్నారు. శుక్రవారం డైరెక్టరేట్ జనరల్ రీ సెటిల్మెంట్ , డిపార్ట్మెంట్ అఫ్ ఎక్స్ సర్వీసెమెన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రోడ్ మైదానంలో ఎక్స్ సర్వీసెమెన్ జాబ్ ఫెయిర్ ను ముఖ్య అతిధిగా హాజరైన రీ సెటిల్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ ఎస్. బి . కె సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సె ద్వారా దేశానికి సేవలు అందించిన జవాన్ లకు వికసిత భారత్ లక్ష్యంగా ఇలాంటి జాబ్ మేళా లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 50కి పైగా కంపెనీలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి 12 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని వివరించారు. పలు కంపెనీలు ఈ మేళా ద్వారా ఎక్స్ సర్వీసెమెన్ లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి రెండో కెరీర్ ప్రారంభించేలా ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధి గా పాల్గొన్న సి ఐ ఐ ప్రతినిధి రవి రాజ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కు చెందిన 15 కంపెనీలు ఇందులో స్టాలల్స్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫుడ్, ఫార్మసీ, మాన్యుఫాక్చరింగ్ , హాస్పిటాలిటీ, టెక్నీకల్ , సెక్యూరిటీ రంగాలకు చెందిన కంపెనీలు ఇందులో ఎక్స్ సర్వీసెమెన్ లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ వైస్ మార్షల్ పి . ఎ. షా , జీ పీ కెప్టె న్ నీరజ్ జాంబ్ , ఏ డీ జీ బ్రిగేడియర్ రంజన్ కేరాన్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 9:30 pm

శ్రీలంక వరద బాధితులకు భారత్ ఆపన్నహస్తం

శ్రీలంకలో సంభవించిన వరదల్లో దాదాపు 56 మంది ప్రాణాలు కోల్పోవడంపై భారత ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర సంతాపం తెలియజేశారు. దిత్వా తుపాను కారణంగ వరదలు ఆకస్మికంగా ముంచుకురావడంతో ఈ విపత్తు సంభవించింది. 21 మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ ఆపద సమయంలో పొరుగు దేశానికి స్నేహ హస్తం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు భద్రంగా ఉండాలని, వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తన ఎక్స్ పోస్టులో తెలియజేశారు. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో అత్యవసర మానవతాసాయం పంపినట్టు ప్రకటించారు. భారత నేవీకి చెందిన మానవతాసాయం, వైపరీత్యాల సహాయ (హెచ్‌ఎడిఆర్) మిషన్ పొరుగునున్న దేశాలకు ఏ విపత్తు జరిగినా తక్షణం సహాయం అందిస్తుంది. ఈ ఆపరేషన్‌లో భారత్ నౌకలు, విమానాలు , వైద్యబృందాలు, పాల్గొంటున్నాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా బాధితుల సహాయ కార్యక్రమాలకు ఐఎన్‌ఎస్ విక్రాంత్ విమానాన్ని ఉపయోగించుకోవడానికి శ్రీలంక అభ్యర్థించిందని బారత అధికారులు శుక్రవారం వెల్లడించారు. శ్రీలంకలో నవంబర్ 30న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష జరుగుతున్నందున భారత్ ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక ఈనెల 2526 ప్రాంతంలో శ్రీలంకకు చేరిందని శ్రీలంక నేవీ వెల్లడించింది. 

మన తెలంగాణ 28 Nov 2025 9:25 pm

‘హిల్ట్’ పాలసీపై బహిరంగ చర్చకు సిద్ధమా..?: ఎంఎల్ఎ ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ (హిల్ట్) పాలసీ గురించి ప్రతిపక్షాలకు అర్ధం కాలేదనడం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దివాళాకోరుతనానికి నిదర్శనమని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే, దానిపై చర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేదని ప్రశ్నించారు. -హిల్ట్ పాలసీ అత్యంత పారదర్శకంగా ఉందని, ఎలాంటి కుంభకోణానికి అస్కారం లేదంటున్న మంత్రి ఉత్తమ్ ఈ విధానంపై బహిరంగ చర్చకు సిద్దమా అని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఏలేటి మీడియాతో మాట్లాడుతూ బహిరంగ చర్చకు మంత్రి సిద్దపడితే శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింటులో జర్నలిస్టుల సమక్షంలో చర్చకు తాను సిద్దమని తెలిపారు. లేదంటే డేట్, టైమ్, వేదికను మంత్రి ఖరారు చేసినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్దమే అని సవాల్ విసిరారు. హిల్ట్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదని, దీనిపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే చర్చ జరిగిందంటున్న మంత్రి ఉత్తమ్ బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిని, అక్రమాలను ఆదర్శంగా తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు.

మన తెలంగాణ 28 Nov 2025 9:19 pm

ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజలకు ఉపయోగకరంగా లేవు: పొన్నాల లక్ష్మయ్య

 ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజలకు ఉపయోగకరంగా లేవు అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. .హిల్ట్ పాలసి పేరుతో మరో భూ దోపిడీ యత్నం చేస్తున్నారని, ఇది హిల్ట్ పాలసి కాదు టిల్ట్ పాలసీ అని విమర్శించారు. హిల్ట్ భావమేమి రేవంతా...? అని అందరూ అనుకుంటున్నారని అన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలను భ్రమింపజేస్తున్నారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉండగా కొడంగల్ ఎత్తిపోతల పథకం దేనికి..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న వాటిని అమలు చేయకుండా లేని వాటికి ప్రాధాన్యత ఎందుకు, డబ్బుల సంపాదన కోసం కాదా..? అని అడిగారు. నాలుగేండ్లలో 24 లక్షల ఇండ్లు కడతామన్నారని, ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు కట్టారు..విడుదల చేసిన మొత్తం ఎంత..? అని ప్రశ్నించారు. రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తే కమిషన్లు రావని కోతలు పెట్టే ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో అంచనాలు భారీగా పెంచి లక్ష కోట్లు దాటించారని అన్నారు. విభజన చట్టం ప్రకారం ఎన్‌టిపిసి దగ్గర 2400 మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కొత్త ప్రాజెక్టుల స్థాపన ఎందుకు..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల విమర్శలకు విద్యుత్ శాఖ మంత్రి సమాధానం చెప్పకుండా వేరే మంత్రులు జవాబిస్తున్నారని పేర్కొన్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 9:16 pm

TDP |తెలుగు తమ్ముళ్ల గలాట..

TDP | తెలుగు తమ్ముళ్ల గలాట.. ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ): కొండపల్లి పట్టణ టీడీపీ

ప్రభ న్యూస్ 28 Nov 2025 9:14 pm

Cyclone Ditva |ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: బంగాళాఖాతంలో ఏర్పడిన “దిత్వా” వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ

ప్రభ న్యూస్ 28 Nov 2025 9:05 pm

ఏడు రోజులపాటు అరసవల్లి రథసప్తమి వేడుకలు…

శ్రీకాకుళం బ్యూరో, ఆంధ్రప్రభ : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:57 pm

Sports Hub |తిరుపతికి స్పోర్ట్స్‌ హబ్ సెంట‌ర్..

Sports Hub | తిరుపతికి స్పోర్ట్స్‌ హబ్ సెంట‌ర్.. ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:47 pm

ఎకరాకు రూ.151.25 కోట్లు

కోకాపేట నియోపోలిస్ భూముల వేలం నయా రికార్డు నెలకొల్పింది. శుక్రవారం మరో రెండు ప్లాట్లకు హెచ్‌ఎండిఏ ఈ వేలం నిర్వహించగా కోట్లలో హెచ్‌ఎండిఏకు ఆదాయం సమకూరింది, నియోపోలిస్‌లోని 15, 16 నెంబర్ ప్లాట్లకు శుక్రవారం ఈ-వేలం జరిగింది. నియోపోలిస్‌లోని 15వ ప్లాట్‌కు ఎకరాకు రూ.151.25 కోట్ల ధర పలకగా, ఈ ప్లాట్‌ను లక్ష్మీ నారాయణ గుమ్మడి, కార్తీశ్ రెడ్డి మద్గుల, శరత్ వెంట్రప్రగడ, శ్యామ్ సుందర్ రెడ్డి వంగాలలు ఈ వేలంలో ఈ ప్లాట్లను దక్కించుకున్నారు. ఇక, 16 ప్లాట్ ఎకరాకు రూ.147.75 కోట్ల ధర పలకగా, గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ ఈ ప్లాట్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు ప్లాట్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రూ.1,352 కోట్ల ఆదాయం లభించింది. గతవారంలో నిర్వహించిన వేలంతో పాటు ప్రస్తుతం నిర్వహించిన ఈ వేలం ద్వారా ఇప్పటివరకు నియోపోలిస్ ఆక్షన్ల ద్వారా రూ.2,708 కోట్ల ఆదాయం హెచ్‌ఎండికు సమకూరింది. 

మన తెలంగాణ 28 Nov 2025 8:43 pm

దీప్తి శర్మ 3 కోట్ల 20 లక్షలు

భారత జట్టు మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో భారీ విలువ దక్కింది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:40 pm

పాధరక్షల వారసత్వాన్నికాపడుకొవాలి - జాతీయ సదస్సులో గవర్నర్ జిష్నుదేవ వర్మ

ఘనమైన భారతీయ పాధరక్షల వారసత్వాన్ని కాపాడి, కళాకారులకు చేయూత నివ్వాలని గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్, శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు అన్నారు.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:35 pm

కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై సిఎం రేవంత్ ఆగ్రహం

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వ్యవహారాలపై పత్రికల్లో వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇంఛార్జీల నియామకం తదితర ఘటనలపై వస్తున్న ఆరోపణలపై సిఎం ఆరా తీశారు. ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్థ పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించే సమస్యే లేదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పని చేసేవారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పని చేయాలని సిఎం సూచించారు.

మన తెలంగాణ 28 Nov 2025 8:33 pm

వేలంలో తెలుగు క్రికెటర్ల సత్తా

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో తెలుగు క్రికెటర్లు సత్తాచాటారు. అరుంధతిరెడ్డిని ఆర్‌సీబీ 75 లక్షలకు తీసుకుంది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:30 pm

Flamingo Festival |ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష..

Flamingo Festival | ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష.. తిరుపతి ప్రతినిధి

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:29 pm

Akhanda 2 Release Teaser: NBK Sets Screen On Fire

With the movie releasing soon on December 5th, the makers of Akhanda 2 starring Nandamuri Balakrishna and directed by Boyapati Sreenu have released a powerful new teaser- and it is sure to give you goosebumps. The teaser begins with a strong voice saying that a dark power is trying to disturb the spiritual balance of […] The post Akhanda 2 Release Teaser: NBK Sets Screen On Fire appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 8:28 pm

కెసిఆర్ దీక్షపై కొంతమంది సోయిలేని మాటలు మాట్లాడుతున్నారు: తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ భవన్‌లో శనివారం(నవంబర్ 29) దీక్షా దివాస్ ను ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ 2001లో ఉద్యమం ప్రారంభించి అన్ని వర్గాలకు ఏకతాటిపైకి తెచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేపట్టారని, కెసిఆర్ దీక్ష ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్‌లో శనివారం జరిగే కార్యక్రమ ఏర్పాట్లను తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కెసిఆర్ దీక్షపై కొంతమంది సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ మీద అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన కెసిఆర్ చరిత్ర మారదు అని పేర్కొన్నారు. తెలంగాణ రాకపోతే కాంగ్రెస్ ఎక్కడిది...తెలంగాణ ప్రభుత్వం ఎక్కడిది అని ప్రశ్నించారు. కొత్త బిచ్చగాళ్ళు పొద్దు ఎరగరు అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్ర తెలియనివాళ్ళు మాట్లాడుతున్నారని, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు తెలంగాణ ఏర్పాటుప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. బతుకమ్మ పేరుతో ఆనాడు చీరలు పంచితే ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అని పేరు మార్చారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని నిండు అసెంబ్లీలోనే కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వాళ్ళ లాగా మూర్ఖుల్లా తాము మాట్లాడము అని పేర్కొన్నారు. కెసిఆర్ ఆమరణ దీక్షకు సంబంధించిన దీక్షా దివస్ డాక్యుమెంటరీని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు సంబంధించిన అన్ని విషయాలు నెమరువేసుకోవడంతోపాటు ఈ తరానికి దీక్షా దివస్ గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

మన తెలంగాణ 28 Nov 2025 8:27 pm

ఇండియా పర్యటనకు పుతిన్..

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4వ తేదీన భారత్ పర్యటనకు వస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే పర్యటనలో భాగంగా ఆయన భారత్ రష్యాల 23వ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రధాని మోడీతో విస్తృత చర్చలు జరుపుతారని శుక్రవారం అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాతో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రష్యా అధినేత భారత్ రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. ద్వైపాక్షిక సంబందాలు మరింత పటిష్టం అయ్యేందకు ఈ పర్యటన, ఇరు దేశాల వార్షిక సదస్పు ఉపయుక్తం అవుతుందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోడీ వ్యక్తిగత ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడి రెండు రోజుల పర్యటన ఖరారయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ రష్యా అధ్యక్షులు పుతిన్‌కు స్వాగతం పలుకుతారు. ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేస్తారు. పుతిన్‌తో చర్చల దశలో ఉక్రెయిన్‌తో ఘర్షణ, పరిష్కారం విషయం కూడా ప్రస్తావనకు వస్తుంది. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రత, పౌర అణు ఇంధన రంగం వంటి కీలక విషయాలపై చర్చలు జరుగుతాయి. ఆపరేషన్ సిందూర్ దశలో సమర్థవంతంగా పనిచేసిన ఎస్ 400 ఉపరితల గగనతల క్షిపణుల అదనపు శ్రేణుల సమీకరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.

మన తెలంగాణ 28 Nov 2025 8:27 pm

ఆదోని మండల పునర్విభజనకు గెజిట్ జారీ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, ఉత్తర ప్రాంతానికి కేంద్రంగా ఉన్న

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:24 pm

నేపాల్‌ కొత్త 100 నోట్ భారత భూభాగాలతో

నేపాల్ మరోసారి భారత్ కు ఆగ్రహాన్ని తెచ్చే పని చేసింది. భారత్‌-నేపాల్‌ మధ్య వివాదాస్పదంగా ఉన్న కాలాపానీ, లిపులేఖ్

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:20 pm

నివాసాల్లోకి వచ్చిన కొండచిలువ

నివాసాల వద్దకు కొండచిలువ రావడంతో స్థానికులు భయాందోళనకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా కొండాపురం సిఎంఆర్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ ఇంటి వద్ద కొండచిలువ కోడిపుంజును మింగుతుండగా స్థానికులు గమనించి దాడి చేశారు. దీంతో కొండచిలువ కోడిపుంజును వదిలిపెట్టింది. ఆ తర్వాత స్థానికులు కొండచిలువను కొట్టి చంపారు. గంటికోట జలాశయం వెనుక జలాల నుంచి కొండచిలువ వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

మన తెలంగాణ 28 Nov 2025 8:12 pm

హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచ ఖ్యాతి

ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' విడుదల చేసిన 'వరల్డ్స్‌ బెస్ట్‌ రైస్‌ డిషెస్‌ లిస్ట్‌ ఆఫ్‌ 2025' లో హైదరాబాదీ బిర్యానీ టాప్ 10లో నిలిచింది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:12 pm

క్షమించండి: రిషబ్ పంత్

సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌‌‌‌లో 0–2తో వైట్‌‌‌‌వాష్‌‌‌‌ అవడంపై ఇండియా టెస్టు టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్షమాపణ చెప్పాడు.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:07 pm

community service |ఆదరించండి.. అభివృద్ధి చేస్తా

community service | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా community service | సదాశివనగర్,

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:04 pm

Prices Are Rising High|కొండ‌దిగ‌ని కూర‌గాయ‌లు..

పొన్నలూరు, ఆంధ్రప్రభ : కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి.

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:00 pm

election |రంగంలో ఉన్నా…ఆశీర్వదించండి

election | రంగంలో ఉన్నా…ఆశీర్వదించండి election | రామన్నపేట, ఆంధ్రప్రభ : సర్పంచ్

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:58 pm

BRS |భారీగా బీఆర్ ఎస్‌లో చేరికలు…

BRS | భారీగా బీఆర్ ఎస్‌లో చేరికలు… BRS | పెద్దమందడి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:54 pm

AP Cabinet Clears Major Amaravati Capital Expansion: Second Phase of Land Pooling and ₹7,500 Crore Loan Approved

The Andhra Pradesh Cabinet has taken significant decisions that will accelerate the development of the Amaravati capital region. In a meeting chaired by Chief Minister Chandrababu Naidu, the Cabinet approved the second phase of land pooling, covering 16,666.57 acres across seven villages under the Capital Region Development Authority (CRDA). This decision follows the government’s recent […] The post AP Cabinet Clears Major Amaravati Capital Expansion: Second Phase of Land Pooling and ₹7,500 Crore Loan Approved appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 7:51 pm

చింతామణి తండా పంచాయతీ ఏకగ్రీవం

 రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలం, చింతామణి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గుగులోత్ సింధుజ గంగాధర్‌లను గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కాబోయే సర్పంచ్ గుగులోతు సింధుజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని, రానున్న రోజుల్లో చింతామణి తండాను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని అన్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 7:47 pm

Mighty Patch Review: మైటీ ప్యాచ్‌ రివ్యూ: ఒక్క రాత్రిలో మొటిమ మాయం.. ఆశ్చర్యపోవడం మీ వంతు

Mighty Patch రివ్యూ: మొటిమలు (Acne) త్వరగా తగ్గడానికి, మచ్చలు రాకుండా కాపాడటానికి Hydrocolloid Patch ఎలా పనిచేస్తుంది? Pimple Patch కొనే ముందు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు, బెనిఫిట్స్, కొనుగోలు లింక్ ఇక్కడ చూడండి. మొటిమలు (Acne) ఎప్పుడు వస్తాయో తెలియదు. అలాంటి పరిస్థితిని అధిగమించడానికి మైటీ ప్యాచ్ (Mighty Patch) మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది మొటిమలను సులభంగా, సురక్షితంగా తగ్గిస్తుంది. ఈ హైడ్రోకొల్లాయిడ్ ప్యాచ్ (Hydrocolloid Patch) ఎలా పనిచేస్తుంది? దీనిని ఎక్కడ […] The post Mighty Patch Review: మైటీ ప్యాచ్‌ రివ్యూ: ఒక్క రాత్రిలో మొటిమ మాయం.. ఆశ్చర్యపోవడం మీ వంతు appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 28 Nov 2025 7:46 pm

BRS |అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగేందుకు…

BRS | అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగేందుకు… BRS | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:45 pm

బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదు

ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశాం. డీఎస్పీ హేమంత్ కుమార్ విశాలాంధ్ర – ధర్మవరం : చెన్నై కొత్తపల్లిలో బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు నిర్లక్ష్యం చేయలేదని ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయడం జరిగిందని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 26న సికేపల్లి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక తనపట్ల ఒకడు అసభ్యకరంగా వేధిస్తున్నాడన్న విషయంపై ఆ మైనర్ బాలిక సికె పల్లిలో […] The post బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:44 pm

సర్పంచ్ పదవి కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిన యువకుడు

తన కన్న ఊరికి ఏదైనా చేయాలని ఉద్దేశంతో, ఊరి మీద ఉన్న మమకారంతో తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ బరిలో దిగుతున్నాడు ఓ యువకుడు. జగిత్యాల జిల్లా, రాయికల్ మండలం, దావన్‌పెల్లి గ్రామానికి చెందిన బాణావత్ తిరుపతి నాయక్ జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అనస్థీయా టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 

మన తెలంగాణ 28 Nov 2025 7:44 pm

Election Code |నిబంధ‌న‌లు పాటించేలా దృష్టి పెట్టాలి…

Election Code | నిబంధ‌న‌లు పాటించేలా దృష్టి పెట్టాలి… Election Code |

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:39 pm

పోలీసుల అదుపులో దేవ్‌జీ

మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు దేవ్‌జీతో సహా 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని, వారందరినీ కోర్టు హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) పేరుతో ఈ నెల 22వ తేదీన విడుదల అయిన లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లు అడవిలో జరిగింది నకిలీ ఎన్‌కౌంటర్ అని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన నిర్వహించే చత్తీస్‌గఢ్, దండకారణ్యం బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ బిజెపి నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్కై, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, డికె స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా, ఆయన జీవిత భాగస్వామి కామ్రేడ్ రాజేలను బంధించి దారుణంగా హింసించి హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారన్నారు. దీన్ని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయ విచారణకు డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల కలిగే నష్టానికి నిరసనగా, గిరిజన ప్రజలు నీరు, అడవులు, భూమి, ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నారన్నారు. ఈ విషయంపై పోరాడుతున్న సిసి సభ్యులు కామ్రేడ్ కోసా దాదా, కామ్రేడ్ రాజు దాదా నకిలీ ఎన్‌కౌంటర్‌లో హత్యకు గురయ్యారని తెలిపారు. దండకారణ్యమంతా అన్యాయమైన యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోందని, జాతీయ, అంతర్జాతీయ చట్టాలు తీవ్రంగా ఉల్లంఘింస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న ప్రజా ఉద్యమాలను తుపాకీతో బెదిరించి అణిచివేస్తున్నారన్నారు. ఈ నెల 18, 19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామారాజు జిల్లాలో జరిగిన రెండు నకిలీ ఎన్‌కౌంటర్లను ప్రజలంతా ఖండించాలని కోరారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరపాలని లేఖలో డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 28 Nov 2025 7:39 pm

Kolikapudi |సర్పంచ్లతోనే సాధ్యం..

Kolikapudi | సర్పంచ్లతోనే సాధ్యం.. విస్సన్నపేట,ఆంధ్రప్రభ : సర్పంచులతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:34 pm

అపశబ్దాలైపోయిన వందే మాతరం, జై హింద్‌

ఏదో ఓ వివాదం లేకపోతే నరేంద్ర మోదీకి, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వానికి నిద్రపట్టదు. రాజ్యసభలో వందే మాతరం, జై హింద్‌ లాంటి నినాదాలు చేయకూడదని రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇది బులెటెనే అయినప్పటికీ అది ఉత్తర్వుతో సమానమే. ఈ ఉత్తర్వులు జారీ చేసింది రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరించ బోతున్న చంద్రాపురం పొన్ను సామి రాధా కృష్ణన్‌ కాదు. కానీ ఆయన అధ్యక్షత వహించే రాజ్యసభ సచివాలయం ఆయనకు తెలియకుండా ఇలాంటి ఆదేశం జారీ […] The post అపశబ్దాలైపోయిన వందే మాతరం, జై హింద్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:34 pm

కార్మిక వర్గ సైద్ధాంతిక మహోపాధ్యాయుడు ఏంగెల్స్‌

ఎంసీ వెంకటేశ్వర్లు భూస్వామిక పెట్టుబడి దారీ వర్గాల దోపిడీకి గురై దుర్భర జీవితాలు అనుభవిస్తున్న నిరుపేదలు, రైతన్నలు, శ్రామిక వర్గాల విముక్తికి ‘‘మార్క్సిజం’’ సిద్ధాంత ఆయుధాన్ని అందించిన మహోపా ధ్యాయులు మార్క్స్‌ఏంగెల్స్‌. వారిద్దరి సాన్నిహిత్యం నాలుగు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. స్నేహితులుగా, విప్లవకారులుగా, మార్క్సిస్టు ఆలోచనఆచరణకు నిబద్ధులై వారు చేసిన కృషి ప్రపంచ మానవాళి విముక్తికి మార్గదర్శకంగా నిలిచింది. అందువలన వారిద్దరిని వేరుచేసి చూడటం సాధ్యంకాదు. ఏంగెల్స్‌ ప్రష్యా (నేటి జర్మనీ)లోని బర్మన్‌ నగరంలో 1820 నవంబరు […] The post కార్మిక వర్గ సైద్ధాంతిక మహోపాధ్యాయుడు ఏంగెల్స్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:33 pm

అమరావతి నిర్మాణం ఓ యజ్ఞం: నిర్మలా సీతారామన్

పూర్వోదయ పథకంలో రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళికలపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. పూర్వోదయ పథకం కింద 9 జిల్లాల అభివృద్ధికి సహకరిస్తామని ఆమె స్పష్టం చేశారు. రాజధానిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర ఆర్ధిక మంత్రి 9 జిల్లాల్లోని ఉద్యాన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల మార్కెట్ లకు తరలించేందుకు వీలుగా బ్యాంకులు సహకరించాలని ఆదేశించారు. కేవలం కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలకే పరిమితం కావొద్దని జాతీయ బ్యాంకులకు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, కోల్ చెయిన్ లాంటి పరిశ్రమలకూ చేయూత ఇవ్వడం ద్వారా రైతులకు సహకరించాలని అన్నారు. మహారాష్ట్ర నుంచి అరటి, తమిళనాడు నుంచి కొబ్బరి లాంటి ఉత్పత్తులు ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు రైళ్లలో తరలిస్తున్నారని, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పండే ఉద్యాన పంట ఉత్పత్తుల విషయంలోనూ ఇదే తరహాలో రైతులకు సహకారం అందించాలని స్పష్టం చేశారు. దేశానికి పౌష్టికాహారం అందించే రైతులకు దానికి మించి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలని జాతీయ బ్యాంకుల చైర్మన్లు, ఎండీలకు సూచించారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడం బ్యాంకుల బాధ్యత అని పేర్కొన్నారు. పూర్వోదయ స్కీమ్ కింద రాయలసీమ జిల్లాలు ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏపీ ప్రణాళికలు రూపొందించింది. ఈ పథకంలో భాగంగా అభివృద్ధి రూ.39 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆర్ధిక భరోసాగా బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఓ యజ్ఞమని నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధాని పనుల రీస్టార్ట్ సంతోషదాయకమని వ్యాఖ్యానించారు. నిర్మాణ పనులకు ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారని.. ఇంత పెద్ద నగరానికి ఆర్ధికంగా భరోసాగా ఉండాలన్న నిర్ణయంతోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు అవుతున్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాజధానిలో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రధాని మోదీ వద్ద ఎప్పుడు ప్రస్తావించినా వాటిని తక్షణం ఆమోదిస్తారని, విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోన్న రాష్ట్రానికి పూర్తిగా సహకరించాలని చెప్పారని అన్నారు. క్వాంటం వ్యాలీతో పాటు రాష్ట్రంలో ఏఐ ప్రాజెక్టుల కోసం జిల్లాల్లో ఏఐ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఐటీతో పాటు ఆస్ట్రో ఫిజిక్స్ లాంటి వాటిపై కూడా కేంద్రం ఆలోచన చేస్తోందని అన్నారు. భవిష్యత్ రాజధాని అమరావతి నగరంలో ఆత్యాధునిక ప్లానెటోరియం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవటం సంతోషదాయకమని వ్యాఖ్యానించారు. ఏడాదిన్నరలోగా ఈ ప్లానెటోరియం నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఏపీ ప్రజలెప్పుడూ సైన్సులో నిపుణులని, గతంలో బెనారస్ యూనివర్సిటీలో సైన్సు విభాగంలో వారిదే అగ్రస్థానం అని వ్యాఖ్యానించారు. ఆచార్య నాగార్జునుడి సైన్సు సూత్రాలను టిబెట్ లో కూడా చెప్పుకుంటారని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం ఐటీతో పాటు ఆస్ట్రో ఫిజిక్స్ గురించి కూడా కేంద్రం ఆలోచిస్తోందని తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి రంగంలో కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుందని దీనిలో ఏపీ కూడా పనిచేయాలని కేంద్ర మంత్రి కోరారు.

మన తెలంగాణ 28 Nov 2025 7:32 pm

చైనాకు భారత ఎగుమతులు పెరిగాయా!

ఎం కోటేశ్వరరావుచైనాకు ఏడు నెలల్లో 25శాతం పెరిగిన భారత ఎగుమతులు. మీడియాలో కొద్ది రోజుల క్రితం వచ్చిన శీర్షిక ఇది. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు వరుసగా ఏడు నెలల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. మంచిదే, మన ఎగుమతులు ఏమాత్రం పెరిగినా సంతోషించాల్సిందే. అయితే అసలు కథేమిటంటే నరేంద్రమోదీకి భజన చేసేందుకు అలవాటుపడిన వారు చేసిన జిమ్మిక్కు ఇది. నిజంగా జరిగిందేమిటి ? గతేడాదితో పోలిస్తే ఎగుమతులు పెరిగిన మాట నిజం. ఇదే సమయంలో చైనా నుంచి […] The post చైనాకు భారత ఎగుమతులు పెరిగాయా! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:30 pm

PEDANA MLA  :   రైతే రాజు.. అదే సర్యారు లక్ష్యం

PEDANA MLA : రైతే రాజు.. అదే సర్యారు లక్ష్యం ( ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:27 pm

17th Battalion |తల్లి మృతిని తట్టుకోలేక..

17th Battalion | తల్లి మృతిని తట్టుకోలేక.. 17th Battalion | సిరిసిల్ల,

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:27 pm

UPSC |యుపిఎస్సి పరీక్షలకు హైటెక్‌ సెక్యూరిటీ..

ఆంధ్రప్రభ, విజయవాడ : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) లో ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:23 pm

Accident |తృటిలో తప్పిన ప్రమాదం

Accident | తృటిలో తప్పిన ప్రమాదం Accident | వేల్పూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:17 pm

Vamsadhara |వంశధార య‌మ స్పీడ్…

Vamsadhara| వంశధార య‌మ స్పీడ్… శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : వ్యవసాయ రంగానికి

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:16 pm

Nomination |ఒక అవ‌కాశం ఇవ్వండి…

Nomination | ఒక అవ‌కాశం ఇవ్వండి… Nomination | ఎడపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:11 pm

Mahabubabad |గన్నీ సంచులు రావు… ధాన్యం విక్రయాలు జరగవు

Mahabubabad | గన్నీ సంచులు రావు… ధాన్యం విక్రయాలు జరగవు — భార్ధాన్

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:02 pm

ఈమె మరో రాములమ్మ…

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో.. ఓ రాములమ్మ కథ తెరమీదకు వచ్చింది.

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:56 pm

Breaking : కోకాపేట్ భూములు మళ్లీ రికార్డు బ్రేక్

హైదరాబాద్ లోని కోకాపేట భూములు మరోసారి రికార్డు ధరలకు అమ్ముడుపోయాయి

తెలుగు పోస్ట్ 28 Nov 2025 6:55 pm

విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులేమయ్యాయి..?: హరీష్‌రావు

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు అని డబ్బా కొట్టుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టాలని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఇక నుంచి తానే సమీక్షలు చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలేమయ్యాయి..విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులేమయ్యాయి..? అని ప్రశ్నించారు. బడి పిల్లలకు పురుగుల అన్నం పెట్టిన ఘటనపై శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండేళ్లలో సిఎం వద్దనే ఉన్న విద్యాశాఖపై ఎన్ని సార్లు సమీక్షలు చేసారు.. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడుతున్న ఎంత మందిని జైలుకు పంపారు..? అని నిలదీశారు. సిఎం మాటలకు విలువ లేదు, ఆచరణకు దిక్కులేదని విమర్శించారు. బడిలో చదువుకోవాల్సిన విద్యార్థులు.. పురుగులన్నం మాకొద్దు అని రోడ్లెక్కి నిలదీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు.. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చేస్తున్నట్లు..? అని ప్రశ్నించారు. చిల్లర మాటలు.. చీప్ పాలిటిక్స్..స్కీంలు లేవుగానీ.. ఎందులో చూసినా స్కాంలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందిన కాడికి దండుకునే ప్లాన్లు.. వాటాలు, కమీషన్ల కోసం మీటింగులు..ఇదే కదా 23 నెలలుగా రేవంత్‌రెడ్డి చేస్తున్నది అని పేర్కొన్నారు. బడి పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండి ఏం లాభం..? అని అడిగారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పురుగులన్నం పెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హరీష్‌రావు బిఆర్‌ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 28 Nov 2025 6:44 pm

పంచాయతీ ఎన్నికలు.. సిఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికలతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి.. పార్టీ లీడర్లు, కార్యకర్తలను కలిసేందుకు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ ౧వ తేదీ నుంచి జిల్లా పట్టణాల్లో సిఎం రేవంత్ పర్యటించనున్నట్లు సమాచారం. కాగా, ఈసారి రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకుంటున్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 6:41 pm

260 students |ఆరోగ్య పరీక్షలు, మందులు పంపిణీ

260 students | ఆరోగ్య పరీక్షలు, మందులు పంపిణీ 260 students |

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:26 pm

Andhra Pradesh : అమరావతికి మరో 16 వేల భూమి సమీకరణ

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 6:20 pm

Minister |కస్తూరి వాసు మృతి.. నివాళులు..

Minister | కస్తూరి వాసు మృతి.. నివాళులు.. Minister | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:20 pm

MLA |నూతన కమిటీ ఎన్నిక

MLA | నూతన కమిటీ ఎన్నిక MLA | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:10 pm

Keerthy Suresh gets a Shock

National-award-winning actress Keerthy Suresh has been struggling to deliver a decent hit. The actress hasn’t signed any noted Telugu film but her other languages films are being dubbed and released here. She had big hopes on Revolver Rita, a crime comedy having Keerthy Suresh in the lead role. The film released today and the film […] The post Keerthy Suresh gets a Shock appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 6:09 pm

800 MW | 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్

800 MW | 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్ 800

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:05 pm

Telangana : తాగి ఊగండి.. ఓటేయండి.. రికార్డు బ్రేక్ చేయనున్న మద్యం అమ్మకాలు

స్థానిక ఎన్నికలతో తెలంగాణ మద్యం విక్రయాలు రికార్డు బ్రేక్ చేయనున్నాయి

తెలుగు పోస్ట్ 28 Nov 2025 6:04 pm

Regonda |నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

Regonda | నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ Regonda | రేగొండ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:01 pm

Initiation |జీతం కోసం పారిశుధ్య కార్మికురాలి మౌన దీక్ష

Initiation | జీతం కోసం పారిశుధ్య కార్మికురాలి మౌన దీక్ష Initiation |

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:01 pm

ZONE |గణపేశ్వరం వంతెన ప్రారంభం

ZONE | గణపేశ్వరం వంతెన ప్రారంభం ZONE | నాగాయలంక, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:59 pm

development |యువతరానికి అవకాశం కల్పించండి

development | యువతరానికి అవకాశం కల్పించండి development | ఎడపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:56 pm

Karimabad |విద్య వైజ్ఞానిక ప్రదర్శనశాలను సందర్శించిన కలెక్టర్

Karimabad | విద్య వైజ్ఞానిక ప్రదర్శనశాలను సందర్శించిన కలెక్టర్ ప్రతి ఎగ్జిబిట్ మోడల్

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:51 pm

Mudhol |బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి

Mudhol | బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి Mudhol |

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:51 pm

Why is Sai Pallavi not signing Telugu Films?

Talented actress Sai Pallavi has done Naga Chaitanya’s Thandel that released early this year. The actress is busy with her Bollywood commitment Ramayana and she has allocated bulk dates for the mythological attempt. Sai Pallavi hasn’t signed any Telugu film this year. Though the actress was considered for several films and approached, the actress is […] The post Why is Sai Pallavi not signing Telugu Films? appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 5:42 pm

Delhi : ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్ బద్దలు.. దేశంలో దొరికిపోయిన ప్లెడ్లర్లు.. యాభై మంది నైజీరియన్ ల అరెస్ట్

తెలంగాణా ఈగల్‌ ఫోర్స్‌ ఢిల్లీ డ్రగ్స్ రాకెట్ ను బద్దలు కొట్టింది

తెలుగు పోస్ట్ 28 Nov 2025 5:37 pm

అవినీతికి నిలయంగా ఆస్పరి తహసీల్దార్ కార్యాలయం..

–దళారుల వ్యవస్థతో కోట్ల దందా–రీసర్వే డిటి భీమేష్ కు ప్రత్యక్ష పాత్ర–ఆధారాలతో కలెక్టర్ కు ఫిర్యాదు : సీపీఐ విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆస్పరి మండల తహసీల్దార్ కార్యాలయం అవినీతి అక్రమాలకు కేంద్రబిందువుగా మారిందని, తహసీల్దార్ రామేశ్వర్ రెడ్డి నేతృత్వంలో దళారుల వ్యవస్థ ద్వారా కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ […] The post అవినీతికి నిలయంగా ఆస్పరి తహసీల్దార్ కార్యాలయం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 5:30 pm

డబ్ల్యూపీఎల్ వేలంలో శిఖా పాండే భారీ ధర

డబ్ల్యూపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని విధంగా శిఖా పాండే భారీ ధర పలికింది. దీప్తి శర్మ తర్వాత అత్యధిక ప్రైజ్‌ పట్టేసిన భారత క్రికెటర్ ఆమెనే. ఈ …

జనం సాక్షి 28 Nov 2025 5:28 pm

surveillance |ఎన్నికల నియమావళి అమలు చేయాలి

surveillance | ఎన్నికల నియమావళి అమలు చేయాలి surveillance | వర్ని, ఆంధ్ర

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:27 pm

Mrunal Thakur calls Dhanush’s journey Beautiful

Tamil actor Dhanush and Bollywood beauty Mrunal Thakur are close friends. During a film event this year, they have been spotted exchanging smiles and their conversation triggered dating rumors. Dhanush’s recent reply for Mrunal Thakur’s post added fuel to the speculations but they never responded. Dhanush’s recent Hindi film Tere Ishq Mein released today across […] The post Mrunal Thakur calls Dhanush’s journey Beautiful appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 5:25 pm