మన తెలంగాణ/హైదరాబాద్ :మొంథా తుఫాన్ దాటికి నష్టపోయిన పంటల వివరాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మొంథా తుఫాన్ కారణంగా రా ష్ట్రంలో 1,17,757 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నివేదికను సమర్పించిందన్నారు. తుఫాన్ ప్రభావంతో నష్టం వాటిల్లిన జిల్లాలలో పర్యటించిన వ్యవసాయశాఖ అధికారుల బృందం, దెబ్బతిన్న పంటల వివరాలను, సర్వే చేసి నివేదికను సి ద్ధం చేసినట్టు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అత్యధికంగా వరి 83,407 ఎకరాలలో, పత్తి 30,144,మొక్కజొన్న2,097 ఎకరాలలో న ష్టం జరిగిదని, నాగర్ కర్నూల్ జిల్లాల్లో న ష్టం జరిగినట్లు వ్యవసాయ నివేదికలో పేర్కొన్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 33 శా తంకి పైగా పంట నష్టం జరిగిన వివరాలు సేకరించామని, 27 జిల్లాల్లోని 1,22,142 మంది రైతులకు చెందిన 1,17,757 ఎకరా ల్లో నష్టం వాటిల్లిందని మంత్రి చెప్పారు. కేం ద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్డిఆర్ఎఫ్ కింద ఇసుక మేటలకు ఎకరానికి రూ 7,285, నీటిపారుదల కింద సాగైన పంటలకు ఎకరానికి రూ.6,880, వర్షాధార పంటలకు ఎకరానికి రూ. 3,440,- తోటలకు ఎకరానికి రూ. 9,106- చొప్పున మొత్తం 70 కోట్ల నిధులు రాష్ట్రానికి నిధులు రావల్సి ఉందని మంత్రి చెప్పారు. గతంలో వరదలు సంభవించినప్పుడు కేంద్రం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందలేదని, ఈ పంట నష్టం వివరాలు కేంద్రానికి పంపి ఎన్డిఆర్ఎఫ్లో కేంద్రాన్ని నిధులు అడుగుతామని మంత్రి తెలిపారు. ఇప్పటికే మొంథా తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపించాలని కోరామన్నారు. త్వరలోనే పంటనష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి పదివేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాల వారీగా పంట నష్టం వివరాలు మొంథా తుఫాన్ దాటికి జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ పంటం నష్టం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్లో 23,508.6 ఎకరాల్లో పంట నష్టం కాగా, తరువాత వరుసగా వరంగల్లో 19,736.22, కరీంనగర్లో 11,473.32, హన్మకొండలో 11,310.10, జనగాంలో 8,457.04, మహబూబాబాద్లో 8, 318.07, సూర్యాపేటలో 7,476, సిద్దిపేటలో 5,277, నల్గొండలో 5,259.20, సంగారెడ్డిలో4,858.01, ఖమ్మంలో 3,901.34, వనపర్తిలో 1,884.01, మెదక్లో 1,634.19, జగిత్యాలలో 1,157.16, మంచిర్యాలలో 570.15, వికారాబాద్లో 523.35, జయశంకర్ భూపాలపల్లిలో 481.25, మహబూబ్నగర్లో463.36, యాదాద్రి భువనగిరిలో 421.04, రంగారెడ్డిలో 316.19, నిర్మల్లో 252.23, నిజామాబాద్లో 250.14, ఆదిలాబాద్లో 62.38, రాజన్న సిరిసిల్లలో 55.03, కుమురం భీం ఆసిఫాబాద్లో 13.28, జోగులాంబ గద్వాల్లో 12.16, మేడ్చల్ మల్కాజ్గిరిలో 7.30 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వ్యవసాయ శాఖ వెల్లడించింది.
మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల్ల లబ్ధిదారులకు బిల్లుల రూపేణా ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేసినట్టు హౌసిం గ్ కార్పొరేషన్ ఎండి వి.పి.గౌతం తెలిపారు. ఇళ్ల నిర్మాణపు పనుల దశలను బట్టి విడుదల చేయాల్సిన బిల్లు మొత్తాలను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆ ప్రక్రియలో భాగంగా నవంబర్ 11 వ తేదీ నాటికి పురోగతి సాధించిన మేరకు 18,247 మంది లబ్ధిదారులకు బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వారం లబ్ధిదారులకు చేసిన చెల్లింపుల్లో బేస్మెం ట్ లెవల్ నిర్మాణాలు 4,615, రూఫ్ లెవల్ (గోడలుపూర్తి) అయిన 8,517, శ్లాబ్ వేసిన 5,115 ఇళ్ల్లు ఉన్నాయని ఆయన వివరించారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇంతవరకు మొత్తం రూ.2900.35 కోట్లను చెల్లించినట్టు ఆయన తెలిపారు. వీటిలో బేస్ మెంట్ లెవల్ (బిఎల్) దా టిన ఇళ్లకు రూ.1610.79 కోట్లు, రూఫ్ లెవల్ (ఆర్ ఎల్) - రూ.716.91 కోట్లు, రూఫ్ క్యాస్టెడ్ (శ్లాబ్ పూర్తి -ఆర్సి)- అయిన ఇళ్లకు రూ.572.65 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 2,33,069 ఇళ్ల పనులు ప్రారంభం కాగా, వాటిలో బేస్మెంట్ (బిఎల్) స్థాయిలో 90,613, గోడల నిర్మాణం పూర్తయినవి (ఆర్ఎల్) 41,212 ఇళ్లు శ్లాబ్ పూర్తి (ఆర్సి) అయినవి 37,400 ఇళ్లు ఉన్నాయని మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు.
మన తెలంగాణ/హైదరాబాద్: జీఎస్టీరేట్ల త గ్గింపుతో వస్తువుల ధరలు తగ్గినా తెలంగాణలో పన్ను వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. తాజా ని వేదిక ప్రకారం దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ అంచనాలను మించి 10 శాతం వృ ద్ధిని నమోదు చేసింది. ఈ సానుకూల వృద్ధి కేం ద్ర బడ్జెట్ అంచనాలను మించే అవకాశం ఉం దని నిపుణులు భావిస్తున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వస్తువుల ధరలు తగ్గినా తెలంగాణలో ప న్ను వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. తాజా ని వేదిక ప్రకారం దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ అంచనాలను మించి 10 శాతం వృ ద్ధిని నమోదు చేసింది. ఈ సానుకూల వృద్ధి కేం ద్ర బడ్జెట్ అంచనాలను మించే అవకాశం ఉం దని నిపుణులు భావిస్తున్నారు. సవరించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల కారణంగా వస్తువుల ధరలు దిగివచ్చాయి. కొన్ని వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించగా మరికొన్నింటి శ్లాబులు తగ్గించారు. అయితే దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు తగ్గుతాయని.. నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనాలు వేశారు. అయితే జీఎస్టీ పన్ను రేట్లు తగ్గినా వ సూళ్లు మాత్రం తగ్గట్లేదు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ వల్ల లబ్ధి పొందిన అతిపెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. తాజా ‘ఎకోరాప్’ నివేదిక ప్రకారం జీఎస్టీ వసూళ్లలో అనూహ్య వృద్ధిని నమోదు చేసి దేశంలోనే రెండో స్థానం దక్కించుకుంది. జీఎస్టీ రేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆ దాయంలో 7 శాతం నష్టాన్ని అంచనా వేసిన తెలంగాణ రాష్ట్రం దానికి భిన్నంగా 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2025 అక్టోబర్ నెలలో తెలంగాణ జీఎస్టీ ద్వారా రూ.5,726 కోట్లు వ సూలు చేసింది. ఇది అంతకుముందు సంవత్స రం (2024 అక్టోబర్) వసూలు చేసిన రూ.5, 211 కోట్లతో పోలిస్తే 10శాతం అధికం. రాష్ట్రం అంచనా వేసిన నెలవారీ రూ.583 కోట్ల నష్టానికి బదులు.. ఏకంగా రూ.783 కోట్ల లాభాన్ని న మోదు చేసింది. ఎకోరాప్ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 8-9 శాతం వార్షిక జీఎస్టీ వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో కర్ణాటక 10 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలవగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా తెలంగాణకు సమానంగా 8-9 శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా. కర్ణాటక రాష్ట్రం నెలవారీ రూ.7,083 కోట్ల నష్టాన్ని అంచనా వేసినా అది కూడా 10శాతం వృద్ధిని చూసింది. పంజాబ్ 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్లో స్వల్పంగా 1 శాతం క్షీణత కనిపించగా కేరళలో జీఎస్టీ ఆదాయం 2 శాతం తగ్గింది. బడ్జెట్ అంచనాలను మించే అవకాశం : జీఎస్టీ కౌన్సిల్ డేటా ప్రకారం ధరల సవరణల తర్వాత చాలా రాష్ట్రాలు సానుకూల వృద్ధిని కనబరిచాయి. దేశీయ జీఎస్టీ వసూళ్ల అంచనాల ఆధారంగా చూస్తే రాష్ట్రాలు అక్టోబర్ 2025లో చూపిన వృద్ధిని ఇలాగే కొనసాగిస్తే 2025 -26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం జీఎస్టీ ఆదాయాలు కేంద్ర బడ్జెట్లో అంచనా వేసిన ప్రొజెక్షన్లను మించిపోయే అవకాశం ఉందని ఎకోరాప్ నివేదిక పేర్కొంది. గతంలో 2018 జూలై, 2019 అక్టోబర్ నెలల్లో జీఎస్టి రేట్ల మార్పుల తర్వాత కూడా స్వల్ప సర్దుబాటు దశ అనంతరం ఆదాయాలు నెలవారీ 5-6 శాతం వృద్ధి చెందాయని నివేదిక గుర్తు చేసింది. ప్రస్తుత రేట్ల తగ్గింపు వల్ల స్వల్పకాలంలో 3-4 శాతం క్షీణత ఉన్నప్పటికీ మొత్తం జీఎస్టీ పన్ను పరిధిని బలోపేతం చేసిందని, భవిష్యత్తులో స్థిరమైన వృద్ధికి ఇది మార్గం సుగమం చేస్తుందని నివేదిక వెల్లడించింది. రూ.1.22 లక్షల కోట్లు దాటిన ఆదాయం రాష్ట్ర ఆదాయం గత ఏడాది కన్నా ఈ ఏడాది పెరిగింది. కొత్త రుణాలతోపాటు పన్నుల ఆదాయం అధికంగా ఉండటంతో రాష్ట్ర ఆదాయ, వ్యయాల్లో గణనీయంగా వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025- 26) తొలి అర్ధభాగం (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు) రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.1.22 లక్షల కోట్లు దాటగా వ్యయం రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్నట్లు కాగ్ తాజా ఆడిట్ నివేదిక వెల్లడించింది. గత ఏడాది(2024- 25) ఇదే అర్ధ సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రూ.14 వేల కోట్ల ఆదాయం అధికంగా ఉంది. పన్నుల ద్వారా ఈ ఏడాది మొత్తం కలిపి రూ.1.75 లక్షల కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలని బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అర్ధ సంవత్సరం ముగిసేనాటికి అందులో 40.97 శాతం (రూ.71,836 కోట్లు) మాత్రమే సాధించింది. గత ఏడాది తొలి అర్ధభాగంతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో పన్నులపై ఆదాయం అదనంగా రూ.2,913 కోట్లు మాత్రమే పెరిగింది. కానీ కొత్త రుణాలు రూ.12,626 కోట్లు అదనంగా సేకరించడంతో మొత్తం ఆదాయం రూ.1.22 లక్షల కోట్లు దాటినట్లు కాగ్ వివరించింది. కొత్త రుణాల సేకరణ భారీగా పెరగడంతో అదే నిష్పత్తిలో వ్యయం కూడా రూ.1.01 లక్షల కోట్ల నుంచి రూ.1.11 లక్షల కోట్లకు చేరింది. సంక్షేమ పథకాలు, రాయితీలతోపాటు ఉద్యోగుల జీతభత్యాలు, రిటైరైన వారికి పింఛన్లు, పాత బాకీలపై వడ్డీలు, అసలు కిస్తీల చెల్లింపులకే భారీగా వ్యయం అవుతున్నట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే మూలధన వ్యయం భారీగా పెరగడం అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వెల్లడిస్తోంది. బడ్జెట్ లక్ష్యాల మేరకు పన్నుల ఆదాయం భారీగా పెరగకపోగా కనీసం తొలి అర్ధభాగంలో సగమైనా రాకపోవడంతో ఆర్థిక ద్రవ్యలోటు రూ.45,139 కోట్లకు విస్తరించింది. దీన్ని పూడ్చుకునేందుకు అంతమేర కొత్త రుణాలను సేకరించినట్లు తేలింది. ఇక ఈ ఏడాది ఆదాయ, వ్యయాల అనంతరం రెవెన్యూ మిగులు రూ.2,738 కోట్లకుపైగా ఉండవచ్చని బడ్జెట్లో అంచనావేస్తే తలకిందులై తొలి ఆరు నెలల్లోనే రూ.12,452 కోట్ల లోటు ఏర్పడింది. ఈ లోటు మైనస్ 454 శాతం అని కాగ్ స్పష్టం చేసింది.
భారత్పై సుంకాలు తగ్గిస్తాం:ట్రంప్
న్యూయార్క్ / వాషింగ్టన్ : భారత్పై విధించిన సుంకాలను ఏదో ఒక సమయంలో తగ్గించాలని అమెరికా యో చిస్తోందని, భారత్తో తా ము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గర గా ఉన్నామని అమెరికా అ ధ్యక్షుడు ట్రంప్ వెల్లడించా రు. భారత్తో జరుగుతున్న వాణిజ్య చర్చల గురించి విలేకరులు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. గతంలో చేసుకున్న ఒప్పందానికి భి న్నంగా ఇప్పుడు ఒప్పందం ఉంటుందని పేర్కొన్నా రు. భారత్కు అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ వైట్హౌస్లో ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ భారత్పై సుంకాల గురించి ప్రస్తావించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్కు సన్నిహితంగా చర్చలు జరిగేలా చూడాలని సెర్గియోకు ట్రంప్ సూచించారు.
బుధవారం రాశి ఫలాలు (12-11-2025)
మేషం : బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్త నడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృషభం : నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతుల పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. మిధునం : ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల సలహాలు కలసి వస్తాయి. వ్యాపారాలు అనుకులిస్తాయి. కర్కాటకం : స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు కలసి రావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం. సింహం : వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విబేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కన్య : స్థిరస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తుల : కుటుంబసభ్యులతో కొన్ని వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృశ్చికం : మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ధనస్సు : కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహమున కొందరి ప్రవర్తన శిరోభాధలు కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. మకరం : ఆత్మీయుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. కుంభం : వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీనం : ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 12-11-2025
స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతి
మండలంలోని కరిసెలబోడు గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కరిశలబోడు తండాకు చెందిన భూక్యా గోపి, అఖిల దంపతులకు కవల పిల్లలు లక్ష, దర్షిత్లు ఉన్నారు. దర్షిత్ (2) రోడ్డుపై ఆడుకుంటున్న క్రమంలో జూలూరుపాడుకు చెందిన సాయి ఎక్స్లెంట్ ప్రైవేట్ స్కూల్ బస్సు పిల్లలను తీసుకెళ్లేందుకు గ్రామంలోనికి వచ్చింది. దర్షిత్ ఇంటి ముందు పిల్లలను ఎక్కించుకున్ను బస్సు డ్రైవర్ రోడ్డుపై ఆడుతున్న దర్షిత్ను గమనించకపోవడంతో బస్సు ఢీకొని దర్షిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి తండ్రి గోపి ఫిర్యాదు మేరకు బస్ డ్రైవర్ ఆరెం వంశీకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై శివరామకృష్ణ మాట్లాడుతూ... అన్ని స్కూల్ యాజమాన్యాలు, డ్రైవర్లు పిల్లలను తీసుకెళ్లే సమయంలో అత్యంత జాగ్రత్త పాటించాలని, భద్రత నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్..
ములుగు, (ఆంధ్రప్రభ) : ములుగు పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్సై విజయ్కుమార్, కానిస్టేబుల్
Prabhas wraps up The Raja Saab on a big day
Pan-India superstar Prabhas has his platter full with a bunch of projects. The Raja Saab, a horror comedy, will be his immediate next release and the shooting formalities are on the verge of completion. The makers have already announced that the film will hit the screens on January 9th. Director Maruthi surprised Prabhas fans with […] The post Prabhas wraps up The Raja Saab on a big day appeared first on Telugu360 .
బంగ్లాదేశ్తో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఐర్లాండ్ టీమ్ మొదటి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్తో పాటు వన్డౌన్లో వచ్చిన కేడ్ కర్మిఛెల్లు అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ధాటిగా ఆడిన స్టిర్లింగ్ 9 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన కేడ్ 129 బంతుల్లో ఏడు బౌండరీలతో 59 పరుగులు సాధించాడు. కుర్టిస్ కాంఫెర్ (44), వికెట్ కీపర్ లొర్కాన్ టక్కర్ (41), జోర్డాన్ నీల్ (30) పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి మెక్కార్తీ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మీరాజ్ మూడు, హసన్ మురాద్ రెండే వికెట్లను పడగొట్టారు.
టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదగడం ఖాయం.. ధ్రువ్ జురెల్ పై ప్రశంసలు
కోల్కతా: యువ ఆటగాడు ధ్రువ్ జురెల్పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల సౌతాఫ్రికాఎతో జరిగిన అనధికార టెస్ట్ సిరీస్లో ధ్రువ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడం తనను ఎంతో ఆనందానికి గురి చేసిందన్నాడు. రానున్న రోజుల్లో ధ్రువ్ జురెల్ టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదగడం ఖాయమన్నాడు. అతని బ్యాటింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు అండగా నిలిచే సత్తా అతనికుందన్నాడు. రానున్న రోజుల్లో అతను టీమిండియా కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఎదగడం ఖాయమని గంగూలీ జోస్యం చెప్పాడు.
పేలుడు బాధితులకు ఢిల్లీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా
ఎర్రకోట సమీపంలో పేలుడు మృతుల కుటుంబాలకు ఢిల్లీ సిఎం రేఖాగుప్తా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారంగా అందజేయనున్నట్లు మంగళవారంనాడు ఒక ప్రకటనలో ఆమె వెల్లడించారు. శాశ్వత అంగవైకల్యానికి గురైనా వారికి రూ.5లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.2లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. స్వల్ప గాయాలతో బయటపడిన వారికి రూ.20వేలు అందజేస్తామని సిఎం వివరించారు. ఈ మేరకు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
పుల్వామాకు చెందిన వైద్యుడు ఉమర్ నబీ కీలకపాత్ర! ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి కారులో వచ్చి మారణాకాండ ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాలు సిసిటివి ఫుటేజీల ఆధారంగా పోలీసుల ప్రాథమిక నిర్ధారణ డిఎన్ఎ పరీక్ష కోసం ఉమర్ కుటుంబీల శాంపిళ్ల సేకరణ ఢిల్లీ కేసు ఎన్ఐఎకు అప్పగింత, ఉపా చట్టం కింద కేసు నమోదు న్యూఢిల్లీ/శ్రీనగర్ : ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. సిసిటివి ఫుటేజీల ఆధారంగా పేలుడుకు ఉపయోగించిన హ్యుందయ్ కారు నడిపిన జమ్మూ కశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీని కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు రోజు హర్యానాలోని ఫరీదాబాద్లో పట్టుబడ్డ 8మందితో కూడిన ఉగ్రవాద నెట్వర్క్తో ఉమర్కు సంబంధాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 2900 కేజీల పేలుడు పదార్ధాలతో పాటు భారీ ఎత్తున ఆయుధాలను ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్న గంటల వ్యవధిలో ఢిల్లీలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పేలుడుకు ఉపయోగించిన కారు కూడా ఫరీదాబాద్ నుంచే ఢిల్లీకి రావడం మరింత బలం చేకూరుస్తోంది. ఢిల్లీలో పేలుడుకు ఉపయోగించిన హెచ్ఆర్ 26సిఇ 7674 నెంబర్ కలిగిన హ్యుండయ్ ఐ20 కారును సోమవారం ఉమర్ నబీ ఒక్కడే నడిపినట్లు, ఎర్రకోటలోని పార్కింగ్ ఏరియాకు మధ్యాహ్నం 3.19 గంటలకు వచ్చినట్టు గుర్తించారు. పేలుడు జరిగింది సాయంత్రం 6.52గంటలకు అంటే సుమారు 3గంటలకుపైగా ఉమర్ మాస్క్ ధరించి కారులోనే ఉన్నట్లు సిసిటివి ఫుటేజీలను బట్టి అర్థమవుతోంది. అయితే రద్దీ సమయంలో పేలుడుకు పాల్పడేందుకు అంతసేపు వేచిచూశాడా, లేకపోతే ఎవరి నుంచైనా ఆదేశాల కోసం ఎదురుచూశాడా అన్న కోణంలోనూ విచారణ సాగిస్తున్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఎర్రకోటతో పాటు దాని చుట్టుపక్కల సిసిటివి ఫుటేజీలను కూడా విశ్లేషిస్తున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. ఆ 11 గంటల ప్రయాణం... పోలీసులు విచారణ క్రమంలో బదర్పూర్ అనే టోల్ప్లాజా వద్ద ఉమర్ నబీ ఫీజు చెల్లించడాన్ని సిసిటివి ఫుటేజీ ద్వారా గుర్తించారు. కారు హర్యానాలో ఫరీదాబాద్ నుంచి సోమవారంనాడు తెల్లవారుజామునే ప్రయాణం మొదలు పెట్టినట్లు అంచనాకు వచ్చారు. తొలుత ఫరీదాబాద్లోని ఏషియన్ ఆస్పత్రి వెలుపల ఉదయం 7.30గ.లకు కారు కనిపించింది. బదర్పూర్ టోల్ప్లాజాను సుమారు 8.13గంటలకు, ఒక్లాహా పారిశ్రామిక వాడకు సమీపంలోని పెట్రోల్ పంప్ను 8.20గంటలకు దాటింది. ఢిల్లీహర్యానా సరిహద్దుల్లో ఈ ప్రాంతాలు ఉంటాయి. మధ్యాహ్నం 3.19గంటలకు ఎర్రకోట కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పార్కింగ్ ఏరియాలోకి కారు ప్రవేశించింది. అక్కడ మూడు గంటల పాటు నిలిపివుంది. 6.22గంటలకు పార్కింగ్ ఏరియాను వీడిన కారు ఎర్రకోటకు సమీపించింది. అనంతరం 6.52గంటలకు పేలుడు సంభవించింది. పార్కింగ్ ఏరియాను వీడిన అర్ధగంట తర్వాత భారీ పేలుడును సృష్టించింది. ఇంకా ఢిల్లీ పొరుగు ప్రాంతాలు, ముఖ్యంగా ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చే రహదారులపై ఉన్న సిసిటివి ఫుటేజీలను తెప్పిస్తున్నామని, వాటన్నింటిని విశ్లేషించిన తర్వాత కారు ప్రతి కదలికను గుర్తించగలుతామని పోలీసులు వివరించారు. కాగా సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో బదర్పూర్ టోల్ప్లాజా వద్ద ఫీజు చెల్లించి ఉమర్ రిసిప్ట్ అందుకున్న దృశ్యాలు, ఆ సమయంలో నిందితుడు మాస్క్ ధరించి ఉన్నట్లు వాటిని బట్టి తెలుస్తోంది. ఇదే కారులో రెండు వారాల క్రితం ఉమర్ సహా ముగ్గురు కలిసి ప్రయాణించారని, ఒకచోట కారుకు పొల్యూషన్ చెకప్ కూడా చేయించినట్లు గుర్తించారు. ఆ మిగతా వ్యక్తులు ఎవరన్న కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు ఉపయోగించిన కారు హర్యానా నెంబర్ ప్లేట్ కలిగి ఉంది. దాని యజమాని పుల్వామాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. డిఎన్ఎ నమూనాల సేకరణ... పేలుడు ఘటనలో ఉమర్ నబీ కూడా మరణించినట్లు దాదాపు నిర్ధారించుకున్న దర్యాప్తు బృందాలు జమ్మూ కశ్మీర్లో పోలీసులను అప్రమత్తం చేశాయి. పుల్వామాలో కోయిల్ అనే గ్రామానికి హుటాహుటిన తరలివెళ్లాయి. అతని తల్లితో పాటు ఇద్దరు సోదరుల నుంచి డిఎన్ఎ పరీక్షల కోసం నమూనాలు సేకరించాయి. ఢిల్లీ పేలుడు స్థలి నుంచి సేకరించిన మృతదేహాల్లోని ఏదేని నమూనాతో వారి డిఎన్ఎ సరిపోలితే కేసు దర్యాప్తు కొలిక్కి వస్తుందని శ్రీనగర్కు చెందిన పోలీసు అధికారి వెల్లడించారు. ఇక ఉమర్ తండ్రి గులాం నబీ భట్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు వివరించారు. అదే సమయంలో కారు అమ్మకం, కొనుగోలుతో ంబంధాలున్న ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఎన్ఐఎకు అప్పగింత.. ఉపా కింద కేసులు ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ)కు అప్పగించింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు మొదలుపెట్టినట్లు సమాచారం. సాధారణంగా ఉగ్రవాద సంబంధిత కేసులను ఎన్ఐఎ విచారణ చేపడుతూ ఉంటుంది. మరోవైపు ఈ ఘటనపై ఉపా, పేలుడు పదార్థాల చట్టం కింద ఢిల్లీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కొట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు రిజిస్టర్ చేశారు. దర్యాప్తు క్రమంలో ఢిల్లీ పోలీసులు అడుగడునా జల్లెడ పడుతున్నారు. అనుమానితుల కోసం వేట ముమ్మరం చేశారు. అదే సమయంలో ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ విశ్వవిద్యాలయంపై కూడా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. వైద్య అధ్యాపకులు, వైద్యులు పలువురు ఉగ్రవాద నెట్వర్క్లో పాలుపంచుకున్నట్లు ఇటీవలి అరెస్ట్లతో తేటతెల్లం కావడం తెలిసిందే.
ఎడపల్లి, (ఆంధ్రప్రభ): ఎడపల్లి మండలం మంగళపాడు గ్రామంలో పెళ్లి వేడుకకు సిద్ధమైన కుటుంబంలో
ఎర్రకోట పేలుడు నిందితులను విడిచిపెట్టేది లేదు: అమిత్షా
న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపాంలో పేలుడు సంఘటనకు సంబంధించి దీని వెనుక ఉన్న ప్రతి నిందితుడిని విడిచిపెట్టేది లేదని, ఈ ఘోరానికి బాధ్యులైన వారిపై దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్షా వెల్లడించారు. ఢిల్లీతోపాటు దేశ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతపై మంగళవారం ఉన్నతాధికారులతో అమిత్షా రెండు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పేలుడు తరువాతి పరిస్థితులను ఉన్నతాధికారులు కేంద్రమంత్రికి ఈ సందర్భంగా వివరించారు. ఈ సంఘటనపై అత్యున్నత దర్యాప్తు సంస్థలు సమగ్ర దర్యాప్తు చేపట్టాయని పేర్కొన్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ భేటీల్లో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ తదితరులు పాల్గొన్నారు.
వదంతులు వ్యాప్తి చేయొద్దు.. ధర్మేంద్ర ఆరోగ్యంపై కూతురు
ముంబై : ప్రముఖ నటుడు 89 ఏళ్ల ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన కోలుకుంటున్నారని కుమార్తె ఈషా దేవోల్ మంగళవారం వెల్లడించారు. ముంబై బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయన మృతి చెందారంటూ మంగళవారం ఉదయం మీడియాలో వార్తలు రావడంపై ఆమె ఖండించారు. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని మీడియాకు ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా సూచించారు. ధర్మేంద్ర మంచి ఆరోగ్యంగా ఉండాలని సుదీర్ఘకాలం జీవించాలని మనమంతా ప్రార్ధిద్దామని ఆమె అభ్యర్థించారు.
భారత్పై సుంకాలు తగ్గించాలని యోచిస్తున్నాం : ట్రంప్
న్యూయార్క్/వాషింగ్టన్: భారత్పై విధించిన సుంకాలను ఏదో ఒక సమయంలో తగ్గించాలని అమెరికా యోచిస్తోందని, భారత్తో తాము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. భారత్తో జరుగుతున్న వాణిజ్య చర్చల గురించి విలేకరులు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. గతంలో చేసుకున్న ఒప్పందానికి భిన్నంగా ఇప్పుడు ఒప్పందం ఉంటుందని పేర్కొన్నారు. భారత్కు అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ వైట్హౌస్లో ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ భారత్పై సుంకాల గురించి ప్రస్తావించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్కు సన్నిహితంగా చర్చలు జరిగేలా చూడాలని సెర్గియోకు ట్రంప్ సూచించారు.
జల సంరక్షణ ప్రాజెక్టుల్లో తొలిస్థానంలో తెలంగాణ
జల సంరక్షణ ప్రాజెక్టుల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జల్ సంచయ్ జన్ భాగీదారి 1.0 కింద 5.2 లక్షల టీఎంసీల నీటి సంరక్షణ నిర్మాణాలతో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా అవతరించిందని జల్ శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. అలాగే 4.05 లక్షల టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్న ప్రాజెక్టులతో ఛత్తీస్ గఢ్ 2వ స్థానంలో, 3.64 లక్షల నీటి సామర్థ్య ప్రాజెక్టులతో రాజస్థాన్ మూడవ స్థానంలో ఉందని తెలిపారు.‘జల్ శక్తి అభియాన్ : క్యాచ్ ది రెయిన్’ ప్రచారం కింద ఈ ఏడాది అవార్డులను అందిస్తున్నట్లు పాటిల్ ప్రకటించారు. నవంబర్ 18న జరిగే 6వ జాతీయ జల అవార్డుల కార్యక్రమంలో జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావుతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారని తెలిపారు.
రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
గత పది రోజుల వరకు రాష్ట్రాన్ని తడిచి ముద్ద చేసిన వర్షాలు తగ్గాయనే లోపే చలి పంజాతో రాష్ట్రాన్ని వణికిస్తుంది. గత రెండు రోజులుగా చలి తీవ్రరూపం దాల్చడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు) కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమొదయ్యాయి. ఆదిలాబాద్లో 10.2 డిగ్రీలు, రాజన్న సిరిసిల్లలో 11.5, నిర్మల్లో 11.7, నిజామాబాద్లో 11.8, వికారాబాద్లో 12.0, సంగారెడ్డిలో 12.1, కామారెడ్డిలో 12.2, జగిత్యాలలో 12.5, మెదక్లో 12.8, సిద్దిపేటలో 13.3, రంగారెడ్డి, కరీంనగర్లో 13.4న, మంచిర్యాలలో 13.6, పెద్దపల్లిలో 13.7, మహబూబ్నగర్లో 14, నారాయణపేటలో 14.1, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లిలో 14.4, యాదాద్రి భువనగిరిలో 14.7, జనగాంలో 14.8, మేడ్చల్ మల్కాజ్గిరిలో 14.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు రాష్ట్ర డెవలెప్మెంట్ ప్రణాళికా సంఘం వెల్లడించింది.దీంతో పాటు రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉంటాయని పేర్కొంది. చలి తీవ్రత దృష్టా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
హుజూర్నగర్/మంథని (ఆంధ్రప్రభ): రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి. రేపు బుధవారం నీటిపారుదల, పౌరసరఫరాల
అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి
అటవీ భూమిని అక్రమంగా నరుకుతుంటే అడ్డుకోబోయిన అటవీ సిబ్బంది పై గిరిజనులు దాడి చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సమీపంలోని వత్తిమక్కులకుంట దగ్గర దాదాపు 15 ఎకరాల అటవీ భూమిలో కొంత మంది గిరిజనులు చెట్లను నరికారు. అటవీ భూమి నరకుతుంటే అడ్డుకోబోయిన ఫారెస్ట్ అధికారి జయరాంను వెంటబడి దాడి చేశారని ఫారెస్ట్ అధికారి తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దాడి చేసిన గిరిజనులను అదుపులోకి తీసుకొని ఫారెస్ట్ కార్యాలయానికి తరిలించారు.కొంతమంది పరారైనట్లు ఫారెస్ట్ రేంజర్ ఈశ్వర్ తెలిపారు. అటవీ భూములను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని, అక్రమంగా అడవిని నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికారిపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గిరిజన మహిళలు తమపై దాడి చేసారని ఆరోపించారు. అటవీ అధికారులపై దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని నాగర్కర్నూల్ జిల్లా అటవీ అధికారుల సంఘం అధ్యక్షులు రవి కుమార్, ముజీబ్ ఘోరి, తేజశ్రీ, రాంబాబు, వల్య, హన్మంతు డిమాండ్ చేశారు.
రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్దీప్ సింగ్#TeluguPost #telugu #post #news
హైదరాబాద్లో అడ్వాన్స్ రోబోటిక్స్ ఇన్ రిహాబ్ అండ్ రికవరీ’ సదస్సు
హైదరాబాద్లో జరిగిన ఒక శాస్త్రీయ సమావేశంలో 50 మందికి పైగా ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు , రీహాబిలిటేషన్ నిపుణులు ఆరోగ్య సంరక్షణలో అత్యంత నిర్లక్ష్యం చేయబడినప్పటికీ అత్యంత కీలకమైన అంశాలలో ఒకటైన - పోస్ట్-స్ట్రోక్ రీహాబిలిటేషన్ గురించి చర్చించారు. రోగులకు వేగవంతమైన మరియు అతి తక్కువ ఖర్చులో కోలుకోవడాన్ని నిర్ధారించడానికి భారతదేశం దాని పోస్ట్-స్ట్రోక్ కేర్ వ్యవస్థలో అధునాతన రోబోటిక్ రీహాబిలిటేషన్ ను ఏకీకృతం చేయాలని ప్యానెల్ ఏకాభిప్రాయంతో వెల్లడించింది. ‘అడ్వాన్స్ రోబోటిక్స్ ఇన్ రిహాబ్ & రికవరీ’ పేరిట నిర్వహించిన ఈ సదస్సు భారతదేశ ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో ఒక ప్రాథమిక అంతరాన్ని వెలుగులోకి తెచ్చింది. దేశంలో పెద్ద వయసు వ్యక్తుల వైకల్యానికి స్ట్రోక్ ప్రధాన కారణాలలో ఒకటిగా ఉన్నప్పటికీ చాలా మంది రోగులకు, వైద్య జోక్యం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్తోనే ముగుస్తుంది. రికవరీ కోసం నిజమైన యుద్ధం ఇక్కడే ప్రారంభమవుతుందని నిపుణులు నొక్కి చెప్పారు. “భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అత్యవసర సంరక్షణలో ప్రావీణ్యం సంపాదించింది, కానీ రీహాబిలిటేషన్ అంటే జీవితాలను నిజంగా పునర్నిర్మించే ప్రదేశం” అని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ బిఎస్వి రాజు అన్నారు. “స్ట్రోక్లో, ప్రతి రోజు లెక్కించబడుతుంది. రోగి గైడెడ్ రిహాబిలిటేషన్ను ఎంత త్వరగా ప్రారంభిస్తే, అతను తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. రోబోటిక్ రీహాబిలిటేషన్ చికిత్సకు ఖచ్చితత్వం మరియు తీవ్రతను జోడిస్తుంది” అని అన్నారు. HCAH సహ వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు డాక్టర్ గౌరవ్ తుక్రాల్ మాట్లాడుతూ, “మేము ఇటీవల తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్ రీహాబిలిటేషన్ ల్యాబ్ ను ప్రారంభించాము, ఇందులో ఏఐ -శక్తితో పనిచేసే ఎక్సోస్కెలిటన్లు మరియు మోషన్-ట్రాకింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ప్రారంభ మరియు నిర్మాణాత్మక రీహాబిలిటేషన్ క్లినికల్గా ప్రభావవంతంగా ఉండటమే కాకుండా ఆర్థికంగా కూడా తెలివైనది. చికిత్సను ముందుగానే ప్రారంభిస్తే రోగులు వేగంగా కోలుకుంటారు” అని అన్నారు. “శస్త్రచికిత్స ప్రాణాలను కాపాడుతుంది; రీహాబిలిటేషన్ దానిని తిరిగి ఇస్తుంది. పోస్ట్-స్ట్రోక్ రీహాబిలిటేషన్ ను మనం సంరక్షణలో ఒక ప్రామాణిక భాగంగా మార్చాలి” అని డాక్టర్ తుక్రాల్ జోడించారు.
పసుపు రంగు చెప్పులు పట్టించేశాయ్!!
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో నాదర్గుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో వరుసగా నేరాలు చేసింది.
Observed Sridevi, Savitri For Kaantha: Bhagyashri
Bhagyashri Borse played the leading lady in the upcoming period drama Kaantha which is due for release in 3 more days on November 14th. The actress feels blessed to portray such a challenging role as Kumari at the very beginning of her career. “Since the film is set in the 1960s, recreating that era was […] The post Observed Sridevi, Savitri For Kaantha: Bhagyashri appeared first on Telugu360 .
డిసెంబరు 13న హైదరాబాద్కు మెస్సీ
అర్జెంటీనాకు చెందిన దిగ్గజ అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్కు రానున్నారు.
పొదల్లో కదల్లేని స్థితిలో చిరుత
మెదక్, సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని చేగుంట మండల జైత్రాం తండా, దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో చిరుత కనిపించింది.
‘కాంత’లో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం:భాగ్యశ్రీ బోర్సే
హీరో దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ డ్రామా ’కాంత’ను దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే మీడియాతో మాట్లాడుతూ “-కాంత నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాది. దుల్కర్, రానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. -నేను చేసిన కుమారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చింది. -డైరెక్టర్ సెల్వ చాలా టాలెంటెడ్. కుమారి క్యారెక్టర్ని ఆయన రాసుకున్న విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. అందరి నటుల నుంచి చాలా మంచి నటనను రాబట్టుకున్నారు. ‘కాంత’లో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం. నేను చేసిన కాంత, ఆంధ్ర కింగ్ సినిమాలు వరుసగా వస్తుండడం ఎంతో హ్యాపీగా ఉంది. తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని నమ్ముతున్నాను. -కాంతలో సినిమాలో సినిమా ఉంటుంది. ఆంధ్ర కింగ్ ఒక ఫ్యాన్ బయోపిక్. ఈ రెండు కూడా దేనికవే డిఫరెంట్ సినిమాలు. కాంతలో కుమారి క్యారెక్టర్కి ఆంధ్ర కింగ్ లో మహాలక్ష్మి క్యారెక్టర్కి అసలు పోలికే ఉండదు. దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. రెండు సినిమాలు ప్రేక్షకులని అలరిస్తాయని నమ్ముతున్నాను. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీని మంచి నటి అంటారని ఆశిస్తున్నాను. -ఇక ప్రస్తుతం నాకు తెలుగు సినిమాలు, అలాగే హిందీ సినిమాలు ఉన్నాయి. నా ప్రాజెక్ట్ల గురించి మేకర్స్ ప్రకటిస్తారు”అని అన్నారు.
డాక్టర్ రెడ్డీస్కు 2.16 కోట్లు టోకరా
డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ 2 కోట్ల 16 లక్షల రూపాయల సైబర్ మోసానికి గురైంది.
గర్భిణి మృతి కామినేని హాస్పిటల్కు కోటి ఫైన్
నల్గొండ జిల్లా నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ లో గర్భిణి చనిపోయిన కేసులో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం మృతురాలి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
బిహార్లో రికార్డు స్థాయి పోలింగ్…
బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ శాతం రికార్డు
పాక్లో భారీ పేలుడు..12 మంది మృతి
ఇస్లామాబాద్ లోని కోర్టు ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి 12 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది న్యాయవాదులు, సిబ్బంది ఉన్నారు. కోర్టు కాంప్లెక్సు వద్ద పార్కింగ్ స్థలంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది ఆత్మాహుతి దాడి అని కారులో అమర్చిన గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రద్దీ సమయంలో ఈ సంఘటన జరగడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. ఇస్లామాబాద్ జిల్లాకోర్టు లోని న్యాయవాదులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు శబ్దం దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు వినిపించిందంటే పేలుడు తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దగ్ధమైన కారు నుంచి మంటలు, పొగలు ఉవ్వెత్తున పైకి కమ్ముకోవడం వీడియోల్లో కనిపించింది. సమీపాన పార్కింగ్ చేసి ఉన్న అనేక వాహనాలు ఈ పేలుడుకు భారీగా దెబ్బతిన్నాయి. పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ, ఈ ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. దక్షిణ వజీరిస్థాన్ లోని కాడెట్ కాలేజ్ వానా వద్ద తెహ్రీక్ఇతాలిబన్ పాకిస్థాన్ ( టిటిపి) దాడిని పాక్ భద్రతా దళాలు భగ్నం చేసిన కొన్ని గంటల్లోనే ఈ సంఘటన జరిగింది. కళాశాల విద్యార్థులను బందీలుగా చేసుకోవాలన్న తెహ్రీక్ ప్రయత్నాన్ని పాక్ బలగాలు అడ్డుకున్నాయి. ఈ ఆపరేషన్లో టిటిపికి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పాక్ సైన్యం మట్టుపెట్టింది.
బీహార్లో ముగిసిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే హవా
బీహార్లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. ఈ నెల 6వ తేదీన తొలి దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన పోలింగ్ లో అత్యధిక స్థాయిలో దాదాపు 65 శాతం ఓటింగ్ రికార్డు అయింది. కాగా, ఈనెల 14న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, బీహార్లో రెండో దశ పోలింగ్ పూర్తి కావడంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు. ఇందులో ఎన్డీయే హవా చూపుతోంది. ఎన్డీయే కూటమే ప్రభుత్వంలోకి రాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.
మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా..
మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా.. బిచ్కుంద, ఆంధ్రప్రభ : బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజలు
Aamir Khan Shelves Third Film in a Row?
Bollywood Superstar Aamir Khan has been in talks for several projects and he is yet to take any of them to the next level as he is not convinced with the final scripts. He recently rejected Vamshi Paidipally’s film which has been under discussion. After the poor response for Coolie, Aamir Khan shelved his superhero […] The post Aamir Khan Shelves Third Film in a Row? appeared first on Telugu360 .
పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగింది:మాగంటి సునీత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని, ఓటర్లను భయపెట్టారని బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతూ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు జూబ్లీహిల్స్లో ఏం పని..? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో మంగళవారం మధ్యాహ్నం మాగంటి సునీత మీడియాతో మాట్లాడుతూ, ఉద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ గూండాల బెదిరింపులకు ఓటర్ల భయపడవద్దని, తాను ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్కు ఓటేయాలని బెదిరింపులకు దిగుతూ.. మాట వినకపోతే బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అభ్యర్థి అని చూడకుండా బూతులు మాట్లాడతారా..?అని మండిపడ్డారు. ఓటర్లు విజ్ఞతతో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆకు రౌడీలంతా జూబ్లీహిల్స్లో తిరుగుతున్నారని పేర్కొన్నారు. సురేశ్ యాదవ్ అనే వ్యక్తి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బిఆర్ఎస్ ఏజెంట్లు కూర్చుంటే వాళ్లను కూర్చోనివ్వలేదని, లేదని, పోలింగ్ బూతుల్లోని టేబుళ్లను బయట పడేశారని మండిపడ్డారు. బిర్యానీల్లో డబ్బులు పెట్టి ఓటర్లకు ఇచ్చారని, బిర్యానీ ప్యాకెట్లను చూసి కూడా పోలీసులు వదిలేశారని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు వీల్చైరుల కూడా సరిపడేంతగా పెట్టలేదని తెలిపారు. రజియా అనే అమ్మాయి ఇంటికి వెళ్లి దాడులకు దిగారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీరాజ్యంగా మార్చారని, నవీన్ యాదవ్ మనుషులు వచ్చి తన సంగతి చెప్తానని తననే బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మాగంటి గోపీనాథ్ ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశారని, కానీ ఇంత దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదని సునీత పేర్కొన్నారు. 13వ తేదీవరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి.. 14వ తేదీ తర్వాత తాను గెలిచాక అందరి సంగతి చెబుతానని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ప్రజలందరికీ బిఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. కృష్ణానగర్ పోలింగ్ బూత్ వద్ద బైఠాయించిన సునీత కాంగ్రెస్ నేతలు నిబంధనలు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి తన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి సునీత కృష్ణానగర్ పోలింగ్ బూత్ వద్ద బైఠాయించారు. దొంగ ఓటర్లకు పోలీసులు సహకరించారని మండిపడ్డారు. తాము దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లతో దౌర్జన్యాలకు పాల్పడి, తమ పార్టీ కార్యకర్తలను కొట్టి, తిరిగి వారి మీదనే కేసులు పెడతామని నవీన్ యాదవ్ అనుచరులు బెదిరించారని పేర్కొన్నారు.
హంగేరీ రచయితకు 2025 బుకర్ ప్రైజ్ అవార్డు
లండన్ : హంగేరీకి చెందిన బ్రిటిష్ రచయిత 51ఏళ్ల డేవిడ్ సలై తన ఫ్లెష్ అనే నవలకు గాను 2025 బుకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. సోమవారం రాత్రి బుకర్ప్రైజ్ వేడుకలో భారతీయ రచయిత కిరణ్ దేశాయ్ రాసిన ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ నవల తీవ్ర పోటీ ఇచ్చినప్పటికీ డేవిడ్ రాసిన నవలకే అవార్డు దక్కింది. సలై తుదిపోరులో ఐదుగురు పోటీదారులను అధిగమించి బుకర్ ప్రైజ్కు ఎంపిక కావడం విశేషం. ఈమేరకు డేవిడ్ సలైకు సుమారు 50 వేల పౌండ్ల నగదు పారితోషికం అందజేశారు. గత ఏడాది విన్నర్ సమంతా హార్వే చేతుల మీదుగా ట్రోఫీని బహూకరించారు.
BREAKING |ఢిల్లీ దుర్ఘటన బాధితులకు ఎక్స్-గ్రేషియా..
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం
Bihar Assembly Elections 2025: Exit Polls Predict a Clear NDA Surge
The political battle in Bihar appears to have a decisive outcome even before the official results. Multiple exit polls conducted after the second phase of voting predict a strong return to power for the National Democratic Alliance (NDA), led by Chief Minister Nitish Kumar. NDA Heads for Comfortable Majority According to exit poll data, the […] The post Bihar Assembly Elections 2025: Exit Polls Predict a Clear NDA Surge appeared first on Telugu360 .
నిఠారీ హత్యల కేసు..సురేంద్ర కోలీని నిర్దోషిగా తేల్చిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన 2005-06 నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈకేసుల్లో దోషిగా తేలి మరణశిక్షను ఎదుర్కొంటున్న సురేందర్ కోలీని సుప్రీం కోర్టు మంగళవారం నిర్దోషిగా తేల్చింది. ఆయనపై నమోదైన ఆఖరి కేసులో కూడా నిర్దోషిగా తేలడంతో సురేంద్ర దాదాపు 19 ఏళ్ల తరువాత విడుదల కాబోతున్నాడు. నిఠారీ హత్యల్లో ఒకటైన 15 ఏళ్ల బాలిక హత్య కేసులో సురేందర్ కోలీ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. నిందితుడిపై నేరారోపణలు రుజువు కానందున నిర్దోషిగా విడుదల చేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది.న ఈ కేసుపై తాజాగా సీజేఐ జస్టిస్ బిఆర్గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమనాథ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కేవలం ఒక కత్తి ఆధారంగా అతడిని నిందితుడిగా భావించలేమని పేర్కొంది. ఇప్పటికే 12 కేసుల్లో నిర్దోషిగా తేలినందువల్ల సురేందర్ కోలీని వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. నోయిడా సమీపం లోని నిఠారీ గ్రామంలో 20052006 మధ్య కాలంలో చిన్నారులు,యువతులు అదృశ్యం కావడం కలకలం రేపింది. 2006 డిసెంబర్ 29న నొయిడా లోని నిఠారీ వద్ద మోనిందర్ సింగ్ ఫండేర్ ఇంటి వెనుక మురుగు కాల్వలో 16 మంది చిన్నారుల అస్థికలు బయటపడటం తీవ్ర అలజడి రేపింది. ఈ కేసుల దర్యాప్తు సిబిఐ చేపట్టింది. ఫండేర్తోపాటు అతని ఇంట్లో సహాయకుడిగా ఉండే కోలీని కూడా అరెస్టు చేసింది. ఈ హత్యలకు సంబంధించి 2007లో మొత్తం 19 కేసులను నమోదు చేసింది. సాక్షాధారాలు తగినంతగా లేకపోవడంతో ఆ కేసుల్లో మూడింటిని మూసివేసింది. మిగతా 16 కేసులకు గాను పన్నెండు కేసులకు సంబంధించి కోలీని నిర్దోషిగా 2023 అక్టోబరు 16న అలహాబాద్ హైకోర్టు తేల్చింది. ఇంకా ఫండేర్పై మూడు కేసులు మిగిలి ఉండగా, వాటిలోనూ అతడిని నిర్దోషిగా నిర్ధారించింది. ఈ కేసుల దర్యాప్తులో సిబిఐ నిర్లక్షంగా వ్యవహరించిందని, నిందితులే నేరం చేసినట్టు ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో సీబీఐ , మృతుల తరఫు బంధువులు పిటిషన్లు వేయడంతో వాటన్నింటినీ సుప్రీం కోర్టు ఈ ఏడాది జులైలో కొట్టివేసింది. అయితే నిఠారీ హత్యల్లో ఒకటైన 15 ఏళ్ల బాలికకు సంబంధించిన హత్య కేసులో కోలీ నిర్దోషిగా తేలక పోవడంతో అతడు జైల్లోనే ఉన్నాడు.
ఢిల్లీ పేలుడు... ఆస్పత్రి వద్ద కుటుంబీకుల కన్నీటి ఘోష
న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం సంభవించిన కారు పేలుడులో మృతులైన వారి అవశేషాలను తీసుకెళ్లడానికి ఎల్ఎన్జెపి ఆస్పత్రి వద్ద మంగళవారం ఉదయం చేరుకున్న కుటుంబీకుల కన్నీటి ఘోష హృదయాలను ద్రవింప చేస్తోంది. ఆస్పత్రి మాచ్చురీ గేట్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కేవలం అధికారిక సిబ్బందిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. కొంతమంది గల్లంతైన తమ వారి కోసం ఆస్పత్రి సిబ్బందితో వాదించడం కనిపించింది. మరికొంతమంది వచ్చిపోయే అంబులెన్స్ల వంక దీనంగా చూస్తూ రోదిస్తున్నారు. ఎల్ఎన్జెపి ఆస్పత్రి మార్చురీ వద్ద తెల్లవారు డ్యూటీ పూర్తి చేసిన ఒక ఉద్యోగి మార్చురీ వద్ద ఈ దృశ్యాలన్నీ చాలా భయంకరంగా కనిపిస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చాడు. “మార్చురీకి వచ్చిన మృతదేహాలు గుర్తుపట్టలేకుండా ఉన్నాయి. కొన్ని మృతదేహాలు కేవలం మాంసం ముద్దలే. కొన్నిటిలో లోపల అవయవాలు చెల్లాచెదురై పోవడం లేదా అదృశ్యమై పోవడం జరిగింది. ఇవన్నీ ఒకరికొకరు చెప్పుకోవడం చాలా కష్టంగా ఉంటోంది. ఈ విధ్వంసం ఎలా ఉందో చెప్పలేకపోతున్నాం” అని అక్కడ అనుభవాలు ఏకరువు పెట్టాడు. బాధిత కుటుంబాల్లో నోమన్ కుటుంబం ఒకటి. పేలుడుకు నోమన్ బలైపోయాడు. ఆయన కుటుంబం మంగళవారం ఉదయం నోమన్ మృతదేహాన్ని గుర్తించాక తట్టుకోలేక ఒకరినొకరు పట్టుకుని ఓదార్చుకుంటున్నారు. నోమన్ అవశేషాలను సిబ్బంది ఒక తెల్లని గుడ్డలో చుట్టి అంబులెన్స్లో మార్చురీకి తీసుకొచ్చారు. ఆ అంబులెన్స్ను కుటుంబీకులు నిశ్శబ్దంగా అనుసరించడం కనిపించింది. నోమన్ స్నేహితుడు సోను ఈ పరిస్థితిలో తన ప్రియమిత్రుడిని చూడలేనని కుప్పకూలిపోయాడు. మంగళవారం ఉదయం నుంచి కుటుంబీకులు గుర్తించిన మృతదేహాలను వారికి అప్పగించడం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఆస్పత్రికి వచ్చే సాధారణ రోగుల కుటుంబీకులు తమ వారిని ఆస్పత్రిలో కలుసుకోవడం చాలా ఇబ్బందిగా తయారైంది. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డును పూర్తిగా మూసివేశారు. వైద్యం కోసం వచ్చే రోగులను ఇతర బ్లాక్లకు పంపిస్తున్నారు. ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ వార్డుల వద్ద సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. ఇతర గేట్లు కూడా చాలావరకు మూతపడ్డాయి. ఆస్పత్రి లోకి వెళ్లాలంటే చుట్టూ తిరిగి వేరే దారిలో వెళ్లాలని చెబుతున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా మంగళవారం ఉదయం ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు.
తవ్వకాల్లో బయటపడిన దుర్గామాత విగ్రహం
ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ సమీపంలో తవ్వకాల్లో సింహవాహిని రూపంలో ఉన్న దుర్గామాత విగ్రహం బయటపడింది. దుర్గామాత విగ్రహాన్ని శాలపల్లి గ్రామ ప్రజలు మంగళవారం ఉదయం తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ బి టైప్ గేట్ సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద జరిపిన మినీ చెరువు నిర్మాణం పనుల్లో అష్టభుజాలతో సింహవాహిని రూపంలో ఉన్న దుర్గామాత విగ్రహాన్ని స్థానిక ప్రజలు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే హిందు వాహిని బిజెపి నాయకులు వెళ్లి పూజలు నిర్వహించారు. ఎన్టీపీసీకి చెందిన సోలార్ ప్లాంట్ పరిధిలో అమ్మవారి విగ్రహం లభించడంతో మంగళవారం ఉదయం హెచ్ఆర్ ఎజిఎం బిజయ్ కుమార్ సిక్దర్, హెచ్ఆర్ అధికారులు, సిఐఎస్ఎఫ్ సిబ్బంది వెళ్లి దుర్గామాత విగ్రహాన్ని పరిశీలించారు. దుర్గామాత మందిరాన్ని నిర్మించాలని హిందూ వాహిని, బిజెపి నాయకుల డిమాండ్ ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ సమీపంలో లభించిన దుర్గామాత రాతి విగ్రహం సమీపంలోనే మందిరాన్ని నిర్మించి ఇవ్వాలని హిందూ వాహిని నాయకులు, బిజెపి నాయకులు ఎన్టీపీసీ యాజమాన్యాన్ని కోరారు. మంగళవారం ఉదయం దుర్గామాత విగ్రహం లభించిన ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం హిందు వాహిని నాయకులు ఇసంపల్లి వెంకన్న, కొండపర్తి సంజీవ్, కాంతుల సంతోష్ రెడ్డి, మిట్టపల్లి సతీష్, బిజెపి రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, గాండ్ల ధర్మపురి స్థానిక విలేకరులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు రమేష్, తన్నీరు రమేష్, బండి సమ్మయ్య, గోలివాడ శ్రీకాంత్, ఇదినూరు వెంకటేష్, మేకల సదానందం, రవీందర్, వంశీతోపాటు పలువురు పాల్గొన్నారు.
పోలీసుల వాహన తనిఖీలు… చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ
జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ - ఏ పార్టీ విన్?#JubileeHills #ExitPoll #Congress #BRS #Bypoll #viralvideo
గడ్డి మందు ఎందుకు తాగాడు…? గన్నేరువరం, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని జిల్లా
యువ పారిశ్రామిక వేత్తలు వినూత్నంగా ఆలోచించాలి..
శ్రీకాకుళం, (ఆంధ్రప్రభ బ్యూరో) : రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా,
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఎపిలోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో మంగళవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్లిన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో నలుగురు యువకులు దుర్మరణం చెందగా. పోలీసుల ప్రాథమిక విచారణలో అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైం దని పోలీసులు వెల్లడిం చారు. ప్రమాదం తీవ్రతను బట్టి కారు వేగం 120 కి.మీ.లకు పైగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు చింతయ్య (17), రాకేష్ బాబు (24), ప్రిన్స్ (24) సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మరో యువకు డుకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బాధితుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని వాహనం శకలాల్లో చిక్కుకున్న బాధితులను బయటకు తీయడానికి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఉయ్యూరు పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ప్రమాదం కారణాలపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభమైందని సిఐ వెల్లడించారు.
ముమ్మరంగా డాగ్ స్క్వాడ్ తనిఖీలు
ముమ్మరంగా డాగ్ స్క్వాడ్ తనిఖీలు హుజూర్నగర్, ఆంధ్రప్రభ : డిల్లీలో జరిగిన బాంబు
అల్లరి నరేష్.. ‘12ఎ రైల్వే కాలనీ’ ట్రైలర్ వచ్చేసింది..
అల్లరి నరేష్ నటిస్తున్న యూనిక్ థ్రిల్లర్ మూవీ ‘12ఎ రైల్వే కాలనీ’. పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో గుర్తింపు తెచుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా.. కొత్త డైరెక్టర్ నాని కాసరగడ్డ తెరకెక్కిస్తున్నాడు. ప్రతిష్టాత్మక శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈమూవీ ట్రైలర్ ను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్.. మూవీపై అంచనాలను పెంచేసింది. ఇప్పటికే విడుదలైన సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తనదైన మూవ్స్ తో నరేష్ ఆకట్టుకున్నారు. అల్లరి నరేష్ ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు. పొలిమేర సిరీస్లో ఆకట్టుకున్న డాక్టర్ కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు. కాగా, నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.
జనంసాక్షి ఎగ్జిట్ పోల్స్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్దే..
హైదరాబాద్ (జనంసాక్షి) : విశ్వసనీయతకు మారుపేరైన జనంసాక్షి సర్వే సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. ఇందులోనూ కాంగ్రెస్ ముందంజలోనే ఉంది. …
యూసుప్గూడలో భారీగా దొంగ ఓట్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓడిపోతామని యూసుఫ్గూడ డివిజన్లో కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు. ఈ విషయాన్ని గ్రహించిన బీఆర్ఎస్ నేతలు దొంగ ఓటర్లను పట్టుకున్నారు. ఈ క్రమంలో భారీగా మహిళా ఓటర్లు పట్టుబడ్డారు. ఎల్బీనగర్ మహిళ యూసుప్గూడలో ఓటు వేసిందని బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
తాళాలు వేసిన ఇండ్లకే కన్నాలు…
తాళాలు వేసిన ఇండ్లకే కన్నాలు… — దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్— 5తులాల
Video : Jubilee Hills By Election Exit Poll
The post Video : Jubilee Hills By Election Exit Poll appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్ లో ముగిసిన పోలింగ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ శాతం
చర్ల, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి
పేదింటిబిడ్డ పెండ్లికి… లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : పేదలకు అండగా ప్రభుత్వం ఉందని
హిందూపురంలో ఎఐఎస్ఎఫ్ బహిరంగ సభ – ప్రభుత్వంపై మండిపడ్డ ఎస్.ఎఫ్ నేతలు
విశాలాంధ్ర – హిందూపురం:రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన రాష్ట్రవ్యాప్త బస్సు జాతా మంగళవారం 21వ రోజు హిందూపురం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా చర్చి గ్రౌండ్లో వందలాది మంది విద్యార్థుల సమక్షంలో బహిరంగ సభను జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, కార్యదర్శి శేషం మహేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు వేమయ్య యాదవ్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలరాజు, నాసర్ జీ, […] The post హిందూపురంలో ఎఐఎస్ఎఫ్ బహిరంగ సభ – ప్రభుత్వంపై మండిపడ్డ ఎస్.ఎఫ్ నేతలు appeared first on Visalaandhra .
చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలి నుంచి భద్రత బలగాలు భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Exit Polls : బీహార్ ఎన్డీఏదే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కే
బీహార్ అసెంబ్లీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి
విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి…
విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి… లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : విద్యార్థులు విద్యతో
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, పలువురిపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నియమాలు ఉల్లఘించిన వారిపై మూడు కేసులు నమోదు చేశారు. ఆలేరు ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, రామచంద్రనాయక్, రాందాస్పై మధురానగర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్పై బోరబండ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గౌరవించాలని పోలీసులు స్పష్టం చేశారు.
సిగ్నేచర్ గ్లోబల్ స్టాక్పై 75% వరకు లాభాలకు అవకాశం
హైదరాబాద్: ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన ఐసిఐసిఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, నువమా... సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్పై 'బయ్' (BUY) రేటింగ్ను సిఫార్సు చేశాయి. కంపెనీ స్థిరమైన వ్యాపార వేగం, దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సిఫార్సు చేస్తున్నట్లు తెలిపాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఈ కంపెనీపై 'బయ్' రేటింగ్ను కొనసాగిస్తూ, టార్గెట్ ధరను రూ. 1,786గా నిర్ణయించింది. యాక్సిస్ క్యాపిటల్, నువమా సంస్థలు తమ టార్గెట్ ధరలను వరుసగా రూ. 1,780, రూ. 1,376గా నిర్ణయించాయి. ఇది ప్రస్తుత స్టాక్ ధర నుండి 75% వరకు వృద్ధికి అవకాశం ఉందని సూచిస్తోంది. నవంబర్ 11, 2025న, ఉదయం ట్రేడింగ్లో సిగ్నేచర్ గ్లోబల్ స్టాక్ ఒక్కో షేరుకు రూ. 1029.90 వద్ద ప్రారంభమైంది. 2026 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో (H1FY26), కంపెనీ రూ. 46.6 బిలియన్ల బలమైన ప్రీ-సేల్స్ను నమోదు చేసింది. రూ. 12.0 బిలియన్ల ఆదాయాన్ని నివేదించగా, కలెక్షన్లు రూ. 18.7 బిలియన్లుగా ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (H2FY26), గురుగ్రామ్లోని తమ అధిక-విలువ కలిగిన ప్రాజెక్టులలో కీలక నిర్మాణ మైలురాళ్లను చేరుకుంటున్నందున, కలెక్షన్లు గణనీయంగా పెరుగుతాయని కంపెనీ ఆశిస్తోంది. బ్రోకరేజ్ సంస్థల సిఫార్సులు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తమ 'బయ్' రేటింగ్ను కొనసాగిస్తూ, టార్గెట్ ధరను రూ. 1,786కు అప్డేట్ చేసింది. ఇది స్టాక్ 75% పెరిగే అవకాశం ఉందని సూచిస్తోంది. సిగ్నేచర్ గ్లోబల్... 2021-25 ఆర్థిక సంవత్సరాల మధ్య, ప్రధానంగా అందుబాటు/మధ్య-ఆదాయ గృహ ప్రాజెక్టుల ద్వారా, సేల్స్ బుకింగ్లలో 57% సిఏజిఆర్ (CAGR) వృద్ధిని సాధించిందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. 2025-28 ఆర్థిక సంవత్సరాలకు గాను రూ. 450 బిలియన్లకు పైగా సంచిత గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ (జీడీవీ)తో కూడిన బలమైన లాంచ్ పైప్లైన్ సిగ్నేచర్ గ్లోబల్కు ఉందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. దీని మద్దతుతో, కంపెనీ సేల్స్ బుకింగ్లు 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 119 బిలియన్లకు, 2027లో రూ. 127 బిలియన్లకు, 2028లో రూ. 139 బిలియన్లకు చేరుకుంటాయని అంచనా వేసింది. యాక్సిస్ సెక్యూరిటీస్ (యాక్సిస్ క్యాపిటల్), కంపెనీ స్టాక్ ధరలో 74% వృద్ధిని ఆశిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో రూ. 130 బిలియన్లకు పైగా విలువైన బలమైన ప్రాజెక్టులను ప్రారంభించాలని కంపెనీ ప్రణాళిక వేస్తోందని, దీనితో ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలదని విశ్వసిస్తోంది. ఇప్పటి నుండి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం క్రమంగా పుంజుకుంటుందని మేము ఆశిస్తున్నాము. కొత్త లాంచ్ల వద్ద ఆరోగ్యకరమైన బుకింగ్లతో పాటు, ఇది కలెక్షన్లను, ఓసిఎఫ్ (ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో)ను పెంచుతుంది అని యాక్సిస్ క్యాపిటల్ తమ నివేదికలో పేర్కొంది. నువమా కూడా తన 'బయ్' రేటింగ్ను కొనసాగిస్తూ, ఒక్కో షేరుకు టార్గెట్ ధరను రూ. 1,376గా నిర్ణయించింది. ఈ రంగంలోకి సాపేక్షంగా ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, గత కొన్నేళ్లుగా గురుగ్రామ్ హౌసింగ్ మార్కెట్లో సేల్స్ బుకింగ్స్ పరంగా సిగ్నేచర్ గ్లోబల్ అతిపెద్ద డెవలపర్లలో ఒకటిగా ఉద్భవించింది అని నువమా తన నివేదికలో పేర్కొంది. సిగ్నేచర్ గ్లోబల్ (SGIL) విజయంలో అతిపెద్ద అంశాలలో ఒకటి, కంపెనీ చాలా ఆకర్షణీయమైన ధరలకు భూమిని సేకరించగలగడం. సగటున, కంపెనీకి భూమి/ఆమోదాలకు సంబంధించిన ఖర్చులు, అమ్మకపు ధరలో 10-15% మాత్రమే ఉంటున్నాయి అని ఆ నివేదిక జోడించింది.
మేడారానికి రేపు నలుగురు మంత్రులు..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: మేడారం మహాజాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నలుగురు రాష్ట్ర మంత్రులు రేపు
పొగొట్టుకున్న ఫోన్లు పొందవచ్చు…
పొగొట్టుకున్న ఫోన్లు పొందవచ్చు… నకిరేకల్, ఆంధ్ర ప్రభ : నకిరేకల్ పోలీసులు సీఈఐఆర్
Jubilee Hills Bye Elections : పోలింగ్ దారుణం.. ఇది ఎవరికి లాభమంటే?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదయింది.
అసభ్య గీతాలకు విద్యార్ధుల నృత్యం
అసభ్య గీతాలకు విద్యార్ధుల నృత్యం మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా
హిందూపురం పోలీసుల నిఘాలో.. చిక్కిన బైక్ దొంగలు
విశాలాంధ్ర – హిందూపురం :హిందూపురం పట్టణంలో ఇటీవల పెరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలపై కొంతకాలంగా పోలీసులు నిఘా ఉంచారు. ఎస్పీ యస్. సతీష్ కుమార్, డీఎస్పీ కెవి. మహేష్ పర్యవేక్షణలో హిందూపురం 1 టౌన్ సీఐ కె. రాజగోపాల్ నాయుడు, ఎస్ఐ శ్రీధర్, ఏఎస్ఐ మద్దిలేటి నేతృత్వంలోని పోలీసు బృందం మంగళవారం తెల్లవారుజామున గుడ్డం అండర్ బ్రిడ్జ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులను చూసి పారిపోబోయిన దుండగులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. […] The post హిందూపురం పోలీసుల నిఘాలో.. చిక్కిన బైక్ దొంగలు appeared first on Visalaandhra .
ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్.. వెలుగులోకి మరో వీడియో #DelhiBlast #Crime #DelhiPolice #TerrorProbe
ఆకస్మిక తనిఖీ… మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా
వినూత్నంగా ఆలోచించాలి… సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుపైడి భీమవరంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్
Bihar : బీహార్ లో పోలింగ్ శాతం ఎంతంటే?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది.
భారీ పెట్టుబడులే లక్ష్యం విశాఖ సీఐఐకి 45 దేశాల ప్రతినిధులుమంత్రి కొండపల్లి శ్రీనివాసరావు
మానసిక బలాన్ని పెంచుకోవాలి.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, ఆంధ్రప్రభ : పోలీసులు తమ
Video : Exclusive Interview with Hero Priyadarshi
The post Video : Exclusive Interview with Hero Priyadarshi appeared first on Telugu360 .
న్యాయవాది పై దాడికి నిరసనగా విధులకు గైర్హాజరు..
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం… తిరుపతి కి చెందిన న్యాయవాది ఎ. రాజశేఖర్పై పుత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన దాడికి నిరసనగా మంగళవారం కళ్యాణదుర్గం న్యాయవాదులు కోర్టు విధులకు గైర్హాజయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పుత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన ఈ దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, న్యాయవాదుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.పార్ధసారధి చౌదరి, కార్యదర్శి కె.శ్రీనివాసులు, […] The post న్యాయవాది పై దాడికి నిరసనగా విధులకు గైర్హాజరు.. appeared first on Visalaandhra .
రెండు గంటలు విజయ్ దేవరకొండ విచారణ
బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ హీరో విజయ్ దేవరకొండ ను సిట్ అధికారులు విచారించారు
Case filed against Dulquer Salmaan’s Kaantha
Malayalam actor Dulquer Salmaan has been scoring hits in all the languages. The actor has spent ample time on Kaantha, an interesting attempt and the film is all set for a grand release this Friday. A case has been filed against the film to stall the release of Kaantha. There are rumors that the film […] The post Case filed against Dulquer Salmaan’s Kaantha appeared first on Telugu360 .
పరిశుభ్రతపై అవగాహన సదస్సు…
పరిశుభ్రతపై అవగాహన సదస్సు… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : రాష్ట్రీయ బాల
రెండో స్థానంలో నంద్యాల.. నంద్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల మధ్య
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే! వాంకీడి, ఆంద్ర ప్రభ : మండల కేంద్రంలోని
ఆక్వాలో జిల్లాను మేటిగా నిలపాలి
ఆక్వాలో జిల్లాను మేటిగా నిలపాలి కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో
రోడ్డెక్కిన పత్తి రైతు… నిలిచిన కొనుగోళ్లు…
రోడ్డెక్కిన పత్తి రైతు… నిలిచిన కొనుగోళ్లు… ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో :
ధర్మవరం పట్టణ పరిశుభ్రత, నీటి సరఫరాపై ఎన్డీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం
మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు రెండు ముఖ్యమైన సమీక్షా సమావేశాలను నిర్వహించారు.మొదటగా ధర్మవరం మున్సిపాలిటీ శానిటరీ అధికారులతో జరిగిన సమావేశంలో పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వీధి, ప్రతి వార్డు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకం […] The post ధర్మవరం పట్టణ పరిశుభ్రత, నీటి సరఫరాపై ఎన్డీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం appeared first on Visalaandhra .
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు లాఠీ ఛార్జి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులు లాఠీ ఛార్జి చేశారు
పాక్లో ఉగ్రదాడి.. కోర్టు ఆవరణలో భారీ పేలుడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతి చెందగా.. సుమారు 20 మంది గాయపడ్డారు. మంగళవారం జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. మధ్యాహ్నం 12.30 సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసిన ఓ కారులో పేలుడు జరిగింది. కారులో గ్యాస్ సిలిండర్ను అమర్చి పేల్చివేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిచనట్లు అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రంగా ఉండటంతో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ శాతం న్యాయవాదులు, కోర్టులో పని చేస్తున్న సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దాడికి సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకు ప్రకటన చేయలేదు.
ఎస్కేయూ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు ఎంపిక ..
ప్రిన్సిపాల్ హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం; నవంబర్ 6 , 7వ తేదీలను గుంతకల్లులో జరిగిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గ్రూప్ సి. అంతర కళాశాలల ఫుట్బాల్ ప్రాబబుల్స్ నందు పాల్గొన్న భరత్ కుమార్ రెడ్డి గ్రూప్ ఏ పోటీల నందు బాల్ బాడ్మింటన్ లో రన్నర్స్ గా నిలిచిన తమ కళాశాల జట్టు కెప్టెన్ సాయికుమార్, యూనివర్సిటీ టీంకు ఎంపికయ్యారని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ […] The post ఎస్కేయూ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు ఎంపిక .. appeared first on Visalaandhra .
రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ కు శంకుస్థాపన
రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ కు శంకుస్థాపన బ్రాహ్మణపల్లిలో ఘనంగా కార్యక్రమం కర్నూలు బ్యూరో,
సబ్జెక్టులపై పట్టు సాధించాలి…
సబ్జెక్టులపై పట్టు సాధించాలి… ములుగు, ఆంధ్రప్రభ : విద్యార్థులు సమయం వృధా చేయకుండా
విమానాశ్రయంలో ఫ్లైట్ ట్రైనింగ్
విమానాశ్రయంలో ఫ్లైట్ ట్రైనింగ్ కర్నూలు, ఆంధ్ర ప్రభ : కర్నూలు ఎయిర్పోర్ట్లో ఏర్పాటు
పోలీసులు విస్తృత తనిఖీలు పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఢిల్లీలో ఉగ్రవాదుల పేలుళ్ల

19 C