బెడిసికొడుతున్న ట్రంప్ వ్యూహాలు
పశ్చిమాసియాలో యుద్ధం దాదాపుగా ముగింపు దశకు వచ్చిందని, తాము విజయపథంలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విస్తృతంగా ప్రకటనలు గుప్పిస్తుండగా, మరోవైపు ఇరాన్ తన వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాల కీలక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న అమెరికా టెక్ కంపెనీల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడుతున్నారు? అలాగే ఈ యుద్ధం ఎవరిది? ఎవరు ప్రారంభించారు? ఎవరు ఆపాలి? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. యుద్ధంలో తాము జయించాం. కానీ తగినంత కాదు అని ట్రంప్ ప్రకటిస్తున్నారు. ఈ కష్టాలు, నష్టాలు, అరిష్టాలు చివరికి ప్రపంచం మొత్తం భరించవలసి వస్తోంది. ఈ యుద్ధోన్మాదం ఎందుకో సరైన కారణం లేదు. యుద్ధం ముగిసిన తరువాత ఏమవుతోందో తెలీదు. అయినా రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక పరిస్థితి రానురానూ అధ్వానంగా దిగజారిపోతోంది. ఇరాన్పై యుద్ధం మొదలైన తొలి రెండు రోజుల్లోనే 5.6 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.51 వేల కోట్లు) విలువైన ఆయుధ సామగ్రిని అమెరికా వినియోగించింది. అంటే అమెరికా ఎంత నష్టపోతోందో తెలుస్తోంది. దీనికి తోడు అనూహ్య సంక్లిష్ట రాజకీయ పరిణామాలకు ట్రంప్ గంగవెర్రులెత్తుతున్నారు. యుద్ధాన్ని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని కొందరు సహాయకులు సలహా ఇస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ మిత్రదేశం ఇరాన్పై దూకుడు తగదని, అలాగే కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని టార్గెట్ చేయడం మంచిది కాదని ట్రంప్ను హెచ్చరించడమే కాక, ఇరాన్కు అండగా ఉంటున్నారు. ఇదే విధంగా చైనా ఇరాన్కు మద్దతు ఇస్తోంది. తాజాగా ఉత్తరకొరియా ఇరాన్కు మద్దతు ప్రకటించింది. ఇవన్నీ పరిశీలిస్తే ట్రంప్ వ్యూహాలు బెడిసికొడుతున్నాయనే చెప్పాలి. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడుల్లో అరబ్దేశాలు చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇరాన్ కేవలం అమెరికా మిలిటరీ స్థావరాలను మాత్రమే లక్షంగా పెట్టుకోవడం లేదు. పౌరనివాసాల పైనా, మార్కెట్లపైనా, దాడులతో ధ్వంసం సాగిస్తోంది. ఇరాన్ దాడులను తిప్పికొట్టాలా వద్దా అన్న సందిగ్ధంలో అరబ్ దేశాలు ఊగిసలాడుతున్నాయి. చమురు క్షేత్రాలు, డీశాలినేషన్ ప్లాంట్లపై మంటలు చెలరేగుతుంటే అవి మీడియాలో వైరల్ దృశ్యాలుగా కనిపిస్తుంటే ప్రజల హాహా కారాలు తప్ప ఎవరూ దాడులను ఆపలేకపోతున్నారు. హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్తున్న చమురు ట్యాంకర్లకు ఎస్కార్ట్ కల్పిస్తున్నట్టు అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ సోషల్ మీడియాలో మొదట ప్రచారం చేసినా తరువాత విరమించుకున్నారు. అమెరికా ఎలాంటి ఎస్కార్ట్ చేయలేదని వైట్హౌస్ స్పష్టం చేసింది. అంటే హార్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమని, అలా అడ్డుకుంటే ఇరాన్ ధ్వంసం అవుతుందని ట్రంప్ హెచ్చరికలు కేవలం బీరాలుగానే మిగిలాయి. ఏ చమురు ట్యాంకర్ను అమెరికా దళాలు హార్ముజ్ మీదుగా తీసుకెళ్లలేదని ఇరాన్ ఐఆర్జిపి వెల్లడించింది. పైగా హార్ముజ్ జలసంధిలో అమెరికా మిత్రదేశాల నౌకలు ప్రవేశిస్తే పేలిపోయేలా ఉచ్చులు పరిచింది. దీనికోసం సీమైన్స్ లేదా నేవల్ మైన్స్ (మందుపాతరలు) అమర్చుతోంది. ఇరాన్ వద్ద దాదాపు 2000 నుంచి 6000 వరకు సీమైన్స్ ఉన్నట్టు అంచనా. 1980 ప్రాంతంలో ట్యాంకర్ వార్ వేళ ఇరాన్ భారీ సంఖ్యలో సీమైన్స్ను వాడి శత్రునౌకలను ధ్వంసం చేసింది. ఈ పరిస్థితుల్లో చమురుపై ఆంక్షలు ఎత్తివేసినట్టు ట్రంప్ ప్రకటించడం ఎంతవరకు లాభం? రష్యా నుంచి ఉత్పత్తి అయిన క్రూడ్ లభ్యమవుతుందని, చమురుకు ఎలాంటి కొరత ఉండదని ట్రంప్ శెలవిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్ను స్థిరీకరించడానికి తమ వద్ద ఉన్న చమురు నిల్వల్లో కొంతభాగాన్ని మార్చి 16 నాటికి మార్కెట్లోకి తీసుకొస్తామని జపాన్ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. హార్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా ఒక్కటే కాదు. ఎరువులు కూడా రవాణా అవుతుంటాయి. అందుకే హార్ముజ్ జలసంధి మూతపడితే ప్రపంచ ఇంధన మార్కెట్లు, సముద్ర రవాణా, అంతర్జాతీయ సరఫరా గొలుసుల పైనా ప్రభావం పడుతుందని, ఎరువుల ధరలతోపాటు రవాణా ఛార్జీలు, బీమా ప్రీమియంలు పెరిగిపోతాయని, ఆహార ధరలు, జీవన వ్యయాలకు రెక్కలొస్తాయని పేదవర్గాల ప్రజలు ఇబ్బందిపడాల్సి వస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఎరువుల తయారీకి గల్ఫ్ దేశాల నుంచి కావలసిన ఎల్ఎన్జీ (ద్రవరూప సహజవాయువు) మనదేశం దిగుమతి చేసుకోవడం పరిపాటి. ప్రస్తుతం 70% గ్యాస్ నిల్వలే భారత్ వద్ద ఉన్నాయి. దీంతో యూరియాను ఉత్పత్తి చేసే భారత్కు చెందిన ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కొన్నిప్లాంట్లను మూసివేయడమే కాక, మరికొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించింది. ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ శాశ్వతంగా మూసివేస్తే ఇరాన్ నాశనమవుతుందని ట్రంప్ హెచ్చరిస్తూ బ్రిటన్ స్థావరాల మీదుగా భారీ బాంబర్లను పంపినా, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి గాజా స్ట్రిప్ మాదిరిగా టెహ్రాన్ను శిథిలాల కుప్పగా కూల్చినా ఇరాన్ ప్రాథమిక అణుబాంబుల సమస్య మాత్రం సమసిపోదు. పశ్చిమాసియా లేదా ఉత్తరాఫ్రికా రీజియన్లో అమెరికా లేదా రష్యా ప్రమేయంతో చెలరేగే యుద్ధాలు అమెరికా, పశ్చిమదేశాల నాయకులను మినహాయించి కొన్ని పాలనా తరాలను మార్చడం తప్ప మరేమీ ప్రయోజనం అందించలేవని చరిత్ర పాఠాలు చెబుతున్నాయి.
నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధం ముగింపు
వాషింగ్టన్: ప్రస్తుత మధ్యప్రాచ్య యుద్ధం ఏ క్షణంలో అయినా ఆగిపోవచ్చునని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్ తో తమ యుద్ధం అనంతర పరిణామాల విశ్లేషణ క్రమంలో తమ ఆంతరంగిక సలహదారులతో ట్రంప్ సుదీర్ఘంగా చర్చించారు. తరువాత వైట్హౌస్లో కిక్కిరిసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నల కు తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. యుద్ధం ఆగిపోతుంది. అయి తే ఇది తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆగిపోవచ్చు. ఇప్పుడు తమ ముందు ఇరాన్ సంబంధిత టార్గెట్స్ ఏమీ మిగిలిలేవు. అక్కడి అగ్రనాయకత్వం పోయింది. రెండో శ్రేణి కథముగిసింది. ఇక తాము కొట్టడానికి మిగిలిదేమీ లేదని ట్రంప్ స్పందించారు. ఇరాన్ ఇక సరైన నాయకత్వంతో ముందుకు సాగుతుందని అనుకుంటానని తెలిపారు. ఇప్పటికే ఇరాన్ సైనిక బలగాలు బాగా దెబ్బతిన్నాయని, వారు కోలుకోలేని రీతిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక యుద్ధం ముగుస్తుంది. త్వరలోనే ఆగిపోతుందని తెలిపారు. ఇజ్రాయెల్ బలగాలతో కలిసి అమెరికా సేనలు సాగించిన పోరులో ఇరాన్లోని పలు వ్యూహాత్మక స్థావరాలను దెబ్బతీశామని వివరించారు. ఇంకా కొన్ని మిగిలి ఉండవచ్చు. అయితే వారు పుంజుకోవడానికి మిగిలిందేమీ లేదన్నారు. తాను ఎప్పుడు ఆపివేయాలనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుందని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ యుద్ధం స్వల్పకాలికమే అన్నారు. అయితే యుద్ధం ముగిసిందనే ట్రంప్ వాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ రెవెల్యూషనరీ గార్డ్ దళాలు ఇప్పుడు అమెరికా కీలక స్థావరాలను, ప్రత్యేకించి టెక్ సాధనసంపత్తిని దెబ్బతీసే క్రమంలో ఉన్నాయని తెలిపారు. తాము బలోపేతం అవుతున్న దశలోనే, అమెరికాలో ట్రంప్పై వ్యతిరేకత పెరుగున్నదని, దీనితోనే ఆయన ఇప్పుడు ఓ డ్రామాగా ఈ మాటలకు దిగారని ఇరాన్ స్పందించింది. ఇప్పటికి సాగిన వార్ గొప్పగా ఉందని, తాము నిర్ణీత లక్షాలను కాలపరిమితికి ముందే చేరుకున్నామని , అనుకున్న దానికంటే ముందే శత్రువును దెబ్బతీయడం జరిగింది. ఇది అమెరికాకు గ్రేట్ వార్, అంతకు మించి గ్రేట్ ఫన్ అన్నారు. నిర్ణీత అంచనాల ప్రకారం ఆరు నెలలు యుద్ధం ఉంటుందనుకున్నానని, అయితే ముందే ఆగిపోయేలా ఉందని తెలిపారు. ఇరాన్ది విచ్ఛిన్నకర విధానం అని విమర్శించారు. ఇతర ప్రాంతాలపై అల్లరిచిల్లరిగా దాడికి దిగడం ద్వారా దశాబ్దాల తరబడి కోలుకులేని నష్టం కల్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
ఒకప్పుడు ఆశావహ దృక్పథం కలిగిన భారత ప్రధాన మంత్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ‘మాగా’ (MAGA: Make America Great Again) నినాదం, ‘మిగా’ (MIGA : Make India Great Again) లక్ష్యానికి దోహదపడుతుందని చెప్పారు. అయితే దాదాపు పావు శతాబ్దంగా కొనసాగుతున్న భారత్ -అమెరికా వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యం ఇప్పుడు ముగిసినట్లే అనే సంకేతాలు వెలువడుతున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్లో అమెరికా ఉపవిదేశాంగ కార్యదర్శి క్రిస్టఫర్ లాండౌ దీనిని స్పష్టంగా చెప్పారు: చైనాకు ఇచ్చినట్టుగా ఆర్థిక ప్రయోజనాలను అమెరికా భారతదేశానికి ఇవ్వదు. భారత్ అమెరికాకు పోటీదారుగా మారేందుకు కూడా అవకాశం ఇవ్వదు. వాణిజ్య ఒప్పందం ‘అమెరికా ఫస్ట్’ అనే సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది. అమెరికా అధికార ప్రతినిధి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు, భవిష్యత్తులో భారత్ -అమెరికా సంబంధాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఒకప్పుడు పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్న ఈ రెండు దేశాల భాగస్వామ్యం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతున్నట్లు కనిపిస్తోంది. గత దశాబ్దంగా భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను గమనిస్తున్న వారికి ఇది ఆశ్చర్యంగా అనిపించే విషయం కాదు. అటల్ బిహారి వాజపేయి -మన్మోహన్ సింగ్ కాలంలో ఏర్పడిన సానుకూల దిశ నుంచి ఈ సంబంధాలు 2017లో మలుపు తిప్పుకున్నాయి. అప్పుడే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య రంగంలో భారత్పై విమర్శలు మొదలుపెట్టారు. అమెరికా మార్కెట్లో కొన్ని భారతీయ ఎగుమతులకు ప్రత్యేక రాయితీలు కల్పించిన జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జిఎస్పి) సదుపాయాన్ని ఉపసంహరించుకోవడం ఈ దిశలో మొదటి అడుగు. ట్రంప్ ప్రధాన లక్ష్యం చైనానే అయినప్పటికీ, ఆ నిర్ణయాల ప్రభావం భారత్పైనా పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన ఈ ‘లావాదేవీ ధోరణి (transactionalism)’ కి ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత అనుబంధం, స్నేహపూర్వకంగా ప్రతిస్పందించేందుకు ప్రయత్నించారు. హ్యూస్టన్లో జరిగిన భారీ సభలో ట్రంప్తో చేతులు పట్టుకుని వేదికపైకి నడిచారు. అలాగే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు రోజు, మోడీ తన స్వరాష్ట్రం గుజరాత్లో నిర్వహించిన మరో భారీ సభలో అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ మద్దతు ప్రకటించారు. కానీ ఆ రాజకీయ పెట్టుబడి ఫలించలేదు. చివరకు ట్రంప్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ కూడా ఇదే లావాదేవీ ధోరణిని కొనసాగించారు. సంబంధాలు కొనసాగాలంటే భారత్ అమెరికా నుంచి మరిన్ని రక్షణ సామగ్రి కొనుగోలు చేయాలని ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. దీనిపై భౌగోళిక రాజకీయాలు, విదేశాంగ వ్యవహారాలను విశ్లేషించే పలువురు వ్యాఖ్యాతలు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఇకపై ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ కంటే ‘లావాదేవీ ఆధారిత సంబంధాలు’గా మారిపోయాయని వారు పేర్కొన్నారు. అయితే ఈ భాగస్వామ్యంపై విశ్వాసం ఉంచినవారు మాత్రం వెనక్కి తగ్గలేదు. వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు సాంకేతిక రంగంపైనే కేంద్రీకృతమైందని వారు చెప్పారు. ఇకపై అమెరికా భారత్కు ఉన్నతమైన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తుందని వాదించారు. ఈ వాదనకు మద్దతుగా వివిధ ఒప్పందాలను ఉదాహరణగా చూపించారు. న్యూఢిల్లీలోని థింక్ట్యాంక్లు, మీడియా వర్గాల్లోని అనేక మంది కూడా ఈ ఆశాభావాన్నే కొనసాగించారు. భారత్- అమెరికా భాగస్వామ్యానికి ప్రారంభం నుంచే మద్దతు ఇచ్చిన అమెరికన్ విశ్లేషకుల్లో ఒకరైన ఆష్లీ టెలిస్ నుంచి మొదటి గట్టి హెచ్చరిక వచ్చింది. కార్నెగీ ఎండౌమెంట్కు చెందిన ఆయన 2024లో ఈ ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత విశ్లేషణను ప్రచురించారు. ఆ విశ్లేషణలో టెలిస్ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో భారతదేశం ఎదగడం, అమెరికా ప్రయోజనాలకు అనుకూలం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఆ అభిప్రాయానికి మద్దతు ఇచ్చేవారు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో ప్రభావం కలిగిన ప్రతి వర్గమూ ఇప్పుడు ఒకే ప్రశ్న దాంతో మాకు ఏమి లాభం? అని అడుగుతోందని టెలిస్ చెప్పారు. 2008 ప్రారంభంలో అమెరికా కాంగ్రెస్ సభ్యుల ప్రతినిధి బృందం అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిసిన సందర్భం నాకు గుర్తొస్తోంది. వారు అప్పుడు ఇలా అన్నారు: ఇది 123 కోసం 126. అంటే, భారత- అమెరికా పౌర అణు ఒప్పందానికి మార్గం సుగమం చేసే హైడ్ చట్టంలోని 123 సవరణకు తమ మద్దతు ఇవ్వడం వెనుక ఒక అర్థం ఉందని వారు సూచించారు. అదేంటంటే, భారత్ 126 యుద్ధ విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వాలని వారు ఆశిస్తున్నారని అర్థం. కానీ ఆ కొనుగోలులో భారత్ చివరకు ఫ్రాన్స్ను ఎంచుకుంది. అయినప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు భారత్ తర్వాత అమెరికా నుంచి ఇతర రక్షణ సామగ్రి కొనుగోలుపై బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. అధ్యక్షుడు ట్రంప్ కాలంలో పరిస్థితి మరింత స్పష్టమైంది - అమెరికా మాంగే మోర్! అనే ధోరణి కనిపించింది. భారత్ మరిన్ని అమెరికన్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని, ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్కు ఉన్న అధిక మిగులు (ట్రేడ్ సర్ప్లస్) తగ్గించాలని అమెరికా కోరింది. అంతేకాదు, భారత్ తన దిగుమతి సుంకాలను తగ్గించాలనీ, డేటా లోకలైజేషన్ విధానంపై పట్టుదల విడిచిపెట్టాలనీ అమెరికా ఒత్తిడి తీసుకొచ్చింది. తరువాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని కూడా నిలిపివేయాలని కోరింది. సారాంశంగా ట్రంప్ సందేశం ప్రసిద్ధ సంగీత నాటకం మై ఫెయిరీ లేడీ (My Fair Lady) లోని పాటలా ఉండింది ప్రేమ గురించి మాట్లాడకండి, చేసి చూపించండి! ప్రపంచాన్ని ఎంత కావాలంటే అంత ఆలింగనం చేసుకోండి, కానీ నా ముందు మాత్రం వంగాలి - అన్నట్టుగా ఆ సందేశం కనిపించింది. ట్రంప్ నుంచి ఒకదాని వెంట ఒకటి అనేక షాక్లు వచ్చాయి. మొదటగా 2025 జనవరిలో జరిగిన తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను ట్రంప్ ఆహ్వానించి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం ఇవ్వకపోవడం గమనార్హం. ఈ పరిస్థితిలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెంటనే వాషింగ్టన్కు వెళ్లి ప్రధానమంత్రికి ఆహ్వానం పొందేందుకు ప్రయత్నించారు. కానీ చివరికి ఆయనకు మాత్రమే ఆహ్వానం లభించింది. దీని వెంటనే మరో వివాదం చెలరేగింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం, భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతలను తానే మధ్యవర్తిత్వం చేసి యుద్ధ విరమణకు దారితీసానని ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. అంతేకాదు, ఇందుకు తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని కూడా పేర్కొన్నారు. అయితే భారత్ మాత్రం ఈ ప్రకటనలను ఖండించింది. కాల్పుల విరమణ నిర్ణయంలో అమెరికాకు ఎలాంటి పాత్రలేదని స్పష్టం చేసింది. ఇక పాకిస్థాన్ మాత్రం ట్రంప్కు ధన్యవాదాలు తెలుపుతూ, ఆయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఆ తరువాత భారతదేశంపై విమర్శలు చేస్తూ వచ్చిన పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్కు అమెరికా అధ్యక్షుడు మధ్యాహ్న భోజనానికి ఆహ్వానం ఇవ్వడం మరో సంచలనంగా మారింది. ఇది దౌత్యపరంగా అసాధారణమైన పరిణామంగా భావించబడింది. ఢిల్లీ, వాషింగ్టన్లోని దౌత్యవర్గాలు మరో విషయాన్ని కూడా గమనించాయి. ప్రధాని నరేంద్ర మోడీ వైట్హౌస్కు వెళ్లినప్పుడు ట్రంప్ స్వయంగా ద్వారం వద్దకు వచ్చి స్వాగతం పలకలేదు. అదే సమయంలో ట్రంప్ పాకిస్థాన్ నాయకత్వంతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ సన్నిహితంగా వ్యవహరించడాన్ని కూడా వారు గుర్తుచేశారు. పాకిస్థాన్ నాయకులు మాత్రం ఆయనతో ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, ఎప్పటికప్పుడు సర్జీ అంటూ మర్యాద చూపుతున్న దృశ్యాలు కనిపించాయి. భారతదేశంలో మోడీ అనుచరులను ఎక్కువగా ఆగ్రహానికి గురిచేసే విషయం ఏదైనా ఉంటే, అది భారత్ కంటే పాకిస్థాన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. చైనా విషయంలో అయితే వారు కొంత వరకు సహనంగా ఉంటారు. ఎందుకంటే అక్కడ డబ్బే ప్రభావం చూపుతుందని వారికి తెలుసు. చైనా పెద్ద ఆర్థిక శక్తి, సంపన్న దేశం. కాబట్టి ప్రపంచ దేశాలు చైనాతో తమ సంబంధాలను కొనసాగిస్తే దానికి పెద్దగా అభ్యంతరం చెప్పలేమని వారు భావిస్తారు. కానీ పాకిస్థాన్ విషయానికి వస్తే పరిస్థితి భిన్నం. వారి దృష్టిలో అది విఫలమవుతున్న, అస్థిరతలో ఉన్న దేశం. అంతేకాదు, భారత్కు ప్రత్యక్ష శత్రువు. అలాంటి దేశంతో ఎవరైనా స్నేహపూర్వకంగా వ్యవహరించడం ఎలా సమర్థించగలమని వారు ప్రశ్నిస్తారు. అయితే ట్రంప్ మాత్రం పాకిస్థాన్తో సన్నిహితంగా వ్యవహరించడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ అవమానాలు, నిర్లక్ష్య సంకేతాలు వరుసగా ఎదురైనా భారత్ మాత్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ను సందర్శించి అక్కడి ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పలుమార్లు సన్నిహితంగా కలుసుకున్నారు. అమెరికాలో ప్రభావం కలిగిన యూదు వర్గాలు ట్రంప్పై ప్రభావం చూపించి, మోడీపై ఆయన వైఖరిని మార్చవచ్చని భావించినట్టుగా కనిపించింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై బాంబు దాడులు చేసి, ఆ దేశ సుప్రీం నాయకుడిని హత్య చేసిన ఘటనపై కూడా భారత్ పెద్దగా స్పందించలేదు. ఇదిలా ఉండగా, అమెరికా మరో చర్య భారత్కు అసౌకర్యం కలిగించింది. భారత జలాలకు సమీపంలో ఉన్న ఒక ఇరాన్ నౌకపై బాంబు దాడి చేసిన తర్వాత, గల్ఫ్ ప్రాంతంలో సరఫరాలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత్కు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన భారత్పై మరింత అవమానకరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ అవమానాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టఫర్ లాండౌ చేసిన వ్యాఖ్యలు మరోసారి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. ‘చైనా ఎదుగుదలకు అమెరికా సహకరించడం వల్ల మీకు సమస్యలు తలెత్తాయి. కానీ భారతదేశం ఎదుగుదల కోసం మేము ఆ సమస్యలను పరిష్కరించలేము అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే సందేశం స్పష్టమే.. అమెరికాను గొప్పగా చేయాలనే MAGA (Make America Great Again) లక్ష్యానికి, భారత్ను గొప్పగా చేయాలనే MIGA (Make India Great Again) అవసరం లేదన్న మాట. సంజయ్ బారు
రాజకీయాల్లో నాయకత్వాన్ని కొలిచే ప్రమాణాలు అనేకం ఉంటాయి. అధికారాన్ని సాధించడం ఒకటి, ప్రజలకు సంక్షేమం అందించడం మరొకటి. అయితే వాటన్నింటికంటే గొప్పది నాయకుడు తనపై నమ్మకం ఉంచిన వారిని ఎలా ఆదుకుంటాడన్నది. నమ్మి నడిచిన వారికోసం ఎంతదూరమైన వెళ్లి నిలబడగలిగితేనే నాయకత్వం సార్థకం అవుతుంది. రాజకీయ సమీకరణాలు, వర్గాల ఒత్తిళ్లు, అవకాశాల కోసం జరిగే పోటీ మధ్య అలాంటి ధోరణి అరుదుగా కనిపిస్తుంది. అందుకే రాజకీయాల్లో నమ్మకం అనేది అత్యంత విలువైన మూలధనంగా చెప్పబడుతుంది. అధికార పోరాటాల్లో చాలాసార్లు వ్యక్తిగత విశ్వాసాల కంటే రాజకీయ సమీకరణలే పైచేయి సాధిస్తాయి. పరిస్థితులు మారితే మిత్రులు మారడం, సమీకరణాలు మారితే నిర్ణయాలు మారడం రాజకీయాల్లో సహజమే. కానీ కొందరు నాయకులు మాత్రం ఈ సాధారణ ధోరణికి భిన్నంగా వ్యవహరిస్తారు. తమపై విశ్వాసం ఉంచిన వారిని కాపాడటమే కాకుండా అవసరమైతే వారి కోసం రాజకీయంగా రిస్క్ తీసుకోవడానికీ వెనుకాడరు. అలాంటి నాయకత్వాన్ని రాజకీయ చరిత్ర ప్రత్యేకంగా గుర్తుంచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అలాంటి నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన పేరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి. ఆయన రాజకీయ జీవితం గురించి మాట్లాడేటప్పుడు సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాప్రయోజనాల నిర్ణయాలు ఎంతగా చర్చకు వస్తాయో, తనతోపాటు నడిచిన నాయకులపై చూపిన విశ్వాసం కూడా అంతే ప్రాధాన్యం పొందుతుంది. వైఎస్సార్కు వ్యక్తిగత నమ్మకం చాలా విలువైనది. తనతోపాటు పోరాటంలో నడిచిన వారిని ఆయన ఎప్పుడూ మరువలేదు. ఆ సందర్భాల్లో ఎక్కువగా ప్రస్తావించబడేది కెవిపి రామచంద్రరావుతో ఆయనకు ఉన్న అనుబంధం. కెవిపిని ఆయన కేవలం రాజకీయ సహచరుడిగా మాత్రమే కాకుండా అత్యంత సన్నిహితుడిగా భావించేవారని కాంగ్రెస్ వర్గాలు చెప్పేవి. ఆయనపై ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా రాజ్యసభ సీటు వ్యవహారం తరచూ ఉదాహరణగా చెప్పబడుతుంది. పార్టీ అంతర్గతంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా, తనకు నమ్మకంగా ఉన్న వ్యక్తికి న్యాయం చేయాలనే సంకల్పంతో వైఎస్సార్ వ్యవహరించిన తీరు అప్పట్లో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఇదే ఆయన నాయకత్వానికి ప్రత్యేకతను తెచ్చింది. ఇప్పటి తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇటువంటి దృశ్యం కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి వ్యవహార శైలిలో కూడా ఇదే లక్షణం ప్రతిఫలిస్తోందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థిత్వం విషయంలో ఆయన ప్రదర్శించిన పట్టుదల దీనికి ఉదాహరణగా చెప్పబడుతోంది. సాధారణంగా రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల విషయంలో అనేక సమీకరణాలు ప్రభావం చూపుతాయి. ప్రాంతీయ సమతుల్యత, సామాజిక వర్గాల ప్రతినిధిత్వం, పార్టీ అంతర్గత ఒత్తిళ్లు వంటి అంశాలు నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఈసమీకరణల మధ్య కూడా తనకు నమ్మకంగా ఉన్న వ్యక్తికి అవకాశం కల్పించాలనే సంకల్పంతో రేవంత్రెడ్డి నిలబడ్డారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. చివరకు వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారవడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది.ఇది కేవలం ఒక రాజకీయ నియామకం మాత్రమే కాదని, తనతోపాటు నడిచిన వారిపై రేవంత్రెడ్డి ఉంచిన విశ్వాసానికి ఇది ఒక సంకేతమని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. 2023లో తాను పిసిసి అధ్యక్షుడిగా, మహేశ్ కుమార్ గౌడ్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. అలాగే 2029లో మహేశ్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా, తాను ముఖ్యమంత్రిగా మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేకమైన రాజకీయ సంకేతంగా భావించబడుతున్నాయి. సాధారణంగా అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ అంతర్గతంగా నాయకత్వ పోటీలు పెరుగుతాయి. కానీ రేవంత్రెడ్డి మాత్రం పార్టీ నిర్మాణంలో తనతో కలిసి పనిచేసిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే సంకేతం ఇస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా మహేశ్ కుమార్ గౌడ్ వంటి నాయకులను ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం పార్టీ అంతర్గత ఐక్యతకు ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన యాదృచ్ఛికం కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డి. శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రక్రియలో కీలకపాత్ర పోషించారు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, మహేశ్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా కలిసి పనిచేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే అప్పటి పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లాకు చెందినవారు కాగా, ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా అదే జిల్లాకు చెందినవారు కావడం గమనార్హం. అలాగే 1995 తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, 2014 తర్వాత 2023లో మళ్లీ అధికారంలోకి రావడం మరో ఆసక్తికరమైన యాదృచ్ఛికంగా చెప్పవచ్చు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్రెడ్డి -మహేశ్ కుమార్ గౌడ్ జోడీని కొందరు నాయకులు కృష్ణార్జునుల జంటగా అభివర్ణిస్తున్నారు. పార్టీపరంగా ఒకరు సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తే, మరొకరు పాలనా వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నారని వారు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చినతరువాత కూడా పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే చివరికి రాజకీయాల్లో నాయకులపై తుది తీర్పు ప్రజలదే. వారి నిర్ణయాలు ప్రజల జీవితాల్లో ఎంతమేరకు మార్పు తీసుకొస్తాయన్నదే ప్రధాన ప్రమాణం అవుతుంది. అయినప్పటికీ నమ్మినవారికి అండగా నిలబడే నాయకత్వం పార్టీకి దీర్ఘకాలిక బలం ఇస్తుందని రాజకీయ చరిత్ర చెబుతోంది. ఈ నేపథ్యంలో చూస్తే, నమ్మినవారికి న్యాయం చేయాలనే నాయకత్వ లక్షణం రాజకీయాల్లో ఎంత విలువైనదో మరోసారి గుర్తు చేస్తున్న పరిణామాలుగా ఇవి నిలుస్తున్నాయి. ఒకప్పుడు వైఎస్సార్ నాయకత్వంలో కనిపించిన ఆ లక్షణం, ఇప్పుడు రేవంత్రెడ్డి రాజకీయ శైలిలో కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.మొత్తానికి రాజకీయాల్లో విజయానికి కేవలం అధికారమే ప్రమాణం కాదు. నమ్మకం, నిబద్ధత, సహచరులపట్ల బాధ్యత కూడా అంతే కీలకమైన అంశాలు. నమ్మి నడిచిన వారిని నిలబెట్టుకోవడం, కష్టకాలంలో వెంట నడిచిన వారిని మరువకపోవడం నాయకత్వానికి నిజమైన పరీక్ష. అలాంటి విలువలతో ముందుకు సాగే నాయకత్వమే ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్న పరిణామాలు కూడా అదే సందేశాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి. నమ్మకం నిలబడితేనే నాయకత్వం బలపడుతుంది. నాయకత్వం బలపడితేనే ప్రజల విశ్వాసం మరింత గట్టిపడుతుంది. ఇదే ప్రజా రాజకీయాల అసలు సారం. అమరవాజీ నాగరాజు (టిపిసిసి ప్రెసిడెంట్ పిఆర్ఒ)
ప్రపంచ పరిణామాలు ఎంతదూరంలో జరిగినా, వాటి ప్రభావం సామాన్య వ్యక్తి జీవితంపైనే పడుతుంది. ముఖ్యంగా వ్యవసాయం వంటి సున్నితమైన రంగంపై అంతర్జాతీయ సంఘర్షణల ప్రభావం చాలా తీవ్రం. ప్రస్తుతం పశ్చిమాసియాలో విస్తరిస్తున్న యుద్ధ ఉద్రిక్తతలు, ఆర్థిక ఆంక్షలు, సరఫరా గొలుసుల్లో వచ్చిన అంతరాయాలు భారతీయ వ్యవసాయరంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఎరువుల ధరల పెరుగుదల, రవాణా వ్యయాలు, ఎగుమతి మార్కెట్లలో అస్థిరత.. ఇవన్నీ అన్నదాతలపై అదనపు భారంగా మారుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు; ఇది భారతదేశ ఆహార భద్రతకు, రైతు ఆత్మగౌరవానికి సంబంధించిన జాతీయ సవాలు. వ్యవసాయంలో ఎరువులు అనేవి రక్తం లాంటివి. ప్రపంచవ్యాప్తంగా యూరియా, ఫాస్ఫేట్, పొటాష్ తయారీ సహజ వాయువుపై ఆధారపడి ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమైతే సహజ వాయువు సరఫరా దెబ్బతినడం ఖాయం. దీని ప్రభావం నేరుగా ఎరువుల ఉత్పత్తి వ్యయంపైపడి, మార్కెట్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే గత కొన్నేళ్లుగా ఎరువుల ధరలు రైతులను కష్టాల్లో ముంచేశాయి. ఇప్పుడు యుద్ధం కలిసి వచ్చేస్తే వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల సాగు ఖర్చు మరింత ఎగిసి, రైతు లాభాలు మట్టిలో కలిసిపోతాయి. సాగు వ్యయం పెరిగినా, మార్కెట్ ధరలు అదే స్థాయిలో పెరగకపోతే రైతు ఆర్థిక దశ మరింత దారుణంగా మారడం తప్పదు. ఇది కేవలం ఎరువులతో ఆగదు. పశ్చిమాసియా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు.. హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం.. ఉద్రిక్తతలతో కలకలమైతే నౌకాశ్రయ రవాణా, బీమా ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి బియ్యం, మిర్చి, రొయ్యలు పెద్ద ఎత్తున పశ్చిమాసియా దేశాలకు వెళ్తున్నాయి. ఇరాన్ లాంటి దేశాలు మన బియ్యం ముఖ్యమైన కొనుగోలుదారులు. యుద్ధం వల్ల ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనపడితే లేదా రవాణా మార్గాలు మూసుకుపోతే మన ఎగుమతులు నేలకూలతాయి. ఇది కేవలం వ్యాపార నష్టం కాదు; లక్షలాది రైతుల, మత్స్యకారుల జీవనోపాధి ప్రశ్నార్థకం అవుతుంది. మరో వైపు, వ్యవసాయం పూర్తిగా ఇంధనంపై ఆధారపడి ఉంది. ట్రాక్టర్లు, నీటి మోటార్లు, రవాణా వాహనాలు అన్నీ డీజిల్పై నడుస్తాయి. పశ్చిమాసియా యుద్ధం చమురు ధరలను ఎగరేస్తే భారత్లో డీజిల్ ధరలు పెరగడం ఖాయం. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కార్మిక ఖర్చులు పెరిగిన తర్వాత ఇంధన ధరలు కూడా ఎగిస్తే రైతు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనవుతాడు. ఎరువుల కొరత వల్ల రైతులు తక్కువ ఎరువులు వాడితే పంటల దిగుబడులు తగ్గి, దేశీయ ఆహార ఉత్పత్తి తగ్గి, ఆహార భద్రతకు గండి పడే ప్రమాదం ఉంది. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారు. దిగుబడులు తగ్గితే దేశీయ అవసరాలు తీర్చడమే సవాలుగా మారి, ఆహార ధరలు పెరిగి సాధారణ ప్రజలు కూడా ఇబ్బందిపడతారు. అయితే ప్రతి సంక్షోభంలో ఒక అవకాశం దాగి ఉంటుంది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నప్పుడు కొన్ని దేశాలు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటాయి. అప్పుడు మన బియ్యం, మసాలా పంటలు, పప్పుధాన్యాలకు మంచి డిమాండ్, మంచి ధరలు లభించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ రొయ్యల ఉత్పత్తిలో కీలకం. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు ఏం చేయాలి? ‘ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలను వెంటనే అన్వేషించాలి. ‘రైతులకు డీజిల్, ఎరువులపై సబ్సిడీలను పెంచాలి.’ ఎగుమతులకు కొత్త మార్కెట్లను అభివృద్ధి చేయాలి. ‘నిల్వ వ్యవస్థలను బలోపేతం చేసి, సంక్షోభ సమయంలో కూడా ఆహార భద్రత కాపాడాలి. పశ్చిమాసియా యుద్ధం కేవలం రాజకీయ లేదా భౌగోళిక సమస్య కాదు. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే శక్తివంతమైన ఆయుధం. ఆ దెబ్బ చివరికి భారతీయ రైతు పొలానికి, అతని కుటుంబానికి చేరుతుంది. కాబట్టి ఈ సంక్షోభాన్ని తాత్కాలిక సమస్యగా కాకుండా, దీర్ఘకాలిక వ్యూహంతో ఎదుర్కోవాలి. రైతులకు రక్షణ, వ్యవసాయానికి బలం, ఆహార భద్రతకు కాపలా.. ఇవే ప్రభుత్వాల ముందున్న అత్యవసర బాధ్యతలు. మేకల కృష్ణ 99485 56978
ప్రతి జిల్లా కేంద్రానికీ రింగురోడ్డు
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి జిల్లా కేంద్రానికి రింగురోడ్డు ఏర్పాటుతో పాటు వాటిని జా తీయ రహదారులకు అనుసంధానించే అంశాల పై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి పూర్తిస్థా యి ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్డు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఆ శాఖ ప్ర త్యేక కార్యదర్శి వికాస్రాజ్, సిఎంఒ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. రోడ్ సెక్టార్ పాలసీ-2047కు అ నుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధిం చి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హై దరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా ని ర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగాలని సిఎం సూచించారు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిం దిగా ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన ఏరియాలలో రోడ్ల అభివృద్ధి పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిం చారు. స మస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, రెవెన్యూ వి భాగాలతో సమీక్షించి స్పష్టమైన విధానంతో ముం దుకు వెళ్లాలన్నారు. బోధనా హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రుల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా హాస్పిటల్స్ భవనాల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సర్వోన్నత న్యాయస్థానంలో స్పీకర్పై దాఖలైన ధిక్కరణ పిటిషన్పై గురువారం (12న) విచారణ జరగనున్నది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తాము దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎనలేని జాప్యం చేస్తున్నారంటూ బిఆర్ఎస్ లోగడ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీం కోర్టు గతంలో మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది. అయినా స్పీకర్ నిర్ణ యం తీసుకోకుండా ధర్మాసనం ఆదేశాన్ని ధిక్కరించారం టూ బిఆర్ఎస్ ధిక్కరణ (కంటెంప్ట్) పిటిషన్ దాఖలు చే సింది. దీనిని సుప్రీం సీరియస్గా తీసుకుని మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని,స్పీకర్కు ఇదే చివరి గడువు అని గట్టిగా తెగేసి చెప్పింది. ఆ గడువు ముగిసి గురువారం సుప్రీం బెంచ్ విచారణ చేపట్టనున్నది. దీంతో గురువారం సుప్రీం ధర్మాసనం స్పీకర్ విచారణ, మొత్తం పది అనర్హత పిటిషన్లపై తీర్పు ఇచ్చేసి విచారణ ముగించడంతో సంతృప్తి చెంది తమ ముందు ఉన్న కంటెంప్ట్ పిటిషన్ను డిస్మిస్ చేస్తుందా? లేక స్పీకర్ ఇచ్చిన తీర్పు లోతుల్లోకి వెళ్ళి, మళ్లీ ఏదైనా ఉత్తర్వులు ఇస్తుందా? అనేది వేచి చూడాల్సిందేనని వివిధ పార్టీల నాయకులు అంటున్నారు.
ఇప్పుడు రాళ్లతో ఎవరిని కొట్టాలి?
మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్గాంధీకి సిగ్గుంటే పార్టీ ఫిరాయింపులపై సమాధానం చెప్పాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చం పాలని గతంలో రేవంత్రెడ్డి అన్నారని, ఇప్పుడు రాళ్లతో ఎవరిని కొట్టి చంపాలని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపుల సంస్కృతీ గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి లేదని, స్పీకర్ చేతుల్లో అసలు ఏమీ లేదని, మొత్తం కాంగ్రెస్ పార్టీనే ఈ ఫిరాయింపుల వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించిందని కెటిఆర్ మండిపడ్డారు. ఈ కేసులో రాహుల్గాంధీ అసలు దోషి అని ఆయన అనుమతి లేకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకునే సాహసం చేయలేరని ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అని చెప్పిన రాహుల్ గాంధీ, తెలంగాణ వచ్చి న్యాయ పత్రాల గురించి ఉపన్యాసాలు దంచిన రాహుల్, ఈరోజు స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఏం సమాధానం చెబుతారని కెటిఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ హర్యానాలో మొదలుపెట్టిన ఫిరాయింపులు ప్ర స్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పాకిందన్నారు. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 26మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, 10 మందిని తీసుకున్నది కాంగ్రెస్ కాదా అని కెటిఆర్ గుర్తుచేశారు. పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్చిట్ ఇవ్వడంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడిగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బిఫాం మీద ఎంపిగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రో జు అని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఒక తీర్పు కాద ని, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాం గ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అని ఆయన అన్నా రు. భారతదేశ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకున్నందుకు రాహుల్గాంధీకి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు తాము సన్మా నం చేయాలనుకుంటున్నామని కెటిఆర్ ఎద్దేవా చేశారు. కడియం సిగ్గులేకుండా ఎందుకు బ్రతకాలి? కడియం శ్రీహరికి బిఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం ఏంటి? ఆయన 2013లో వచ్చినప్పుడు కెసిఆర్ ఆయన్ను ఎంపిని చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సిఎంను చేశారు. ఆపై ఎమ్మెల్సీని చేశారు. తర్వాత ఎమ్మెల్యేను చేశారు. ఆయన కూతురికి ఎంపి టికెట్ ఇచ్చారు. ఈ వయసులో ఇలాంటి ‘మురికి’ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత సిగ్గులేకుండా ఎందుకు బతకాలి? నేను ఇంకా బిఆర్ఎస్లోనే ఉన్నాను, నాయకత్వంతోనే ఉన్నానని మీరు చెప్పారు. అందుకే అడుగుతున్నాను, ఈ ‘థర్డ్ క్లాస్’ మాటలు ఎందుకని కెటిఅర్ ప్రశ్నించారు. వెలుగుమట్ల భూములు భూదాన్ బోర్డువే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో వెయ్యి మంది పేదల ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టిన ఘటనపై ఆయన మండిపడ్డారు. భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదలను బలవంతంగా గెంటేసిందని, గతంలో అదే భూదాన్ భూముల్లో కొంతభాగాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులపరం చేసిందని కెటిఆర్ ఆరోపించారు. వాస్తవానికి వెలుగుమట్లలో ఇళ్లు కూలగొట్టిన ప్రాంతంలోని భూము లు భూదాన్ భూములని ఆయన తెలిపారు. 1950ల్లో ఆచార్య వినోభాబావే నాయకత్వంలో జరిగిన భూదానోద్యమంలో పలువురు దాతలు భూములను దానం చేశారన్నారు. అదేవిధంగా వెలుగుమట్లలో కూడా ఇద్దరు దాతలు 62 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకు విరాళంగా ఇచ్చారన్నారు.
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: వెలుగుమట్ల భూదాన భూమిలో నిరాశ్రయులైన నిరుపేదల కోసం దేశంలోని ఇతర రాష్ట్రాల వారు వచ్చి చూ సేలా ఆదర్శవంతమైన మోడల్ కాలనీ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భూదాన్ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్ళను కూల్చడంతో నిరాశ్రయిలైన నిరుపేదలకు బుధవారం జిల్లా కలెక్టరేట్లో ఇళ్ళ పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు పత్రాలను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు పంపిణీ చేశారు. భూదాన్ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గురువారం నుంచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి డిసెంబర్ 9న సోనియాగాంధి జన్మదినోత్సవం నాటికి మోడల్ కాలనీని నిర్మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామని చెప్పారు . ఇల్లు కట్టిస్తామని పది సంవత్సరాలపాటు పరిపాలించిన వారు చెప్పిన మాటలు నమ్మి ఎదురు చూసి చూసి పేదల కళ్ళు కాయలు కాశాయని, వారు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదని, అలాంటి వారికి మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. ఈ రాష్ట్రంలో జీవించే ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలనేది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఆలోచన అన్నారు. ఆ ఆలోచనలో భాగంగానే రాష్ట్రంలో పేదవారి కోసం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు రూ 22,500 కోట్ల నిధులను ఒకేసారి మంజూరు చేసి చేసే దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం తమది అనే డిప్యూటీ సీఎం తెలిపారు. ఇలాంటి ప్రభుత్వంపై కావాలని పేదలకు మేలు జరగవద్దనే ఉద్దేశ్యంతో కొద్దిమంది ప్రజా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వెలుగుమట్లలో మాఫియా గ్యాంగ్ పేదల నుంచి డబ్బులు వసూలు చేసి ,వారికి కనీస సౌకర్యాలు లేకుండా సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసిందని, పేదలు ఆత్మగౌరవంతో బతికేలా చేయాలని వెలుగుమట్లలో అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. వెలుగుమట్లలో అర్హత కలిగిన 412 మందిని గుర్తించి పట్టాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వాన్ని ,మంత్రులను వ్యక్తిగతంగా దూషించారని,ఇతర రాజకీయపార్టీ వారనే కక్షపూరితంగా వ్యవహరించకుండా పారదర్శకంగా జరిగిన సర్వే అధారంగాఅర్హులైన అందరికి పట్టాలను ఇస్తామని,ఇంకా ఎవ్వరైన అర్హులు మిగిలిపేతే వారికి కూడా అందజేస్తామన్నారు.. వివిధ గ్రామాల్లో ఉన్న 101 మంది పేదలకు వారి గ్రామాల్లో ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఈ రోజే అనుమతి పత్రాలు మంజూరు చేశామని , ఇది పేదల పక్షాన మాకు ఉన్న నిబద్ధత అని భట్టి స్పష్టం చేశారు. పేదలనిసహాయతను,పేదరికాన్ని అడ్డుపెట్టుకొని బతికే మాఫియా శక్తులను దరిదాపుల్లోకి రానివ్వద్దని పేదలకు, అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. వెలుగుమట్లలో పేదలకు పంచగా మిగిలిన 16 ఎకరాల భూమిని తెలంగాణ పబ్లిక్ స్కూల్, గురుకుల పాఠశాలల వంటి ప్రభుత్వ విద్యా సంస్థల నిర్మాణానికి ఉపయోగిస్తామన్నారు. ‘యాడ మీ ప్రభుత్వం వచ్చేది’?: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదే పదే తమ ప్రభుత్వం వస్తుందని చెప్పుకుంటూ బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని, యాడ మీ ప్రభుత్వం ఒచ్చేది? .. ఏంది మీ ప్రభుత్వం ఒచ్చేది? అని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ‘ఈ ప్రజాప్రభుత్వం పేదోడికి అండగా ఉంది. పేదోడి దీవెనలు ఉన్నాయి. ఫలితాలు ఉన్నాయి.. ఇన్ని ఫలితాలు చూశాక కూడా నిస్సిగ్గుగా పగటి కలలు కనవద్దు. ఇంకా ఊహించుకుంటున్నావ్.. ముఖ్యమంత్రిని అనో, కాబోయే ముఖ్యమంత్రిని అనో.. మీ పగటి కలలను కల్లలుగానే ఈ తెలంగాణా ప్రజలు ఉంచుతారు.. ఊహల్లో ఊగిసలాడకు’ అని పొంగులేటి కెటిఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు గత నెల 24న వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేతలు జరిగిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే నాయకులు వచ్చి మొసలి కన్నీరు కార్చారని , 2023 జూలై నెలలో ఎన్నికల కంటే ముందు వెలుగుమట్ల ప్రాంతంలో కూల్చివేతలకు గత ప్రభుత్వం పాల్పడింది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. పేదల జీవితాల్లో శాశ్వత వెలుగులు: మంత్రి తుమ్మల రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఇళ్ళపేరుతో కొంతమంది ముఠా ఏర్పడి మోసం చేస్తే గత పాలకులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు పేరిట ఇచ్చిన పత్రాలు బోగస్ అని, సిసిఎల్ఏ ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. మాఫియాను ప్రారద్రొలే కమ్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలో పేదలకు కొంత ఇబ్బంది కలిగిందని.. దీని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలన్నారు ప్రజా ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల వెలుగుమట్ల లో పేదల జీవితాల్లో శాశ్వత వెలుగులను నింపామని,దీని ద్వారా పదేళ్ళుగా నడుస్తున్నసమాంతర ప్రభుత్వాన్ని ఉక్కుపాదంతో అణిచివేసినట్లయిందన్నారు.లాఠీ ఛార్జ్ లేకుండా అక్రమ నిర్మాణాలు కూల్చివేసి దగా కోరులను తరిమివేశామని మంత్రి తెలిపారు. పదేళ్ళు బిక్కుబిక్కుమంటూ బ్రతికారని ఇకపై స్వేఛ్చగా,నిర్బయంగా ,దర్జాగా ఆత్మగౌరవంతో బతకవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ,జిల్లా పోలీస్ కమీషనర్ సునీల్ దత్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న,ఎమ్మెల్యే రాందాస్ నాయక్, అదనపు కలెక్టర్ పిన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు,ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ,కమీషనర్ అభిషేక్ అగస్థ్య తదితరులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలిగింపు కోరుతూ ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాస నం బుధవారం లోక్సభలో వీ గిపోయింది. చట్టసభలో అసాధారణ రీతిలో తీసుకువచ్చిన ఈ తీర్మానంపై పెద్దగా ఎటువంటి ప్రతిస్పందనలు, ఊహించిన రీతిలో వాగ్యుద్ధాల నడుమ ఓడిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాల తీరుపైసభలో మండిపడ్డారు. ప్రత్యేకించి లోక్సభలో విపక్ష నేత రా హుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాటలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయి నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలోనే అమిత్ షా ఘాటు ప్రసంగం సాగింది. ప్రతిపక్షాల సభ్యులు ప్రవర్తన, సభా తీరుతెన్నుల గురించి మాట్లాడుతున్నారు. అసలు ప్రతిపక్ష నేత హోదా ఉన్న వ్య క్తి వైఖరే సభలో విచిత్రరీతిలో ఉంటే, ఇక ప్రతిపక్షం గురించి చెప్పాల్సిందేముం ది? ఆయన ఉన్నట్లుండి లేచి వె ళ్లి ప్రధానిని ఆలింగనం చేసుకుంటాడు. లేదా గాలిలో ముద్దు విసురుతాడు, లేదా కన్నుకొడుతాడని, ఆయన ఏ విధంగా కవ్విస్తున్నాడనేది అందరికీ తెలిసిందే అధ్యక్షా అన్నారు. ప్రతిపక్షాల సభ్యులు అంతా లేచి అమిత్షాకు అడ్డుతగులుతూ నినాదాలకు దిగారు. అధికార, వి పక్ష సభ్యుల మధ్య వాదోపవాదాల మధ్యనే మూ జువాణితో రణగొణధ్వనుల మధ్య తీర్మానం రా వడం, వీగిపోయినట్లు ప్రకటించడం జరిగిపోయింది. సభలో ప్రతిపక్షానికి 230సభ్యుల బలం ఉంది. వీరిలో 99 మంది కాంగ్రెస్ సభ్యులు. మి గిలిన వారు టిఎంసి, ఎస్పి, డిఎంకె ఇతర పా ర్టీ ల వారు ఉన్నారు. పాలకపక్షానికి 293 మంది ఎంపీల బలం ఉంది. వీరిలో బిజెపి బటం 240, జెడియు నుంచి 16 మంది, టిడిపి నుంచి 12 మంది, ఎన్డిఎ ఇతర మిత్రపక్షాల ఎంపీలు ఉన్నారు. సభలో బలాబలాలను బట్టి తీర్మానం నిలువదనేది అందరికీ తెలుసు. అయితే ప్రతిపక్షాలు తమ వాదనను తెలియచేసుకోవడానికి ఈ తీర్మానాన్ని వాడుకున్నట్లు స్పష్టం అయింది. స్పీకర్ ఓం బిర్లా అధికార పక్షం వ్యక్తిగా వ్యహరిస్తున్నాడని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వడం లేదని, ప్రజాస్వామిక పార్లమెంటరీ సంప్రదాయాలకు భిన్నంగా ప్రతిపక్షాల గొంతుకను అణచివేస్తున్నారని తీర్మానం కారణాలలో పేర్కొన్నారు. తీర్మానంపై మంగళవారం నుంచి గురువారం వరకూ వాడివేడిగా చర్చ .జరిగింది. స్పీకర్కు వ్యతిరేకంగా తీసుకువచ్చిన తీర్మానం వీగిపోయిందని నిరసనల మధ్య ప్రకటించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య తిరోగమన చర్య ప్రతిపక్షాల అవిశ్వాసం పై అమిత్ షా మండిపాటు సభలో ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం, సరికాదని చెపితే ఆయన పదవిని కించపరుస్తూ తీర్మానం పెట్టడం ఎంతవరకూ సభబు అని హోం మంత్రి అమిత్ షా నిలదీశారు. లోక్సభ స్పీకర్పై అవిశ్వాసం తీర్మానానికి జరిగిన చర్చపై ప్రభుత్వం తరఫున అమిత్ షా స్పందించారు. పార్లమెంటరీ విలువలు, పద్థతులకు తూట్లు పొడిచారని విమర్శించారు. స్పీకర్ సభకు తటస్థ కస్టోడియన్గా ఉంటారు, ప్రతిపక్షాలు, అధికార పక్షాల సభ్యులకు వారధిగా నిలుస్తారు. అటువంటి స్థానంలోని వ్యక్తిపై తొలిగింపునకు తీర్మానం తీసుకురావడం దురదృష్టకరం , పార్లమెంటరీ రాజకీయాలకు అనుచితం అని అమిత్ షా మండిపడ్డారు.. కాంగ్రెస్ నేతలకు థరూర్ క్లాస్ తీసుకోవాల్సిందే ప్రతిపక్ష నేతలు ప్రత్యేకించి కాంగ్రెస్లో చలామణి అయ్యే నేతలు దారితప్పారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీలో మిగిలిన సీనియర్ ఎంపి శశి థరూర్ ఇతర అతి కొద్ది మంది నేతలు అయినా వారికి బుద్ధి చెప్పాల్సి ఉందని అమిత్ షా చురకలు పెట్టారు. సభలో ఏ విధంగా ఉండాలి? సభా మర్యాదలు పద్ధతులు పాటించడం ఎట్లా అనేది తెలియచేయాల్సి ఉందని హితవు పలికారు. తప్పుగా వ్యవహరించే సభ్యులను స్పీకర్ దారికి తెచ్చేందుకు మందలిస్తే తప్పేమీ లేదన్నారు. స్పీకర్ ఓం బిర్లా ఈ అవిశ్వాస తీర్మానం తనపై వచ్చినందున తాను చర్చ దశలో సభలో ఉండనని ముందుగా చెప్పారు. దీనితో సభకు ఈ దశలో బిజెపి ఎంపి జగదాంబికా పాల్ అధ్యక్షత వహించారు. అవిశ్వాస తీర్మానం ఓడిందని ప్రకటించారు. గురువారానికి సభ వాయిదా పడింది. గురువారం తిరిగి సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరుగుతుంది. ఈ దశలోనే ఆయన తమ తరఫున ఓ ప్రకటన వెలువరించనున్నారు. సభలలో ప్రతిపక్ష సభ్యులు , ప్రత్యేకించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరు తెన్నులను విశ్లేషిస్తూ మాట్లాడుతారని వెల్లడైంది.
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మూడవ విద్యుత్ పంపిణి సంస్థ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి వి ద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన మూడవ డిస్కం పేరును తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టిజిఆర్పిడిసిఎల్)గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే దక్షిణ తె లంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (టిజిఎస్పిడిసిఎల్), ఉ త్తర తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (టిజిఎన్పిడిసిఎల్) రెండు డిస్కంలు పనిచేస్తున్నాయి. తాజాగా మూడ వ డిస్కంగా టిజిఆర్పిడిసిఎల్ను అధికారికంగా ఏర్పా టు చేశారు. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ నీటి సరఫరా వ్యవస్థలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పరిధిలోని కనెక్షన్లు, ఎల్టి విఐబి కేటగిరీ పరిధిలోని మునిసిపల్ నీటి సరఫరా కనెక్షన్లు టిజిఆర్పిడిసిఎల్ పరిధిలోకి రానున్నాయి. దక్షి ణ తెలంగాణ వి ద్యుత్ పంపిణి సంస్థలో సిఎండి గా పనిచేసిన అ నుభవమున్న ము షారఫ్ ఫరూఖీను కొత్త విద్యుత్ సంస్థకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. అలాగే రాష్ట్రంలోని దక్షిణ, ఉత్తర తెలంగాణ పంపిణి సంస్థల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్న వి.తిరుపతిరెడ్డి, పి.కృష్ణరెడ్డి, వి.మోహన్ రా వు, ఎన్.నరసింహులును పాలక మండలి సభ్యులుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కా గా, టిజిఆర్పిడిసిఎల్ నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బందిని డిప్యూటేషన్, ప్రత్యక్ష నియామకాలు లేదా అవుట్సోర్సింగ్ విధానం ద్వారా సమకూర్చుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సేవల సామర్థ్యాన్ని పెంచడం, రైతులకు మ రింత మెరుగైన సేవలు అందించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ధర్పల్లి మాజీ ఎంపిపి ఇమ్మడి గోపి దారుణ హత్య
ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి బుధవారం దారుణ హత్య కు గురయ్యారు. ఆయన సమీప బంధువే లింగాపూర్ గ్రామ శివారులో కారు తో ఆక్సిడెంట్ చేసి బయటకు ఈడ్చి కత్తుల తో పొడిచి హత్య చేసారని సమాచారం. నిజమాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి గోపి ధర్పల్లి లింగాపూర్ నుండి గౌరారం వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గొడ్డలితో దాడి చేసి సినిమాను తలపించే విధంగా పరిగెత్తించి గొడ్డలితో నరికి చంపినట్లు స్థానికులు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గురువారం రాశి ఫలాలు (12-03-2026)
మేషం ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. వృషభం సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. మిధునం ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కర్కాటకం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారంతో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సింహం సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. తుల చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృశ్చికం ఆదాయ మార్గాలు తగ్గుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. ధనస్సు ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారమున భాగస్తులతో సమస్యలు ఉంటాయి. బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మకరం కుటుంబ సభ్యులు నుండి ధనసహాయం లభిస్తుంది. గృహమున చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కుంభం మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారములలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనం దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి. సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వాషింగ్టన్ ః ఆద్యంతం భద్రతా ఏర్పాట్లతో నిఘాతో ఉండే అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వద్ద గురువారం ఉదయం తీవ్రకలకలం చెలరేగింది. వైట్హౌస్కు కూతవేటు దూరంలోని భద్రతా వలయాల కారిడార్లను వేగంగా ఢీకొంటూ ఓ వాహనం దూసుకువచ్చింది. ఎప్పుడూ ప్రజలు, సిబ్బందితో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఈ ఘటన కలవరానికి దారితీసింది. ప్రస్తుత యుద్ధ వాతావరణం దశలో అమెరికాలో మరింత సంచలనం అయింది. ఈ ఘటన వెంటనే డౌన్టౌన్లో రహదారులను మూసివేయించారు. జనం కదలికలను నియంత్రించారు. వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికార వర్గాలు పూర్తి స్థాయిలో సమగ్ర ప్రకటన వెలువరించాల్సి ఉంది.
ఖమ్మం వెలుగుమట్ల బాధితుల ఇళ్లు కూల్చేసిన చోటనే ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవా రం సాయంత్రం విరమించారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వెలుగుమట్ల బాధితులకు ఇండ్లు కూల్చేసిన చోటునే కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఖమ్మంలో మహాధర్నా చేపట్టిన కవిత, విశార దన్, బాధితులు అదే రోజు రాత్రి నిర్వాసితులతో కలిసి అంబేద్కర్ భవన్ లో నిరవధిక నిరాహార దీక్ష చేసిన విషయం విదితమే. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ సహా ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేసి, విడుదల చేశారు. అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత, డీఎస్పీ ఆఫీస్లో విశారదన్ దీక్ష కొనసాగించారు. ప్రభుత్వం ఆక్రమణదారులు అంటూ వెలుగుమట్లలో ఇండ్లు కూల్చేసిన వారినే బుధవా రం ఆ స్థలాలకు యజమానులుగా పేర్కొం టు టోకెన్లు జారీ చేయడంతో దీక్ష విరమించినట్లు ప్రకటించారు. వెలుగుమట్లలో మిగతా బాధితులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని కవిత, విశారదన్ ప్రకటించారు. బాధితులపై కేసులు ఎత్తేయాలి కానీ బాధితులకు అండగా నిలిచిన జాగృతి కార్యకర్తలపై కేసులు పెట్టారని కవిత అన్నారు. తనపై, విశారదన్పై పెట్టిన కేసులు ఎత్తివేయకపోయి నా పర్వాలేదు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, జాగృతి కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. తమ దీక్ష సందర్భంగా ఎన్నో ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
వైట్హౌస్ వద్ద దూసుకువచ్చిన వ్యాన్ కలకలం
ఆద్యంతం భద్రతా ఏర్పాట్లతో నిఘాతో ఉండే అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వద్ద గురువారం ఉదయం తీవ్రకలకలం చెలరేగింది. వైట్హౌస్కు కూతవేటు దూరంలోని భద్రతా వలయాల కారిడార్లను వేగంగా ఢీకొంటూ ఓ వాహనం దూసుకువచ్చింది. ఎప్పుడూ ప్రజలు, సిబ్బందితో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఈ ఘటన కలవరానికి దారితీసింది. ప్రస్తుత యుద్ధ వాతావరణం దశలో అమెరికాలో మరింత సంచలనం అయింది. ఈ ఘటన వెంటనే డౌన్టౌన్లో రహదారులను మూసివేయించారు. జనం కదలికలను నియంత్రించారు. వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికార వర్గాలు పూర్తి స్థాయిలో సమగ్ర ప్రకటన వెలువరించాల్సి ఉంది.
హర్మూజ్ జలసంధి మార్గంలో భారత్లోని గుజరాత్ కాండ్ల రేవుకు వస్తున్న మయూరి నారీ నౌకపై రాకెట్ దాడిని భారతదేశం ఖండించింది. బుధవారం సాయంత్రం విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి ఘాటుగా స్పందన వెలువడింది. థాయ్ జాతీయ పతాకంతో వస్తున్న నౌకపై గుర్తుతెలియని క్షిపణి లేదా డ్రోన్ దాడి జరిగింది. ఈ క్రమంలో పలువురు సిబ్బంది గాయపడ్డారు. ఇంతవరకూ దాడికి ఏ సంస్థా బాధ్యత వహించలేదు. అయితే ఇరాన్ సైన్యం మాటువేసి ఈ దాడికి దిగినట్లు అంతర్జాతీయ మీడియా చెపుతోంది. వాణిజ్య నౌకపై దాడి జరిపి ప్రాణాంతక చర్యకు దిగడం అమానుషం, అనాగరికం అని ఖండించారు. ఇటువంటి చర్యలు గర్హనీయం అని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఓ నౌకపై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. కొందరు గాయపడ్డారు. ఇప్పుడు జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు జాడతెలియకుండా పోయినట్లు గుర్తించారు. వీరికోసం అన్వేషిస్తున్నారు. ఈ నౌకలోని 20 మందికి పైగా సిబ్బందిని , నౌక మంటల్లో చిక్కినా క్షేమంగా బయటకు తరలించినట్లు ఒమన్ నౌకాదళం తెలిపింది. అరబ్ ఏమిరేట్స్లోని ఖలీఫా పోర్టు నుంచి గుజరాత్ తీరానికి బయలుదేరినప్పుడు దాడికి గురైంది.
పునరుద్ధరణకు సిద్ధం లక్ష్మీపురం–రుద్రారం త్రికూట శివాలయం
కాకతీయుల కాలం నాటి శిధిల దేవాలయానికి పునర్వైభవం లక్ష్యం
ഫാക്ട് ചെക്ക്: കുംഭമേളയിലെ വൈറൽ താരത്തെ വിവാഹം ചെയ്തത് കേരളത്തിൽ നിന്നുള്ളയാളല്ല.
തിരുവനന്തപുരത്ത് വെച്ച് വിവാഹിതയായ മൊണാലിസ ഭോസ്ലേയുടെ വരൻ മഹാരാഷ്ട്ര സ്വദേശിയാണ്
Fact Check: Viral video claiming Benjamin Netanyahu’s house is on fire is false
The footage actually shows a February 2026 house fire in Galloway, New Jersey
ఇక యుద్ధం ఎప్పుడైనా ఆగిపోతుంది: ట్రంప్
ఇరాన్ను దెబ్బతీయడానికి ఏమిలేదు నాయకుడు లేడు. నాయకత్వం దెబ్బతింది ఆరువారాల లక్ష్యం.. రెండో వారంలోనే పూర్తి హడావిడి ప్రెస్మీట్లో ట్రంప్ కీలక ప్రకటన వాషింగ్టన్ : ప్రస్తుత మధ్యప్రాచ్య యుద్ధం ఏ క్షణంలో అయినా ఆగిపోవచ్చునని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్ తో తమ యుద్ధం అనంతర పరిణామాల విశ్లేషణ క్రమంలో తమ ఆంతరంగిక సలహదారులతో ట్రంప్ సుదీర్ఘంగా చర్చించారు. తరువాత వైట్హౌస్లో కిక్కిరిసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. యుద్ధం ఆగిపోతుంది. అయితే ఇది తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆగిపోవచ్చు. ఇప్పుడు తమ ముందు ఇరాన్ సంబంధిత టార్గెట్స్ ఏమీ మిగిలిలేవు. అక్కడి అగ్రనాయకత్వం పోయింది. రెండో శ్రేణి కథ ముగిసింది. ఇక తాము కొట్టడానికి మిగిలిదేమీ లేదని ట్రంప్ స్పందించారు. ఇరాన్ ఇక సరైన నాయకత్వంతో ముందుకు సాగుతుందని అనుకుంటానని తెలిపారు. ఇప్పటికే ఇరాన్ సైనిక బలగాలు బాగా దెబ్బతిన్నాయని, వారు కోలుకోలేని రీతిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక యుద్ధం ముగుస్తుంది. త్వరలోనే ఆగిపోతుందని తెలిపారు. ఇజ్రాయెల్ బలగాలతో కలిసి అమెరికా సేనలు సాగించిన పోరులో ఇరాన్లోని పలు వ్యూహాత్మక స్థావరాలను దెబ్బతీశామని వివరించారు. ఇంకా కొన్ని మిగిలి ఉండవచ్చు. అయితే వారు పుంజుకోవడానికి మిగిలిందేమీ లేదన్నారు. తాను ఎప్పుడు ఆపివేయాలనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుందని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ యుద్ధం స్వల్పకాలికమే అన్నారు. అయితే యుద్ధం ముగిసిందనే ట్రంప్ వాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ రెవెల్యూషనరీ గార్డ్ దళాలు ఇప్పుడు అమెరికా కీలక స్థావరాలను, ప్రత్యేకించి టెక్ సాధనసంపత్తిని దెబ్బతీసే క్రమంలో ఉన్నాయని తెలిపారు. తాము బలోపేతం అవుతున్న దశలోనే, అమెరికాలో ట్రంప్పై వ్యతిరేకత పెరుగున్నదని, దీనితోనే ఆయన ఇప్పుడు ఓ డ్రామాగా ఈ మాటలకు దిగారని ఇరాన్ స్పందించింది. ఇప్పటికి సాగిన వార్ గొప్పగా ఉందని, తాము నిర్ణీత లక్షాలను కాలపరిమితికి ముందే చేరుకున్నామని , అనుకున్న దానికంటే ముందే శత్రువును దెబ్బతీయడం జరిగింది. ఇది అమెరికాకు గ్రేట్ వార్, అంతకు మించి గ్రేట్ ఫన్ అన్నారు. నిర్ణీత అంచనాల ప్రకారం ఆరు నెలలు యుద్ధం ఉంటుందనుకున్నానని, అయితే ముందే ఆగిపోయేలా ఉందని తెలిపారు. ఇరాన్ది విచ్ఛిన్నకర విధానం అని విమర్శించారు. ఇతర ప్రాంతాలపై అల్లరిచిల్లరిగా దాడికి దిగడం ద్వారా దశాబ్దాల తరబడి కోలుకులేని నష్టం కల్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. చమురు ఎఫెక్ట్తోనే ట్రంప్ ప్రకటన? ఓ వైపు గల్ఫ్దేశాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం, దీనితో ఆయా దేశాల నుంచి అమెరికాపై ఒత్తిళ్లు, మరో వైపు హర్మూజ్ జలసంధి నౌకా మార్గంలో చమురు రవాణా నౌకలపై ఇరాన్ బలగాల దాడులు, చమురు సరఫరా వలయానికి విఘాతం, అన్నింటికీ మించి అమెరికా సైన్యం ఇప్పటి యుద్ధంపై మానసికంగా వ్యతిరేకత ప్రదర్శించడం వంటి కారణాలతోనే ట్రంప్ ఇప్పుడు యుద్ధం ఆగిపోతుందని ప్రకటించినట్లు విశ్లేషిస్తున్నారు. ఇక ఏ దశలో అయినా బ్యారెల్ చమురు ధర 200 డాలర్లకు చేరుకుంటుందని ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయ ఇంధన ఆధారిత మార్కెట్లో ప్రకంపనలకు దారితీసింది. మరో వైపు రష్యా అధ్యక్షులు పుతిన్ నేరుగా ట్రంప్తో ఫోన్లో మాట్లాడటం, జరుగుతున్న పరిణామాల్లో అమెరికా నుంచి తక్షణ స్పందన అవసరం అని తెలియచేయడంతో ట్రంప్ తానే గెలిచినట్లు ప్రకటిస్తూ యుద్ధ విరమణకు దిగినట్లు స్పష్టం అవుతోంది. మరో వైపు చైనా అత్యంత వ్యూహాత్మకంగా ఇరాన్కు బలోపేతమైన ఆయుధ వ్యవస్థను అందించడం, తాము వెంట ఉంటామని అంతర్గతంగా తెలియచేయడం వంటి పరిణామాలు కూడా అమెరికా వైఖరిలో కొట్టొచ్చేమార్పునకు దారితీసిన కారణాలు అని ప్రచారం జరుగుతోంది. వైమానిక దాడుల క్రమంలో ఇరాన్కు ఏ మేరకు నష్టం జరిగిందనేది బేరీజు వేసుకుని, ఈ క్రమంలో అమెరికా సైనిక పాటవ శక్తికి ఆర్థిక నష్టం ఏ మేరకు ఉందనేది లెక్కించుకుని ప్రస్తుత యుద్ధపర్వానికి ముగింపును , దీనికి ముందు సంబంధిత సంకేతాలను వెలువరించాలని ట్రంప్ భావించినట్లు , దీని వెనుక ఆయన సలహాదారుల బృందం కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. సుదీర్ఘ కాల యుద్ధమే ః ఇజ్రాయెల్ ఓ వైపు ట్రంప్ యుద్ధం ముగిసిందని చెపుతున్న దశలోనే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జూ భిన్నంగా స్పందించారు. ఇది ఇప్పట్లో తేలేది కాదని, దీర్ఘకాలిక యుద్థానికే ఇజ్రాయెల్ సంసిద్ధం అయిందని ఇజ్రాయెల్లో ఓ గుర్తు తెలియని చోటు నుంచి మాట్లాడుతూ చెప్పారు. నిర్ణీత లక్షాలను చేరుకోవల్సి ఉంటుంది. నిర్ణయాత్మక విజయం దక్కేవరకూ పోరు నిలిపేది లేదని , ఇందుకు ఇజ్రాయెల్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత తీవ్రస్థాయి పోరు బుధవారంతో రెండో వారంలోకి చేరుకుంది.
IPL 2026.. ఉప్పల్పై చిన్న చూపు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ 2026 తొలి విడత షెడ్యూల్లో హైదరాబాద్కు ఒక మ్యాచ్ను మాత్రమే కేటాయించారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇతర నగరాలకు రెండేసి మ్యాచ్లను కేటాయించిన నిర్వాహకులు హైదరాబాద్కు మాత్రం ఒక మ్యాచ్తోనే సరిపెట్టారు. ఏప్రిల్ 5న ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో లక్నోతో హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ క్రికెట్లో రాజుకున్న వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ధర్పల్లీ మండల కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఓ వ్యక్తి మహిళా మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా, అది ఒక్కసారిగా కింద పడిపోవడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీయగా.. మృతురాలు సీతాయిపేటకు చెందిన జారుపుల కాంతిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు . మృతదేహాన్ని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె ఎలా మృతి చెందింది? మృతదేహాన్ని బైక్పై ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ పేర్కొన్నారు.
గల్ఫ్ యుద్ధ.. ఐఇఎ నుంచి చమురు సాయం
వియన్నా: ప్రస్తుత గల్ఫ్ యుద్ధ చమురు సంక్షోభ దశలో అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. వియన్నాలోని ఐఇఎ కీలక తక్షణ సమావేశంలో ప్రపంచ మార్కెట్కు తక్షణమే 400 మిలియన్ బ్యారెల్స్ చమురును తరలించాలని సంకల్పించారు. ఈ నిర్ణయానికి మొత్తం 32 దేశాలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ దళాల తీవ్రపోరు, గల్ఫ్ దేశాలలో దాడుల ఉధృతి, హర్మూజ్ జలసంధి మూసివేత క్రమంలో పలు దేశాల్లో తీవ్రస్థాయి చమురు ఇంధన సమస్య తలెత్తింది. ఈ సమస్య పరిష్కారానికి క్రమపద్ధతిలో అన్ని సభ్యదేశాలకు కోటాల మేరకు ఆయిల్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
మంత్రి కొండా సురేఖను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు
మంత్రి కొండా సురేఖను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు కరీమాబాద్, ఆంధ్రప్రభ :
దాగుడుమూతలాడుదామని అత్యాచార యత్నం..
దాగుడుమూతలాడుదామని అత్యాచార యత్నం.. శివ్వంపేట, ఆంధ్రప్రభ : నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ళ
Video : Director Harish Shankar Exclusive Interview
The post Video : Director Harish Shankar Exclusive Interview appeared first on Telugu360 .
ఛత్తీస్ ఘడ్ లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల దండకారణ్యం నుంచి 108 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర డిజిపి అరుణ్ దేవ్ గౌతమ్ వెల్లడించారు. బుధవారం ఆయన బస్తర్ డివిజన్ కేంద్రమైన జగదల్పూర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సంయుక్తంగా రాష్ట్రంలో దండకారణ్యం ప్రాంతాలలో శాంతిని నెలకొల్పాలనే దిశగా మావోయిస్టుల కార్యకలాపాలను నిర్మూలించడానికి పునరావాస పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో హింస మార్గాన్ని వీడి రాష్ట్రంలోని వివిధ దండకారణ్య జిల్లాల నుండి బుధవారం 108 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఆయన వెల్లడించారు.లొంగిపోయిన వారిలో 5 గురు డివిజన్ కమిటీ సభ్యులు, ఇద్దరు జోనల్ స్థాయి పి ఎల్ జి ఏ కంపెనీ చీఫ్ లు, 15 మంది ప్లాటు పార్టీ కమిటీ సభ్యులు, 21 మంది ఏరియా కమిటీ సభ్యులు,63 మంది పార్టీ కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. లొంగిపోయిన 108 మంది మావోయిస్టులపై 3 కోట్ల 29 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు తెలిపారు.వీరి వద్దనుండి ఏకే పార్టీ 47 రైఫిల్స్ 6, ఏకే 47 తార్ 1,10 ఇన్సాస్ రైఫిల్స్, కార్బన్ 1, ఎస్ ఎల్ ఆర్ రైఫిల్స్ 5,7.62 ఎం ఎం ఎల్ ఎం జి 1,5.56 ఎం ఎం ఎల్ ఎం జి 1,303 ఎం ఎం ఎల్ ఎం జి 1,303 రైఫిల్స్ 20, 12 బోర్ రైఫిల్స్ 25, బీజీఎల్ లాంచర్లు 11, 51 ఎంఎం మోర్టర్ 1, 315 బోర్ రైపిల్స్ 3, మజిల్ లోడింగ్ రైఫిల్, బర్మర్ 13, మెగా బిజిఎల్ 1 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుండి అందే అన్ని సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు.అలాగే రాష్ట్రంలో గత 26 నెలల్లో 2714 మంది మావోయిస్టు లొంగిపోయినట్లు,వీరిలో ముఖ్య నేతలు, వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, పార్టీ సభ్యులు ఉన్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ వివేకానంద్, బిఎస్ఎఫ్ అదనపు డిజిపి శివాంగ్ నాంగ్యాల్, బస్తర్ రేంజ్ డీఐజీ పి సుందర్ రాజ్, సిఆర్పిఎఫ్ ఐజి షాలిన్, చత్తీస్ ఘడ్ సాయుధ దళాల ఐజి బిఎస్ ధ్రువ, బస్తర్ డివిజన్ లోని ఏడు జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.
భాగ్యనగరానికి తాకిన ‘గ్యాస్’ సెగ
హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్- ,అమెరికా-, ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు సైబరాబాద్ పరిధిలోని హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్న హాస్టళ్లు, చిన్న, పెద్ద హోటళ్లు, మెస్ కేంద్రాలు ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బ్లాక్ మార్కెట్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. రోజూ వందలాది మందికి వంట చేయాల్సిన హాస్టల్ నిర్వాహకులు గ్యాస్ అందుబాటులో లేక వంట పనులను కొనసాగించడం కష్టంగా మారిందని చెబుతున్నారు. హాస్టళ్లలో నివసించే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు బయట నుంచి వచ్చి ఇక్కడే ఉంటూ ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు హాస్టళ్లలో లేదా సమీప హోటళ్లలోనే ఆహారం తీసుకుంటారు. అయితే గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో చాలా హాస్టళ్లలో వంట పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. కొంతమంది నిర్వాహకులు తాత్కాలికంగా ఇండక్షన్ స్టౌలు లేదా చిన్న సిలిండర్లతో వంట చేయడానికి ప్రయత్నిస్తున్నా, పెద్ద సంఖ్యలో ఉన్న నివాసితులకు ఆహారం సిద్ధం చేయడం సాధ్యపడటం లేదని చెబుతున్నారు. దీంతో కొన్ని హాస్టళ్లు బయట హోటళ్ల నుంచి భోజనం తెప్పించి ఇస్తుండగా, మరికొన్ని తాత్కాలికంగా మెస్ సేవలను నిలిపివేశాయి. ఇక హోటళ్ల పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. కమర్షియల్ గ్యాస్ లేకపోవడంతో అనేక చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తమ వ్యాపారాన్ని కొనసాగించడం కష్టంగా మారింది. కొంతమంది హోటల్ యజమానులు వ్యాపార సమయాలను తగ్గించగా, మరికొన్ని హోటళ్లు పూర్తిగా మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా రాత్రి ఆలస్యంగా వరకు బయట ఫుడ్పైనే ఆధారపడుతుంటారు. రాత్రి రెండు గంటల వరకు కూడా తెరిచి ఉండే టిఫిన్ సెంటర్లు, హోటళ్లు ఈ ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా ఆహారం అందుబాటులో లేకపోవడం ఉద్యోగులకు పెద్ద సమస్యగా మారుతోంది. మేము రోజూ హాస్టల్ మెస్ లేదా సమీప హోటళ్లపైనే ఆధారపడుతుంటాం. ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల భోజనం దొరకడం కూడా కష్టంగా మారింది. ఇది ఇంకా కొనసాగితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఒక ఐటీ ఉద్యోగి తెలిపారు. రోజూ వందల మందికి వంట చేయాలి. కమర్షియల్ గ్యాస్ లేకపోతే అది అసాధ్యం. చిన్న సిలిండర్లతో అంత పెద్ద స్థాయిలో వంట చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఒక హాస్టల్ నిర్వాహకుడు తెలిపారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ఐటీ కారిడార్లో ఆహార సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. కరోనా సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసేలా పరిస్థితులు మారుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, సంబంధిత గ్యాస్ సరఫరా సంస్థలు తక్షణ చర్యలు తీసుకుని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని హాస్టల్ నిర్వాహకులు, హోటల్ యజమానులు, ఉద్యోగులు కోరుతున్నారు. లేదంటే నగరంలోని కీలక ఐటీ ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హాస్టల్ నిర్వాహకులు సమావేశం ఏర్పాటు చేసి హాస్టల్స్ నడపలెమని చేతులెత్తెశారు.కనీసం హాస్టల్స్ వరకు డొమెస్టిక్ వాడేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వైపుకు కంపెనీల మొగ్గు : ప్రస్తుతం మళ్ళీ నగర జీవనంపై కరోనా లాంటి పరిస్థితులు దాపురించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హాస్టల్స్, హోటల్స్లలో గ్యాస్ లేక ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున సైబరాబాద్ పవరిధిలోని పలు కంపెనీలు తమ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఫుడ్ బిజినెస్కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నగరంలో హోటల్స్ మూతతో కోట్లాది రూపాయల నష్టం ఏర్పడే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ రంగం పై ఆధారపడి బతికే కార్మికులకు గడ్డు పరిస్థితులు ఏర్పడనున్నాయి.
లోక్సభ అందరిదీ.. మాట్లాడనివ్వాల్సిందే: రాహుల్
న్యూఢిల్లీ: చట్టసభ అంటే ఏదో ఒక పార్టీకి చెందినది కాదు. మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహించేది అని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. తనను అనేక సార్లు సభలో కీలక విషయాలపై మాట్లాడనివ్వలేదని, ఇది ఎంతవరకూ న్యాయం అని ప్రశ్నించారు. స్పీకర్ ఓం బిర్లా తొలిగింపు తీర్మానంపై చర్చలో ఆయన జోక్యం చేసుకుంటూ రాహుల్ మాట్లాడారు. సభ దేశానికి చెందినది. దేశానికి సంబంధించిన కీలక సమస్యలు, అంశాలపై మాట్లాడే అవకాశం, అధికారం అందరికీ ఉంటుంది. అడ్డుకోవడం కుదరదని తెలిపారు. ప్రధాని మోడీ అన్ని విషయాలపై రాజీపడ్డారని, దీని ఫలితం ఏ విధంగాఉందనేది అందరికీ తెలిసివస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత సభలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పార్లమెంటరీ నియమావళిని నిబందనలను పట్టించుకోవల్సి ఉందని బిజెపి ఎంపి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. మంత్రి ప్రజాస్వామిక ప్రక్రియను గౌరవిస్తూ మాట్లాడాల్సి ఉంటుంది. పలు సార్లు సభలో అధికార పక్షం, మంత్రులు తన పేరు అనుచితంగా ప్రస్తావించారు. స్పీకర్ పాత్ర ఏమిటనేది సభ్యులందరికీ అవసరం అయిన విషయం. సభ ప్రజల స్పందనకు వ్యక్తీకరణకు వేదిక కావాల్సి ఉంటుంది. తాను ఎప్పుడు సభలో మాట్లాడాలనుకున్నా తనను అడ్డుకున్నారని , ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు.
చమురు నిల్వల విడుదలకు జపాన్ నిర్ణయం
టోక్యో: ఇరాన్ యుద్ధం కారణంగా అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో అంతర్జాతీయగంగా బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్లకు మించి పెరిగింది. ఈ నేపథ్యంలో చమురు సరఫరా పెంచి ధరలను అదుపులో పెట్టడానికి వివిధ దేశాలు తమ వద్ద ఉన్న వ్యూహాత్మక చమురు రిజర్వులను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు జపాన్ తమ దేశంలో ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయబోతున్నట్టు జపాన్ ప్రధాని సనాయే తకాయిచి బుధవారం వెల్లడించారు. ఈ నెల 16 లోగా చమురు నిల్వలను విడుదల చేస్తామని ఆమె ప్రకటించారు. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరల స్థిరీకరణ జరుగుతుందని సికాయిచి అన్నారు. ఈ పనిచేసిన తొలి జీ7 దేశంగా జపాన్ నిలిచింది. చమురు సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు చమురును ఎక్కువగా వినియోగించే దేశాలు తమ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్ నుంచి కొంత విడుదల చేయాలనేది ఒక ఒప్పందం. దీనివల్ల ఇతర దేశాలకు సరఫరా పెంచి, ధరలను తగ్గించి, అక్కడి ప్రజలకు ఉపయోగపడేలా చేయవచ్చు. ఈ వ్యవహారాన్ని అంతా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది.
యల్ పీ జీ గ్యాస్ అక్రమ వియోగం, నిల్వలపై తనిఖీలు
యల్ పీ జీ గ్యాస్ అక్రమ వియోగం, నిల్వలపై తనిఖీలు స్వాధీనం చేసుకున్న
అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ నూతన సుప్రీం మొజ్తాబా ఖమేనీ సురక్షితం
టెహ్రాన్: ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గాయపడినట్టు వార్తలు వచ్చాయి. వీటిని ఇరాన్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగా, సురక్షితంగానే ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుమారుడు యూసఫ్ వెల్లడించారు. మొజ్తాబా గాయపడినట్టు వస్తున్న వార్తలు తన దృష్టికి వచ్చాయని, ఆయన సన్నిహితుల నుంచి ఆరా తీయగా ఆయన క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని వారు చెప్పారని యూసఫ్ పేర్కొన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ ఆపరేషన్ చేపట్టిన తొలి రోజులోనే మొజ్తాబా తన భార్య, తండ్రి ఖమేనీతో సహా పలువురు కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఈ దాడుల్లో ఆయన కూడా గాయపడినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. పశ్చిమాసియాలో భీకరంగా పోరు సాగుతున్నా ఆయనకు కనిపించకపోవడం , ప్రజలను ఉద్దేశించి ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిచ్చింది. సుప్రీం నేతగా ఇటీవల ఆయన ఎన్నికైనా ఆయన కార్యాలయం నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో తలెత్తిన సందేహాలన్నీ తాజాగా ఇరాన్ అధ్యక్షుడి కుమారుడి ప్రకటనతో దూరమయ్యాయి.
పల్నాడులో నెదర్లాండ్స్ బృందం పర్యటన
పల్నాడులో నెదర్లాండ్స్ బృందం పర్యటన పల్నాడులో ప్రకృతి వ్యవసాయ నమూనాలపై నెదర్లాండ్స్ నిపుణుల
కావూరి సాంబశివరావు కన్నుమూత..ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు (82) అనారోగ్యంతో బుధవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను గురువారం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహిం నున్నట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కావూరి చురుగ్గా పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆయన 5 సార్లు లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మచిలీ పట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించారు.యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. కావూరి సాంబశివరావుకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విశాఖపట్నం ఎంపీ, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు అయిన శ్రీ భరత్... కావూరి సాంబశివరావుకు స్వయానా మనవడు (కుమార్తె కుమారుడు). రాష్ట్ర విభజన సందర్భంలో ఆయన సమైక్యాంధ్రకు మద్దతిచ్చారు. కావూరి సాంబశివరావు వరంగల్లోని ఆర్ఇసిలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. కావూరి మృతి పట్ల పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖు లు సంతాపం వ్యక్తం చేశారు. ఎపి సిఎం చంద్రబాబు సంతాపం ‘సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి అత్యంత బాధాకరం. మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు మరణం తీరనిలోటు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరిది ప్రత్యేక ముద్ర. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కావూరి సాంబశివరావు మృతి పట్ల ఎపి బిజెపి అధ్యక్షుడు మాదవ్ సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు హిందీ పాటలతో సందడి చేస్తున్న శ్రీలంక గాయని యోహాని #Yohani#ManikeMageHithe#TeluguSong
సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే జూలకంటి
సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే జూలకంటి పల్నాడు ప్రగతే చంద్రబాబు ధ్యేయం: ఎమ్మెల్యే
Hansika Motwani is now Divorced
Actress Hansika Motwani got married to businessman Sohael Khaturiya four years ago and they have been granted divorce by the Bandra Family Court in Mumbai today. Hansika appeared before the court and she appealed for separation by mutual consent. The family members and the friends tried to reconcile them but the efforts were not successful. […] The post Hansika Motwani is now Divorced appeared first on Telugu360 .
పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు భాగస్వాములు కావాలి
పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు భాగస్వాములు కావాలి చెత్తను పారేయకుండా కళగా మార్చుకుందాంమున్సిపల్ కార్యాలయంలో
మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు ఘన నివాళులు..
మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు ఘన నివాళులు.. పార్ధివ దేహానికి పూలమాల అర్పించిన
సమాజ సేవలో ఆదర్శం.. స్టేషన్ ఘన్ పూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్
సమాజ సేవలో ఆదర్శం.. స్టేషన్ ఘన్ పూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ రామలింగేశ్వర
ప్రియుడిని పెళ్లి చేసుకున్న మోనాలిసా #Monalisa #Wedding #Thiruvananthapuram #NewsUpdate #TeluguNews
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ రోజు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM కిసాన్) లబ్ధిదారులకు శుభవార్త. 22వ విడత పిఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. మార్చి 13న గౌహతి పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ 22వ విడత నిధులను విడుదల చేస్తారు. ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు సుమారు రూ.19,000 కోట్లు విడుదల చేయనున్నట్లు వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, ఫిబ్రవరి 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan)ను ప్రారంభించింది. ఈ పథకం కింద, దేశంలోని అర్హత కలిగిన రైతులందరికీ ప్రభుత్వం ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మూడు వాయిదాలలో రూ.6,000 పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
లోక్సభ స్పీకర్పై వీగిన అవిశ్వాసం..
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణం మూజువాణి ఓటుతో వీగిపోయింది. స్పీకర్ సభలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తు విపక్ష సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి నేటి వరకూ సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో విపక్షాలు చేసిన విమర్శలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్పై మండిపడ్డారు. అనంతరం సభ గురువారానికి వాయిదాపడింది.
‘జైలర్- 2’ లో పోలీసు ఆఫీసర్ గా షారుఖ్ ఖాన్
సూపర్స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ చిత్రం ‘జైలర్- 2’. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. 2023లో విడుదలైన జైలర్కు సీక్వెల్గా ఈ చిత్రం రూపుదిద్దు కుంటోంది. ఈ సినిమాలో షారుఖ్ ప్రత్యేక పాత్రలో ఓ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. ఈనెల చివరి వారంలో సెట్స్లోకి షారుఖ్ వస్తాడనీ, ఎనిమిది రోజుల పాటు చిత్రీకరించనున్న సన్నివేశాలతో షూటింగ్ పూర్తవుతుందని తెలిసింది. కాగా ‘జైలర్’లో శివరాజ్కుమార్, మోహన్లాల్ వంటి స్టార్ నటులు కథను మలుపు తిప్పే అతిథి పాత్రల్లో నటించారు.
ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదు : జగపతిబాబు
ప్రముఖ నటుడు జగపతి బాబు బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ ’వదలా’తో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకత్వంలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. బుధవారం మేకర్స్ గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో హీరో జగపతిబాబు మాట్లాడుతూ “అందరూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమా భోపాల్లో చేశాం. భరద్వాజ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కార్తిక్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. తన నుంచే వదలా అనే టైటిల్ కూడా వచ్చింది. లయ ‘వదలా’లో అద్భుతంగా నటించింది. ఆముద పాత్రలో హ్రితిక కూడా చాలా చక్కగా నటించింది”అని అన్నారు. హీరోయిన్ లయ మాట్లాడుతూ “డైరెక్టర్ వంశీ కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి కథ నేనెప్పుడూ కూడా వినలేదు. చివరి వరకు ఏమవుతుందో అనేది ఎవరు ఊహించలేరు”అని తెలిపారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ “జగపతి బాబుకి ఈ కథ చాలా నచ్చింది. కథ పై నమ్మకంతో ఈ సినిమా మొదలుపెట్టాం”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హృతికా శ్రీనివాస్, కిషోర్ నాయుడు, చోటా కె నాయుడు, కార్తీక్ పాల్గొన్నారు.
తమ్ముడు శ్రీకృష్ణ పిచ్చి మాటలు మాట్లాడవద్దు: కెటిఆర్
తమ్ముడు పిచ్చి మాటలు మాట్లాడవద్దని టిడిపి ఎంపి శ్రీకృష్ణదేవరాయపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో తెలంగాణపై ఎంని శ్రీకృష్ణదేవరాయ చేసిన కామెంట్పై కెటిఆర్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు అయిపోయిందని, అభివృద్ధిలో దూసుకుపోతోందని కెటిఆర్ గుర్తు చేశారు. నువ్వు మా తమ్ముడివి, యువకుడివి, వేరేవాళ్ల గురించి తప్పుడు మాటలు మాట్లాడాల్సిన ఖర్మ మాకు లేదని, ఎపి, తెలంగాణ బాగుండాలని మేం కోరుకుంటున్నామని, ఎపి అభివృద్ధిపై, చంద్రబాబు చేస్తున్న మంచి పనులపై మాట్లాడాలని, తెలంగాణపై ఏడుపులు బంద్ చేయాలని మాజీ మంత్రి కెటిఆర్ టిడిపి ఎంపి శ్రీకృష్ణదేవరాయలను హెచ్చరించారు.
హామీలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
హామీలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నర్సింహులపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన
స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే…
స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే… స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ
విజయవంతంగా 100 రోజులు 100 గ్రామాలు
విజయవంతంగా 100 రోజులు 100 గ్రామాలు వంద రోజులు 100గ్రామాలు 50వ రోజు
విద్యుత్ సమస్య లేకుండా కృషి చేస్తా…
విద్యుత్ సమస్య లేకుండా కృషి చేస్తా… చిట్యాల,, ఆంధ్రప్రభ : పెద్ద కపర్తి
భద్రాద్రికి గోటి బియ్యం తలంబ్రాలు…
భద్రాద్రికి గోటి బియ్యం తలంబ్రాలు… చిట్యాల, ఆంధ్రప్రభ : శ్రీరామదాసు భక్తమండలి చేల్పూర్
శివాజీ వర్ధంతి వేడుకలు.. విజయవాడ, ఆంధ్రప్రభ: పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో
రక్షించండి.. ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు 'కుంభమేళా' మోనాలిసా
2025లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో దండలు అమ్ముకుంటూ కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసిన మోనాలిసా.. మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి తిరువనంతపురం పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది. తమను రక్షించాలంటూ మోనాలిసా తన ప్రియుడితో కలిసి తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. మోనాలిసా, కేరళకు చెందిన ఫర్హాన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్తో మోనాలిసా డేటింగ్ చేస్తోంది. మోనాలిసా-ఫర్మాన్ ఖాన్ ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి ప్రేమను మోనాలిసా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తమకు రక్షణ కల్పించాలని మోనాలిసా కోరినట్లు తెలుస్తోంది. ప్రియుడితో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వెలుగుమట్ల భూములు భూదాన్ బోర్డువే: కెటిఆర్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో వెయ్యి మంది పేదల ఇళ్లను ప్రభుత్వం కూలగొట్టిన ఘటనపై ఆయన మండిపడ్డారు. భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదలను బలవంతంగా గెంటేసిందని, గతంలో అదే భూదాన్ భూముల్లో కొంతభాగాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులపరం చేసిందని కెటిఆర్ ఆరోపించారు. వాస్తవానికి వెలుగుమట్లలో ఇళ్లు కూలగొట్టిన ప్రాంతంలోని భూములు భూదాన్ భూములని ఆయన తెలిపారు. 1950ల్లో ఆచార్య వినోభాబావే నాయకత్వంలో జరిగిన భూదానోద్యమంలో పలువురు దాతలు భూములను దానం చేశారన్నారు. అదేవిధంగా వెలుగుమట్లలో కూడా ఇద్దరు దాతలు 62 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకు విరాళంగా ఇచ్చారన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేవరకు కూడా ఆ భూమి భూదాన్ బోర్డు పేరుతోనే పట్టాతో ఉందని దాదాపు 30 ఏళ్లకుపైగా భూదాన్ బోర్డు పేరు మీద ఉన్న ఆ భూములను నాడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదకు మార్చిందని ఆయన మండిపడ్డారు. ఆ భూమిని 2014 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ భూదాన్ బోర్డు 1,895 మందికి పట్టాలు చేసిందన్నారు.
CM Revanth Reddy to Attend ‘Moosi Invites’ Event in Hyderabad on March 13
The Musi Riverfront Development Corporation Limited (MRDCL) will organise a special event titled “Moosi Invites” on March 13 at Taj Krishna Hotel in Hyderabad to present the proposed plans for the Musi River rejuvenation and riverfront development project. Chief Minister A. Revanth Reddy will participate in the event and outline the government’s vision for restoring […] The post CM Revanth Reddy to Attend ‘Moosi Invites’ Event in Hyderabad on March 13 appeared first on Telugu360 .
ముగిసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండక్షన్ కార్యక్రమం
ముగిసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండక్షన్ కార్యక్రమం డేటా సైన్స్, ఏఐ విద్యార్థులకు
Medha Patkar Urges CM Revanth to Halt Musi Event, Traces Back to Chandrababu Era
Social activist Medha Patkar, representing the National Alliance of People’s Movements (NAPM), has written to Telangana Chief Minister A. Revanth Reddy urging the government to halt the planned March 13 unveiling of the Detailed Project Plan for the Musi River Rejuvenation (Phase II) and initiate a broader democratic consultation process. Referring to the project’s background, […] The post Medha Patkar Urges CM Revanth to Halt Musi Event, Traces Back to Chandrababu Era appeared first on Telugu360 .
Fire Near Amaravati Secretariat Raises Suspicion During Collectors Conference
A fire broke out near the Seed Access Road in Amaravati and caused concern among officials. The incident occurred near the N9 road at Velagapudi Junction, where plastic pipes meant for capital construction works were stored. Large quantities of these pipes were destroyed in the blaze. Fire department officials reached the spot immediately after receiving […] The post Fire Near Amaravati Secretariat Raises Suspicion During Collectors Conference appeared first on Telugu360 .
రైతులకు ప్రభుత్వ రాయితీలపై అవగాహన
రైతులకు ప్రభుత్వ రాయితీలపై అవగాహన సూక్ష్మ నీటి సాగులో ఆటోమేషన్ యూనిట్ ప్రదర్శన
ఐపిఎల్-2026 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్ ఎవరి మధ్యంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026కి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. మార్చి 28వ తేదీ నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి 20 మ్యాచ్ల షెడ్యూల్ని ప్రకటించారు. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య బెంగళూరు వేదికగా జరుగనుంది. మార్చి 29న ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య, మార్చి 30వ తేదీ రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. మూడు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత మిగితా షెడ్యూల్ని విడుదల చేస్తామని ఐపిఎల్ బోర్డు పేర్కొంది. News Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 ️ Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections. More details ▶️… pic.twitter.com/8Iq492v8TE — IndianPremierLeague (@IPL) March 11, 2026
నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు…..
నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు….. రోడ్డెక్కిన అన్నదాతలు. రాయపోల్, ఆంధ్రప్రభ : సాగునీరు
ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశం..
ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశం.. విజయవాడ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని
Pawan Kalyan’s UBS Mass-Bang Update
The hype around Ustaad Bhagat Singh has officially hit the next gear. The team behind Power Star Pawan Kalyan’s much-awaited mass entertainer has dropped a mass-bang update, setting the stage for an explosive promotional run. The makers have now confirmed the big reveal. The theatrical trailer arrives on March 14th, kick-starting a high-voltage countdown ahead […] The post Pawan Kalyan’s UBS Mass-Bang Update appeared first on Telugu360 .
హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలి.
హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలి. ఎస్సీ సంక్షేమ హాస్టల్ తనిఖీ
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం… హైదరాబాద్ వ్యాపారికి రూ.5.4 లక్షల నష్టం
జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తానని నమ్మబలికిన వ్యక్తిఎనిమిది మందికి వర్క్ పర్మిట్ పేరిట డబ్బులు వసూలు
టీ20లో విధ్వంసం.. టాప్-2కు దూసుకెళ్లిన ఇషాన్ కిషన్
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచ కప్ 2026లో విధ్వంసకర ఆటతో చెలరేగిన టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లోనూ సత్తా చాటాడు. బుధవారం ఐసిసి, టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో ఇషాన్ ఏకంగా రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ప్రపంచ కప్కు ముందు ఇషాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగిన కిషన్ 871 రేటింగ్ పాయింట్లు సాధించిన నంబర్ 2 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక, భారత మరో స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తన నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. అభిషేక్ 875 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ 848 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ శ్రీలంక బ్యటార్ పాతుమ్ నిస్సాంక వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నారు. ఇక, బౌలర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. T20 ప్రపంచ కప్ 2026లో టిమిండియా తరపున బుమ్రాతోపాటు అత్యధిక వికెట్లు పడగొట్టినప్పటికీ.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో తన వరుణ్.. 740 రేటింగ్ పాయింట్లతో రెండవ స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 753 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకున్నాడు.పాకిస్తాన్కు బౌలర్ అబ్రార్ అహ్మద్ మూడో స్థానానికి ఎగబాకగా.. ఆదిల్ రషీద్, కార్బిన్ బాష్ వరుసగా నాలుగు, ఐదు స్థానంలో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని 702 రేటింగ్ పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నాడు.
ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ
ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ గ్లకోమా పట్ల అప్రమత్తంగా ఉండాలి:
ఎర్రగట్టు జాతరలో సేవలందించిన వైద్యాధికారి
ఎర్రగట్టు జాతరలో సేవలందించిన వైద్యాధికారి హసన్ పర్తి, ఆంధ్రప్రభ : కిట్స్ వాకర్స్
కేసీఆర్కు క్షమాపణ చెప్పే ధైర్యం ఉందా?
కేసీఆర్కు క్షమాపణ చెప్పే ధైర్యం ఉందా? స్టేషన్ ఘన్ పూర్ , ఆంధ్రప్రభ:
కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ లో రెండవ రోజు ఏసీబీ తనిఖీలు…
కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ లో రెండవ రోజు ఏసీబీ తనిఖీలు… విజయవాడ కార్పొరేషన్,
భీమ్గల్ కు రానున్న ప్రసిద్ధ వేద విద్వాంసులు
భీమ్గల్ కు రానున్న ప్రసిద్ధ వేద విద్వాంసులు భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
ఆ భూముల్లోనే నిరుపేదలకు ఇళ్లు ఇస్తాం: మంత్రి తుమ్మల
వెలుగు మట్ల భూదాన్ భూముల్లో కొందరు ముఠాగా ఏర్పడి పేదలను అడ్డంపెట్టుకొని మోసం చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాల అందజేత కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కోర్టు తీర్పు మేరకే ప్రభుత్వం ఆదేశాలతో ఖాళీ చేయించి కలెక్టర్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. సమాంతర వ్యవస్థ నడుపుతూ ముఠా సభ్యులు ఎవరిని లోపలికి రానీయకుండా దౌర్జన్యంగా వ్యవహరించారని.. అయినా, గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. కోర్టులో కేసు ఉండటంతో అక్కడ తాము ఎలాంటి సౌకర్యాలు కల్పించలేక పోయామని మంత్రి తుమ్మల అన్నారు. ప్రస్తుతం భూదాన్ ట్రస్టు లేదు..అది సీసీఎల్ఏకు బదలాయించిందన్నారు. ముఠా చేతిలో నుంచి బాదితులను రక్షించేందుకు తాము అనేక ప్రయత్నాలు చేసామని తెలిపారు. భూదాన్ భూముల్లోనే బాధితులకు ఇళ్లు ఇవ్వాలని సిఎం, ముగ్గురు మంత్రులం నిర్ణయించామని.. డిసెంబర్ 9న సిఎం చేతుల మీదుగా ఇళ్ల గృహ ప్రవేశం చేస్తామని.. అక్కడ అన్ని మౌళిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.
లోక్ సభ స్పీకర్ పై వీగిన అవిశ్వాసం
లోక్ సభలో స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్ష పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది
Gudivada Cricket Betting Racket Exposed, Associates of Kodali Nani Arrested
Police in Krishna district recently uncovered an online cricket betting racket in Gudivada. Five people were arrested during the operation. Among them is Masala Shiva, who is known to be a close associate of former YSR Congress Party minister Kodali Nani. The police seized ₹1.05 lakh in cash and eight mobile phones from the accused. […] The post Gudivada Cricket Betting Racket Exposed, Associates of Kodali Nani Arrested appeared first on Telugu360 .
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్- అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడనున్నట్లు వస్తున్న వార్తలపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పందించారు. వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ ముడి చమురు, గ్యాస్ సరఫరాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోపే డెలివరీ అవుతుందని అధికారి వెల్లడించారు. దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ అన్నారు. భారత ముడి చమురు సరఫరా స్థిరంగా ఉందని తెలిపారు. దేశం రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుందని.. భారత్, దాదాపు 40 దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని చెప్పారు. అంతేకాదు, భారత్ కు రెండు ముడి చమురు కార్గోలు రాబోతున్నాయని ఆమె తెలిపారు.
యర్రపల్లిలో “కాఫీ విత్ క్యాడర్”తో వైసీపీ
యర్రపల్లిలో “కాఫీ విత్ క్యాడర్”తో వైసీపీ గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరించిన మాజీ
చిన్నారుల ఆరోగ్యం, వార్డ్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి…
చిన్నారుల ఆరోగ్యం, వార్డ్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి… అంగన్వాడీ కేంద్రాలు, నాలా క్లీనింగ్
సురక్షా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 మందికి సైకిళ్లు
సురక్షా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 మందికి సైకిళ్లు విజయవాడ, ఆంధ్రప్రభ
పూర్వ విద్యార్థుల చొరవ అభినందనీయం
పూర్వ విద్యార్థుల చొరవ అభినందనీయం మండల విద్యాధికారి తలమల్ల మల్లేశం. మునుగోడు, ఆంధ్రప్రభ
నా పొట్టను దాచలేక విసిగిపోయాను.. కెటిఆర్ పోస్ట్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటిఆర్ సోషల్మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు సంబంధించిన విషయాలు, పార్టీ వ్యవహారాలు, ఇతర విషయాలను ఆయన సోషల్మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ ఫన్నీ పోస్ట్ పెట్టారు. జిమ్లో దిగిన ఫోటోని షేర్ చేసిన కెటిఆర్.. ఇంతకాలం తన పొట్టని దాచలేక విసిగిపోనని.. పేర్కొన్నారు. ‘‘ఆరు నెలల తర్వాత మళ్లీ ట్రైనింగ్ మొదలు పెట్టాను జూలైలో నాకు 50 సంవత్సరాల వచ్చే నాటికి మంచి షేప్లోకి రావాలని ఆశిస్తున్నా’’ అని కెటిఆర్ రాసుకొచ్చారు. Tired of hiding my paunch Started training again after a gap of 6 months. Hoping to be in better shape by July when I turn 50 #FitnessGoals pic.twitter.com/o99hm3tEj4 — KTR (@KTRBRS) March 11, 2026
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవo
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవo నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : ఆడపిల్లలను ఉన్నతంగా
ఔషధ మొక్కల సాగుతో అత్యధిక ఆదాయం
ఔషధ మొక్కల సాగుతో అత్యధిక ఆదాయం మోపిదేవి, ఆంధ్రప్రభ: ఔషధ మొక్కల సాగుతో
Telangana : 14 నుంచి పదో తరగతి పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి
కనకదుర్గమ్మకు కానుక వర్షం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ
విపక్షాలు కుట్ర చేస్తున్నాయి: భట్టి విక్రమార్క
ఖమ్మం: పేదలకు మేలు జరగకుండా విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాల అందజేత కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు రాష్ట్రంలోని పేదలపై ప్రేమ లేదని... పేదల నిస్సహాయతను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు మాఫియాగా ఏర్పడి.. పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని డిప్యూటీ సిఎం ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ పేదల గురించి ఆలోచించే ప్రభుత్వమని.. నిజమైన పేదలు అయ్యుంటే.. ఇళ్లు లేని వారు ఉండొద్దనేది తమ ప్రభుత్వ ఆశయమని తెలిపారు. పేదలపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోందని చెప్పారు. తొలి ఏడాదే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని.. త్వరలో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని భట్టి స్పష్టం చేశారు.
రద్దీగా ఉన్న రహదారిపై విమానం అత్యవసర ల్యాండింగ్
19 ఏళ్ల యువ పైలట్ నికో బ్రే తన విమానాన్ని రద్దీగా ఉన్న రహదారిపై సురక్షితంగా దించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘటన 2026 మార్చి 6వ తేదీ మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.19 ఏళ్ల యువ పైలట్ నికో బ్రే తన స్నేహితుడితో కలిసి చిన్న సింగిల్ ఇంజిన్ విమానంలో (Cessna 150) ప్రయాణిస్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్ శక్తిని కోల్పోయింది. విమానం నేల నుండి కేవలం 500 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోవడంతో పైలట్ ఏమాత్రం కంగారు పడకుండా మొదట బీచ్ దగ్గర ఉన్న A1A రోడ్డుపై దించాలని అనుకున్నా, అది ఇరుగ్గా ఉండటంతో వెడల్పుగా ఉన్న ఇండియన్ టౌన్ రోడ్డును ఎంచుకున్నాడు. విమానం కిందికి రావడం గమనించిన ఒక ట్రక్కు డ్రైవర్ రోడ్డుపై ట్రాఫిక్ను ఆపి విమానం దిగడానికి ఖాళీ ప్రదేశం కల్పించారు. దీంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఏ వాహనాన్ని ఢీకొట్టకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.ఈ ఘటనలో పైలట్, అతని స్నేహితుడు మరియు రోడ్డుపై ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. 19 ఏళ్ల వయసులోనే నికో బ్రే ప్రదర్శించిన ధైర్యం మరియు నైపుణ్యాన్ని స్థానిక అధికారులు, ప్రజలు మెచ్చుకున్నారు.
ఘనంగా వీడ్కోలు సంబరాలు దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని వెల్గనూర్ ఉన్నత
ప్రజల సమస్యల పరష్కారానికి అధిక ప్రాధాన్యత..
ప్రజల సమస్యల పరష్కారానికి అధిక ప్రాధాన్యత.. 18వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె
₹14,500కే అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి టూర్ #IRCTC#DivyaDakshinaYatra#TempleTour#Arunachalam

19 C