SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో జీవన్ రెడ్డి కీలక భేటీ…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ‌ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగే ఈ సమావేశం కోసం జీవన్ రెడ్డికి మధ్యాహ్న భోజనానికి ఆహ్వానం అందింది. ఈ భేటీలో బీఆర్ఎస్‌లో చేరే తేదీతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. […] The post ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో జీవన్ రెడ్డి కీలక భేటీ… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Apr 2026 11:29 am

MonaLisa |మోనాలిసా భర్తపై పోక్సో కేసు…

MonaLisa | మోనాలిసా భర్తపై పోక్సో కేసు… MonaLisa | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 10 Apr 2026 11:24 am

ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలివే

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం ప్రారంభమయింది

తెలుగు పోస్ట్ 10 Apr 2026 11:24 am

ఆర్ టిసి ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026 సంవత్సరం నుంచి 2.1 శాతం  డిఎ పెంచుతామని ప్రకటించింది. ఇంతకు ముందు 50.7 శాతం డిఎ ఉండగా ఇపుడు దాన్ని 52.8 శాతానికి పెంచినట్టు ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన డిఎ జనవరి 1, 2026 నుండి అమలు చేస్తామని, గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. పెరిగిన డిఎ ద్వారా ఆర్టీసీ పై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.  చివరగా జూలై 2025 లో కూడా 2.1 శాతం డిఎం పెంచిన విషయం తెలిసిందే. జూలై 2025 లో 48.6% నుండి 50.7% నికి పెంచింది.  ప్రస్తుతం పెరిగిన 2.1 శాతం డిఎతో 52.8 % కి చేరింది. మే 2024 లో ఆర్ పిఎస్ , 2017 అమలు తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఎ బకాయిలు లేవని ప్రభుత్వం వివరించింది  డిఎ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ లో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్ లో ఆర్ ఎం లతో సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డిఎను ప్రభుత్వం విడుదల చేసిందని తెలియజేశారు. జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వస్తుందని, దీంతో సవరించిన డిఎ 52.8 శాతానికి చేరిందని వివరించారు. జనవరి నుండి ఇవ్వాల్సిన పెండింగ్ డిఎలు భవిష్యత్ లో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.  తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో మొదటి నుండి ఆర్టిసి సంస్థ పరిరక్షణ ,ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పని చేస్తుందని తెలిపారు. సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమం పై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణ కు ఆసుపత్రి అప్గ్రెడేషన్ చేశామని, కారుణ్య నియామకాలు, దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం ,కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తుందని విరించారు. తెలంగాణ లో ఉన్న ప్రతి ఆర్టీసీ ఉద్యోగులందరికీ పెంచిన డిఎ ఉపయోగపడుతుందని, తెలంగాణలో లైఫ్ లైన్ గా ఉన్న ఆర్టీసిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లలా కృషి చేయాలని పొన్నం సూచించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 

మన తెలంగాణ 10 Apr 2026 11:20 am

Maoist |డీజీపీ ఎదుట నేడు సరెండర్

Maoist | డీజీపీ ఎదుట నేడు సరెండర్ Maoist | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 10 Apr 2026 11:18 am

Telangana : ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 10 Apr 2026 11:16 am

Meeting |ఇవాళ కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ..

Meeting | ఇవాళ కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ.. Meeting | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 10 Apr 2026 11:09 am

నేడు కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నేడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ కానున్నారు

తెలుగు పోస్ట్ 10 Apr 2026 11:08 am

190 people |పోలీసుల కఠిన చర్యలు

190 people | పోలీసుల కఠిన చర్యలు 190 people | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 10 Apr 2026 11:04 am

గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం... 190 మంది రౌడీలకు పాజిటివ్

హైదరాబాద్‌లో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రౌడీషీటర్లు ఎక్కువగా గంజాయికి అలవాటుపడడంతో వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. 250 మంది రౌడీలకు డ్రగ్ టెస్టు చేయగా 190 మంది గంజాయి పాజిటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గంజాయి సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్‌లో 1300 మందికిపైగా రౌడీషీట్ ఉన్నట్టు గుర్తించారు. 

మన తెలంగాణ 10 Apr 2026 11:00 am

Hyderabad : హైదరాబాద్ పోలీసులు .. రౌడీ షీటర్లకు..

హైదరాబాద్‌ పోలీసులు రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపారు

తెలుగు పోస్ట్ 10 Apr 2026 10:59 am

Telangana : నేడు భారీ సంఖ్యలో లొంగిపోనున్న మావోయిస్టులు

తెలంగాణ పోలీసుల ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు

తెలుగు పోస్ట్ 10 Apr 2026 10:53 am

Cyber War Break : ఇజ్రాయెల్​ ను వదలం Andhra Prabha News

Cyber War Break : ఇజ్రాయెల్​ ను వదలం Andhra Prabha News

ప్రభ న్యూస్ 10 Apr 2026 10:52 am

ఇజ్రాయెల్ దూకుడుతో మళ్లీ సంక్షోభం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించడానికి పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడడంతో ఒప్పందం గందరగోళంలో పడింది. ఒప్పందం లోని అంశాలను పాక్ సరిగ్గా వివరించలేకపోయిందని అమెరికా, ఇరాన్ దేశాలు మండిపడుతున్నాయి. పాక్ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తూ, మరోవైపు లెబనాన్‌పై దాడులను సమర్ధించుకుంది. దక్షిణ లెబనాన్ నుంచి హెజ్‌బొల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడమే తమ ప్రధాన లక్షంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తి స్థాయి ఒప్పందం అమలయ్యేవరకు తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు, బలగాలు, ఇరాన్ చుట్టూ మోహరించి ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో తమ మిత్రదేశమైన లెబనాన్‌పై దాడులు కొనసాగడాన్ని ఇరాన్ సీరియస్‌గా తీసుకుని హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది. ఫలితంగా జలసంధి మీదుగా వెళ్లాల్సిన నౌకలు బలవంతంగా వెనక్కు మరలుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని భారత నావికులను హెచ్చరించింది. ఇలాంటి చిక్కుల మధ్య ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ దేశాల మధ్య తొలిదశ చర్చలు శనివారం (11.4.2026) ప్రారంభం కానుండడం ప్రపంచ దేశాల మధ్య ఉత్కంఠను రేపుతోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేతృత్వంలో అమెరికా ప్రతినిధుల బృందం ఈ చర్చల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. అసలు ఈ యుద్ధం ప్రారంభించి ఉండాల్సిందే కాదు. యుద్ధానికి ముందు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అనేకసార్లు చర్చలు జరిగాయి. దాదాపు ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ఖరారవుతున్న సమయంలో ఇజ్రాయెల్ శకునిపాత్ర వహించింది. ట్రంప్ తలంచుకుంటే ఏదైనా చేసేస్తారన్న రీతిలో తప్పుడు సంకేతాలిచ్చింది. నెతన్యాహు రెచ్చగొట్టడంతో ఇరాన్‌పై అకస్మాత్తుగా బాంబు దాడులకు ట్రంప్ ఫిబ్రవరి 28న ఉత్తర్వు జారీ చేశారు. ఇరాన్ ప్రతిఘటనా సామర్థాన్ని ట్రంప్ తక్కువ అంచనా వేశారు. ఇరాన్ వెంటనే తన పాదాక్రాంతమవుతుందని భ్రమ పడ్డారు. దాదాపు గత నలభైరోజుల పాటు ఇరాన్‌పై భీకర దాడులతో అమెరికా ఇజ్రాయెల్ ఎంతగా విధ్వంసానికి పాల్పడినప్పటికీ ఇరాన్ దిగి రాలేదు. ఇప్పటికీ హర్ముజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికాకు సులభమైన మార్గం ఏదీ దొరకలేదు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైనా తన అంచనా తప్పేనని ట్రంప్ తెలుసుకుంటే అది పశ్చిమాసియాకు శుభవార్తే అవుతుంది. ఈ యుద్ధాన్ని నివారించడానికి బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన పాత్రను పోషించి పాకిస్తాన్ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అటు అమెరికాను, ఇటు ఇరాన్‌ను సన్నిహితం చేయడానికి సహాయపడింది. కానీ కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా 15 పాయింట్ల ప్రతిపాదనలకు, ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదనకు మధ్య పొంతన కుదరక భారీ తేడా కనిపిస్తోంది. లెబనాన్‌తో సహా అన్ని సంక్షోభాలకు ఈ ఒప్పందం పరిష్కారం అవుతుందని ఇరాన్, పాకిస్థాన్ ఆశించగా, ఒప్పందంలో లెబనాన్ సైనిక చర్య ప్రసక్తే లేదని అమెరికా, ఇజ్రాయెల్ కొట్టిపారేస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కూడా తమకు ఇరాన్ నుంచి వేర్వేరుగా మూడు వెర్షన్ల ప్రతిపాదనలు అందాయని, తొలుత 10 పాయింట్లతో పంపిన ప్రతిపాదనలు ఛాట్ జిపిటి రాసినట్టుగా ఉండటంతో తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు. ఇరాన్ పంపిన రెండో వెర్షన్ ప్రతిపాదనల గురించే ట్రంప్ ప్రస్తావించారన్నారు. మూడోసారి ఇరాన్ పంపిన ప్రతిపాదనలు మొదటిదానికంటే అత్యంత దారుణంగా, అంగీకరించలేని విధంగా డిమాండ్లు ఉన్నాయన్నారు. సోషల్ మీడియా ద్వారానే ఈ మూడో ప్రతిపాదన గురించి తమకు తెలిసిందని జెడి వాన్స్ ప్రకటించారు. లెబనాన్ కారణంగా కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కాకుండా చూడాలని ఇరాన్‌ను జెడి వాన్స్ కోరారు. పర్షియన్ గల్ఫ్ లోని హర్ముజ్ జలసంధిని తాను నియంత్రణ లోకి తెచ్చుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే హెచ్చరించినా అలా చేయడం అమెరికాకు ఆర్థికంగా ఎంతో నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రపంచానికి సరఫరా అయ్యే చమురులో 20 శాతం ఈ జలసంధి మీదుగానే వెళ్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ జలసంధిపై పట్టు సాధించాలంటే ఇరాన్ భూభాగం లోని దాదాపు 600 కి.మీ ప్రాంతంపై అమెరికా సైన్యం నియంత్రణ సాధించాలి. నౌకలపై క్షిపణులు ప్రయోగించకుండా ఇరాన్‌ను ఆపాలంటే 30,000 నుంచి 45,000 మంది సైనికులు అవసరం అవుతారు. అంతమందిని ఏళ్ల తరబడి అక్కడ నిర్వహించాలంటే అమెరికా ఎంతో వెచ్చించవలసి వస్తుంది. గతంలోఅఫ్గానిస్థాన్‌లో, వియత్నాంలో ఈ విధంగా సైనిక బలగాల నిర్వహణకు అమెరికా ఎంతో మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత కోసం ఇజ్రాయెల్, దాని సైనిక చర్యల కట్టడి చాలా అవసరం. ఇజ్రాయెల్ సైనిక చర్యలు హద్దులు మీరుతున్నాయని ఐక్యరాజ్యసమితి తోపాటు పలు అంతర్జాతీయ సంస్థలు, దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ను వెనకేసుకుని ట్రంప్ రాకుండా తనకు తాను నియంత్రించుకోవాలి. తాను సృష్టించుకున్న గందరగోళం నుండి తప్పించుకోడానికి రెచ్చగొట్టే ప్రసంగాలు, జాతి నిర్మూలన బెదిరింపులు వంటివి లేకుండా శాశ్వత శాంతికోసం కృషి చేయడంపై దృష్టి సారించాలి. అప్పుడే ఆయన పదవికి తగిన సమున్నత గౌరవం ప్రపంచ స్థాయిలో లభిస్తుంది. 

మన తెలంగాణ 10 Apr 2026 10:50 am

హామీలకే పరిమితమైన ‘స్కిల్ సెంటర్’..

హామీలకే పరిమితమైన ‘స్కిల్ సెంటర్’.. బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణాన్ని ఐటీ

ప్రభ న్యూస్ 10 Apr 2026 10:45 am

భార్యకు నిద్రమాత్రలు మింగించిన భర్త... ఇంట్లోనే ప్రియురాళ్లతో శృంగారం

బెంగళూరు: భార్యతో నిద్రమాత్రలు మింగించి అనంతరం ప్రియురాలితో భర్త చాటింగ్ చేయడంతో పాటు వీడియో కాలింగ్ చేసేవాడు. ప్రశ్నించిన భార్యను హింసించిన సంఘటన కర్నాటక రాష్ట్రం హుబ్బళ్లిలోని విజయనగర ప్రాంతంలో జరిగింది. పది సంవత్సరాల క్రితం మాలింగప్ప అనే ఉపాధ్యాయుడు కాంచన అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. భార్యతో నిద్రమాత్రలు మింగించి అనంతరం తన ప్రియురాళ్లతో ఫోన్ లో ఛాటింగ్‌తో పాటు వీడియో కాల్ చేసేవాడు. రాత్రి సమయంలో భార్య గాఢ నిద్రలోనికి జారుకున్న తరువాత ప్రియురాళ్లను ఇంటికి తీసుకొచ్చి శృంగారం చేసేవాడు. భార్య పలుమార్లు ప్రశ్నించడంతో ఆమెపై దాడులు చేయడంతో పాటు బూతులు తిట్టేవాడు. ఆమె హుబ్బళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 10 Apr 2026 10:39 am

సర్వేల్లో శాస్త్రీయత ఎంత?

ఎన్నికల కాలం దగ్గర పడుతుండగానే దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన చర్చ మొదలవుతుంది. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ సర్వే సంస్థలు వరుసగా తమ అంచనాలను విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా సి-ఓటర్ వంటి సంస్థలు ప్రకటించిన తాజా ఒపీనియన్ పోల్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ సర్వేలు ఎంతవరకు నిజాన్ని ప్రతిబింబిస్తాయి? వాటి శాస్త్రీయత ఎంత? ప్రజాస్వామ్యంలో వాటి పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలు సహజంగానే ఎదురవుతున్నాయి. శాస్త్రీయత వెనుక ఉన్న పరిమితులు సర్వేలు సాధారణంగా శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఓటర్లను నమూనాగా ఎంపిక చేసి, వారి అభిప్రాయాలను సేకరించి మొత్తం ఓటర్ల మూడ్‌ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. వయస్సు, లింగం, ప్రాంతం, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఈ ప్రక్రియలోనే కొన్ని పరిమితులు ఉంటాయి. లక్షలాది ఓటర్ల అభిప్రాయాన్ని కొన్ని వేల మందిపై ఆధారపడి అంచనా వేయడం సహజంగానే పూర్తి సత్యాన్ని అందించలేకపోవచ్చు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అట్టడుగు వర్గాల్లో అభిప్రాయ సేకరణ పూర్తిగా జరిగిందా అనే సందేహాలు తరచుగా వ్యక్తమవుతుంటాయి. సర్వే ఫలితాలు సూచిస్తున్న రాజకీయ దిశ ఇటీవల విడుదలైన సర్వేలు చూస్తే రాష్ట్రాలవారీగా పోటీ భిన్నంగా కనిపిస్తోంది. తమిళనాడులో అధికార పార్టీ, ప్రతిపక్ష కూటముల మధ్య తేడా చాలా తక్కువగా ఉండటం హోరాహోరీ పోటీని సూచిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ దగ్గరగా ఉండటం చివరి క్షణంలో మార్పులకు అవకాశం ఉన్నట్టు చెబుతోంది. అసోంలో అధికార బిజెపి కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉందని సర్వేలు సూచిస్తుండగా, కేరళలో సంప్రదాయంగా కొనసాగుతున్న అధికార మార్పిడి ధోరణి ఈసారి కూడా పునరావృతం కావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ అంచనాలు రాజకీయ దిశను సూచించినప్పటికీ, తుది ఫలితాలను ఖచ్చితంగా నిర్ధారించలేవు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే శక్తి ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం గమనించాలి. ఈ సర్వేలు కేవలం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడమే కాకుండా, కొన్ని సార్లు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం కూడా చేస్తాయి. ముందంజలో ఉన్న పార్టీకి మరింత మద్దతు లభించే బ్యాండ్ వ్యాగన్ ప్రభావం ఒకవైపు ఉండగా, వెనుకబడిన పార్టీలకు సానుభూతి పెరిగే అవకాశం మరోవైపు ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సర్వేలను తమ ప్రచార వ్యూహాల్లో భాగంగా వినియోగించుకోవడం కూడా సాధారణమైంది. భారత ఎన్నికల చరిత్రలో సర్వేలు తప్పిపోయిన సందర్భాలు కూడా కొదవలేదు. అనూహ్యమైన ఫలితాలు, చివరి దశలో ఓటర్ల అభిప్రాయ మార్పులు, స్థానిక అంశాల ప్రభావం, అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం ఇవన్నీ కలిసి సర్వే అంచనాలను తప్పుదోవ పట్టించిన ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు, 2004 సాధారణ ఎన్నికల్లో ఎక్కువ భాగం ఒపీనియన్ పోల్స్ ఇండియా షైనింగ్ ప్రచారంతో ఎన్‌డిఎ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ తుది ఫలితాల్లో యుపిఎ కూటమి విజయం సాధించడం సర్వేల విశ్వసనీయతపై పెద్ద చర్చకు దారితీసింది. అలాగే 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక సర్వేలు త్రిభుజ పోటీని సూచించినప్పటికీ, ఆమ్‌ఆద్మీ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం అంచనాలను పూర్తిగా తారుమారు చేసింది. ఇక 2020 బీహార్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా మహాగఠ్‌బంధన్‌కు అనుకూలంగా సూచించినా, తుది ఫలితాల్లో ఎన్‌డిఎ కూటమి తిరిగి అధికారంలోకి రావడం మరోసారి సర్వేల పరిమితులను బయటపెట్టింది. పశ్చిమబెంగాల్ 2021 ఎన్నికల్లో కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ లేదా బిజెపికి గట్టి పోటీ సూచించినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో గెలవడం అంచనాలను మించిపోయింది. ఈ ఉదాహరణలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. సర్వేలు ఓటర్ల తుది నిర్ణయాన్ని పూర్తిగా అంచనా వేయలేవు. ముఖ్యంగా సైలెంట్ ఓటర్ అనే వర్గం సర్వేలలో కనిపించకపోయినా, ఫలితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నికల రోజు ఓటర్ల టర్నౌట్ కూడా ఫలితాన్ని పూర్తిగా మార్చగలదు. అంతేకాకుండా, సర్వే సంస్థల స్వతంత్రత, పారదర్శకత కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భాలు ఉన్నాయి. సర్వేలకు ఎవరు నిధులు సమకూరుస్తున్నారు? డేటా సేకరణ ఎలా జరుగుతోంది? విశ్లేషణలో ఎలాంటి పద్ధతులు అనుసరించారు? వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేనప్పుడు వాటి విశ్వసనీయతపై సందేహాలు కలగడం సహజం. సర్వేలను ఎలా చూడాలి? ఈ పరిస్థితుల్లో సర్వేలను ఎలా చూడాలి? అవి పూర్తిగా నిరాకరించాల్సినవేనా? లేక పూర్తిగా నమ్మాల్సినవేనా? అనే ప్రశ్నకు సమతుల్యమైన సమాధానం అవసరం. సర్వేలు ఒక సూచికగా ఉపయోగపడతాయి. అవి ప్రజల ప్రస్తుత మూడ్‌ను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. కానీ అవి ఎన్నికల ఫలితాలపై తుది తీర్పు ఇవ్వలేవు. ఓటరు ప్రవర్తన చాలా సంక్లిష్టమైనది. చివరి క్షణంలో తీసుకునే నిర్ణయాలు, స్థానిక సమస్యలు, నాయకత్వంపై అభిప్రాయాలు ఇవన్నీ కలిసి ఓటు రూపంలో బయటపడతాయి. తీర్పు ఎప్పటికీ ప్రజలదే.. మొత్తానికి, ఎన్నికల సర్వేలు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక సూచిక మాత్రమే. అవి తుది తీర్పును నిర్ణయించే సాధనాలు కావు. గణాంకాలు ఒక దిశను చూపగలవు గానీ, ఓటరుల మనసులో జరిగే మార్పులను పూర్తిగా అంచనా వేయలేవు. ఎన్నికల రాజకీయాల్లో చివరి మాట ఎప్పుడూ ఓటరుదే. అది ఎలాంటి సర్వేలకు అందని, అంచనాలకు లోబడని ప్రజాతీర్పు. ఓటరు తన అనుభవం, జీవన పరిస్థితులు, స్థానిక సమస్యలు, నాయకత్వంపై నమ్మకం వంటి అనేక అంశాలను తూకం వేసి తన ఓటుద్వారా నిర్ణయం చెబుతాడు. అందువల్ల సర్వేలను గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరో, పూర్తిగా విస్మరించడం కూడా అంతే అవివేకం. వాటిని ఒక సూచనగా మాత్రమే పరిగణిస్తూ, విమర్శనాత్మక దృష్టితో పరిశీలించడం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి అవసరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అసలు అధికారం ఎప్పటికీ ప్రజల చేతుల్లోనే ఉంటుంది. - మేకల కృష్ణ 9948556978

మన తెలంగాణ 10 Apr 2026 10:36 am

ఏడాది గడిచింది.. పట్టించుకునే వారేరి..?

ఏడాది గడిచింది.. పట్టించుకునే వారేరి..? ఘంటసాల – ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామంలోని

ప్రభ న్యూస్ 10 Apr 2026 10:34 am

High Court Slams Police Over Social Media Abuse Enforcement Failures

The Andhra Pradesh High Court has strongly criticized the police for not controlling abusive content on social media. While hearing a petition filed by YSRCP leader Sajjala Bhargav Reddy, the court made it clear that police failure is the main reason such posts are increasing. The judges said that people are becoming bold because they […] The post High Court Slams Police Over Social Media Abuse Enforcement Failures appeared first on Telugu360 .

తెలుగు 360 10 Apr 2026 10:24 am

மதுரையில் இறைச்சி விற்பனையை தடை செய்வேன் என இயக்குநரும் என்.டி.ஏ வேட்பாளருமான சுந்தர்.சி கூறினாரா?

மதுரையில் இறைச்சி விற்பனையை தடை செய்வேன் என சுந்தர்.சி கூறியதாக தவறான தகவலுடன் நியூஸ் கார்டு வைரலாகி வருகிறது.

తెలుగు పోస్ట్ 10 Apr 2026 10:23 am

Telangana : రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలోనే పింఛన్ల మొత్తం పెంపు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 10 Apr 2026 10:23 am

Telangana : సాదాబైనామా దరఖాస్తులలో కొత్త మార్గదర్శకాలివే

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 10 Apr 2026 10:20 am

రోడ్డు ప్రమాదాల నివారించేందుకు..

రోడ్డు ప్రమాదాల నివారించేందుకు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ డీసీపీ

ప్రభ న్యూస్ 10 Apr 2026 10:17 am

Telangana : వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం వాహనాలను కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 10 Apr 2026 10:15 am

సీఏపీఎఫ్‌లో వివక్ష

అధికార స్థానాల ఎంపికలో సిబ్బందికి అన్యాయం: రాహుల్ గాంధీ న్యూదిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు దళా(సీఏపీఎఫ్)ల్లో అధికార స్థానాలకు ఎంపిక విషయంలో సిబ్బందికి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఆ వివక్షను రూపుమాపి, ఉన్నతాధికారులుగా సీఏపీఎఫ్‌కు చెందిన వారినే నియమిస్తామని, బయటి నుంచి తీసుకురాబోమని హామీ ఇచ్చారు. సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఆ సంస్థ సిబ్బందికి రాహుల్‌గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ‘మావోయిస్టులు, ఉగ్రవాదులను ఎదుర్కోవడంతో పాటు […] The post సీఏపీఎఫ్‌లో వివక్ష appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Apr 2026 10:14 am

దేవాలయానికి బహుమతి ఇచ్చిన భక్తులు..

దేవాలయానికి బహుమతి ఇచ్చిన భక్తులు.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ లోని

ప్రభ న్యూస్ 10 Apr 2026 10:12 am

Telangana : సర్కార్ బడుల్లో తనిఖీలతో హడల్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 10 Apr 2026 10:11 am

అవినీతికి ఊతంగా దళారీ దండు

దేశంలో దళారీ వ్యవస్థ బలంగా విస్తరించడం వల్ల ప్రభుత్వ ఆఫీసులోకి ప్రజలు వెళ్లి స్వయంగా పనులు చక్కబెట్టుకొనే పరిస్థితి లేకుండా పోయింది. ఆధునిక సాంకేతికతని ఉపయోగించి దళారీ లంకెని తెగ్గొట్టాలని ప్రభుత్వాలు చేస్తున్న ప్రయోగాలు అనుకున్న ఫలితం ఇవ్వడం లేదు. ఆన్‌లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్నా దళారీ దగ్గరకు పోనిదే ఆఫీసులోకి ఫైల్ కదలడం లేదు. దళారిని వద్దను కుంటే ఆఫీసు చుట్టూ పదిసార్లు చక్కర్లుకొట్టాలి. అప్పటికీ పని అవుతుందన్న గ్యారెంటీ లేదు. రాను పోను సమయం, ఖర్చు వృథా ఎందుకని చాలా మంది బ్రోకర్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇది తప్పా ఒప్పా అనే డెబిట్ అనవసరం. అవినీతిని అంతం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేనంత కాలం ఎన్ని మార్పులు చేపట్టినా దండగే.స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఆఫీసులో వ్యవహారమంతా డాక్యుమెంట్ రైటర్ల చేతుల మీదుగానే జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ 1972లో రూపుదిద్దుకొంది. అప్పటి వరకు ఉన్న దస్తావేజు రాతగాళ్ల అర్హతలను బట్టి వారిలో కొందరిని ఎంపిక చేసి డాక్యుమెంట్ రైటర్ లైసెన్సులు జారీ చేశారు. అప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ 1992లో రద్దయింది. అయినప్పటికీ డాక్యుమెంట్ రైటర్లు కనుమరుగు కాలేదు. లైసెన్సులు లేకపోయినా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 200 ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవడం ద్వారా డాక్యుమెంట్లను తయారుచేసేవారు. ఇలా కొంతకాలం కొనసాగగా 2002లో అప్పటి ప్రభుత్వం ఆ పద్ధతిని కూడా రద్దు చేసి డాక్యుమెంట్ తయారీలో ఉన్న నిబంధనలన్నీ తొలగించింది. అంటే ఎవరికి వారు డాక్యుమెంట్ తీసుకొని వచ్చినా అది ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటే రిజిస్ట్రార్ ఒప్పుకోవలసిందే. కానీ మధ్య దళారీగా పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్ ముందుండి కదిలిస్తే తప్ప రిజిస్ట్రేషన్ పూర్తవని దుస్థితి కొనసాగుతోంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఎసిబి దాడులు షరా మామూలే. ఇటీవల హనుమకొండ ఎస్‌ఆర్‌ఒపై జరిగిన ఆకస్మిక తనిఖీలో 20 మంది బ్రోకర్లు దొరికారు. వారి వద్ద లెక్క చూపలేని సొమ్ము దొరికింది. అధికారి సొరుగులో లంచం అందక అప్పగించని దస్తావేజులు దొరికాయి. అధికారి, లేఖరుల ఫోన్ల సంభాషణలో వసూళ్ల ముచ్చట్లు దొరికాయి. ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ ద్వారా అధికారికి రూ. 42 లక్షలు బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయి. నిత్యకృత్యమైన ఈ వ్యవహారం ఒక్క ఎస్‌ఆర్‌ఒ బాగోతం కాదు. అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరిగే తంతే. పట్టుబడినా ఆగని దందా ఇది. లక్షలు పెట్టి కొనే భూమి, ఇల్లు కాగితాలు సక్రమంగా ఉండాలనే ముందు జాగ్రత్తతో కొనుగోలుదారులు అడిగినంత సొమ్ము ముట్టజెప్పడానికి సిద్ధపడతారు. అదే వారి సంపాదనకు ఆయువుపట్టు. మీ సేవ సెంటర్లు వివిధ ఆఫీసుల్లో అవసరమయ్యే సర్టిఫికెట్లను ఒకే చోట అందించే సౌలభ్య కేంద్రాలు. తహసీల్దార్ కార్యాలయం నుండి ఏ ధ్రువీకరణ పత్రం కావాలన్నా మీ సేవ ద్వారానే అప్లికేషన్ పంపాలి. ఉదాహరణకు ఒకరి డెత్ సర్టిఫికెట్ కావాలంటే మీ సేవలో సంప్రదిస్తే తగిన రుజు పత్రాలను జోడించి అభ్యర్థనను రెవెన్యూ కార్యాలయానికి పంపుతారు. ప్రతి సర్టిఫికెట్ పొందడానికి నిర్ణీత సమయం తెలిపే పట్టిక అక్కడ ఉంటుంది. అయితే మీ సేవలో అప్లయి చేయగానే సమయం ప్రకారం సర్టిఫికెట్ చేతికందదు. సమయం మించిపోయిం ది కదా అని మీ సేవలో ఆరా తీస్తే ఆఫీసుకు వెళ్లి కలవమని చెబుతారు. ఆఫీసుకు వెళ్లి అడిగితే అప్పుడే ఫైల్ కదులుతుంది. వారం రోజుల్లో విచారణకు వస్తామంటారు. అలా వచ్చిన వ్యక్తి బేరసారాలు మొదలెడతాడు. మీరు ఇంత మొత్తాన్ని చెల్లిస్తే రేపు సర్టిఫికెట్ తెచ్చి ఇస్తాను. లేదంటే దొరకదు అని చెప్పేస్తాడు. రాజీపడవలసిందే. ఆ డెత్ సర్టిఫికెట్ లేకుంటే ఎన్నో పనులు ఆగిపోతాయి. మీ సేవ సెంటర్ ఒక పోస్ట్ బాక్స్ మాత్రమే. మిగతాదంతా ఆఫీసుకి వెళితేనే సాధ్యపడుతుంది. కంపెనీ అధీకృత డీలర్ల దగ్గరే మోటార్ సైకిల్, కారు లాంటి వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయే పద్ధతిని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని వల్ల ఇక ఆర్‌టిఎ ఆఫీసు చుట్టూ తిరిగే బెడద తప్పుతుందని వాహనదారులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. వెహికిల్‌ని తీసుకుని ఆఫీసు వద్దకు వెళ్లే పని తప్పుతుంది. హైదరాబాద్‌లో అయితే కొందరు ఎంతో దూరం వెళ్ళవలసి వస్తోంది. 24, జనవరి నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ కు పచ్చజెండా ఊపారు. అయితే ఆర్‌టిఎ ఆఫీసు చేసే దోపిడీ దందా డీలర్ల చేతుల మీదుగా మొదలైందని పత్రికల్లో వచ్చింది. వాహన రిజిస్ట్రేషన్ కోసం చెల్లించే ఫీజుకు అదనంగా కొంత సొమ్మును డీలర్లు వసూలు చేస్తున్నారట. దానికి ఎలాంటి వివరణ, రసీదు ఉండదు. అంటే ఆర్‌టిఎ ఆఫీసుకు కొత్త బ్రోకర్ వ్యవస్థగా డీలర్లు పని చేస్తున్నారన్నమాట. ఫైల్ ఆన్‌లైన్‌లో వచ్చినా వసూళ్లకు ఎలాంటి భంగం కలగలేదు. ఆర్‌టిఎ ఆఫీసుల వద్ద కనబడే ప్రత్యక్ష దళారుల గురించి అధికారులను ప్రశ్నించే అవకాశం ఉండేది. బాధితులు ఎవరైనా గట్టిగా అడిగినప్పుడు పోలీసుల సాయంతో ఈ పగటి దొంగలను బయటికి పంపించిన ఘటనలు ఉన్నాయి. డీలర్లు అదనంగా వసూలు చేసే సొమ్ముపై ఎవరికీ ఫిర్యాదు చేయాలో అర్థం కావడం లేదని బాధితులు అంటున్నారు. అవినీతికి ఆస్కారమున్న అధికారులకు ప్రజలు చిక్కకుండా ప్రవేశపెట్టిన ఏ విధాన్నానైనా విఫలం చేసే చాతుర్యం మనవాళ్లకుంది. అందుకు విరుగుడుగా ప్రభుత్వ ఆఫీసులకు ఆన్‌లైన్‌లో వచ్చిన అప్లికేషన్ల పరిస్థితిని తనిఖీ చేసే వ్యవస్థ కావాలి. అది నిజాయితీ గల సివిల్ సర్వెంట్ ఆధ్వర్యంలో నడవాలి. తరచూ, ఆకస్మిక దాడుల ద్వారా కొంతలో కొంతైనా ప్రయోజనం ఉండొచ్చు. - బి.నర్సన్ 94401 28169

మన తెలంగాణ 10 Apr 2026 10:04 am

ప్రభుత్వ పథకాలు వివరిస్తూ..

ప్రభుత్వ పథకాలు వివరిస్తూ.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి బడుగు

ప్రభ న్యూస్ 10 Apr 2026 10:03 am

Summer Effect : ఏప్రిల్ లోనే రోహిణి కార్తె వచ్చినట్లుందిగా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

తెలుగు పోస్ట్ 10 Apr 2026 10:01 am

Artemis Mission : ఆర్టెమిస్ మిషన్ రేపు భూమిపైకి .. దీని విశిష్టతలేంటంటే?

భారత కాలమాన ప్రకారం ఆర్టెమిస్ మిషన్ రేపు భూమికి తిరిగి రానుంది

తెలుగు పోస్ట్ 10 Apr 2026 9:56 am

ప్రశాంతంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు..

ప్రశాంతంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు.. హుజూర్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ న్యాయవాదుల

ప్రభ న్యూస్ 10 Apr 2026 9:52 am

హోర్మూజ్ నిర్వహణలో కఠనమైన మార్పులు

మొజ్తాబా ఖామేనీ సంకేతాలు తెహ్రాన్: అమెరికా- ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ..హోర్మూజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖామేనీ కీలక ప్రకటన చేశారు. జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామని ప్రకటించారు. హోర్మూజ్‌పై అనుసరించే విధానం మరింత వ్యూహాత్మకంగా, కఠినంగా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటనను ఆ దేశ మీడియా వెళ్లడించింది. చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్‌లో పరిస్థితులు కుదుటపడలేదు. ఈ […] The post హోర్మూజ్ నిర్వహణలో కఠనమైన మార్పులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Apr 2026 9:50 am

యోగ ద్వారా మానసిక ప్రశాంతత..

యోగ ద్వారా మానసిక ప్రశాంతత.. వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రతి రోజు జీవితంలో

ప్రభ న్యూస్ 10 Apr 2026 9:47 am

నేటి నుంచి టోల్ ప్లాజ్ దాటాలంటే?

నేటి నుంచి టోల్ ప్లాజా దాటాలంటే నగదు చెల్లింపులు అనుమతించరు

తెలుగు పోస్ట్ 10 Apr 2026 9:43 am

IPL 2026 : నేడు ఐపీఎల్ లో బిగ్ ఫైట్

నేడు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది

తెలుగు పోస్ట్ 10 Apr 2026 9:33 am

ఓ ప్రజాప్రతినిధి పిఎ అన్యాయం... చిత్రహింసలు పెడుతున్నారు... నన్ను ఎన్ కౌంటర్ చేయండి

అమరావతి: న్యాయం అడిగితే తన భర్తను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని రామాంజనేయులు భార్య జోత్స్య ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం అడిగినందుకే తన భర్త చిత్రహింసలు పెట్టడంతో పాటు మనోవేదనకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. తన భర్తపై ఐదు కేసులు నమోదు చేశారని, 307 కేసు పెట్టి 100 రోజులు జైల్లో ఉంచారని ఆరోపించారు. అయినా పోరాటం కొనసాగిస్తుండటంతో తన భరపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారని తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఓ ప్రజాప్రతినిధి పిఎ సాంబశివరావు తన కుటుంబాన్ని వ‌దిలేయాలని రామాంజనేయులు కోరారు. డిఎస్ పి మురళీ కృష్ణ తన కుటుంబాన్ని వదిలేసి తనన ఎన్‌కౌంట‌ర్ చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజ‌క‌వ‌ర్గం యర్రబాలెంలో రామాంజనేయులు అనే వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడ్డాడు. తన మరణానికి మంగళగిరి సిఐ వీరస్వామి, డీఎస్పీ మురళీకృష్ణ అని, తనపై తప్పుడు కేసులు కట్టి వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఓ ప్రజా ప్రతినిధి పిఎ సాంబశివరావు, మ‌రికొంత‌మంది చెప్పార‌ని త‌న‌పై రౌడీషీట్ ఓపెన్ చేసి వేధిస్తున్నార‌ని ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. తాను ఇక ఇబ్బందులు ప‌డ‌లేనని, తనని ఎన్ కౌంట‌ర్ చేయాలని కోరారు. తాను టిడిపి కార్యకర్తను అని, ఒక సాంభశివ రావుతోనే అన్యాయం జరిగింది, మొత్తం వ్యవస్థను తప్పు పట్టడంలేదన్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

మన తెలంగాణ 10 Apr 2026 9:28 am

Gold Prices Today : బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరిక

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

తెలుగు పోస్ట్ 10 Apr 2026 9:24 am

26 South Korea Ships : సాహో.. ఇరాన్ Andhra Prabha News

26 South Korea Ships : సాహో.. ఇరాన్ Andhra Prabha News

ప్రభ న్యూస్ 10 Apr 2026 9:22 am

ఉయ్యూరులో దారుణం..

ఉయ్యూరులో దారుణం.. ఉయ్యూరు, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ఉయ్యూరులోని సాయి కృప

ప్రభ న్యూస్ 10 Apr 2026 9:21 am

స్టార్ డైరెక్టర్ మూవీలో బిగ్ ఆఫర్

ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల తార కృతి శెట్టి కొంత కాలం తర్వాత ఇప్పుడు తెలుగులో ఓ క్రేజీ మూవీలో నటించనుంది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాలో ఆమె ఓ హీరోయిన్‌గా చేయనుంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కృతిశెట్టి... నందమూరి కళ్యాణ్ రామ్‌కు జోడీగా నటించనుంది. ఈ నేపథ్యంలో కృతిశెట్టి మాట్లాడుతూ “తెలుగులో గ్యాప్ అనేది నిజంగా అయితే నేను ప్లాన్ చేసింది కాదు. వరుసగా తమిళ్ నుంచి అవకాశాలు వచ్చాయి. అందులో నాకు చాలా కథలు నచ్చాయి. తెలుగు ఆడియన్స్ నా మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. వాళ్లకు ఒక మంచి సినిమా ఇవ్వాలి అనుకుని ఈ సమయం తీసుకున్నాను. ఈ గ్యాప్‌లో మళ్లీ యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లాను. ఫైటింగ్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. అలాగే క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నాను. సమయం దొరికితే నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయబోతున్నాను. అలాగే తమిళ్‌లో ఒక సినిమా చర్చల్లో ఉంది”అని అన్నారు. ఇక తాజాగా అనిల్ రావిపూడి తన సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు. తన మూవీలో నందమూరి హీరోకి జోడిగా కృతి శెట్టి నటిస్తున్నట్లు ఆయన అధికారికంగా చెప్పారు. ఇప్పుడు ఈ మల్టీస్టారర్ మూవీలో విక్టరీ వెంకటేష్‌కి జోడీగా ఏ భామ నటించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో, సినిమా లవర్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. అనిల్ రావిపూడి సినిమా అంటే సంక్రాంతికి రావాల్సిందే అనే ట్రెండ్ మార్క్ సెట్ చేసిన ఈ సక్సెస్‌పుల్ డైరెక్టర్.. ఇప్పుడు తన కొత్త సినిమాను కూడా 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న భారీ అంచనాలను తగ్గట్టుగా దర్శకుడు స్క్రిప్ట్‌ను జాగ్రత్తగా మెరుగుపరుస్తున్నాడు.

మన తెలంగాణ 10 Apr 2026 9:18 am

Telangana : ఈసారి చిలకపచ్చ రంగు చీరల పంపీణీ

తెలంగాణలో ఉచిత చీరల పంపిణీ పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది

తెలుగు పోస్ట్ 10 Apr 2026 9:07 am

Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా... అయితే మీకోసమే?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది

తెలుగు పోస్ట్ 10 Apr 2026 9:00 am

రాచూరులో కాఫీ విత్ క్యాడర్..

రాచూరులో కాఫీ విత్ క్యాడర్.. శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ

ప్రభ న్యూస్ 10 Apr 2026 8:54 am

14 రోజుల రిమాండ్.. ఎందుకో తెలుసా..?

14 రోజుల రిమాండ్.. ఎందుకో తెలుసా..? కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని

ప్రభ న్యూస్ 10 Apr 2026 8:47 am

Revanth Reddy : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు

తెలుగు పోస్ట్ 10 Apr 2026 8:40 am

10thApril 2026 |తిరుమల సమాచారం..

10thApril 2026 | తిరుమల సమాచారం.. తిరుమల, ఆంధ్రప్రభ : “ఓం నమో

ప్రభ న్యూస్ 10 Apr 2026 8:32 am

అప్పులు ఇచ్చి... మరీ ప్రాణం తీసుకున్నాడు

అమరావతి: అప్పులు ఇచ్చిన వారు మోసం చేయడంతో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పోలవరం జిల్లా అడ్డుతీగల ప్రాంతంలో గోగిన జయకిషన్(55) నివసిస్తున్నాడు. చిట్టీలు పాడి, తెలిసిన వారి దగ్గర అప్పులు తీసుకొచ్చి వేణి, ఈశ్వర్ రావు, వై లక్ష్మీభవాని, రమ్య, కె రామకృష్ణ, తదితరలకు రూ.35 లక్షల వరకు అప్పులు ఇచ్చాడు. కొందరు ఏడు లక్షల వరకు అప్పులు చెల్లించారు. మిగిలిన డబ్బులు ఇవ్వమంటే అతడితో వారు గొడవకు దిగారు. స్థానికు ఎంఎల్‌ఎ అనుచరుడు అండ చూసుకొని అప్పులు వాళ్లు డబ్బులు ఇవ్వడంలేదని జయకిషన్ ఆరోపణలు చేశాడు. కేసు పెట్టుకోవాలంటూ వారంతా తనపై తిరగబడ్డారని తెలిపాడు. దీంతో తనకు అప్పులు ఇచ్చిన వాళ్లు అడగడంతో ఏం చేయాలో అతడికి తోచలేదు. రెండు కవర్లలో మూడు లీటర్ల పెట్రోలు తీసుకొని రాజమహేంద్రవరంలోని రాజోల్ లో చేరుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. మంత్రి నారా లోకేశ్‌కు వీడియోను షేర్ చేశాడు. తనను మోసగించిన వారి నుంచి మొత్తం రికవరీ చేసి తాను తీర్చాల్సిన అప్పులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.  

మన తెలంగాణ 10 Apr 2026 8:30 am

Andhra Pradesh : నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది

తెలుగు పోస్ట్ 10 Apr 2026 8:28 am

కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా అఖిల్ కృష్ణ..

కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా అఖిల్ కృష్ణ.. పెద్దపల్లి, ఆంధ్రప్రభ : కస్టమ్స్ ఇన్స్పెక్టర్

ప్రభ న్యూస్ 10 Apr 2026 8:27 am

Pawan Kalyan : ఇకపై నెలకు రెండుసార్లు పర్యటిస్తా : పవన్ కల్యాణ్

కాకినాడ జిల్లాలో రెండు నెలలకి ఒకసారి ప్రత్యేకంగా పర్యటిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు

తెలుగు పోస్ట్ 10 Apr 2026 8:22 am

రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు భారీ ఊరట లభించింది

తెలుగు పోస్ట్ 10 Apr 2026 8:12 am

ముందస్తు అరెస్టు..

ముందస్తు అరెస్టు.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ముదిరాజ్

ప్రభ న్యూస్ 10 Apr 2026 8:10 am

Jana Nayagan Leaks: Who has to be Blamed?

Jana Nayagan has been in waiting mode from months. The producers spent big money and they are in big financial stress because of the delay. Vijay’s fans are left stressed as the film’s new release date is yet to be announced. The makers are tightlipped and are waiting with patience. Several clips from the film […] The post Jana Nayagan Leaks: Who has to be Blamed? appeared first on Telugu360 .

తెలుగు 360 10 Apr 2026 8:07 am

IPL 2026 : చివరి బాల్ కు విజయం.. లక్నోది ఎంత లక్కంటే?

కోల్ కత్తా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది

తెలుగు పోస్ట్ 10 Apr 2026 7:54 am

మీడియా, ప‌త్రిక‌పై భౌతిక దాడులు వద్దు: వెంకయ్యనాయుడు

అమరావతి: కార‌ణం ఏదైనా మీడియా, ప‌త్రిక‌పై భౌతిక దాడులు స‌రైన నిర్ణయం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. స‌మాజంలో అంద‌రూ ప‌త్రిక‌ల ప‌ట్ల గౌర‌వం పాటించాలని సూచించారు. అసత్య వార్తలు, అభ్యంతరకరమైన వార్తలు రాసినప్పుడు శాంతియుతంగా నిరసన చేప్టటాలని, కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీ‌కాకుళం జిల్లా ఎచ్చెర్ల‌లో ఓ పత్రిక ఆఫీస్‌పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. అక్కడే ఉన్న పత్రిక పేర్లకు సంబందించిన బోర్డులను పీకేసి తగల బెట్టారు.  ప్రహరీ గోడ దూకి ఎచ్చెర్ల ఓ పత్రిక యూనిట్ ఆఫీస్‌ ను తగలబెట్టారు. 

మన తెలంగాణ 10 Apr 2026 7:44 am

అకాల వర్షాల హెచ్చరిక..

అకాల వర్షాల హెచ్చరిక.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ,

ప్రభ న్యూస్ 10 Apr 2026 7:44 am

Israel -airstrikes- Beirut :బీరూట్‌పై ఇజ్రాయెల్‌ భీకర వైమానిక దాడులు

బీరూట్‌పై ఇజ్రాయెల్‌ భీకర వైమానిక దాడులు జరిపింది.

తెలుగు పోస్ట్ 10 Apr 2026 7:36 am

ఉత్తరాంధ్రకు వడగాలుల హెచ్చరిక..

ఉత్తరాంధ్రకు వడగాలుల హెచ్చరిక.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేడు

ప్రభ న్యూస్ 10 Apr 2026 7:29 am

లక్నో అద్భుత గెలుపు

కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్ మూడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన లక్నో ఇన్నింగ్స్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు మిఛెల్ మార్ష్ (15), ఐడెన్ మార్‌క్రమ్ (22) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బడోని 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54 పరుగులు చేశాడు. చివర్లో ముకుల్ చౌదరి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌కు అద్భుత గెలుపును అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ముకుల్ 27 బంతుల్లోనే ఏడు సిక్స్‌లు, 2 ఫోర్లతో అజేయంగా 54 పరుగులు చేశాడు. అంతకుముందు కోల్‌కతా టీమ్‌లో రహానె (41), రఘువంశీ (45), పొవెల్ (39), గ్రీన్ (32) పరుగులు చేశారు.

మన తెలంగాణ 10 Apr 2026 7:17 am

ఆత్మవిశ్వాసంతో రాజస్థాన్.. నేడు బెంగళూరుతో పోరు

గౌహతి: హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ రాజస్థాన్ జయకేతనం ఎగుర వేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇక బెంగళూరు ఆడిన రెండు మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లలోనూ ప్రతిభాంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగాడు. జోరు సాగిస్తారా.. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. ఇద్దరు విధ్వంసక బ్యాటింగ్‌తో రాజస్థాన్‌కు భారీ స్కోరు సాధించి పెట్టారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్న ముంబైపై వీరు సునామీ ఇన్నింగ్స్‌లతో విరుచుకు పడ్డారు. బెంగళూరుపై కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యారు. యువ ఆటగాళ్లు జోరుమీదుండడం రాజస్థాన్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇద్దరు చెలరేగితే రాజస్థాన్‌కు మరోసారి భారీ స్కోరు సాధించడం కష్టం కాకపోవచ్చు. రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అంతేగాక ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇక బెంగళూరులో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఛాలెంజర్స్ ఆలవోక విజయాలను సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రజత్ పటిదార్, జితేశ్ శర్మ, విరాట్ కోహ్లి, పడిక్కల్, ఫిలిప్ సాల్ట్, డేవిడ్, షెఫర్డ్, కృనాల్ పాండ్య వంటి స్టార్‌లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో బెంగళూరుకు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి.

మన తెలంగాణ 10 Apr 2026 7:10 am

రేప్ చేసి ఉరేశారు

బంధువుల ఆరోపణ వరంగల్ జిల్లా ఎకె తండాలో దారుణం జాతీయ రహదారిపై ధర్నా మన తెలంగాణ/వర్ధన్నపేట/రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మం డల పరిధిలోని ఏకే తండాలో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. బుధవారం రాత్రి ఏకే తండాకు చెందిన చిట్టి అనే యువతి(21) నలుగురు యువకులు అత్యాచారం చేసి ఉరి వేసి చంపారని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో యువతి మృతిచెందగా వర్ధన్నపేట మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ యువతి కుటుంబ సభ్యులు మార్చురీ ఎదుట జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. నలుగురు యువకులు ఎల్లప్పుడు గంజాయి మత్తులో ఉండేవారని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. గంజాయి మత్తులో నలుగురు యువకులు ఆ యువతి పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి చంపేశారని ఆరోపిస్తూ మృతురాలు కుటుంబ సభ్యులు వర్ధన్నపేట సెంటర్ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అమాయకురాలైన యువతిని కిడ్నాప్ చేసి ఆపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి హతమార్చారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.నిందితులను శిక్షించే దాకా మృతదేహానికి పోస్టుమార్టం చేసేది లేదంటూ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పడంతో వర్ధన్నపేట మార్చురీ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 10 Apr 2026 7:10 am

లెబనాన్‌తో చర్చలకు సిద్ధం

జెరూసలేం: లెబనాన్‌తో నేరుగా చర్చలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్‌నెతన్యాహు ప్రకటించారు. వీలైనంత త్వరగా ఈ చర్చలు ప్రారంభించాలని కేబినెట్‌కు ఆదేశించినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. లెబనాన్ ప్రభుత్వం పలుమార్లు నేరు గా చర్చలు ప్రారంభించాలని కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్చలు ప్రధానంగా హిజ్బొల్లా మిలిటెంట్ల నిరాయుధీకరణ, అలాగే ఇజ్రాయెల్‌లెబనాన్ మధ్య శాం తి సంబంధాల ఏర్పాటుపై కేంద్రీకృతమవుతాయ ని తెలిపారు. హిజ్బొల్లాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేపట్టిన అతిపెద్ద దాడుల్లో 200 మందికి పైగా మరణించిన నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ప్రాం తంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ చర్చలు కీలకంగా మారనున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగం కావాలని ఇరాన్ పట్టుబడుతుండగా, అమెరికాఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ ఈ ఒప్పందంలో భాగం కాదని స్పష్టం చేస్తున్నాయి. 

మన తెలంగాణ 10 Apr 2026 7:00 am

శాంతి చర్చలపై ఉత్కంఠ

ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో శాశ్వత శాంతి లక్షంగా ఇస్లామాబాద్‌లో జరగనున్న చర్చలు అమెరికా బృందానికి వాన్స్ నాయకత్వం ఇస్లామాబాద్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు కీలకమైన అమెరికా-ఇరాన్ ముఖాముఖి చర్చలకు పాకిస్తాన్ వేదికగా నిలవనుంది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఈ చర్చలు శుక్రవారం జరగనున్నాయి. ఈ సమావేశాల లక్ష్యం తాత్కాలిక విరమణను స్థిరమైన శాంతి ఒప్పందంగా మార్చడమే. ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ ప్రతినిధి బృందం గురువారం రాత్రికి ఇస్లామాబాద్ చేరుకోనుందని పాకిస్తాన్‌లోని ఇరాన్ రా యబారి రెజా అమిరి మొఘద్దాం తెలిపారు. అయితే ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఇరాన్ ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. అ యినప్పటికీ పాకిస్తాన్ ప్రధాని షెహబా షరీఫ్ ఆహ్వానం మేరకు ఇరాన్ చర్చలకు హాజరవుతున్నట్లు చెప్పారు. అమెరికా ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహించనున్నట్లు సమాచారం. ఆయనతో పాటు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే వారి రాక సమయంపై ఇంకా స్పష్టత లేదు. దీర్ఘకాలిక శాంతిపై దృష్టి ఈ చర్చలు శాశ్వత శాంతి కోసం విసృ్తత చట్రాన్ని రూపొందించడంపై కేంద్రీకృతమవుతాయని సమాచారం. ఆంక్షల సడలింపు, ప్రాంతీ య భద్రత, ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాల భవిష్యత్తు వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్ర ణాళిక ఆధారంగా చర్చలు సాగనున్నాయి. ఇం దులో ఆంక్షల ఎత్తివేత, భవిష్యత్ దాడులపై హా మీలు, హార్మూజ్ జలసంధికి సంబంధించిన ఏ ర్పాట్లు వంటి అంశాలు ఉన్నాయి. శాంతి ప్రయత్నాల మధ్య అమెరికాఇరాన్ మధ్య అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా లెబనాన్‌లో కాల్పుల విరమణ ఉల్లంఘనలపై వచ్చిన నివేదికలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. గతంలో చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో ఇరాన్ మరింత అప్రమత్తంగా ఉంది. పాకిస్తాన్ రాజనీతి ఈ వివాదంలో పాకిస్తాన్ అనూహ్యంగా మధ్యవర్తిగా మారి కీలక పాత్ర పోషిస్తోంది. శాంతి చర్చ లు విజయవంతం కావడానికి పాకిస్తాన్ ప్రధాని షెహబా షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, విదేశాంగమంత్రి ఇషాక్‌దార్ విసృ్తత స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇషాక్‌దార్ ఇప్పటికే సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, కెన డా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, కువైట్ వి దేశాంగ మంత్రి జర్రాహ్ జాబెర్ అల్ సబాహ్‌లతో సంప్రదింపులు జరిపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఈ కీలక చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో గురువారం, శుక్రవారం స్థానిక సెలవులు ప్రకటించారు. విదేశీ ప్రతినిధుల రాక, నివాసానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ, పాకిస్తాన్‌లోని అమెరికా రాయబారి నటా లీ బేకర్‌తో సమావేశమై, అన్ని విదేశీ ప్రతినిధులకు పటిష్ట భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అమెరికా ప్రతినిధులను ప్రత్యేక అతిథులుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చర్చల ఫ లితం పశ్చిమ ఆసియా భద్రత, ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ రాజనీతిపై గణనీయ ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మన తెలంగాణ 10 Apr 2026 6:50 am

నేడు ఢిల్లీకి సిఎం రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో నిర్వహించనున్న వర్కింగ్ కమిటీ (సీడబ్లూసి) సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. నేడు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు. నేడు మధ్యాహ్నాం ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించనున్నట్టుగా తెలిసింది. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ పర్యటనలో సిఎం వెంట వెళ్లనున్నారు. రాష్ట్రంలో పాలన పరంగా 28 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు, రాష్ట్ర అభివృద్ధి పనుల పురోగతిని సిఎం ఏఐసిసి అధిష్టానానికి వివరించనున్నారు. అలాగే, రాష్ట్ర కేబినెట్ విస్తరణ లేదా నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా అధిష్టానంతో సిఎం ప్రాథమిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. శుక్రవారం సాయంత్రం ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో ముఖ్యమంత్రి విడివిడిగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. 

మన తెలంగాణ 10 Apr 2026 6:50 am

నిప్పుల కొలిమి

రాష్ట్ర వ్యాప్తంగా సూర్యుడి భగ భగలు ఏప్రిల్ 12 నుంచి ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 12 నుంచి 22 వరకు 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుం డటంతో ఎండలు మండుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు తన భగభగలను మొదలుపెడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న మూడు రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉష్ణతరంగ పరిస్థితులు ఏర్పడనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర పరిస్థితులు నెలకొని, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా ఏప్రిల్ 12 నుంచి 22 వరకు వరుసగా 10 రోజుల పాటు 40-41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిం చారు. బుధవారం రాష్ట్రంలో 26 జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా, శనివారం 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ ఆలర్ట్ జిల్లాల్లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేసింది. మధ్యాహ్నం వేళల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు వేసవి తాపం నుండి రక్షణ పొందే మార్గాలు తీవ్రమైన వడగాల్పుల నుండి కాపాడుకోవడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ఈ సమయంలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృద్ధులు, పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ నుంచి రక్షణ కోసం దాహం వేయకపోయినా తరచుగా మంచినీరు తాగుతూ ఉండాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు, గొడుగు వాడాలి. కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్ ధరించడం వల్ల ఎండ వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. అధిక ప్రోటీన్, ఉప్పు, మసాలా, నూనె ఎక్కువ ఉండే ఆహారం తినకుండా ఉండాలి. సూర్యకాంతిలో బయటకు వెళ్తే షూస్ లేదా చెప్పులు తప్పక ధరించాలి. పగటిపూట (ముఖ్యంగా సూర్యకాంతి పడే వైపు) కిటికీలు, కర్టెన్స్ మూసి ఉంచండి. రాత్రి చల్లని గాలి రావడానికి తెరిచి ఉంచడం చేయాలి. బయటి పనులు ఉదయం, సాయంత్రం చల్లని సమయంలోనే చేయండి. ఇంట్లో తయారు చేసుకునే పానీయాలు సులువుగా ఇంట్లోనే లభించే నిమ్మరసం, మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్, ఉప్పు-చక్కర నీటి ద్వారా శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంచవచ్చని నిపుణులు చెపుతున్నారు. ప్రయాణం చేసేటప్పుడు నీళ్ల బాటిల్ తీసుకెళ్లండి. నీరు ఎక్కువగా ఉండే సీజనల్ పండ్లు, కూరగాయలు తినండి (వాటర్ మెలన్, మస్క్ మెలన్, ఆరెంజ్, ద్రాక్ష, అనాస, కాకరకాయ మొదలైనవి). ఎండ దెబ్బ లక్షణాలు ఎండ దెబ్బ గురయిన వ్యక్తి ఉండే లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు. ఎండ దెబ్బ తగిలిన వ్యక్తికి వికారం, వాంతులు, వేడి, ఎర్రటి, పొడి చర్మం, శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉండడం జరుగుతుంది. తలనొప్పి, ఆందోళన, మైకం, స్పృహ కోల్పోవడం, కండరాల బలహీనత, తిమ్మిర్లు, వేగవంతమైన హృదయ స్పందన, మానసిక గందరగోళం (గందరగోళం, కోపం, చిరాకు, సీజర్, కోమా) ఉంటాయని, వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య సహాయం తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు.

మన తెలంగాణ 10 Apr 2026 6:40 am

జీవన్‌రెడ్డికి సముచిత స్థానం

బిఆర్‌ఎస్‌లో చేరాలని ఆయనను ఆహ్వానించాం రెండు రోజుల్లో కెసిఆర్‌ను కలుస్తానన్నారు అధికార మత్తులో రేవంత్ ఇష్టారీతిలో మాట్లాడుతున్నారు: కెటిఆర్  మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: రాజకీయం గా 42 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న జీవన్‌రెడ్డికి బిఆర్‌ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పించడంతోపాటు ప్రజల్లో వారికి ఉన్న గుర్తింపుకు అనుగుణంగా గౌరవించుకుంటామని భారత రాష్ట్ర సమి తి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన జీవన్‌రెడ్డిని బిఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు కెటిఆర్ కరీంనగర్,నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బిఆర్‌ఎస్ నేతలతో కలిసి గురువారం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి జీవన్‌రెడ్డితో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అధికార మత్తులో తన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడన్నారు. తాము అధికారంలోకి వస్తే 420 హామీలు అమలు చేస్తామని చెప్పి గద్దె నెక్కిన రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని గొప్పలు చెప్పి ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టారని, రైతులకు ఇవ్వాల్సిన రూ. 27 వేల కోట్లు ఎగ్గొట్టి కాంగ్రెస్ రైతులకు తీరని ద్రోహం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీతో 42 ఏళ్ల అనుబంధం ఉన్న సీనియర్ నేత జీవన్‌రెడ్డిని అవమానానికి గురి చేయడం దురదృష్టకరమన్నారు. రానున్నది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఇటీవల బట్టి విక్రమార్క కొడుకు పెళ్లికి వెళ్లిన సందర్భంగా అక్కడ సుమారు 150 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు తనతో కరచాలనం చేసి అన్న వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని చెప్పడాన్ని బట్టి చూస్తే కార్యకర్తలో రేవంత్ సర్కార్‌పై ఎంత అయిష్టత ఉందో స్పష్టమవుతోందన్నారు. ఇక ప్రజల్లో రేవంత్ సర్కార్‌పై ఉన్న వ్యతిరేకత గురించి చెప్పాల్సిన అవసరమే లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ద్ధంగా ఉన్నారన్నారు. జీవన్‌రెడ్డికి, కెసిఆర్‌తో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని కెటిఆర్ చెప్పుకొచ్చారు. 2014కు ముందు జీవన్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి రావాలని కెసిఆర్ ఆహ్వానించారని, అయితే నిబద్ద్ధత గల నాయకుడిగా కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేక ఆ పార్టీలోనే కొనసాగారన్నారు. 2014లో కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జీవన్‌రెడ్డి కరీంనగర్‌లో జరిగిన ఓ సమావేశంలో బోర్నపెల్లి వంతెనకు నిధులు మంజూరు చేయాలని కెసిఆర్‌ను కోరగానే అక్కడికక్కడే వంతెన నిర్మాణానికి రూ. 75 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే అసెంబ్లీలో జరిగిన చర్చలో నిజాం షుగర్స్‌ను తెరిపించాలని జీవన్‌రెడ్డి కోరగా వెంటనే స్పందించిన కెసిఆర్ మహారాష్ట్రలో కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా నడిపిస్తున్నారని, ఇక్కడ కూడా అలాగే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆ సొసైటీకి మీరే అధ్యక్షుడిగా ఉండాలని జీవన్‌రెడ్డి పేరును కెసిఆర్ ప్రతిపాదించినట్లు ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు. పార్టీలోకి రావాలని జీవన్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానించామని, రెండు మూడు రోజుల్లో కెసిఆర్‌తో కలిసి అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత తన నిర్ణయం చెబుతానని జీవన్‌రెడ్డి చెప్పినట్లు కెటిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంఎల్‌సి ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, విద్యాసాగర్‌రావు, బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్‌గుప్తా, రసమయి బాలకిషన్, వొడితెల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్‌రెడ్డి, రవీందర్‌సింగ్, తుల ఉమ, నారదాసు లక్ష్మన్‌రావు, జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 10 Apr 2026 6:30 am

ఆలయాల్లో ప్రవేశంపై ఆంక్షలు హిందూ మతానికే నష్టం

 సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక శబరిమలలో మహిళలకు నిషేధంపై దాఖలైన కేసులో కీలక వ్యాఖ్యలు  న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరికీ అన్ని దేవాలయా లు, మఠాల్లో ప్రవేశం ఉండాలని, ఏదైనా వ ర్గాన్ని లేదా పంథాను వెలివేయడం హిందూమతంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు సమాజాన్ని విభజిస్తుందని గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మహిళలపై మతపరమైన స్థలాల్లో వివక్షకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇందులో సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించగా, న్యాయమూర్తులు బి.వి.నాగరత్న, ఎం.ఎం.సుందరేశ్, అహ్సానుద్దీన్ అమానుల్లా, అరవింద్ కుమార్, ఆగస్టిన్ జార్జ్ మసీహ్, ప్రసన్న బి.వరాలే, ఆర్.మహాదేవన్, జోయ్మాల్య బాగ్చి సభ్యులుగా ఉన్నారు. శబరిమల కేసు నేపథ్యం కేరళలోని శబరిమల ఆలయం సహా వివిధ మతస్థలాల్లో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు, మత స్వేచ్ఛ పరిమితులపై ఈ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, నాయర్ సర్వీస్ సొసైటీ, అయ్యప్ప సేవా సమాజం వంటి సంస్థల తరఫున వాదిస్తూ, ఒక నిర్దిష్ట పంథానికి చెందిన దేవాలయాలు తమ వర్గానికే పరిమితమయ్యే హక్కు ఉందని వాదించారు. అయితే న్యాయమూర్తి నాగరత్న స్పందిస్తూ, ప్రవేశ హక్కు విషయంలో ఒక వర్గాన్ని మాత్రమే అనుమతించడం హిందూమతానికి నష్టం కలిగిస్తుంది అని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ దేవాలయాలు, మఠాల్లో ప్రవేశం ఉండాలి. ఇతరులను నిరాకరించడం మతానికి మంచిది కాదు అని స్పష్టం చేశారు. న్యాయమూర్తి అరవింద్ కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇలాంటి విధానాలు సమాజాన్ని విభజిస్తాయని హెచ్చరించారు. “మన దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు కూడా ఉన్నాయి. దేవి భగవతి ఆలయంలో కొన్నేళ్లుగా ఇలాంటి ఆచారం కొనసాగుతోంది. ఇక కేరళలో ఓ ఆలయంలోకి అబ్బాయిలు మహిళల వేషధారణలో వెళ్తారు. అందుకోసం వారు బ్యూటీపార్లర్‌కు వెళ్లి మరీ అమ్మాయిల్లా తయారవుతాయి. కాబట్టి ఇది పురుషాధిక్య లేదా స్త్రీ ఆధిక్య మత విశ్వాసాలకు సంబంధించిన ప్రశ్న కాదు అని తుషార్ మెహతా పేర్కొన్నారు. న్యాయపరమైన అంశాలు దేవాలయాలు కేవలం తమ వర్గానికే సేవలు అందిస్తే, ప్రభుత్వం లేదా ప్రజల నుండి నిధులు స్వీకరించకూడదని వాదనలు వినిపించాయి. అలాగే ఏ చట్టమైనా ప్రజా శాంతి, నైతికత, ఆరోగ్య ప్రమాణాలను పాటించాల్సిందేనని న్యాయవాదులు పేర్కొన్నారు. గతంలో దేవరు కేసులో సుప్రీంకోర్టు మద్రాస్ ఆలయ ప్రవేశ చట్టాన్ని సమర్థిస్తూ, అన్ని హిందువులకు దేవాలయ ప్రవేశం అనుమతించాలనే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక ఆచారాలను మాత్రం నిర్దిష్ట వర్గాలకు పరిమితం చేయవచ్చని పేర్కొంది. విసృ్తత విచారణ కొనసాగుతోంది మత స్వేచ్ఛ పరిధిపై ఏడు కీలక ప్రశ్నలను ఈ రాజ్యాంగ బెంచ్ రూపొందించింది. 2018లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అనంతరం 2019లో ఈ అంశాన్ని మరింత విసృ్తతంగా పరిశీలించేందుకు ఉన్నత బెంచ్‌కు బదిలీ చేశారు. ఈ కేసు తీర్పు మత స్వేచ్ఛ, లింగ సమానత్వం, సామాజిక సమగ్రతపై దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశముందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

మన తెలంగాణ 10 Apr 2026 6:20 am

ఓటెత్తిన రాష్ట్రాలు

అసోంలో 85.04% పోలింగ్ 2021లో నమోదైన రికార్డుస్థాయి పోలింగ్ కన్నా ఎక్కువ కేరళంలో 77.38% నమోదు పుదుచ్ఛేరిలో రికార్డు స్థాయిలో 89.08% ఓటింగ్ న్యూఢిల్లీ: అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 296 నియోజక వర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కేరళ, పుదుచ్చేరిలో సాయంత్రం 6 గంటల వరకు నమోదైన ఓటింగ్ గణాంకాలు చూస్తే, పుదుచ్చేరిలో అత్యధికంగా 89.08శాతం పోలింగ్ నమోదు కాగా, అస్సాంలో 85.04శాతం, కేరళలో 77.38శాతం ఓటింగ్ నమోదైంది. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గం టల వరకూ రికార్డు స్థాయిలో 85.04 శాతం ఓటింగ్ నమోదైంది. 2021లో నమోదైన 82.04 శాతాన్ని మించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ దశాబ్దం తర్వాత తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. డాల్గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 94.57 శాతం ఓటింగ్ నమోదవగా, అమ్రి నియోజకవర్గంలో కనిష్ఠంగా 70.40 శాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 35 జిల్లాల్లోని 31,490 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 722 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గడువు సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఓటర్లకు టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. 6 గంటల వరకూ 77.38 శాతం పోలింగ్ నమోదై, 2021లో నమోదైన 74.06 శాతాన్ని మించింది. పుదుచ్చెరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ కూడా సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 89 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఎన్‌డీఏ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి స్థానిక స్వయం పాలన, పరిపాలనా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని పోటీ చేస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో నమోదైన అధిక ఓటింగ్ శాతం ప్రజల్లో ఎన్నికలపై ఉన్న ఆసక్తిని, రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మన తెలంగాణ 10 Apr 2026 6:10 am

ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లోనూ ఎఫ్‌ఆర్‌ఎస్

విద్యార్థుల హాజరు ప్రక్రియలో మార్పు ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే ప్రభుత్వ కాలేజీల్లో అమలు ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ‘దోస్త్’ నోటిఫికేషన్  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లోనూ విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు(ఎఫ్‌ఆర్‌ఎస్) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలవుతుండగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రైవేట్‌లోనూ అమలు చేయనున్నారు. సంబంధిత విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని కళాశాలలకు సర్యులర్ జారీ చేసి ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయాలని నిర్ణయించారు. అనేక డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోయినా వారి నుంచి భారీమొత్తంలో అదనపు ఫీజులు వసూలు చేస్తూ పరీక్షలకు అనుమతిస్తున్నట్లు విద్యాశాఖ దృష్టి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డిగ్రీ కాలేజీల్లో తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారా..లేదా..? అనేది అధికారులు పర్యవేక్షించనున్నారు. సచివాలయంలో గురువారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్(పిఎంయు) సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, వివిధ వర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు, ఉన్నతాధికారులు పాల్గొని డిగ్రీ కోర్సులలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. ఈ నెల 13వ తేదీన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్ల సమావేశం నిర్వహించి కొత్త కోర్సులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసే ఆవకాశం ఉంది. 

మన తెలంగాణ 10 Apr 2026 6:10 am

పొంగు‘లూటీ’

అవినీతి బయటపడడంతో ఆత్మరక్షణలో పడ్డ మంత్రి పొంగులేటి బూతులు, తిట్లు, పిట్టకథలు చెబుతున్నారని ఆగ్రహం సిఎం సహా మంత్రులందరూ అవినీతిపరులే అని పొంగులేటి ఒప్పుకున్నారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి వనపర్తి జిల్లాలో విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: పొంగులేటి కాదు.. పొంగు లూటీ పొగరులేటి.. బాంబులూటీ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మాజీ మంత్రి ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్ గ్రామంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. అత్యంత పవిత్రమైన సచివాలయంలో పొగురులేటి మాటలు విన్నాం.. అంబేద్కర్, బిర్లా మందిరం, అమ్మవారు, మసీదు, చ ర్చి పక్కనే ఉన్నా నిజాలు దాచి అబద్ధాలు మా త్రమే మాట్లాడారని అన్నారు. ఆయన బూతు లు చూస్తే ఆయన ఫ్రస్ట్రేషన్ తెలుస్తుందని అన్నారు. సరుకు లేనప్పుడు, సమాధానం లేనప్పు డు తిట్లు ఎత్తుకుంటారని, డిఫెన్స్‌లో పడ్డాడు పొగరులేటి అని, ఒక రాష్ట్ర మంత్రిగా కాకుం డా... రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడా రు. కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేసి పిట్ట కబుర్లు చెప్పి బయటపడాలని అనుకున్నాడని తెలిపారు. నేనొక్కన్నె అవినీతి పరుడున్ని కాదు.. అందరూ మంత్రులు అవినీతి పరులే అని తేల్చారు. జూపల్లి కృష్ణారావు, సీఎం, భట్టి సహా రాష్ట్రంలో అవినీతి కుంభకోణాల చిట్టా ఆయనే చదివారు. ఆయనతో పాటు అందరిని కలుపుకున్నాడని, పొంగులేటి కాదు.. పొంగులూటీ అని ఆయనే చెప్పకనే చెప్పిండు అని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు.. రాఘవ కన్స్ట్రక్షన్‌లో జరిగిన అవినీతి మా అధికారులే గుర్తు పట్టారు.. ఫైన్ కూడా కట్టారని సీఎం చెప్పారని తెలిపారు. అనుమతులు ఆలస్యం అవుతాయని మైనింగ్ మంత్రి చెప్పారని తెలిపారు. రెవెన్యూ ఎలక్ట్రిసిటీ పిసిబి మైనింగ్ నాలుగు శాఖల అధికారులు మైనింగ్ ఇన్స్పెక్షన్ చేసి ఇల్లీగల్ మైనింగ్ అని నిర్ధారించారు. పొంగులేటి చెప్పింది తప్పా...అధికారులు చెప్పింది తప్పా.. ముఖ్యమంత్రి చెప్పింది తప్పా? మైనింగ్ మంత్రి చెప్పింది తప్పా? నువ్వేమో సంబంధం లేదని చెప్తున్నావ్.. పొగరులేటి నీవి ఇంకా చాలా ఉన్నాయి.. అన్ని బయటపెడతామని తెలిపారు. పొగరు తగ్గించుకో పొంగులేటి రాఘవ కు మైనింగ్ లేదని ఎందుకు చెప్పలేదని, అసెంబ్లీ లో ఉండి కూడా నాది కాదని చెప్పలేదని ఆరోపించారు. సీఎం మైనింగ్ మంత్రి తప్పు అని చెప్పని, కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ పేరు ఎందుకు ఉంది.. కాంగ్రెస్ జెండా ఎందుకు ఉంది? పిసిబి, మైనింగ్ అధికారులు నోటీస్ ఇస్తే మీ ఉద్యోగి రిసీవ్ చేసుకున్న కాపీ నేను అసెంబ్లీలో చూపెట్టానని తెలిపారు. బాంబులేటి బుకాయిస్తున్నావ్..వాస్తవాలు అసెంబ్లీ లో ఎందుకు చెప్పలేదని తెలిపారు. నాదార్ గుల్ భూములు కాపాడింది బీ ఆర్‌ఎస్ పార్టీ.. నిషేధిత భూముల జాబితాలో పెట్టింది బిఆర్‌ఎస్ ప్రభుత్వమని తెలిపారు. హై కోర్ట్ లో కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొట్లాడిందని, సీలింగ్ భూములు అమ్మినవారి మీద.. కొన్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ తెచ్చింది బీఆర్‌ఎస్ అని తెలిపారు. ఎందుకు దాచి పెడుతున్నావని, డివిజన్ బెంచ్‌లో కేసు గెలిచింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా, మీరు చెప్పినట్లు నేడు అవి ప్రభుత్వ భూములు అయితే రోజుకొక పేరు ఎందుకు మారుతుందని తెలిపారు. రెండున్నర ఏండ్లుగా భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఎందుకు కంపెనీల బోర్డులు మారుతున్నాయి? శిల్పతో రాఘవ కంపెనీకి సంబంధాలు ఉన్నాయా లేవా? ఏ క్యూ స్క్వేయిర్ తో సంబంధాలు ఉన్నాయి నిజామా కాదా? మీరు అన్నట్లు ప్రభుత్వ భూములు అయితే హైడ్రా గడ్డి పీకుతుందా అని తెలిపారు. ఆర్డీవో ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ల్యాండ్ అని ఆర్డర్ ఉండగా హైడ్రా ఎందుకు కండ్లు మూసుకుందని తెలిపారు. నిజాయతీ ఉంటే, చిత్తశుద్ధి అక్రమణదారులపై చర్యలు తీసుకోండని తెలిపారు. పొంగులూటి పొగరులేటి నీ బాంబులు అన్ని తుస్సుమన్నాయని తెలిపారు. నీ విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా ఏం కాలేదని తెలిపారు. హైడ్రాను పంపి చిత్తశుద్ధి నిరూపించుకో తప్పు అయితే నాలుగు శాఖల మీద చర్యలు అయినా తీసుకో అని తెలిపారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ లో అబద్దం ఆడారు అని చెప్పించు, పొగరు లేటి నువ్వు బాంబు లూటీ ఇప్పటికైనా తప్పు ఒప్పుకో ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.

మన తెలంగాణ 10 Apr 2026 6:10 am

10thApril2026 |శుక్రవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

10thApril2026 | శుక్రవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 10thApril2026 |

ప్రభ న్యూస్ 10 Apr 2026 6:00 am

పాతబస్తీకి ‘సర్’ ఫీవర్

 హైదరాబాద్ పాతబస్తీలో తూతూమంత్రంగా ‘సర్’ ప్రక్రియ వెరిఫికేషన్‌లో బిఎల్‌ఓలకు బదులు వారి అసిస్టెంట్లు అక్షర జ్ఞానం లేని అసిస్టెంట్లతో అవస్థలు ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు ..బడా నేతల ఒత్తిళ్లు ఓటు హక్కు లేనివారి పేర్లూ జాబితాలో చేరుతున్న వైనం మన తెలంగాణ/సిటీ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ‘సర్’ సమర్థవంతంగా జరగడంలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్‌ఓ) నుండి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ తీసుకుని ఇష్టారాజ్యంగా రివిజన్ నమో దు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాతనగరంలో రాజకీయ ఒత్తిడితో సర్ ప్రక్రియ తూతూ మంత్రంగా సాగుతోందనేది ప్రధాన ఆరోపణ. చాంద్రాయణగుట్ట, చా ర్మినార్, బహదూర్‌పుర, యాకుత్‌పురా తదిత ర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ‘సర్’ ఇష్టారాజ్యంగా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో ఓటరు సవరణలో అక్రమాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని, అధికంగా ఓటు హక్కులేని వార్ల పేర్లు కూడా చేరే ప్రమాదం లేకపోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో సమర్థవంతంగా, పొరపాట్లు, తప్పులు లే కుండా ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టాల్సిన జీహెచ్‌ఎంసి అధికార యంత్రాంగం ఇప్పుడు అక్రమాలకు మరోమారు తావిచ్చిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఓటరు సవరణకే పరిమితం కా కుండా మరింత లోతుగా ఓటరు డాక్యుమెంట్స్‌ను తనిఖీ చేసే ప్రక్రియ ను చేపట్టాల్సిన బి ఎల్‌ఓలు కేవలం తమ అసిస్టెంట్లను ఏ ర్పాటు చేసుకుని ‘సర్’ ప్రక్రియను పూర్తిచేస్తున్నట్టు ప్రచారంలోకి వచ్చింది. స్వీపర్లుగా కూడా బిఎల్‌ఓలుగా పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్వీపర్లు, నిరక్షరాస్యులు కూడా బిఎల్‌ఓలుగా ఉండటంతో వారి నుండి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ తీసుకుని పలువురు ఇష్టారాజ్యంగా ‘సర్’లో వివరాలను నమోదు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. పలువురు ఓల్డ్ సిటీలో డ్యూటీలు చేసే బిఎల్‌ఓలు నేరుగా విధులను నిర్వహించకుం డా.. తమతమ అసిస్టెంట్లను వెరిఫికేషన్‌కు పంపించడంతో అసిస్టెంట్లు సర్ ప్రక్రియను పూర్తిచేయడంపైనే ఫోకస్ పెడుతున్నారే తప్ప కచ్ఛితంగా అవసరమయ్యే డాక్యుమెంట్లను మరింత లోతుగా తనిఖీలు చేయడంలేదనేది ప్రధాన ఆరోపణ. సర్ ద్వారా బోగస్ ఓట్లు, చ నిపోయిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉంటే వాటిని తొలగించాల్సి ఉంది. కానీ, ఈ ప్రక్రియను చేసేందుకు నిరక్షరాస్యులు వెల్లుతున్నందున సమర్థవంతంగా జరుగడంలేదనేది ప్రధాన ఆరోపణ. ప్రతి ఇంటికి.. బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్‌ఓ)లకు 2002 సంవత్సరంనాటి ఓటరు జాబితాను అందించడంతో పాటు బిఎల్‌ఓ యాప్‌ను వారి ఫోన్‌ల డౌన్‌లోడ్ చేసి ప్రక్రియను చేపడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళుతూ ఓటరు జాబితాలోని పేర్లను, వారి కుటుంబ సభ్యుల వివరాలతో పోల్చిచూస్తున్నారు. ఓటరుగా ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ను, వారి కుటుంబ సభ్యుల వివరాలను సరిపోల్చడం జరుగుతుంది. 18 సం.లు నిండినట్టు అధికారిక డాక్యుమెంట్లు ఉంటే కొత్తగా ఓటరు జాబితాలో నమోదు చేయడం జరుగుతుంది. వాస్తవానికి ఓల్డ్ సిటీలో చాలా వరకు డబుల్‌గా ఓటరు జాబితాలో ఉన్నట్టు బిఎల్‌ఓలు గుర్తిస్తున్నట్టు సమాచారం. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును కూడా ఈ ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల డూప్లికేట్ ఓట్లను సులభంగా గుర్తించి తొలగించేస్తున్నారు. చనిపోయిన వారు, ఇల్లు మారి వేరే చోటుకి వెళ్ళిపోయిన వారు, అనర్హులైన ఓటర్లను, ఒకటి కంటే రెండు చోట్ల ఓటర్లు ఉన్నవారిని ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇలా తొలగించే ముందు కుటుంబ సభ్యులకు పూర్తిగా వివరిస్తున్నారు.

మన తెలంగాణ 10 Apr 2026 5:50 am

కెఎంసీలో ర్యాగింగ్

 సెకండియర్ విద్యార్థులను మోకాళ్లపై కూర్చోబెట్టి హింసించినట్లు ఆరోపణ హాస్టల్ నుంచి సీనియర్ల బహిష్కరణ కాలేజీ నుంచి మూడు నెలల సస్పెన్షన్‌కు అధికారుల సమాయత్తం మన తెలంగాణ/వరంగల్ కార్పొరేషన్: అధికారులు ఎన్ని కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ రాగింగ్ భూతం విద్యార్థులను వదిలిపెట్టడంలేదు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను మోకాళ్లపై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురిచేశారని జూనియర్ విద్యార్థులు కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీనియర్ విద్యార్థులపై చర్యలకు సిద్ద్ధమవుతున్నారు. రాగింగ్ అనగానే కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులు, సీనియర్స్ మధ్య ఉంటుందని అందరూ భావిస్తారు. ఇక్కడ మాత్రం ఎంబీబీఎస్ రెండు, మూడవ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థుల మధ్య రాగింగ్ జరిగింది. రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థుల వాట్సప్ గ్రూపులో మూడవ సంవత్సరం విద్యార్థుల గురించి తప్పుగా మాట్లాడుతున్నారన్న సమాచారం అందుకున్నారు. తమ గురించి జూనియర్స్ తప్పుగా మాట్లాడడం సరియైనది కాదు. వారికి బుద్ది చెప్పి తీరాల్సిందేనని సీనియర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో హాస్టల్ టెర్రస్ పైకి 20 మంది జూనియర్ మెడికోలను పిలిచి మోకాళ్లపై కూర్చోబెట్టి తప్పయిందని.. మరోసారి ఇలా చేయమని సారీ చెప్పించుకున్నారు. ఇతరత్రా ఇబ్బంది పెట్టారని సమాచారం. ఇది నచ్చని కొంత మంది జూనియర్ విద్యార్థులు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి దేశంలో సంబంధిత శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌కు బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో కళాశాల అధికారులు రంగంలోకి దిగారు.

మన తెలంగాణ 10 Apr 2026 5:40 am

శుక్రవారం రాశి ఫలాలు (10-04-2026)

మేషం దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన సంభందిత వ్యాపారాలు లాభాలు బాట పడతాయి. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృషభం బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిధునం ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి. వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. బంధు మిత్రుల ఆదరణ పొందుతారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కర్కాటకం నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వృత్తి వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సింహం వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కన్య విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నవి. తుల వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృశ్చికం దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారం సేకరిస్తారు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగమున విధులు సమర్ధవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ధనస్సు దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకరం ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. నూతన వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలుంటాయి. ఉద్యోగ విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుంభం సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు. గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీనం కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు అందుతాయి. మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి.  

మన తెలంగాణ 10 Apr 2026 12:20 am

అందమైన ఊరి వాతావారణం చూపించే చిత్రం

కొత్త టాలెంట్ ను ప్రోత్సాహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ‘. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా పరిచయమవుతున్నారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ‘ చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హైదరాబాద్‌లో ‘తిమ్మరాజుపల్లి టీవీ‘ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ.. ‘అంతరించిపోయిన వస్తువులను మ్యూజియంలో పెడుతుంటారు. అలాంటి మ్యూజియం మీరు తెరపై చూడాలంటే మా సినిమాను ఈనెల 17న చూడండి. ఎందుకంటే మా సినిమా ఒక మ్యూజియంలా ఉంటుంది. అందులో అంతరించిపోతున్న మన కల్చర్, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే ఎమోషన్స్ ను చూస్తారు. ఇది తిమ్మరాజుపల్లి స్టోరీ మాత్రమే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల వారి స్టోరీ. మొత్తం ఏపీ, తెలంగాణలో 40 ఫ్లస్ ఏజ్ ఉన్నవాళ్లు దాదాపు 5 కోట్ల మంది ఉంటారు. వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫామిలీస్ కి అందరికీ ఈ సినిమా నచ్చతుంది” అని తెలియజేశారు. హీరో సాయి తేజ్ మాట్లాడుతూ.. “మన లైఫ్ లో మొదటిసారి ఎక్సిపీరియన్స్ చేసేవన్నీ ఒక మంచి ఫీల్ ను ఇస్తాయి. మొదటిసారి తిన్న అమ్మచేతి ముద్ద ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలా మన లైఫ్ లో చూసే స్వీట్ మెమొరీస్ ఈ చిత్రంలో ఉంటాయి‘ అని అన్నారు. నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “మా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్‌కు థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే ఇంటిల్లిపాదీ థియేటర్స్ కు వెళ్లేవాళ్లం. మా చిన్నతనంలో టీవీలో కొత్త సినిమా వచ్చినా, వీసీడీల్లో కొత్త మూవీ చూసినా ఎంతో హ్యాపీగా ఉండేది. అలాంటి హ్యాపీనెస్ ఇప్పటితరం వారికి చూపించాలనే అప్పటి హీరో, హీరోయిన్స్ గెటప్స్ లో ఈ రోజు మీ ముందుకు వచ్చాం. చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు నాకు బాగా ఇష్టం. అందుకే ఈ రోజు చెన్నకేశవరెడ్డి గెటప్ లో వచ్చాను. బాలకృష్ణ కి థ్యాంక్స్. అలాగే వింటేజ్ హీరోలందరికీ థ్యాంక్స్. మా చిత్రంలో పనిచేసిన వాళ్లందరి కల సినిమా. ఆ కల తీరేందుకు ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ పట్టింది. వాళ్లు మా మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డారు.టెక్నికల్ బ్రిలియన్స్, ఆర్టిస్టుల బ్రహ్మాండమైన పర్ ఫార్మెన్స్‌లు, ఊరిలోని ఆహ్లాదకరమైన వాతావారణం.. ఈ మూడు చూసేందుకు మా మూవీకి వెళ్లండి. ఈ వేసవికి సమ్మర్ వెకేషన్ ఊరికి వెళ్లినట్లే. ఈ సారి మా తిమ్మరాజుపల్లికి రండి. మీ ఊరు గుర్తుస్తుంది, అప్పటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఇది నేను గ్యారెంటీ ఇస్తున్నా ‘ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో హీరోయిన్ వేద జలంధర్,తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

మన తెలంగాణ 9 Apr 2026 11:14 pm

ఇజ్రాయెల్ దాడులు.. అల్ జజీరా విలేకరి, ఇద్దరు జర్నలిస్టుల మృతి

బీరట్ : ఇజ్రాయెల్ దాడుల్లో గాజాకు చెందిన అల్ జజీరా కరస్పాండెంట్ , ఇద్దరు లెబనీస్ జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని జర్నలిస్టుల కమిటీ వెల్లడించింది. వెస్ట్‌గాజా సిటీలో మొహమ్మద్ విషాహ్‌ను ఇజ్రాయెల్ డ్రోన్ దాడి టార్గెట్ చేసుకుంది. విషాహ్ హమాస్ సభ్యుడని, హమాస్ మిలిటరీ విభాగంలో కమాండర్‌గా ఉన్నాడని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు. 

మన తెలంగాణ 9 Apr 2026 10:49 pm

Adivi Sesh’s Dacoit USA Premieres Today

Hero Adivi Sesh is riding high on momentum, delivering five consecutive blockbusters and now inching toward a rare double hat-trick. His much-awaited love-and-action drama Dacoit is set for a worldwide theatrical release tomorrow, with premieres kicking off today across the USA. Overseas distributor Moksha Movies is releasing the film on a grand scale in a […] The post Adivi Sesh’s Dacoit USA Premieres Today appeared first on Telugu360 .

తెలుగు 360 9 Apr 2026 10:29 pm

ఎపి హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట..

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ నటుడు ఎం. మోహన్ బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తిరుపతి పోలీసులను ఎపి హైకోర్టు ఆదేశించింది. విద్యార్థి నాయకుడి కిడ్నాప్‌నకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై నమోదైన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎపి హైకోర్టులో మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ నిర్వహించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఈ మేరకు పోలీసులను ఆదేశించింది. కేసు సిడిని తమ ముందు ఉంచాలని పోలీసులకు కోర్టు స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి సమీపంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూళ్లు చేస్తుం దంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సదరు యూనివర్సిటీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాలు నేతలు ఆందోళనకు పిలుపు నిచ్చారు. దీంతో విద్యార్థి సంఘం నేతలు వినోద్, అక్బర్లను మోహన్‌బాబు యూనివర్సిటీకి చెందిన బోన్సర్లు బలవంతంగా ఎత్తుకెళ్లా రు. ఈ నేపథ్యంలో మరో విద్యార్థి సంఘం నేత తిరుపతి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థి సంఘం నేతల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనంతరం విద్యార్థి సంఘం నేతలను పోలీసులు రక్షించారు. బౌన్సర్ల తోపాటు వారి వాహనాలను తిరుపతి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద పోలీ సులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి తొలి వారంలో చోటు చేసుకుంది.

మన తెలంగాణ 9 Apr 2026 10:21 pm

ఐపిఎల్ 2026: లక్నోకు టార్గెట్ ఎంతంటే?

ఐపిఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ గెయింట్స్ జట్టుకు కోల్ కతా నైట్ రైడర్స్182 పరుగుల టార్గెట్ విధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానె(41), రఘువంశీ(45), కమెరూన్ గ్రీన్(32 నాటౌట్), పొవెల్(39 నాటౌట్)లు రాణించారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్, దిగ్నష్ సింగ్ లు తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 9 Apr 2026 9:47 pm

AP High Court Grants Interim Relief to Mohan Babu in Student Kidnap Case

The Andhra Pradesh High Court has directed Tirupati police not to take any hasty action against veteran actor Mohan Babu in connection with a student leader kidnapping case. The court asked the police to place the case diary before it and said further action should wait until the next hearing. Mohan Babu approached the High […] The post AP High Court Grants Interim Relief to Mohan Babu in Student Kidnap Case appeared first on Telugu360 .

తెలుగు 360 9 Apr 2026 9:36 pm

Botsa Cried, But Old Videos Still Tell a Different Story

Senior TDP leader Atchannaidu recalled past remarks allegedly made by Botsa Satyanarayana regarding the death of Y S Rajasekhara Reddy. The comments quickly triggered a reaction, with Botsa holding a sudden press meet in Visakhapatnam that turned emotional. During the media interaction, Botsa appeared visibly emotional about the statements made by Atchannaidu. But, he did […] The post Botsa Cried, But Old Videos Still Tell a Different Story appeared first on Telugu360 .

తెలుగు 360 9 Apr 2026 9:20 pm

Iran Us Peace Talks : ఆ రెండే పీటముళ్లు Andhra Prabha Top Story

Iran Us Peace Talks : ఆ రెండే పీటముళ్లు Andhra Prabha

ప్రభ న్యూస్ 9 Apr 2026 9:20 pm

లక్ష్మీనారాయణకి కార్పొరేటర్ ఆగం రాజ్ ఘన నివాళి

విశాలాంధ్ర-దుండిగల్ : గురువారం లక్ష్మీనారాయణ ఆకస్మిక మరణం పట్ల బాచుపల్లి 17వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆగం రాజు ముదిరాజ్ కాలనీ ప్రజలతో కలిసి ఘన నివాళులర్పించారు. The post లక్ష్మీనారాయణకి కార్పొరేటర్ ఆగం రాజ్ ఘన నివాళి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 9 Apr 2026 8:53 pm

హరీష్ రావు జీవితమే బ్లాక్ మెయిల్: అద్దంకి

హరీష్ రావు బ్లాక్ మెయిల్ రావు ఎన్నిసార్లు చెప్పినా ఆయన బ్లాక్ మెయిల్ ఆగడం లేదు పొంగులేటి కుటుంబంపైన ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు పభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిల ఆగ్రహం మనతెలంగాణ/హైదరాబాద్: హరీష్ రావు బ్లాక్ మెయిల్ రావు అని, ఎన్నిసార్లు చెప్పినా ఆయన బ్లాక్ మెయిల్ ఆగడం లేదని, పొంగులేటి కుటుంబంపైన ఆధారం లేకుండా మాట్లాడుతున్నారని, పొంగులేటి కానీ, ఆయన కుటుంబానికి సంబంధం లేని కంపెనీలను హరీష్‌రావు అంటగడుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మిర్యాలగూడ, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శిల్పా ఇన్పోటెక్ కంపెనీలో పొంగులేటి లేదా ఆయన కొడుకు డైరెక్టర్లుగా లేరని, ఏక్యూ అండ్ ఏఎం బిల్డర్స్ , క్రిస్టల్ మ్యాన్‌క్షన్‌తో కూడా పొంగులేటికి సంబంధం లేదని వారు తెలిపారు. హరీష్ రావు జీవితమే బ్లాక్ మెయిల్ అని, ఆంధ్రా, తెలంగాణ పారిశ్రామికవేత్తలను ఉద్యమ సమయంలో బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర హరీష్ రావుదని వారు ఆరోపించారు. సొంత మామను బ్లాక్ మెయిల్ చేసి ఇరిగేషన్ మంత్రి అయ్యారని, తమ సీక్రెట్ ఫైల్స్ నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, కవిత కూడా నెమ్మదిగా రూపాంతరం చెందుతోందని, తండ్రిని మళ్లీ మంచి చేసుకోవడానికి కవిత ప్రయత్నాలు చేస్తోందని వారన్నారు. అనేక కంపెనీలను కెటిఆర్, హరీష్‌రావులు బ్లాక్ మెయిల్ చేశారని వారు ఆరోపించారు. మామ ఫాంహౌస్ నుంచి రాడనీ, బామ్మర్థి ఊర్లో లేడని, కవిత పార్టీలో లేదని, అందుకే హరీష్ రావు రెచ్చిపోతున్నారని వారు పేర్కొన్నారు. 2029 వరకు బిఆర్‌ఎస్‌లోనే ఉంటానని చెప్పే దమ్ము హరీష్ రావుకు ఉందా..? అని వారు ప్రశ్నించారు. 2014 నుంచి 2026 వరకు భూముల కేటాయింపులు, బదలాయింపులపైన విచారణకు ప్రభుత్వం సిద్ధమని వారు పేర్కొన్నారు.

మన తెలంగాణ 9 Apr 2026 8:52 pm

పొంగులేటిపై ఆధారాలు చూపండి.. బిఆర్ఎస్ పై పిసిసి చీఫ్ ఫైర్

హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదని.. ఆధారాలు ఉంటే గాంధీ భవన్‌కు వచ్చి ఇవ్వాలని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆధారాలు ఉంటే అప్పుడు కాంగ్రెస్ ఆలోచిస్తుందన్నారు. గురువారం గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆధారాలు తీసుకొని వస్తే తాను చర్చకు సిద్ధం అన్నారు. పస లేని ఆరోపణలు చేయొద్దని నాదర్‌గుల్ భూముల కుంభకోణం బిఆర్‌ఎస్ హయంలోనే జరిగిందని ఆయన ఆరోపించారు. తమపై బట్ట కాల్చి వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. బిఆర్‌ఎస్ దోపిడీ గురించి ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రులపై ఆరోపణలు సరికాదని హరీశ్ రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలన్నారు. తాము కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటివరకు ఎక్కడ గీత కూడా పడలేదని, అదే బిఆర్‌ఎస్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలిపోయిందని మహేష్ కుమార్ విమర్శించారు.

మన తెలంగాణ 9 Apr 2026 8:44 pm

Shocker: Vijay’s Jana Nayagan Leaked Online

The makers of Vijay’s film Jana Nayagan are struggling to clear all the hurdles and release the film. With the Tamil Nadu Assembly elections nearing in this month, the election fever has gripped the state and Jana Nayagan will release only after the elections. Some of the scenes along with a song from Jana Nayagan […] The post Shocker: Vijay’s Jana Nayagan Leaked Online appeared first on Telugu360 .

తెలుగు 360 9 Apr 2026 8:30 pm