రాజేంద్రనగర్ లో డ్రగ్స్ ఓవర్డోస్ తో యువకుడు మృతి... యువతి పరిస్థితి విషమం?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్లోని ఓ అపార్ట్మెంట్లో యువతి, యువకుడు డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. డ్రగ్స్ ఓవర్డోస్ తీసుకోవడంతో యువకుడు మృతి చెందగా యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. శివరాంపల్లిలోని కెన్ వరత్ అపార్ట్ మెంట్ లో పాత బస్తీ కాళాపత్తర్ కు చెందిన అహ్మద్, కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి సహజీవనం చేస్తున్నారు. రాత్రి డ్రగ్స్ కొనుగోలు చేసి ఇద్దరు రూమ్ లో సేవించారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో అహ్మద్ మృతి చెందగా యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. డ్రగ్స్ హైదరాబాద్ లోని నిలోఫర్ కేఫ్ వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. డ్రగ్స్ టెస్ట్ లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు అనే సమాచారాన్ని రాజేంద్రనగర్ పోలీసులు సేకరిస్తున్నారు. గురువారం ఉదయం రాజేంద్రనగర్ లో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తుండగా భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ధాన్యం కొనుగోలు.. బిక్కనూర్, (ఆంధ్రప్రభ) రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు
భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. గోల్డ్ కోస్ట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
తిరుమలలో భక్తుల రద్దీ ఎంత ఉందంటే?
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి వున్నారు. మంగళవారం శ్రీవారిని 63,239 మంది భక్తులు దర్శించుకోగా 23,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లుగా ఉందని టిటిడి అదికారులు వెల్లడించారు.
Andhra Pradesh : ఏపీలో మంటల్లో బస్సు
ఆంధ్రప్రదేశ్ లో మరో బస్సు ప్రమాదానికి గురయింది. ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్దమయింది.
Telangana : నేటి నుంచి స్పీకర్ విచారణ
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేటి నుంచి విచారణ ప్రారంభించనున్నారు
డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టివేత..
డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టివేత.. రాజేంద్రనగర్ లో డ్రగ్స్ తో పాటు
Amaravathi : కొత్త ఏడాది తొలిరోజు అమరావతి గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్యాంటమ్ వ్యాలీకి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Rain Alert : మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ.. వానలు ఇక్కడే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ కన్నుమూత
గన్నవరం – ఆంధ్రప్రభ : విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య
Nara Lokesh : నేడు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో లోకేశ్
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం లభించింది
దుబాయ్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన ముగిసింది.
విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు..#TeluguPost #telugu #post #news
బస్సు ప్రమాదంలో ట్విస్ట్ :టిప్పర్ యజమాని వ్యాఖ్యలు#TeluguPost #telugu #post #news
ఏపీలో తగ్గనున్న కరెంట్ బిల్లులు..
ఏపీలో తగ్గనున్న కరెంట్ బిల్లులు.. ఏపీలోని అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చౌడువాడ,
Gold Rates Today : అందుబాటులోకి వచ్చేవరకు ఆగుతారా? ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేస్తారా?
దేశంలో బంగారం, వెండి దరలు నేడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి
అందరినీ అలరించే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే తమిళ్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. నవంబర్ 7న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ “ఇలాంటి సినిమా చేయడం చాలా ఛాలెంజింగ్. తప్పకుండా ఆడియన్స్కి సీట్ ఎడ్జ్ అనుభూతినిస్తుంది ఈ సినిమా”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, మానస, డైరెక్టర్ ప్రవీణ్ హరీష్ పాల్గొన్నారు.
Exclusive: Allu Arjun lining up the Biggest Films
Icon Star Allu Arjun has reached new heights after the release of Pushpa franchise. The actor’s potential outside the Telugu states got unleashed and the actor is working on bigger films. He is shooting for Atlee’s film and it releases in 2027. The actor while shooting for the film in Mumbai is working on new […] The post Exclusive: Allu Arjun lining up the Biggest Films appeared first on Telugu360 .
బిగ్ బ్రేకింగ్ –ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం..
బిగ్ బ్రేకింగ్ – ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం.. పార్వతీపురం మన్యం జిల్లాలో
TDP : నేడు చంద్రబాబుకు తిరువూరు పై నివేదిక
తిరువూరు వివాదంపై నేడు క్రమశిక్షణ కమిటీ చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనుంది
ఇన్ ఫ్లో 5000 అవుట్ ఫ్లో 3900 క్యూసెక్కులుసూర్యాపేట ఆంధ్రప్రభ : మూసీ
Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.
విశాఖలో స్పా ముసుగులో వ్యభిచారం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నంలో స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతోంది. విఐపి రోడ్డులోని ఆర్చిడ్ స్పా సెంటర్పై టాస్క్ ఫోర్స్ రైడ్ చేసింది. త్రి టౌన్ పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తొమ్మిది మంది అమ్మాయిలను స్పాలో టాస్క్ ఫోర్స్ గుర్తించింది. సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకోవడంతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిర్వహకులు స్పా ముసుగులో వ్యభిచారం చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
Singer Chinmayi turns against Social Media Abuse
Singer Chinmayi Sripaada is active on X and she expresses her views. She was trolled, targeted and appreciated for her stand. The singer was targeted on X and she was quick to take the issue to the notice of Hyderabad Commissioner VC Sajjanar. The top cop was quick to respond. It all started after Chinmayi’s […] The post Singer Chinmayi turns against Social Media Abuse appeared first on Telugu360 .
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రీవిష్ణు కొత్తం చిత్రం
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్... శ్రీవిష్ణు కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.39 ని అధికారికంగా ప్రకటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ సంజయ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ’అనగనగా’తో ఓటీటీలో అరంగేట్రం చేసి ప్రేక్షకుల మెప్పు పొందిన దర్శకుడు సన్నీ సంజయ్, మరో గొప్ప కథతో రాబోతున్నారు. సున్నితమైన భావోద్వేగాలతో నిండిన, రోజువారీ జీవితాన్ని నిర్వచించే నిశ్శబ్ద సంఘర్షణలు, ఆశలు మరియు సంతృప్తిలను అన్వేషించే కథతో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకోబోతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుంది.
ఎపిలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్లతో భారీ అక్రమాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండోరోజు ఎసిబి సోదాలు చేపట్టింది. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎసిబి అధికారుల తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్లో ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉన్నట్టు గుర్తించారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాత్రి పది గంటల వరకు ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ద్వారా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఎసిబి అడిషినల్ ఎస్ పి వెల్లడించారు. నిషేధిత భూములు రిజిస్ట్రేషన్లు మూడు నాలుగు చోట్ల జరిగిందిన్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతోందని, తిరుపతి శ్రీనివాసపురం నిషేధిత భూములు సర్వే 242 లో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్ లు జరిగినట్లు గుర్తించామని వివరించారు. లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నామని ఎసిబి వివరించింది.
Andhra Pradesh : నేడు రామచంద్రాపురం నియోజకవర్గం బంద్
రామచంద్రాపురం నియోజకవర్గం నేడు బంద్ కు జేఏసీ పిలుపు నిచ్చింది
YSRCP : నేడు వైసీపీ కీలక సమావేశం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో సమావేశం కానున్నారు.
Bigg Boss Telugu 9: Are the “Fire Storms” Losing Their Spark?
In the current week, Sai finds himself in the danger zone and the once-hyped wild card entries, popularly branded as “Fire Storms,” appear to be losing momentum. When six wild card contestants entered the house mid-season, expectations were sky-high. But weeks later, only a couple remain with any strong impact, prompting viewers to wonder whether […] The post Bigg Boss Telugu 9: Are the “Fire Storms” Losing Their Spark? appeared first on Telugu360 .
Andhra Pradesh : నేడు జోగి రమేష్ బెయిల్ పిటీషన్ పై విచారణ
మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ పిటీషన్ పై నేడు ఎక్సైజ్ కోర్టులో విచారణ జరగనుంది
బీహార్ ప్రజలకు పొంగులేటి పిలుపు..
బీహార్ ప్రజలకు పొంగులేటి పిలుపు.. రెండు దశాబ్దాల పాటు అవినితి అక్రమాలు, అవకాశవాద
Chandrababu : నేడు అమరావతికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అమరావతికి చేరుకోనున్నారు.
జెమిమా రోడ్రిగ్స్ పేరు మహిళల వరల్డ్ కప్ తర్వాత ప్రపంచం అంతటా మారుమోగిపోతుంది.
బీహార్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం
పాట్నా: బీహార్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోసి, మగధ్, మిధిలాంచల్ ప్రాంతాలకు చెందిన మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాలలో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడత ఎన్నికలలో 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నవంబర్ 14న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. డ్రోన్లు, సీసీకెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహణ జరుగుతోంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. 121అసెంబ్లీ నియోజకవర్గాలలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర పార్టీల కలయిక అయిన మహాఘట్బంధన్ మొత్తం 121 స్థానాలకు 63 గెల్చుకుని తిరుగులేదన్పించుకుంది. ఇప్పుడు ఇండియా కూటమి గా సాగుతోన్న పోరులో జయాపజయాలు ఇండియా కూటమి ఉనికికి , బలోపేతానికి అగ్నిపరీక్ష కానున్నాయి. ఈ ప్రాంతంలో ఇంతకు ముందు బిజెపి, జెడియుల ఎన్డిఎ 55 స్థానాల్లో గెలిచింది. ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రచార సభలలో ప్రధాని మోడీ తన వెంట జెడియు నేత లలన్ సింగ్ ఉండగా బీహారీల ఓట్ల కోసం అభ్యర్థించారు. నితీశ్కుమార్ ఎక్కువగా సభలకు రాలేదు. దీని ప్రభావం ఏమిటనేది ఈ విడత పోలింగ్తో తెలుస్తుంది. ఇండియా కూటమి తరఫున స్థానిక ప్రజలను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇమేజ్ కీలకం కానుంది. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్లో ఓటు చోరీ నిరసన యాత్ర సాగించడం, జాలర్లతో కలిసి ఈత కొట్టడం, ఇతర ప్రజాకర్షక పద్థతులకు దిగడం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఓటు ఫలం ఎటు అనేది తేలాల్సి ఉంటుంది. అయితే ప్రచార దశలో ఆయన ఎక్కువగా పాల్గొనలేదు. కొంత కాలం అమెరికా ఇతర దేశాల పర్యటనలోనే గడిపారు. రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ కూడా ఈ సారి రంగంలోకి దిగింది. ఆయన పోటీ చేయడం లేదు. అయితే తమ పార్టీ ఈ ఎన్నికలలో గణనీయ శక్తి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి పోలింగ్లో తేజస్వీ యాదవ్ , సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత సామ్రాట్ చౌదరి, గాయకులు మైధిలీ ఠాకూర్ వంటి వారు ప్రముఖులుగా ఉన్నారు. ఇండియా కూటమి తరఫు సిఎం అభ్యర్థి తేజస్వీ రఘోపూర్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పాట్నా సాహిబూ, బెగూసరాయ్. ఛాప్రా వంటి స్థానాలు ప్రధాన పోటీ కేంద్రాలు అయ్యాయి.
India vs Australia : నేడు భారత్ - ఆస్ట్రేలియా నాలుగో టీ20
భారత్ - ఆస్ట్రేలియా మధ్య నేడు నాలుగో టీ20 జరగనుంది. గోల్డ్ కోస్ట్ వేదికగా మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది
Bihar : బీహార్ లో నేడు తొలి విడత ఎన్నికలు
నేడు బీహార్ తొలి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ మూవీ.. ‘జటాధర’
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అర్ణు అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు వినుంటాం. ‘బ్యాంకులు లేని సమయంలో ధనాన్ని భూమిలో పాతి ఒక బంధనం వేసి దానికి ఒక పిశాచి కాపలాగా ఉంటుంది’ అని ప్రచారంలో ఒక కథ ఉండేది. ఈ కథకు అలాంటి ఒక జానపదం ఆధారం. అలాంటి కథని ఈ కాలంలోకి వచ్చి తీసుకొచ్చి చాలా ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో -దెయ్యం, కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, శివుడు గురించి కథలు... ఇలా చాలా లేయర్స్ వున్నాయి. అరుణాచల ప్రస్తావన కూడా వుంది. యాక్షన్, ఫ్యామిలీ, మైథలాజి... అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా ఇది. -ఈ సినిమాలో ఘోస్ట్ హంటర్గా కనిపిస్తా. అయితే తనకి దెయ్యాలు ఉన్నాయంటే నమ్మకం వుండదు. దేవునిపై నమ్మకం వుంటుంది. సైన్స్ ని నమ్ముతాను. అలా ఎందుకనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా వుంటుంది. బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ సినిమా ఇది. సోనాక్షి చాలా అద్భుతమైన నటి. సినిమాలో ధనపిశాచి పాత్రలో తన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. -శిల్పా శిరోద్కర్ శోభ అనే పాత్రలో కనిపిస్తారు. అద్భుతంగా నటించారు. ఇక నెక్స్ రాహుల్ రవీంద్రన్ తో ఒక సినిమా వుంది. ఇప్పుటి వరకు అలాంటి కాన్సెప్ట్ వరల్డ్ సినిమాల్లో రాలేదు. కాన్సెప్ట్ పరంగా అది ఒక బాహుబలి లాంటి సినిమా. అలాగే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేయాలి” అని అన్నారు.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన
నేడు బీహార్ లో పోలింగ్.. బీహార్ లో ఈరోజు తొలి విడతగా 121
ఈసారి 121 స్థానాలలో ఓటు ఎన్డిఎ, ఇండియా కూటమి హోరాహోరీ గంగా దక్షిణ ప్రాంతపు 18 జిల్లాల్లో బ్యాలెట్ సిఎం అభ్యర్థి తేజస్వీకి కీలక పరీక్ష పాట్నా: ఎన్డిఎ, ఇండియా కూటమి మహాఘట్బంధన్ నడుమ తీవ్ర ఉత్కంఠతను రేపే బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నేడు ( గురువారం) జరుగుతుంది. ఈ తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలలో అర్హులైన ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కు వినియోగించుకోనున్నారు. ఈ దఫా గంగా దక్షిణ ప్రాంతంలో విస్తరించుకుని ఉండే ఈ పోలింగ్లో ఇంతకు ముందటి ఫలితాల క్రమంలో మహాఘట్బంధన్కు ఆధిక్యత అవకాశం ఉంది. అయితే ఈసారి ఇక్కడ ఎన్డిఎ అతిరధ మహారధులు ప్రత్యేకించి మోడీ, అమిత్ షాలు తమ దృష్టిని కేంద్రీకరించారు. దీనితో ఓటు ఫలితం ఎటువైపు అనేది తేలాల్సి ఉంది. ఇక్కడ పలు రాజకీలక సమీకరణలు, సామాజిక పరిస్థితులు గెలుపోటములను ఖరారు చేస్తాయి. ఈ ప్రాంతంలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర పార్టీల కలయిక అయిన మహాఘట్బంధన్ మొత్తం 121 స్థానాలకు 63 గెల్చుకుని తిరుగులేదన్పించుకుంది. ఇప్పుడు ఇండియా కూటమి గా సాగుతోన్న పోరులో జయాపజయాలు ఇండియా కూటమి ఉనికికి , బలోపేతానికి అగ్నిపరీక్ష కానున్నాయి. ఈ ప్రాంతంలో ఇంతకు ముందు బిజెపి, జెడియుల ఎన్డిఎ 55 స్థానాల్లో గెలిచింది. ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రచార సభలలో ప్రధాని మోడీ తన వెంట జెడియు నేత లలన్ సింగ్ ఉండగా బీహారీల ఓట్ల కోసం అభ్యర్థించారు. నితీశ్కుమార్ ఎక్కువగా సభలకు రాలేదు. దీని ప్రభావం ఏమిటనేది ఈ విడత పోలింగ్తో తెలుస్తుంది. ఇండియా కూటమి తరఫున స్థానిక ప్రజలను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇమేజ్ కీలకం కానుంది. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్లో ఓటు చోరీ నిరసన యాత్ర సాగించడం, జాలర్లతో కలిసి ఈత కొట్టడం, ఇతర ప్రజాకర్షక పద్థతులకు దిగడం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఓటు ఫలం ఎటు అనేది తేలాల్సి ఉంటుంది. అయితే ప్రచార దశలో ఆయన ఎక్కువగా పాల్గొనలేదు. కొంత కాలం అమెరికా ఇతర దేశాల పర్యటనలోనే గడిపారు. రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ కూడా ఈ సారి రంగంలోకి దిగింది. ఆయన పోటీ చేయడం లేదు. అయితే తమ పార్టీ ఈ ఎన్నికలలో గణనీయ శక్తి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో హైదరాబాద్ ఎంపి , మజ్లిస్ నేత అసదుద్దిన్ తమ పార్టీ తరఫున అభ్యర్థులను దింపారు. ఇవి ఇండియా కూటమి ఓట్లను చీలుస్తాయనే ఆందోళన సంబంధిత పార్టీల నేతలలో ఉంది. ఈసారి పోలింగ్లో నితీశ్ కుమార్ కేబినెట్లోని 16 మంది మంత్రుల భవితవ్యం తేలాల్సి ఉంది. ప్రత్యేకించి రాఘోపూర్,మహూవా , ఛాప్రాల్లో పోటీ నువ్వానేనాగా ఉంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలలో ఇప్పుడు జరిగే తొలి విడత పోలింగ్ 18 జిల్లాలకు విస్తరించుకుని ఉంది. ఈసారి పోలింగ్లో తేజస్వీ యాదవ్ , సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత సామ్రాట్ చౌదరి, గాయకులు మైధిలీ ఠాకూర్ వంటి వారు ప్రముఖులుగా ఉన్నారు. ఇండియా కూటమి తరఫు సిఎం అభ్యర్థి తేజస్వీ రఘోపూర్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పాట్నా సాహిబూ, బెగూసరాయ్. ఛాప్రా వంటి స్థానాలు ప్రధాన పోటీ కేంద్రాలు అయ్యాయి.
కాంగ్రెస్ ను ముట్టుకుంటే.. తెలుస్తుంది –భట్టి
కాంగ్రెస్ ను ముట్టుకుంటే.. తెలుస్తుంది – భట్టి కాంగ్రెస్ అంటే.. కరెంట్, కరెంట్
సామాజిక, మానవ అభివృద్ధిలో రికార్డు సాధిస్తున్న ‘దేవభూమి’ కేరళ, తీవ్రమైన పేదరికం నుంచి విముక్తి పొందినట్టు 69వ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబరు 1న రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించడం దేశానికే ఆదర్శాన్ని చాటుతోంది. తమ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు రూ. 1000 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ఇదే సాఫల్యమైన కేరళ అసలు స్టోరీగా అభివర్ణించారు. అనేక రంగాల్లో కేరళ అభివృద్ధి సాధించడం ద్వారా ‘కేరళ మోడల్’ అన్న పేరు బాగా ప్రసిద్ధి చెందిందన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. పినరయి విజయన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మదాం నియోజకవర్గం ఇప్పటికే దేశం లో, పేదరిక రహిత నియోజకవర్గంగా ప్రకటించబడడం గమనార్హం. పేదరిక కుటుంబాలను గుర్తించడంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. వివిధ ఏజెన్సీల సహకారంతో ప్రణాళిక రూపొందించింది. స్థానిక స్వపరిపాలన శాఖ నేతృత్వంలో సామాజిక భాగస్వామ్యానికి ప్రణాళికలో చోటు కల్పించింది. 2021 మేలో రాష్ట్ర ఎల్డిఎఫ్ ప్రభుత్వం అత్యంత పేదరిక నిర్మూలన కార్యక్రమం (ఎక్స్ట్రీమ్ పోవెర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఇపిఇపి) ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు ఇటీవల సవరించిన అంతర్జాతీయ దారిద్య్రరేఖ ప్రకారం రోజుకు మూడు అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఖర్చుతో జీవించే వ్యక్తులను తీవ్ర పేదరికంతో ఉన్నట్టు పరిగణిస్తారు. ఈ లెక్కన కేరళ ప్రభుత్వం ప్రజా కేంద్రీకృత అభివృద్ధి, వికేంద్రీకృత ప్రణాళికతో పేదరికాన్ని తగ్గించగలిగింది. 1973 74లో 59.8% వరకు ఉన్న పేదరికం 201112 నాటికి 11.3 శాతానికి తగ్గింది. నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవెర్టీ ఇండెక్స్ 2023లో దేశం మొత్తం మీద అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంగా సూచించింది. కేరళ జనాభాలో కేవలం 0.55 శాతం మంది మాత్రమే బహుముఖ పేదరికంలో ఉన్నారని స్పష్టం చేసింది. ఇది జాతీయ తలసరి పేదరికం 14.96% కన్నా చాలా తక్కువ. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలను గుర్తించడంలో పూర్తిగా స్వీయ నమోదుపై ఆధారపడకుండా ప్రత్యేకంగా దాదాపు 4 లక్షల ఎన్యూమరేటర్లను నియమించింది. వీరికి స్థానిక పాలనా సంస్థలతోపాటు కుడుంబశ్రీ వర్కర్ల సహాయం కూడా అందించింది. అనేక స్థాయిల్లో మధింపు జరిగిన తరువాత 64,006 అతి పేద కుటుంబాలకు చెందిన 1,03,099 మంది పేదలను గుర్తించింది. వీరిలో చాలా మందికి కనీస ధ్రువీకరణ పత్రాలు లేవు. నాలుగు అంశాల ఆధారంగా వీరి పేదరికాన్ని గుర్తించారు. వారు తింటున్న ఆహారం, ఆరోగ్య ప్రమాణాలు, ఉండడానికి ఇల్లు ఉందా లేదా, వారి చదువు తదితర వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కుటుంబాల్లో చాలా మందికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా లేవు. 21,263 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ అందేలా చేశారు. 4000 కుటుంబాలకు 5422 ఇళ్లు కట్టించి ఇచ్చారు. మరో 5522 ఇళ్లను తిరిగి నిర్మించారు. 1500 కుటుంబాలకు సాగుభూమి అందించారు. శిథిల స్థితిలో ఉన్న ఇళ్లల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ. 2 లక్షల వంతున సహాయం అందించారు. పేదరికం నుంచి ఒకసారి విముక్తి కల్పించడమంటే అన్ని సమస్యలు వారికి వెంటనే పరిష్కారమైనట్టు కాదు. పేదరికాన్ని ఎదుర్కోవడం ఎప్పటికీ అంతం కాని పని. రాష్ట్రప్రభుత్వం తీవ్ర పేదరిక నిర్మూలన ఆదర్శనీయమైన పద్ధతిలో కొనసాగించడంలో అసలు ఉద్దేశం కటిక పేదరికం మళ్లీ ఏర్పడకూడదని, కొత్తగా ఏ కుటుంబం పేదరికంలో పడకూడదని.. పేదరికం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికే ఎల్డిఎఫ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్య, ఆరోగ్య రంగాల్లోనూ స్థానిక ప్రభుత్వాలు గట్టిగా కృషి చేస్తున్నాయి. 2025 నాటికి కేరళలో అక్షరాస్యత 96 శాతం చేరుకుంది. ఆరోగ్య భద్రత విషయాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో 5415 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మహిళల ప్రసూతి సమయంలో శిశుమరణాల సంఖ్య జాతీయ స్థాయిలో ప్రతివెయ్యి కాన్పులకి 28 వరకు ఉండగా, కేరళలో వెయ్యి కాన్పులకు 5 మాత్రమే ఉండటం గమనార్హం. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో భారీ పరిశ్రమలు అంటూ లేవు. అయినా మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి సూచికల్లో అగ్రగామిగానే కేరళ ఉంటోంది. పేదరిక నిర్మూలన నిరంతర కార్యక్రమమని, 2026 మార్చి నాటికి పేదరికం 0.002 శాతానికి చేరేలా ప్రయత్నిస్తామని రాష్ట్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. అయితే కేరళ నమూనాను విమర్శించేవారు కూడా ఉన్నారు. అభివృద్ధి విషయంలో స్తబ్ధత నెలకొందని, నిరుద్యోగం పెరుగుతోందని ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు సాక్షాలన్న విమర్శలు వస్తున్నాయి. పేదరిక నిర్మూలన గణాంకాలు ఉత్త బోగస్ అని కాంగ్రెస్ నేతృత్వం లోని విపక్షం ఆక్షేపిస్తోంది. ఈ విమర్శలను సవాలుగా తీసుకొని ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను, సాంకేతిక హరిత ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. నిరుద్యోగాన్ని తొలగించడానికి విద్యావంతులకు నైపుణ్యాభివృద్ధిని చేపట్టింది. దేనికీ రాజీపడని ప్రగతిశీల పరిపాలన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ రెండిటినీ సమతుల్యం చేసుకోగలదని ‘ఇపిఇపి’ నిరూపిస్తోంది. సమాజం నడిపించే ఈ నమూనా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కేరళ స్టోరీ దేశం మొత్తంమీద ఆదర్శవంతమే కాక, విస్తృతంగా అనుసరించేలా ప్రచారం చేయదగిందనే చెప్పవచ్చు.
నేడు భారత్, ఆస్ట్రేలియా నాలుగో టి20.. ఇరు జట్లకు కీలకం
క్వీన్స్లాండ్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం క్వీన్స్లాండ్ వేదికగా కీలకమైన నాలుగో టి20 మ్యాచ్ జరుగనుంది. తొలి టి20 వర్షార్పణం అయ్యింది. రెండో పోటీలో ఆస్ట్రేలియా, మూడో టి20లో టీమిండియా జయకేతనం ఎగుర వేశాయి. దీంతో ప్రస్తుతం సిరీస్ 11తో సమంగా ఉంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు సిరీస్లో ఆధిక్యంలోకి దూసుకెళుతోంది. ఇలాంటి స్థితిలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. కిందటి టి20లో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియా ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులో గెలిచి సిరీస్లో పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉంది. ఆతిథ్య టీమ్ ఆస్ట్రేలియా కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇరు జట్లలోనూప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు రెండు జట్లలోనూ ఉన్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఓపెనర్లే కీలకం.. ఈ మ్యాచ్లో టీమిండియాకు ఓపెనర్లు కీలకంగా మారారు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మలు జట్టుకు శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. వన్డే సిరీస్తో పాటు ఇప్పటి వరకు ఆడిన రెండు టి20 మ్యాచుల్లోనూ గిల్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్ను కనబరచలేక పోయాడు. కీలకమైన ఈ మ్యాచ్లోనైనా అతను తన బ్యాట్కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. గిల్ వరుస వైఫల్యాలు జట్టును కలవరానికి గురి చేస్తోంది. అభిషేక్ రెండో టి20లో అద్భుత బ్యాటింగ్ను కనబరిచాడు. మూడో టి20లో బాగానే ఆడినా భారీ స్కోరును అందుకోలేక పోయాడు. ఈసారి మాత్రం ఆ లోటును తీర్చుకోవాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్లో వాషింగ్టన్ విధ్వంసక ఇన్నింగ్స్తో భారత్కు విజయం సాధించి పెట్టాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. జితేశ్ కూడా బ్యాట్ను ఝులిపించేందుకు సిద్ధమయ్యాడు. తిలక్వర్మ, సూర్యకుమార్లు కూడా తమవంతు పాత్ర పోషిస్తే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. మరోవైపు అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్ తదితరులతో భారత బౌలింగ్ కూడా బలంగానే ఉంది. రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. గెలుపే లక్షంగా.. మరోవైపు కిందటి మ్యాచ్లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా ఎలాగైనా భారత్ను ఓడించాలనే లక్షంతో కనిపిస్తోంది. కిందటి మ్యాచ్లో భారీ స్కోరు సాధించినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుకు సాగాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా సమతూకంగా ఉంది. కానీ కీలక ఆటగాళ్ల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. మూడో టి20లో టిమ్ డేవిడ్, స్టోయినిస్, మాథ్యూ షార్ట్ తప్ప మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో మాత్రం కీలక ఆటగాళ్లు బ్యాట్ను ఝులిపించాలనే కసితో ఉన్నారు. హెడ్, మార్ష్, ఇంగ్లిస్, డేవిడ్, ఓవెన్, స్టోయినిస్, షార్ట్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆస్ట్రేలియాతో పోరు భారత్ అంత తేలికేం కాదనే చెప్పాలి.
ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు..
ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు.. భద్రతా ప్రమాణాల పరిశీలన పాటించకపోతే కఠిన
న్యూయార్క్ : అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేడు ఎదురు దెబ్బ తిన్నారు. షాక్ కు గురయ్యారు. భారతీయ సంతతికి చెందిన ముగ్గురు ముస్లిం డెమోక్రాట్లు జోహ్రాన్ మమ్దానీ, అఫ్తాబ్ పురేవాల్, గజాలా హష్మి ఆయనకు తొలి రాజకీయ ఓటమిని చవిచూపారు. రాజకీయ కాక పుట్టించి, న్యూయార్క్ నగరం, సిన్సినాటి, వర్జీనియాలో అధికవోట్లను అగ్రశ్రేణి డెమోక్రాట్లు - జోహ్రాన్ మమ్దానీ, అఫ్తాబ్ పురేవాల్, గజాలా హష్మి గెలుచుకున్నారు. న్యూయార్క్ నగర మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ భారతీయ - అమెరికన్ తల్లి మీరా నాయర్ దంపతుల బిడ్డ. కాగా వర్జీనియా లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నికైన గజాలా హష్మీ భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలోని మలకపేట కు చెందిన వారు కావడం విశేషం. ఇక అఫ్తాబ్ పురేవాల్ తండ్రి పంజాబీ, తల్లి టిబెటన్ కు చెందిన వారు. జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ భారతీయ ప్రముఖ చిత్ర నిర్మాత, అతని తండ్రి మహ్మద్ మమ్దానీ పూర్వీకులు గుజరాత్ కు చెందిన వారే. మహ్మద్ మమ్దానీ ప్రముఖ రచయిత, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ ప్రొఫెసర్. న్యూయార్క్ నగర మేయర్ గా ఎన్నికైన తొలి ముస్లిం గా, భారతీయ సంతతి వ్యక్తిగా జోహ్రాన్ కొత్త రికార్డు సృష్టించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలతో సహా పలు ఎన్నికల్లో డెమోక్రాట్స్ కు వరుసగా ఓటమి ఎదుర్కొంటున్న సమయంలో ఈ విజయాలు కొత్త జీవం పోశాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఎన్నికల రేస్ లో వ్యక్తిగతంగా లేకపోయినా, ఆయన ప్రభావం, నిర్ణయాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. న్యూయార్క్ లో జహ్రానీ మమ్దానీ చేతిలో ఓడిపోయిన ఇండి పెండెంట్ అభ్యర్థి ఆండ్రూ క్యూమోను ప్రెసిడెంట్ ట్రంప్ సమర్థించారు. ఆయన న్యూయార్క్ మాజీ గవర్నర్ కూడా. ఒక దశలో ట్రంప్ మమ్దానీ మేయర్ గా గెలిస్తే, ఫెడరల్ నిధులను నిలిపివేస్తామని బెదిరించారు కూడా. ఇక వర్జీనియాలో 61 ఏళ్ల గజాలా హష్మి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికల్లో గెలిచి మరో చరిత్ర సృష్టించారు. ఆ పదవికి ఎన్నికైన భారతీయ -అమెరికన్, మొదటి ముస్లిం మహిళ కూడా. హష్మి రిపబ్లికన్ పార్టీకి చెందిన జాన్ రీడ్ పై విజయం సాధించారు. సిన్సినాటి మేయర్ గా ఎన్నికైన అఫ్తాబ్ పూరేవాలా ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి కోరీ బౌమాన్ ను ఓడించి రెండోసారి ఆ పదవి చేపట్టారు. కోరీ బౌమాన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ సవతి సోదరుడు. ట్రంప్ సన్నిహితుడు. ఈ ఎన్నికలు ట్రంప్ పనితీరు పట్ల మెజారిటీ ఓటర్ల అసంతృప్తికి అద్దం పడుతున్నాయి. వర్జీనియా తో సహా చాలా స్టేట్ లలో సగం కంటే ఎక్కువమంది ఓటర్లు తమ ఓటుతో ట్రంబ్ కు ఘాటైన మెసేజ్ పంపారని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు, సుంకాలు వలస విధానాలను ఓటర్లు తిరస్కరిస్తున్నట్లు కన్పిస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతీయ మూలాలు ఉన్న ముగ్గురు ముస్లిం అభ్యర్థులు ముఖ్యంగా డెమోక్రాట్లు రిపబ్లికన్ పార్టీ జోరుకు బ్రేక్ వేశారు. ఇది 2026 మధ్యంతర, 2028 ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఆధిక్యానికి ఏ విధంగా దెబ్బకొడుతుందో చూడాలి.. జోహ్రాన్ మమ్దానీ జనవరి 1న న్యూయార్క్ మేయర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్న జోహ్రాన్ మమ్దానీ తల్లిదండ్రులు భారతదేశంలో మూలాలు కలిగిన వారు. మమ్దానీ ఉగాండాలోని కంపాలా లో జన్మించారు.ఆయన బాల్యం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో సాగినా, 7 ఏళ్ల వయస్సులో న్యూయార్క్ నగరానికి చేరారు. కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు 2018 లో అమెరికన్ పౌరసత్వం పొందారు. మమ్దానీ భార్య రామా దువాజీ సిరియన్ - అమెరికన్ కళాకారిణి, ఈ ఏడాదే వారి వివాహం జరిగింది. న్యూయార్క్ లోని క్వీన్స్ లో కలిసి ఉంటున్నారు. 34 ఏళ్ల మమ్దానీ స్టేట్ అసెంబ్లీ సభ్యుడు డెమోక్రటిక్ సోషలిస్ట్. జూన్ లో డెమోక్రటిక్ ప్రైమరీలో ఆండ్రూ క్యూమోను ఓడించారు. గజాలా హష్మీ హైదరాబాదీయే గజాలా హష్మీ 1964లో హైదరాబాద్లో జన్మించారు. బాల్యంలో పాతబస్తీ ప్రాంతంలోని మలక్పేటలో తన అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించారు. ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పని చేశారు. నాలుగేళ్ల వయసులోనే తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా హష్మీ అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. అనంతరం అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్డీ పూర్తి చేసిన ఆమె తండ్రి ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పని చేసేవారు. చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్షిప్పులు, ప్రోత్సాహకాలు అందుకున్న గజాలా, జార్జియా సదరన్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ కోర్సు చదివారు. గజాలా హష్మి వర్జీనియాకు తొలి ఇండియన్ - అమెరికన్, ముస్లిం లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఆమె రిచ్మండ్ కు చెందిన రిపబ్లికన్ జాన్ రీడ్ ను ఓడించారు. హష్మి ప్రస్తుతం స్టేట్ సెనెటర్. సౌత్ రిచ్మండ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఓడించి వర్జీనియా రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. హష్మి 4 ఏళ్ల వయస్సులో తన కుటుంబంతో సహా భారతదేశం నుంచి అమెరికాకు చేరారు. ఆమె జార్జియా సదరన్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ బిఏ, ఎమోరీ యూనివర్సిటీ నుంచి పిహెచ్ డి పట్టా పొందారు. అఫ్తాబ్ పురేవాల్ భారతీయ సంతతికి చెందిన సిన్సినాటి మేయర్ అఫ్తాబ్ పురేవాల్ (43) గతంలో 2021లో నగరానికి తొలిసారి ఆసియా - అమెరికన్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు రెండో సారి మేయర్ గా ఎన్నికయ్యారు. పురేవాల్ తల్లిదండ్రులు ఒహియోకు వలస వచ్చిన వారు. ఆయన తండ్రి పంజాబ్ కు చెందిన వారు. పురేవాల్ కు చిన్ననాటి నుంచి రాజకీయాలంటే మక్కువ . విద్యార్థి దశలోనే నాయకుడిగా ఎదిగారు. సిన్సినాటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి పట్టాపొందిన పురేవాల్ 2008 లో వాషింగ్టన్ డిసి కి చేరుకుని అక్కడ ఓలా సంస్థలో పనిచేశారు. తర్వాత అమెరికా న్యాయశాఖలో అటార్ని ప్రత్యేక అసిస్టెంట్ గా పని చేశారు. 2016లో రాజకీయ కెరీర్ ప్రారంభించారు. మాజీ ప్రెసిడెంట్ ఒబామా శుభాకాంక్షలు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా డెమోక్రటిక్ విజేతలకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. వారి విజయం భవిష్యత్ లో డెమోక్రటిక్ పార్టీ విజయాలకు నాంది కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హష్మీకి సీఎం రేవంత్, కెటిఆర్ అభినందనలు వర్జీనియా గవర్నర్గా హైదరాబాదీ గజాలా హష్మీ - ఎన్నిక కావడం పట్ల సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ఆమె తొలి ముస్లిం మహిళగా రికార్డు పొందారని, అమెరికాలో గవర్నర్గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా హష్మీ రికార్డు సొంతం చేసుకున్నారని చెప్పారు. - అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు నేతలు సత్తా చాటారని, అందులో భాగంగా వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా డెమోక్రాట్ నాయకురాలు గజాలా హష్మీ ఘన విజయం సాధించారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2005 నుండి మహిళా సంక్షేమానికి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, పంచాయతీ రాజ్, పుర పాలక సంఘాల అధ్యక్ష స్థానాలలో రిజర్వే షన్లు కల్పించి, పాఠశాల విద్యార్థినులకు 9వ తరగతి నుండే ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసి, పిజి వరకు చదివే విద్యార్థినులకు వివిధ స్థాయిలలో లక్ష వరకు స్కాలర్షిప్ ఇచ్చి వారి మన్ననలు చూరగొన్నారు. మహా దళితులకు, 36 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన (ఇబిసి) వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 15శాతం ఓటు బ్యాంకును స్థిరపరచుకు న్నారు. బిజెపికి అగ్రవర్ణాలు తదితరులతో కలిసి దాదాపు 20% ఓట్లున్నాయి. అత్యంత వెనుకబడిన వర్గాలలోని 112 ఉపకులాల వారు 120 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయనున్నారు. 10వేల కంటే తక్కువ మెజారిటీతో పార్టీలు గెలిచిన స్థానాలు 50. హిల్సా నియోజక వర్గంలో ఆర్జెడి అభ్యర్థిపై జెడియు అభ్యర్థి కేవలం 12 ఓట్లతో గెలిచారు. బర్భిగా స్థానంలో విజేత మెజారిటీ 113. 10 స్థానాలలో అభ్యర్థులు వెయ్యి ఓట్లలో పు మెజారిటీతో గెలిచారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేసినా 47 లక్షల మంది పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరలేదు. వీరిలో 16 లక్షల మంది మహిళలు, ఇబిసిలు దళితులే. బీహార్ 18వ శాసనసభ 234 స్థానాలకు రెండు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నితీశ్ నాయకత్వంలోని అధికార ఎన్డిఎ, రాహుల్ గాంధీ, ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ల నేతృత్వంలోని మహాఘట్బంధన్ హోరాహోరీగా తలడుతున్నాయి. నవంబర్ 6న తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు సర్వం సిద్ధం కాగా, మలి విడత 122 స్థానాలకు 11న ఎన్నికలు జరగనున్నాయి. గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ సారథ్యంలోనే ఎన్డిఎ ఎన్నికలకు వెళుతుండగా, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభృతులు బీహార్ అంతటా కలియదిరిగి మహాఘట్బంధన్కు ఓటేస్తే 1990 నుండి 1995 వరుకు సాగిన లాలూ, రబ్రీదేవిల నాటి ఆటవిక పాలన, నేరాలు, ఘోరాలు మళ్ళీ వస్తాయని, బీహార్ అంధ యుగాలలోకి వెళుతుందని, డబుల్ఇంజిన్ సర్కార్ లాభాలు, సుపరిపాలన కావాలంటే మళ్ళీ నితీశ్ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికి పట్టం కట్టాలని పిలుపు ఇచ్చారు. బిజెపి, ఆర్జెడి, ఎల్జెపి, హిందూస్తాన్ ఆవామీ మోర్చా, లోక్ సుమతా పార్టీలు పంచ పాండవుల వలె రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని హామీ ఇచ్చారు. కాగా రాహుల్, తేజస్విల నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూడా ఈసారి ఎలాగైనా ఎన్డిఎను చిత్తుచేసి, బీహార్ను చేజిక్కించుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. నితీశ్ వయోభారం, అనారోగ్యంవల్ల పాలన చేసే స్థితి లేరని, నేరాలు పెరుగుతున్నాయని, అందరి భాగస్వామ్యంతో బీహార్ను అభివృద్ధి పథంలో నడిపించాలంటే యువకుడైన్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. లాలూ తొలిసారి ముఖ్యమంత్రి అయిన 1990లో తేజస్వి పురిటి పొత్తిళ్లలోని 4 నెలల పసికందు. ఢిల్లీలో 9వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన తేజస్వి 2020 ఎన్నికలలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి యువతను ఆకర్షించినా మహాఘట్ బంధన్ 110 స్థానాలకు పరిమితమైనది. ఆర్జెడి 75 స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా నిలిచింది. మజ్లిస్ పార్టీ వేరుగా పోటీ చేసి ఆరు స్థానాలు గెలిచి అనేక చోట్ల మహాఘట్బంధన్ విజయావకాశాలు దెబ్బ తీసింది. ఈ ఎన్నికలలో కూడా 30 స్థానాలకు పోటీకి దిగింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే రాష్ట్రమంతా చుట్టేసి పలువురు అభ్యర్థులతో తాను పోటీ చేయకుండా జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపారు. ఒక్కసీటు గెలిచే వీలున్నా బహుముఖ పోటీల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలు దెబ్బతీయగలరని అంటున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2005 నుండి మహిళా సంక్షేమానికి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, పంచాయతీ రాజ్, పురపాలక సంఘాల అధ్యక్ష స్థానాలలో రిజర్వేషన్లు కల్పించి, పాఠశాల విద్యార్థినులకు 9వ తరగతి నుండే ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసి, పిజి వరకు చదివే విద్యార్థినులకు వివిధ స్థాయిలలో లక్ష వరకు స్కాలర్షిప్ ఇచ్చి వారి మన్ననలు చూరగొన్నారు. మహా దళితులకు, 36 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన (ఇబిసి) వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 15శాతం ఓటు బ్యాంకును స్థిరపరచుకున్నారు. బిజెపికి అగ్రవర్ణాలు తదితరులతో కలిసి దాదాపు 20% ఓట్లున్నాయి. వీరికి తోడు హిందూస్తాన్ అవామీ మోర్చా దళిత ఓట్లు, లోక్ సమతా పార్టీ ఓట్లతో కలిపి దాదాపు 38 శాతం ఓట్లున్నాయి. మహాఘట్ బంధన్కు బలమైన యాదవ, ముస్లిం (14 శాతం, 17 శాతం ముస్లిం) 32 శాతం ఓట్లున్నాయి. అయితే అధికారంలోకి ఈ ఓట్లు చాలవని గుర్తించి తేజస్వి యాదవ్ ఈ ఎన్నికల ముందు ఎన్డిఎను వీడిన నిషదుల వికాస్ సీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) నేత ముకేశ్ సహానీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించి ప్రచార సభలకు వెంటబెట్టుకొని వెళుతున్నారు. ఓటర్లలో 4.5 మత్స్యకారులున్నారు. వారిలో మల్లా ఉపకులానికి 2.6 శాతం ఓట్లున్నాయి. ముకేశ్ సహాని మల్లనే. గత ఎన్నికల్లో మరో 12 స్థానాలు గెలిచి ఉంటే తేజస్వికి ముఖ్యమంత్రి పీఠం దక్కేది. సీమాంచల్లో మజ్లిస్ పార్టీ మహాఘట్బంధన్ను దెబ్బ తీసింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్కు 37.23 శాతం ఓట్లు రాగా, ఎన్డిఎకు 37.26 శాతం అంటే కేవలం 12,700 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. బీహార్లో దాదాపు 20 శాతం దళితులున్నారు. మహా దళితులు, చిరాగ్ పాశ్వాన్ ఎన్డిఎకు మద్దతుగా ఉన్నారు. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన కింద దాదాపు కోటిన్నర మంది మహిళలు ఒక్కొక్కరి ఖాతాలో రూ. పదివేలు జమచేసి, మెరుగైన ప్రతిభ కనబరచిన వారికి రూ. 2 లక్షల వరకు రుణాలు ఇస్తామని నితీశ్ ప్రభుత్వం వారి జేజేలు అందుకుంది. మహిళల ప్రాధాన్యత గుర్తించిన తేజస్వి మహాఘట్బంధన్ అధికారంలోకివస్తే ఒక్కో మహిళ ఖాతాలో నెలనెలా రూ. 2500 నగదు జమ చేస్తామని, సంక్రాంతి పండుగకు రూ.30 వేలు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఖచ్చితంగా ఇస్తామని పోటీ హామీ ఇచ్చి అధికార కూటమిలో గుబులు రేపారు. అత్యంత వెనుకబడిన వర్గాలలోని 112 ఉపకులాల వారు 120 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయనున్నారు. 10వేల కంటే తక్కువ మెజారిటీతో పార్టీలు గెలిచిన స్థానాలు 50. హిల్సా నియోజక వర్గంలో ఆర్జెడి అభ్యర్థిపై జెడియు అభ్యర్థి కేవలం 12 ఓట్లతో గెలిచారు. బర్భిగా స్థానంలో విజేత మెజారిటీ 113. 10 స్థానాలలో అభ్యర్థులు వెయ్యి ఓట్లలోపు మెజారిటీతో గెలిచారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేసినా 47 లక్షల మంది పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరలేదు. వీరిలో 16 లక్షల మంది మహిళలు, ఇబిసిలు దళితులే. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి జెడియుపై కత్తి గట్టిన చిరాగ్ ఎల్జెపి ఈసారి అధికార కూటమిలో చేరగా, గతంలో ఎన్డిఎలో ఉన్న ముకేశ్ సహానీ ఈసారి మహాఘట్బంధన్తో జట్టు కట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కులాలు, ఉపకులాల ప్రాబల్యం, ఆ చైతన్యం ఎక్కువగా ఉన్న బీహార్లో పార్టీలు ఓట్ల కోసం అలవిగాని హామీలు ఇచ్చాయి. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటే మరో కోటికి పైగా ఉద్యోగాల కల్పనకు రూ. 6 లక్షల కోట్లు అవసరమంటున్నారు. ఇంటికి 200 యూనిట్ల విద్యుత్కు భారీగా నిధులు కావాలి. యువత, మహిళలను ఆకట్టుకుని అధికారంలోకి రావాలని యువకుడైన తేజస్వి ఆశ. ఈ ఎన్నికలలో మళ్లీ గెలిచి ఉత్తరాదిలో సత్తాచాటాలని మోడీ యత్నం. తేజస్వి తేజస్సు వెలుగుతుందా లేక మోడీ, నితీశ్ల ప్రభావం కొనసాగుతుందా అనేది 7.45 కోట్ల బీహార్ ఓటర్లు తేల్చనున్నారు. పతకమూరు దామోదర్ ప్రసాద్ 94409 90381
అవినీతికి అడ్డుకట్ట సాధ్యమేనా?
భూకబ్జాలు, కమీషన్లు, దౌర్జన్యాలకు పాల్పడే రాజకీయ నాయకులు, నకిలీ, కల్తీసరుకులు అమ్ముతూ, పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులు, చేతులు తడపందే ఫైల్ వైపు చూడని ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ మూడు వర్గాలు కూడబలుక్కొని దేశాన్ని పందికొక్కుల్లా మేస్తున్నారు. దృఢమైన గొలుసులా ఏర్పడి సొంత ఆస్తులను గుట్టలుగా పోగు చేసుకుంటున్నారు. వీరి ధనదాహం, అధికార అహం వల్ల దేశంలో వంద కోట్లకు పైగా సామాన్యుల జీవితాలు కష్టాల ఊబిలోకి జారుతున్నాయి. పని చేసి పెట్టేందుకు లంచంకోసం చేయి చాచే ఉద్యోగి ప్రజలకు ప్రత్యక్షంగా కనబడతాడు. వ్యాపారి మోసాలు మాత్రం సామాన్యుడి కంటికి అగపడవు. ఇక రాజకీయ నాయకుడు పెద్ద మాయలోడు. వారి సంపాదన అండర్ గ్రౌండ్ డ్రైనేజిలా ఎటునుంచి ఎటు వెళుతుందో అంతుపట్టదు. ఉద్యోగి పట్టుబడితే కష్టాలే. వ్యాపారి నష్టపోతే తిప్పలే. నాయకుడు ఓడిపోయినా దివాళా తీయడు. ఈ పోలిక ఆధారంగా దేశ సంపద, పౌరుడి శ్రమ ఈమేరకు ఎవరి జేబులోకి వెళుతుందో ఊహించవచ్చు. ఈ మూడింటిలో అత్యంత బలమైనది వ్యాపార వర్గమే. ఒక రకంగా రాజకీయ, ఉద్యోగ వర్గాలు వ్యాపారికి ఊడిగం చేసేవే. వ్యాపారులు ఇచ్చే విరాళాలు రాజకీయ పార్టీలకు ఇంధనంలా పనికొస్తాయి. ఒక పరిశ్రమ తమ రాష్ట్రానికి రావడానికి పాలకులు పడే ఆరాటం చూస్తుంటే పారిశ్రామికవేత్తలు ఎంత శక్తిమంతులో అర్థమవుతుంది. మంత్రులను తమ కనుసన్నలపై ఆడించే వ్యాపారుల ఇంటి గేటు తాకడానికి కూడా అధికారులు వణికిపోతారు. ప్రభుత్వ బ్యాంకుల్లోంచి తీసుకొన్న వేల కోట్ల అప్పును గుర్తుచేయడానికి కూడా అధికారికి సాహసమే కావాలి. బ్యాంకుల్లోని ప్రజల పొదుపు సొమ్మును వేల కోట్ల దాకా ఎగ్గొట్టిన మన వ్యాపారులు విదేశాలకు వెళ్లి రాజాల్లా బతకగలరు. ఆ అప్పులకు మాఫీ చేస్తున్నట్లు మంత్రులతో ప్రకటనలు ఇప్పించగలరు. రాజకీయ, వ్యాపార వర్గాల చెప్పుచేతల్లో నడిచేవారు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు. ప్రతి దొంగపనిని చూసీచూడనట్లు ఉన్నందుకు వీరి టిప్పు వీరికి అందుతుంది. రెస్టారెంట్లు, బ్రాందీ షాపులు, పబ్బుల నుండి పోలీసులకు, మున్సిపాలిటీకి, కార్మిక, వాణిజ్య పన్నుల శాఖలకు నెలవారీగా లంచం సొమ్ము టంచనుగా అందుతుంది. పరిశ్రమల, వ్యాపారుల అక్రమ దందాలు ఎలాంటి అడ్డంకి లేకుండా యథేచ్ఛగా సాగడానికి ఎన్నో విభాగాల తనిఖీ అధికారులకు లంచం ముడుతుంది. డిపార్ట్మెంట్ వారీగా అందిన సొమ్ము హోదాల క్రమంగా జేబులోకి చేరుకుంటుంది. ఇలా నిశ్శబ్దంగా రోజుకు కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. రోజుకు సగటున లక్ష రూపాయలు ఇంటికి తీసికెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క రాష్ట్రంలో వేలల్లో ఉంటారు. మాఫియాలో బ్లాక్ మనీ, స్మగ్లింగ్, హత్యలు ఉంటాయి. లంచగొండి వ్యవస్థ కూడా వైట్ కలర్ మాఫియానే. వారానికి ఒకరిద్దరు లంచగొండి అధికారులు అవినీతి శాఖకు చిక్కుతున్నారనే వార్తలు కనబడుతుంటాయి. అవినీతి నిరోధక శాఖ బాగా పనిచేస్తుందని చర్చ సాగుతుంది. వాస్తవానికి ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే ఎసిబి స్పందిస్తుంది. ఊర్లో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటుందో అందరికీ తెలుసు. అవినీతి నిరోధక స్టేషన్ మాత్రం ఎక్కడా కనబడదు. ఆ సిబ్బంది కూడా అందులోనే ఉంటే బయట బోర్డుపెట్టాలి. దాని మార్గం విడిగా ఉండాలి. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కౌంటర్ కనబడేలా పెట్టినట్లు లంచాలు అడిగే ఆఫీసుల వద్ద ఎసిబి కౌంటర్లు పెట్టాలి. ఈ వ్యవస్థ లేకపోవడం వల్లనే తమను లంచం అడిగారని ఆ శాఖ దృష్టికి తీసుకువెళ్లే వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోంది. సిబ్బంది కోరిన ప్రకారం సమర్పించుకొని తమ పనులు పూర్తి చేసుకొని బయట పడడానికే జనం ఇష్టపడుతున్నారు. చాలా సందర్భాల్లో అధికారుల అత్యాశే విషయం ఎసిబి దాకా వెళ్లేలా చేస్తుంది. బిల్లు మంజూరుకు అధికారి లక్ష డిమాండ్ చేస్తాడు. అంత ఇవ్వలేము, 70 వేలతో సరిపెట్టుకోండి అని వేడుకుంటారు. ససేమిరా కుదరదు. లక్ష ఇవ్వాల్సిందే అని అధికారి మొండికేస్తాడు. చిర్రెత్తిన లబ్ధిదారు ఎసిబిని ఆశ్రయిస్తాడు. శ్రమలేకుండా ఎసిబి వారికి ఓ చేప పడుతుంది. దానికో వార్త. ఇదేం పెద్ద నేరమన్నట్లు ఉద్యోగి దర్జాగా ఫోటోకి పోజు ఇస్తాడు.లంచం తీసుకోవడం తప్పు అనే భావన సమాజంలోంచి ఎగిరిపోయింది. బాధితుల ఫిర్యాదుపైనే కాకుండా, ఉద్యోగుల ఇళ్లపై దాడి చేసి కూడా అవినీతి ఉద్యోగులను ఎసిబి పట్టుకుంటుంది. ఆ ఉద్యోగులకు ఆదాయాన్ని మించిన ఆస్తులున్నాయని లెక్కలేసి మరీ చెబుతుంది. మిగతా వారికి అక్రమాస్తుల లేవా అంటే వారికీ ఉన్నాయనే సమాధానం వస్తుంది. చాలా డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిలో మునిగేవే. వాటిపై చర్యలు తీసుకుంటే ఆఫీసులే ఖాళీ అవుతాయి. జైళ్లు సరిపోవు. బలమైన ఈ చక్రవ్యూహంలో సామాన్యుడు సర్దుకు బతకడమే తప్ప మరో మార్గం లేదు. బి.నర్సన్, 9440128169
మన తెలంగాణ/హైదరాబాద్ : “మీకు చేతనైతే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థినవీన్ కుమార్ను ఓడించండి...”అని సిఎం రేవంత్ రెడ్డి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని, బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సవాల్ విసిరారు. ప్రధాని మోడీ, కెసిఆర్ ఒకవైపు, తాను, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాం ధీ, మజ్లీస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోవైపు నిలబడ్డామని అన్నారు. కాంగ్రెస్ అం టేనే ముస్లింలని, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉ ప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం సిఎం రేవంత్ రోడ్-షో నిర్వహించారు. షేక్పేట డివిజన్లో జరిగిన రోడ్-షోలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కౌసర్, కాంగ్రెస్ అభ్యర్థి నవీ న్ కుమార్, స్థానిక కార్పోరేటర్ ఫరహత్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సిఎం షేక్పేటలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక ప్రార్థన చే శారు. ఈ సందర్భంగా రోడ్-షోలో పాల్గొన్న వారినుద్ధేశించి ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ బిజెపి, బిఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు. బిఆర్ఎస్ సహకారం వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని ఆయన ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో బిజెపికి బిఆర్ఎస్ సహకరించినందువల్లే బిజెపికి ఎనిమిది సీట్లు వచ్చాయని, బిఆర్ఎస్కు డిపాజిట్లు రాలేదని ఆయన తెలిపారు. అందుకే కెసిఆర్ను, కెటిఆర్ను అవినీతి కేసుల్లో బొక్కలో వేయలేదని ఆయన విమర్శించారు. ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో సహా అనేక మందిపై ఈడి కేసులు పెట్టారు కానీ తండ్రీ-కొడుకును బొక్కలో వేసి, చిప్పకూడు ఎందుకు తినిపించలేదని ఆయన ప్రధాని మోడీని, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతి విషయంలో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కోరితే, ఒక్క రోజులోనే కెసిఆర్పై సిబిఐ విచారణ చేపట్టి, జైలుకు పంపిస్తామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని తాను మంగళవారం రోడ్-షోలో కిషన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తే, మా ఇంటికి వచ్చి చర్చిస్తానంటూ మళ్ళీ తనను ఎదురు ఛాలెంజ్ చేశారని ఆయన దుయ్యబట్టారు. తన ఇంటికి రావాల్సిన అవసరం లేదని, గజదొంగ కెసిఆర్ను అరెస్టు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి తెచ్చుకోవాలని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్లో బిజెపికి డిపాజిట్ దక్కదన్నారు. డిపాజిట్ తెచ్చుకుంటే కిషన్ రెడ్డి గెలిచినట్లేనని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కారు టైర్లు పీకేసి గ్యారేజీకి పంపించారని, కొడితే కెసిఆర్ ఫాం హౌస్లో బొక్కా బొర్లా పడ్డారని అన్నారు.వేల కోట్లతో కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్, కవిత వేర్వేరు చోట్ల ఫాం హౌస్లు కట్టుకున్నది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి నేతలు బిఆర్ఎస్ గుర్తు అయిన కారు గుర్తుతో ఓట్లు అడుగుతున్నారని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్కు ఓట్లు వేస్తే బిజెపికే వేసినట్లు అవుతుందని ఆయన తెలిపారు. నాణేనికి రెండు వైపులా బిజెపి, బిఆర్ఎస్ అని ఆయన విమర్శించారు. సర్కార్కు రెండు కళ్ళు.. హిందూ-ముస్లింలు తమ సర్కారుకు రెండు కళ్ళ వంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అజహరుద్దీన్ను తన సహచర మంత్రిగా తీసుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏమి ఇబ్బంది అయ్యిందని ఆయన ప్రశ్నించారు. ‘నీ అయ్య జాగీరు ఏమైనా అడిగామా? లేక గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ భూములేమైనా అడిగామా?’ అని ఆయన ప్రశ్నించారు. అమిత్ షా వచ్చి అడ్డు చెప్పినా అజహర్ను మంత్రివర్గంలోకి తీసుకునే వాడినని ఆయన తెలిపారు. ముస్లింలకు వివిధ కార్పొరేషన్ పదవులు ఇచ్చానని, క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చామని ఆయన వివరించారు. షెక్పేట్ డివిజన్ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి పదిహేను వేల మెజారిటీ ఇవ్వాలని ఆయన కోరారు. సబర్మతి నదీ, యమునా నదీ అభివృద్ధి చేసినట్లు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయరాదని ఆయన ప్రశ్నించారు. ఏకగ్రీవం సంప్రదాయానికి తిలోదకాలు ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయానికి కెసిఆర్ తిలోదకాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. గతంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణిస్తే, ఆ కుటుంబం నుంచి ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వస్తే సెంటమెంట్ ఏమీ లేదని కెసిఆర్ అభ్యర్థిని పోటీకి దించారని ఆయన తెలిపారు. ఇప్పుడేమో కెటిఆర్ సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్కు రాని సన్నాసులు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కృష్ణానగర్ నంది అవార్డులు తెచ్చింది, ఇప్పుడు ఆస్కార్ అవార్డులు తెచ్చిందని ఆయన తెలిపారు. సినీ కార్మికులకు చిత్రపురి కాలనీలో భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది అవార్డు ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గద్దర్ అవార్డులు ఇచ్చిందని ఆయన తెలిపారు. కెటిఆర్ మాత్రం గెస్ట్ హౌస్ల్లో సినీ నటులతో తిరిగారు తప్ప ఏనాడూ సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఈ ప్రాంతాలో ఉండే కార్మికులకు ఆరోగ్య భద్రత, జీవిత భీమా, ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి, లంచ్ కూడా ఏర్పాటు చేయిస్తానని అన్నారు. ఉత్తమ్కుమార్ రెడ్డి మంత్రి అయిన తర్వాత సన్న బియ్యం ఇస్తున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన దొడ్డు బియ్యం బర్లకు కూడా పెట్టేవారు కాదన్నారు. దసరా పండుగకు ఆడబిడ్డలు వెళ్ళాలనుకుంటే ఉచితంగా వెళ్ళేందుకు బస్సు సౌకర్యం కల్పించామన్నారు. డ్బ్బై వేల ఉద్యోగాలు కల్పించి పత్రాలు స్టేడియంలో అందించామన్నారు. సన్న బియ్యం, ఉచిత బస్సు సౌకర్యం, రేషన్ కార్డులు కెసిఆర్ ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ-కార్ల కేసులో యాభై కోట్ల అవినీతికి పాల్పడిన కెటిఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ రోడ్-షోలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
సత్తా ఎవరిదో.. చెత్త ఎవరిదో తేల్చుకుందాం
మన తెలంగాణ/హైదరాబాద్: దమ్ముంటే సిఎం రేవంత్రెడ్డి గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో లెక్కలు చెప్పి ఓట్లు అడగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. దీనిపై ఎక్కడ చర్చ పెట్టినా రావడానికి తా ము సిద్ధమని సవాల్ విసిరారు. హైదరాబాద్లో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో దమ్ముంటే చర్చ కు రావాలన్నారు. చర్చించడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్లేస్, టైమ్ వాళ్లు చెప్పినా సరే..తమను చెప్పమన్నా స రే అని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటరైనా.. గాంధీభవన్ అయినా, అసెంబ్లీలో చర్చ పెట్టినా తాము ఈ విషయాలపై చర్చించడానికి రెడీగా ఉ న్నామని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగతి నివేదికను విడుదల చే శారు. తెలంగాణ భవన్ లో నివేదికను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జూ బ్లీహిల్స్లో ఓడిపోతామనే రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశా రు. రేవంత్ రెడ్డికి ఆయన భాషలో ఆయనకు అ ర్థమైయేటట్లు చెప్పే సత్తా తమకు ఉందని అన్నా రు. కానీ రేవంత్రెడ్డి మమ్మల్ని తిట్టినా తాము మాత్రం గౌరవంగానే మాట్లాడుతామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, రెండేళ్లలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించిన ఆయన దీంతో చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేలి పోతుందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ హయాంలో చేసిన అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. హైదరాబాద్లో 42 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు నిర్మించామని, తమ హయాంలో స్టార్ట్ చేసిన వాటికే కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేసిందని వివరించారు. అవి కాకుండా కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్డు అయినా నిర్మించారా అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. కొత్త రోడ్ల సంగతి తర్వాత, కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చారా అని నిలదీశారు. నగర ప్రజలకు మళ్లీ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు : హైదరాబాద్లో శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ కూడా సీఎంగా ఒక ఏరియాను ఎంచుకొని అక్కడ శానిటేషన్ పనులు పర్యవేక్షించారని గుర్తు చేశారు. స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వేలాది స్వచ్ఛ్ ఆటోలను ప్రవేశపెట్టామని అన్నారు. ఇప్పుడు కనీసం ఒక్క ఆటోనైనా ప్రవేశపెట్టారా అని ప్రభుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తమ హయాంలో ప్రతి రోజు 7.5 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించామని వెల్లడించారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్లో 34 అవార్డులు సాధించామని తెలిపారు. బెస్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్కు అవార్డు వచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్ఎన్డిపిని కూడా స్టార్ట్ చేసినట్లు తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ హైదరాబాద్ను క్లీన్ సిటీగా మారిస్తే ఇప్పుడు దానిని కాంగ్రెస్ ప్రభుత్వం మురికికూపంగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు : పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించిదని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టారా అని ప్రశ్నించారు. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఇల్లు కట్టకపోగా వేలాది ఇళ్లను హైడ్రా పేరుతో ప్రభుత్వం కూలగొట్టిందని ఫైరయ్యారు. హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది కూడా తమ ప్రభుత్వమేనని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మెట్రో సీఎఫ్వో, ఎల్ అండ్ టీ సీఎఫ్వోలను బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బాధ తట్టుకోలేక, వాళ్ల బెదిరింపులకు తాళలేక ఎంత మంది పారిశ్రామికవేత్తలు పారిపోయారో చర్చకు సిద్ధమా అని నిలదీశారు. కరెంటు విషయంలోనూ కాంగ్రెస్ తీరును కేటీఆర్ ఎండగట్టారు. కాంగ్రెస్ హయాంలో వారానికి రెండు, మూడు రోజులు పవర్ హాలిడేస్ ఉంటే తాము అధికారం చేపట్టిన తర్వాత 24 గంటలు కరెంటు ఇచ్చామని గుర్తు చేశారు. ఎల్ఈడీ బల్బులతో తెలంగాణను దేదీప్యమానంగా చేశామని, రెండేళ్లలో రేవంత్ సర్కార్ ఒక్క ఎల్ఈడీ అయినా పెట్టిందా అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో విద్యుత్ వెలుగులు కొనసాగాయో, ఎవరి హయాంలో విద్యుత్ కోతలతో ఇబ్బంది పడ్డారో చర్చిద్దామా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఉన్న చెట్లను నరికేశారు : కాంక్రీట్ జంగిల్లో కొత్తగా లంగ్ స్పేస్లు ఏర్పాటు చేసిన ఘనత తమదే అని కేటీఆర్ అన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టి 16వేల నర్సరీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క నర్సరీ కూడా పెట్టకపోగా ఉన్న చెట్లను నరికేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రూ.10వేల కోట్లకు కక్కుర్తిపడి హెచ్సియులో జీవవైవిధ్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. ఐటీ ఉద్యోగాలను కూడా మూడు లక్షల నుంచి 9 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. శాంతిభద్రతల విషయంలోనూ కాంగ్రెస్ పనితీరు ఏంటో కేటీఆర్ బయటపెట్టారు. బీఆర్ఎస్ హయాంలో సీసీ కెమెరాలు పెట్టి కేసీఆర్ హైదరాబాద్లో శాంతి భద్రతలు పెంపొందిస్తే ఇప్పుడు సైబరాబాద్లో 41 శాతం, హైదరాబాద్లో 60 శాతం క్రైమ్ రేటు పెరిగిందని, డే లైట్ మర్డర్లు పెరిగాయన్నారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు హైదరాబాద్లోని చర్లపల్లిలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారంటే అంతకంటే అవమానం ఉంటుందా అని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూటిగా సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, మోదీ మధ్య ఫెవికాల్ బంధం : సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య మంచి ఫెవికాల్ బంధం ఉందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్- బీజేపీ జాయింట్ ప్రభుత్వం నడుస్తోందని తెలిపారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాహుల్ గాంధీ విమర్శిస్తే అదే సంస్థలను రేవంత్ నమ్ముతారని వెల్లడించారు. ఇక మైనార్టీలను అవమానించినందుకు గాను రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే కాంగ్రెస్కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కెటిఆర్ హెచ్చరించారు. అటు ఫార్ములా ఈ కేసులోనూ గవర్నర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చినా, చార్జ్షీట్లో విషయం లేకపోవడం వల్ల దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని తేల్చిచెప్పారు. తనపై చేసిన ఆరోపణల విషయంలో దమ్ముంటే ఈ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలని చెప్పారు. అంతేకాకుండా తాను లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమే అని..రేవంత్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. దీంతో ఎవరు దొంగనో తేలిపోతుంది కదా అని చెప్పారు. ప్రతి విషయంలోనూ పచ్చి అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వరం సరే..మీ హామీల మాటేమిటి?
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి, కాంగ్రెస్పార్టీల మధ్య మాటల తూ టాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిలదీతలతో బిజెపి, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు మా టల దాడి చేసుకుంటున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఇత ర రాష్ట్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్రావులను సీబీఐ అరెస్ట్ చేయడం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11లోగా వీరిద్దరిని సీబీఐతో అరెస్ట్ చేయించి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కిషన్రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా 'ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి కేంద్రంపై ధ్వజమెత్తారు. ఇందుకు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి బుధవారం తన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి ముందు మీడియాతో మాట్లాడుతూ అంతే ధీటుగా రేవంత్రెడ్డికి సమాధానం ఇచ్చారు. బిజెపి ఎన్నికలకు ముం దు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిస్తామని ఎటువంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డే కేసీఆర్, హరీశ్లను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు వారిని అరెస్టు చేయలేదని కిషన్రెడ్డి నిలదీశారు. తమకు సంబంధం లేని విషయాలను ఆపాదించడం సరికాదని అన్నారు. అరెస్టులు సం గతి పక్కన పెట్టి రేవంత్రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన డిక్లరేషన్లు, 420 హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తమపై అకారణంగా ఆరోపణలు చేయడం సరికాదని, ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభు త్వం దృష్టిసారించాలని కిషన్రెడ్డి హితవు పలికారు. అవినీతి పెరిగిందే తప్ప తగ్గలేదు తెలంగాణలో కెసిఆర్ పోయి, రేవంత్రెడ్డి వచ్చినా అవినీతి పెరిగిందే తప్ప తగ్గలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. అడుగడుగునా రాష్ట్రం లో అవినీతి తాండవిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులతో సహా అన్ని వర్గాలను రేవంత్రెడ్డి ప్రభుత్వం మో సం చేసిందని ఆరోపించారు. ఎర్రగడ్డ డివిజన్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డికి మద్దతుగా బుధవారం సా యంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కిషన్రెడ్డి గత కెసిఆర్ ప్రభుత్వం, ఇప్పటి రేవంత్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సీఎం పదవిలోకి కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చినా అవినీతి తగ్గలేదని, ఇంకా ఏ ముఖం పెట్టుకుని రేవంత్ ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. మైనార్టీ ఓట్లతో కాంగ్రెస్ ఈ ఎన్నికలో విజ యం సాధించాలని చూస్తోందని విమర్శించారు. పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగితే మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్సు గురించి మాట్లాడి దాట వేత వైఖరిని అవలంభిస్తున్నారని అన్నారు. జాబ్క్యాలెండర్, బంగారం కానుకలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. వెంకటగిరి, యూ సుఫ్ గూడా డివిజన్లలో బిజెపి కార్యకర్తలతో కలి సి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సాయంత్రం బోరబండ డివిజన్, ఎర్రగడ్డ డివిజపలో బిజెపి అభ్యర్థి దీపక్రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 6-11-2025
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 6-11-2025
గురువారం రాశి ఫలాలు (06-11-2025)
మేషం: సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు ఇది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూసంభందిత క్రయవిక్రయాలు లాభిస్తాయి. ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు. వృషభం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం. ఆకస్మిక ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారమున కీలక సమయంలో నిర్ణయాలు తీకోలేరు. మిధునం: ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకుపరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం: బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగిన అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబసభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. సింహం: కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. కన్య: దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. తుల: ఋణదాతలనుండి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబసభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారా, ఉద్యోగాలు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృశ్చికం: చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తికావు. ఆత్మవిశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున ధైర్యముగా నిర్ణయాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ధనస్సు: ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులకు నచ్చే విధంగా ఉండవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటాయి. మకరం: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంభందిత వివాదాలు కొలిక్కి వస్తాయి. శుభవార్తలుఅందుతాయి. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభం: చేపట్టిన పనులు నత్తనడక సాగుతాయి. కత్తులు తగినంత ఆదాయం లభించదు. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారమున భాగస్తులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు కలిగే సూచనలున్నవి. మీనం: అనారోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహయ సహకారాలు అందుతాయి. ధనదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతాన విద్యవిషయాలు పట్ల సంతృప్తికరంగా సాగుతాయి.
రశ్మిక, దీక్షిత్ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్ కాకుండా మరో టైటిల్ ఈ సినిమాకు చెప్పమంటే నీ జీవితమంతా నేనే అని చెప్పాలి. అమ్మాయి, అబ్బాయి తమ జీవిత భాగస్వామి గురించి ఇలాగే అనుకుంటూ అతి సున్నితంగా సాగే ఈ సినిమా చివరకు అతి ఘాటుగా ముగుస్తుంది. ఈ సినిమా చూశాక చాలామంది ఆ రాత్రి నిద్రపోరు. అంతగా ఈ మూవీ వారిని వెంబడిస్తుంది. రశ్మిక ఈ సినిమాలో జీవించేసింది”అని అన్నారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ సినిమానే ప్రపంచంగా జీవించే డైరెక్టర్ రాహుల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని తెలియజేశారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా నా కెరీర్ లో ఒక బ్యూటిఫుల్ జర్నీగా మిగిలిపోతుంది. అల్లు అరవింద్ ఓకే చెప్పకుంటే ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదు. ఈ సినిమాలో రశ్మిక, దీక్షిత్ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దీక్షిత్ శెట్టి, ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి, హేషమ్ అబ్దుల్ వాహబ్ తదితరులు పాల్గొన్నారు.
. నేపాల్లో ఏకీకృత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం. సమన్వయకర్తలుగా ప్రచండ, నేపాల్ ఏకగ్రీవం ఖాట్మండు: నేపాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 10 వామపక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. సీపీఎన్ (మావోయిస్టు సెంటర్), సీపీఎన్ (ఏకీకృత సోషలిస్టు), నేపాల్ సోషలిస్ట్ పార్టీ, సీపీఎన్ (సోషలిస్ట్), జన సమాజ్వాదీ పార్టీ, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్`సోషలిస్ట్), సీపీఎన్ (సమాజ్వాదీ)తో పాటు వామపక్ష పార్టీలన్నీ కలిసి ఐక్య పార్టీ ఏర్పాటునకు అంగీకారం తెలిపాయి. దీనికి సంబంధించి 18 అంశాల ఒప్పందంపై సంతకాలు చేశాయి. […] The post ఒక్కటైన 10 వామపక్షాలు appeared first on Visalaandhra .
సీపీఐ నూతన కార్యదర్శివర్గం ఇదే
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శివర్గాన్ని విజయవాడ దాసరిభవన్లో పి.రామచంద్రయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర సమితి సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్యతోపాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా జేవీ సత్యనారాయణమూర్తి, పి.హరినాథరెడ్డి, కేవీవీ ప్రసాద్, డి.జగదీశ్, జంగాల అజయ్కుమార్, డేగా ప్రభాకర్, తాటిపాక మధు, పి.దుర్గాభవాని, కె.రామాంజనేయులు, శాశ్వత ఆహ్వానితులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ ఎన్నికయ్యారు. The post సీపీఐ నూతన కార్యదర్శివర్గం ఇదే appeared first on Visalaandhra .
అధ్వాన పాలనను అడ్డుకోకపోతే అధోగతే
పన్డీఏ విధానాలపై రామకృష్ణ, వెంకటరెడ్డి . ప్రైవేటీకరణ, అప్పులు, అవినీతితో అరాచకం. తీవ్ర పేదరిక నిర్మూలనలో కేరళ విధానం స్ఫూర్తిదాయకం. బీహార్ పన్నికల్లో పన్డీఏకు పరాభవం తప్పదు. డిసెంబరు 26న ‘చలో ఖమ్మం’. 18న సామాజిక న్యాయం కోసం ఆందోళనలు. ఉద్యమాలు ఉధృతం చేస్తాం: జి.ఈశ్వరయ్య విశాలాంధ్ర- విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరాచక పాలనతో ప్రజల జీవన పరిస్థితులు దయనీయంగా మారిపోయాయని, బలమైన ఉద్యమాలు నిర్మించడం ద్వారా ఈ అధ్వాన పాలనకు చరమగీతం పలకాల్సిన […] The post అధ్వాన పాలనను అడ్డుకోకపోతే అధోగతే appeared first on Visalaandhra .
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు
కీలక దస్త్రాల స్వాధీనంపరారైన డాక్యుమెంట్ రైటర్లు! విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మెరుపు దాడులు నిర్వహించింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు… అనుమానాస్పదంగా ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులతో ఒక్కసారిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ […] The post సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు appeared first on Visalaandhra .
భారత మహిళల జట్టుకు ప్రధాని మోడీ ఆతిథ్యం..
మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని సాధించిన భారత క్రికెట్ జట్టు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసింది. ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీ టీమిండియా సభ్యులకు ఆతిథ్యం ఇచ్చారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి జట్టు సభ్యులు ప్రధానీతో భేటి అయ్యారు. ఈ క్రమంలో క్రికెటర్లు వరల్డ్కప్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని అభినందనలు తెలిపారు. కాగా, 47ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ తొలిసారి భారత జట్టు వన్డే ప్రపంచకప్ సాధించింది. నవీ ముంబై వేదిగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ లో భారత్ 52 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. టీమిండియాపై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. వన్డే ప్రపంచకప్ గెలిచిన 4వ జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఏడు సార్లు, ఇంగ్లండ్ నాలుగు సార్లు, న్యూజిలాండ్ ఒక్కసారి ప్రపంచకప్ ను గెలుచుకున్నాయి.
కూతురిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన తల్లిదండ్రులు
తాము వద్దన్నా వినకుండా ప్రేమ పేరుతో కులాంతర వివాహాం చేసుకున్న కుమార్తెను అత్తవారింటికి వెళ్లకుండా అడ్డుకునేందుకు కన్న తల్లిదండ్రులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా. ఎండపల్లి మండలం, రాజారాంపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా, పాలకురి మండలం, బసంత్నగర్కు చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం, రాజక్కపల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేశ్ గత ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. తమ బిడ్డను ప్రేమించిన రాకేశ్ దళితుడు కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు ఆ పెళ్లికి అడ్డు చెప్పారు. అయితే రాకేశ్నే పెళ్లి చేసుకుని అతడితోనే జీవిస్తానంటూ ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రియాంక జూలై 27న అతనిని కులాంతర వివాహం చేసుకుంది. తాము వద్దన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఆమె తల్లిదండ్రులు వారిద్దరినీ విడదీసేందుకు అప్పటి నుంచి విఫల ప్రయత్నాలు చేశారు.రాకేశ్తోనే తన జీవితమంటూ ప్రియాంక అతడి వైపు గట్టిగా నిలబడటంతో ఏమీ చేయలేకపోయారు. ప్రియాంక గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న ఆమె తల్లి బిడ్డతో ఫోన్లో మాట్లాడటం ప్రారంభించింది. వైద్య పరీక్షల కోసం తన అత్తతో కలిసి బుధవారం జగిత్యాలలోని ఆస్పత్రికి వస్తున్నట్లు తెలుసుకున్న ప్రియాంక తల్లి జగిత్యాల ఆస్పత్రికి చేరుకుంది. ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం తిరిగి రాజక్కపల్లి వెళ్లేందుకు వెల్గటూర్ బస్సు కోసం బస్టాండ్కు చేరుకోగా అప్పటికే బస్సు వెళ్లిపోవడంతో ధర్మారం వెళ్లే బస్సు ఎక్కి రాజారాంపల్లిలో వారు దిగారు. అయితే జగిత్యాల ఆస్పత్రిలో ఉన్నప్పుడే ప్రియాంక తల్లి తన భర్తకు ఫోన్ చేసి బిడ్డను బలవంతంగా తీసుకెళ్లేందుకు పథకం రచించినట్లు తెలుస్తోంది. ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు భర్తకు సమాచారం అందించింది.రాజారాంపల్లిలో దిగగానే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తన బిడ్డ వెంట ఉన్న అత్తను మూత్ర విసర్జనకు వెళదామని చెప్పి వెంట తీసుకెళ్లగా, అప్పటికే ప్రియాంక తండ్రి వెంకటేశ్, అన అక్క భర్త గుంజ కుమార్ కారులో రాజారాంపల్లికి వేచిచూస్తున్నారు. ప్రియాంక రోడ్డుపై ఒంటరిగా ఉండటాన్ని గమనించిన వారు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. తనను కిడ్నాప్ చేస్తున్నారంటూ ప్రియాంక కేకలు వేస్తూ స్థానికుల సహాయంతో వారి బారి నుంచి తప్పించుకుంది. పోలీస్స్టేషన్కు చేరుకుని తన తండ్రి, బావ కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్నారని, చంపుతానని బెదిరించారంటూ వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు, తన భర్త రాకేశ్కు తండ్రితో పాటు బావతో ప్రాణ భయం ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన అమ్మే తనను నమ్మించి మోసం చేసిందని కన్నీళ్ల పర్యంతమైంది.
భారత్ వాంటెడ్ జకీర్ నాయక్కు బంగ్లాదేశ్ షాక్
ఢాకా : ఇస్లాం మత ప్రచారకుడు, భారత్ వాంటెడ్ జాకీర్ నాయక్ కు బంగ్లాదేశ్ గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా ఆయనను తమ దేశంలోకి రానిచ్చేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు జాకీర్ నాయక్కు అనుమతి లభించినట్టు మొదట అక్టోబర్ చివర్లో మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వారం రోజుల్లోనే ఆ పర్యటన పూర్తిగా రద్దు అయినట్టుగా ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. 2016లో ఢాకా హోలీ ఆర్టిజన్కేఫ్పై జరిగిన దాడిలో 29 మంది మరణించగా, జాకీర్ నాయక్ ప్రసంగాలతోనే ఉగ్రవాదులు ప్రేరణ పొంది దాడికి పాల్పడ్డారని బంగ్లాదేశ్.. జాకీర్ నాయక్పై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించింది.
ఎన్డిఏ కోటి వరాల హామీలు బూటకం: మంత్రి పొంగులేటి
రెండు దశాబ్దాల పాటు అవినీతి, అక్రమాలు, అవకాశవాద రాజకీయాలతో బీహార్ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని బీహార్ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులు,రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీహార్ రాష్ట్రం పశ్చిమ చంపారన్ జిల్లా చనుపటియా అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తో కలిసి మంత్రి పొంగులేటి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్డిఏ కూటమికి ఓటమి భయం పట్టుకుందని, అందువల్లనే అలవికాని హామీలను ఇస్తోందని విమర్శించారు. వారి ఎన్నికల ప్రణాళికలో కోటి వరాలు ప్రకటించడి, యువతకు కోటి ఉద్యోగాలు, కోటి మంది లక్పతి దీదీలు హామీలు ఇచ్చారని, అధికారంలో ఉన్న ఈ 20 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారోచ ఎంతమంది దీదీలను లక్పతులుగా చేశారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు వీటిని ఎందుకు అమలు చేయలేదని పొంగులేటి ప్రశ్నించారు. బీహార్ ప్రజలను కొత్త హామీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మహా ఘట్ బంధన్ను గెలిపిస్తే తెలంగాణ మోడల్ పాలనను బీహార్లో అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది, సంక్షేమానికి సమ ప్రాధాన్యతను ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని వివరించారు. రైతులకు రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయిలకే సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన పేదలందరికీ ఇందిర్మమ్మ ఇళ్ల నిర్మాణం వంటి హామీలు అమలు చేస్తున్నామని వివరించారు. బహిరంగ సభలో బీహార్ రాష్ట్ర ఇంచార్జ్ కృష్ణ అల్వర్, మహా ఘట్ బంధన్ అభ్యర్థి అభిషేక్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా.. బిగ్ మూవీ
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం బ్యానర్ పై భారత సినీ రంగంలో మైలు రాయిగా నిలిచే మహత్తరమైన ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఇద్దరు మహానటుల మధ్య ఐదు దశాబ్దాల స్నేహం, సహోదర బంధాన్ని సెలబ్రేట్ చేసుకునే బిగ్ సినిమాటిక్ ఈవెంట్. రజనీకాంత్, కమల్ హాసన్ల అనుబంధం తరతరాల కళాకారులకు, ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తుంది. రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ 44 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకొని రూపొందుతున్న ‘తలైవర్ 173’ సూపర్స్టార్ రజనీకాంత్ మాగ్నటిక్ స్క్రీన్ పవర్, సుందర్ సి డైరెక్షన్ కలిపి ప్రేక్షకులకు విశేషమైన అనుభూతిని అందించబోతుంది. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా పొంగల్ 2027 సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
పంటనష్టం అంచనా నిరంతరం కొనసాగుతోంది : కృష్ణాకలెక్టర్
పంటనష్టం అంచనా నిరంతరం కొనసాగుతోంది : కృష్ణాకలెక్టర్ ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్
నెలలో 7సార్లు పాము కాటు #SnakeBite #Jagtial #Wildlife #Telangana #ViralNews #viralvideo #telugupost
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: బాల్క సుమన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని బిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,చాడ కిషన్ రెడ్డి ,ఆజo అలీ ,ముఖీబ్ చాందా ,ముసిముల్లా ఖాన్ తదితర నేతలతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడా రు. కాంగ్రెస్ అభ్యర్థి స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైనే సిఎం,మంత్రులు దృష్టి పెట్టా రని, కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టాలని విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ కార్య కర్త రియాజ్ ఇళ్ళు కూలగొట్టి దాడి చేశారని విమర్శించారు. నిరుద్యోగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే వారిపై దాడి చేశారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా వున్నారని తెలిపారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఎన్నికల సంఘం ఎట్లా అనుమతి ఇచ్చింది? అని ప్రశ్నించారు. అధికారులు,పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్న దీమాను బాల్క సుమన్ వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు... ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల కమిషన్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎన్నికల కోడ్ ను రేవంత్ రెడ్డి ఉల్లఘించాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ ఆఫీస్లో రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఒక.మతాన్ని ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడారని, మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడితే 3 రోజుల నిషేధం ఉంటుందని, చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీ శ్రీ రవిశంకర్కు “వరల్డ్ లీడర్ ఫర్ పీస్” అవార్డు
బోస్టన్ : ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్కు బోస్టన్ గ్లోబల్ ఫోరం 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు లభించింది. ప్రపంచ శాంతి,సయోధ్య, మానవతానాయకత్వంలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది. బోస్టన్ గ్లోబల్ ఫోరం, ఎఐ వరల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో అమెరికా లోని బోస్టన్లో ఆయనను ఘనంగా సన్మానించారు. వరల్డ్ లీడర్ ఫర్పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు పదో వార్షికోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి గాను గురుదేవ్ ఎంపికయ్యారు. గతంలో ఈ పురస్కారం అందుకున్న వారిలో జపాన్ మాజీ ప్రధాని షింజోఅబె, జర్మనీ అప్పటి ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ,ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బాన్కీ మూన్ తదితరులు ఉన్నారు.
కన్నుల పండువగా గంగా హారతి బాసర, ఆంధ్ర ప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం
'చికిరి చికిరి'.. అదిరిపోయిన 'పెద్ది' ఫస్ట్ సింగిల్ ప్రోమో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ’పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రకు ప్రాణం పోసేందుకు చరణ్ అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇక మేకర్స్ ఫస్ట్ సింగిల్- చికిరి చికిరి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో, దర్శకుడు బుచ్చి బాబు సానా, అకాడమీ అవార్డు విన్నింగ్ కంపోజర్ ఎ.ఆర్. రెహమాన్ పట్ల తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకుంటూ, పాట సందర్భాన్ని వివరిస్తూ ప్రారంభమవుతుంది. కొండల మధ్య నివసించే హీరో, ఒక అమ్మాయిని చూసిన వెంటనే ఉప్పొంగే భావోద్వేగం సంగీతంగా, సంబరంగా వెలువడుతుందని సందర్భాన్ని వివరించారు. హీరో అమ్మాయిని ‘చికిరి’ అని పిలుచుకోవడం ఈ పాటకు ప్రాణం అయింది. రెహమాన్ సృష్టించిన హై వోల్టేజ్ బీట్లకు అనుగుణంగా రామ్ చరణ్ తన సిగ్నేచర్ మాస్ డాన్స్ స్టైల్, ఎనర్జీ తో అదరగొట్టారు. నవంబర్ 7న విడుదల కాబోతున్న ‘చికిరి చికిరి’ లిరికల్ వీడియో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా, చరణ్ ప్రేమికురాలు‘చికిరి’గా కనిపించనుంది. పెద్ది మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
Mega fans waiting for Vaisshnav Tej
Mega hero Vaisshnav Tej made an impressive debut with Uppena. The actor has tested his luck with films like Konda Polam, Ranga Ranga Vaibhavanga and Aadikeshava. His last film Aadikeshava released in 2023 and the actor hasn’t announced any new film for two years. There are speculations that Vaisshnav Tej is quite selective and he […] The post Mega fans waiting for Vaisshnav Tej appeared first on Telugu360 .
మెరసిన ఇంద్రకీలాద్రి ..వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు..
మెరసిన ఇంద్రకీలాద్రి ..వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. విజయవాడ, ఆంధ్రప్రభ : కార్తీక
రిపబ్లికన్ అభ్యర్థుల ఓటమి.. ట్రంప్ విచిత్ర స్పందన
వాషింగ్టన్ : అమెరికా స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడు ట్రంప్కు ఓటర్లు షాక్ ఇచ్చారు. కీలకమైన న్యూయార్క్ మేయర్ పదవితోపాటు అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్లే గెలుపొందారు.ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ట్రంప్ విచిత్రంగా స్పందించారు. ఎన్నికల బ్యాలెట్ పేపర్పై తన ఫోటో లేకపోవడమే కారణంగా చూపించారు. ట్రూత్ వేదికగా స్పందిస్తూ “ఎన్నికల బ్యాలెట్ పేపర్పై ట్రంప్ ఫోటోలేదు. అమెరికాలో షట్డౌన్ కొనసాగుతోంది. ఈ రెండు ముఖ్య కారణాలే అధికార రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోవడానికి ప్రధాన కారణాలు” అని పోల్స్టర్స్ సర్వే అభిప్రాయాన్ని ట్రంప్ తన ట్రూత్ వేదికలో పోస్ట్చేశారు. ఇది వైరల్గా మారింది. కాలిఫోర్నియాలో ఈ ఎన్నికల ఫలితాలపై అసహనం వ్యక్తం చేస్తూ రాజ్యాంగ విరుద్దమైన రీమ్యాపింగ్ పేరుతో భారీ స్కామ్ జరిగిందని, ఓటింగ్లోనూ రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. మెయిల్ ఇన్ ఓట్లను పక్కన బెట్టేయడం తీవ్రమైన అంశంగా ఆరోపించారు. న్యూయార్క్ మేయర్ పదవికి భారత మూలాలున్న డెమోక్రాట్ నేత జొహ్రాన్ మమ్దానీ, న్యూజెర్సీలో డెమోక్రాటిక్ అభ్యర్థిమైకీ షెరిల్ గవర్నర్గా గెలిచారు.
కరాటే పోటీలో గోల్డ్ మెడల్స్ సాధించిన సాబా మొహీంని అభినందించిన కెటిఆర్
మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో 18 కరాటే కాంపిటీషన్లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించిన ఓల్డ్ సిటీ కిషన్బాగ్కు చెందిన12 యేండ్ల సాబా మొహీంని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ అభినందించారు. భవిష్యత్తులో ఒలంపిక్స్ లో ఆడాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సాబా మొహీంకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు. వచ్చే డిసెంబర్ నెలలో దుబాయ్లో జరిగే అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. కెటిఆర్తోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పోర్ట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. కెటిఆర్ని కలవడం గర్వంగా ఉందని, తెలంగాణ తరుపున గోల్డ్ మెడల్ సాధించిన తనను కెటిఆర్ అభినందించడం సంతోషంగా ఉందని కరాటే క్రీడాకారిణి సాబా మొహీం అన్నారు.
‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ను నెలకొల్పిన సింటెక్స్
దేశంలో నీటి నిర్వహణ పరిష్కారాలకు సంబంధించి అత్యంత విశ్వసనీయ సంస్థ అయిన సింటెక్స్, తమ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. బాధ్యతాయుతమైన రీతిలో నీటి వినియోగాన్ని చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసేందుకు 24 గంటల్లో 31,000 మందికి పైగా ప్రజలను సమీకరించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సంపాదించింది. దేశంలోని అత్యంత కీలకమైన సవాళ్లలో ఒకటైన స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని పొందడం మరియు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడం గురించి అవగాహన పెంచడం ఈ దేశవ్యాప్త కార్యక్రమ లక్ష్యం. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలు, భాగస్వాములు, ఉద్యోగులు డిజిటల్ ప్లాట్ఫామ్పై కలిసి ప్రతిజ్ఞ చేశారు. నీరు మరియు ఆరోగ్యాన్ని కాపాడటానికి సమిష్టి నిబద్ధతను పునరుద్ఘాటించారు. వెల్స్పన్ బిఏపిఎల్ లిమిటెడ్, ఎండి & సింటెక్స్ –డైరెక్టర్ యశోవర్ధన్ అగర్వాల్ మాట్లాడుతూ “నీటి నిల్వ ట్యాంకులలో 50 సంవత్సరాల వారసత్వం , నాయకత్వం కలిగిన సింటెక్స్కు ఇది ఒక ప్రతిష్టాత్మక క్షణం. నీటి కాలుష్యం , తగిన రీతిలో నీటిని నిల్వ చేయకపోవటం వంటివి భారతదేశంలో తీవ్రమైన ప్రజారోగ్య ప్రమాదాలను కలిగిస్తూనే ఉన్నాయి, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తికి గణనీయంగా దోహదం చేస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా, నీటి నిల్వ యూనిట్లను క్రమం తప్పకుండా శుభ్రపరచడం ద్వారా తాగునీరు మరియు వాడుకోవడానికి వినియోగించే నీటిని పరిశుభ్రంగా నిల్వ చేయడం, తద్వారా కాలుష్యాన్ని నివారించడం , తమ కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడటం అనే సరళమైనప్పటికీ శక్తివంతమైన నిబద్ధతను కలిగి ఉండటానికి మేము వ్యక్తులను ప్రేరేపిస్తున్నాము. సేకరించిన ప్రతి ప్రతిజ్ఞ మరియు చేరుకునే ప్రతి వ్యక్తి మరింత బాధ్యతాయుతమైన, శుభ్రమైన నీటి స్పృహ కలిగిన భారతదేశం దిశగా వేసే ఒక అడుగు. ఈ రికార్డు సృష్టించిన విజయం ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలుకుతుంది !అని అన్నారు. సురక్షితం కాని నీటి కారణంగా గణనీయమైన ఆరోగ్య భారాన్ని భారతదేశం మోస్తోంది. ఇప్పటికీ, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో దాదాపు 13% మరణాలకు కారణమైన అతిసారం (డయేరియా) మూడవ అత్యంత సాధారణ కారణంగా నిలుస్తోంది . సింటెక్స్ యొక్క కార్యక్రమం, కార్పొరేట్ ప్రయోజనం, ఆవిష్కరణ , ప్రజల శక్తి , నిజమైన మార్పును ఎలా తీసుకురావచ్చో వెలుగులోకి తెస్తుంది. ప్రత్యేక మైక్రోసైట్లో నిర్వహించిన ప్రతిజ్ఞ, ఆసక్తి కలిగిన వారిని లాగిన్ చేసి ధృవీకరించమని ఆహ్వానించింది: “నీరు కలుషితం కాకుండా నిరోధించడానికి మరియు నా కుటుంబ భద్రతను నిర్ధారించడానికి నీటి నిల్వ యూనిట్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారా నేను వాడకానికి మాత్రమే వినియోగించే & త్రాగడానికి వినియోగించే నీటిని పరిశుభ్రమైన స్థితిలో నిల్వ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.. ఐదు దశాబ్దాలకు పైగా, భారతదేశ నీటి నిర్వహణ పరిశ్రమలో ఆవిష్కరణ, విశ్వసనీయత మరియు నాణ్యతకు పర్యాయపదంగా సింటెక్స్ నిలిచింది. నిల్వకు మించి, ఈ కంపెనీ నేడు ట్రాన్స్మిషన్ (పైపులు), నిల్వ (ట్యాంకులు) మరియు శుద్ధి (పారిశుధ్యం)లను కవర్ చేసే సమగ్ర నీటి నిర్వహణ పరిష్కారాలను అందిస్తుంది. సింటెక్స్లోని అన్ని ఉత్పత్తులు 100% ఫుడ్-గ్రేడ్ వర్జిన్ ప్లాస్టిక్తో తయారు చేయబడ్డాయి, ఇవి శుభ్రమైన, సురక్షితమైన నీటిని నిర్ధారిస్తాయి మరియు బీపీఏ , థాలేట్లు మరియు ఫార్మాల్డిహైడ్ వంటి రీసైకిల్ చేసిన ప్లాస్టిక్లలో కనిపించే టాక్సిన్ల నుండి కుటుంబాలను రక్షిస్తాయి.
వచ్చాడు.. రాళ్లు వేశాడు ..పోయాడు –మంత్రి కొల్లు
వచ్చాడు.. రాళ్లు వేశాడు ..పోయాడు – మంత్రి కొల్లు మచిలీపట్నం ప్రతినిధి, ఆంధ్రప్రభ
కెసిఆర్ కుటుంబమే రౌడీ కుటుంబం:మంత్రి జూపల్లి
ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కోనసాగిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కోనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మంత్రి జూపల్లి కృష్ణారావు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించిన జూపల్లి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్ లో బోరబండలోని సాయిబాబా నగర్లో బుధవారం నవీన్ యాదవ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వృద్దులను, మహిళలను అప్యాయంగా పలుకరిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు. ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. కేసీఆర్ కుటుంబమే రౌడీ కుటుంబం రాష్ట్ర ఖజానాను లూటీ చేసిన కేసీఆర్ కుటుంబమే రౌడీ కుటుంబమని మంత్రి జూపల్లి మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే పునీతులా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉంటే రౌడీ షీటర్లు అంటారా అని నిలదీశారు. జూబ్లీహిల్స్లో గెలుస్తామని బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. కేటీఆర్ కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదని అన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని బాకీ కార్డు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ద్వజమెత్తారు. దోచుకున్న డబ్బుతో విచ్చలవిడిగా ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని అన్నారు. ప్రజా వ్యతిరేఖ బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా నిలదీయాలని కోరారు. బీఆర్ఎస్ను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.
మెక్సికో అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు..
మెక్సికోసిటీ : మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్కు బహిరంగంగా నడిరోడ్డుపైనే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. హిస్టారిక్ డౌన్టౌన్లో మంగళవారం ఆమె ప్రజలతో బహిరంగంగా మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె వెనుక నుంచి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా, ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యకరంగా తాకడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనకు ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని అతడిని పక్కకు నెట్టివేశారు. అయినప్పటికీ అతడు క్లాడియాను అసభ్యంగా తాకుతుండడంతో ఆమె ఇబ్బంది పడ్డారు. అతడు చేతిని పక్కకు నెట్టేశారు. ఈ సంఘటన దృశాలు వైరల్ అవుతున్నాయి. దేశాధ్యక్షురాలికే భద్రత లేదా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి అధ్యక్షురాలి వద్దకు వచ్చేవరకు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో నిందితుడు మద్యం మత్తులోఉన్నాడని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అధ్యక్ష కార్యాలయం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
హిందూపురంలో వైసీపీ దూకుడు హిందూపురం, ఆంధ్రప్రభ : వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన కోటి
అందరం సమష్టిగా కృషి చేద్దాం : ఏపీ జెన్ కో ఎండీ
అందరం సమష్టిగా కృషి చేద్దాం : ఏపీ జెన్ కో ఎండీ ఇబ్రహీంపట్నం
వైభవంగా తులాభారం… మక్తల్, ఆంధ్రప్రభ : కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు
మహారాష్ట్రలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దైవదర్శనానికి కారులో వెళ్లి, మొక్కులు తీర్చుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన వారిని మృత్యువు రూపంలో వచ్చిన బొలెరో వాహనం షిఫ్ట్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హలిఖేడ్ టోల్గేట్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అప్పటికే ముగ్గురు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ ప్రాంతవాసులు. మృతుల్లో నారాయణఖేడ్ మండల పరిధిలోని జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40) ఉన్నారు. మరొకరు మనూర్ మండలంలోని ఎల్గోయి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న హలిఖేడ్ పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిరాదర్ ప్రతాప్ అనే వ్యక్తిని బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారంతా కుటుంబ సభ్యులు, బంధువులే కావడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రమాద సంఘటన తెలుసుకున్న ఖేడ్ ఎంఎల్ఎ సోదరుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీదర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బిరాదర్ ప్రతాప్ను పరామర్శించారు.
ముగ్గురి ప్రాణాల మీదికి తెచ్చిన వివాహేతర సంబంధం
నాగర్కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో ఘోర ఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని సంజాపూర్లో వివాహేతర సంబంధం ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గామానికి చెందిన గుర్రం మల్లేష్కు వెల్దండ మండలం, చెరుకూరు గ్రామానికి చెందిన శిరీషతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె ఉంది. మల్లేష్ మున్సిపాలిటీ పరిధిలోని సిలార్పల్లికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు . ఈ విషయమై మల్లేష్, అతని భార్య శిరీషకు గతంలో గొడవలు జరిగాయి. ఇరు కుటుంబాల పెద్దమనుషులు గతంలో భార్యాభర్తలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ మల్లేష్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ భార్య శిరీషను, కుమార్తెను పట్టించుకోవడం మానేశాడు.ఈ క్రమంలో శిరీష బంధువులు చెరుకూరు గ్రామానికి చెందిన శివ ప్రశాంతు, రామకృష్ణ, వెంకటేష్, సుభాష్, నరేష్ బుధవారం మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వచ్చారు. ఇరువురి మధ్య వాగ్వాదం పెరగడంతో వారు మల్లేష్ తండ్రి జంగయ్య, తల్లి అలివేల, తమ్ముడు పరమేష్పై విచక్షణారహితంగా ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘర్షణలో జంగయ్య అలివేల, పరమేష్ పరిస్థితి విషమంగా మారింది. వీరిలో జంగయ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. సిఐ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హాస్టల్ బాలికలపై పైశాచికం ఫలితం
హాస్టల్ బాలికలపై పైశాచికం ఫలితం తిరుపతి క్రైమ్ , ఆంధ్రప్రభ : మైనర్
తడిచిన ధాన్యం కొంటాం.. సివిల్ సప్లై ఎండి హామీ
తడిచిన ధాన్యం కొంటాం.. సివిల్ సప్లై ఎండి హామీ విజయవాడ, ఆంధ్రప్రభ :
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసిన బండి సంజయ్
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసిన బండి సంజయ్ ఉమ్మడి
కొనసాగుతున్న ఇంటింటి ప్రచారం..
కొనసాగుతున్న ఇంటింటి ప్రచారం.. హైదరాబాద్, ఆంధ్రప్రభ : టీపీసీసీ ఆదేశాల మేరకు కొమరం
వైభవంగా గోదావరి మహా హారతి మంథని, ఆంధ్రప్రభ : మంథని గోదావరి మహా
పంట నష్టపరిహారం ఇవ్వాల్సిందే మోతె, ఆంధ్రప్రభ : రైతులు పండించిన పంటలకు నష్టపరిహారం
Rajinikanth, Kamal Haasan, A Historical Collaboration
Superstar Rajinikanth and Universal Hero Kamal Haasam are celebrated for their legendary careers. Although they shared screen space together in many super hit movies during the initial days of their career, it’s been long since they didn’t work together again. In an official announcement, Kamal Haasan confirmed that his home banner, Raaj Kamal Films International […] The post Rajinikanth, Kamal Haasan, A Historical Collaboration appeared first on Telugu360 .
పూజ గదిలో కర్టెన్ కు దీపం అంటుకుని…
పూజ గదిలో కర్టెన్ కు దీపం అంటుకుని… ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా )
ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు.. బిచ్కుంద, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా ..రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య

27 C