All Deals Closed for NBK’s Akhanda 2
Telugu360 was the first to break the news that Jio Plus Hotstar is the frontrunner to acquire the digital rights of Balakrishna’s upcoming movie Akhanda 2. The digital platform was way ahead when compared to Netflix and Amazon. The digital deal of Akhanda 2 has been closed for a record price of Rs 85 crores […] The post All Deals Closed for NBK’s Akhanda 2 appeared first on Telugu360 .
Who Targeted Bunny Vas and Mithra Mandali?
It is a Long Journey for Bunny Vas in Telugu cinema. Starting his career as an associate for Allu Arjun, Bunny Vas emerged as a Key Member in Geetha Arts after Allu Aravind. He has been a part of several successful films till Little Hearts which released last month. Bunny Vas is always cautious and […] The post Who Targeted Bunny Vas and Mithra Mandali? appeared first on Telugu360 .
Srisailam : శ్రీశైలం అభివృద్ధికి భారీ ప్రణాళిక.. మోదీ ముందుంచనున్న ప్రతిపాదనలివే
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 14-10-2025
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 14-10-2025
రాయుడితో బలవంతంగా చెప్పించి... హత్య చేశారు: సుధీర్ రెడ్డి
అమరావతి: డ్రైవర్ రాయుడు వీడియోపై టిడిపి ఎంఎల్ఎ బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. రాయుడు వీడియో ఎఐ, మార్ఫుడ్ వీడియో అని తెలిపారు. రాయుడుతో బలవంతంగా మాట్లాడించి అనంతరం అతడిని చంపి ఉంటారని ఆరోపణలు చేశారు. శ్రీకాళహస్తి అభివృద్ధి కోసం తాను పని చేస్తున్నానని, తనపై బురద జల్లడానికి ఈ వీడియో విడుల చేశారని మండిపడ్డారు. డిపాజిట్లు రాని వారితో తనకు పని ఏంటని ప్రశ్నించారు. ఆమె తనకు రాజకీయ ప్రత్యర్థి కాదు అని, డిపాజిట్ కూడా రాని వినుత గురించి తాను ఎందుకు లక్షలు ఖర్చు చేస్తానని ప్రశ్నించారు. వినుత దంపతులు క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నారని, వాళ్ల డ్రైవర్ గురించి తనకు ఎలా తెలుస్తుందని బొజ్జల సుధీర్ రెడ్డి అడిగారు. వినుతకు బెయిల్ వచ్చిన తరువాత వీడియో విడుదల చేయడంలో అనుమానం ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో తన నియోజకవర్గంలో తన కోసం ఆమె ఎప్పుడు పని చేయలేదన్నారు. ఓటు వేయాలని వనిత ఇంట్లోకి తమ కుటుంబ సభ్యులు వెళ్తే రానివ్వలేదన్నారు. రాయుడి వీడియోపై దర్యాప్తు చేయాలని ఎంఎల్ఎ సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. టిడిపి ఎంఎల్ఎ సుధీర్ రెడ్డి బలవంతం చేయడంతో వినుత దంపతులకు సంబంధించిన వీడియోలు తీశానని రాయుడు వీడియోలో వెల్లడించిన విషయం తెలిసిందే. రాయుడు హత్య కేసులో దంపతులు అరెస్టు కావడంతో పాటు ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు.
Andhra Pradesh : నేడు గూగుల్ తో ఏపీ కీలక ఒప్పందం
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్ దిగ్గజం గూగుల్తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకోనుంది
కరీంనగర్ లో బాలికపై అత్యాచారం.... సోషల్ మీడియాలో వీడియో వైరల్
కొత్తపల్లి: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.
సంక్షేమ హాస్టళ్లలో ముఖ గుర్తింపు
విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఫేషియల్ రికగైజేషన్ తప్పనిసరి వైద్యకళాశాలలతో హాస్టళ్ల అనుసంధానం విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ఆహార నాణ్యత పరీక్షకు ప్రత్యేక యాప్ సకాలంలో యూనిఫామ్లు, పుస్తకాల పంపిణీ ఖర్చులు, బకాయిలపై యాక్షన్ ప్లాన్ సంక్షేమ వసతి గృహాల సమీక్షలో సిఎం రేవంత్రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: బిసి, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) నుంచి రూ.60 కోట్లు కేటాయించింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు , తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వాటిని వినియోగించుకునే వెసులుబాటును కలిగించింది. హాస్టళ్లకు కేటాయించిన నిధుల చెక్కులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందజేశారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ఐసిసిసిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధన , బోధనేతర సిబ్బంది ముఖ గుర్తింపుకు ఏర్పాట్లు చేయాలని సిఎం ఆదేశించారు. పూర్తి స్థాయి డేటా జవాబుదారీతనం ఉండాలని ఆయన అన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు యాప్ను ఉపయోగించాలని సిఎం సూచించారు. విద్యార్థులకు విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన నాణ్యమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని దాంతో వారికి లభించే క్యాలరీలను తెలుసుకోవాలని సిఎం ఆదేశించారు. యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో... హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్బోర్డులో అప్లోడ్ చేయాలని సిఎం ఆదేశించారు. హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలని సిఎం సూచించారు. హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని సిఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని సిఎం సూచించారు. ఖర్చులు, బకాయిల చెల్లింపునకు అవసరమైన మొత్తానికి బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లకు స్కాలర్షిప్లు సిబ్బంది జీతాలు, డైట్ఛార్జీలు, నిర్మాణ ఖర్చులు, ఇతర ఖర్చులు, బకాయిల చెల్లింపు, హాస్టళ్ల నిర్వహణకు అయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపుకు అవసరమైన మొత్తానికి సంబంధించి కార్యాచరణను రూపొందించి సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్లను ఆదేశించారు. హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 24 గంటలూ ఆన్లైన్లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్లైన్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎడ్ టెక్ను ఉపయోగించుకోవాలని సిఎం సూచించారు. హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని, ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. వాటికి అవసరమైన యాప్లను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షకు ముందు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ హాస్టళ్లలోని పరిస్థితులపై ప్రజేంటేషన్ ఇచ్చారు. సమీక్షలో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల శాఖల అధికారులు జ్యోతి బుద్ధప్రకాష్ జ్యోతి , బి. షఫియుల్లా, అనితా రామచంద్రన్, క్షితిజ, నిర్మల క్రాంతి వెస్లీ, కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
కాంప్బెల్, హోప్ హీరోచిత సెంచరీలు.. గెలుపు బాటలో టీమిండియా
భారత్ లక్ష్యం 121 రన్స్, ప్రస్తుతం 63/1 ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకున్న విండీస్ న్యూఢిల్లీ: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో, చివరి టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయానికి 58 పరుగుల దూరంలో నిలిచింది. 173/2 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాలుగో రోజు తిరిగి బ్యాటింగ్ను చేపట్టిన విండీస్ 390 పరుగులు చేసి ఆలౌటైంది. తర్వాత 121 పరుగుల లక్షంతో బ్యాటింగ్ను చేపట్టిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్తో కలిసి మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ జట్టును లక్షం వైపు నడిపిస్తున్నాడు. సోమవారం ఆట నిలిపి వేసే సమయానికి రాహుల్ (25), సాయి సుదర్శన్ (30) పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టినవిండీస్ 248 పరుగులకే ఆలౌటై ఫాల్ ఆన్ ఆడింది. హోప్, కాంప్బెల్ పోరాటం.. సోమవారం తిరిగి బ్యాటింగ్ను ప్రారంభిచిన విండీస్కు ఓవర్నైట్ బ్యాటర్లు కాంప్బెల్, షాయ్ హోప్లు అండగా నిలిచారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇటు కాంప్బెల్ అటు హోప్లు అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఒకవైపు వికెట్ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ముందుకు సాగారు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కాంప్బెల్ లంచ్ బ్రేక్కు ముందే సెంచరీని సాధించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కాంప్బెల్ 199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఇదే సమయంలో హోప్తో కలిసి మూడో వికెట్కు కీలకమైన 177 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లంచ్ తర్వాత హోప్ కూడా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అద్భుత ఇన్నింగ్స్తో అలరించిన హోప్ 214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (40) కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇక చివర్లో జస్టిన్ గ్రీవ్స్, జైడెన్ సీల్స్ అసాధారణ పోరాట పటిమను కనబరిచారు. ఇద్దరు కలిసి చివరి వికెట్కు 79 పరుగులు జోడించడం విశేషం. కీలక ఇన్నింగ్స్ ఆడిన గ్రీవ్స్ 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సీల్స్ 67 బంతుల్లో 32 పరుగులు చేసి చివరి వికెట్గా పెలివిలియన్ చేరాడు. దీంతో విండీస్ ఇన్నింగ్స్ 118.5 ఓవర్లలో 390 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, బుమ్రా మూడేసి వికెట్లను పడగొట్టారు. సిరాజ్కు రెండు వికెట్లు దక్కాయి.
20మంది ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్ ఇరుపక్షాలలో పండుగ వాతావరణం అయినవారిని చేరి ఆనందడోలికల్లో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇజ్రాయెల్ పార్లమెంట్ నీరాజనం ప్రపంచానికి మరింతమంది ట్రంప్లు కావాలని ఆకాంక్ష వచ్చే ఏడాది నోబెల్కు ప్రతిపాదిస్తామని స్పష్టీకరణ ట్రంప్కు బంగారు పావురాన్ని ప్రదానం చేసిన ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ఇజ్రాయెల్ చట్టసభల్లో ట్రంప్ ప్రసంగం ధాంక్యూ బీబీ..గొప్పపని చేశావ్: ట్రంప్ ప్రశంస ట్రంప్ నిజాయితీ ప్రయత్నాలకు మోడీ మద్దతు గాజా సిటీ: దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది. ఇజ్రాయెల్హమాస్ మధ్య కుదిరిన కొత్త కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ సోమవారం ఇజ్రాయెల్ సజీవ బందీలు 20 మందిని దశల వారీగా విడిచిపెట్టింది. మొదటి దశలో సోమవారం ఉదయం ఏడుగురిని, రెండోదశలో మిగతా 13 మందిని విడిచిపెట్టి రెడ్క్రాస్ సొసైటీకి అప్పగించింది. వారిని తీసుకుని రెడ్క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్కు బయలుదేరింది. ఇక హమాస్ వద్ద ఉన్న 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు కూడా త్వ రలోనే అప్పగించనుంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 2 ల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకరించింది. ఈలోగా కా ల్పుల విరమణకు మధ్యవర్తిగా వ్యవహరించిన అ మెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ ఈజిప్టులో గాజా శాంతి సదస్సులో పాల్గొనేందుకు ముందు గా ఇజ్రాయెల్కు విచ్చేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఆయన ప్రసంగించారు. కాల్పుల విరమణను స్వాగతిస్తూ “ గాజా యుద్ధం ముగిసింది. ఈరోజు చాలా గొప్పదినం.ఇది శుభారంభం ” అని ట్రంప్ అభివర్ణించారు. శాంతి ప్రణాళిక ప్రకారం హమాస్ నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. బందీల కుటుంబీకులను కూడా ట్రంప్ కలుసుకుంటారు. రెండేళ్ల తరువాత తమ ప్రియతములను చూడగానే ఆయా కుటుంబాలు భావోద్వేగానికి గురయ్యాయి. హమాస్ నుంచి విడుదలైన ఏడుగురి బందీలను ఐడీఎఫ్, ఐఎస్ఎ అధికారిక బృందాల సాయంగా ఇజ్రాయెల్కు తీసుకువస్తున్నట్టు పేర్కొంది. వారు చేరుకోగానే వైద్యపరీక్షలు జరుగుతాయి. మరికొంతమంది బందీలను ఈరోజు తరువాత రెడ్క్రాస్కు బదిలీ చేయడమవుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ఇజ్రాయెల్ నగరాల్లో ఆనందం వెల్లువ బందీల పరిస్థితులు ఎలా ఉన్నాయో వెంటనే లభ్యం కాకపోయినా, వారు విడుదలయ్యారన్న వార్తకు స్వదేశంలో అనేక చోట్ల ఆనందాతిశయా లు వెలువడ్డాయి. నగరాలు, పట్టణాల్లో జనం గుమికూడి విడుదల సంఘటనల లైవ్ బ్రాడ్కాస్ట్లను సందర్శిస్తుండటం కనిపించింది. టెల్ అవీవ్లో భారీ ఎత్తున బహిరంగంగా తెరలపై దృశ్యా లు ప్రదర్శించారు. చాలా మంది ఇజ్రాయెల్ పతాకాలను ఎగురవేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దంపతుల స్వాగతం బందీలు తిరిగి స్వదేశానికి తరలివస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని నెతన్యాహు, ఆయన భార్య సారా లిఖితపూర్వకమైన స్వాగతం పలికారు. తాము రాసిన నోట్లో “ఇజ్రాయెల్ ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. మీకో సం నిరీక్షిస్తున్నాం. మిమ్మల్ని ఆనందంగా హత్తుకుంటాం” అని పేర్కొన్నారు. తిరిగివచ్చిన బందీలు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన రిసెప్షన్ కిట్ అందుతుందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆ కిట్లో దుస్తులు, వ్యక్తిగత సామగ్రి, లాప్టాప్, ఫోన్, టాబ్లెట్ ఉంటాయి. బందీలు వచ్చే దారి పొడుగునా ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్వాగత పతాకాలను నెలకొల్పారు. థాంక్యూ బీబీ.. గొప్పపని చేశావ్: ఇజ్రాయెల్ చట్టసభలో ట్రంప్ ప్రసంగం బందీలను హమాస్ విడిచిపెట్టిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ చట్టసభలో మాట్లాడుతూ.. థాంక్యూ వెరీమచ్ బీబీ, గొప్పపని చేశావని ప్రధాని బెంజమిన్ నెతన్యాహును పొగిడారు. “మధ్య ప్రాచ్యంలో సరికొ త్త చరిత్ర ఉదయిస్తోంది. ఈ పవిత్ర భూమిలో శాంతి వీచికలు వీస్తుండగా ఆకాశం నిర్మలంగా మారింది. తుపాకులు మూగపోయాయి. ప్రస్తు తం అమెరికాలో ఉన్న స్వర్ణయుగం ఇజ్రాయెల్ లో ప్రారంభమైంది. బందీలు తిరిగి వచ్చారు. ఈ మాట చెప్పడం ఎంతో బాగుంది. కాల్పుల విరమ ణ ఒప్పందానికి సంబంధించి మేం సమయాన్ని వృథా చేస్తున్నామని చాలామంది అన్నారు. కానీ మేం సాధించాం” అని ట్రంప్ మాట్లాడారు. హో లోకాస్ట్ (రెండో ప్రపంచ యుద్ధంలో యూదులపై నాజీలు సాగించిన నరమేథాన్ని హోలోకాస్ట్ అం టారు) తర్వాత యూదులపై జరిగిన అత్యంత దారుణంగా అక్టోబర్ 7 దాడులను వ్యాఖ్యానించారు. అమెరికా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంద ని బాధిత కుటుంబాలను ఉద్దేశించి పేర్కొన్నారు. అలాగే మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న స్టీవ్ విట్కాఫ్, తన అల్లుడు, సలహాదారులు జేర్డ్ కున్నర్ను ఈ సందర్భంగా కొనియాడారు. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ట్రంప్ మాట్లాడుతోన్న సమయం లో కొందరు ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. మారణహోమం అంటూ నినాదాలు చేశారు. దాంతో వారిని చట్టసభ నుంచి బయటకు పంపివేశారు. ఈ నిరసనలపై ట్రంప్నకు స్పీకర్ క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారమంతా గమనించిన ట్రంప్ , సమర్థవంతంగా పనిచేశారని చమత్కరించారు. దాంతో సభ్యులంతా చిరునవ్వులు చిందించారు. ట్రంప్ అని నినాదాలు చేశారు.
సీతక్క, సురేఖలతో విభేదాలు లేవు వారిరువురు సమ్మక్క, సారక్కలా పని చేస్తున్నారు నాపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారంటే నమ్మశక్యంగా లేదు రూ.70కోట్ల కాంట్రాక్టు కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు నేనేంటో అందరికీ తెలుసు మంతి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: అటవీ శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో త నకు ఎలాంటి వివాదాలు లేవని వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ప ష్టం చేశారు. సోమవారం ములుగు జిల్లా, ఎస్ ఎస్ తా డ్వాయి మండలం, మేడారంలో సమ్మక్క, సారలమ్మ ఆల య అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతర వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల తనపై వచ్చిన విమర్శలపై మంత్రి స్పందిస్తూ..తానేంటే అందరికీ తెలుసునని, కేవలం రూ.70 కోట్ల విలువైన కాంట్రాక్టు కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తనపై తమ సహచర మంత్రులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారంటే నమ్మశక్యంగా లేదని వ్యా ఖ్యానించారు. అయినా..నాపై ఫిర్యాదు చేయడానికి ఏ ముందని ప్రశ్నించారు. అధిష్టానానికి ఎవరూ ఫిర్యాదు చే సే ఛాన్సే లేదన్నారు. తాను కూడా అలా జరుగుతుందని న మ్మడం లేదని అన్నారు. సిఎం రేవంత్రెడ్డి ఆలోచనల మేర కు అభివృద్ది పనులు చేస్తున్నామని అన్నారు. సమ్మక్క, సారలమ్మల వంటి సీతక్క, సురేఖ అక్కలతో తదుపరి మేడారం సమీక్ష సమావేశంలో పాల్గొంటానన్నారు. తన సహచర మహిళా మంత్రులు సీతక్క, సురేఖ ఇద్దరూ సమ్మక్క, సారక్కలా పనిచేస్తున్నారు అని అన్నారు. తదుపరి మేడారం సమీక్ష సమావేశంలో మంత్రి కొండా సురేఖతో పాల్గొంటానని అన్నారు. 2024లో జరిగిన జాతరకు విచ్చేసిన భక్తుల సంఖ్య కంటే 2026 జనవరిలో జరిగే మహా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారి అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్క, సారలమ్మ మేడారం మహా జాతర పునరుద్ధరణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణను జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఇన్ఛార్జి మంత్రికి అమ్మవార్ల పై ఉన్న భక్తితో ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సజావుగా అమ్మవార్ల దర్శనం జరగాలని మేడారం సమ్మక్క, సారమ్మ జాతర ప్రాముఖ్యత ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందాలనే ఉద్దేశంతో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి పొంగులేటికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓట్ల చోరీ
20 వేల దొంగ ఓట్లను నమోదు ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలి దొంగ ఓట్ల పైన విచారణ జరగాలి కాంగ్రెస్తో కుమ్మక్కైన అధికారులపైన చర్యలు తీసుకోవాలి జూబ్లీహిల్స్లో సామ, ధాన, భేద దండోపాయాలతో కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రయత్నం చేస్తుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తూ సిఇఒ సుదర్శన్రెడ్డికి కెటిఆర్ ఫిర్యాదు మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు పెద్ద కుట్రకు తెరలేపారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆక్షేపించారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటే.. ఇక్కడ చోరీ ఓట్లతో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తూ సోమవారం బిఆర్కె భవన్లో బిఆర్ఎస్ నేతలతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డికి కెటిఆర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పలు అంశాలని కెటిఆర్ ప్రస్తావించారు. అనంతరం పార్టీ నేతలు వేముల ప్రశాంత్రెడ్డి, సుధీర్రెడ్డి, ముఠా గోపాల్, పాడి కౌశిక్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, దాసోజు శ్రవణ్, క్రిశాంక్లతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 20 వేల దొంగ ఓట్లని సృష్టించారని పేర్కొన్నారు. ఈ అంశంపై ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కొవ్వూరి కార్తీక్ పేరుతో మూడు చోట్ల ఓట్లు ఉన్నాయని.. దీపక్ శర్మ అనే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని అన్నారు. 400 ఎన్నికల బూత్లలో కనీసం 50 దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ నమోదు చేసిందని కెటిఆర్ ఆరోపించారు. ఇలా కనీసం 20వేల దొంగ ఓట్లను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నమోదు చేయించిందని అన్నారు. ఒక్కొక్క వ్యక్తికి మూడు ఎన్నికల గుర్తింపు కార్డులు ఉన్నాయని.. ఒక్కటే అడ్రస్తో మూడు ఓట్లు.. నాలుగు ఓట్లు ఒక్కొక్కరు నమోదు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్కొక్క వ్యక్తికి రెండు మూడు ఓటర్ ఐడీలు ఉన్నాయని.. ఒకటే వ్యక్తికి చిన్న చిన్న అక్షరాలను మార్చి అనేక సార్లు ఓట్ల నమోదు చేయించారని ఆరోపించారు. తాము లేవనెత్తుతున్న ప్రతి అంశం ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నదే అని అన్నారు. ఇప్పటివరకు తమ దృష్టికి వచ్చినవి 20 వేల డూప్లికేట్, దొంగ ఓట్లు ఉన్నాయని.. ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఇంట్లో 150 నుంచి 200 ఓట్ల నమోదు జరిగిందని అన్నారు. ఆయా ఇళ్లకు సంబంధించి తాము వెళ్లి చూస్తే అక్కడ అవన్నీ బోగస్ ఓట్లు అని తేలిందని చెప్పారు. తమ పార్టీ నేతలు ఒక ఇంటికి వెళ్లి అడిగితే 23 ఓట్లు ఉన్న ఆ ఇంటి యజమాని ఆ ఓటర్లలో ఒకటి కూడా తమ వాళ్లు లేరని చెప్పారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఓట్లు ఉన్నవాళ్లకి ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ల ఓట్లను తొలగించకుండా జూబ్లీహిల్స్లో రాయించారన్నారు. ఈ అంశంలో సరైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కలిశామని తెలిపారు. దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా తమకు అనుమానం ఉందన్నారు. కుమ్మక్కైన అధికారులపైన చర్యలు తీసుకోవాలి కింది స్థాయి అధికారులు కాంగ్రెస్తో కుమ్మక్కై దొంగ ఓట్లను సృష్టించారని కెటిఆర్ మండిపడ్డారు. దొంగ ఓట్ల పైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్తో కుమ్మక్కైన కింది స్థాయి అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేలోపు 20 వేల దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగాలని కోరారు. జూబ్లీహిల్స్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలని అన్ని అడ్డదారుల్లో ప్రయత్నం చేస్తుందని కెటిఆర్ ఆరోపించారు. సామ, ధాన, భేద దండోపాయాలతో ప్రయత్నం చేస్తుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ నేతలు ప్రలోభపెడుతున్నారని, ఓటర్లను భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. మొత్తం రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిధులు లేవని సొంత పార్టీ ఎంఎల్ఎనే ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయగా, మరో ఎంఎల్ఎ వార్త పత్రికలో వ్యాసం రాశారని ఎద్దేవా చేశారు. అయితే జూబ్లీహిల్స్ గెలిస్తే మాత్రం అభివృద్ధి చేస్తామని మరోసారి ప్రజలను మోసం చేయడానికి కాగ్రెస్ ప్రయత్నం చేస్తుందని కెటిఆర్ మండిపడ్డారు.
నూతన మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్
జీఓ నెంబర్ 93 ని కొట్టేయాలని కోరిన పిటిషనర్ కమిషనర్కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఎక్సైజ్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో భాగంగా జారీ చేసిన జీఓ నెంబర్ 93 ను కొట్టివేయాలంటూ అనిల్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నూతన మద్యం పాలసీలో ఒక్కో దరఖాస్తు రుసుము మూడు లక్షలుగా నిర్ణయించటం పట్ల పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దరఖాస్తు దారులకు షాపు దక్కకపోతే సదరు రుసుము అబ్కారీ శాఖకు వెళుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లాటరీలో షాపు దక్కకపోతే మూడు లక్షల దరఖాస్తు రుసుము తిరిగి ఇచ్చే విధంగా ఆబ్కారీ శాఖను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ క్రమంలో పిటిషనర్ వాదలు విన్న ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ముద్దాయిన ధాన్యపు రాశులు దెబ్బతిన్న పత్తి.. పలుచోట్ల నేలకొరిగిన వరిపైళ్లు మణుగూర్లో సింగరేణి ఉపరితల గనుల్లోకి చేరిన వరదనీరు.. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం పొంగిపొర్లిన వాగులు, వంకలు యాదాద్రి నక్కలగూడెంలో 5వేల కోళ్ల మృత్యువాత మరో మూడురోజులు వర్షాలు మన తెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల నిష్క్రమణ నేపథ్యంలో ఏర్పడుతున్న స్వల్ప అలప్పీడనాలతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాష్ట్రంలో భద్రాద్రి కోత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మణుగూరు సురక్ష బస్టాండ్ ఏరియా చెరువును తలపించేలా మారింది. సింగరేణి గనికి సంబంధించిన వరద నీరు రోడ్లపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కోడిపుంజుల వాగు ఉదృతంగా ప్రవహించడంతో పరివాహక ప్రాంతాల్లోకి నీరు చేరడంతో నివాసితులు భయభ్రాంతులకు గురై ఆగ్రహంతో కోడిపుంజుల వాగుపై ఆందోళన నిర్వహించారు. మణుగూరు మండలంలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో మండలంలోని పలు గ్రామాలకు తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి ఉపరితల గనిలోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కరక గూడెం మండలంలో భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.అనంతరం కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులకు పద్మాపురం ఒర్రె వద్ద భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో విధులకు హాజరు కాలేక సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రేగళ్ల గ్రామంలోని ఓ రైతుకు చెందిన సుమారు మూడు ఎకరాల వరి పంట భయంకరమైన వీదురు గాలులతో కూడిన భారీ వర్షానికి నేల పాలయింది. ఖమ్మం జిల్లాల్లో ఏన్కూర్లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలో పత్తి నేలరాలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. భారీ వర్షానికి వలిగొండ, ఆత్మకూరు మండలాల్లో వరద నీరు డ్రైనేజీలో జామ్ కాడంతో వరద నీరు ఇండ్లలోకి చేరుకుంది. దీంతో ఇంట్లో ఉన్న నిత్యావసరాలు, బట్టలు తడిసి పోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వలిగొండలో సుమారు రెండు వేల క్వింటాళ్ల ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులలో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండంలోని లింగరాజుపల్లి, కూరెళ్ళ గ్రామాలలో కల్లాల్లో ఆరోబోసిన, కుప్పల్లో ఉన్న ధాన్యం తడిచిపోయింది. కూరెళ్ళ గ్రామంలోని వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగరాజుపల్లి గ్రామంలో 9 మంది రైతులకు సంబంధించిన వరి ధాన్యం వరద నీటితో కొట్టుకు పోయింది. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోగా, పలుచోట్ల కొట్టుకుపోయింది. మోత్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిపోయి నీటిలో కొట్టుకుపోయింది. మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచి విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాలడుగు, మోత్కూర్, బుజిలాపురంలో చెరువులు అలుగుపోస్తున్నాయి. గుండాల మండల పరిధిలోని పెద్దపడిశాల గ్రామంలో తోట సత్తమ్మ అనే మహిళ ఇల్లు కూలిపోయింది. నల్గొండ జిల్లా నాంపల్లిలో భారీ వర్షానికి పులుసు వాగు భారీ వరద ప్రవాహంతో ప్రవహిస్తూ పసునూరు పెద్ద చెరువు చిన్న చెరువులోకి ప్రవహిస్తుంది. దీంతో నాంపల్లి కొండమల్లేపల్లి మధ్య ముష్టిపల్లి గ్రామం వద్ద చెరువు కింద ప్రధాన ఆర్ అండ్ బి రోడ్డు పై బ్రిడ్జి పై నుండి భారీ వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లా చెన్నారావు పేటలో మొక్కజొన్న తడిపోయింది. మూడు రోజులు వర్ష సూచన రాష్ట్రంలో మూడు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు
స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు పోక్సో కేసుతో పురుగుల మందు తాగి టీచర్ ఆత్మహత్య మన తెలంగాణ/కొణిజర్ల: మైనార్టీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడిపై అదే పాఠశాలలో పనిచేస్తున్న జువాలజీ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, అమ్మపాలెం మైనార్టీ పాఠశాలలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ సూరజ్ తెలిపిన వివరాల ప్రకారం... మైనార్టీ పాఠశాలలో జువాలజీ టీచర్గా పనిచేస్తున్న అరిగెల ప్రభాకర్ 8వ తరగతి మైనర్ బాలుడిని లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆ విద్యార్థి దసరా సెలవుల కోసం ఇంటికి వెళ్లి మళ్లీ హాస్టల్కు వచ్చేందుకు నిరాకరించాడు. తల్లిదండ్రులు వాకబు చేయగా జరిగిన సంఘటనను ఆ విద్యార్థి తల్లిదండ్రులకు వివరించాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేయగా పోలీస్లు సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ప్రభాకర్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ ఉపాధ్యాయుడు మృతి చెందాడు.
నేడు ఢిల్లీకి సిఎం రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్రెడ్డికి నేడు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. బిసి రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని సవాల్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా సీనియర్ లాయర్లతో సిఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో భేటీ కానున్నారు. కోర్టులో వాదించాల్సిన అంశాల గురించి వారితో సిఎం రేవంత్రెడ్డి చర్చించనున్నట్టుగా తెలిసింది.
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్ః గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న చేవెళ్ళ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ జర్నలిస్టు కొండా లక్ష్మారెడ్డి సోమవారం ఉదయం 5.30 గంటలకు కన్నుమూశారు. ఆయనకు భార్య సరళ, కుమారుడు విజిత్ రెడ్డి, కుమార్తె ప్రతిమా రెడ్డి ఉన్నారు. లోగడ ఆయన వార్తా సంస్థను స్థాపించినందున ఎన్ఎస్ఎస్ లక్ష్మారెడ్డిగా గుర్తింపు పొందారు. లకా్ష్మరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చేవెళ్ళ ఎమ్మెల్యేగా, ఎన్ఎస్ఎస్ వార్తా సంస్థ స్థాపకుడిగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్టు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షునిగా ఆయన సేవలందించారని ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి కొనియాడారు. లక్ష్మారెడ్డి మృతి పట్ల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఇంకా అనేక రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి లక్ష్మారెడ్డి నివాసానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు లక్ష్మారెడ్డి భౌతికకాయానికి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మారెడ్డి సమీప బంధువు చేవెళ్ళ నియోజకవర్గం బిజెపి లోక్సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి లోక్సభ సభ్యుడు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి, మన తెలంగాణ దినపత్రిక ఎడిటర్ దేవులపల్లి అమర్ తదితరులు హాజరయ్యారు.
Sree Vishnu Applauds Mithra Mandali Team, It’s Friendship and Fun at Its Best!
The buddy comedy Mithra Mandali, produced under BV Works, presented by Bunny Vas and Sapta Ashwa Media Works, promises to be a laughter riot from start to finish. The film features Priyadarshi and Niharika NM in the lead roles, Directed by VijayendarS. The ensemble cast includes Brahmanandam, Vennela Kishore, Satya, Vishnu Oi, Rag Mayur, Prasad […] The post Sree Vishnu Applauds Mithra Mandali Team, It’s Friendship and Fun at Its Best! appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్లో తొలిరోజు 10 నామినేషన్లు దాఖలు మన తెలంగాణ/సిటీ బ్యూ రో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు 10 మంది తమ నా మినేషన్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎన్నికల నోటిఫికేషన్ సోమవా రం విడుదల కావడంతో రిటర్నింగ్ అధికారి పి సాయిరాం నామినేషన్లను స్వీకరించారు. ఉ.11.00 నుంచి సా.3.00 గంటల వరకు పోటీకి ఆసక్తి ఉన్న పలువురు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో రెండు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు కాగా.. 8 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణా పునర్ నిర్మాణ సమితి తరుపున పూస శ్రీనివాస్ నామినేషన్ వేశారు. నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాస రావు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీ కాంత్, పెసరకాయల పరీక్షిత్రెడ్డి, చలిక చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్రెడ్డి, ఇబ్రహీంఖాన్, సయ్యద్ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్లు నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలకు కొద్ది గంటల ముందు షేక్ పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంను జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి కర్ణన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంను సందర్శించారు.
మంగళవారం రాశి ఫలాలు (14-10-2025)
మేషం- వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యధాతధంగా ఉంటాయి. ఎంతో శ్రమించి ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ వృత్తి వ్యాపారాలలో సాధారణ ఫలితాలు లభిస్తాయి. వృషభం- మీ నుండి ఉపకారం పొందిన వారి నుండే తిరిగి మీరు సహాయమును పొందవలసి వస్తుంది. కుటుంబ పురోగతి బాగుంటుంది. విద్యా సాంస్కృతిక కార్యక్రమాల కొరకు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మిథునం- జమా ఖర్చులకు సంబంధించిన వాటిలోని ఒడిదుడుకులు గుర్తించి మౌనంగా కార్యాచరణలో మార్పులు చేస్తారు. ఆర్థికపరమైన అంశాలు కొంతమేర ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటకం - వృత్తి ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. మీకు న్యాయం చేయవలసిన వాళ్ళు సంపూర్ణంగా న్యాయం చేయరు స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు ఓ పరిష్కార దిశకు చేరుకుంటాయి. సింహం - ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం దక్కదు. కళా, సాంస్కృతిక రంగాల్లోని వారికి పోటీ ఎదురవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కన్య- చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. శుభకార్యాల నిర్వహణకు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. తుల: మీలో నిద్రాణమైన ప్రతిభ వెలుగు చూస్తుంది. హోదాను పెంచే విధంగా ఒక ఒప్పందాన్ని చేసుకుంటారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చికం: శారీరక మానసిక శ్రమ అధికమవుతుంది. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ధనస్సు: చాకచక్యంగా వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. మకరం: పనివారు, సహ ఉద్యోగులు కొన్ని చికాకులు కల్పించిన వాటిని అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. బందు వర్గానికి ధన సహాయం చేయవలసి వస్తుంది. కుంభం: కొన్ని చర్చలు జరిపి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్టేషనరీ ప్రింటింగ్ సంబంధిత వ్యాపారాలు కొంతమేర అనుకూలంగా ఉంటాయి. మీనం: ప్రతి పని రెండోసారి సానుకూలపడుతుంది. స్వల్పకాలిక ట్రాన్సాక్షన్స్ లాభిస్తాయి. మిత్రులతోటి సుదీర్ఘమైన సంభాషణ సాగిస్తారు. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ పనులు సానుకూలపడతాయి.
20 రూపాయల బీమాతో రూ. 2లక్షల సాయం..
20 రూపాయల బీమాతో రూ. 2లక్షల సాయం.. ఉమ్మడి కరీంనగర్ బ్యూరో(ఆంధ్రప్రభ )
అంగన్వాడీ టీచర్ ను విచారించిన సిడీపీఓ
అంగన్వాడీ టీచర్ ను విచారించిన సిడీపీఓ కిరాణ దుకాణ యజమానికి గుడ్లు ఇచ్చిన
ఐపిఎస్ అధికారి ఆత్మహత్య కారకులపై చర్యలు తీసుకోవాలి: భట్టీ
చంఢీఘడ్లో ఉన్న కుటుంబాన్ని పరామర్శించిన భట్టి ఫోన్లో పరామర్శించిన సిఎం రేవంత్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : చండీఘడ్లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపిఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను ఫోన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేంవత్ రెడ్డి పరామర్శించారు. సోమవారం చంఢీఘడ్కు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పూరన్ కుమార్ భార్య ఐఏఎస్ అమనీత్ ను కుటుంబ సభ్యులను ఓదార్చి, పూరన్కుమార్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పూరన్ కుమార్ భార్య ఐఏఎస్ అమనీత్, కుటుంబ సభ్యులతో సిఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో డిప్యూటి సిఎం మాట్లాడించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సిఎం హామీ ఇచ్చారని, పూరన్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటి సిఎం మాట్లాడుతూ హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకరమని అన్నారు. అధికారి సూసైడ్ నోట్పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, న్యాయం జరిగేలా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన అధికారి వై పురాన్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి తాను చండీగఢ్కు వచ్చానని విక్రమార్క చెప్పారు. హర్యానా డిజిపి శత్రుజీత్ కపూర్, రోహ్తక్ మాజీ ఎస్పి నరేంద్ర బిజార్నియాతో సహా ఎనిమిది మంది సీనియర్ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ పూరన్ కుమార్ నోట్ను వదిలిపెట్టారన్నారు. ఐపిఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం చాలా ఆందోళనకరమైన విషయమని పురాన్ కుమార్ సూసైడ్ నోట్లో ఇద్దరు అధికారులను ప్రస్తావించినట్లు డిప్యూటి సిఎం గుర్తు చేశారు. హర్యానా డిజిపి శత్రుజీత్ కపూర్, మాజీ రోహ్తక్ ఎస్పి నరేంద్ర బిజర్నియాలు తనను అవమానించడం తన ఆత్మహత్యకు మూల కారణమని పూరన్ కుమార్ పేర్కొనట్లు డిప్యూటి సిఎం వివరించారు. బిజర్నియాను శనివారం బదిలీ చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత, ఈ కేసుపై త్వరిత, నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తు కోసం చండీగఢ్ పోలీసులు ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. దేశంలోని చట్టం ప్రకారం, సాధారణంగా, సూసైడ్ నోట్ను తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటారని, ప్రభుత్వం దానిపై వెంటనే చర్య తీసుకుంటుందన్నారు. దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగి చాలా రోజులు గడిచినా, ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించడం లేదని, మరణించిన అధికారి మృతదేహం పోస్ట్మార్టం లేకుండా అలాగే పడి ఉందని, కుటుంబం మృతదేహాన్ని చూడలేకపోతున్నారని ఇది అమానవీయం ఘటన అని ఉప ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వం, చండీగఢ్ పోలీసులను డిమాండ్ చేశారు. పూరన్ కుమార్ అనేక విజయాలు సాధించిన ఐపిఎస్ అధికారి అని, గర్వంగా జీవించడానికి ప్రయత్నించాడని డిప్యూటి సిఎం అన్నారు. అటువంటి వ్యక్లి క్షమించండి, నేను జీవించలేను, నేను చనిపోవాలి’ అని నిర్ణయించుకోవడం పట్ల మృతుడు అనుభవించిన మానసిక సంఘర్షణ మీరు ఊహించగలరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం దీనిని అర్థం చేసుకుని కుటుంబం తరపున నిలబడాలని డిప్యూటి సిఎం కోరారు. సూసైడ్ నోట్ ప్రకారం చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వం గత ఏడు రోజులుగా ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు అధికారులపై చర్య తీసుకోవాలని ఆ కుటుంబం డిమాండ్ చేస్తోందని, అయినా ఎటువంటి స్పందన లేదని భట్టి ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజ్యాంగం, చట్టాన్ని కాపాడటం ఏ ముఖ్యమంత్రికైనా ప్రాథమిక బాధ్యతని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
The fake liquor scandal in Andhra Pradesh has taken a shocking new turn. A sensational video featuring the prime accused, Addhepalli Janardhan Rao, reveals a series of explosive allegations that could shake the political landscape of the state. In the video, Janardhan Rao claims that during the YSRCP regime, former minister Jogi Ramesh directed the […] The post Fake Liquor Case Turns Explosive: Janardhan Rao’s Video Names Former Minister Jogi Ramesh in Alleged Political Conspiracy appeared first on Telugu360 .
సాక్ష్యాధారాలతో సహా నాపై జరిగిన కుట్రను బయటపెడతా..
కారు డ్రైవర్ ను మేమే చంపామని మీడియాలో ప్రచారం చేయడం కలచివేసింది పవన్ కల్యాణ్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాం న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వినుత కోట వీడియో విడుదల మన తెలంగాణ/హైదరాబాద్ : రాయుడు అనే డ్రైవర్ను హత్య చేసిన కేసులో అరెస్టయి బెయిల్పై బయటకు వచ్చిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ మాజీ ఇన్ ఛార్జ్ వినుత కోట ఓ సంచలన వీడియోను విడుదల చేశారు. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ స్థాయిలో చోటు చేసుకుంటోన్న రాజకీయాలు, భ్రమరాంబ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం పాలకమండలి ఛైర్మన్ పదవి తదితర అంశాలను ప్రస్తావించారు. తన అభ్యంతరాలను తెలిపారు. తన నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. కారు డ్రైవర్ హత్య కేసులో వినుత కోటను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. కొద్దిరోజుల కిందటే బెయిల్ పై విడుదల అయ్యారు. బెయిల్ షరతులకు అనుగుణంగా ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. హత్యకు గురైన కారు డ్రైవర్ కు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చిన మరుసటి రోజే కోట వినూత తాజాగా వీడియోను విడుదల చేయడం, అందులో పలు అంశాలను చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసైనికులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఓటర్లు, రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలను తెలియజేయడానికి, మనసు నిండా పుట్టెడు బాధతో ముందుకొచ్చానని వాపోయారు. చెయ్యని తప్పుకు జైలుకు వెళ్లినందుకు తమకు బాధగా లేదని, కారు డ్రైవర్ ను తామే చంపా మని మీడియాలో ప్రచారం చేయడం కలచివేసిందన్నారు. అతని చావులో తమ ప్రమేయం లేదని కోర్టు భావించడం వల్లే అరెస్టయిన 19 రోజు ల్లోనే బెయిల్ వచ్చిందని చెప్పారు. విదేశాల్లో లక్షల రూపాయలు వచ్చే జీతాన్ని వదులుకుని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామని, ప్రజల ప్రాణాలకు తీయడానికి కాదని కోట వినుత అన్నారు. ఈ హత్య కేసులో తమకు ఎంతమాత్రం సంబంధం లేదని, కోర్టులో నిరూపించుకుని క్లీన్ చిట్ తో బయటికి వస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోర్టులో విచారణ కొనసాగుతున్నందున ఇంత కంటే ఎక్కువ మాట్లాడదలచు కోలేదని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తోన్నామని, పూర్తిస్థాయిలో బెయిల్ లభించిన వెంటనే త్వరలో ఆయనను కలుస్తానని అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తనను రాజకీయాలకు దూరం చేయాలని, క్యారెక్టర్ దెబ్బ తీసే ప్రయ త్నాలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా తనపై జరిగిన కుట్రను బయటపెడతానని అన్నారు. మీడియా సమక్షంలో వాటన్నింటినీ విడుదల చేస్తానని తెలిపారు. చనిపోక ముందు డ్రైవర్ వీడియో కలకలం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి జనసేన ఇంఛార్జ్ కోట వినుత, ఆమె భర్తను హత్య చేయాలని ప్లాన్ చేశారని చెబుతున్న డ్రైవర్ రాయుడు పాత వీడియో వెలుగులోకి వచ్చింది. బొజ్జల తన అనుచరుడు సుజిత్రెడ్డితో తనను సంప్రదించి కోట వినుత, ఆమె భర్తను హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాలని సూచించినట్లు రాయుడు ఆరోపించాడు. వారి హత్యకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమైనట్లు తెలిపాడు. 2024 ఎన్నికల కన్నా ముందే జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయిప్రసాద్ టిడిపి నేత బొజ్జల సుధీర్రెడ్డికి సహకరించారని వీడియోలో వెల్లడించాడు. గతంలో హత్యకు గురైన డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. అతడు సొంతంగా వీడియో రికార్డ్ చేశాడా, లేక భయపెట్టి వీడియో తీయించారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. బెయిల్ పై వచ్చినంత మాత్రాన నిర్దోషులు కాదు: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కోట వినుత డ్రైవర్ రాయుడు వీడియోపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. రాయుడు వీడియో ఎఐతో రూపొందించారా? వాస్తవమా? అన్నది తేల్చాలన్నారు. రాయుడు హత్య జరిగిన రెండు నెలల తర్వాత వీడియో విడుదల చేశారని, తనపై బురదజల్లడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు నుంచి కోట వినుత దంపతులు తన గెలుపునకు సహకరించలేదని, ఇంటికి వెళ్లి ఓట్లు అడిగినా సరైన రీతిలో స్పందించలేదని తెలిపారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయిందన్నారు. తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలసి కొన్ని దశాబ్దాల నుంచి రాజకీయాలు చూస్తున్నానని, ఎప్పుడూ ఇలాంటి రాజకీయాలు తాను చూడలేదని ఆయన చెప్పారు. ఈ మేరకు బొజ్జల సుధీర్ రెడ్డి ఒక వీడియో విడుదల చేశారు. కోట వినుత డ్రైవర్ రాయుడి వీడియో పై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. బెయిల్ పై వచ్చినంత మాత్రాన నిర్దోషులు కాదని, న్యాయస్థానం హత్యలో ప్రమేయం లేదని తేల్చి చెప్పాలని బొజ్జల సుధీర్ రెడ్డి వీడియోలో పేర్కొన్నారు.
బీహార్ ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి షాక్..
ఢిల్లీ ప్రత్యేక కోర్డు ద్వారా కీలకమైన ఛార్జిషీట్ మోసం, కుట్ర, అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు రైల్వే మంత్రిగా అధికార దుర్వినియోగంపై సాక్షాలు? ఈ నెల చివరిలోనే విచారణ ప్రక్రియ ఆరంభం మహాఘట్బంధన్ ప్రధాన పార్టీ ఆర్జేడికి సంకటం న్యూఢిల్లీ : ఆర్జేడీ వ్యవస్థాపక నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం అభియోగాలు మోపింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రులు అయిన లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు, బీహార్లో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్లపై సంచలనాత్మక ఐఆర్సిటిసి స్కామ్ కేసులో రౌజ్ హౌస్ కోర్టు ఈ చార్జీషీట్కు దిగింది. లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు మోసం, కుట్రపూరిత చర్య, అవినీతికి పాల్పడటం ద్వారా భూములు కాజేశారనేది అభియోగం. ఈ క్రమంలో లాలూ కుటుంబానికి ప్రయోజనం చేకూరిందనేది వాదన. బీహార్లో రెండు దశల అసెంబ్లీ ఎన్నికలు మరో నెలరోజుల్లోనే జరగాల్సి ఉన్నదశలోనే ప్రధాన పార్టీ ఆర్జేడీకి కోర్టు చార్జీషీట్ షాక్ తగిలింది. లాలూ, తరువాత రబ్రీదేవి ముఖ్యమంత్రులుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఐఆర్సిటిసి మోసానికి పాల్పడ్డారనేది ప్రధానమైన ఆరోపణ. అభియోగాల నమోదు విషయాన్ని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారణ క్రమంలో వెల్లడించారు. భూముల బదలాయింపులకు సంబంధించి వీరి పాత్ర పూర్తి స్థాయిలో అనుమానాస్పదంగా ఉందని , ఈ మేరకు ప్రాధమిక సాక్షాధారాలు లభించినందున ఇప్పుడు తదుపరి ప్రక్రియలో భాగంగా అభియోగాలను నమోదు చేసినట్లు తెలిపారు. నవంబర్ 6, తరువాత 11 తేదీలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. బీహార్లో ఎన్డిఎను ఢీకొంటూ నిలిచిన మహాఘట్బంధన్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ముఖ్యమైన రాజకీయ పార్టీగా ఉంది. ఈ క్రమంలో ఈ కూటమి తరఫున తేజస్వీ యాదవ్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఆయనపై కూడా అభియోగాలు నమోదు కావడం కీలకమైంది. తేజస్వీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కేసు విచారణ ఈ నెలాఖరులోనే అభియోగాలు నమోదు కావడంతో లాలూ కుటుంబ సభ్యులపై సంబంధిత కేసులో విచారణ ఈ నెల చివరిలోనే ఆరంభమవుతుంది. ఎన్నికల ప్రచారం ఉధృతదశలో ప్రత్యర్థి పార్టీలు ఆర్జేడీపై విరుచకుపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. అభియోగాల నమోదు విషయం ఇప్పుడు ఎన్నికల బీహార్లో రాజకీయ వేడివేడి చర్చకు దారితీసింది. రెండు భారతీయ రైల్వే కేటరింగ్ సర్వీసులు రెండింటిని, ఐఆర్సిటిసి హోటల్స్ను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారని, ఇందుకు బదులుగా ఈ ఫ్యామిలీ భారీ స్థాయిలో విలువైన భూములను తమ సొంతం చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. వీరిపై అవినీతి నిరోధక చట్టం పరిధిలోని నిబంధనలకు అనుగుణంగా అభియోగాలు దాఖలు చేశారు. అభియోగాల్లోని కార్యనిర్వాహక భాగంలోని కొన్ని అంశాలను జడ్జి చదివి విన్పించారు. కాంట్రాక్టుకు బదులుగా ఈ కుటుంబానికి అతి చవక ధరలకు పొందిందని, సుజాత హోటల్స్కు బినామీగా లాలూ కుఉంబం ఉందని, భూమిని నామమాత్రపు ధరలకు పొందడం ద్వారా కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం కల్గించారని న్యాయమూర్తి తెలిపారు. ఈ వ్యవహారంపై గతంలో సిబిఐ దర్యాప్తు సాగింది. మూడు ఎకరాల భూమి , అత్యంత విలువైన ధర పలికేదానిని తమ పేరిట రాయించుకున్నారనే విషయంపై 2017లోనే లాలూపై ఎఫ్ఐఆర్ దాఖలు అయింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ కేసుకు సంబందించి తీవ్రస్థాయి అభియోగాలు న్యాయస్థానం ద్వారా దాఖలు అయ్యాయి. ఛార్జీషీట్లో వీరితో పాటు ఐఆర్సిటిసి జిఎంలు వికె అస్థానా, ఆర్కె గోయల్తో పాటు హోటల్ సుజాత డైరెక్టర్లు, ఛానక్య హోటల్ యజమానులు అయిన విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్లను కూడా చేర్చారు. లారా ప్రాజెక్టుగా చలామణి అయ్యే డిలైట్ మార్కెటింగ్ కంపెనీ , సుజాత ప్రైవేటు లిమిటెడ్లను ఛార్జీషీట్లో నిందితులుగా చేర్చారు. 2004 2009 మధ్యలో లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా వ్యవహరించారు.
యుద్ధం ఆపకపోతే టోమాహాక్ దాడులే.. పుతిన్కు ట్రంప్ వార్నింగ్
ఉక్రెయిన్తో యుద్ధం తక్షణం నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యాకు అమెరికా అధ్యక్షలు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. యుద్దం ఆపండి లేకపోతే తాము అమెరికా దీర్ఘశ్రేణి టోమాహాక్ క్షిపణులను ఉక్రెయిన్కు అందిస్తామని, తరువాత వారి ఇష్టం అని ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్కు ప్రత్యేక విమానంలో బయలుదేరిన ట్రంప్ తమ వెంట ఉన్న మీడియాతో మాట్లాడారు. అమెరికా శక్తివంతమైన క్షిపణుల శక్తి ఏమిటనేది రష్యాకు తెలిసిందే అని, యుద్ధం సమసిపోవల్సి ఉంది. లేకపోతే తాము వేరే విధంగ స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ నుంచి ఉక్రెయిన్కు అత్యంత కీలక ఆయుధాలు అందుతాయని పరోక్షంగా తెలిపి, రష్యా అధినేత పుతిన్పై ఒత్తిడి తెచ్చేందుకు యత్నించారు. తమ క్షిపణి చాలా శక్తివంతం. దీని దెబ్బతినకుండా రష్యా వ్యవహరిస్తుందనే తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీతో ట్రంప్ ఫోన్లో అంతకు ముందు మాట్లాడారు. ఈ దశలోనే ఈ మిస్సైల్స్ను ఉక్రెయిన్కు పంపిచేందుకు మాట ఇచ్చినట్లు వెల్లడైంది. రష్యా వైపు ఈ క్షిపణులు దూసుకువెళ్లాలని పుతిన్ కోరుకుంటున్నాడా? లేదనే అనుకుంటున్నాను. ముందుగా యుద్దం ఆగిపోవాలి. నానా విధాలుగా తాను పుతిన్కు నచ్చచెపుతున్నానని, ఇక ఈ మిస్సైల్ తమ దూకుడుకు మరో అడుగు అని అనుకున్నా ఫర్వాలేదని ట్రంప్ మీడియాతో చమత్కరించారు. ట్రంప్ ప్రస్తావించిన క్షిపణులు గరిష్టంగా 2500 కిలోమీటర్ల దూరం వరకూ, శబ్ధవేగాన్ని మించి దూసుకువెళ్లుతాయి. భూమికి అతి తక్కువ దూరం నుంచి వెళ్లగలిగే వీటిని నౌకల నుంచి చివరికి జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించే శక్తిసామర్థాలు సంతరించుకుని ఉన్నాయి.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) జీఎస్టీ సంస్కరణలతో ఎంఎస్ఎంఈల్లో నూతనుత్తేజం..డబుల్ ఇంజిన్
అన్ని విభాగాలలో అంతర్గత బదిలీలు…
అన్ని విభాగాలలో అంతర్గత బదిలీలు… సూపర్డెంట్లు, ఏఈఓలకు స్థాన చలనం..భక్తుల సౌకర్యాలు.. సేవలపై
కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల రుసుం పెట్టారని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లాటరీలో షాపు దక్కకపోతే రూ.3 లక్షలు ఆబ్కారీ శాఖకే వెళ్తాయని పిటిషనర్ పేర్కొన్నారు. షాపు దక్కకుంటే డబ్బు తిరిగి వచ్చేలా ఆబ్కారీ శాఖను ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. లిక్కర్ పాలసీపై జారీ చేసిన జివొ 93ను కొట్టివేయాలని పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Bhagyashri Borse All Praises For Ram
The teaser of Ram Pothineni’s unique entertainer Andhra King Taluka was released yesterday to a phenomenal response. Ram is introduced as a passionate movie buff since childhood, and the film revolves around his deep love for cinema, his admiration for his favorite star, and his romantic journey with his girlfriend. Bhagyashri Borse, who plays Ram’s […] The post Bhagyashri Borse All Praises For Ram appeared first on Telugu360 .
టీచర్ పోస్టులకు ఇద్దరు కానిస్టేబుళ్లు ఎంపిక
అభినందించిన వన్టౌన్ సీఐ విశాలాంధ్ర – విజయవాడ (క్రైమ్): విజయవాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. 2018 బ్యాచ్కు చెందిన కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, నాగరాజు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్లుగా ఎంపికయ్యారు. నాగరాజు ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్గా, దుర్గాప్రసాద్ సోషల్ స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం వారిని వన్టౌన్ సీఐ గురుప్రకాష్ అభినందించి సన్మానించారు. వారిద్దరూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నతంగా […] The post టీచర్ పోస్టులకు ఇద్దరు కానిస్టేబుళ్లు ఎంపిక appeared first on Visalaandhra .
దరఖాస్తుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలి
దరఖాస్తుల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలి కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :
సత్వర న్యాయమే లక్షంగా క్రిమినల్ చట్టాలు: అమిత్ షా
జైపూర్ ః దేశంలో తీసుకువచ్చిన మూడు కొత్త క్రిమినల్ లా చట్టాలు న్యాయ లక్షంతో కూడుకున్నవే, అంతేకానీ శిక్షలే ప్రధాన ఉద్ధేశంతో ఉండేవి కావని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భారతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను 21వ శతాబ్ధంలో భారీ స్థాయిలో సంస్కరించే దిశలోనే ఈ మూడు చట్టాలు రూపొందాయి. అమలులోకి వచ్చాయని వివరించారు.కేంద్ర హోం మంత్రి సోమవారం జైపూర్లోని కన్వెన్షన్ సెంటర్లో ఈ మూడు చట్టాల సమగ్ర స్వరూపం తెలిపే ఎగ్జిబిషన్ను ఆరంభించిన క్రమంలో ఆయన మాట్లాడారు. నూతన చట్టాల పరిధిలో జరిగే కేసుల దర్యాప్తు, ప్రాసిక్యూషన్ పద్థతుల గురించి ఆయన వివరించారు. ఇంతకు ముందటి చట్టాల పరిధిలో కేసుల విచారణకు 25 నుంచి 30 ఏండ్ల వరకూ కాలం పట్టేది. పైగా అనేక రకాల వేధింపులు, చివరికి కక్ష సాథింపు చర్యలు కూడా చోటుచేసుకునేవి. తీర్పులు లేకుండానే అనేకులు ఏళ్ల తరబడి జైలులో మగ్గిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకువచ్చిన చట్టాలతో పరిస్థితి మారింది. సరళీకృతంగా సత్వరంగా సంబందితులకు న్యాయం దక్కుతుందని వివరించారు. ఈ కొత్త చట్టాలు పాత చట్టాలలోని అంశాలను పోలుస్తూ సశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఈ చట్టాలపై అవగావహన విషయంలో తొలి ప్రక్రియగా నిలిచింది. న్యాయవ్యవస్థలో ఉన్న పద్దతులతో జనం ఎక్కువగా ఈ వ్యవస్థ పట్ల నిట్టూర్పులకు గురికావడం జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయాలను సరిదిద్దడం ద్వారా అందరికి న్యాయం సకాలంలో అందేందుకు మార్గాలు ఏర్పడ్డాయని వివరించారు.
ఆసుపత్రికి తరలిస్తుండగా అనంత లోకాలకు
ఆసుపత్రికి తరలిస్తుండగా అనంత లోకాలకు నిజాంపేట, ఆంధ్రప్రభ : ఉరి వేసుకుని వివాహిత
ట్రంప్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం
జెరూసలెం : గాజా ఒప్పందం కుదిర్చి, బందీల విడుదలకు కృషి చేసినందుకు గాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు అరుదైన గౌరవాన్ని అందించనున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ ‘ మెడల్ ఆఫ్ ఆనర్ ’ ను అమెరికా అధ్యక్షుడికి ప్రదానం చేయనున్నట్టు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ వెల్లడించారు. రానున్న నెలల్లో సమయం, వేదిక నిర్ణయించి అందజేయనున్నట్టు తెలిపారు. బందీల విడుదల చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని సాధించడంలో చేసిన కృషికి గాను ఈ గౌరవాన్ని అందుకోడానికి ట్రంప్ అర్హుడని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ లోనే కాకుండా మధ్య ప్రాచ్యంలో శాంతియుత భవిష్యత్తును నెలకొల్పడానికి ట్రంప్ పునాది వేశారని కొనియాడారు.
నకిలీ మద్యం కేసులో వెలుగులోకి కీలక విషయాలు,,
జోగి రమేష్ ఇచ్చిన రూ.3 కోట్ల ఆఫర్కు ఆశపడే ఇదంతా చేశా ఎ1 నిందితుడు అద్దేపల్లి జనార్ధన్రావు వాంగ్మూలం మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో బయటపడ్డ నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసిపి నేత జోగి రమేష్ చేసి న కుట్ర వల్లనే ఇదంతా జరిగిందని కేసులో ఎ1 నిందితుడుగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు బయట పెట్టారు. జోగి రమేష్ ఇచ్చిన మూడు కోట్ల రూపాయల ఆఫర్కు ఆశపడే ఇదంతా చేశానని జనార్దన్ రావు చెబుతున్నారు. వైసిపి హయాంలోనే పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారం చేశా మని జనార్దన్ రావు వెల్లడించారు. పోలీసులు పట్టుకుంటే బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే వైసిపి ఓడిపోయిన తర్వాత నిఘా ఎక్కువ కావడంతో నకిలీ మద్యం తయారీ ఆపేశామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ మద్యం తయారీ ప్రారంభించాలని సూచించారని పోలీసులకు తెలిపారు. ఒక వేళ దొరికతే ప్రభుత్వంపై బురద చల్లవచ్చని తంబళ్లపల్లె నుంచే ప్రారంభించాలని సూచించారన్నారు. దొరికితే అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తానని జోగి రమేష్ చెప్పారని జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందన్నారు. పైవారి ఆదేశాలతోనే నీకు ఈ పని అప్పగిస్తున్నా అని జోగి రమేష్ నాతో చెప్పారని జనార్దన్ రావు చెప్పారు. జనార్దన్ రావు వీడియో సంచలనం సృష్టిస్తోంది. నకిలీ మద్యం కేసును సిబిఐకి ఇవ్వాలని వైసిపి నేతలు ఆందో ళనలు చేశారు. అదే రోజు అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లయింది. మరో వైపు ప్రభుత్వం నకిలీమద్యం కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ నేతృత్వంలో మల్లికా గార్గ్, రాహుల్ దేవ్ శర్మ వంటి సీనియర్ ఆఫీసర్లతో ఈ సిట్ను నియమించారు. నకిలీ మద్యం సూత్రధారుల్ని గుర్తించి శరవేగంగా నిందితుల్ని పట్టుకోవాలని ఆదేశించారు. మరో వైపు ఎపి ప్రభుత్వం సురక్ష యాప్ తీసుకు వచ్చింది. మద్యం దుకాణాల్లో అమ్మే ప్రతి బాటిల్ పైా క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే మద్యం ఉత్ప త్తి కంపెనీ సహా మొత్తం సమాచారం వచ్చేలా ఏర్పాటు చేశారు. నకిలీ మద్యం ఎక్కడా అమ్మకుండా చూసేందుకు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా నకిలీ మద్యం కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేసేలా అవకాశం కల్పించారు.
భారత్పై జంట సెంచరీలు.. 51 ఏళ్ల రికార్డు తిరగరాశారు..
న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ముగింపు దశకు చేరుకుంది. ఐదో రోజు భారత్ మరో 58 పరుగులు సాధిస్తే.. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను వైట్ వాష్ చేస్తుంది. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ బ్యాటర్ల కనబరిచిన పోరాట పటిమకు క్రికెట్ లోకం ఫిదా అయింది. ముఖ్యంగా ఫాలో ఆన్లో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుకు క్యాంప్బెల్, హోప్ల జోడీ అండగా నిలిచింది. వీరిద్దరు సెంచరీలు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేశారు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఓ రికార్డును సాధించారు. మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన ఈ జంట 51 ఏళ్ల తర్వాత ఓ రికార్డును తిరగరాశారు. 1974లో ఇద్దరు విండీస్ ఆటగాళ్లు భారత గడ్డపై ఒకే టెస్ట్లో రెండో ఇన్నింగ్స్లో సెంచరీలు చేశారు. నాడు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో (రెండో ఇన్నింగ్స్) గార్డన్ గ్రీనిడ్జ్ (107), క్లైవ్ లాయిడ్ (163) సెంచరీలు చేశారు. మళ్లీ ఇప్పుడు క్యాంప్బెల్, హోప్లు ఈ ఫీట్ని పునరావృతం చేశారు. ఇలా భారత గడ్డపై వెస్టిండీస్ ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్లో సెంచరీలు చేయడం ఇది మూడోసారి. తొలుత 1948-49లో కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్లో ఎవర్టన్ వీక్స్ (101), క్లైడ్ వాల్కాట్ (108) సెంచరీలు చేశారు.
భారీగా తరలిన అధికారులు, కార్మికులు
భారీగా తరలిన అధికారులు, కార్మికులు శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ :
పెద్దఅంబర్పేట్లో వరుస చోరీలు #crime #hyderabad #peddaamberpet #police #robbery #telugupost
Aaryan I’m The Guy Song: A Youthful Melody
Aaryan glimpse has created such an impression that the buzz for the film is increasing by the day. Directed by Praveen K, this Vishnu Vishal starrer is stated to be one of the best thrillers to come out in recent times. Makers are doubly confident that the cinematic experience the movie offers is on the […] The post Aaryan I’m The Guy Song: A Youthful Melody appeared first on Telugu360 .
రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు వెళ్తాం: మహేష్ కుమార్ గౌడ్
మన తెలంగాణ/హైదరాబాద్ః రిజరేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమై మంతనాలు జరిపారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇటీవల ఖర్గే బెంగళూరులో అనారోగ్యానికి గురైనందున పరామర్శించేందుకు ఢిల్లీకి వచ్చానని చెప్పారు. ఖర్గే పూర్తిగా కోలుకున్నారని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను, న్యాయ పోరాటాల గురించి ఖర్గేకు వివరించానని చెప్పారు. ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ఆశయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఖర్గే అభినందించారని ఆయన తెలిపారు. రిజర్వేషన్లపై, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జారీ చేసిన జివోపై రాష్ట్ర హైకోర్టు ‘స్టే’ విధించినందున దీనిపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ‘స్టే’ను తొలగించాల్సిందిగా సుప్రీంను కోరుతూ సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన వివరించారు. హైకోర్టులో జరిగిన విషయాలు, సుప్రీంలో దాఖలు చేయనున్న పిటిషన్ గురించి ఖర్గేకు వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్లో తమ పార్టీలోని పలువురు ముఖ్య నాయకులు కూడా ఇంప్లీడ్ కానున్నారని ఆయన చెప్పారు. సమాచార లోపంతో సమస్య.. మంత్రుల మధ్య తలెత్తిన వివాదాల గురించి విలేకరులు ప్రశ్నించగా, చిన్న సమాచార లోపంతో తలెత్తిన సమస్యే తప్ప ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఓ కుటుంబంలా అందరూ కలిసి ఉన్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో అందరమూ చర్చించి పరిష్కరించుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.
ప్రపంచానికి మరింత మంది ట్రంప్లు కావాలి..
జెరూసలెం : ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు బెంజమిన్ నెతన్యాహు సర్కారు ఘనంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇజ్రాయెల్ చట్టసభ కనేసేట్ ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ప్రపంచానికి ట్రంప్ లాంటివారు మరింత మంది కావాలని ఆకాంక్షించింది. వచ్చే ఏడాది ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదిస్తామని తెలిపింది. ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో కలిసి జెరూసలెంలోని చట్టసభకు వెళ్లారు. అక్కడ ఇజ్రాయెల్ చట్టసభ్యులు అగ్రరాజ్య అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. కాల్పుల ఒప్పందం చేసినందుకు గాను రెండున్నర నిమిషాలు పాటు లేచి నిలబడి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం స్పీకర్ అమిర్ ఒహనా మాట్లాడుతూ బందీల విడుదలకు కృషి చేసిన ట్రంప్ను యూదు ప్రజలు వేల సంవత్సరాల పాటు గుర్తుంచుకుంటారని కొనియాడారు. శాంతి స్థాపన కోసం ఆయన చేస్తున్నంతగా ఎవరూ చేయడం లేదని అన్నారు. దృఢ సంకల్పం, ధైర్యం ఉన్న ట్రంప్ లాంటి నేతలు ప్రపంచానికి మరింతమంది కావాలని అభిప్రాయపడ్డారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ కంటే అర్హులు మరెవరూ లేరని తెలిపారు. వచ్చే ఏడాది నోబెల్ పురస్కారం కోసం అన్ని దేశాలూ ట్రంప్ పేరు ప్రతిపాదించేలా తాము కృషి చేస్తామన్నారు. ప్రపంచాన్ని కదిలించిన వ్యక్తి ట్రంప్ అనంతరం నెతన్యాహు ప్రసంగిస్తూ ట్రంప్పై ప్రశంసలు కురిపించారు. ప్రపంచాన్ని ఇంత వేగంగా దృఢ నిశ్చయంతో కదిలించిన ట్రంప్ లాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదన్నారు. యుద్ధం ముగిసేలా గాజా ఒప్పందం చేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. శాంతి స్థాపనకోసం తాము కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు. ట్రంప్ తప్పకుండా నోబెల్ శాంతి బహుమతి సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. బహుమతిగా బంగారు పావురం అంతకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ కొంతసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి నెతన్యాహు అపురూప కానుక ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన కోసం పాటుపడుతున్న ట్రంప్నకు బంగారు పావురాన్ని బహుమతిగా అందజేశారు.
988 కోట్ల ఖర్చుతో దేశీయ చాట్ బాట్
ప్రస్తుతం చాట్జీపీటీ, జెమినీ, గ్రాక్, పర్ఫ్లెక్సిటీ లాంటి చాట్ బాట్స్ ను తెగ వినియోగిస్తూ ఉన్నారు.
హైదరాబాద్ టూ శ్రీశైలం హెలికాప్టర్ లో
పర్యాటక శాఖ హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు హెలికాప్టర్ సేవలు నడపాలని నిర్ణయం తీసుకుంది.
డ్రోన్లు నిషేధం కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల
‘కాంతార: ఛాప్టర్ 1’లో చిన్న పొరపాటు.. నెటిజన్ల ట్రోల్స్
సోషల్మీడియా అందుబాటులోకి రాని సమయంలో ఎంత పెద్ద సినిమాలో అయినా చిన్నచిన్న పొరపాట్లు జరిగితే ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రేక్షకులు సినిమాలో ఏదైన తప్పు దొరికితే వెంటనే దాన్ని నెట్లో పెట్టి ఏకి పారేస్తున్నారు. తాజాగా ‘కాంతార: ఛాప్టర్ 1’ సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా కాసుల పంట పండిస్తోంది. ‘కాంతార’ ప్రస్తుతం జరుగుతున్నట్లు తీశారు. కానీ, ఈ సినిమా దానికి ప్రీక్వెల్గా 16వ శతాబ్ధంలో జరుగుతున్నట్లు తెరకెక్కించారు. అందుకు తగినట్లు సెట్స్, కాస్ట్యూమ్స్ అన్ని చక్కగా డిజైన్ చేశారు. కాని ఒక్కచోట మాత్రం టీమ్ తప్పు చేసింది. తాజాగా ఈ సినిమాలో సెకండాఫ్లో ‘బ్రహ్మకలశ’ అనే పాట ఉంటుంది. గూడెంలో ఉండే దేవుడిని రాజు ఉండే చోటుకి తీసుకువచ్చే సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. ఈ పాటలో అందరూ కలిసి భోజనం చేస్తున్న చోట ప్రస్తుతం వాడుకలో ఉన్న 20 లీటర్ల వాటర్ క్యాన్ కనిపిస్తుంది. ఇది సినిమాలో, రెండు రోజుల క్రితం విడుదల చేసిన వీడియో సాంగ్లోనూ కనిపించింది. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 16వ శతాబ్ధంలో వాటర్ క్యాన్ ఎలా వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.
బీఎస్ఎఫ్ తొలి మహిళాఫ్లైట్ ఇంజనీర్గా
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీరుగా ఇన్స్పెక్టర్ భావనా చౌదరి నియమితులయ్యారు.
రెండేళ్ల యుద్దం తర్వాత విముక్తి... 20 మంది బందీల విడుదల
గాజా: దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన కొత్త కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ సోమవారం ఇజ్రాయెల్ సజీవ బందీలు 20 మందిని రెండు దశల వారీగా విడిచిపెట్టింది. మొదటి దశలో సోమవారం ఉదయం ఏడుగురిని, రెండోదశలో మిగతా 13 మందిని విడిచిపెట్టి రెడ్క్రాస్ సొసైటీకి అప్పగించింది. వారిని తీసుకుని రెడ్క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్కు బయలుదేరింది. ఇక హమాస్ వద్ద ఉన్న 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు కూడా త్వరలోనే అప్పగించనుంది. ఒప్పందం కింద తమ వద్ద ఉన్న 48 మంది బందీలను హమాస్ విడిచిపెట్టనుంది. అందులో 20 మందే సజీవంగా ఉన్నారు. వీరిని గాజా లోని మూడు ప్రాంతాల్లో హమాస్ విడుదల చేసింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది.. ఈలోగా కాల్పుల విరమణకు మధ్యవర్తిగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈజిప్టులో గాజా శాంతి సదస్సులో పాల్గొనేందుకు ముందుగా ఇజ్రాయెల్కు విచ్చేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఆయన ప్రసంగించనున్నారు. కాల్పుల విరమణను స్వాగతిస్తూ “ గాజా యుద్ధం ముగిసింది. ఈరోజు చాలా గొప్పదినం.ఇది శుభారంభం ” అని ట్రంప్ అభివర్ణించారు. శాంతి ప్రణాళిక ప్రకారం హమాస్ నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. బందీల కుటుంబీకులను కూడా ట్రంప్ కలుసుకుంటారు. మొదటి బ్యాచ్లో ఇజ్రాయెల్ బందీలు ఎయిటాన్ మోర్, గాలి అండ్ జివ్ బెర్మన్, మటాన్యాంగ్రెస్ట్, ఒమ్రి మిరాన్, గై జిల్బోయా, అలాన్ అహెల్, తదితరులు విడుదలయ్యారు. రెండోబ్యాచ్లో ఎవిటార్ డేవిడ్, ఎలాన్ ఒహెల్, ఎవినాటన్ ఓర్, ఎరియల్ కునియో, డేవిడ్ కునియో, నిమ్రోడ్ కొచెన్, బార్ కుపెర్స్టెయిన్, యుసఫ్ చైమ్ ఒహానా, సెగెవ్ కల్ఫాన్, ఎల్కనా బొహొబోట్, మాక్సిమ్ హెర్కిన్, ఎయిటాన్ హార్న్, రోమ్ బ్రస్లవ్స్కి విడుదలయ్యారు. విడుదలకు ముందు బందీల్లో కొందరు వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబీకులతో మాట్లాడారు. రెండేళ్ల తరువాత తమ ప్రియతములను చూడగానే ఆయా కుటుంబాలు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రక్షణ దళం అప్డేట్ను రిటర్నింగ్ హోమ్ పేరున పోస్ట్ చేసింది. హమాస్ నుంచి విడుదలైన ఏడుగురి బందీలను ఐడీఎఫ్, ఐఎస్ఎ అధికారిక బృందాల సాయంగా ఇజ్రాయెల్కు తీసుకువస్తున్నట్టు పేర్కొంది. వారు చేరుకోగానే వైద్యపరీక్షలు జరుగుతాయి. మరికొంతమంది బందీలను ఈరోజు తరువాత రెడ్క్రాస్కు బదిలీ చేయడమవుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ఇజ్రాయెల్ నగరాల్లో ఆనందం వెల్లువ బందీల పరిస్థితులు ఎలా ఉన్నాయో వెంటనే లభ్యం కాకపోయినా, వారు విడుదలయ్యారన్న వార్తకు స్వదేశంలో అనేక చోట్ల ఆనందాతిశయాలు వెలువడ్డాయి. నగరాలు, పట్టణాల్లో జనం గుమికూడి విడుదల సంఘటనల లైబ్ బ్రాడ్కాస్ట్లను సందర్శిస్తుండటం కనిపించింది. టెల్ అవీవ్లో భారీ ఎత్తున బహిరంగంగా తెరలపై దృశ్యాలు ప్రదర్శించారు. చాలా మంది ఇజ్రాయెల్ పతాకాలను ఎగురవేశారు. గాజాలో ఇంకా ఉన్న వారి పేర్లు, ముఖాలు ప్రదర్శించే సంకేతాలు చూపించారు. దక్షిణ ఇజ్రాయెల్లో రెయిమ్ మిలిటరీ స్థావరం వద్ద సూర్యోదయం కాగానే జనం గుమికూడి ఇజ్రాయెల్ పతాకాలు ఎగురవేశారు. నిశ్శబ్దంగా ప్రార్థనలు చేశారు. చప్పట్లు కొడుతూ పాటలు పాడారు. ఒక వ్యక్తి యూదుల సంప్రదాయ బాకా షోఫార్ను ఊదుతూ బందీలకు స్వాగతం పలికారు. కొంతమంది ఒహెల్ చిత్రాన్ని చిత్రించి ఉన్న టీ షర్టులు ధరించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దంపతుల స్వాగతం బందీలు తిరిగి స్వదేశానికి తరలివస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని నెతన్యాహు, ఆయన భార్య సారా లిఖితపూర్వకమైన స్వాగతం పలికారు. తాము రాసిన నోట్లో “ఇజ్రాయెల్ ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. మీకోసం నిరీక్షిస్తున్నాం. మిమ్మల్ని ఆనందంగా హత్తుకుంటాం” అని పేర్కొన్నారు. తిరిగివచ్చిన బందీలు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన రిసెప్షన్ కిట్ అందుతుందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆ కిట్లో దుస్తులు, వ్యక్తిగత సామగ్రి, లాప్టాప్, ఫోన్, టాబ్లెట్ ఉంటాయి. బందీలు వచ్చే దారి పొడుగునా ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్వాగత పతాకాలను నెలకొల్పారు. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తరువాత ట్రంప్ శాంతి ప్రణాళికలో రెండోదశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను త్యజించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ, ప్రధాన అంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి , 251 మందిని హమాస్ అపహరించిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమందిని గతంలో విడుల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించగా, మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారిని హమాస్ ఇప్పుడు విడిచిపెట్టింది.
సౌత్జోన్ ఈఎన్టీ కాన్ఫరెన్స్లో విశేష ప్రతిభ
సౌత్జోన్ ఈఎన్టీ కాన్ఫరెన్స్లో విశేష ప్రతిభ కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వైద్య
మహిళల ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టు భారత జట్టుపై 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
కల్తీ మద్యం వ్యవహారంపై మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్
కల్తీ మద్యం వ్యవహారంపై మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్ చిలకలూరిపేట, ఆంధ్రప్రభ
ఇష్టమైన చేపలు వండుకుని తినడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు కొందరు.
ట్రాక్ దాటుతుండగా బైక్ స్కీడ్.. క్షణాల్లోనే రైలు ఢీకొని మృతి
మనిషికి మృత్యువు ఏ క్షణంలో ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. మృత్యు సమీపించే ఘడియలు వస్తే దాన్ని ఎవరూ ఆపలేరు. ఉత్తర్ప్రదేశ్కి చెందిన ఓ యువకుడి విషయంలోనూ ఇదే జరిగింది. రైల్వే ట్రాక్ దాటేందుకు వచ్చిన ఆ యువకుడు రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. గ్రేటర్ నోయిడాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తుషార్ అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. కానీ, అతని బైక్ స్కిడ్ అయి ట్రాక్పై పడిపోయింది. వెంటనే తేరుకొని బైక్ను లేపే ప్రయత్నం చేశాడు. మరోవైపు రైలు వేగంగా రావడం గమనించి అక్కడి నుంచి తప్పుకుందామని అనుకున్నాడు. కానీ అప్పటికే రైలు అతడిని ఢీకొట్టింది. దీంతో తుషార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వేట్రాక్లు దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గేట్ వేసి ఉన్న సమయంలో ట్రాక్పై నుంచి దాటడానికి ప్రయత్నించవద్దని పేర్కొన్నారు.
Bojjala Sudheer : బొజ్జల సుధీర్ రెడ్డి షాకింగ్ వీడియో రిలీజ్
కోట వినుత డ్రైవర్ రాయుడు వీడియోపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు
తమిళనాడులో స్విగ్గీ, జోమాటోలపై తిరుగుబాటు #TamilNadu #Swiggy #Zomato #FoodDelivery #Hotels
Kavitha : కవిత గోల్ అదేనా? ఒక్కసారి అందరికీ షాక్ ఇవ్వనున్నారా?
కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో భవిష్యత్ కార్యాచరణపై ఆమె తన సన్నిహితులతో చర్చించినట్లు తెలిసింది
ఊరికి స్మశాసం లేదమ్మా ( నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) : రతనాల సీమ
Andhra Pradesh : కల్తీ మద్యం కేసులో జనార్థన్ రావు జోగి రమేష్ పేరు చెప్పారా?
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కేసులో ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
వాచిన కాళ్లు.. అలసిన శరీరం..ఇదే ఆశీర్వాదం#TeluguPost #telugu #post #news
మూడు రోజుల పండుగ సెలవులు” #education #telangana #andhrapradesh #holidays #Diwali #students
పూరన్ కుమార్ కుటుంబాన్నికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ భట్టిఫోన్లో బాధిత కుటుంబంతో మాట్లాడిన సీఎం.రేవంత్ రెడ్డివిశాలాంధ్ర – హైదరాబాద్ :: చండీఘడ్ లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. సోమవారం పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్ ను కుటుంబ సభ్యులను ఓదార్చిన డిప్యూటీ సీఎం.ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ […] The post పూరన్ కుమార్ కుటుంబాన్నికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది appeared first on Visalaandhra .
సంక్షేమ హాస్టళ్ల పై ప్రత్యక దృష్టి పెట్టాలి
విద్యార్థులకు సరైన పౌష్టిక ఆహారం అందేలా చూడాలిసమీక్షా సమావేశంలో సీఎం.రేవంత్ రెడ్డివిశాలాంధ్ర – హైదరాబాద్ :: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పూర్తిస్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. సోమవారం వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ […] The post సంక్షేమ హాస్టళ్ల పై ప్రత్యక దృష్టి పెట్టాలి appeared first on Visalaandhra .
మా పిల్లలకు చదువు చెప్పండి నర్సంపేట, ఆంధ్రప్రభ : మా పిల్లలకు చదువు
ఘనంగా వైకుంఠం శ్రీరాముల జన్మదిన వేడుకలు
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆలూరు టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, మాజీ ఇన్చార్జి వైకుంఠం శివప్రసాద్ కుమారుడు వైకుంఠం శ్రీరామ్ జన్మదిన వేడుకలు సోమవారం మండల కేంద్రంలోని గాంధీ పార్క్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల యూత్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర, టిడిపి సీనియర్ నాయకులు సంజన్న, బత్తిన జీవన్ కుమార్, ముత్తుకూరు మల్లికార్జున, […] The post ఘనంగా వైకుంఠం శ్రీరాముల జన్మదిన వేడుకలు appeared first on Visalaandhra .
Ponguleti : ఆరోపణలపై మంత్రి పొంగులేటి ఏమన్నారంటే?
తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు
మెడికల్ కళాశాలలో అక్టోబర్ 13 నుండి 17 వరకు సిపిఆర్ అవగాహన వారోత్సవాలు
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీవిశాలాంధ్ర అనంతపురం : మెడికల్ కళాశాలలో అక్టోబర్ 13 నుండి 17 వరకు సిపిఆర్ అవగాహన వారోత్సవాలనుమెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీ సోమవారం ప్రారంభించారు. అవగాహన కార్యక్రమాన్ని కార్డియో పల్మనరీ అనస్థీషియా ప్రధాన విభాగాధిపతి ఆచార్య ఏ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీ , ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి […] The post మెడికల్ కళాశాలలో అక్టోబర్ 13 నుండి 17 వరకు సిపిఆర్ అవగాహన వారోత్సవాలు appeared first on Visalaandhra .
ముగిసిన 4వ రోజు ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే..
న్యూఢిల్లీ: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఎట్టకేలకు ఐదో రోజు వరకూ వెళ్లింది. ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ జట్టు వీరోచితంగా పోరాడింది. ముఖ్యంగా చివరి వికెట్ని గ్రీవ్స్, సీల్స్ ఇద్దరు కాపాడుకుంటూ.. పరుగులు సాధించారు. దీంతో వెస్టిండీస్ 390 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారత్ ముందు 121 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. అయితే లక్ష్య చేధనలో భారత్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 9 పరుగుల వద్దే యశస్వీ జైస్వాల్ (8) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన సాయి సుదర్శన్తో మరో ఓపెనర్ రాహుల్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వచ్చారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. క్రీజ్లో రాహుల్ (25), సుదర్శన్ (30) ఉన్నారు. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే భారత్ ఇంకా 58 పరుగులు చేయాలి.
చిన్నపిల్లలకు విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న వాటిని తప్పనిసరిగా తినిపించాలి..
రిటైర్డ్ జిల్లా ఆందత్వ నివారణ అధికారి సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం;; చిన్నపిల్లలకు విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న వాటిని తప్పనిసరిగా తినిపించాలని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, జిల్లా వైద్యాధికారి సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను రిటైర్మెంట్ తీసుకున్నప్పటి నుండి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని తెలిపారు. కంటి పట్ల తాను సర్వీసులో ఉన్నప్పుడు వేలాదిమందికి అవగాహనతో పాటు, కంటి చూపు యొక్క ప్రాధాన్యతను తెలపడం జరిగిందన్నారు. కంటిలో నలుసు […] The post చిన్నపిల్లలకు విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న వాటిని తప్పనిసరిగా తినిపించాలి.. appeared first on Visalaandhra .
Jubilee Hills by-election : తొలిరోజు పది నామినేషన్లు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది
పేద ప్రజల కళ్ళకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం..
అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజల కళ్ళకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణ, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఆవరణములో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పేద […] The post పేద ప్రజల కళ్ళకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం.. appeared first on Visalaandhra .
చదువుతోనే సమాజంలో గుర్తింపు..
చదువుతోనే సమాజంలో గుర్తింపు.. కల్వకుర్తి, ఆంధ్ర ప్రభ : కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్
ఇంట్లో ఎంత బంగారం ఉండొచ్చు? రూల్స్ ఏంటి? #telugupost #goldjewellery #gold #latestnews #facts
జాతీయ అవార్డు గ్రహీత జూజారె నాగరాజుకు సన్మానం..
రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం వాసి, ప్రముఖ డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత జూజారే నాగరాజును రోటరీ క్లబ్ కమిటీ అధ్యక్షులు నాగభూషణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఆవరణములో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే నాగరాజు చేనేత పరిశ్రమకు చేసిన సేవలు పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము […] The post జాతీయ అవార్డు గ్రహీత జూజారె నాగరాజుకు సన్మానం.. appeared first on Visalaandhra .
లిక్కర్ మాఫియాపై కఠిన చర్యలు తప్పవు
లిక్కర్ మాఫియాపై కఠిన చర్యలు తప్పవు (కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో ) :
ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలను తప్పక అందించాలి..
ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలను తప్పక అందించాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో వైద్య సేవలు, పరిశుభ్రత పరిస్థితులు, ఔషధాల లభ్యత, సిబ్బంది హాజరు వంటి అంశాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. తదుపరి ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందుతున్న రోగులతో వారు వ్యక్తిగతంగా మాట్లాడి వారికి అందిస్తున్న సదుపాయాలు గూర్చి వివరాలను అడిగి […] The post ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలను తప్పక అందించాలి.. appeared first on Visalaandhra .
ఇద్దరు ప్రేయసుల నడుమ.. ప్రియుడు.. ‘తెలుసు కదా’ ట్రైలర్
యువ హీరోలలో సిద్ధూ జొన్నలగడ్డకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కెరీర్ ఆరంభంలో చేసిన కొన్ని చిత్రాలకు అంత ఆదరణ లభించకపోయినా.. ‘డిజె టిల్లు’ సినిమాతో తన సత్తా నిరూపించుకున్నాడు సిద్ధూ. ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ‘టిల్లు స్క్వేర్’ అనే సినిమాతో పలకరించాడు. ఈ సినిమా అంతంత మాత్రంగా ఆడింది. అయితే ప్రస్తుతం సిద్ధూ చేస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. రొమాంటిక్ కామెడి జానర్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోనా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యం ఈ సినిమా నుంచి వచ్చిన ‘మల్లిక గంధ’ అనే పాట సూపర్ హిట్ అయింది. సోమవారం ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇద్దరు ప్రేయసుల నడుమ చిక్కుకుపోయిన ప్రియుడి కథ ఇది అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టిలు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన విడుదల కానుంది.
ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన
ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జగిత్యాల, ఆంధ్రప్రభ : బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కార
నిధులు ఎక్కువైనా ఇచ్చేందుకు సిద్ధం: పొంగులేటి
హైదరాబాద్: ఎంత ఖర్చయినా సరే.. మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేడారం పనులు సకాలంలో పూర్తి చేయడమే తన విధి అని అన్నారు. మేడారం అభివృద్ధి పనులను మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. మేడారం గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష జరిపారు. నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మేడారంలో పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి పనులపై అందరి సూచనలు తీసుకుంటూనే ఉంటామని, కేవలం ప్రాంగణం అభివృద్ధి కోసమే రూ. 101 కోట్లు కేటాయించామని తెలియజేశారు. అన్ని హంగులతో 90 రోజుల్లో పనులు పూర్తి చేయాలని, మేడారం అభివృద్ధికి రూ. 212 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ వేశామని అన్నారు. నిధులు ఎక్కువైనా ఇచ్చేందుకు సిద్ధమని, మేడారంలో భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
పక్క దేశంలోని తాలిబన్లు ప్రగతిశీలురా
The post పక్క దేశంలోని తాలిబన్లు ప్రగతిశీలురా appeared first on Visalaandhra .
కోడిపందెం ఆడుతున్న వ్యక్తి అరెస్ట్..
11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం.. రూరల్ ఎస్సై శ్రీనివాసులు.విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామ సమీపములో గల కొండపైన కోడిపందెం ఆడుతున్నారన్న రహస్య సమాచారముతో రూరల్ ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాడి చేసి, కోడిపందెం ఆడుతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద రూ.250 తో పాటు 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. మరికొంతమంది పరారీలో వెళ్ళిపోయారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ […] The post కోడిపందెం ఆడుతున్న వ్యక్తి అరెస్ట్.. appeared first on Visalaandhra .
Telusu Kada will make a historical mark in love stories – Neeraja Kona
Telusu Kada has become the talk of the industry in recent times with each promotional material hitting the bullseye. Siddhu Jonnalagadda’s character from the film has become a talking point as he falls in love with two women and supports his stance. Neeraja Kona has directed this edgy romantic movie with deft touch. Now, the […] The post Telusu Kada will make a historical mark in love stories – Neeraja Kona appeared first on Telugu360 .
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నకిలీ మద్యం..
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నకిలీ మద్యం.. ( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో
Fact Check: AP Deputy CM Pawan Kalyan did not threaten to ‘Scrape the Skin’ DMK MLAs
Fact Check clarifies that actor-politician’s warning was directed at YSRCP leaders, not DMK MLAs
నిరసన తెలిపిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది
విశాలాంధ్ర -పామిడి : తమ డిమాండ్ల సాధన కోసం గత 15 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్న వైద్యాధికారులకు మద్దతుగా, పామిడి మండలం పరిధిలోని ఎద్దులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) సిబ్బంది సోమవారం నిరసన తెలిపారు.వైద్యాధికారులు సమ్మెకు దిగిన నేపథ్యంలో, పీహెచ్సిలోని ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తూనే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్యాధికారులు చేస్తున్న సమ్మె న్యాయబద్ధమైందని, వారి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.వైద్యులు లేకపోవడం వల్ల ప్రాథమిక […] The post నిరసన తెలిపిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది appeared first on Visalaandhra .
ఇది మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం..
ఇది మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం.. తిర్యాణి, ఆంధ్రప్రభ : ప్రధాన్ తెగపై అనుచిత
పేకాట, కోడిపందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు..
9 మంది జూదరులు అరెస్టు..రూ1,77,500 నగదు .9,సెల్ ఫోన్లు స్వాధీనం.విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం డి.ఎస్.పి హేమంత్ కుమార్ పర్యవేక్షణలో పట్టణంలోని వై జంక్షన్ సమీపంలో, బాల్ రెడ్డి వైన్ షాప్ పక్కన ఉన్న బిల్డింగ్ పైన పేకాట ఆడుతున్నారన్న రాబడిన సమాచారం మేరకు ధర్మవరం వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ తమ సిబ్బందితో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి 9 మంది పేకాటరాయలను అరెస్టు చేయడంతో పాటు రూ 1,77,800 నగదును , 9 సెల్ […] The post పేకాట, కోడిపందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు.. appeared first on Visalaandhra .
విద్యార్థులకు చదువుతోపాటు కరాటే క్రీడను కూడా తల్లిదండ్రులు తప్పక నేర్పించాలి
ఏపీ పోలీస్ అకాడమీ కోచ్ మురళీకృష్ణారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులకు చదువుతోపాటు కరాటే క్రీడలను కూడా తల్లిదండ్రులు తప్పక నేర్పించాలని ఏపీ పోలీస్ అకాడమీ కోచ్ మురళీకృష్ణారెడ్డి, కదిరి సీనియర్ కరాటే మాస్టర్ అక్బర్ అలీ, హ్యూమన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ లాయర్ సుమలత తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని జీవి ఈ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్లో ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో 80 మంది విద్యార్థులు బెల్ట్ గ్రేడింగ్ పోటీపరీక్షలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన పోటీలో 50 మంది […] The post విద్యార్థులకు చదువుతోపాటు కరాటే క్రీడను కూడా తల్లిదండ్రులు తప్పక నేర్పించాలి appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |బెస్ట్ రాజధాని చేస్తాం/ట్రిపుల్ ఆర్ రగడ/జూబ్లీహిల్స్ దెబ్బ
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 13-10-2025, 4.00PM వరల్డ్లోనే బెస్ట్ రాజధాని చేస్తాం సూర్యఘర్..
కాళేశ్వరం బ్యాక్ వాటర్తో నష్టపోయిన పంటలు
కాళేశ్వరం బ్యాక్ వాటర్తో నష్టపోయిన పంటలు ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ :