Kesamudram |అన్నంలో పురుగులు.. విద్యార్థుల నిరసన
Kesamudram | అన్నంలో పురుగులు.. విద్యార్థుల నిరసన అల్పాహారం పెట్టటం లేదని ఆరోపణలు
GADKARI |ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు
GADKARI | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించడం చట్టపర ప్రక్రియ భారాన్ని మోయవచ్చు. కానీ ఇందులో గుర్తించలేని రాజకీయ ప్రతీకార చర్య దాగి ఉందన్న దుర్గంధం గుప్పుమంటోంది. ఒకవైపు ప్రజలంతా ఈ సమయంలో ఉద్రిక్తతలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని అభ్యర్థిస్తూ , మరోవైపు ఈ తీర్పు చారిత్రాత్మకమైనదని, అత్యంత లోతైన పరిశీలనతో కూడుకున్నదని మొహమ్మద్ యూనస్ నేతృత్వం లోని తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రభుత్వం తనకు తాను గొప్పలు చెప్పుకుంటోంది. అయినప్పటికీ బంగ్లాదేశ్ అంతటా చెలరేగిన రాజకీయ అశాంతి ఇప్పటివరకు చేసిన పొరపాట్లలో ఉన్న లోతుపాతుల పగుళ్లను బయటపెడుతోంది. బంగ్లాదేశ్కు విముక్తి ప్రసాదించిన పోరాట యోధుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె హసీనా. ఆమెకు అత్యంత సన్నిహితుడైన బంగ్లా మాజీ హోం మంత్రి అసదుజమాన్ ఖాన్కు కూడా మరణశిక్ష పడింది. వీరిద్దరినీ తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ఒత్తిడి తెస్తోంది. దీనికి భారత్ విముఖత చూపిస్తుండటంతో ఇంటర్పోల్ను ఆశ్రయించడానికి బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. భారత్ నుంచి తిరిగి బంగ్లాదేశ్కు వెళ్లాలని హసీనాకు ఇష్టం లేకపోయినా, వెళ్లిపోవాల్సిందిగా భారత్ అసాధారణంగా బహిష్కరించినప్పుడు ఆమె ఉరికంబం ఎక్కవలసి వస్తుంది. ప్రజలు ఎన్నిక చేయని తాత్కాలిక ప్రభుత్వ నిర్వహణ లోని ట్రిబ్యునల్ తీర్పు కేవలం రాజకీయ ప్రతీకారమేనని, తన వాదనలు వినిపించనీయకుండా ఏకపక్ష నిర్ణయమని ఆమె విమర్శిస్తున్నారు. హసీనాను తమ దేశానికి తిరిగి పంపించివేయాలని బంగ్లాదేశ్ అభ్యర్థనను భారత్ పట్టించుకోకపోవడం సమంజమే. ఎందుకంటే చట్టబద్ధంగా ఎన్నికై, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఏర్పడినప్పుడే తాము ఆలోచించాల్సి వస్తుందని భారత్ వాదిస్తోంది. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో హసీనాకు చెందిన అవామీ లీగ్కు చోటు లేకుండా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం వేటు వేసింది. హసీనా మూడు ప్రధాన సంఘటనల్లో దోషిగా తేలారు. గత ఏడాది విద్యార్థుల నేతృత్వంలో సాగిన తిరుగుబాటులో ఘర్షణలను ప్రేరేపించడం, కాల్పులకు ఆదేశాలు ఇవ్వడం, దౌర్జన్యాల నివారణలో వైఫల్యం చెందడం ఈ మూడు విషయాల్లో ఆమె పొరపాట్లు చేసి దోషిగా తేలారు. ఈ మూడింటిలో రెండు విషయాల్లో ఆమెకు ట్రిబ్యునల్ మరణశిక్ష విధించగా, మూడో విషయంలో ఆమె సహజ మరణం పొందేవరకు జీవితఖైదు విధించాలని తీర్పు వెలువడింది. 2024 నాటి అల్లకల్లోలంతో బాధపడుతున్న దేశంలో ఈ అవకాశాలు మరింత దహించి వేస్తున్నాయి. తిరుగుబాటు తరువాత అణచివేత చర్యలను దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ పరిశోధకులు బంగ్లాదేశ్లో దాదాపు 1400 మరణాలు సంభవించాయని అధికారికంగా ధ్రువీకరించారు. వీటిలో చాలావరకు దగ్గరగా గురిపెట్టి కాల్చిచంపారని తేల్చారు. ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణాలు జరిగాయని, నియంతృత్వ విధానంతో ఏకపక్షంగా అరెస్టులు సాగాయని నివేదికలో వెల్లడించారు. ఆడియో రికార్డింగ్లను పరిశీలించగా ప్రభుత్వం ఎంత హద్దులు మీరి అతిగా ప్రవర్తించిందో చాలా దీనాతిదీనమైన దృశ్యం బయటపడింది. అయినప్పటికీ ఈ తీర్పు చాలా ఇబ్బందికరమైన సందర్భంలో వెలువడింది. ఈనాడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ పాలనలో సాగుతోంది. దీని చట్టబద్ధత సంక్షోభం నుంచి ఆవిర్భవించిందే తప్ప ప్రజా తీర్పు ద్వారా ఏర్పడలేదు. యూనస్ సారథ్యంలో ఢాకా ఇంకా స్థిరత్వాన్ని సాధించలేదు. తీర్పు వెలువడక ముందునుంచే బంగ్లాదేశ్ హసీనా మద్దతుదార్లు, అవామీలీగ్ కార్యకర్తల ఆందోళనలతో భగ్గుమంటోంది. ఢాకా లోని వీధివీధినా ఆందోళనలు, ఘర్షణలు సాగుతున్నాయి. బస్సులు తగలబడుతున్నాయి. లాఠీలు విరుగుతున్నాయి. ఒక దేశానికి అవసరమైన శాంతిభద్రతల సమతుల్యత, భద్రత ఇవేవీ కనిపించకుండా దూరంగా ఉంటున్నదంటే తాత్కాలిక ప్రభుత్వ పాలన ఎలా ఉందో అర్థమవుతోంది. చట్టపరమైన పాలన, రాజకీయ స్థిరత్వం కేవలం ప్రతీకార పునాదులపై నిర్మింపబడవన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. హసీనా కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు కొన్ని క్షమించరాని పొరపాట్లు చేశారు. ఆందోళనకారులపై సైనిక బలగాలు మితిమీరి చర్యలు తీసుకోకుండా అడ్డుకోలేకపోయారు. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేశారు. ఆమె పర్యవేక్షణలో అసమ్మతిని సహించలేకపోయారు. అయినాసరే మరణశిక్ష తీర్పుతో రాజకీయ ప్రతీకారం సమానం చేయడం తీవ్ర ఆక్షేపణీయం. న్యాయం అన్నది ముందుగా సాగే మార్గాన్ని ప్రకాశవంతం చేయాలే తప్ప అస్తిరతలోకి దేశం దిగజారేలా మరింత తీవ్ర పరిస్థితులను కల్పించరాదు. ఇక ఈ పరిస్థితుల్లో భారతదేశం సంయమనం కోరుకుంటోంది. బంగ్లాదేశ్తో దైపాక్షిక సంబంధాల్లో క్లిష్టతరమైన దశను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా రానున్న బంగ్లాదేశ్ ఎన్నికల్లో హసీనాకు చెందిన అవామీలీగ్కు ప్రాతినిధ్యం లేనప్పుడు ఢాకా లో రాజకీయ అనిశ్చితి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ బంగ్లాదేశ్ అంటే కేవలం ప్రభుత్వమే కాదు, తన ప్రజలు, తన సాంస్కృతిక వారసత్వ భాగస్వామ్యం, ఆర్థిక భవిష్యత్తు, దేశభద్రత ఇవన్నీ పెనవేసుకుని ఉన్నాయన్న వాస్తవాన్ని బంగ్లాదేశ్ పాలకులు అర్థం చేసుకోవాలి. ఈ విషయాల్లో దీర్ఘదృష్టి మందగిస్తే ఉపఖండంలో అత్యంత కీలకమైన పరిణామాలను ప్రమాదంలో నెట్టేయడమే అవుతుంది. ఇప్పుడు హసీనాకు విధించిన మరణశిక్ష బంగ్లాదేశ్ నియంతృత్వ విధానాలకు ప్రారంభ సంకేతమా లేక రాజకీయ ప్రతీకార చర్యల కొనసాగింపా అన్నది బంగ్లాదేశ్ ప్రభుత్వం తనకుతాను నిర్ణయించుకోవాలి.
ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే కఠిన చర్యలు: సిపి సజ్జనార్
హైదరాబాద్: పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. గురువారం తన ట్విట్టర్ సిపి సజ్జనార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగిన, దాడులు చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసులను నమోదు చేయడంతో పాటు హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉంటుందని, పాస్ పోర్టు జారీకి, ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయని, క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసిన జీవితాంతం కుమిలిపోయేలా చేస్తామని హెచ్చరించారు.
Vikarabad |నిలిచిన డయాలసిస్ సేవలు
Vikarabad | నిలిచిన డయాలసిస్ సేవలు Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ :
బీహార్ 18వ శాసనసభ 243 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధాని మోడీ సారథ్యంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) అంచనాలకు మించి అఖండ విజయం సాధించడం సుపరిపాలనకు, అభివృద్ధికి అనుకూలంగా ప్రజలిచ్చిన తీర్పు. ప్రతిపక్ష మహాగట్బంధన్ నేతగా బరిలో నిలిచి హోరాహోరీగా తలపడి ఈసారైనా ముఖ్యమంత్రి కావాలని ఉధృతంగా ప్రచారం సాగించిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) యువనేత తేజస్వి యాదవ్ ఆశలు ఆడియా శలయ్యాయి. ఎన్డిఎను దీటుగా ఢీ కొట్టడానికి కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం, ప్రతి మహిళ ఖాతాలో నెలనెలా రూ. 2500 నగదు జమ చేస్తామని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గట్టి ప్రయత్నాలు చేస్తామని, పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి యువత జీవితాలలో వెలుగులు నింపుతామని ఆశలు రేపినా అధికార కూటమి ముందు వెలవెలపోవలసి వచ్చింది. ఇందుకు భాగస్వామ్య పక్షాల పనితీరు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ప్రాచీన జాతీయ పార్టీగా ఎన్నో ఏళ్లు ఈ దేశాన్ని, వివిధ రాష్ట్రాల్లో ఏకఛత్రాధిపత్యం నెరపిన కాంగ్రెస్ గంగా మైదాన రాష్ట్రాలు యుపి, బీహార్, పశ్చిమబెంగాల్లో మండల్ రాజకీయాల కారణంగా ప్రాభవం కోల్పోయి, సంస్థాగతంగా కోలుకోలేనంత శిధి ల స్థాయికి చేరడం, అయినా చేవలేకపోయినా అత్యధిక స్థానాలు తీసుకుని మహాపరాజయం చెందడం ఈ ఎన్నికలలో మరింత స్పష్టమైనది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్ధానాలలో పోటీచేసి 19 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఈసారి సర్దుబాటులో 51, స్నేహపూర్వక పేరుతో మరో 10 మొత్తం 61 స్థానాలలో పోటీ చేసి కేవలం 6 సీట్లే గెలవడం గట్బంధన్కు శరాఘాతమైనది. గత ఎన్నికల్లో వామపక్షాలు 16 స్థానాలు గెలిచి (సిపిఐ ఎంఎల్ 12, సిపిఐ 2, సిపిఎం 2) కాంగ్రెస్ కంటే మెరుగ్గా ఫలితాలు సాధించినా ఈసారి సిపిఎంఎల్ కేవలం 2, సిపిఎం భిభూతిపూర్ ఒక్క స్థానాన్ని గెలవగా, సిపిఐ ఒక్క స్థానం లో కూడా విజయం సాధించలేకపోవడం విచారకరం. యాదవ, ముస్లిం బంధంతో 32% ఓట్లకుతోడు అత్యంత వెనుకబడిన (ఇబిసి) కులాల ఓట్లు రాబట్టే వ్యూహంలో భాగంగా నిషదులలో 2.6% ఉన్న మల్లా ఉపకులం ఓట్ల కోసం ముకేశ్ సహానికి ఉప ముఖ్యమంత్రి హామీతో వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి)తో జట్టు కట్టినా ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేకపోయింది. ముంబయిలో సినిమా సెట్ డిజైనర్గా పనిచేసే ముఖేష్ ఆరేడేళ్ల క్రితం బీహార్కు తిరిగి వచ్చి గత ఎన్నికల్లో ఎన్డిఎతో చేరి, డిప్యూటీ సిఎం పదవి హామీతో గట్బంధన్తో జట్టుకట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గంగా తదితర నదీ పరీవాహక ప్రాంతాలలో పడవలు నడపటం, చేపలు పట్టడం వంటి వృత్తుల్లో ఉన్న కేవట్, మల్లా తదితర మత్స్యకారులు బీహార్ జనాభాలో 8 శాతం, ఇబిసిలలో గణనీయంగా ఉన్నా వారు ప్రధానంగా జెడి(యు), ఎన్డిఎ మద్దతుదారులు. ఇలా ప్రధాన భాగస్వామ్య పక్షాలు అధ్వాన ప్రభావం చూపడంతో 50 మంది యాదవులకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చినా గట్బంధన్ మహా పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. అయితే తేజస్వి నేతృత్వంలోని ఆర్జెడి గత ఎన్నికలలో 75 సీట్లు గెలిచి పెద్ద పార్టీగా నిలిచింది. ఈసారి 143 స్థానాలకు పోటీ చేసి కేవలం 25 సీట్లే గెలిచి, 50 సీట్ల కోల్పోయినా తన 23 శాతం ఓటు బ్యాంకును నిలబెట్టుకోగలగడం ఆ పార్టీకి కొంత ఊరట. బీహార్ వ్యవసాయ ప్రధాన నిరుపేద రాష్ట్రం. పట్టణ జనాభా కేవలం 11 శాతం. జీవాలు, పాడి పశువులు, మత్స్య పరిశ్రమపై ఆధారపడి మూడోవంతు రాష్ట్ర ప్రజలు మనుగడ సాగిస్తున్నారు. గట్బంధన్ గెలిస్తే 1990 నుండి -95 వరకు సాగిన లాలూ, రబ్రీదేవిల ఆటవిక పాలన మళ్లీ వస్తుందని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్సింగ్, ఆరోగ్య మంత్రి నడ్డా, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభృత ఎన్డిఎ నాయకులు చేసిన భారీ ప్రచారం ఇబిసి కులాలు, మహా దళితులను భీతావహులను చేసింది. అదీగాక గత పదేళ్లకాలంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు మహిళలు, నిరుపేదలకు అందాయి. పల్లె రోడ్లతోబాటు జాతీయ, రాష్ట్ర రహదార్లను అభివృద్ధి చేసి రాకపోకలను సుగమం చేయడాన్ని ప్రజలు హర్షించారు. 1000 కి.మీగా ఉన్న గ్రామీణ రోడ్లను 1,16,880 కి.మీకు విస్తరించారు. గత 12 ఏళ్లలో పల్లెల్లో వివిధ గృహనిర్మాణ పథకాల కింద పేదలకు 59 లక్షల ఇళ్లను నిర్మించారు. గతంలో నీళ్లు, విద్యుత్, రోడ్ల వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రజలు ఎన్నో ఆందోళనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2019లో జలజీవన్ మిషన్ ప్రారంభించింది. గతంలో కేవలం 2 శాతం ఇళ్లకు మాత్రమే రక్షిత మంచినీటి సరఫరా ఉండేది. గత ఆరేళ్లలో నితీశ్ ప్రభుత్వం 95.7 శాతం ఇళ్ళకు మంచినీటి సౌకర్యాలు కల్పించింది. అఖిలభారత స్థాయిలో రక్షిత నీటి సరఫరా 81.3%. జాతీయ సగటు కంటే తక్కువే అయినా బీహార్లో తలసరి విద్యుత్ వినియోగం గత 12 ఏళ్లలో 134 నుండి 363 యూనిట్లకు పెరిగి, 3 రెట్లు పెరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలేగాక మహిళా సాధికారతను పెంపొందించడం కోసం నితీశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా, పట్టుదలగా కృషి చేస్తూనే ఉంది. 2006 లోనే పంచాయతీలలో 50 శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసిన మొదటి రాష్ట్రం బీహార్. ఆ తర్వాత ఆ రిజర్వేషన్లను పురపాలక సంఘాలకు విస్తరింపజేశారు. బాలికల విద్యను ప్రోత్సహించడానికి నితీశ్ ప్రభుత్వం 2006లో బాలికలకు సైకిళ్లు కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ. 2 వేలు ఇచ్చింది. అదీగాక హైస్కూలు నుండి డిగ్రీ వరకు వివిధ స్థాయిలలో బాలికలకు లక్ష వరకు ప్రత్యేక స్కాలర్ షిప్లు ఇస్తూ వచ్చారు. ఇందువల్ల విద్యాభ్యాసం కొనసాగించే బాలికల సంఖ్య 67 శాతానికి పెరిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. సోషలిస్టు అయిన నితీశ్ 1973లో స్వర్గీయ మంజు కుమారిని వివాహమాడినపుడు వరకట్నం వద్దని విలువలు పాటించారు. గత ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగి జెడి(యు)పై పోటీ పెట్టి ఆ పార్టీ విజయావకాశాలు దెబ్బతీసిన చిరాగ్ పాశ్వాన్ లోక్జనశక్తి పార్టీ ఈసారి ఎన్డిఎ భాగస్వామిగా 29 స్థానాలకు పోటీ చేసి, 19 గెలిచి బీహార్లో 4వ పెద్ద పార్టీగా నిలిచింది. ఎల్జెపి, మహా దళిత నేత జితన్ రామ్ మాంజి భాగస్వాములుగా ఉన్నందున గత ఎన్నికల్లో 37% ఉన్న ఎన్డిఎ ఓట్లు 10 శాతం అంటే 47 శాతానికి పెరిగాయి. 2010 ఎన్నికలలో ఆర్జెడికి 22 స్థానాలు, ఎన్డిఎకు 206 స్థానాలు వచ్చాయి. 2020 ఎన్నికలలో 43 స్థానాలకే పరిమితమైన నితీశ్ జెడి(యు) ఈసారి రెట్టింపు (85) స్థానాలు గెలవడమేగాక, తన సుపరిపాలనతో మహిళలు, మహా దళితులు, అత్యంత వెనుకబడిన కులాలను బాగా ఆకట్టుకుని వాళ్ళు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ఎన్డిఎ 67% పైగా ఓట్లు సాధించడంలో ప్రశంసనీయ పాత్ర పోషించారు. అందుకే జెడి(యు) ఈసారి 5% ఓట్లు పెరిగి, ఓట్లు 23 శాతానికి పెరగడం గమనార్హం. నితీశ్ ఎక్కడా కులమత ఘర్షణలు జరగకుండా పాలనలో కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారు. మైనారిటీలకు రక్షణ కల్పించారు. నితీశ్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి బిజెపి కుతంత్రాలు పన్ని చిరాగ్ను ఎగదోసినా, పెద్ద పార్టీగా బిజెపికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అప్పుడప్పుడు కొందరు కమల నేతలు సన్నాయి నొక్కులు నొక్కినా అందుకు సాహసించలేకపోయారు. నితీశ్ హిందూత్వ ఎజెండాను దూరం పెట్టారు. ప్రధాని మోడీ, తదితర కమల నేతలు వాస్తవాన్ని గుర్తించి ప్రాప్తకాలజ్ఞతతో నితీశ్ నే పదోసారి సిఎంగా అంగీకరించారు. బిజెపికి 2020లో 19.46% ఓట్లు రాగా, ఈసారి స్వల్పంగా 20.08 శాతానికి పెరిగాయి. 89 స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా ఉన్నా పెరిగిన ఓట్లు కొంచమే. జెడి(యు), బిజెపి చెరి 101 స్థానాలకే పోటీ చేసినా గరిష్ట ఫలితాలు సాధించి రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ అధికారం చేపడుతున్నాయి. గత 20 ఏళ్లుగా మహిళా సాధికారతను సాకారం చేయడానికి, అన్నార్తులై ఎలుకలు వేటాడి ఆకలి తీర్చుకునే ముసాహిర్ల వంటి మహా దళితులు, అత్యంత వెనుకబడిన కులాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన నితీశ్కు కృతజ్ఞత తెలియజేయడానికే ఆ వర్గాలు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని అభివృద్ధి, సుపరిపాలనకే మద్దతు పలికాయి. ఇప్పటికీ బీహార్ జనాభాలో మూడోవంతు దుర్భర దారిద్య్రంలో ఉండటం, ఏటా ఉపాధి కోసం 25 లక్షల మంది వలసలు వెళుతూ ఉండటం, పల్లెలు జనాలతో కిక్కిరిసి ఉండటం, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి ఆదాయాలు పెంచడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలే. 13.4 కోట్ల బీహార్ జనాభాలో కోటి మంది వలస వెళ్ళారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలు అభివృద్ధి చెందడం ఎంతో అవసరం. డబుల్ ఇంజిన్ సర్కార్లు అందుకు ఎంతో శ్రమించవలసి ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లక్షిత వర్గాలకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కేంద్ర పథకాల నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి ఒక ప్రత్యేక ఐఎఎస్ అధికారిని ఢిల్లీలో నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం అభినందనీయం. ప్రాప్తకాలజ్ఞతతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో హస్తం పార్టీ సకలశక్తులు ఒడ్డి ఘన విజయం సాధించింది. బిజెపి డిపాజిట్లు కోల్పోయి చతికిలబడింది. కెసిఆర్ బిఆర్ఎస్ ఇప్పటికీ బలంగానే ఉంది. ఈ సంగతి గుర్తించి రేవంత్ రెడ్డి సమ్మిళిత సుపరిపాలనతో ముందుకు సాగాలి. - పతకమూరు దామోదర్ ప్రసాద్ 94409 90381
Chennur |సామూహిక వందేమాతర గీతాలాపన
Chennur | సామూహిక వందేమాతర గీతాలాపన Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ :
DEATH|గుర్తు తెలియని వ్యక్తి మృతి
DEATH| నల్లమాడ, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం
విదేశీయులే.. పరిశోధనల కోసం ఇక్కడకు రావాలని, ఆ స్థితికి మన దేశం చేరుకోవాలని ఆకాంక్షించిన మహోన్నత వ్యక్తి రామన్. రామన్ ముందు వరకూ సైన్స్లో నోబెల్ బహుమతులు పాశ్చాత్యులకే దక్కేవి. కానీ, రామన్ అచ్చమైన భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని, తలమానికమైన పరిశోధన జరిపి సైన్సులో దేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పి భారత్కు నోబుల్ సాధించిపెట్టారు. ‘నా మతం సైన్సు.. దానినే జీవితాంతం ఆరాధిస్తా’ అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు. 1930 లో సి.వి. రామన్కు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన తరువాత ఇప్పటి వరకు మన దేశంలో జన్మించి, నివసిస్తున్న ఏ ఒక్క శాస్త్రవేత్తకు నోబుల్ బహుమతి లభించకపోవడం విచాకరం. మన దేశం లో జన్మించి, విదేశాలలో స్థిరపడ్డ హరగోవింద్ ఖురానా (1968), సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ (1983), వెంకట్రామన్ రామకృష్ణన్ (2009) లకు మాత్రమే సైన్స్రంగంలో నోబుల్ బహుమతులు లభించాయి. సత్యేంద్రనాధ్ బోస్, జి.యం. రాంచంద్రన్, ఉత్పల్, మాణిక్పాల్ భద్ర, మేఘనాధ్ సాహా, శంభునాధ్డే, హోమీ బాబా, జగదీష్ చంద్రబోస్, సి.ఎన్.ఆర్.రావు వంటి భారతీయ శాస్త్రవేత్తలు సైన్స్ పరిశోధనా రంగంలో అంతర్జాతీయంగా ఖ్యాతిగడించినప్పటికీ, నోబుల్ బహుమతులు పొందలేకపోయారు. 1930లో నోబెల్ బహుమతి స్వీకరించిన సందర్భంలో సివి రామన్ బహుమతి ప్రదానోత్సవానికి హాజరైన సభికులకు తాను ఆవిష్కరించిన రామన్ ప్రభావాన్ని ప్రదర్శించేందుకు ‘ఆల్కాహాల్’ని మాధ్యమంగా ఉపయోగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కాక్టెయిల్ పార్టీలో ‘ఆల్కాహాల్ తీసుకుంటారా’? అని రామన్ను విందుకు హాజరైనవారు అడుగగా ‘ఇప్పటి వరకు మీరు ఆల్కహాల్లో రామన్ ఎఫెక్టు చూసారు, రామన్పై ఆల్కహాల్ ఎఫెక్ట్ చూడాలని కోరుకోవద్దు’ అని చమత్కరించి పరోక్షంగా తాను మద్యానికి దూరంగా ఉంటాననే విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రశేఖర వెంకట్రామన్ 1888 నవంబర్ 7న ఆనాటి మద్రాసు ప్రావిన్సులోని తిరుచరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాల్లకు జన్మించారు. ఆయన బాల్యం నుంచే చురుకైన విద్యార్థిగా వుంటూ కేవలం 11 సంవత్సరాల వయస్సులోనే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. చిన్నతనంనుంచే పరిశోధన రంగంపై ఆసక్తి వున్న ఆయన విద్యాభ్యాసం అనంతరం 1907లో ఇండియన్ ఫైనాన్స్ డిపార్టుమెంట్లో అసిస్టెంట్ ఎకౌంటెంట్ జనరల్గా చేరారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు పరిశోధనపై దృష్టి సారించారు. తన లక్ష్యసాధన కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేరారు. 1919లో ‘ది ఇండియన్ అసోషియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్కు’ గౌరవ కార్యదర్శిగా నియమితులయ్యారు. సివి రామన్ కాంతిపై పరిశోధనలుచేసి 1928లో ‘రామన్ ఎఫెక్టు’ కనుగొన్నారు. కాంతి కిరణాలు ఒక ద్రవపదార్ధంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది, అంటే కాంతికిరణాలలోని ఫొటాన్ కణాలు ద్రవపదార్థాల పరమాణువులపైపడి పరిక్షేపణ చెందుతాయి. దూరపు కొండలు, సముద్రపు నీరు, ఆకాశం నీలి రంగులో ఉండటానికి గల కారణాలను రామన్ ఎఫెక్టు విశ్లేషిస్తుంది. వైద్యరంగంలో మందుల్ విశ్లేషణకు, రసాయన పదార్థాలలోని అణువులు, పరమాణువుల పరిశీలనకు, మనం ధరించే వస్త్రాల రంగుల అధ్యయనానికి రామన్ ఎఫెక్టు దోహదపడుతుంది. రామన్ ఫలితం ఆహారపు నాణ్యతని నిర్ధారించడంలో, పదార్థాల అణువుల నిర్మాణాన్ని గుర్తించడంలో, పదార్థాల రసాయనిక, భౌతిక గుణాలను గుర్తించడంలో ఉపయోగపడుతుంది. రామన్ ఫలితాన్ని ఉపయోగించి యానక పదార్థం నిర్మాణాన్ని విశ్లేషించవచ్చు. పదార్థాల స్పటిక నిర్మాణాలను అవగతం చేసుకోవటానికి రామన్ ఫలితం ఉపయోగపడుతుంది. ఆయన పరిశోధనలకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. రామన్ ఎఫెక్టు కనుగొన్న రోజైన ఫిబ్రవరి 28ని భారత ప్రభుత్వం ‘జాతీయ సైన్స్ దినోత్సవంగా’ ప్రకటించింది. 1933లో బెంగళూరులోని ప్రతిష్టాత్మక ‘ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ కు రామన్ డైరెక్టర్గా నియమించబడ్డారు. 1948లో ఆయన బెంగళూరులో ‘రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను’ స్థాపించి పలువురు యువశాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. కేవలం రూ. 250తో రామన్ తన ప్రయోగాన్ని ఆవిష్కరించడం విశేషం. 1954లో రామన్ని ‘భారతరత్న’ వరించింది. మత విశ్వాసాల ఆధారంగా విద్యాలయం నడిపే ఒక మతసంస్థ రామన్ను తమ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించమని ఆహ్వానిస్తే ‘స్వర్గం, నరకం, పునర్జన్మ వంటి అశాస్త్రీయ విషయాలపై నేను మాట్లాడను’ అని ఆ సంస్థ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. ‘సైన్సే నా మతం’ అని రామన్ స్పష్టం చేశారు. ఆయన ధ్వనిపై కూడా పలు పరిశోధనలు చేసారు. నోబెల్ బహుమతి పొందినప్పుడు రామన్ ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తూనే మరొకవైపు ‘దేశం పరాయిపాలనలో ఉందని బహుమతి అందుకునేటప్పుడు నా దేశం తరపున, నా దేశ జాతీయజెండా లేకపోవడం నన్ను బాధిస్తుందని’ రామన్ తెలిపి దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. ‘ది లైట్ ఆఫ్ ఏషియా’ పుస్తకం రామన్పై అమిత ప్రభావం చూపించింది. ఆత్మన్యూనతా భావాన్ని, ఓటమి భయాన్ని వీడి ధైర్యంతో ముందడుగు వేసి పరిశోధనా రంగంలో భారత కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయంగా నిలపాలని, నిరంతర పరిశీలన, అధ్యయనంతోనే ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. సైన్సులో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా ఛేదించి ప్రపంచ వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధృవతార సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ (సివి రామన్) 1970 నవంబర్ 21న తుదిశ్వాస విడిచారు. ఇటీవల ప్రకటించిన నోబెల్ బహుమతుల్లో కూడా మన దేశానికి స్థానం దక్కలేదు.అందుకే సివి రామన్ స్ఫూర్తితో నేటి పాలకులు పరిశోధనలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయవలసిన అవసరం ఉంది. అప్పుడే మనదేశం సైన్స్ ఆవిష్కరణలలో ముందుండే అవకాశం ఉంటుంది. - యం. రాంప్రదీప్ 94927 12836
పేదల కష్టాలు ఏ మాత్రం తీరలేదు: కవిత
రంగారెడ్డి: ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఎంఎల్ సి కవిత తెలిపారు. శెరిలింగంపల్లిలో 2014 లో ఇక్కడ 64 చెరువులు ఉండేవని ఇప్పుడు అనేక చెరువులు కబ్జాకు గురయ్యానని మండిపడ్డారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఆమెకు తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. సే నో డ్రగ్స్ క్యాంపెయిన్ లో భాగంగా విద్యార్థులతో కలిసి కవిత ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. శేరిలింగంపల్లి నుంచి తమ పర్యటనను మొదలు పెట్టామని, ఇవాళ యువమిత్రులతో కలిసి నో టు డ్రగ్స్ అనే కార్యక్రమం చేపట్టామన్నారు. మత్తుకు బానిసైన యువతను ఆ ఊబి నుంచి ఏలా బయటకు తేవాలన్న దానిపై జాగృతి కృషి చేస్తుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం చాలా పెద్దది అని, కానీ ఇక్కడ పేదలు, పేద బస్తీలు చాలా ఉన్నాయని కవిత వివరించారు. ఈ విషయాన్ని హైదరాబాద్, తెలంగాణ ప్రజలు గమనించాలని, ఒక పక్క తెలంగాణకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు పోయాయని దుయ్యబట్టారు. పేదల కష్టాలు ఏ మాత్రం తీరలేదని, అభివృద్ధి ఫలాలు అందడం లేదని, వారికి సౌకర్యాలు పెరగలేదన్నారు. ట్రాఫిక్ కష్టాలు పెరిగాయని, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారని కవిత తెలియజేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు
కాలువలో పడిన ఏనుగు రక్షణ దృశ్యాలు #ElephantRescue #Karnataka #ForestDepartment #Shivanasamudra
The post Video: Venu Udugula Interview appeared first on Telugu360 .
Breaking News|కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి
Breaking News| కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి Breaking News| హైదరాబాద్,
GOOD NEWS|గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
GOOD NEWS| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు
Nara Bhuvaneswari |అదే.. రాష్ట్రాన్ని నిలబెట్టింది..
Nara Bhuvaneswari | అదే.. రాష్ట్రాన్ని నిలబెట్టింది.. Nara Bhuvaneswari, కుప్పం,ఆంధ్రప్రభ: యువత
ఆ సినిమాపై నెగెటివ్ టాక్ వస్తే అమీర్ పేటలో అర్థనగ్నంగా తిరుగుతా: దర్శకుడు
హైదరాబాద్: అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటి వి విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందు కు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ న్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. 15 ఏళ్లు ఓ జంటకు నరకం చూపించిన కథను తీసుకరాబోతున్నానని దర్శకుడు సాయి కంపాటి తెలిపారు. భావోద్వేగంతో కూడిన సినిమాలో ఎక్కువగా ఎమోషనల్గా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వస్తే అమీర్ పేటలో అర్థనగ్నంగా తిరుగుతానని సవాల్ విసిరారు. దీనిపై నెగిటివ్ ప్రచారం చేయవద్దని కోరారు. సినిమా నచ్చకపోతే వదిలేయాలని, నెగెటివ్ కామెంట్లు చేయకండని విజ్ఞప్తి చేశారు. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని తనకు నమ్మకం ఉందని, ఈ చిత్రం వెనుక ఎంతో మంది కష్టపడ్డారన్నారు. ఈ చిత్రంలో టైటిల్ సాంగ్కు అద్భుతమైన స్పందన వచ్చిందని ప్రశంసించారు. పల్లెటూరు కథతో రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీశానని తెలిపారు. గ్రామాలలో పొలం పనులు చేసుకునే మనుషులు, అమాయకంగా ఉండే ఆటో డ్రైవర్లు, కాలేజీల్లో అమ్మాయిల మధ్య మొరటు ప్రేమ పుడుతుందనే సినిమా ఉంటుందని వివరించారు. సినిమా యూనిట్తో కలిసి ఎంతో ఇష్టం పల్లెటూరి కథను తీస్తున్నానని పేర్కొన్నారు. విమానంలో వచ్చే హీరోలు, ట్రైన్ నుంచి దిగే హీరోయిన్ల గురించి తాను కథను రాయలేనని చెప్పారు.
సచివాలయం వద్ద స్కానర్ లో ఇరుక్కున్న మహిళా ఉద్యోగి కాలు#Hyderabad #Secretariat #Safety #Telangana
Maoists : మావోయిజం ఇక అంతరించినట్లేనా? కీలక నేతల మరణంతో?
మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు మావోయిజం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది
Chandrababu Naidu and Nara Lokesh to Join National Leaders
Bihar is all set for a major political moment as Nitish Kumar prepares to take oath once again as the Chief Minister. The swearing-in ceremony will take place this morning at Patna’s historic Gandhi Maidan, where a full-fledged National Democratic Alliance government is being shaped. Two Deputy Chief Ministers, Samrat Choudhary and Vijay Sinha, are […] The post Chandrababu Naidu and Nara Lokesh to Join National Leaders appeared first on Telugu360 .
kashi | రుద్రాభిషేకం.. kashi, సూర్యాపేట, ఆంధ్రప్రభ: మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో
నేడు సుప్రీంకోర్టులో కీలక తీర్పు
నేడు సుప్రీంకోర్టులో కీలక తీర్పు వెలువడనుంది.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా అంత్యక్రియలు జరగనున్నాయి
ప్రేమించడంలేదని... ఇంటర్ బాలికను పొడిచి చంపిన యువకుడు
చెన్నై: ప్రేమించడంలేదని బాలికను ఓ ప్రేమోన్మాది కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం రమనాథపురం జిల్లా రామేశ్వరం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సెరాంకొట్టెంలో మారియప్పన్ అనే కుటుంబం నివసిస్తోంది. మారియప్పన్కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు షాలిని ఇంటర్ కాలేజీలో చదువుతోంది. గత కొన్ని రోజుల నుంచి మునిరాజ్ అనే వ్యక్తి షాలిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో బాలిక తన తండ్రికి చెప్పడంతో మునిరాజ్ను మందలించాడు. మునిరాజు వేధింపులు ఎక్కువగా మారాయి. షాలినిపి ప్రేమించాలంటూ పలుమార్లు వెంటపడ్డాడు. కాలేజీ వెళ్తున్న షాలినిని కత్తీ తీసుకొని పొడిచాడు. ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Falkon | ఆగకుండా.. ఎగురుతూ.. Falkon, న్యూఢిల్లీ : భారత్ నుంచి వదిలిన
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, స్పిరిట్ మీడియా బ్యానర్ల మీద సొనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్ దాస్ కె నారంగ్ దివ్యాశీస్సులతో జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమంటే’. ఈ మూవీలో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించారు. ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా, ఆదిత్య మేరుగు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ నవంబర్ 21న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు లవ్ ట్రోట్టర్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువ సామ్రాట్ నాగ చైతన్య, సెన్సేషనల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో నాగ చైతన్య మాట్లాడుతూ .. “నవనీత్ మంచి పాయింట్తో కొత్త ప్రేమ కథను అందివ్వబోతోన్నారు. ‘ప్రేమంటే’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ అందమైన కథతో ‘ప్రేమంటే’ రాబోతోంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, ఆనంది, నవనీత్ శ్రీరామ్, జాన్వీ నారంగ్, సుమ కనకాల, హైపర్ ఆది పాల్గొన్నారు.
Telangana : నేడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది.
What Went Wrong with Upasana’s Egg-Freezing Debate?
Upasana Konidela’s remarks on marriage, career planning and egg freezing were meant to motivate young women to take control of their timelines. But what she said and how people received it turned out to be very different. The controversy didn’t explode because her message was offensive. It grew because many felt it came from a […] The post What Went Wrong with Upasana’s Egg-Freezing Debate? appeared first on Telugu360 .
Weather Report : ఇదేమి గండాలు సామీ.. ఇంకెన్ని వాయుగుండాలున్నాయో?
ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది
తిరుమల కల్తీ నెయ్యి కేసులో నేడు వైవీ సుబ్బారెడ్డి విచారణను సిట్ అధికారులు చేయనున్నారు
Gold Price Today : కొంత తగ్గాయ్ కానీ.. ఇంకా అందుబాటులోకి రాలేదుగా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ కర్నూల్ లో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడుతూ “ఆంధ్ర కింగ్ అనేది నా కెరీర్లోనే స్పెషల్ సినిమా. సంగీత దర్శకులు వివేక్, మెర్విన్ తెలుగులో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు. ఈ సినిమాలో నేను అభిమాని పాత్ర పోషించాను. సూపర్ స్టార్ పాత్రని ఉపేంద్ర పోషించారు. ఇది అభిమానుల సినిమా”అని అన్నారు. డైరెక్టర్ మహేష్ బాబు పి మాట్లాడుతూ “మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రామ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఉపేంద్రతో వర్క్ చేయడం కూడా అదృష్టం”అని పేర్కొన్నారు. నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ “డైరెక్టర్ మహేష్ అద్భుతమైన సినిమా తీశారు. చాలా కాలం మాట్లాడుకునే సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ భాగ్యశ్రీ, వివేక్, మెర్విన్ పాల్గొన్నారు.
పట్టపగలు నడిరోడ్డుపై టీచర్ కాల్చివేత
పాట్నా: పట్టపగలు నడిరోడ్డును టీచర్ను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన బిహార్ రాష్ట్రం ముజప్ఫర్నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తోరౌరా ప్రాంతంలో కైలాశ్ అనే టీచర్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కైలాశ్ కోచింగ్ క్లాస్లు చెప్పి తన సోదరుడి కలిసి ఇంటికి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి టీచర్ను తుపాకీతో కాల్చి చంపారు. కైలాశ్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. దీంతో సోదరుడు షాక్లో ఉండిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూవివాదమే ఈ హత్యకు కారణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Salman Khan to take up Direction Chair?
Bollywood Superstar Salman Khan has delivered some of the biggest blockbusters in his career but his recent films failed to recreate the magic and live up to the expectations. The actor has ghost directed several films in the past and he has never taken credit for his work. For the first time, Salman Khan will […] The post Salman Khan to take up Direction Chair? appeared first on Telugu360 .
బీహార్ వెళ్లిన చంద్రబాబు, లోకేష్
నేడు బీహార్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లు బయలుదేరి వెళ్లారు
ఊర్రూతలూగిస్తున్న ఫాస్ట్ బీట్ సాంగ్
గాడ్ ఆఫ్ ది మాసె స్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తు న్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ’అఖండ 2: తాండ వం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ సెకండ్ సింగిల్గా ‘జాజికాయ’ అంటూ సాగే పవర్ఫుల్ మాస్ డ్యాన్స్ నెంబర్ రిలీజ్ చేశారు. వైజాగ్లోని జగదాంబ థియేటర్లో గ్రాండ్గా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో పాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త తదితరులు హాజరై ఫ్యాన్స్లో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..“అఖండ ఫస్ట్ పార్ట్ మన దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో చూశారు. ఇప్పుడు సీక్వెల్ ‘అఖండ: తాండవం’ పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ కాబోతోంది. ఇప్పుడు రిలీజ్ అయిన పాట కుటుంబం పండగ చేసుకునే నేపథ్యంలో వచ్చే సాంగ్. తమన్ ఈ పాటకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు”అని చెప్పారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ..“సినిమాలో అనంతపురంలో జరిగే బర్త్ డే పార్టీలో వచ్చే పాట ఇది. సంయుక్త మీనన్ చేసిన ఫస్ట్ మాస్ సాంగ్ ఇది. ఈ సాంగ్ను బాగా ఎంజాయ్ చేస్తారు. ”అని తెలియజేశారు. నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ..“మంచి హైఓల్టేజ్ ఎనర్జీ ఉన్న ఫాస్ట్ బీట్ సాంగ్ ఇది. బాలయ్య ఎనర్జీకి, స్టైయిల్కి మ్యాచ్ అయ్యేలా ఉంటుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సంయుక్త పాల్గొన్నారు.
Trump Softens His Tone on H-1B Visas, Says America Needs Skilled Foreign Talent
US President Donald Trump surprised many by once again defending the H-1B visa program. His remarks at the US-Saudi Investment Forum in Washington left both supporters and critics stunned. The President, who built much of his political identity on strict immigration control, struck a noticeably softer tone. He even admitted that America cannot run a […] The post Trump Softens His Tone on H-1B Visas, Says America Needs Skilled Foreign Talent appeared first on Telugu360 .
Draupadi’s Murmu |శ్రీవారి సన్నిధిలో ముర్ము..
Draupadi’s Murmu | శ్రీవారి సన్నిధిలో ముర్ము.. ఆంధ్రప్రభ : భారత రాష్ట్రపతి
3 இந்திய விமானப்படை விமானங்கள் 2 மணி நேரத்திற்குள் வெடித்து சிதறியதா?
இரண்டு மணி நேரத்திற்குள் 3 இந்திய விமானப் படை விமானங்கள் விபத்தை சந்தித்ததாக பொய்யான தகவல் பரவி வருகிறது.
ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలు
ఇండోనేషియాలోని జావా ఐల్యాండ్లో మౌంట్ సెమెరు అగ్నిపర్వతం బద్దలైంది
Bus fire | దుండగల పనేనా..? Bus fire, కేతేపల్లి, ఆంధ్రప్రభ :
జడ్చర్లలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ట్యాంకర్ను వెనుక నుంచి జగన్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉన్న ట్యాంకర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ట్యాంకర్లోని కెమికల్తోనే ప్రమాద స్థలంలో పొగ వ్యాపించింది. మాచారం ఫ్లైఓవర్ వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘాటైన వాసన, పొగతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
నేడు పోలీస్ కస్టడీకి ఇమ్మడి రవి
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నేడు పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు
Bigg Boss Telugu 9: Family Week Brings Laughter, Tears and Energetic Mothers
Family Week continued on Bigg Boss Telugu 9, bringing a perfect mix of emotions, laughter, mischief and heartwarming reunions. Before welcoming families, Bigg Boss lightened the mood with a fun “Freeze–Rewind–Release–Fast Forward” session where housemates hilariously pranked one another. But the real emotional waves began when the families stepped inside. Freeze Fun Before the Tears […] The post Bigg Boss Telugu 9: Family Week Brings Laughter, Tears and Energetic Mothers appeared first on Telugu360 .
Pawan Kalyan to Arrive in Summer 2026
Pawan Kalyan has Ustaad Bhagat Singh completed for his portions and the pending shoot is being completed. Harish Shankar is working on the post-production work along with the pending shoot. The team had initially planned for a Maha Shivarathri 2026 release for Ustaad Bhagat Singh but they have changed their plans now. The team has […] The post Pawan Kalyan to Arrive in Summer 2026 appeared first on Telugu360 .
Suriya in talks for one more Telugu Film?
Tamil actor Suriya announced that he would do straight Telugu films. After rejecting several projects, he is working with Venky Atluri in a straight Telugu film which is in shooting mode and the film releases in summer 2026. As per the ongoing buzz, Suriya has given his formal nod for one more Telugu director. Brochevarevarura, […] The post Suriya in talks for one more Telugu Film? appeared first on Telugu360 .
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుపతికి చేరుకోనున్నారు
Tirumala : నేడు తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు
తమిళనాడులో భారీ వర్షాలు... ఎపికి మరో అల్పపీడనం
హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తమిళనాడు, ఎపిలో భారీ వర్షాలు కురవనున్నాయి. లక్షద్వీప్ దీవుల సరిహద్దుల్లో ఉన్న మాల్దీవుల వరకు అల్పపీడనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండడంతో తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, చెన్నై సహా ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తిరునల్వేలిలో పలు ప్రాంతాలు నీట మునిగడంతో జలపాతాల సందర్శన నిలిపివేశారు. తామిర భరణి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దక్షిణ తమిళనాడుపై వరద ప్రభావం ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఇది వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ, వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతున్నట్ల వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం కూడా ఉంది.
Hydra : విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హైడ్రా
హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన స్థలంలో ఆక్రమణలను తొలగించారు
Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రాజధాని ఇక
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది
Sheikh Hasina |కోసం ఇంటర్ పోల్ కు బంగ్లాదేశ్..
Sheikh Hasina | కోసం ఇంటర్ పోల్ కు బంగ్లాదేశ్.. Sheikh Hasina,
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నంలో డైమండ్ పార్కు వద్ద వ్యక్తి హత్య గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు మధ్య ఘర్షణ హత్యకు దారి తీసినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాయితో కొట్టి హతమార్చినట్టు పోలీసులు చెబుతున్నారు. హత్య చేసిన వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
India Vs South Africa : రెండో టెస్ట్ ఎవరికి అనుకూలం? క్రీడానిపుణులు ఏమంటున్నారంటే?
భారత్ - సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది
Ayyappa Swamy | మాల ధరిస్తే.. Ayyappa Swamy, బిక్కనూర్, ఆంధ్ర ప్రభ
Ys Jagan : నేడు సీబీఐ కోర్టుకు జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. సీబీఐ కోర్టులో హాజరు కానున్నారు
Godavari | నదీ మాతకు హారతి.. Godavari, జైపూర్, ఆంధ్రప్రభ : కార్తీక
Bihar : నేడు పదోసారి బీహార్ సీఎంగా నితీష్
బీహార్ ముఖ్యమంత్రిగా నేడు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు
Y.S.Jagan |సీబీఐ కోర్టుకు నేడు జగన్..
Y.S.Jagan | సీబీఐ కోర్టుకు నేడు జగన్.. Y.S.Jagan, హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో:
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో భాగంగా భారత్ పాకిస్థాన్ ఆటగాళ్లు
Accident | తిరగబడ్డ లారీ.. Accident, ఇచ్చోడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని
Satya sai Baba |అణువణువునా ఆధ్యాత్మికం..
Satya sai Baba | అణువణువునా ఆధ్యాత్మికం.. Satya sai Baba, శ్రీ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పం చాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సం ఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భా గంగానే పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు ఎస్ఈసీ షెడ్యూలు విడుదల చేసింది. గురువారం నుంచి నవంబర్ 23 వర కు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని తెలిపింది. ఈ నెల 20న ఓటర్ల దరఖాస్తు లు, తప్పుల సవరణ, అభ్యంతరాల స్వీకరణ, ఈ నెల 21న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరా ల పరిష్కారం, 23న తుది ఓటర్ల జాబితా, పో లింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల రెండో వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే నెలాఖరులోపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉందని తెలిసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాల తరువాత పంచాయతీ ఎ న్నికలు నిర్వహించేందుకు మంత్రి మండలి నిర్ణయం నేపథ్యంలో ఈ ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. సోమవారం నిర్వహించిన మంత్రిమండలి భేటీలో స్థానిక ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది. రిజర్వేషన్ల అమలు, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు, న్యాయ నిపుణుల సలహాలపై పంచాయతీ రాజ్శాఖ నివేదిక ఇవ్వడంతో దానిపై మంత్రులు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ నెల 24న తెలంగాణ హైకోర్టులో విచారణ గురించి చెప్పారు. మార్చి 31లోపు పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది.
మహిళా సంఘాల ఉత్పత్తులు త్వరలో అమెజాన్లో అమ్మకం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘా లు ఉత్పత్తి చేస్తున్న వివిధ వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లేందుకు అ మెజాన్తో సంప్రదింపులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని ఆయన అక్కడే లాంఛనంగా ప్రారంభించారు. అనంత రం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎం మాట్లాడారు. తెలంగాణలోని ఆడ బిడ్డలకు పుట్టింటి వాళ్లు అన్నదమ్ములు సారె చీర పె ట్టడం సాంప్రదాయమని అన్నారు. అలాగే, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి తమ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు చీర అందిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలోని అర్హులైన కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట చీరల పంపిణీ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సిఎం సూచించారు. నవంబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు చీరల పంపిణీ పూర్తి చేయాలని ఇందుకు 65 లక్షల చీరెలను అందుబాటులో ఉంచామని సిఎం తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు 35 లక్షలు చీరలు పంపిణీ చేయాలని సిఎం ఆదేశించారు. అర్హులైన ప్రతి మహిళకు చీర అందుతుందని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన సామాజక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సీపెక్) డాటాను దగ్గర పెట్టుకొని ప్రతి మహిళకు చీర అందెలా చూడాలని చీర అందించే సమయంలో ఆధార్ నెంబర్ను తీసుకోవాలని ముఖ గుర్తింపు చేపట్టాలని సిఎం కలెక్టర్లకు సూచించారు. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలని మీరే బ్రాండ్ అంబాసిడర్గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. అవకాశం ఉన్నచోట మహిళలకు ప్రోత్సాహాం.. మహిళల ఉన్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాల విషయంలో నిర్లక్ష్యం వహించిందని తాము వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన నిధులు విడుదల చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా ఆర్టీసి బస్సులకు మహిళలను యజమానులను చేశామని సిఎం తెలిపారు. యూనిఫాంలు కుట్టే బాధ్యతను అప్పజెప్పడంతో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల ఆదాయం సమకూరిందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో రూ.534 కోట్ల పనులు చేపట్టామని, ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాలకే అప్పజెప్పామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శిల్పారామం పక్కన రూ.వందల కోట్ల విలువైన 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని సిఎం పేర్కొన్నారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలన్న లక్ష్యంతో అమెజాన్తో సంప్రదింపులు చేస్తున్నామని సిఎం వెల్లడించారు. అంతకు ముందు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సిఎం ఇందిరమ్మ స్పూర్తితో మహిళా సాధికరతకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించామని, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం పనిచేస్తోందని సిఎం రేవంత్ చెప్పారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసిందని, పేదలను ఆశలను అడియాశలు చేసిందని ఆయన విమర్శించారు. మన ప్రభుత్వం రాగానే మొదటి విడతగా రూ.22,500 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. మహిళలకు పెట్రోల్ బంక్ లు నిర్వహించుకునేలా ప్రోత్సహించామని, ఆర్టీసిలో వెయ్యి బస్సులకు మహిళలని యజమానులను చేశామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 4లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళలను భాగస్వామ్యులను చేస్తున్నామని సిఎం రేవంత్ చెప్పారు. పరిపాలనలో ఇందిరాగాంధీ ఒక రోల్ మోడల్ పరిపాలనలో ఇందిరా గాంధీ ఒక రోల్ మోడల్ అని భూ సంస్కరణలతో ఆమె పేదలకు భూ పంపిణీ చేశారని సిఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. ఇందిరాగాంధీ పాకిస్తాన్ను విడగొట్టి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేశారని, ప్రపంచ దేశాల బెదిరింపులకు ఇందిరమ్మ భయపడలేదని సిఎం రేవంత్ తెలిపారు. ఇందిరాగాంధీ పాలన దేశానికి దిక్సూచి అని సిఎం రేవంత్ కొనియాడారు. వైఎస్ఆర్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి బిఆర్ఎస్ మోసం చేసిందని సిఎం విమర్శించారు. రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు: ఉప ముఖ్యమంత్రి కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళలకు గౌరవం పెంచాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతోందన్నారు. రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: మంత్రి సీతక్క మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాల రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సంఘాల దగ్గరకే వస్తున్నాయని తెలిపారు. 98 శాతం రుణ చెల్లింపుతో సంఘాలు తమ క్రమశిక్షణను చాటుతు న్నాయని మంత్రి సీతక్క కొనియాడారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపైనా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలని మంత్రి సీతక్క సూచించారు. ఆకాశమే హద్దుగా మహిళలు ఎదగాలన్న ఉద్దేశంతో ఆకాశం రంగును చీరలకు ఎంచుకున్నామని ఆమె తెలిపారు. మీ పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోంది.. మీ సంఘం ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోందని నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. బాగా నడుస్తోందని, నెలకు రూ.4 లక్షల రాబడి వస్తోందని ఆమె సిఎంతో పేర్కొన్నారు. ఇతర జిల్లాల నుంచి సంఘాలను అక్కడకు తీసుకెళ్లి వారి పని తీరు రాబడిని ప్రత్యక్షంగా చూపాలని కలెక్టర్లకు సిఎం సూచించారు.. డిజైన్లు ఎంతో బాగున్నాయి... తమకు ఇస్తున్న చీరల డిజైన్లు ఎంతో బాగున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 9 మీటర్లు, 6 మీటర్ల చీరలు తమకు నచ్చినట్లు ఉన్నాయని తమకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె సిఎంతో పేర్కొన్నారు. మాకు యూనిఫాం ఇచ్చినట్లు ఉంది ఇందిరామహిళా శక్తి చీరలు ఇవ్వడం ద్వారా తమకు యూనిఫాం వచ్చిందన్న సంతోషం ఉందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. ఈ చీరలు దరించడం ద్వారా తమ సంఘాల మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శేషాద్రి, సిఎం కార్యదర్శి మాణిక్రాజ్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం నక్సల్స్, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావో యిస్టు పార్టీకి చెందిన నక్సల్స్ మరణించినట్టు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, ము గ్గురు మహిళలు ఉండగా, వీరిలో కీలక నేత మెట్టూరి జోగారావు అలియాస్ ‘టెక్ శంకర్’గా ఉన్నట్టు ఆయన మీడియాకు వివరించారు. జోగా రావు శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వ్యక్తి కా గా మిగతా వారు చత్తీస్గఢ్కు చెందినవారని తెలిపారు. మృ తులలో సీత అలియాస్ జ్యోతి, సురేశ్, గణేష్, వాసు, అని త, షమ్మీగా గుర్తించినట్టు తెలిపా రు. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. ఛత్తీస్గఢ్లో కొంతకాలంగా నక్సల్స్ కార్యకలాపాల అణచివే త పె రుగుతుండటంతో వారంతా అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో తలదాచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మహేశ్ చం ద్ర లడ్డా తెలిపారు. దీంతో వారి కదలికలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఈ నెల 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టగా, మంగళవారం మారేడుమిల్లిలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మాతో సహా ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ కృషా జిల్లా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో మంగళవారం 50 మం ది మావోయి స్టులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామన్నారు. వా రి వద్ద నుంచి 45 ఆయుధాలు, 272 రౌండ్ల బుల్లెట్లు, 2 మేగజైన్లు, 750 గ్రాముల వైర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని, కచ్చితమైన ప్రణాళికతో ఆపరేషన్ జరిగిందని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్టు తెలిపారు. తమ ఇంటిలిజెన్స్ విభాగం చాలా బాగా పని చేసిందని ప్రశంసించారు. ఇటీవల కొంతమంది మావోయిస్టు నక్సల్స్ తెలంగాణలో లొంగిపోయారని ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిన మావోయిస్టులు తలదాచుకునేందుకు ఏపీలోని పలు ప్రాంతాలను ఎంచుకున్నారని, అయితే తమకు లభించిన పక్కా సమాచారంతో ఆపరేషన్ చేపట్టిన్నట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వారి కదలి కలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టాయని చెప్పారు. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న క్రమంలో మావోయిస్టు నక్సల్స్ ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతాన్ని వదిలి ఎపికి మకాం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లాతో సహా ఇతర ఏజెన్సీ జిల్లాల్లో మావోయిస్టుల కదలకలపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఎదురు కాల్పుల్లోనే హిడ్మా మృతి జర్నలిస్టులకు హిడ్మా లేఖ రాసిన విషయం తమకు తెలియదని లడ్డా తెలిపారు. హిడ్మా ఎదురు కాల్పుల్లోనే లోనే మృతి చెందారని ఆయన స్పష్టం చేశారు. ఆయనను పట్టుకు న్నాక చంపారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. మావోయిస్టుల ప్లాన్ ఏమిటో, కానూరులో ఎందుకున్నారో దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలో చాలా మంది లొంగి పోతారని వెల్లడించారు. అరెస్టుల వల్ల భయపడా ల్సిన అవసరం లేదన్నారు. ఛత్తీస్గఢ్లో చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయన్నారు. దీంతో అక్కడ్నించీ ఇతర ప్రాంతాలకు మావోయిస్టులు వెళ్తున్నారన్నారు. ఈ క్రమంలో పట్టుబడుతున్నారని ఎడిజి మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. ఏలూరు గ్రీన్ సిటీలో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు రిమాండ్ ఏలూరు గ్రీన్ సిటీ లో పట్టుబడిన 15 మంది మావోయిస్టులకు కోర్టు రిమాండ్ విధించింది. ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా కేంద్ర బలగాలు విజ యవాడలో 32 మంది, ఏలూరులో 12 మంది, కాకినాడలో ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏలూరు గ్రీన్ సిటీలో పట్టుబడిన 15 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి బుధవారం ఏలూరు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో వారికి ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అలాగే వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది. విజయవాడలో పట్టుబడిన 24 మంది మావోయిస్టులను రిమాండ్ నిమిత్తం రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. అలాగే మరో నలుగురు మావోయి స్టులకు వయోపరిమితి నిర్ధారించాలని ఆదేశించింది. న్యాయ విచారణ జరపాల్సిందే : సిపిఎం డిమాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో మంగళ, బుధవారం జరిగిన వరుస ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సిపిఎం ఏపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి, అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు అన్యాయంగా బూటకపు ఎన్కౌంటర్ చేశారని వార్తలు వచ్చాయన్నారు. చట్ట విరుద్ధమైన బూటకపు ఎన్కౌంటర్లను సిపిఎం ఖండిస్తుందని తెలిపారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి నగరాల్లో పోలీసులు దాడులు చేసి 50 మందికి పైగా మావోయిస్టులు, వారి అనుయాయులను నిర్బంధించారన్నారు.వివిధ చోట్ల నిర్బంధించబడిన వీరిని వెంటనే సంబంధిత న్యాయ స్థానాల ముందుంచాలని కోరారు. అమాయక గిరిజనులను మావోయిస్టులకు సహకరిస్తున్నారని, మిలిషియాగా పనిచేస్తున్నారని పోలీసులు వివిధ రూపాల్లో వేధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. వేధింపులను, నిర్భందాన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఎం నేత శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.****
మన తెలంగాణ/అమరావతి: సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా. ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా ఆయన జీవించారని, భారతీయ నాగరికతకు సేవ మూల కేంద్రంన్నా రు. భక్తి, జ్ఞానం, కర్మ ఈ మూడూ సేవతోనే ముడిపడి ఉంటాయన్నారు. సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని వివరించారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని, అందరి నీ ప్రేమించు, అందరినీ సేవించు ఇదే బాబా నినాదమని, ఆయన బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తుందన్నారు. కోట్లమంది బాబా భక్తులు మానవసేవ చేస్తున్నారని, బాబా ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయన్నారు. చాలామంది జీవితాలను బాబా సమూలంగా మార్చేశారని, లక్షలమందిని బాబా సేవామార్గంలో నడిపించారని ప్రధాని మోదీ అన్నారు. సేవ పరమో ధర్మ అనేది మన మూల జీవన విధానంలోనే ఉందని, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించారని, బోధించడమే కాకుండా తాను ఆచరించడంతో పాటు ఆయన సంస్థలూ అదే పాటించేలా శ్రీ సత్యసాయి బాబా అందరిలోనూ స్పూర్తి నింపారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శ్రీ సత్యసాయి బాబా 100వ జయంత్యుత్సవాలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు హజరయ్యారు. వీరితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, కిషన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ సహా పయ్యావుల, సవిత, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేశారు. సత్యసాయి స్మారక తపాళా బిళ్లల్ని ప్రధాని, సీఎం ఆవిష్కరించారు. మొదట శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. ఆ తర్వాత కుశ్వంత్ హాల్లో సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించిన శతజయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ సత్యసాయి బాబా మన మధ్య బౌతికంగా లేనప్పటికీ ఆయన స్థాపించిన సంస్థలు గ్రామీణ అభివృద్ధి, ప్రజలకు వైద్యం లాంటి సేవల్ని అందిస్తున్నారు. శ్రీసత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు జరుపుకోవటం మనకు ఓ వరం. బాబా పాటించిన ప్రేమ, సేవ భావన ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తోందన్నారు. బాబా జీవితమే వసుధైక కుటుంబం బాబా జీవితమే వసుధైక కుటుంబం అనే భావనతో ఉండేదని, మన భారతీయుల జీవన విధానమే సేవ, భక్తి, జ్ఞానం. కోట్ల మంది బాబా భక్తులు దేశవ్యాప్తంగా మానవ సేవే మాధవ సేవ అని భావించి సేవలు అందిస్తున్నారని ప్రధాని అన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రకృతి వైపరీత్యం వచ్చినా శ్రీసత్యసాయి సేవా దళ్ సభ్యులు ప్రజలకు సేవలందిస్తున్నారు. భుజ్ భూకంపం సమయంలో సేవాదళ్ చేసిన సేవలు నాకు బాగా గుర్తున్నాయి. 3 వేల కిలోమీటర్లకు పైగా తాగునీటి పైపుల్ని ఏర్పాటు చేసి ప్రజలకు దాహార్తి తీర్చారు. వైద్యం ఉచితంగా అందిస్తున్న సంస్థలను బాబా నిర్మించారు. సుకన్య సమృద్ధి యోజన కోసం వేల మంది బాలికలకు ఆర్ధిక సాయం అందిస్తోంది ట్రస్టు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 4 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ఉన్నాయి. రూ. 3.25 లక్షల కోట్లకు పైగా నిధులు ఈ ఖాతాల్లో ఉన్నాయి. వారణాసి ఎంపీగా అక్కడ 27 వేల మంది బాలికలకు సుకన్య సమృద్ధి యోజన కింద నిధులు జమ చేయించానన్నారు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తే ఆత్మనిర్భర్ భారత్ తయారైనట్టేనని, శ్రీ భగవాన్ సత్యసాయి ప్రేరణతో అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి ఆలోచనలో కరుణ, శాంతి, కర్మ అనే విధానాల ద్వారా ముందుకు వెళ్లాలని ప్రధాన మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మానవ వనరులు, ఐటి, విద్యా, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్, ప్రముఖ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్, మాజీ మిస్ వరల్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి బాబా సేవలు ఆదర్శనీయం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం అని, లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేది శ్రీసత్యసాయి మనకు చూపిన దారి అని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన సత్యసాయి బాబా దాన్నే బోధించారు...ఆచరించారు...ఫలితం చూపించారన్నారు.. ప్రేమ ఒక్కటే మతం, హృదయం ఒక్కటే భాష, మానవత్వమే కులం, అన్నిచోట్లా దైవం ఉన్నారని బాబా బోధించారని, విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకూ ఉచితంగా అందించారని కొనియాడారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60వేల మందికి ఉత్తమ విద్యను అందిస్తున్నాయని, సూపర్ స్పెషాలిటీ, జనరల్ ఆస్పత్రులు, మొబైల్ ఆస్పత్రుల ద్వారా రోజూ రోగులకు సేవలందుతున్నాయన్నారు. రాయల సీమ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రశాంతి నిలయాన్ని తాకట్టుపెట్టి అయినా ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నారని, ఈ విషయం తెలిసి భక్తులు ముందుకు వచ్చి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. రూ.550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు, 30 లక్షలకు పైగా జనాభాకు నీరిచ్చారన్నారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడరనైజేషన్ స్కీంకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారని, సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం భగవాన్ శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ కి బీజం వేసిన సత్యసాయి:ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ పథకానికి శ్రీ సత్యసాయి బాబా ఎప్పుడో అంకురం వేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం అని, ప్రభుత్వపరంగా నరేంద్ర మోదీ నేడు జల్ జీవన్ మిషన్ పథకాన్ని తీసుకువస్తే ఏ ప్రభుత్వం ఆలోచన చేయని రోజుల్లో ఓ ఆధ్యాత్మిక గురువుగా ప్రజల దాహర్తిని తీర్చాలన్న ఆలోచన శ్రీ సత్యసాయి బాబా చేశారన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గొప్ప ఆధ్యాత్మిక తేజస్సు కలిగిన వారని, సాయిబాబా సేవా తత్పరతకు ప్రభావితం అయిన వారి సంఖ్య లెక్కలకందదని చెప్పారు. పుట్టపర్తి వచ్చి సేవ చేసే ప్రముఖులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని, సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతో మంది ప్రముఖులను ప్రభావితం చేశారన్నారు. ఆయన సేవా స్ఫూర్తిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. అది గోల్డెన్ మూమెంట్: భారత రత్న సచిన్ తెందూల్కర్ ప్రజల్ని జడ్జ్ చేయొద్దని, వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పారని క్రికెట్ దిగ్గజం, భారత రత్న సచిన్ తెందూల్కర్ అన్నారు. దీనివల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని అన్నారు. 2011 వరల్డ్ కలో తాను ఆడినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవని, అప్పుడు బెంగళూరులో ఉన్నారని తెలిపారు. సత్య సాయిబాబా తనకు ఫోన్ కాల్ చేశారని, అనంతరం ఒక పుస్తకం పంపారన్నారు. అది తనలో సానుకూల దృక్పథాన్ని, స్ఫూర్తిని నింపిందని, ఆ సంవత్సరం టీం ట్రోఫీ కూడా గెలుచుకుందన్నారు. అది తనకు గోల్డెన్ మూమెంట్ అని సచిన్ తెలిపారు.
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గత రెండు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవా రం సాయంత్రం ఆయన ప్రజాభవన్ లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో కలిసి ఏర్పాటు చేసిన 2047 విజన్ డాక్యుమెం ట్ వార్ రూమ్ సమావేశ మందిరంలో ప్రసంగించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సా ధన సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ కల అన్నారు. ఆ కల సాధనకు ప్రతి ఒక్క రం ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నామని, ఈ లక్ష్య సాధనలో అం దరినీ భాగస్వాములు చేసి సమగ్ర డాక్యుమెంట్ రూపొందించే బాధ్యతను సీఎం రే వంత్ రెడ్డి తనకు అ ప్పగించారని డిప్యూ టీ సీఎం వివరించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ప్రభుత్వం ఐఎస్బితో అధికారిక ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే వివిధ శాఖ ల నుంచి నోడల్ ఆఫీసర్లను నియమించి వారి ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఐఎస్బి బృందం ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిందన్నా రు. గ్లోబల్ సమ్మిట్ వచ్చేనెల 8, 9 తేదీల్లో జరగనుందని, తక్కువ సమయం అందుబాటులో ఉ న్నందున పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి విజన్ డా క్యుమెంట్ను తుది దశకు తీసుకురావాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అనేది చరిత్రలో లిఖించదగిన అంశమని డిప్యూటీ సీఎం వివరించారు. ఆర్థిక, పారిశ్రామిక, సర్వీసు సెక్టార్లలో జిడిపిని పెంచి 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించిందని వివరించారు. రెండు సంవత్సరాల్లో కనబరిచిన నిబద్ధతతోనే 2047 డాక్యుమెంట్ రూపకల్పనకు అడుగులు ముందుకు వేయాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని వివరించారు. హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అనుకూల అంశాలకు విజన్ డాక్యుమెంట్లో పకడ్బందీగా చోటు కల్పించాలని వివరించారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనేది వివరించేందుకు దేశంలో అనేక రంగాల్లో ప్రసిద్ధి చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కంపెనీల సీఈఓ లను ఆహ్వానించి గ్లోబల్ సమ్మిట్ ను పెద్ద పండుగలా నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని సంపద, వనరులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చూపడమే కాదని, వాటిని ఏ విధంగా కార్యరూపం దాలుస్తామో కూడా అధికారులు డాక్యుమెంట్ లో చూపించాలని పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం తెలిపారు. గురువారం అన్ని శాఖల కార్యదర్శులు మంత్రులతో చర్చించి విజన్ డాక్యుమెంట్ ను తుది దశకు తీసుకురావాలన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజులు కూర్చుని కసరత్తు చేసి విజన్ డాక్యుమెంట్ కు ఆమోదం తెలుపుతారన్నారు. 85 వేల కోట్లతో చేపడుతున్న రోడ్ల పనులు పూర్తయితే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని, దేశంలోని ఏ రాష్ట్రం తెలంగాణతో పోటీ పడలేదన్నారు. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, సిఎస్ రామకృష్ణారావు, జయేష్ రంజన్, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: సొంత పార్టీలోని కొందరి తీరు వల్లే జూబ్లీహిల్స్ లో ఓటమి పాలయ్యామని, కొందరు కాంగ్రెస్ కోవర్టులుగా పనిచేశారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కొం దరు కార్యకర్తలు వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై చర్చించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్లో కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, జూబ్లీహిల్స్ నియోజక వర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప లువురు కార్యకర్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానిక నేతలు, జిల్లాల నుం చి వచ్చిన బీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయ లో పం కూడా ఓటమికి కారణమని చెప్పినట్టు తెలిసిం ది. స్థానిక జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ నేతలు బైపోల్స్ ను పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. నియోజక వర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు కరువయ్యారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ ను ఎదుర్కోలేకపోవడం కూడా ఓటమికి కారణమని చెప్పుకొచ్చారు. తండ్రి చనిపోయినా కూడా హరీశ్ రావు ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా పార్టీ కోసం పనిచేశారని ప్రశంసలు కురిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఆ తర్వాత సంస్థాగత నిర్మాణం చేపడతామని అన్నారు. బూత్ ల వారీగా పటిష్టంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దివంగత గోపీనాథ్ మరణం తర్వాత పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం, ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పడ్డ కష్టానికి మించి తాము పని చేస్తామని, ‘కాలికి బలపం కట్టుకొని తిరుగుతామని కేటీఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నైతిక విజయం బీఆర్ఎస్దే : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పోరాటస్ఫూర్తితో పనిచేసిన కార్యకర్తలదే నైతిక విజయమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 18వేల ఓట్లు మాత్రమే వచ్చిన జూబ్లీహిల్స్లో, ఈ ఉపఎన్నికలో 75వేల ఓట్లు సాధించడం అనేది కార్యకర్తల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతికంగా గెలిచి ఉండవచ్చని, కానీ నైతిక విజయం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మదేనని హరీశ్ రావు అన్నారు.
నేడు 10వ సారి సిఎంగా నితీశ్ ప్రమాణం
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్కుమార్ రికార్డు స్థాపించబోతున్నారు. బీహార్లో ఎన్డిఎ ఘన విజయం తరువాత ఆయన 10వ సారి గురువారం ప్రతిష్టాత్మక రీతిలో ప్రమాణం చేస్తారు. స్థానిక గాంధీ మైదాన్లో ఉదయం 11 గంటలకు ఆయన బీహార్ అధికార పీఠం అధిరోహిస్తూ ప్రమాణం చేస్తారు. బుధవారం ఉదయం విజయపక్షం అయిన ఎన్డిఎ నూతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇందులో ఎన్డిఎ శాసనసభాపక్ష నేతగా నితీశ్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిజెపి నేత, ఇప్పటి డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి ఈ సందర్భంగా నితీశ్ పేరును ప్రతిపాదించారు. బిజెపి, జెడియు ఎమ్మెల్యేలంతా బలపర్చారు. దీనితో మరోసారి బీహార్ సిఎంగా నితీశ్ పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం అయింది. బిజెపి, జెడియుల సంయుక్త శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కొద్ది సేపటి తరువాత నితీశ్కుమార్ తన వెంట బిజెపి నేతలు కూడా రాగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ను కలిశారు. లాంఛన ప్రాయంగా తన సిఎం పదవికి రాజీనామా చేశారు. తాను శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన పత్రాన్ని అందించారు. గవర్నర్ ఈ రాజీనామాను ఆమోదించినట్లు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్లు వెల్లడైంది. రాజ్భవన్కు వెళ్లిన వారిలో చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్మోర్చా (ఆర్ఎల్ఎం) నేత ఉపేంద్ర కుశావా, యుపి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఇతరులు కూడా ఉన్నారు. నూతన ప్రభుత్వ స్థాపనకు అభ్యర్థించారు. పాట్నాలోని బీహార్ లెజిస్లేచర్ సెంట్రల్ హాల్లో బిజెపి, జెడియుల కార్యకర్తల హర్షధ్వానాల నేపథ్యంలో లెజిస్టేటివ్ పార్టీ సమావేశం జరిగింది. నితీశ్ ఆధ్వర్యంలోనే ఎన్డిఎ ప్రచారం , తరువాతి క్రమంలో సిఎం కూడా ఆయనే అని ప్రధాని మోడీ పదేపదే చెపుతూ వచ్చారు. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు నితీశ్కు పట్టం జరుగుతోంది. నితీశ్జీనే తమ సంయుక్త పక్ష నేత అని , చెక్కుచెదరని తీర్పు వెలువరించిన బీహారీలకు అభినందనలు అని కేంద్ర మంత్రి , లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఎన్డిఎ కూటమి సమావేశం వివరాలను ఆ తరువాత విలేకరులకు రాష్ట్ర మంత్రి శ్రావణ్కుమార్ విలేకరులకు తెలిపారు. చారిత్రక గాంధీ మైదాన్లో నితీశ్ మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. నితిశ్తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేస్తారని వెల్లడైంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు , బిజెపి అగ్రనాయకులు, ఎన్డిఎ పాలిత రాష్ట్రాల సిఎంలు హాజరుకానున్నారు. దీనితో పాట్నాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పలు ప్రధాన రాదార్లలో తనిఖీలు, పర్యవేక్షణ ఇనుమడించింది. అంతకు ముందు బుధవారం ఉదయమే బిజెపి శాసనసభాపక్షం సమావేశం జరిగింది. ఇందులో సీనియర్ బిజెపి నేత సామ్రాట్ చౌదరిని బిజెపి శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఇక డిప్యూటీ నేతగా విజయ్కుమార్ సిన్హాను ఎంచుకున్నారు. వీరిద్దరికి నూతన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రుల పదవులు దక్కనున్నాయి. ఈసారి ఎన్నికలలో మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్డిఎకు 202 స్థానాలు దక్కాయి. ఇందులో బిజెపికి 89, జెడియుకు 85, ఎల్జెపికి 19, హామ్కు 5, ఆర్ఎల్ఎంకు 4 స్థానాలు వచ్చాయి. ఈ క్రమంలో బిజెపి అత్యధిక స్థానాల పార్టీ అయినా తిరిగి జెడియు నేత నితీశ్కు సిఎం పదవి కట్టబెట్టారు. బిజెపి నుంచి ఉపముఖ్యమంత్రులు కొనసాగనున్నప్పటికీ, నితీశ్ మంత్రిమండలిలో బిజెపికి ఎన్ని బెర్తులు? జెడియుకు ఎన్ని? ఇతర పార్టీలకు ఎన్ని? కీలక శాఖలలో ఎవరికి అవకాశం ఉంటేందనేది స్పష్టం కాలేదు. దీనిపై తగవులు రాకుండా చేసుకునేందుకు ప్రధానపార్టీల నేతలు రంగంలోకి దిగారు.
బిల్లుల ఆమోదంలో గవర్నర్లకు కాలపరిమితిపై నేడు సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం తెలిపే విషయంలో రాజ్యాంగ న్యాయస్థానం కాలపరిమితి విధించగలదా అని అడిగిన రాష్ట్రపతి సూచనపై సుప్రీంకోర్టు గురువారం నాడు తన తీర్పును ప్రకటించనున్నది. దాదాపు 10 రోజులపాటు, వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్ నాథ్, సిఎస్ నరసింహ, ఎఎస్ చందూర్కర్ లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సెప్టెంబర్ 11న తన తీర్పును రిజర్వు చేసింది. మే నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగం లోని ఆర్టికల్ 143(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లిలు ఆమోదించిన బిల్లులను పరిష్కరించేటప్పుడు రాష్ట్రపతి విచక్షణతో వ్యవహరించడానికి న్యాయపరమైన ఆదేశాల ద్వారా కాలపరిమితి విధించవచ్చా, లేదా అని సుప్రీంకోర్టు నుంచి, తెలుసు కోవడానికి తనకు రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలను ఉపయోగించారు. తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ అధికారాలపై ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి నిర్ణయం వచ్చింది. రాష్ట్రపతి ఐదు పేజీల రిఫరెన్స్ లో ముర్ము సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలను సంధించారు.
Cartoon 20 Nov 2025 |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
NZB |చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్..
మాక్లూర్, (ఆంధ్రప్రభ) : మాక్లూర్ మండల కేంద్రంలో ఈ నెల 14వ తేదీ
ഫാക്ട് ചെക്ക്: എൻഡിഎ വിജയത്തിന് പിന്നാലെ ബിഹാറിൽ പ്രതിഷേധം? വസ്തുതയറിയാം
ഗായകൻ സുബീൻ ഗാർഗിൻ്റെ വിലാപയാത്രയിൽ നിന്നുള്ള ദൃശ്യമാണ് പ്രചരിക്കുന്നത്
SCAM |కోట్ల రూపాయల భూ కుంభకోణం..
SCAM | కోట్ల రూపాయల భూ కుంభకోణం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి
గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన దలైలామా
నోబెల్ బహుమతి గ్రహీత దలైలామా మొట్టమొదటిసారి గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు చెందిన దలైలామా ఆల్బమ్ ఆ పోటీలో ఉంది. దలైలామా చేసిన ప్రసంగాలకు సరోద్ వాయిద్య కళాకారుడు అంజద్ అలీఖాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అంతర్జాతీయ కళాకారులు అంద్రాడే, మ్యాగీ రోజర్స్, టోనీ సుకార్, టెడ్ నాష్, దేబీనోవా,రూఫస్ వెయిన్రైట్ కూడా పనిచేశారు. ఈ ఆల్బమ్ను గ్రామీ అవార్డు విజేత కబీర్ సెహగల్ రూపొందించారు. 2026 ఫిబ్రవరి 1న లాస్ ఏంజెలెస్లో 68 వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది
సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ కొత్తస్టార్టప్ టెస్ట్ విజయవంతం
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన్యాన్ యాత్రలో మరో ముందడుగు వేసింది. నవంబర్ 7న మహేంద్రగిరి లోని ప్రొపల్షన్ కాంప్లెక్స్లో నిర్వహించిన పరీక్షల్లో ఎల్వీఎం 3 రాకెట్ను నడిపించే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ను కొత్త బూట్స్ట్రాలప్ మోడ్లో విజయవంతంగా స్టార్ట్ చేసింది. దాదాపు పది సెకన్ల పాటు ఈ పరీక్ష నిర్వహించినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇంజిన్ ఇప్పటికే 19 నుంచి 22 టన్నుల వరకు థ్రస్ట్ స్థాయిలో ప్రయోగాల్లో పనిచేసింది. తాజాగా బూట్స్ట్రాప్ స్టార్ట్ సాధించడం విశేషం. అదనంగా ఉండే స్టోర్డ్ గ్యాస్ సిస్టమ్ అవసరం లేకుండానే థ్రస్ట్ చాంబర్ , గ్యాస్ జెనరేట్లో మల్టీ ఎలిమెంట్ ఇగ్నిటర్ ఉపయోగించి ఈ విధానం సాధించినట్టు చెప్పింది. ఈ కొత్త స్టార్ట్అప్ టెక్నిక్ సాయంతో ఇంజిన్ లోని టర్బో పంపులు తామే వేగాన్ని పెంచుకుంటూ స్థిరస్థితికి చేరుతాయని , దాంతో రాకెట్ బరువు తగ్గి, సామర్థం పెరుగుతుందని తెలియజేసింది.
లిఫ్ట్లో ఇరుక్కుని బాలుడి మృతి
లిప్ట్లో ఇరుక్కుని బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నగరంలో ఎల్లారెడ్డి గూడలోని కీర్తి అపార్ట్మెం ట్స్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో నివాసం ఉండే నరుసు నాయుడు చిన్న కుమారుడు హర్షవర్ధన్(5) మధురానగర్లోని శ్రీనిధి పాఠశాలలో ఎల్కెజి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి తల్లి, సోదరుడితో పాటు ఇంటికి వచ్చిన బాలుడు లిఫ్ట్లో ఐదో అంతస్తులోకి వెళ్లాడు. తిరిగి కిందకు దిగుతున్న సమయంలో 4,5 అంతస్తుల మధ్య లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు. వెంటనే బాలుడిని బయటకు తీయగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే బంజారాహిల్స్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి మృతితో అపార్ట్మెంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
శరబరిమలో భక్తులకు తొలిరోజే నరకం
శబరిమల ఆలయ పరిసరాలలో జనం కిక్కిరిసిపోవడంపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం అక్కడికి అసాధారణ సంఖ్యలో జనం రావడం, వారిని అదుపులో పెట్టలేకపోవడంపై ఆలయ నిర్వాహక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రావెన్కోర్ దేవస్థానం ధర్మకర్త మండలి నిర్వాహకులు, ఉన్నతాధికారుల మధ్య సరైన సమన్వయం లేనట్లు అక్కడి పరిస్థితితో స్పష్టం అయిందని కేరళ హైకోర్టు తెలిపింది. ఆలయ సమీపంలోకి దర్శనం తొలిరోజునే ఏకంగా రెండు లక్షల మంది వరకూ చేరుకుని ఉంటారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ ప్రాంతంలో దిక్కుతోచనిస్థితిలో గడిపారు. భారీ సంఖ్యలో జనాన్ని అనుమతించడం, సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఎప్పుడు దర్శనం తిరిగి ఆరంభం అవుతుందనేది తెలియదా? కనీసం ఆరు నెలలకు ముందే అన్ని ఏర్పాట్లు జరిగి ఉండాల్సింది అని న్యాయస్థానం మందలించింది. దీనికి దేవస్థానం బోర్డు చైర్మన్ కె జయకుమార్ అంగీకరించారు.
దేవాదాయ శాఖలో మొత్తం 324 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
దేవాదాయ శాఖలో మొత్తం 324 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను దేవాదాయ శాఖ జారీ చేసింది. జాయింట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 109 పోస్టులు, డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 21 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 26 పోస్టులు, 6ఏ ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో 117 పోస్టులు, 6బి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో 32 పోస్టులు, 6సి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో 19 పోస్టులను డైరెక్ట్గా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాయింట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 223 కాగా, 113 మంది పనిచేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 84 కాగా, 63 మంది పనిచేస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 145 కాగా, 119 మంది, 6ఏ ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 532 కాగా, 415 మంది, 6బి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 37 కాగా, 05 మంది, 6సి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 21 కాగా, 02 పనిచేస్తున్నట్టు దేవాదాయ శాఖ తెలిపింది. మొత్తం 1042 మంది ఉద్యోగులకు గాను 717 మంది ఉద్యోగులే విధులు నిర్వహిస్తున్నారని మిగతా 324 మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద తీసుకోవాలని నిర్ణయించినట్టు దేవాదాయ శాఖ తెలిపింది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక పాయింట్ తేడాతో టాప్ ర్యాంక్ను కోల్పోయాడు. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిఛెల్ 782 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్ 781 పాయింట్లతో రెండో ర్యాంక్కు పడిపోయాడు. వెస్టిండీస్తో జరుగుతున్న సిరీస్లో మెరుగైన బ్యాటింగ్ను కనబరచడం ద్వారా మిఛెల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మొదటి ర్యాంక్ను దక్కించుకున్నాడు. అఫ్గాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ మూడో, భారత ఆటగాళ్లు శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లిలు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 8వ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. కాగా, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిఛెల్ టాప్ ర్యాంక్కు చేరుకోవడం ద్వారా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 1979లో గ్లెన్ టర్నర్ తర్వాత వన్డేల్లో టాప్ ర్యాంక్ను దక్కించుకున్న రెండో కివీస్ బ్యాటర్ మిఛెల్ నిలిచాడు. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ (అఫ్గాన్) టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్) రెండో, కేశవ్ మహరాజ్ (సౌతాఫ్రికా) మూడో, తీక్షణ (లంక) నాలుగో, బెర్నార్డ్ (నమీబియా) ఐదో ర్యాంక్లో నిలిచారు. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ ఆరో ర్యాంక్ను కాపాడుకున్నాడు. టెస్టు బ్యాటింగ్ విభాగంలో జో రూట్ (ఇంగ్లండ్), బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా (భారత్) టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నారు.
Railway Coach |ఓరుగల్లు ప్రజల 30 ఏండ్ల కల
Railway Coach | ఓరుగల్లు ప్రజల 30 ఏండ్ల కల ఆంధ్రప్రభ సిటీ
దేశంలో 5.67 లక్షల గ్రామాలలో ఇంటింటా టాయిలెట్ లు
దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలోనూ టాయిలెట్ లు ఉండాలని, ఎవరూ బహిరంగ ప్రదేశాలలో మల మూత్రవిసర్జన కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్న లక్ష్య సాధనలో గొప్ప ప్రగతి సాధ్యమైంది. దేశంలో 5.67 లక్షల గ్రామాలలో ఇంటింటా టాయిలెట్ లు నిర్మాణమయ్యాయి. ఈ గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ ( బహిరంగ మల విసర్జన రహిత స్థితి గలిగినవి)గా ప్రకటించారు. 2022 నుంచి ఓడిఎఫ్ లు 467 శాతం పెరుగుదల సాధ్యమైంది. బుధవారం ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారికంగా విడుదల చేసిన డేటా ద్వారా ఈ విషయం వెల్లడైంది.వీటిలో 4.86 లక్షల గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ దశను సాధించాయి. ఫలితంగా గ్రామాలలో శుభ్రతకు అత్యంత పెద్దపీట వేసినట్లయింది.భారతదేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మింపజేయడంలో కేంద్రం, రాష్ట్రాలకు మద్దతు ఇచ్చిందని కేంద్ర జల్ శక్తి శాఖమంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. ప్రభుత్వం కృషితో పాటు ప్రజలు పెద్దసంఖ్యలో భాగస్వాములు కావడం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు.
Maoist |రంపచోడవరం ఉక్కిరి బిక్కిరి !!
Maoist | రంపచోడవరం ఉక్కిరి బిక్కిరి !! చింతూరు /మారేడుమిల్లి/రంపచోడవరం, ఆంధ్రప్రభ :
అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్లో మహిళ కాలు
సచివాలయం వద్ద సంఘటన మనతెలంగాణ/హైదరాబాద్ సచివాలయం వద్ద బుధవారం సాయంత్రం అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. సచివాలయ ప్రవేశ ద్వారం ఎదుట ఏర్పాటు చేసిన అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్లో ఒక మహిళ కాలు ఇరుక్కుపోవడంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ తనిఖీల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రిల్ పై నుంచి వెళ్లిన సమయంలో ఆమె కాలు లోపలికి జారీ చిక్కుకుపోయింది. వెంటనే అక్కడ భద్రతా సిబ్బంది స్పందించి మహిళలకు సాయం అందించారు. స్కానర్ గ్రిల్ చాలా బలంగా ఉండటంతో, సాధారణంగా బయటకు తీయడం సాధ్యం కాకపోవడంతో ఎస్పిఎఫ్ సిబ్బంది ప్రత్యేక పరికరాలను తెప్పించి గ్రిల్ను కట్ చేసి, ఆమె కాలును సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, ఆమెను వెంటనే వైద్య పరీక్షలకు తరలించినట్లుగా ఎస్పిఎఫ్ సిబ్బంది తెలిపారు.
వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : నగర శివారు ప్రాంతంలో గుట్టుగా పేకాట జరుగుతోందని
ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు: దామోదర్ రాజనర్సింహ
దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్యసేవలను కూడా విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్లో జెరియాట్రిక్ సేవలు అందిం చాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఈ మేరకు జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో మంత్రి బుధవారం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్లో జరిగిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డిహెచ్ రవిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ జీవన ప్రమాణాలు పెరిగాయని, దీంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతున్నదన్నారు. పిల్లల కోసం మనం ప్రత్యేకంగా చైల్ హెల్త్ కేర్ సెంటర్లు నిర్వహిస్తున్నట్టుగానే, జపాన్, ఇటలీ తరహాలో వృద్ధుల కోసం ప్రత్యేక హాస్పిటళ్లు నిర్వహించాల్సిన అవసరం భవిష్యత్తులో మన దేశంలోనూ ఏర్పడుతుందన్నారు. వృద్ధాప్యంలో వచ్చే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని హాస్పిటళ్లలోనూ జెరియాట్రిక్ సేవలను విస్తరించాలని మంత్రి సూచించారు. ప్రతి జీజీహెచ్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇప్పటికే జెరియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేశామన్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమా లు నిర్వహించాలని సూచించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల జాబితాలు సిద్ధం చేసుకుని, వారికి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉచిత వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత డీఎంహెచ్వోలదేనని మంత్రి ఆదేశించారు. “గత ప్రభుత్వం తరహాలో హాస్పిటల్, మెడికల్ కాలేజీ పేరిట అరకొర బిల్డింగులు కట్టి వదిలేయడం లేదు. ప్రతి హాస్పిటల్లోనూ అవసరమైన మేర డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని నియమి స్తున్నాం. ఈ రెండేళ్లలో 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశాం. మరో 7 వేలకుపైగా పోస్టులు భర్తీ అవుతున్నాయి. మ్యాన్ పవర్తో పాటు మీరు అడిగిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇక మీ దగ్గరకు వచ్చే పేషెంట్లకు సర్వీస్ చేయడం మీ చేతుల్లోని ఉంది. ప్రభుత్వ హాస్పిటళ్లు మీవి మీరు వాటిని ఓన్ చేసుకుని కాపాడుకోవాలి.. అక్కడికి వచ్చే పేషెంట్లకు మంచి సర్వీస్ అందించి రక్షించుకోవాలి. డీఎంహెచ్వోలు, హాస్పిటల్ సూపరింటెండెంట్ల అటెండెన్స్ను మేము మానిటర్ చేస్తున్నాం. మీ సిబ్బంది అటెండెన్స్ను మీరు మానిటర్ చేస్తున్నారో లేదో కూడా చేస్తున్నాం. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఎంతటివారిపైన అయినా కఠిన చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో మంచిగా పని చేసే వారికి అండగా నిలుస్తాం. హాస్పిటళ్లలో పాతుకుపోయి, పని చేయించే ఆఫీసర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, వార్తలు రాయించడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిద్దాం. వారి వివరాలను మీ హెచోడీలకు అందించండి. మీరు చేసిన పర్యటనలు, తనిఖీలు, ఫైండింగ్స్, యాక్షన్ టేకెన్ రిపోర్టులను ప్రతి నెలా అందించాలి. ‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన వైద్య వ్యవస్థ కూడా మారాలి.. మార్చే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు కమ్యునికెబుల్ డిసీజెస్ ఎక్కువగా ఉండేవి.. ఇప్పుడు నాన్ కమ్యునికెబుల్ వ్యాధులు, లైఫ్స్టైల్ వ్యాధులు ఎక్కువయ్యాయి. మన హాస్పిటళ్లను కూడా బిపి, షుగర్, కేన్సర్, గుండె, కిడ్నీ జబ్బులు లైఫ్స్టైల్ వ్యాధులకుమెరుగైన ట్రీట్మెంట్ అందించే విధంగా తయారు చేసుకుంటున్నా’మని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి పేషెంట్లను బయటకు రిఫర్ చేయొద్దని మంత్రి అన్నారు. సబ్ సెంటర్ నుంచి జీజీహెచ్ల వరకూ అన్ని హాస్పిటళ్ల నడుమ సమన్వయం ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చిన పేషెంట్ను అవసరమైనప్పుడు మరో ప్రభుత్వ హాస్పిటల్కు మాత్రమే రిఫర్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అవసరమైన అన్నిరకాల వైద్య సేవలు అందించాలన్నారు.
Tech Shankar | 37 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
Tech Shankar | 37 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం పలాస /
NTR to have a Busy Time with Dragon
It has been a long pause from the shoot for NTR. The actor lost weight and this added a lot of speculation for the film. Dragon is his next film directed by Prashanth Neel and the shoot of the film came to a halt for the past three months. The team is working on the […] The post NTR to have a Busy Time with Dragon appeared first on Telugu360 .
450 చ.గ.ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లాలో సరూర్నగర్ మండలం కర్మన్ఘాట్ గ్రామంలోని సాయి గణేశ్ నగర్లో పార్కును హైడ్రా కాపాడింది. 1979లో మొత్తం 176 ప్లాట్లతో సాయి గణేష్ నగర్ లేఔట్ వేశారు. దాదాపు 450 చ.గ.ల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. ఇటీవల కొంతమంది వ్యక్తులు ఈ పార్కు స్థలంపై అనధికార గది నిర్మాణం చేపట్టారు. వారిని ప్రశ్నించిన కాలనీ వాసులను ఆక్రమణదారులు బెదిరించారు. కాలనీ నివాసితులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన హైడ్రా అధికారులు వెళ్లి పరిశీలించారు. పార్కు స్థలంపై చిన్న గది, గోడ వంటి అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు. సంబంధిత వ్యక్తులు సమర్పించిన పత్రాలను పరిశీలించగా, ఆ నిర్మాణం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు కాని పూర్తిగా అక్రమ నిర్మాణం అని నిర్ధారించారు.హైడ్రా అధికారులు స్వయంగా ఆ అక్రమ గోడను తొలగించి, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రాకు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.
Ghatkesar |ఆసుపత్రిలో విద్యార్థిని మృతి..
Ghatkesar | ఆసుపత్రిలో విద్యార్థిని మృతి.. ఘట్కేసర్, ఆంధ్రప్రభ : నర్సింగ్ చదువుతున్న

24 C