SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

22    C
... ...View News by News Source

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో..

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో .. తణుకు (ఆంధ్రప్రభ): తణుకు పట్టణానికి చెందిన వీరమల్లు

ప్రభ న్యూస్ 7 Nov 2025 8:17 am

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.. తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి)తిరుమలలో టోకెన్లు లేని

ప్రభ న్యూస్ 7 Nov 2025 7:58 am

రెండేళ్ల కాలంలో 1117 కుక్కకాటు బాధితులు…

రెండేళ్ల కాలంలో 1117 కుక్కకాటు బాధితులు… భ‌ద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం పిహెచ్‌ సి

ప్రభ న్యూస్ 7 Nov 2025 7:42 am

దున్నపోతును ఢీ కొట్టిన కారు..

దున్నపోతును ఢీ కొట్టిన కారు.. మంత్రాలయం, (ఆంధ్ర ప్రభ ):మంత్రాలయం మండలంలోని ఎమ్మిగనూరు

ప్రభ న్యూస్ 7 Nov 2025 7:32 am

మణుగూరులో వరుస చోరీలు..

మణుగూరులో వరుస చోరీలు.. రాత్రి అయ్యిందంటే చాలు టెన్షన్ పడుతున్నారు. అస్సలు నిద్రపట్టడం

ప్రభ న్యూస్ 7 Nov 2025 7:25 am

Andhra Pradesh : ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి రెండు వారాలు సెలవులు

ఆంధ్రప్రదేశ్ లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు.

తెలుగు పోస్ట్ 7 Nov 2025 7:23 am

వన్ విజన్ –వన్ డైరెక్షన్..

వన్ విజన్ – వన్ డైరెక్షన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో

ప్రభ న్యూస్ 7 Nov 2025 7:01 am

జూబ్లీహిల్స్ లో మరోసారి రేవంత్ ప్రచారం..

జూబ్లీహిల్స్ లో మరోసారి రేవంత్ ప్రచారం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని..

ప్రభ న్యూస్ 7 Nov 2025 6:42 am

మహిళా క్రికెటర్లతో ప్రధాని.. సందడే..సందడి

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ ట్రోఫీ సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళా క్రికెట్ టీమ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మహిళా క్రికెటర్లకు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో క్రికెటర్లతో ప్రధాని వివిధ విషయాలపై సరదాగా సంభాషించారు. దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలోపోస్ట్ చేశారు. ఇవి వైరల్‌గా మారాయి. తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన జట్టులోని ప్రతి క్రికెటర్‌తో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ తదితరులతో ప్రధాని సంభాషణలు వైరల్‌గా మారాయి. కెప్టెన్ హర్మన్‌తో ముచ్చటించిన ఆమె బంతిని జేబులో వేసుకోవడం గురించి అడిగారు. దీనిపై స్పందించిన హర్మన్ అదృష్టవశాత్తూ బంతి తన దగ్గరకు వచ్చిందని, దాన్ని తానే దగ్గర పెట్టుకున్నానని సరదాగా చెప్పింది. సర్, మీ స్కిన్ కేర్ రహాస్యం.. ప్రధానీతో హర్లీన్ భేటీ సందర్భంగా టీమిండియా స్టార్ క్రికెటర్ హర్లీన్ డియోల్ ప్రధాని మోడీని అడిగిన ఓ ప్రశ్న అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరూ ఊహించని విధంగా హర్లీన్ ప్రధానినిఅనూహ్య ప్రశ్నను అడిగింది. మైక్ అందుకున్న డియోల్ ‘సర్, మీ స్కిన్ కేర్ ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. దీని వెనక ఉన్న రహస్యమెంటో మాకు చెప్పగలరా?’ అని ప్రశ్నించింది. హర్లీన్ నుంచి ఊహించని ప్రశ్నకు ప్రధానితో సహా అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ప్రధాని దీనిపై చిరనవ్వుతో స్పందిస్తూ వాటి గురించి ఆలోచించను అంటూ సమధానం ఇచ్చారు. ఆ వెంటనే జట్టు సభ్యుల్లోని ఒక ప్లేయర్ స్పందిస్తూ ‘సర్, ఇది దేశంలోని కోట్లాది మంది ప్రేమ వల్లే’ అనగానే మరోసారి అందరూ సరదాగా నవ్వేశారు. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ స్పందిస్తూ చూశారా సర్ ఇలాంటి వారిని నేను డీల్ చేయాల్సి వచ్చిందన్నారు. అందుకే, నా జుట్టు త్వరగా తెల్లబడిపోయిందని అనేశారు. దీప్తితో టాటూ గురించి.. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ వేయించుకున్న హనుమాన్ టాటూ గురించి ప్రధాని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ‘హనుమంతుడి టాటూ ఉంది, అది ఎలా సాయపడింది?’అని ప్రధాని దీప్తిని ప్రశ్నించారు. దీనిపై దీప్తి స్పందిస్తూ నాకు హనుమంతుడంటే చాలా ఇష్టం, నును ఎక్కువగా నమ్మతా, నా ఆటతీరు మెరుగుకావడానికి ఇది సాయపడిందని వివరించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో అజేయ శతకంతో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్‌తో కూడా ప్రధాని సంభాషించారు. మ్యాచ్ సమయంలో జెమీమా భావోద్వేగానికి గురైన అంశంగా గురించి ప్రధాని అడిగారు. దీనిపై జెమీ స్పందిస్తూ అది సెమీ ఫైనల్ మ్యాచ్, గతంలో తాము చాలా సార్లు ఆస్ట్రేలియాపై విజయానికి చేరువగా వచ్చి పరాజయం పాలయ్యాం. ఈసారి మాత్రం తాను ఎలాగైనా చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాలనే లక్షంతో బరిలోకి దిగా. లక్షం నెరవేరడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యానని వివరించింది. ప్రతీక రావల్‌కు స్నాక్స్ అందించిన ప్రధాని క్రికెటర్ల విందు సమయంలో ప్రధాని మోడీ టీమిండియా స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్‌కు ప్రత్యేకంగా స్నాక్స్ అందించడం వైరల్‌గా మారింది. ప్రధానితో భేటీకి ప్రతీక వీల్‌చెయిర్‌లో వచ్చిన విషయం తెలిసిందే. సంభాషణ అనంతరం క్రికెటర్లు స్నాక్స్ తింటుండగా.. ప్రతీక దాన్ని తీసుకునేందుకు ఇబ్బంది పడింది. ఈ విషయాన్ని గమనించిన ప్రధాని స్వయంగా స్నాక్స్‌ను తీసుకొని వెళ్లి ప్రతీకకు అందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రధాని నిరాడంబరతను నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇలా ప్రతి క్రికెటర్‌తో మోడీ ఎంతో సరదాగా గడిపారు.

మన తెలంగాణ 7 Nov 2025 6:40 am

‘సర్’ సాఫీగా జరిగేనా?

హర్యానాలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 25 లక్షల నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చారని లోక్‌సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ బయటపెట్టడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోని ఓటర్ల జాబితాలన్నీ డూప్లికేట్, నకిలీ, మృతులైన ఓటర్లతో నిండి ఉన్నాయని ఆయన ఆరోపించారు. నకిలీ ఓటర్లను ఎలా జాబితాలో చేర్చగలరో కూడా ఆయన వెల్లడించారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో అర్హులైన 6000 మంది ఓటర్లను జాబితా నుంచి ఎలా తొలగించారో గత సెప్టెంబర్ 18న కూడా రాహుల్ లొసుగులు బయటపెట్టడం సంచలనం కలిగించింది. ఓటరుగా ఎవరైనా నమోదు అయితే ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు మరెవరైనా తమ నంబరు ఉపయోగించి అసలు వ్యక్తికి తెలియకుండా ఫారం 8 ఉపయోగించి మార్చివేయవచ్చు. ఇవన్నీ విపక్షనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 18న బయటపెట్టిన ఐదురోజుల తరువాత ఎన్నికల కమిషన్ రాహుల్ ఆరోపణలన్నీ తోసిపుచ్చింది. ఆధార్ అనుసంధానిత మొబైల్ నంబరును చాటుమాటుగా ఉపయోగించకుండా మార్చింది. ఇది స్వాగతించవలసిన చర్యే అయినప్పటికీ, ఎలాంటి పత్రికా ప్రకటన లేదా చర్చ లేకుండానే జరిగింది. అంటే ఓటర్ జాబితాల నిర్వహణలో ఉన్న విపరీతమైన లోపాలను ఎన్నికల కమిషన్ స్పష్టంగా, అవ్యక్తంగా అంగీకరించినట్టే అయింది. ఈ లోపాలే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ఆస్కారం కలిగిస్తున్నాయి. ప్రత్యేక ఓటరు గుర్తింపు నంబర్లు లోపించడం ఓటరు వివరాలను ఎవరైనా మార్చివేయడానికి వీలవుతుంది. ఇలాంటి ప్రాథమిక వ్యవస్థాపరమైన లోపాలను డేటాబేస్‌లో కనీస జ్ఞానం లేని టీనేజి ఇంజినీర్లు ఎవరూ చేయలేరు. దీనిబట్టి డేటాబేస్ నిర్వహణలో ఎన్నికల కమిషన్ ఘోరమైన అసమర్థతలో ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యమైన డేటాబేస్‌తో ఉండాల్సిన ఓటరు జాబితాలు ఈ విధంగా ఉండడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. దేశం లోని ఓటరు జాబితాలు అత్యంత సమర్థులైన నిపుణులు, ప్రక్రియలతో ప్రక్షాళన, నిర్వహణ కావలసిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో దేశం లోని రాష్ట్రాల్లో ఓటరు జాబితాలను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి, లోపరహితం కావడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను చేపట్టడానికి సిద్ధం కావడం స్వాగతించవలసిందే. కానీ మొదటి సారి గందరగోళ పర్చిన అదే అధికారులకు, అదే ప్రక్రియ కింద ఈ బృహత్తర బాధ్యతలను అప్పగించవచ్చా? చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశాల్లో పక్షపాత వైఖరి బట్టబయలవుతోంది. ఈ పరిస్థితుల్లో నమ్మకం, సమర్థత లోపించిన ఎన్నికల కమిషన్ తన స్వంత ప్రక్రియలు, నిబంధనలతో దేశమంతా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను నిర్వహించడానికి ముందుకు రావడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌కు ప్రత్యామ్నాయం ఈ జాబితాల ప్రక్షాళన ప్రతి అంశం లోనూ అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయడం తప్పనిసరి. అంతేతప్ప ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేయడం సరికాదు. మొదటిది బీహార్ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టకూడదు. అక్కడ అక్రమ వలసదారులను తొలగిస్తున్నామని తప్పుడు కారణాలు చూపించి అసలైన ఓటర్లను దురుద్దేశంతో జాబితాల నుంచి తొలగించేశారు. రెండో ముఖ్య అంశం ఓటరు జాబితా ఎలాంటి లోపం లేకుండా స్వచ్ఛంగా నిర్ధారించడానికి ఆధార్ కార్డు అన్నది ప్రాథమికం, మౌలికం. కానీ ఆధార్ కార్డును ఉపయోగించడంపై ఎన్నికల కమిషన్ గందరగోళాన్ని సృష్టించింది. పౌరసత్వానికి ఇది రుజువు కాదని వాదించి ఆధార్ కార్డును ఆధారం లేకుండా పక్కన పెట్టేసింది. ఇది నిజం. ఆధార్ కార్డు ఉన్న ప్రతివారూ ఓటరు కావలసిన అవసరం లేదు. కానీ ప్రతి ఓటరు తప్పనిసరిగా ఆధార్ కార్డున్న వారే అన్నది వాస్తవం. ఆధార్ లింకు కలిగిన నకలు ఓటరు జాబితా లోంచి డూప్లికేట్లను, నకిలీలను, మృతులను సమర్ధంగా తొలగించివేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డూప్లికేట్లు, నకిలీలు, ఇతర లోపాలను సవరించవచ్చు. ఈ ప్రక్రియతో ప్రతి ఓటరుకు ఓటరు గుర్తింపు కార్డు ఇవ్వవచ్చు. దీన్ని ఎవరూ మార్చలేరు. కానీ ఈ ప్రక్రియ ఏదీ చేయకుండా ఎన్నికల కమిషన్ అసలైన ఓటర్ల పేర్లను బీహార్‌లో కొన్ని లక్షల వరకు తొలగించి వేసింది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తనకుతాను సాంకేతికంగా తనకేమీ పరిజ్ఞానం లేదని నిరూపించుకోవడమే కాక, ఇష్టానుసారం దుర్మార్గంగా వ్యవహరించింది. మూడవ అంశం.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకుని వారంతట వారే సమర్పించాలని లేదా కేంద్రాల్లో వాటిని స్వీకరించడం సరైన పనికాదు. ఇంటింటికీ వెళ్లి అసలైన ఓటర్లను తనిఖీ చేసి, ధ్రువపత్రాల ఆధారంగా నమోదు చేయాలి. ఎన్నికల కమిషన్ తమ వద్దకు ఓటర్లను రమ్మన కూడదు. ఓటర్ల వద్దకే ఎన్నికల అధికారులు వెళ్లి వివరాలు నమోదు చేయాలి. కానీ బీహార్‌లో ఇదేమీ జరగలేదు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణలో జనాభా గణన అధికారులు రెండు నెలల వ్యవధిలో ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి 3.5 కోట్ల మంది జనాభా వివరాలను పూర్తిగా సేకరించగలిగారు. ఎన్నికల కమిషన్ కూడా ఇలాంటి ఆదర్శనీయమైన పద్ధతి అనుసరించడం ఏకైక మార్గం. బీహార్‌లో నెల రెండు నెలల వ్యవధిలో హడావిడిగా చేసినట్టు కాకుండా నిదానంగా సక్రమ పద్ధతిలో చేస్తున్నారన్న నమ్మకం ఎన్నికల కమిషన్‌పై కలుగుతుంది.

మన తెలంగాణ 7 Nov 2025 6:30 am

చీమలకు భయపడి.. ఆత్మహత్య..?

చీమలకు భయపడి.. ఆత్మహత్య..? చీమలు చూసి ఎవరూ భయపడరు కదా.. మరి.. చీమలు

ప్రభ న్యూస్ 7 Nov 2025 6:21 am

కశ్మీర్‌పై బిజెపి వక్రీకరణలు

కశ్మీర్ గురించి, పాక్ ఆక్రమిత కశ్శీర్ గురించి బిజెపి తరచు కొన్ని ఆలోచనలు వ్యక్తపరుస్తుంటుంది. కశ్మీర్ గురించి అనేవి, ఆ విషయమై మొదటి ప్రధానమంత్రి నెహ్రూ తప్పు చేసారని. పిఒకె గురించి అనేది ఆ ప్రాంతాన్ని ఎప్పటికైనా స్వాధీనపరచుకోగలమని. ఈ రెండు మాటలు కూడా సగటు భారతీయుని దేశభక్తి భావనలకు అనుగుణమైనవి. ఆ విషయం దృష్టిలో ఉంచుకుంటూనే కొన్ని మాటలు చెప్పుకోవటం అవసరం. అవి వాస్తవిక దృష్టితో కూడినవి. ముందుగా పిఒకె సంగతి చూద్ధాము. దేశ విభజన సమయంలో అప్పటి కశ్మీర్ రాజు హరిసింగ్ తన రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు పలు ప్రయత్నాల తర్వాత అంగీకరించారు. ఆ ప్రక్రియ సాంకేతికంగా పూర్తియింది. కాని వాస్తవ స్థితిని చూసినపుడు, కశ్మీర్‌లో కొంత భాగం పాకిస్థాన్ ఆక్రమణకు గురై ఇప్పటికీ వారి అధీనంలోనే ఉంది. ఈ భాగం, ఆ భాగం అని గాక మొత్తం కశ్మీర్ ప్రశ్నపై రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఏమీ తేలలేదు. భారత సైన్యం తూర్పు పాకిస్థాన్‌ను విడదీసి అక్కడి పాకిస్థాన్ సైన్యాన్ని పెద్ద సంఖ్యలో బందీగా పట్టుకున్నపుడు, పిఒకెను మనకు వదలుకున్నట్లయితేనే ఆ బందీలను వదలగలమనే షరతు విధించవలసిందనే అభిప్రాయం ఒకటుంది. ఎందుకైతేనేమి అది జరగలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం, కశ్మీర్ సరిహద్దు వివాద పరిష్కారంపై చర్చలు జరిగాయి గాని, పిఒకెను సైనికంగా స్వాధీన పరచుకోవడమనే అంశం అజెండా పైకి రాలేదు. బిజెపి, ముఖ్యంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ అధికారానికి వచ్చినప్పటి నుంచి పిఒకె స్వాధీనం ప్రస్తావనలు వస్తున్నాయి. ఎప్పటికైనా ఆ పని చేస్తామంటున్నారు. ఆయన నాయకత్వాన గత ప్రధాని వాజపేయికి మించి తీవ్ర జాతీయవాద వైఖరిని అవలంబిస్తున్నందున అటువంటి ప్రస్తావనలు సహజమనాలి. ఆ ధోరణికి అనుగుణంగానే ఆయన ప్రభుత్వం, కశ్మీర్ వివాదమంటూ అసలు ఏమీ లేదని, దానిపై పాకిస్థాన్‌తో చర్చించవలసింది కూడా ఏమీ లేదని, చర్చించటమంటూ ఉంటే వారు పిఒకెను మనకు వశపరచటం గురించి మాత్రమేనని అంటూ వస్తున్నది. అందుకు పొడిగింపుగా మాట్లాడుతూ, మనమే ఒక రోజు ఆ భూభాగాన్ని స్వాధీనపరచుకోగలమని చెప్తున్నది. దీనంతటిలోని సాంకేతికతలను అట్లుంచితే, ఆచరణకు సంబంధించిన ప్రశ్నలు కొన్నింటిని గమనించవలసి ఉంటుంది. ఆ విధమైన ఆక్రమణ సాధ్యమా అన్నది ఒక ప్రశ్న కాగా, ఒకవేళ ఆక్రమించినా దానిని అధీనంలో ఉంచుకుని నియంత్రించగలరా అన్నది మరొక ప్రశ్న. యుద్ధాలు, ఆక్రమణలు, నియంత్రణలు అనే మూడు కూడా ఆషామాషీ విషయాలు కావు. అందువల్ల ఆవేశంతోగాక జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. మొదట యుద్ధం మాట చూస్తే, పాకిస్థాన్ కన్న ఇండియా చాలా శక్తివంతమైనదని వేరే చెప్పనక్కరలేదు. కాని ఇరువురికి అణ్వస్త్రాలు ఉండటం విస్మరించలేనిది. పాకిస్థాన్ ‘నూక్లియర్ విధానం’ ప్రకారం, తమ భూభాగానికి, భౌగోళిక సమగ్రతకు ముప్పు ఏర్పడినట్లయితే అణ్వస్త్రాలు ఉపయోగిస్తారు. ఆ పని నిజంగా జరుగుతుందా అనేది వేరే విషయం. కాని, జరగదని కూడా ఎవరూ హామీ ఇవ్వలేరు. ఒకసారి తూర్పు పాకిస్థాన్‌ను కోల్పోయిన తర్వాత, మరొక భూభాగాన్ని పోగొట్టుకునేందుకు సిద్ధపడటం తేలిక కాదు. అందువల్ల, పిఒకెను స్వాధీనపరచుకునే లక్షంతోనే యుద్ధమన్నది తేలిక కాదు. ఆ స్థాయి యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా జోక్యమన్నది సరేసరి. పిఒకె స్వాధీనం జరుగుతుందని వాదన కోసం ఒప్పుకుంటే, అపుడు నియంత్రణ ప్రశ్న ముందుకు వస్తుంది. స్వాధీనం తక్షణం జరిగేది కాగా, నియంత్రణ దీర్ఘకాలికం. అందులోని సాధకబాధకాలేమిటి? కశ్మీర్ లోయ భూభాగం 15 వేల చదరపు కిలోమీటర్లకు పైగా ఉంది. పిఒకె వైశాల్యం అంతకు రెట్టింపు కన్న ఎక్కువ. జనాభా ఇక్కడ సుమారు కోటీ 80 లక్షల కాగా, అక్కడ దాదాపు 55 లక్షలు. వీరంతా ముస్లింలే. ఇటు వైపు భూభాగం ఏ విధంగానైతే కొండలు, లోయలు, నదులతో సంక్లిష్టమైనదో, అటువైపుది బహుశా అంతకన్న సంక్లిష్టమైనది. ఇటువైపు గలవారికి మన పట్ల ప్రేమ, విధేయత అన్నవి లేవనుకుంటే, వారికీ లేవు. వీరు నిరసనలకు, తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనుకుంటే, అటువైపు వారు అందుకు తోడవుతారు. అటువైపు వారికి పాకిస్థాన్ పట్ల కొంత నిరసన ఉండవచ్చు. దాని అర్థ్ధం ఇండియాను ప్రేమిస్తున్నారని కాదు. వీరూవారు కలిస్తే కశ్మీరీ జాతి మొత్తంగా స్వతంత్ర భావనలు బలపడి, రెండు దేశాలతో సంబంధం లేని విధంగా స్వతంత్ర కశ్మీర్ ఆలోచనలు తలెత్తగల అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇంత మాత్రమే కాదు. ఒకసారి మ్యాప్‌ను చూడండి. రెండు కశ్మీర్‌లను ఆనుకుని ఉత్తరాన, పడమరన అఫ్ఘానిస్థాన్‌తోపాటు మధ్య ఆసియా ముస్లిం దేశాలు విస్తరించి ఉన్నాయి. వాటన్నింటా ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థలున్నాయి. లోగడ ఒక దశలో ఆ సంస్థలు కొన్ని కశ్మీర్‌ను ఇండియా నుంచి విముక్తం చేయగలమని ప్రకటించి అక్కడి సంస్థలకు ఆయుధాలు, నిధులు, శిక్షణలు కూడా ఇచ్చాయి. మధ్య ఆసియాలోని ఇస్లామిస్ట్ తీవ్రవాదం కొన్ని దశాబ్దాలుగా అంతులేకుండా పెచ్చరిల్లుతూనే ఉంది. సమయానుసారంగా ఆ ధోరణులకు ఆ ప్రాంతపు దేశాలలోపాటు, తమ వ్యూహాత్మక క్రీడల కోసం అగ్రరాజ్యాలూ ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నాయి. ఈ వివరాలన్నింటిని లెక్కలోకి తీసుకుంటూ ఇపుడు ఆలోచించండి, పిఒకె స్వాధీనం ఒకవేళ సాధ్యం అనుకున్నా, ఎంతవరకు వాంఛనీయం? అందులోని లాభనష్టాలేమిటి? ఇప్పటికే కశ్మీర్‌లో మన బలగాలు కొన్ని లక్షలు మోహరించి ఉన్నట్లు అంచనా. పిఒకె స్వాధీనం తర్వాత మరెన్ని మోహరింపులు అవసరం కావచ్చు? ఎంతకాలం? అట్లయినా పిఒకె శాశ్వతంగా భారతదేశంలో ఉండిపోగలదనే హామీ ఉంటుందా? రెండవది, కశ్మీర్ విషయమై నెహ్రూ తప్పు చేసారనేది. ఈ మాటను ప్రధాని మోడీ అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఆయన ‘ఐక్యతా విగ్రహం’ వద్ద ప్రసంగిస్తూ మరో మారు అన్నారు. కశ్మీర్ సంస్థానం మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలన్నది పటేల్ ఆకాంక్ష కాగా, అందుకు నెహ్రూ అడ్డుపడ్డారని ఆరోపించారు మోడీ. దేశ ప్రజలపై గాంధీజీ, నెహ్రూల ప్రభావం ఇప్పటికీ తగినంత ఉన్నందున, దానిని దెబ్బ తీస్తూపోతే ఆ మేరకు తమ ప్రభావం ఇంకా వ్యాపిస్తుందన్నది సంఘ్ పరివార్, బిజెపిల వ్యూహం. అందుకోసం ఆ ఇరువురిపై రకరకాలగా ఆరోపణలు, విమర్శలు తరచు చేస్తూ వస్తున్నారు. గాంధీజీపై విమర్శల పట్ల వ్యతిరేకత పెరుగుతుండటంలో ఆయనను పక్కన ఉంచి, నెహ్రూపై ఆరోపణలు పెంచుతున్నారు. గాంధీజీ, నెహ్రూలు విమర్శలకు అతీతులని కాదు. కాని ఆరోపణలు, విమర్శలు ఎవరు ఎవరిపై చేసినా అందుకు ఆధారాలుండాలి. ఆ విధంగా చూసినపుడు కశ్మీర్ విషయమై నెహ్రూ, పటేల్ పాత్రలు తెలుపు, నలుపు పద్ధతిలో గిరిగీసినట్లేమీ లేవు. పటేల్ జీవిత చరిత్రను, రికార్డులు, వ్యక్తిగత లేఖలు, ఇంటర్వూల ఆధారంగా అతి సమగ్రంగా రచించిన వాడు, గాంధీజీ మనుమడైన రాజ్‌మోహన్ గాంధీ. ఆయన తను పేర్కొన్న ప్రతి అంశానికి ఆధారాలను ఉదహరించారు. వాటిని గమనించినపుడు ప్రధాని మోడీ వాదనలు పరిశీలనకు నిలవవు. కేవలం నెహ్రూను కించపరచి, దేశ ప్రజల దృష్టిలో తన విలువను తగ్గించి, బిజెపి భావజాలానికి అనుకూలుడని తాము భావించే పటేల్‌ను పైకెత్తటం కోసం ఆ విధంగా మాట్లాడుతున్నట్లు అర్థమవుతుంది. కశ్మీర్ తోపాటు గల దేశ విభజన విషయంలోనూ నెహ్రూ, పటేల్ వైఖరుల గురించి వారు ఇదే విధంగా ప్రచారాలు చేస్తున్నారు. ఉదాహరణకు పటేల వ్యక్తిగత కార్యదర్శి, సన్నిహిత సలహాదారు అయిన వి. పి. మెనన్ రాసిన ‘ద ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా’, వి. శంకర్ రచన ‘మై రెమిని సెన్సెస్ ఆఫ్ సర్దార్ పటేల్’ వంటి గ్రంథాలను చదివితే కశ్మీర్‌పట్ల ఎవరి వైఖరి ఏమైనదీ స్పష్టమవుతుంది. ముస్లింలు ఆధిక్యతలో గల కశ్మీర్ విషయమై పటేల్ ఆసక్తి చూపకపోవటం దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం లభించిన తర్వాత కూడా 1947 సెప్టెంబర్ 13 వరకు కొనసాగింది. ఆయన ఆ రోజు రక్షణ మంత్రి బల్ దేవ్ సింగ్‌కు లేఖ రాస్తూ, “ఒకవేళ (కశ్మీర్) వేరే డొమినియన్ (పాకిస్థాన్ అని భావం) లో చేరదలచుకుంటే” ఆ వాస్తవిక స్థితిని తాను గుర్తించగలనని చెప్పారు. తర్వాత అదే రోజు మధ్యాహ్నం, జునాగఢ్ విలీనాన్ని పాకిస్థాన్ అంగీకరించిన తర్వాతనే పటేల్ వైఖరి మారింది. జునాగఢ్ సంస్థాన పాలకుడు ముస్లిం, అక్కడి ప్రజలు మెజారిటీ హిందువులు. అటువంటి సంస్థానం పాకిస్థాన్‌లో విలీనమైనపుడు, హిందూ పాలకుడు, మెజారిటీ ప్రజలు ముస్లింలు అయిన కశ్మీర్‌ను ఇండియాలో ఎందుకు విలీనం చేసుకోరాదన్న నిర్ణయాన్ని పటేల్ అపుడు మాత్రమే తీసుకున్నారు. ఇందుకు భిన్నంగా, తమ పూర్వీకుల జన్మభూమి అయిన ఆ సుందర దేశాన్ని వదలుకోవటం నెహ్రూకు ఎప్పుడూ ఆమోదయోగ్యం కాలేదు. తన మిత్రుడైన షేక్ అబ్దుల్లా తోడ్పాటుతో కశ్మీర్ విలీనానికే నిరంతరం ప్రయత్నించారు. అందువల్ల, ఇటువంటి పలు పరిణామాలను విస్మరిస్తూ ప్రస్తుత రాజుకీయాల కోసం చరిత్రను వక్రీకరించటం తగిన పనికాదు. టంకశాల అశోక్

మన తెలంగాణ 7 Nov 2025 6:10 am

విజయం మనదే

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం మనదేనని, కాంగ్రెస్ జెండా పాతాలని సిఎం రేవంత్‌రెడ్డి డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముం దు కు సాగుతోందని, ఈ నేపథ్యంలోనే ప్రతి అం శాన్ని అనుకూలంగా మలుచుకోవాలని, అ హర్నిశలు శ్రమించాలని, అందరూ అ ప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి సూ చించారు. ఈ క్రమంలోనే తాజాగా జూబ్లీహి ల్స్ ఉప ఎన్నిక, ప్రచార సరళిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. గురువా రం జూబ్లీహిల్స్ లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతో ఇప్పటి వరకు సాగిన ప్రచారంపై సిఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసిసి వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మన అభ్యర్థి గెలవబోతున్నారని మంత్రులు, పార్టీ నాయకులందరూ మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. బిఆర్‌ఎస్,  బిజెపి పార్టీలు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా బిఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని ఆయన సూచించారు. మంత్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోజుకో సర్వేను వదులుతూ ప్రజలను, ఓటర్లను బిఆర్‌ఎస్ సోషల్ మీడియా గందరగోళానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఫీల్డ్‌లో కాంగ్రెస్‌కు బలం ఉందని, నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయని సిఎం రేవంత్ తెలిపారు. ప్రచారానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉందని, ఈ రోజు నుంచి ప్రతి గంట సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఓటరుకు మన వాయిస్ చేరాలని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మూడురోజుల ప్రణాళికల గురించి సిఎం వారికి సూచించారు. ప్రతి డివిజన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించాలని యువ ఓటర్లను ఆకర్శించే విధంగా సోషల్‌మీడియాను బలోపేతం చేయాలని, బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుకోవాలని సిఎం పేర్కొన్నారు.

మన తెలంగాణ 7 Nov 2025 6:00 am

‘హైడ్రోజన్ బాంబ్’ పేలిందా?

హర్యానా శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత భారత రాజకీయాల్లో తీవ్ర కలకలం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘హైడ్రోజన్ బాంబ్’ పేరుతో బిజెపిపై ఓటు చోరీ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రఖ్యాత మీడియా ఛానెల్స్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించాయి. దేశీయ, విదేశీ మీడియా కవరేజ్ ఈ ఆరోపణల లోతును తెలియజేస్తోంది. ఎన్నికల కమిషన్‌పైనా ప్రశ్నలు లేవనెత్తారు. రాహుల్ గాంధీ ఆరోపణలు తీవ్రమైనవి. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లతో బిజెపి గెలిచిందని చెప్పారు. ఓటరు జాబితాల్లో డూప్లికేట్‌లు, తప్పు చిరునామాలు, నకిలీ ఫోటోలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకే ఫోటోతో 22 ఎంట్రీలు, బ్రెజీలియన్ మోడల్ ఫోటోను ఉపయోగించి స్వీటీ, సీమ, సరస్వతి వంటి పేర్లు పెట్టారని ఆరోపించారు. ఈ మహిళ ఫోటో 10 పోలింగ్ బూత్‌ల్లో కనిపించిందని, అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. ఒకే నియోజకవర్గంలో 100 ఓటర్ కార్డులు ఒకే ఫోటోతో ఉన్నాయని హైలైట్ చేశారు. మరో మహిళ ఫోటో 223 సార్లు కనిపించిందని తెలిపారు. ఒక ఇంట్లో 501 మంది ఓటర్లు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినవారికి ఓటు హక్కు కల్పించారని ఆరోపణ. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ప్రధాని మోడీ, అమిత్ షా మధ్య సంప్రదింపులు జరిగాయని కూడా చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ గెలుపు అంచనా వచ్చినా, ఫలితాలు బిజెపికి ఎక్కువని గుర్తు చేశారు. హర్యానా సిఎం నాయబ్ సింగ్ సైనీ ఏర్పాట్ల వార్తలు, బిజెపి గెలవబోతుంది అన్న వీడియోను రుజువుగా చూపించారు. పోస్టల్ ఓటింగ్‌లో అసాధారణ తేడాలు, 8 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోవడం, మొత్తం 22,779 ఓట్ల తేడాతో పరాజయం - ఇవన్నీ ‘ఆపరేషన్ సర్కార్ చోరీ’లో భాగమని ఆరోపించారు. దేశీయ మీడియా ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది. ఎన్‌డిటివి ఎడిటర్ రవిష్ కుమార్ రాహుల్ గాంధీ ఆరోపణలు భారత ప్రజాస్వామ్యానికి ముప్పు. 25 లక్షల నకిలీ ఓట్లు అంటే ప్రతి 8 మందిలో ఒకరు నకిలీ. ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాలి అని కామెంట్ చేశారు. ఇండియా టుడే చానెల్‌లో రజత్ శర్మ ‘హైడ్రోజన్ బాంబ్’ పేరు భయపెట్టేలా ఉంది. కానీ ఆధారాలు రుజువైతే, ఇది ఎన్నికల వ్యవస్థపై పెద్ద ప్రశ్న. బిజెపి ఖండన తప్పుడు మాత్రమే కాదు, విచారణ కావాలి అని మండిపడ్డారు. టైమ్స్ నౌ డిబేట్‌లో అర్నబ్ గోస్వామీ రాహుల్ ఓటు చోరీ ఆరోపణలు ఎక్కువ, ఆధారాలు తక్కువ అని అన్నారు. కానీ బ్రెజిల్ మోడల్ ఫోటో విషయం ఆసక్తికరం. ఎక్స్‌పోజ్ చేయాలి అని ప్రశ్నించారు. ఎబిపి న్యూస్‌లో ప్రణబ్ రాయ్ ‘కాంగ్రెస్ ఘన విజయాన్ని ఓటమిగా మార్చారు. ఎన్నికల కమిషన్ బిజెపి సాథీభావం చూపిందా? 35 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపణ తీవ్రమైంది’ అని అన్నారు. రిపబ్లిక్ టివిలో అర్ణబ్ మళ్లీ ‘రాహుల్ వైఫల్యాలను కవర్ చేసుకోవడానికి ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తున్నారు. కానీ నకిలీ ఓట్ల ఆధారాలు వెరిఫై అవుతే, దేశానికి షాక్’ అని హెచ్చరించారు. సిఎన్‌ఎన్ -న్యూస్18 లో రాఘవ్ బాపట్ల ‘పోస్టల్ ఓటింగ్ అసాధారణత్వం, ఒక ఇంట్లో 501 ఓటర్లు ఇవి రిగ్గింగ్ సంకేతాలు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి అని సూచించారు. విదేశీ మీడియా కూడా ఈ ఆరోపణలను పట్టుకుని చర్చించింది. బిబిసి న్యూస్‌లో సౌమ్యా గుప్తా రాహుల్ గాంధీ చేసిన హైడ్రోజన్ బాంబ్ వ్యాఖ్యలు భారత ఎన్నికల సమగ్రతలో ఉన్న పగుళ్లను బహిర్గతం చేశాయి. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు బయటపడటంతో, ఎన్నికల కమిషన్ (ఇసిఐ) తటస్థతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది మోడీ ప్రజాస్వామ్య ప్రతిఛాయను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీయవచ్చు అని కామెంట్ చేసింది. అల్ జజీరాలో మెహ్దీ హసన్ ‘హర్యానాలో బిజెపి నకిలీ ఓటర్ల ద్వారా విజయాన్ని దొంగిలించిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ బ్రెజిలియన్ మోడల్ ఫోటోలతో నకిలీ ఐడిల ఆధారాలను చూపించారు. అంతర్జాతీయ పరిశీలన అవసరమయ్యే కుంభకోణం. భారత ఎన్నికల కమిషన్ కాదా అని ప్రశ్నించారు. రాయటర్స్ రిపోర్ట్‌లో ‘ఆపరేషన్ సర్కార్ చోరి’లో ప్రధాని మోడీ, సిఇసి కుట్రపూరితంగా వ్యవహరించారని గాంధీ ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది. కానీ బిజెపి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించింది. నకిలీల ద్వారా 125% ఓటర్ల ద్రవ్యోల్బణం ప్రజాస్వామ్యంపై ఎర్ర జెండాలు ఎగురవేస్తోంది’ అని పేర్కొన్నారు. న్యూస్ వీక్ మ్యాగజైన్‌లో ‘హర్యానాలో బిజెపి విజయంపై రాహుల్ గాంధీ హెచ్-బాంబ్’ పేల్చారు. 25 లక్షల బోగస్ ఓట్లను ఆరోపిస్తున్నారు. యుపి వలసదారుల నుండి జీరో అడ్రస్ ఇళ్ల వరకు, ఆరోపణలు వ్యవస్థాగత మోసాన్ని చిత్రీకరిస్తున్నాయి. ఇసిఐ పారదర్శకంగా స్పందించాలి’ అని విశ్లేషించారు. గార్డియన్ పేపర్‌లో భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్ జరిగిందని పేలుడు ఆరోపణలు చేస్తున్నారు. 100 కార్డులలో ఒక ఫోటో ఆధారాలతో, ఈ ‘హైడ్రోజన్ బాంబు’ ఎన్నికల సంస్కరణల కోసం పిలుపులను రేకెత్తించవచ్చు’ అని రాశారు. సిఎన్‌ఎన్ ఇంటర్నేషనల్‌లో క్రిస్టియన్ అమపౌర్ ‘హర్యానా ఎన్నికల వివాదం భారతదేశ ఓటింగ్ వ్యవస్థలోని దుర్బలత్వాలను హైలైట్ చేస్తుంది. వీడియోలు, డేటా మద్దతుతో గాంధీ వాదనలు మోడీ పాలనలో న్యాయాన్ని సవాలు చేస్తున్నాయి. గ్లోబల్ వాచ్‌డాగ్‌లు దర్యాప్తు చేయాలి’ అని అన్నారు. ఫారిన్ పాలసీ మ్యాగజైన్‌లో ‘నకిలీ ఓటర్లపై రాహుల్ బహిర్గతం 5.2 లక్షల నకిలీలు, 98 వేల తప్పుడు చిరునామాలు బిజెపి 2024 హర్యానా విజయాన్ని ప్రశ్నిస్తుంది. నిరూపిస్తే, అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని తగ్గిస్తుంది’ అని విశ్లేషణ చేశారు. ఈ మీడియా కామెంట్స్ ఆరోపణల లోతును తెలియజేస్తున్నాయి. దేశీయ ఛానెల్స్ రాజకీయ డిబేట్‌లకు దారి తీశాయి. విదేశీ మీడియా భారత ప్రజాస్వామ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తోంది. బిజెపి ఈ ఆరోపణలను ‘తప్పుడు, ఆధారరహితం’ అని ఖండించింది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాహుల్ తన వైఫల్యాలను దాచుకోవడానికి ఎన్నికల వ్యవస్థను అసత్యాలతో ఆరోపిస్తున్నారు’ అని చెప్పారు.కానీ మీడియా ఆధారాలపై దృష్టి పెట్టింది. రాహుల్ చూపిన వీడియోలు, డేటా రిపోర్టులు విశ్వసనీయమని చాలా చానెల్స్ అభిప్రాయపడ్డాయి. ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. ఇది వివాదాన్ని మరింత పెంచుతోంది. ఈ ఘటన భారత ఎన్నికల వ్యవస్థపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. నకిలీ ఓట్లు, డూప్లికేట్ ఐడిలు ఎలా జరిగాయి? ఎన్నికల కమిషన్ స్వతంత్రమా? ఎగ్జిట్ పోల్స్‌తో ఫలితాల మధ్య తేడా ఎందుకు ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలి. రాహుల్ ఆరోపణలు నిజమైతే, ఎన్నికల సంస్కరణలు అవసరం. తప్పితే, కాంగ్రెస్ విశ్వసనీయతపై ప్రశ్నలు. ఇది రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి దారి తీస్తుంది. ప్రజాస్వామ్యం బలపడాలంటే, పారదర్శకత ముఖ్యం. ఈ ‘హైడ్రోజన్ బాంబ్’ పేలుడు దేశాన్ని మేల్కొల్పాలి. కోలాహలం రామ్ కిశోర్ 98493 28496

మన తెలంగాణ 7 Nov 2025 5:50 am

రావొచ్చినా..రెడ్డొచ్చినా ఒవైసి చెప్పిందే వినాలి

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్ నియోజకవ ర్గం ఉప ఎన్నికల ప్రచారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఆయన రోడ్ షో, సమావేశాలకు అనుమతిలేదని పోలీసులు ముందు చెప్పడంతో బిజేపి శ్రేణులు రాష్ట్ర పోలీసులపై విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మజ్లిస్ చెప్పినట్లు పోలీసులు వింటున్నారని, తాను పర్యటనకు వస్తానని, ఎవరు ఆపుతారో చూస్తానంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించడం కలవర పెట్టింది. బిజెపి కార్యకర్తలంతా బోరబండ ఎన్నికల ప్రచారానికి తరలిరావాలని పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సాయంత్రానికి పోలీసులు అనుమతిస్తున్నట్లు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.బోరబండ ఎన్నికల సభలో బండి సంజయ్ మాట్లాడుతూ ‘నేను హిందువును, టోపీ పెట్టి, దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపర్చను, ఒక వేళ టోపి పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా’ అని సంచలన వ్యాఖ్య లు చేశారు. ఇక కెసిఆర్ కుమార్తె కవితపైనా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. మీ తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకో అంటూ కవితకు సూ చించారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే రూ.9 వేల కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరినట్లు? అని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అని నిలదీశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని హిందువులారా 70 శాతం ఓట్ల సత్తా ఏందో చూపించండని పిలుపునిచ్చారు. రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఒవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు అంటూ మంత్రులు, నేతలపై సంజయ్ ఘాటుగా విమర్శించారు. టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డిని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొచ్చాడని ఎద్దేవా చేశారు. అజహరుద్దీన్ చేత గణేష్ మంత్రం చదవించే దమ్ముందా?, ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ ఆలయానికి తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా? అని ప్రశ్నించారు. దీపక్‌రెడ్డి గెలవాలి: రాంచంద్రరావు బోరబండలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ హిందు టైగర్ బండి సంజయ్ ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడారో మీకు తెలుసునని అన్నారు. బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలవాలి, ఆయన అసెంబ్లీకి వెళ్లి మన వాణి వినిపించాలని బండి సంజయ్ అలా మాట్లాడారని అన్నారు. హిందువుగా స్వాభిమానాన్ని కాపాడాలంటే జూబ్లిహిల్స్ ఎన్నికల్లో దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రేవంత్ రెడ్డి రేవంతుద్దీన్ గా మారిపోయిన సంగతి తెలిసిందేనని ఎద్దేవా చేశారు. ఆయన మారినట్లుగానే మనం రహమత్ నగర్‌ను మీనాక్షి నగర్‌గా పేరు మార్చుదామని అన్నారు.  

మన తెలంగాణ 7 Nov 2025 5:30 am

నాలుగో టీ20లో భారత్ ఘన విజయం..

క్వీన్స్‌లాండ్: ఆస్ట్రేలియాతో గురువారం జరిగే కీలకమైన నాలుగో టి20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసినటీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు జట్టుకు శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన అభిషేక్ 21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ 39 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో శివమ్ దూబె (22), కెప్టెన్ సూర్యకుమార్ (20) నిరాశ పరిచారు. తెలుగు కుర్రాడు తిలక్‌వర్మ (5), వికెట్ కీపర్ జితేశ్ శఱ్మ (3) కూడా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (12) పరుగులు చేయగా, అర్ష్‌దీప్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ధాటిగా ఆడిన అక్షర్ పటేల్ 11 బంతుల్లోనే 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, జంపా మూడేసి వికెట్లను పడగొట్టారు. శుభారంభం లభించినా.. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మాథ్యూ షార్ట్, మిఛెల్ మార్ష్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే రెండు ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన షార్ట్‌ను అక్షర్ వెనక్కి పంపాడు. కొద్ది సేపటికే జోష్ ఇంగ్లిస్ (12) కూడా ఔటయ్యాడు. ఆ వెంటనే కెప్టెన్ మార్ష్ (20) కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు, అక్షర్ పటేల్, శివమ్ దూబె రెండేసి వికెట్లను పడగొట్టారు.

మన తెలంగాణ 7 Nov 2025 5:20 am

కుటుంబాన్ని చిదిమేసిన చీమలు.. భయంతో మహిళ ఆత్మహత్య

* అమీన్‌పూర్‌లో అనూహ్య ఘటన మన తెలంగాణ/అమీన్‌పూర్: క్రూర జంతువులే కాదు.. చిట్టి చీమలు కూడా మనిషి మరణానికి కారణం అవుతున్నాయి. ఇది వినడానికి అపహాసంగా ఉన్న ఇది ముమ్మాటికి నిజం. అందుకు అమీన్‌పూర్‌లో జరిగిన ఘటనే ఉదాహరణ. బంగారం లాంటి బిడ్డ కంటికి రెప్పలా కాపాడుకునే భర్త జీవితానికి కావలసిన సదుపాయాలతో నిండు నూరేళ్లు సంతోషంగా గడపాల్సిన ఓ మహిళ కేవలం చీమల బెడద తట్టుకోలేక నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. ఈ అనూహ్య ఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సిఐ నరేష్ తెలిపిన వివరా ప్రకారం ఇలా ఉన్నాయి.. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో నవ్య కాలనీలో నివాసముంటున్న మనీషా (25) చీమలకు భయపడి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2022లో మృతురాలు మనీషా కు చిందం శ్రీకాంత్ (35)తో వివాహం జరిగింది. వీరికి అనికా (3) పాప ఉంది. మంచిర్యాలకు చెందిన ఈ దంపతులు రెండున్నర సంవత్సరాల కింద ఉద్యోగ నిమిత్తం అమీన్‌పూర్‌లోని నవ్య కాలనీలో నివాసముంటున్నారు. అయితే మనీషా కు చిన్నప్పటి నుంచి చీమలకు భయపడే మైర్మెకోఫోబియా అనే వ్యాధి ఉంది. మంగళవారం ఉదయం మృతురాలు భర్త శ్రీకాంత్ ఆఫీస్‌కు వెళ్ళాడు. అదే సాయంత్రం శ్రీకాంత్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగా లోపల నుంచి గడియ పెట్టి ఉంది. స్థానికుల సహాయంతో డోర్‌ను పగలకొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని కనిపించింది. పక్కనే దొరికిన లేఖలో చీమలు భరించడం నా వల్ల కావడం లేదని అందుకే చనిపోతున్నానని పేర్కొంది. కూతురు అనికాను జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ వదిలి వెళ్తున్నందుకు క్షమించాలని భర్తను వేడుకుంది. అన్నవరం,తిరుపతి హుండీ లో రూ.1116/- లు వేయడంతో పాటు ఎల్లమ్మ తల్లికి ఒడి బియ్యం పోయాలని లేఖలో తెలిపింది. ఎప్పుడూ వినని సమస్యతో మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 7 Nov 2025 5:10 am

జూబ్లీహిల్స్‌లో కెసిఆర్ ప్రచారం లేనట్లే?

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ని యోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఈ నె ల 11న ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా, ఈనెల 9వ తేదీన సాయంత్రం 6 గంటల ప్ర చారం ముగియనున్నది. కాగా, ప్రధాన మూ డు పార్టీలకు చెందిన అగ్రనేతలు ముమ్మర ప్ర చారం చేస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతు గా కెసిఆర్ ప్రచారం చేస్తారా..లేదా..? అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి బిఆర్‌ఎస్ పార్టీ 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నిక ల సంఘానికి ఇచ్చింది. అందులో కెసిఆర్ మొ దటి స్థానంలో ఉండటంతో అధినేత ప్రచారం చేస్తారని పార్టీ కార్యకర్తలు, నాయకులు భావించారు. అయితే రెండు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు కెసిఆర్ ప్రచారం చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ ఉప ఎన్నిక ప్ర చారాన్ని బాధ్యతను పూర్తిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీసుకున్నారు. గతంలో పా ర్టీ అగ్రనేత హరీష్‌రావు ప్రచారం నిర్వహించినప్పటికీ తన తండ్రి మరణంతో ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దాంతో కెటిఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక బా ధ్యతను పూర్తిగా కెటిఆర్ తీసుకుని అన్నీ తానై ప్రచార చేస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ ముఖ్యనేతలు బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. కెటిఆర్ ప్రతి రోజూ రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు సంధిస్తున్నారు. కెటిఆర్ ప్రసంగాలకు ప్రజలను మంచి స్పందన వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జూబ్లీ ప్రచారంలో పేలుతున్న మాటలు తూటాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ నేతలు మాటల తూటాలు వదులుతున్నారు. విమర్శలు ప్రతి విమర్శలతో జూబీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్‌లు మార్మోగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ స్థానాన్ని దక్కించుకోవడంపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్యనేతలు డివిజన్ల వారీగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. చెల్లికి అన్నం పెట్టని వ్యక్తి చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేయిస్తారట అంటూ సిఎం రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెల్లిని ఇంట్లో నుంచి పంపిన వ్యక్తి మాగంటి సునీతను బాగా చూసుకుంటారా..? అని ప్రశ్నించారు. కాగా, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తానని సిఎం రేవంత్ రెడ్డి అంటున్నారని... అయ్య సొమ్మా.. నీ అబ్బ సొమ్మా..ఎవడి సొమ్మని ఇయ్యను అంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.జూబ్లీహిల్స్‌లో తమ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపిస్తే రేవంత్‌రెడ్డి గల్లా పట్టి పథకాలు ఇప్పిస్తామంటూ పేర్కొన్నారు. భర్త చనిపోయిన మాగంటి సునీతమ్మ ఏడిస్తే ఆరోపణలు చేస్తారా..? అని కెటిఆర్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారంలో మాటలు తూటాలు పేల్చుతున్నారు. కంటోన్మెంట్ ఫలితాన్ని పునరావృతం చేసేలా కాంగ్రెస్ వ్యూహాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి జూబ్లీహిల్స్ సీటును కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. వరుసగా మూడు దఫాలుగా మాగంటి గోపినాథ్ గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన మరణంతో జరుగనున్న ఉపఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ ధృఢ నిశ్చయంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ దానిని పునరావృతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించేందుకు సిఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యనేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేలా బిఆర్‌ఎస్ అడుగులు సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకొని పూర్వవైభవం దిశగా అడుగులు వేయాలన్న నిశ్చయంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్‌ఎస్ ఉన్నది. ఈ ఎన్నికలో తమ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించేందుకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సహా మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం బిఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు వచ్చాయి. అనారోగ్యంతో మరణించిన మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నుంచి వరుసగా మూడుసార్లు 2014, 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. హైదరాబాద్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షునిగా కూడా గోపీనాథ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆకస్మిక మరణంతో రానున్న ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించుకోవడం గులాబీ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, జూబ్లీహిల్స్ నుంచే బిఆర్‌ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మన తెలంగాణ 7 Nov 2025 5:00 am

హైదరాబాద్ అభివృద్ధికి రూ.1.30లక్షల కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు కేంద్రం ఏం చే సిందని కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు ప్రశ్నిస్తున్నాయని, నిజానికి ఒక్క హైదరాబాద్‌లోనే రూ.1.30లక్షల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. రైల్వే, జాతీయ రహదారులతో పాటు భారీ వంతెనాలు, ట్రిబుల్ ఆర్ తదితర ఎన్నో ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసి ని ధులు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎ న్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలపై స్ప ష్టత ఇవ్వకుండా ప్రతి దానికి ఉచిత బస్సు గురించే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగితే వాటి గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉచిత బస్సు పథకం గురించి మాట్లాడుతూ అన్ని సమస్యలకు అదే పరిష్కారమన్నట్లు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చెప్పడం వారి మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నూతన పాలకవర్గం గురువారం నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’లో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఆ పార్టీతో కలిసి పని చేసే ప్రసక్తి లేదని అన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పరిమితమైందని గుర్తు చేశారు. భవిష్యత్తులో బిఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తి లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిది మూడో స్థానం అయితే, లోక్ సభ ఎన్నికలో రెండో స్థానానికి వచ్చామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల ప్రచార తీరుపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత, బీఆర్‌ఎస్‌పై నమ్మకం లేకపోవడంతో జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేకపోతున్నారని అన్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోరు జరుగుతోందని అన్నారు. ఈ గందరగోళం సర్వేల్లోనూ ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికల అంశంలో సర్వేల్లో స్పష్టత లేదని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో జరిగే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ వెనుకబాటుకు బీఆర్‌ఎస్ బాధ్యత వహించాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తమ హామీల గురించి ప్రస్తావించకుండా బిజెపిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో ఎక్కువ వాటా కేంద్రానిదేనని, ఆ పథకాన్ని ఆపేస్తామని సీఎం ఎలా అంటారని ప్రశ్నించారు. రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యంలో ప్రతి కిలోకి రూ.42 కేంద్రం భరిస్తోందని, సన్నబియ్యం అంటూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని దానికి కలపడం వల్ల మరో రూ.15 అదనంగా చెల్లిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏమీ ఖర్చు చేయడం లేదని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి కూడా నిధులు లేవని విమర్శించారు. మజ్లిస్ మెప్పు కోసం ముఖ్యమంత్రి తహతహ రాష్ట్రంలో ఏం చేయాలన్నా మజ్లిస్‌ను అడిగి, వారి మెప్పు పొందిన తర్వాతే చేస్తున్నారని కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ’ఇజ్జత్’ అంటావు, మరి హిందువులు ఇజ్జత్ కాదా రేవంత్‌రెడ్డి అని ప్రశ్నించారు. ఎర్రగడ్డలో ఖబర్‌స్తాన్‌కు స్థలం కేటాయించడం సరైనదేనా అని ప్రశ్నించిన ఆయన బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాల స్థలం ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. హిందువులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ అనుబంధాన్ని ఎంతకాలం కొనసాగిస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తన పరిధిలో విచారణ చేయకుండా బీజేపీపై ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ తో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై సీబీఐ కేసు నమోదు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై కిషన్ రెడ్డి స్పందిస్తూ దీనిపై కేంద్రం దర్యాప్తునకు సిద్ధంగా ఉందని చెప్పారు. బోరబండలో పాదయాత్ర చేస్తే ఎంత మేర అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని అన్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం బాధ్యత వహిస్తుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం బాధ్యత వహిస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం ఏం చేయాలో అవన్నీ చేస్తుందని అన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్ ఉంటుందని, అంతేకాని తెలంగాణకు ఒకటి, ఆంధ్రాకు ఒకటి, కేరళ, తమిళనాడుకు ఒక బడ్జెట్ ఉండదని అన్నారు. అయితే అక్కడ ఉన్న ప్రాధాన్యతలను బట్టి కొన్ని చేయాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులకు సంబంధించి భూ కేటాయింపుల కోసం 40 ఉత్తరాలు రాశానని, అయినా ఒక్కదానికి సమాధానం రాలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 101 అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ పరిధిలో జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీబీనగర్ ఎయిమ్స్ శాశ్వత భవనాలను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తారని తెలిపారు. తాను కేంద్రమంత్రిగా హైదరాబాద్‌కే కాకుండా తెలంగాణకు ఏది అవసరమో దాని కోసం ప్రయత్నించి వీలైనన్ని ప్రాజెక్టులు తెచ్చామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

మన తెలంగాణ 7 Nov 2025 4:00 am

స్వచ్ఛ విద్యుత్‌కు పచ్చజెండా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 7460 మెగా వాట్ల స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ములు గు జిల్లా ఇప్పగూడెంలో 3,960 మెగావాట్లు, ఆదిలాబాద్ జిల్లా జారీలో 950 మెగావాట్లు ఉత్పత్తి చే సేందుకు గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముం దుకు వచ్చింది. అలాగే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని రాణాపూర్ గ్రామంలో 900 మెగావాట్ల వి ద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సిద్ధార్డ్ ఇన్‌ఫ్రాటెక్ అం డ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, నిజామాబాద్ జిల్లా మైలారంలో 750 మెగా వాట్ల వి ద్యుత్ ఉత్పత్తికి అష్టా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆదిలాబాద్ జిల్లా రామాపుర గ్రామంలో 900 మెగావాట్ల విద్యు త్ ఉత్పత్తికి సెరులీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ టిజి రెడ్కోకు ప్రతిపాదనలను అందించాయి. టి జి రెడ్కో అధికారులు ఈ ప్రతిపాదనలను టిజి జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్‌కు పంపగా ఒప్పందాల కోసం విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదకతను పెంచి భవిష్యత్తు అవసరాలకు సరిపడే వి ద్యుత్తును సమకూర్చుకునేందుకు తెలంగాణ ప్రభు త్వం ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025’ని రూ పొందించింది. సిఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఇటీవల కొత్త పాలసీని ఆమోదించింది. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం అదనంగా సమకూర్చుకోవాలనేది కొత్త పాలసీ లక్ష్యం. ఈ క్రమంలో రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి కొత్త విధానం సరికొత్త బాటలు వేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో రాబోయే పదేండ్లలో 1.98 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు 1.14 లక్షల ఉద్యోగ అవకాశాల సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రంలో ఇప్పుడున్న కాలుష్య కారక తీవ్రత పదేండ్లలో 33 శాతం తగ్గుతుందని అంచనా వేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మాసిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక కారిడార్లు తదితర అభివృద్ధి పనులతో భవిష్యత్తులో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరగనుంది. 2024-25లో రాష్ట్రంలో 15,623 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉండగా 2034-35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. సౌర విద్యుత్‌తో పాటు ఫ్లోటింగ్ సోలార్, విండ్ పవర్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఈ విధానం రూపొందించింది. పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులు : గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులతో పాటు సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలను ఈ పాలసీలో పొందుపరిచింది. మన రాష్ట్రంలో ఉన్న వాతావరణం ఏడాదిలో 300 రోజులు సౌర విద్యుత్తు ఉత్పత్తికి అనుకూలిస్తుంది. దేశంలోనే బలమైన గాలులు వీచే 8 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో పవన విద్యుత్తు ఉత్పత్తికి మెండుగా అవకాశాలున్నాయి. కొత్త విధానం ప్రకారం సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాలను స్థాపించేందుకు ముందుకు వచ్చే డెవెలపర్లను ప్రోత్సహిస్తారు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో కొత్త ప్లాంట్లకు అనుమతులిస్తారు. వీటికి ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకు ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న వారు డిస్కంలకు లేదా ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా అమ్ముకునే అవకాశాన్ని కల్పించారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ఈ పాలసీ కింద ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్ విధానంలో కేటాయించనున్నారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రోత్సహిస్తుంది. 500 కిలోవాట్ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశమిస్తుంది. డిస్కంలు ఈ విద్యుత్‌ను కొనుగోలు చేస్తాయి. ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై రూఫ్ టాప్ సౌరవిద్యుత్ ప్లాంట్లను ప్రోత్సహిస్తారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ, ఇతర పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే స్థలాలను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. సీలింగ్ పరిమితి ఉండదు. భూ వినియోగ మార్పిడి అనుమతులు అవసరం ఉండదు. టీజీ-ఐపాస్ ద్వారా అనుమతులు : టీజీ-ఐపాస్ ద్వారా అన్ని రకాల అనుమతులను వేగంగా జారీ చేస్తారు. ప్లాంట్ల స్థాపనకు కొనుగోలు చేసిన భూములకు 100 శాతం స్టాంప్ డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతులు, ఎన్వోసీలను మినహాయించారు. సోలార్ ప్లాంట్లకు నీటి ఛార్జీలను రియింబర్స్ చేస్తారు. సోలార్, పవన విద్యుత్తును వినియోగించే ఎంఎస్‌ఎంఈ సంస్థలకు 8 ఏండ్ల పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మాఫీ వర్తిస్తుంది. మూల ధన పెట్టుబడిలోనూ రాష్ట్ర జీఎస్టీ వాటాను తిరిగి చెల్లిస్తారు. పునరుత్పాదక విద్యుత్తులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, వినూత్న ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌కో, డిస్కంల ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది.

మన తెలంగాణ 7 Nov 2025 3:30 am

బీహార్‌లో తొలివిడత ప్రశాంతం

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ 64.66 శాతం పోలింగ్ నమోదైంది. 2020 నాటి ఎన్నికలతో పోల్చితే 2.84శాతం పోలింగ్ అధికంగా నమోదైంది. గురువారంనాడు జరిగిన తొలిదశ పోలింగ్‌లో పలు కీలక, వివాదాస్పద స్థానాలు ఉన్నాయి. మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రానికి 64.66 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తన కారుపై దుండుగులు దాడికి ది గారని ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ కలుగచేసుకుని విచారణ కు ఆదేశించి నిందితులపై చర్యలకు ఆదేశించింది. తొలి దశ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా పలువురు మంత్రులు కూడా బరిలో ఉన్నారు. తేజస్వీయాదవ్ తన కుటుంబానికి గట్టి పట్టున్న రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ నమోదైన శాతాన్ని బట్టి మెరుగైనదిగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందనే విషయంపై ప్రధాన ప్రత్యర్థులు ఎన్‌డిఎ, ఇండియా కూటములు వి శ్లేషణలకు దిగుతున్నాయి. ఈ దఫా మొత్తం 18జిల్లాల్లో విస్తరించుకుని ఓటింగ్ జరిగింది. ఇందులో బెగూసరాయ్ జిల్లాలో అత్యధికంగా సాయంత్రానికి 67.32శాతం పోలింగ్ నమోదైం ది. తరువాత స్థానంలో సమస్తిపూర్‌లో 66శాతం, మాధేపురాలో 65 శాతం ఓటింగ్ రికార్డు అయింది. లఖిసరాయ్‌లో నాలుగోసారి పోటికి దిగిన ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా తన కాన్వాయ్‌ను ఆర్జేడీ మద్దతుదార్లు నిలిపివేశారని, దాడికి దిగారని ఆరోపించారు. అక్కడి బిసి ఓటర్లను బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌జెడి ఎంఎల్‌సి ఆజయ్ కుమార్‌కు, డిప్యూటీ సిఎంకు నడుమ మాటల యుద్ధం సాగింది. తాగుబో తు, క్రిమినల్ అంటూ పరస్పరం తిట్టుకున్నారు. మాకు బలమున్న చోట ఓటింగ్ తగ్గించే కుట్ర: ఆర్‌జెడి ఇండియా కూటమి బలమున్న చోట్లలో పోలింగ్ శాతం తగ్గేందుకు అధికారులు యత్నించారని ఆర్జేడీ సామాజిక మాధ్యమాలలో ఆరోపించింది. ఈ వాదనను ఎన్నికల సంఘం అధికారులు తోసిపుచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ప్రశాంతంగా, సజావుగా పోలింగ్ జరిగేలా చూశారని వివరణ ఇచ్చుకున్నారు. పాట్నా నియాజకవర్గంలో సాయంత్రం వరకూ అత్యల్పంగానే ఓటింగ్‌రికార్డు అయింది. ఇక్కడ బనిక్‌పూర్ అర్బ న్ నియోజకవర్గంలో 34శాతం, కుమాహ్రారర్‌లో 37 శాతానికి పైగా జనం ఓటేశారు. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో, నగరాల్లో ఓటింగ్ పట్ల ఓటర్లు ఉత్సాహం ప్రదర్శించకుండా ఉంటున్న వైనం ఈ పరిస్థితికి కారణం అని అధికారులు విశ్లేషించారు. 

మన తెలంగాణ 7 Nov 2025 3:30 am

వందేమాతరానికి 150 ఏళ్లు

మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని విద్యాసంస్థల్లో శుక్రవారం(నవంబర్ 7) ఉదయం 10 గంటలకు వందేమాతర గీతం సామూహికంగా ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రచయిత బంకింఛంద్ర చట్టర్జీ వందేమాతరం గీతం రచించి 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పాఠశాలలతో పాటు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వందేమాతరం పాడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నేడు ఢిల్లీలో ప్రారంభించనున్న మోడీ స్వాతంత్య్ర పోరాటానికి దేశభక్తిని ప్రేరేపించిన ‘వందేమాతరం’జాతీయ గీతాన్ని రచయిత బకించంద్రఛటర్జీ రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడుగునా స్మారక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా స్మారక తపాలా స్టాంప్, నాణేన్ని కూడా విడుదల చేస్తారు. ఈ ఏడవ తేదీ నుంచి వచ్చే ఏడాది నవంబర్ 7 వరకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అనుసంధానంగా అనేక చోట్ల బహిరంగ ప్రదేశాల్లో సామూహిక గీతాలాపన నిర్వహిస్తారు.  

మన తెలంగాణ 7 Nov 2025 3:00 am

ఉద్యోగాల కల్పనే లక్ష్యం

. 12న కొత్తగూడెంలో మెగా జాబ్‌ మేళా. సద్వినియోగానికి కూనంనేని పిలుపు. ప్రచార పోస్టరు విడుదల విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం:కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైనప్పటికీ నిరుద్యోగం అధికమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈనెల 12న మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి కాలరీస్‌ సంస్థ సౌజన్యంతో కొత్తగూడెం క్లబ్‌లో జరిగే జాబ్‌ మేళాను సద్వినియోగించుకోవాలని కోరారు. ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారన్నారు. కొత్తగూడెం […] The post ఉద్యోగాల కల్పనే లక్ష్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Nov 2025 1:03 am

జర్నలిస్టుల సమస్యలు విస్మరిస్తే ఆందోళన

టీయూడబ్ల్యూజే హెచ్చరిక విశాలాంధ్ర- హైదరాబాద్‌: గత ప్రభుత్వం మాదిరిగా జర్నలిస్టుల సమస్యలు విస్మరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూ డబ్ల్యూజే) ప్రభుత్వాన్ని హెచ్చరించింది. శంకర్‌ పల్లి మండలం పొద్దటూరు ప్రగతి రిసార్ట్స్‌ లో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్‌ అలీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో, జర్నలిస్టుల ప్రధాన సమస్యలు… వాటి పరిష్కారంపై జరుగుతున్న జాప్యంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి […] The post జర్నలిస్టుల సమస్యలు విస్మరిస్తే ఆందోళన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Nov 2025 12:59 am

రేవంత్‌రెడ్డిపైచర్యలు తీసుకోండి

ఈసీకి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదువిశాలాంధ్ర – హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి దిగజారి చేస్తున్న ప్రయత్నా లను, చౌకబారు మాటలను పరిశీలించి, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీఈవో సుదర్శన్‌రెడ్డిని కోరినట్టు శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి … ముస్లింపై చేసిన వ్యాఖ్యలపై గురువారం ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక చారిత్రక బాధ్యతను నిర్వహించింది. తెలంగాణ ప్రజలు […] The post రేవంత్‌రెడ్డిపైచర్యలు తీసుకోండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Nov 2025 12:54 am

ఫిర్యాదుల మధ్య బీహార్‌లో పోలింగ్‌

బీహార్‌ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌ గురువారం పూర్తి అయింది. సాయంత్రం అయిదు గంటలకల్లా 65 శాతం ఓట్లు పోలైనట్టు అంచనా. కొన్ని చోట్ల మామూలుగా కన్నా పది శాతం ఎక్కువ పోలింగ్‌ జరగడం దేనికి సంకేతమో చూడాలి. అధికారపక్షానికి దిక్కు తోచడం లేదు. ప్రతిపక్షాలు అత్యంత ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ఇరవై ఏళ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మరోసారి అధికారం నిలబెట్టు కోగలరా లేదా అన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది. నితీశ్‌ కుమార్‌ను పక్కకు […] The post ఫిర్యాదుల మధ్య బీహార్‌లో పోలింగ్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Nov 2025 12:15 am

చరిత్రగతిని మార్చిన అక్టోబరు సోషలిస్టు విప్లవం

108 సంవత్సరాల క్రితం 1917 అక్టోబర్‌లో రష్యాలో జరిగిన సోషలిస్టు విప్లవం ప్రపంచ చరిత్రగతిని మార్చిన మహత్తర ఘటన. పెట్టుబడిదారీ విధానానికి గట్టి సవాల్‌ విసిరిన సంఘటన. పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజానికి పరివర్తన చెందేందుకు జరిగిన మౌలిక మలుపు. 1917 అక్టోబర్‌ విప్లవం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆనందం వ్యక్తం అయింది. మానవజాతి చరిత్రలో నూతనదశ ప్రారంభమైంది. జారుచక్రవర్తి ‘జైలు’లాంటి సామ్రాజ్యంలోని వందకు పైగా జాతులు గల ప్రాంతంలో అధికారం కార్మిక, కర్షక సోవియట్‌ రాజ్యం […] The post చరిత్రగతిని మార్చిన అక్టోబరు సోషలిస్టు విప్లవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Nov 2025 12:14 am

న్యూయార్క్‌ నగరమా! మళ్లీ ఊపిరి పీల్చుకో!

షాయిస్తా ఖానూమ్‌ పఠాన్‌ ఓ న్యూయార్క్‌ నగరమా! మళ్లీ ఊపిరి పీల్చుకో అంటూ నూతన మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన 34 ఏళ్ల డెమొక్రాట్‌ నేత జొహ్రాన్‌ మమ్దానీ పిలుపునిచ్చారు. ‘ఇన్నేళ్లు ఓటమి భయంతో ఊపిరి బిగబట్టి గడిపావు. ఇప్పుడు విజయం నిన్ను వరించింది. ఆస్వాదించు. కష్టాలు, కన్నీళ్లు తీరబోతున్నాయి. నూతన శకం లిఖించు…’ అంటూ విజయోత్సవ సభలో న్యూయార్క్‌నుద్దేశించి మమ్దానీ ఉద్ఘాటించారు. అమెరికాలోని అతిపెద్ద నగరానికి మేయర్‌ కోసం మంగళవారం జరిగిన […] The post న్యూయార్క్‌ నగరమా! మళ్లీ ఊపిరి పీల్చుకో! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Nov 2025 12:12 am

నవ్విపోదురుగాక నాకేటి

ఏలేవారి చేతికి ఎముకలు లేవనుకుంట బావ హద్దు అదుపు లేకుండా ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడేమయిందయ్యా ఎవరు ఖర్చు పెడుతున్నారు ఏంటి కథ. ఎవరని నిదానంగా అడుగుతావేంటి. అసలు పార్టీలో పనిచేసే వారికి పదవులివ్వకపోతే పని చేయరా. ప్రతి కార్యకర్తను ఏదో ఒక కమిటీలో మెంబరు వేసి ఎంతో కొంత జీతం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు ఎవరికి అందినకాడికి వారు ప్రజాధనం దోచుకుంటున్నారేగాని ప్రజల సమస్యలు పరిష్కారంపై దృష్టిపెట్టడంలేదు. ఒకరు లండను వెడితే […] The post నవ్విపోదురుగాక నాకేటి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Nov 2025 12:11 am

శుక్రవారం రాశి ఫలాలు (07-11-2025)

మేషం: ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవసేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభం:  కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టిసారించడం మంచిది. మిధునం: దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి. కర్కాటకం: రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయట పడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీపనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సింహం: ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవసేవా కార్యక్రమాలకు ధనసహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. కన్య: వృత్తి వ్యాపారాలలో పనిఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాటఇవ్వటం మంచిది కాదు. విద్యార్థులు పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. దైవసేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. తుల: నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీమాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. వృశ్చికం:  ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవకార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి. ధనస్సు: కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధనసహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు. మకరం: వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరోబాధను కలిగిస్తాయి. ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడివలన నూతనరుణాలు చేయవలసివస్తుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. కుంభం: వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులనుండి ఆశించిన ధనసహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థానచలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీచేసుకుంటారు. మీనం వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  

మన తెలంగాణ 7 Nov 2025 12:10 am

పాలకుల ప్రోత్సాహంతోనేసబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి

రెవెన్యూ వ్యవస్థలో అక్రమాల దందాసీఎం కంటితుడుపు వ్యాఖ్యలు: ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పాలకుల ప్రోత్సాహంతోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలలో అవినీతి వేళ్లూనుకు పోయిందని, రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకల వల్ల ఈ కార్యాలయాల్లో అవినీతి దందా కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ప్రభుత్వానికి తెలియనిది కాదనీ, పాలకుల ప్రోత్సాహంతోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి తారస్థాయికి […] The post పాలకుల ప్రోత్సాహంతోనేసబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Nov 2025 12:06 am

పత్తి రైతు కుదేలు

ఇటు తుపానులు… అటు ధరల పతనంతగ్గిన దిగుబడి… కొనుగోలుకు ముందుకు రాని సర్కారు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రంలో పత్తిరైతు కష్టాలు వర్ణనాతీతం. అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఓ పక్క…పండిన పంటకు గిట్టుబాటు ధర లేక మరోపక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలు, తుపానుల ప్రభావం, మార్కెట్‌లో ధరల పతనం వంటి కారణాల వల్ల తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నారు. పంట చేతికందే సమయంలో తుపాను రావడంతో తీవ్రంగా నష్టపోయారు. రెండేళ్ల క్రితం తీవ్ర కరువుతో […] The post పత్తి రైతు కుదేలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:54 pm

డేటా ఆధారిత పాలన

. ‘వన్‌ విజన్‌-వన్‌ డైరెక్షన్‌’ ప్రభుత్వ విధానం. సమాచార క్రోడీకరణతో మెరుగైన సేవలు. విజన్‌ యూనిట్లుగా గ్రామ సచివాలయాలు. ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం నివారించాలి. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: వన్‌ విజన్‌-వన్‌ డైరెక్షన్‌ ప్రభుత్వ విధానమని, దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు విజన్‌ యూనిట్లుగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం […] The post డేటా ఆధారిత పాలన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:49 pm

డ్రగ్స్ డోస్ ఎక్కువై యువకుడు మృతి

మన తెలంగాణ/రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ కెన్‌వర్త్ అపార్ట్‌మెంట్ మత్తు మందు ప్రియులకు అడ్డగా మా రింది. ఆ మత్తే వారి జీవితాలను చిత్తు చేస్తుండ డం స్థానికులను కలవరానికి గు రి చేస్తుంది. దాంతో పలు కు టుంబాలు సురక్షితంగా భావించి నివాసం ఉంటున్న కెన్ వర్త్ ఆపార్ట్ మెంట్ ప్రాంగాణాన్ని తమకు అనువు గా సహజీవనానికి పాల్పడుతున్న కొందరు అనుకులంగా మార్చుకుని అధిక మోతాదులో మత్తు మందు స్వీకరించి ప్రాణాలు కోల్పోతుండడం కలకలం రేపుతోంది. ఇటీవల ఓ ఎయిర్ హోస్టేస్ ప్రియుడితో కలసి జరుపుకున్న బర్త్ డే పార్టీలో అనుమానా స్పదంగా ప్రాణాలు కోల్పోగా తాజాగా గురువారం వెలుగు చేసిన సంఘటన ఆందోళనకరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్లు ఉన్నా యి. అందులోని ఫ్లాట్ నెంబర్ 805 లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ అత ని స్నేహితుడితోపాటు మరో ఇద్దరు యువతులతో కలసి లివింగ్ రిలేషన్షిప్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా బుధవారం రాత్రి అహ్మద్ అలీ తన స్నేహితుడితోపాటు మరో ఇద్దరు అమ్మాయిలతో కలసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నాడు. మత్తుకు బానిసగా మారిన పార్టీలో అధిక మోతాదులో మాదక ద్రవ్యం స్వీకరించిన అహ్మద్ అలీ (28) అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అపార్ట్మెంట్ వాసులు ఇచ్చిన సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే పరిశీలించగా అప్పటికే అహ్మద్ అలీ మృతి చెందాడు. పోలీసుల విచారణలో గత రాత్రి అహ్మద్ అలీ తో మరో యువకుడు ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అధికంగా డ్రగ్స్ వాడడం వల్లే అహ్మద్ అలీ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతికి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్ ఓవర్ డోస్ వల్ల అహ్మద్ అలీ మరణించగా, అతని తో పాటు ఉంటున్న మరో ఇద్దరికీ పాజిటివ్ రాగా, మరో అమ్మాయికి నెగటివ్ వచ్చింది. 

మన తెలంగాణ 6 Nov 2025 11:47 pm

తొలి దశ ప్రశాంతం

బీహార్‌లో 65 శాతం పోలింగ్‌. చెదురు మదురు ఘటనలు…ఈవీఎంల మొరాయింపు. అనేక చోట్ల ఓట్ల గల్లంతుపై ప్రజల ఫిర్యాదులు. డిప్యూటీ సీఎం విజయ్‌కుమార్‌ సిన్హాకు చేదు అనుభవం. భక్తియార్‌పూర్‌లో ఓటేసిన సీఎం నితీశ్‌, పట్నాలో లాలు, తేజస్వి. గెలుపుపై అధికార, ప్రతిపక్ష నేతల ధీమా పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందకు అధికారులు అనుమతించారు. సుమారు […] The post తొలి దశ ప్రశాంతం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:45 pm

కుటుంబాన్ని చిదిమేసిన చీమలు

మన తెలంగాణ/అమీన్‌పూర్: క్రూర జం తువులే కాదు.. చిట్టి చీమలు కూడా మనిషి మరణానికి కారణం అవుతున్నాయి. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది ముమ్మాటికి నిజం. అందుకు అమీన్‌పూర్‌లో జరిగిన ఘటనే ఉదాహరణ. బంగారం లాంటి బిడ్డ కంటికి రెప్పలా కాపాడుకునే భర్త జీవితానికి కావలసిన సదుపాయాలతో నిండు నూరేళ్లు సంతోషంగా గడపాల్సిన ఓ మహిళ కేవలం చీమల బెడద తట్టుకోలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. ఈ అనూహ్య ఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సిఐ నరేష్ తెలిపిన వివరా ప్రకారం ఇలా ఉన్నాయి.. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో నవ్య కాలనీలో నివాసముంటున్న మనీషా (25) చీమలకు భయపడి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2022లో మృతురాలు మనీషా కు చిందం శ్రీకాంత్ (35)తో వివాహం జరిగింది. వీరికి అనికా (3) పాప ఉంది. మంచిర్యాలకు చెందిన ఈ దంపతులు రెండున్నర సంవత్సరాల కింద ఉద్యోగ నిమిత్తం అమీన్‌పూర్‌లోని నవ్య కాలనీలో నివాసముంటున్నారు. అయితే మనీషా కు చిన్నప్పటి నుంచి చీమలకు భయపడే మైర్మెకోఫోబియా అనే వ్యాధి ఉంది. మంగళవారం ఉదయం మృతురాలు భర్త శ్రీకాంత్ ఆఫీస్‌కు వెళ్ళాడు. అదే సాయంత్రం శ్రీకాంత్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగా లోపల నుంచి గడియ పెట్టి ఉంది. స్థానికుల సహాయంతో డోర్‌ను పగలకొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని కనిపించింది. పక్కనే దొరికిన లేఖలో చీమలు భరించడం నా వల్ల కావడం లేదని అందుకే చనిపోతున్నానని పేర్కొం ది. కూతురు అనికాను జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ వదిలి వెళ్తున్నందుకు క్షమించాలని భర్తను వేడుకుంది. అన్నవరం,తిరుపతి హుండీ లో రూ.1116/- లు వేయడంతో పాటు ఎల్లమ్మ తల్లికి ఒడి బియ్యం పోయాలని లేఖలో తెలిపింది. ఎప్పుడూ వినని సమస్యతో మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 6 Nov 2025 11:44 pm

యువతకు మీరు ఆదర్శం

మహిళల జట్టుతో రాష్ట్రపతి ముర్ము న్యూదిల్లీ: తొలిసారి వన్డే ప్రపంచకప్‌ సాధించిన భారత మహిళా క్రికెటర్లు గురువారం రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన టీమ్‌ఇండియా సభ్యులు ముర్ముతో ముచ్చటించారు. ప్రపంచకప్‌తో సరికొత్త చరిత్ర సృష్టించిన అమ్మాయిలను ద్రౌపదీ ముర్ము అభినందించారు. యువ తరానికి ముఖ్యంగా బాలికలకు ఆదర్శవం తంగా నిలిచారని ప్రశంసించారు. ‘మన అమ్మాయిల జట్టు భారత మహిళా క్రికెట్‌ను భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్వసిస్తున్నా. క్రికెట్‌ ప్రయాణంలో […] The post యువతకు మీరు ఆదర్శం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:40 pm

’కాంత’ తర్వాత దుల్కర్‌ని నటచక్రవర్తి అని పిలుస్తారు

దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పీరియాడికల్ డ్రామా ’కాంత’ నవంబర్ 14న విడుదల కానుంది. టీజర్, పాటలు అద్భుతమైన స్పందనతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ట్రైలర్ ఇంటెన్స్ ఎమోషనల్ సినిమాటిక్ అనుభూతితో అదిరిపోయింది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ కథను భావోద్వేగాలు, హృదయాన్ని హత్తుకునే డ్రామాటిక్ సన్నివేశాలతో అద్భుతంగా చూపించారు. దుల్కర్ సల్మాన్ తన అద్భుతమైన నటనతో మైమరపించారు. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “ఇది మాకు చాలా స్పెషల్ సినిమా. నా బెస్ట్ ఫ్రెండ్ రానాతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సెల్వ అద్భుతమైన కథతో వచ్చాడు. కుమారి పాత్రలో భాగ్యశ్రీ చాలా చక్కగా నటించింది. ఇది మంచి డ్రామా, థ్రిల్లర్‌” అని అన్నారు. హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. “ఇలాంటి పీరియడ్ సినిమాకి దుల్కర్ సల్మాన్ లాంటి రెట్రో కింగ్ పర్ఫెక్ట్. నవంబర్ 14 తర్వాత దుల్కర్‌ని అందరూ నటచక్రవర్తి అని పిలుస్తారు. దుల్కర్, సముద్రఖని లాంటి అద్భుత నటుల మధ్య నిల్చుంది భాగ్యశ్రీ” అని తెలిపారు. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ మాట్లాడుతూ.. “సినిమాలో నటచక్రవర్తి దుల్కర్ సల్మాన్ నటనని అందరూ చాలా ఇష్టపడతారు. రానా నటన అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. భాగ్యశ్రీ, సముద్రఖని అద్భుతంగా నటించారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగ్యశ్రీ, సముద్రఖని, ప్రశాంత్ పొట్లూరి పాల్గొన్నారు.

మన తెలంగాణ 6 Nov 2025 11:30 pm

సమానత్వం ముట్టడిలో, ప్రజాస్వామ్యం ప్రమాదంలో

రష్యా విప్లవం 1917 లో మహత్తర విజయం సాధించింది. ఆనాడు రష్యా రాజకీయ చిత్రాన్ని అంత తేలికగా వూహించలేని పరిస్థితి. ఈ మహత్తర విప్లవం వివిధ ఖండాలలో విభ్రాంతి కలిగించే అలలను సృష్టించింది. శతాబ్దాలుగా వలసవాద రాజ్యాల పునాదులు కదిలిపోయాయి. ఆ కాలంలో మానవాళి విదేశీ పాలనలో లేదా సామ్రాజ్యవాదుల ఆధిపత్యంలో నివసించింది. అప్పుడు స్వాతంత్య్రం, విముక్తి, సమానత్వం కోసం పెట్రోగ్రాడ్‌ వీధుల్లో జరిగిన విప్లవ పోరాటానికి మించి ఈ విప్లవ పోరాటంలో పాల్గొనాలని గొప్ప పిలుపునివ్వడం […] The post సమానత్వం ముట్టడిలో, ప్రజాస్వామ్యం ప్రమాదంలో appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:29 pm

బీహార్‌ భవిత ఎటు…!

పతకమూరు దామోదర ప్రసాద్‌ బీహార్‌ 18వ శాసనసభ 234 స్థానాలకు రెండువిడతలుగా జరుగుతున్న ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్‌ నాయకత్వంలోని అధికార ఎన్డీఏ, రాహుల్‌, ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాగట్బంధన్‌ హోరాహోరీగా తలడుతున్నాయి. నవంబర్‌ 6న తొలివిడతలో 121 స్థానాల ఎన్నికలకు సర్వం సిద్ధంకాగా, మలివిడత 122 స్థానాలకు ఈ నెల11న ఎన్నికలు జరుగనున్నాయి. గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్‌ కుమార్‌ సారధ్యంలోనే ప్రస్తుతానికి ఎన్డీయే ఎన్నికలకు వెళుతుండగా, […] The post బీహార్‌ భవిత ఎటు…! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:28 pm

భారత నావికాదళానికికొత్త శక్తి

డీజే మోహనరావుభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ నెల 2వ తేదీన, దేశీయంగా అభివృద్ధి చేసిన శక్తిమంతమైన లాంచ్‌ వెహికల్‌ మార్క్‌-3 రాకెట్‌ ద్వారా, భారత నావికాదళానికి చెందిన అత్యంత అధునాతన కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-7ఆర్‌(సీిఎంఎస్‌-03)ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ విజయం ఇస్రోకు గొప్ప సాంకేతిక మైలురాయి మాత్రమే కాదు, దేశ రక్షణ సామర్థ్యాలను ఇది గణనీయంగా పెంపొందించింది. అంతరిక్ష రంగంలో స్వావలంబన సాధించాలనే భారతదేశ లక్ష్యానికి […] The post భారత నావికాదళానికికొత్త శక్తి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:26 pm

విద్వేషాలను ఓడిరచిన మమ్ద్దానీ

అమెరికాలో అతి పెద్ద నగరం, ప్రపంచంలో గొప్ప నగరాల్లో ఒకటి అయిన న్యూయార్క్‌ మేయరుగా జొహ్రాన్‌ మమ్దానీ ఎన్నిక కావడమే కాక ఆయన డెమొక్రాట్‌ పార్టీలో సోషలిస్టు కావడం బ్రహ్మాండమైన పరిణామమే. మమ్దానీ భారతీయ సంతతి వాడు. ప్రసిద్ధ దర్శకురాలు మీరా నాయర్‌ కుమారుడు. మంగళవారం రాత్రి డెమొక్రాట్‌ పార్టీ నాయకులకు పండగ రోజు. అబిగెయిల్‌ స్పాంబెగర్‌ వర్జీనీయ రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికయ్యారు. న్యూ జెర్సీ గవర్నర్‌గా మైకీ షెర్రిల్ల్‌ మరో వేపు జాక్‌ చీట్టరెల్లీని ఓడిరచి […] The post విద్వేషాలను ఓడిరచిన మమ్ద్దానీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:25 pm

ఇండియన్ స్క్రీన్ మీద చూడని భిన్నమైన చిత్రం

రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘టాక్సిక్ - ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ పనుల్లో బిజీగా ఉన్నారు. యాక్షన్-ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశ బెంగళూరులో జరుగుతోంది. క్రేజీ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో జరిగిన చిట్ చాట్‌లో ‘టాక్సిక్’ గురించి ఆమె ప్రస్తావించారు. రుక్మిణి వసంత్ మాట్లాడుతూ “టాక్సిక్’ అనేది ఇప్పటివరకు కన్నడ లేదా భారతీయ సినిమాల్లో మనం చూసిన వాటన్నంటికంటే భిన్నంగా ఉంటుంది. ఇది రా అండ్ రస్టిక్‌గా ఎన్నో లేయర్స్‌తో అద్భుతంగా ఉండబోతోంది. దర్శకురాలు గీతు విజన్ ఎంతో బోల్డ్‌గా ఉంటూనే.. అదే సమయంలో ఎంతో హృద్యంగానూ ఉంటుంది’అని పేర్కొంది.

మన తెలంగాణ 6 Nov 2025 11:21 pm

కాంగ్రెస్ గెలుపు ఖాయం –ఎంపీ రఘురాం రెడ్డి

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం

ప్రభ న్యూస్ 6 Nov 2025 11:06 pm

యువతకు మీరు రోల్ మోడల్..

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ టీమ్ సభ్యులు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిసారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన టీమిండియా బృందం రాష్ట్రపతితో సరదాగా ముచ్చటించారు. ప్రతిష్టాత్మకమైన ట్రోఫీతో నయా చరిత్ర సృష్టించిన టీమిండియా క్రికెటర్లను రాష్ట్రపతి ముర్మ అభినందించారు. దేశంలోని కోట్లాది మంది యువతకు మీరు రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు. చిరస్మరణీయ విజయంతో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. ఈ గెలుపు భారత మహిళా క్రికెట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లుందని విశ్వసిస్తున్నా, క్రికెట్ ప్రయాణంలో మీరు ఎన్నో కఠిన సవాళ్లను, పరీక్షలను ఎదుర్కొని ఉంటారు. అవన్నీ దాటుకుని ప్రస్తుతం విశ్వవిజేతగా నిలువడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మీరు సాధించిన ఈ విజయం కోట్లాది మంది భారతీయులను ఆనందంలో ముంచెత్తింది. ఈ విజయంపై దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. విశ్వవిజేతగా నిలిచిన జట్టు భారత వైవిద్యతలను ప్రతిబింబిస్తోంది. విభిన్న ప్రాంతాలు..భిన్న పరిస్థితులు, విభిన్న సామాజిక నేపథ్యాలు ఉన్న వారంతా ఒక జట్టుగా సమష్టి విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. రాబోయే తరాలకు మీరంతా స్పూర్తిదాయకంగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులంతా సంతకాలు చేసిన ప్రత్యేక జెర్సీని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బహూకరించారు.

మన తెలంగాణ 6 Nov 2025 10:59 pm

కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి

హైదరాబాద్ ( జూబ్లీహిల్స్), ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:44 pm

చెరువు సునామీ

కేవీబీపురం, ఆంధ్రప్రభ : అ్చప్పుడప్పుడే తెల్లవారుతోంది. ప్రజలు ఒక్కొక్కరిగా నిద్రలేచేస్తున్నారు. అంతలోనే జలవిలయం

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:31 pm

21న రాష్ట్రపతి రాక

తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నవంబరు

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:24 pm

సర్, మీ స్కిన్ కేర్ రహాస్యం.. మోడీకి హర్లీన్ ఊహించని ప్రశ్న

వన్డే ప్రపంచకప్ ట్రోఫీ సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళా క్రికెట్ టీమ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.అయితే, ఈ భేటీ సందర్భంగా టీమిండియా స్టార్ క్రికెటర్ హర్లీన్ డియోల్ ప్రధాని మోడీని అడిగిన ఓ ప్రశ్న అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరూ ఊహించని విధంగా హర్లీన్ ప్రధానినిఅనూహ్య ప్రశ్నను అడిగింది. మైక్ అందుకున్న డియోల్ ‘సర్, మీ స్కిన్ కేర్ ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. దీని వెనక ఉన్న రహస్యమెంటో మాకు చెప్పగలరా?’ అని ప్రశ్నించింది. హర్లీన్ నుంచి ఊహించని ప్రశ్నకు ప్రధానితో సహా అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ప్రధాని దీనిపై చిరనవ్వుతో స్పందిస్తూ వాటి గురించి ఆలోచించను అంటూ సమధానం ఇచ్చారు. ఆ వెంటనే జట్టు సభ్యుల్లోని ఒక ప్లేయర్ స్పందిస్తూ ‘సర్, ఇది దేశంలోని కోట్లాది మంది ప్రేమ వల్లే’ అనగానే మరోసారి అందరూ సరదాగా నవ్వేశారు. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ స్పందిస్తూ చూశారా సర్ ఇలాంటి వారిని నేను డీల్ చేయాల్సి వచ్చిందన్నారు. అందుకే, నా జుట్టు త్వరగా తెల్లబడిపోయిందని అనేశారు.

మన తెలంగాణ 6 Nov 2025 10:22 pm

ఇద్దరికి మూడేళ్లు జైలు

ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి : కర్రా కళ్యాణ్ దళితుడు.

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:21 pm

కొత్త లుక్‌లో తారక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ నుంచి షూటింగ్ వరకు పలు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ కొత్త అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తారక్‌పై ఓ కొత్త లుక్‌ను ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అలీ హకీమ్‌తో సిద్ధం చేయిస్తుండగా దీనిని దర్శకుడు ప్రశాంత్ నీల్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఇలా కొత్త లుక్‌తో కొత్త షెడ్యూల్ కి రంగం సిద్ధం చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఎన్టీఆర్ లోని బీస్ట్ మోడ్ చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఈ భారీ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది రిలీజ్ కి తీసుకొస్తున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది. అయితే ‘డ్రాగన్’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా సమయం తీసుకున్నాడు. కాబట్టి ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

మన తెలంగాణ 6 Nov 2025 10:21 pm

జూబ్లీహిల్స్ నుంచే మార్పు మొదలవ్వాలి..

బోరబండ, ఆంధ్ర‌ప్ర‌భ : హిందూ టైగర్ బండి సంజయ్ అంత ఆవేశంగా ఎందుకు

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:17 pm

వైభవంగా లక్ష పుష్పార్చన

మక్తల్ / ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:05 pm

ముగిసిన సప్తాహం..

చెన్నూర్ / ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూర్ జగన్నాధాలయంలో కార్తీక మాసం పాడ్యమి

ప్రభ న్యూస్ 6 Nov 2025 9:59 pm

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప..

ఆసిఫాబాద్ / ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అవినీతిచేప‌ బయటపడింది. రైస్

ప్రభ న్యూస్ 6 Nov 2025 9:54 pm

Keerthy Suresh lines up Six New Films

National-award-winning actress Keerthy Suresh hasn’t delivered a super hit in the recent years. The actress also did not sign big ticket films in Telugu and she is now focused on signing more number of films after getting married. She has an interesting set of films lined up for shoot and they will release next year. […] The post Keerthy Suresh lines up Six New Films appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 9:52 pm

రష్యా ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ దాడి

కీవ్: రష్యాలోని వోల్గోగ్రేడ్ రీజియన్ లోని భారీ చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు బుధవారం దాడి చేశాయి. గత మూడు నెలల్లో ఇది రెండో దాడిగా ఉక్రెయిన్ ప్రభుత్వ సిబ్బంది గురువారం తెలిపారు. రష్యా మొత్తం రిఫైనరీ సామర్ధంలో 5.6 శాతం ఉన్న ఈ రిఫైనరీ ఏటా 15 మిలియన్ టన్నుల ముడిచమురును ఉత్పత్తి చేస్తుంది. రష్యా యుద్ధానికి అవసరమైన చమురు ఎగుమతుల ఆదాయాన్ని అందకుండా చేయడానికే రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడి చేస్తోంది. 

మన తెలంగాణ 6 Nov 2025 9:50 pm

కాషాయ జెండాను రెపరెపలాడిస్తా..

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : బోరబండలో తమ సభకు అనుమతి ఇచ్చి రద్దు చేయడంపై

ప్రభ న్యూస్ 6 Nov 2025 9:44 pm

లిక్కర్ బాబులకు షాక్

ఆంధ్రప్రభ, రాయచోటి : రాయచోటి లో మద్యం తాగి వాహనాలు నడిపిన ఐదుగురికి

ప్రభ న్యూస్ 6 Nov 2025 9:26 pm

యాప్‌ తిక్కిరిబిక్కిరి

కర్నూలు సిటీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం 2025.. 2026 కు గాను

ప్రభ న్యూస్ 6 Nov 2025 9:23 pm

Big Shock for BRS Ahead of Jubilee Hills Bypoll: Maganti Family Rift Rocks the Party

With just five days left for the crucial Jubilee Hills by-election, political heat in Telangana has reached its peak. All major parties are campaigning aggressively, but the Bharat Rashtra Samithi (BRS) has been hit by an unexpected setback. The late Jubilee Hills MLA Maganti Gopinath’s mother, Mahanandakumari, made explosive statements that have stirred the political […] The post Big Shock for BRS Ahead of Jubilee Hills Bypoll: Maganti Family Rift Rocks the Party appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 9:15 pm

బెట్టింగ్ రాజాలు పరారీ..

ఒంగోలు ప్రతినిధి. ఆంధ్రప్రభ : ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ బెట్టింగ్ భూతం

ప్రభ న్యూస్ 6 Nov 2025 8:55 pm

Big News: Aryan Khan to direct SRK

Bollywood Superstar Shah Rukh Khan’s son Aryan Khan made his debut as director with The Bads of Bollywood that is streaming on Netflix. Aryan Khan’s work is widely appreciated all over. The youngster is all set to direct a feature film and the shooting formalities will start during early next year. The details of the […] The post Big News: Aryan Khan to direct SRK appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 8:45 pm

కాపాడిన ఫైర్ ఫైటర్

మోపిదేవి, ఆంధ్రప్రభ : గ్యాస్ బండ లీకేజీతో భారీగా మంటలు వ్యాపించి తృటిలో

ప్రభ న్యూస్ 6 Nov 2025 8:44 pm

చర్చి ఫాస్టర్‌పై కేసు...

ప్రార్థనల కోసం వచ్చిన మహిళా భక్తులను వేధింపులకు గురిచేస్తున్న చర్చి ఫాస్టర్‌పై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ అయిన మాసా జేడీ పాల్ కొంత కాలం నుంచి ప్రార్థనల కోసం చర్చికి వచ్చే మహిళలను వేధిస్తున్నాడు. జేడి పాల్ తండ్రి మాస యేసురత్నం 47ఏళ్ల క్రితం ఫతేనగర్‌లోని చర్చికి వచ్చే భక్తులు విరాళాలు ఇవ్వడంతో చర్చిని కట్టారు. కరోనా సమయంలో మాస యేసు రత్నం 2021 లో మృతిచెందారు. తర్వాత చర్చిని స్వాధీనం చేసుకున్న అతడి కుమారుడు మాసా జెడి పాల్ భక్తులను వేధింపులకు గురిచేస్తున్నాడు. తండ్రి బ్రతికి ఉన్నప్పుడు ఆయన పై వ్యభిచారి అని నింద వేసి, చర్చి నుంచి కొంత మందిని తీసుకొని వెళ్లిపోయి బాలానగర్ లో మాసా జెడి పాల్ మరో చర్చి నిర్వహిస్తున్నాడు. తండ్రితో విభేదించి వెళ్లిపోయిన పాస్టర్ మాస పాల్ తండ్రి మరణం తర్వాత బలవంతంగా చర్చ్‌లోకి జొరబడి, తల్లి మాస రూతమ్మతో కలిసి అక్కడి చర్చిని తీసివేశారు. ఇది తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తి అంటూ ప్రార్థనలు జరగకుండా నానా హంగామా చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి చేసి కొట్టారు, మహిళా భక్తులు అని చూడకుండా పాస్టర్ మాస పాల్ మహిళల వీడియోలు చిత్రీకరించడం, రహస్యంగా చర్చ్ లో సిసి కెమెరాలు పెట్టారు, దీంతో మహిళా భక్తులు చర్చికి రావడం మానేశారు. మాస పాల్, మాస రూతును చర్చి అమ్మకానికి పెట్టారని బాధితులు ఆరోపించారు. భక్తులను బెదిరించడం, అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితులు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 6 Nov 2025 8:40 pm

న‌వీన్ యాద‌వ్ కు మ‌ద్ద‌తుగా ఇంటింటి ప్ర‌చారం…

యూసఫ్ గూడా / ఆంధ్రప్రభ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

ప్రభ న్యూస్ 6 Nov 2025 8:37 pm

బీహార్‌లో ఓట్ల చోరీకి బీజేపీ యత్నం : రాహుల్

పూర్నియా (బీహార్): బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనబలం ఉపయోగించి ఓట్ల చోరీకి బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనికి వ్యతిరేకంగా పోరాడ వలసిన బాధ్యత యువకులదేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలియజేశారు. గురువారం ఇక్కడ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు చోరీ చేసి బిజేపి గెలుస్తోందని, హర్యానా ఎన్నికల్లో బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ఓట్లు చోరీ చేశారని యావత్ ప్రపంచానికి తాము చూపించామని, అదే విధంగా బీహార్ లోనూ జరుగుతుందన్నారు. దీన్ని అడ్డుకునే బాధ్యత యువతదేనని, రాజ్యాంగాన్ని రక్షించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో జాగ్రత్తగా గమనించాలని యువతకు సూచించారు. యువత నిరుద్యోగంతో అల్లాడుతుంటే కోటీశ్వరుల పాలనను ప్రధాని మోడీ కోరుకుంటున్నారని విమర్శించారు. అరారియాలో జరిగిన మరో ర్యాలీలో మాట్లాడుతూ మోడీ, అమిత్‌షా దేశంలో జంగిల్‌రాజ్‌ను అమలు చేస్తున్నారని, దీనికి ఇడి, సిబిఐ, ఐటి దాడులే ఉదాహరణగా చెప్పారు. కులం, మతం ఆధారంగా మోడీ ప్రజల్లో చీలిక తెస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రం లోని యువకులను లేబర్‌గా మారుస్తున్నారన్నారు. 

మన తెలంగాణ 6 Nov 2025 8:34 pm

ఓటమి భయంతోనే బిఆర్‌ఎస్ నేతల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు

ఓటమి భయంతోనే బిఆర్‌ఎస్ నేతల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఆ పార్టీ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ లోని మూసాపేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థిరపడ్డ కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజల అకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన రేండేళ్లలోనే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశారన్నారు.ఉమ్మడి పాలనలో ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేశారని, ఆయన చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదికి రూ. 75 కోట్ల వడ్డీలు చెల్లిస్తుందన్నారు.సిఎం రేవంత్ రెడ్డిపై కెటిఆర్ వ్యాఖ్యలు బావదారిద్య్రం, దివాలాకోరుతనాన్ని చాటుతున్నాయని మంత్రి జూపల్లి మండిపడ్డారు. కెసిఆర్ కుటుంబం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆరాచక పాలన చేసిన కెసిఆర్ కుటుంబానికి ఓటు అడిగే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు ఓటు వేయడమే కాకుండా ఇంటింటికి తిరుగుతూ నవీన్ యాదవ్‌కు మద్దతుగా నిలబడి ఓట్లు వేయించాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని మంత్రి జూపల్లి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 6 Nov 2025 8:32 pm

Jatadhara is like a childhood Chandamama tale – Sudheer Babu

Sudheer Babu has grown a niche following for himself by attempting different genres and diverse characters. Now, the actor is starring in a divine supernatural thriller, Jatadhara. Talking about the film, he stated that he is happy with the response for teaser and trailer, calling it a theatrical experience for audiences. He revealed that like […] The post Jatadhara is like a childhood Chandamama tale – Sudheer Babu appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 8:27 pm

మజ్లిస్ మెప్పు కోసం ముఖ్యమంత్రి తహతహ:కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో ఏం చేయాలన్నా మజ్లిస్‌ను అడిగి, వారి మెప్పు పొందిన తర్వాతే చేస్తున్నారని కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ’ఇజ్జత్’ అంటావు, మరి హిందువులు ఇజ్జత్ కాదా రేవంత్‌రెడ్డి అని ప్రశ్నించారు. ఎర్రగడ్డలో ఖబర్‌స్తాన్‌కు స్థలం కేటాయించడం సరైనదేనా అని ప్రశ్నించిన ఆయన బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాల స్థలం ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. హిందువులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ అనుబంధాన్ని ఎంతకాలం కొనసాగిస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తన పరిధిలో విచారణ చేయకుండా బీజేపీపై ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ తో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై సీబీఐ కేసు నమోదు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై కిషన్ రెడ్డి స్పందిస్తూ దీనిపై కేంద్రం దర్యాప్తునకు సిద్ధంగా ఉందని చెప్పారు. బోరబండలో పాదయాత్ర చేస్తే ఎంత మేర అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని అన్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 6 Nov 2025 8:22 pm

ఈనెల 12వ తేదీన కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నేడు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. తిరిగి ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నాం 3 గంటలకు కేబినెట్ భేటీని నిర్వహించనున్నట్లుగా అధికారికవర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటామని గతంలో జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు పేర్కొన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టుగా సమాచారం.

మన తెలంగాణ 6 Nov 2025 8:18 pm

త్వరలోనే గిగ్ వర్కర్లకు ప్రత్యేక చట్టం

వివిధ రంగాల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. త్వరలోనే గిగ్ వర్కర్ల బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం సచివాయలంలో పలు గిగ్ వర్కర్ల యూనియన్లతో చర్చించిన మంత్రి గిగ్ వర్కర్లకు న్యాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఎంతో మంది గిగ్ వర్కర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని, అన్ని రంగాల్లో గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి వివేక్ అన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు గిగ్ వర్కర్లకు మేలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు వచ్చేలా అగ్రిగేటర్స్ తో మాట్లాడి నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ చెప్పినట్లు గుర్తు చేశారు. రాహుల్ సూచనల మేరకు వర్కర్లకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గిగ్ వర్కర్లు ఒక్కొక్కరు గంట జొమాటోకు పనిచేస్తే , మరో గంట స్విగ్గీకి చేస్తారని, వారికి కనీస వేతన చట్టం ఎలా అమలు చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. 1962 లో తెచ్చిన కనీస వేతనాల చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయని, ప్రస్తుతం వర్కర్లకు న్యాయం చేసేందుకు కావాల్సిన మార్పుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. గిగ్ వర్కర్లకు సంబంధించిన డ్రాఫ్టింగ్ పూర్తవుతోందని, త్వరలోనే అసెంబ్లీకి వెళ్తుందని చెప్పారు. ఇప్పటి వరకు వారికి భద్రత లేదని, వారికి భద్రత ఎలా కల్పించాలనే కోణంలో ఆలోచిస్తున్నామని చెప్పారు. ఈ అంశాలన్నీ డ్రాఫ్ట్ లో పొందుపరుస్తున్నామని తెలిపారు. త్వరలోనే పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి వివేక్ వర్కర్లకు హామీ ఇచ్చారు.

మన తెలంగాణ 6 Nov 2025 8:16 pm

బెదిరిస్తేనే.. భారత్‌-పాక్ యుద్ధం ఆగింది: ట్రంప్

8 యుద్ధ విమానాలు నేలకూలాయి.. ట్రేడ్ డీల్ బెదిరింపుతోనే రాజీ ఘనత మియామీ బిజినెస్ సదస్సులో టారీఫ్‌లకు సమర్థన న్యూయార్క్ : గత మే నెలలో భారత్ పాక్ స్వల్ప యుద్ధం దశలో ఎనిమిది యుద్ధ విమానాలు నేల కూలాయని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇంతకు ముందు ఆయన చెప్పిన ఏడు విమానాల లెక్కను సరిదిద్ది సరికొత్త లెక్క చెప్పారు. అమెరికాలోని ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరం సదస్సులో ట్రంప్ మాట్లాడారు. ఇంతకు ముందు లాగానే ఆయన ఈసారి కూడా కూలిన ఫైటర్స్ భారత్‌వా? పాక్‌వా చెప్పలేదు. ఇటీవలి కాలంలో కుదురు లేకుండా భారత్ పాక్ యుద్ధం గురించి చెపుతూ వస్తున్న ట్రంప్ ఈ బిజినెస్ ఫోరం వేదికపై కూడా దీని గురించి ప్రస్తావించారు. భారత్-పాక్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందాల ఖరారు దిశలో ఉన్నప్పుడు రెండు దశలో ఘర్షణకు దిగినట్లు తెలిసింది. అప్పడు ఏడు యుద్ధ విమానాలు పూర్తిగా నేలరాలాయి. మరోటి కూడా దాదాపుగా దెబ్బతింది. పనికిరాకుండా పోయింది. ఈ విధంగా చూస్తే మొత్తం ఈ లెక్క ఎనిమిది యుద్ధ విమానాలు అవుతుందని ఆయన తెలిపారు. ఇక తానే రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధ ప్రమాదాన్ని నివారించానని, ఇందుకు తాను వాడిన అస్త్రం ట్రేడ్ డీల్ ఉండబోదని బెదిరించడమే అని మరో సారి తన పాత వాదనను విన్పించారు. దక్షిణాఫ్రికా జి20 సదస్సుకు వెళ్లను: ట్రంప్ ఈ నెలాఖరులో దక్షిణాప్రికాలో జరిగే జి 20 సదస్సుకు తాను వెళ్లబోనని అమెరికా అధ్యక్షులు ట్రంప్ తెలిపారు. ప్రధాన ఆర్థిక దేశాల బృందంలో దక్షిణాఫ్రికాకు సభ్యత్వం కుదురుతుందా? పైగా ఆ దేశంలో జి 20 సదస్సు తనకు ఇష్టం లేదని తెలిపిన ట్రంప్ , అక్కడికి అమెరికా ప్రతినిధి బృందం వెళ్లితే వెళ్లవచ్చు అన్నారు. మియామీ సదస్సులో ఆయన ఈ విషయం తెలిపారు. ఈ నెల 22నుంచి రెండు రోజుల పాటు జోహెన్స్‌బర్గ్‌లో సదస్సు ఖరారయింది. భారతదేశపు సారధ్యంలో జి 20 ఉన్నప్పుడు దక్షిణాప్రికాను ఈ బృందంలోకి శాశ్వత సభ్యత హోదాలోకి తీసుకున్నారు. 

మన తెలంగాణ 6 Nov 2025 8:15 pm

భారీగా గంజాయి, హష్ ఆయిల్ పట్టివేత

భద్రాద్రి: ఇల్లెందు-కొత్తగూడెం మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బైక్, కారులో తరలిస్తున్న గంజాయి, హష్ ఆయిల్‌ని పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా.. గంజాయి, హష్ ఆయిల్‌ని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

మన తెలంగాణ 6 Nov 2025 8:14 pm

Kaantha will be a Pan-India sensation – Dulquer

Kaantha starring Dulquer Salmaan, Bhagyashri Borse, Rana Daggubati, Samuthirakani has created good buzz and anticipation with the teaser and songs. Today, the movie trailer has been released to a huge appreciation from all corners and it is trending on social media since release. The makers have conducted a trailer launch event in front of a […] The post Kaantha will be a Pan-India sensation – Dulquer appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 8:11 pm

జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం !!

యూసుఫ్ గూడా, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

ప్రభ న్యూస్ 6 Nov 2025 8:09 pm

Vijay Deverakonda and Rashmika’s Wedding Date Locked

Tollywood actors Vijay Deverakonda and Rashmika have got engaged recently and they kept it a private affair. The duo was tightlipped and did not respond about their engagement ceremony. There are rumors that Vijay Deverakonda and Rashmika will tie the knot next year and the wedding date is now locked. As per the latest update, […] The post Vijay Deverakonda and Rashmika’s Wedding Date Locked appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 8:08 pm

వారిపై సుముఖత... రామునిపై వ్యతిరేకత: ప్రధాని మోడీ ఫైర్

భాగల్‌పూర్/అరారియా: ఓటు బ్యాంకు రాజకీయాలతో బీహార్‌లో ఆర్‌జేడీ, కాంగ్రెస్ ఉమ్మడి భాగస్వాములు చొరబాటుదారులపై సుముఖత, పరమాత్ముడు రామునిపైన, ఛఠీమైయా (సూర్యభగవానుని సోదరి)పైన వ్యతిరేకత చూపిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ గురువారం బీహార్ ఎన్నికల ర్యాలీల్లో ధ్వజమెత్తారు. భాగల్‌పూర్, అరారియా జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీల్లో ప్రసంగిస్తూ అయోధ్య లోని నిషధరాజ్, మాతాశబరి, మహర్షివాల్మీకి వంటి దర్శనీయమైన క్షేత్రాలను సందర్శించడానికి విపక్ష నాయకులు విముఖత చూపిస్తుంటారని ఆరోపించారు. గతంలో 15 ఏళ్ల ‘జంగిల్‌రాజ్ ’ పాలనలో అభివృద్ధి సున్నాయని, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వం లోని ఎన్‌డిఎ ప్రభుత్వం లోనే రాష్ట్రంలో అనేక ఎక్స్‌ప్రెస్‌వేలు, బ్రిడ్జిలు, నాలుగు సెంట్రల్ యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని ఉదహరించారు. ఓటు చోరీ జరిగిందన్న ఆరోపణలతో రాహుల్ సాగించిన ఓటర్ అధికార యాత్రను పరోక్షంగా ప్రస్తావిస్తూ తప్పుడు కథనాలతో రాజకీయ యాత్రలు సాగించారని విమర్శించారు. 1984లో సిక్కు వ్యతిరేక హింస మాదిరిగా 1989లో భాగల్పూర్‌లో మత ఘర్షణలు కాంగ్రెస్ రెచ్చగొట్టిందని, కుల హింసను ఆర్‌జేడీ ప్రేరేపించిందని ఆరోపించారు. ఆర్‌జేడీ పోస్టర్లపై కాంగ్రెస్ తన నామ్‌దార్ (రాహుల్) చిత్రం లేదన్న ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఇండియా కూటమిలోని వారంతా కుమ్ములాడుకుంటారని వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 6 Nov 2025 7:55 pm

శిథిలావస్థలో నల్లమాడ పోలీస్ స్టేషన్…

విశాలాంధ్ర-నల్లమాడ: మండలకేంధ్రములోని పోలీస్ స్టేషన్ శిథిలావస్థలో చేరుకుంది. ఈ స్టేషన్ గ్రామ మధ్యలో దాదాపుగా 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. వాటికి తోడు సర్కిల్ కార్యాలయం, పీర్లసావడి దగ్గరలోనే వున్నాయి. అరకొర వర్షానికి నీరు కారుతోంది. దీంతో పై కప్పు పెచ్చులు రాలి పడుతున్నాయి. .బుధవారం అరకొర వర్షం పడడంతో పై కప్పు ఒకేసారి కూలి కిందపడిందని పోలీసులు శ్రీనివాసులు, రామలింగం సూర్యనారారణలు ఆవేధన వ్యక్తం చేశారు. స్టేషన్ లో పై కప్పు ఊడడంతో కంప్యూటర్ పెట్టుకోవడానికి […] The post శిథిలావస్థలో నల్లమాడ పోలీస్ స్టేషన్… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 7:55 pm

అద్ధంకి ఒంగోలు బాట..

‎బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ : ‎బాపట్ల జిల్లా రగడకు మంత్రివర్గ ఉప సంఘం

ప్రభ న్యూస్ 6 Nov 2025 7:41 pm

కుర్లపల్లి లో రైతు ఆత్మహత్య

విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం మండల పరిధిలోని కుర్లపల్లి గ్రామంలో అప్పులబాధ తాలలేక రైతు వెంకటేశులు(30)గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనకున్న 5 ఎకరాల పొలంలో పంటలు సాగు చేసి నష్టపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి, కొడుకుల ఇద్దరు సేద్యం చేసినా అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో పొలంలోకి వెళ్లి చెట్టుకి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య, ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. కుటుంబాన్ని ఆదుకోవాలని భార్యాపిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని […] The post కుర్లపల్లి లో రైతు ఆత్మహత్య appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 7:40 pm

బెట్టింగ్ యాప్ కేసు.. ధావన్, రైనా ఆస్తులు అటాచ్

న్యూఢిల్లీ: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేేసులో టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బిగ్ షాకిచ్చింది. అక్రమ బెట్టింగ్ కార్యక్రమాలపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఇద్దరు క్రికెటర్లకు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. అటాచ్‌మెంట్‌లలో ధావన్ కు చెందిన రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తి, రైనాకు చెందిన రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఉన్నాయి.  కాగా, ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల అనుబంధ బ్రాండ్‌లతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న విదేశీ సంస్థలతో ఇద్దరు ఆటగాళ్లు తెలిసి ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ధావన్, రైనాను ఈడీ అధికారులు విచారించింది. క్రికెటర్లతోపాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్లను కూడా ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

మన తెలంగాణ 6 Nov 2025 7:38 pm

నవీన్ యాదవ్‌కు మద్దతుగా…

సనత్ నగర్ / ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్

ప్రభ న్యూస్ 6 Nov 2025 7:33 pm

ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది…

సోమాజిగూడ, (ఆంధ్రప్రభ): సోమాజిగూడలోని మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ప్రభ న్యూస్ 6 Nov 2025 7:27 pm

డబ్ల్యూపిఎల్.. ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకుందంటే..

ఐసిసి వన్డే ప్రపంచకప్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత మహిళ క్రికెటర్లను మరో మెగా ఈవెంట్ ఆహ్వానిస్తోంది. ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు మెగా వేలం నవంబర్ 27న జరుగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కొందరు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నారు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదుగురిని రిటైన్ చేసుకోగా.. ముంబై ఇండియన్స్ కూడా ఐదుగురిని అట్టిపెట్టుకుంది. అందులో ప్రపంచకప్ సాధించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మంధానతో పాటు మరో ముగ్గురిని రిటైన్ చేసుకుంది. ఇక గుజరాత్ జెయింట్స్ ఇద్దరిని, యూపీ వారియర్స్ కేవలం ఒకరిని మాత్రమే రిటైన్ చేసుకొని మిగితా అందరిని విడుదల చేసింది. రిటెన్షన్ లిస్ట్ ముంబై ఇండియన్స్‌ నాట్‌ సీవర్‌- బ్రంట్‌ (రూ. 3.50 కోట్లు) హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (రూ. 2.50 కోట్లు) హేలీ మాథ్యూస్‌ (రూ. 1.75 కోట్లు) అమన్‌జోత్‌ కౌర్‌ (రూ. 1 కోటి) గుణాలన్‌ కమిలిని (రూ. 50 లక్షలు) ఢిల్లీ క్యాపిటల్స్‌ షఫాలీ వర్మ (రూ. 2.20 కోట్లు) జెమీమా రోడ్రిగ్స్‌ (రూ. 2.20 కోట్లు) మరిజానే కాప్‌ (రూ. 2.20 కోట్లు) అనాబెల్‌ సదర్లాండ్‌ (రూ. 2.20 కోట్లు) నికీ ప్రసాద్‌ (రూ. 50 లక్షలు) రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్మృతి మంధాన (రూ. 3.50 కోట్లు) రిచా ఘోష్‌ (రూ. 2.75 కోట్లు) ఎలిస్‌ పెర్రి (రూ. 2 కోట్లు) శ్రేయాంక పాటిల్‌ (రూ. 60 లక్షలు) గుజరాత్‌ జెయింట్స్‌ ఆష్లే గార్డ్‌నర్‌ (రూ. 3.50 కోట్లు) బెత్‌ మూనీ (రూ. 2.50 కోట్లు) యూపీ వారియర్స్‌ శ్వేతా సెహ్రావత్‌ (రూ. 50 లక్షలు)

మన తెలంగాణ 6 Nov 2025 7:24 pm

నవ్వులు పూయిస్తున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్‌..

విక్రాంత్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సిినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి సంజీవ్ రెడ్డి డైరెక్టర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట.. తర్వాత పిల్లల కోసం వారు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీత ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 6 Nov 2025 7:05 pm

తిరుమలలో రెండు రోజుల పాటు రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న తిరుమలకు రానున్నారు.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 7:02 pm