SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

నల్లగొండలో గురుకుల పాఠశాలలో ఘటనపై వివాదం

నల్లగొండలో గురుకుల పాఠశాలలో ఘటనపై వివాదం ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా దామరచర్లలోని

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:14 pm

రాబోయే మూడేళ్లలో రూ.70 వేల కోట్లతో రోడ్లు: మంత్రి వెంకట్ రెడ్డి

హ్యామ్ విధానంలో వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభం గ్రామీణ రోడ్లతో రైతులు, విద్యార్థులు, రోగులకు మెరుగైన సౌకర్యాలు జాతీయ రహదారుల విస్తరణతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం గేమ్ ఛేంజర్‌గా మారనున్న త్రిబుల్ ఆర్, గ్రీన్ ఫీల్ ఎక్స్‌ప్రెస్‌వే అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే మూడు సంవత్సరాల్లో 70 వేల కోట్లతో రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి రోడ్లు భవనాలు శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, లక్ష్యాలు గురించి శాసన సభలో ప్రసంగించారు. మంచి రోడ్లు ఉంటే పెట్టుబడులు పెరిగి, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. రోడ్ల అభివృద్ధి ద్వారా మార్కెట్ సౌకర్యాలు మెరుగుపడి, పరిశ్రమలు విస్తరించి సమగ్ర ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధితో రైతులకు పంట మార్కెట్‌కు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని, విద్యార్థులు విద్య కోసం సులభంగా ప్రయాణిస్తారని, అత్యవసర పరిస్థితుల్లో రోగులు సమయానికి (గోల్డెన్ అవర్ లో) ఆసుపత్రులకు చేరుకోవచ్చని వివరించారు. యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. మోర్త్ లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో, 1.6 లక్షల మంది మరణించారని తెలిపారు. రాష్ట్రంలో 22,441 ప్రమాదాలు జరిగి 6,221 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. డబ్బు పోతే తిరిగి వస్తుందని, ప్రాణం పోతే తిరిగి రాదని అన్నారు. రోజుకు సగటున 18 నుండి 20 మంది మరణించడం విచారకరమని, ఇందులో ఎక్కువగా యువతే ఉండటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ఇటీవల చేవేళ్ల-, మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రోడ్డు అభివృద్ధి అనేది కేవలం మౌలిక వసతుల నిర్మాణం కాకుండా ప్రాణాలను కాపాడే బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో మొత్తం 34,062 కి.మీ రోడ్డు నెట్‌వర్క్ ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 7,590 కోట్లతో 1,835 కి. మీ రోడ్ల పనులు చేపట్టామని మంత్రి వెల్లడించారు. రూ. 13,051 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గత 27 నెలల్లో 595 కి.మీ రోడ్లు, 51 వంతెనలు పూర్తి (రూ. 1,035 కోట్లు) 323 కి.మీ రోడ్లు, 16 వంతెనలు (రూ. 485 కోట్లు) పూర్తయినట్లు వివరించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం హ్యామ్ (హైబ్రిడ్ అన్యూటి మోడల్) అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విధానంతో 12,000 కి.మీ రోడ్ల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఫేజ్-1లో 6,092 కి.మీ రోడ్లును సుమారు రూ. 13,006 కోట్ల వ్యయంతో 30 నెలల్లో నిర్మాణం, 15 సంవత్సరాల నిర్వహణ ఉంటుందని వివరించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (త్రిబుల్ ఆర్), హైదరాబాద్ నుంచి- విజయవాడ ఆరు లేన్ల విస్తరణ, అమరావతి నుంచి బందరు పోర్టు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, బుల్లెట్ ట్రైన్ కారిడార్లు (చెన్నై, పూణే, బెంగళూర్) లాంటి నగరాలను కలుపుతూ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. బుల్లెట్ ట్రైన్స్ కోసం కేంద్రంగా భారత్ ఫ్యూచర్ సిటీలో శంషాబాద్ దగ్గరలో 500 ఎకరాలు ప్రభుత్వం కేటాయించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయన్నారు. వేగంగా కొనసాగుతున్న ఉస్మానియా, హైకోర్టు కొత్త భవనాల పనులు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు రాష్ట్ర ఆర్‌అండ్‌బి శాఖ ఆధ్వర్యంలో పలు కీలక నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు మంత్రి తెలియజేశారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం నిర్మణం జరుగుతోందని, కొత్త హైకోర్టు భవనాల నిర్మాణం ప్రస్తుతం పిల్లర్ల దశలో ఉండగా, పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. అదే విధంగా నగర అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని నాలుగు వైపులా అధునాతన ఆస్పత్రులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. మొత్తం రూ. 8,000 కోట్ల వ్యయంతో నాలుగు పెద్ద ఆస్పత్రులను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సనత్ నగర్‌లో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రి దాదాపు రూ. 2,000 కోట్ల వ్యయంతో జూన్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 30 Mar 2026 11:12 pm

ఫ్యాక్ట్ చెక్: రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటనను ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనగా ప్రచారం చేశారు

రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటనను ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనగా

తెలుగు పోస్ట్ 30 Mar 2026 10:58 pm

మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆంధప్రదేశ్..

మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణ రావు సహా తొమ్మిది మంది ఎపి డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని డిజిపి ప్రకటించారు. లొంగిపో యిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ డంప్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేత, ఆంధ్రాఒడిశా సరిహద్దు (ఏవోబి) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణ రావు తలపై రూ.25 లక్షల భారీ రివార్డు ఉందంటేనే ఆయన ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఆయనతో పాటు కర్తం లచ్చు (రూ.5 లక్షల రివార్డు), పోడియం రాజే, ముచ్చిక మాస, మడవి జోగి, కర్తం అడామే(తలో రూ. 4 లక్షల రివార్డు), మాదివి అడా మా, ముచ్చిక లక్ష్మణ్, కడితి హుర్రే (తలో రూ.1 లక్ష రివార్డు) వంటి ముఖ్య నేతలు లొంగిపోయారు. వీరికి ప్రభుత్వం తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ. 20,000 అందజేసి, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు భరోసా కల్పించింది. పభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గ్రామాలకు కూడా చేరుతుండటం, ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా మార్పు రావడంతో ఉద్యమ ఉనికి తగ్గుతోందని, అందుకే సాయుధ పోరాటాన్ని వీడి లొంగిపోయినట్లు సోమన్న వివరించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నారాయణరావు దాదాపు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. 1989లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరిన ఆయన, క్రమంగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మిలిటరీ ఆపరేషన్లలో ఆరితేరిన నేతగా గుర్తింపు పొందాడు. గత ఏడాది అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక నేతలు గాజర్ల రవి, అరుణ మరణించిన తర్వాత, ఏవోబీ బాధ్యతల్ని సోమన్న చేపట్టారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో పలు కేసులు నమోదయ్యాయి. ఎపి ప్రభుత్వం భారీ రివార్డును కూడా ప్రకటించింది. ఉద్దానం ప్రాంతం నుంచి వచ్చిన సోమన్న లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కు కోల్పోయినట్లయింది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు పరిస్థితులు మారాయని, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు వెళ్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సాయుధ పోరాటం ద్వారా సాధించేదేమీ లేదని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లొంగుబాటు ఏవోబి ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి విఘాతంగా మారుతుందని భద్రతా దళాలు భావిస్తున్నాయి. గతంలో అగ్రనేతగా ఉన్న గణపతి వంటి వారు ప్రస్తుతం రాష్ట్రంలో లేరని, ఇతర రాష్ట్రాల విషయాల గురించి మాట్లాడలేమని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇప్పుడు పూర్తి శాంతి నెలకొందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోయిన వారిపై చట్టపరమైన ప్రక్రియ యథావి ధిగా జరుగుతుందని, అదే సమయంలో వారి పునరావాసానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. హింస వల్ల సాధించేదేమీ లేద ని, అభివృద్ధి పథంలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ఇవాళ సత్ఫలితాలను ఇచ్చింది. నక్సలిజం కోరల్లో చిక్కుకుని నలిగి పోయిన మారుమూల గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి వెలుగులు ప్రసరించనున్నాయి. ఎపి పోలీసుల తెగువ, కేంద్ర ప్రభుత్వ దృఢ నిశ్చయం కలిసి రాష్ట్రాన్ని నక్సల్స్ ఫ్రీ స్టేట్‌గా నిలబెట్టాయి.

మన తెలంగాణ 30 Mar 2026 10:07 pm

ഫാക്ട് ചെക്ക്: സൌദി രാജകൊട്ടാരത്തിൽ വെടിവെപ്പ്? പ്രചാരണത്തിൻ്റെ വസ്തുതയെന്ത്

ഇറാൻ ആക്രമണത്തിനെതിരെ സൌദി രംഗത്തെത്തിയതിന് പിന്നാലെയാണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 30 Mar 2026 10:02 pm

Palnadu Family Suicide : పల్నాడు గుండె చెరువు Andhra Prabha News

Palnadu Family Suicide : పల్నాడు గుండె చెరువు Andhra Prabha News

ప్రభ న్యూస్ 30 Mar 2026 9:53 pm

ఆడబిడ్డలకు శానిటరీ ప్యాడ్స్ అందించలేని దుస్థితిలో ప్రభుత్వాలు..

ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ హాస్టళ్లు, కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు కనీసం శానిటరీ ప్యాడ్స్ అందించలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఎక్స్ వేదికగా కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పీఎం శ్రీ పథకం కింద ఇతర స్కూళ్లలో ఇస్తున్నట్టే ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ హాస్టళ్లు, కెజిబివిల్లో చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతినెలా విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని ఆమె కోరారు.

మన తెలంగాణ 30 Mar 2026 9:22 pm

గెట్ అవుట్.. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్‌తో శాసనమండలి కార్యకలాపాలకు అడ్డుతగిలిన ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన 11 మంది ఎంఎల్‌సిలను సభ నుంచి చైర్మన్ గత్తా సుఖేందర్‌రెడ్డి సస్పెండ్ చేశారు.పెద్దల సభ గౌరవాన్ని కాపాడేందుకు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాల్సిందిగా శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైర్మన్ ఆమోదిస్తూ వారిని సభ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. అయితే సస్పెండ్ చేసినట్టు ప్రకటించినప్పటికీ బయటికి వెళ్లడానికి నిరాకరించిన ఎమ్మెల్సీలపై ఒకదశలో ‘గెటవుట్’ అంటూ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘మీలాంటి వారు సభకు రావడం దురదృష్టకరం&పెద్దల సభ గౌరవాన్ని దిగజార్చారు’ అని చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. శాసన మండలిలో సోమవారం బీఆర్‌ఎస్ సభ్యులు, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఛైర్మెన్ పోడియం దగ్గరికి దూసుకెళ్లారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిల ఆందోళన మధ్యనే తల్లిదండ్రుల సంరక్షణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఛైర్మన్ పోడియం వద్ద కు చేరుకుని ప్లకార్డులు పట్టుకుని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు నిరసన తెలిపారు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఈ అంశంపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లుగా శాసనసభలో స్పష్టం చేశామన్నారు. సభ సజావుగా సాగేందుకు బిఆర్‌ఎస్ సహకరించాలని కోరారు. మరో వైపు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా సభా కార్యక్రమాల నిర్వహణకు సహకరించాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలను పదే పదే కోరారు. సభ్యుల ప్రవర్తన సభా నియమావళికి విరుద్ధమని చెప్పినప్పటికీ వినిపించుకోకపోవడంతో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు 11 మందిని సభ నుండి సస్పెండ్ చేస్తోన్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మార్షల్స్‌కు, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలకు మధ్య తోపులాట జరిగింది. సస్పెన్షన్ వేటు వేసిన తరువాత సైతం సభలోనే ఉండి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు చైర్మన్ పోడియం చుట్టుముట్టే ప్రయత్నం చేయడం, నిరసనకు దిగడంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సస్పెండ్ అయిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు : మధుసూదన్ చారీ, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, నవీన్ కుమార్ రెడ్డి, వంటేర్ యాదవ రెడ్డి, శంబీపూర్ రాజు, దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ, కోటి రెడ్డి, వాణీ దేవి, తాతా మధు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.****

మన తెలంగాణ 30 Mar 2026 9:17 pm

15K Hunting Foeces : అతడెవరు? Andhra Prabha SPL Story

15K Hunting Foeces : అతడెవరు? Andhra Prabha SPL Story (

ప్రభ న్యూస్ 30 Mar 2026 9:12 pm

ప్రధాని మోడీ ఫొటో పెడతాం: సిఎం రేవంత్

హైదరాబాద్: సన్న బియ్యం పథకానికి తమకు ఏటా రూ.14,500 కోట్ల రూపాయల వ్యయం అవుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తే.. పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెడతామని సిఎం చెప్పారు. సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. సన్న బియ్యం పథకం బాగుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని తాను ఇదివరకే కేంద్రాన్ని కోరానని తెలిపారు. రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ సన్న బియ్యం పండించాలని రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నామని సిఎం అన్నారు. 3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఇది 90 శాతం కూడా కావచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మన తెలంగాణ 30 Mar 2026 9:04 pm

స్పోర్ట్స్ హ్యాకథాన్‌లో 2,132 వినూత్న ఆవిష్కరణలు

హైదరాబాద్: క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన స్పోర్ట్స్ హ్యాకథాన్ ఘనంగా ముగిసింది. గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న హ్యాకథాన్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, క్రీడాకారులు, స్టార్టప్‌లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలు రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయేశ్ రంజన్, ఐఏఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (క్రీడలు), తెలంగాణ ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ యువతలో సృజనాత్మకతను వెలికితీసే ఇలాంటి వేదికలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్, గౌరవ ఉప సభాపతి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ హ్యాకథాన్‌లో ప్రత్యేకత ఏమిటంటే, కరాటే, వాలీబాల్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, పవర్‌లిఫ్టింగ్, చెస్, కేరంలు వంటి మొత్తం 24 క్రీడలు భాగస్వామ్యం కావడం. పాల్గొన్న వారు క్రీడల్లో పాల్గొంటూనే వాటిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి వినూత్న పరిష్కారాలను ఆవిష్కరించారు. ఈ ఆలోచనలను “పిచ్ అరేనా” వేదికపై నిపుణులు, అధికారులు, పెట్టుబడిదారుల ముందు ప్రదర్శించారు. ఈ హ్యాకథాన్‌లో వచ్చిన ఆవిష్కరణలు క్రీడల పనితీరు మెరుగుదల, శిక్షణ విధానాలు, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులను చూపిస్తున్నాయి. ఈ 2,132 ఆవిష్కరణలను ప్రత్యేక స్మారక గ్రంథంగా (Souvenir) ప్రచురించేందుకు నిర్వాహకులు ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా హ్యాకథాన్ బ్రాండ్ ఓనర్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ.. “క్రీడలు కేవలం ఆటలకే పరిమితం కావు — అవి ఆవిష్కరణలకు కూడా మార్గం చూపుతాయి. ఈ హ్యాకథాన్ ద్వారా యువతలో ఉన్న అపార సృజనాత్మకత వెలుగులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మా లక్ష్యం” అని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడం ద్వారా తెలంగాణ రాష్ట్రం క్రీడలు మరియు ఆవిష్కరణల రంగంలో ముందంజలో ఉందని మరోసారి రుజువైంది.

మన తెలంగాణ 30 Mar 2026 8:56 pm

జిఒ 317 బాధితులకు న్యాయం చేయండి: సిఎంకు కవిత లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్: జిఒ 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వన్ టైం రిలీఫ్ కింద ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అప్పటికే వివిధ ఉమ్మడి జిల్లాలు, జోన్‌లలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రాతిపాదికన కొత్త జిల్లాలు, జోన్‌లలో పోస్టింగ్స్ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగుల సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఎనిమిదేళ్లు, అంతకన్నా తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు, టీచర్లు ఆయా ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏదో ఒక జిల్లాకు అలాట్ అయ్యారని గుర్తు చేశారు. ఇలా ఉద్యోగులను కొత్త జిల్లాలు, జోన్ల వారీగా సర్దుబాటు చేయడానికి అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2021 డిసెంబర్ 6న జిఒ నంబర్ 317 జారీ చేసిందని తెలిపారు. కానీ, ఆ జిఒలోనూ స్థానికతపై స్పష్టత లేకపోవడంతో వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. జిఒ 317తో ఉద్యోగులు, టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అప్పటి సిఎం కెసిఆర్‌కు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.  

మన తెలంగాణ 30 Mar 2026 8:44 pm

రేవంత్ సర్కార్‌పై కాగ్ అక్షింతలు: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కాగ్ అప్పులు తెచ్చారు..కానీ ఆస్తులు పెంచలేదు కాగ్ రిపోర్టుతో అయినా కళ్లు తెరవండి బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్: రెండేళ్ల మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్ధిక క్రమశిక్షణ గాడి తప్పిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్(కాగ్) నివేదిక స్పష్టం చేసిందని బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు అన్నారు. కాగ్ రిపోర్టు రేవంత్ సర్కార్‌కు చెంప పెట్టు లాంటిదని విమర్శించారు. తాము ఈ ప్రభుత్వ పని తీరుపై నిలదీస్తున్న అంశాలనే కాగ్ ప్రస్తావించిందని ఒక ప్రకటలో పేర్కొన్నారు. సంక్షేమ రంగానికి, సాగునీటి రంగానికి ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో భారీగా నిధులు పెట్టి ఖర్చు పెట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందిన విషయాన్ని కాగ్ తప్పుపట్టిందని చెప్పారు. అంకెల్లో గోల్ మాల్.. ఆచరణలో అంతకన్నా గోల్ మాల్ ఉందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టిందని విమర్శించారు. తెచ్చిన అప్పులను రాష్ట్రానికి ఆస్తులుగా మలచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ తేల్చి చెప్పిందని, రాష్ట్రాన్ని భారీ రెవెన్యూ లోటు దిశగా తీసుకెళ్తుతున్నారని కాగ్ చెప్పకనే చెప్పిందని పేర్కొన్నారు. మాటలు మూరెడు-చేతలు చారెడు కూడా లేవని ఈ చేవ లేని సర్కార్‌కు కాగ్ అక్షింతలు వేసిందని తెలిపారు. తాము ప్రభుత్వాన్ని తప్పుబడితే పెడబొబ్బలతో తమ మీద దాడి చేస్తారని, కాగ్ రిపోర్టు తర్వాత కూడా ఇంకా ఆవే అబద్దాలను కొనసాగిస్తారా..? అని ప్రశ్నించారు. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన రిపోర్టులోనే కాగ్ అనేక ప్రభుత్వ లోపాలను తప్పు పట్టిందని, 2025 -26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభుత్వం లెక్కలేనన్ని తప్పులు చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్లు కూడా డొల్ల అని కాగ్ రిపోర్టు 2024 -25 కుండబద్దలు కొట్టిందని విమర్శించారు. మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప దాటదు అనడానికి కాగ్ రిపోర్టు మరో ఉదాహరణ అని, ఈ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు అని చెప్పడానికి కాగ్ రిపోర్టు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. అప్పులు తెచ్చి కూడా ఆరు గ్యారంటీలను అమలు చెయ్యలేని అసమర్ధ సర్కార్ ఇది అని కాగ్ పరోక్షంగా తప్పుపట్టిందని పేర్కొన్నారు. కాగ్ నివేదికతోనైనా కళ్ళు తెరవాలని, పిచ్చి కూతలు మాని ప్రజలకు పనికొచ్చే విషయాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. బలంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పునాదులు ధ్వంసం చేసి తెలంగాణను దివాలా రాష్ట్రంగా మార్చొద్దని, ప్రతీకార రాజకీయాలు, రాష్ట్ర పరపతిని దెబ్బతీసే విధానాలకు స్వస్తి పలికి పాలన మీద దృష్టి సారించాలని హితవు పలికారు.

మన తెలంగాణ 30 Mar 2026 8:40 pm

వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. తల్లి, కుమారుడి మృతి

తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడిన తల్లి.. కుమారుడు మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ వేడుకకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

మన తెలంగాణ 30 Mar 2026 8:31 pm

కాంగ్రెస్‌తోనే భవిష్యత్ మార్పు: పొంగులేటి

పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనకు ముగింపు పలకాలి కేరళలో మార్పు కోసం యూడిఎఫ్‌ను గెలిపించాలి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: కేరళ ప్రజలారా మీ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. పది సంవత్సరాల ఎల్డీఎఫ్ అసమర్ధ పాలనకు ముగింపు పలకండి, అవినీతి పాలనను అంతం చేయండి, విభజన రాజకీయాలను తిరస్కరించండి, అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన కోసం యూడిఎఫ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వ మార్పు కోసం కాదు, కేరళ భవిష్యత్ కోసమని ఆయన అన్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించి, యూడిఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కేరళలోని పత్తనం తిట్ట జిల్లాలోని ఆడూరు, అరుణ్ ముల నియోజకవర్గాల్లో కెఎస్‌ఆర్టీసి జంక్షన్ వద్ద జరిగిన ఏఐసిసి అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. అవినీతి పాలనకు కేరాఫ్ ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కేరళలో పది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎల్డీఎఫ్ పాలన ప్రజలను పూర్తిగా నిరాశ పరిచిందని ఆయన ఆరోపించారు. పది సంవత్సరాలుగా కేరళను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం అవినీతి పాలనకు ప్రతీకగా మారిందని, యువతకు ఉద్యోగాలు లేవని, పెట్టుబడులు రావడం లేదని, సంక్షేమం కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైందని మంత్రి విమర్శించారు. దేశవ్యాప్తంగా విభజన రాజకీ యాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచే బిజెపికి కేరళలో స్థానం లేదని ప్రజలు ఇప్పటికే పలుమార్లు తీర్పు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రత్యామ్నాయం యూడిఎఫ్ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలనను ఉదాహరణగా చూపుతూ, తాము ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చుతున్నామో దేశం చూస్తోందని, అదే విధంగా కేరళలో కూడా ప్రజా పాలన తీసుకురాగలిగేది కాంగ్రెస్ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.

మన తెలంగాణ 30 Mar 2026 8:23 pm

ఇందిరమ్మ ఇళ్లు.. లబ్దిదారులకు గుడ్ న్యూస్

మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తుది విడత బిల్లుల విడుదలకు ఉన్న నిబంధనల్లో కొన్నిమార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లబ్దిదారుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, త్వరగా గృహ ప్రవేశాలు చేసేందుకు వీలుగా ఈ మేరకు కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. ఇంటి నిర్మాణపు పనులు సమగ్రంగా పూర్తయిన తరువాతనే క్షేత్ర స్థాయి సిబ్బంది ఫొటోలను అప్‌లోడ్ చేసి తుది బిల్లుల విడుదలకు ప్రతిపాదనలు పంపాలని గతంలో నిర్ధేశించగా, లబ్దిదారులు తాము నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశం చేసుకున్న తరువాత కూడా కొన్ని పనులను చేపట్టేందుకు కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా ఇళ్లలో నివసించేందుకు అనువైన వసతులు, పరిస్థితులుంటే చాలు తుది విడత బిల్లులు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయి నివాసయోగ్యంగా ఉన్నప్పటికీ, చిన్న పనులు కాకపోవడంతో బిల్లుల విడుదల కాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన సూచనలు, లబ్ధిదారుల ఇబ్బందులు మొదలైన అంశాలపై నిశితంగా అధ్యయనం చేసిన తరువాత కొన్ని అంశాల్లో సడలింపు ఇస్తున్నట్లు ఎండి పేర్కొన్నారు. అందులో ప్రధానంగా లోపలి వైపు ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, తలుపులు(దర్వాజాలు), పూర్తి స్థాయి విద్యుత్ వైరింగ్, ప్లబింగ్ వంటి పనులను లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసుకున్న తరువాత వీలును బట్టి పూర్తి చేసుకోవచ్చన్నారు. ఈ సడలింపుల వల్ల ఇందిరమ్మ లబ్దిదారులకు తుదివిడత బిల్లు రూపేణా చెల్లించాల్సిన మొత్తం విడుదలై, వారికి ఆర్ధికంగా వెసులు బాటు కలుగుతుందని ఆయన వివరించారు. ఈ మేరకు, సవరించిన మార్గదర్శకాల ప్రకారం గ్రామ స్థాయి నుంచి బిల్లుల ప్రతిపాదనలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎండి ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలు ఇలా... కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్లాస్టరింగ్ ఇంటి వెలుపలి వైపు పూర్తి కావాలి.(లోపలి వైపు ప్లాస్టరింగ్ గృహ ప్రవేశం తరువాత కూడా చేసుకోవచ్చు.) ఫ్లోరింగ్ తప్పనిసరి కాదు (ఆయా లబ్దిదారుల ఆర్థిక స్థితిగతులను బట్టి ఫ్లోరింగ్ చేసుకునే వెసులుబాటు) కల్పించారు. కలరింగ్ - వెలుపలి భాగంలో చేయాల్సి ఉంటుంది. (రెండో కోట్ కలరింగ్‌ను ఇంటిలో నివసిస్తూ, వినియోగిస్తూ కూడా చేసుకోవచ్చు). ఇంటి వెలుపలి దర్వాజాలు ఏర్పాటు చేసుకోవాలి. (లోపలి వైపునవి ఇంటిలో నివసిస్తూ కూడా వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు), విద్యుత్ వైరింగ్ తుది బిల్లు విడుదలకు తప్పనిసరి కాదు. (వైరింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ పాత ఇంటి కనెక్షన్ ద్వారా విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు). ప్లంబింగ్ - పనులు ఇంటిలో నివసిస్తూ చేసుకోవచ్చు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా తుది విడత బిల్లుల విడుదలకు ప్రతిపాదనలు పంపించాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి మేనేజింగ్ డైరక్టర్ విపి గౌతం ఉత్తర్వులు జారీ చేశారు.

మన తెలంగాణ 30 Mar 2026 8:16 pm

globalstar |ఇలా ఉంటుందా ఆయన డైట్!

globalstar | ఇలా ఉంటుందా ఆయన డైట్! globalstar | రామ్ చరణ్

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:12 pm

హ్యాకథాన్‌లో 2,132 వినూత్న ఆవిష్కరణలు..

హ్యాకథాన్‌లో 2,132 వినూత్న ఆవిష్కరణలు.. హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:12 pm

ప్రభుత్వ ఉర్దూ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలు

ప్రభుత్వ ఉర్దూ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలు 50 ఏళ్ల పాఠశాలలో సీనియర్ విద్యార్థులందరి

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:03 pm

చిట్యాలలో రెచ్చిపోతున్న ఫోన్ మాఫియా…

చిట్యాలలో రెచ్చిపోతున్న ఫోన్ మాఫియా… చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణంలో గత

ప్రభ న్యూస్ 30 Mar 2026 8:00 pm

AA25: Allu Arjun’s Superhero Films Loading

Icon Star Allu Arjun is currently shooting for his 22nd film directed by Atlee. The film is slated for summer release. The actor is in talks for several films. He is in talks with Malayalam actor and director Basil Joseph for a film and the discussion has been going on from a long time. Allu […] The post AA25: Allu Arjun’s Superhero Films Loading appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 7:55 pm

పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి…

పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి… అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:54 pm

సోషల్‌ మీడియాలో నకిలీ ఐడీలు

సోషల్‌ మీడియాలో నకిలీ ఐడీలు ఖమ్మం, ఆంధ్రప్రభ : సాంకేతికతను వినియోగించుకొని కొందరు

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:50 pm

ఆస్తి పన్ను చెల్లించని డిస్కవరీ కంపెనీ సామాను జప్తు

ఆస్తి పన్ను చెల్లించని డిస్కవరీ కంపెనీ సామాను జప్తు ఆస్తిపన్ను చెల్లించని వారిపై

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:45 pm

భక్తులకు మిషన్ భగీరథ త్రాగు నీటి సేవలు

భక్తులకు మిషన్ భగీరథ త్రాగు నీటి సేవలు లోతట్టు ప్రాంతాల్లోనూ తాగునీటి ఏర్పాట్లు

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:40 pm

ఉద్యమకారులను ముందస్తు అరెస్టు చేయడం తగదు..

ఉద్యమకారులను ముందస్తు అరెస్టు చేయడం తగదు.. తెలంగాణ ఉద్యమకారుడు జన్నె యుగేందర్, చిట్యాల,

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:37 pm

అక్రమ అరెస్టులు ఖండించిన ఉద్యమకారులు..

అక్రమ అరెస్టులు ఖండించిన ఉద్యమకారులు.. మునుగోడు, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:35 pm

మలబార్ గోల్డ్ నూతన నగల షోరూమ్ ప్రారంభం…

మలబార్ గోల్డ్ నూతన నగల షోరూమ్ ప్రారంభం… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:27 pm

బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలి,

బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలి, జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేసిన నవాబుపేట రైతులు,

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:25 pm

రోస్టర్ పాయింట్లలో మాలలకు తీవ్ర అన్యాయం

రోస్టర్ పాయింట్లలో మాలలకు తీవ్ర అన్యాయం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:23 pm

Video : Director Abhilash Reddy Kankara Exclusive Interview

The post Video : Director Abhilash Reddy Kankara Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 7:21 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

గువాహటి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. బర్సాపరా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది రవీంద్ర జడేజా చెన్నై నుంచి రాజస్థాన్‌కి, సంజూ శాంసన్ రాజస్థాన్‌ నుంచి చెన్నైకి ట్రేడ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో వాళ్ల మాజీ జట్టుపై ఈ ఆటగాళ్లు ఎలా ప్రదర్శిస్తారా..? అనే ఆసక్తి నెలకొంది. తుది జట్లు: సిఎస్‌కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, మ్యాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జేమీ ఓవర్‌టన్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్. ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురేల్(కీపర్), షిమ్రాన్ హెట్మైర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేశ్ శర్మ.

మన తెలంగాణ 30 Mar 2026 7:20 pm

మడూరు స్టేజ్ వద్ద ఎక్స్ బస్సులను ఆపాలి

మడూరు స్టేజ్ వద్ద ఎక్స్ బస్సులను ఆపాలి తొర్రూరు, ఆంధ్రప్రభ : మండలంలోని

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:19 pm

పేదరికం నిర్మూలించడమే లక్ష్యం..

పేదరికం నిర్మూలించడమే లక్ష్యం.. స్వర్ణాంధ్ర లక్ష్యంగా పి4 పథకం…ఉరవకొండలో ఘనంగా వార్షికోత్సవం ఉరవకొండ

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:14 pm

ఆ ఆడియోపై విచారణ జరిపించండి: సిపిఎం

హైదరాబాద్: ఎంఎల్‌ఎ దానం నాగేందర్ 2 కోట్ల లంచం అడిగినట్లు మాట్లాడిన ఆడియోపై విచారణ జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది. బిల్డింగ్ పర్మిషన్ కోసం బిల్డర్ దగ్గర రూ.2 కోట్లు లంచం అడిగినట్లు ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి దోషులను చట్ట ప్రకారం కటినంగా శిక్షించాలని సిపిఎ గ్రేటర్ హైదరాబాద్ సెంటురల్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎంఎల్‌ఎ దానం నాగేందర్ తనకు ఇప్పటికే 25 లక్షలు ముట్టినట్టు మాట్లాడారని, ఇందులో కొంతమంది ప్రభుత్వ అధికారులకు డబ్బులు ఇచ్చినట్టు అంటున్నారని ఆయనన్నారు. ఈ అంశంలో ఎవరి పాత్ర ఎంత ఉన్నది అనేది బయటికి రావాలన్నారు.

మన తెలంగాణ 30 Mar 2026 7:13 pm

డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి:

డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక

ప్రభ న్యూస్ 30 Mar 2026 7:09 pm

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచే నక్సలిజం అభివృద్ధి చెందింది: అమిత్ షా

న్యూఢిల్లీ: చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం సాధ్యమని.. తుపాకులతో కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. మాట్లాడితే ప్రజాస్వామ్యం అంటారు కానీ హింసను ఎలా సమర్థిస్తారు అని ప్రశ్నించారు. కాంబోడియా, పెరూ, కొలంబియాలో భయంకర రక్తపాతం జరిగిందని పేర్కొన్నారు. ‘‘దేశాభివృద్ధికి మావోయిస్టు సిద్ధాంతాలు, విధానాలు తీవ్ర ఆటంకం. మావోయిస్టుల రక్తపాత సిద్ధాంతాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. బస్తర్‌లో నక్సల్స్ అనేక ఏళ్లపాటు సమాంతర ప్రభుత్వం నడిపారు. ఆయుధాలు వీడాలని బస్తర్ వెళ్లి పలుసార్లు కోరాం’’ అని అన్నారు. నక్సలిజం నశించాలని గిరిజనులు కూడా కోరుకుంటున్నారని అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘నక్సలిజంపై పోరులో ప్రజలు కూడా మాకు అండగా నిలిచారు. వేల మంది సైనిక బలగాలు, పోలీసులను నక్సల్స్ చంపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అభివృద్ధినే కోరుకుంటున్నారు.. హింస కాదు. బస్తర్ యువకులను కలిశా.. వాళ్లందరూ నక్సలిజాన్ని వ్యతిరేకించారు. ప్రస్తుత సమాజంలో నక్సలిజానికి తావు లేదు. ఎన్డిఎ పాలనలో మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరుగుతోంది. నక్సలైట్ల ఎజెండాలో అభివృద్ధి అన్నది లేదు. నక్సలైట్లు తమ ఉనికి కోసమే పోరాడుతున్నారు. నక్సలైట్లు.. భగత్‌సింగ్, బిర్సాముండా కారు. వాళ్లతో నక్సలైట్లను పోల్చకూడదు. ప్రజలను చంపేవారు దేశభక్తులు ఎలా అవుతారు? నక్సలైట్లు తమ సిద్ధాంతాన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు’’ అని అమిత్ షా తెలిపారు. నక్సలైట్లకు ఆదర్శం భారతీయులెవరూ కాదు.. వారికి మావో ఆదర్శమని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘రోడ్లు, విద్యుత్ వంటి సదుపాయాలు లేకుండా గిరిజన ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయి. నక్సల్స్.. చిన్న పిల్లలకు తుపాకులు, ఆయుధ సామాగ్రి ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల యువత జీవితాలను నక్సల్స్ నాశనం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. విద్య, వైద్య, మౌలిక వసతులను కూడా నక్సల్స్ ధ్వంసం చేస్తున్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం.. రాజ్యాంగాన్ని స్వీకరించాం. ఆయుధాలు చేపట్టి ప్రజల ప్రాణాలు తీయాలని ఏ సిద్ధాంతాలు చెప్పాయి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని నక్సల్స్ గ్రహించాలి. స్కూళ్లు, బ్యాంకులు, ఆస్పత్రులు తగలబెట్టేవారి వల్ల అభివృద్ధి ఎలా సాధ్యం? ఆయుధాలు చేతుల్లోకి తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచే నక్సలిజం అభివృద్ధి చెందింది. ఇందిరా గాంధీ వల్లే మావోయిస్టు పార్టీ అన్ని ప్రాంతాలకు విస్తరించింది’’ అని అమిషా ధ్వజమెత్తారు.  

మన తెలంగాణ 30 Mar 2026 6:58 pm

Hyderabad : హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతుంది

తెలుగు పోస్ట్ 30 Mar 2026 6:32 pm

dark circles |కళ్ల కింద నల్లటి చారలు: కారణాలు, పరిష్కారాలు

dark circles | కళ్ల కింద నల్లటి చారలు: కారణాలు, పరిష్కారాలు dark

ప్రభ న్యూస్ 30 Mar 2026 6:16 pm

వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెదిరె మేఘా రెడ్డి

వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెదిరె మేఘా రెడ్డి మునుగోడు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 30 Mar 2026 6:16 pm

వెం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

వెం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి :

ప్రభ న్యూస్ 30 Mar 2026 6:13 pm

Telangana : టార్గెట్ పొంగులేటి.. బీఆర్ఎస్ లక్ష్యమదేనా?

బీఆర్ఎస్ టార్గెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయ్యారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 6:12 pm

బంగారు గని వద్ద కాల్పులు.. 70 మందికి పైగామృతి

దక్షిణ సూడాన్‌ మరోసారి మృత్యుఘోషతో విలవిలలాడిపయింది. రాజధాని జుటా శివార్లలోని ఓ బంగారు గని వద్ద తలెత్తిన వివాదంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా.. 70 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ‘‘ఓ బంగారు గనిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో 70 మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు’’ అని పోలీసులు తెలిపారు. దక్షిణ సూడాన్ ప్రతిపక్ష పార్టీ ‘సూడన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్‌మెంట్ ఇన్ అపోజిషన్’ ఈ దాడిని ఖండించింది. ప్రభుత్వ బలగాలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని ఆరోపించింది.

మన తెలంగాణ 30 Mar 2026 6:12 pm

గ్రామసభలు నిర్వహణకు సిద్ధం కావాలి

గ్రామసభలు నిర్వహణకు సిద్ధం కావాలి భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : 99 రోజుల

ప్రభ న్యూస్ 30 Mar 2026 6:08 pm

ఆశా వర్కర్ల ఆగ్రహం..

ఆశా వర్కర్ల ఆగ్రహం.. జీతాలు బకాయిలపై ధర్నా, పోలీసుల అరెస్ట్.. వనపర్తి టౌన్,

ప్రభ న్యూస్ 30 Mar 2026 6:04 pm

అఖిలపక్ష నాయకుల సమావేశం..

అఖిలపక్ష నాయకుల సమావేశం.. లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:55 pm

దేవాలయల పునర్నిర్మాణానికి భూమి పూజ..

దేవాలయల పునర్నిర్మాణానికి భూమి పూజ.. భువ‌న‌గిరి, ఆంధ్ర‌ప్ర‌భ : భువనగిరి మున్సిపల్ పట్టణంలోని

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:53 pm

ఎడపల్లిలో కొనసాగిన సొసైటీ మహాజన సభ

ఎడపల్లిలో కొనసాగిన సొసైటీ మహాజన సభ ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లిగ్రామంలోలో గల

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:53 pm

Naga Chaitanya’s Vrushakarma Updates

Akkineni youngster Naga Chaitanya has spent over a year on his upcoming film Vrushakarma. The shoot of the film is currently in the final stages. The first glimpse received terrific response and the makers have closed the non-theatrical and the theatrical rights of the film. The team is now heading to Rajasthan to shoot for […] The post Naga Chaitanya’s Vrushakarma Updates appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 5:51 pm

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు సామాన్య ప్రజలపై భారం పడొద్దని

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:51 pm

సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ : రేవంత్ రెడ్డి

సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 5:46 pm

Chandrababu : 2029 నాటికి అందరికీ ఇళ్లు

2029 నాటికి అందరికీ ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 5:33 pm

పోగొట్టుకున్న మొబైల్‌ను గుర్తించి బాధితురాలికి అప్పగింత..

లింగాపూర్, ఆంధ్రప్రభ ; సిర్పూర్ (యు) మండలానికి చెందిన ఓ మహిళ తన

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:28 pm

పేదవాడి సొంతింటి కల సాకారం..

పేదవాడి సొంతింటి కల సాకారం.. జిల్లాలో ఘనంగా గృహప్రవేశాలు.పాల్గొన్న మంత్రి టీ.జీ. భరత్

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:27 pm

క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి: నార్పల ఎస్సై సాగర్ హెచ్చరిక

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, వాటి వల్ల జీవితాలు నాశనం చేసుకోకూడదని నార్పల ఎస్సై సాగర్ ప్రజలకు సూచించారు. బెట్టింగ్‌లో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లు పెరుగుతున్నాయని, ముఖ్యంగా యువత వీటి బారిన పడుతున్నారని తెలిపారు. బెట్టింగ్ చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.బెట్టింగ్‌ను అరికట్టేందుకు […] The post క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి: నార్పల ఎస్సై సాగర్ హెచ్చరిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 5:25 pm

జీజీహెచ్‌లో అద్భుత శస్త్రచికిత్స..

జీజీహెచ్‌లో అద్భుత శస్త్రచికిత్స.. ఏడు సంవత్సరాల బాలుడికి కొత్త జీవితంఅరుదైన ‘నాసోఫారింజియల్ ఆంజియోఫైబ్రోమా’పై

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:23 pm

కార్మికుల పట్ల శ్రద్ధ వహించాలి…

కార్మికుల పట్ల శ్రద్ధ వహించాలి… ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:23 pm

చెరువుపల్లి మాల్యాద్రి సేవలకు గుర్తింపు

20సంవత్సరాలు మండలపార్టీ బాధ్యతలు ఘనంగా సన్మాణించిన ఎమ్మెల్యే ఇంటూరి విశాలాంద్ర -వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు చెరువుపల్లి మాల్యాద్రిని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వదలకుండా […] The post చెరువుపల్లి మాల్యాద్రి సేవలకు గుర్తింపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 5:21 pm

ముదిగుబ్బకు నియోజకవర్గ హోదా ఇవ్వాలి – సిపిఐ డిమాండ్

పునర్విభజనలో పక్కన పెడితే ఉద్యమాలు తప్పవు – సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు హెచ్చరిక విశాలాంధ్ర, ముదిగుబ్బ,శ్రీ సత్యసాయి జిల్లా : మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణాన్ని ప్రత్యేక నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ముదిగుబ్బను తిరిగి కదిరి నియోజకవర్గంలో విలీనం చేసే అవకాశాలపై వస్తున్న వార్తలు మండల ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.ముదిగుబ్బ మండలం విస్తీర్ణం, జనాభా పరంగా జిల్లాలోనే […] The post ముదిగుబ్బకు నియోజకవర్గ హోదా ఇవ్వాలి – సిపిఐ డిమాండ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 5:18 pm

వాటర్ ట్యాంక్ ఎక్కి తెలంగాణ ఉద్యమకారుల నిరసన

గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎన్టీవీ సి వద్ద తెలంగాణ

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:17 pm

నటుడు బ్రహ్మానందంను కలిసిన చిత్రకారుడు రాయబోస్

కడెం, ఆంధ్రప్రభ : తెలుగు సినీ పరిశ్రమలో తన అద్భుతమైన హాస్యంతో ప్రేక్షకులను

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:11 pm

కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన సదస్సు

విశాలాంధ్ర -అనంతపురం టౌన్: అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్ని ప్రమాదాల పట్ల జిల్లా అధికారులకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నీటి ప్రమాదాల పట్ల, ఎన్ని రకాల అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, వాటిని ఆర్పే పద్ధతులు గురించి, కిచెన్ సేఫ్టీ గురించి, […] The post కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన సదస్సు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 5:10 pm

రెన్యువల్స్ గురించి భయపడొద్దు..

రెన్యువల్స్ గురించి భయపడొద్దు.. డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ శ్రీవాస్ నూపూర్ అజయ్

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:08 pm

అర్ధాంతరంగా నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనం పూర్తి చేయాలి: సిపిఐ డిమాండ్…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ): నార్పల మండల కేంద్రంలోని ఉయ్యాలకుంట కాలనీలో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనాన్ని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అంగన్‌వాడీ భవనాలకు అనుమతులు మంజూరైనప్పటికీ పనులు పూర్తికాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఈ అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో అంగన్‌వాడీ భవనాల సమస్యను ప్రస్తావించినప్పటికీ, […] The post అర్ధాంతరంగా నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనం పూర్తి చేయాలి: సిపిఐ డిమాండ్… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 5:07 pm

Cancer |మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్

Cancer | మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ Cancer | ఆంధ్రప్రభ వెబ్

ప్రభ న్యూస్ 30 Mar 2026 5:04 pm

హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ఏలేటి

హైదరాబాద్: హేట్ స్పీచ్ బిల్లు అత్యంత ప్రమాదకరమని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాజకీయ కక్షసాధింపులకే హేట్ స్పీచ్ బిల్లు అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ ప్రివెన్షన్ బిల్లును సెలక్ట్ కమిటీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ రిఫర్ చేశారు. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఆధారాలు లేకున్నా అరెస్ట్ చేసేలా బిల్లు ఉందని, చట్టాలు ప్రజల రక్షణ కోసం ఉండాలి.. ప్రజల గొంతు నొక్కడానికి కాదని విమర్శించారు. ఇలాంటి చట్టం చేసేముందు హౌస్ కమిటీ వేయాలని.. చర్చ సాగాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 4 అనేది ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్ అని.. హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. 

మన తెలంగాణ 30 Mar 2026 5:02 pm

వాటర్ స్పోర్ట్స్ జిల్లా సాయి ఎంపికలు..

జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్విశాలాంధ్ర ధర్మవరం;; వాటర్ స్పోర్ట్స్ జిల్లా స్థాయి ఎన్నికలు పుట్టపర్తి లోని సాయి ఆక్వా బోటింగ్ చిత్రావతి నది వద్ద ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ తెలిపారు. వారు మాట్లాడుతూ అండర్- 15 సబ్ జూనియర్, అండర్- 18 జూనియర్ విభాగాల్లో జరిగే పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు ఏప్రిల్ 11 నుంచి 12వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి వాటర్ […] The post వాటర్ స్పోర్ట్స్ జిల్లా సాయి ఎంపికలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 5:01 pm

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ బెల్లంపల్లిలో డీఈ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికుల ధర్నా

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:59 pm

పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి..

క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం ఉంటుందని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 121వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి వెంకటేశులు (చిట్టి) మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి […] The post పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 4:58 pm

టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం కు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు

విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రంలోని టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో 44 ఏళ్ల రాజకీయ ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న టిడిపి నాయకులకు కార్యకర్తలకు వారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో నిలిచి ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తున్న సాగుతున్న ఈ […] The post టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం కు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 4:54 pm

యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి

యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం;; యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రం నందు ఏప్రిల్ 1న పుట్టపర్తిలో నిర్వహించే రణభేరి 3.0 ను జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సేట్టిపి జయచంద్ర రెడ్డి, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద […] The post యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 4:50 pm

దేశంలో నియంత పాలన రాకూడదన్నదే నా ఉద్దేశం: రేవంత్

హైదరాబాద్: నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల పునర్వవస్థీకరణ పార్టీల సమస్యకాదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా దక్షిణాదిలో కార్యాచరణ ఉండాలని, 50 శాతం సీట్ల పెంపుపై విస్తృతంగా చర్చ జరగాలని అధికారులకు సూచించారు. దేశంలో నియంత పాలన రాకూడదన్నదే తన ఉద్దేశం అని తెలియజేశారు. దక్షిణాదికి బలం లేదని పెత్తనం చేస్తామంటే అది ఎంత కాలమో కొనసాగదని అన్నారు. జాతీయ పార్టీ అయినా అన్యాయంపై మాట్లాడే స్వేచ్ఛ తమకు ఉందని, 50 శాతం సీట్లు పెంచితే దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం చేస్తుందని, దక్షిణాదిలో ఒక్క సీటు రాకున్నా కేంద్రం సర్కారు ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. రాష్ట్రాల సీట్ల మధ్య అంతరం.. పెంచిన తర్వాత కూడా అంతే ఉండాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.   

మన తెలంగాణ 30 Mar 2026 4:48 pm

Megastar’s Vishwambara: What’s Happening?

With years of delay in a film, the audience will lose interest and a project becomes stale. Chiranjeevi has signed the biggest ever film in his career, Vishwambara, a fantasy adventure directed by Vassishta. It all started after the first teaser received poor response. The VFX work was badly trolled and the entire unit stepped […] The post Megastar’s Vishwambara: What’s Happening? appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 4:37 pm

మోత్కూర్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి…

మోత్కూర్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి… గ్రీవిన్స్ లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌లకు

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:18 pm

ఆలేరులో అలరించిన పౌరాణిక నాటకాలు..

ఆలేరులో అలరించిన పౌరాణిక నాటకాలు.. ఆలేరు, ఆంధ్రపభ : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:16 pm

కనకదుర్గమ్మకు కానుకుల వర్షం..

కనకదుర్గమ్మకు కానుకుల వర్షం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:15 pm

గర్భగుడిలో వేసవి కాలంలో ప్రత్యేక పూజలు..

గర్భగుడిలో వేసవి కాలంలో ప్రత్యేక పూజలు.. శ్రీ రామలింగేశ్వర ఆలయానికి రూ.50 వేల

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:13 pm

పేదల సొంతింటి కల నెరవేరుతుంది..

పేదల సొంతింటి కల నెరవేరుతుంది.. ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వేముల

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:13 pm

Andhra Prabha Smart Edition |AP|ఎండ్​ కార్డ్​|ఎండ్​ కార్డ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 30-03-2026, 4.00PM ap మావోయిస్టులకు ఎండ్​ కార్డ్​..

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:10 pm

విద్యార్థిని మృతి ఘటన లో

విద్యార్థిని మృతి ఘటన లో ఉపాధ్యాయుల తొలగింపు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:08 pm

అదుపులో అతిసార పరిస్థితి…

అదుపులో అతిసార పరిస్థితి… ఇంటింటి సర్వేలు పూర్తిపరిస్థితి నియంత్రణలోనే నందిగామ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:07 pm

Andhra Prabha Smart Edition |TS|భూ కబ్జాలు..|ఎండ్​ కార్డ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 30-03-2026, 4.00PM ts ప్రజాపాలనలో భూ కబ్జాలు..

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:06 pm

లేబర్ కోడ్స్ రూల్స్ ప్రతులు దగ్ధం

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ ; 4 లేబర్ కోడ్స్ రూల్స్ ప్రతులను ట్రేడ్

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:05 pm

ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ : రేవంత్

హైదరాబాద్: దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థ తీసుకొస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈగల్, హైడ్రా తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ తీసుకొస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పంటకు ధర నిర్ణయించే అవకాశం రైతులకు లేకుండా పోయిందని, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తెచ్చామని తెలియజేశారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.   

మన తెలంగాణ 30 Mar 2026 4:00 pm