SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

ఎర్రకోటలో ‘లీకుల’ వైరస్

భారతదేశ రాజకీయ పటంలో కమ్యూనిస్టు పార్టీలకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అది ‘డెమోక్రాటిక్ సెంట్రలిజం’ (ప్రజాస్వామ్య కేంద్రకృతం). పార్టీ లోపల ఎంత చర్చ అయినా జరగవచ్చు, కానీ ఒక్కసారి నిర్ణయం జరిగిన తర్వాత అది ఉక్కుకవచం లాంటి క్రమశిక్షణతో అమలు కావాలి. కానీ, తెలంగాణ సిపిఎంలో గత పదేళ్లుగా చోటుచేసుకున్న పరిణామాలు, తాజాగా మాజీ రాష్ట్ర కార్యదర్శి సహా మరో ఇద్దరు కీలక నేతలపై కేంద్ర కమిటీ తీసుకున్న ‘అభిశంసన’ నిర్ణయం ఆ పార్టీ పునాదులనే ప్రశ్నిస్తున్నాయి. సిద్ధాంతం ముసుగులో సాగిన వ్యక్తిగత ఆధిపత్యం, పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసిందో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో సిపిఎం పటిష్టమైన శక్తిగా ఎదుగుతుందని ఆశించిన కార్యకర్తలకు నిరాశే మిగిలింది. గత పదేళ్లలో పార్టీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, ముఖ్యంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్‌ఎఫ్) ప్రయోగం, ఎన్నికల పొత్తుల విషయంలో అస్పష్టత, పార్టీని క్షేత్రస్థాయిలో దెబ్బతీశాయి. అయితే, ఇవన్నీ కేవలం రాజకీయ వ్యూహకర్తలు చేసిన తప్పులే అనుకుంటే పొరపాటే. పార్టీ రాష్ట్ర మహాసభల్లో కార్యదర్శి ఎన్నిక సందర్భంగా జరిగిన పైరవీలు, గ్రూపు రాజకీయాలు కమ్యూనిస్టు నైతికతకే మచ్చతెచ్చాయి. కేంద్ర కమిటీ తన అభిశంసన తీర్మానంలో ‘పదేళ్ల పెడధోరణుల’ పై రెండు గ్రూపుల తగాదాల నేపథ్యంలో ఇలాంటి చర్యలకు సిద్ధపడటం జరిగిందంటే, అది కేవలం ఒక వ్యక్తి తప్పు కాదు, ఆ నాయకత్వం అనుసరించిన అప్రజాస్వామిక పద్ధతులపై ఇచ్చిన ఛార్జ్‌షీట్‌గా చూడకతప్పదు. అయితే అభిశంసనకు గురైన మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు కేంద్ర కమిటీ వేటువేయడం వెనుక ఒక పెద్ద తార్కిక సందేహం కలుగుతుంది. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ప్రతి ప్రధాన నిర్ణయం, పొత్తులు కావచ్చు, సామాజిక ప్రయోగాల రీత్య ఏర్పాటు చేసిన బిఎల్‌ఎఫ్ కావచ్చు, పైస్థాయి కమిటీల పర్యవేక్షణలోనే జరుగుతాయి. రాష్ట్ర కార్యదర్శి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేనప్పుడు, ఆయా సందర్భాల్లో అంగీకరించిన కేంద్ర నాయకత్వం, ఇప్పుడు వాటిని ‘పెడధోరణులు’గా ముద్రవేయడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు ఉత్పన్నమవకుండా ఎలా ఉంటాయి? ఒక నిర్ణయం విఫలమైనప్పుడు దానికి కేవలం రాష్ట్ర కార్యదర్శిని మాత్రమే బాధ్యుడిని చేయడం ‘సామూహిక బాధ్యత’ అనే పార్టీ సూత్రానికి విరుద్ధం కాదా..? అప్పుడు ఆమోద ముద్ర వేసిన వారు ఇప్పుడు న్యాయమూర్తులుగా మారి తీర్పు చెప్పడం కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టించడంకాక ఏమోతుందో ఆ పార్టీకే తెలియాలి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అత్యంత విచారకరమైన, ప్రమాదకరమైన అంశం ‘పార్టీ అంతర్గత చర్చల లీకేజీ’. పార్టీ కేంద్ర కమిటీ తీర్మానం అధికారికంగా కింది స్థాయికి చేరకముందే, ఉన్నత స్థాయి కమిటీలో ఎవరు ఏమన్నారు..? ఎవరిని ఎలా మందలించారు..? అనే వివరాలు మీడియాకు చేరడం వెనుక ఉన్న ‘అదృశ్య హస్తాలు’ ఎవరివి..? అనేది ఆ పార్టీ సమీక్షించుకోవాల్సిన అంశం, ప్రశ్నించుకోవాల్సిన అంశం కూడా. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ రహస్యాలను శత్రువులు కూడా రాబట్టలేకపోయేవారు. కానీ నేడు స్వయంగా ఉన్నత స్థాయి నేతలే సమాచారాన్ని బయటకు పంపుతున్నారంటే, అక్కడ పార్టీపట్ల విధేయత కంటే ప్రత్యర్థులను దెబ్బతీసే కుట్రలే ప్రధానమయ్యాయని అర్థమవుతోంది. పార్టీ పట్ల కనీస అవగాహన, బాధ్యత ఉన్న ఏ నాయకుడూ అంతర్గత విషయాలను బజారున పెట్టడు. అలా చేస్తున్నారంటే, వారి రాజకీయ చైతన్యస్థాయి అత్యంత దిగువకు పడిపోయిందని చెప్పక తప్పదు. ఇది కేవలం క్రమశిక్షణ ఉల్లంఘన మాత్రమే కాదు, పార్టీ ఉనికిని పణంగా పెట్టే ‘నమ్మక ద్రోహం’మే అవుతుంది. కేంద్ర కమిటీ చర్యలు కేవలం ముగ్గురు వ్యక్తులకు పరిమితమైతే ప్రయోజనం లేదు. ఇది మొత్తం రాష్ట్ర నాయకత్వానికి ఒక హెచ్చరిక కూడా కావాలి. గత తప్పిదాలను సమీక్షించిన పార్టీ అసలు ఆ సమీక్ష పత్రాలను, సమీక్ష వివరాలను అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బద్దలుకొడుతూ లీకులకు కారకులైన వారి పట్ల కూడా సమీక్షించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలి. పార్టీలో ‘నేను చెప్పిందే వేదం’ అనే ధోరణి పెరిగినప్పుడు ప్రశ్నించే గొంతులు నొక్కబడతాయి. అది చివరకు పార్టీ వినాశనానికి దారితీస్తుంది. నాయకులు తమ వ్యక్తిగత ఇమేజ్ కోసం పార్టీ వేదికలను వాడుకోవడం ఆపాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కింది స్థాయి కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. కేవలం పైస్థాయిలో నలుగురు కూర్చుని తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు కావు సదా విఫలమవుతూనే ఉంటాయి. అంతర్గత చర్చలను మీడియాకు చేరవేసే ‘కోవర్టు’ సంస్కృతిని తుడిచిపెట్టాలి. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే, పార్టీ భవిష్యత్తులో మరింత పతనం కావడం ఖాయం. తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన ఎర్రజెండా, సొంత గూటిలోని కుమ్ములాటలతో సతమతమవ్వడం విచారకరం. ఇప్పటికైనా నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. సమాచారాన్ని లీక్ చేసే స్థాయికి దిగజారిన ‘చైతన్యం’ లేని నాయకత్వం కంటే, సిద్ధాంతం పట్ల కట్టుబడి ఉండే సామాన్య కార్యకర్త నయం. ఈ ‘అభిశంసన’ కేవలం వ్యక్తులకు పరిమితం కాకుండా, పార్టీ నిర్మాణంలో పేరుకుపోయిన కుళ్లును కడిగేసే ‘ప్రక్షాళన’కు పునాది కావాలి. ముఖ్యంగా తెలంగాణలో సిపిఎం ఉనికి ప్రశ్నార్థకమవుతున్న వేళ, నాయకులు తమ ఈగోలను పక్కనపెట్టాలి. అభిశంసనకు గురైన వర్గం తమ తప్పిదాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలి, అలాగే ప్రత్యర్థి వర్గం కూడా ‘లీకుల’ రాజకీయాలు మాని పార్టీ ఐక్యత కోసం కృషి చేయాలి. ఈ రెండు గ్రూపుల మధ్య నలిగిపోతున్నది సామాన్య కార్యకర్త, పార్టీ సిద్ధాంతం మాత్రమే అని గుర్తించాలి. ఎర్రజెండా పరువు తీసేది బయటి శత్రువులు కాదు, లోపల ఉండి గ్రూపు రాజకీయాలు చేసే ‘నేతలే’ అన్నది నిష్గ్ఠూర సత్యంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా కనువిప్పు కలగకపోతే, తెలంగాణ గడ్డపై దశాబ్దాల కమ్యూనిస్టు పార్టీ మరింత మసకబారే ప్రమాదం లేకపోలేదు.  - రాజేందర్ దామెర

మన తెలంగాణ 6 Mar 2026 10:26 am

ఆందోళనలో అన్నదాతలు..

ఆందోళనలో అన్నదాతలు.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా

ప్రభ న్యూస్ 6 Mar 2026 10:26 am

Bhogi New Poster: Sharwa’s Fearless Avatar

Charming Star Sharwa celebrates his birthday today, and marking the occasion, the makers of his upcoming film Bhogi have unveiled a brand-new poster. The poster reveals a gritty and intense transformation for the actor. Sharwa appears in a rugged and fearless avatar with a thick beard, heavy moustache, and messy hair. His stern and focused […] The post Bhogi New Poster: Sharwa’s Fearless Avatar appeared first on Telugu360 .

తెలుగు 360 6 Mar 2026 10:18 am

విద్యుత్ సర్క్యూట్ తో గుడిసెలు దగ్ధం..

విద్యుత్ సర్క్యూట్ తో గుడిసెలు దగ్ధం.. వెల్దుర్తి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని

ప్రభ న్యూస్ 6 Mar 2026 10:17 am

అభిషేక్ శర్మ రాణిస్తాడు : సంజు శాంసన్

క్రీడలు : టీ -20 ప్రపంచ కప్ లో తరచుగా విఫలమవుతున్న అభిషేక్ శర్మకు సంజు సాంసంగ్ మద్దతుగా నిలిచాడు. ఫామ్ కోల్పోవడం క్రికెట్ లో సర్వసాధారణమేనని, తనదైన రోజున అభిషేక్ విజృంభిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుంటుంది. అభిషేక్ మీద విపరీతమైన నమ్మకం తమకు ఉందన్నాడు. ప్రతి క్రికెటర్ ఖరీర్ లో ఎత్తు పల్లాలు ఉంటాయని ఆ సమయంలో ఆయనకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. అతడు టి20 ప్రపంచ […] The post అభిషేక్ శర్మ రాణిస్తాడు : సంజు శాంసన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Mar 2026 10:12 am

ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక ర్యాలీ..

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ర్యాలీ.. మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 6 Mar 2026 10:12 am

నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం..

నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ : నిరుపేదలకు కూటమి ప్రభుత్వం

ప్రభ న్యూస్ 6 Mar 2026 10:04 am

Summer Tips : ఎండ ప్రభావానికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

తెలుగు పోస్ట్ 6 Mar 2026 9:58 am

06 Mar 2026 |తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..

06 Mar 2026 | తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం.. తిరుమలలో భక్తుల

ప్రభ న్యూస్ 6 Mar 2026 9:56 am

కూలిన సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానం

భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానం కూలిపోయింది

తెలుగు పోస్ట్ 6 Mar 2026 9:50 am

రష్యా చమరు కొనుగోలుకు భారత్ కు ఓకే

న్యూదిల్లీ : పశ్చిమాసియాలు జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో చమురు రవాణా పై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ సమయంలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్కు అమెరికా మినహాయింపు ఇచ్చింది. ఇదే విషయాన్ని యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఎక్స్ వేదిక ద్వారా పేర్కొన్నారు. 30 రోజులు పాటు భారతీయ చమురు శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి తాత్కాలికంగా మినహాయింపు […] The post రష్యా చమరు కొనుగోలుకు భారత్ కు ఓకే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Mar 2026 9:48 am

Summer Effect : ఈ ఏడాది ఎండల నుంచి బతికి బయటపడటం ఎలాగో?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి

తెలుగు పోస్ట్ 6 Mar 2026 9:41 am

Telangana :Telangana : మహబూబాబాదం జిల్లాలో గిరిజన జాతర కోలాహలం

మహబూబాబాద్ జిల్లాలో గిరిజనుల జాతర మొదలయింది

తెలుగు పోస్ట్ 6 Mar 2026 9:35 am

శ్రీరామనవమి కానుకగా...

‘కోర్ట్’ చిత్రంతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయబోతోన్నారు. ‘బ్యాండ్ మేళం’ టీజర్, ట్రైలర్, మాస్ పెప్పీ సాంగ్ ‘తిప్పూ కుం టున్నావ్’, మంచి మెలోడీ సాంగ్ ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ వంటివి ఆడియెన్స్‌లో సినిమా పట్ల అంచనాల్ని పెంచేసింది. యూత్ ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలను సృష్టించిన ఈ చిత్రం శ్రీరాముడి ఆశీస్సులతో శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. మార్చి 26న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు ప్లాన్ చేశారు. 

మన తెలంగాణ 6 Mar 2026 9:24 am

మహా కుంభాభిషేక మహోత్సవం..

మహా కుంభాభిషేక మహోత్సవం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ

ప్రభ న్యూస్ 6 Mar 2026 9:21 am

‘మృత్యుంజయ్’లో శ్రీ విష్ణు నటన చాలా కొత్తగా..

కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ జంటగా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రం తో మరోసారి అలరించనున్నారు. శుక్రవారం ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈక్రమంలో గురువారం నాడు మీడియాకి ప్రత్యేకంగా చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రీమియర్ షో ప్రెస్ మీట్‌లో శ్రీ విష్ణు మాట్లాడుతూ .. “కంటెంట్ మూవీస్ ఎప్పుడు వచ్చినా మీడియా, ఆడియెన్స్ ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఈ కంటెంట్ సినిమాకి ప్రేక్షకులు అందరూ వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. నిర్మాత సందీప్ గుణ్ణం మాట్లాడుతూ.. “ఈ మూవీ కోసం మా టీం నిద్రలేని రాత్రులు గడిపి పని చేసింది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది” అని తెలిపారు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ .. “నాని ‘మృత్యుంజయ్’ మూవీని చూశా రు. ఆయనకు నచ్చింది అని నాకు తెలిసిన తరువాత నాకెంతో ప్రశాంతంగా అనిపించింది. ఆయన రివ్యూ ఎప్పుడూ తప్పదు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు నటన చాలా కొత్తగా ఉంటుంది. రెబా మోనికా పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెబా మోనికా జాన్, మనీషా ఎ. దత్, రమ్య, సుదర్శన్, అయ్యప్ప శర్మ, రచ్చ రవి పాల్గొన్నారు. 

మన తెలంగాణ 6 Mar 2026 9:15 am

Gold Prices Today : అదిరిపోయే న్యూస్.. బంగారం ధరలు ఎంత తగ్గాయో తెలుసా?

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

తెలుగు పోస్ట్ 6 Mar 2026 9:11 am

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଇରାନ ଉପରେ ଆକ୍ରମଣ ପାଇଁ ଆମେରିକା ଭାରତର ନୌସେନା ଘାଟି ବ୍ୟବହାର କରୁଥିବା ଦାବିକୁ ଖଣ୍ଡନ କରିଛି ଭାରତ

ହର୍ମୁଜ ଜଳପଥ ନେଇ ସ୍ପଷ୍ଟ କଲା ଇରାନ; ଭାରତର ଆଶା ବଢ଼ିଲା। କେବଳ ଆମେରିକା, ଇସ୍ରାଏଲ୍‌, ୟୁରୋପ ପାଇଁ ବନ୍ଦ ରହିବ ହର୍ମୁଜ ଜଳପଥ। ଇତିମଧ୍ୟରେ ଏକ ପୋଷ୍ଟ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଜଣେ ବିଦେଶୀ ବ୍ୟକ୍ତି ଏକ ଆନ୍ତର୍ଜାତିକ ଗଣମାଧ୍ୟମକୁ ସାକ୍ଷାତକାର ଦେଇ କହୁଛନ୍ତି, ଆମର ଘାଟି ଏବଂ ବନ୍ଦର ଗୁଡ଼ିକ ନଷ୍ଟ ହୋଇଯାଇଛି । ତେଣୁ ଆକ୍ରମଣ ପାଇଁ ଆମେ ଭାରତୀୟ ନୌସେନାର ବନ୍ଦର ଗୁଡ଼ିକ ବ୍ୟବହାର କରୁଚୁବୋଲି ମତ ପ୍ରକାଶ କରିଛନ୍ତି ।  View this post on Instagram A post shared by The Asian Chronicle (@theasianchronicle) ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଇରାନ ଉପରକୁ ଆକ୍ରମଣ କରିବାକୁ ଯାଇ, ଭାରତୀୟ ବନ୍ଦରଗୁଡ଼ିକୁ ଆମେରିକୀୟ ନୌସେନା ଦ୍ୱାରା ବ୍ୟବହାର କରାଯାଉଥିବା ଦାବିଟି ଭିତ୍ତିହୀନ ବୋଲି ସୂଚନା ଦେଲା ଭାରତୀୟ ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟ । ଉକ୍ତ ଦାବିକୁ ତଦନ୍ତ କରିବାକୁ ଯାଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ନୌସେନା, ପ୍ରତିରକ୍ଷା ମନ୍ତ୍ରଣାଳୟ କିମ୍ବା ଆମେରିକୀୟ ସେନା ସାଇଟ , ସୋସିଆଲ ମିଡିଆ କିମ୍ବା କୌଣସି ଅଧିକାରୀ କିମ୍ୱା କୌଣସି ସ୍ପୋକ ପର୍ସନ ଏନେଇ କୌଣସି ସୂଚନା ଦେଇଥିବାର ଆମର ହସ୍ତଗତ ହୋଇନଥିଲା । ଅନ୍ୟପଟେ ଭାରତୀୟ ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟ ପକ୍ଷରୁ ସୂଚନା ଦିଆଯାଇଛି ଯେ, ଆମେରିକାର ଏକ ଚ୍ୟାନେଲ୍, ଓଏଏନରେ ଭାରତୀୟ ବନ୍ଦରଗୁଡ଼ିକୁ ଆମେରିକୀୟ ନୌସେନା ଦ୍ୱାରା ବ୍ୟବହାର କରାଯାଉଥିବା ଦାବି ମିଥ୍ୟା ଏବଂ ମିଥ୍ୟା। ଆମେ ଆପଣଙ୍କୁ ଏପରି ଭିତ୍ତିହୀନ  ମନ୍ତବ୍ୟ ବିରୁଦ୍ଧରେ ସତର୍କ କରୁଛୁ । Fake News Alert! Claims being made on OAN, a US based channel that Indian ports are being used by the US Navy are fake and false. We caution you against such baseless and fabricated comments. pic.twitter.com/xiFWnkoXBk — MEA FactCheck (@MEAFactCheck) March 4, 2026 ଉକ୍ତ ଦାବିକୁ ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍ କରି ଭାରତର ସରକାରଙ୍କ ଫ୍ୟାକ୍ଟଚେକ୍ ଅନୁଷ୍ଠାନ ପିଆଇବି ଫ୍ୟାକ୍ଟଚେକ୍ ଉଲ୍ଲେଖ କରିଛି, ଗୋଟିଏ ଆମେରିକୀୟ ଚ୍ୟାନେଲ ଆମେରିକା ନିୟୁଜ ନେଟୱାର୍କ ରେ ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ । ଜଣେ ଆର୍ମି କର୍ନେଲ ମତପ୍ରକାଶ କରିଛନ୍ତି ଯେ, ଇରାନକୁ ଆକ୍ରମଣ କରିବାକୁ ଆମେରିକା ଭାରତୀୟ ନୌସେନା ବେସ୍ କୁ ବ୍ୟବହାର କରୁଛି । ଯାହାକି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ଫେକ୍ ଅଟେ, ଏଭଳି ମିଛ ସୂଚନା ଠାରୁ ଦୂରେଇ ରୁହନ୍ତୁ । Claim: On a US-based channel, One America News Network ( @OANN ), former U.S. Army Colonel Douglas Macgregor made a statement suggesting that the United States is using Indian naval bases to attack Iran, amidst the ongoing Iran-US conflict. #PIBFactCheck : ❌This claim is #FAKE … pic.twitter.com/nzcXCi7yT9 — PIB Fact Check (@PIBFactCheck) March 4, 2026 ଉକ୍ତ ଘଟଣାକୁ ନେଇ ଏକ ବିସ୍ତୃତ ଖବର ପ୍ରସାରଣ କରିଛି ଓଡ଼ିଶାର ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମ ଓ ଟିଭି । ଉକ୍ତ ଖବରକୁ ନିଜ ଡ଼ିଜିଟାଲ ସାଇଟରେ ଓଟିଭି ପଉଲ୍ଲେଖ କରିଛି, ପୂର୍ବତନ ଆମେରିକୀୟ ସେନାର କର୍ଣ୍ଣେଲ ଡଗଲାସ ମ୍ୟାକଗ୍ରେଗର ଆମେରିକୀୟ ନ୍ୟୁଜ୍ ଚ୍ୟାନେଲ ୱାନ୍ ଆମେରିକା ନ୍ୟୁଜ୍ ନେଟୱର୍କକୁ ଦେଇଥିବା ଏକ ସାକ୍ଷାତକାରରେ କହିଥିଲେ ଯେ, ଇରାନ ବିରୁଦ୍ଧରେ ଯୁଦ୍ଧରେ ଆମେରିକା ଭାରତୀୟ ନୌସେନା ଘାଟି ବ୍ୟବହାର କରୁଛି। ଆମେରିକା ସେନାର ସମସ୍ତ ବେସ୍ ଧ୍ୱଂସ ହୋଇଯାଇଛି। ଇରାନ ଉପରେ ଆକ୍ରମଣ ଲାଗି ଭାରତର ବନ୍ଦରର ବ୍ୟବହାର ଖବରକୁ ଭିତ୍ତିହୀନ ବୋଲି କହିଛି ଭାରତୀୟ ବୈଦେଶିକ ବ୍ୟାପାର ବିଭାଗ । ପ୍ରକାଶିତ ଖବରକୁ ମିଥ୍ୟା କହିବା ସହ ଏପରି ଭିତ୍ତିହୀନ ଏବଂ କପୋଳକଳ୍ପିତ ମନ୍ତବ୍ୟ ପ୍ରତି ସତର୍କ ରହିବାକୁ କହିଛି ଭାରତୀୟ ବୈଦେଶିକ ବ୍ୟାପାର ବିଭାଗ । ସେହିପରି ସମାନ ସୂଚନା ସହ ବିଭିନ୍ନ ଜାତୀୟ ଗଣମାଧ୍ୟମ ଏନେଇ ଖବର ପ୍ରସାରଣ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି ଯାହାର ଲିଙ୍କ୍ ଏଠାରେ , ଏଠାରେ ଏବଂ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଇରାନ ଉପରକୁ ଆକ୍ରମଣ କରିବାକୁ, ଭାରତୀୟ ବନ୍ଦରଗୁଡ଼ିକୁ ଆମେରିକୀୟ ନୌସେନା ବ୍ୟବହାର କରାଯାଉଥିବା ଦାବିଟି ଭିତ୍ତିହୀନ ବୋଲି ସୂଚନା ଦେଲା ଭାରତୀୟ ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟ ।

తెలుగు పోస్ట్ 6 Mar 2026 9:08 am

ఆదర్శ గ్రామంగా..

ఆదర్శ గ్రామంగా.. సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : రానున్న రోజుల్లో నారాయణపురం గ్రామాన్ని

ప్రభ న్యూస్ 6 Mar 2026 9:04 am

Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

తెలుగు పోస్ట్ 6 Mar 2026 8:55 am

రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పెరుగుతన్న మృతుల సంఖ్య

రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది.

తెలుగు పోస్ట్ 6 Mar 2026 8:49 am

భారత్ వర్సెస్ ఇంగ్లాడ్... మ్యాచ్ హైలెట్స్ చూడాల్సిందే

టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో భారత్ గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సంజూ శామ్సన్ 42 బంతుల్లో 89 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్లు శివమ్ దూబే 25 బంతుల్లో 43 పరుగులు, ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు, హార్ధిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు, తిలక్ వర్మ ఏడు బంతుల్లో 21 పరుగులు సూర్యకుమార్ యాదవ్ ఆరు బంతుల్లో 11 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ ఏడు బంతుల్లో తొమ్మిది పరుగులు చేసి విఫలమయ్యాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు చివరలో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అదరగొట్టడంతో విజయం సాధించారు. 89 పరుగులు చేసిన సంజూ శామ్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టీమిండియా బ్యాట్స్ మెన్లు 19 సిక్స్ లు, 18 పోర్లు బాదారు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు 12 సిక్స్ లు 21 ఫోర్లు కొట్టారు.   

మన తెలంగాణ 6 Mar 2026 8:49 am

ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం..

ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ,

ప్రభ న్యూస్ 6 Mar 2026 8:46 am

Tiger : రంపచోడవరం మన్యంలోనే పెద్దపులి సంచారం

రంపచోడవరం మన్యంలోనే పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది

తెలుగు పోస్ట్ 6 Mar 2026 8:42 am

One more Expensive Investment from Nayanthara

Film actors are known for their investments in lavish properties and most of them invest big on lands and apartments in cities. Some of the top actors of Indian cinema have emerged as the wealthiest because of their good real estate investments. A couple of years ago, Nayanthara and her husband Vignesh Shivan moved into […] The post One more Expensive Investment from Nayanthara appeared first on Telugu360 .

తెలుగు 360 6 Mar 2026 8:32 am

Tirumala : తిరుమలకు వెళ్లే వారికి అలెర్ట్.. ఈరోజు దర్శనం ఎంత సమయం అంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు పెరిగింది

తెలుగు పోస్ట్ 6 Mar 2026 8:29 am

India March Into T20 World Cup Final After Epic Semifinal Win

The India national cricket team are through to the final of the ICC Men’s T20 World Cup, and what a night of cricket it was. In a breathtaking semifinal against the England national cricket team, India held their nerve to secure a thrilling victory and book their place in the biggest match of the tournament. […] The post India March Into T20 World Cup Final After Epic Semifinal Win appeared first on Telugu360 .

తెలుగు 360 6 Mar 2026 8:26 am

కారును ఢీ కొట్టడంతో..

కారును ఢీ కొట్టడంతో.. ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం

ప్రభ న్యూస్ 6 Mar 2026 8:24 am

Telangana : తెలంగాణకు కొత్త గవర్నర్‌

దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకాల్లో మార్పులు చేశారు

తెలుగు పోస్ట్ 6 Mar 2026 8:17 am

విజయ్ దేవరకొండ ఇంటికి రేవంత్

సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు

తెలుగు పోస్ట్ 6 Mar 2026 8:01 am

ఆళ్లగడ్డలో పట్టపగలు వైసిపి నేతపై కత్తులతో దాడి

అమరావతి: వైసిపి నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో జరిగింది. ఆళ్లగడ్డ సమీపంలోని పి వి ఎస్ ఆర్ గోడౌన్ లో వైసిపి నేత శివరామిరెడ్డిను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచారు. ముగ్గురు వ్యక్తులు ముసుగు ధరించి కత్తులతో దాడి చెయ్యడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం మొత్తం రక్తంతో నిండిపోయింది. టిడిపి ఎంఎల్ఎ అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ తనపై దాడి చేశాడని, తనను చంపడానికి వచ్చినట్లు గుర్తించానని బాధితుడు శివరామిరెడ్డి ఆరోపణలు చేశాడు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని శివరాంరెడ్డిని పరామర్శించారు. అఖిల ప్రియ భర్త కేవలం డబ్బులు కోసమే శివరామిరెడ్డి పై దాడి చేయించారంటూ భూమా విమర్శించారు. శివరామిరెడ్డిని అత్యవసర చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోజు రోజుకు శాంతి భద్రతలు క్షిణించిపోతున్నాయని, ఆళ్లగడ్డలో రౌడీయిజం రాజ్యం ఏలుతుందని, తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతాకాల్సి వస్తుందని వైసిపి శ్రేణులు ఆరోపణలు చేస్తున్నాయి. 

మన తెలంగాణ 6 Mar 2026 7:58 am

India Vs England : టీం ఇండియా ఫైనల్ చేరడానికి ఈ ముగ్గురు కారణం ఎవరైనా కాదంటారా?

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా ఆటగాళ్లు ముగ్గురు గేమ్ ఛేంజర్స్ గా నిలిచారు

తెలుగు పోస్ట్ 6 Mar 2026 7:49 am

వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

రేవల్లి: వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదుల శివారులో రెండు ట్రాక్టర్ల డోర్లు ఆటోకు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కొంకలపల్లి గ్రామానికి చెందిన భక్తులు జనుంపల్లిలోని మంత్రాలమ్మ జాతరకు ఆటోలో వెళ్లారు. గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఇంటికి తిరిగివస్తుండగా రెండు ట్రాక్టర్ డోర్లకు ఆటో ఢీకొనడంతో ఇద్దరు చనిపోయారు. ఐదుగురు గాయపడడంతో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు వెంకటయ్య, సుమిత్రమ్మగా గుర్తించారు. ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మన తెలంగాణ 6 Mar 2026 7:37 am

India Vs England : నరాలు తెగాయి కదయ్యా... హార్ట్ బీట్ ఎంత పెరిగిందంటే?

India Vs England : నరాలు తెగాయి కదయ్యా... హార్ట్ బీట్ ఎంత పెరిగిందంటే?

తెలుగు పోస్ట్ 6 Mar 2026 7:20 am

Israel Beirut Strikes : మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు... బీరూట్ పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు

లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ ప్రాంత నగరాలపై ఇజ్రాయెల్ గురువారం వరుస వైమానిక దాడులు చేసింది

తెలుగు పోస్ట్ 6 Mar 2026 7:03 am

రాష్ట్రానికి కొత్త గవర్నర్‌

న్యూఢిల్లీ : ఒకపక్క బీహార్‌లో కమలం సర్కార్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తూనే కేంద్రంలోని మో డీ ప్రభుత్వం మరోపక్క గురువారంనాడు అర్ధరా త్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్‌ల బదిలీలు, నియామకాలు చేపట్టింది. తెలంగాణ గవర్నర్‌గా పనిచేస్తున్న జిష్ణుదేవ్ వర్మ ను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లాను నియమించారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్‌ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించారు. అంతకు ముందు పశ్చిమ బెం గాల్ గవర్నర్‌గా ఉన్న ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేయడం, వెనువెంటనే ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడడం చకచకా జరిగిపోయింది. తమిళనాడుకు కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇన్‌ఛార్జి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటన వెలువరించింది. బీహార్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ హస్నైన్ నియమించారు. నాగాలాండ్ గవర్నర్‌గా నందకిశోర్ యాదవ్‌ను నియమించారు. ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వినయ్‌కుమార్ సక్సేనాను లఢక్ గవర్నర్‌గ పంపించారు. అక్కడ గవర్నర్‌గా ఉన్న కవీందర్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్‌గా నియమితులు అయిన శివప్రతాప్ శుక్లా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని రుద్రాపూర్ గ్రామంలో జన్మించారు. ఇదిలావుండగా రాజీనామాకు దారితీసిన కారణాలను ఆనంద్ బోస్ వెల్లడించలేదు. తన రాజీనామా వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? వ్యక్తిగత కారణాలు ఇందుకు దారితీశాయా? అనేది ఆయన వెల్లడించలేదు. ప్రస్తుత పరిణామంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ విస్మయం వ్యక్తం చేశారు. గవర్నర్ రాజీనామా తనకు దిగ్భ్రాంతి కల్గించిందని మమత బెనర్జీ తెలిపారు. 

మన తెలంగాణ 6 Mar 2026 6:00 am

రాజ్యసభకు వెళ్తున్నా..

` నితీశ్ కుమార్ ప్రకటన ` బీహార్‌తో అనుబంధం కొనసాగుతుందని వెల్లడి ` రాజ్యసభకు నామినేషన్ వేసిన బీహార్ ముఖ్యమంత్రి ` హాజరైన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ …

జనం సాక్షి 6 Mar 2026 5:43 am

కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులో దురుద్దేశం లేదు

` హైకోర్టుకు వివరించిన తెలంగాణ ప్రభుత్వం ` అవతకవకలు, డబ్బు దుర్వినియోగంపైనే దష్టి ` తదుపరి విచారణ 12కు వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై …

జనం సాక్షి 6 Mar 2026 5:41 am

తగ్గేదేలే అంటున్న ఇరాన్

` అమెరికా ఏయిర్ బేస్‌లపై ముమ్మరదాడులు ` ఇజ్రాయిల్‌కు ధీటుగా జవాబు ` మిస్సైళ్లు, డ్రోన్‌లతో విరుచుకు పడుతున్న ఐఆర్‌జీసీ ` చైనా సహకారంతోనే అంటూ..అంతర్జాతీయ కథనాలు …

జనం సాక్షి 6 Mar 2026 5:40 am

అయతుల్లా అలీ ఖమేనీకి భారత్ అధికార నివాళి

` సుప్రీం లీడర్ మతికి సంతాపం ` రాయబార కార్యాలయంలో విక్రమ్ మిస్రీ సంతకం ` ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి జైశంకర్ ఫోన్ ` …

జనం సాక్షి 6 Mar 2026 5:39 am

సింఘ్వీ, వేం ఎన్నిక లాంఛనమే

మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభిషేక్‌మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు గురువారం నామినేషన్‌లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల అధికారి ఉపేం దర్ రెడ్డికి ఈ నామినేషన్ పత్రాలను వారు అందజేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి, శ్రీధర్‌బాబు నేతృత్వంలో సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు మొదటి, రెండు నామి నేషన్లు దాఖలు చేయగా సిఎం రేపంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మూడో సెట్ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ ఎన్నికల అధికారికి సమర్పించారు. ప్రస్తు తం ఈ రెండు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నట్టుగా తెలిసింది. మొత్తం రెండు స్థా నాల కోసం 3నామినేషన్లు దాఖలయ్యా యి. కాంగ్రెస్ తరఫున అభిషేక్ సిం ఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయ గా, స్వతంత్ర అభ్యర్థిగా  సాయి అనే వ్యక్తి కూడా నామినేషన్ వేశారు. అభిషేక్ సింఘ్వీ మూడుసెట్లు, వేం నరేందర్ రెడ్డి నాలుగు సెట్లు, సాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, స్వతంత్ర అభ్యర్థి సాయి 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా నామినేషన్ వేయడంతో స్క్రూటీనిలో ఆ నామినేషన్‌ను తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో సింఘ్వీ, వేం నరేందర్ ఏకగ్రీవం లాంఛనం కానున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు బిఆర్‌ఎస్ అభ్యర్థులు బరిలో లేరు. అయితే, కాంగ్రెస్ రెండోసీటుకు పోటీచేస్తుండగా ఈ సీటు గెలవాలంటే కాంగ్రెస్‌కు సరిపడా మద్ధతు లేదు. దీనికోసం కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ మద్ధతు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతం మూడో అభ్యర్థి పోటీలో లేకపోవడంతో పోటీ ఏకగ్రీవమవుతుందని అధికారులు తెలిపారు. నేడు స్క్రూటీని దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం నామినేషన్లు దాఖలయ్యాయి. దాఖలైన నామినేషన్ లను నేడు అధికారులు పరిశీలిస్తారు. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు మార్చి 9వ తేదీ వరకు అవకాశం ఉంది. ఏకగ్రీవం కానీ, పక్షంలో అవసరమైతే మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. బిఆర్‌ఎస్ దూరం రాజ్యసభ పోటీకి బిఆర్‌ఎస్ దూరంగా ఉంది. ఖాళీ అయిన రెండు స్థానాల్లో సురేశ్ రెడ్డి బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపి కాగా, తాజాగా ఇప్పుడు ఆ స్థానాన్ని గులాబీ పార్టీ కోల్పోయింది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బిఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారికి సంఖ్యా బలం లేకపోవడంతో బిఆర్‌ఎస్ పోటీ నుంచి తప్పుకుంది. రెండో స్థానం కోసం కాంగ్రెస్ నుంచి 16 మంది గతంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లిన అభిషేక్‌మను సింఘ్వీ పదవీకాలం మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది. దీంతో మరోసారి సింఘ్వీకి కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది. ఇక, రెండోస్థానం కోసం కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్లు సుమారుగా 16 మంది పోటీపడగా సిఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు పదవికి వేం నరేందర్‌రెడ్డి రాజీనామా సిఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా వ్యవహారిస్తున్న వేం నరేందర్ రెడ్డి తన పదవికి గురువారం ఉదయం రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి లాభదాయక పదవుల్లో ఉండకూడదన్న నిబంధన ఉంది. ఈ నేపథ్యంలోనే సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వేం నరేందర్ రెడ్డి తన ప్రభుత్వ సలహాదారు పదవిని వదులుకున్నారు. ఆయన రాజీనామాను సిఎస్ రామకృష్ణా రావు వెంటనే ఆమోదించారు. అనంతరం వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీతో కలిసి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు అసెంబ్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని ఢిల్లీ పర్యటన ముగించుకున్న సిఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. జాతీయ రాజధానిలో కాంగ్రెస్ అధిష్టానంతో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చలు జరిపిన అనంతరం ఆయన నగరానికి తిరిగి వచ్చారు. అనంతరం అసెంబ్లీకి చేరుకున్న సిఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిల మూడో సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అధిష్టానానికి ధన్యవాదాలు నామినేషన్ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు రాజ్యసభ అవకాశం కల్పించిన అధిష్టానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆశీర్వాదంతోనే తనకు రాజ్యసభ అవకాశం దక్కిందన్నారు. అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ తనకు రెండో సారి అవకాశం ఇచ్చిన హైకమాండ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతానని ఆయన చెప్పారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు నామినేషన్‌లు దాఖలు చేసిన అనంతరం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వారిద్దరూ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఉన్నారు.

మన తెలంగాణ 6 Mar 2026 5:30 am

నేటి నుంచి కార్యాచరణ

మనతెలంగాణ/హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే రెండుసా ర్లు ప్రజా ప్రభుత్వం ప్రజా పా లన గ్రామసభలు, వార్డు సభల తో నేరుగా ప్రజల వద్దకు చేరుకుంది. ప్రజా ప్రభుత్వం మూ డోసారి ప్రజల్లోకి వెళుతోంది. ప్రజా ప్రభుత్వం అధికారం చే పట్టిన తర్వాత 2023 డిసెంబర్‌లో 28 వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాల న గ్రామ, వార్డు సభలను నిర్వహించగా 2025 జ నవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు రెండోసారి ప్రజా పాలన గ్రామ సభలు, వార్డు సభలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ రెండు విడతల్లోనూ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారి నుంచి అ ర్జీలు స్వీకరించటంతో పాటు ప్రజలతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకునే ప్ర యత్నం చేసింది. ప్రజల స మక్షంలో వచ్చిన అర్జీలతో నే ప్రభుత్వం వివిధ సం క్షేమ పథకాలను అ మలు చేసింది. అక్కడ తీసుకున్న అర్జీల ఆధారంగానే రైతు రుణమాఫీ, రైతు భ రోసా, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచి త విద్యుత్, కళ్యాణలక్ష్మి, షాదీ ము బారక్, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జా రీ, సన్న బి య్యం పంపిణీ, సన్న వడ్లకు రూ.500 బోనస్ పథకాలను అమలు చేసింది. ఇప్పుడు మూడోసారి ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణకు నడుం బిగించింది. పౌర సేవలు, ప్రజల అవసరాలతో మమేకమై ఉండే అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు తలపెట్టింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అయిదు స్థాయిల్లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతోంది. మార్చి 6వ తేదీ నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యంతో పాటు పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయనుంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందస్తు ఉత్సవంగా ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేసింది. గ్రామ సభలు, వార్డు సభల నిర్వహణతో పాటు మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సరికొత్త కార్యాచరణకు నడుం బిగించింది. మండలాలు, జిల్లా కేంద్రాల్లో వివిధ శాఖల అధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. అన్ని స్థాయిల్లోనూ గ్రామ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపిల వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వాటితో లబ్ధి పొందిన కుటుంబాలు, లబ్ధి పొందిన వర్గాలకు చేసిన మేలును క్షేత్ర స్థాయిలో చెప్పుకోవటంతో పాటు అర్హులకు ప్రభుత్వ పథకాలు తప్పకుండా అందించాలన్న సంకల్పంతో ఈ సభలను ఏర్పాటు చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో వస్తున్న సంస్కరణలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్లను తీర్చిదిద్దే ప్రణాళికను ప్రజలకు వివరించనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించే 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను గుర్తించి, పిల్లల తల్లితండ్రుల్లో అవగాహన పెంచనుంది. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్ ప్రధానంగా సోలార్ విద్యుత్ వినియోగం పెంచటం, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను ప్రజలకు, రైతులకు తెలియజేయాలని లక్ష్యంగా ఎంచుకుంది. ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలన్న ప్రజా ప్రభుత్వ లక్ష్యాన్ని నూటికి నూరుపాళ్లు అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం సంకల్పించింది. నిరంతరం రేషన్‌కార్డులను ఇవ్వాలని... పదేళ్లు ఇవ్వని రేషన్ కార్డులను, అర్హులకు ఇవ్వాలని, ఇదో నిరంతర ప్రక్రియగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు నైపుణ్యాల శిక్షణతో పాటు ఉపాధి కల్పించే కార్యక్రమాలు 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చేపట్టనుంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించి లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని టార్గెట్‌గా ఎంచుకుంది. ఇందిరా మహిళా శక్తి సాధిస్తున్న విజయాలను, కొత్తగా వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించనుంది. అన్ని జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రారంభించనుంది. 1వ వారం- గ్రామీణ అభివృద్ధి, 2వ వారం ఆరోగ్య రంగం 1వ వారం - గ్రామీణ అభివృద్ధి (మార్చి 30 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ), 2వ వారం ఆరోగ్య రంగం (ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు) 3వ వారం - అరైవ్ అలైవ్ ( ఏప్రిల్13 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు) 4వ వారం - సంక్షేమం (ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు) 5వ వారం - పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట (ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే2వ తేదీ వరకు) 6వ వారం- రైతు సంక్షేమం (మే 4వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు) 7వ వారం -విద్య(మే 11వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు) 8వ వారం - యువత, క్రీడలు (మే 18వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు) 9వ వారం -మహిళా సంక్షేమం (మే 25వ తేదీ నుంచి మే 30 వ తేదీ వరకు) 10వ వారం- పర్యావరణం( జూన్1వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ)వరకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపట్టనుంది.

మన తెలంగాణ 6 Mar 2026 5:00 am

భారత్‌కు భారీ ఊరట

టెహరాన్: మధ్యప్రాచ్య యుద్ధం వేళ ఇరా న్ భారత్ పట్ల మిత్రధర్మం పాటించింది. హర్మూజ్ జలసంధి నుంచి కేవలం అమెరి కా, ఇజ్రాయెల్ , యూరప్ దేశాల నౌకల ను అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు గురువారం ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ దళాలు ఓ ప్రకటన వెలువరించాయి. ఈ ప్రకటనతో ఈ అత్యంత కీలకమైన చమురు రవాణా జలమార్గంలో భారతీయ నౌకల రాకపోకలకు ఎటువంటి ఆటంకాలు ఉండవని స్పష్టం అ యింది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్రపక్ష దేశాలకు నో ఎంట్రీ అని తెలియచేశారు. ఈ విషయం భారతదేశానికి శుభవార్త అ యింది. ఈ మధ్యరోజుల్లో ఈ ప్రాంతం చ మురు నౌకల రాకపోకలకు ముప్పుగా మా రింది. అనేక నౌకలపై దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇరాన్ సేనల కనుసన్నల్లోనే సాగుతున్నాయనేది ప్రపంచ స్థా యి బహిరంగ రహస్యం అయింది. ఇరాన్ అధికారిక ప్రకటనను అక్కడి అధికారిక వా ర్తా ప్రసార సంస్థ ఐఆర్‌ఐబి తెలియచేసిం ది. ఇప్పటి ప్రకటనతో ఈ జల మార్గంలో చమురు నౌకల  ప్రయాణాలపై అనిశ్చితత, డోలాయమాన పరిస్థితి తొలిగిపోయింది. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటి కటుతరమైన పరస్పర కవ్వింపు చర్యలు, పరస్పర దాడులతో ఈ ప్రాంతంలో దాదాపుగా అన్ని రకాల వాణిజ్య నౌకల కదలికలు నిలిచిపోయాయి. ఈ దశలో భారతదేశం వంటి అత్యధిక స్థాయి చమురు వాడకాల అవసరం ఉన్న బారత్ వంటి దేశాలకు ఈ ప్రకటన పెద్ద రిలీఫ్ ఇచ్చింది. చమురు కోసం ఇతర ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్న భారత్‌కు ఇక ఈ బెడద తప్పనుంది. ఈ జలమార్గం తమ ఆధీనంలో ఉందని, దీనిపై తమకే హక్కులు ఉన్నాయని, ఈ ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాల నౌకలు తిరిగితే తమ దాడులు తప్పవని ఇరాన్ హెచ్చరించింది. పైగా ఇక్కడ ఇరాన్ తరఫున హైతీ ఇతర మిలిటెంటు బృందాల నాటుపడవలు సంచరిస్తున్నాయి. అయితే ఇప్పుడు వీటి భయాలు లేకుండా భారత్‌కు చెందిన నౌకలు ఇక్కడ తమ నిర్ణీత గమ్యానికి చేరుకునేందుకు వీలేర్పడింది. ముందుగా ఈ ప్రాంతం మీదుగా కేవలం చైనా జెండాలతోతిరిగే నౌకలను అనుమతిస్తామని ఇరాన్ తెలిపింది. తమ పట్ల చైనా సంఘీభావానికి గుర్తింపుగా ఈ చర్యకు దిగారు. 23వేల మంది భారతీయ నావికుల కదలిక హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షల దశలో దాదాపు 23000 మంది భారతీయ నావికులు గల్ఫ్ ప్రాంతంలో నౌకారవాణా లేకపోవడంతో చిక్కుపడ్డారు. ఇక ఈ ప్రాంతంలో దాదాపుగా 36 వరకూ భారతీయ జెండాలతో కూడిన చమురు రవాణా నౌకలు ఉన్నాయని వెబ్‌సైట్‌తో స్పష్టం అయింది. వీటిలో ఏడు భారత నౌకా రవాణా సంస్థకు చెందిన నౌకలు ఉన్నాయి. ఈ ప్రాంతం వెలుపల భారీ సంఖ్యలో చమురు నౌకల గుంపులు ఆరు క్రూడాయిల్ ట్యాంకర్లు, 1 చమురు ట్యాంకర్, 1 ఎన్‌ఎన్‌జి నౌక, మూడు కంటైనర్ షిప్‌లు, ఇతరత్రా జలరవాణా వాహనాలు ఉన్నాయని వెబ్‌సైట్‌తో స్పష్టం అయింది. హర్మూజ్ జలసంధి మార్గం ప్రారంభ ప్రదేశంలో వందలాదిగా చమురు నౌకలు ఆగిపోయి ఉన్న విషయం మెరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రత్యేకించి పలు చమురు ట్యాంకర్ నౌకలు కువైట్ ఉత్తరంలో, దుబాయ్ తీరం వెంండి నిలిచిఉన్నాయి. ఇరాన్‌కు చెందిన సొంత వాణిజ్య నౌకలు ఇప్పుడు బందర్ అబ్బాస్ రేవు వద్ద లంగర్ వేసుకుని ఉన్నాయి. 

మన తెలంగాణ 6 Mar 2026 4:30 am

బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్

మనతెలంగాణ/హైదరాబాద్:ఎలాంటి విధ్వంసం లే కుండా అరాచకం లేకుండా మూసీని అభివృద్ధి చే య వచ్చు అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి ఆ ర్ అ న్నారు. మూసీ అభివృద్ధి అంశంలో ఒ క్క ఇల్లు కూల్చే అవసరం లేనిది బిఆర్‌ఎస్ మోడల్ అయితే, కాంగ్రెస్‌ది లక్షన్నర ఇండ్లను కూల్చే బు ల్డోజర్ మోడల్ మండిప డ్డారు. బిఆర్‌ఎస్ మోడల్ లో వికాసం ఉంటే కాంగ్రెస్ విధానాల్లో విధ్వంసం ఉన్నదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ మోడల్ పరిపాలన ఆపాలని హెచ్చరించారు. మూ సీ అభివృద్ధి పేరిట కాంగ్రెస్ చేస్తున్న అరాచకాన్ని అవినీతిని ఆపాలని, త మ అవినీతి సొమ్ముల కోసం లక్షల మంది పేదల ఇం డ్లు కూలగొట్టే ప్రయత్నం మానుకోవాలనిపేర్కొన్నారు. నగరంలోని నాగోల్‌లో గురువారం మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, మహమూద్ అలీ,తలసాని శ్రీని వాస్ యాదవ్, ఎంఎల్‌ఎలు పేర్కొన్నారు. నగరంలోని నాగోల్‌లో గురువారం మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, మహమూద్ అలీ,తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎలు ముఠా గోపాల్,సుదీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, ఎంఎల్‌సి వాణి దేవి, ఇతర బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్‌టిపి)ని పరిశీలించారు. తర్వాత నాగోల్ బ్రిడ్జి వద్ద గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన మూసి మోడల్‌ని పరిశీలించి అక్కడ మూసీ ప్రాజెక్టు బాధిత కుటుంబాలతో మాట్లాడారు. తీవ్రమైన ఆవేదనలో ఉన్న బాధిత కుటుంబాలను ఓదార్చారు. వారికి బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, నగరంలో మూసీ ప్రాజెక్టు పేరిట లక్షన్నర మంది ఇళ్లను కూలగొట్టే కుట్ర చేస్తున్న ప్రభుత్వ చర్యలపై మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కేవలం తన అవినీతి కోసం, ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల సంపాదన కోసం లక్షన్నర మంది పేదల ఇళ్లను కూలగొడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ప్రతి ఒక్క బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, కెసిఆర్ సైనికుడు కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం లేకుండా కూడా మూసీని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నదని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐదున్నర కిలోమీటర్ల మేర ఒక్క వ్యక్తికి ఇబ్బంది లేకుండా మూసీని నాగోల్ ప్రాంతంలో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఎన్నికల ముందు పేదలకు అండగా ఉంటామని, వారికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి వారిని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజ్యాన్ని తెచ్చారు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, ఎప్పుడు తమ ఇళ్లను కూలగొడుతుందో ప్రభుత్వం అని ప్రజలు భయం భయంగా బతుకుతున్నారని కెటిఆర్ అన్నారు. ’ఇందిరమ్మ రాజ్యం’ తెస్తామని చెప్పి ’బుల్డోజర్ రాజ్యాన్ని’ తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరిట నగరంలో సృష్టిస్తున్న విధ్వంసాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది మూసీ బ్యూటిఫికేషన్ కాదు అని, అది లూటిఫికేషన్ అంటూ విమర్శలు చేశారు. కేవలం 16 వేల కోట్ల రూపాయలతో మొత్తం మురుగు నీటిని శుద్ధి చేయడంతో పాటు కొండపోచమ్మ నుంచి మంచి నీళ్లను మూసీలోకి తీసుకురావడం, రెండు వైపులా స్కైవేల నిర్మాణం వంటి అన్ని కార్యక్రమాలతో కూడిన సమగ్రమైన డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డిపిఆర్) ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నదని తెలిపారు. కానీ, వేల కోట్ల రూపాయల అవినీతి కోసం రేవంత్ రెడ్డి ఈ మూసీ ప్రాజెక్టును ఎత్తుకున్నారని ఆరోపించారు. 16 వేల కోట్లతో జరిగే ప్రాజెక్టుని లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణకు తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. అయితే, ఆ ప్రాజెక్టు పేరుతో మాత్రం లక్షల మంది జీవితాలను ఆగం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్వయంగా రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు చెరువులలో ఇళ్లు కట్టుకుని ఉన్నారని చెప్పారు. అలాంటి వారిని ముట్టుకోకుండా పేద ప్రజలకు మూసీ ఒడ్డున ఉన్నారంటూ.. పెంచిన బఫర్ జోన్ నిర్ణయాల వల్ల వారి ఇళ్లు కూలగొడతామని బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఒక్క ఇంటిని నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి డిపిఆర్ సిద్ధం చేయకుండా, ఎలాంటి ప్రణాళిక లేకుండా కేవలం ఇళ్లకు రెడ్ మార్కులు వేస్తూ ప్రజల పైన కేసులు పెడుతూ బెదిరింపులకు దిగుతూ భయపెట్టిస్తున్నారని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పేద ప్రజల ఇళ్లకు నష్టం జరగకుండా మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన అవినీతికి వాడుకుంటామంటే అడ్డుకొని తీరుతామని కెటిఆర్ హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పనులను తమకు అప్పగిస్తే రూ.16 వేల కోట్లకే చేసి చూపిస్తామని అన్నారు. పైగా ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తామని అన్నారు. హామీల అమలు కోసమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో నగరంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇంటిని నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కెటిఆర్ సవాల్ విసిరారు.

మన తెలంగాణ 6 Mar 2026 4:00 am

శుక్రవారం రాశి ఫలాలు (06-03-2025)

మేషం వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. బంధువులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున కొందరి ప్రవర్తన మానసిక చికాకు కలిగిస్తాయి. వృషభం నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో విశేషంగా రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉన్నది. మిధునం చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వాహన వ్యాపారస్తులకు అనుకూలత పెరుగుతుంది. కర్కాటకం ధనపరంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి విమర్శలు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోనడం మంచిది. సింహం చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్తులతో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థుల పరీక్షా ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. కన్య కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన భాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది. తుల ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాదిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. భూ సంభందిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వృశ్చికం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ధన పరమైన విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ధనస్సు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. కుటుంబమున కొందరి మాటల వలన మానసిక చికాకులు కలుగుతాయి. నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. మకరం బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహన భూ లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. కుంభం కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు తప్పవు. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మీనం స్ధిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సంతాన శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు సర్దుమణుగుతాయి.  

మన తెలంగాణ 6 Mar 2026 12:20 am

ఉత్కంఠ పోరులో భారత్ విజయం –ఫైనల్‌లోకి టీమిండియా

. 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం. భారత్ 253/7, ఇంగ్లాండ్ 246/7 ముంబయి : టీ20 ప్రపంచ కప్ 2026 లో భారత్ నాలుగోసారి అత్యంత ఉత్కంఠతో ఫైనల్‌కి చేరుకుంది. భారత జట్టు 2007, 2014, 2024లలో కూడా ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం చేజిక్కిచుకుంది. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తన రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది. ముంబైలోని […] The post ఉత్కంఠ పోరులో భారత్ విజయం – ఫైనల్‌లోకి టీమిండియా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 11:40 pm

ఆదాయంలో బిజెపి అగ్రస్థానం

 దేశంలో జాతీయ రాజకీయ పార్టీల ఆదాయ వివరాల క్రమంలో 2024 25 ఆర్థిక సంవత్సరంలో అధికారిక బిజెపి అగ్రస్థానంలో నిలిచింది. బిజెపికి ఈ ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం మొత్తం రూ 6769.14 కోట్లుగా తేలింది. మొత్తం ఆరు జాతీయ పార్టీల ఆదాయ వ్యయ వివరాలను అసోసియేషన ఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) తన సమాచారం క్రమంలో వెలుగోకి తీసుకువచ్చింది. పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికల దశలో వివరాలు వెల్లడి అయ్యాయి. పార్టీలకు దక్కిన మొత్తం ఆదాయాన్ని రూ 7960.9 కోట్లుగా తేల్చారు. ఇందులో బిజెపికి దక్కింది 85 శాతం వరకూ ఉందని నిర్థారణ అయింది. ఇక రెండోస్థానంలో కాంగ్రెస్ పార్టీకి రూ 918 కోట్లు, మూడో స్థానంలో సిపిఎంకు 172 కోట్లు, బిఎస్‌పికి రూ 58 కోట్లు దక్కాయి. తరువాతి స్థానంలో ఆప్, ఎన్‌పిఇపిలు నిలచాయి. కాగా బిజెపి తన ఆదాయంలో దాదాపు 56 శాతం ఖర్చు పెట్టింది. అంటే రూ 3774 కోట్లకు పైగా వెచ్చించింది. కాంగ్రెస్‌కు దాదాపు రూ 1100 కోట్ల వరకూ ఖర్చు పెట్టింది. అంటే వచ్చిన ఆదాయం కన్నా 21 శాతం అధికంగా ఖర్చు లెక్కలు చూపింది. బిఎస్‌పి కూడా తమకు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు అయినట్లు ఆడిట్ లో తేల్చారు. ఇక రాజకీయ పార్టీలకు వచ్చిన ఆదాయం ఎక్కువగా విరాళాల రూపంలోనే అందిందని వెల్లడైంది. ఎడిఆర్ లెక్కలలో ఈసారి ప్రాంతీయ పార్టీలకు దక్కిన ఆదాయం వివరాలు వెలుగులోకి రాలేదు. 

మన తెలంగాణ 5 Mar 2026 11:10 pm

ప్రతీకారం తప్పదు

పశ్చాత్తాపం చెందాల్సిందే . అమెరికా-ఇజ్రాయిల్‌కు ఇరాన్ హెచ్చరిక. ప్రాణనష్టం కలిగిస్తారా?. ప్రతి హత్యకు గుణపాఠం చెబుతాం: అరాగ్చీ. 1,230కు పెరిగిన మతులు. 120 గంటలు దాటిన ఇంటర్నెట్ బ్లాకౌట్ తెహ్రాన్: పశ్చిమాసియా పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం ప్రపంచ దేశాల్లో ఉంది. అమెరికా`ఇజ్రాయిల్ కలిసికట్టుగా ఇరాన్‌పై భీకర దాడులు సాగిస్తుండగా… ఇరాన్ కూడా సమర్థంగా ప్రతిదాడులు చేస్తోంది. ప్రతీకారం తీర్చుకుంటోంది. అమెరికాకు అండగా నిలిచిన ఆయా దేశాల స్థావరాలను, సైనిక […] The post ప్రతీకారం తప్పదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 11:03 pm

బీహార్‌ను బీజేపీకి కట్టబెట్టిన నితీశ్

ముఖ్యమంత్రి రేసులో కేంద్రమంత్రిజేడీయూకు రెండు ఉపముఖ్యమంత్రి పదవులు? పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళుతున్నారు. గురువారం రాజ్యసభకు ఆయన నామినేషన్ దాఖలు చేసేశారు. నితీష్ కుమార్ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లిపోవడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ముఖ్యమంత్రి పీఠం బీజేపీకే దక్కుతుందని జేడీయూ వర్గాలు తెలిపాయి. రెండు ఉపముఖ్యమంత్రి పదవులు మాత్రం జేడీయూకు దక్కుతాయని ఆ […] The post బీహార్‌ను బీజేపీకి కట్టబెట్టిన నితీశ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 11:00 pm

బీహార్‌ను బీజేపీకికట్టబెట్టిన నితీశ్

ముఖ్యమంత్రి రేసులో కేంద్రమంత్రిజేడీయూకు రెండు ఉపముఖ్యమంత్రి పదవులు? పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళుతున్నారు. గురువారం రాజ్యసభకు ఆయన నామినేషన్ దాఖలు చేసేశారు. నితీష్ కుమార్ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లిపోవడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ముఖ్యమంత్రి పీఠం బీజేపీకే దక్కుతుందని జేడీయూ వర్గాలు తెలిపాయి. రెండు ఉపముఖ్యమంత్రి పదవులు మాత్రం జేడీయూకు దక్కుతాయని ఆ […] The post బీహార్‌ను బీజేపీకికట్టబెట్టిన నితీశ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 11:00 pm

ఇంగ్లండ్‌పై భారత్ ఉత్కంఠ విజయం

 టి20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఆదివారం జరిగే తుది పోరులో న్యూజిలాండ్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తలపడుతుంది. అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. జాకబ్ బెతెల్ చారిత్రక సెంచరీతో ఇంగ్లండ్‌ను దాదాపు గెలిపించినంత పని చేశాడు. క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడిన బెతెల్ 48 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 105 పరుగులు చేశాడు. మిగతా వారు విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పలేదు. సంజు విధ్వంసం.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్ సంజు శాంసన్ అండగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తూ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. కానీ వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి సంజు ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఇటు సంజు అటు ఇషాన్ తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. వరుస ఫోర్లు, సిక్సర్లతో కనువిందు చేశారు. వీరిని కట్టడి చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చెలరేగి ఆడిన ఇషాన్ 18 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన శివమ్ దూబెతో కలిసి సంజు తన జోరును కొనసాగించాడు. కళ్లు చెదిరే సిక్సర్లు, ఫోర్లతో సెంచరీ దిశగా సాగాడు. అయితే 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తృటిలో శతకం చేసే ఛాన్స్‌ను చేజార్చుకున్నాడు. మరోవైపు దూకుడుగా ఆడిన శివమ్ దూబె 25 బంతుల్లోనే ఓ ఫోర్, నాలుగు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ 12 బంతుల్లో 27, తిలక్ వర్మ 7 బంతుల్లో 3 సిక్సర్లతో 21 పరుగులు చేయడంతో భారత్ స్కోరు 250 పరుగులను దాటింది.

మన తెలంగాణ 5 Mar 2026 11:00 pm

అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండపైకి కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం సాయంత్రం కాలి నడకన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు కవిత, ఆమె భర్త అనిల్, కుమారుడు ఆదిత్య, జాగృతి నాయకులతో కలిసి అలిపిరి మెట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. నడక మార్గంలో ఆమెను చూసిన కొంతమంది ఆప్యాయంగా పలకరించారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కవిత, అక్కడి నుంచి అలిపిరికి చేరుకున్నారు. అలిపిరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో చేయని తప్పుకు తాను నాలుగేళ్లు మానసిక వేదన అనుభవించానని అన్నారు. దేవుడి దయ వల్ల న్యాయస్థానం ఈ కేసును పూర్తిగా కొట్టివేసిందని హర్షం వ్యక్తం చేశారు. కేసు నుంచి విముక్తి లభిస్తే కాలి నడకన తిరుమల వస్తానని శ్రీవారికి మొక్కుకున్నానని, తన మొక్కు చెల్లించుకోవడం కోసం ఇవాళ తిరుపతికి వచ్చానని అన్నారు.

మన తెలంగాణ 5 Mar 2026 11:00 pm

ఇండిగోలో సాంకేతిక లోపం

టేకాఫ్ సమయంలో సమస్య గుర్తించిన పైలెట్గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్మంత్రి గొట్టిపాటి, కన్నా, ప్రత్తిపాటి సురక్షితం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసుల్లో ఇటీవల సాంకేతిక లోపాలు తరచూ తలెత్తుతున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం గురువారం అత్యవసరంగా దిగింది. విజయవాడ నుంచి ప్రతిరోజూ హైదరాబాద్ వెళ్లాల్సిన రెగ్యులర్ విమానంలో బయలుదేరిన తర్వాత కొద్ది సెకన్లలోనే అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్త్తింది. రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని […] The post ఇండిగోలో సాంకేతిక లోపం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 10:55 pm

మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు

ఎపి ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడేందుకు, రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి, జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త ’జనాభా నిర్వహణ విధానం’ ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ప్రోత్సాహకం అందించాలని ప్రభు త్వం ప్రతిపాదించింది. ముసాయిదా పాలసీ వివరాలను సిఎం చంద్రబాబు వెల్లడిస్తూ మూడో బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు నెలకు రూ. 1,000 చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. పిల్లలు కనేవారిని ప్రోత్సహించేందుకు తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) 1.5కు పడిపోయిందని, ఇది ఇలాగే కొనసాగితే జపాన్, ఇటలీ మాదిరిగా వృద్ధుల జనాభా పెరిగి, యువత సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా సమతుల్యత కోసం టిఎఫ్‌ఆర్ రేటును 2.1కి పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ (కుటుంబ నియంత్రణ) నినాదం ఉండేదని, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ’పాపులేషన్ కేర్’ (జనాభా సంరక్షణ) విధా నానికి మారుతున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ఇప్పటికే కూటమి ప్రభుత్వం తొలగించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని అనే ఐదు దశల విధానంతో ప్రజలకు అండగా ఉంటామన్నారు. పిల్లలు లేనివారి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిపిపి పద్ధతిలో ఐవిఎఫ్ సేవలందిస్తామని వెల్లడించారు. ఈ పాలసీపై నెల రోజులు చర్చించి, మార్చి నెలా ఖరుకు ఖరారు చేసి ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించారు.

మన తెలంగాణ 5 Mar 2026 10:50 pm

అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్ షెడ్యూల్ విడుదల

అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌కు సంబంధించిన మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు పాల్గొంటాయి. లీగ్ దశ మ్యాచ్‌లు మార్చి 8 నుంచి ప్రారంభమై, ఫైనల్ మ్యాచ్ మార్చి 14న జరుగనుంది. పూల్-ఏలో జట్లు: ఇంగ్లాండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా. పూల్-బీలో జట్లు : భారతదేశం, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ లీగ్ దశ మ్యాచ్‌లు : మార్చి 8 (ఆదివారం) మధ్యాహ్నం 12:45 - ఇంగ్లాండ్ వర్సెస్ ఇటలీ. మధ్యాహ్నం 3:00 - కొరియా వర్సెస్ ఆస్ట్రియా, సాయంత్రం 5:15 - స్కాట్లాండ్ వర్సెస్ వేల్స్, రాత్రి 7:30 - భారతదేశం వర్సెస్ ఉరుగ్వే, మార్చి 9 (సోమవారం) మధ్యాహ్నం 12:45 - ఇటలీ వర్సెస్ ఆస్ట్రియా, మధ్యాహ్న ం 3:00 - కొరియా vs ఇంగ్లాండ్, సాయంత్రం 5:15 - ఉరుగ్వే వర్సెస్ వేల్స్, రాత్రి 7:30 - స్కాట్లాండ్ వర్సెస్ భారతదేశం, మార్చి 10 - విశ్రాంతి రోజు. మార్చి 11 (బుధవారం) మధ్యాహ్నం 12:45 - ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రియా, మధ్యాహ్నం 3:00 - ఇటలీ వర్సెస్ కొరియా, సాయంత్రం 5:15 - ఉరుగ్వే వర్సెస్ స్కాట్లాండ్, రాత్రి 7:30 - భారతదేశం వర్సెస్ వేల్స్, మార్చి 12 - విశ్రాంతి రోజు. నాకౌట్ మ్యాచ్‌లు : మార్చి 13 (శుక్రవారం) మధ్యాహ్నం 12:45 - పూల్ ఏలో 3వ స్థానం vs పూల్ బీలో 4వ స్థానం మధ్యాహ్నం 3:00 - పూల్ బీలో 3వ స్థానం vs పూల్ ఏలో 4వ స్థానం, సాయంత్రం 5:15 - సెమీ ఫైనల్: పూల్ ఏలో 1వ స్థానం vs పూల్ బీలో 2వ స్థానం, రాత్రి 7:30 - సెమీ ఫైనల్ : పూల్ బీలో 1వ స్థానం vs పూల్ ఏలో 2వ స్థానం, మార్చి 14 (శనివారం) మధ్యాహ్నం 12:45 - 7వ స్థానం మ్యాచ్, మధ్యాహ్నం 3:00 - 5వ స్థానం మ్యాచ్, సాయంత్రం 5:15 - 3వ స్థానం మ్యాచ్, రాత్రి 7:30 ఫైనల్ మ్యాచ్. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు పూల్-బీలో స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లతో పోటీ పడనుంది. లీగ్ దశలో అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

మన తెలంగాణ 5 Mar 2026 10:40 pm

నేపాల్‌లో 65 శాతం పోలింగ్

ఎన్నికలు ప్రశాంతంఖాట్మండు: నేపాల్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గురువారం ఉదయం 7 గంటలకు 165 నియోజకవర్గాల్లో గట్టి బందోబస్తుతో ఓటింగ్ మొదలైంది. గతేడాది ఓలీ ప్రభుత్వాన్ని కూల్చిన జెన్‌జీ ఆందోళన తర్వాత జరిగిన ఎన్నిక కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం 11 గంటల సమయానికి 1,823,824 ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య పది శాతంగా పేర్కొంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది. క్యూలైన్లలో ఉన్న చివరి […] The post నేపాల్‌లో 65 శాతం పోలింగ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 10:37 pm

డిమోనా అణుస్థావరం ధ్వంసం చేస్తాం: ఇరాన్

మధ్యప్రాచ్యం , విస్తారిత గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో పరస్పర అణు స్థావరాల ధ్వంసాల హెచ్చరికలు తీవ్రతరం అయ్యాయి. ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత కీలకమైన డిమోనా అణు స్థావరంపై దాడికి దిగుతామని గురువారం ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌లో నూతన నాయకత్వ ఎంపిక ప్రక్రియ భగ్నానికి అమెరికా చేస్తున్న కుట్రలపై ఇరాన్ స్పందించింది. ఇప్పటికైనా ట్రంప్, నెతన్యాహులు ఈ కుట్రలు ఆపకపోతే తమ బలగాలు డిమోనా అణు స్థావర కార్యకలాపాలను దెబ్బతీస్తామని, దీని పరిణామాలు తీవ్రస్థాయి లో ఉంటాయని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ వర్గాలు ప్రకటించాయి. ఇక మరో వైపు ఇరాన్‌లోని అత్యంత కీలకమైన అణు స్థావరాలను దెబ్బతీసేందుకు ఇప్పటికే యత్నించి వెనుకడుగు వేసిన అమెరికా ఇప్పుడు ఈ దిశలో తిరిగి కదలికలకు దిగింది. మరో వైపు ఫ్రాన్స్‌కు చెందిన అణుశక్తి సంచాలక యుద్ధ నౌక ఇప్పుడు అమెరికా మిత్రదేశాలకు సాయం కోసం సముద్ర మార్గాలలో తిష్టవేసుకుని ఉంది. ఇరాన్‌ను భారీ స్థాయిలో దెబ్బతీసేందుకు అత్యంత తీవ్రస్థాయి , ఇంతవరకూ ఎప్పుడూ వాడని అణ్వాయుధాలను రంగంలోకి దింపాలని ట్రంప్ తమ అత్యంత కీలక వ్యూహానికి పదును పెడుతున్నట్లు ఇరాన్ పసిగట్టింది. ప్కరస్తుత పరిణామాలతో అణు దాడుల ప్రకంపనలు ప్రపంచానికి సెగలు పుట్టిస్తున్నాయి. 

మన తెలంగాణ 5 Mar 2026 10:36 pm

మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా

బీజింగ్: పశ్చిమాసియా ఉద్రిక్తతలకు దౌత్య పరిష్కారమే సరైనదిగా చైనా సూచన చేసింది. యుద్ధం ముగించడానికి మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని పేర్కొంది. సంయమనం పాటించాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఎక్స్‌లో పిలుపునిచ్చారు. యూఏఈ ఉప-ప్రధాని అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సహా గల్ఫ్‌లోని ఉన్న రాజకీయ నాయకులతో ఫోన్‌లో తమ విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడినట్లు లిన్ వెల్లడించారు. జాతీయ భద్రతను కాపాడుకునే విషయంలో యూఏఈకి చైనా మద్దతు ఉందన్నారు. దౌత్యపరంగా […] The post మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 10:35 pm

యుద్ధం ఖర్చు వారానికి 3 బిలియన్ డాలర్లు

ఇజ్రాయిల్ ఆర్థిక శాఖజెరూసలేం: అమెరికాతో కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధానికిగాను తమ దేశం వారానికి మూడు బిలియన్ డాలర్ల వ్యయ భారాన్ని భరించాలని ఇజ్రాయిల్ ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఈ మేరకు హోం ఫ్రంట్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ షాయ్ క్లప్పర్‌కు ఆర్థిక శాఖ డైరెక్టర్ జనరల్ ఇలన్ రోమ్ లేఖ రాశారు. ఆర్థికపరమైన ఆంక్షలను క్రమంగా సడలించాలని కోరారు. వ్యాపారాలు, పని ప్రదేశాలు ప్రారంభం కావాలన్నారు. భద్రతా పరిస్థితి కోసం రక్షణ విధానం అక్కర్లేనప్పటికీ […] The post యుద్ధం ఖర్చు వారానికి 3 బిలియన్ డాలర్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 10:34 pm

అమెరికా ట్యాంకర్‌పై ఇరాన్ దాడి

తెహ్రాన్: పశ్చిమాసియాలో తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా దాడి చేసి… ముంచేసింది. తాజాగా ఇరాన్ దీనికి ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్‌లోని అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ మీడియా ప్రకారం పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికా ట్యాంకర్‌పై క్షిపణితో దాడి చేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటించింది. నౌక నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నట్లు వెల్లడించింది. తమ యుద్ధనౌకపై దాడికి […] The post అమెరికా ట్యాంకర్‌పై ఇరాన్ దాడి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 10:26 pm

5వేల బాంబులతో దాడి చేశాం: ఇజ్రాయిల్

టెలఅవీవ్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ భీకర పోరు కొనసాగుతోంది. తమ ఆపరేషన్ మరో రెండు వారాలు సాగుతుందని ఇజ్రాయిల్ సైన్యం సూచనప్రాయంగా తెలిపింది. ఇరాన్ పాలన, దాని సైనిక స్థావరాలను కూలదోయడమే లక్ష్యమని పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నేటి వరకు ఇరాన్‌పై ఐదు వేలకుపైగా బాంబులతో దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం గురువారం ప్రకటించింది. ఇరాన్ సైనికులు వేలాది మంది చనిపోయినట్లు వెల్లడించింది. తెహ్రాన్‌లోని అతిపెద్ద మిలిటరీ స్థావరంపై ఇజ్రాయిల్ 100కు పైగా యుద్ధ […] The post 5వేల బాంబులతో దాడి చేశాం: ఇజ్రాయిల్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 10:23 pm

ఒళ్లు గగుర్పొడిచేలా నాగచైతన్య ‘వృషకర్మ’

హైదరాబాద్: నాగచైతన్య కథానాయకుడిగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో, సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇది కేవలం నిధి వేట చుట్టూ తిరిగే అడ్వెంచర్ సినిమా మాత్రమే కాదని, దుష్టశక్తులతో కూడిన ఒక మైథలాజికల్ థ్రిల్లర్ అని ఈ గ్లింప్స్ స్పష్టం చేసింది. విడుదలైన వీడియోలో ఒక దుష్టశక్తి ఆవహించిన […] The post ఒళ్లు గగుర్పొడిచేలా నాగచైతన్య ‘వృషకర్మ’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 10:22 pm

ఆకట్టుకుంటున్న ‘మేడిన్ కొరియా’ ట్రైలర్

హైదరాబాద్: ప్రతిభ గల నటి ప్రియాంకా మోహన్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తిక్ రూపొందించిన వినూత్న చిత్రం ‘మేడిన్ కొరియా’. ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హాస్యం, భావోద్వేగాలు కలగలిసిన ఒక వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి చెందిన యువతికి దక్షిణ కొరియా వెళ్లాలనేది జీవిత లక్ష్యం. అసలు బాల్యంలోనే ఆమె ఆ దేశానికి వెళ్లాలని ఎందుకు […] The post ఆకట్టుకుంటున్న ‘మేడిన్ కొరియా’ ట్రైలర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 10:20 pm

19న థియేటర్లలో ‘ఉస్తాద్ భగత్ సింగ్‌‘

హైదరాబాద్ : సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్‌‘ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్లు, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న […] The post 19న థియేటర్లలో ‘ఉస్తాద్ భగత్ సింగ్‌‘ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 10:17 pm

భారత్‌తో సిరీస్ ఆడటమే కలిసొచ్చింది

కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్కోల్‌కతా: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఇప్పటివరకు ఈ టోర్నీలో అపజయం ఎరుగని దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (33 బంతుల్లో 100 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 170 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఏకంగా 43 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘన […] The post భారత్‌తో సిరీస్ ఆడటమే కలిసొచ్చింది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 10:11 pm

దిగొస్తున్న బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,000 తగ్గి రూ.1.60 లక్షలకు చేరుకుంది. గత రెండు రోజుల్లో బంగారం ధర మొత్తం రూ.7,000 తగ్గింది. ఒక కిలో వెండి ధర కూడా రూ.13,000 తగ్గి రూ.2.58 లక్షలకు పడిపోయింది. రెండు రోజుల్లో వెండి ధర మొత్తం రూ.32,000 తగ్గింది. లాభాల బుకింగ్ కారణంగా ఈ తగ్గుదల వచ్చిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధర సుమారు రూ.26,000, వెండి ధర రూ.27,000 పెరిగాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే లేదా ముడి చమురు ధరలు పెరిగితే బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణుల పేర్కొంటున్నారు.

మన తెలంగాణ 5 Mar 2026 10:10 pm

హోటల్ మహిళా సిబ్బందితోపాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన

సారీ చెప్పిన మేనేజర్!కొలంబో: టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన పాకిస్థాన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. పాక్ జట్టులోని ఓ ఆటగాడు హోటల్‌లో పనిచేసే మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జట్టు ప్రతిష్టను మరోసారి దెబ్బతీసేలా మారింది. శ్రీలంకలోని క్యాండీ నగరంలో ఉన్న ఒక హోటల్‌లో పాకిస్థాన్ జట్టు తాత్కాలికంగా బస చేసింది. అదే సమయంలో ఓ ప్లేయర్ హౌస్‌కీపింగ్ విభాగంలో పనిచేసే మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు. […] The post హోటల్ మహిళా సిబ్బందితోపాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 10:10 pm

అమెరికా వాణిజ్య ఉచ్చులో మోదీ

రాజన్ క్షీరసాగర్ అమెరికా-భారత్ మధ్య కుదిరింది వాణిజ్య ఒప్పందం కాదు దేశాన్ని తాకట్టు పెట్టే లొంగుబాటు చర్య. అమెరికా వాణిజ్య ఉచ్చులో మోదీ పడిపోవడమే కాదు దేశాన్ని కూడా పడేసారు.అమెరికా పత్రాలపై మంత్రులు, ప్రధానులు సంతకాలు చేసి ఈ ఒప్పందాన్ని దౌత్య విజయంగా చెప్పుకుంటున్నారు కానీ పంట పండించే రైతులు, ప్రజలు మూల్యం చెల్లించుకునే స్థితికి తెచ్చాడు మోదీ. రాత్రికి రాత్రి పెద్దన్నతో చేతులు కలిపేశాక గోదీ మీడియా తెల్లార్లు కోడై కూసేసింది. భారతదేశం 500 బిలియన్లకు […] The post అమెరికా వాణిజ్య ఉచ్చులో మోదీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 10:01 pm

కార్పొరేట్లకు కౌగిలింతలు…రైౖతులకు సంకెళ్లు

డా॥ సూర్యదేవర రామకృష్ణ భారతదేశం అమృతకాలం వైపు అడుగులు వేస్తోంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే ఆశయంతో పరుగులు తీస్తోంది. ఈ ప్రయాణంలో బ్యాంకింగ్ రంగం ఒక ఇంజిన్ లాంటిది. ప్రజల రక్తం, చెమట రంగరించి దాచుకున్న పొదుపు సొమ్మును పెట్టుబడిగా మార్చి, దేశాభివృద్ధికి మళ్లించాల్సిన బాధ్యత ఈ వ్యవస్థపై ఉంది. అయితే, ఈ వ్యవస్థ పనితీరుపై ఇప్ప్పుడు ఒక ప్రశ్న ఎదురవుతోంది. వేల కోట్ల రూపాయలు ఎగవేసిన కార్పొరేట్ దిగ్గజాలకు రెడ్ కార్పెట్ […] The post కార్పొరేట్లకు కౌగిలింతలు…రైౖతులకు సంకెళ్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 10:01 pm

నాగబంధం నుంచి మొదటి పాట వచ్చేస్తోంది

పాన్ -ఇండియన్ మూవీ నాగబంధం అద్భుతమైన కంటెంట్ తో సంచలనం సృష్టిస్తోంది. అభిషేక్ నామా దర్శకత్వంలోఎన్‌ఐకె స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటించారు. మార్చి 15న ఉదయం 11:11 గంటలకు నాగబంధం ఫస్ట్ సింగిల్ ‘నమో రే’ రిలీజ్ కానుంది. ఈ పాట నారాయణుడికి నివాళిగా ఆధ్యాత్మికతతో రూపుదిద్దుకుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న నాగబంధంలో నమో రే సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పాటలో ఏకంగా 1,000 మంది డ్యాన్సర్లు పాల్గొంటూ, భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించే అద్భుతమైన విజువల్ వండర్‌గా రూపొందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్లు గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ అద్భుతమైన కోరియోగ్రఫీ చేశారు. నమో రే పాటకు సంగీతాన్ని జునైద్ కుమార్, - అభే జంట అందించగా,భక్తి భావం, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా డ్రీమీ మ్యూజికల్ ట్రీట్ కంపోజ్ చేశారు. గేయ రచయిత శ్రీహర్ష ఇమాని రాసిన సాహిత్యం పాట థీమ్‌ను అద్భుతంగా చూపిస్తోంది. గాయకులు సింధుజా శ్రీనివాసన్, ఐశ్వర్య దారురి ఈ పాటకు ప్రాణం పోశారు. సాంగ్ పోస్టర్‌లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌లను సాంప్రదాయ వేషధారణలో అద్భుతంగా కనిపించడం పాటలోని గ్రాండియర్‌ను చూపిస్తోంది. ఈ పాటను అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే భారీ సెట్లో చిత్రీకరించడం ద్వారా విజువల్‌గా మరింత వైభవాన్ని అందించారు. నాగబంధం వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.

మన తెలంగాణ 5 Mar 2026 10:00 pm

బెంగాల్ గవర్నర్ ఆనంద రాజీనామా

 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల దరిదాపుల్లో అత్యంత నాటకీయ పరిణామం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్ గురువారం రాజీనామా చేశారు. ఇదే సమయంలో లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా కూడా తమ పదవికి రాజీనామా చేశారు. ఆయన జమ్మూ కశ్మీర్‌కు చెందిన సీనియర్ బిజెపి నేతగా సేవలు అందించారు. ఉన్నట్లుండి ఇద్దరు రాజ్యపాలకుల రాజీనామాల సమర్పణ జాతీయ స్థాయిలో ప్రకంపనలకు దారితీసింది. అయితే ఇది హోం మంత్రి అమిత్ సా వ్యూహాత్మక కదలిక అని రాజకీయ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో ముందుగా బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ తమ రాజీనామా ప్రకటించారు. రాజీనామాకు దారితీసిన కారణాలను ఆనంద్ వెల్లడించలేదు. తన రాజీనామా వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? వ్యక్తిగత కారణాలు ఇందుకు దారితీశాయా? అనేది ఆయన వెల్లడించలేదు. గురువారం ఉదయమే ఆనంద బోస్ రాష్ట్రపతికి తమ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ప్రస్తుత పరిణామంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ ముందు విస్మయం వ్యక్తం చేశారు.పలు విషయాలపై బెంగాల్‌లో ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు విభేదాలు అనేక దశల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. రాజ్‌భవన్ , సిఎం ఆఫీసు మధ్య హోరాహోరి పరిస్థితి ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయి. గవర్నర్ రాజీనామా తనకు దిగ్భ్రాంతి కల్గించిందని మమత బెనర్జీ తెలిపారు. తనకు తెలిసిన దాని ప్రకారం తమిళనాడు గవర్నరు ఆర్‌ఎన్ రవి ప్రస్తుతానికి బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు తీసుకుంటారని, అయితే ఈ విషయం నిర్థారణ కాలేదని మమత విలేకరులకు తెలిపారు. హోం మంత్రి అమిత్ షా సూచనప్రాయంగా ఈ విషయం చెప్పారని వివరించారు. బోస్ బెంగాల్ గవర్నర్‌గా 2022 నవంబర్ 17న నియమితులు అయ్యారు. మూడున్నర ఏండ్లు రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నానని, ఇక చాలునని బోస్ తమ రాజీనామా ధృవీకరణ సందర్భంగా మీడియాకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల దశలో రాజకీయ ఒత్తిళ్లతోనే ఆనంద బోస్ పదవి నుంచి వైదొలిగినట్లు వార్తలు వెలువడ్డాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒత్తిడితోనే ఆనంద బోస్ రాజీనామా చేశారని మమత బెనర్జీ విమర్శించారు. ఇంతకు మించి దీనిపై ఎక్కువగా స్పందించలేదు. తమకు గవర్నర్‌తో వివాదాలు ఉన్నప్పటికీ రాజీనామాలు, నియమాకాల విషయంలో కేంద్రం పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతైనా సమాఖ్యవాదం పాటించాల్సి ఉందని మమత బెనర్జీ మోడీ సర్కారుపై పనిలో పనిగా మండిపడ్డారు.కాగా ఇప్పుడు రాజీనామాకు దిగిన లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా గత ఏడాది జులైలో ఈ పదవికి వచ్చారు. గుప్తా జమ్మూ కశ్మీర్‌కు చెందిన బిజెపి సీనియర్ నాయకుడు. పార్టీకి గడ్డుపరిస్థితుల్లోనూ సేవలందించారు. గతంలో జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. 

మన తెలంగాణ 5 Mar 2026 9:49 pm

గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఎపిలోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి హైద రాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానం లో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. విమానం రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్, విమానాన్ని రన్‌వేపైనే అత్యవసరంగా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పి నట్లు తెలుస్తోంది. ఈ విమానంలో సుమారు 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయ్యే విమానం ఒక్కసారిగా నిలిచిపో వడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానంలో ఉన్న వారిలో హైదరాబాద్‌లో భట్టి విక్రమార్క కుమారుడు వివాహానికి బయల్దేరిన ఎపిరాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవి, ఎంఎల్‌ఎలు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ఇండిగో అధికారులు ఆ విమాన సర్వీసును తక్షణం రద్దు చేశారు. ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేసి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చేస్తామని ఇండిగో అధికారులు వెల్లడించారు. దీంతో మంత్రి గొట్టిపాటి రవి, ఎంఎల్‌ఎలు రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరారు.

మన తెలంగాణ 5 Mar 2026 9:43 pm

మరోసారి చిక్కుల్లో పడిన దివ్వెల మాధురి

బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి మరోసారి చిక్కుల్లో పడింది. ఏడుకొండలపై గెస్ట్ హౌస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్‌డే వేడుకలను మాధురి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇప్పుడు ఇదే ఆమెను చిక్కుల్లో పడేసింది. ఎందుకంటే తిరుమల కొండపైకి కేక్‌లు తీసుకెళ్లడం నిషేధం. మరి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కొండపైకి మాధురి ఎలా బర్త్ డే కేక్ తీసుకెళ్లారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై టిటిడి విజిలెన్స్ కూడా ఆరా తీస్తోంది. అంతకు ముందే వీరు తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ ఇదే తిరుమల శ్రీవారి ఆలయం సాక్షిగా వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి దంపతులు. మాడ వీధుల్లో సోషల్ మీడియా రీల్స్, వీడియోలు చేసి వాటిని నెట్టింట షేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మాధురిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇక లేటెస్ట్ గా తన క్లోజ్ ఫ్రెండ్, బిగ్ బాస్ విన్నర్ తనూజ కోసం బర్త్ డే కేక్ తెప్పించి కట్ చేయించింది. అంతేకాదు తనూజకు చీర గాజులతో పాటు బంగారు కమ్మలను కూడా బహుమ తిగా ఇచ్చింది. తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో దివ్వెల మాధురి షేర్ చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే బంగా రం.. మై స్వీట్ హార్ట్ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకొంటోన్న ఫస్ట్ బర్త్‌డే! నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగివచ్చావు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను’ అని తనూజకు విషెస్ చెప్పింది. ఈ పోస్ట్ కు స్పందించిన తనూజ కూడా థ్యాంక్యూ మ్యాడీ అని రిప్లై ఇచ్చింది. ఈ వీడి యో కాస్తా వైరల్ కావడంతో అనుకోకుండా మాధురి వివాదంలో చిక్కుకుంది. 

మన తెలంగాణ 5 Mar 2026 9:41 pm

నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చిట్యాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Mar 2026 9:21 pm

సర్పంచ్‌ చొరవతో తీరిన భగీరథ లీకేజీల సమస్య..

సర్పంచ్‌ చొరవతో తీరిన భగీరథ లీకేజీల సమస్య.. భీమ్‌గల్‌ రూరల్‌, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Mar 2026 9:16 pm

కలెక్టర్ హనుమంతరావుకి వీడ్కోలు…

కలెక్టర్ హనుమంతరావుకి వీడ్కోలు… మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్

ప్రభ న్యూస్ 5 Mar 2026 9:12 pm

Viral Now: Vijay and Trisha Spotted Together

Ilayathalapathy Vijay’s wife Sangeetha has filed a divorce petition after 28 years of marriage. She alleged that Vijay is in a relationship with an actress. After Vijay’s political entry, several politicians made open statements about the relationship of Vijay and Trisha. The duo is now spotted together attending a wedding reception and the video is […] The post Viral Now: Vijay and Trisha Spotted Together appeared first on Telugu360 .

తెలుగు 360 5 Mar 2026 9:12 pm

మిస్సింగ్ విద్యార్థి దొరికిండు

మిస్సింగ్ విద్యార్థి దొరికిండు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మహాత్మా

ప్రభ న్యూస్ 5 Mar 2026 9:07 pm

Telangana Speaker Questions Kadiyam Srihari in Defection Case, Hearing of Danam Nagender Postponed

The inquiry into the party defection moved forward on Thursday when the Speaker of the Telangana Legislative Assembly Gaddam Prasad Kumar questioned senior leader Kadiyam Srihari. The hearing lasted for several hours and concluded on Thursday evening. The inquiry is part of the ongoing examination of complaints related to legislators who were accused of switching […] The post Telangana Speaker Questions Kadiyam Srihari in Defection Case, Hearing of Danam Nagender Postponed appeared first on Telugu360 .

తెలుగు 360 5 Mar 2026 9:06 pm

పాదయాత్ర రోజులను మరువని ఉప ముఖ్యమంత్రి…

పాదయాత్ర రోజులను మరువని ఉప ముఖ్యమంత్రి… ఉప ముఖ్యమంత్రి భట్టి తనయుడి వివాహ

ప్రభ న్యూస్ 5 Mar 2026 9:04 pm

దంపతుల ఆత్మహత్యాయత్నం

దంపతుల ఆత్మహత్యాయత్నం నవాబుపేట, ఆంధ్రప్రభ : మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:54 pm

ఇంగ్లండ్‌ టార్గెట్ 254

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా 253 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పొయి 253 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్(89: 42 బంతుల్లో 8 ఫోర్లు,7 సిక్స్ లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 2 ఫోర్లతో 9 పరుగులు మాత్రమే విల్ జాక్స్ బౌలింగ్‌లో చేసి ఔట్ అయ్యాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ శాంసన్ మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరు కలిసి 97 పరుగులు జోడించారు.అదిల్ రషీద్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ (39:18 బంతుల్లో 4ఫోర్లు,2 సిక్స్ లు)భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. అనవసర పరుగు కోసం యత్నించిన శివమ్ దూబె(43: 25 బంతుల్లో 1 ఫోరు, 4 సిక్స్ లు) రనౌట్ గా పెవిలియన్ కు చేరాడు. సూర్యకుమార్ యాదవ్(11), హార్ధిక్ పాండ్యా(27),తిలక్ వర్మ(21) పరుగులు చేశారు. ఇంగ్లాడ్ బౌలర్లలో విల్ జాక్స్ 2, అదిల్ రషీద్ 2, జోప్రా ఆర్చర్ ఒక వికెట్ తీశాడు.

మన తెలంగాణ 5 Mar 2026 8:52 pm

బైక్, కారు ఢీ .. ఇద్దరు యువకులు మృతి

బైక్, కారు ఢీ .. ఇద్దరు యువకులు మృతి రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:42 pm

ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చాలా ముఖ్యం

ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చాలా ముఖ్యం రాప్తాడు, ఆంధ్రప్రభ : విద్యార్థిని విద్యార్థులకు

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:40 pm

పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పై హర్షం…

పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పై హర్షం… ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:37 pm

భారీ ట్రాఫిక్ జామ్ అంటూ ప్రచారం

భారీ ట్రాఫిక్ జామ్ అంటూ ప్రచారం వాస్తవాలు వెల్లడించిన ట్రాఫిక్ పోలీసులు.. విజయవాడ

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:32 pm

టోలీ చౌకీ భవన ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

 హైదరాబాద్, టోలీచౌకి భవన ప్రమాదంపై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న భవన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం, మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడం కలిచివేసిందన్నారు. ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిర్మాణ ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా అధికారులు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

మన తెలంగాణ 5 Mar 2026 8:24 pm