రంజాన్ కానుకలు.. -ముస్లిం సోదరులకు ఈద్ కానుకలు అందజేత-పాల్గొన్న సర్పంచ్ మంతెన హరిత
రైతు ఉత్సవాలకు రేవంత్ కు ఆహ్వానం
ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు
ఆత్మయోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. కోడూరు, ఆంధ్రప్రభ : ఆత్మ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
Chandrababu : నేడు తిరుమలకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు వెళ్లనున్నారు
ఉత్తమ నటి, నటుడుగా గద్దర్ అవార్డులను అందుకున్న రష్మిక, నాగచైతన్య. #Rashmika #RevanthReddy
Tirumala : తిరుమలకు వచ్చేభక్తులు నేడు రెండు కిలోమీటర్లకు అవతలే
తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది
Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది.
Uttar Pradesh : భయపడిన భర్త...ప్రియుడితో భార్యను పంపించిన వైనం
ఉత్తర ప్రదేశ్లో విచిత్రమైన ఘటన జరిగింది
ప్రధాన కార్యదర్శిగా పి సతీష్ రెడ్డి నియామకం..
ప్రధాన కార్యదర్శిగా పి సతీష్ రెడ్డి నియామకం.. కడెం ( నిర్మల్ జిల్లా),
క్షణికావేశంలో ఆత్మహత్య... ఇద్దరికి వెలుగునిచ్చిన వర్షితా
మరణించి జీవిస్తున్న వర్షిత ఇద్దరు అందులకు చూపినిచ్చిన జనహిత సేవా సమితి మన తెలంగాణ / బెల్లంపల్లి టౌన్ : తాను మరణించినా ఇద్దరు అందులకు వెలుగునిచ్చిన వర్షిత కుటుంబాన్ని జనహిత సేవా సమితి అభినందించారు. బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్ బస్తీకి చెందిన లింగంపెల్లి వర్షిత (12) ఆత్మహత్య చేసుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్లు వారి కుటుంబ సభ్యులను కలిసి వర్షిత నేత్రాలను నేత్రదానం చేయడానికి సభ్యులను ఒప్పించారు. కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండి ఇద్దరు అంధులకు జీవితంలో వెలుగులు నింపిన వర్షిత కుటుంబాన్ని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షులు ఆడెపు సతీష్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి రమేష్లు మాట్లాడుతూ... సమాజహితం కోరి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు వారి కూతురు నేత్రాలను దారం చేయడం సంతోషకరమన్నారు. జనహిత సేవా సమితి తరుపున ఇప్పటి వరకు 12 నేత్ర దానాల కార్యక్రమాలు నిర్వహించారు. వారి కుటుంబ స్ఫూర్తితో ప్రజలందరు మరణించిన తర్వాత అవయవాలను దానం చేసి సమాజానిక ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని వారు కోరారు. సదాశయ ఫౌండేషన్ వారి సహకారంతో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకు సిబ్బంది నేత్రాలను స్వీకరించి వారి కుటుంబాన్ని అభినందించారు. జనహిత సేవా సమితి ఆద్వర్యంలో 8 మంది ప్రాణాలను కాపాడే అవకాశం, రక్తదానంతో ఎంతో స్పూర్తిదాయకంగా వైద్యశాలకు వారి మృతదేహాన్ని అందిస్తే వైద్య విద్యార్ధులకు బోధనకు ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ప్రజలందరు అపోహలు వీడి నేత్ర, అవయవ, శరీర దానాలకు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి సభ్యులు అంధుల రాజన్న, ఎల్ వి ప్రసాద్ బ్యాంకు సిబ్బంది, జనహిత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. వర్షిత తన స్నేహితురాలుకు ఆర్థిక సాయం చేసింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు కానీ డబ్బులు ఎలా ఇస్తావని తండ్రి ఆమెను ప్రశ్నించడంతో వర్షిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
20thMarchCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
20thMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 20thMarchCartoon | గ్యాస్ సంక్షోభం తీవ్రత
فیکٹ چیک: کیا اسرائیلی رپورٹر نے نیتن یاہو کی موت کی تصدیق کی؟ جانئے وائرل دعوے کی سچائی
وائرل پوسٹس میں دعویٰ کیا گیا کہ اسرائیلی رپورٹر نے نیتن یاہو کی موت کی تصدیق کی ہے۔ فیکٹ چیک سے واضح ہوا کہ ویڈیو میں ایریئل کے میئر کو نیتن یاہو کی موت نہیں بلکہ ایرانی حملے میں تباہ شدہ مکان کا جائزہ لیتے دکھایا گیا ہے۔
America - Israel - Iran War : యుద్ధంతో నిలిచిన చమురు రవాణా.. ప్రపంచంలో ఇంధన కొరత
అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతుంది
Israel - Iran War : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్రం.. ఇంకా ఎన్నాళ్లు?
ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఇరవై రోజులయింది
యోగా గురువుకు ఉగాది పురస్కారం..
యోగా గురువుకు ఉగాది పురస్కారం.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : యోగా – సేవా
పూజల పేరుతో మహిళపై పలుమార్లు అత్యాచారం.... 58 అశ్లీల వీడియోలు వెలుగులోకి
ముంబయి: పూజల పేరుతో ఓ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అశోక్ ఖరాత్(67) అనే వ్యక్తి పూజలు చేయడంతో పాటు జ్యోతిష్యం చెప్పేవాడు. తన వద్దకు బాధలతో వచ్చిన వారికి పూజాలతో సమస్యలను పరిష్కరించేవాడు. నాసిక్ లో ఆధ్యాత్మిక వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది. అతడి నుంచి రాజకీయాలు ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఓ మహిళకు ఇంట్లో సమస్యలు ఉండడంతో అతడిని కలిసి తన బాధాలను చెప్పుకుంది. పూజల పేరుతో మహిళకు మత్తు మందు ఇచ్చారు. అనంతరం ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. మత్తు మందు ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అశోక్ ఇంట్లో ఉన్న పెన్ డ్రైవ్ తో పాటు లాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు. పెన్ డ్రైవ్ లో 58 అసభ్యకరమైన వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అశోక్ కుమార్ బెడ్ రూమ్ లో రహస్య కెమెరాలు ఉన్నట్టు గుర్తించారు. గతంలో తాను నేవీ లో పని చేశానని అందరికి చెప్పుకునేవాడు.
చిట్యాల సుజన థియేటర్లో ఉద్రిక్తత..
చిట్యాల సుజన థియేటర్లో ఉద్రిక్తత.. చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల
దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది బాధ్యతల మార్పులు..
దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది బాధ్యతల మార్పులు.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి
రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు..
రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు.. చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల
ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే హై దరాబాద్ సురక్షిత ప్రాంతమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సింగిల్ విండో విధానం అమలులోకి తెస్తున్నామని చె ప్పారు. ప్రపంచ సినీ పరిశ్రమను హైదరాబాద్ను హబ్గా మార్చడానికి కృషిచేస్తున్నట్లు వెల్లడించా రు. గురువారం రాత్రి హైదరాబాద్లో జరిగిన గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చార్మినార్కు నాలు గు మీనార్లు ఎలాగో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఎన్టిఆర్, ఎఎన్ఆర్, కృష్ణ, రామానాయుడు అమితంగా కృషి చేశారని పేర్కొన్నారు. హై దరాబాద్ బిర్యానీకే కాదు దేశంలో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సౌత్ కొరియా తరహాలో మా ప్ర భుత్వం సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఇండియన్ సినిమా హైదరాబాద్ కేంద్రంగా పని చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గద్దర్ ప్రజా యుద్ధ నౌక అని, ఆయన పిలుపుతో లక్షలాది మం ది కదిలేవారన్నారు. గద్దర్ తన గళంతో అనేక ఉ ద్యమాలకు ఊపిరిపోశారన్నారు. గద్దర్ పేరు మీ దుగా అవార్డులు ఇవ్వడం మా బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. సినీ పరిశ్రమకు గుర్తింపునివ్వాలని భావించామన్నారు. చెన్నై నుంచి సినీ పరిశ్రమను హైదరాబాద్ తరలించేందుకు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. సినీ పరిశ్రమకు దాసరి నారాయణ రావు పెద్దగా వ్యవహరించారని పేర్కొన్నారు. సినీకార్మిక పక్షపాతిగా నటుడు ప్రభాకర్ రెడ్డి గొప్ప పనులు చేశారని కొనియాడారు. సినీ పరిశ్రమ హైదరాబాద్లోనే వేళ్లూనుకునేందుకు రామోజీరావు తీవ్రంగా కృషి చేశారని అన్నారు. ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికుల కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చి ఆదుకున్నారని, ఆనాడు సినీ రంగంలో ఏ సమస్య వచ్చినా ముందుండే దాసరి నారాయణ రావుని స్మరించుకోవాల్సినా అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ సినీ హబ్ గా తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇటీవల నెట్ ఫ్లిక్స్ తమ సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని సిఎం తెలిపారు. నెట్ ఫ్లిక్స్ వచ్చిందంటే హైదరాబాద్కు హాలీవుడ్ వచ్చినట్టేనని చెప్పారు. గద్దర్ ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి అని, తన పాటతో వేలాది మందిలో చైతన్యం తీసుకువచ్చిన ఆయన పేరుతో ఈ అవార్డులు ఇవ్వడం సంతోషకరమని అన్నారు. సినిమా అనేది మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ అని, సమాజాన్ని చైతన్యపరిచేందుకు సినిమాను సాధనంగా ఉపయోగించు కోవాలన్నారు. సామాజిక బాధ్యతను గుర్తెరిగి గద్దర్ స్ఫూర్తితో సామాజిక సమస్యలను పరిష్కరానికి సినిమా ద్వారా సందేశం అందించాలని సూచించారు. తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి ఎదిగింది : భట్టి తెలంగాణ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసిన మహానీయుడు గద్దర్ అని. ఆయన పేరిట అవార్డులు ఇవ్వడం అంటే ప్రభుత్వ ఆలోచన ఏమిటో ప్రపంచానికి చెప్పడమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని, అనేక సందేశాత్మక సినిమాలు ప్రజల్లో మార్పునకు నాంది పలికాయన్నారు. తెలుగు సినిమా తెలంగాణకే పరిమితం కాకుండా ప్రపంచానికే తలమానికం కావాలని సిఎం రేవంత్ రెడ్డి గద్దర్ పేరిట సినిమా అవార్డులను తిరిగి ప్రారంభించారన్నారు. గత పాలకులు 10సంవత్సరాల పాటు సినిమా అవార్డులు ఇవ్వలేదని చెప్పారు. ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు, సినీ నటులు చిరంజీవి, కమల్హసన్, అక్కినేని నాగార్జున, అమల, జయసుధ, కుష్బు, అల్లు అర్వింద్, అశ్వినీదత్ తదితరులు పాల్గొన్నారు.
రూ.3.26 లక్షల కోట్లతో నేడు బడ్జెట్
మన తెలంగాణ/హైదరాబాద్: నేడు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం రూ.3.26 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపె ట్టే అవకాశం ఉందని తెలిసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే, ఈ బడ్జెట్లో ప్రధానంగా ప్రభుత్వం మూడు రంగాలు, ఆరు పథకాలపై దృష్టి పెట్టినట్లుగా సమాచారం. దీంతోపాటు తెలంగాణ విజన్- 2047 డాక్యుమెంట్లో ని పలు అంశాలకు సంబంధించి ప్రత్యేక నిధు లు కేటాయించనున్నట్టుగా తెలిసింది. నేడు ఉ.9:30 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ అయి బ డ్జెట్కు ఆమోదం తెలిపిన తర్వాత మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్కు సంబంధించి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే అధికారులతో సమావేశమై రం గాల వారీ కేటాయింపులు, కొత్త పథకాల ప్రకట న, అంచనాలను ఖరారు చేశారు. అయితే, కేటాయింపులు, పథకాలకు సంబంధించి సిఎం రేవంత్రెడ్డి కీలక మార్పులు సూచించడంతో ఈ ప్రతిపాదనలను డిప్యూటీ సిఎం భట్టి ఖరారు చేసినట్టుగా తెలిసింది. సంక్షేమం, అభివృద్ధి, దీర్ఘకాలిక వృద్ధి అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వం రూపొందించినట్లుగా తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడో బడ్జెట్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడో బడ్జెట్. ఈ నేపథ్యంలోనే ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా అ మల్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే, రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త పథకాలను కూడా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలిసింది. కొత్త పథకాల్లో భా గంగా విద్యార్థుల కోసం యంగ్ ఇండియా కి ట్స్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లతో సహా ఆ రు కొత్త పథకాలను ప్రభుత్వం ప్రకటించనున్నట్టుగా సమాచారం. అయితే, రాష్టంలో కీలకమై న సంక్షేమం, వ్యవసాయం, నీటి పారుదల రం గాలకు సైతం బడ్జెట్లో ప్రభుత్వ పెద్దపీట వేయనున్నట్లుగా తెలిసింది. ఈ రంగాలకు భారీగా కేటాయింపులు చేయనున్నట్లుగా సమాచారం. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించినట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థినీలకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లు యంగ్ ఇండియా కిట్స్ కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో సంక్షేమ హాస్టళ్ల నుంచి సమీకృత గురుకుల సంస్థల వరకు ఉన్న విద్యార్థినీలకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను అందించడమే ప్రభుత్వ ఉద్ధేశ్యంగా తెలుస్తోంది. ఎన్నికల హామీలకు అనుగుణంగా, ప్రభుత్వం బాలికా విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ, పాడి రైతులకు రాయితీపై పశువుల సరఫరాను కూడా ఈ బడ్జెట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆర్థిక సాధికారతపై దృష్టి సారించడంతో పాటు, మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమానికి ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్టుగా సమాచారం. కాలేజీ యువతులకు ఈవీ స్కూటీలను.. గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది. వచ్చే ఏడాది ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాదితో పోలిస్తే ఈసారి కాస్త అధికంగానే సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఈసారి బడ్జెట్ రూ.3.26 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ బడ్జెట్లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళా సంక్షేమం, సన్న బియ్యం కోసం భారీగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం అయినట్లుగా సమాచారం. ఇక, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కోసం ఈ బడ్జెట్లో నిధులను కేటాయించనున్నట్టు తెలిసింది. వీటితో పాటు తుమ్మిడిహెట్టి, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, కొడంగల్ నారాయణ్పేట్ ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్బిసిలకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాలేజీ యువతులకు ఈవీ స్కూటీలను ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో దీనికోసం నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమ యుద్ధం అత్యంత భీకర రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఆయా దేశాల్లోని సైనిక, వైమానిక, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యక్తులనే లక్షంగా చేసుకున్న ఇరు పక్షాలు తాజాగా ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇజ్రాయె ల్ తన కీలక సహజ వాయు క్షేత్రంపై దాడి చేసిన నేపథ్యంలో, ఇరాన్ ప్రతీకార చర్యల ను మరింత ముమ్మరం చేసింది. గురువా రం గల్ఫ్ ప్రాంతంలోని పలు ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జ రిపింది. సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్ర తీరంలోని రిఫైనరీపై దాడి చేయగా ఖతార్లోని ఎల్ఎన్జీ కేంద్రాల్లో, కువైట్లోని రెం డు చమురు శుద్ధి కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ పరిణామాలు మ ధ్యప్రాచ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చే శాయి. గురువారం నాడు ఖతార్ రాజధాని దోహాకు దగ్గర్లోని రస్ లఫాన్లో ఉన్న అత్యంత భారీ గ్యాస్ చమురు క్షేత్రంపై దాడి చేసింది. ఇక్కడి నుంచే ఆసియా, ఐరోపా ఖండాలకు భారీ మొత్తంలో ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయు క్షేత్రంగా భావించే సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇరాన్ దాడులకు దారి తీసింది. ఇరాన్ విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 80 శాతం దీనిపైనే ఆధారపడటం వల్ల, ఈ దాడి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కువైట్లోని మీనా అల్- అహ్మది రిఫైనరీపై డ్రోన్ దాడితో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా, సమీపంలోని మీనా అబ్దుల్లా రిఫైనరీ కూడా మంటల్లో చిక్కుకుంది. సౌదీలోని అరామ్ కో రిఫైనరీపై కూడా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరానికి సమీపంలో ఒక నౌక అగ్నికి ఆహుతి అయ్యింది. ఖతార్ సమీపంలో మరో నౌక దెబ్బతింది. హార్ముజ్ మార్గాన్ని తప్పించేందుకు సౌదీ అరేబియా ఎర్ర సముద్ర మార్గం ద్వారా చమురు సరఫరాను పెంచుతుండగా యన్బూ నగరంలోని సమ్రెఫ్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో ఆ రహదారి భద్రత ప్రశ్నార్ధకమైంది. అబూదాబిలోని హబ్షాన్ గ్యాస్ సదుపాయం, బాబ్ ఆయిల్ ఫీల్డ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇరాన్ దాడులను అధికారులు ప్రమాదకర ఉద్రిక్తత పెరుగుదలగా అభివర్ణించారు. ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి. సౌదీ విదేశాంగ మంత్రి ఇప్పుడు ఉన్న కొద్దిపాటి నమ్మకమూ పోయింది అని వ్యాఖ్యానించారు. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్లో పలు ప్రాంతాల్లో ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగడంతో లక్షలాది ప్రజలు బంకర్లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. వెస్ట్బ్యాంక్లో జరిగిన దాడిలో నలుగురు పౌరులు మృత్యువాతపడ్డారు. కొన్ని భవనాలకు నష్టం కలిగినప్పటికీ, పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగలేదు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 20కిపైగా నౌకలపై దాడులు జరిగినట్లు సమాచారం. హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా తీవ్రంగా తగ్గిపోయింది. ఇరాన్లో ముగ్గురికి మరణశిక్ష జనవరిలో జరిగిన నిరసనల సమయంలో అరెస్టైన ముగ్గురికి ఇరాన్ మరణదండన విధించి అమలు చేసింది. మానవ హక్కుల సంఘాలు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్లో 1,300 మందికి పైగా మరణించగా, లెబనాన్లో సుమారు 968 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్లో 15 మంది మృతి చెందారు. అమెరికా సైనికుల్లో కనీసం 13 మంది మరణించినట్లు సమాచారం. చమురు ధరలపై ప్రభావం ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్కు 114 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి చమురు ధరలు దాదాపు 57 శాతం పెరిగాయి. మరోవైపు హర్మూజ్ నుంచి తమ అనుమతితో వెళ్తున్న పలు దేశాల నౌకలపై టోల్ విధించాలని ఇరాన్ భావిస్తోంది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్న ఇరాన్ చట్ట సభ్యుడొకరు వెల్లడించారు. తదునుగుంణగా బిల్లులు తీసుకురానున్నట్టు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఇజ్రాయెల్, అమెరికా నౌకలపై హర్మూజ్ను జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ భవిష్యత్తు కార్యచరణను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో కాంగ్రె స్ పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ శరవేగంగా చర్య లు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) నియామక ప్రక్రియల కు శ్రీకారం చుట్టింది. మొదటి విడతగా రాష్ట్రంలోని 14 జిల్లా లకు సంబంధించి పూర్తి స్థాయి కార్యవర్గ కమిటిలను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గురువారం ప్రకటిం చారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచే ఈ కమిటీల నియామకంపై పార్టీలో అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. నియామకాల్లో ఎలాంటి అసమ్మతి తలెత్తకుండా ఉండేందుకు బుధవా రం రాత్రి వరకు సుదీర్ఘ కసరత్తు చేసి, అన్ని జి ల్లాలకు సంబంధించి స్థానిక ఎంఎల్ఎలు, ని యోజకవర్గ ఇంచార్జీలతో చర్చించి, వారిని స మన్వయ పరుస్తూ ఈ జాబితాను రూపొందించారు. గతంలో వేసిన స్క్రీనింగ్ కమిటీ సూచనలను పాటిస్తూ , పార్టీ కోసం కష్ట డిన వారికి ఈ కమిటీల్లో పెద్దపీట వేశారు. ఈ ప్రకటనలో కేవలం అధ్యక్షులను మాత్రమే కాకుండా, జిల్లా స్థాయిలో పార్టీని నడిపించే పూర్తిస్థాయి యంత్రాంగాన్ని నియమించారు. ప్రతి జిల్లా కమిటీలో వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలతో పాటు ఎగ్జి ్యటివ్ మెంబర్లను నియమించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కమిటీలను ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని అధిష్టానం భావిస్తోంది. తొలి విడతలో 14 జిల్లాలను ప్రకటించగా, మిగిలిన జిల్లాల కమిటీలను కూడా త్వరలోనే వెల్లడిం నున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నిర్మా ణంపై ఎక్కువగా దృష్టి సారిం లని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కమిటీలు పనిచేయాలని హైకమాండ్ ఆదేశాల మేరకే ఈ నియామకాల్లో వేగం పుంజుకున్నట్లు సమాచారం.
మన తెలంగాణ/నంగునూరు: సిద్దిపేట జి ల్లా నంగునూరు మండలం నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వేదికగా గురువారం నిర్వహించిన రైతు మేళా రాజకీయ రణరంగం గా మారింది. ప్రభుత్వ కార్యక్రమం కాస్తా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీయడంతో సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రై తు మేళా ప్రారంభోత్సవ కార్యక్రమానికి శా సన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీ హరి, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీ శ్రావు హాజరయ్యారు. అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. సభా ప్రాంగణం వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి, వారికి నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సభ జరుగుతున్న సమయంలోనూ నినాదాల పర్వం కొనసాగడంతో వేదికపై ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే హరీష్ రావు స్వయంగా జోక్యం చేసుకున్నారు. రైతు సంక్షేమం కోసం జరుగుతున్న ఈ ఉత్సవాల్లో రాజకీయ గొడవలు తగవని, సంయమనం పాటించాలని తమ తమ పార్టీ శ్రేణులకు సూచించారు. నేతల విజ్ఞప్తితో కార్యకర్తలు శాంతించడంతో సభ యధావిధిగా కొనసాగింది. ముఖ్య నేతలు సమన్వయం పాటించడంతో చివరకు రైతు మేళా ప్రశాంతంగా ముగిసింది. అయినప్పటికీ నర్మెట్ట పరిసరాల్లో ఈ రాజకీయ రగడ స్థానికంగా చర్చనీయాంశమైంది. సిద్దిపేట జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది.
కుప్పకూలుతున్న అమెరికా సామ్రాజ్యవాదం
అగ్రరాజ్య ఏకఛత్రాధిపత్యానికి క్రమంగా గండి మొహం చాటేస్తున్న యూఎస్ మిత్రదేశాలు.. డాలర్కు బదులుగా యువాన్లో చమురు వ్యాపారం చేసే యోచన ట్రంప్ యుద్ధ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న …
శుక్రవారం రాశి ఫలాలు (20-03-2025)
మేషం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున చికాకులు తప్పవు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృషభం ఆకస్మిక ధన లాభసూచనలున్నవి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరులతో స్థిరస్థి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు. మిధునం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. అవసరానికి ఇతరులకు ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందికి గురి అవుతారు. దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. సింహం ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది ఋణగ్రస్థుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు .ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కన్య సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి. తుల చిన్న నాటి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంబించి లాభాలు అందుకుంటారు. వృశ్చికం గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఇంటాబయటా పరిస్థితుల్లు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ధనస్సు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పెరిగి నూతన రుణాలు చేస్తారు. బందు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. మకరం నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. కుంభం వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ భారం పెరుగుతుంది. ఇంటా బయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. సంతాన అనారోగ్యం విషయంలో జాగ్రతః వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. మీనం ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు స్వల్ప లాభలు అందుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది.
కనిపించని నెలవంక.. ఎల్లుండి రంజాన్ పండుగ
సోదరులు అత్యంత పవిత్రంగా భక్తిశ్రధ్దలతో జరుపుకునే రంజాన్ పండుగ తేదీ ఖరారైంది. గురువారం ఆ కాశంలో శవ్వాల్ మాసపు నెలవంక ఎక్కడా కనిపించలేదు. దీంతో ముస్లిం లు శుక్రవారం కూడా ఉపవాస దీక్షలను కొనసాగించనున్నారు. శనివారం రంజాన్ పండుగ (ఈద్ఉల్ఫితర్) దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నట్లు రుహిత్-ఎ-హిలాల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, లక్నో వంటి ప్రధాన నగరాల్లో నెలవంక కనిపించలేదు. దీంతో రంజాన్ మాసం 30 రోజులు పూర్తి కానుంది. పండుగను పురస్కరించుకుని శనివారం ఉదయం 10 గంటలకు వివిధ ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యే క ఈద్ ప్రార్థనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని చారిత్రాత్మక మ క్కా మసీదు, పబ్లిక్ గార్డెన్స్ మసీదు, మీర్ ఆలం ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు, భద్ర తా చర్యలపై పోలీసులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సౌదీ అ రేబియా సహా పలు గల్ఫ్ దేశాల్లో శుక్రవారం రంజాన్ పండుగ జరుపుకుంటుండగా, భారత్లో మాత్రం నెలవంక కనిపించని కారణంగా శనివారం వే డుకలు జరగనున్నాయి. ఈ పండుగతో నెల రోజుల కఠిన ఉపవాస దీక్షలు ముగిసి, శవ్వాల్ మాసం ప్రారంభం కానుంది.
ఖమ్మం జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. జిల్లా రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలకు మహర్దశ కల్పిస్తూ, జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్ర త్యేక దృష్టి సారించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క అసాధారణ చొరవ చూపారు. ఆయన పట్టుదలతో జిల్లాలోని ఐదు ప్రధాన రహదారుల విస్తరణకు ఏకంగా రూ.594 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో కీలక మార్గాలను నాలుగు వరుసల (ఫోర్ లేన్) రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే జిల్లా అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. హైబ్రిడ్ యా న్యుటీ మోడల్ (హెచ్ఏమ్) పద్ధతిలో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంలో ఆయన కీలకంగా వ్యహరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు సౌకర్యవంతమయిన రాకపోకలు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ రహదారుల విస్తరణను ప్రభుత్వం చేపడుతోంది. రదారుల విస్తరణతో ఖమ్మం, వైరా, మధిర నియోజక వర్గాల్లో కనెక్టివిటీ పెరగడంతో పాటు స్థానికగా ఆర్ధిక వ్యవస్థకు ఊతం లభించనుం ది. రవాణా ఖర్చులు తగ్గడంతో రైతులు, వ్యాపారులకు ప్ర యోజనం చేకూరనుంది. విస్తరించే రహదారులు ఇవే * వైరా నుంచి జగ్గయ్యపేట వరకు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ నాలుగు వరుసల రహదారిగా విస్తరణ జగ్గయ్యపేట, బోనకల్, రావినూతల్, ము జాఫర్ నగర్, జానకీపురం, పెద్దబీరవల్లి, పాలడుగు, సీతానగరం, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి, జింకల తండా, సోమవరం మీదుగా వైరా వరకు విస్తరించనున్నారు. మొత్తం 25.2 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ. 151.20 కోట్ల నిధులు మంజూరు అయ్యియి. * మధిర నుంచి తూటికుంట్ల వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. మధిర, జిలుగుమాడు, ఆత్కూ రు, కిష్టాపురం సిరిపురం, కలకోట, బ్రహ్మణపల్లి మీదుగా తూటికుంట్ల వరకు ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొ త్తం 13.50 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులకు రూ. 81 కోట్ల నిధులు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. * మధిర ఎర్రుపాలెం వరకు నాలుగు వరుసల రహదారి. మధిర, ఎల్లెందుల పాగు, దెందుకూరు, మీనవోలు మీదుగా ఎర్రుపాలెం వరకు 18. 40 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ. 110.40 కోట్లు నిధులు ప్రభుత్వం వెచ్చించనుంది. * ఖమ్మం నుంచి బోనకల్ వరకు 28.03 కిలోమీటర్ల రహదారిని రూ. 157.23 కోట్ల నిధులతో నాలుగు వరుసలుగా విస్తరించనుంది. ఖమ్మం, కొత్తూరు, దంసలాపురం, గాంధీనగరం, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి, జగన్నాథపురం, నాలుగవంచ, ముష్టికుంట్ల మీదుగా బోనకల్ వరకు ఈ పనులు జరుగనున్నాయి. * బోనకల్, ఆళ్లపాడు వరకు 15.72 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ. 94.32 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ రహదారి బోనకల్, ఆళ్లపాడు, రాయన్నపేట మీదుగా వంగవీడు వరకు రహదారిని విస్తరణ జరుగనుంది.
తెలంగాణ చట్టసభల్లో విప్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ సమన్వయం కోసం ప్రభుత్వ విప్లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున గొంతుక వినిపించేందుకు, ఎమ్మెల్యే లను ఏకం చేసేందుకు ముగ్గురు సీనియర్ నాయకులను విప్లుగా రేవంత్రెడ్డి సర్కార్ నియమించింది. వీరిలో వేముల వీరేశం (నకిరేకల్), విజయ రమణారావు (పెద్దపల్లి), యెన్నం శ్రీనివాస్రెడ్డి (మహబూబ్ […] The post తెలంగాణ చట్టసభల్లో విప్ల నియామకం appeared first on Visalaandhra .
దిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా
న్యూదిల్లీ: దిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారించింది. ఈడీ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ ఏఎస్జీ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు తన అధికార పరిధిని మించి కొన్ని వ్యాఖ్యలు చేసిందని, వాటిని […] The post దిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా appeared first on Visalaandhra .
స్వల్ప, మధ్య,దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి
. పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మేలు. తెలుగుజాతిని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. టీటీడీ, వ్యవసాయ శాఖ పంచాంగాల ఆవిష్కరణ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివ ద్ధికి కషి చేస్తున్నామని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2047 నాటికి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ […] The post స్వల్ప, మధ్య,దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి appeared first on Visalaandhra .
నాలుగు రోజుల క్రితమే నిశ్చితార్థం..అంతలోనే అనంత లోకాలకు
ఉగాది పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ దర్శనానికి వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కోనేరులో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఎపిలోని కాకినాడ జిల్లా సామర్లకోటలోని ప్రసిద్ధ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో గురువారం చోటు చేసుకుంది. మృతుడిని ప్రశాంత్ అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలీవిధం గా వున్నాయి. తన కాబోయే భార్య, బంధువులతో కలిసి భీమేశ్వర స్వామి దర్శనం కోసం సామర్లకోటకు వచ్చిన ప్రశాంత్ స్వామివారిని దర్శించుకునే ముందు స్నానం చేద్దామని ఆలయ కోనేరులో దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగాడు. ఇది గమనించిన స్థానికులు ప్రశాంత్ను కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. నీటి లోతును సరిగా అంచనా వేయకపోవడం, ఈత రాకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తు న్నారు. కేవలం నాలుగు రోజుల క్రితమే ప్రశాంత్ నిశ్చితార్థం జరిగినట్లు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తెలిపారు. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
. అనేక జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు. చేతికొచ్చిన మొక్కజొన్న, మునగ, అరటి నేలమట్టం. సత్వరం ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ వాతావరణంలో సంభవించిన ఆకస్మిక మార్పుల వల్ల కురిసిన అకాల వర్షాలు, వీచిన ఈదురు గాలులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. కడప, ఎన్టీఆర్, కష్ణా తదితర జిల్లాల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు […] The post అకాల వర్షం… అపార నష్టం appeared first on Visalaandhra .
భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సంప్రదాయబద్దంగా గురువారం శ్రీకారం చుట్టారు. ఉత్సవాంగ స్నవనంతో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, ఉగాది వేపపూత ప్రసాదం స్వామి వారికి నివేదన చేశారు. అలాగే బ్రహ్మో త్సవాలను పురస్కరించుకుని పాల్గొనే రుత్వికులకు, సిబ్బందికి భద్రాద్రి దేవస్థానం ఏఈవో శ్రావణ్ కుమార్ దీక్ష వస్త్రాలను అందజేశారు. మూలవరులకు అభిషేకం, బేడా మండపంలో ఉత్సవమూర్తులకు ఉత్సవాంగ స్నపనంతో వసంతపక్ష బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా సాయంత్రం గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను మృత్సంగ్రహణంను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సమయంలో భూ వరాహాస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మట్టిని సేకరించి కల్యాణ అంకురార్పణకు వినియోగించారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో గురువారం నుంచి నిత్యక ల్యాణాలు ఏప్రిల్ రెండు వరకు నిలిపివేశారు. అలాగే నేటి నుంచి రెండు వరకు పవళింపు సేవలు నిలిపివేశారు. ఉగాదిని పురస్కరించుకొని రాత్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వైదిక సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉగాది పర్వదినంను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వరుస సెలవుదినాలు కావడంతో రామయ్య దర్శనంకు భక్తులు పోటెత్తారు.
. ఇంధన క్షేత్రాలపై దాడులు ముమ్మరం. ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రతరం. ఇరుగు`పొరుగు ఆగ్రహం తెహ్రాన్: ఇజ్రాయిల్అమెరికా కలిసి ఇరాన్లో విధ్వంసం సష్టిస్తుండగా, ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్ సైతం తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ యుద్ధం ఇప్ప్పుడు చమురు యుద్ధంగా మారిపోయింది. తమ దేశంలో చమురుగ్యాస్ క్షేత్రాలపై దాడులు జరపడంతో గల్ఫ్దేశాల చమురు నిల్వలపై ఇరాన్ గురి పెట్టింది. వైమానిక దాడులు చేసింది. యూఏఈ, ఖతార్లోని చమురు కేంద్రాలపై క్షిపణులు ప్రయోగించింది. సౌదీ అరాంకో సంస్థకు చెందిన […] The post ఇక చమురు యుద్ధమే! appeared first on Visalaandhra .
పుష్కరాల నాటికి ‘పోలవరం’ పూర్తి
. ముగింపు దశకు ‘మహా స్వప్నం’!. డయాఫ్రమ్ వాల్ 98 శాతం పూర్తి. మే 31 నాటికి 21,769 నిర్వాసిత కుటుంబాల తరలింపు లక్ష్యం. ప్రాజెక్ట్ డీఈఈ, ఏఈఈ వెల్లడి. ప్రాజెక్టును సందర్శించిన విశాలాంధ్ర పాత్రికేయ బృందం గోదావరి ప్రవాహం సాక్షిగా ఆంధ్రుల దశాబ్దాల కల ‘పోలవరం’ ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. ప్రకృతి విసిరిన సవాళ్లు, సాంకేతిక చిక్కుముడులు, వరద పోట్లను తట్టుకొని నదీ గర్భంలో నిర్మిస్తున్న అద్భుత ఇంజనీరింగ్ నిర్మాణం, నిధుల లభ్యత, సాంకేతిక […] The post పుష్కరాల నాటికి ‘పోలవరం’ పూర్తి appeared first on Visalaandhra .
శంషాబాద్ విమానాశ్రయానికి స్కైట్రాక్స్ అవార్డు
జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2026 సంవత్సరానికి గాను ’బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏసియా 2026’ అవార్డును గెలుచుకుంది. స్కైట్రాక్స్ ద్వారా ఈ గౌరవం దక్కడం ఇది 5వ సారి, లండన్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించారు. హైదరాబాద్ ప్రాంతీయ విమానాశ్రయాల విభాగంలో 2వ స్థానం, భారత్-, దక్షిణాసియాలో 3వ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. 20-30 ఎంపిపిఎ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 8వ ర్యాంకు సాధించింది. మా సిబ్బంది అంకితభావం వల్లే ఈ గుర్తింపు లభించిందని జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిఇఒ ప్రదీప్ పనిక్కర్ తెలిపారు. ప్రయాణికుల సేవల్లో అత్యుత్తమ ప్రమాణాలను పాటించినందుకు ఈ అవార్డు దక్కింది.
కృష్ణా డెల్టాలో ఉప్ప్పునీటి బెడదకు చెక్
కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఏటేటా వణికిస్తున్న ఉప్పునీటి బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రకాశం బ్యారేజీ దిగువన సముద్రపు పోటు వల్ల సాగు భూములు చవిటి నేలలుగా మారుతున్న తరుణంలో, రూ. 2,665 కోట్ల అంచనా వ్యయంతో రెండు మినీ బ్యారేజీల నిర్మాణానికి సమగ్ర నివేదికలు సిద్ధమయ్యాయి. సముద్రంలో కలుస్తున్న 7.40 టీఎంసీల వరద జలాలను నిల్వ చేయడం ద్వారా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వేలాది ఎకరాలకు అదనపు […] The post కృష్ణా డెల్టాలో ఉప్ప్పునీటి బెడదకు చెక్ appeared first on Visalaandhra .
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి #cmrevanthreddy #gaddarfilmawards #news
ధర్మదం నుంచి కేరళ సిఎం విజయన్ నామినేషన్ దాఖలు
కేరళ ముఖ్యమంత్రి 80 ఏళ్ల వయోవృద్ధుడు, పినరయి విజయన్ ధర్మదం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు గురువారం ఉదయం 11గంటల సమయంలో తలస్సెరి సబ్ రిజిస్ట్రాల్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కన్నూర్ రిజిస్ట్రార్ ఈ నామినేషన్ పత్రాలను స్వీకరించారు. పినరయి విజయన్ వెంట సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కెకె రాజేష్,సీనియర్ నేత ఇపి జయరాజన్, స్పీకర్ ఎఎన్ షమ్సీర్, ఆయన రాజకీయ కార్యదర్శి పి శశి నామినేషన్ దాఖలు సందర్భంగా అనుసరించారు.. విజయన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది ఏడోసారి. అలాగే ధర్మదం నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీకి దిగారు. గతంలో ఆయన కుతుపరంబ నియోజకవర్గం నుంచి మూడుసార్లు, పయ్యనూర్ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలుపొందారు. బుధవారం నాడు నియోజకవర్గంలో విజయన్ తన ప్రచారాన్ని రోడ్షోతో ప్రారంభించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేతృత్వం లోని యుడిఎఫ్ తరఫున విపి అబ్దుల్ రషీద్, బీజేపీ తరుఫున కె రంజిత్ పోటీకి దిగారు.
బెంగాల్కు111 మందితో బిజెపి రెండో జాబితా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి గురువారం తమపార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 111 మంది అభ్యర్థుల పేర్లు , పోటీ చేసే స్థానాలు ఉన్నాయి. సీనియర్ నేతలు రేఖా పాత్ర హింగల్గంజ్ నుంచి, సోరార్పూర్ దక్షిణ్ నుంచి రూపా గంగూలీ పోటి చేస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు రెండు విడతలుగా ఏప్రిల్ 23, ఏప్రిల్ 29వ తేదీలలో జరుగుతాయి. సబిత బర్మన్ ఇటాహార్ నుంచి బరిలోకి దిగుతారు. స్వపన్ మజుందార్ బాంగాన్ దక్షిణ్ నుంచి నిలబడుతారు. పశ్చిమ బెంగాల్లో టిఎంసి పాలనను దెబ్బతీసేందుకు చాలా కాలంగా బిజెపి పావులు కదుపుతోంది.
₹ 250 Triliion Vapors : ఖతార్ గ్యాస్ ఖతం Andhta Prabha Detail Report
₹ 250 Triliion Vapors : ఖతార్ గ్యాస్ ఖతం Andhta Prabha
సంతోషకర దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంతంటే..?
ప్రజలు సంతోషంగా జీవించే దేశాలలో భారత్.. పాకిస్థాన్, నేపాల్ కంటే వెనుకబడిపోయింది. మార్చి 19, గురువారం ప్రపంచ సంతోష నివేదిక 2026లో మొత్తం 140కి దేశాల జాబితాలో భారత్ 116వ స్థానంలో నిలిచింది. గతేడాది 118వ స్థానంలో ఉన్న ఇండియా..ఈసారి నుంచి రెండు స్థానాలు మెరుగుపడినప్పటికీ..నేపాల్, పాకిస్తాన్ల కంటే వెనుకబడింది. ఈ జాబితాలో ఫిన్లాండ్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. విశ్వాసం, సామాజిక మద్దతు, జీవన నాణ్యత స్థాయిల ఆధారంగా ఫిన్లాండ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగిస్తోంది. ఈ జాబితాలో ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే వంటి దేశాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. ఈ దేశాలు బలమైన ప్రభుత్వ సంస్థలు, తక్కువ అవినీతి, ఉన్నత జీవన ప్రమాణాలతో ఉంటాయి. ఇరాన్ తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయిల్.. ఈ జాబితాలో 8వ స్థానంలో నిలవడం విశేషం. కాగా, ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీ అంతర్జాతీయ సంతోష దినోత్సవం సందర్భంగా ప్రపంచ సంతోష నివేదికను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేస్తుంది. ప్రజలు తమ జీవితాలను ఎలా అంచనా వేసుకుంటారు, ఎలా చూస్తారు అనే దాని ఆధారంగా దేశాలకు ర్యాంకులు ఇచ్చే ఈ నివేదికలో దేశాల శ్రేయస్సు సమాచారాన్ని... వివిధ రంగాలకు చెందిన ప్రపంచ స్థాయి పరిశోధకుల విశ్లేషణతో కలిపి పొందుపరుస్తారు.
అమరవీరుల ఆశయ సాధనకు పునరంకితమవుదాం
దోనేపూడి శంకర్ విశాలాంధ్రవిజయవాడ: కమ్యూనిస్టు ఉద్యమ వందేళ్ళ మహాప్రస్థానంలో ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలు పనంగా పెట్టి పార్టీ కోసం పేద ప్రజల కోసం అనేక పోరాటాలు సాగించారని ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. గురువారం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సంగుల పేరయ్య అధ్యక్షతన చలసాని వెంకటరత్నం 54వ వర్ధింతి కార్యక్రమం చలసాని నగర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ముఖ్యఅతిథులుగా హాజరై చలసాని […] The post అమరవీరుల ఆశయ సాధనకు పునరంకితమవుదాం appeared first on Visalaandhra .
ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ
ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ పాయకాపురం, ఆంధ్ర ప్రభ :
మత సామరస్యానికి ప్రతీక విజయవాడ
మత సామరస్యానికి ప్రతీక విజయవాడ భవానిపురం,ఆంధ్రప్రభ : మత సామరస్యానికి ప్రతీక విజయవాడ
అవుట్డోర్ స్టేడియం అభివృద్ధికి శంకుస్థాపన
అవుట్డోర్ స్టేడియం అభివృద్ధికి శంకుస్థాపన కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : క్రీడాకారులు, వాకర్స్
కమ్యూనిస్టు పోరాట యోధుడు చలసాని వెంకటరత్నం
జి.ఈశ్వరయ్య విశాలాంధ్రవిజయవాడ: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ఎర్రజెండతోనే సాధ్యమని నమ్మి తన తుదిశ్వాస వరకు కార్మిక పక్షపాతిగా నిలబడి దోపిడివర్గ నిర్మూలన కోసం పోరాడిన పోరాటయోడుడు చలసాని వెంకటరత్నం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. గురువారం నగరంలోని దాసరి భవన్ వద్ద పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన చలసాని వెంకటరత్నం 54వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య ముఖ్య అతిధిగా […] The post కమ్యూనిస్టు పోరాట యోధుడు చలసాని వెంకటరత్నం appeared first on Visalaandhra .
వైభవంగా లక్ష్మమ్మఅవ్వ రథోత్సవం
వైభవంగా లక్ష్మమ్మఅవ్వ రథోత్సవం మంత్రాలయం,ఆంధ్ర ప్రభ : మండలంలోని బూదురు గ్రామంలో శ్రీ
ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి..
ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి.. పటమట ,ఆంధ్రప్రభ : శ్రీ పరాభవ
అకాల వర్షాలపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
అకాల వర్షాలపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ కార్యాలయంలో 91549 70454
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 19 న ఎంతో ఘనంగా జరిగాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ గారు పంచాంగ శ్రవణం చేశారు. ఆ తరువాత ప్రత్యేకంగా వ్రాయించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్రీ శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి) గారు సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి,పులిహోర, దద్దోజనం మొదలగు ప్రసాదం పంపిణి చేయడం జరిగింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మరియు కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ మొదలగు వారు ఉన్నారు. ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు మరియు ప్రసాదానికి సహాయం అందించిన దాతలకు, స్పాన్సర్స్ కు మరియు సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ మొదలగు వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ వేడుకలు ఘనంగా జరగడానికి చేయూతనందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సౌజన్య డెకార్స్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ ,డెలీసియస్ బిర్యాని బై ఫీస్ట్రో, నండూరి సునీత మరియు మహేష్ చెట్టిపెల్లి గార్లకు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రభుత్వ విప్ గా పెద్దపల్లి ఎమ్మెల్యే
ప్రభుత్వ విప్ గా పెద్దపల్లి ఎమ్మెల్యే పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ
రెడీ మిక్స్ రేట్ల పెంపుతో అభివృద్ధి పనులకు అడ్డంకులు
రెడీ మిక్స్ రేట్ల పెంపుతో అభివృద్ధి పనులకు అడ్డంకులు సరఫరాదారుల ఇష్టారాజ్యం…నియంత్రణ ఎక్కడ?అధికారుల
అసలు సమస్య బౌలింగే: రవిచంద్రన్ అశ్విన్
బ్యాటింగ్లో ఎంతో బలంగా ఉన్న టీమిండియాకు బౌలింగ్ సమస్య వెంటాడుతోందని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జట్టు బౌలింగ్ భారాన్ని జస్ప్రిత్ బుమ్రా ఒక్కడే మోస్తున్నాడన్నాడు. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్కప్లో బుమ్రా తప్ప మిగతా బౌలర్ ఎవరూ కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదన్నాడు. వరుణ్ చక్రవర్తి వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడన్నాడు. ప్రస్తుతం బుమ్రా తర్వాత ఒక్క సిరాజ్ మాత్రమే మెరుగైన బౌలర్గా కనిపిస్తున్నాడన్నాడు. వీరిద్దరు తప్పిస్తే భారత్లో మరో మ్యాచ్ విన్నర్ బౌలర్ లేడంటే అతిశయోక్తి కాదన్నాడు. రానున్న వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో బౌలింగ్ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. ఇప్పటి నుంచే ఈ విషయంపై జట్టు యాజమాన్యం దృష్టి సారించాలని అశ్విన్ సూచించాడు. లేకుంటే రానున్న రోజుల్లో జట్టుకు తీవ్ర ఇబ్బందులు ఖాయమని హెచ్చరించాడు.
సూర్య తన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ’కరుప్పు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సూర్య పవర్ఫుల్ అవతార్లో కనిపించిన ’కరుప్పు’ ఫస్ట్ లుక్ టీజర్ సంచలనం సృష్టించింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. మే 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్లో సూర్య ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
73 మంది రాజ్యసభ ఎంపీలపై కేసులు
ప్రస్తుత రాజ్యసభలో 73 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులున్నట్లు తెలియచేసుకున్నారు. ఈ విధంగా మొత్తం సభలో 32 శాతం మంది వరకూ క్రిమినల్ చరిత్ర ఉందని వెల్లడైంది. కాగా ఈ సభలో 31 మంది బిలియనీర్లు ఉన్నారు. సంబంధిత వివరాలను ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఎడిఆర్) తమ నివేదికలో తెలిపింది. మొత్తం 233 మంది ఎంపీలలో 229 మంది అఫిడవిట్ల పరిశీలన క్రమంలో సభ్యుల రికార్డులు తెలిసివచ్చాయి. ఇటీవలే ఎన్నికైన రాజ్యసభ ఎంపీల అఫిడవిట్ల విశ్లేషణ కూడా ఈ నివేదికలో పొందుపర్చారు. రాజ్యషభలో 14 శాతం వరకూ పరమ కోటీశ్వరులు ఉన్నట్లు నిర్థారణ అయింది. ప్రస్తుతం జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఒక్క సీటు ఖాళీ ఉంది. ముగ్గురు ఎంపీల వివరాలు వెలుగులోకి రాలేదని ఎడిఆర్ తెలిపింది. ఇక క్రిమినల్ రికార్డులు ఉన్న వారిలో 73 మంది అంటే 32 శాతం వరకూ తమపై తీవ్ర అభియోగాలు ఉన్నట్లు తెలియచేసుకున్నారు. ఓ ఎంపీపై హత్య కేసు, నలుగురిపై హత్యాయత్నం కేసులు , ముగ్గురిపై మహిళలపై అఘాయిత్యాల కేసులు ఉన్నాయి. ఇక పార్టీల వారిగా చూస్తే బిజెపి ఎంపీలలో 99 మందిలో 27 మందిపై కేసులు ఉన్నాయి. కాగా కాంగ్రెస్కు చెందిన 28 మంది సభ్యులలో 12 మందిపై, టిఎంసికి చెందిన 13 మందిలో నలుగురుపై, టిఎంసికి చెందిన పది మందిలో నలుగురుపై కేసులు ఉన్నాయి. బిఆర్ఎస్కు చెందిన ఓ ఎంపిపై క్రిమినల్ కేసు ఉంది. సిపిఎంకు చెందిన ముగ్గురు ఎంపిలపై కేసులు రికార్డు అయి ఉన్నాయి. ఇక ఆస్తుల విషయానికి వస్తే బిఆర్ఎస్ పార్టీకి చెందిన బండి పార్థసారథికి అత్యున్నత స్థాయిలో రూ 5300 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. తరువాతి క్రమంలో ఆప్ సభ్యులు రాజీందర్ గుప్తాకు రూ 5053 కోట్లు, వైఎస్ఆర్సిపి ఆళ్ల అయోధ్యరామి రెడ్డికి రూ 2577 కోట్లు ఉన్నాయి. ఆప్ ఎంపి సంత్ బల్బీర్ సింగ్ తమ ఆస్తుల విలువ దాదాపు 3 లక్షలని తెలియచేసుకున్నారు. ఎంపిల ఆస్తుల విలువ చూస్తే ఆయనే నిరుపేద అని తేలింది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఐఐటి విద్యార్థులు మృతి
ముంబై-పుణె ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం పుణె నుంచి ముంబైకి వెళ్తుండగా వోక్స్వ్యాగన్ పోలో కారు.. ఖలాపూర్ సమీపంలో అతివేగం కారణంగా కంట్రోల్ తప్పి పలుమారలు పల్టీలు కొట్టింది. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ క్రమంలో ఎక్స్ప్రెస్వేపై ట్రాఫిక్కు ఏర్పడింది. హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదం సమయంలో కారులో నలుగురు ఐఐటి విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, వరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఖలాపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులను నాసిక్కు చెందిన ఓంకార్ బోర్సే (22), నాగ్పూర్కు చెందిన లే భట్ (23), జైపూర్కు చెందిన శ్రేయాష్ శర్మ (22),,ముంబైలోని ఐఐటి పవాయ్ విద్యార్థులుగా గుర్తించారు. ముగ్గురు విద్యార్థులు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం కలంబోలిలోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గ్యాస్ పై దళారుల మోసాలు గ్యాస్ స్టాక్ పూర్తిగా ఉన్నదని ప్రభుత్వం ప్రకటిస్తున్నగ్యాస్
Dhurandhar: The Revenge: Regional Hurdles Cleared
Dhurandhar: The Revenge opened on a sensational note across the globe and the reviews are clear that the film will end up as one of the biggest hits of Indian cinema. In a sudden shock, the Telugu, Tamil, Kannada and Malayalam version of the film did not release as per the plan with paid premieres […] The post Dhurandhar: The Revenge: Regional Hurdles Cleared appeared first on Telugu360 .
OTT Releases during Ugadi Weekend
A number of original titles and films are available for streaming during the long weekend of Ugadi and Eid. Seetha Payanam, Sumathi Sathakam, Amaravathiki Aahvanam are the Telugu releases. Here is the list of OTT releases for this weekend: March 16th: The Plastic Detox (English): Netflix March 17th: Anora (English): Netflix Wicked: For Good (English, […] The post OTT Releases during Ugadi Weekend appeared first on Telugu360 .
ఆలయాలపై దోపిడీని అరికట్టాలి కోటగుళ్లలో పురాతన దేవాలయాలపై అక్రమాలపై ఆందోళనఆలయం కు ఎండోమెంట్
పిడకల సమరం… సంప్రదాయం శక్తి, సమైక్యతకు చిరస్మరణీయ ప్రతీక కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ
అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల మూడో జాబితా ప్రకటించిన కాంగ్రెస్
గౌహతి: అస్సాంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 126 అసెంబ్లీ స్థానాలకు 22 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 87 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కోక్రాఝర్ స్థానం నుండి మానిక్ బ్రహ్మ, బావ్ఖుంగ్రి నుండి సపాలి మాలిక్, పర్బత్ఝోరా నుండి అష్రాఫుల్ ఇస్లాం షేక్, ధుబ్రి నుండి బేబీ బేగం, జలేశ్వర్ నుండి అఫ్తాబ్ ఉద్దీన్ మొల్లా, అభయపురి నుండి ప్రదీప్ సర్కార్, సిడ్లి చిరాగ్ నుండి మతిలాల్ నార్జరీ, చెంగా నుండి అబ్దుర్ రహీం అహ్మద్, పాకబెత్బారి నుండి జాకిర్ హుస్సేన్ సిక్దార్ మరియు బక్సా నుండి జగదీష్ మదాహి బరిలోకి దిగనున్నారు. ఇక, తమూల్పూర్ నుండి రఫీ డైమరీ, ఉదల్గురి నుండి సోరెన్ డైమరీ, లహరిఘాట్ నుండి ఆసిఫ్ మహమ్మద్ నజర్, నాగావ్-బటాద్రబా నుండి దుర్లభ్ చమువా, నదువార్ నుండి సునీల్ ఛెత్రి, రంగోనది నుండి జయంత్ ఖౌండ్, లఖింపూర్ నుండి ఘనా బురాగోహైన్, ధకువాఖానా నుండి ఆనంద నారా, మకుల్ నుండి శిబనాథ్ చేతియా మరియు ఖుమ్తాయ్ నుండి రోసెలీనా టిర్కీలను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.
తిరుపతి గరుడ వారధిపై అదుపుతప్పిన బస్సులు.. ఒకదానితో మరొకటి ఢీ...#Tirupati #RTC #Accident
Shirdi Sai Transformers Under Scanner as AP High Court Warns of Penalties Over Quality Concerns
The Andhra Pradesh High Court has put the spotlight on transformer supplies in the state, raising serious questions about quality and pricing. The court made it clear that strict action will follow if the transformers supplied by Shirdi Sai Electricals Private Limited fail to meet prescribed standards. The issue reached the court after a public […] The post Shirdi Sai Transformers Under Scanner as AP High Court Warns of Penalties Over Quality Concerns appeared first on Telugu360 .
ఎంపీ అవినీతి ఏ స్థాయికి చేరిందో..?
ఎంపీ అవినీతి ఏ స్థాయికి చేరిందో..? ఎంపీ అంటే మట్టి, పేకాట అని
పాత కక్షలతో వ్యక్తి పై గొడ్డలితో దాడి
పాత కక్షలతో వ్యక్తి పై గొడ్డలితో దాడి జమలయ్య పరిస్థితి విషమంవిజయవాడ ప్రైవేట్
మైనర్లపై వేధింపులు.. అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
న్యూమెక్సికో: మైనర్లుగా పరిచయం చేసుకొంటూ చిన్నారులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు అమెరికాలోని న్యూ మెక్సికో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఓ తెలుగు యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని బల్కం నాగరాజుగా పోలీసులు గుర్తించారు. అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా న్యూ మెక్సికోలోని శాంటఫే నగర పోలీసులు ఆన్లైన్లో ప్రత్యేక ఖాతాలు తెరిచారు. పోలీసులు సైతం చిన్నారులుగా పలువురు అనుమానితులతో చాటింగ్ చేశారు. చిన్నారులను లైంగికంగా ప్రలోభాలకు గురి చేస్తున్న నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఖతార్ గ్యాస్పై దాడులను సహించేది లేదు: ట్రంప్
ఖతార్పై ఇరాన్ మరోసారి దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్కు చెందిన ప్రధాన చమురు క్షేత్రం సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇకపై ఇజ్రాయెల్ తిరిగి దాడులకు దిగదు. అయితే ఈ దాడుల సాకుతో ఇరాన్ చర్యకు దిగితే అమెరికా ఇక ఏకంగా ఈ చమురు క్షేత్రాన్ని నేలమట్టం చేస్తుందని సామాజిక మాధ్యమంలో తెలిపారు. తాము చేపట్టే చర్యలతో ఎంత నష్టం ఇరాన్కు వాటిల్లుతుందనేది చెప్పలేం, తీవ్రస్థాయిలో పరిణామాలు ఉంటాయి. అంతేకాకుండా ఇరాన్పై భవిష్యత్తులో పెను ప్రభావం పడుతుందని, అక్కడి చమురు నిల్వల వనరులకు జరిగే నష్టాన్ని సూచనప్రాయంగా తెలిపారు. ఇరాన్ తమ దేశ ఇంటలిజెన్స్ మంత్రి అమెరికా , ఇజ్రాయెల్ సేనల దాడులలో హతులు అయ్యారు. దీనితో ఇరాన్ మరింత ప్రతీకార దాడులకు దిగింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని పలు చమురు క్షేత్రాలను ఎంచుకుని దాడులకు దిగింది. ఈ క్రమంలోనే ఖతార్పై జరిగిన దాడిని అమెరికా తీవ్రంగా పరిగణించింది.
11 మంది మావోయిస్టులు లొంగుబాటు..
మహారాష్ట్ర: మావోయిస్టు పార్టీ మరో షాక్ తగిలింది. గడ్చిరోలిలో జిల్లాలో గురువారం ఐదుగురు కీలక సభ్యులతో సహా మొత్తం 11 మంది నక్సలైట్లు పోలీసులు, CRPF అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.68 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారుస లొంగిపోయిన వారిలో డివిసిఎం, ఏరియా కమిటీ సెక్రటరీ, కమాండర్ స్థాయి మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. 2025 నుంచి ఇప్పటివరకు గడ్చిరోలి జిల్లాలో మొత్తం 123 మంది మావోయిస్టులు లొంగిపోయారని పోలీసులు వెల్లడించారు. ఈ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం దాదాపుగా అంతమైపోయిందని చెప్పారు.
‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ
తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత త్వరలో పార్టీ ప్రారంభించన్నారు. ఇప్పటికే పార్టీ పేరు నమోదు కోసం జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇసి దీనిపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఎ కింద రాజకీయ పార్టీ నమోదు కోసం చేసిన తన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి అప్లికేషన్లో చాలా లోపాలున్నాయంటూ కవితకు ఫిబ్రవరి 23నే సమాచారం పంపామని ఇసి తరఫు న్యాయవాది ఫిబ్రవరి 27న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఆ సమయంలో కవిత తరఫు న్యాయవాది ఆసుపత్రిలో ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కోరడంతో కేసు మార్చి 19కి వాయిదా పడింది. అదే పిటిషన్ గురువారం మరోసారి విచారణ చేపట్టింది. కవిత కొత్త పార్టీ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇసికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో ఇసి కోర్టుకు చెప్పగా, లోపాలన్నీ సరిచేసినట్లు కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సాంకేతిక తప్పులు సరిచేసి ఇసికి మళ్లీ దరఖాస్తు చేశామన్నారు. దీంతో ఈసీ కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామనడంతో ఢిల్లీ హైకోర్టు విచారణ ముగించింది.
వేసవిని ఎదుర్కోవడానికి గ్రామీణ నీటి సరఫరా శాఖ సిద్ధం
వేసవిని ఎదుర్కోవడానికి గ్రామీణ నీటి సరఫరా శాఖ సిద్ధం రూ.23 లక్షలతో ప్రత్యామ్నాయ
గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది. వచ్చే ఏడాది ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాదితో పోలిస్తే ఈసారి కాస్త అధికంగానే సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఈసారి బడ్జెట్ రూ.3.26 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ బడ్జెట్లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళా సంక్షేమం, సన్న బియ్యం కోసం భారీగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం అయినట్లుగా సమాచారం. ఇక, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కోసం ఈ బడ్జెట్లో నిధులను కేటాయించనున్నట్టు తెలిసింది. వీటితో పాటు తుమ్మిడిహెట్టి, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, కొడంగల్ నారాయణ్పేట్ ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్బిసిలకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాలేజీ యువతులకు ఈవీ స్కూటీలను ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో దీనికోసం నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
ఎడారి నేలలో ‘మినీ స్విట్జర్లాండ్' #MiniSwitzerland#SnowYard#Rajasthan#Ajmer#TouristSpot#IndiaTravel
ఇది రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం
ఇది రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం రైతులు కన్నీరు కారుస్తుంటే పలుకరించే నాథుడు
ఈనెల ౨౨ నుంచి రైతు భరోసా నిధులు జమ
రాష్ట్రంలోని రైతులు బాగున్నప్పుడే, రైతుల పంటలు లాభాలు సాధించినప్పుడే రాష్ట్రంలో సుఖశాంతులు నెలకొంటాయని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు లాభాలు సంపాదించి పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని , రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 22వ తేదీ నుంచి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నా మని సిఎం తెలిపారు. అలాగే భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చి రైతులకు కష్టాలను తీర్చి, సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను అనుభవించే విధంగా చర్యలు తీసుకున్నామని సిఎం గుర్తు చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అనంతరం ఉగాది పంచాంగ శ్రవణం లో పాల్గొన్న వివిధ ప్రాంతాలకు చెందిన అర్చకులను సిఎం రేవంత్ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ సంవత్సరం తెలంగాణలో రైతులకు ఎలాంటి విపత్తులు రాకూడదని భగవంతుడిని సిఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు.
అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి రైతులకు పూర్తి సహాయం అందిస్తాంమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమెరికాకు క్యూబా హెచ్చరికహవానా: తమ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తామని క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్-కానెల్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అత్యవసర చర్యలు’ వ్యాఖ్యలను ఎక్స్ మాధ్యమంగా ఆక్షేపించారు. కరేబియన్ దీవులను తాను ఏమైనా చేయగలనన్నట్లుగా ట్రంప్ వ్యవహరిస్తున్నారన్నారు. క్యూబా రాజ్యాంగ వ్యవస్థను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నా యని, బహిరంగంగా హెచ్చరికలు అందుతు న్నాయని చెప్పారు. ఆరు దశాబ్దాలకుపైగా ఆర్థిక ఆంక్షల ఎదుర్కొంటున్న క్యూబాలో సంక్షోభాన్ని సాకుగా చూపుతూ దండయాత్రకు అమెరికా […] The post తీవ్ర ప్రతిఘటన తప్పదు appeared first on Visalaandhra .
‘హోర్ముజ’పై ఇరాన్ కొత్త నిబంధనలు
తెహ్రాన్: హోర్ముజ్ జలసంధి మార్గంలో నౌకల ప్రయాణానికి సంబంధించి ఇరాన్ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టనున్నది. ఉద్రిక్తతల వేళ జల మార్గంపై నియంత్రణలో మార్పులే లక్ష్యమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయిల్ మిత్ర దేశాల నౌకలను నిరోధించడానికి స్పష్టమైన కారణం ఉందన్నారు. యుద్ధ పరిస్థితుల్లో భద్రతాంశాల దష్ట్యా ఇలాంటి చర్యలు అవసరమని తెలిపారు. ‘హోర్ముజ్ జలసంధి కీలక జలమార్గం. శత్రువులు ఈ మార్గాన్ని వినియోగించకుండా నిరోధించాలి. భద్రతా ముప్ప్పుతో ఇప్పటికే అనేక నౌకలు […] The post ‘హోర్ముజ’పై ఇరాన్ కొత్త నిబంధనలు appeared first on Visalaandhra .
ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయలేదు
తులసీ గబార్డ్వాషింగ్టన్: అణ్వస్త్రాల తయారీకి ఇరాన్ యత్నిస్తున్నందన్న నెపంతో అమెరికాఇజ్రాయిల్ కలిసి ఆ దేశంపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతు న్నాయి. విధ్వంసం సష్టిస్తున్నాయి. తీవ్ర ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. విలువైన ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. వాస్తవానికి అమెరికాఇజ్రాయిల్ చెప్పేదానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదని, ఆ ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది.ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తున్న ఆరోపణలపై అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబార్డ్ స్పందించారు. సెనెట్ కమిటీకి వివరాలు తెలిపారు. […] The post ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయలేదు appeared first on Visalaandhra .
ఇరాన్ కీలక నేతల హత్యలుఆక్షేపణీయం: చైనా
బీజింగ్: అంతర్జాతీయ సంబంధాల్లో బలవంతపు చర్యలను తమ దేశం ఎప్ప్పుడు ప్రోత్సహించదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. ఇరాన్పై యుద్ధంలో భాగంగా ఆ దేశ కీలక నేతలను ఇజ్రాయిల్ `అమెరికా దళాలు వరుస పెట్టి చంపుతుండటాన్ని ఆక్షేపించింది. పౌర క్షేత్రాలపై, నాయకు లపై ప్రత్యక్ష దాడులు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఇరాన్ జాతీయ భద్రతాధికారి అలీ లారిజానీ హత్యను గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. తక్షణమే సైనిక ఆపరేషన్లను విరమించుకోవాలని, […] The post ఇరాన్ కీలక నేతల హత్యలుఆక్షేపణీయం: చైనా appeared first on Visalaandhra .
యుద్ధం వేళ నిలిచిన శాంతి చర్చలు
మాస్కో: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్కు మధ్య శాంతి చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు క్రెమ్లిన్ పేర్కొంది. ఇరాన్ యుద్ధం కీవ్ను రాజీ దిశగా నెట్టే అవకాశమున్నదన్నది. ఈ మేరకు రష్యా అధికారులు చెప్పినట్లు ఇజ్వెస్టియా గురువారం నివేదించింది. ప్రతిష్ఠంభనను క్రెమ్లిన్ ధ్రువీకరించినట్లు నివేదిక తెలిపింది. జెనీవాలో అమెరికా, ఉక్రెయిన్తో ముగిసిన చర్చల తర్వాత యుద్ధానికి డెడ్లైన్లు ఉండవంటూ రష్యా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందిస్తూ త్రైపాక్షిక చర్చలకు విరామం […] The post యుద్ధం వేళ నిలిచిన శాంతి చర్చలు appeared first on Visalaandhra .
జనసేన ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
జనసేన ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఎమ్మెల్సీ హరిప్రసాద్ చేతుల మీదుగా 10 ఆటోలు
‘జెరాల్డ్ ఆర్ ఫోర్్డ’ వెనక్కి
వాషింగ్టన్: అమెరికాకు చెందిన శక్తిమంతమైన విమాన వాహక నౌక ‘జెరాల్డ్ ఆర్ ఫోర్డ’ యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగింది. మరమ్మతులు అవసరం కావడంతో గ్రీస్లోని నాటో స్థావరమైన క్రెటెకు బయల్దేరింది. ఈ నౌక లాండ్రీలో 12వ తేదీన భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. ఇద్దరు సైలర్లు గాయపడ్డారు. దీంతో ఎర్ర సముద్రం మీదుగా క్రెటెలోని సౌద బేకు ఈ నౌక ప్రయాణిస్తోంది. ఈ నౌకకు అత్యవసర మరమ్మతులు అక్కడ చేస్తారు. క్యారియర్ స్ట్రైక్ గ్రూపులోని మిగిలిన నౌకలు ఇప్పటికీ యుద్ధ […] The post ‘జెరాల్డ్ ఆర్ ఫోర్్డ’ వెనక్కి appeared first on Visalaandhra .
యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్
యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో కూటమి
‘ఉస్తాద్ భగత్ సింగ’పై వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట
బెంగళూరు కోర్టు కీలక ఆదేశంబెంగళూరు: హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ’ చిత్రంపై సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం చేయకుండా నిరోధిస్తూ బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ సినిమా గురించి అభ్యంతరకర, కించపరిచే లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకునేలా ‘జాన్ డో’ ఇంజంక్షన్ ఆర్డర్ను జారీ చేస్తూ న్యాయమూర్తి జీవనరావు వసంతరావు కులకర్ణి ఆదేశాలిచ్చారు. […] The post ‘ఉస్తాద్ భగత్ సింగ’పై వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట appeared first on Visalaandhra .
ఇంద్రకీలాద్రిపై పంచాంగ శ్రవణం శ్రీ పరాభవ నామ సంవత్సరానికి ఆధ్యాత్మిక శ్రీకారంవేదోచ్చారణల మధ్య
బాలయ్య సినిమాలో నయన్తోపాటు అనుష్క?
హైదరాబాద్: మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్స్గా ఇద్దరు అందాల భామల పేర్లు వినిపి స్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల తార నయనతార నటించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ జంటగా నటించిన సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాలు విజయం సాధించాయి. […] The post బాలయ్య సినిమాలో నయన్తోపాటు అనుష్క? appeared first on Visalaandhra .
మైనార్టీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం..: మంత్రి అడ్లూరి
ధర్మపురి: కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని దేశంలో అన్ని మతాలను కులాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదర, సోదరిమణులకు గురువారం ధర్మపురి పట్టణంలోని ఎస్ఎచ్ గార్డెన్ లో తోఫా పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముస్లీం పేదలకు తోఫా పంపిణీ చేయాలని నిర్ణయించారని అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని 2050 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా పేద ముస్లింల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాలకు ధర్మపురికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ధర్మపురి బస్ డిపో మంజూరు కోరకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. గోదావరి పుష్కరాలు వరకు ధర్మపురి బస్ డిపో నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమ ప్రభుత్వమని, ముస్లీం సోదర సోదరిమణులకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు. జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల లావణ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి తో పాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లీం మత పెద్దలు పాల్గొన్నారు.

22 C