ముంబై : ప్రపంచ అనిశ్చితత నడుమ భారత్, బ్రిటన్ భాగస్వామ్యం, మిత్రత్వం సుస్థిరతకు కీలక మైలురాయి అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో విస్తృత చర్చలు తరువాత ప్రధాని మోడీ గురువారం ఈ బం ధంపై సంతోషం వ్యక్తం చేశారు. కేవలం ఇరుదేశాలకే కాకుండా ప్రపంచ స్థాయిలో ఆర్థిక ప్రగతి, పురోగమనానికి ఇరుదేశాల మిత్రత్వం ప్రాతిపదిక అవుతోందని తెలిపారు. ఒక్కరోజు క్రితం అత్యంత భారీ , ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కీర్ స్టార్మర్ భారత్కు వచ్చారు. మొ దటిరోజు ఈ వాణిజ్య రాజధానిలో హాలీవుడ్, బాలీవుడ్ చిత్ర సహకారం దిశలో కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోడీ కూడా ఇక్కడికి చేరుకున్న దశలో ఇరువురు నడుమ సుదీర్ఘ చర్చలు బృందాల వారిగా, నేరుగా జరిగాయి.భారత్కు రక్షణ రంగ పటిష్టతకు సంబంధించి బ్రిటన్ నుంచి తేలికపాటి , బహుళార్థక క్షిపణి వ్యవస్థల (ఎల్ఎంఎం) సరఫరాకు ఒప్పందం కుదరింది. భారతీయ వాయుసేన పాటవశక్తిని పెంపొందింపచేసుకునేందుకు ఈ మిస్సైల్ వ్యవస్థలు ఎంతగానో ఉపకరిస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక అత్యంత కీలకమైన రీతిలో సముద్ర మార్గాల నిశిత పర్యవేక్షణ తద్వారా భారతీయ నౌకాశ్రయ వేదికలకు ఎలక్ట్రానిక్ ప్రపుల్సన్ సిస్టమ్స్ సమకూర్చే విషయంలో కూడా ఇరుదేశాల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. దీనితో భారతీయ విస్తారిత తీర ప్రాంతానికి రక్షణ కవచం పటిష్టం అయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. రెండు దేశాల సంయుక్త ప్రాజెక్టులో భాగంగానే తీర ప్రాంత పర్యవేక్షణ వ్యవస్థలను నెలకొల్పుతారు. జులైలో ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టిఎ) కుదరడం స్నేహబందానికి పరాకాష్ట అని ఇరుదేశాల నేతలు వ్యాఖ్యానించారు. సంబంధాల మరింత వృద్ధి, వ్యాపార పురోగతికి ఈ ట్రేడ్ డీల్ దోహదం చేస్తుందని తెలిపారు. బ్రిటన్ ప్రధాని వెంబడి పలు సంస్థలు, పరిశ్రమలకు చెందిన అధినేతలు, కార్యానిర్వాహక అధికారులు, పలువురు విసిలతో కూడిన వంద మందితో కూడిన బృందం రావడం విశేష పరిణామం అయింది. ఇరుదేశాలు సహజసిద్ధ భాగస్వామ్యపక్షాలు. ప్రజాస్వామ్యం , స్వేచ్ఛ, చట్టపరమైన పాలన నిబిడీకృతంగా ఈ బంధం సాగుతుందని స్టార్మర్ సమక్షంలో మోడీ తెలిపారు. భారతదేశపు దక్షత, బ్రిటన్ నైపుణ్యత కలబోతగా సంతరించుకున్న విశిష్ట సమన్వయం అత్యంత కీలకమైనదని తెలిపారు. ఇరుదేశాల మధ్య అత్యంత కీలకం, వ్యూహాత్మకం అయిన వాణిజ్య ఒప్పందం ఖరారు కావడం విశేష పరిణామమనే వాదనతో స్టార్మర్ ఏకీభవించారు. ఈ సందర్భంగానే ఆయన భారతదేశం ఆర్థిక పురోగతి గణనీయం అని ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను మరోసారి ప్రధాని మోడీ నాయకత్వ పటిమను అభినందిస్తున్నానని తెలిపారు. వచ్చే మూడేండ్లలోనే భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక శక్తి కానుందని ఇది నాయకత్వ లక్షణాలతోనే సాధ్యం అన్నారు. వాణిజ్య ఒప్పందం మరింత సమగ్రరీతిలో అమలు అయ్యేందుకు ఏర్పాటు అయిన సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటి (జెట్కో) వల్ల అనేక మంచి ఫలితాలు ఉంటాయని ఇరువురు నేతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య పరస్పర పెట్టుబడులు, విస్తృత స్థాయిలో వాణిజ్య విస్తరణకు అవసరం అయిన దిశలో కమిటి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితి, రష్యా ఉక్రెయిన్ ఘర్షణ ఇతర ప్రపంచ సమస్యల గురించి కూడా ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరువురు ప్రధానుల భేటీకి ముంబైలోని రాజ్భవన్ వేదిక అయింది. ఇక్కడికి వచ్చిన ప్రధాని కీర్కు మోడీ సాదరస్వాగతం పలికారు. ఆ తరువాత ఇరువురు నేతలు సముద్ర తీరంలో ఓ వేదిక వద్ద నిలబడి ఏకాంత చర్చలు జరిపినప్పటి దృశ్యాలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా వెలువరించారు. ఇద్దరూ ఏదో కీలక విషయంపై సీరియస్గా మాట్లాడుకుంటున్నప్పటి ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. * ఉగ్రవాదంపై పోరులో సమిష్టివిధానాలు అవసరం అని భారత్ , బ్రిటన్ ప్రధానులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ బ్రిటన్లో ఖలీస్థానీయుల చర్యలకు సకాలంలో అడ్డుకట్ట వేయాల్సి ఉందని సూచించారు. * భారత్లో బ్రిటన్కు చెందిన విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో తొమ్మిది క్యాంపస్ల ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటికే ఈ దిశలో గురుగ్రామ్ క్యాంపస్లో విద్యా సంవత్సరం ఆరంభమైందని వెల్లడించారు. బ్రిటన్కు చెందిన పలు వర్శిటీల విసీలు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ విద్యారంగంలో పరస్పర సహకారానికి మరింత మార్గం ఏర్పడుతుందని మోడీ తెలిపారు.
మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ’తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి వున్నప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టొరీ అనుకుంటారు. కానీ తెలుసు కదాలో ఒక యూనిక్ పాయింట్ ని టచ్ చేశాం. సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా సర్ ప్రైజ్ అవుతారు. నాకు రొమాంటిక్ స్టొరీస్ చేయడం ఇష్టం. తెలుసు కదాలో మంచి లైట్ హార్ట్టెడ్ ఎంటర్టైన్మెంట్ వుంది. సినిమాలో లవ్, ఎమోషన్, హాస్యం, పాటలు, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ మంచి రొమాంటిక్ డ్రామాని ఫీల్ అవుతారు. -నీరజ చాలా పాషన్తో సినిమా చేశారు. ఆమె విజన్ ఆడియన్స్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇది మంచి ఫీల్గుడ్ ఎంటర్టైనర్. ఇందులో మూడు క్యారెక్టర్స్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. థియేటర్స్లో చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. సిద్దు క్యారెక్టర్ని చాలా ఎంజాయ్ చేస్తారు. రాగ పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. సిద్దుకి అన్ని విభాగాలలో చాలా నాలెడ్జ్ వుంటుంది. ఒక యాక్టర్కి అన్ని విభాగాలపై పట్టు వుండటం అదృష్టం. తన టైమింగ్ అద్భుతం. -రాశి ఖన్నా చాలా క్రమశిక్షణ గల నటి. తమన్ మ్యూజిక్కి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన నేను నటిస్తున్న సినిమాకి మ్యూజిక్ చేయడం ఆనందంగా వుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. బీజీఎం చాలా అద్భుతంగా వుంటుంది. పీపుల్ మీడియా ప్రొడక్షన్ హౌస్ లో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు.
‘ప్రేమంటే’ నుంచి 'దోచావే నన్నే' సాంగ్ రిలీజ్..
హీరో ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ నిర్మిస్తోంది. స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ ’దోచావే నన్నే’ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయింది. అబ్బీ వి వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసింది. శ్రీమణి రాసిన సాహిత్యం హార్ట్ టచ్చింగ్ వుంది. ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉంది.
శుక్రవారం రాశి ఫలాలు (10-10-2025)
మేషం - జీవిత భాగస్వామి సలహాలను పాటిస్తారు. రెండు మూడు విధాలుగా ఆశించిన కార్యక్రమాలను పురోభివృద్ధిలో నడిపించడానికి కావాల్సిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృషభం - నూతన వ్యాపారాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పలుకుబడి నామమాత్రంగా పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మిథునం - సంఘంలో గౌరవానికి లోటుండదు. కుటుంబ కలహాలు మీ ప్రశాంతతకు భంగం కలిగించే సూచనలు ఉన్నాయి.సహోదరి వర్గానికి సహాయ పడవలసి వస్తుంది.ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం కర్కాటకం - ఆర్థిక విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగం లభిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకునే విషయమై సందిగ్ధత లభించదు. సింహం - ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు గుర్తించడం కష్టతరంగా పరిణమిస్తుంది. మనసుకు తోచింది చేసుకుంటూ పోవడమే తప్ప క్రమశిక్షణ కరువవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒడిదుడుకులు ఏవి ఏర్పడవు. కన్య - పొదుపు పైన దృష్టిని సారించగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి- వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు అనుకూల కాలం. తుల - నూతన ఒప్పందాలు అనివార్య కారణాల వలన వాయిదా పడతాయి. ఇందువలన సమయ నష్టమే తప్ప ఆర్థిక నష్టం ఏర్పడదు. స్థాన మార్పులు ఉండవచ్చు. వృశ్చికం - కీలక నిర్ణయాలు తీసుకోవడానికి శ్రేయోభిలాషులతో సలహాలు సంప్రదింపులు జరుపుతారు. ఒక మంచి కార్యక్రమాలను నిర్వహించడానికి విరాళాలను సేకరిస్తారు. ధనుస్సు - పారిశ్రామిక రంగాలలోని వారికి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు వచ్చే సూచనలున్నాయి. సన్నిహితులు నిపుణులతో సంప్రదించకుండా ఏ ముఖ్య కార్యక్రమాన్ని అమలు చేయకండి. మకరం - సంతానంలో ఏర్పడుతున్న మొండితనాన్ని నివారించడానికి గాను కొత్త మార్గాలను అన్వేషిస్తారు. కొంతమంది ప్రబుద్ధులు స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మీతో స్నేహ హస్తం కలుపుతారు. కుంభం - ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. సంగీత, సాహిత్య కళారంగాలలో ప్రత్యేక అభిరుచిని కలబరుస్తారు. చిన్ననాటి మిత్రులు దగ్గరవుతారు. మానసిక ఆనందం కలుగుతుంది. మీనం - వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ స్థాయి పెరుగుతుంది. కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది గృహోపకరణాలు. శుభకార్యాలు మొదలగు వాటికి అధికంగా ధనం ఖర్చు చేస్తారు.
చైనా మహిళతో రొమాన్స్.. అమెరికా దౌత్యవేత్తపై వేటు
న్యూయార్క్ : చైనా మహిళతో నడిపిన ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టిన కారణంగా ఓ అమెరికా దౌత్యవేత్తపై వేటు పడింది. ఆ మహిళపై గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో ఇది జరిగింది. ఈ విషయాన్ని యూఎస్ విదేశాంగశాఖ ప్రతినిధి టామీ పిగోట్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చైనీయులతో ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడంపై యూఎస్ గతం లోనే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీన్ని ఉల్లంఘించిన కారణంగా దౌత్యవేత్త తొలగింపు జరిగినట్టు తెలుస్తోంది. పిగోట్ ప్రకటన ప్రకారం ... విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా మహిళతో దౌత్యవేత్త ప్రేమ వ్యవహారం నడిపి , ఆ విషయం దాచి పెట్టారని నిర్ధారణ అయిందన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి రూబియో నాయకత్వంలో తమ దేశ జాతీయ భద్రతను దెబ్బతీసే ఏ ఉద్యోగినీ వదిలిపెట్టబోమన్నారు. అయితే ఆ దౌత్యవేత్త పేరును అధికారులు బయటపెట్టకపోవడం గమనార్హం.
ప్రపంచకప్.. భారత్కు సౌతాఫ్రికా షాక్
విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్లో ఆతిథ్య టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం విశాఖపట్నం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో సౌతాఫ్రికా మూడు వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (37), స్మృతి మంధాన (23) పరుగులు చేశారు. హర్లిన్ డియోల్ (13) పరుగులు చేసి ఔటైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (9), రోడ్రిగ్స్ (0), దీప్తి శర్మ (4) నిరాశ పరిచారు. అయితే వికెట్ కీపర్ రిచా ఘోష్ అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకుంది. చెలరేగి ఆడిన ఘోష్ 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 పరుగులు చేసింది. స్నేహ్ రాణా (33) ఆమెకు అండగా నిలిచింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్గా దిగిన కెప్టెన్ లౌరా వాల్వర్డ్ (70) జట్టుకు అండగా నిలిచింది. ఇక నడైన్ డి క్లార్క్ చిరస్మరణీయ ఇన్నింగ్స్తో సౌతాఫ్రికా సంచలన విజయం సాధించి పెట్టింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన క్లార్క్ 54 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. చోలె ట్రియాన్ (49) తనవంతు పాత్ర పోషించింది.
రిజర్వేషన్ల జివోపై హైకోర్టు స్టేకు బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే :రాంచందర్ రావు
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడానికి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని - బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. హైకోర్టు స్టే -వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమేనని అన్నారు. హైకోర్టు స్టేకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, - వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన సూచించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ స్వలాభం కోసం బీసీల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఫణంగా పెట్టిందని ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈరోజు ఓబీసీలు ఎదుర్కొంటున్న దురవస్థకు కారణమని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి, న్యాయపరమైన లొసుగులను సరిచేసుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తోందని ఆయన తెలిపారు. ఆగస్టు 31న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్కు పంపినప్పటికీ, గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ఉన్న మూడు నెలల గడువు ముగియకముందే ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం గవర్నర్కు పంపిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆ గడువు పూర్తికాకముందే ప్రభుత్వం తొందరపడి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమని ఆయన విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి చట్టపరమైన లొసుగులను సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూసి, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని రాంచందర్ రావు తెలిపారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ‘బిజెపి అడ్డుకుంటోంది’ అనే దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన అవగాహన లేదా ఆలోచనల స్పష్టత లేదని విమర్శించారు. బిల్లులు తెచ్చి, డిక్లరేషన్లు, ఆర్డినెన్స్ సవరణలు ఇలా న్యాయపరంగా చెల్లుబాటు కాని విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని, చట్టపరంగా తప్పుడు నిర్ణయాలతో బీసీల హక్కులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని మండిపడ్డారు. హైకోర్టులో వచ్చిన ఈ ఫలితానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల, వారి సాధికారత పట్ల నిజమైన చిత్తశుద్ధి లేదని అన్నారు.
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు: కర్ణాటక నిర్ణయం
బెంగళూరు : మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒకరోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులతోపాటు వస్త్రపరిశ్రమ , బహుళజాతి సంస్థలు, ఐటీకంపెనీలు, ఇతర ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈ సెలవు వర్తించనుందని ప్రభుత్వం వెల్లడించింది. “ శ్రామిక మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. నెలసరి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతోపాటు మహిళలకు మానసిక, శారీరక సౌకర్యం అందించాలన్నదే మా ఉద్దేశం. ఈ నిర్ణయం ఉద్యోగినులకు ఎంతగానో ఉపకరించనుంది. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయి. అందుకే ఇక్కడా ఆ సెలవును ఇవ్వాలనుకున్నాం. ” అని క్యాబినెట్ సమావేశం అనంతరం న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగె స్వాగతించారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని హర్షం వ్యక్తం చేశారు. అయితే అసంఘటిత రంగంలో సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే బీహార్, ఒడిశా, కేరళ, సిక్కిం రాష్ట్రాలు ఈ నెలసరి సెలవును అమలు చేస్తున్నాయి. అలాగే జొమాటో , స్విగ్గీ, ఎల్ అండ్ టీ, గోజూప్ వంటి సంస్థలు వేతనంతో కూడిన ఈ సెలవును ఇస్తున్నాయి.
ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం: తేజస్వీ యాదవ్ హామీ
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాము (ఇండియా కూటమి) అధికారం లోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ హామీ ఇచ్చారు. పాట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపే ఇందుకు సంబంధించి ప్రతిపాదిత చట్టాన్ని తీసుకు వస్తామని అన్నారు. “20 ఏళ్లలో రాష్ట్ర యువతకు ఎన్డీయే ఉద్యోగాలు కల్పించలేక పోయింది. మేం అధికారం లోకి వచ్చిన 20 రోజుల్లోనే చట్టాన్ని తీసుకువస్తాం. 20 నెలల్లోనే దీన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వ ఉద్యోగాలపై హామీ ఇచ్చాను. నేను అధికారంలో ఉన్న ఆ కొద్ది కాలం లోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించా. నాకు ఐదేళ్ల సమయం ఉంటే ఎన్ని ఉద్యోగాలు ఇస్తానో మీరే ఊహించుకోవచ్చు” అని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను కాపీక్యాట్ అంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కొన్ని నెలలుగా చేపడుతున్న కార్యక్రమాలు గత ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను పోలి ఉన్నాయని ఆరోపించారు.
టమాటా వాహనాన్ని ఢీకొట్టిన డిసిఎం
టమాటా లోడ్తో వెళ్తున్న బోలెరాను కంది మండలంలో వెనుక నుంచి వస్తున్న డిసిఎం గురువారం ఢీ కొట్టింది. వివరాలిలా ఉన్నాయి. బోలెరా వాహనం టమాటాలను తీసుకుని శంకర్పల్లి నుంచి నారాయణఖేడ్కు బయలు దేరింది. కంది ఆర్టిఎ ఆఫీస్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చి డిసిఎం ఢీకొట్టింది. ఫలితంగా బోలెరా వాహనం దెబ్బతిన్నది. జనం టమాటాను తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. డ్రైవర్ మనోజ్కు గాయాలయ్యాయి.ఇంద్రకరణ్ పోలీస్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
హైదరాబాద్ సిటిలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టిబడింది. నగరంలోని సుచిత్ర సర్కిల్లో ఉన్న కాకినాడకు చెందిన పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీలో ఎఫిడ్రిన్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 220 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 77 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మహిళల వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. వన్డే ప్రపంచకప్లో భాగంగా గురువారం విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మంధాన అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా మంధాన రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మంధాన ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్లు ఆడి 982 పరుగులు చేసింది. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా మంధాన నిలిచింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న 970 పరుగుల రికార్డును మంధాన తిరగ రాసింది. క్లార్క్ 1997లో ఈ రికార్డు సాధించింది.
ఎసిబికి చిక్కిన చిట్యాల తహశీల్దార్
నల్లగొండ జిల్లా, చిట్యాల తహశీల్దార్ కృష్ణనాయక్ ఎసిబి అధికారులకు చిక్కాడు. ఈ సంఘటనకు సంబందించిన వివరాలను మహబూబ్నగర్ ఎసిబి డిఎస్పి, నల్లగొండ రేంజ్ ఏసిబి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సిహెచ్ బాలకృష్ణ వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 172, 167 లను మ్యుటేషన్ చేయటానికి ఇన్స్పెపెక్షన్ రిపోర్ట్ ఇవ్వటానికి మధ్యవర్తిగా ఉన్న వ్యక్తితో తహశీల్దార్ 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకుని, దాంట్లో రూ.2 లక్షలు అడ్వాన్సుగా గురువారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో రమేష్ అనే ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా స్వీకరించారు. అదే క్రమంలో ఎసిబి అధికారులు నగదును స్వాధీనం చేసుకుని తహశీల్దార్ కృష్ణనాయక్తో పాటు రమేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నల్లగొండలోని తహశీల్దార్ నివాసంలో కూడా సోదాలు చేస్తున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు.
రెండు తులాల బంగారం కోసం ఒకరి దారుణ హత్య
రెండు తులాల బంగారం, డబ్బు అశ ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చింది. డబ్బు కోసం స్నేహనికి సైతం వెన్నపొటు పొడిచారు. హోమో సెక్స్వల్తో ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారి.. తీరా ప్రాణం తీసే వరకు వచ్చింది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిని దారుణంగా చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హత్య ఆనవాళ్ళు లేకుండా చేసిన ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ ఎసిపి తిరుపతి రెడ్డి గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టిఆర్ జిల్లా, వత్సవాయి మండలం, చిట్యాలకు చెందిన పరిమి అశోక్ (36) ఎం.ఫార్మసీ చదువుకున్నాడు. నాలుగైదేళ్ల క్రితం అతని తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి ప్రయివేట్గా వివిధ పనులు చేసుకుంటున్నప్పటికీ, తద్వారా వచ్చే ఆదాయం అతని జల్సాలకు సరిపోవడం లేదు. దీంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుని వంగతోట వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తనకు తెలిసిన కొందరి వద్ద అప్పులు చేసి సేద్యం చేయగా, నష్టాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతనికి ఖమ్మం క్యూర్ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తున్న తిరుమలాయపాలేం మండలానికి చెందిన కొమ్ము నగ్మా (32)తో ఏర్పడిన పరిచయం కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇదే దశలో ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద కామేపల్లి మండలం, కెప్టెన్ బంజరకు చెందిన గట్ల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ (40)తో అశోక్ కు ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి, ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కానికి దారితీసింది. ఖమ్మం దానవాయిగూడెం సమీపంలోని అశోక్ గదికి వెంకట్ వెళ్ళినప్పుడల్లా అతని ఖర్చులకు కొంత డబ్బు ఇస్తుండేవాడు. ఈ క్రమంలో బల్లేపల్లి సమీపంలోని బాలపేటకు చెందిన పెంటి కృష్ణయ్య అలియాస్ కృష్ణ రామస్వామి అనే వ్యక్తితోనూ కూడా అశోక్కు పరిచయం ఏర్పడింది. ఇది వీరి మధ్య స్నేహం బలపడింది. ధనవంతుడిలా కనిపించే వెంకట్ తన గదికి ఈసారి వచ్చినపుడు అతన్ని ఎలాగైనా చంపి, అతని వద్దగల బంగారం, డబ్బు తీసుకోవాలని అశోక్తోపాటు అతని మిత్రులైన కృష్ణ, నగ్మా పథకం వేశారు. మనిషిని ఎలా చంపాలి, చంపిన మనిషి అవయవాలను ఎలా విడిభాగాలుగా చేయాలి? అనే విషయాలపై యూట్యూబ్లో అశోక్ తెలుసుకున్నాడు. హత్యకు అవసరమైన కత్తులను కూడా కొనుగోలు చేశాడు. సెప్టెంబర్ 15వ తేదీన రాత్రి 8.30 గంటల సమయంలో వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ అశోక్ గదికి వచ్చి నిద్రపోయాడు. ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న నిందితులు గత నెల 16వ తేదీన వెంకట్ నిద్రిస్తున్న సమయంలో నగ్మాను అశోక్ బయట కాపలాగా ఉంచి, నిద్రలో వెల్లకిలా పడుకున్న వెంకట్ గొంతుపై కత్తితో బలంగా నరకడంతోపాటు, మెడపైనా పలుసార్లు పొడిచాడు. దీంతో వెంకట్ తలా, మొండెం వేరయ్యాయి. ఆ తర్వాత అదే కత్తితో వెంకట్ శరీరాన్ని ముక్కలుగా, ముక్కలుగా నరికి కవర్లలో శరీరభాగాలను దూర్చి, దుప్పటిలో మూటగా కట్టి, బైక్పై దుప్పటి మూటను తీసుకువెళ్లి, కవర్లలో కూర్చిన వెంకట్ శరీర భాగాలను కరుణగిరి ప్రాంతంలోని పొదల్లో విసిరేశాడు. ఆ తర్వాత ఘటనకు పాల్పడిన గదిని రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేశాడు. అయితే తన సోదరుడు కనిపించడం లేదంటూ వెంకట్ తమ్ముడు కొండ యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముందు ‘మిస్సింగ్’ కేసుగా నమోదు చేశారు. అయితే ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో ఈ కేసు మిస్సింగ్ నుంచి మర్డర్గా మారింది. మృతుడి సెల్ఫోన్ డేటాను సేకరించడంతో హత్యోందం వెలుగుచూసింది. అశోక్, నగ్మా, కృష్ణ కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక బైక్ ను, హత్యకు గురైన వ్యక్తి నుంచి దోచుకున్న 2.7 తులాల బంగారు గొలుసును, నాలుగు సెల్ ఫోన్లను, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన సింగరేణి సిఐ తిరుపతిరెడ్డి, కామేపల్లి ఎస్ఐ సాయికుమార్, కారేపల్లి ఎస్ఐ గోపి, కానిస్టేబుల్స్ అంజి, ఆనంద్, సంపత్, రాజేష్ను సిపి సునీల్ దత్, ఎసిపి తిరుపతిరెడ్డి అభినందించారు.
ఎన్నికలు ఆగడానికి కారణమైన మాధవరెడ్డి ఎవరు?
ఎన్నికలు ఆగడానికి కారణమైన మాధవరెడ్డి ఎవరు? హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఎంతపని
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 10-10-2025
అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో హడ్సన్ ఇనిస్టిట్యూట్ కు చెందిన
కొబ్బరిబోండాల మాటున గంజాయి అక్రమ రవాణా
కొబ్బరి బోండాల మాటున గంజాయి అక్రమ రవాణా గుట్టును రాచకొండ నార్కొటిక్స్ పోలీస్స్టేసన్, ఈగల్ టీం, ఖమ్మం వింగ్ సంయుక్తంగా రట్టు చేసింది. ముగ్గురు రాజస్థాన్ ట్రాన్స్పోర్టర్లు చోటు నారాయణ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 401 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. గంజాయి అక్రమ రవాణా అవుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ టీం రంగంలోకి దిగింది. రామోజీ ఫిల్మ్ సిటీ, పెద్ద అంబర్పేట్ సమీపంలో విశాఖపట్నం నుండి రాజస్థాన్కు అక్రమంగా 401 కిలోల గంజాయిని రవాణా చేస్తున డిసిఎం వాహనాన్ని అడ్డగించింది. రాజస్థాన్కు చెందిన ముగ్గురు ట్రాన్స్పోర్టర్లను ఈగల్ టీం అరెస్టు చేసింది. కేసులో మొత్తం ఆరుగురు నిందితులు చోటు నారాయణ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్, శ్రీధర్, అషు, పరమేశ్వర్లు ఉండగా, వారిలో ముగ్గురు నిందితులు శ్రీధర్, అషు, రమేశ్వర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఈగల్ టీం తెలిపింది. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్కు చెందిన ఓం బిష్ణోయ్ తన పట్టణంలో గంజాయి రవాణాలో పాలుపంచుకున్నాడు.అతను రాజమండ్రిలోని శ్రీధర్ నుండి అక్రమ వస్తువులను సేకరించి, తన హ్యుందాయ్ వెన్యూలో షిప్మెంట్లను రవాణా చేయడానికి చోటు నారాయణ లాల్ నాయక్ను నియమించుకున్నాడు. అతనికి ప్రతి ట్రిప్కు రూ.25,000 చెల్లించాడు. ఒడిశాలోని జగదల్పూర్లో ఓం బిష్ణోయ్ను అరెస్టు చేసి, తరువాత జైలులో ఉంచినప్పుడు, చోటు నారాయణ లాల్ నాయక్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కిలోగ్రాముకు 2,000 చొప్పున 400 కిలోగ్రాముల గంజాయిని కొనుగోలు చేయడానికి శ్రీధర్తో ప్రత్యక్ష ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత నాయక్ గంజాయిని బికనీర్లోని ఆశుకు కిలోకు 4,000 చొప్పున విక్రయించాలని పథక రచన చేశాడు. ఈ ఆపరేషన్లో రవాణా ఏర్పాట్ల కోసం పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్, పరమేశ్వర్లను కూడా నాయక్ చేర్చుకున్నాడు. తరువాత, అక్రమంగా రవాణా చేసిన వస్తువులను ఒక వ్యాన్లో ఎక్కించి, కొబ్బరికాయల లోడు కింద దాచి, రాజస్థాన్కు వెళ్లాలని పథక రచన చేశారు. కిషన్ లాల్ నాయక్ నడుపుతున్న వ్యాన్కు నాయక్, పుష్కర్ తమ కారులో ఎస్కార్టుగా వెళ్లారు. అబ్దుల్లాపూర్మెట్ ఎక్స్ రోడ్ సమీపంలోని విజయవాడ హైవే వెంట ప్రయాణిస్తుండగా, రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, ఈగల్ టీం, ఖమ్మం వింగ్కు చెందిన సంయుక్త బృందం రెండు వాహనాలను అడ్డగించి చోటు నారాయణ లాల్ నాయక్,కిషన్ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్లను అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి 401.467 కిలోగ్రాముల గంజాయి, వ్యాన్, కారుతో సహా ఐదు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో ఎన్డిపిఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సాహిత్యంలో హంగేరియన్ రచయితకు నోబెల్..
స్టాక్హోమ్ : హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్జ్నా హోర్కె ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘హెర్ష్ 07769’ అనే నవల జర్మనీ లోని సామాజిక అశాంతిని చిత్రీకరించింది. ఈ నవలకే నోబెల్ బహుమతి వరించింది.ఈ నవలలో చనిపోయిన ఇద్దరు అద్బుతమైన వ్యక్తులు తిరిగి వస్తారన్న నమ్మకంతో మోక్షం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద ప్రజల మూఢత్వాన్ని చిత్రీకరించారు. ఇందులో హింస, అందం కలగలసి పోయిందని, ప్రపంచ వినాశనం వంటి తీవ్ర భయానక పరిస్థితుల మధ్య కూడా కళకు ఉన్న అపారమైన శక్తిని తన రచనల ద్వారా బలంగా చాటి చెప్పినందుకు లాస్లోకు ఈ గౌరవం అందిస్తున్నట్టు నోబెల్ కమిటీ అభివర్ణించింది. ఆయన సాహిత్యం సమకాలీన ప్రపంచం లోని సంక్లిష్టతలను, మానవ అస్తిత్వ వేదనను, వినూత్నశైలిలో ఆవిష్కరించారని పేర్కొంది. 07769 నవల తరువాత 1994 లో సినిమాగా డైరెక్టర్ బెలాటార్ రూపొందించారు. ఈ రచనను గొప్ప సమకాలీన జర్మన్ నవలగా పాఠకులు అభివర్ణించారు. అపోకలిప్టిక్ (అలౌకిక) భయాల మధ్య కూడా కళాశక్తిని చాటుతూ ఆయన చేసిన రచనలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. లాస్లో గాఢమైన ఆలోచనలు, మానవ మనస్తత్వాన్ని లోతుగా వ్యక్తపరిచే శైలికి ప్రపంచ వ్యాప్తంగా విమర్శకులు ప్రశంసలు అందుకున్నాయి. గంభీరమైన వాక్య నిర్మాణాలు, నిరాశ, భవిష్యత్తు, గురించి భయపెట్టే ఇతివృత్తాలతో కూడిన పోస్ట్మోడర్న్ ( ఆధునికానంతర )నవలలు రచించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్య రచనలలో ‘సాతాన్ ట్యాంగో’ , ‘ది మెలాంకోలీ ఆఫ్ రెసిస్టెన్స్’ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. ఈ రచనలు మానవుడి ఒంటరితనం, ఆధునిక నాగరికత లోని నిస్సారతపై సాహిత్యపరంగా మంచి పేరు పొందాయి. లాస్లో రచనలు మొదట హంగేరియన్ భాషలో రాయబడినప్పటికీ, అవి అనేక యూరోపియన్ భాషల్లోకి అనువదింపబడ్డాయి. అనేక అంతర్జాతీయ పురస్కారాలు కూడా ఈయనకు లభించాయి. వాటిలో బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ 2015లో లభించింది. సినీ దర్శకుడు బెలా టార్ తీసిన చిత్రాలు కూడా లాస్లో నవలల ఆధారంగా రూపొందడంతో ఆయన రచనలకు అంతర్జాతీయ ఖ్యాతి మరింత పెరిగింది. 1954 లో ఆగ్నేయ హంగేరీలో రొమేనియన్ సరిహద్దుకు సమీపంలో గ్యులా అనే చిన్న పట్టణంలో ఆయన జన్మించారు. ఆయన మొట్టమొదటి నవల ‘సాటం టాంగో’ 1985 లో ప్రచురించారు. ఈ రచన హంగేరీలో సాహిత్య సంచలనం సృష్టించింది. గత ఏడాది దక్షిణ కొరియా రచయిత్రి హాన్కాంగ్కు ఈ బహుమతి లభించింది. హాన్కాంగ్కి ఈ గౌరవం లభించడం ఆసియా సాహిత్యానికి కొత్త ఉత్సాహం కల్పించింది. ఈ సంవత్సరం లాస్లో ఎంపికతో యూరోపియన్ సాహిత్యం మళ్లీ నోబెల్ వేదికపై వెలుగొందింది. ఇక 1901 నుంచి 2024 వరకు 117 సార్లు సాహిత్యంలో నోబెల్ ప్రకటించగా, ఇప్పటివరకు 18 మంది మహిళలు ఈ పురస్కారం అందుకున్నారు.
Pawan’s Promise vs Jagan’s Protest
Politics in Andhra Pradesh was on full display this week. On one hand, former Chief Minister Jagan Mohan Reddy attempted a grand re-entry into public life with his tour in Narsipatnam. On the other hand, Deputy CM Pawan Kalyan walked straight into the heart of a crisis at Uppada and actually tried to fix things. […] The post Pawan’s Promise vs Jagan’s Protest appeared first on Telugu360 .
బిసి బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్
నగరంలో బిసి బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్ అయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. కోటగల్లి బాలికల పాఠశాలలో వెనకబడిన తరగతుల వసతిగృహం నుంచి ముగ్గురు బాలికలు తప్పిపోయినట్లు తెలుస్తోంది. రెండవ టౌన్ ఎస్ఐ ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బిసి బాలిక వసతి గృహానికి చెందిన పదో తరగతికి చెందిన ఇద్దరు, తొమ్మిదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని బుధవారం తెల్లవారుజాము నుంచి హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కనిపించకుండా పోయారని హాస్టల్ వార్డెన్ రెండవ టౌన్లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వసతి గృహంలోని సిసి కెమెరాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
కంటైనర్ లారీ ఢీకొని హోంగార్డు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్లో కంటైనర్ లారీ ఢీకొని హోంగార్డు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన కూరెళ్ల ఉపేంద్ర చారి (36) రామన్నపేట పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో భాగంగా తెల్లవారుజామున వెహికిల్ చెకింగ్ చేస్తుండగా, భువనగిరి నుండి చిట్యాల వైపు వెళుతున్న లారీ కంటైనర్ అతి వేగంగా హోంగార్డుపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలం వద్ద పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఆసుపత్రికి తరలించారు. నివాళులర్పించిన మాజీ ఎంఎల్ఎ చిరుమర్తిః హోంగార్డు ఉపేంద్రచారి మరణవార్త తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎంఎల్ఎ చిరుమర్తి లింగయ్య రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బిఆర్ఎస్ మండల నాయకులు తదితరులు ఉన్నారు. పోలీసుల చేయూతః హోంగార్డు ఉపేంద్రచారి విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదంలో మరణిచడంతో అతని కుటుంబానికి అండగా, తక్షణమే సిపి సుధీర్బాబు హోంగార్డు సంక్షేమ నిధి నుంచి 10 వేల రూపాయలు, భువనగిరి హెడ్ క్వార్టర్స్ తరపున అడిషనల్ ఎస్పి, ఆర్ఐ, ఆర్ఎస్ఐలు, హెచ్ సిసి, ఉమెన్ పిసిఎస్ కలిసి సమకూర్చిన లక్ష రూపాయలను అడిషనల్ ఎస్పి వినోద్కుమార్, అడ్మిన్ ఆర్ఐ శ్రీనివాస్ హోంగార్డు కుటుంబ సభ్యులకు అందజేశారు.
Mass Jathara: Crucial for the Whole Team
Mass Maharaj Ravi Teja hasn’t delivered a strong hit in the recent times. His upcoming movie Mass Jathara is delayed several times and is struggling for the right buzz. The film is announced for October 31st release and the film’s buzz completely depends on the trailer. The songs failed to make an impact. Bhanu Bhogavarapu, […] The post Mass Jathara: Crucial for the Whole Team appeared first on Telugu360 .
అందాలను తిలకించిన పీసీసీఎఫ్
అందాలను తిలకించిన పీసీసీఎఫ్ జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్
వాగు దాటే ప్రయత్నంలో భార్యాభర్తతో పాటు మరొకరు గల్లంతు
జిల్లాలోని పోతిరెడ్డి రెడ్డి చెరువు వద్ద వాగును దాటే ప్రయత్నంలో క్రిష్టాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అంబటాపురం గ్రామానికి చెందిన తనెం బాలయ్య, రాములమ్మ దంపతులిద్దరూ వాగులో కొట్టుకుపోయారు. వీరితో పాటు మరొకరు కూడా గల్లంతు అయినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, మహబూబ్నగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, నవాబుపేట, హన్వాడ, బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్, భూత్పూర్ తదితర మండలాలతో పాటు అనేకచోట్ల భారీ వర్షం కురిసింది. గంటకు పైగా ఉరుములతో కూడిన వర్షపాతం నమోదైంది. నవాబుపేట మండలంలో భారీ వర్షానికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రుద్రారం గ్రామంలో ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కొంతమంది రైతుల ఇళ్లలో దాన్యం, తిండిగింజలు సైతం వర్షార్పణం అయ్యాయి. స్థానిక. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ, వెంకటేశ్వర కాలనీ, మర్లు, వన్టౌన్, పెద్ద చెరువు ప్రాంతం బగీరథ కాలనీ,వీరన్నపేట తదితర కాలనీలో వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్లపై నీరు పెద్ద ఎత్తున చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు.గత రెండు రోజులుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పాత ఇళ్లలో ఉన్న వారు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎక్కడైన ప్రమాదం జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి
జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలం, మారేడుపల్లి గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బింగి సతీష్ తండ్రి చిన్నయ్య 35 రోజూవారీ కార్యక్రమ వ్యవసాయ పనుల్లో భాగంగా వంటచేనుకు మందు పిచికారి చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో పక్కన గల పంటచేలో అమర్చిన విద్యుత్ తీగ షాక్ తగలడంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు విజ్ఞప్తి చేశారు.
టైగర్ సెన్సెస్ కు అటవీ శాఖ రంగం సిద్ధం..
టైగర్ సెన్సెస్ కు అటవీ శాఖ రంగం సిద్ధం.. మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ
బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తోంది: హరీష్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ఆరోపించారు. ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బిసి రిజర్వేషన్ల డ్రామా అని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల అమలు జిఒ నెం.9పై హైకోర్టు స్టే విధించడంపై హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఏనాడైనా బిసి రిజర్వేషన్ల కోసం పాటు పడిందా..? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ఢిల్లీ నేతలతో పోరాటం చేయాలని, అందుకు కలిసి రావడానికి బిఆర్ఎస్ సిద్ధం అని పేర్కొన్నారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బిసిలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని విమర్శించారు. 22 నెలలుగా బిసి రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంతు రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసారు తప్ప, బిసిలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి, తెలివిగా దాన్ని పక్కదోవ పట్టించారని మండిపడ్డారు. బిసిల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జిఒ ఇచ్చి కొత్త నాటకానికి తెరతీసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపి, బిసిల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42 శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడి, పార్లమెంట్లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చాలని డిమాండ్ అన్నారు. బిసిలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించండి.. ఉద్యమ పార్టీగా బిఆర్ఎస్ ఎల్లప్పుడూ బిసిల కోసం గొంతెత్తుతుది... ఢిల్లీని నిలదీస్తుందని హరీష్రావు స్పష్టం చేశారు.
ఆర్టీసిని విధ్వంసం చేసిందే బిఆర్ఎస్ ప్రభుత్వం: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
ఆర్టీసిని విధ్వంసం చేసిందే బిఆర్ఎస్ ప్రభుత్వమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. మళ్లీ నేడు వారు చార్జీల పెంపు, ఆర్టీసి కార్మికుల కష్టనష్టాలపై మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఆయన అన్నారు. గురువారం ఆద్దంకి విలేకరులతో మాట్లాడుతూ నాడు 40 రోజుల పాటు ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తే పట్టించుకోని బిఆర్ఎస్ నాయకులకు ఆర్టీసి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అద్దంకి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఆర్టీసిని క్రమంగా ప్రభుత్వ పరం చేయాలని ఆలోచన ఉన్న సమయంలో బిఆర్ఎస్ నేతలు గందరగోళం సృష్టించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. నేడు ఆర్టీసి నిలబడిందని, ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగిందంటే అందుకు ప్రధాన కారణం సిఎం రేవంత్ రెడ్డి అని అద్దంకి దయాకర్ బిఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు.
అద్భుత బ్యాటింగ్ తో చెలరేగిన రిచా.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మొదట తడబడినా.. రిచా ఘోష్ అద్భుత పోరాటంతో రేసులో నిలిచింది. రిచా పోరాటంతో భారత్, దక్షిణాఫ్రికా జట్టుకు 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 100 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్రమంలో తన అద్భుత బ్యాటింగ్ తో జట్టును తిరిగి రేసులో నిలబెట్టింది. చివర్లలో స్నేహ్ రాణా (33)తో కలిసి దక్షిణాఫ్రికా బౌలర్లలపై విరుచుకుపడింది. ఈ క్రమంలో కేవలం 77 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సులతో 94 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో భారీ షాట్ కు యత్నించి క్యాచ్ ఔట్ గా వెనుతిరగడంతో తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. ఆ తర్వాత వెంట వెంటనే భారత్ చివరి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో 45.5 ఓవర్లలో టీమిండియా 251 పరుగులు చేసింది.
మద్దతు ధరకు మొక్కజొన్న పంట కొనుగోలు
మొక్కజొన్న పంటను మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం సిఎం రేవంత్ రెడ్డితో మద్ధతు ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై చర్చించామన్నారు. మొక్కజొన్న పంటకు కేంద్రం మద్ధతు ధర ప్రకటించినప్పటికి ఇప్పటివరకు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో ముఖ్యమంత్రి సూచనతో రాష్ట్ర ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తుమ్మల ప్రకటించారు. గత సంవత్సరం కేంద్రం కేవలం మద్ధతు ధర ప్రకటనకే పరిమితమై, ఎలాంటి కొనుగోళ్లు జరపకపోయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వమే సుమారు రూ. 535 కోట్లతో రాష్ట్రంలో పండిన జొన్న పంటను మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని, సాగు పరిస్థితులు మెరుగవ్వడంతో సగటున ఎకరాకు 18.50 క్వింటల్ దిగుబడి వచ్చి, మొత్తం 11.56 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్టు మంత్రి వెల్లడించారు. ఈ సీజన్ లో 8.66 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశామని మంత్రి పేర్కొన్నారు. సెప్టెంబర్ 3 వ వారం నుండే మార్కెట్లోకి భారీగా మొక్కజొన్న పంట రావడం వలన ధరలు తగ్గిపోయాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత మార్కెట్ ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి క్వింటాకు రూ. 2,400 కన్నా రూ. 441 తక్కువగా రూ. 1,959 రూపాయలు ఉందని, దీని వలన మొక్క రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 8.66 లక్షల మెట్రిక్ టన్నులు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వంపై రూ. 2400 కోట్ల భారం పడుతుందని, అయినప్పటికి రాష్ట్ర రైతుల ప్రయోజనం కోసం మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రైతులు తమ ఉత్పత్తిని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. రాష్ట్రంలోని మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఈ మద్దతు ధర అవకాశాన్ని వినియోగించుకొవాలని మంత్రి కోరారు. తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు చేయకుండా, మార్క్ ఫెడ్ నిర్వహిస్తున్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రైస్ సపోర్ట్ స్కీం కింద కేంద్రం కొనుగోలు చేసే పెసర, మినుము, సోయాచిక్కుడు, కంది, వేరుశనగ లాంటి పంటలపై కేంద్రం 25 శాతం సీలింగ్ విధించిందని, రైతులు పండించిన పంటలను పూర్తిగా కొనగోలు చేయడానికి ఈ సీలింగ్ అడ్డంకిగా మారుతుందన్నారు. ఈ సీలింగ్ ను దాటి రైతులు పండించిన మొత్తం పంటను మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు మంత్రి తెలిపారు. మొక్కజొన్న, జొన్న లాంటి పంటలకు కేవలం మద్ధతు ధర ప్రకటనలకే పరిమితం కాకుండా ధరలు పడిపోయినప్పుడు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినట్లైతే రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉండదని మంత్రి వివరించారు.
Telangana : హైకోర్టు తీర్పుపై మల్లు భట్టి విక్రమార్క ఏమన్నారంటే?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు
నాలుగు రోజుల్లో రెండు ఆవుల మృతి..!
నాలుగు రోజుల్లో రెండు ఆవుల మృతి..! ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర
జట్టుకు కోహ్లి, రోహిత్ అవసరం ఉంది” – గిల్ స్పందన #viratkohli #rohithsharma #shubmangill #cricket
హైకోర్టు తీర్పుపై ఎలక్షన్ కమిషన్ రియాక్షన్ ఇదే..
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. గురువారం ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, 42 శాతం బిసి రిజర్వేషన్లతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల సంఘం స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకే వ్యవహరిస్తామని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడినట్లు అయ్యింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జిఓ 9 తీసుకొచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ జిఓను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఈ క్రమంలో నిన్న, ఇవాళ రెండు రోజులు.. పిటిషనర్ల తరుఫు న్యాయవాది, అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న హైకోర్టు 42 శాతం బిసి రిజర్వేషన్ల అమలు జిఓతోపాటు ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి నాలుగు వారాలు, పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఆరు వారాలకు వాయిదా వేసింది.
మూడేళ్లుగా కనిపించని యంత్రాలు కుబీర్. ఆంధ్రప్రభ : అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
బకాయిలు చెల్లిస్తేనే వైద్య సేవలు..
బకాయిలు చెల్లిస్తేనే వైద్య సేవలు.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఏపీలో ప్రైవేటు
Pawan Kalyan : ఉప్పాడ మత్స్యకారులకు పవన్ హామీలు ఇవే
ఉప్పాడ మత్స్యకారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి..
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.. ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ :
వన్డే ప్రపంచకప్: దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. ఆరో వికెట్ కోల్పోయిన భారత్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా తడబడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ వరుస వికెట్లు కోల్పోతోంది. ఇప్పటికే రెండు వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ ను దక్షిణాఫ్రికా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో బెంబేలెత్తిస్తున్నారు. దీంతో టీమిండియా 100 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో శుభారంభం దక్కినా.. తర్వాత క్రమం తప్పకుండా భారత్ వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు స్మృతి మంధానా(23), ప్రతికా రావల్(37)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో భారత్ 102 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అమన్ జ్యోత్ కౌర్, రిచా ఘోష్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో వికెట్ చేజార్చుకోకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం టీమిండియా 33 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.
దేశ బహిష్కరణే శిక్ష! హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న
గిరిజనులకు దుప్పట్లు పంపిణీ దండేపల్లి, ఆంధ్రప్రభ : వార్త సేకరణలోనే కాకుండా సామాజిక
Ys Jagan : నర్సీపట్నానికి జగన్ ఆరుగంటల ప్రయాణం
వైసీపీ అధినేత జగన్ అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం వైద్య కళాశాలను పరిశీలించారు
జీవితం కోసం ‘సూపర్’ ఆదా హిందూపురం , అక్టోబర్ 9 (ఆంధ్రప్రభ) :
ప్రశంసించిన స్థానికులు వెల్గటూరు, ఆంధ్రప్రభ : వెల్గటూరు ఎస్సై ఆర్. ఉమా సాగర్(R.
42% బిసి రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే.. స్థానిక ఎన్నికలకు బ్రేక్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జిఓ 9పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. రెండు రోజులుగా కొనసాగిన ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు గురువారం జిఓ 9పై స్టే విధిస్తూ తీర్పు వెల్లడించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలు తెలుపేందుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది న్యాయస్థానం. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఆరు వారాలకు వాయిదా వేసింది. బిసి రిజర్వేషన్లతోపాటు ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా కోర్టు స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలకు బ్రేకు పడింది. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందోనని అందరిలో చర్చ నెలకొంది.
సహజంగా తగ్గండిలా.. మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. తిండి-నిద్ర వేళలు ఏవీ సరైన
డి యం హెచ్ ఓ .డా ఈ బి దేవివిశాలాంధ్ర -అనంతపురం : జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. దేవి టోభాకో ప్రీ యూత్ కాంపెయిన్ 3.O ను జెండా ఊపి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు గురువారం ప్రారంభించారు. అక్టోబర్ 9 వ తేదీ నుండి డిసెంబర్ 08 వ తేదీ వరకు పొగాకు వ్యతిరేకంగా ప్రజలలో మరియు ముఖ్యంగా యువతకు అవగాహన […] The post పొగాకు కు యువత దూరంగా ఉండాలి appeared first on Visalaandhra .
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన బాధితులకు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. గ్రామానికి చెందిన డోలు రామాంజనేయులుకు 61,500 రూపాయలు, కోసిగి ఈరమ్మకు 25,000 రూపాయల చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం […] The post ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ appeared first on Visalaandhra .
ఎస్టీపీతో నీటి కాలుష్యాన్ని తగ్గిస్తాం..
ఎస్టీపీతో నీటి కాలుష్యాన్ని తగ్గిస్తాం.. చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఎస్టీపీతో నీటి
Telangana High Court Stays GO 9 Granting 42% BC Quota in Local Body Polls
In a significant development, the Telangana High Court has stayed the implementation of Government Order (GO) 9, which proposed 42% reservation for Backward Classes (BCs) in the upcoming local body elections. The court passed interim orders after two days of detailed arguments, putting a temporary halt to the state government’s move to increase political representation […] The post Telangana High Court Stays GO 9 Granting 42% BC Quota in Local Body Polls appeared first on Telugu360 .
ఆర్టీసీ బస్సులో మహిళ మెడ లోని బంగారు గొలుసు చోరీ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్టీసీ బస్సుల్లో ఓ మహిళ మెడలో బంగారు గొలుసు చోరీకి గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం నుండి ధర్మవరానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో బంగారు గొలుసులు గుర్తుతెలియని దొంగ దొంగలించాడు అని బాధితురాలు జమున తెలిపింది. చెన్నై కొత్తపల్లి మండలం గంగినేపల్లి తండాకు చెందిన రవి నాయక్ భార్య జమున బుధవారం ఉదయం తన కుమార్తెను కళాశాలకు వదిలి పెట్టేందుకు అనంతపురం కు పోవడం జరిగిందని, ఆ […] The post ఆర్టీసీ బస్సులో మహిళ మెడ లోని బంగారు గొలుసు చోరీ appeared first on Visalaandhra .
160 గంజాయి మొక్కల స్వాదీనం ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : వ్యవసాయ పంట
పోషణ్ మాహ్ ఉన్నతమైన కార్యక్రమం
పోషణ్ మా ఉన్నతమైన కార్యక్రమం చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : స్వస్త్ నారీ
ఉప్పాడ మత్స్య కారుల సమస్యలపై చర్చించాం: పవన్
అమరావతి: పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదలడం వల్ల మత్యసంపద దెబ్బతింటుందని అన్నారు. ఉప్పాడ మత్స్యకారుల బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పాడ మత్స కారుల సమస్యలపై చర్చించామని తెలియజేశారు. ఉప్పాడ సి ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని, పరిశ్రమల వ్యర్థాల శుద్ధిపై మూడు దశల్లో పరిశీలిస్తాని చెప్పారు. మత్యకారులు ఎక్కడికి చెబితే అక్కడికి మూడ్రోజుల్లో వస్తానని, చేపల వేటను కొనసాగిస్తూ ఉప్పాడలో 7,193 మత్స్య కారుల కుటుంబాలు ఆధారపడ్డాయని పేర్కొన్నారు. పరిశ్రమల వ్యర్థాల శుద్ధిపై మూడు ధశల్లో పరిశీలిస్తానని, రూ. 323 కోట్లతో సి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉందని, ఉప్పాడ సి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంపై ఈ నెల 14న సమావేశం ఉందని, ఉప్పాడ సి ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తానని మాట ఇస్తున్నానని పవన్ కల్యాణ్ హామి ఇచ్చారు. ఉప్పాడ- కొణపాక మధ్యతీర రక్షక పనులు ప్రారంభించామని, పరిశ్రమలకు వ్యతిరేకం కాదని మత్స్యకారులు చెబుతున్నారని అన్నారు. వ్యర్థాలు ఎక్కడ కలుస్తున్నాయో.. అక్కడికే బోటులో వెళ్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 323
మానవతాన్ని చాటుకున్న వన్టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని ఎల్సికేపురం, వైయస్సార్ సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనాలు రెండు డి కొనగా, అప్పుడే అక్కడే విధులలో ఉన్న వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ ఆ ప్రమాదాన్ని గమనించి, వెనువెంటనే తన వాహనంలో క్షతగాత్రులను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అనంతరం ప్రభుత్వ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వారు కోరారు. దీంతో స్థానికులు వన్ టౌన్ సీఐ మానవత్వాన్ని చాటుకుని చాటుకున్నారని, ఇప్పటికే వన్ టౌన్ పరిధిలో సిఐకు మంచి […] The post మానవతాన్ని చాటుకున్న వన్టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ appeared first on Visalaandhra .
రెండో అంతస్తుపై కొండచిలువ #indianpython #bachupally #kondachiluva #telugupost #viralvideo #news
Telangana : తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. జీవో 9పై స్టే
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో సంచలన నిర్ణయం ప్రకటించింది. జీవోనెంబరు 9 పై స్టే విధించింది
వీటి సేవలు మధుర జ్ఞాపకం మాత్రమే!
వీటి సేవలు మధుర జ్ఞాపకం మాత్రమే! మక్తల్, ఆంధ్రప్రభ : సాంకేతిక పరిజ్ఞానం
వైయస్సార్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా ముగ్గురి ఎంపిక
విశాలాంద్ర ధర్మవరం ; వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన పెద్దిరెడ్డి శ్రీనివాసులు, గోరకాటి పురుషోత్తం రెడ్డి, గడ్డం కుళ్లాయప్పలను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మవరం ట్రస్టర్ 2 పట్టణ అధ్యక్షులు కోటిరెడ్డి బాల్రెడ్డి ఆధ్వర్యంలో వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపికైన వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధికి నిరంతరం పోరాటం చేస్తామని, ప్రజా […] The post వైయస్సార్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా ముగ్గురి ఎంపిక appeared first on Visalaandhra .
డిజైనర్ నాగరాజును ఘనంగా సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు…
అధ్యక్షులు సంకారపు జయశ్రీవిశాలాంధ్ర ధర్మవరం : పట్టణానికి చెందిన డిజైనర్ నాగరాజ్ చేనేత డిజైన్ డెవలప్మెంట్ నందు జాతీయ అవార్డును కేంద్ర మంత్రుల ద్వారా న్యూఢిల్లీలో భారత్ మండపమునందు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ వారి స్వగృహంలో డిజైనర్ నాగరాజును ఘనంగా సన్మానించారు. అనంతరం జయశ్రీ మాట్లాడుతూ దేశ, రాష్ట్రస్థాయిలో డిజైనర్ నాగరాజు చేనేత వృత్తికి, పరిశ్రమకు మంచి గుర్తింపును తేవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇలాంటి […] The post డిజైనర్ నాగరాజును ఘనంగా సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు… appeared first on Visalaandhra .
Siddu’s Telusu Kada Pre-Trailer: Intriguing and Fun
Telusu Kada starring Siddhu Jonnalagadda, Raashii Khanna, Srinidhi Shetty has become one of the most anticipated films in Telugu Cinema. The movie teaser, promotional material and mainly, songs have become viral hits. S Thaman did a brilliant job in building massive buzz for the film, as a composer. The makers have announced the trailer release […] The post Siddu’s Telusu Kada Pre-Trailer: Intriguing and Fun appeared first on Telugu360 .
Video : Sircilla Election survey 2025
The post Video : Sircilla Election survey 2025 appeared first on Telugu360 .
భారత్లో తయారైన 3 దగ్గు సిరప్ల్లో విషపదార్థాలు.. WHOకి భారత్ నివేదిక
మార్కెట్ నుంచి ఉపసంహరణ భారత్ ప్రభుత్వం మూడు దగ్గు సిరప్లలో ప్రమాదకర రసాయన పదార్థం కలుషితమైందని గుర్తించి వాటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది.ఈ విషయం గురించి భారత్ బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కి అధికారికంగా సమాచారం అందించింది.తెలంగాణ,తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోని శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్,రెడ్నెక్స్ ఫార్మా,షేప్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన కోల్డ్రిఫ్ (Coldrif),రెస్పిఫ్రెష్ TR (Respifresh TR),రీలైఫ్ (ReLife) పేర్లతో ఉన్న సిరప్లలో డయిథిలీన్ గ్లైకాల్ (DEG) అనే ప్రమాదకర రసాయనం ఎక్కువ మోతాదులో […] The post భారత్లో తయారైన 3 దగ్గు సిరప్ల్లో విషపదార్థాలు.. WHOకి భారత్ నివేదిక appeared first on Visalaandhra .
నాపై దాడి కూడా నాటకమన్నారు#TeluguPost #telugu #post #news
Fact Check: Viral Video Claiming Chemical Ripening of Fruits Is AI-Generated
Artificial ripening is a controlled process used to induce fruits to ripen faster. It often relies on the use of
కొత్త సంస్కరణలతో ఎంతో మేలు..
కొత్త సంస్కరణలతో ఎంతో మేలు.. (ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి
రైతులకు ప్రభుత్వ సేవల విషయంలో కీలకపాత్ర పోషించాలి: చంద్రబాబు
అమరావతి : రైతు సేవా కేంద్రాలను రీ- ఓరియంటేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు తెలిపారు. రైతులకు ప్రభుత్వ సేవల విషయంలో కీలకపాత్ర పోషించాలని అన్నారు. రైతులకు సేవలందించేలా రైతు సేవా కేంద్రాలను తీర్చిదిద్దాలని చెప్పారు. వ్యవసాయశాఖ, అనుబంధ రంగాలపై సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచి పోషక విలువల ద్వారా భూసారం, ఉత్పాదకత పెంచాలని, రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రకృతి సేద్యం ద్వారా ప్రయోజనాలు రైతులకు వివరించాలని, క్షేత్రస్థాయిలో ఉండేవారికి పూర్తిస్థాయి అవగాహన ఉండేలా చూడాలని ఆదేశించారు. పోషకాల విషయంలో లోపాలను సవరించి ప్రణాళికలు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
ఎయిర్ఫోర్స్డే డిన్నర్ మెనూ వైరల్#TeluguPost #telugu #post #news
క్లాస్ రూములో పాములు దర్శనం – భయంతో పరుగులు పెట్టిన విద్యార్థులు #vikarabadnews #school #snakes
Breaking : జీవోనెం.9పై హైకోర్టు స్టే…
జీవోనెం.9పై హైకోర్టు స్టే… హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీసీ రిజర్వేషన్ లో కీలకమైన
Kavitha Opens Up: A Deep Sense of Betrayal by BRS
Kalvakuntla Kavitha has broken her silence with a powerful message. Once a strong pillar of the Bharat Rashtra Samithi (BRS), now says there is no going back. Her words were clear. Even if her father KCR himself asked her to return, she would not. Kavitha shared that she felt deeply hurt when those closest to […] The post Kavitha Opens Up: A Deep Sense of Betrayal by BRS appeared first on Telugu360 .
భద్రతా ఏర్పాట్లు సమీక్ష ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఈవీఎం
రైతులపై కక్షగట్టిన కూటమి ప్రభుత్వం
రైతులపై కక్షగట్టిన కూటమి ప్రభుత్వం హిందూపురం, అక్టోబర్ 9 (ఆంధ్రప్రభ) : సత్యసాయి
జగిత్యాల కోర్టు ఆదేశాలు జగిత్యాల, ఆంధ్రప్రభ : జగిత్యాల ఆర్డీవో కార్యాలయ సామాగ్రిని
ఏపీలో వ్యవసాయంపై సీఎం చంద్రబాబు ఫోకస్..ఆర్ఎస్కేల ప్రక్షాళనకు ఆదేశం
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేసేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) స్వరూపాన్ని పూర్తిగా మార్చి, వాటిని రైతులకు సమస్త సేవలు అందించే కీలక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో వ్యవసాయ శాఖ పనితీరుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు ప్రభుత్వ సేవలు అందించడంలో ఆర్ఎస్కేలే ప్రధాన పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. […] The post ఏపీలో వ్యవసాయంపై సీఎం చంద్రబాబు ఫోకస్..ఆర్ఎస్కేల ప్రక్షాళనకు ఆదేశం appeared first on Visalaandhra .
"వెలిగొండ అటవీ అంచుల్లో పులుల సంచారం – భయంతో రైతులు పొలాలకు దూరం" #nallamallaforest #tiger #chirutha
Exclusive: Nani’s The Paradise out of Summer 2026 Race
Natural Star Nani is one actor who has perfect plans about the shoot and the release of his films. None of his recent films missed the deadlines and the young actor has a habit of announcing the release dates of his films well in advance. For the first time in the recent times, Nani will […] The post Exclusive: Nani’s The Paradise out of Summer 2026 Race appeared first on Telugu360 .
పీపీపీ విధానం బెస్ట్ అనంతపురం బ్యూరో, అక్టోబర్ 9 (ఆంధ్రప్రభ) : మెడికల్
దేవరకొండలో బీఆర్ఎస్ సమావేశం
దేవరకొండలో బీఆర్ఎస్ సమావేశం దేవరకొండ, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్
ఇలాంటి టైమ్లో శిక్షణ? ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : మల్దకల్
పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ
పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ కడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో జరుగుతున్న మొదటి విడత
బాధితుల ఆందోళన హిందూపురం, అక్టోబర్ 8 (ఆంధ్రప్రభ) : సత్యసాయి జిల్లా హిందూపురం
బీఆర్ఎస్ నేతలు సంతాపం సంగారెడ్డి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల(Gummadila) మున్సిపాలిటీ
టేకాఫ్ తరువాత కుప్పకూలిన ప్రైవేట్ జెట్..Private jet crash in UP #telugupost #planecrash #viralvideo
విధి వంచితులు ఈ అక్కాతమ్ముళ్లు కష్టాల్లో కూరుకుపోయిన మేడిపల్లి కుటుంబం" #karimnagar #brothersister
బిసి జనాభా 57.6 శాతం ఉంటే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం: ఎజి
హైదరాబాద్: బిసి రిజర్వేషన్లపై రెండో రోజు హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. బిసి కులగణనపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం తరువాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని, ఇంటింటికెళ్లి సర్వే చేశారని, సర్వే ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. బిసి జనభా 57.6 శాతం ఉన్నారనడంలో ఎవరూ కాదనడం లేదన్నారు. 57.6 శాతం జనాభా ఉన్నా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎజి తెలియజేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని, రాజకీయ వెనుకబాటుతనం ఉందని అసెంబ్లీ గుర్తించి తీర్మానం చేసిందని, గ్రామీణ, పట్టణ సంస్థల్లో బిసిలకు 42 శాతం ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయం తీసుకుందని వివరించారు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టేనని, ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదన్నారు. గడువులోగా గవర్నర్ ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని, తమిళనాడు ప్రభుత్వం, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నోటిఫై చేయనక్కర్లేదని, అసెంబ్లీ చేసిన చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉందని ఎజి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్లు అనేది రాష్ట్ర ప్రజల కోరిక అని, దాన్ని అసెంబ్లీ ఆమోదించిందన్నారు., శాస్త్రీయ పద్దతిలో కులగణన సర్వే జరిగిందని, సర్వేలో అన్ని కులాల లెక్కలు తెలిశాయని, బిసిల్లోని సబ్ కేటగిరీల వారీగా వివరాలు సర్వేలో తేలాయని, సర్వేలో అగ్రవర్ణాల లెక్కలు కూడా బయటకు వచ్చాయని ఎజి వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికట నోటిఫికేషన్ వెలువడిందని, కొందరు ఇది నోటిఫికేషన్ కాదంటున్నారని, అది తప్పు అన్నారు. నోటిఫికేషన్ ప్రతులను ధర్మాసనం ముందు ఉంచామని, నోటిఫికేషన్ ఇచ్చాక న్యాయస్థానాల జోక్యం ఉండదని, నోటిఫికేషన్ వచ్చాక కోర్టులు జోక్యం చేసుకోవద్దని ఉన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేశారు.
భారీ బందోబస్తు ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఎన్నికల నిబంధనలు
అంతర్జాతీయ సదస్సులో తుడా చైర్మన్
అంతర్జాతీయ సదస్సులో తుడా చైర్మన్ తిరుపతి తుడా, అక్టోబర్ 9 (ఆంధ్రప్రభ): ఢిల్లీలో