Can’t Guess Dacoit Story Beyond First Half An Hour: Sesh
Adivi Sesh, who is on the verge of scoring double blockbusters, is coming to theatres this summer with Dacoit, releasing on the 10th of this month. The team has put nearly two years of effort into the film, and their hard work is clearly reflected in the trailer unveiled today. Sesh thanked Anurag Kashyap and […] The post Can’t Guess Dacoit Story Beyond First Half An Hour: Sesh appeared first on Telugu360 .
Hyderabad : నేడు సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్లో నేడు సేవ్ సింగరేణి పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది
Revanth Reddy : నేడు రేవంత్ రెడ్డి షెడ్యూల్
నేడు తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది
అల్లూరు జిల్లాలో స్వల్ప భూకంపం..
అల్లూరు జిల్లాలో స్వల్ప భూకంపం.. విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో : ఉమ్మడి విశాఖలోని
Vijayawada : నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ
విజయవాడలో ఉగ్రవాదుల లింకు కేసులో నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది
5thAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
5thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
IPL 2026 : గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం
రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ పై గెలిచింది
Andhra Prabha SPL Story |ఉత్తరాది, దక్షిణాది సమతౌల్యం కీలకం..
Andhra Prabha SPL Story | ఉత్తరాది, దక్షిణాది సమతౌల్యం కీలకం.. Andhra
Israel - Iran War : ఆరో వారానికి చేరుకున్న యుద్ధం... ట్రంప్ హెచ్చరికలు మామూలే
ఇజ్రాయిల్ - ఇరాన్ యుద్ధం ఆరో వారానికి చేరుకుంది
5thAprilchintana |క్షీరసాగర మథనం ద్వారా ఆధ్యాత్మిక సందేశం..
5thAprilchintana | క్షీరసాగర మథనం ద్వారా ఆధ్యాత్మిక సందేశం.. 5thAprilchintana | పాలకడలి
Andhra Prabha SPL Story |చమురు కంపెనీల నష్టాలు.. ప్రభుత్వ చర్యలు..
Andhra Prabha SPL Story | చమురు కంపెనీల నష్టాలు.. ప్రభుత్వ చర్యలు..
5thAprileditorial |ఇరాన్ యుద్ధం వల్ల పెరుగుతున్న ధరల భారం..
5thAprileditorial | ఇరాన్ యుద్ధం వల్ల పెరుగుతున్న ధరల భారం.. 5thAprileditorial |
Breast cancer |భారత్లో బ్రెస్ట్ క్యాన్సర్ పరిస్థితి మరియు గణాంకాలు..
Breast cancer | భారత్లో బ్రెస్ట్ క్యాన్సర్ పరిస్థితి మరియు గణాంకాలు.. Breast
వాషింగ్టన్ : 48 గంటల్లోగా హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ సర్వనాశనం అవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ను హెచ్చరించారు. ఒప్పందం చేసుకోవడానికి , జలసంధిని తెరవడానికి ఇప్పటికే తాను ఇరాన్కు ఇచ్చిన పది రోజుల గడువు ముగిసిపోయిందని, అయినా అదనంగా మరో 48 గంటల సమయం ఇస్తున్నానని ఆయన వెల్లడించారు.ఈ గడువు ఏప్రిల్ 6 నాటికి ముగిసిపోతుందని, ఈలోగా హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ సర్వనాశనం కాక తప్పదని ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలు, చమురుబావులు,కీలకమైన మౌలిక సదుపాయాలు అన్నీ నాశనం చేస్తామని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. అమెరికన్ పైలట్ కోసం గాలింపు అమెరికాకు చెందిన ఎఫ్15 యుద్ధ విమానాన్ని ఇరాన్ తమ గగనతలంలో కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరిని రిస్కూటీమ్ రక్షించింది. మరో పైలట్ తప్పించుకున్నాడు. అతడి ఆచూకీ కోసం ఒకవైపు అమెరికా, మరోవైపు ఇరాన్ దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇరాన్ లోని స్థానిక ప్రజలు కూడా ఆ పైలట్ కోసం గాలిస్తున్నారు. అమెరికా పైలట్ కనిపిస్తే బంధించాలని, లేదా చంపాలని అలా చేస్తే భారీ నజరానా అందిస్తామని స్థానిక గవర్నర్ ప్రకటించగా, ఇరాన్ ఆర్మీ మాత్రం తమకు పైలట్ పట్టుబడితే అతడిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ ఖైదీగా పరిగణించి అంతర్జాతీయ న్యాయస్థానానికి అప్పగిస్తామని ప్రకటించింది. శుక్రవారం ఇరాన్ కూల్చివేసినట్టు చెప్పబడుతున్న అమెరికా రెండు యుద్ధ విమానాల్లో ఒకటి అమెరికా ఎఫ్15 ఇగా గుర్తించారు. విమానాలు రెండు కూలిపోవడం, పైలట్ కోసం ముమ్మరంగా గాలించడం, సహాయక చర్యలు కొనసాగించడంపై చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరాకరించారు. ఏం జరిగినా అవి చర్చలపై ప్రభావం చూపవని ప్రకటించారు. దుబాయ్లో సాంకేతిక దిగ్గజం ఒరాకిల్పై దాడి దుబాయ్ లోని ఒరాకిల్ ప్రధాన కేంద్రంపై ఇరాన్ శనివారం డ్రోన్లతో దాడి చేసింది. దుబాయ్లోని షేక్ జయేద్రోడ్ హైవేలో ఒరాకిల్ ప్రధాన కేంద్రంపై ఈ దాడి జరిగింది.భవనం శిథిలాలు కూలి స్వల్పంగా కొందరికి గాయాలయ్యాయి. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి 1900 మంది కన్నా ఎక్కువ మంది ఇరానీయులు మృతి చెందగా, అరబ్ దేశాలు, ఆక్రమిత వెస్ట్బ్యాంకులో రెండు డజన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్లో 19 మంది ,అమెరికా సిబ్బంది 13 మంది మృతి చెందారు. లెబనాన్లో 1300 ప్రజలు ప్రాణాలు కోల్పోగా, మిలియన్ మంది నిర్వాసితులయ్యారు. అక్కడ 10 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు.
5thApril2026 |ఆదివారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
5thApril2026 | ఆదివారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 5thApril2026 |
మన తెలంగాణ/హైదరాబాద్: ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ప్రదర్శనలు లేకుండా ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని సిఎం సూచించారు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా లో నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. సోమవారం(ఏప్రిల్ 6) రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. మాస్టర్ప్లాన్ను పరిశీలించిన సిఎం పలు మార్పులు సూచించారు. సంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకొని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ బా సర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సిఎం అధికారులకు సూచించా రు.భవిష్యత్ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రో డ్లు నిర్మించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్తులో భారీ వృ క్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలు నాటాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని... పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు.ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలని... ఆలయ ప్రాంగణంలోకి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి) ద్వారానే చేరుకునేలా చూడాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సిఎం సూచించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూప్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ది పనుల నాణ్యతలో రాజీపడితే ఏమాత్రం సహించేది లేదని సిఎం హెచ్చరించారు. జ్ఙాన సరస్వతి ఆలయ అభివృద్ధిపై జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపి వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఏ క్షణమైనా గ్రేటర్ ఎన్నికల నగారా
మన తెలంగాణ/హైదరాబాద్: ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.. కాబట్టి ఎదుర్కొని విజయం సాధించేందుకు ప్రతి నాయకుడు, ప్రతి కా ర్యకర్త సిద్ధంగా ఉండాలి’ అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ - గో ల్కొండ జిల్లా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం పార్టీ రాష్ట్ర కా ర్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఉమా మహేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల ను అప్రమత్తం చేశారు. తన ప్రసంగంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో లేదా వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉందన్నారు. దీనికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. బూత్ కమిటీలను బలోపేతం చేసుకోవాలని, అన్ని బూత్ కమిటీల నియామకాన్ని తక్షణమే పూర్తి చేయాలని చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ, ‘స్పెషల్ సమ్మరీ రివిజన్‘ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి డివిజన్ ప్రెసిడెంట్ మరియు సీనియర్ నాయకులు తమ డివిజన్లో కొత్త ఓట్లను నమోదు చేయించాలని ఆయన సూచించారు. ఇంకా బూత్ స్థాయి కార్యకర్తలందరికీ రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ప్రజలనూ కలుపుకుని వెళ్లేందుకు త్వరలో పార్టీ పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.ఈ నెల 5 (ఆదివారం) బాబూ జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 6న బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని, 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ప్రజలతో కలిసి నిర్వహించుకోవాలని ఆయన చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్, జోనల్ కమిషనర్, జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తన కార్యాలయం నుండి అధికారిక లేఖలు తీసుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో గోల్కండ జిల్లా ఇంఛార్జి శ్రీధర్, జి. శంకర్ యాదవ్, లాల్ సింగ్, డా. సురక్ష ఓం ప్రకాష్, రాకేష్ జైస్వాల్, అమర్ సింగ్ జి, నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పాసం సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సురేందర్, అనంత కృష్ణ, శ్రీరామ్ వ్యాస్, నటరాజ్ నామధారి, నర్సింహ మరియు డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అరాచకాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఎదిరించి, మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సాధించిన ఘనవిజయాన్ని ప్రజాస్వామ్య జయకేతనంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభివర్ణించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బిఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. నూతనంగా మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పార్టీ యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ (బంటి)తో పాటు, పార్టీ శ్రేణులకు కెటిఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అడ్డదారుల్లో మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, మరెన్ని ఒత్తిళ్లు తెచ్చినా వేటికీ లొంగకుండా, మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్ల ధైర్యానికి ఆయన సెల్యూట్ చేశారు. అలాగే క్యాతనపల్లి విజయంలో మిత్రపక్షమైన సిపిఐ కామ్రేడ్లు కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణలో అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు తావులేదని ఈ ఎన్నికల తీర్పు స్పష్టంగా తేల్చి చెప్పిందని అన్నారు. కేవలం రెండున్నరేళ్ల పాలనలోనే పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి, ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలు చాటిచెబుతున్నాయని అన్నారు. అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని కెటిఆర్ భరోసా ఇచ్చారు. ఈ విజయాలు అందించిన స్ఫూర్తితో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగునా విధ్వంసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని కెటిఆర్ హెచ్చరించారు.
ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి బిఆర్ఎస్ కైవసం
మన తెలంగాణ/హైదరాబాద్: గతంలో వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలి టీ చైర్మన్ పీఠాలను బిఆర్ఎస్ కైవసం చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య తాజాగా జరిగిన ఎన్నికలో రెండు మున్సిపాలిటీలను బిఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్గా ర్మన్గా సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా బిజెపి కౌ న్సిలర్ ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. అ లాగే మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్గా బిఆర్ఎస్ అభ్యర్థి సంధ్యారాణి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్పర్సన్ పదవిని సిపిఐ అభ్యర్థి సరిత దక్కించుకున్నారు. ఈ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల వాయిదా పడింది. ఈ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం నెలకొంది. అధికారులతో ఎంఎల్ఎ, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో ఛైర్మన్ ఎన్నిక గందరగోళం మధ్య వాయిదా పడింది. ముందుగా ఛైర్పర్సన్ ఎన్నిక వేళ అధికారులు బిజెపి అభ్యర్థి మౌనిక పేరు ప్రతిపాదించారు. మౌనికకు మద్దతుగా ఎనిమిది మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. ఎన్నిక తీరుపై ఎంఎల్ఎ వెడ్మ బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా బిజెపి అభ్యర్థి పేరు ఎలా ప్రతిపాదిస్తారంటూ ఆందోళన చేశారు. అధికారులతో వెడ్మ బొజ్జు వాగ్వాదానికి దిగారు. దీంతో ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ఎప్పుడు నిర్వహించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. సమావేశం నుంచి ఎంఎల్ఎ వెడ్మ బొజ్జు బయటకు వెళ్లిపోయారు. మున్సిపల్ కార్యాలయం ముందు బిజెపి, బిఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. వెడ్మ బొజ్జుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ అభ్యర్థికి మెజారిటీ ఉన్నా ఛైర్మన్గా ప్రకటించలేదని బిజెపి, బిఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు.
మన తెలంగాణ/ గజ్వేల్: గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని జిల్లా కాం గ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ శ్రేణులు ముట్టడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బిగించి బీ ఆర్ఎస్, కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కేసీఆర్ ఇప్పటికే రూ.కోటి 20 లక్షల వేతనం, ఇతర అలవెన్సులు పొందినట్లు అంక్షారెడ్డి ఆరోపించారు. వెంటనే ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండని కేసీఆర్ ఒక్క క్షణం కూడా ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేసీఆర్ అందుబాటులో ఉండకపోవడంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ నిలిచినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆయన స్పందించకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎర్రవల్లి ఫామ్హౌస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక్కడి సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ఘోరంగా వైఫల్యం చెందారు. గజ్వేల్ ప్రజలు, ముంపు బాధితులను నట్టేట ముంచినట్లు ఎద్దేవా చేశారు. దమ్ముంటే కేసీఆర్ నిర్వాసిత గ్రామాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గజ్వేల్ ప్రజలను గాలికి వదిలినా, పట్టించుకోకున్నా, సీఎం రేవంత్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అడిగినన్ని నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ క్యాంప్ కార్యాలయం అన్నింటికీ అడ్డాగా మరిందని, ఆయన మాత్రం ఇక్కడ అడుగుపెట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. వెంటనే క్యాంపు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేయాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు చేరుతుండటంతో జీర్ణించుకోలేక బీఆర్ఎస్ శ్రేణులు అడ్డు తగులుతున్నట్టు వివరించారు. కాగా, మొదటగా గజ్వేల్లోని అంబేద్కర్ చౌరస్తా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించి కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బిగించడంతోపాటు ధర్నా, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు వంటేరు నరేందర్ రెడ్డి, వీరుపాక శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్తా, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనుకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనారిటీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆజ్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/ దరాబాద్: ఆర్టిసి ప్రధాన కార్యాలయం బస్ భవన్లో ఐటి, జిఎస్టి అధికారులు స్వాధీనం చేసుకున్న ఎ బ్లాక్లోని నాలుగు ఫ్లోర్లను ఎపి అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అన్ని గేట్లకు తాళాలు వేసి సీల్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం బస్భవన్లోని ఎ బ్లాక్ను ఎపి ఆర్టిసికి కే టాయించారు. పదేళ్లు ఇక్కడి నుండే ఎపిఎస్ ఆర్టిసి కార్య క లాపాలు నిర్వహించింది. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్ర కారం ఆర్టిసి ఆస్తుల విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. దీంతో ఎపి ఆర్టిసి అధికారులు ఎ బ్లాక్కు తాళాలు వేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రభుత్వం తమకు కేటాయించిందని ఐటి, జిఎస్టి అధికారులు ఆ తాళాలను పగులగొట్టి వాటికి త మ తాళాలు వేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేసిన ఎపి అధికారులు శుక్రవారం రాత్రి నుం డి తమ తాళాలు వేసి సీల్ చేశారు. శనివారం బస్ భవన్ ఎ బ్లాక్లోని నాలుగు అంతస్తుల ప్రస్తుత పరిస్థితులను పర్య వేక్షణ కోసం తెలంగాణ ఆర్టిసి జెఎసి చైర్మన్ ఈదురు వెంక న్న , వైస్ చైర్మన్ ఎం.థామస్రెడ్డి, ముషీరాబాద్ డిపో జెఎసి నాయకులు ఎన్.కృష్ణలు ఎ బ్లాక్కు వెళ్లి పరిశీలించారు. కాగా ఎ బ్లాక్ గ్రౌండ్ఫ్లోర్ వద్ద ఎపికి చెందిన 6 గురు సిబ్బందితో పాటు ఇద్దరు ఉన్నతాధికారులు ఒక ఎఎమ్టి, ఇద్దరు ఆర్టిసి కానిస్టేబుళ్లను బందోబస్తు పెట్టీ గేట్కు ఆంధ్ర తా ళాలు వేసి సీల్ చేశారు. అలాగే 2,3,4, అంతస్తుల్లో కూడా ఎపి అధికారులను, సిబ్బందిని కాపలా పెట్టీ అన్ని గెట్లకు తాళాలు వేసి సీల్ వేశా రు.ఈ సందర్భంగా ఆంధ్ర అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ తెలంగాణ ఆర్టిసికి చెందిన యూనియన్ నాయకులు, పూ ర్తిగా సహకరించడం వల్లే తాము ఈ రోజు ధైర్యంగా ఇక్కడ ఉన్నామని తెలిపారు. తెలంగాణ కార్మిక వర్గం తమను అర్థం చేసుకోవాలని, ఈ బస్భవన్ నిర్మాణం ఎపి, తెలంగాణ ఆర్టి సి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా చేసి పైసా పైసా పోగుచేసి కార్మికుల సంక్షేమo కోసం, కార్మికులకు సంబంధించిన అన్ని విభాగాల లావాదేవీల కోసం నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కన్ను పడిందని, ఇప్పడు ఎ బ్లాక్ ఆంధ్ర వాళ్ళదని చెప్పి అక్రమంగా ఆక్రమించి రేపు తెలంగాణకు చెందిన బి బ్లాక్ ను కూడా అక్రమంగా అధికార బలంతో ఆక్రమించరని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. బస్ భవన్ ముందు ఉన్న 11 ఎకరాల ఖాళీ స్థలాలు కూడ ఈ ప్రభుత్వం కబ్జా చేయదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఆర్టిసి జెఎసి తరుపున ఎపి సిబ్బందికి అండగా ఉంటామని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు గట్టిగా పోరాదామని తెలంగాణ ఆర్టిసి జెఎసి నాయకులు సూచించారు. అందులో బాగంగా ఏప్రిల్ 7 న బస్ భవన్ బచావో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
‘హైడ్రా’ పేరిట బెదిరిస్తే కఠిన చర్యలు
మన తెలంగాణ/సిటీబ్యూరో: యూఎల్ సీ భూముల్లోని పాత లేఔట్లలో ఇళ్లనే కాదు ఖాళీ ప్లాట్లున్నా వాటి జోలికి వెళ్లమని హైడ్రా తేల్చిచెప్పింది. ‘ఒప్పుకుంటే చె క్కు.. లేకపోతే హైడ్రాతో చెక్!’ శీర్షికతో శనివారం ‘మన తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి హైడ్రా స్పందించింది. కూకట్పల్లి పరిధిలోని గోపాల్నగర్ భూములపై ఆరా తీసింది. ఈ సందర్భంగా యూఎల్సీ భూముల్లోని పాత లేఔట్లలో రెగ్యులరైజ్ కాని ఖాళీ ప్లాట్ల పై ఎలాంటి చర్యలుండవని హైడ్రా స్ప ష్టం చేసింది. యూఎల్సీ భూముల్లో వెలిసిన లే ఔట్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను హైడ్రా పేరు చెప్పి ఆక్రమించుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ఎవరూ నమ్మవద్దని కోరింది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలున్నా హైడ్రా కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించింది. హైడ్రా పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందితే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లే ఔట్ ప్రకారం రహదారులు, పార్కులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా హైడ్రా కాపాడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నది. కూకట్పల్లి గోపాల్నగర్ యూఎల్సీ భూముల్లోని లే ఔట్లలో రెగ్యులరైజ్ కాని ప్లాట్లను హైడ్రా తీసుకుని ప్రభుత్వానికి అప్పగిస్తుందని కొంతమంది కబ్జాదారులు చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, మీ ఇంటి స్థలాన్ని తక్కువ ధరకు సొంతం చేసుకోవాలనే కుట్రకోణం ఉన్నదన్న విషయయాన్ని గ్రహించాలని హైడ్రా సూచించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేసుకునే చర్యలు గత వారం ఒక కొలిక్కి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఐదు గంటలకు పైగా చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించడం, అక్కడ లోకసభలో, రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందడం, ఇక రేపోమాపో రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే చట్టం అయిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ తీర్మానం మీద శాసనసభలో చర్చ జరిగిందనడంకంటే అమరావతి అవసరాన్ని గురించి మాట్లాడుకున్నారని, ఆ మాట్లాడుకున్న విషయాన్ని పార్లమెంటుకు పంపించారని చెప్పుకోవచ్చు. సాంకేతికంగా అమరావతి మీద శాసనసభ ఒక్కటే తీర్మానం చేసినా చెల్లుతుంది. కానీ శాసనమండలికి ఆ తీర్మానాన్ని పంపించి అక్కడ కూడా ఆమోదం పొందకపోవడం పెద్దల సభను అవమానించడమే. బహుశా అక్కడ ప్రతిపక్ష సభ్యులు ఎక్కువమంది ఉన్నారు కాబట్టి అభ్యంతరాలు వస్తాయని, చర్చ జరుగుతుందని అధికారపక్షం ఈ ఆలోచన చేసి ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో సంభాషణ, మరీ ముఖ్యంగా భిన్నాభిప్రాయాల మధ్య సంఘర్షణ చాలా ఆరోగ్యకరమైనది. కానీ అటువంటి ఆరోగ్యకరమైన సంప్రదాయాల్ని రోజురోజుకీ ప్రభుత్వాలు వదిలేస్తున్న విషయం తెలిసిందే. ఏదైతేనేం, ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అని నిర్ధారించి త్వరలోనే ఆ ప్రాంతానికి కేంద్ర తపాలా శాఖ ఒక పిన్ కోడ్ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు రాగానే కూటమి సంబరాలు మిన్నంటాయి. సహజంగానే దేశానికి ఒక రాజధాని ఉన్నట్టే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అప్పుడెప్పుడో విడిపోయిన రాష్ట్రాల విషయం ఏమో కానీ రెండు దశాబ్దాల క్రితం విడిపోయిన మూడు రాష్ట్రాల విషయం తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్ గఢ్ విడిపోయినప్పుడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఎటువంటి వివాదం కానీ, కేంద్ర జోక్యం కానీ అవసరం లేకపోయింది. డెహ్రాడూన్, రాంచి, రాయపూర్ నగరాలను రాజధానులుగా చేసుకుని ఆయా ప్రభుత్వాలు వాటి పనుల్లో పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. విడిపోయిన రాష్ట్రం తెలంగాణ కాకుండా మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. రాజధాని ఏర్పాటు కోసం కొన్ని నగరాలు ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిననాటి నుండి, మళ్లీ మాట్లాడితే రాష్ట్రం ఏర్పాటుకు ముందునుండి వేరు తెలంగాణనే కోరుతూ ఇన్ని దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నా విభజన ముమ్మాటికీ జరగదన్న ధీమాతో హైదరాబాద్ వైపు చూస్తూ ఉండిపోయిన కారణంగానే ఆంధ్రప్రదేశ్ కు ఈ తప్పనిసరి ఇబ్బంది ఎదురైంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకునే ప్రాంతాన్ని రాజధాని అంటారు. దానితోపాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదం చేయగలిగిన అనుకూల ప్రాంతం అయితే మరీ మంచిది. పరిపాలన సౌలభ్యం అంటే శాసనసభ సముదాయం, హైకోర్టు, రాజభవన్, సచివాలయం, మంత్రులు, అధికారులు, సిబ్బంది నివాస గృహ సముదాయాలు వంటివి సమకూర్చుకోగలిగితే ఆ సముదాయాల చుట్టూ నగరం విస్తరించడం సహజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన అమరావతి బృహత్ కార్యక్రమం ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నారు? ఒక రాజధాని కావాలా లేక ప్రపంచమంతా కన్నార్పకుండా చూసే ఒక మహానగరం కావాలా? మొదటిది అయితే ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఏర్పడి ఉన్నది. ఇక రెండవది అయితే ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. ఆయన తరచూ చెప్పే విజన్ 20 47 నాటికి కూడా సాధ్యపడుతుందని చెప్పలేం. మరి దేనికోసం లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబునాయుడు, ఆయన కూటమి పార్టీలు ఖర్చు చేయదలుచుకున్నాయి? రాష్ట్రం విడిపోయిన 12 సంవత్సరాలకు ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించుకోవాలన్న ఆలోచన అక్కడి కూటమి ప్రభుత్వానికి రావడానికి కారణాలేమిటి? 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక 29 గ్రామాల రైతుల నుండి సేకరించిన 30 వేల పైచిలుకు ఎకరాల భూమితోబాటు దాదాపు 20వేల ఎకరాల ప్రభుత్వభూమి కలిపి 50 వేల ఎకరాల్లో లక్ష కోట్లో రెండు లక్షల కోట్లో ఖర్చుపెట్టి ఒక మహా నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన.. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అమలుకు నోచుకోకుండా పోయింది. లోటుబడ్జెట్ తో విడిపోయిన రాష్ట్రం, అప్పులతో సతమతమవుతున్న రాష్ట్రం రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్లు వ్యయం చేయడం తప్పు అన్నది వైఎస్సార్సీపీ వాదన. ఆ పార్టీ అధికారంలో ఉండగా మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది. చట్టపరమైన సమస్యలు, ఇతర సమస్యల కారణంగా అది అమల్లోకి రాకముందే ఆ పార్టీ పరాజయం పాలైంది. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మూడు పార్టీల కూటమి ఎజెండాలో మళ్లీ అమరావతి రాజధాని చేరింది. విజన్ 2047 అని చంద్రబాబు, మరో 15 ఏళ్లు బాబే ముఖ్యమంత్రి అని కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ పదేపదే ప్రకటించుకోవడం చూశాం. అంత విశ్వాసం ఉన్నప్పుడు మామూలుగా రాజధానిని అభివృద్ధి చేసుకోవచ్చు కదా. చట్టబద్ధత ఎందుకు అవసరం అయింది? మళ్లీ అధికారంలోకి రామేమోనన్న భయం కూటమికి పట్టుకున్నందువల్లనే అమరావతిని మళ్లీ ఎవరొచ్చినా మార్చకుండా ఉండేందుకు ఈ చర్య అన్న చర్చ జరుగుతున్నది. భారత రాజ్యాంగాన్ని మించినది మన దేశానికి ఇంకోటి లేదుకదా. దానినే కొన్ని వందలసార్లు ఈ దేశ అవసరాలకు అనుగుణంగా సవరించుకున్నాం. రేపు ఒకవేళ కూటమి ఆందోళన చెందుతున్నట్టుగానే, 2029లో వైయస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే మళ్లీ శాసనసభలో ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపి పార్లమెంట్ చేత దాన్ని చట్టం చేయించుకోవడం సాధ్యం కాని పని ఏమీ కాదు కదా. అప్పటికి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో? ఒకవేళ బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏనే తిరిగి అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ అవసరం దానికి కలగకుండా ఉంటుందని ఎందుకు అనుకోవాలి? అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకోవడం, సాధ్యాసాధ్యాల మీద సమాజంలోని భిన్నవర్గాల ముందు చర్చ పెట్టడం, ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావడం అనే ప్రజాస్వామిక పద్ధతి అమరావతి విషయంలో కనిపించదు. అమరావతి విషయంలో ఎవరు కొంచెం విమర్శనాత్మకంగా వ్యవహరించినా వాళ్లను ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా చిత్రించేందుకు కూటమి పార్టీలు సిద్ధంగా ఉంటాయి. ఇదే కూటమిలోని జనసేన, బిజెపి గతంలో అమరావతి రాజధానిని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 50 వేల ఎకరాల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసుకోబోతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇంచుమించు ఇదేతరహాలో బిజెపి నాయకురాలు పురందేశ్వరి గతంలో విమర్శించారు. ఎవరు ఏమనుకున్నా అమరావతిలో రాజధానిని శాశ్వతం చేయాలన్న చంద్రబాబునాయుడు కోరిక ప్రస్తుతానికైతే తీరింది. అయితే ప్రతిపక్షాలు.. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తున్న అభ్యంతరాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడుకో, పార్టీగా తెలుగుదేశానికో లేకపోయినా ప్రభుత్వంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గం తప్పనిసరిగా ఈ అభ్యంతరాల పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకపక్క కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతూనే కేంద్రం నుండి నిధులు, ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థలనుంచి నిధులు అప్పుగా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అప్పులభారంతో కుంగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదనంగా అమరావతి అప్పును ఎలా భరించాలి? అక్కడ నిర్మాణాలకోసం చేస్తున్న వ్యయంలో తీవ్రమైన అవినీతి జరుగుతున్నదనే ఆరోపణకు వివరణ ఏది? దాదాపు పదేళ్లు గడిచిపోయినా ఇప్పటికింకా స్వచ్ఛందంగా లేదా తప్పనిసరి అయి భూములు ఇచ్చిన రైతులకు లబ్ధి చేకూరేది ఎప్పుడు? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత, రాష్ట్ర ప్రజానీకాన్ని సమాధాన పరచాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద, దానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబునాయుడు మీద తప్పనిసరిగా ఉంటుంది. ఢిల్లీలో నూతన పార్లమెంట్ సెంట్రల్ విస్తా నిర్మాణవ్యయం ఒక చదరపు అడుగు ఐదునుండి పదివేల రూపాయలలోపే ఉండగా అమరావతిలో నిర్మాణాలకు చదరపు అడుగుకు 14 వేల రూపాయల చొప్పున ఖర్చు చేయడాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లకు సమాధానం చెప్పాలి కదా. రాజధాని ప్రాంతాన్ని నిర్ధారించే ముందు దాని చుట్టుపక్కల భూములు రైతులనుండి ఏలినవారికి దగ్గరివాళ్ళు తక్కువ ధరలకు కొనుగోలు చేశారని, దీన్ని ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటారని లోకసభ సాక్షిగా గత వారం చర్చలో వైఎస్ఆర్ సీపీ పక్షనేత మిథున్ రెడ్డి మరోసారి చేసిన ఆరోపణ మీద నిగ్గు తేల్చాలి కదా. ఇవన్నీ ఎలా ఉన్నా కూటమి నేతలు చెపుతున్నట్టు ఐదుకోట్ల మంది ఆంధ్రులు హారతులు పడుతూ ఉంటే, దేశమంతా జేజేలు పలుకుతుంటే అమరావతి నిర్మాణానికి చట్టబద్ధత కోసం ఎక్కడా లేని విధంగా ఇంత ప్రయాస ఎందుకు? పార్లమెంట్ దాకా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అన్న ప్రశ్నలు మాత్రం పెద్దయెత్తున చర్చలోకి వచ్చాయి. సరే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నట్టుగా అమరావతి హైదరాబాద్ ప్లస్ అవుతుందో, భవిష్య నగరంగా (ఫ్యూచర్ సిటీ) భాసిల్లుతుందో ముందు ముందు తెలుస్తుంది.ప్రఖ్యాత ఉర్దూ సాహిత్యకారుడు సాహిర్ లుధియాన్వి ఒక సినిమా కోసం రాసిన ప్రేమ గీతంలోని ఒక చరణం ‘తసవ్వుర్ మే కోయి బస్తా నహి హమ్ క్యా కరే‘ అని ఉంటుంది. అంటే, ‘ఊహల్లో ఎవరూ నివసించలేరు, ఏం చేస్తాం’ అని అర్థం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి జరుగుతున్న వ్యవహారమంతా ఈ చరణాన్ని గుర్తు చేస్తున్నది. పార్లమెంటులో నిర్ణయం జరిగిపోయిందన్న ఆనందంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ‘తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్’ అన్నారు. బ్రెయిన్ చైల్ అంటే ఆయన ఆలోచనలోంచి పుట్టిందని అర్థం. తెలంగాణ ఆయన ఆలోచనల నుంచి ఎలా పుట్టిందో ఆయనే వివరించాలి. అది దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలు, త్యాగాల చరిత్ర అని ఆయనకు తెలియదు. చరిత్ర చదివే అలవాటేలేని రాజకీయవేత్త చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చరిత్ర చదవడం శుద్ధదండగ అన్న మహానుభావుడు. 1978కి ముందువరకు ఆయనకు హైదరాబాద్ అంటే తెలిసి ఉండదు. ఆయన ఎంతసేపూ హైదరాబాద్ నగరం 1982లో తన మామగారు తెలుగుదేశం పార్టీ పెట్టాకనే పుట్టిందని అనుకుంటారు. అంతేకాదు, 2010 హైదరాబాద్ మహానాడులో తెలంగాణవాళ్ళు అర్ధరాత్రి దాటేవరకు తాగి గానాబజానాల్లో తేలుతుంటే, ఎన్టీఆర్ పార్టీ పెట్టి వీళ్లకు క్రమశిక్షణ నేర్పించారని తెలంగాణ సంస్కృతిని ఎద్దేవా చేసిన నాయకుడు బాబు. అమరావతి రాజధానికి సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ బ్రెయిన్ చైల్ వ్యాఖ్యకు కొనసాగింపుగా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పుట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ హైదరాబాదులో పుట్టింది కాబట్టి అది చంద్రబాబునాయుడు బ్రెయిన్ చైల్ ఎలా అయిందో ఆయనే వివరించాలి. నిజానికి ఆ పార్టీ పుట్టిన నాటికి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి. ఆ పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావు. తరవాత కాలంలో ఆయననుంచి పార్టీ లాక్కున్నవాడు చంద్రబాబునాయుడు. అయినా చాలావాటిని సొంతం చేసుకున్నట్టు తెలంగాణను కూడా ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. సెల్ ఫోన్లు తనే కనుగొన్నానని, సాఫ్ట్ వేర్ ను తనే కనిపెట్టానని, కరోనా వ్యాక్సిన్ ను తనే తయారు చేశానని, చివరికి వంట గ్యాస్ వాడటం కూడా ప్రజలకు తానే నేర్పించానని ఆయన నమ్ముతూ ఉంటారు. అందరూ అది నమ్మాలని పదేపదే చెప్తూ ఉంటారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజం అవుతుందన్నది గోబెల్స్ సిద్ధాంతం. చేసిన పనులు చెప్పుకోవడానికే చాలామంది తటపటాయిస్తారు. చంద్రబాబుకు తాను చేయనివి కూడా సొంత ఖాతాలో వేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ప్రపంచానికి హైదరాబాద్ బిర్యానీ పరిచయం చేసింది తానేనని ఆయన చెప్పుకుంటే ఆయన శిష్యుడు ఒకరు, సినిమారంగానికి చెందినవాడు, ఈ మధ్య ఒక సినిమాలో ‘హైదరాబాద్ కో క్లింటన్ ఆయా, చంద్రబాబునే పాయా మంగాయా, క్లింటన్ పాయ ఖాయా, ఔర్ హైదరాబాద్ కు సాఫ్ట్ వేర్ ఆయా‘ అంటూ పాడాడు. అంటే, క్లింటన్ కు పాయా తినిపించి చంద్రబాబునాయుడు హైదరాబాద్ కు సాఫ్ట్ వేర్ తీసుకొచ్చాడని చెప్పదలుచుకున్నాడు ఆ వీర బాబు భక్తుడు. ఇలా ఉంటుంది చంద్రబాబును అభిమానించేవాళ్ళు చేసే ప్రచారం. ఫలానా రాజకీయ నాయకుడు స్టేట్స్ మాన్ అని, విజనరీ అని ప్రపంచం మెచ్చుకుంటుంది. చంద్రబాబునాయుడు గారు ప్రపంచం మెచ్చుకునే దాకా ఆగరు. ‘నేను పుస్తకాలు చదవను .. ఎందుకంటే నేను విజనరీ, నేను స్టేట్స్ మన్’ అని పలు సందర్భాలలో చెప్పుకున్న విషయం వీడియోలలో ఉన్నది. హైదరాబాదీలు అత్యంత ఇష్టపడే వంటకం పాయా. ఇంకా నయం, మొగలాయిల నుండి వచ్చిన ఈ వంటకాన్ని కూడా బాబే ప్రపంచానికి పరిచయం చేశాడని చెప్పలేదు. ఇక సాఫ్ట్ వేర్ విషయానికొస్తే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో దేశంలో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించారు. అప్పుడు ఆ విషయాలలో ప్రధానమంత్రి సలహాదారుగా ఉండిన సామ్ పిట్రోడాను మర్చిపోవడానికి వీల్లేదు. ఆ సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండిన నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి ఒక ఐటీ భవనానికి శంకుస్థాపన చేస్తే తాను ముఖ్యమంత్రి అయ్యాక దానిని ప్రారంభించి ఆ ప్రాంతానికి హైటెక్ సిటీ అనే పేరు పెట్టి చంద్రబాబు నాయుడు తాను ఒక నగరాన్ని నిర్మించానని చెప్పుకుంటుంటారు. అక్కడి పరిస్థితులను బట్టి, అప్పటి అవసరాలను బట్టి, ఆ ప్రాంతాలకు ఉండే సౌకర్యాన్ని బట్టి నగరాలు విస్తరిస్తూ ఉంటాయని, అభివృద్ధి జరుగుతుందని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఆయన అంగీకరించరు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు అదనంగా సైబరాబాద్ అనే మూడో నగరాన్ని తానే నిర్మించానని ఆయన అందరిని నమ్మమంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు 1995 నుండి 2004 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ కాలంలో ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా రెండు ప్రధానమైన పరిణామాలు జరిగాయి. ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండు ఆర్థిక సంస్కరణలు. దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రాజీవ్ గాంధీ విత్తనం నాటితే ఆర్థిక సంస్కరణలకు అధ్యులు పీవీ నరసింహారావు, ఆయన వద్ద ఆర్ధికమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్. అటువంటి కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన హయాంలో ఎంతో కొంత ఈ రంగాలకు సంబంధించిన మార్పులు జరిగి ఉంటాయి. వాటిని చంద్రబాబునాయుడు తన ఖాతాలో వేసుకోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆయన తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ అనే ఒక అబ్సెషన్ (తెలుగులో మనోవ్యాధి లేదా యావ అంటారు) వదిలించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆయన తలపెట్టిన అమరావతి రాజధానికి ఏమైనా ఉపయోగపడవచ్చు. ఎందుకంటే దాదాపు 450 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం ఇంకొంత కాలంపోతే అభివృద్ధిలో మరిన్ని అంగలు వేయడం తప్పనిసరి. అమరావతి ఇంకా ఉయ్యాలలో బిడ్డే. అందుకే పోలికలు అనవసరం. పోటీ వ్యర్థం. ఆయన చెప్పేవన్నీ, తాను చేశానని చెప్పుకునేవన్నీ సమకాలికులు ఎవరూ నమ్మరు. బహుశా జెన్ జీ, జెన్ ఆల్ఫా కాలంలో జన్మించిన వాళ్ల కోసం ఇలా చేయని పనులు చేసినట్టు పదేపదే చెప్పుకుంటారేమో. 1997 - 2012 మధ్య, 2010 - 2024 మధ్య పుట్టిన వాళ్లు ఈ జెన్ జీ, జెన్ ఆల్ఫా కోవలోకి వొస్తారు. అయితే అసలేం జరిగిందో చరిత్రకారులు చెప్తారు. చంద్రబాబునాయుడు చెప్పింది వేదం అనుకునే తరాలు కావవి. చరిత్ర చదివి సత్యాసత్యాలను పట్టేస్తాయి.ఇక చివరగా చంద్రబాబునాయుడుకు అత్యంత ప్రియమయిన ఒక అంశం గురించి చెప్పాలి, అదే మీడియా. గత శనివారంనాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అనే తీర్మానాన్ని హర్ష ధ్వానాల మధ్య ఆమోదింపచేసుకున్న ఉత్సాహం వెంట రాగా వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ జాతీయ మహాసభలు ప్రారంభించడానికి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ మీడియాగురించి మాట్లాడిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సభల్లో చంద్రబాబు కొన్ని జర్నలిజం పాఠాలు చెప్పారు. ఇవాళ్టి పరిస్థితుల్లో జర్నలిజాన్ని రెండుగా విభజించాలని, ఒకటి వృత్తి నిబద్ధత కలిగిన జర్నలిజం అయితే ఇంకొకటి రాజకీయ ప్రేరేపిత జర్నలిజం అని అన్నారు. ఇదమిత్ధంగా ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటంటే తనను, తన రాజకీయాలను సమర్ధించే మీడియా వృత్తి నిబద్దత కలిగిన మీడియా అని, తన లోపాలను, తన రాజకీయాల్లో, పరిపాలనలో జరిగే తప్పులను, పొరపాట్లను ఎత్తిచూపే మీడియా రాజకీయ మీడియా అని. తనను విమర్శించే మీడియామీద ముద్రలు వేయడం, వాటి మైండ్ సెట్ మారాలని బహిరంగంగానే బెదిరించడం 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గరనుండే ఆయన మొదలుపెట్టారు. ఆ కాలంలో జర్నలిజం వృత్తిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న రిపోర్టర్లు ఎవరిని అడిగినా చెప్తారు.. ఆయన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో జరిగే తప్పులను ఎత్తిచూపి వార్తలు రాసిన విలేకరులు ఎప్పుడో ఒకసారి అయినా ‘మీ మైండ్ సెట్ మారాలి’ అన్న హెచ్చరిక చంద్రబాబునుంచి వినడం గాని లేదా ఆయన యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే ఉద్యోగాలు ఊడగొట్టుకోవడం కానీ అనుభవం లోకి వచ్చాయో లేదో. Delete Edit
వార ఫలాలు (05-04-2026 నుంచి 11-04-2026 వరకూ)
మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈవారం కొన్ని విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రభుత్వ ప్రకారం గా రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ లభిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతాన విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలు సాగుతాయి. నూతన గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృషభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి వ్యవహరించండి. సంతాన సంబంధమైన విషయాలలో విద్యా సంబంధమైన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉన్నది. ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం చదవండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మిధున రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి పనిలో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. దానివల్ల నష్టాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని విషయాలలో మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన ఋణయత్నాలు చెయ్యకపోవడం మంచిది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి సలహాలు ఎక్కువగా తీసుకొని ముందుకు వెళ్లడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధమైన ఫీజులు లైసెన్సులు కాంట్రాక్టులు లభిస్తాయి. ఈ రాశి వారు దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి. స్టిరాస్తికి సంబంధించిన వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. సినీ కళా రంగాలలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఈ రాశి వారు ఇంద్రాణి రూపు మెడలో ధరించండి. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. సింహ రాశి వారికి ఈ ఈవారం చాలా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కాలం అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండండి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి మంచి ఫలితాలు ఉంటాయి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కాని వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి ఉపశమనం కలుగుతుంది. గృహ అలంకరణ వస్తువుల కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. వృత్తి,ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గణపతి స్వామి వారికి బుధవారం రోజున గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి. రాహుకాల సమయంలో ఎరుపు వత్తులతో దీపారాధన చేయండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 4 కలిసివచ్చే రంగు గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తులా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుండో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వారం ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. మీరు తీసుకునే స్వంత నిర్ణయాలు లభిస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం చాలావరకు లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి అలాగే దుర్గాదేవి స్తోత్రం తప్పనిసరిగా చదవండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. సొంతంగా చేసే వ్యాపారాలలో చిన్నపాటి నష్టాలు వస్తాయి. సంతాన విద్యా విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సౌకర్యాలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. మీరు గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. రాశి వారికి కలిసివచ్చి సంఖ్య రెండు. ఏదైనా పని మీద పెట్టబలేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి, కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సినీ కళా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే పరిస్థితి గోతిరిస్తుంది జాగ్రత్త వహించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది అయినప్పటికీ శని బలంగా ఉన్నారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార పరంగా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఖర్చులు మాత్రం అదుపులో ఉండవు. ఆరోగ్యపరంగా కూడా చిన్నచిన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. సమయానికి తగిన నిద్ర ఆహారం తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సేవింగ్స్ కి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి కాలభైరవ రూపు మెడలో ధరించండి. దైవ చింతన పెరుగుతుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీన రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆర్ధిక విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్థిరాస్తులను ఏర్పరచుకోగలుగుతారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం సంతాన ప్రాప్తి కలుగుతుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు.సహోద్యోగుల ప్రవర్తన వలన శిరో బాధలు పెరుగుతాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. దూర ప్రాంత వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఫస్ట్ నైట్ రోజే అమ్మాయికి మత్తు మందు ఇచ్చి నలుగురు అత్యాచారం
హైద్రాబాద్ కి చెందిన ఓ హిందు అమ్మాయి వద్దకు షాప్ అద్దెకు కావాలని నవాజ్ అనే వ్యక్తి వచ్చాడు. షాప్ అద్దెకు తీసుకున్నాడు. అనంతరం హిందు అమ్మాయిని ట్రాప్ చేసి నవ దుర్గా గా పేరు మార్చుకొని హిందువుగా మతంలో కి మారినట్లు చిత్రీకరించి 2025 జూన్ లో వివాహం చేసుకున్నాడు. కూకట్ పల్లి నుంచి పంజాగుట్టకు మకాం మార్చాడు. అదే రోజు ఫస్ట్ నైట్ ప్లాన్ చేసాడు. అతని సోదరులు, స్నేహితులైన మున్నవార్, షారుక్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్ లు పార్టీ పేరుతో ఇంట్లోకి వచ్చారు. అమ్మాయికి కూడా మత్తు మందు ఇచ్చి అందరూ అత్యాచారం చేసారు. పెళ్లి అనంతరం అమ్మాయి కి సంబంధించిన ప్లాట్, బంగారంతో పాటు అమ్మాయి పేరు మీద లోన్ లు తీయించాడు. ఈ ఘటనపై బాధితురాలు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది నవాజ్ హవాలా డబ్బులను ఇతర రాష్ట్రాలకు పంపించేవాడని ఫిర్యాదు లో తెలిపింది. దింతో కూకట్ పల్లి పోలీసులు అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం, హవాలా డబ్బులు వ్యాపారం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారం పై జీరో ఎఫ్ఐఆర్ చేసి పంజాగుట్టకు పంపిస్తున్నట్లు సమాచారం.
మమతా బెనర్జీ హెలికాప్టర్ సమీపంలో డ్రోన్ కలకలం
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్ సమీపంలో ఒక డ్రోన్ కనబడడం సంచలనమైంది. మాల్దా లోని మాలతీపూర్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని గజోల్ వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కబోతుండగా సమీపం నుంచి ఒక డ్రోన్ అనుమానాస్పదంగా ఎగురుతూ కనిపించింది. దీంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యాయి. తక్షణం దర్యాప్తు ప్రారంభించి ముగ్గురిని అరెస్టు చేశారు. మమత హెలికాప్టర్కు దగ్గర్లో డ్రోన్ కనిపించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనికి ముందు మాల్దాలో మమతా బెనర్జీ ఎన్నికల ప్రకారం సాగించారు.
4Mn Iran Women Fighters : వీళ్లే వీర వనితలు Andhra Prabha TOP Story
4Mn Iran Women Fighters : వీళ్లే వీర వనితలు Andhra Prabha
సిఐడి విచారణకు హాజరయిన ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో పోలీసు విధులకు భంగం కలిగించడం, రెచ్చగొట్టే వాఖ్యలు చేసిన కేసులో కౌశిక్ రెడ్డి, ఆయన భార్య శాలినీ రెడ్డితో కలిసి శనివారం సిఐడి అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. జనవరి 29వ తేదీన హుజూరాబాద్లోని సమ్మక్క జాతర వేళ పోలీసులకు కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసుల విధులకు అడ్డంకి, దూషణలు, మతవిద్వేష వ్యాఖ్యలు చేసినట్లు కౌశిక్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈ నేపథ్యంలో విచారణకు రావాల్సిందిగా సిఐడి అధికారులు కౌశిక్ రెడ్డికి ఇటీవల నోటీసులు ఇచ్చారు. దీంతో విచారణకు హాజరయిన కౌశిక్ రెడ్డిని అధికారులు నాలుగు గంటల పాటు విచారించి, ప్రక్రియను వీడియో రికార్డు చేశారు. విచారణ అనంతరం కౌశిక్ రెడ్డి సిఐడి కార్యాలయం వెలుపల మీడియా ప్రతినిధుతలో మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. తనను, తన కుటుంబాన్ని రాజకీయంగా వేధించడానికి ఈ విచారణలు జరుపుతున్నారని ఆరోపించారు. అనని మాటలు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని, పొంగులేటి మైనింగ్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే తనపై ఎథిక్స్ కమిటీ వేశారని కౌశిక్ రెడ్డి చెప్పారు. ప్రజల పక్షాన పోరాడటానికి దేనికైనా సిద్ధమని, హుజూరాబాద్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కరీంనగర్ జిల్లా చెత్తనంతా తెచ్చి హుజూరాబాద్లో వేస్తే ఊరుకునేది లేదని, ఆ డంపింగ్ యార్డ్ కరోనా కంటే ప్రమాదమని, ఈ విషయంలో చేస్తున్న పోరాటాన్ని అణచివేయడానికి విచారణ పేరుతో ప్రభుత్వం వేధిస్తోందన్నారు. ఈ నెల 7వ తేదీన హుజూరాబాద్లో దీక్షకు కూర్చుంటానని, మత మార్పిడిలపై వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. మళ్లీ కెసిఆర్ సిఎం అవుతారని అప్పుడు కేసులు తిరగబడతాయని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
ఐపిఎల్ లో అరుదైన రికార్డు.. సెహ్వాగ్, గంభీర్ రికార్డు బ్రేక్
అహ్మదాబాద్: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశ్వీ జైస్వాల్ అరుదైన రికార్డు నెలకొల్పారు. శనివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న పోరులో వీరిద్దరు రాజస్తాన్ కు శుభారంభాన్ని అందించారు. పవర్ప్లేలో సూర్యవంశీ, వైభవ్ తొలి ఆరు ఓవర్లలో 69 పరుగులు సాధించారు. ఈ క్రమంలో అత్యంత వేగంగా 500 భాగస్వామ్య పరుగులు (బంతుల వారీగా) సాధించిన భారత జోడీగా వైభవ్ సూర్యవంశీ, యశ్వీ జైస్వాల్ కొత్త రికార్డు సృష్టించారు. ఈ జోడీ కేవలం 248 బంతుల్లోనే ఈ ఘనతను సాధించి, గతంలో ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ నెలకొల్పిన 309 బంతుల రికార్డును బ్రేక్ చేసింది. ఈ జాబితాలో సూర్యవంశీ, జైస్వాల్ మూడో స్థానంలో ఉన్నారు. అత్యంత వేగంగా 500 భాగస్వామ్య పరుగులు సాధించిన రికార్డు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల పేరిట ఉండగా, 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఓపెనర్లుగా ఆడిన ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్లు రెండో స్థానంలో ఉన్నారు.
దక్షిణాది సీట్లు తగ్గుదాయనడం అసత్యం: ప్రధాని మోడీ
జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్సభలో సీట్లు కోల్పోతాయని వస్తున్న వాదనలలో వాస్తవం లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. శనివారం కేరళలోని పథనంథిట్ట తిరువళ్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని స్పష్టం చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరిగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతామనన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. పశ్చిమాసియా అంశంపై భయాన్ని సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో శబరిమల రైల్వే ప్రాజెక్టు కొత్త అవకాశాలను తీసుకురాగలదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది శబరిమలకు ప్రత్యక్ష అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, స్థానిక వ్యాపారాలకు కొత్త ఊపు ఇస్తుందని చెప్పారు. యువతకు కొత్త ఉపాధి మార్గాలను తెరుస్తుందని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు. బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయన్నారు.
Prabhas’ Fauzi team Issues Strict Warning
Prabhas’ upcoming release will be Fauzi and the shoot of the film is currently in the final stages. Hanu Raghavapudi is the director and Prabhas has ten days of shoot left to complete his portions for Fauzi. A couple of pictures featuring Prabhas are leaked from the sets and they are being circulated on social […] The post Prabhas’ Fauzi team Issues Strict Warning appeared first on Telugu360 .
LIK Trailer: A 2040 Love story
Tamil young actor Pradeep Ranganathan is racing ahead with back-to-back hits. His upcoming film is titled Love Insurance Kompany (LIK). Vignesh Shivan is the director and Nayanthara is the producer. The trailer of the film is out and LIK is a love story set in 2040. The film is a satire on how humans depend […] The post LIK Trailer: A 2040 Love story appeared first on Telugu360 .
Amaravati vs MAVIGUN: Confusion Is Sold as Vision
On the day Parliament cleared Amaravati as the capital of Andhra Pradesh, Y. S. Jagan Mohan Reddy decided it was the perfect moment to introduce a brand new idea. Not with a detailed blueprint, but with a sarcastic smile, a fresh concept with MA-VI-GUN was bought in front of the media. According to him, linking […] The post Amaravati vs MAVIGUN: Confusion Is Sold as Vision appeared first on Telugu360 .
ఎల్డిఎఫ్-బిజెపి-ఆర్ఎస్ఎస్లు ఒక్కటయ్యాయి: రాహుల్ గాంధీ
తిరువనంతపురం: కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ను అధికారంలోకి రాకుండా చేయాలని.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), సైద్ధాంతిక గురువు అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)తో చేతులు కలిపిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎల్డీఎఫ్ ఇకపై వామపక్ష కూటమి కాదని..మత హింసను ప్రేరేపించే వారితో జత కట్టిందని రాహుల్ విమర్శించారు. కేరళలోని ఎర్నాకుళంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎల్డీఎఫ్ బీజేపీకి ఎప్పటికీ ముప్పు కాలేదని.. కాషాయ పార్టీకి, ఆర్ఎస్ఎస్కు కాంగ్రెస్ మాత్రమే సవాలు విసరగలదని అన్నారు. ఈ ఎన్నికలు ఎల్డిఎఫ్, యుడిఎఫ్ల మధ్య జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ ఎన్నికల్లో బిజెపి, ఆర్ఎస్ఎస్, ఎల్డిఎఫ్ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని.. ఇది అందరికీ స్పష్టంగా తెలుసు అని అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్లు.. మైనారిటీలను, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, తనపై 36 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం తన లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిందని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను 55 గంటల పాటు విచారించిందన్నారు.ఇక, శబరిమల ఆలయంలోని బంగారం వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎల్డిఎఫ్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆలయంలోని బంగారాన్ని ఎల్డిఎఫ్ నాయకులు దొంగిలించారని, దీనిపై మోడీ మౌనం వహించారని ఆయన ఆరోపించారు.
కుప్పకూలిన నాలుగు అంతస్తుల హోటల్.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కోట్మా పట్టణంలో శనివారం సాయంత్రం ఓ నాలుగు అంతస్తుల హోటల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు వ్యక్తి మరణించగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది.. హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానంగా ఉందని పోలీసులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హోటల్ ఉన్న స్థలానికి ఆనుకునే నిర్మాణ పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని చెప్పారు.
అవన్నీ అవాస్తవాలే.. కాంగ్రెస్పై మోదీ విమర్శలు..
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. కేరళలోని పథనంథిట్టలోని తిరువళ్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. కేరళలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ఈశాన్య రాష్ట్రాల తరహాలో అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామని అన్నారు. పశ్చిమాసియా అంశంపై కాంగ్రెస్ నేతలు భయాన్ని సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్లు కోల్పోతాయని వస్తోన్న వాదనలు అవాస్తమని తేల్చి చెప్పారు. ఆ తర్వాత శబరిమల రైల్వే ప్రాజెక్టు గురించి మోదీ మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కొత్త అవకాశాలు తీసుకురాగలదని పేర్కొన్నారు. ఇది శబరిమలకు ప్రత్యక్ష అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, స్థానిక వ్యాపారులకు కొత్త ఊపునిస్తుందని చెప్పారు. యువతకు కొత్త ఉపాధి మార్గాలను తెలుస్తుందని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు. బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వస్తే.. ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట..
విజేతలను అభినందించిన కలెక్టర్…
విజేతలను అభినందించిన కలెక్టర్… భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : సీఎం కప్ క్రీడలను
మైనర్ బాలికపై వేధింపులు… చిట్యాల, ఆంధ్రప్రభ : ఓ మైనర్ బాలికను ప్రేమ
సన్రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్..
హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను గాయం కారణంగా ఈ సీజన్లోని తొలి రెండు మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. త్వరలోనే జట్టులోకి తిరిగి వస్తాడనుకున్న కమిన్స్ ఎంట్రీ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఇప్పటికే అతను లేకపోవడంతో హైదరాబాద్ బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కమిన్స్ తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. కమిన్స్, గాయం కారణంగా.. యాషెస్ సిరీస్లోని మూడో టెస్టు నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్కు కూడా దూరమయ్యాడు. గాయం ఉన్నప్పటికీ, ఐపీఎల్ ప్రారంభానికి ముందు కమిన్స్, హైదరాబాద్ శిబిరంలో చేరి నెట్స్లో చురుకుగా బౌలింగ్ చేశాడు. అయితే, అతను తిరిగి మైదానంలోకి దిగేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీంతో తుది అనుమతి కోసం కమిన్స్ ఇప్పుడు తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. సీఏ పర్యవేక్షణలో త్వరలో స్కానింగ్ జరగనుందని.. ఈక్రమంలో ఏప్రిల్ 17 నాటికి హైదరాబాద్ జట్టులో తిరిగి చేరనున్నట్లు సమాచారం. దీంతో కమిన్స్ మరో మూడు మ్యాచ్లకు దూరమవ్వనున్నాడు. అదీ కూడా అతని స్కానింగ్ రిజల్ట్ పై ఆధార పడి ఉంది. కాగా.. ఎస్ఆర్హెచ్ తన తర్వాతి మూడో మ్యాచ్ లో లక్నోతో తలపడనుంది. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఘోర పరాజయం పాలైన హైదరాబాద్, రెండో మ్యాచ్లో పుంజుకుని కోల్కతా నైట్ రైడర్స్పై 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కాటమయ్య పండుగకు ముందస్తు ఏర్పాట్లు…
కాటమయ్య పండుగకు ముందస్తు ఏర్పాట్లు… స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
అడవి పంది – బైక్ ఢీ ముగ్గురికి తీవ్ర గాయాలు ఉట్నూర్ /జైనూర్,
తొర్రూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..
తొర్రూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా.. తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు పట్టణాన్ని అన్ని
ఏప్రిల్ 9 నుంచే హేలీ టూరిజం సేవలు ప్రారంభం:
ఏప్రిల్ 9 నుంచే హేలీ టూరిజం సేవలు ప్రారంభం: మంత్రి జూపల్లి కృష్ణారావు..
సింగరేణిలో సహజ మరణానికి పది లక్షల ఉచిత బీమా పథకం అమలు
సింగరేణి సంస్థలో కార్మికుల సహజ మరణానికి పది లక్షల ఉచిత బీమా పథకం అమలు చేస్తున్నట్లు సంస్థ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకు సింగరేణిలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం చెందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. యూనియన్ బ్యాంకులో కార్పోరేట్ శాలరీ అకౌంటు కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి పది లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని వర్తింప జేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సంస్థకు బ్యాంకు యాజమాన్యం తెలియజేసింది. సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండి బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు డైరెక్టర్ పర్సనల్, ఫైనాన్స్ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవ ఫలితంగా యూనియన్ బ్యాంకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నట్లు బ్యాంకు యాజమాన్యం స్పష్టం చేసింది. 2024 లో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగరేణి కార్మికులకు ఉచిత కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంకు అమలు చేసింది.ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికి కూడా పది లక్షల రూపాయల బీమాను వర్తింపజేసేందుకు నిర్ణయించినట్లు యూనియన్ బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలలో పది లక్షల బీమా పాలసీ తీసుకోవాలంటే నెలకు కనీసం ఐదు వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక చొరవతో ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా యూనియన్ బ్యాంకు సహజ మరణానికి పది లక్షల బీమా పథకాన్ని అమలు చేయడంతో దీనిపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. కాగా, సింగరేణి సంస్థలో కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు జరుపుతున్న ఇతర బ్యాంకులు కూడా ఇదే విధంగా సహజ మరణానికి కూడా బీమా సౌకర్యాన్ని వర్తింప జేసే విధంగా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది.
కంచెలు తెంచి.. హద్దులు చెరిపి రాయపర్తి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని 52
Mahesh and NTR like Adivi Sesh’s Dacoit Trailer
Adivi Sesh, Mrunal Thakur starrer Dacoit has been one of the most anticipated films in recent Indian Cinema. The trailer of the film has been unveiled and it is receiving high praises all around. Superstar Mahesh and Man of Masses Jr. NTR also praised the trailer wishing the team. Mahesh Babu wrote, “From Major to […] The post Mahesh and NTR like Adivi Sesh’s Dacoit Trailer appeared first on Telugu360 .
మల్కాజ్గిరిలో 13మంది సైబర్ నేరస్థుల అరెస్టు
మల్కాజ్గిరి పోలీసులు ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో 13మంది సైబర్ నేరస్థులను అరెస్టు చేశారు. నిందితులు పెట్టుబడులు, డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని బెదిరించడంతో మల్కాజ్గిరి సైబర్ క్రైం పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. వారి కోసం ప్రత్యేంగా ఏర్పాటు చేసిన టీంలు ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ఆపరేషన్లో ఆరు కేసుల్లో 13మందిని అరెస్టు చేశారు. పెట్టుబడుల నేరాలు ఐదు, డిజిటల్ అరెస్టు ఒక కేసులో 13మంది నిందితులుగా ఉన్నారు. సైబర్ క్రైం బాధితులకు మల్కాజ్గిరి పోలీసులు రూ.15,61, 728 రీఫండ్ చేశారు. ప్లస్ గ్లోబల్ పేరుతో నిందితులు బాధితుడితో రూ.2,50,000 పెట్టుబడిపెట్టించి మోసం చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఖమ్మం జిల్లాకు చెందిన ఎకే అక్బర్ను అరెస్టు చేశారు. నకిలీ ట్రేడింగ్యాప్తో అధిక లాభాలు వస్తాయని చెప్పి బాధితుడి వద్ద నుంచి రూ.61,90,000 కోట్టేశారు. రూ.9,85,24,793 లాభాలు వచ్చాయని చూపించిన నిందితులు వాటిని విత్డ్రా చేసుకునేందుకు మరింత పెట్టుబడిపెట్టాలని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు మల్కాజ్గిరి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు మాన్ సింగ్ను అరెస్టు చేశారు. ఇలా వివిధ కేసుల్లో 13మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఆర్టిసి బస్సు ఢీకొని బాలిక మృతి
ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఓ బాలిక మృతిచెందిన సంఘటన జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 5లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. బాలిక కీర్తి, సోదరుడితో కలిసి పాఠశాలకు వెళ్లింది. ఇద్దరిని బైక్పై వారి తండ్రి తీసుకుని వస్తుండగా రోడ్డు నంబర్ 5వద్ద వేగంగా వచ్చి ఆర్టిసి బస్సు బైక్ను ఢీకొట్టడంతో బాలిక బస్సు కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా, తండ్రి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టిసి బస్సు డ్రైవర్ నిర్లక్షంగా బస్సును నడపడం వల్లే బాలిక మృతిచెందినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలిక తండ్రి, సోదరుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
12న రాష్ట్ర స్థాయి కబడ్డీ రిఫరీ పరీక్ష
12న రాష్ట్ర స్థాయి కబడ్డీ రిఫరీ పరీక్ష నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ :
గుజరాత్తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అహ్మదాబాద్లోన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి మ్యాచ్లో గుజరాత్ ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి సీజన్లో తమ గెలుపు ఖాతా తెరవాలని గుజరాత్ భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్.. తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిస్తే.. పాయింట్స్ టేబుల్లో నెం.1 స్థానం దక్కించుకొనే అవకాశం ఉంది. ఈ మ్యాచ్కి జిటి జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మాన్ గిల్కు గాయం కావడంతో రషీద్కు తాత్కాలికంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. గిల్ స్థానంలో కుమార్ కుషాగ్రా ఈ మ్యాచ్తో ఐపిఎల్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఇక రాజస్థఆన్ ఈ మ్యాచ్లో రెండు మార్పులు చేసింది. బ్రిజేష్ స్థానంలో తుషార్, బిష్ణోయ్ స్థానంలో శుభమ్ దూబెలను జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, డొనొవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ. జిటి: కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్, జాస్ బట్లర్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్(కెప్టెన్), కగిసో రబాడా, అశోశ్ శర్మ, మహ్మద్ సిరాజ్, ప్రశిద్ధ్ కృష్ణ.
ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ లో తెలంగాణకు బంగారు పథకం
ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026 లాజిస్టిక్స్ విభాగంలో తెలంగాణకు చెందిన మెహ్రునిషా బేగం బంగారు పతకం సాధించింది. భారత ప్రభుత్వ జాతీయ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నోయిడాలో జాతీయ స్కిల్ డెవలప్మెంట్ -2026 పోటీలు జరిగాయి. ఈ పోటీలలో మెహ్రునిషా బేగం ప్రతిష్టాత్మక భారత నైపుణ్యాల పోటీ 2026 లో లోజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. బేగంపేట డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థిని, ప్రస్తుత కార్గోమెన్ లాజిస్టిక్స్ లో పనిచేస్తున్న మెహ్రునిషా బేగం, జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో గెలుపొంది, జాతీయ స్థాయికి చేరుకుని ఈ విజయాన్ని సాధించారు. ఈ ఇండియా స్కిల్స్ పోటీలు ప్రాక్టికల్ నేర్పులను, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను ప్రోత్సహించే జాతీయ వేదికగా నిలుస్తున్నాయి. 22 ఏళ్ల లోపు యువతకు ఈ పోటీలు నిర్వహిస్తారు. దీనిలో విజేతలకు అంతర్జాతీయ స్థాయి వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ లో కూడా పాల్గొందుకు అవకాశం కలుగుతుంది.
ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం..
ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం.. తొర్రూరు, ఆంధ్రప్రభ : వేసవిలో ప్రజల
IPL 2026 : ముంబయి ఇండియన్స్ పై ఢిల్లీ కాపిటల్స్ విక్టరీ
ముంబయి ఇండియన్స్ పై ఢిల్లీ కాపిటల్స్ విజయం సాధించింది
బైకుల దొంగ అరెస్ట్… 4 బైకులు స్వాధీనం…
బైకుల దొంగ అరెస్ట్… 4 బైకులు స్వాధీనం… ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ చౌటుప్పల్,
కుమ్మేసిన సమీర్ రిజ్వి.. ముంబైపై ఢిల్లీ ఘన విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ జట్టు ఆరంభంలో కాస్త తడబడింది. 7 పరుగుల వద్దే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పాతుమ్ నిస్సాంకాతో కలిసి సమీర్ రిజ్వి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే 44 పరుగుల వద్ద శాంట్నర్ బౌలింగ్లో నిస్సాంకా ఔట్ అయ్యాడు. అయితే సమీర్ మాత్రం ఏ మాత్రం జోరు తగ్గించలేదు. మైదానంలో పరుగుల వరద పారించాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులతో ముంబై బౌలర్లను కుమ్మేశాడు. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్(21) మ్యాచ్ని ఫినిష్ చేశాడు. దీంతో 18.1 ఓవర్లలో ఢిల్లీ 164 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి…
మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి… పిరికిపందల చర్యగా అభివర్ణించిన అమరం
Jeevan Reddy : జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం సిద్ధమయింది
విజయవంతంగా ప్లేస్మెంట్ డ్రైవ్…
విజయవంతంగా ప్లేస్మెంట్ డ్రైవ్… మేడ్చల్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని
ఆ పాపం కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలదే: బండి సంజయ్
హుజూరాబాద్ లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలం జనావాసాలకు దగ్గరగా ఉండటమే కాకుండా వన్యప్రాణులు కూడా ఉండటమే అందుకు కారణమని చెప్పారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళనను అర్ధం చేసుకుని చెత్త డంపింగ్ యార్డ్ స్థలాన్ని జనావాసాలు లేని ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హుజూరాబాద్ ప్రజలతో కలిసి బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. హుజూరాబాద్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలనే పాపం కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు చేసిన తప్పిదమేనని బండి మండిపడ్డారు. గత పాలకులు ఇక్కడే డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తే... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలోకి తీసుకువచ్చిందన్నారు. ఆనాడు డంపింగ్ యార్డును హుజూరాబాద్ సమీపంలోనే ఏర్పాటు చేయాలని చెప్పిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులే ఈరోజు అందుకు భిన్నంగా ఆందోళనలు చేయడం సిగ్గు చేటన్నారు. శనివారం మధ్యాహ్నం హుజూరాబాద్ లో పర్యటించిన బండి సంజయ్.. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డితోపాటు స్థానిక బీజేపీ నేతలతో కలిసి సిర్సపల్లి, రంగాపూర్ సమీపంలోని డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో హుజూరాబాద్ మున్సిపాలిటీ శివారు ప్రాంతమైన సిర్సపల్లి, రంగాపూర్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తుండటంతో హుజూరాబాద్ ప్రజలకు తీవ్రమైన హానీ చేకూరే ప్రమాదముందని ఈ సందర్భంగా స్థానికులు బండి సంజయ్ ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డు ప్రాంతంలోనున్న గుట్టల్లో నెమళ్లు, పక్షులు సహా నిత్యం వన్యప్రాణులు సంచరిస్తున్నాయని చెప్పారు. ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తే వన్యప్రాణులు చచ్చిపోతాయని, దీంతోపాటు మనుషుల ఆరోగ్యాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.... హుజూరాబాద్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నీ బీజేపీ వ్యతిరేకిస్తుంది. హుజూరాబాద్ మున్సిపాలిటీకి సమీపంలో డంపింగ్ యార్డు ఉంది. ఇక్కడ చుట్టు పక్కల గ్రామాలున్నాయి. వీరిపై తీవ్ర ప్రభావం ఉంది. ఒక సమస్యను పరిష్కరించడానికి మరో సమస్యను స్రుష్టించడం సరికాదు. ప్రజల ప్రాణాలతో చెలగాడటం సరికాదు. నిజానికి ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది గత పాలకులు. ఈ ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుమ్లాపూర్ సభలో ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే... మొట్టమొదట వ్యతిరేకించింది నేనే. ఆనాడు ఏ ఒక్కరూ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. అయినా ఈరోజు సిగ్గు లేకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయడం ఆశ్యర్యం కలిగిస్తోంది. ఆనాడే డంపింగ్ యార్డు ప్రతిపాదనను వ్యతిరేకించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే పాపానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని పున:పరిశీలించాలి. అవసరమైతే హుజూరాబాద్ ప్రాంతానికి వచ్చి ఒక్కసారి డంపింగ్ యార్డు స్థలాన్ని సందర్శించాలి. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో హుజూరాబాద్ ప్రజలతో కలిసి బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. డంపింగ్ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా పోరాటాలు చేస్తాం అని హెచ్చరించారు.
فیکٹ چیک: انڈونیشیا کے حالیہ زلزلے کے دعوے کے ساتھ وائرل فوٹیج دراصل فلپائن کا ہے
وائرل ویڈیو جسے انڈونیشیا کے حالیہ زلزلے کا بتایا جارہا ہے، گمراہ کن ہے۔ تلگو پوسٹ کی تحقیق سے پتہ چلا کہ یہ فوٹیج 2025 کے فلپائن کے زلزلے کا ہے جسے گمراہ کن دعوے کے ساتھ پھیلایا جارہا ہے۔
బుషిహర్ న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా క్షిపణి దాడి
ఇరాన్ లోని బుషెహర్ అణువిద్యుత్ కేంద్రం లక్షంగా క్షిపణి దాడి జరిగిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) తెలియజేసింది. ఇటీవలి కాలంలో ఇది నాలుగో ఘటన అని పేర్కొంది.ఈ క్షిపణి శకలం తగిలి సిబ్బందిలో ఒకరు చనిపోయారని తెలిపింది. ఆ ప్రాంతం లోని భవనం కూడా దెబ్బతిన్నట్టు వివరించింది. ఈ సంఘటన న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో రేడియేషన్కు దారి తీయలేదని స్పష్టం చేసింది. ఇరాన్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఏకైక విద్యుత్ ప్లాంట్ ఇదే కావడం గమనార్హం. తాజా పరిణామాలపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ మరియానో గ్రాస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా భవనాల్లో కీలకమైన పరికరాలు ఉండే అవకాశం ఉందన్నారు. అణు కేంద్రాల సమీప ప్రాంతాలపై ఎన్నడూ దాడి చేయకూడదన్నారు. అణు ప్రమాదం ముప్పును నివారించేందుకు అత్యంత సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అణుభద్రత, రక్షణకు కట్టుబడి ఉండటం అత్యంత ప్రాధాన్య అంశమని ఉద్ఘాటించారు.
Earth Quake : భూకంపంతో కాబూల్ లో ఎనిమిది మంది మృతి
కాబూల్ పరిసర ప్రాంతంలో సంభవించిన 5.8 తీవ్రత భూకంపంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు
అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి, మండలం లోని గూడెం చెక్ పోస్ట్ వద్ద
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజల్లో నమ్మకం పెరిగింది
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజల్లో నమ్మకం పెరిగింది రాష్ట్ర పోలీసు కంప్లైంట్ అథారిటీ బోర్డ్
పేదల కడుపు కొట్టేందుకే జీ రాంజీ చట్టం
పేదల కడుపు కొట్టేందుకే జీ రాంజీ చట్టం తొర్రూరు, ఆంధ్రప్రభ : జీ
రూ.225 కోట్లతో బాసర ఆలయ అభివృద్ధి పనులు..
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహాలో నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ప్రదర్శనలు లేకుండా ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ.225 కోట్ల అవసరమవుతాయని అధికారులు తెలిపారు. మాస్టర్ప్లాన్ను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. సంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకొని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ సూచించారు. భవిష్యత్ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్లో భారీ వృక్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలు నాటాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని... పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలని... ఆలయ ప్రాంగణంలోకి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూప్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అభివృద్ది పనుల నాణ్యతలో రాజీపడితే ఏమాత్రం సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
108లో ప్రసూతి అయిన మహిళ తల్లీ బిడ్డ క్షేమం సిర్పూర్ (యు) /లింగాపూర్,
War Effect : మెడిసిన్స్ పై భారీ ఎఫెక్ట్.. ఈ మందులు పెరగనున్నాయ్
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో మెడిసిన్స్ ధరలు పెంచాయి
1 Dead 5 Injured Us Airstrikes : అమెరికా ప్రతిదాడి Andhra Prabha News
1 Dead 5 Injured Us Airstrikes : అమెరికా ప్రతిదాడి Andhra
Dacoit: Action Is the Shell, Love Is the Core: Sesh
Adivi Sesh, after delivering a series of blockbusters, is aiming for an even bigger success with his upcoming Pan-India film Dacoit, releasing in theatres on April 10th. In an exclusive interview with us, the actor shared that distributors who watched the movie gave highly positive feedback, even thanking the team for making such a strong […] The post Dacoit: Action Is the Shell, Love Is the Core: Sesh appeared first on Telugu360 .
acoit: Action Is the Shell, Love Is the Core: Sesh
Adivi Sesh, after delivering a series of blockbusters, is aiming for an even bigger success with his upcoming Pan-India film Dacoit, releasing in theatres on April 10th. In an exclusive interview with us, the actor shared that distributors who watched the movie gave highly positive feedback, even thanking the team for making such a strong […] The post acoit: Action Is the Shell, Love Is the Core: Sesh appeared first on Telugu360 .
ఇంటి పన్నులు చెల్లించి 5 శాతం రాయితీని పొందండి
ఇంటి పన్నులు చెల్లించి 5 శాతం రాయితీని పొందండి పరకాల, ఆంధ్రప్రభ :
రోహిత్ అరుదైన రికార్డు.. ధోనీని దాటేశాడు..
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. ఐపిఎల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో ఓ సిక్సు బాదిన రోహిత్.. ఢిల్లీ క్యాపిటల్స్పై మొత్తం 51 సిక్సర్లు కొట్టాడు. అయితే ఐపిఎల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనీ రికార్డును రోహిత్ అధిగమించాడు. ధోనీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 50 సిక్సులు బాదాడు. ఇప్పుడు ఈ మ్యాచ్లో సిక్సుతో ధోనీని రోహిత్ దాటేశాడు. ఇక ఈ విభాగంలో రోహిత్, ధోనీ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ సిఎస్కెపై 48 సిక్సులు కొట్టాడు. ఓవరాల్గా ఐపిఎల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సులు బాదిన రికార్డు క్రిస్ గేల్ ఖాతాలో ఉంది. గేల్.. పంజాబ్పై 61, కెకెఆర్పై 54 సిక్సులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాడు.
Sai Dharam Tej rejects Dozen Films
Supreme Star Sai Dharam Tej is extra cautious, not in a hurry and is not in a mood to do regular commercial flicks. After the super success of Virupaksha, Sai Dharam Tej is completely focused on Sambarala Yeti Gattu which is in shoot for over a year. He will soon team up with KA directors […] The post Sai Dharam Tej rejects Dozen Films appeared first on Telugu360 .
ప్రపంచమంతటా శాంతి సౌరబాలు వెల్లివిరియాలి…
ప్రపంచమంతటా శాంతి సౌరబాలు వెల్లివిరియాలి… ఖమ్మం కల్చరల్, ఆంధ్ర ప్రభ : ప్రపంచమంతటా
Women’s Health |ఆరోగ్యానికి అద్భుతమైన నల్ల వెల్లుల్లి…
Women’s Health | ఆరోగ్యానికి అద్భుతమైన నల్ల వెల్లుల్లి… Women’s Health |
జైలర్ 2 సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు వచ్చింది #rajnikanth #jailer2 #telugupost #viralvideo
ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న
ఘనంగా పుల్ల మల్లయ్య జన్మదిన వేడుకలు,
ఘనంగా పుల్ల మల్లయ్య జన్మదిన వేడుకలు, చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో
పూతలపట్టు-చిత్తూరు నేషనల్ హైవేపై అగ్నిప్రమాదం #latestnews #telugupost #fireaccident #apnews
Shivansh | 9నెలల బాలుడిని గొడ్డలితో…
Shivansh | 9నెలల బాలుడిని గొడ్డలితో… Shivansh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
అమరావతిపై కూటమిది ప్రచార ఆర్భాటమే
అమరావతిపై కూటమి ప్రభుత్వానిది కేవలం ప్రచార ఆర్భాటమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు
కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి ఖండన..
మోత్కూర్, ఆంధ్రప్రభ ; ఉద్యమ నాయకుడు,తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే
తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం.. కేరళలో భట్టి వక్రమార్క
కేరళలో ఎల్డీఎఫ్ పూర్తిగా విఫలమైందని.. పరిపాలన ప్రమాణాలు, మానవీయ విలువలు దిగజారిపోయాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. నిరుద్యోగం పెరిగిపోవడంతో యువత విదేశాలకు వలస వెళ్తుండగా, రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు సరైన సంక్షేమం అందడం లేదని అన్నారు. కేరళం రాష్ట్రంలోని పతనం తిట్ట అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం, ర్యాలీలలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళంలో గొప్ప మార్పు, మెరుగైన సంక్షేమం, సుపరిపాలన, సెక్యులర్ విలువలను స్థాపించాలంటే ఈనెల 9న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యుడిఎఫ్ (యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేరళం అంటే సెక్యులరిజం, ఉన్నత విద్య, మానవీయ విలువల ప్రతీకగా భావిస్తాం. కానీ ప్రస్తుతం ఆ విలువలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిజం, మార్క్సిజం పేరుతో వచ్చిన ప్రభుత్వం గుండాయిజం వైపు మళ్లిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన, శాంతి, సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని, ఎవరైనా అనుమానం ఉంటే తెలంగాణకు వచ్చి పరిశీలించాలని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా ఇప్పటివరకు వేల కోట్ల భారం కుటుంబాలపై తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలోని 1.06 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పేదలకు రూ.500 గ్యాస్ సిలిండర్, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహ నిర్మాణం చేపట్టామని వివరించారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం భారీ మొత్తంలో నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, విద్య మరియు వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. కేరళంలో యుడిఎఫ్ ప్రభుత్వం ఏర్పడితే కాలేజీకి వెళ్లే మహిళలకు నెలకు రూ.1000 ఆర్థిక సహాయం, యువతకు వడ్డీ లేని రుణాలు, సామాజిక పెన్షన్ పెంపు వంటి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉమెన్ చాందీ పేరుతో వృద్ధుల కోసం ప్రత్యేక బీమా పథకం తీసుకువస్తామని తెలిపారు. అలాగే వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేరళం ప్రజలు మార్పు కోసం యుడిఎఫ్కు మద్దతు ఇవ్వాలని భట్టి పిలుపునిచ్చారు.
నిరాహార దీక్ష విరమింపజేసిన డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ..
నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారికి సమాన
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి….
సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్విశాలాంధ్ర బత్తలపల్లి/ధర్మవరం;; మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధా విధంగా కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి 12 వరకు పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ పాదయాత్రలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తో పాటు రాష్ట్ర ప్రజా సంఘ నాయకులు పాల్గొంటారు అని తెలిపారు. ధర్మవరం […] The post మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి…. appeared first on Visalaandhra .
సికింద్రాబాద్ మోండా మార్కెట్లో కూల్చివేతలపై ఉద్రిక్తత #telugupost #secunderabad #mondamarket
రాజధాని విషయాన్ని కామెడీ పీస్ చేసిన ఘనత జగన్ కి దక్కుతుంది…
ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) విశాలాంధ్ర నందిగామ:-ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశీలనకు వచ్చిన ఆయన స్థానిక శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎంతో హుందాతనంతో రాజధాని విషయంలో మాట్లాడాల్సి ఉందని అటువంటి సమయంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి […] The post రాజధాని విషయాన్ని కామెడీ పీస్ చేసిన ఘనత జగన్ కి దక్కుతుంది… appeared first on Visalaandhra .
రాణించిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్పస్కోర్కే పరిమితమైన ముంబై
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన ముంబై జట్టు ఢిల్లీ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. 3వ ఓవర్లోనే ముఖేష్ కుమార్ రికెల్టన్(9), తిలక్ వర్మ(0)లను పెవిలియన్ పంపించాడు. ఈ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్తో కలిసి రోహిత్ శర్మ మంచి భాగస్వామ్యం జత చేశాడు. వీరిద్దరు కలిసి 53 పరుగుల స్కోర్ని జోడించారు. అయితే ఈ భాగస్వామ్యానికి అక్షర్ బ్రేక్ వేశాడు. అక్షర్ బౌలింగ్లో రోహిత్(35) ఔట్ అయ్యాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం జట్టును గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేశాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సులతో 51 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నమన్ ధిర్ 28 పరుగులు చేసి ఫర్వాలేదు అనిపించాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్లో ముఖేశ్ కుమార్ 2, ఎంగిడి, అక్షర్, విప్రాజ్, నటరాజన్ తలో వికెట్ తీశారు.

27 C