మంచి కాన్సెప్ట్తో తీసిన సినిమా
వరుస బ్లాక్బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీపద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘దర్శకుడు విఘ్నేష్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ నాకు ప్రత్యేకంగా చూపించారు. డబ్బింగ్ గురించి మర్చిపోయి సినిమా ఎంజాయ్ చేశాను. సినిమా చాలా న్యూ ఏజ్ కంటెంట్తో ఉంది. 2040లో మనం టెక్నాలజీ మీద ఎంత ఆధారపడతామో చాలా సృజనాత్మ కంగా చూపించారు. ప్రదీప్ అద్భుతంగా నటించాడు’ అని అన్నారు. హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో మనం ప్రతిదీ గూగుల్ లేదా చాట్ జీపీటీని అడుగుతున్నాం. మన రిలేషన్షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం- అన్నింటికీ ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. కానీ ఇంటర్నెట్లో దొరికిన సమాచారం అంతా సరైనదేనా? ఇద్దరి మధ్య జరిగేది వాళ్లిద్దరికే తెలుసు, కానీ చాట్ జీపీటీకి తెలియదు. ఇప్పుడు 2026లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, 2040లో ఎలా ఉంటుంది? మనుషుల కంటే మిషన్స్ మీద నమ్మకం పెరుగుతుంది. మిషన్ ఎవరి పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా చెప్పే స్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో.. ఒక అప్లికేషన్ మనకి సరైన జీవిత భాగస్వామి ఎవరో చెబితే? దానిని నమ్మగలమా? ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం’ అని పేర్కొన్నారు. డైరెక్టర్ విఘ్నేష్ శివ మాట్లాడుతూ ‘ఇది ఒక మంచి కాన్సెప్ట్తో తీసిన సినిమా. ప్రదీప్ ఈ స్క్రిప్ట్ను నమ్మి చేశాడు. అతనికి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. కృతి చాలా బాగా నటించింది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, కృత్తిశెట్టి, ఎస్జె సూర్య, శివప్రసాద్ పాల్గొన్నారు.
సింగారపేని గుట్టను మింగేస్తున్న ‘మట్టి’అసురులు!
సింగారపేని గుట్టను మింగేస్తున్న ‘మట్టి’ అసురులు! స్టేషన్ ఘన్పూర్ , ఆంధ్రప్రభ :
Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
వైజాగ్ లో యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ గొడవ
అమరావతి: క్రికెట్ మ్యాచ్ లో గొడవ యువకుడి ప్రాణం తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఆరిలోవ పెద్దగదిలి ప్రాంతంలో కొందరు యువకులు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్లో అజిత్(23), కిషోర్(26) అనే ఇద్దరు యువకులు గొడవపడ్డారు. పెద్దగదిలి జంక్షన్ వద్ద కోపంతో రగిలిపోయిన కిశోర్ అందరు చూస్తుండగానే పట్టపగలు నడిరోడ్డుపై అజిత్ ను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం కిశోర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆందోళనలో రైతులు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు
ప్రకృతే ఆమె ఉక్కపోతలో ఊరట తడి ఆరిన చూపులకు కురిసే చల్లని మేఘం సముద్రమే ఆమె లోతు చెప్పని కెరటాలతో నిత్యం సవ్వడే ఆమె పరిచయం ఒడ్డుపై కవిత్వమైన ఆమే ఏ ఊహ ఐనా సరే మనసుకు హత్తుకుని మెత్తగా మ్రోగే అక్షరం ఆమె - చందలూరి నారాయణరావు
Hyderabad : ఆసుపత్రులన్నీ కిటకిట.. హైదరాబాద్ పై దోమల దాడి
హైదరాబాద్ లో దోమల బెడద ఎక్కువయింది.
BJP : నేడు బీజేపీ ఆవిర్భావ వేడుకలు
నేడు బీజేపీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి.
మందుబాబులపై యుద్ధ బాంబు! #LiquorPrices#BeerRates#PriceHike#AlcoholNews
వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..
వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : 2026 ఏప్రిల్
తుపాకీ తూటాలతో పనిలేదు ఉండుండీ యుద్ధ మేఘాలు ఆవరిస్తాయి ముందస్తు హెచ్ఛరికలు లేకుండానే నలువైపులా చుట్టుముట్టి అప్పటికప్పుడు మాటలు మందుపాతరలై ఇద్దరి మధ్యా పెద్ద విస్పోటనం సృష్టిస్తాయి ఆమె పిల్లలను, పిల్లులను రక్షణ కవచకం చేసుకొని ఎదురు కాల్పులకు తెగబడుతుంది గాయాలన్నీ మాయమై చెల్లాచెదరైన శరీర అవయవాలన్నీ ఒక్కటై జరాసందుడిలా అసలు ఆకారం తీసుకుంటాము రోజువారీ దాంపత్యం కథలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడల్లా ఒక పిట్ట కథ లొట్టలేసుకుంటూ వచ్చి పీటముడిని సుతారంగా విప్పుతుంది అత్త మీది కోపం దుత్త మీద చూపిస్తానని బెదిరిస్తుంది ఒక ఇంట్లో రెండు శిబిరాలుగా విడిపోయే వేళ ఇరువురి మధ్య కాల్పుల విరమణ ఒడంబడిక జరుగుతుంది మాటల తూటాల జడివాన వెలిశాక పాలు పటువను నేలపాలు కాకుండా కడు నేర్పుతో వ్యూహం పన్నుతుంది కళింగ యుద్ధం తరువాత మారిన అశోకుడిలా అహింస బౌద్ధ ఆరామ ధర్మశాలగా ఒంటి చేత్తో ఇంటి లోపల శాంతి కపోతాన్ని ఎగురవేస్తుంది -జూకంటి జగన్నాధం
మావోయిస్టు పార్టీ కీలక నేత లొంగుబాటు
తెలంగాణలో మావోయిస్టు పార్టీ కీలక నేత పోలీసుల ఎదుట లొంగిపోయారు
అమరావతి విజయోత్సాహం.. ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : అమరావతి రాజధాని చట్టభద్దాత కల్పించడం రాష్ట్రపతి
మన అనుకున్న బంధాలన్నీ నామ రూపాల నీడలై ఇసుక రేణువుల్లా జారిపోతాయి కాలం అనే అగాథంలో మనసు కట్టుకున్న పాశాలు నిజమని నమ్మిన రంగులూ ఏదో ఒక నాటికి తెరలు తొలగిన నాటకాలై నిశ్శబ్దంగా కూలిపోతాయి మనం పలకరించిన ముఖాలు మనదనుకున్న బంధాలు కూడా నశ్వరమని తెలిసిన క్షణం రేపటికి అతిథులై మారతాయి మన జీవన గృహంలో ఏమీ లేని ఈ ఖాళీ లోకంలో ప్రశ్నలే మిగులుతాయి ఈ ప్రయాణంలో మనతో పాటు నడిచింది ఎవరు? మన అడుగులకు తోడైనది ఏమిటి? పదవులు కాదు, పేర్ల నీడలు కాదు అనుబంధాల పాశాలు కూడా కాదు మన శ్వాస వెంట నడిచే మన అంతర్ముఖ స్వరం ఒక్కటే అహం కరుగుతున్న వేళ గతం అనే మృగ జలం మన చూపునే మోసం చేస్తుంది నిజం మాత్రం మౌనంగా నిలుస్తుంది అందుకే, వదలడం తెలిసినవారే తమలో తాము తేలిపోతారు తమని తాము దాటి ఉన్నదానిలోనే నిలిచిపోతారు ఆ ఉనికే మనం అదే నిత్య సత్యం, అదే మోక్ష మార్గం - గీతా శ్రీనివాస్
బియ్యం అందజేత.. ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని 11వ
Pawan kalyan : నేడు తమిళనాడుకు పవన్
పవన్ కల్యాణ్ నేడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు
కొన్ని విషాదభరిత కళారూపాలని మనం చూస్తుప్పుడు అవి మనపై ఒక ముద్ర వేసి, మన నుండి ఏదో బరువు తొలగిపో యి కొంత రిఫ్రెష్ అయినట్టు మనం అనుభూతి పొందుతుంటాం. దాన్ని కెథార్సిస్ అంటారు. నాటక రంగంలో ఈ పదాన్ని వింటూ ఉంటాం. ఇది ఒక గ్రీక్ పదం. ఈ పదాన్ని గ్రీక్ విషాద నాటకం చివరలో ప్రేక్షకులలో కలగజేసే ప్రభావాన్ని వివరించడానికి ఉపయోగించేవారు. అయితే ఆధునిక ఉపయోగంలో, ‘క్యాథర్టిక్’ అనే ది తీవ్ర భావోద్వేగాల చికిత్సా ఉత్సర్గం అని అర్ధం. సాధారణంగా ఈ పదం బలమైన భావోద్వేగ అనుభవాన్ని వివరించడానికి ఉపయోగించబడుతుంది. కెథార్సిస్ గురించి చర్చించుకోవడం ఎందుకు అవసరం అంటే అది కళకి, సమాజానికి మధ్య, ప్రజల భావోద్వేగాల నిర్వహణకి మధ్య ఒక నైరూప్య సంబంధాన్ని తయారు కావాల్సిన అంశం గురించి చర్చిస్తుంది కాబట్టి. సాధారణంగా,ప్రేక్షకులలో భావోద్వేగ ప్రతిస్పందనను కలిగించి విషాద నాటకం ముస్తుం ది. ప్రేక్షకుల భావోద్వేగాలను వెలికి తీసి, వాటిని వదిలింపజేసి, ఆపై మానసికంగా ప్రశాంతత సాధించి, ప్రక్షాళన చేస్తుంది. ఈ పదాన్ని అరిస్టాటిల్ ట్రాజెడీని గురించి నిర్వచిస్తున్నప్పుడు వాడా డు. విషాద నాటకంలో ట్రాజిక్ చర్య చేసే పని ప్రేక్షకులలో జాలిని, భయాన్ని రేకెత్తించడం. దీనిపై ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. పాఠకులు లేదా ప్రేక్షకులు మానసిక, నైతిక శ్రేయస్సు కొరకు, తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి అని ప్లేటో చెప్పాడు. దానికి ప్రతిస్పందనగా అరిస్టాటిల్ కెథార్సిన్ని చెప్పాడు అని మనం నమ్మవచ్చు. పునరుజ్జీవనోద్యమ ఆలోచనాపరులు క్లాసిక్ గ్రీక్ రోమన్ సాహిత్యాలచే ప్రభావం చెందారు. అరిస్టాటిల్ హోరేస్ వంటి వారు వారి కి మార్గ దర్శకులు అయ్యారు. హోరేస్ ప్రకారం కవిత్వం బోధిస్తుం ది, అదే సమయంలో ఆనందపరుస్తుంది. ఇంకా చెప్పాలి అంటే కవి త్వం ఆహ్లాదపరుస్తున్నంది కావున బోధనకి ఉపయోగపడుతుంది. ఉద్వేగ అనుభూతుల నిర్వహణా వ్యాపారంలో కళ ఎంత తీవ్రంగా పాల్గొంటుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆధునిక కాలంలో పౌర సమాజం అభివృద్ధి చెందిన తర్వాత, ‘హేతుబద్ధమైన’ బూర్జువా సమాజం అభివృద్ధి చెందిన తరువాత, కెథార్సిను మొదట్లో తిరస్కరించిన తరువాత మానసిక ఉద్వేగాల దృష్టి తో పునర్నిర్వచించారు. గోథే దృష్టిలో కెథార్సిస్లో ప్రధాన అంశం సయోధ్య, సామరస్యాలను ప్రేక్షకుల మధ్య కంటే స్టేజిపై ఉన్న పార్టీల మధ్య సాధించడం. అది ఒక సృజనాత్మక ప్రక్రియ. కళాకారుడికి కళా సృజన అనేది కూడా ఒక విధమైన కెథార్టిక్ ప్రాసెస్. జోనాథన్ లియర్ అనే వ్యాఖ్యత, కెథార్సిస్కి ‘ఋతుస్రావం’ అనే అర్ధం వచ్చేటట్టు చెప్పాడు. ఉద్వేగాలని విడుదల చేసే ఒక సహజ ప్రక్రియగా చూశాడు. కెథార్సిస్ను ప్రక్షాళనగా, శుద్దీకరణగా, విద్య గా నిర్వచించారు. అయితే ‘ఫో రం థియేటర్’ సిద్ధాంతకర్త అగస్టో బోల్ అరిస్టాటిల్ కెథార్సిస్ సిద్ధాంతాన్ని ఒక సాంస్కృతిక రక్షణ కవాటంగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఇది ప్రేక్షకుల మనసులని ఖాళీ చేసి సురక్షితంగా ప్రశాంతంగా ఉంచుతుంది రాజకీయపరమైన తిరుగుబాటు చేసే బదులు. అతని వాదన ప్రకారం, విషాద నాటకం తన ప్రేక్షకులను దానిదైన స్వంత భ్రమాన్విత స్థలంలోకి లాక్కుని వెళుతుంది. దైనందిన జీవిత తీర్పులను కాల్పనిక వాటితో భర్తీ చేస్తుంది. అందువల్ల అతను పాసివ్ కెథార్సిస్ని చాలెంజ్ చేస్తాడు. థియేటర్ని మార్పుకి ఒక రిహార్సల్ స్థలంగా ఉండాలి అంటాడు. తరువాత కాలంలో కెధార్సిస్ సిద్ధాంతాన్ని సైకాలజీలో కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. పంతొమ్మిదవ శతాబ్దంలో జర్మన్ పండితులు కెథార్సిస్ ప్రక్రియని రోగ సంబంధమైన ఆవేశాల బహిష్కరణ అని భావించారు. ఇది నాటకం చూసిన ప్రేక్షునికిలో కలిగే ప్రతిస్పందన కంటే భిన్నమైనది. ఫ్రాయిడ్ బ్రూయర్తో కలసి హిస్టీరిక్స్ అంటే నరాల బలహీనతల గల వ్యక్తులు కోసం ఒక చికిత్సను అభివృద్ధి చేసాడు. దీనిని వారు ‘క్యాథర్టిక్ మెథడ్’ అని పిలిచారు. ఈ కారణంగా సామాజిక సంపర్కంతో సంబంధం లేకుండా, కెథార్సిస్ అనేది వ్యక్తిగత చికిత్సకి సంబంధించిన పదంగా మార్పు చెం దింది. ఈ విధంగా కెథార్సిస్ పని ప్రక్షాళన చేయడమే కాకుండా తీవ్ర భావోద్వేగ అనుభవంతో సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రాచుర్యం పొందడంలో ఒక ముందడుగుగా చెప్పవచ్చు. - గోవింద శివ్వాల
Iran Missile Attack : హైఫాలో.. హైటెన్షన్ Andhra Prabha News
Iran Missile Attack : హైఫాలో.. హైటెన్షన్ Andhra Prabha News (
నేడు చిత్తూరు,తిరుపతిలో మంత్రి నారాయణ
నేడు చిత్తూరు,తిరుపతిలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది
ఐపీఎల్ అంటే కేవలం మ్యాచ్ కాదు..
ఐపీఎల్ అంటే కేవలం మ్యాచ్ కాదు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐపీఎల్
Peddi Release Clarity: In Rahman’s Hands?
There is a big confusion on the release of Ram Charan’s Peddi. The shoot except for an item song is wrapped up and the film’s director Buchi Babu is with AR Rahman working on the background score. There is a big pressure mounting on the producers to trash the speculations and the makers will make […] The post Peddi Release Clarity: In Rahman’s Hands? appeared first on Telugu360 .
Five Villages, One Reality: Administrative Balance Over Political Push
The fresh demand from Tummala Nageswara Rao to transfer villages around Bhadrachalam into Telangana has added political weight to an already sensitive issue. His letter to Amit Shah frames the merger as a correction. It highlights distance, administrative access, and coordination concerns. The concerns raised are practical. Access to nearby district centres and flood management […] The post Five Villages, One Reality: Administrative Balance Over Political Push appeared first on Telugu360 .
కౌన్సిలర్ పరామర్శ.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్
ఒక్క నేనే ఇన్ని ముక్కలు..నేను, నా సాహితీ యాత్ర
సాహిత్య వాసనలేని మధ్యతరగతి ఇంట్లో పుట్టాను . అమ్మ పుట్టిల్లు హైదరాబాద్, నీలోఫర్ ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. బాల్యం, యవ్వనం విజయవాడలో నే గడిచాయి. చాలామంది కవుల్లా గా ఊరి చెరువు, ఈతలు, రావి చెట్టు ఉయ్యాల లు, అభిరుచి కలిగించే పంతుళ్ళు లాంటి మానసిక స్వాంతనలేవీ నాకు లేవు. విజయవాడ ఇరు కు గల్లీలో మూడు వాటాల పెంకుటింటి చివరి వాటా ఇల్లు, రోడ్డుకి అడ్డంగా పరిగెడుతూ పందు లు, ఇంటిముందు మురిక్కాలవలు, ఆడుకుంటూ అప్పుడప్పుడు అందులో పడిలేవడంతో నా బా ల్యం గడిచింది. ఇంట్లో అమ్మ మీద పెత్తనం చేసే బామ్మా, పిల్లలమైన మా మీద పెత్తనం చేసే బా బాయిలు, వాళ్ళకి ఎదురుతిరిగి, దెబ్బలు తినడం ఇవి కూడా నా స్వభావాన్ని తీర్చిదిద్దాయి. మా నాన్నకి తాత వరసయ్యే కొండేపూడి లక్ష్మి నారాయణ అనే గేయ కవి, కమ్యూనిస్ట్ ఉద్య మం నడిపారని, పెద్దమనుషులు అనే సినిమా తీశారని, వీధి నాటకాలు వేసే రాధ అనే వేరే కు లం అమ్మాయిని వివాహం చేసుకున్నారని గుసగుసలు ఉండేవి. మా మేనత్తల చదువు స్కూలుతోనే ఆగిపోయింది. నా తరంలో కాలేజీ మెట్టు ఎక్కిన మొదటి ఆడపిల్లని నేనే. అంచేత అతి జాగ్రత్త కొద్దీ, దగ్గరగా ఉన్న కో ఎడ్యుకేషన్లో కాకుండా ఎక్కువ ఫీజు కట్టి మరీ ఉమెన్స్ కాలేజీలో చేర్చారు. మారి స్టెల్లా కాలేజీ కొలనులో కలువ పూలు బావుండేవి కానీ, ఆ విపరీత క్రైస్తవ క్రమశిక్షణ నాకు నచ్చేది కాదు. డిగ్రీ మొదటి ఏ డాదికే ఆకాశవాణిలో చిరుద్యోగం రెక్కల్ని ఇచ్చిం ది. ఎకనమిక్స్ టెస్టుల్లో కూడా తిలక్ని, శేషేంద్రనీ గుమ్మరించే నేను, సరళ వాక్యం నేర్చుకుంది అక్క డే. యువవాణిలో కాజువల్ కాంపీరర్గా ఉన్నరోజుల్లో ఒకసారి రావాల్సిన వక్త రికార్డింగుకి రాలే దు. సాయంత్రానికల్లా ప్రోగ్రామ్ లైవ్కి వెళ్ళాలి. కథ ఏదయినా ఉంటే చదివేసి మంగళ వాక్యం పాడవచ్చు కానీ, చేతిలో ఏదీ లేదు. భయపడ్డాను. ఏం చేయాలో తోచక అప్పటికప్పుడు రికార్డింగు రూములో కూచుని కథ రాసేశాను. దానిపేరు పే రు మువ్వ మూగబోయింది. జనం తప్పకుండా తిడతారని, ఉద్యోగం ఊడిపోతుంది అని అనుకున్నాను. చిత్రంగా దానికి భలే పేరొచ్చింది. రేడి యో పత్రిక వాణిలో కూడా అచ్చయింది. నా మొదటి కవిత పేరు దుర్లోచన. దానికి కా రణం కోపం. మా హెడ్ ఆఫ్ ది తెలుగు డిపార్ట్ మెంట్ లాలితాదేవి. జయశ్రీ పత్రికలో వచ్చింది. అచ్చానందం భలే ఉంటుంది. సవ్యసాచి అనే పేరుతో కొన్నాళ్ళు కవిత్వం రాశాను. భారతి పత్రికలో ఇంకో సవ్యసాచి ఎవరో ఉండటం వల్ల, తిరిగి నా పేరుకి మారిపోయాను. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది నాలో ఉన్న ఇంకో కో ణం. అది ఒక్క నేనే ఇన్ని ముక్కలు కవిత రాయించింది. 1988లో ఇల్లు ఖాళీ చేసినప్పుడు.. అనే కవిత రాశాను. మొన్నీ మధ్య మళ్ళీ అదే వస్తువు మీద వ్యాసం రాశాను రెంటి మధ్యా ఎంత వైరుధ్యం ఉందో చెప్పడం నా ఉద్దేశ్యం. అస్తిత్వ వాద ఉద్యమ కవులకి కవితా వస్తువు ఊహాలలోంచి కా దు సందర్భంలో నుంచే పుడుతుందని నా ఉద్దేశ్యం. స్త్రీలు ముట్టకూడని వస్తువులు, ప్రతీకలు ఎన్నో ఉ న్నాయని తెలిసాక పనికట్టుకుని అవే రాశాను. మదర్ సీరియస్, హృదయానికి బహువచనం- లాంటి కవితా శిల్పాల గురించి చేరాతలు చెప్పా యి. సంప్రదాయ వ్యతిరేక ధోరణిగా ముద్రపడి విమర్శలకి గురవుతున్న సమయంలో, స్త్రీవాదానికి చేరా మాస్టారు ఇచ్చిన మోరల్ సపోర్టు చాలా ఉండేది. అప్పటికి ఒకే ఒక్క కవిత రాసిన కవయిత్రి గురించి కూడా చేరాతల్లో వచ్చిన ప్రశంసలు చూసి సీనియర్ కవులు అసూయపడేవారు. ప్రముఖ కవయిత్రి విమల, నేను రాస్తున్న కవి త్వం మీద ఎబికె ప్రసాద్ నీలాల రేవు నిర్మల, పా తాళ గంగ విమల అనే పేరుతో వార్తలో ఒక సం పాదకీయం రాశారు. నేను రాసిన పుస్తకాలలో నడిచే గాయాలుకి వచ్చిన గుర్తింపు కాలానికి, అప్పటి సామాజిక సందర్భానికి వదిలేస్తే నాకు మాత్రం బాధా శప్తనది అంటేనే ఇష్టం. సంధిగ్ధ సంధ్య, నడిచే గాయాలు, బాధా సప్తనది మూడు పుస్తకాల రోజుల్లోనూ నేను తెలంగాణా మారు మూల గ్రామాల్లో ఉండేదాన్ని, కవిత్వమే నన్ను సభల పేరిట మనుషుల దగ్గరికి తీసుకొచ్చే వాహికగా ఉండేది. సాహితీ వాతావరణం లేనిచోట సాహితీ మిత్రుల లేఖలే గొప్ప ఊరటగా కూడా ఉండేవి. నడిచే గాయాలులో వచ్చిన కవిత్వం పరిశీలిస్తే ఒక బాలిక పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకూ ఉన్న దశలన్నీ రికార్డ్ చేయగలిగాను. బాధా శప్తనది నుంచి రాజకీయ స్పృహ బాగా కనిపిస్తుంది. నాలుగో సంపుటి మల్టీ నేషనల్ ముద్దులో ప్రపంచీకరణ ప్రభావం మానవ జీవితంలోని అన్నీ కోణాల్లో ఎలా ఉం టుందో చెప్పడానికి ప్రయత్నించాను. నివురు కవి తా సంపుటి వచ్చేలోగా నేను అమెరికా వెళ్ళి వ చ్చాను, కాబట్టి అక్కడ ఉన్న తెల్లతోలు రాజకీ యం, భారతీయుల సమస్యలు లాంటివి నా ఊ హకి అందినవి రాశాను. తిరిగి అన్నీ కలిపి నిర్మల కవిత్వంగా ఒక సంపుటి వేశాను. ఇప్పుడు వద్దనుకున్నకొద్దీ ఫాసిజమే రచనకి సంభాషణకి వస్తువు అవుతోంది. ఈ మధ్య వచనం ఎక్కువ రాస్తున్నాను. అది ఉద్దేశపూర్వకంగానే జరిగింది. నేను చెబుతున్న విషయానికి ప్రక్రియాపరమైన అడ్డంకులు ఉండకూడడదనేది, సులువుగా అందరికీ అందాలనేది నా అభిమతం. శత్రుస్పర్శ, ఎచ్చటికిపోతా వీ రాత్రి రెండు కథా సంకలనాలు వేశాను. మృదంగం వ్యాసాల పుస్తకం వచ్చింది. ఇప్పు డు మళ్ళీ వేయాల్సినవి చా లా ఉన్నాయి. ము ఖ్యంగా కవిత్వం అనువాదాలు 50 వరకు ఉన్నాయి. ఫేస్బుక్ లో పోస్టు చేసిన వ్యాసాలు 45వరకు ఉన్నాయి. విలపి త భారత్ పేరుతో వేద్దామని ఉంది. చూడాలి. నా వ్యాసాలకి రంగవల్లి స్మారక అవార్డు, లాడ్లీ మీడియా అ వార్డు వచ్చాయి. కవిత్వానికయితే కేరళ ప్రభుత్వం ఇచ్చిన జాతీయ బహుమతితో పాటు దాదాపు ఇరవై వరకు గుర్తింపులున్నాయి. నేను రాసిన శారీఘర్ అనే కథ గురజాడ నుంచి ఇప్పటి వరకు వచ్చిన వంద మంచి కథల్లో ఒకటిగా ఎంపికవడం చెప్పుకోదగిన విషయం. ఇక నా ఉద్యోగ జీవితానికి వస్తే ఆంధ్రజ్యోతిలో 1978 నుంచీ నా జర్నలిజం జీవితం మొదలయింది. ఉదయం సుప్రభాతం, ఆంధ్రపభ, ఆకాశవాణి, మాభూమి, వర్తమానం లాంటి పత్రికలన్నీ అయిపోయాక, జర్నలిజంలో చాలా మార్పులు వచ్చాయి. ఏషియా నెట్ చానల్ వారి అంతర్జాలంలో పనిచేశాను. అనుకోకుండా ప్రభు త్వ రంగంలోకి వచ్చి పడ్డాను. అది కూడా చాలా నాటకీయంగా జరిగింది. నేను వలసల రాజ్యం అనే కవిత రాసేనాటికి ఆంధ్రప్రదేశ్ అకాడమీ వాళ్ళు జండర్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ కోసం చూస్తున్నారు. నా గురించి తెలుసుకుని వాకబు చే శారు. వెళ్ళాను. అవకాశం వచ్చింది, దాని తర్వా త రూరల్ వెలుగు, అర్బన్ వెలుగు, యునిసెఫ్, ప్రియాలాంటి ఎన్జీవోల్లో కూడా ట్రయినర్గా చేశాను. జర్నలిస్ట్గా నేను ప్రజల మధ్య నుంచుని చూసిన సమస్యలని, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య నుంచుని దాని అమలులో ఉండే రాజకీయాల్ని తెలుసుకున్నాను. ఈ రెండిటికి మధ్యలో కొన్నాళ్ళు సీరియ ల్స్లో చెప్పడానికి డబ్బింగ్ నేర్చుకున్నాను. ఉద్యోగానికి, ఉద్యోగానికి మధ్య చిన్నచితకా ప్రాజెక్టు లు కొన్ని చేశాను. అందులో ఒకటి జూనియర్ ఆర్టిస్టుల జీవితాల గురించి చేసినది చెప్పుకోవాలి. శ్మశానాల్ని ఆశ్రయించుకుని బతికే బేగరివాళ్ళ ని ఇంటర్వ్యూ చేశాను. జెఎన్టీయూ ఆర్ట్ కాలేజీ లో న్యూడ్ మోడలింగ్ చేసే బిక్కి అనే అమ్మాయి కష్టాల్ని రికార్డు చేశాను. అదీ కవిత్వమయిపోయింది. మెహందీవాడలో ఉండే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు నాన్నల్ని కొనాలి కిలో ఎంత కవిత రాశాను. ఏ నిజాయితీ, స్పష్టతలు కవులకి, కళాకారులకి ఉండి తీరాలో అవే ఇప్పుడు నిషిద్ధ మార్గాలవడం ఇప్పటి విషాద వాస్తవికత. దుష్ట రాజకీయాలు మనిషి జీవితంలో పుట్టిస్తున్న ప్రకంపనలు మౌనంగా ఉంచలేకపోతున్నాయి. కానీ అవి రికార్డు చేయడమే ఇప్పటి మన సవాలు. - కొండపూడి నిర్మల
చాముండేశ్వరి యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం..
చాముండేశ్వరి యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.. ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా
ఆదిలాబాద్ జిల్లాలో.. రేవంత్ రెడ్డి..
ఆదిలాబాద్ జిల్లాలో.. రేవంత్ రెడ్డి.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి
ఉప్పల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు మరో ఓటమి..#IPL2026#SRHvsLSG#SunrisersHyderabad#LucknowSuperGiants
టిమ్ డేవిడ్ క్లీన్ బౌల్డ్.... కానీ నోబాల్ తోనే ఓటమి: రుతురాజ్
హైదరాబాద్: ఐపిఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరసగా మూడో మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో ఆ జట్టు పరాజయాలపాలైంది. ఆర్సిబితో జరిగిన మ్యాచ్లో సిఎస్కె జ్టటు 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సిబి జట్టు 251 పరుగుల లక్ష్యాన్ని సిఎస్కె ముందు ఉంచింది. సంజు శామ్సన్పై అధిక అంచనాలను పెట్టుకున్నప్పటికి అతడు వమ్ము చేశాడు. హ్యాట్రిక్ ఓటమికి తానే బాధ్యుడినని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఆర్సిబితో జరిగిన మ్యాచ్లో తాను ఆడి ఉంటే భిన్నంగా ఉండేదని వివరించాడు. ఆర్సిబి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 14 ఓవర్ వరకు మ్యాచ్ చెన్నై చేతిలోనే ఉందని, టిమ్ డేవిడ్ను అన్షుల్ కాంబోజ్ క్లీన్ బౌల్డ్ చేసినప్పటి, అది నో బాల్ కావడంతో అక్కడి నుంచి మ్యాచ్ స్వరూపం మారిపోయిందన్నారు. లక్ష్య చేదనలో కూడా మూడు వికెట్లు త్వరగా పడిపోవడంతో పీకల్లోతు కష్టాల్లో జట్టు పడిందని, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, ఓవర్టన్ మంచి ఆటతీరు ప్రదర్శించారని కొనియాడారు. శివమ్ దూబే దురదృష్టవశాత్తూ పెవిలియన్కు చేరాడని పేర్కొన్నారు. మూడు ఓటములకు తానే బాధ్యత వహిస్తున్నానని రుతురాజ్ స్పష్టం చేశాడు.
కడప జిల్లాలో బస్సు ప్రమాదం.. కడప, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కడప
IPL 2026 : నేడు ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్
ఐపీఎల్ లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది
Tirumala : నేడు కూడా తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుం
ట్రాన్సఫార్మర్ టెన్షన్.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ విద్యుత్ శాఖ పరిధిలోని నవాబ్పేట
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో కారులో మంటలు కలకలం#Khairatabad#CarFire#HyderabadNews
45 Days Cease Fire : మళ్లీ వాయిదా ?! .. Andhra Prabha News
45 Days Cease Fire : మళ్లీ వాయిదా ?! .. Andhra
Strait of Hormuz : హార్మోజ్ జలసంధి మనకు చారిత్రాత్మకమైనదట
హార్మోజ్ జలసంధి గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తుంది
బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే సామేల్
మన తెలంగాణ/మోత్కూర్: బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పిలుపునిచ్చారు. బాబు జగ్జీవన్ రావు 119వ జయంతి సందర్భంగా ఆదివారం మోత్కూరులో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన బాబు జగ్జీవన్ రావు జయంతి సభలో ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి జగ్జివన్ రావు అని ఆయన సేవలను కొనియాడారు బాబు జగ్జీవన్ రావు 50 ఏళ్లు పార్లమెంట్ సభ్యుడుగా పనిచేయడంతో పాటు దేశ ఉప ప్రధానిగా సేవలందించారన్నారు. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన గొప్ప మహనీయుడు జగ్జీవన్ రావు అని పేర్కొన్నారు. తండ్రి సేవలను అనుసరిస్తూ తన కుమార్తె మీరాకుమారి లోక్ సభ స్పీకర్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, అధ్యక్షతన వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ కే సతీష్ కుమార్, కౌన్సిలర్లు కురిమిళ్ల ప్రమీల రాములు, మొగుళ్ళ అనురాధ శ్రీనివాస్ రెడ్డి,గనగాని శైలజ నర్సయ్య, పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి, బీసు శ్రీకాంత్ గౌడ్, నల్ల మధు, కారుపోతుల వెంకన్న గౌడ్, మెంట రమణ నాగేష్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పైళ్లసోమిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుర్రం లక్ష్మీ నర్సింహ్మరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రు, రాచకొండ బాలరాజు, మార్కెట్ డైరెక్టర్ లు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఎం డి.సమీర్, నాయకులు జినుకల కనకయ్య, మందుల సురేష్, శేఖర్ ఆచారి, బందెల రవి తదితరులు పాల్గొన్నారు. వివిధసంఘాల ఆధ్వర్యంలో ....... బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్లవీరేందర్ గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, గౌరు శ్రీనివాస్, చాడ మంజుల సజ్జన మనోహర్, పోచం సోమయ్య తదితరులు పాల్గొన్నారు. బీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో.... బాబు జగ్జీవన్ రావు జయంతి పుష్కరించుకొని బీఆర్ ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ మండల ,పట్టణ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్,జంగ శ్రీను, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చిప్పలపల్లి మహేంద్ర నాథ్, కొనతం యాకూబ్ రెడ్డి , నాయకులు కొండా సోం మల్లు, గజ్జి మల్లేష్ , క్రాంతి కుమార్ రెడ్డి, తిరుమలేష్, రఘుపతి, వెంకన్న, శ్రీను,తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ....... బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు కూరెళ్ళ యాకస్వామి,మందుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Weekend Box-office: Mixed Reactions
Sharwanand’s Biker and Sangeeth Sobhan’s Rakasa released over the weekend. Both these films received decent response. Biker word of mouth was better but the footfalls and the box-office numbers were quite low over the weekend. Biker was better in the multiplexes while Rakasa performed well in B and C centres. There is a huge impact […] The post Weekend Box-office: Mixed Reactions appeared first on Telugu360 .
లక్నో: అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను ప్రియుడితో భార్య చంపించింది. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. టాటూ నిందితులను పట్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఆగ్రాలోని లోకేంద్ర అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. లోకేంద్ర భార్య మహేశ్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం లోకేంద్రకు తెలియడంతో భార్యను పలుమార్లు మందలించాడు. భర్తను అడ్డుతొలగించుకుంటే వివాహేతర సంబంధం కొనసాగించొచ్చని ప్రియుడితో భార్య ప్లాన్ వేసింది. ఏప్రిల్ 1 సాయంత్రం లోకేంద్ర బయటకు వెళ్లాడు. ఈ విషయం తన ప్రియుడు మహేశ్కు తెలిపింది. మార్గం మధ్యలో లోకేంద్రకు మహేష్ కలవడంతో మద్యం తాగుదాముని ఆఫర్ ఇచ్చాడు. మహేష్, లోకేంద్ర, మహేశ్ స్నేహితుడు ధరమ్ వీర్ తో ఫుల్గా మద్యం తాగారు. లోకేంద్ర మద్యం పుల్గా తాగి పడిపోవడంతో ఇద్దరు కలిసి అతడి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మృతదేహానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేశారు. కాలిపోయిన మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోకేంద్ర సోదరుడు తన అన్న కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులకు అనుమానం రావడంతో మృతదేహాన్ని లోకేంద్ర సోదరుడుకి చూపించారు. చేతిపై లోకేంద్ర టాటూ ఉండడంతో వెంటనే తమ్ముడు అన్నమృతదేహాన్ని గుర్తు పట్టాడు. లోకేంద్ర భార్యను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తొలిసారిగా డిజిటల్ విధానంలో.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో టెన్త్ (SSC)
Pallichattambi Trailer: Tovino Thomas action-packed sensation
After 2018 and ARM, Malayalam star Tovino Thomas continues to strengthen his pan-Indian presence with his prestigious upcoming film “Pallichattambi.” The trailer has been unveiled, offering a peek into an intense period action drama set in the 1950s and 1960s. It opens with a voiceover that introduces the setting, where the head priest of Kunnumpuram’s […] The post Pallichattambi Trailer: Tovino Thomas action-packed sensation appeared first on Telugu360 .
డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం..
డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మొయినాబాద్
Revanth Reddy : నేడు ఆదిలాబాద్ జిల్లాకు రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు
పిస్టల్, రైఫిల్ షూటింగ్.. కప్.. గెలిచేది ఎవరు…?
పిస్టల్, రైఫిల్ షూటింగ్.. కప్.. గెలిచేది ఎవరు…? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Chandrababu : నేడు తాడిపత్రికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు
పోలవరం జిల్లాలో తప్పని డోలీ మోతలు
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డోలీ మోతలు తప్పడంలేదు. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని తడికోట గ్రామంలో చోళ్ల చిన్న రెడ్డి (20) అనే గిరిజనుడు చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడడంతో అతడిని తీసుకెళ్లడానికి ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేదు. కదలలేని స్థితిలో ఉన్న చిన్న రెడ్డిని ఆసుపత్రికి తరలించేందుకు డోలి కట్టి ఐదు కిలోమీటర్లు గిరిజనులు మోసుకెళ్లారు. మధ్యలో ఏడు చోట్ల వాగులను అతి కష్టం మీద దాటాల్సి వచ్చింది., 108 సిబ్బంది సహాయంతో అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేశంలో ఎక్కువ పట్టణ ప్రాంతాలలో ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న గిరిజన్ ప్రాంతాల్లో రోడ్లు, సరైన సదుపాయాలు లేవని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలలో రోడ్లు నిర్మించడంతో, గ్రామాలకు సమీపంలో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. దేశంలో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు కానీ గిరిజన ప్రాంతాలలో రోడ్లు నిర్మించడంలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్యం రాకముందు డోలీ మోతలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎక్కడ అభివృద్ధి జరిగిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
6thApril 2026 |తిరుమల సమాచారం..
6thApril 2026 | తిరుమల సమాచారం.. తిరుమల, ఆంధ్రప్రభ : “ఓం నమో
Israel - Iran War : హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ మరోసారి వార్నింగ్.. తెరవకుంటే దాడులే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్ంప్ ఆదివారం ఇరాన్పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
హర్మూజ్ తెరుస్తారా? నరకానికి పంపించమంటారా…?
హర్మూజ్ తెరుస్తారా? నరకానికి పంపించమంటారా…? Donald Tramp | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
ఇరాన్లో అమెరికా సాహసోపేత ఆపరేషన్ శత్రువు వెంటాడుతున్నా గల్లంతైన పైలట్ను రక్షించిన అమెరికా బలగాలు సిఐఎ కీలక పాత్ర.. అండగా నిలిచిన ఇజ్రాయెల్ శత్రువుకు చిక్కకుండా ఇరాన్ భూభాగంలోనే సొంత విమానాల పేల్చివేత రెండు సి130, బ్లాక్హాక్ హెలికాప్టర్లు నేలకూల్చినట్లు ఇరాన్ ప్రకటన ఆపరేషన్లో ఐదుగురు అమెరికన్ సైనికులు మృతి? ఒక్కడే కదా అని వదిలేయదు. ఆ ఒక్కడి కోసం అమెరికా యంత్రాంగమం తా సర్వశక్తులు ఒడ్డింది. శత్రువు బారిన పడకుండా కాపాడగలిగింది. నిఘా నేత్రాలు.. పక్కా వ్యూహాలతో రంగంలోకి దిగిన డజన్ల కొద్దీ యుద్ధ విమానా లు, వందలాది బలగాలు ఇరాన్లో కుప్పకూలిన యుద్ధ విమానం నుంచి సురక్షితంగా బయటపడిన ఫైటర్ పైలట్ను సురక్షితంగా కాపాడగలిగాయి. ఈ ఆపరేషన్ను నిరంతరం పర్యవేక్షించిన అధ్యక్షుడుడు ట్రంప్ గర్వంగా ‘వి గాట్ హిమ్’ అని ప్రకటించారు. ఏ ఒక్క అమెరికన్ యోధుడిని ఒంటరి గా వదిలివెయ్యబోమని బలగాల్లో భరోసా నింపారు. మరోవైపు ట్రంప్ హర్మూజ్పై ఇరాన్కు విధించిన 48గంటల గడువు కాస్తా 24గంటలకు వచ్చింది. ఆదివారంనాడు మరోసారి హర్మూజ్ అంశంపై ఇరాన్ను లక్షంగా చేసుకుని ట్రంప్ నోరుపారేసుకున్నారు. పరుష, అసభ్య పదజా లంతో దూషణకు దిగారు. హర్మూజ్ను తెరవకపోతే వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులకు దిగుతామని హెచ్చరించారు. న్యూఢిల్లీ: ఇరాన్లో కూలిన ఎఫ్-15 యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిని రక్షించేందుకు అమెరికా సైన్యం చేపట్టిన సాహసోపేత ఆపరేషన్పై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. వి గాట్హిమ్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ ఆపరేషన్లో డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, వందల సంఖ్యలో ప్రత్యేక దళాలు పాల్గొన్నట్లు సమాచారం. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాన్ని కూల్చివేయడంతో, అందులో ఉన్న ఇద్దరు సిబ్బందిలో పైలట్ను తక్షణమే రక్షించారు. అయితే వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ కనిపించకుండా పోవడంతో అతని కోసం అమెరికా విసృ్తత శోధనను ప్రారంభించింది. రెండో రోజు రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ మరుసటి రోజు ఉదయం ముగిసింది. అమెరికా సైన్యం ఈ ఆపరేషన్లో అత్యాధునిక యుద్ధ సామగ్రిని వినియోగించింది. హెచ్హెచ్-60 డబ్ల్యూ‘జాలీ గ్రీన్ II’ రక్షణ హెలికాప్టర్లు, ఎ-10 వార్థాగ్ దాడి విమానాలు, హెచ్సి-130 మిడ్ఎయిర్ ట్యాంకర్, ఎఫ్-35 స్టెల్త్ జెట్స్తో పాటు ప్రత్యేక ‘కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ’ దళాలు పాల్గొన్నాయి. శత్రు భూభాగంలో మిసైల్, రాడార్ ముప్పు మధ్య ఈ ఆపరేషన్ నిర్వహించడం గమనార్హం. మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారం, విమానం కూలిన వెంటనే ఇద్దరు సిబ్బంది తమ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా వారి స్థానాన్ని తెలియజేశారు. అమెరికా సైన్యం మొదటి పైలట్ను రక్షించగా, రెండో పైలట్ కోసం సీఐఏ ప్రత్యేక వ్యూహంతో శోధన చేపట్టింది. శత్రువులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ, అసలు స్థానం గోప్యంగా ఉంచింది. ఖచ్చితమైన సమాచారం అందిన వెంటనే ప్రత్యేక దళాలను ప్రవేశపెట్టి, తీవ్ర కాల్పుల మధ్య హెలికాప్టర్ల సహాయంతో రెండో పైలట్ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఆపరేషన్లో కొంత ప్రతిఘటన ఎదురైందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ బలగాలు దాడి చేయడానికి ప్రయత్నించగా, అమెరికా యుద్ధవిమానాలు బాంబులు విసురుతూ, కాల్పులు జరిపి శత్రువులను దూరంగా ఉంచాయి. ఈ చర్యల మధ్యే రక్షణ కార్యాచరణ విజయవంతమైంది. రక్షించిన సిబ్బంది గాయపడినప్పటికీ ప్రాణాపాయం లేదని ట్రంప్ తెలిపారు. రెండో పైలట్ను గౌరవనీయ కల్నల్ అని పేర్కొంటూ, శత్రు ప్రాంతంలో ఉన్నప్పటికీ అతను ఒంటరిగా లేడు. 24 గంటలూ అతని కదలికలను మేము పర్యవేక్షించాం అని అన్నారు. అదేవిధంగా, రెండు వేర్వేరు సందర్భాల్లో శత్రు భూభాగంలో చిక్కుకున్న ఇద్దరు అమెరికా పైలట్లను విజయవంతంగా రక్షించడం సైనిక చరిత్రలో అరుదైన ఘటనగా ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రతిస్పందన మరోవైపు ఈ ఆపరేషన్పై ఇరాన్ విభిన్న వాదనలు చేసింది. అమెరికా రక్షణ చర్య విఫలమైందని, తమ బలగాలు ఒక సి-130 రవాణా విమానం, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేశాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొంది. ఇస్ఫహాన్ ప్రాంతంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని, కొందరు మరణించారని కూడా ఇరాన్ ఆరోపించింది. ఈ సంఘటనతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా తన వైమానిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని ప్రకటిస్తుండగా, మరోవైపు ఇరాన్ తీవ్ర ప్రతిదాడులకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా భద్రత, ఇంధన రంగాలపై ప్రభావం చూపే అవకాశముంది.
న్యాయవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వాల కృషి భేష్
న్యాయ మౌలిక వసతులు విలాసం కాదు.. అత్యవసరం కోర్టు గది వెనుక మరో ప్రపంచం ఉంటుంది జడ్జిల నివాస సముదాయాల్లోనూ కార్యకలాపాలు: సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ 2027 డిసెంబర్ నాటికి హైకోర్టు భవన నిర్మాణ పనులు పూర్తిచేస్తాం ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పరం గౌరవంతో పనిచేయాలి కోర్టు సముదాయం అన్నివర్గాలకు పవిత్ర ఆలయం లాంటిది: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజేంద్రనగర్లో హైకోర్టు జోన్2 భవన నిర్మాణ పనులకు న్యాయమూర్తులతో కలిసి శంకుస్థాపన మనతెలంగాణ/హైదరాబాద్ : న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే సంకల్పంతో అడుగులు వేసినప్పుడే రాజ్యాంగం కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సామాన్యుడి జీవితంలో సజీవంగా మారుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా, న్యాయ మౌలిక సదుపాయాల కల్పన ఐచ్ఛికం కాదని, అది అత్యవసరమని అన్ని పక్షాల ప్రభుత్వాలు గుర్తించాయని అన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి హిమాచల్ వరకు, అసోం నుంచి తెలంగాణ వరకు ఇప్పుడు న్యాయవ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. న్యాయ మౌలిక సదుపాయాలు విలాసం కాదు అని, అవి దేశానికి ప్రాణాధారం అని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు రెండో జోన్ భవన నిర్మాణ పనులకు ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్ నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి, జస్టిస్ అలోక్ ఆరాధే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్తో పాటు ఇతర న్యాయకోవిదులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసే ప్రదేశానికి చేరుకున్న జస్టిస్ సూర్యకాంత్కు సిఎం రేవంత్ రెడ్డి సహా న్యాయమూర్తులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సిజెఐ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాలను పరిశీలించారు. నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేద పండితుల సమక్షంలో జరిపిన శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, తెలంగాణ న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని కొనియాడారు. దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థ బలోపేతంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రస్తుత హైకోర్టు భవనం చారిత్రాత్మకమైనదే అయినప్పటికీ, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వసతులు లేవని సిజెఐ అభిప్రాయపడ్డారు. కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ అనేవి ప్రజలకు విజిబుల్ జ్యుడీషియరీ అని, కోర్టు గది వెనక మరో ప్రపంచం ఉంటుందని తెలిపారు. కోర్టు కార్యకలాపాలు కొనసాగుతూనే ఉంటాయని, న్యాయమూర్తుల నివాస సముదాయాల్లో కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు నిర్మాణ పనులు చేపడుతున్న ప్రభుత్వానికి అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ.. వచ్చే వంద సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. 100 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ సముదాయం దేశంలోనే అత్యుత్తమంగా నిలవబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం: సిఎం రేవంత్రెడ్డి హైకోర్టు భవన నిర్మాణ పనులు డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయడం అనేది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదని, అది భారత గణతంత్రం ప్రజలకు ఇచ్చిన పవిత్రమైన హామీ అని పేర్కొన్నారు. హైకోర్టు కొత్త భవన సముదాయ నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో 49 కోర్టులు, నివాస భవనాల నిర్మాణ ప్రాజెక్టులను కూడా చేపడుతున్నట్టు చెప్పారు. 2023 డిసెంబర్లో తమ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తీసుకున్న మొదటి నిర్ణయాల్లో హైకోర్టుకు కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలన్న నిర్ణయం ఒకటి అని పేర్కొన్నారు. అందుకోసం రాజేంద్రనగర్లో 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించామని తెలిపారు. భవనాల కోసం జోన్-1లో ఇప్పటికే ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పుడు జోన్-2లో నివాస భవనాలకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. న్యాయవ్యవస్థకు అత్యుత్తమ సౌకర్యాలు అందించడం కార్యనిర్వాహక విభాగం బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ నిర్మించబోయే భవనం దేశంలోనే అతిపెద్ద హైకోర్టు సముదాయాల్లో ఒకటిగా మాత్రమే కాకుండా, ఆధునికత, మౌలిక వసతుల పరంగా ఒక ప్రమాణంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పరం ఆధారపడి, గౌరవంతో పనిచేస్తాయని తెలిపారు. సాధారణ పౌరుడు న్యాయం కోసం చివరగా ఆశ్రయించేది న్యాయస్థానాన్నే అని, అలాంటి న్యాయస్థానానికి కావలసిన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జీవితంలో తనకు లభించిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తానని పేర్కొన్నారు. కొత్తగా నిర్మించే హైకోర్టు సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగా నిలుస్తుందని, ఇది పేదలు, బలహీనులు న్యాయం కోసం వచ్చే వారికి వేదికగా నిలుస్తుందని చెప్పారు. రాబోయే వంద సంవత్సరాల పాటు పేదలు, బలహీనులు, అణగారిన వర్గాలు న్యాయం కోసం ఈ మందిరానికి వస్తారని అన్నారు. దేశంలో ఒక దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఒక కోర్టు సముదాయం అన్ని వర్గాల ప్రజలకు పవిత్ర ఆలయం వంటిదని వ్యాఖ్యానించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి న్యాయ మేధావులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా ఉందని అన్నారు. దేశంలోనే అతిపెద్ద హైకోర్టు భవన సముదాయమే కాకుండా అత్యున్నత ప్రమాణాలు, మౌలిక సదుపాయాలతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. హైకోర్టు భవన సముదాయం కేవలం నిర్మాణం కాదు.. ఇది తమ ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం అని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ పట్ల తమ ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ఇస్తుందని సిఎం రేవంత్రెడ్డి చెప్పారు.
సోమవారం రాశి ఫలాలు(06-04-2026)
మేషం చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్ధిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. సన్నిహితులతో కీలక విషయాలను చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృషభం అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. మిధునం వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహమున విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కర్కాటకం చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరచి సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. సింహం వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. భూ సంబంధిత వ్యాపారస్తులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్య నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. తుల వాహన సంభందమైన సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబమున మీ ఆలోచనలు ఎవ్వరికీ నచ్చవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు పరచడం మంచిది. వృశ్చికం శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. రాబడి మార్గాలు సంతృప్తి కరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ధనస్సు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. గృహమున కొన్ని సంఘటనలు గందరగోళంగా ఉంటాయి. వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. మకరం ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. దైవ సేవాకార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. కుంభం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. మీనం దీర్ఘకాలిక ఋణ భారం అధికమౌతుంది. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
ప్రజలపై ధరల భారాన్ని తగ్గించాలి..
ప్రజలపై ధరల భారాన్ని తగ్గించాలి.. ఆలేరు, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ
ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల భౌగోళికంగా భద్రాచలంతో కలిసి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో విలీనం తర్వాత అక్కడి ప్రజలు పాలనాపరంగా అవస్థలు పడుతున్నారు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సమస్యను పరిష్కరించండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ మన తెలంగాణ/హైదరాబాద్: భద్రాచలం ప ట్టణానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు రాష్ట్ర వ్వయసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ దివారం లేఖ రాశారు. భద్రాచలం పట్టణానికి అనుకుని ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండా ల పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ రా ష్ట్రంతో కలిసి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని వివరించారు. భద్రాచలం ప ట్టణం తెలంగాణలోనే ఉన్నా, భద్రాచలం గ్రా మం, పట్టణం మినహా భద్రాచలం మండలంలోని మిగిలిన అన్ని రెవెన్యూ గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినట్లు గుర్తు చేశారు. సుమారు 19 రెవెన్యూ గ్రామాలను కలిగి ఉన్న ఈ గ్రామ పంచాయతీలు, తెలంగాణ భూభాగంలోని రెండు ప్రాంతాల మధ్య ఒక విలక్షణమైన భౌగోళిక ప్రదేశంలో నెలకొని ఉన్నాయని, వీటి మిగిలిన సరిహద్దులు గోదావరి నది, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాన్ని కలిగి ఉన్నట్లు వివరించారు. దీంతో స్థానిక ప్రజలకు అనవసరమయిన కష్టాలను కలిగిస్తుందని చెప్పారు. ఈ గ్రామ పంచాయతీలు నివాస ప్రాంతాలు రాకపోకలు, పరిపాలన, జీవనోపాధి, ప్రజా సేవల కోసం పూర్తిగా భద్రాచలంపైనే ఆధారపడి ఉన్నాయని, ఈ క్రమంలో వీటిని ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగించడం స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. గతంలో భద్రాచలం పట్టణంతో తమకున్న చారిత్రక అనుబంధం, ప్రధానంగా షెడ్యూల్ తెగలకు చెందిన గ్రామ పంచాయతీలలోని ప్రజలు తెలంగాణలో భాగం కావాలని కోరుతూ స్థానిక నివాసితులు పలుమార్లు శాంతియుత ధర్నాలు, ప్రదర్శనలు కూడా నిర్వహించిన విషయాన్ని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. ప్రభావిత గ్రామస్థులు ఆంధ్రప్రదేశ్లోని జిల్లా స్థాయి పరిపాలన, పనుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం సుమారు 282 కిలోమీటర్ల (రోడ్డు మార్గంలో సుమారు 8 గంటల ప్రయాణం) దూరంలో ఉండగా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కేవలం 40 కిలోమీటర్ల (రోడ్డు మార్గంలో సుమారు గంట ప్రయాణం) దూరంలో ఉందని వివరించారు. ప్రస్తుత పరిస్థితులతో వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులను రవాణా చేసేటప్పుడు స్థానిక గిరిజన జనాభాకు పదేపదే తనిఖీలు, రాకపోకలకు సంబంధించిన ఇబ్బందులతో సహా, అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశాలకు సమీపంలో ఉండటం, చారిత్రాత్మకంగా వామపక్ష తీవ్రవాదం ప్రభావానికి లోనవడం వల్ల ఈ ప్రాంతం అంతర్గత భద్రత దృష్ట్యా సున్నితమైనదని, దీంతో పోలీసులులకు భద్రతాపరమయిన సవాళ్లను సృష్టిస్తాయని పేర్కొన్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, భద్రాచలం, తెలంగాణలో ఉండగా ఆలయానికి సంబంధించిన భూములు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్నాయని, ఆలయ వ్యవహారాలు, అనుబంధ భూముల పరిపాలన కోసం, ఈ ప్రాంతాన్ని తెలంగాణలో తిరిగి విలీనం చేయడం తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని లేకపోతే రాబోయే సంవత్సరాలలో ప్రభావిత గ్రామాలు, గిరిజన నివాసాలకు దీర్ఘకాలిక అన్యాయం జరుగుతుందని మంత్రి తెలిపారు.
6thApril2026 |సోమవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
6thApril2026 | సోమవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 6thApril2026 |
నాదర్గుల్ భూముల వ్యవహారంలో పొంగులేటి కుమారుడి ప్రమేయం లేదు
కోహినూర్ గ్రూప్ వివరణ - మన తెలంగాణ / హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ భూముల వ్యవహారంలో బిఆర్ఎస్ ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితం మాత్రమేనని, ఇందులో మంత్రి పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కోహినూర్ గ్రూప్ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. 2021లోనే స్థలం చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మాణం జరిగిందని వెల్లడించింది. రాజకీయ లబ్ధి కోసం బిఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని కోహినూర్ గ్రూప్ పేర్కొంది. 2015లో సుప్రీంకోర్టు తుది తీర్పుతో రాజా శివ్ రాజ్ బహదూర్ వారసులు హక్కుదారులుగా గుర్తించబడ్డారని వెల్లడించింది. 2015 వరకు భూవివాదం కోర్టులో ఉన్న కారణంగా ల్యాండ్ రిఫామ్స్ చట్టం వర్తించదని పేర్కొంది. వ్యవసాయానికి అనుకూలం కాని భూమి కావడం, ఇది అర్బన్ పరిధిలో ఉండటంతో ల్యాండ్ రిఫామ్స్ చట్టం వర్తించదని స్పష్టం చేసింది. కేసు విచారణలో ఉన్న సమయంలో మీడియా ట్రయల్ నిర్వహించడం సరికాదని పేర్కొంది. ఎక్యూ స్కేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2021లో మొత్తం స్థలాం చుట్టూ రేకులతో ప్రహరీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని గూగుల్ ఎర్త్ వెబ్సైట్లోని టైమ్లైన్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది. ఈ ప్రహరీ పనులు 2022మే నెలలో పూర్తయ్యాయని తెలిపింది. ఎక్యూ స్క్వేర్ రియల్టర్స్, దాని అనుబంధ సంస్థ క్రిస్టల్ మ్యాన్షన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్లో 2021 డిసెంబర్ 6 నుంచి 2023 మార్చి 1వరకు పొంగులేటి హర్ష రెడ్డి అదనపు డైరెక్టర్గా ఉన్నారని, అనంతరం బోర్డు నుంచి రాజీనామా చేశారని తెలిపింది. ఆ వివరాలు ఎంసిఎ రికార్డుల్లో నమోదయ్యాయని వివరించింది. నాదర్గుల్ భూ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ప్రేరేపితంగానే నిరాధార ఆరోపణలు చేస్తూ పొంగులేటికి హర్ష రెడ్డికి ఆపాదిస్తున్నారని పేర్కొంది. ఈ భూమి అసలు రాజా శివ్ రాజ్ బహదూర్కు చెందిన ప్రైవేట్ ఆస్తి అని, 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో ఆయన వారసులే హక్కుదారులని ధ్రువీకరించబడిందని తెలిపింది. అసలు ఈ భూమిపై వివాదం 2005లో ఓస్ నెంబర్ 155తో ప్రారంభమైందని తెలిపింది. యాజమాన్యం, ఆక్యుపెన్సీ హక్కులపై డిక్లరేషన్, రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని, అయితే ఏప్రిల్ 30, 2007న ట్రయల్ కోర్టు ఈ కేసును కొట్టివేసిందని తెలిపింది. దీనిపై హైకోర్టులో ఎస్ నంబర్ 274/2007 ద్వారా అప్పీల్ దాఖలైందని, డివిజన్ బెంచ్లో భిన్నాభిప్రాయాల కారణంగా కేసు మూడో న్యాయమూర్తికి వెళ్లిందని వివరించింది. 19 డిసెంబర్ 2011న వెలువడిన తీర్పులో పిటిషనర్లను పూర్తి యజమానులుగా కోర్టు గుర్తించిందని, రాష్ట్రం జోక్యం చేసుకోకుండా శాశ్వత ఇంజంక్షన్ కూడా మంజూరు చేసిందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎపిఐఐసి 2013లో దాఖలు చేసిన సివిల్ అప్పీలు (2963, 2964)ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని, భూ యజమానులకు ఆక్యుపెన్సీ హక్కులు వర్తించేలా ఉత్తర్వులిచ్చిందని తెలిపింది. భూమి విస్తీర్ణం అధికంగా ఉండటంతో ల్యాండ్ రిఫారమ్స్ చట్టం వర్తించాలనే ప్రశ్న తలెత్తినప్పుడు, 2015 వరకు భూమి వివాదంలో ఉండటంతో ఆ చట్టం అమలు కాదని తెలిపింది. 2020 జనవరి 9న ల్యాండ్ రిఫారమ్స్ ట్రైబ్యునల్ (ఎల్ఆర్టి) నోటీసులు జారీ చేసిందని, దీనిపై భూయజమానులు అప్పీల్ దాఖలు చేయగా అది ప్రస్తుతం పెండింగ్లో ఉందని తెలిపింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమి పాట్ ఖరాబ్గా (అంటే వ్యవసాయానికి అనుకూలం కాని భూమిగా) వర్గీకరించబడిందని కోహినూర్ గ్రూప్ వివరణ ఇచ్చింది. ఇది అర్బన్ పరిధిలో ఉండటంతో ల్యాండ్ రిఫారమ్స్ చట్టం వర్తించదని, ఈ భూమిపై కొందరు చేసిన కొనుగోళ్లలో న్యాయపరమైన లోపాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వివరించింది. నాలా కన్వర్షన్ అనుమతి తిరస్కరించిన నేపథ్యంలో ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లిందని, ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని కోహిర్నూర్ గ్రూపు పేర్కొంది.
భట్టి పీపుల్స్ మార్చ్కు మూడేళ్లు
కాంగ్రెస్ను అధికారంలోకి తేవడానికి 2023లో పాదయాత్ర నేడు బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరిలో బహిరంగ సభ హాజరు కానున్న సిఎం రేవంత్ పలు పథకాల లబ్దిదారులకు పత్రాల పంపిణీ మన తెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి వేదికగా పీపుల్స్ మార్చ్ పేరిట అప్పటి ప్రధాన ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు మూడేళ్లు పూర్తికానున్న సందర్భంగా పిప్పిరి గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ నిర్వహించనుంది. ఈ బహిరంగ సభకు సిఎం రేవంత్ రెడ్డి హాజరై పాదయాత్రలో ఇచ్చిన సంక్షేమ పథకాల తాలుకా అర్హులయిన లబ్దిదారులకు పత్రాలు అందించనున్నారు. 109 రోజులు.. 1,364 కిలోమీటర్లు భట్టి విక్రమార్క ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో ప్రారంభమయి 2023 జులై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగిసింది. మొత్తం 109 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో భట్టి విక్రమార్క సుమారు 1,364 కిలోమీటర్లు నడిచారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొత్తం 17 జిల్లాలు 36 అసెంబ్లీ నియోజకవర్గాలు దాటి ముందుకు సాగింది. ఈ యాత్రలో ఆయన 700 పైగా గ్రామాలను సందర్శించి వందకు పైగా కార్నర్ సమావేశాల్లో హాజరైన అశేష జన వాహిని ఉద్దేశించి ప్రసంగించారు. పాదయాత్రను మరింత ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో అధిష్టానం సూచన తో మంచిర్యాల, షాద్నగర్, ఖమ్మం, మూడు చోట్ల భారీ బహిరంగ సభలు సైతం నిర్వహించారు. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలను వినడమే కాకుండా అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా హామీల ద్వారా డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క నాడు ప్రజలకు వివరించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు పునరంకితం అవుతూ మరోసారి పిప్పిరి గ్రామంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలు అమలు చేసే పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. జలయజ్ఞం 2004 కార్యక్రమంలో ఆడ వద్ద కొమరం భీం ప్రాజెక్టులు ప్రారంభమైనప్పటికీ గత పది సంవత్సరాలుగా కాలువల నిర్మాణం పూర్తి కాకపోవడంతో సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కుడి ఎడమ కాలువలు వెంటనే పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటి సిఎం అధికారులను ఆదేశించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలకంగా ఉన్న చికుమాను, పులిమడుగు, కుఫ్టీ త్రివేణి సంగమం ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ రకాల అనుమతులను ఈ సందర్భంగా మంజూరు చేయనున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మర్చిపోలేని మహాయజ్ఞం : భట్టి విక్రమార్క ఆదిలాబాద్ అడవుల నుంచి ఖమ్మం వరకు 1364 కిలోమీటర్ల మేర జరిగిన పీపుల్స్ మార్చ్ పాద యాత్ర జీవితంలో మర్చిపోలేని ఒక మహాయజ్ఞమని డిప్యూటి సిఎం భట్టి అన్నారు. తెలంగాణ మట్టి బిడ్డలకు, నాతో నడిచిన అశేష జనవాహినికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఆ నాడు పాదాలకు బొబ్బలు ఎక్కినా, శరీరం అలసిపోయినా నన్ను ముందుకు నడిపించింది ప్రజల ఆత్మీయత మాత్రమేనని పేర్కొన్నారు.
డిజిటల్ జనగణనలో ‘కుల గణన’ ఉంటేనే సామాజిక న్యాయం
దేశ భవిష్యత్తు ప్రణాళికలకు అత్యంత కీలకమైన ‘జనగణన 2027’ ప్రక్రియ గురించి భారత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ కీలక …
నాదర్గుల్లో 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు యత్నాలు ఈ భారీ భూ కుంభకోణం వెనుక మంత్రి పొంగులేటి కుటుంబం బౌన్సర్లను పెట్టి పేద రైతులపై దాడులు సిఎం వెంటనే చర్యలు చేపట్టాలి హైడ్రా కమిషనర్ తక్షణమే కలుగజేసుకోవాలి లేకపోతే మా ఎంఎల్ఎలతో కలిసి అక్కడికి వెళ్తాం: బిఆర్ఎస్ అగ్రనేత హరీశ్రావు మనతెలంగాణ/హైదరాబాద్ : నాదర్గుల్లో రూ. 7 వేల కోట్ల విలువైన 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు ఆరోపించారు. హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ అధికార బలంతో బౌన్సర్లను పెట్టి పేద రైతులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ భారీ భూ కుంభకోణం, కబ్జా కంపెనీల వెనుక మంత్రి పొంగులేటి కుటుంబం ఉన్నదని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ.. పేదల ఇళ్లు కూలగొట్టే హైడ్రాకు .. అధికార పార్టీ నేతల వేల కోట్ల కబ్జాలు, చెరువుల ఆక్రమణలు ఎందుకు కనిపించదని ప్రశ్నించారు. సిఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కబ్జాదారులను అరెస్ట్ చేసి, రైతులను భూముల్లోకి అనుమతించాలని అన్నారు. నాదర్గుల్ భూములపై సోమవారం ఉదయం వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకోకపోతే.. ఎంఎల్ఎలతో కలిసి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని మండిపడ్డారు. ఒకవైపు పారిశ్రామిక వేత్తల ముసుగులో, మరోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతోందన్నారు. రక్షకులే భక్షకులుగా మారారని విమర్శించారు. నాదర్గుల్ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లేఖ రాయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో వీటిని ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి ఎపిఐఐసికి అప్పగించారని చెప్పారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఆ భూములను కంటికి రెప్పలా కాపాడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఈ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని పేర్కొన్నారు. ఈ భూముల్లో 600 మంది పేద రైతులు తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. పేదలకు సాయం చేయాల్సిన పోలీసులు పెద్దలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. నాదర్గుల్ భూములు తనవని శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి నిజాం కాలం నాటి మాటలు చెబుతుండగా, 2005లోనే అప్పటి ఆర్డీవో ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారు.2017లో సుప్రీంకోర్టు కూడా ఇది ప్రభుత్వానిదేనని చెప్పింది. 373 ఎకరాలు ఉండే అవకాశం లేదు రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదని హరీష్రావు అన్నారు. కానీ, 2016లో శివరాజ్ బహదూర్ ఈ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ అనే కంపెనీలకు విక్రయించారని చెప్పారు. చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 17 ప్రకారం ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఈ భూములను అమ్మే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఈ విక్రయాలు చెల్లవని, ఇది సెక్షన్ 22ఎ కింద నిషేధిత జాబితాలో ఉంటుందని కందుకూరు ఆర్డిఒ తేల్చిచెప్పారని అన్నారు. ఆర్డీవో నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు కంపెనీలు హైకోర్టుకు వెళ్లగా.. ఆర్డీవో నిర్ణయమే సరైనదని, ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవని సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ స్పష్టం చేశాయని తెలిపారు. అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూచించిందని అన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారని, ప్రస్తుతం జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం వద్ద ఈ కేసు 2026 ఏప్రిల్ 7న విచారణకు పెండింగ్లో ఉందని అన్నారు. సుప్రీంకోర్టులో వాళ్లకు ఎలాంటి స్టే రాలేదు కాబట్టి హైకోర్టు తీర్పే ఫైనల్ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కందుకూరు ఆర్డీవో దాఖలు చేసిన అఫిడవిట్ లోనూ ఇది ప్రభుత్వ భూమి అనే స్పష్టం చేశారని, ఆదివారం ఉదయం భూభారతి వెబ్సైట్లో చూసినా ఇది ప్రభుత్వ భూమి నిషేదితగానే చూపిస్తోందని తెలిపారు.
జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి నేడు సిఎం రేవంత్ భూమి పూజ తొమ్మిది అంతస్థులతో రాజగోపురం ఈశాన్యాన కోనేరు 3 రెట్లు పెరగనున్న దేవాలయ విస్తీర్ణం రూ.225 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం శృంగేరి పీఠాధిపతుల అనుమతితో పనులు మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలోని ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం.. అక్షరాభాస్యాలకు ఆలవాలమైన క్షేత్రం పునఃనిర్మాణంతో కొత్త శోభను సంతరించుకోబోతోంది. వేద వ్యాస మహర్షితో ప్రతిష్టతమైన ముగ్గురు అమ్మల ఆలయం ఆచారాలకు అనుగుణంగా సమున్నతమైన రాజగోపురం.. కోనేరు.. ఉత్తర ద్వారం అభివృద్ధి.. ధ్యాన మందిరాలతో మరింతగా భక్తుల మనస్సులను ఆకట్టకోనుంది. వేల ఏళ్ల ఘన చరిత్ర గల్గిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునః నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లను కేటాయించింది. పునః నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేయనున్నారు. దక్షిణ గంగగా గుర్తింపు పొందిన పవిత్ర గోదావరి నదీ తీరంలోని బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతి దేవి కొలువై ఉన్నారు.. కురుక్షేత్ర యుద్ధానంతరం ప్రశాంతత కోసం వేద వ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చి బాసరలో నివసించారట.ఆ సమయంలో స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతితో పాటు మహా లక్ష్మి, మహా కాళి అమ్మ వార్ల మూర్తులను ప్రతిష్టించారనేది స్థల పురాణం.. అలా ముగ్గురమ్మల కొలువైన క్షేత్రంగా బాసర ప్రసిద్ధి చెందింది. ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్య జ్ఞాన సరస్వతి కొలువైన క్షేత్రం కావడంతో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. వసంత పంచమి, ఇతర పర్వ దినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చే పిల్లలు, తల్లిదండ్రులు, వారి బంధువులు, భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ప్రాచీన ఆలయం కావడం.. ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు... శృంగేరి పీఠాధిపతుల సూచనలతో మాస్టర్ప్లాన్ బాసర ఆలయ పునఃనిర్మాణ పనులకు మాస్టర్ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించారు.. గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు.. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. విశాలంగా.. సౌకర్యంగా.... భక్తుల సంఖ్య.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు... శిలలతో నిర్మాణాలు ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టనున్నారు. 6 వేల మంది భక్తులకు అన్ని వసతులతో (ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితరాలతో) 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్కు, 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంట శాల, భోజన శాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు... తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, ఆవతలి వైపున సోలార్ రూప్టాప్తో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో ఆలరారేలా మొక్కలు నాటనున్నారు.. పుష్కరాలకు వచ్చే వారికి అన్ని వసతులు గోదావరి నది పుష్కరాలు వచ్చే ఏడాది జూన్లో ప్రారంభం కానున్నాయి. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలకు బాసర గోదావరి తీరానికి చేరుకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రస్తుత మాస్టర్ప్లాన్లో భాగంగా చేపట్టనున్నారు. ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా అదే సమయంలో ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍:ଭାଇରାଲ ଭିଡିଓଟି ଗୁଜରାଟର ଅଟେ, ଦିଲ୍ଲୀରେ ଘଟିଥିବା ହତ୍ୟାକାଣ୍ଡ ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ
ହୋଲିରେ ଦୁଇଟି ପରିବାର ମଧ୍ୟରେ ସଂଘର୍ଷ ସମୟରେ ଜଣେ ୨୬ ବର୍ଷୀୟ ଯୁବକଙ୍କ ମୃତ୍ୟୁ ପରେ ପଶ୍ଚିମ ଦିଲ୍ଲୀର ଉତ୍ତମ ନଗରରେ ଉତ୍ତେଜନା ପ୍ରକାଶ ପାଇଥିଲା । ହିନ୍ଦୁ ଧର୍ମର ବିଭିନ୍ନ ସଂଗଠନ ପ୍ରତିବାଦ କରିବା ସହ ମୃତ୍ୟୁବରଣ କରିଥିବା ଯୁବକ ତରୁଣଙ୍କ ହତ୍ୟାରେ ସମ୍ପୃକ୍ତ ସନ୍ଦିଗ୍ଧ ବ୍ୟକ୍ତିଙ୍କ ସହ ଜଡିତ ଏକ ଘରକୁ ନିଆଁ ଲଗାଇ ଦେଇଥିଲେ । ଉତ୍ତେଜନାପୂର୍ଣ୍ଣ ଅଞ୍ଚଳରେ ପୋଲିସ ମୁତୟନ ପରେ ହିଁ ସ୍ୱାଭାବିକ ଅବସ୍ଥା ଫେରି ଆସିଥିଲା । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଉକ୍ତ ଭିଡିଓରେ ଏକ ଜନ ସମୁଦ୍ର ଭିତରେ କିଛି ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଦଉଡ଼ିରେ ବନ୍ଧା ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଆଉ କିଛି ବ୍ୟକ୍ତି ଏକ ବାଡ଼ି ଦ୍ୱାରା ମାଡ଼ ମାରୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ମାଡ଼ ମାରୁଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କ ପଛପଟେ ଆଉକିଛି ବ୍ୟକ୍ତି ପୋଲିସ ପୋଷାକରେ ଚାଲୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଭିଡିଓଟିକୁ ଦିଲ୍ଲୀର ଉତ୍ତମ ନଗରର ଘଟଣା ସହ ଯୋଡ଼ା ଯାଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଘଟଣାରେ ଜଡ଼ିତ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ପୋଲିସ ଶାସ୍ତି ଦେଉଥିବାର ଏହି ଭିଡିଓ ବୋଲି ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ସେହିପରି ଭିଡିଓ ଉପରେ ଉଲ୍ଲେଖ ରହିଚି, ଉତ୍ତମ ନଗରରେ ଯେଉଁ ଦଙ୍ଗା ହେଉଥିଲା । ଉକ୍ତ ଘଟଣାରେ ଜଡ଼ିତ ଦଙ୍ଗାକାରୀଙ୍କୁ ପୋଲିସ ଗିରଫ କରି ସର୍ବସାଧାରଣ ସ୍ଥାନରେ ଉତ୍ତମ ମଧ୍ୟମ ଦେଉଛି । ଯାହାର ଏକ ଲିଙ୍କ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭାଇରାଲ ଭିଡିଓଟି ଗୁଜରାଟର ଅଟେ । ଉକ୍ତ ଭିଡିଓ ସହ ଦିଲ୍ଲୀ ଉତ୍ତମ ନଗରରେ ଘଟିଥିବା ଘଟଣା ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ । ଉକ୍ତ ଦାବିର ସତ୍ୟତା ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଦିଲ୍ଲୀ ପୋଲିସ ଏଭଳି କୌଣସି ଦଣ୍ଡ ଦେବାର ସୂଚନା ଆମର ହସ୍ତଗତ ହୋଇ ନଥିଲା । ଯଦି ଏଭଳିକୌଣସି ଘଟଣା ଘଟିଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଭାଇରାଲ ହେଉଥିବା ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । #गुजरात पाटन जिले के चाणस्मा तालुका के जीलिया गांव में 15 मार्च 2026 की रात एक फार्महाउस पर 15 से 20 हमलावरों ने हथियारों और पत्थरों से हमला किया, कई लोगों को पीटा औऱ तोड़फोड़ करके भारी नुकसान किया। मंदिर के चंदे को लेकर पुरानी रंजिश के चलते यह हमला किया गया था। इसमें… pic.twitter.com/Svk5LziZOf — Abhimanyu Singh (@Abhimanyu1305) March 19, 2026 ଅଭିମନ୍ୟୁ ସିଂହ ନାମକ ଜଣେ ସାମ୍ବାଦିକ ଉକ୍ତ ଭିଡିଓକୁ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ୧୯ ମାର୍ଚ୍ଚ ୨୦୨୬ରେ ଉକ୍ତ ଭିଡିଓକୁ ଅପଲୋଡ଼ କରି ଅଭିମନ୍ୟୁ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଭିଡିଓଟି ଗୁଜରାଟର ଅଟେ । ୧୫ ମାର୍ଚ୍ଚ, ୨୦୨୬ ରାତିରେ, ପାଟନ ଜିଲ୍ଲାର ଜିଲିଆ ଗ୍ରାମସ୍ଥିତ ଏକ ଫାର୍ମହାଉସରେ ୧୫ ରୁ ୨୦ ଜଣ ଦୁର୍ବୃତ୍ତ ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ର ଏବଂ ପଥର ବ୍ୟବହାର କରି ଆକ୍ରମଣ କରିଥିଲେ; ସେମାନେ ଅନେକ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଆକ୍ରମଣ କରିଥିଲେ ଏବଂ ଭଙ୍ଗାରୁଜା ମାଧ୍ୟମରେ ବ୍ୟାପକ କ୍ଷତି କରିଥିଲେ। ମନ୍ଦିର ଦାନ ସମ୍ପର୍କିତ ଏକ ପୁରୁଣା ଶତ୍ରୁତା ଯୋଗୁଁ ଏହି ଆକ୍ରମଣ କରାଯାଇଥିଲା। କିଛି ସଂଗଠନ ଏବଂ ପ୍ରମୁଖ ରାଜନୈତିକ ଦଳ ସହିତ ଜଡିତ ବ୍ୟକ୍ତିମାନେ ଏହି ଘଟଣାରେ ସାମିଲ ଥିଲେ। ତୁରନ୍ତ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଗ୍ରହଣ କରି, ପୋଲିସ ୧୮ ଜଣ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ ଗିରଫ କରିଥିଲା ଏବଂ ମାର୍ଚ୍ଚ ୧୮ ରେ ସେମାନଙ୍କୁ କ୍ଷମା ମାଗିବାକୁ ବାଧ୍ୟ କରିବା ପାଇଁ ସାର୍ବଜନୀନ ଭାବରେ ପରେଡ କରିଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁ ମାତ୍ରାରେ ସମାନତା ଦେଖା ଯିବାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ଦିନର ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ କିୱାର୍ଡ ଗୁଡିକ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଆଉ ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୧୯ ମାର୍ଚ୍ଚ ୨୦୨୬ରେ ଆଇବିଏନ ୨୪× ୭ ନିୟୁଜ ଉକ୍ତ ଭିଡିଓକୁ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆ ପେଜରେ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଭିଡିଓଟି ଅପଲୋଡ଼ କରି ଆଇବିଏନ ଉଲ୍ଲେଖ କରିଛି, ଝିଲ୍ଲୀଆ ଗ୍ରାମରେ ଥିବା ଫାର୍ମ ହାଉସରେ ଘଟିଥିବା ଅଘଟଣ ପାଇଁ ଦୁର୍ବୃତ୍ତଙ୍କୁ ପୋଲିସ ସର୍ବସାଧାରଣରେ ଏଭଳି ଚଲାଇ ଚଲାଇ ନେଉଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଗୁଜରାଟର ଏକ ଫାର୍ମହାଉସରେ ଅଘଟଣ ଘଟାଇଥିବା ଦୁର୍ବୃତ୍ତଙ୍କୁ ପୋଲିସ ଚଲାଇ ଚଲାଇ ନେଉଥିବାର ଭିଡିଓ ଅଟେ। ଉକ୍ତ ଭିଡିଓ ସହ ଦିଲ୍ଲୀ ଉତ୍ତମ ନଗରୀରେ ଘଟିଥିବା ହତ୍ୟାକାଣ୍ଡ ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ ।
సినిమా ఇంకా ఉందని వీడియోలతో ఎదురుదాడి న్యూఢిల్లీ: పంజాబ్ వేదికగా ఆమ్ ఆద్మీపార్టీలో సంక్షోభం ముదిరింది. ఆప్ రాజ్యసభ సభ్యులు ఎంపి రాఘవ చద్ధా ఆదివారం పార్టీ నాయకత్వంపై ఎదురుదాడికి దిగారు. సినిమా అయిపోలేదు. ఇంకా మిగిలే ఉంది. పైగా ఇప్పుడే అసలు సినిమా అంటూ వీడియోలు విడుదల చేశారు. పార్లమెంట్లో పంజాబ్ సమస్యలను రాఘవ ప్రస్తావించడం లేదనే పార్టీ అంతర్గత వాదనను ఆయన తోసిపుచ్చారు. పార్లమెంట్లో తన ప్రసంగాలను తెలియచేస్తూ తాజాగా మూడు నిమిషాల వీడియోను వెలువరించారు. నిజానిజాలు ఈ దృశ్య శ్రవణ సాధనాలు తెలియచేస్తామని స్పందించారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో తప్పుడు కథలతో ప్రచారానికి దిగుతున్నారని, దీనికి తాను ప్రతిస్పందన ఇచ్చుకోవల్సి ఉంటుందని తెలిపారు. రాజ్యసభలో ఆప్ ఉపనేత పదవి నుంచి ఇటీవల ఆయనను తొలిగించారు. ఇది వివాదాస్పదం అయింది. పంజాబ్ విషయాలను తాను ప్రస్తావించడం లేదని చెప్పడం కించపర్చడమే అని పేర్కొన్నారు. పంజాబ్ తనకు ఓ మైక్ అనుకోరాదని, అంతకు మించి ఓ ఇల్లు, తన ఆత్మ అని తెలిపిన రాఘవ పంజాబ్ కోసం స్పందించడం తన బాద్యత అని తేల్చిచెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరలు, భగత్ సింగ్కు భారత్ రత్న, భూగర్భ జలాల తగ్గుముఖం, నన్కానా సాహిబ్ కారిడార్ వంటి విషయాలపై మాట్లాడానని తెలిపారు. సంబంధిత వీడియోలు అందరి ముందుంచుతున్నాను మిత్రమా అని సవాలు విసిరారు. పంజాబ్ ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం వల్లనే రాజ్యసభకు చద్థా వెళ్లారని, అయితే ఆయన పల్లెతు మాట కూడా పంజాబ్ కోసం మాట్లాడటం లేదని పంజాబ్లోని ఆప్ నాయకత్వం విమర్శిస్తోంది. ఆయన మౌనం దేనికి సంకేతం అని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా, ఆప్ పంజాబ్ విభాగం అధ్యక్షులు అమన్ ఆరోరా , సీనియర్ నేత కుల్దీప్ సింగ్ ధాలీవాల్ చేస్తున్న విమర్శలకు ఇప్పుడు గౌరవప్రదంగానే రాఘవ కౌంటర్ ఇచ్చారు.
ഫാക്ട് ചെക്ക്: രാമക്ഷേത്രം തകർത്ത് ബാബരി പണിയുന്ന വീഡിയോയുമായി കോൺഗ്രസ്? വസ്തുതയെന്ത്?
വയനാട്ടിൽ കോൺഗ്രസിൻ്റെ തെരഞ്ഞെടുപ്പ് പ്രചാരണ ഗാനം എന്ന നിലയിലാണ് വീഡിയോ വൈറലാവുന്നത്
చందమామ పెద్దగా ఉంది... భూమి చిన్నగా కనిపిస్తుంది
నేడు ఆర్టిమిస్ తుది మజిలి కనువిందు హుస్టన్: తాము బయలుదేరిన భూమి మాకు చాలా చాలా చిన్నది అవుతోంది. చేరుకునే చంద్ర మండలం రానురానూ పెద్దగా కన్పిస్తోందని అర్టిమిస్ 2 వ్యోమగాములు ఆదివారం తెలిపారు. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక చంద్ర మండల యాత్ర విజయవంత దశకు చేరుకుంది. చంద్రుడి అధిదేవత ఆర్టిమిస్ పేరిట సాగే ఈ యాత్ర ఇప్పుడు చంద్రుడికి చేరుకునే దగ్గరలో ఉంది. సోమవారం ముగ్గురు అమెరికన్లు, ఓ కెనడియన్తో కూడిన వ్యోమగాముల బృందం తమ నిర్ణీత లక్షం చేరకుంటారు. చంద్ర మండలంపై పదిరోజుల పరిభమ్రణ సాగుతుంది. 53 ఏండ్ల క్రితపు అపోలో చంద్ర మండలయాత్రతో పోలిస్తే ఇది మరింత విజయంగా నిలుస్తుందని వీరు ఆశిస్తున్నారు. భూమిని దాటేసుకుని చంద్రుడి వద్దకు చేరుతున్నామని తెలిపిన వ్మోమగాములు తాము ఇంతకు ముందటి వ్యోమగాముల కన్నా అత్యధిక పరిశోధనలకు దిగుతామన్నారు. అంతా బాగానే సాగుతున్నా వీరి రాకెట్కు సంబంధించి ఇప్పుడు టాయ్లెట్లో సాంకేతిక సమస్యలతో మొరాయింపు సాగుతోంది.
కోల్కతా వరకు గురి చూసి కొడుతాం: పాక్ మంత్రి
లాహోర్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆరిఫ్ మరోసారి తీవ్ర స్థాయి హెచ్చరికలకు దిగారు. భారతదేశం మరోమారు ఎప్పుడైనా తమ దేశంపై చర్యకు దిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చివరికి భారత్లోని కోల్కతా వంటి సుదూర ప్రాంతాలను కూడా గురిచూసి కొడుతామని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్లో ప్రభుత్వంపై ఓ శక్తి అంతర్గత కుట్రకు దిగుతోందని, దీని వెనుక భారత్ ఉందనే విషయం తమకు తెలుస్తోందని చెప్పిన రక్షణ మంత్రి ఇందుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. పాకిస్థాన్పై బయటి నుంచి కానీ లోపలి నుంచి కానీ ఎటువంటి చర్యకు అయినా భారత్ పాల్పడితే తమ చర్యలు అత్యంత తీవ్రంగా, నిర్ణయాత్మకంగా , ఉధృతంగా ఉంటాయని ఆయన తమ స్వస్థలం సియాల్కోట్లో మీడియా సమావేశంలో తెలిపారు.
గుర్తింపు కార్డులతో 5 కిలోల సిలిండర్లు
వంటగ్యాస్ కొరత లేదు..ఆందోళన వద్దన్న కేంద్రం న్యూఢిల్లీ ః దేశంలో వంటగ్యాసు (ఎల్పిజి) సరఫరాను మరింత పెంచినట్లు కేంద్రం ఆదివారం ప్రకటించింది. కోట్లాది మంది నిరుపేద కార్మికుల కోసం 5 కిలోల ఎల్పిజి సిలిండర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎల్పిజి కోటా అడుగంటిందనే భయాందోళనలు వద్దని ప్రజలను కోరారు. హర్మూజ్ జలసంధి పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతోందని చమురు మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇక గత నెల 23 నుంచి 5 కిలోల ఎల్పిజి సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకూ మొత్తం మీద దాదాపు ఆరులక్షల 60వేలకు పైగా ఈ సిలిండర్లను విక్రయించారు. పంపిణీదార్ల వద్దకు కార్మికులు ఎటువంటి నివాస పత్రాలు లేకుండా వెళ్లి , కేవలం తమ గుర్తింపు కార్డు చూపి ఈ చిన్న సిలిండర్లను తీసుకువెళ్లవచ్చునని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 90వేలకు పైగా 5 కిలోల సిలిండర్లు (వీటిని ఎఫ్టిఎల్ సిలిండర్లు కార్మికులకు అందించారు. అక్రమ నిల్వలను , బ్లాక్ మార్కెట్ను ఎప్పటికప్పుడు గుర్తించి , తగు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని వలసకూలీలకు,, ఇంటి పనిమనుష్యులు, రోజువారి కూలీలలకు, విద్యార్థులకు , పలు వృత్తులలో ఉండి సరైన చిరునామా పత్రాలు లేని వారు నేరుగా వచ్చి5 కిలోల సిలిండర్లు తీసకువెళ్లవచ్చునని ఆలిండియా ఎల్పిజి పంపిణీదార్ల సమాఖ్య ప్రెసిడెంట్ చంద్ర ప్రకాశ్ ప్రకటించారు. ఈ చిన్న సిలిండర్ ధర తెలంగాణలో ఇప్పుడు రూ 335 నుంచి రూ 338 పై పైసలుగా పలుకుతోంది, వెంటనే వచ్చి తీసుకుపోవడానికి వీలైన ఈ సిలిండర్లపై ఇప్పుడు ఎక్కువగా దృష్టి కేంద్రీకృతం అయింది. అయితే ఇది శ్రామిక వర్గాలకు పరిమితం అయింది.
విద్యుత్ కేంద్రాలు, పెట్రోకెమికల్ కేంద్రం ధ్వంసం ఇరాన్ ఆదివారం జరిపిన డ్రోన్ దాడులలో కువైట్కు చెందిన ఓ విద్యుత్ కేంద్రం, ఒక పెట్రోకెమికల్ స్థావరం దెబ్బతింది. ఒక జల శుద్ధి కర్మాగారాన్ని కూడా పనికి రాకుండా చేశారు. కువైట్లోని షువైఖ్ చమురు సెక్టార్ కాంప్లెక్స్లో కూడా డ్రోన్ దాడి జరిగింది. దీనితో మంటలు చెలరేగాయి. ఈ కాంప్లెక్స్లో చమురు మంత్రిత్వశాఖ, కువైట్ పెట్రోలియం ప్రధాన కార్యాలయం ఉన్నాయి. . ఈ విషయాన్ని కువైట్ విద్యుత్ మంత్రిత్వశాఖ కూడా నిర్థారించింది. . ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అరబ్ ఏమిరేట్స్లో బోరోగ్ పెట్రోకెమికల్ ప్లాంట్ను ఇరాన్ దెబ్బతీసింది. ఈ క్రమంలో ఆదివారం చెలరేగిన మంటలను తమ సహాయక బృందాలు అదుపులోకి తీసకువచ్చాయని ఏమిరేట్స్ అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాకు పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న యుఎఇకి చెందిన రువైస్ ఇంధన ప్లాంట్లో పని నిలిచిపోయింది. పలు గల్ఫ్ దేశాలలో పెట్రో కెమికల్ పరిశ్రమ అత్యంత కీలకమైన ఆర్థిక వనరుగా ఉంది. బహరైన్, యుఎఇ, ఇరాన్లలో ఈ యూనిట్లలోనే చమురు, సహజవాయువులను ప్లాస్టిక్స్, పాలిమిర్స్తో పాటు ఎరువులుగా మారుస్తారు. దీనితోనే ఎటా బిలియన్ డాలర్లలో ఎగుమతి ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఇరాన్ తమ పెట్రోకెమికల్ యూనిట్స్ను శత్రుదాడుల నుంచి రక్షించుకుంటూనే గల్ఫ్ దేశాలలోని కీలక విభాగాలపై దాడులకు దిగుతోంది.
ఇరాన్ నుంచి తాజాగా అమెరికాకు ఘాటైన స్పందన ట్రంప్ తీవ్ర హెచ్చరికలను ఆదివారం ఇరాన్ మరింత ఘాటుగా తోసిపుచ్చింది. ఇక ట్రంప్ అమెరికా సేనలకు నరక ద్వారాలు తెరుచుకుంటాయని ట్రంప్ పరిభాషలతోనే స్పందించారు. ఇరాన్ సైన్యం తరఫున జనరల్ అలీ అబ్దుల్లాహి అల్లాబాది ప్రకటన వెలువడింది. అమెరికా ఖంగు తినే రీతిలో తమ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ వ్యవస్థలపై ఎటువంటి దాడి జరిగినా తమ ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని, గల్ఫ్లోని సైనిక ఆయుధ స్థావరాలపై దాడులు కొనసాగుతాయని, ఇక మరింత శక్తివంతం అవుతాయని తెలిపారు. నిర్ణీత లక్షాలను ఎంచుకుని సాగే ఈ దాడులు శత్రువు విస్తుపోయేవిగా ఉంటాయని , ఈ దిశలో కార్యాచరణ సిద్ధం అయిందని వెల్లడించారు. శత్రువును ఏ విధంగా దెబ్బతీయాలనేది తమకు తెలుసునని, అమెరికా చెపుతున్న విధంగా సత్వర బలీయ దాడులకు అక్కడి సైనిక బలగాలు సిద్ధంగా లేవని, నిర్ణయాత్మక దిశలో ముందుకు వెళ్లలేరని, ఇప్పటి పరిణామాలతో ఈ విషయం గుర్తించామని తెలిపారు. అసమగ్ర అపసవ్య దాడుల బలహీనతతో శత్రువు కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో ఇరాన్ ఎప్పుడూ పైచేయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
Dead Line Tension : ఇక అమీతుమీ Andhra Prabha TOP Story
Dead Line Tension : ఇక అమీతుమీ Andhra Prabha TOP Story
సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ... బెంగళూరు 84/5
బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఏడు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 84 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ సిబి జట్టు 250 పరుగులు చేసింది. ఆర్ సిబి జట్టు 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం సర్ఫరాజ్ ఖాన్ 25 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. కార్తీక్ శర్మ కూడా ఆరు పరుగులు చేసి మైదానం వీడాడు. ఈ మ్యాచ్ లో సంజూ శామ్సన్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో శివమ్ దూబే(8), ప్రశాంత్ వీర్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బెంగళూరు బౌలర్లలో జాకోబ్ డఫీ రెండు వికెట్లు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు.
ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోండి: ఓటర్ల పేర్ల తొలగింపుపై మమతా బెనర్జీ పిలుపు
సంసేర్గంజ్: ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రజలు ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలి అని పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో పేర్లు తొలగించిన వారు ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని కూడా ఆమె సూచించారు. ముర్షిదాబాద్ జిల్లాలోని సంసేర్గంజ్లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రజల పేర్లు తొలగించిన వారిపై మీ ఓటుతో ప్రతిస్పందించండి. ఫలితాలు దానికి తగినట్లుగా ఉండాలి అని అన్నారు. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ రోజు మే 4 వరకు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుంటూ, ‘సర్’ ప్రక్రియలో ఓటర్ల పేర్ల తొలగింపుకు ఆయన బాధ్యత వహిస్తున్నారని మమతా ఆరోపించారు. ధైర్యం ఉంటే నేరుగా పోటీ చేయండి అంటూ సవాల్ విసిరారు. అలాగే ఎన్నికల సమయంలో బూత్ ఏజెంట్లు బీజేపీకి అమ్ముడుపోకూడదని పార్టీ కార్యకర్తలకు హెచ్చరిక జారీ చేశారు. ఈవీఎంలు కొన్ని చోట్ల పనిచేయకుండా చేయవచ్చని ఆరోపిస్తూ, అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం అధికారులు మరమ్మత్తులు చేయడానికి అనుమతించకుండా, కొత్త యంత్రాలను డిమాండ్ చేయాలని ఆమె పార్టీ శ్రేణులకు సూచించారు. సంసేర్గంజ్లో మొహమ్మద్ నూర్ ఆలం, ఫరక్కాలో మొహమ్మద్ అమీరుల్ ఇస్లాం అభ్యర్థిత్వానికి మద్దతుగా నిర్వహించిన సభలో మమతా, వక్ఫ్ (సవరణ) చట్టంపై తాను గట్టిగా పోరాడుతున్నానని తెలిపారు. తనపై ముస్లింల కోసం ఏమీ చేయలేదని బీజేపీ ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. వక్ఫ్ చట్టం అమలులో ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసను ప్రస్తావిస్తూ, కొంతమంది మరణించారని గుర్తుచేశారు. అయితే ఆ హింసకు తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల కారణంగా అభివృద్ధి పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ఎన్నికల సంఘం దాదాపు 500 మంది అధికారులను బదిలీ చేసిందని ఆమె విమర్శించారు. ఈ మార్పులు తాత్కాలికమే, ఎన్నికల తర్వాత మళ్లీ పనులు ప్రారంభమవుతాయి అని చెప్పారు. ఎన్నికల జాబితాలో కొందరి పేర్లు తొలగిస్తూ, మరికొందరిని బెదిరిస్తున్నారని ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేసిన మమత, 2024 లోక్సభ ఎన్నికల జాబితాతోనే అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అప్పటి జాబితాలో అక్రమ వలసదారులు ఉన్నారని భావిస్తే, ఆ ఓట్లతో గెలిచిన ప్రధాని, హోం మంత్రి ముందుగా రాజీనామా చేయాలి అని విమర్శించారు. ఎన్ఆర్సీ పేరుతో నిర్బంధ శిబిరాలు ఏర్పాటు చేయడానికి తాను ఎప్పటికీ అనుమతించబోనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే రాష్ట్ర పాలనపై ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుందని కూడా ఆమె గుర్తుచేశారు.
No Dollar : టోల్ కట్టాల్సిందే Andhra Prabha News
No Dollar : టోల్ కట్టాల్సిందే Andhra Prabha News ( ఆంధ్రప్రభ,
అమెరికా రక్షణ ఆపరేషన్ విఫలం..... ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా ఇరాన్ వ్యాఖ్యలు
టెహ్రాన్: ఇరాన్లో కూలిన అమెరికా యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిని రక్షించే ప్రయత్నం పూర్తిగా విఫలమైంది అని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అయితే ఆ సిబ్బంది పట్టుబడ్డారని మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. ఈ ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైలట్ను సురక్షితంగా రక్షించాం అని ప్రకటించిన కొన్ని గంటలకే వెలువడడం గమనార్హం. ఇరాన్ సాయుధ దళాల సమన్వయ కమాండ్ ‘ఖాతమ్ అల్-అన్బియా’ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారీ టెలివిజన్ ద్వారా విడుదల చేసిన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ఇస్ఫహాన్లోని నిర్జన విమానాశ్రయం వద్ద కూలిన యుద్ధవిమాన పైలట్ను రక్షించే పేరిట అమెరికా చేపట్టిన మోసపూరిత ఆపరేషన్ను పూర్తిగా భగ్నం చేశాం అని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్లో రెండు సి-130 రవాణా విమానాలు, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. భూమిపై వాస్తవ పరిస్థితులు ఇరాన్ సైనిక శక్తి ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నప్పటికీ, ట్రంప్ ఖాళీ ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు అని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ మాధ్యమాలు విడుదల చేశాయి. ఎడారి ప్రాంతంలో కాలిపోయిన యుద్ధ వాహనాల అవశేషాలు, పొగలు కక్కుతున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. రక్షణ చర్య సమయంలో జరిగిన దాడుల్లో దక్షిణ పశ్చిమ ప్రాంతంలో ఐదుగురు మరణించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అయితే వారు పౌరులా లేక సైనికులా అన్నది స్పష్టత రాలేదు. ఇక శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిన అమెరికా సిబ్బంది కోసం స్థానికులు కూడా శోధనలో పాల్గొన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆయుధాలు, జెండాలు పట్టుకున్న కొందరు ప్రజలు ఆ పైలట్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలను ప్రసారం చేశారు. ఈ పరిణామాలతో అమెరికాఇరాన్ మధ్య సమాచార యుద్ధం మరింత ముదురుతోంది. ఒకవైపు అమెరికా రక్షణ చర్య విజయవంతమైందని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ దాన్ని పూర్తిగా విఫలమైందని ప్రకటించడం గమనార్హం.
హార్మూజ్ జలసంధి తెరవండి.. లేకుంటే.. ! ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని డిమాండ్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో ఆయన చేసిన ఘాటు, అసభ్య పదజాలం కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, మంగళవారం కీలక దశగా మారవచ్చు అని పేర్కొంటూ, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై విసృ్తత స్థాయి దాడులు జరగవచ్చని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో పాటు ఇరాన్పై నేరుగా దూషణలు చేయడం మరింత వివాదాస్పదంగా మారింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్మూజ్ జలసంధి ఇటీవల ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, వాయువు సరఫరాలో గణనీయమైన భాగం రవాణా అవుతుంది. ప్రస్తుతం ఈ జలసంధిలో రవాణా తీవ్రంగా అంతరాయం ఎదుర్కొంటుండటంతో గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మాత్రమే కాకుండా దౌత్య పరంగా కూడా తీవ్ర ప్రతిస్పందనలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ ఇప్పటికే అమెరికా హెచ్చరికలకు కఠినంగా స్పందిస్తుండగా, ఈ తాజా వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్కు ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత
మే 31 వరకు విమాన సేవలు రద్దు జెరూసలేం: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఇజ్రాయెల్కు వెళ్లే తన విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. న్యూఢిల్లీతెల్ అవీవ్ మార్గంలో నడుస్తున్న విమానాలు మే 31 వరకు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్లైన్స్ చాలా వరకు తమ సర్వీసులను నిలిపివేశాయి. కేవలం ఇజ్రాయెల్కు చెందిన ఎల్ అల్, ఇజ్రా ఎయిర్, ఆర్కియా, ఎయిర్ హైఫా వంటి విమాన సంస్థలు మాత్రమే కఠిన పరిమితులతో సేవలను కొనసాగిస్తున్నాయి. ఈ నిర్ణయం ఇజ్రాయెల్లో నివసిస్తున్న 40,000కు పైగా భారతీయులకు ఇబ్బందులను కలిగిస్తోంది. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలతో భారత్కు రావాలనుకునేవారు, లేదా ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నుంచి బయటపడాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయెల్ నుంచి భారత్కు రావాలనుకునే భారతీయులు ప్రస్తుతం జోర్డాన్ లేదా ఈజిప్ట్ మార్గం ద్వారా సరిహద్దులు దాటి ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం సహాయక చర్యలు చేపడుతోంది. 24 గంటల అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు చేయడంతో పాటు, భారతీయుల నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇటీవల భారత రాయబారి జె.పీ. సింగ్, రాయబార బృందం ఇజ్రాయెల్లోని భారతీయ కార్మికులు, విద్యార్థులతో వర్చువల్ సమావేశం నిర్వహించి వారి సమస్యలను వినిపించుకున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ, తరువాత కూడా నిరంతర సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, న్యూఢిల్లీతెల్ అవీవ్ నేరుగా విమాన సర్వీసులు ఈ ఏడాది జనవరి 1న మళ్లీ ప్రారంభమయ్యాయి. వారానికి నాలుగు సార్లు నడిచే ఈ విమానాలు ఆధునిక బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలతో నిర్వహిస్తున్నారు.
బెంగళూరు: ఐపిఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ సిబి 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. చెన్నై ముందు 251 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఉంచింది. టిమ్ డేవిడ్ దేవదూత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. ఆర్ సిబి బ్యాట్స్ మెన్లలో టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 70 పరుగులు, రజత్ పటిదార్ 48 బంతుల్లో 48 పరుగులు, దేవదూత్ పడిక్కల్ 29 బంతుల్లో 50 పరుగులు, విరాట్ కోహ్లీ 18 బంతుల్లో 28 పరుగులు, ఫిలిప్ సాల్ట్ 30 బంతుల్లో 46 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో
Hezbollah Missile Attack : హిజ్బుల్లా క్షిపణి దాడి Andhra Prabha News
Hezbollah Missile Attack : హిజ్బుల్లా క్షిపణి దాడి Andhra Prabha News
భారత్ లో విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ
ఎఐ, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్, అగ్రి-టెక్ వంటి రంగాల సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి సాధ్యం విదేశాల్లో ఉన్న విద్యార్థులు, నిపుణులు భారత్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు ముఖ్య అతిథిగా హాజరైన కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభివర్ణించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఉద్దేశించి తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని ఆయన వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దశాబ్ద కాలం పాటు జరిగిన అభివృద్ధి గురించి కెటిఆర్ మాట్లాడుతూ.. సుదీర్ఘ పోరాటం ద్వారా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం, తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పరిపాలన, ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనం అని పేర్కొన్నారు. తాము అవకాశాల కోసం ఎదురుచూడలేదు అని, వాటిని అందిపుచ్చుకునేందుకు అద్భుతమైన పాలసీలను తయారు చేశామని తెలిపారు. మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించామని అన్నారు. 2027లో భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ, కేవలం పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమని చెప్పారు. రాష్ట్రాన్ని దేశాన్ని నడిపే నాయకత్వానికి స్పష్టత ఉంటే జవాబుదారీతనం పెరుగుతుందని, తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. భవిష్యత్తు గురించి కేవలం మాటలు చెప్పడం కంటే, దానిని మనమే సృష్టించడం ఉత్తమమైన మార్గం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలే దేశాభివృద్ధికి ఇంజన్లు అన్న ప్రాథమిక విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని ప్రస్తావిస్తూ.. దేశాభివృద్ధి అనేది కేవలం ఒకే రకమైన విధానాల వల్ల కాకుండా, ప్రతి రాష్ట్రం తనకున్న ప్రత్యేక బలాలను వినియోగించుకోవడం ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. భారతదేశం 28 ఇంజన్లు కలిగిన ఒక ఫార్ములా 1 రేసింగ్ కార్ లాంటిదని, ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతికి తోడ్పడాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ పెట్టుబడి నిర్ణయాలు చివరికి రాష్ట్రాలు, నగరాల స్థాయిలోనే జరుగుతాయని గుర్తుచేశారు. ఆవిష్కరణలకు చిరునామా తెలంగాణ మారింది ఐటి, పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని కెటిఆర్ తెలిపారు. 2014 నుండి 2023 మధ్య కాలంలో తెలంగాణ సాంకేతిక రంగం సాధించిన గణాంకాలను వివరించారు. ఐటీ ఎగుమతులు రూ. 57,000 కోట్ల నుండి రూ. 2.72 లక్షల కోట్లకు పెరిగాయని, ఐటీ ఉద్యోగాల సంఖ్య 3.23 లక్షల నుండి దాదాపు 10 లక్షలకు చేరుకుందని తెలిపారు. ప్రభుత్వ వేగవంతమైన నిర్ణయాలు, పటిష్టమైన ఎకో సిస్టమ్ కారణంగానే హైదరాబాద్ గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని చెప్పారు. హైదరాబాద్లో అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేసిందని, గూగుల్, ఆపిల్, మెటా, సేల్స్ ఫోర్స్, ఉబర్, మైక్రాన్ టెక్నాలజీ వంటి సంస్థలు తమ కీలక కార్యకలాపాలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఆవిష్కరణలకు చిరునామా తెలంగాణ మారిందని వ్యాఖ్యానించారు. టీ -హబ్, వీ-హబ్, టీ- వర్క్, టాస్క్ వంటి సంస్థల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు పెద్దపీట వేసిందని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్, డార్విన్ బాక్స్, జెనోటి, హైరేడియస్ వంటి యూనికార్న్ సంస్థలు హైదరాబాద్ నుండి పుట్టుకురావడమే తెలంగాణ సత్తాకు నిదర్శనమన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఎదిగిందని, ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. ఏటా 10 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను తెలంగాణ ఉత్పత్తి చేస్తోందని, దేశీయ బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా తెలంగాణదేనని చెప్పారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్, అగ్రి-టెక్ వంటి రంగాల సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి సాధ్యమని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు, నిపుణులు భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కేవలం ఆలోచనల దగ్గర ఆగిపోకుండా వాటిని సాధించేందుకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. నేటి సమస్యల పరిష్కారమే కాదు.. రేపటి అవసరాలకు తగిన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.
Tollywood young actor Bellamkonda Sreenivas is all set to tie the knot soon. The actor has found his lady love Kavya Reddy and the duo got engaged today in a closed ceremony in Hyderabad. Close friends and family members of the Bellamkonda family attended the event. Bellamkonda Sreenivas and Kavya Reddy will get married on […] The post Bellamkonda Sreenivas Engaged appeared first on Telugu360 .
కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి సీతక్కపై ఖర్గే ప్రశంసల జల్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : కేరళలోని ఇడుక్కి జిల్లా ఏలప్పారలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కపై ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రశంసల వర్షం కురిపించారు. ఇడుపు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇడుక్కి జిల్లాలోని ఏలప్పార లొ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎస్టి సామాజిక వర్గానికి చెందిన సీతక్క తన కృషి, పట్టుదలతో ఎదిగిన గొప్ప నాయకురాలని ఆయన కొనియాడారు. సీతక్క ఒక గొప్ప ఫైటర్, హార్డ్వర్కింగ్ మహిళగా ఎప్పటికప్పుడు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఖర్గే పేర్కొన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పరితపిస్తూ, అడవుల్లో తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సేవలు అందిస్తున్న నాయకురాలని ఆయన అభినందించారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి కష్టసుఖాలను అర్థం చేసుకుని సేవ చేయడం సీతక్క ప్రత్యేకత అని ఖర్గే చెప్పారు. ఆమె సేవాభావం, నిబద్ధత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రిగా నియమించినట్లు ఆయన వెల్లడించారు.
సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి : సిఎం రేవంత్ రెడ్డి
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి మన తెలంగాణ / హైదరాబాద్ : అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ జయంతి రోజున జరుపుకునే సమతా దివస్ సందర్భంగా, సమాజంలోని వివక్షతకు వ్యతిరేకంగా సమానత్వం, ఐక్యత, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి ని సిఎం కొనియాడు. కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, దళితుల హక్కుల కోసం వారు జీవితాంతం పనిచేశారని గుర్తు చేసుకున్నారు. బాబూజీ స్పూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల మేలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. సాంఘీక న్యాయయోధుడు జగ్జీవన్ రామ్ : గవర్నర్ నివాళి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగజీవన్ రామ్ ఒక మహోన్నత జాతీయ నాయకుడని, స్వాతంత్య్ర సమరయోధుడని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సాంఘిక న్యాయ యోధుడని ఆయన అభివర్ణించారు. సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రగతిశీల భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో దోహదపడిందని కొనియాడారు. న్యాయమైన, సమ్మిళిత, సమాజాన్ని నిర్మించడానికి తరతరాలకు స్ఫూర్తినిస్తూ, ఆయన వారసత్వం శాశ్వతంగా నిలిచిపోవాలని గవర్నర్ ఆకాక్షించారు. జగ్జీవన్రామ్ జీవితం మనందరికీ స్పూర్తిదాయకం : వివేక్ బాబు జగ్జీవన్రామ్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు అపారమైనవని కొనియాడారు. ఇందిరా గాంధీ కేబినెట్లో కేంద్ర వ్యవసాయ మంత్రిగా కూడా ఆయన అద్భుతమైన సేవలు అందించారని, ఆయన స్ఫూర్తితో మనమందరం ముందుకు సాగుదామని అన్నారు. బిసి కమిషన్ ఘన నివాళి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాన్ని తెలంగాణ బిసి కమిషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బిసి కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాల లక్ష్మి ఇతర అధికారులు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ జి.నిరంజన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి, బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసారని, ఆయన కూతురు మీరా కుమారి లోక్ సభ స్పీకర్ గా ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు ఆమోదానికి కృషి చేశారని తెలిపారు. ఆర్టిసి బస్ భవన్ లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు‘ ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆజన్మాంతం పని చేసిన ధీరుడు, భారత మాజి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ అని ఆర్టిసి అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం సంస్థ ప్రధాన కార్యాలయం బస్భవన్లో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబుజీ చేసిన కృషి చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆర్టిసి ఈడి సిహెచ్ .వెంకన్న అన్నారు. అధికారులు, సిబ్బంది బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీ భవన్లో జగ్జీవన్రామ్ జయంతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆదివారం గాంధీభవన్లో ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. పిసిసి మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు, కాంగ్రెస్ నేతలు కుమారరావు, మెట్టు సాయికుమార్, జగదీశ్వరరావు, సురేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Anil Ravipudi confirms Krithi Shetty in his Next
From the past couple of weeks, there are rumors that Krithi Shetty is in talks to play one of the female leads in Anil Ravipudi’s upcoming directorial. She is paired up beside Kalyanram in the film. During the pre-release event of LIK, Anil Ravipudi himself confirmed the news. He said that the news was out […] The post Anil Ravipudi confirms Krithi Shetty in his Next appeared first on Telugu360 .
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సిబి.. విరాట్ ఔట్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిన్నైస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై జట్టు ఆర్సిబిని బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్కి వచ్చిన ఆర్సిబి జట్టు నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే మ్యాట్ హెన్రీ వేసిన నాలుగో ఓవర్లో విరాట్ కోహ్లీ 16 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత అన్షుల్ కాంబోజ్ ఓవర్లో కోహ్లీ (28) శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పవర్ప్లే (ఆరు ఓవర్లు) ముగిసేసరికి ఆర్సిబి ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజ్లో సాల్ట్(20), పడిక్కల్ (3) ఉన్నారు.
The IPL 2026 has started recently and the cricket fever has gripped the nation. There is a heavy decline in the footfalls for the evening and night shows all over the country. On weekends as there are two matches, the IPL has been impacting the afternoon shows too. Biker and Rakasa released this weekend and […] The post IPL Impacting Indian Cinema appeared first on Telugu360 .
వ్యసనాలకు దూరంగా యువత క్రీడల్లో రాణించాలి
వ్యసనాలకు దూరంగా యువత క్రీడల్లో రాణించాలి తెలంగాణ రన్నర్స్ ప్రోమో రన్ విజయవంతంవెస్ట్
వానరం ఒడిలో కుక్కపిల్ల.. అమ్మ ప్రేమకు జాతి భాష రూపం బేధాలు లేవు…
దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పదినంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు
30 కోట్లతో కాచిగూడలో జగ్జీవన్ రామ్ భవన్ లోయర్ ట్యాంక్ బండ్ లో అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ నిర్మాణం జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మన తెలంగాణ / హైదరాబాద్ : జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు కేవలం స్మరణకే పరిమితం కాకుండా, దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పదినంగా మార్చాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సమానత్వం, న్యాయం, స్వాభిమానం అనే మహనీయుడు చూపిన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఆయన స్పష్టం చేశారు. జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రసంగిస్తూ, దళితులు, పేద, అణగారిన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం దళితుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని అన్నారు. జగ్జీవన్ రామ్ దళితుల గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని చెప్పారు. కాచిగూడ లోని నింబోలి అడ్డలో రూ. 30 కోట్లతో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను నిర్మిస్తున్నామని, లోయర్ ట్యాంక్ బండ్ లో పది అంతస్తులకు తగ్గకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అడ్లూరి వెల్లడించారు. అణగారిన వర్గాల పక్షాన నిలబడిన అరుదైన నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అభివర్ణించారు. అవకాశం లభిస్తే దళితుడు కూడా ఉన్నత నాయకత్వం చేపడతాడు అనే నమ్మకాన్ని ఆయన కార్యాచరణతో నిరూపించారని అన్నారు. రాజ్యాంగంలో ఎస్సి, ఎస్టిల హక్కులు, రిజర్వేషన్లు కాంగ్రెస్ దృక్పథంతోనే సాధ్యమయ్యాయని చెప్పారు. భూమి సంస్కరణలు, విద్యా అవకాశాల ద్వారా పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని వివరించారు. త్వరలో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు రాష్ట్రంలో ప్రజాపాలన పారదర్శకంగా సాగుతోందని, దళితుల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అనే సంకల్పంతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి అడ్లూరి తెలిపారు. సంక్షేమం మాత్రమే కాకుండా అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. దళిత విద్యార్థులకు ఉన్నత విద్యలో పూర్తి సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో రూ.100 కోట్లతో 10 అంతస్తుల అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. నిబ్మోలి గడ్డ హాస్టల్కు ఆధునిక సౌకర్యాలతో నూతన భవనం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తూ, మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు. సమాజంలో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరేలా కృషి చేస్తూ, వివక్షలేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ ఆశయాలకు దళిత ఐక్యతే మా బలం, సామాజిక న్యాయం కాంగ్రెస్ ధర్మం అంటూ నినాదాలు చేశారు. ప్రతి దళిత కుటుంబానికి గౌరవం, ప్రతి యువకుడికి అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జగ్జీవన్ రామ్ కలల భారతాన్ని తెలంగాణలో సాకారం చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, మాజీ పార్లమెంట్ సభ్యులు వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ, కౌన్సిల్ విప్ అద్దంకి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామెల్, నాగరాజు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ కాసిం, ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, జేబీ రాజు, మేడి పాపయ్య, ఉత్సవ కమిటీ నేతలు, పలువురు దళిత నాయకులు కార్యక్రమానికి హాజరై బాబు జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న ఆలపించిన గీతాలు ఆహుతులను ఉర్రూతలుగుంచాయి
Iran Missile Strike : డ్రోన్ల ఫ్యాక్టరీ ధ్వసం Andhra Prabha News
Iran Missile Strike : డ్రోన్ల ఫ్యాక్టరీ ధ్వసం Andhra Prabha News
జగ్జీవన్ రామ్ సేవలు స్ఫూర్తిదాయకం…
జగ్జీవన్ రామ్ సేవలు స్ఫూర్తిదాయకం… స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్

30 C