మన తెలంగాణ/హైదరాబాద్: సూర్యుడి ప్రతాపానికి రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతొంది. ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు గత రెండు రోజులుగా 43 డిగ్రీల మార్కును చేరుకోవడంతో ఎండ వేడి విపరీతంగా పెరిగింది. దీనికి తొడు వడగాలులు తొడవ్వడంతో ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రాష్ట్రంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 43. డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోగా రాష్ట్రంలో రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యింది. దీంతో పాటు రెండు రోజుల్లో 31 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల తరువాత ఎవరూ బయటకు రావద్దని, తప్పనిసరి పరిస్థితులు అయితే తగు జాగ్రత్తలతో బయటకు వెళ్లాలని సూచించింది. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు వడ గాలులు వీచే అవకాశం ఉందని, వడదెబ్బతో ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో సైతం ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బయటకు వెళ్లేవారు శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంచుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. జిల్లా అధికారులను అలర్ట్ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో విపరీతమయిన ఎండ, వడగాలులు నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వడగాలు వీచే అవకాశం ఉందని, దీంతో పాటు ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల నుంచి 4.5 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉండంటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా అధికారులు ఎండల పరిస్థితిపై నిరంతరం సమీక్షలు నిర్వహించాలని, వాతావరణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ప్రజలు తెలియజేయాలని పేర్కొంది. ప్రభుత్వం నిరంతర వాతావరణ స్థితిగతులు అధికారులకు తెలియజేస్తుందని, ఈ సమాచారంతో జిల్లా స్థాయి పరిస్థితులు పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను నియమించుకుని సంబంధిత అన్ని శాఖలో సమన్వయం చేసుకోవాలని తెలిపింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో అందచేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
గ్రామీణ ప్రాంత ప్రజానీకం జీవనాడి అయిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎనఆర్ఈజీఏ) బలోపేతం చేయడంలో ఘోరంగా విఫలమైన మోదీ ప్రభుత్వం, దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్గార్ అజీవికా మిషన్ (జి రామ్ జి) ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి ఉసురు తీసింది. నిస్సిగ్గుగా చేపట్టిన ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల హననమే. కొత్త చట్టం ఉత్తుత్తి చట్టమేమీ కాదు. హక్కులపై ఓ బుల్డోజర్. మహాత్మాగాంధీ పేరు […] The post పేదల కడుపుకొడితే సహిస్తారా? appeared first on Visalaandhra .
తీర ప్రాంత ప్రజలకు కారిడార్ ముప్ప్పు
గుల్ల కాంతారావు ఒక పని తలపెట్టినప్పుడు దాని పర్యవసానాలను ముందుగానే అంచనా వేయాలి. మంచిచెడులను ఆలోచించాలి. విచక్షణ, సంయమం అనేవి వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా తప్పనిసరి. ఇవి లోపించినప్పుడు, ఆ నిర్ణయాల దుష్పరిణామాలు సమాజంపై ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం సహజ వనరుల వినియోగం పేరుతో తీసుకుంటున్న విధాన నిర్ణయాలు ఇదే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. కార్పొరేట్లకు అనుకూలంగా మారుతున్న విధానాల కారణంగా బీచ్ శాండ్ మినరల్స్ తవ్వకాల విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో పెను ముప్పుగా మారే […] The post తీర ప్రాంత ప్రజలకు కారిడార్ ముప్ప్పు appeared first on Visalaandhra .
ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కుతున్నారు
వెంక గారి భూమయ్య తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేడు సంక్షోభపు అంచున నిలిచింది. హామీల అమలులో మొండిచేయి, బకాయిల చెల్లింపులో మీనమేషాలు లెక్కించడం ఈ రెండూ కలిపి వేలాది మంది కార్మికుల భవిష్యత్తునే అనిశ్చితిలోకి నెట్టేశాయి. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో 45 వేల మంది కార్మికులను రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది కేవలం వేతనాల కోసం చేసే పోరాటం కాదు. ఇది వారి ఉనికిని […] The post ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కుతున్నారు appeared first on Visalaandhra .
భారత రాజకీయాల్లో మహిళల హక్కుల కోసం అంకితభావంతో పోరాడిన నేతల్లో గీతా ముఖర్జీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. 1996 సెప్టెంబర్ 12న మహిళలకు లోక్సభ , రాష్ట్ర అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. 1996 లో అప్పటి ప్రధాన మంత్రి దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేళపెట్టి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ […] The post మహిళా రిజర్వేషన్ మార్గదర్శి appeared first on Visalaandhra .
రెండు దశాబ్దాల పాటు బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న జనతా దళ్ (యు) నాయకుడు నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ నాయకుడు, నితీశ్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్ చౌధŠరి బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించనున్నారు. అయితే నితీశ్ నుంచి బీజేపీకి అధికారం బదలాయించడానికి దాదాపు నెల రోజులు పట్టింది. మార్చి మొదటి వారంలోనే నితీశ్ కుమార్ తనకు రాజ్యసభ సభ్యుడు కావాలన్న కోరిక ఉందని చెప్పారు. నిజానికి నితీశ్ను తప్పించి తమ […] The post నితీశ్ యుగాంతం appeared first on Visalaandhra .
కోనాల భీమారావు కమ్యూనిస్టు ఉద్యమ గమనంలో కొన్ని జంటలు కేవలం దంపతులుగానే కాకుండా విడదీయలేని ఆశయ బంధాలుగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన, ఆదర్శవంతమైన జంట దివంగత వంక సత్యనారాయణ -నాగమణి జంట. 70 ఏళ్ళ వారి వైవాహిక జీవితంలో ఉద్యమమే ఊపిరిగా, ఆశయమే బాటగా సాగిన వారి ప్రస్థానం నేటి తరానికి ఒక పాఠం. వంక సత్యనారాయణ తన 95వ ఏట 2018లో కన్నుమూయగా వంక నాగమణి తన 95వ ఏటే 2026 ఏప్రిల్ 5న కన్ను […] The post పోరాట ప్రతినిధి నాగమణి appeared first on Visalaandhra .
భారతదేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులకు సంబంధించి ఇటీవల విడుదలైన నివేదికలు ఆందోళనకరమైన గణాంకాలను వెల్లడిస్తున్నాయి. నేషనల్ కైమ్ రికార్డ్స్ బ్యూరో (bన్సీఆర్బీ), జాతీయ మహిళా కమిషన్ (bన్సీడబ్ల్యు) నివేదికల ప్రకారం భారత్లో మహిళలపై నేరాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ప్రతి గంటకు సగటున 51 మంది మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. 2025 మే నాటికే జాతీయ మహిళా కమిషన్కు సుమారు 7,698 ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా […] The post భద్రత కరువు appeared first on Visalaandhra .
. అందుబాటులోకి 14 వేల సూపర్ స్పెషాల్టీ బెడ్లు. వైద్య విద్యకు మరింత ప్రోత్సాహం. నిరుద్యోగుల ఉపాధి మెరుగుకు స్కిల్ వర్సిటీలు. ఆసుపత్రి ప్రారంభోత్సవంలో భట్టి విశాలాంధ్ర బ్యూరో ఖమ్మం/ సత్తుపల్లి: ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. “తెలంగాణ మోడల” పాలనను చూసి అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు చదువు, ప్రతి కుటుంబానికి […] The post అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం appeared first on Visalaandhra .
చారిత్రక కట్టడాలను తీర్చిదిద్దుతాం
మంత్రి జూపల్లివిశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణలో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని ప్రపంచ పర్యాట కులకు పరిచయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కష్ణారావు అన్నారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా వాటిని అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొ న్నారు. కుతుబ్ షాహీ టూంబ్స్లోని ఇంటర్ర్పి టేషన్ కేంద్రంలో జరుగుతున్న పనులను బుధవారం మంత్రి పరిశీలించారు. వక్ఫ్ ట్రిబ్యునల్లో […] The post చారిత్రక కట్టడాలను తీర్చిదిద్దుతాం appeared first on Visalaandhra .
లక్నో సూపర్ జెయింట్స్ పై రాయల్ చాలెంజర్స్ విజయం
ఐపిఎల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగి న బెంగళూరు 15.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు మా త్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్తో జట్టును గెలిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 6 ఫోర్లు, ఒక సిక్స్తో 49 పరుగులు చేశాడు. కెప్టెన్ రజత్ పటిదార్ (27), జితేశ్ శర్మ (23) పరుగులు చేశారు. టిమ్ డేవిడ్ (14) నాటౌట్, షెఫర్డ్ (14) నాటౌట్ తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు లక్నో తక్కువ స్కోరుకే పరిమితమైంది. మిఛెల్ మార్ష్ (40), బడోని (38), ముకుల్ చౌదరి (39) మాత్రమే రాణించారు. బెంగళూరు బౌలర్లలో రాసిఖ్ సలమ్ దర్ నాలుగు, భువనేశ్వర్ మూడు, కృనాల్ రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఆర్సిబి అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది
కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని, ఆ కంపెనీలో నేను బ్యాండ్ వాడిగా కొనసాగలేకనే బయటకు వచ్చానని మాజీ మంత్రి తాటిప ర్తి జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్తో ఉన్న 42 ఏండ్ల అనుబంధాన్ని ఎవరూ తెంచుకోవాలని కోరుకోరని, పార్టీలో సరైన గౌరవం లభించకపోగా, పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగకపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానన్నా రు. కాంగ్రెస్ పటిష్టత కోసం పని చేసినవారికే సీట్లు కేటాయిస్తామని మీనాక్షి నటరాజన్ చె ప్పారని, అయితే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీతో సంబంధం లేనివారికి బీఫాంలు ఇచ్చి పార్టీ కోసం కష్టపడ్డవారికి మొండిచేయి చూపారని ఆరోపించారు. రేవంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని, ఆయనపై కాంగ్రెస్ పట్టు కోల్పోయిందన్నారు. రేవంత్ సూచనల మేరకే కాం గ్రెస్ అధిష్టానం నడుచుకుంటోందని ఆరోపించారు. నేను పదవుల కోసం బీఆర్ఎస్లోకి వెళ్ల డం లేదని, పదవులే కావాలనుకుంటే నేను నీ దగ్గరే పడిగాపులు కాసేవాడినంటూ సీఎం రే వంత్కు చురకలంటించారు. కేసీఆర్ నా వయస్సును గౌరవిస్తాడని, రాజకీయంగా నేను ఆయనకు సమకాలీకుడినన్నారు. కేసీఆర్ ఎప్పుడూ నన్ను అన్నా అని సంబోధిస్తాడని జీవన్రెడ్డి పే ర్కొన్నారు. కేసీఆర్పై విధానపరంగా విమర్శలు చేశానే తప్పా ఏనాడూ ఆయనను వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. కేసీఆర్కు ప్రజలంటే చాలా గౌరవమని, నీలా కాదంటూ సీఎంను ఉ ద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాంతానికి సాగునీటి సమస్య తీర్చి సస్యశ్యామ లం చేయాలనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని, కేసీఆర్ను ముఖ్యమంత్రిగా మళ్లీ చూడాలనుకుంటున్నారన్నారు. కేసీఆర్ కంటే మెరుగైన పా లన కోరుకుని ప్రజలు కాంగ్రెస్ను గెలిపిస్తే రెండేండ్లలోనే రేవంత్ సర్కార్ ప్రజల విశ్వాసా న్ని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ నేతలందరినీ హైదరాబాద్కు పిలిపించుకొని మాట్లాడటం సంతోషకరమని, ఇప్పటికైనా పార్టీని నమ్ముకున్నవాళ్లందరికీ న్యాయం చేయాలని రేవంత్కు ఆయన సూచించారు.
నియోజకవర్గాల పునర్విభజన అంతా రాజకీయమే
. పార్లమెంటులో వ్యతిరేకంగా ఓటేస్తాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు. ‘ఇండియా’ నేతల నిర్ణయం. నేటి నుంచి పార్లమెంట్ప్ర త్యేక సమావేశం న్యూదిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు`2026ను తీవ్రంగా వ్యతిరేకించాలని… బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా ఐక్య సంఘటన ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము అనుకూలంగా ఉన్నామని కూడా స్పష్టంగా పేర్కొంది. అయితే, దానిని తీసుకువచ్చిన […] The post నియోజకవర్గాల పునర్విభజన అంతా రాజకీయమే appeared first on Visalaandhra .
వికారాబాద్లో కవిత ధర్నా, అరెస్ట్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రై తులు నిత్యం బాధపడుతున్నారని జా గృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బు ధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో భూములు కోల్పోతున్న రైతులు, ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్తో కలిసి ఎన్టీఆర్ చౌరస్తాలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఈ నెల 25న రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ రాబోతుందని చెప్పారు. తాను ప్రకటించే పా ర్టీ రైతుల పక్షాన నిలుస్తోందని స్పష్టంచేశారు. కవిత కలెక్టర్ దీపక్ తివారితో ఫోన్లో మాట్లాడారు. ఆర్డీఓను పం పించి సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు నోటీసులు జారీచేసిన నేపథ్యంలో రైతులు గత కొన్ని రోజుల నుంచి ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాధిత రైతులతో కలిసి బుధవారం వికారాబాద్ ఆర్డీఓ కార్యాయ లం ముందు ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించారు. అక్కడ ధర్నా చేసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో కవిత, రైతులతో ధర్నాకు దిగారు. రైతులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట ఉధృతంగా మారింది. ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం కవితను అరెస్ట్ చేసి ధారూర్ మీదుగా బంట్వారం పోలీస్స్టేషన్కు తరలించారు.
మీ సేవా కేంద్రాలపై ఎసిబి కొరడా ఝళిపించింది. నగరంలోని పలు కీలక ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో అవి నీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఖైరతాబాద్, అంబర్పేట్, అల్వాల్ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో అధికారులు సోదాలు నిర్వహిం చారు. పౌర సేవా సర్టిఫికెట్లు జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ దాడులు జరిగినట్లుగా సమాచారం. అయితే, సాధారణ ప్రజలకు అందాల్సిన సేవలను అడ్డుకుంటూ, మీసేవ సిబ్బంది దళారుల ద్వారా చక్రం తిప్పుతున్నట్లుగా ఎసిబి ప్రాథమికంగా గుర్తిం చింది. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దళారుల ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తూ ఇక నేరుగా వచ్చే సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లుగా సమాచారం. సోదాల సమయంలో మీసేవ కార్యాలయాల్లోని నగదు నిల్వలు, దరఖాస్తుల పెం డింగ్ జాబితా, సిబ్బంది వ్యక్తిగత వివరాలను ఎసిబి బృందాలు పరిశీలించాయి. మరోవైపు మీ సేవ కేంద్రాల్లో దోపీడి ఎక్కువైపోయిందని ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. చార్జీల పేరుతో మీసేవ సిబ్బంది చేస్తోన్న దోపిడీకి అడ్డుఅదుపు లేకుండా పోయిందని జనం ఆరోపిస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో కుల, ఆదాయ, నివాస, బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం వెళ్తే దోచుకుంటున్నారు. టెక్నాలజీతో పౌర సేవలను మరింత సులభతరం చేస్తున్నా మంటూ అన్ని సేవలను మీ సేవ కేంద్రాలకు అప్పగించి అధికారులు మాత్రం చేతులు దులుపుకుంటున్నారు. దీంతో నిర్వాహకులు అందినకాడి కి దండుకుంటున్నారు. కుల, ఆదాయ, నివాస, కుటుంబసభ్యుల ధ్రువీకరణ, ఒబిసి తదితర సర్టిఫికెట్ల కోసం రూ. 45 చెల్లిస్తే చాలు. కానీ, ఈ ఫీజు ఎక్కడా తీసుకోవడం లేదు. దాదాపు రూ.500 నుంచి రూ.1000 వరకు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే, అక్రమ వసూ ళ్లకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
. మైక్రో ఇరిగేషన్లో అగ్రగామిగా ఏపీ. అయినా తప్పని తిప్పలు. పరిష్కారం లేని సాంకేతిక సమస్యలు. నిర్వహణ భారంతో అల్లాడుతున్న అన్నదాత విశాలాంధ్ర-సచివాలయం: నవ్యాంధ్రప్రదేశ్ వ్యవసాయ ముఖచిత్రం మారుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.26 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి ఏపీ రికార్డు సృష్టించింది. గుజరాత్ వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి, రూ. 1030 కోట్ల భారీ సబ్సిడీతో హార్టికల్చర్ హబ్గా అవతరించింది. అయితే రైతుల పరిస్థితి పేరు […] The post తీరని రైతు గోస! appeared first on Visalaandhra .
ప్రథమ సంవత్సరం 77, ద్వితీయ 81 శాతం ఉత్తీర్ణత. కృష్ణాజిల్లా ప్రథమ స్థానం కైవసం. 2, 3 స్థానాల్లో గుంటూరు, ఎన్టీఆర్. చివరికి పరిమితమైన అన్నమయ్య. సత్తా చాటిన బాలికలు. ఎక్స్లో ఫలితాలు ప్రకటించిన మంత్రి లోకేశ్ విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఇంటర్మీడియట్ మార్చి 2026 ఫలితాల్లో ప్రభంజనం నెలకొంది. 12 ఏళ్ల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇంటర్ ఉత్తీర్ణతా శాతం నమోదయింది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు గరిష్ఠ స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం […] The post ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం appeared first on Visalaandhra .
హార్మూజ్ జలసంధిని ‘శాశ్వతంగా తెరిచేస్తున్నా’: ట్రంప్
హార్మూజ్ జలసంధిని తాను శాశ్వతంగా తెరిచేస్తున్నాను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై చైనా చాలా సంతోషంగా ఉంది అని పేర్కొంటూ, ప్రతిఫలంగా బీజింగ్ ఇరాన్కు ఆయుధాలు పంపడం నిలిపివేస్తుందని తెలిపారు. అయితే, ఈ ప్రకటనతో అనేక సందేహాలు మొదలయ్యాయి. ఇటీవలే ఇరాన్ పోర్టులకు వెళ్లే, వచ్చే నౌకలపై అమెరికా దిగ్బంధం విధించిన నేపథ్యంలో, ఇప్పుడు జలసంధిని తెరవడం ఏమిటి? అనే అంశంపై స్పష్టత లేదు. యుద్ధ సమయంలోనే ఇరాన్ కూడా ఆ మార్గంలో నౌకా రాకపోకలను గణనీయంగా తగ్గించింది. అమెరికా మార్కెట్లు ప్రారంభానికి ముందు సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో చేసిన పోస్టులో ట్రంప్, హార్మూజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచేస్తున్నాను. ఇది చైనాకే కాదు, ప్రపంచానికీ ప్రయోజనకరం. ఇలాంటి పరిస్థితి మళ్లీ రావద్దు అని పేర్కొన్నారు.ఇంకా చైనా ఇకపై ఇరాన్కు ఆయుధాలు పంపదని అంగీకరించింది. కొద్ది వారాల్లో నేను చైనాకు వెళ్లినప్పుడు అధ్యక్షుడు షీ జిన్పింగ్ నన్ను ఆత్మీయంగా ఆహ్వానిస్తారు. మేము తెలివిగా, సమర్థంగా కలిసి పనిచేస్తున్నాం అని ట్రంప్ వెల్లడించారు.ఇదిలా ఉండగా, అమెరికా సైన్యం ఆరు వాణిజ్య నౌకలను తిరిగి పంపించిందని, ఇరాన్ పోర్టుల నుంచి వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ పరిణామాలు ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో చైనా, ఇరువైపులూ శత్రుత్వాన్ని తగ్గించి హార్మూజ్ సముద్రసంధిని తెరవాలని పిలుపునిచ్చింది. ఆ మార్గం ద్వారా చైనా తన ఇంధన అవసరాల్లో పెద్ద భాగాన్ని పొందుతోంది. ట్రంప్ ప్రకటన చైనా కోసం మాత్రమేనా, లేక ఇతర దేశాల నౌకలకు కూడా అనుమతి ఉంటుందా అనే విషయంపై స్పష్టత కోరుతూ వైట్ హౌస్ను మీడియా సంస్థలు సంప్రదించాయి. ఇదే అంశంపై ఫాక్స్ బిజినెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇరాన్కు ఆయుధాలు పంపుతున్నారన్న ఆరోపణలను ఖండించారని తెలిపారు.
ఈనెల 20న సిఎం రేవంత్రెడ్డి కాళేశ్వరం పర్యటన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 20న కాళేశ్వరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. అనంతరం సరస్వతి నది అంత్య పుష్కరాల ఏర్పాట్లపై సిఎం సమీక్షించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు. సిఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
. గిరిజన సొసైటీ ముసుగులో కొల్లగొడుతున్న వైనం. చప్పరపాలెంలో గిరిజనేతరుల కనుసన్నల్లో తవ్వకాలు. మైనింగ్, రెవెన్యూ అధికారుల మొద్దునిద్ర. క్వారీ యాజమాన్యంతో కుమ్మక్కు. ఉన్నతాధికారులకు తప్ప్పుడు నివేదికలు విశాలాంధ్ర బ్యూరో- రంపచోడవరం: పోలవరం జిల్లా రంపచోడవరం మండలం చుప్పరపాలెం గిరిజన క్వారీ కార్మికుల కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో విలువైన ‘కలర్ గ్రానైట’ దోపిడీ బహిరంగంగానే సాగుతోంది. సొసైటీ కాలపరిమితి ముగిసినా సర్వే నంబర్లు 37/1, 70/2, 72/2లో సుమారు 3.930 హెక్టార్ల విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా, గిరిజనేతర […] The post ‘కలర్ గ్రానైట’ దోపిడీ appeared first on Visalaandhra .
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ -ఇండియా స్పోర్ట్ యాక్షన్ డ్రామా ’పెద్ది’ నుంచి విడుదలైన రెండు పాటలు చార్ట్బస్టర్లుగా నిలిచాయి. రెండు గ్లింప్స్లలో చరణ్ డిఫరెంట్ అవతార్స్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం విడుదల దిశగా ముందుకు సాగుతోంది. ఇక సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్ర బృందం ఇప్పుడు అధికారికంగా ధృవీకరించింది.మేకర్స్ నుండి వచ్చిన ఒక అధికారిక ప్రకటన ప్రకారం ’పెద్ది’ జూన్లో థియేటర్లలోకి రానుంది. సినిమా ఎడిటింగ్ను సమీక్షించిన తర్వాత, అవుట్పుట్ పై గొప్ప సంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమాను మరింత బాగా తీర్చిదిద్దేందుకు కోసం పోస్ట్-ప్రొడక్షన్ కు అదనపు సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ప్రేక్షకులకు అత్యుత్తమమైన, గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి అద్భుతమైన తారాగణం కీలక పాత్రలలో నటిస్తున్నారు.
250 మంది గల్లంతునైపిడావ్ (మైన్మార్): అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ మునిగిపోయిన దుర్ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన సముద్ర ప్రయాణాల్లో ఉన్న ప్రమాదాలను మరోసారి బయటపెట్టింది. గల్లంతైన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉండటంతో పరిస్థితి మరింత విషాదంగా మారింది. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన పడవ బంగ్లాదేశ్ దక్షిణ ప్రాంతంలోని […] The post అండమాన్ సముద్రంలో పడవ బోల్తా appeared first on Visalaandhra .
Middle East War Impact on Indian Biggies
Several Indian films are planned for shoot abroad and some of them are impacted because of the Iran and USA war. Several Middle East countries are impacted and the shoots planned are disrupted. SS Rajamouli has planned a key schedule in Middle East region and the schedule has been put on hold. Rajamouli and his […] The post Middle East War Impact on Indian Biggies appeared first on Telugu360 .
అమెరికా దిగ్బంధం ఎత్తివేయకపోతే గల్ఫ్ వాణిజ్యాన్ని పూర్తిగా అడ్డుకుంటాం: ఇరాన్
ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన దిగ్బంధం కొనసాగితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, ఓమన్ సముద్రం, రెడ్ సీ పరిధిలో ఎగుమతులుదిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ గట్టిగా హెచ్చరించింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ అధిపతి అలీ అబ్దుల్లాహి మాట్లాడుతూ, దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు ఇరాన్ దృఢంగా చర్యలు తీసుకుంటుంది అని స్పష్టం చేశారు. అమెరికా విధించిన దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించే దిశగా తీసుకున్న తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రారంభమైన నెలకుపైగా కాలంలోనే ఇరాన్ హార్మూజ్ జలసంధిని వాస్తవానికి మూసివేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఇరాన్ పోర్టులకు వెళ్లే, వచ్చే నౌకలపై అమెరికా దిగ్బంధం అమలు చేయడం ప్రారంభించింది. అయితే, పర్షియన్ గల్ఫ్లో ఇతర దేశాల నౌకల రాకపోకలకు అడ్డంకులు కలగనివ్వమని అమెరికా స్పష్టం చేసింది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
సర్వేలో స్పష్టం చేసిన అమెరికన్లువాషింగ్టన్: పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం వల్ల అమెరికా సైన్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ఇరాన్పై దాడులను సొంత పౌరులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదంటూ 54శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ఇప్సాస్-రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. గత కొన్ని వారాలుగా ఇరాన్పై యుద్ధం సాగిస్తోన్న అమెరికా… తాజాగా కీలకమైన ీVAర్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. అయితే, ఈ చర్యలను 54శాతం […] The post ఇరాన్తో యుద్ధం వద్దు appeared first on Visalaandhra .
ఇరాన్తో చర్చలకు అమెరికా షరతు వాషింగ్టన్: శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అమెరికా-ఇరాన్ మరోసారి చర్చలకు సిద్ధమవుతున్నాయి. రెండు రోజుల్లో ఇరు పక్షాల ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్ వేదికగా సంప్రదింపులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈసారి చర్చల కోసం ఇరాన్కు అమెరికా రెండు షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి ీVAర్మూజ్ జలసంధికి సంబంధించినదేనని సమాచారం. ఈ మేరకు అమెరికా దౌత్య వర్గాలను ఉటంకిస్తూ ఇజ్రాయిల్ మీడియా కథనం వెల్లడించింది. […] The post హోర్మూజ్ను పూర్తిగా తెరవాలి appeared first on Visalaandhra .
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తెహ్రాన్: కాల్పుల విరమణ గడువు మరో వారం రోజులే మిగిలి ఉండటంతో అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లోనే సంప్రదింపులు జరగనున్నాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధం నేపథ్యంలో తెహ్రాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై జరుగుతున్న బాహ్య ఒత్తిడి, సైనిక దురాక్రమణలను తిప్పికొట్టారు. పశ్చిమాసియాలో శత్రుత్వానికి పూర్తిస్థాయిలో ముగింపు పలికేందుకు కుదిరిన పెళుసైన కాల్పుల విరమణ, దౌత్యపరమైన […] The post మాపై ఏ బలప్రయోగమైనా విఫలమే appeared first on Visalaandhra .
ఏఐఏఎఫ్లో ప్రదర్శనకు ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’
భారతీయ చిత్రానికి దక్కిన అరుదైన గౌరం: రాజమౌళిహైదరాబాద్: రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ ప్రాంచైజీ నుంచి ఆయన దర్శకత్వంలోనే రూపొందుతోన్న సరికొత్త యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ఎటర్నల్ వార’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అండర్ ప్రొడక్షన్లో ఉన్న ఈ చిత్రం ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఫ్రాన్స్లో జరగనున్న ప్రతిష్టాత్మాక ఎన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్`2026 (ఏఐఏఎఫ్)లోని వర్క్ ఇన్ ప్రోగ్రస్ విభాగంలో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది. దీనిపై దర్శకుడు రాజమైళి స్పందిస్తూ… ‘ఇది […] The post ఏఐఏఎఫ్లో ప్రదర్శనకు ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’ appeared first on Visalaandhra .
గంభీర్ను తప్పిస్తే టీమిండియాలో సంక్షోభమే!
బీసీసీఐకి భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ హెచ్చరికటీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ బీసీసీఐని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్కు ఈ ప్రతిష్టాత్మక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల గంభీర్ సారథ్యంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కీలక ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను టెస్ట్ […] The post గంభీర్ను తప్పిస్తే టీమిండియాలో సంక్షోభమే! appeared first on Visalaandhra .
మరో రెండు మ్యాచ్లకు రోహిత్ దూరంముంబై: ఐపీఎల్ 2026 సీజన్లో వరుస సవాళ్లను ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ…గాయం కారణంగా రాబోయే కనీసం మరో రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రీడా వర్గాల సమాచా రం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన హోరాహోరీ పోరులో రోహిత్ శర్మ గాయపడటమే దీనికి ప్రధాన కారణం.ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న […] The post ముంబై ఇండియన్స్కు షాక్ appeared first on Visalaandhra .
ఫ్లిప్కార్ట్తో ఉబర్ భాగస్వామ్యం
బెంగళూరు: భారతదేశపు స్వదేశీ ఈ`కామర్స్ మార్కెట్ప్లేస్ అయిన ఫ్లిప్కార్ట్, భారతదేశంలోని ప్రముఖ మొబిలిటీ ప్లాట్ఫామ్లలో ఒకటైన ఉబర్తో భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులు అర్హత కలిగిన ప్రతి ఉబర్ ప్రయాణంపై సూపర్కాయిన్లను సంపాదించవచ్చు. ఈ కార్యక్రమం, సూపర్కాయిన్లను ఒక జీవనశైలి లాయల్టీ ప్రోగ్రామ్గా ముందుకు తీసుకువెళుతుంది. ఇది వినియోగదారులు తమ రోజువారీ ప్రయాణాలపై సంపాదించడానికి వీలు కల్పిస్తూనే, భారతదేశపు లాయల్టీ వ్యవస్థను పోలిన రివార్డ్స ప్రోగ్రామ్ను నిర్మించాలనే ఫ్లిప్కార్ట లక్ష్యంను మరింత ముందుకు […] The post ఫ్లిప్కార్ట్తో ఉబర్ భాగస్వామ్యం appeared first on Visalaandhra .
దల్జీత్, జాన్వీలతో కోకోకోలా హాఫ్ టైమ్ క్షణాలు ఆవిష్కరణ
న్యూదిల్లీ: దల్జీత్ దోసాంజ్, జాన్వీ కపూర్లతో కూడిన తన ప్రచార కార్యక్రమాన్ని కోక కోలా బుధవారం ప్రకటించింది. ఇది దైనందిన జీవితంలోని క్షణాల్లోకి “కోకకోలా హాఫ్ టైమ” అనే భావనను సజీవంగా తీసుకువస్తుంది. ఈ ఆలోచనకు వలాధారం ఒక నమ్మకం: అదేమిటంటే, ఒక ‘హాఫ్ టైమ’ (విరామ సమయం) కేవలం ఆ రోజు కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ఇవ్వడం మాత్రమే కాకుండా, మిమ్మల్ని తిరిగి ఆ కార్యకలాపాల్లోకి ఉత్సాహంగా తీసుకువ్లెలా ఉండాలి. కోకాకోలా తన రుచికరమైన, ఉత్తేజకరమైన […] The post దల్జీత్, జాన్వీలతో కోకోకోలా హాఫ్ టైమ్ క్షణాలు ఆవిష్కరణ appeared first on Visalaandhra .
ఎయిర్ ఇండియాకు రూ.22,000 కోట్ల నష్టం
టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను చవిచూసింది. మార్చి 31తో ముగిసిన కాలానికి గానూ సుమారు రూ.22,000 నష్టాన్ని ప్రకటించింది. గతేడాది మే నెలలో పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడం వల్ల విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం, జూన్ నెలలో జరిగిన విమాన ప్రమాదం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సంస్థ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఈ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు ఎయిర్ ఇండియా తన వాటాదారులైన టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ నుండి నిధుల సహాయాన్ని కోరుతోంది. మరోవైపు సంస్థ సిఇఒ కాంప్బెల్ విల్సన్ ఈ ఏడాది చివరలో పదవి నుండి తప్పుకోనున్నట్లు ప్రకటించారు.
టాటా మోటార్స్ లక్నో ప్లాంట్లో 10 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి మైలురాయి
లక్నో: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ లిమిటెడ్, ఉత్తరప్రదేశ్లో ఏడున్నర దశాబ్దాలకు పైగా తన ఉనికిని, పారిశ్రామిక శ్రేష్ఠత, ఆర్థిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, నిరంతర జీవనోపాధి కల్పనకు తన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ, తాజాగా తన లక్నో ప్లాంట్ నుండి 10వ లక్ష వాణిజ్య వాహనాన్ని విడుదల చేసి ఒక కీలకమైన మైలురాయిని చేరుకుంది. భారతదేశ వాణిజ్య వాహన పరిశ్రమ పరిశుభ్రమైన, స్మార్ట, మరింత సమర్థవంతమైన మొబిలిటీ పరిష్కారాల వైపు వేగంగా […] The post టాటా మోటార్స్ లక్నో ప్లాంట్లో 10 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి మైలురాయి appeared first on Visalaandhra .
మారుతి సుజుకి తయారీ కేంద్రాలలో మహిళల భాగస్వామ్యం పెంపు
న్యూదిల్లీ: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ లింగ వైవిధ్యం, సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. గత రెండేళ్లలో, ఈ సంస్థ తన గురుగ్రామ్, మనేసర్ కేంద్రాలలో వాహన తయారీ, ఇంజన్ ట్రాన్స్మిషన్ విభాగాలలో మహిళల నియామకాలను క్రమపద్ధతిలో పెంచింది. ఈ మహిళా నియామకాలు వాహన తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. వీరు కచ్చితత్వంపై గట్టి దష్టి పెడుతూ, అసెంబ్లీ, నాణ్యత నియంత్రణ విభాగాలలో బాధ్యతలు స్వీకరిస్తారు. వారు తమ పురుష సహోద్యోగులతో సమాన స్థాయిలో ఉద్యోగంలోనే […] The post మారుతి సుజుకి తయారీ కేంద్రాలలో మహిళల భాగస్వామ్యం పెంపు appeared first on Visalaandhra .
కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పురపాలక సంఘంలో అసిస్టెంట్ ఇంజినీర్ (AE)గా పనిచేస్తున్న నుసుం సుధాకర్రెడ్డిని బుధవారం రూ.50,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక కాంట్రాక్టర్ తుపాను నీటి కాలువ పనులను పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించిన తుది బిల్లును ప్రాసెస్ చేయాలన్నా, మెజర్మెంట్ బుక్లో వివరాలు నమోదు చేయాలన్నా తనకు లంచం ఇవ్వాలని ఏఈ సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనితో విసిగిపోయిన బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పథకం రచించిన ఏసీబీ అధికారులు, బుధవారం హుజూరాబాద్లోని ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద ఏఈ సుధాకర్ రెడ్డి బాధితుడి నుంచి రూ.50,000 నగదు తీసుకుంటుండగా మెరుపు దాడిచేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడిని కరీంనగర్లోని స్పెషల్ జడ్జి ఫర్ ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన విచారణ కొనసాగుతోంది. పభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు గానీ, ఏసీబీ వాట్సాప్ నంబర్ 9440446106కు గానీ సమాచారం అందించాలని అధికారులు కోరారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్తో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(40), ఆయూష్ బధోని(38), ముకుల్ చౌదరి(39) పరుగులు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లలో రసిక్ సలాం 4,భువనేశ్వర్ కుమార్ 3,కృనాల్ పాండ్యా 2 , జోష్ హజీల్ వుడ్ 1 వికెట్ తీశారు.
పోతి రెడ్డిపల్లి శివారులో గేద దూడపై చిరుత దాడి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతి రెడ్డిపల్లి గ్రామ అటవీ శివారు ప్రాంతంలో బుద వారం తెల్లవారు జామున గేద దూడపై చిరుతపులి దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. అను నిత్యం జనసందోహం ఉండే ప్రాంతంతోల చిరుత దాడి భయాందోళనలకు గురి చేసింది. అదే గ్రామానికి చెందిన సదుల పూర్ణ అనే రైతు అటవీ శివారులో గల తన పశువుల పాకలో రాత్రిపూట రెండు మాసాల వయస్సుగల దూడను కట్టి వేసి ఇంటికి చేరాడు. ఉదయం వెల్లగా కళేబరం కనిపించడంతో ఆందోళనకు గురై గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు. దాడి చేసి దూడను చంపి వేసిన కౄర జంతువు పై ఆరాతీశారు. ఈసంఘటనపై సిరిసిల్ల పారెస్ట్ అధికారి మోహన్లాల్ తన సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకొని పాద ముద్రల అనవాల్లను సేకరించి వేటాడిన తీరును నిర్దారించారు. దాడికి పాల్పడింది చిరుత పులి అని తేల్చి చెప్పారు. శివారు అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నందున రైతులు, ప్రజలు ఒంటరిగా వెల్లకూడదని సూచించారు. పశువులను పాకలలో ఒంటరిగా కట్టి వేయరాదని హితవు చెప్పారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మలకపేట రిజర్వాయర్ సమీప అడవిలో గుహ ఏర్పాటు చేసుకొని ధర్మారం, వెంకటాపూర్ చిట్టడువుల్లో సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేగ దూడలు,కుక్కలను పసి గట్టి దాడులు చేస్తున్నట్లు వాపోతున్నారు. సిరిసిల్ల రేంజ్ పరిదిలో చిరుతుల సంఖ్య పేరగడంతో పశులు, గొర్రెల మందలపై దాడులు జరుగుతున్నాయి.మలకపేట రాజర్వాయర్ నిర్మాణంతో వాటికి రక్షణ పెరిగి యదేచ్చగా సంచరిస్తున్నాయి. అనేక మందికి చిరుతలు తారస పడుతున్నాయి. ఒ చిరుత గత సంవత్సరం మూడు పిల్లలకు జన్మనిచ్చింది.
మేడిగడ్డ ఎందుకు కూలిందో కెసిఆర్ను నిలదీయండి : ఎమ్మెల్సీ బల్మూరి
మేడిగడ్డ ఎందుకు కూలిందో ముందు బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ను నీలదీయండి..అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇటీవల బిఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికి సూచించారు. జీవన్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ నుంచి 14 సార్లు బి-ఫామ్ తీసుకున్నారని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష కారణంగానే జీవన్ రెడ్డి ఈ స్థాయికి చేరుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాలు మరిచిపోయి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా మారిందని జీవన్ రెడ్డి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. కాని జీవన్ రెడ్డి కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరానన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆ కంపెనీలో కెసిఆర్, కెటిఆర్ తప్ప మరొకరు ఉండరన్న సంగతి జీవన్ రెడ్డికి తెలియదా ? అని ఆయన ప్రశ్నించారు. కన్న కూతురును కూడా ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పంపించిన విషయం జీవన్ రెడ్డికి తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం ఎవరైనా కెసిఆర్తో చేతులు కలుపుతారా? అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చిన ఘనత కెసిఆర్దేనని ఆయన విమర్శించారు. మేడిగడ్డ రిపేర్ చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వచ్చే తరాలు క్షమించవని జీవన్ రెడ్డి మాట్లాడటం ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ప్రజల ఆకాంక్ష మేరకే బిఆర్ఎస్లో చేరుతున్నానని జీవన్ రెడ్డి అంటున్నారని, రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అవసరమే లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు. జీవన్ రెడ్డి నిర్ణయాన్ని జగిత్యాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, బిఆర్ఎస్లో చేరడంతోనే ఆయన రాజకీయంగా భూస్థాపితం అయ్యారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.
హనుమాన్ మాల వేసుకున్న విద్యార్థిని స్కూల్లోకి రానివ్వని హెడ్మాస్టర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. హనుమాన్ మాల వేసుకున్న 7వ తరగతి విద్యార్థి ఓంకార్ను పాఠశాల లోనికి రాకుండా అడ్డుకున్నారు. మాలతీసి పాఠశాలకు రావాలని హుకుం జారీ చేయడంతో విద్యార్థి తల్లిదండ్రులు, భజరంగ్దళ్ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ప్రశ్నించిన తల్లిదండ్రులపై హెడ్మాస్టర్ దుర్బాషలాడటం హేయనీయం. హెడ్మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని భజరంగ్దళ్ నాయకులు శ్యామ్లాల్, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
వరుణ్తేజ్ కాలికి గాయం.. శస్త్రచికిత్స చేశారు: ప్రకటించిన నిహారిక #VarunTej #BariMovie
బిసి వసతిగృహంలో 8వ తరగతి విద్యార్థిని మృతి..
వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని ర్యాపని శ్రావణి (14) అనుమానాస్పద స్థితిలో బుధవారం తెల్లవారు జామున మృతి చెందింది. మృతదేహం వసతి గృహం వరండాలో పడి ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నసురుల్లాబాద్ మండలం హాజీపూర్కు చెందిన శ్రావణి బీసీ వసతిగృహంలో 8వ తరగతి చదువుతున్నది. పలువురు విద్యార్థినిలు ఉదయం ఐదు గంటల తర్వాత బాత్రూం వైపు వెళ్తుండగా వరండాలో శ్రావణి అచేతనంగా పడి ఉంది. ఆమెను గమనించిన విద్యార్థినిలు వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా డాక్టర్లు శ్రావణి మరణించినట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుమార్తె శ్రావణి మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లి లక్ష్మి, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. అయితే, అనుమానస్పద స్థితిలో మృతిచెందిన శ్రావణి గుండెపోటు గురై మృతి చెందిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్థానిక ఆర్డీవో ప్రభాకర్, తహశీల్దార్ ప్రేమ్కుమార్, సీఐ రాజిరెడ్డి, ఎస్సై మహేష్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. శ్రావణి మరణించిన విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ, ఏబీవీపీ, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి ‘హైబ్రిడ్’ ముఖ్యమంత్రి: కెటిఆర్
హైదరాబాద్: పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. మహిళ రిజర్వేషన్లకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మహిళ బిల్లును డీలిమిటేషన్తోె ముడి పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఒక ‘హైబ్రిడ్’ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదని విమర్శించారు. ఉదయం కాంగ్రెస్ ప్రతినిధిగా, సాయంత్రం బిజెపి నేతగా ఉంటారని కెటిఆర్ అన్నారు. హైబ్రిడ్ విధానం రేవంత్ రెడ్డి పాలనలో కూడా కనిపిస్తుందని తెలిపారు. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న బిల్లులో అస్పష్టత ఉందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్లు 24 శాతంగానే కొనసాగాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిస్తే తీవ్రమైన తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. కేంద్రం రాజకీయాలు వదిలేసి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు.
సిబిఎస్ఇ 10 ఫలితాలు విడుదల..బాలికల అత్యుత్తమ ప్రతిభ
సిబిఎస్ఇ 10వ తరగతి పరీక్షా ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ విషయాన్ని బోర్డు సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. ఈసారి పరీక్షలలో మొత్తం 93.7 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఈ బోర్డు పరీక్షలలో బాలికలే బాలురతో పోలిస్తే రాణించారు. బాలికలలో మొత్తం 94.99 శాతం మంది పాసయ్యారు. ఈ సారి సిబిఎస్ఇ రెండు దఫాల బోర్డు పరీక్షలు నిర్వహించింది. పదవ తరగతి పూర్తికి విద్యార్థులు తప్పనిసరిగా తొలి రౌండ్ పరీక్షకు హాజరుకావల్సి ఉంటుంది. ఈ మేరకు జరిగిన మొదటి దఫా ఫలితాలు ఇప్పుడు విడుదల అయ్యాయి.ఈసారి మొత్తం 8074 కేంద్రాలలో 24.71 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణులైన వారిలో దాదాపు 55,368 మందికి 95 శాతం పైగా మార్కులు, రెండు లక్షల మందికి పైగా 90 శాతం పైగా మార్కులు సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొంచెం తక్కువ సంఖ్యలో లక్షా 47 వేల మంది వరకూ కంపార్ట్మెంట్ కేటగిరి లో స్థానం దక్కించుకున్నారని అధికారి వివరించారు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకూ తొలి ఎడిషన్ పరీక్షలు జరిగాయి మే నెలలో రెండవ విడత పరీక్షలు ఉంటాయి. సిబిఎస్ఇ అధికారిక వెబ్సైట్ సిబిఎస్ఇ . ఎన్ఐసి. ఇన్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు . ఈసారి పరీక్షలలో కూడా కేంద్రీయ విద్యాలయ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభ చాటుకున్నారు.
ఆప్ ఎంపి మిట్టల్ విద్యాసంస్థలపై ఇడి దాడులు
ఆప్ ఎంపి అశోక్ మిట్టల్ సంబంధిత విద్యాసంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బుధవారం సోదాలు నిర్వహించింది. ఫెమా దర్యాప్తు ప్రక్రియలో భాగంగా ఈ రాజ్యసభ ఎంపికి చెందిన పది బిజినెస్, నివాసస్థలాలు దాదాపు పదింటిపై ఏకకాలంలో అధికారులు దాడులు సాగించారు. జలంధర్, గురుగ్రామ్లలో ఈ చర్యలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబందనల పరిధిలో ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఆప్ ఎంపి మిట్టల్ ఇటీవలే రాజ్యసభలో పార్టీ ఉప నేతగా నియమితులు అయ్యారు. ఇంతకు ముందు ఈ స్థానంలో సీనియర్ ఎంపి రాఘవ చద్ధా ఉన్నారు. ఇడి దాడులు జరిగిన మిట్టల్ ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ ఛాన్సలర్గా కూడా వ్యవహరిస్తున్నారు.
అండమాన్ వద్ద పడవ బోల్తా: 250 మందికి పైగా గల్లంతు
అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెలుతున్న పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 250 మందికి పైగా గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమీషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్లు సంయుక్తంగా ప్రకటించాయి. గల్లంతయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. మలేషియాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వారికోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్లోని టేక్నాఫ్ ప్రాంతం నుండి బయల్దేరినట్లు ఈ ప్రకటనలో ఐక్యరాజ్యసమితి అధికారులు తెలిపారు. మలేషియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు కెరటాల ఉదృ్ధతి కారణంగా పడవ మునిగిపోయినట్లు వెల్లడించారు. కాగా.. ఈ పడవలో పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించారని, అది కూడా ప్రమాదానికి ఒక కారణమై ఉండొచ్చని వారు తెలిపారు. ఈ పడవ ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుండి బయలుదేరినట్లు తెలుస్తోంది. కాక్స్బజార్లోని శరణార్థుల శిబిరాల్లో ఉన్న వీరు కనీస జీవన సదుపాయాల కోసం మలేషియాకు వలసన వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోయినా, బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కమాండర్ సబ్బిర్ ఆలం సుజాన్ తెలిపిన ప్రకారం, ఏప్రిల్ 9న ముగ్గురు రోహింగ్యాలు, ఆరుగురు బంగ్లాదేశ్ పౌరులు సహా తొమ్మిది మందిని రక్షించారు. బంగ్లాదేశ్ జెండా కలిగిన వాణిజ్య నౌక ‘ఎం.టి. మేఘ్నా ప్రైడ్’ సిబ్బంది సముద్రంలో తేలియాడుతున్న ఈ వ్యక్తులను గుర్తించి రక్షించినట్లు ఆయన తెలిపారు. పడవ ఎప్పుడు మునిగిందో, ప్రస్తుతం అధికారిక శోధన చర్యలు కొనసాగుతున్నాయా, లేదా అన్న విషయాలు స్పష్టంగా తెలియరాలేదు. మరో కోస్ట్ గార్డ్ మీడియా అధికారి తెలిపిన ప్రకారం, రక్షించిన ఎనిమిది మంది పురుషులు, ఒక మహిళను టెక్నాఫ్లో పోలీసులకు అప్పగించారు. ఈ రక్షణ చర్య అధికారిక శోధనలో భాగం కాదని, బంగ్లాదేశ్ నుండి ఇండోనేషియాకు వెళ్తున్న సమయంలో మేఘ్నా ప్రైడ్ నౌక సిబ్బంది వీరిని కాపాడినట్లు తెలిపారు.రోహింగ్యాల గల్లంతు ఘటన వారి దీర్ఘకాల నిరాశ్రయ స్థితిని ప్రతిబింబిస్తోందని యుఎన్హెచ్సిఆర్, ఐఓఎం పేర్కొన్నాయి. మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో కొనసాగుతున్న హింస కారణంగా రోహింగ్యాల భద్రమైన పునరావాసం అనిశ్చితంగా మారిందని వెల్లడించాయి. బంగ్లాదేశ్లో మయన్మార్ నుంచి వచ్చిన 10 లక్షలకుపైగా రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తున్న నేపథ్యంలో, వారికి ప్రాణ రక్షణ సహాయం అందించేందుకు అంతర్జాతీయ సమాజం మరింత నిధులు, ఐక్యతతో ముందుకు రావాలని యుఎన్హెచ్సిఆర్, ఐఓఎం విజ్ఞప్తి చేశాయి.
వరి గడ్డితో బయో తారు రోడ్డు #BioBitumen #RiceStraw #RoadConstruction #CSIR #EcoFriendly #IndiaInfra
రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన
రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన బాసర సీఐ కిరణ్ కుమార్ బాసర, (నిర్మల్
భారీ మూల్యం చెల్లించక తప్పదు: డీలిమిటేషన్పై స్టాలిన్
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 16న బ్లాక్ ఫ్లాగ్ నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు వ్యతిరేకంగా ఈ ఆందోళన నిర్వహించనున్నట్లు పేర్కొంటూ, తమిళనాడు స్వరాన్ని కేంద్రం పట్టించుకోకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదు, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని” హెచ్చరించారు. రూలింగ్ పార్టీ డీఎంకే అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్, డీలిమిటేషన్ అంశంపై పార్టీ ఎంపీలు, జిల్లా కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ, ఇప్పటివరకు మన తలపై వేలాడుతున్న కత్తి ఇప్పుడు మనపై పడింది అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఎంపీలతో సంప్రదింపులు జరుపుతూ, ఈ తీవ్ర ప్రమాదంను ఎదుర్కొనేందుకు సమన్వయ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్రంలోని భాజాపా ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ సవరణ బిల్లు తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో తమిళనాడు గళాన్ని పట్టించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశాభివృద్ధికి కృషి చేసిన నేరానికి కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తుందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రేపు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లుపై దక్షిణ భారత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని స్టాలిన్ అన్నారు. నియోజకవర్గాల పునర్విజనకు నిరసనగా రేపు తమిళనాడంతటా నల్ల జెండాలతో నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు స్వరాన్ని గౌరవించకుండా వెనక్కి తగ్గకపోతే దాని ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది కేవలం పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే కాకుండా ఆత్మగౌరవం గల తమిళుడిగా హెచ్చరిక చేస్తున్నానని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ, ఇది పార్టీల గురించి కాదు, వ్యక్తుల గురించి కాదు; మన ప్రజల హక్కులకు సంబంధించిన విషయం. భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు అన్ని పార్టీలూ, ఎంపీలు ఏకమవ్వాలి అని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గాల అశాస్త్రీయ పునర్విభజనను తాము వ్యతిరేకిస్తూనే ఉన్నప్పటికీ ఎన్నికలను ముందు కేంద్రప్రభుత్వం ఈ అంశాన్ని తెరమీదకు తీసుకురావడం కుట్రపూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు పేరుతో పార్లమెంటులో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకు ముందు రోజే స్టాలిన్ డీలిమిటేషన్ వల్ల రాష్ట్రంపై పడే ప్రభావాలపై చర్చించేందుకు ఎంపీలు, జిల్లా కార్యదర్శులతో వేర్వేరు అత్యవసర సమావేశాలు నిర్వహించారు.ధర్మపురి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశం ఆయన ఎన్నికల ప్రచార బిజీ మధ్య నిర్వహించబడిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలోపార్లమెంట్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసినట్లు సమాచారం.మంగళవారం కూడా స్టాలిన్ ఇదే అంశంపై హెచ్చరిస్తూ, తమిళనాడుకు నష్టం కలిగించే లేదా ఉత్తర రాష్ట్రాలకు అసమానంగా రాజకీయ శక్తిని పెంచే విధంగా డీలిమిటేషన్ అమలు చేస్తే, రాష్ట్రం పూర్తిగా స్థంభించే స్థాయిలో భారీ ఆందోళనలు జరుగుతాయని చెప్పారు. అవసరమైతే 1950-60 దశకాలలో జరిగినట్టే డీఎంకే మళ్లీ ఆందోళనలకు దిగుతుందని సూచించారు. సి.ఎన్. అన్నాదురై స్థాపించిన డీఎంకే పార్టీ 1949లో ఆవిర్భవించింది. ప్రారంభ దశలో రాష్ట్ర హక్కుల కోసం, హిందీ విధానానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలకు నేతృత్వం వహించింది.ఉత్తర తమిళనాడులో ఎన్నికల సభల్లో మాట్లాడిన స్టాలిన్, మహిళా రిజర్వేషన్ బిల్లు రూపకల్పన కూడా డీలిమిటేషన్ అమలులోకి వచ్చిన తర్వాత తమిళనాడు- ఉత్తర రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచే ఒక కుట్రగా కనిపిస్తోందని ఏప్రిల్ 14న స్టాలిన్ ఆరోపించారు.
హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణ..,.
హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణ..,. రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన….ఎస్ఐ కృష్ణయ్య మాడుగుల
ఈ తొమ్మిది ప్రతిజ్ఞలను పాటించండి:పిఎం మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి తొమ్మిది పనుల గురించి సామూహిక హామీ తీసుకున్నారు. నీటి సంరక్షణ నుంచి సహజ వ్యవసాయం, ఆరోగ్యం, సేవా భావం వరకు విస్తరించే ఈ ప్రతిజ్ఞలతో వికసిత కర్ణాటక, వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రధాని అడిగిన హామీలు ఏంటంటే.. మొదటిగా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకుందాం. ‘తల్లి పేరుతో మొక్కలు నాటుదాం(ఏక్ పేడ్ మా కే నామ్)’. పబ్లిక్ ప్రదేశాల్లో పరిశుభ్రతను పాటిద్దాం. వోకల్ ఫర్ లోకల్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ స్వదేశీయతను చాటుదాం. జాతీయ పర్యావరణ రంగాన్ని అభివృద్ధి చేద్దాం. దేశీయ పర్యాటకాన్ని పెంపొందిస్తూ, రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ఆచరిద్దాం. మిల్లెట్లను ఆహారంలో భాగం చేసుకుందాం. వంటలో నూనె వినియోగాన్ని తగ్గిద్దాం. యోగా, ఫిట్నెస్ను అలవర్చుకుని బరువును అదుపులో ఉంచుకుంటూ ప్రకృతికి సేవ చేద్దాం. ఈ తొమ్మిది సంకల్పాలపై నిజాయితీతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగితే, వికసిత కర్ణాటకతో పాటు వికసిత భారత్ వైపు వేగంగా పురోగమించవచ్చు అని మాండ్యలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠంలో నిర్మితమైన శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవెగౌడతో కలిసి ‘సౌందర్య లహరి శివ మహిమ స్తోత్రం’ అనే పుస్తకాన్ని కూడా మోదీ ఆవిష్కరించారు.
మరింత మంది సామాజిక కార్యక్రమాల్లో ముందుకు రావాలి
మరింత మంది సామాజిక కార్యక్రమాల్లో ముందుకు రావాలి చలివేంద్రం ప్రారంభంలో ఎస్సై రవికుమార్
గుంతకల్లు సంత మార్కెట్ లో యాచకుడి మృతి..
గుంతకల్లు (విశాలాంధ్ర):స్థానిక సంత మార్కెట్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక షాపు ముందు యాచకుడు మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రామాంజనేయులు (67) అనే యాచకుడు ఎండ తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మృతుడు పెద్దవడుగూరు మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందినవాడని తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతుడి బంధువులు మృతదేహాన్ని స్వగ్రామం గోపరాజుపల్లికి తీసుకువెళ్లినట్లు […] The post గుంతకల్లు సంత మార్కెట్ లో యాచకుడి మృతి.. appeared first on Visalaandhra .
Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్
కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్
వికారాబాద్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను వికారాబాద్ పిఎస్కు తరలించారు. పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణను నిరసిస్తూ ఉదయం నుంచి కవిత ఆందోళన చేశారు. బలవంతంగా భూములు తీసుకోవద్దన్నారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు స్థానిక ఎన్టిఆర్ చౌరస్తాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాలాంధ్ర – విడపనకల్లు.. మండల కేంద్రంలోని సుంకులమ్మ గుడి ప్రాంతంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాల మేరకు, వి.కొత్తకోట రస్తా నుంచి సుంకులమ్మ గుడి వరకు ప్రత్యేక పైప్లైన్ నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి.భూమి పూజ అనంతరం జేసీబీ యంత్రంతో పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సత్యబాబు, పంచాయతీ […] The post తాగునీటి సమస్యకు పరిష్కారం… appeared first on Visalaandhra .
ఘనంగా ‘అరైవ్ అలైవ్’రోడ్డు భద్రతా కార్యక్రమం..
ఘనంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం.. చిట్యాల, ఆంధ్రప్రభ : రోడ్డు
ప్రాథమిక దశలోనే అగ్నిని ఆర్పివేయడం ప్రధాన కర్తవ్యం..
ప్రాథమిక దశలోనే అగ్నిని ఆర్పివేయడం ప్రధాన కర్తవ్యం.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రాథమిక
Video : Exclusive F2F with Producer Supriya Yarlagadda
The post Video : Exclusive F2F with Producer Supriya Yarlagadda appeared first on Telugu360 .
మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా దర్బార్..
విశాలాంధ్ర, ఉరవకొండ.. ఉరవకొండలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు హాజరై తమ సమస్యలను మంత్రి కి వివరించారు. మంత్రి స్వయంగా ప్రజల వినతులను శ్రద్ధగా విని, వినతిపత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందిస్తూ, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, […] The post మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా దర్బార్.. appeared first on Visalaandhra .
టీడీపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు…
టీడీపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం
గవ్వ రవీందర్ రెడ్డికి మాతృవియోగం..
గవ్వ రవీందర్ రెడ్డికి మాతృవియోగం.. సంఘం నేతల నివాళి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభ …
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభ … లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ
పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర: సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాలమూరు రిజర్వాయర్లను వచ్చే వానాకాలంలో కచ్చితంగా నింపాలని, దానికి కావాల్సిన పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. మే మొదటివారంలో ప్రత్యక్ష యుద్దానికి పూనుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు మండుటెండల్లో పాదయాత్రలు చేస్తామని, పాలమూరును ఎందుకు పడావు పెట్టారో ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో బుధవారం బిఆర్ఎస్ నేతలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేఎల్ఐ నీళ్లు ఎలాంటి ఆంటంకం లేకుండా ఆ ప్రాంతానికి నీళ్లు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 1956కు ముందు పాలమూరు అత్యధిక వ్యవసాయ భూములు, చెరువులు, కుంటలు, బావులతో సస్యశ్యామలంగా ఉన్న జిల్లా అని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత అవలంభించిన విధానాల మూలంగా తెలంగాణ వచ్చే నాటికి పాలమూరు జిల్లా వలసల జిల్లా , కరువు జిల్లా, ఆకలి జిల్లా, పేదల జిల్లా, వెనకబడిన జిల్లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధలు, కష్టాల ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమంలో పాటలు, సాహిత్యం, వ్యాసాలు అన్నీ పాలమూరు వెతలను కేంద్ర బిందువుగా చేసుకుని వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడో ఏడాది నడుస్తుందని.. కానీ, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జిల్లా వాసి అయిన సిఎం కనీసం ఎందుకు సమీక్షించడం లేదని ప్రశ్నించారు. జిల్లా ఎంఎల్ఎలు, మంత్రులు హైలెవెల్ రివ్యూ కోసం ఎందుకు అడగడం లేదు..? అని అడిగారు. పాలమూరు ప్రజల శాశ్వత ప్రయోజనాల కోసం పాలమూరు మంత్రులు, ఎంఎల్ఎలు పనిచేయాలని సూచించారు. మొండి వాదనతో పనులు చేస్తామన్న దోరణిని వదులు కోవాలని హితవు పలికారు. ప్రతి ఎకరానికి సాగునీరు అందాలన్న తపనతో తాము పనిచేశామని, గతంలో తాము చొరవ తీసుకుని చేసిన పనుల కారణంగానే భీమా ద్వారా కొల్లాపూర్ ప్రాంతానికి 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని చెప్పారు.
మేడ్చల్ –ఘనపూర్తా గునీటి సరఫరా లైన్ల తనిఖీ….
మేడ్చల్ – ఘనపూర్తా గునీటి సరఫరా లైన్ల తనిఖీ…. లోపాలను సరిదిద్ది ప్రజలకు
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సిబి
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో మూడో స్థానంలో ఉన్న ఆర్సిబి ఈ మ్యాచ్లో గెలిస్తే నెట్ రన్రేట్ ప్రకారం మొదటిస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు గుజరాత్తో ఓటమి ఎదురుకున్న ఎల్ఎస్జి ఈ మ్యాచ్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో బెంగళూరు ఒక మార్పు చేసింది. డఫీ స్థానంలో హేజిల్వుడ్ జట్టులోకి వచ్చాడు. లక్నో అదే జట్టుని ఈ మ్యాచ్లోనూ కొనసాగిస్తుంది. తుది జట్లు: ఆర్సిబి: ఫిలిప్ సాల్ట్, దేవ్దత్ పడిక్కల్, రజత్ పటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయేష్ శర్మ, రషిక్ సలామ్ దర్. ఎల్ఎస్జి: ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, ఆవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠి, ప్రిన్స్ యాదవ్.
ఇసుక తరలిస్తున్న మాఫియా పై పోలీసులు పంజా..!
ఇసుక తరలిస్తున్న మాఫియా పై పోలీసులు పంజా..! లారీ డ్రైవర్, యజమానులపై కేసు
రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు మృతి
రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి చెందాడు. హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తుండగా విజయవాడ-హైదరబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి వద్ద తను ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి వేగంగా డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో జావీద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి రూరల్ పోలీసులు చేరుకొని మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎమ్మెల్యే వసంతకు టీడీపీ నేతల అభినందనలు..
ఎమ్మెల్యే వసంతకు టీడీపీ నేతల అభినందనలు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ
రెండేళ్ల కన్న కూతురిని గొంతు నులిమి చంపిన తండ్రి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (మ) హనుమాపురం లో దారుణం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవ మళ్లీ వివాదం తలెత్తడంతో రెండేళ్ల కన్న కూతురిని తండ్రి శ్రీ రాములు గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఏడాది ఉగాదికి తల్లిగారింటి నుంచి భార్య హనుమాపురంకు వచ్చింది. ఈ క్రమంలో గొడవలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరాములు తన కూతురిని హతమార్చినట్లు సమాచారం. శ్రీరాములుకు మాటలు రావు,చెవులు వినబడవు. హత్య అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్…
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్… హుజురాబాద్, ఆంధ్రప్రభ : లంచం తీసుకుంటూ.. మరో
వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి…
వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి… వృద్ధులకు ఇలాంటి వాతావరణం కల్పించిన నిర్వాహకులను
నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చి బ్యాంకు లోనే కుప్పకూలి మృతి
హబ్సిగూడ లో విషాదం చోటుచేసుకుంది. నగదు డిపాజిట్ చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వచ్చిన విశ్రాంత ఉద్యోగి లక్ష్మీ నారాయణ గుండెపోటు తో బ్యాంకు లోనే కుప్పకూలి మృతి చెందాడు. బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చి డిపాజిట్ స్లిప్ లో వివరాలు రాస్తూ అలాగే కూర్చున్న చోట నుండి కిందపడిపోయి మృతి చెందాడు. నాచారంలో నివసించే రిటైర్డు ఉద్యోగి లక్ష్మీనారాయణ బుధవారం హబ్సిగూడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చి హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పకూలి పోయారు.. బ్యాంక్ సిబ్బంది హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పారు.బ్యాంక్ సిబ్బంది సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కొండపల్లి బొమ్మల పండుగను విజయవంతం చేద్దాం…
కొండపల్లి బొమ్మల పండుగను విజయవంతం చేద్దాం… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రపంచ వారసత్వ
ముంబై ఇండియన్స్కి షాక్.. స్టార్ ఆటగాడు దూరం..
ఐపిఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం 1 మ్యాచ్లో మాత్రం విజయం సాధించి టేబుల్లో 9వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్కి చేరాలంటే.. ఇక నుంచి ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్ మరో షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో భారీ లక్ష్యఛేదన చేస్తుండగా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ మరో రెండు మ్యాచ్లకు జట్టుకు దూరం అవుతాడని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్తో ఏప్రిల్ 20న గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్కు రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఈ సీజన్లో రోహిత్ శర్మ 4 మ్యాచుల్లో 137 పరుగులు స్కోర్ చేశాడు.
Fall In Love With Rao Bahadur’s O Sundari Instantly
Starring Satya Dev and directed by Venkatesh Maha, the upcoming psychological thriller Rao Bahadur is presented by Mahesh Babu and Namrata Shirodkar’s GMB Entertainment, and produced by A+S Movies and SriChakraas Entertainments. The makers today released the film’s first song, O Sundari, that brings a soft and romantic flavour to its world. The listeners will […] The post Fall In Love With Rao Bahadur’s O Sundari Instantly appeared first on Telugu360 .
Srinivasa Mangapuram Teaser: Love In The Line Of Fire
Ajay Bhupathi, who delivered a blockbuster with his last film Mangalavaram, is now directing Srinivasa Mangapuram, which marks the debut of Superstar Krishna’s grandson Jaya Krishna Ghattamaneni. It also marks Rasha Thadani’s entry into Telugu cinema. The teaser, unveiled by Mahesh Babu, offers a raw and emotional glimpse into this powerful, love-driven drama. Set against […] The post Srinivasa Mangapuram Teaser: Love In The Line Of Fire appeared first on Telugu360 .
నాణ్యమైన ఆహారాన్ని అందించాలి టెక్కలి, ఆంధ్రప్రభ : విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం
పంటలు ఉత్పత్తి పెంచుటకు పుష్కల అవకాశాలు
పంటలు ఉత్పత్తి పెంచుటకు పుష్కల అవకాశాలు ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు
IPL 2026 : మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది
అనర్హుల తొలగింపు కోరుతూ కలెక్టర్కు వినతి…
అనర్హుల తొలగింపు కోరుతూ కలెక్టర్కు వినతి… వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి
బాషా, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది..
బాషా, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. ఎంపీ గోడం నగేష్ ఉట్నూర్,
సరికొత్త సైబర్ ఫ్రాడ్.. మీ ప్రాపర్టీ సీజ్ చేస్తామంటూ 12.3 కోట్లు కొట్టేశారు | Investment Scam 2026
వరుణ్ కాలికి గాయం.. శస్త్ర చికిత్స జరిగింది: నిహారిక
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బరి’. ఈ సినిమాలో వరుణ్ వాలీబాల్ క్రీడాకారుడిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్లో వరుణ్ తేజ్ద్ వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తండగా అతడి కాలికి గాయమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత, వరుణ్ సోదరి నిహరికా కొణిదెల వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్కు శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని తెలిపారు. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. విశ్రాంతి తీసుకుంటున్నారని అన్నారు. మరింత శక్తిమంతంగా తిరిగి వస్తారని, ఇలాంటి సమయంలో తమ అభిమానం, ప్రేమ, అప్యాయత ఎప్పుడూ వరుణ్పై ఉండాలని నిహారిక అన్నారు. ‘కమిటీ కుర్రాళ్లు’తో మంచి సక్సెస్ అందుకున్న యదు వంశీ దర్శకత్వం తెరకెక్కుతున్న చిత్రం ‘బరి’.
America - Iran - Ceasefire : వచ్చే వారంతో కాల్పుల విరమణ గడువు పూర్తి
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే అవకాశముంది
అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు
అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు టెక్కలి, ఆంధ్రప్రభ : పేదలు, పట్టణానికి
Anil Ravipudi: కృతిశెట్టి ఆశలన్నీ ఆయనమీదే!
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది కృతిశెట్టి. మొదటి సినిమానే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు, డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డులను బద్ధలు కొట్టాడు. దర్శకుడు బుచ్చిబాబుకి ఉప్పెన మొదటి సినిమా. ఆయన కూడా ఊహించని సక్సెస్ను ఈ మూవీతో అందుకున్నాడు. అయితే, దర్శకుడికి రెండవ సినిమా ఛాన్స్ రావడానికి, అది పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టింది. కానీ, హీరో హీరోయిన్స్ కి మాత్రం వరుసగా అవకాశాలు వచ్చి […] The post Anil Ravipudi: కృతిశెట్టి ఆశలన్నీ ఆయనమీదే! appeared first on Telugu Bullet .
చిరు వ్యాపారులకు అండగా బొండా సిద్ధార్థ ..
చిరు వ్యాపారులకు అండగా బొండా సిద్ధార్థ .. పి.4 పథకం ద్వారా జీవనోపాధి
అల్లం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..
వంటింట్లో ఉపయోగించే ఆహార పదార్థాలలో అల్లం ఒకటి. దీనిని కాలంతో సంబంధం లేకుండా అన్ని వంటకాలలో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే, చాలామంది అల్లాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉండటానికి ఫ్రిజ్లో నిల్వ చేస్తారు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏం ఉండదు. ఎందుకంటే అల్లం రెండు మూడు రోజుల తర్వాత ఎండిపోవడం మొదలవుతుంది.అంతేకాదు కుళ్ళిపోవడం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి అల్లాన్ని సరిగ్గా ఎలా నిల్వ చేయాలో తప్పక తెలుసుకోవాలి. ఈ క్రమంలో అల్లాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి కొన్ని సులభమైన నిల్వ చిట్కాలను పాటించడం చాలా ముఖ్యం. అల్లాన్ని ఎక్కువ రోజులు తాజాగా నిల్వ చేసే పద్ధతులు ఇవే పేపర్ టవల్స్: అల్లాన్ని నిల్వ చేయడానికి పేపర్ టవల్స్ లేదా గాలి చొరబడని డబ్బాలను ఉపయోగించవచ్చు. ఇలా గాలి చొరబడకుండా ఉంచడం వల్ల అది పాడైపోకుండా లేదా ఎండిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా దాని తాజాదనాన్ని కూడా కాపాడుకుంటుంది. జిప్లాక్ బ్యాగ్లు: అల్లం తాజాగా ఉండటానికి దానిని జిప్లాక్ బ్యాగ్లలో కూడా నిల్వ చేయవచ్చు. ఇది అల్లంలోకి గాలి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. దీనివల్ల దానిని ఫ్రిజ్లో ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. మట్టిని ఉపయోగించడం: ఈ పద్ధతి వింతగా అనిపించిన ఇది ఒక పాత, ప్రభావవంతమైన పద్ధతి. చల్లని ప్రదేశంలో అల్లాన్ని పొడి మట్టిలో లేదా ఇసుకలో పాతిపెట్టిలి. అల్లం అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి. ఈ చిట్కా దానిలోని తేమను నిలుపుకోవడానికి, ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. ఫ్రీజ్లో నిల్వ చేయడం: అల్లాన్ని ఒక నెల కంటే ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే దానిని ఫ్రీజర్లో ఉంచాలి. ఈ చిట్కా అల్లం ఎక్కువ కాలం తాజాగా ఉండేలా చేస్తుంది. తద్వారా దానిని ఉపయోగించడం సులభం అవుతుంది. అల్లాన్ని ముక్కలుగా కోసి కూడా ఫ్రీజర్లో నిల్వ చేసుకోవచ్చు. నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.
ఘనంగా సామూహిక శ్రీమంతాలు ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు

29 C