SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
... ...View News by News Source

AP News: రాష్ట్రంలో ఏరులై పారుతున్న కర్ణాటక మద్యం.. అధికారులు పరేషాన్

ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది.

దిశా డైలీ 25 Apr 2024 10:25 am

నిండైన దుస్తుల్లో హుందాగా మెరిసిన కాబోయే దంపతులు అదితి, సిద్దార్థ్

నిండైన దుస్తుల్లో హుందాగా మెరిసిన కాబోయే దంపతులు అదితి, సిద్దార్థ్

ఆసియ నెట్ న్యూస్ 25 Apr 2024 10:24 am

TS : నేడు బండి నామినేష‌న్‌…హాజ‌రుకానున్ను గుజరాత్ సీఎం

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని మహాలక్ష్మి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి చెంత ఉంచి పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్ధిగా ఉదయం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డితో కలిసి కలెక్టరేట్ కు వెళ్లి నామినేషన్ […]

ప్రభ న్యూస్ 25 Apr 2024 10:21 am

గాంధీభవన్ ఎదుట ‘నయవంచన’ పేరిట ఫ్లెక్సీల కలకలం

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గాంధీ భవన్ ఎదుట నయవంచన పేరిట ఫ్లెక్సీలు కలకలం రేపాయి.

దిశా డైలీ 25 Apr 2024 10:15 am

వావ్ రష్మిక ట్రెడిషనల్ లుక్ చూశారా.. శ్రీవల్లిని ఇలా చూస్తూ చూపు తిప్పుకోవడం కష్టం

వావ్ రష్మిక ట్రెడిషనల్ లుక్ చూశారా.. శ్రీవల్లిని ఇలా చూస్తూ చూపు తిప్పుకోవడం కష్టం

ఆసియ నెట్ న్యూస్ 25 Apr 2024 10:15 am

కర్నాటక డీజిల్‌ హైదరాబాద్​కు స్మగ్లింగ్

కర్నాటక డీజిల్‌ హైదరాబాద్​కు స్మగ్లింగ్

v6 వెలుగు 25 Apr 2024 10:15 am

Andhra Pradesh : పింఛను ఈ నెల అయినా ఇంటివద్దకు అందుతుందా? టీడీపీలో టెన్షన్

ఈ నెల కూడా పింఛను ఇంటివద్దకు ఇవ్వకపోతే తమకు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని టీడీపీ ఆందోళన చెందుతుంది

తెలుగు పోస్ట్ 25 Apr 2024 10:13 am

ఆర్జీవీకి చనువిస్తే ఏం చేస్తాడో తెలుసు, అంత సీన్ ఇవ్వను..యాంకర్ వింధ్య మొహమాటం లేకుండా చెప్పేసింది

ఆయనకి చనువిస్తే దానినిఅడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి వర్మకి నేను అంత సీన్ ఇవ్వను. ఆయన్ని పొగుడుతూ ఒక్క మాట మాట్లాడితే మనపై డబుల్ మీనింగ్ లో సెటైర్లతో రెచ్చిపోతాడు. తెలుగులో స్పోర్ట్స్ యాంకర్ గా రాణిస్తున్న వింధ్య విశాఖ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు యాంకర్ గా క్రికెట్ యాంకరింగ్ చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అయితే టాలీవుడ్ లో కూడా వింధ్య యాంకర్ గా రాణించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకి సరైన అవకాశాలు రావడం లేదు. టాలీవుడ్ లో తనకి సుమ, ఝాన్సీ, ఉదయభాను లాంటి యాంకర్లు ఆదర్శం అని వింధ్య అంటోంది. అయితే పలు ఈవెంట్స్ లో వేదికపై మాట్లాడేకొందరు సెలెబ్రిటీలు యాంకర్లనిటార్గెట్ చేస్తూ డబుల్ మీనింగ్ సెటైర్లు వేస్తుంటారు. అలాంటివాటిపై మీ ఒపీనియన్ ఏంటి అని వింధ్యకిఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. నా వరకు నేనైతే జాగ్రత్తగా ఉంటాను అంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మనిఉదాహరణ గా చెప్పింది. రాంగోపాల్ వర్మ లాంటి వారు అంటెండ్ అవుతున్న ఈవెంట్ అయితే నేను జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎలా మాట్లాడతారో తెలుసు. ఆయనకి చనువిస్తే దానినిఅడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వర్మకి నేను అంత సీన్ ఇవ్వను. ఆయన్ని పొగుడుతూ ఒక్క మాట మాట్లాడితే మనపై డబుల్ మీనింగ్ లో సెటైర్లతో రెచ్చిపోతాడు. కాబట్టి నేను అలా చేయను. సింపుల్ గా.. రామ్ గోపాల్ వర్మ గారు వేదికపైకి వచ్చి మాట్లాడాలి అని అంటాను. అంతకిమించి ఒక్క మాట కూడా మాట్లాడను. మన లిమిట్స్ లో మనం ఉంటే ఎవ్వరూ టచ్ చేయరు అని వింధ్య తెలిపింది. అవకాశాల కోసం చనువుగా బిహేవ్ చేయడం.. ఒకరి దగ్గరకి వెళ్లి నాకు ఆఫర్ ఇవ్వండి అని అడగడం తాను ఎప్పుడూ చేయలేదనివింధ్య పేర్కొంది. ఒకసారి ఓ నిర్మాణ సంస్థ దగ్గరకి వెళ్లి అవకాశం అడిగా. వాళ్ళు అంతగా స్పందించలేదు. నేను ఆఫర్ అడగడంఅదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని వింధ్య పేర్కొంది. జబర్దస్త్ లాంటి షోలకు యాంకర్ గా అవకాశం వస్తే ఒకే కానీ.. అక్కడ చేసే బూతు కామెడీ నచ్చదు అని వింధ్య పేర్కొంది. ఆడియన్స్ కూడా ఆకామెడీనిరిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి అందరికి అలవాటైపోయింది అని వింధ్య పేర్కొంది.

ఆసియ నెట్ న్యూస్ 25 Apr 2024 10:10 am

కుంటాలలో చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ సీరియస్

కుంటాలలో చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ సీరియస్

v6 వెలుగు 25 Apr 2024 10:10 am

TS : రెండోరోజు మాజీ సీఎం కేసీఆర్​ బ‌స్సు యాత్ర‌…

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర రెండో రోజుకు చేరుకోనుంది. ఇవాళ సూర్యాపేట నుంచి బయలుదేరి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తారు. అయితే నిన్నమిర్యాలగూడ, సూర్యపేటలలో రోడ్ షోలను నిర్వహించారు. రాత్రికి సూర్యాపేటలోనే కేసీఆర్ బస చేశారు. సూర్యాపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రాత్రి బస చేసిన కేసీఆర్ నేడు భువనగిరి వరకూ బస్సు యాత్ర చేపడతారు. 17 రోజుల పాటు ఏకబిగిన బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంగా ఆయన ఈసారి […]

ప్రభ న్యూస్ 25 Apr 2024 10:09 am

బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచినా మంత్రి పదవికి రిజైన్ చేస్తా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచినా మంత్రి పదవికి రిజైన్ చేస్తా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

v6 వెలుగు 25 Apr 2024 10:07 am

వేములవాడ రాజన్న ఆలయంలో 13 మంది ఉద్యోగులపై చర్యలు.. కారణమిదే..!

వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన 13 మంది ఉద్యోగులకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం కలకలం రేపింది.

దిశా డైలీ 25 Apr 2024 10:06 am

మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం

మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం

v6 వెలుగు 25 Apr 2024 10:05 am

లోక్‌సభ బరిలో ఖలిస్థాన్ వేర్పాటువాది..జైలు నుంచే పోటీ చేయనున్న అమృత్‌పాల్!

ఖలిస్థానీ నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగడ్ జైలులో ఉన్న ఆయన జైలు నుంచే పోటీ చేస్తారని అమృత్ పాల్ తరఫు న్యాయవాది రాజ్ దేవ్ సింగ్ ఖల్సా తెలిపారు.

దిశా డైలీ 25 Apr 2024 10:03 am

కరీంనగర్ కాంగ్రెస్‍లో రసవత్తర రాజకీయం

కరీంనగర్ కాంగ్రెస్‍లో రసవత్తర రాజకీయం

v6 వెలుగు 25 Apr 2024 10:02 am

OMG2 Telugu OTT: తెలుగులో OTTకి వచ్చేసిన సూపర్ హిట్ ఓ మై గాడ్2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OMG2 Telugu OTT: తెలుగులో OTTకి వచ్చేసిన సూపర్ హిట్ ఓ మై గాడ్2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

v6 వెలుగు 25 Apr 2024 10:02 am

వరల్డ్ మలేరియా డే.. దోమలు ఎక్కువగా చెమటలు పట్టేవారినే ఇష్టపడుతాయని తెలుసా?

ఎవరైనా సరే ఎక్కువగా భయపడేది అంటువ్యాధులకే. ముఖ్యంగా దోమలతో వ్యాపించే అంటు వ్యాధి మలేరియా అంటే చాలా మందికి భయం ఉంటుంది. ఇక ఈరోజు .. ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని

దిశా డైలీ 25 Apr 2024 10:01 am

ముగిసిన సలేశ్వరం జాతర.. వెళ్లొస్తాం.. లింగమయ్య వెళ్లొస్తాం

ముగిసిన సలేశ్వరం జాతర.. వెళ్లొస్తాం.. లింగమయ్య వెళ్లొస్తాం

v6 వెలుగు 25 Apr 2024 10:00 am

ధర్మం –మర్మం : అష్టగుణములు (3)(ఆడియోతో…)

మహాభారతంలోని అష్ట గుణములలో ‘క్షమా’ గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…3.వాచా మన సి కాయేన దు:ఖేనో త్పాదితేన చనకుప్యతి నచా ప్రీతి: సాక్షమా పరికీర్తితా వాక్కుతో మనస్సుతో శరీరంతో దు:ఖము కలుగు విధంగా ఎదుటు వారు ప్రవర్తించిననూ కోపగించకుండుట, సుఖమును కలిగించిననూ సంతోషించకుండుట ‘క్షమా’ అనబడును. శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

ప్రభ న్యూస్ 25 Apr 2024 10:00 am

పిల్లలకు పేరెంట్స్ కచ్చితంగా నేర్పాల్సిన మంత్రాలు ఇవి...!

పిల్లల్లో ఏర్పడుతున్న ఒత్తిడిని మాత్రం తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. దాని కోసం... కొన్ని రకాల మంత్రాలను పేరెంట్స్ తమ పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం... ప్రస్తుతం మన ముందు ఉన్నదంతా పోటీ ప్రపంచమే. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే... పిల్లలకు ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. కేవలం చదువులో ముందు ఉంటే సరిపోదు. ఆటల్లో, పాటల్లో డ్యాన్స్.. ఇలా ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉండి తీరాలి. ఎందుకంటే... ఎక్కడ చూసినా లక్షల మంది పోటీ పడుతున్నారు. దీంతో.. పేరెంట్స్ కూడా.. తమ పిల్లలకు ఏదో ఒకటి నేర్పించాలని వారిపై విపరీతమైన ఒత్తిడి తెస్తూ ఉంటారు. అలా అని పిల్లలకు అవి నేర్పించవద్దు అని చెప్పడం లేదు. కానీ... వాటి కారణంగా పిల్లల్లో ఏర్పడుతున్న ఒత్తిడిని మాత్రం తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. దాని కోసం... కొన్ని రకాల మంత్రాలను పేరెంట్స్ తమ పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం... 1.గాయత్రీ మంత్రం.. మీరు రెగ్యులర్ గా గాయత్రీ మంత్రం వింటూనే ఉంటారు. దానిని మీరు పిల్లలకు కూడా నేర్పించాలి. మంత్రం - ‘ఓం భూర్ భువ స్వాహా, తత్ సవితుర్ వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్’ ప్రతి పిల్లవాడికి చిన్నతనంలో నేర్పించవలసిన మంత్రం గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రం వేదాలకు తల్లిగా పరిగణిస్తారు. గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల అత్యున్నత శక్తిని ప్రేరేపిస్తుంది అని నమ్ముతారు. మనస్సు నుండి అజ్ఞానం ఏవైనా రూపాలను తొలగించి, పిల్లల్లో తెలివితేటలు నింపడంలో సహాయపడుతుంది. 2.ఓం నమ: శివాయ మంత్రం... 'ఓం నమః శివాయ' మంత్రం చాలా సాధారణంగా అనిపించవచ్చు. కానీ సాధారణ శ్లోకం అత్యంత శక్తివంతమైనది. దైవిక శక్తితో నిండి ఉంటుంది. ఇది అత్యంత శక్తివంతమైన శివ మంత్రాలలో ఒకటి. ఇది పిల్లలు మానసికంగా మరింత స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మార్పును స్వీకరించడానికి, దయతో అడ్డంకులను అధిగమించడానికి సహాయపడుతుంది. 3.హనుమాన్ చాలీసా.. హనుమాన్ చాలీసా ను సైతం క్రమం తప్పకుండా పిల్లలతో చదివించాలి. అది చాలా పెద్దగా ఉంటుంది.. పిల్లలకు చదవడం కష్టంగా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ... ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే ఈజీ అవుతుంది. రెగ్యులర్ గా చదివిస్తూ ఉంటే.. వారికి అది చదవడం సులభంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా భక్తి, బలం , నిస్వార్థతకు ప్రతిరూపమైన హనుమంతుని ఉత్తమ భక్తి గీతాలలో ఒకటి. హనుమాన్ చాలీసాలోని ప్రతి శ్లోకం అతని జీవితం, సద్గుణాలు, గుణగణాలు , రాముడికి అతని అచంచలమైన అంకితభావం గురించి వివరిస్తుంది. పిల్లలకు హనుమాన్ చాలీసా బోధించడం వల్ల వారిలో ధైర్యం, రక్షణ, వినయం, భక్తి భావాలు పెరుగుతాయి. 4.గురు మంత్రం.. ఈ గురు మంత్రం కూడా పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. మంత్రం - గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. భగవంతుని కంటే ఎవ్వరూ అత్యున్నతుడు కాదని పిల్లలకు ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు. కానీ.. మనకు పాఠాలు చెప్పే గురువు భగవంతుని కంటే గొప్పవాడు అని దీని అర్థం. గురు మంత్రం ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు అంకితం చేశారు.గురువులు మనకు తప్పు ఏది, ఒప్పు ఏది అనే విషయాలను నేర్పిస్తారు. 5.మహామృత్యుంజయ మంత్రం మంత్రం - ఓం త్ర్యంబకం యజామహే, సుగంధిం పుష్టి-వర్ధనం, ఉర్వారుకమివ బంధనన్, మృత్యోర్ ముక్షీయ మామృతాత్ అత్యంత శక్తివంతమైన శివ మంత్రాలలో ఒకటి, ఇది ప్రజలలో మరణ భయాన్ని జయించగలదని నమ్ముతారు. ఇది విద్యార్థులకు , పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలి. మహామృత్యుంజయ మంత్రం పిల్లలు తమ చుట్టూ రక్షణ కవచాన్ని పెంపొందించుకోవడానికి , చివరికి వారిని ప్రపంచ భయాల నుండి విముక్తి చేయడానికి సహాయపడుతుంది. 6.సరస్వతీ మంత్రం.. మంత్రం - యా దేవి సర్వభూతేషు, విద్యా రూపేన్ సంస్థిత, నమస్తస్యే నమస్తస్యే నమస్తస్యే నమో నమః. మాతా సరస్వతీ దేవికి సంబంధించిన ఈ మంత్రాన్ని జపించడం వల్ల.. జ్ఞానం పెరుగుతుంది. పిల్లలకు ఈ మంత్రాన్ని బోధించడం వల్ల వారు నేర్చుకోవడం, కళలు, మేధోపరమైన విషయాల పట్ల ప్రశంసలు పెంచుకుంటారు. కాబట్టి.. కచ్చితంగా నేర్పించడం చాలా అవసరం. మరి, మీరు మీ పీల్లలకు ఈ మంత్రాలు నేర్పుతున్నారా లేదా..?

ఆసియ నెట్ న్యూస్ 25 Apr 2024 9:59 am

జాబ్స్​ ఇవ్వని బీజేపీని ఎందుకు గెలిపించాలి

జాబ్స్​ ఇవ్వని బీజేపీని ఎందుకు గెలిపించాలి

v6 వెలుగు 25 Apr 2024 9:57 am

కాళేశ్వరంపై జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వయిరీ స్టార్ట్

కాళేశ్వరం కరప్షన్, మూడు బ్యారేజీల్లోని వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘన తదితరాలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆది గురువారం నుంచి కార్యకలాపాలను మొదలుపెట్టనున్నది.

దిశా డైలీ 25 Apr 2024 9:54 am

Breaking: పులివెందులకు చేరుకున్న సీఎం జగన్

వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల చేరుకున్నారు.

దిశా డైలీ 25 Apr 2024 9:54 am

Fact Check: Video of Indian flag upside down at Congress leader Priyanka Gandhi Vadra’s feet is not related to upcoming general polls

The second phase of Lok Sabha polls is scheduled for April 26, 2024. Political parties are busy campaigning to woo the voters. Congress general secretary Priyanka Gandhi attended public meetings in Chitradurga and Bengaluru’s HSR layout in Karnataka.

తెలుగు పోస్ట్ 25 Apr 2024 9:52 am

WHO : యువ‌తో పెరిగిన ధూమ‌,మ‌ద్య‌పానాల వాడ‌కం

కౌమారదశలో ఉన్నవారిలో ఆల్కహాల్, ఈ-సిగరెట్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబందించి ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ శాఖ ఇవాళ నివేదికను విడుదల చేసింది. యూరప్, మధ్య ఆసియా, కెనడాలో 11, 13, 15 ఏళ్ల వయస్సు గల 2, 80,000 మంది యువకుల నుంచి సేకరించిన సర్వేలో వెల్లడైంది. ఈ పోకడల వల్ల యొక్క దీర్ఘకాలిక పరిణామాలు ఎదుర్కోనే ప్రమాదం ఉందని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇందులో 15 ఏళ్లలోపు వారిలో 57 శాతం మంది […]

ప్రభ న్యూస్ 25 Apr 2024 9:51 am

ఆరు గ్యారంటీలు సునీతను గెలిపిస్తాయి

ఆరు గ్యారంటీలు సునీతను గెలిపిస్తాయి

v6 వెలుగు 25 Apr 2024 9:51 am

కార్మికుల ద్రోహి బీఆర్ఎస్ పార్టీ : గడ్డం వంశీకృష్ణ

కార్మికుల ద్రోహి బీఆర్ఎస్ పార్టీ : గడ్డం వంశీకృష్ణ

v6 వెలుగు 25 Apr 2024 9:51 am

కామారెడ్డిలో భారీగా నగదు పట్టివేత

2024 పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

దిశా డైలీ 25 Apr 2024 9:50 am

TDP : అన్నా లేడు.. పార్టీ లేదు.. ఏక్ నిరంజన్.. నో బ్లడ్ రిలేషన్

తుని నియోజకవర్గం టిక్కెట్ తనకు దక్కక పోవడంతో యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు

తెలుగు పోస్ట్ 25 Apr 2024 9:48 am

హనుమాన్ ఆలయానికి విరాళంగా భూమి ఇచ్చిన ముస్లిం

హనుమాన్ ఆలయానికి విరాళంగా భూమి ఇచ్చిన ముస్లిం

v6 వెలుగు 25 Apr 2024 9:47 am

ఆడవాళ్లకు చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది?

ప్రస్తుత కాలంలో పెద్ద వయసు వారితో పాటుగా యువకులు, చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. అసలు ఎందుకిలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఒకప్పుడు గుండెపోటు వృద్ధుల మాత్రమే వచ్చే వ్యాధిగా భావించేవారు. కానీ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి మొదలుకుని యువకులు, మధ్యవయస్కులు, పెద్ద వయసువారంటూ ప్రతి ఒక్కరికీ వస్తోంది. ముఖ్యంగా యువతులు కూడా దీని బారిన పడి చనిపోతున్నారు. చాలా మంది గుండెపోటు మగవారికే ఎక్కువగా వస్తుందని నమ్ముతారు. ఎందుకంటే ఆడవారిలో ఉండే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ గుండెను బలంగా ఉంచుతుందని, గుండెపోటు ప్రమాదం నుంయి రక్షిస్తుందని బాగా నమ్ముతారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది యువతులు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? దీని వెనుకున్న కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఆడవాళ్లకు చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది? ఒత్తిడి ఒత్తిడి లేని వారు ఈ రోజుల్లో లేరేమో. కానీ ఈ ఒత్తిడి ఎన్నో రోగాలకు దారితీస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఒత్తిడితో కూడిన జీవనశైలి వల్లే యువతుల్లో గుండెపోటు ముప్పు పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఆడవాళ్లు కేవలం ఇంటికే పరిమితం కాకుండా ఇంటి నుంచే ఆఫీసు పనులను కూడా చేస్తున్నారు. కానీ ఇంటి పని, ఆఫీసు వల్ల వారిపై ఒత్తిడి పెరిగి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. దీనివల్లే గుండెపోటు బారిన పడుతున్నారని నిపుణులు అంటున్నారు. స్మోకింగ్ ఈ రోజుల్లో ఆడవాళ్లు కూడా స్మోకింగ్ ఎక్కువగా చేస్తున్నారు. కానీ స్మోకింగ్ వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ పరిమాణం బాగా తగ్గుతుంది. ఇది వీరి రక్తం జిగటగా ఉండేలా చేస్తుంది. దీంతో రక్తం సులభంగా గడ్డకడుతుంది. దీంతో గుండెపోటు వస్తుంది. గుండెపోటు రావొద్దంటే ఆడవాళ్లు స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఈస్ట్రోజెన్ హార్మోన్ ను సెక్స్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది ఆడవారిలో ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ హార్మోన్ గుండెను సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ మారుతున్న జీవనశైలి వల్ల ఆడవారు ఇంటి ఫుడ్ కంటే బయటదొరికే జంక్ ఫుడ్ కు బాగా అలవాటు పడ్డారు. అలాగే లైఫ్ కూడా నిశ్చలంగా మారింది. దీనివల్ల ఆడవారిల ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గడం ప్రారంభమయ్యింది. దీనివల్ల ఆడవారికి గుండెపోటు రిస్క్ పెరిగింది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో జనన నియంత్రణ మాత్రలు కూడా గుండెపోటుకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు లక్షణాలు ఆడవాళ్లకు, మగవాళ్లకు గుండెపోటు లక్షణాలు వేరువేరుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆడవాళ్లకు గుండెపోటు వచ్చినప్పుడు వారి లక్షణాలు మామూలుగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి ఛాతీలో నొప్పి రాదు. గుండెపోటు వచ్చినప్పుడు నడవడానికి రాదు. ఒళ్లంతా చెమటలు పడతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు ఉంటాయి. దీని వల్ల ఆడవారు తరచుగా గందరగోళానికి గురవుతారు. ఇలాంటి పరిస్థితిలో హాస్పటల్ కు వెళ్లడమే మంచిది.

ఆసియ నెట్ న్యూస్ 25 Apr 2024 9:45 am

కేసీఆర్​ ఎంపీ సీట్లు అమ్ముకొని.. బిడ్డను కాపాడుకోవాలనుకుంటున్నడు: కొండా సురేఖ

కేసీఆర్​ ఎంపీ సీట్లు అమ్ముకొని.. బిడ్డను కాపాడుకోవాలనుకుంటున్నడు: కొండా సురేఖ

v6 వెలుగు 25 Apr 2024 9:45 am

 Bihar: జేడీయూ నేత హ‌త్య‌

బీహార్‌లో జేడీయూకి చెందిన రాజకీయ నేత సౌరభ్ కుమార్ హత్యకు గురయ్యారు. రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. పాట్నాలోని పున్‌పున్‌ ఏరియాలో ఈ ఘటన జరిగింది. వివాహ వేడుకకు హాజరయ్యి తిరిగి వెళ్తున్న సమయంలో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పున్‌పున్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 24న అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగిందని, ఇద్దరు వ్యక్తులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారని, సౌరభ్ కుమార్ చనిపోయారని పోలీసులు తెలిపారు. సౌరభ్ […]

ప్రభ న్యూస్ 25 Apr 2024 9:44 am

లక్సెట్టిపేటలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలి : యువజన సంఘం

లక్సెట్టిపేటలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలి : యువజన సంఘం

v6 వెలుగు 25 Apr 2024 9:44 am

కామారెడ్డి జిల్లాలో రైల్వే డబుల్​ లైన్ వచ్చేనా?

కామారెడ్డి జిల్లాలో రైల్వే డబుల్​ లైన్ వచ్చేనా?

v6 వెలుగు 25 Apr 2024 9:42 am

ప్రజల దృష్టిని మళ్లిస్తున్నరు.. అసలు సమస్యలపై మోదీ మాట్లడ్తలేరు: ప్రియాంక గాంధీ

ప్రజల దృష్టిని మళ్లిస్తున్నరు.. అసలు సమస్యలపై మోదీ మాట్లడ్తలేరు: ప్రియాంక గాంధీ

v6 వెలుగు 25 Apr 2024 9:40 am

TS : ఇవాళ ఉప్ప‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్‌మ్యాచ్‌… ట్రాఫిక్ ఆంక్ష‌లు

ఇవాళ ఉప్ప‌ల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా స్టేడియం ప‌రిస‌రాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. మ్యాచ్ దృష్ట్యా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్టు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 వరకూ చెంగిచర్ల, బోడుప్పల్, ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపునకు వచ్చే వాహనాలు హెచ్ఎండీఏ భగాయత్ లేఅవుట్ మీదుగా నాగోల్ వైపు మళ్లిస్తారు. ఎల్బీనగర్, నాగోల్ మీదుగా ఉప్పల్‌కు వచ్చే వాహనాలను […]

ప్రభ న్యూస్ 25 Apr 2024 9:35 am

ఫస్ట్ ఫేజ్ లో ఓటింగ్ తీరు చూసి మోదీ భయపడుతున్నరు: ఖర్గే

ఫస్ట్ ఫేజ్ లో ఓటింగ్ తీరు చూసి మోదీ భయపడుతున్నరు: ఖర్గే

v6 వెలుగు 25 Apr 2024 9:35 am

TS : కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న

నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో, ఈ స్థానానికి ఉపఎన్నిక జరపనున్నారు. ఓటర్ల జాబితా కూడా వెలువరించారు. ఈ ఎన్నికలకు […]

ప్రభ న్యూస్ 25 Apr 2024 9:32 am

వారసత్వ పన్నుపై నా కామెంట్లను బీజేపీ వక్రీకరిస్తోంది: పిట్రోడా

వారసత్వ పన్నుపై నా కామెంట్లను బీజేపీ వక్రీకరిస్తోంది: పిట్రోడా

v6 వెలుగు 25 Apr 2024 9:31 am

KCR : నేడు రెండో రోజు కేసీఆర్ బస్సు యాత్ర

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర నేటికి రెండో రోజుకు చేరుకోనుంది.

తెలుగు పోస్ట్ 25 Apr 2024 9:30 am

రోడ్డు ప్రమాదంలో లారీ-కారు దగ్ధం

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. అతివేగంతో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. బొగ్గు లారీ కావడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే లారీ కూడా పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. అతిగేవగంతోనే ప్రమాదం జరిగిందని […]

మన తెలంగాణ 25 Apr 2024 9:30 am

TS : కంటోన్మెంట్​, చేవేళ్లలో సీఎం రేవంత్​ పర్యటన

ఇవాళ చేవెళ్ల లోక్‌సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం గాంధీభవన్ లో బీజేపీపై ఛార్జ్ షీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. సాయంత్రం రాజేంద్ర నగర్ ( చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం)లో రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రోడ్ షో లో సీఎం పాల్గొననున్నారు.చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ర్యాలీతో పాటు సభలోనూ సీఎం రేవంత్ పాల్గొననున్నారు.

ప్రభ న్యూస్ 25 Apr 2024 9:28 am

సింగరేణి ద్వారానే కొత్త గనులు తవ్వాలి: మిర్యాల రాజిరెడ్డి

సింగరేణి ద్వారానే కొత్త గనులు తవ్వాలి: మిర్యాల రాజిరెడ్డి

v6 వెలుగు 25 Apr 2024 9:28 am

మా పార్టీ అభ్యర్థికి ఓటు వేయొద్దు! ..బన్‌‌స్వార ప్రజలకు కాంగ్రెస్‌‌ విజ్ఞప్తి

మా పార్టీ అభ్యర్థికి ఓటు వేయొద్దు! ..బన్‌‌స్వార ప్రజలకు కాంగ్రెస్‌‌ విజ్ఞప్తి

v6 వెలుగు 25 Apr 2024 9:25 am

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో షాకయ్యా: నటుడు నరేశ్

మిస్టర్ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సూపర్ స్టార్ స్వర్గీయ కృష్ణ గారిని విమర్శించడం చూసి షాక్ అయ్యాను మరియు చాలా బాధపడ్డాను. అలనాటి హీరో, సూపర్ స్టార్ దివంగత కృష్ణపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయటం సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్‌ను కృష్ణ రాజకీయంగా విభేదించారని పవన్ అన్నారు. అయినా, కృష్ణ చిత్రాలకు ఎన్టీఆర్ ఏనాడు ఇబ్బందులు కలిగించలేదని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి ప్రస్తావిస్తూ చేసిన కొన్ని కామెంట్లు పరోక్షంగా కృష్ణ అభిమానులను బాధ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీకే నరేష్ తాజాగా ఒక సందర్భంలో సోషల్ మీడియా ద్వారా పవన్ చేసిన కామెంట్ల గురించి స్పందించారు. కృష్ణగారి (Krishna) విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ బాధ పెట్టాయని ఆయన తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణగారిది బంగారు మనసని ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేశారని నరేష్ (Naresh) చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి కృష్ణగారు చేసిన సేవలు మరవలేనివని ఆయన అన్నారు. కృష్ణగారు ఎప్పుడూ పొత్తులు మారలేదని ఈ సందర్భంగా సీనియర్ నరేష్ గుర్తు చేశారు. వ్యక్తిగతంగా కృష్ణ ఎవరినీ విమర్శించలేదని నరేష్ తన కామెంట్స్ ద్వారా చెప్పుకొచ్చారు. యాక్టర్ గా, పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ ను నేను ఎంతగానో అభిమానిస్తానని ఏపీ భవిష్యత్తుగా పవన్ కళ్యాణ్ ను నేను చూస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు. ఈ ఎన్నికల్లో పవన్ గెలిచి, కూటమి గెలిచి ఆంధ్రప్రదేశ్ మళ్లీ వెలుగు వెలగాలని ఫీలవుతున్నానని వీకే నరేష్ పేర్కొన్నారు. జై శ్రీరామ్ అంటూ వీకే నరేష్ కామెంట్లు చేయడం గమనార్హం. దివంగత నటుడు కృష్ణగారి పేరును అనవసర వివాదాల్లోకి లాగవద్దని నెటిజన్లు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కావాలని విమర్శలు చేయలేదని ఆయన వ్యాఖ్యల వెనుక కృష్ణగారి స్థాయిని తగ్గించాలనే ఆలోచన అస్సలు లేదని పవన్ కళ్యాణ్ అభిమానులు చెబుతున్నారు. అసలు పవన్ మాటలు ఇని,, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇతర నటులు వేరే పార్టీలలో ఉన్నారు. అలానే అప్పటి సూపర్ స్టార్ కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారిని కృష్ణ గారు ఎంతగా విమర్శించినా ఎన్టీఆర్ గారు తిరిగి ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. అది ఎన్టీఆర్ గారి అంతటి సంస్కారం. అయితే ప్రస్తుత సీఎం జగన్ మాత్రం నన్ను వేధింపులకు గురి చేశారని అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు ఇటీవల ఎంతో దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యల్లో కృష్ణ గారిని పవన్ ఎక్కడా విమర్శించలేదని పలువురు జనసేన నాయకులు, పవన్ ఫ్యాన్స్ అంటే, ఎన్నికల వేళ నాటి సూపర్ స్టార్ కృష్ణ గారిని లాగవలసిన అవసరం పవన్ కు ఏమిటనేది కృష్ణ గారు, మహేష్ ఫ్యాన్స్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పొలిటికల్ గా పవన్ రేంజ్ పెరుగుతోంది. పవన్ తాజాగా మరో జనసేన అభ్యర్థి నామినేషన్ వేసే సమయంలో డ్యాన్స్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పని చేశారు. 1989 ఎన్నికల్లో ఏలూరు నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఆయన గెలుపొందారు. ఆ సమయంలో తెలుగు దేశం అధినేతగా ఉన్న ఎన్టీఆర్‌ను రాజకీయంగా ఆయన విభేదించారు.

ఆసియ నెట్ న్యూస్ 25 Apr 2024 9:24 am

Summer Effect : మాడు పగిలిపోతుంది...బయటకు పోతే ఇక అంతే

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తెలుగు పోస్ట్ 25 Apr 2024 9:22 am

దారుణ హత్య : అధికార పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు

దారుణ హత్య : అధికార పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు

v6 వెలుగు 25 Apr 2024 9:22 am

ఘనంగా ఓయూ ఫౌండేషన్ డే

ఘనంగా ఓయూ ఫౌండేషన్ డే

v6 వెలుగు 25 Apr 2024 9:21 am

కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌పెడుతూ యువకుడు‌‌ మృతి

కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌పెడుతూ యువకుడు‌‌ మృతి

v6 వెలుగు 25 Apr 2024 9:18 am

శర్వా సినిమాలో.. హీరో రాజశేఖర్

శర్వా సినిమాలో.. హీరో రాజశేఖర్

v6 వెలుగు 25 Apr 2024 9:18 am

దంతెవాడ జిల్లాలో గన్ మిస్ ఫైర్.. జవాన్ మృతి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా హందవాడలో గన్ మిస్ ఫైర్ అయింది.

దిశా డైలీ 25 Apr 2024 9:15 am

శబరి కొత్తగా థ్రిల్ చేస్తుంది : వరలక్ష్మీ శరత్‌‌‌‌ కుమార్

శబరి కొత్తగా థ్రిల్ చేస్తుంది : వరలక్ష్మీ శరత్‌‌‌‌ కుమార్

v6 వెలుగు 25 Apr 2024 9:15 am

వనపర్తి జిల్లాలో .. అందుబాటులోకి రాని ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లు

వనపర్తి జిల్లాలో .. అందుబాటులోకి రాని ఇంటిగ్రేటెడ్​ మార్కెట్లు

v6 వెలుగు 25 Apr 2024 9:14 am

Revanth Reddy : నేడు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 25 Apr 2024 9:13 am

పార్టీ మారడంతో మున్సిపల్ చైర్మన్‌కు పదవి గండం

మున్సిపల్ చైర్మన్ పదవి బాధ్యతల నుంచి తప్పించాలని ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై పది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్‌కు అందజేశారు.

దిశా డైలీ 25 Apr 2024 9:12 am

AP : రాయ‌ల‌సీమ‌లో ఇవాళ ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ఉమ్మ‌డి ప్ర‌చారం

టీడీపీ ఛీఫ్‌ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ‌ ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. నేడు రాయలసీమలో ఇద్ద‌రు నేత‌లు పర్యటించనున్నారు. ఇద్దరూ ప్రజాగళం సభలో పాల్గొని ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో… ఈరోజు ఇద్దరూ కలసి రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో జరగనున్న ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఈ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నేతలు పూర్తి చేశారు. గత కొద్ది రోజులుగా ఇద్దరు కలసి […]

ప్రభ న్యూస్ 25 Apr 2024 9:10 am

స్టార్స్ లేకున్నా..స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో

స్టార్స్ లేకున్నా..స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో

v6 వెలుగు 25 Apr 2024 9:10 am

కోతలు విధిస్తే మిల్లర్లపై చర్యలు.. సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ చౌహాన్‌‌‌‌

కోతలు విధిస్తే మిల్లర్లపై చర్యలు.. సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ చౌహాన్‌‌‌‌

v6 వెలుగు 25 Apr 2024 9:08 am

నేను ఆ హీరోని బ్రదర్ గా ఫీల్ అవుతున్న..అందుకే అతనితో ఆ పని చేయలేను

సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్ ఏ హీరోను కూడా బ్రదర్ గా ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఏ హీరోతో ఎప్పుడు ఎలాంటి రోల్స్ చేయాల్సి వస్తుందో తెలియదు కాబట్టి.

దిశా డైలీ 25 Apr 2024 9:07 am

Amit Shah : నేడు తెలంగాణకు అమిత్ షా రాక

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు

తెలుగు పోస్ట్ 25 Apr 2024 9:05 am

ఏప్రిల్ 26న సెకండ్ ఫేజ్ పోలింగ్

ఏప్రిల్ 26న సెకండ్ ఫేజ్ పోలింగ్

v6 వెలుగు 25 Apr 2024 9:04 am

నకిలీ పేపర్లతో ఇంటి స్థలాన్ని కాజేసిన..12 మందిపై కేసు

నకిలీ పేపర్లతో ఇంటి స్థలాన్ని కాజేసిన..12 మందిపై కేసు

v6 వెలుగు 25 Apr 2024 9:04 am

వైశాఖ మాసం మొదలైంది.. ఈ రాశులవారి పంట పండనుంది.. మీరున్నారా?

చైత్రమాసం ఏప్రిల్ 23న ముగిసి వైశాఖ మాసం మొదలైంది

దిశా డైలీ 25 Apr 2024 9:01 am

హైదరాబాద్‌కు ఎదురుందా?

నేడు ఉప్పల్‌లో బెంగళూరుతో పోరు మన తెలంగాణ/ హైదరాబాద్: వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ తన చివరి నాలుగు మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. సొంత గడ్డపై జరుగుతున్న పోరులో హైదరాబాద్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అంతేగాక బెంగళూరును వారి […]

మన తెలంగాణ 25 Apr 2024 9:01 am

SRH Vs RCB : క్రికెట్ లవర్స్‌కు TSRTC గుడ్ న్యూస్

హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ జరగనుంది.

దిశా డైలీ 25 Apr 2024 8:59 am

కవిత నిర్దోషి అయితే బెయిల్ ఎందుకు రాలె?: అనురాగ్ సింగ్ ఠాకూర్

కవిత నిర్దోషి అయితే బెయిల్ ఎందుకు రాలె?: అనురాగ్ సింగ్ ఠాకూర్

v6 వెలుగు 25 Apr 2024 8:59 am

Alert: ఏపీ విద్యార్థులకు జూన్ రెండు వరకే ఆ అవకాశం.. తెలంగాణ విద్యాశాఖ..

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన విషయం తెలిసిందే.

దిశా డైలీ 25 Apr 2024 8:58 am

Mumbai: సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు కూలీలు మృతి

ముంబైలో 40 అడుగుల లోతున్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. కార్మికులు మురుగు కాలువను శుభ్రం చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణ స్థలంలో మురుగు కాలువను శుభ్రం చేస్తుండగా ముగ్గురు కూలీలు దాదాపు 40 అడుగుల లోతున్న ట్యాంకులో పడిపోయారు. ఈ సంఘటన ముంబైలోని మలాడ్ వెస్ట్ దిండోషి ప్రాంతంలో జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, బీఎంసీ అధికారులు ఘటనా స్థలానికి […]

ప్రభ న్యూస్ 25 Apr 2024 8:57 am

కేటీఆర్ కంటే లోకేష్ బాగా రిచ్ ... ఎవరి ఆస్తిపాస్తులు ఎంతో తెలుసా? 

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి, తెలంగాాణలో బిఆర్ఎస్ అధికారంలో వచ్చాయి. అక్కడ చంద్రబాబు సీఎం, లోకేష్ మంత్రి కాగా ఇక్కడ కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారు. ప్రస్తుతం మాజీ సీఎంల తనయులు, కాబోయే ముఖ్యమంత్రులుగా ప్రచారంలో వున్న లోకేష్, కేటీఆర్ ఆస్తిపాస్తులను పోలిస్తే... ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ హడావిడి సాగుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇలా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా నామినేషన్లు వేసారు. ఈ క్రమంలో వారి ఆస్తిపాస్తుల వివరాలు బయటకు వచ్చాయి. వీరి ఆదాయం, ఆస్తులు, అప్పుల వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే క్రమంలో పొరుగున వున్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో మాజీ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ఆస్తిపాస్తుల వివరాలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఏపీలో చంద్రబాబు, లోకేష్ లాగే తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రి, ఐటీ మంత్రిగా పనిచేసారు. కాబట్టి ప్రధాన పార్టీల అధినేతలు, మాజీ ముఖ్యమంత్రుల తనయులైన కేటీఆర్-లోకేష్ ల ఆస్తిపాస్తులు, ఆదాయం, అప్పులు ఎలా వున్నాయో పోల్చి చూద్దాం నారా లోకేష్ : ముందుగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మళ్లీ ఆయన మంగళగిరి అసెంబ్లీలోనే పోటీ చేస్తున్నారు. ఇప్పటికే తన నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేసుకుంటున్న ఆయన నామినేషన్ కూడా దాఖలుచేసారు. ఈ నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తిపాస్తులను పేర్కొన్నారు. అలాగే భార్య బ్రాహ్మణి పేరిట వున్న ఆస్తుల వివరాలను కూడా లోకేష్ వెల్లడించారు. లోకేష్ తో పాటు భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ.523 కోట్లుగా ప్రకటించారు. లోకేష్ ఆదాయం రూ.1,41,64,363 గా వుంది. ఆయన పేరిట వున్న స్థిరాస్తుల విలువ రూ.92,31,09,546 కాగా చరాస్తుల విలువ రూ.341,68,22,459 గా వుంది. ఇక లోకేష్ అప్పుల విషయానికి వస్తే రూ.3,48,81,937 కోట్టుగా పేర్కొన్నాడు. ఇక లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఆదాయం భర్త కంటే ఎక్కువగా రూ.7,57,04,812 కోట్లుగా వుంది. స్థిరాస్తులు రూ.35,59,21,125 కోట్లు కాగా చరాస్తులు రూ.45,06,30,277 కోట్లుగా వున్నాయి. ఆమె అప్పులు రూ.14,34,37,042 కోట్లుగా వున్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే బ్రాహ్మణి తన తల్లి వసుంధర నుండి రూ.42 లక్షలు, తండ్రి బాలకృష్ణ నుండి రూ.16 లక్షలు, అత్త భువనేశ్వరి నుండి 10 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇవి కాకుండా బ్రాహ్మణి వద్ద రూ.2500 గ్రాముల బంగారం (కోటి రూపాయల విలువు), మరో కోటిన్నర రూపాయల విలువైన డైమండ్స్, రత్నాలతో కూడిన ఆభరణాలు వున్నాయి. కొడుకు దేవాన్ష్ తో కలిపి హైదరాబాద్ లోని ఓ వాణిజ్య భవనంలో 50 శాతం వాటాను బ్రాహ్మణి కలిగివున్నారు. ఇలా నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులకు హెరిటేజ్ ఫుడ్స్, రిలయన్స్ లో షేర్లు వున్నాయి. బ్రాహ్మణి పేరిట మాదాపూర్ కొంత భూమి, రంగారెడ్డి వ్యవసాయ భూమి, చెన్నైలో వాణిజ్య భవనం వుంది. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మాజీ మంత్రి. ఆయన హయాంలోనే హైదరాబాద్ లో ఐటీ బాగా అభివృద్ది చెందిందని ... అందువల్లే రాష్ట్రవ్యాప్తంగా ఓడినా హైదరాబాద్ లో మాత్రం బిఆర్ఎస్ గెలిచిందని ఆ పార్టీ నాయకులు చెబుతుంటారు. కేటీఆర్ 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సిరిసిల్ల నుండే పోటీచేసి గెలిచారు. అయితే నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం కేటీఆర్ ఆస్తిపాస్తుల వివరాలిలా ఉన్నాయి. కేటీఆర్-శైలిమ దంపతుల పేరిట వున్న ఆస్తుల విలువు రూ.51 కోట్లు మాత్రమే.ఇందులోనూ శైలిమ పేరిట వున్న ఆస్తులే ఎక్కువ. కేటీఆర్ పేరిట రూ.6.92 కోట్ల చరాస్తులు మాత్రమే వున్నాయి. కేటీఆర్ బ్యాంక్ ఖాతాల్లోని డిపాజిట్లు, కొంత నగదు, టి న్యూస్ లో వాటా, బంగారం, వెండి విలువ ఇది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే కేటీఆర్ పేరిట రూ.17.83 కోట్ల విలువైనవి వున్నాయి. కేటీఆర్ కు రూ.11.89 కోట్ల అప్పులు కూడా వున్నాయి. ఇక శైలిమ చరాస్తుల విలువు భర్త కేటీఆర్ కంటే ఎక్కువగా వుంది. ఆమెకు రూ.26.49 కోట్ల విలువైన చరాస్తులు వున్నాయి. నగదు, డిపాజిట్లు, ఈటిజి గ్లోబల్ సర్వీసెస్ లో షేర్లు, ఎట్ హోం హాస్పిటాలిటీలో వాటాతో పాటు గోల్డ్ బాండ్లు వున్నారు.

ఆసియ నెట్ న్యూస్ 25 Apr 2024 8:56 am

IPL 2024 : కసి అంటే ఈ జట్టుదే మరి.. లక్ ను నమ్ముకోకుండా పెర్‌ఫార్మెన్స్‌ను నమ్ముకుంటూ

ఢిల్లీ కాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.

తెలుగు పోస్ట్ 25 Apr 2024 8:56 am

జేడీయూ యువనేత దారుణ హత్య: బిహార్‌లో ఉద్రిక్తత

లోక్ సభ ఎన్నికల వేళ బిహార్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం నితీశ్ కుమార్‌కి చెందిన పార్టీ జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) యువనేత హత్యకు గురయ్యాడు.

దిశా డైలీ 25 Apr 2024 8:55 am

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో.. ములుగు టాప్, కామారెడ్డి లాస్ట్

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో.. ములుగు టాప్, కామారెడ్డి లాస్ట్

v6 వెలుగు 25 Apr 2024 8:54 am

అమ్మాయిలు ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏం చేస్తారో తెలుసా?

కొందరు అమ్మాయిలు చాలా సంతోషంగా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలనుకుంటే మరికొందరు మాత్రం మూడీగా, ఏదో కోల్పోయినట్లు ఉంటారు. అంతే కాకుండా కొందరు మాత్రం ఇంట్లో ఒకరే ఉండటానికి ఇష్టపడతారు

దిశా డైలీ 25 Apr 2024 8:51 am

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

v6 వెలుగు 25 Apr 2024 8:50 am

వేణు స్వామి చెప్పిందే నిజమా..వరుణ్, లావణ్యలను విడగొట్టడానికి అలా ట్రై చేస్తున్న మెగా లేడీ ఈమేనా?

ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న న్యూస్ ఏదైనా ఉన్నదా అంటే అది లావణ్య, వరుణ్ తేజ్ విడాకుల వార్తనే. సెలబ్రిటీస్, రాజకీయ నాయకుల జీవితాలకు సంబంధించిన జాతకాలు చెప్పడంలో వేణుస్వామి

దిశా డైలీ 25 Apr 2024 8:46 am

నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్

నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్

v6 వెలుగు 25 Apr 2024 8:45 am

వర్ధన్నపేటలో బైక్ ఢీకొట్టిన బస్సు… 50 మీటర్ల దూరంలో పడిన నాలుగు మృతదేహాలు

వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైక్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో నలుగురు యువకులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. అతివేగంగా వచ్చి రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో 50 మీటర్ల దూరంలో మృతదేహాలు పడిపోయాయి. ఇల్లందు గ్రామానికి చెందిన వరుణ్ తేజ్, సిద్దు, అనిల్ కుమార్, వర్ధన్నపేటకు చెందిన గణేశ్‌లు కలిసి ఒకే బైక్‌పై ఇల్లందు […]

మన తెలంగాణ 25 Apr 2024 8:43 am

పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్త: హరీశ్ రావు

పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్త: హరీశ్ రావు

v6 వెలుగు 25 Apr 2024 8:40 am

Last day: ఇవాళ్టితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది.సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటి వరకు మొత్తం 478 మంది అభ్యర్థులు, 554 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.. ఇక, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా జరుగుతోన్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆ స్థానంలో 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణకు డెడ్‌లైన్‌ ఉండగా.. రేపు నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 29 […]

ప్రభ న్యూస్ 25 Apr 2024 8:38 am

మానసికంగా అలసిపోయా, నన్ను ఘాడంగా ప్రేమించే వ్యక్తి కావాలి.. షాకిస్తున్న ఇలియానా ఎమోషనల్ కామెంట్స్

ప్రస్తుతం కొడుకు, భర్తతో హ్యాపీగా ఉన్న సమయంలో ఇలియానా చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఇలియానా గురించి పరిచయం అవసరం లేదు. దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరితో యువత కలల రాణిగా మారిపోయింది. పోకిరి తర్వాత ఇలియానా టాలీవుడ్ లో సునామి సృష్టించింది అనే చెప్పాలి. స్టార్ హీరోలతో కలసి ఆడిపాడింది. అయితే కెరీర్ బాగానే సాగుతున్నటైంలో బాలీవుడ్ లో వెళ్లి రాణించాలని భావించడం ఇలియానా చేసిన తప్పు. ఫలితంగా ఇలియానా కెరీర్ డౌన్ ఫాల్ అయింది. ఆమెకంటేముందు వచ్చిన త్రిష, శ్రీయ లాంటి హీరోయిన్లు ఇప్పటికీ రాణిస్తున్నారు. కానీ ఇలియానా టాలీవుడ్ ని వదిలి వెళ్లడంతో ఆమెనిబాలీవుడ్ లో ఎవరూ పట్టించుకోలేదు. ఇలియానా లవ్ ఎఫైర్స్ కు సంచలనం సృష్టించాయి. బ్రేకప్ ల వల్ల ఆమె మానసికంగా కుంగిపోయిన సంగతి తెలిసిందే. గతంలో ఇలియానా ఓ ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ని ప్రేమించింది. వాళ్ళిద్దరి ప్రేమ బ్రేకప్ కావడంతో ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్ళింది. డిప్రెషన్ నుంచి తిరిగి కోలుకున్న ఇలియానా మరో వ్యక్తిని ప్రేమించి ఓ బిడ్డకి తల్లి కూడా అయింది. ప్రస్తుతం కొడుకు, భర్తతో హ్యాపీగా ఉన్న సమయంలో ఇలియానా చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలియానా అప్పుడప్పుడూ ఆఫర్స్ అందుకుంటూ సినిమాల్లో నటిస్తోంది. ఇలియానా నటించిన లేటెస్ట్ మూవీ దో ఔర్ దో ప్యార్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఇలియానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలోఇలియానా నోరా అనే పాత్రలో నటించింది. ఈ పాత్ర తన రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుందట. నోరా లాగే నేను కూడా చాలా సెన్సిటివ్ అని ఇలియానా పేర్కొంది. నన్ను ఘాడంగా ప్రేమించే వ్యక్తి ఉండాలని చాలా సార్లు కోరుకున్నా. నన్ను ప్రేమించే వ్యక్తిని పబ్లిక్ గా హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం, బాగా నమ్మడం లాంటివి పబ్లిక్ లో చేయడానికి నేను వెనుకాడను అని ఇలియానా తెలిపింది. ఈ చిత్ర దర్శకురాలు శిరీష కథ చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నా. ఎందుకంటే ఈ పాత్ర నా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంది. కాస్త నా పాత్రలో నెగిటివ్ కోణం ఉండడంతో నేను ఇంత తొందరగా ఒప్పుకుంటాననిదర్శకురాలి శిరీష అనుకోలేదు. ఈ పాత్ర కోసం శారీరకంగా జిమ్ వర్కౌట్స్ లాంటివి చేయాలని దర్శకురాలు అడుగుతుందేమోఅని భయపడ్డా. ఎందుకంటే నేను ఇప్పుడు మానసికంగా అలసిపోయి ఉన్నాను. కాబట్టి వర్కౌట్స్ చేసినా బాడీని మార్చుకునేఓపిక నాకు లేదు. బరువు తగ్గడం నా వల్ల కాదు అని శిరీషకి చెప్పేశా. ఆమె స్టుపిడ్ లాగా మాట్లాడకు.. ఇప్పుడు నిన్ను బరువు తగ్గమని ఎవరు చెప్పారు.. నువ్వు ఎలా ఉన్నావో అలాగే కంటిన్యూ అవ్వు అని తనకి ధైర్యం చెప్పినట్లుఇలియానా గుర్తు చేసుకుంది. అయితే భర్త, కొడుకుతోహ్యాపీగా ఉన్న ఇలియానా ఎందుకు మానసికంగా అలసిపోయాను అంటూ స్టేట్మెంట్స్ఇస్తోందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అంత సమస్య ఇలియానాకి ఏమొచ్చిందనేడౌట్స్ మొదలయ్యాయి.

ఆసియ నెట్ న్యూస్ 25 Apr 2024 8:37 am

KCRకు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి గజ్వేల్ BRS టాప్ లీడర్స్

వలసలతో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నది.

దిశా డైలీ 25 Apr 2024 8:36 am

Gold Prices Today : మళ్లీ షాకిచ్చిన గోల్డ్ ధరలు.. వెండి ధరలు మాత్రం?

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

తెలుగు పోస్ట్ 25 Apr 2024 8:36 am

ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యామని ఆరుగురు స్టూడెంట్లు సూసైడ్‌

ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యామని ఆరుగురు స్టూడెంట్లు సూసైడ్‌

v6 వెలుగు 25 Apr 2024 8:36 am

ఔటర్ రింగు రోడ్డు పై ప్రమాదం.. కారులోనే ఒకరు సజీవ దహనం

ఇటీవల కాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

దిశా డైలీ 25 Apr 2024 8:34 am

పద్మారావు మంచోడే కానీ.. వాళ్ల గురువే పిట్టల దొర: సీఎం రేవంత్

పద్మారావు మంచోడే కానీ.. వాళ్ల గురువేపిట్టల దొర: సీఎం రేవంత్

v6 వెలుగు 25 Apr 2024 8:33 am

అగ్గిపెట్టె నుంచి అగర్‍బత్తి దాకా మోదీ జీఎస్టీ వేసిండు : సీఎం రేవంత్ రెడ్డి

అగ్గిపెట్టె నుంచి అగర్‍బత్తి దాకా మోదీ జీఎస్టీ వేసిండు : సీఎం రేవంత్ రెడ్డి

v6 వెలుగు 25 Apr 2024 8:30 am

నేడు కంటోన్మెంట్, చేవెళ్లలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

నేడు సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల లోక్‌సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

దిశా డైలీ 25 Apr 2024 8:28 am

ఇవాళ్టి నుంచి మేడిగడ్డపై జ్యుడీషియల్ కమిషన్ విచారణ

ఇవాళ్టి నుంచి మేడిగడ్డపై జ్యుడీషియల్ కమిషన్ విచారణ

v6 వెలుగు 25 Apr 2024 8:28 am