Bihar : బీహార్ లో నేడు తొలి విడత ఎన్నికలు
నేడు బీహార్ తొలి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ మూవీ.. ‘జటాధర’
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అర్ణు అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు వినుంటాం. ‘బ్యాంకులు లేని సమయంలో ధనాన్ని భూమిలో పాతి ఒక బంధనం వేసి దానికి ఒక పిశాచి కాపలాగా ఉంటుంది’ అని ప్రచారంలో ఒక కథ ఉండేది. ఈ కథకు అలాంటి ఒక జానపదం ఆధారం. అలాంటి కథని ఈ కాలంలోకి వచ్చి తీసుకొచ్చి చాలా ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో -దెయ్యం, కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, శివుడు గురించి కథలు... ఇలా చాలా లేయర్స్ వున్నాయి. అరుణాచల ప్రస్తావన కూడా వుంది. యాక్షన్, ఫ్యామిలీ, మైథలాజి... అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా ఇది. -ఈ సినిమాలో ఘోస్ట్ హంటర్గా కనిపిస్తా. అయితే తనకి దెయ్యాలు ఉన్నాయంటే నమ్మకం వుండదు. దేవునిపై నమ్మకం వుంటుంది. సైన్స్ ని నమ్ముతాను. అలా ఎందుకనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా వుంటుంది. బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ సినిమా ఇది. సోనాక్షి చాలా అద్భుతమైన నటి. సినిమాలో ధనపిశాచి పాత్రలో తన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. -శిల్పా శిరోద్కర్ శోభ అనే పాత్రలో కనిపిస్తారు. అద్భుతంగా నటించారు. ఇక నెక్స్ రాహుల్ రవీంద్రన్ తో ఒక సినిమా వుంది. ఇప్పుటి వరకు అలాంటి కాన్సెప్ట్ వరల్డ్ సినిమాల్లో రాలేదు. కాన్సెప్ట్ పరంగా అది ఒక బాహుబలి లాంటి సినిమా. అలాగే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేయాలి” అని అన్నారు.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన
గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు..
గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు.. ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే
నేడు బీహార్ లో పోలింగ్.. బీహార్ లో ఈరోజు తొలి విడతగా 121
ఈసారి 121 స్థానాలలో ఓటు ఎన్డిఎ, ఇండియా కూటమి హోరాహోరీ గంగా దక్షిణ ప్రాంతపు 18 జిల్లాల్లో బ్యాలెట్ సిఎం అభ్యర్థి తేజస్వీకి కీలక పరీక్ష పాట్నా: ఎన్డిఎ, ఇండియా కూటమి మహాఘట్బంధన్ నడుమ తీవ్ర ఉత్కంఠతను రేపే బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నేడు ( గురువారం) జరుగుతుంది. ఈ తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలలో అర్హులైన ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కు వినియోగించుకోనున్నారు. ఈ దఫా గంగా దక్షిణ ప్రాంతంలో విస్తరించుకుని ఉండే ఈ పోలింగ్లో ఇంతకు ముందటి ఫలితాల క్రమంలో మహాఘట్బంధన్కు ఆధిక్యత అవకాశం ఉంది. అయితే ఈసారి ఇక్కడ ఎన్డిఎ అతిరధ మహారధులు ప్రత్యేకించి మోడీ, అమిత్ షాలు తమ దృష్టిని కేంద్రీకరించారు. దీనితో ఓటు ఫలితం ఎటువైపు అనేది తేలాల్సి ఉంది. ఇక్కడ పలు రాజకీలక సమీకరణలు, సామాజిక పరిస్థితులు గెలుపోటములను ఖరారు చేస్తాయి. ఈ ప్రాంతంలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర పార్టీల కలయిక అయిన మహాఘట్బంధన్ మొత్తం 121 స్థానాలకు 63 గెల్చుకుని తిరుగులేదన్పించుకుంది. ఇప్పుడు ఇండియా కూటమి గా సాగుతోన్న పోరులో జయాపజయాలు ఇండియా కూటమి ఉనికికి , బలోపేతానికి అగ్నిపరీక్ష కానున్నాయి. ఈ ప్రాంతంలో ఇంతకు ముందు బిజెపి, జెడియుల ఎన్డిఎ 55 స్థానాల్లో గెలిచింది. ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రచార సభలలో ప్రధాని మోడీ తన వెంట జెడియు నేత లలన్ సింగ్ ఉండగా బీహారీల ఓట్ల కోసం అభ్యర్థించారు. నితీశ్కుమార్ ఎక్కువగా సభలకు రాలేదు. దీని ప్రభావం ఏమిటనేది ఈ విడత పోలింగ్తో తెలుస్తుంది. ఇండియా కూటమి తరఫున స్థానిక ప్రజలను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇమేజ్ కీలకం కానుంది. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్లో ఓటు చోరీ నిరసన యాత్ర సాగించడం, జాలర్లతో కలిసి ఈత కొట్టడం, ఇతర ప్రజాకర్షక పద్థతులకు దిగడం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఓటు ఫలం ఎటు అనేది తేలాల్సి ఉంటుంది. అయితే ప్రచార దశలో ఆయన ఎక్కువగా పాల్గొనలేదు. కొంత కాలం అమెరికా ఇతర దేశాల పర్యటనలోనే గడిపారు. రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ కూడా ఈ సారి రంగంలోకి దిగింది. ఆయన పోటీ చేయడం లేదు. అయితే తమ పార్టీ ఈ ఎన్నికలలో గణనీయ శక్తి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో హైదరాబాద్ ఎంపి , మజ్లిస్ నేత అసదుద్దిన్ తమ పార్టీ తరఫున అభ్యర్థులను దింపారు. ఇవి ఇండియా కూటమి ఓట్లను చీలుస్తాయనే ఆందోళన సంబంధిత పార్టీల నేతలలో ఉంది. ఈసారి పోలింగ్లో నితీశ్ కుమార్ కేబినెట్లోని 16 మంది మంత్రుల భవితవ్యం తేలాల్సి ఉంది. ప్రత్యేకించి రాఘోపూర్,మహూవా , ఛాప్రాల్లో పోటీ నువ్వానేనాగా ఉంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలలో ఇప్పుడు జరిగే తొలి విడత పోలింగ్ 18 జిల్లాలకు విస్తరించుకుని ఉంది. ఈసారి పోలింగ్లో తేజస్వీ యాదవ్ , సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత సామ్రాట్ చౌదరి, గాయకులు మైధిలీ ఠాకూర్ వంటి వారు ప్రముఖులుగా ఉన్నారు. ఇండియా కూటమి తరఫు సిఎం అభ్యర్థి తేజస్వీ రఘోపూర్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పాట్నా సాహిబూ, బెగూసరాయ్. ఛాప్రా వంటి స్థానాలు ప్రధాన పోటీ కేంద్రాలు అయ్యాయి.
సామాజిక, మానవ అభివృద్ధిలో రికార్డు సాధిస్తున్న ‘దేవభూమి’ కేరళ, తీవ్రమైన పేదరికం నుంచి విముక్తి పొందినట్టు 69వ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబరు 1న రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించడం దేశానికే ఆదర్శాన్ని చాటుతోంది. తమ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు రూ. 1000 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ఇదే సాఫల్యమైన కేరళ అసలు స్టోరీగా అభివర్ణించారు. అనేక రంగాల్లో కేరళ అభివృద్ధి సాధించడం ద్వారా ‘కేరళ మోడల్’ అన్న పేరు బాగా ప్రసిద్ధి చెందిందన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. పినరయి విజయన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మదాం నియోజకవర్గం ఇప్పటికే దేశం లో, పేదరిక రహిత నియోజకవర్గంగా ప్రకటించబడడం గమనార్హం. పేదరిక కుటుంబాలను గుర్తించడంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. వివిధ ఏజెన్సీల సహకారంతో ప్రణాళిక రూపొందించింది. స్థానిక స్వపరిపాలన శాఖ నేతృత్వంలో సామాజిక భాగస్వామ్యానికి ప్రణాళికలో చోటు కల్పించింది. 2021 మేలో రాష్ట్ర ఎల్డిఎఫ్ ప్రభుత్వం అత్యంత పేదరిక నిర్మూలన కార్యక్రమం (ఎక్స్ట్రీమ్ పోవెర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఇపిఇపి) ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు ఇటీవల సవరించిన అంతర్జాతీయ దారిద్య్రరేఖ ప్రకారం రోజుకు మూడు అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఖర్చుతో జీవించే వ్యక్తులను తీవ్ర పేదరికంతో ఉన్నట్టు పరిగణిస్తారు. ఈ లెక్కన కేరళ ప్రభుత్వం ప్రజా కేంద్రీకృత అభివృద్ధి, వికేంద్రీకృత ప్రణాళికతో పేదరికాన్ని తగ్గించగలిగింది. 1973 74లో 59.8% వరకు ఉన్న పేదరికం 201112 నాటికి 11.3 శాతానికి తగ్గింది. నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవెర్టీ ఇండెక్స్ 2023లో దేశం మొత్తం మీద అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంగా సూచించింది. కేరళ జనాభాలో కేవలం 0.55 శాతం మంది మాత్రమే బహుముఖ పేదరికంలో ఉన్నారని స్పష్టం చేసింది. ఇది జాతీయ తలసరి పేదరికం 14.96% కన్నా చాలా తక్కువ. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలను గుర్తించడంలో పూర్తిగా స్వీయ నమోదుపై ఆధారపడకుండా ప్రత్యేకంగా దాదాపు 4 లక్షల ఎన్యూమరేటర్లను నియమించింది. వీరికి స్థానిక పాలనా సంస్థలతోపాటు కుడుంబశ్రీ వర్కర్ల సహాయం కూడా అందించింది. అనేక స్థాయిల్లో మధింపు జరిగిన తరువాత 64,006 అతి పేద కుటుంబాలకు చెందిన 1,03,099 మంది పేదలను గుర్తించింది. వీరిలో చాలా మందికి కనీస ధ్రువీకరణ పత్రాలు లేవు. నాలుగు అంశాల ఆధారంగా వీరి పేదరికాన్ని గుర్తించారు. వారు తింటున్న ఆహారం, ఆరోగ్య ప్రమాణాలు, ఉండడానికి ఇల్లు ఉందా లేదా, వారి చదువు తదితర వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కుటుంబాల్లో చాలా మందికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా లేవు. 21,263 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ అందేలా చేశారు. 4000 కుటుంబాలకు 5422 ఇళ్లు కట్టించి ఇచ్చారు. మరో 5522 ఇళ్లను తిరిగి నిర్మించారు. 1500 కుటుంబాలకు సాగుభూమి అందించారు. శిథిల స్థితిలో ఉన్న ఇళ్లల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ. 2 లక్షల వంతున సహాయం అందించారు. పేదరికం నుంచి ఒకసారి విముక్తి కల్పించడమంటే అన్ని సమస్యలు వారికి వెంటనే పరిష్కారమైనట్టు కాదు. పేదరికాన్ని ఎదుర్కోవడం ఎప్పటికీ అంతం కాని పని. రాష్ట్రప్రభుత్వం తీవ్ర పేదరిక నిర్మూలన ఆదర్శనీయమైన పద్ధతిలో కొనసాగించడంలో అసలు ఉద్దేశం కటిక పేదరికం మళ్లీ ఏర్పడకూడదని, కొత్తగా ఏ కుటుంబం పేదరికంలో పడకూడదని.. పేదరికం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికే ఎల్డిఎఫ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్య, ఆరోగ్య రంగాల్లోనూ స్థానిక ప్రభుత్వాలు గట్టిగా కృషి చేస్తున్నాయి. 2025 నాటికి కేరళలో అక్షరాస్యత 96 శాతం చేరుకుంది. ఆరోగ్య భద్రత విషయాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో 5415 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మహిళల ప్రసూతి సమయంలో శిశుమరణాల సంఖ్య జాతీయ స్థాయిలో ప్రతివెయ్యి కాన్పులకి 28 వరకు ఉండగా, కేరళలో వెయ్యి కాన్పులకు 5 మాత్రమే ఉండటం గమనార్హం. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో భారీ పరిశ్రమలు అంటూ లేవు. అయినా మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి సూచికల్లో అగ్రగామిగానే కేరళ ఉంటోంది. పేదరిక నిర్మూలన నిరంతర కార్యక్రమమని, 2026 మార్చి నాటికి పేదరికం 0.002 శాతానికి చేరేలా ప్రయత్నిస్తామని రాష్ట్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. అయితే కేరళ నమూనాను విమర్శించేవారు కూడా ఉన్నారు. అభివృద్ధి విషయంలో స్తబ్ధత నెలకొందని, నిరుద్యోగం పెరుగుతోందని ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు సాక్షాలన్న విమర్శలు వస్తున్నాయి. పేదరిక నిర్మూలన గణాంకాలు ఉత్త బోగస్ అని కాంగ్రెస్ నేతృత్వం లోని విపక్షం ఆక్షేపిస్తోంది. ఈ విమర్శలను సవాలుగా తీసుకొని ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను, సాంకేతిక హరిత ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. నిరుద్యోగాన్ని తొలగించడానికి విద్యావంతులకు నైపుణ్యాభివృద్ధిని చేపట్టింది. దేనికీ రాజీపడని ప్రగతిశీల పరిపాలన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ రెండిటినీ సమతుల్యం చేసుకోగలదని ‘ఇపిఇపి’ నిరూపిస్తోంది. సమాజం నడిపించే ఈ నమూనా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కేరళ స్టోరీ దేశం మొత్తంమీద ఆదర్శవంతమే కాక, విస్తృతంగా అనుసరించేలా ప్రచారం చేయదగిందనే చెప్పవచ్చు.
నేడు భారత్, ఆస్ట్రేలియా నాలుగో టి20.. ఇరు జట్లకు కీలకం
క్వీన్స్లాండ్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం క్వీన్స్లాండ్ వేదికగా కీలకమైన నాలుగో టి20 మ్యాచ్ జరుగనుంది. తొలి టి20 వర్షార్పణం అయ్యింది. రెండో పోటీలో ఆస్ట్రేలియా, మూడో టి20లో టీమిండియా జయకేతనం ఎగుర వేశాయి. దీంతో ప్రస్తుతం సిరీస్ 11తో సమంగా ఉంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు సిరీస్లో ఆధిక్యంలోకి దూసుకెళుతోంది. ఇలాంటి స్థితిలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. కిందటి టి20లో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియా ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులో గెలిచి సిరీస్లో పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉంది. ఆతిథ్య టీమ్ ఆస్ట్రేలియా కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇరు జట్లలోనూప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు రెండు జట్లలోనూ ఉన్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఓపెనర్లే కీలకం.. ఈ మ్యాచ్లో టీమిండియాకు ఓపెనర్లు కీలకంగా మారారు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మలు జట్టుకు శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. వన్డే సిరీస్తో పాటు ఇప్పటి వరకు ఆడిన రెండు టి20 మ్యాచుల్లోనూ గిల్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్ను కనబరచలేక పోయాడు. కీలకమైన ఈ మ్యాచ్లోనైనా అతను తన బ్యాట్కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. గిల్ వరుస వైఫల్యాలు జట్టును కలవరానికి గురి చేస్తోంది. అభిషేక్ రెండో టి20లో అద్భుత బ్యాటింగ్ను కనబరిచాడు. మూడో టి20లో బాగానే ఆడినా భారీ స్కోరును అందుకోలేక పోయాడు. ఈసారి మాత్రం ఆ లోటును తీర్చుకోవాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్లో వాషింగ్టన్ విధ్వంసక ఇన్నింగ్స్తో భారత్కు విజయం సాధించి పెట్టాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. జితేశ్ కూడా బ్యాట్ను ఝులిపించేందుకు సిద్ధమయ్యాడు. తిలక్వర్మ, సూర్యకుమార్లు కూడా తమవంతు పాత్ర పోషిస్తే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. మరోవైపు అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్ తదితరులతో భారత బౌలింగ్ కూడా బలంగానే ఉంది. రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. గెలుపే లక్షంగా.. మరోవైపు కిందటి మ్యాచ్లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా ఎలాగైనా భారత్ను ఓడించాలనే లక్షంతో కనిపిస్తోంది. కిందటి మ్యాచ్లో భారీ స్కోరు సాధించినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుకు సాగాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా సమతూకంగా ఉంది. కానీ కీలక ఆటగాళ్ల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. మూడో టి20లో టిమ్ డేవిడ్, స్టోయినిస్, మాథ్యూ షార్ట్ తప్ప మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో మాత్రం కీలక ఆటగాళ్లు బ్యాట్ను ఝులిపించాలనే కసితో ఉన్నారు. హెడ్, మార్ష్, ఇంగ్లిస్, డేవిడ్, ఓవెన్, స్టోయినిస్, షార్ట్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆస్ట్రేలియాతో పోరు భారత్ అంత తేలికేం కాదనే చెప్పాలి.
ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు..
ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు.. భద్రతా ప్రమాణాల పరిశీలన పాటించకపోతే కఠిన
న్యూయార్క్ : అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేడు ఎదురు దెబ్బ తిన్నారు. షాక్ కు గురయ్యారు. భారతీయ సంతతికి చెందిన ముగ్గురు ముస్లిం డెమోక్రాట్లు జోహ్రాన్ మమ్దానీ, అఫ్తాబ్ పురేవాల్, గజాలా హష్మి ఆయనకు తొలి రాజకీయ ఓటమిని చవిచూపారు. రాజకీయ కాక పుట్టించి, న్యూయార్క్ నగరం, సిన్సినాటి, వర్జీనియాలో అధికవోట్లను అగ్రశ్రేణి డెమోక్రాట్లు - జోహ్రాన్ మమ్దానీ, అఫ్తాబ్ పురేవాల్, గజాలా హష్మి గెలుచుకున్నారు. న్యూయార్క్ నగర మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ భారతీయ - అమెరికన్ తల్లి మీరా నాయర్ దంపతుల బిడ్డ. కాగా వర్జీనియా లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నికైన గజాలా హష్మీ భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలోని మలకపేట కు చెందిన వారు కావడం విశేషం. ఇక అఫ్తాబ్ పురేవాల్ తండ్రి పంజాబీ, తల్లి టిబెటన్ కు చెందిన వారు. జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ భారతీయ ప్రముఖ చిత్ర నిర్మాత, అతని తండ్రి మహ్మద్ మమ్దానీ పూర్వీకులు గుజరాత్ కు చెందిన వారే. మహ్మద్ మమ్దానీ ప్రముఖ రచయిత, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ ప్రొఫెసర్. న్యూయార్క్ నగర మేయర్ గా ఎన్నికైన తొలి ముస్లిం గా, భారతీయ సంతతి వ్యక్తిగా జోహ్రాన్ కొత్త రికార్డు సృష్టించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలతో సహా పలు ఎన్నికల్లో డెమోక్రాట్స్ కు వరుసగా ఓటమి ఎదుర్కొంటున్న సమయంలో ఈ విజయాలు కొత్త జీవం పోశాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఎన్నికల రేస్ లో వ్యక్తిగతంగా లేకపోయినా, ఆయన ప్రభావం, నిర్ణయాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. న్యూయార్క్ లో జహ్రానీ మమ్దానీ చేతిలో ఓడిపోయిన ఇండి పెండెంట్ అభ్యర్థి ఆండ్రూ క్యూమోను ప్రెసిడెంట్ ట్రంప్ సమర్థించారు. ఆయన న్యూయార్క్ మాజీ గవర్నర్ కూడా. ఒక దశలో ట్రంప్ మమ్దానీ మేయర్ గా గెలిస్తే, ఫెడరల్ నిధులను నిలిపివేస్తామని బెదిరించారు కూడా. ఇక వర్జీనియాలో 61 ఏళ్ల గజాలా హష్మి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికల్లో గెలిచి మరో చరిత్ర సృష్టించారు. ఆ పదవికి ఎన్నికైన భారతీయ -అమెరికన్, మొదటి ముస్లిం మహిళ కూడా. హష్మి రిపబ్లికన్ పార్టీకి చెందిన జాన్ రీడ్ పై విజయం సాధించారు. సిన్సినాటి మేయర్ గా ఎన్నికైన అఫ్తాబ్ పూరేవాలా ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి కోరీ బౌమాన్ ను ఓడించి రెండోసారి ఆ పదవి చేపట్టారు. కోరీ బౌమాన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ సవతి సోదరుడు. ట్రంప్ సన్నిహితుడు. ఈ ఎన్నికలు ట్రంప్ పనితీరు పట్ల మెజారిటీ ఓటర్ల అసంతృప్తికి అద్దం పడుతున్నాయి. వర్జీనియా తో సహా చాలా స్టేట్ లలో సగం కంటే ఎక్కువమంది ఓటర్లు తమ ఓటుతో ట్రంబ్ కు ఘాటైన మెసేజ్ పంపారని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు, సుంకాలు వలస విధానాలను ఓటర్లు తిరస్కరిస్తున్నట్లు కన్పిస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతీయ మూలాలు ఉన్న ముగ్గురు ముస్లిం అభ్యర్థులు ముఖ్యంగా డెమోక్రాట్లు రిపబ్లికన్ పార్టీ జోరుకు బ్రేక్ వేశారు. ఇది 2026 మధ్యంతర, 2028 ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఆధిక్యానికి ఏ విధంగా దెబ్బకొడుతుందో చూడాలి.. జోహ్రాన్ మమ్దానీ జనవరి 1న న్యూయార్క్ మేయర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్న జోహ్రాన్ మమ్దానీ తల్లిదండ్రులు భారతదేశంలో మూలాలు కలిగిన వారు. మమ్దానీ ఉగాండాలోని కంపాలా లో జన్మించారు.ఆయన బాల్యం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో సాగినా, 7 ఏళ్ల వయస్సులో న్యూయార్క్ నగరానికి చేరారు. కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు 2018 లో అమెరికన్ పౌరసత్వం పొందారు. మమ్దానీ భార్య రామా దువాజీ సిరియన్ - అమెరికన్ కళాకారిణి, ఈ ఏడాదే వారి వివాహం జరిగింది. న్యూయార్క్ లోని క్వీన్స్ లో కలిసి ఉంటున్నారు. 34 ఏళ్ల మమ్దానీ స్టేట్ అసెంబ్లీ సభ్యుడు డెమోక్రటిక్ సోషలిస్ట్. జూన్ లో డెమోక్రటిక్ ప్రైమరీలో ఆండ్రూ క్యూమోను ఓడించారు. గజాలా హష్మీ హైదరాబాదీయే గజాలా హష్మీ 1964లో హైదరాబాద్లో జన్మించారు. బాల్యంలో పాతబస్తీ ప్రాంతంలోని మలక్పేటలో తన అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించారు. ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పని చేశారు. నాలుగేళ్ల వయసులోనే తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా హష్మీ అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. అనంతరం అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్డీ పూర్తి చేసిన ఆమె తండ్రి ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పని చేసేవారు. చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్షిప్పులు, ప్రోత్సాహకాలు అందుకున్న గజాలా, జార్జియా సదరన్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ కోర్సు చదివారు. గజాలా హష్మి వర్జీనియాకు తొలి ఇండియన్ - అమెరికన్, ముస్లిం లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఆమె రిచ్మండ్ కు చెందిన రిపబ్లికన్ జాన్ రీడ్ ను ఓడించారు. హష్మి ప్రస్తుతం స్టేట్ సెనెటర్. సౌత్ రిచ్మండ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఓడించి వర్జీనియా రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. హష్మి 4 ఏళ్ల వయస్సులో తన కుటుంబంతో సహా భారతదేశం నుంచి అమెరికాకు చేరారు. ఆమె జార్జియా సదరన్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ బిఏ, ఎమోరీ యూనివర్సిటీ నుంచి పిహెచ్ డి పట్టా పొందారు. అఫ్తాబ్ పురేవాల్ భారతీయ సంతతికి చెందిన సిన్సినాటి మేయర్ అఫ్తాబ్ పురేవాల్ (43) గతంలో 2021లో నగరానికి తొలిసారి ఆసియా - అమెరికన్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు రెండో సారి మేయర్ గా ఎన్నికయ్యారు. పురేవాల్ తల్లిదండ్రులు ఒహియోకు వలస వచ్చిన వారు. ఆయన తండ్రి పంజాబ్ కు చెందిన వారు. పురేవాల్ కు చిన్ననాటి నుంచి రాజకీయాలంటే మక్కువ . విద్యార్థి దశలోనే నాయకుడిగా ఎదిగారు. సిన్సినాటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి పట్టాపొందిన పురేవాల్ 2008 లో వాషింగ్టన్ డిసి కి చేరుకుని అక్కడ ఓలా సంస్థలో పనిచేశారు. తర్వాత అమెరికా న్యాయశాఖలో అటార్ని ప్రత్యేక అసిస్టెంట్ గా పని చేశారు. 2016లో రాజకీయ కెరీర్ ప్రారంభించారు. మాజీ ప్రెసిడెంట్ ఒబామా శుభాకాంక్షలు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా డెమోక్రటిక్ విజేతలకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. వారి విజయం భవిష్యత్ లో డెమోక్రటిక్ పార్టీ విజయాలకు నాంది కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హష్మీకి సీఎం రేవంత్, కెటిఆర్ అభినందనలు వర్జీనియా గవర్నర్గా హైదరాబాదీ గజాలా హష్మీ - ఎన్నిక కావడం పట్ల సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ఆమె తొలి ముస్లిం మహిళగా రికార్డు పొందారని, అమెరికాలో గవర్నర్గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా హష్మీ రికార్డు సొంతం చేసుకున్నారని చెప్పారు. - అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు నేతలు సత్తా చాటారని, అందులో భాగంగా వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా డెమోక్రాట్ నాయకురాలు గజాలా హష్మీ ఘన విజయం సాధించారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2005 నుండి మహిళా సంక్షేమానికి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, పంచాయతీ రాజ్, పుర పాలక సంఘాల అధ్యక్ష స్థానాలలో రిజర్వే షన్లు కల్పించి, పాఠశాల విద్యార్థినులకు 9వ తరగతి నుండే ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసి, పిజి వరకు చదివే విద్యార్థినులకు వివిధ స్థాయిలలో లక్ష వరకు స్కాలర్షిప్ ఇచ్చి వారి మన్ననలు చూరగొన్నారు. మహా దళితులకు, 36 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన (ఇబిసి) వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 15శాతం ఓటు బ్యాంకును స్థిరపరచుకు న్నారు. బిజెపికి అగ్రవర్ణాలు తదితరులతో కలిసి దాదాపు 20% ఓట్లున్నాయి. అత్యంత వెనుకబడిన వర్గాలలోని 112 ఉపకులాల వారు 120 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయనున్నారు. 10వేల కంటే తక్కువ మెజారిటీతో పార్టీలు గెలిచిన స్థానాలు 50. హిల్సా నియోజక వర్గంలో ఆర్జెడి అభ్యర్థిపై జెడియు అభ్యర్థి కేవలం 12 ఓట్లతో గెలిచారు. బర్భిగా స్థానంలో విజేత మెజారిటీ 113. 10 స్థానాలలో అభ్యర్థులు వెయ్యి ఓట్లలో పు మెజారిటీతో గెలిచారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేసినా 47 లక్షల మంది పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరలేదు. వీరిలో 16 లక్షల మంది మహిళలు, ఇబిసిలు దళితులే. బీహార్ 18వ శాసనసభ 234 స్థానాలకు రెండు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నితీశ్ నాయకత్వంలోని అధికార ఎన్డిఎ, రాహుల్ గాంధీ, ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ల నేతృత్వంలోని మహాఘట్బంధన్ హోరాహోరీగా తలడుతున్నాయి. నవంబర్ 6న తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు సర్వం సిద్ధం కాగా, మలి విడత 122 స్థానాలకు 11న ఎన్నికలు జరగనున్నాయి. గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ సారథ్యంలోనే ఎన్డిఎ ఎన్నికలకు వెళుతుండగా, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభృతులు బీహార్ అంతటా కలియదిరిగి మహాఘట్బంధన్కు ఓటేస్తే 1990 నుండి 1995 వరుకు సాగిన లాలూ, రబ్రీదేవిల నాటి ఆటవిక పాలన, నేరాలు, ఘోరాలు మళ్ళీ వస్తాయని, బీహార్ అంధ యుగాలలోకి వెళుతుందని, డబుల్ఇంజిన్ సర్కార్ లాభాలు, సుపరిపాలన కావాలంటే మళ్ళీ నితీశ్ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికి పట్టం కట్టాలని పిలుపు ఇచ్చారు. బిజెపి, ఆర్జెడి, ఎల్జెపి, హిందూస్తాన్ ఆవామీ మోర్చా, లోక్ సుమతా పార్టీలు పంచ పాండవుల వలె రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని హామీ ఇచ్చారు. కాగా రాహుల్, తేజస్విల నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూడా ఈసారి ఎలాగైనా ఎన్డిఎను చిత్తుచేసి, బీహార్ను చేజిక్కించుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. నితీశ్ వయోభారం, అనారోగ్యంవల్ల పాలన చేసే స్థితి లేరని, నేరాలు పెరుగుతున్నాయని, అందరి భాగస్వామ్యంతో బీహార్ను అభివృద్ధి పథంలో నడిపించాలంటే యువకుడైన్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. లాలూ తొలిసారి ముఖ్యమంత్రి అయిన 1990లో తేజస్వి పురిటి పొత్తిళ్లలోని 4 నెలల పసికందు. ఢిల్లీలో 9వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన తేజస్వి 2020 ఎన్నికలలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి యువతను ఆకర్షించినా మహాఘట్ బంధన్ 110 స్థానాలకు పరిమితమైనది. ఆర్జెడి 75 స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా నిలిచింది. మజ్లిస్ పార్టీ వేరుగా పోటీ చేసి ఆరు స్థానాలు గెలిచి అనేక చోట్ల మహాఘట్బంధన్ విజయావకాశాలు దెబ్బ తీసింది. ఈ ఎన్నికలలో కూడా 30 స్థానాలకు పోటీకి దిగింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే రాష్ట్రమంతా చుట్టేసి పలువురు అభ్యర్థులతో తాను పోటీ చేయకుండా జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపారు. ఒక్కసీటు గెలిచే వీలున్నా బహుముఖ పోటీల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలు దెబ్బతీయగలరని అంటున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2005 నుండి మహిళా సంక్షేమానికి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, పంచాయతీ రాజ్, పురపాలక సంఘాల అధ్యక్ష స్థానాలలో రిజర్వేషన్లు కల్పించి, పాఠశాల విద్యార్థినులకు 9వ తరగతి నుండే ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసి, పిజి వరకు చదివే విద్యార్థినులకు వివిధ స్థాయిలలో లక్ష వరకు స్కాలర్షిప్ ఇచ్చి వారి మన్ననలు చూరగొన్నారు. మహా దళితులకు, 36 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన (ఇబిసి) వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 15శాతం ఓటు బ్యాంకును స్థిరపరచుకున్నారు. బిజెపికి అగ్రవర్ణాలు తదితరులతో కలిసి దాదాపు 20% ఓట్లున్నాయి. వీరికి తోడు హిందూస్తాన్ అవామీ మోర్చా దళిత ఓట్లు, లోక్ సమతా పార్టీ ఓట్లతో కలిపి దాదాపు 38 శాతం ఓట్లున్నాయి. మహాఘట్ బంధన్కు బలమైన యాదవ, ముస్లిం (14 శాతం, 17 శాతం ముస్లిం) 32 శాతం ఓట్లున్నాయి. అయితే అధికారంలోకి ఈ ఓట్లు చాలవని గుర్తించి తేజస్వి యాదవ్ ఈ ఎన్నికల ముందు ఎన్డిఎను వీడిన నిషదుల వికాస్ సీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) నేత ముకేశ్ సహానీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించి ప్రచార సభలకు వెంటబెట్టుకొని వెళుతున్నారు. ఓటర్లలో 4.5 మత్స్యకారులున్నారు. వారిలో మల్లా ఉపకులానికి 2.6 శాతం ఓట్లున్నాయి. ముకేశ్ సహాని మల్లనే. గత ఎన్నికల్లో మరో 12 స్థానాలు గెలిచి ఉంటే తేజస్వికి ముఖ్యమంత్రి పీఠం దక్కేది. సీమాంచల్లో మజ్లిస్ పార్టీ మహాఘట్బంధన్ను దెబ్బ తీసింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్కు 37.23 శాతం ఓట్లు రాగా, ఎన్డిఎకు 37.26 శాతం అంటే కేవలం 12,700 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. బీహార్లో దాదాపు 20 శాతం దళితులున్నారు. మహా దళితులు, చిరాగ్ పాశ్వాన్ ఎన్డిఎకు మద్దతుగా ఉన్నారు. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన కింద దాదాపు కోటిన్నర మంది మహిళలు ఒక్కొక్కరి ఖాతాలో రూ. పదివేలు జమచేసి, మెరుగైన ప్రతిభ కనబరచిన వారికి రూ. 2 లక్షల వరకు రుణాలు ఇస్తామని నితీశ్ ప్రభుత్వం వారి జేజేలు అందుకుంది. మహిళల ప్రాధాన్యత గుర్తించిన తేజస్వి మహాఘట్బంధన్ అధికారంలోకివస్తే ఒక్కో మహిళ ఖాతాలో నెలనెలా రూ. 2500 నగదు జమ చేస్తామని, సంక్రాంతి పండుగకు రూ.30 వేలు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఖచ్చితంగా ఇస్తామని పోటీ హామీ ఇచ్చి అధికార కూటమిలో గుబులు రేపారు. అత్యంత వెనుకబడిన వర్గాలలోని 112 ఉపకులాల వారు 120 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయనున్నారు. 10వేల కంటే తక్కువ మెజారిటీతో పార్టీలు గెలిచిన స్థానాలు 50. హిల్సా నియోజక వర్గంలో ఆర్జెడి అభ్యర్థిపై జెడియు అభ్యర్థి కేవలం 12 ఓట్లతో గెలిచారు. బర్భిగా స్థానంలో విజేత మెజారిటీ 113. 10 స్థానాలలో అభ్యర్థులు వెయ్యి ఓట్లలోపు మెజారిటీతో గెలిచారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేసినా 47 లక్షల మంది పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరలేదు. వీరిలో 16 లక్షల మంది మహిళలు, ఇబిసిలు దళితులే. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి జెడియుపై కత్తి గట్టిన చిరాగ్ ఎల్జెపి ఈసారి అధికార కూటమిలో చేరగా, గతంలో ఎన్డిఎలో ఉన్న ముకేశ్ సహానీ ఈసారి మహాఘట్బంధన్తో జట్టు కట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కులాలు, ఉపకులాల ప్రాబల్యం, ఆ చైతన్యం ఎక్కువగా ఉన్న బీహార్లో పార్టీలు ఓట్ల కోసం అలవిగాని హామీలు ఇచ్చాయి. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటే మరో కోటికి పైగా ఉద్యోగాల కల్పనకు రూ. 6 లక్షల కోట్లు అవసరమంటున్నారు. ఇంటికి 200 యూనిట్ల విద్యుత్కు భారీగా నిధులు కావాలి. యువత, మహిళలను ఆకట్టుకుని అధికారంలోకి రావాలని యువకుడైన తేజస్వి ఆశ. ఈ ఎన్నికలలో మళ్లీ గెలిచి ఉత్తరాదిలో సత్తాచాటాలని మోడీ యత్నం. తేజస్వి తేజస్సు వెలుగుతుందా లేక మోడీ, నితీశ్ల ప్రభావం కొనసాగుతుందా అనేది 7.45 కోట్ల బీహార్ ఓటర్లు తేల్చనున్నారు. పతకమూరు దామోదర్ ప్రసాద్ 94409 90381
వలసలపై అమెరికన్ల గురివింద నీతి
వలసలపై అమెరికాలో ఇప్పుడు కొనసాగుతున్న వ్యతిరేకత చాలా చిత్రమైనది. నిజానికి వలసలపై వారి వైఖరి, ధోరణిపై అర్థమే లేదు. అమెరికన్లు అంతా ఇలాగే లేరు కాని, ప్రస్తుతం ఈ ధోరణిదే ఆధిపత్యం. వలసలపై మాట్లాడే చర్చించే నైతిక అర్హతలు ప్రస్తుతం అమెరికన్లుగా చలామణి అవుతున్న వారికి కనీస మాత్రంగా కూడా లేవు. చదువు, బతుకు దెరువు కోసం ఇతర దేశాలనుంచి అమెరికాకు వలస వచ్చిన విద్యార్థులు, యువతపై తీవ్రమైన వ్యతిరేకత, కోపం, ద్వేషం వ్యక్తం కావడం చాలా చిత్రమైన సంగతి. ఆశ్చర్యకరంగా ఇప్పుడు అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దొరవారు ఈ నినాదంపైనే గద్దెనెక్కారు. ఆయనతో సహా వలసలను వ్యతిరేకిస్తున్న వాళ్లు తన మూలాలు ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే వారి నోరు పెగిలే అవకాశం ఏమాత్రం లేదు. గొంతులో పచ్చి వెలక్కాయ పడిపోయి ఒక్కరికి కూడా మాటపెగలదు. 90 శాతానికి పైగా ప్రస్తుత అమెరికన్ పౌరుల మూలాలు అమెరికా భూభాగం వెలుపలివే. వీరెవ్వరు కూడా అమెరికా భూమి పుత్రులు ఎంత మాత్రంకారు. ఎక్కువగా యూరోపియన్ దేశాలకు చెందిన వీళ్ళ తాతలు, ముత్తాతలు ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి యూరప్ దేశాలకు చెందిన వారు. దాదాపుగా వీళ్లంతా తెల్లతోలు కలిగిన ప్రజలే. ఆఫ్రికా నుంచి వచ్చిన నల్లతోలు ప్రజలు వారంతట వారుగా అమెరికాకు వచ్చిన వారు కాదు. బలవంతంగా తీసుకు రాబడిన వారే ఇప్పటి అమెరికన్ నల్లజాతీయులు. యూరప్ నుంచి అమెరికాకు వలస వచ్చిన తెల్లతోలు యూరోపియన్లు తమ వ్యక్తిగత సేవలు, ఆక్రమించిన వ్యవసాయ భూముల్లో వెట్టి కూలీలుగా పని చేయడానికి ఆఫ్రికా నుంచి బలవంతంగా బానిసలుగా తరలించబడిన వారే నల్లజాతీయులు. అసలైన భూమి పుత్రులు, నిజమైన అమెరికన్లు కేవలం రెడ్ ఇండియన్ల మాత్రమే. స్థానికులు, భూమి పుత్రులు అయిన ఈ రెడ్ ఇండియన్లు ఇప్పుడు అమెరికాలో కడు దయనీయ జీవితాలను వెళ్ల బుచ్చుతున్నారు. కేవలం కూలీలుగా, నాల్గవ తరగతి ఉద్యోగులుగా మాత్రమే వీళ్లు బతుకులను వెళ్లదీస్తున్నారు. వారి భూములు, అడవులను ఆక్రమించిన తెల్లతోలు యూరోపియన్లు మాత్రం ఆధిపత్యం చేస్తూ అమెరికన్లుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు అమెరికన్లుగా చలామణి అవుతున్న వారిలో 90 శాతం వాళ్లే. ఇలాంటి వారికి ప్రస్తుత వలసలను ప్రశ్నించే నైతిక అర్హత ఎలా ఉంటుంది? ఒక్కమాటలో చెప్పాలంటే వారిది గురివింద తన కింది నలుపును కనపడనీయకుండా దాచుకొని నేను ఎర్రని దాన్ని, అందమైన దాన్ని అని విర్రవీగే గురివింద నీతి మాత్రమే అవుతుంది. అలాంటి వలస మూలాలున్న తెల్లతోలు అమెరికన్లు ఇప్పుడు చదువు కోసం, ఉపాధి కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులు, యువతపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. వారి ఉపాధికి అడ్డుపడుతున్నారు. భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఆ ధోరణిని రాజకీయ అస్త్రంగా మార్చుకున్న రిపబ్లికన్ పార్టీ నిన్నటి ఎన్నికల్లో ఏకంగా గద్దెనే స్వాధీనం చేసుకోగలిగింది. దీంతో ఇటీవల కాలంలో ఆ నేల వెలుపలి నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. నిజానికి అమెరికాలో ఉపాధి పొందగలుగు తున్నది అత్యంత ప్రతిభావంతులైన యువత మాత్రమే. స్థానిక అమెరికన్లు ఇతర దేశాల యువత ప్రతిభతో పోటీ పడలేని ఫలితంగానే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతున్నారనేది సత్యం. స్వయం కృషి, ప్రతిభలతో మాత్రమే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందే విదేశీ విద్యార్థులపై ఇలాంటి ధోరణి వ్యక్తం కావడం న్యాయమైతే కాదు. వ్యక్తమవుతున్న వలస వ్యతిరేక ధోరణి కారణంగా అమెరికా వెలుపల ఉన్న వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎంతో మానసిక క్షోభకు లోనవుతున్నారు. అమెరికా వెళ్లడం చదువుకోవడం, ఉపాధి సంపాదించడం అంత సులభమైన పని ఏమీకాదు. ఎంతో ప్రయాసతో కూడుకున్నది. డబ్బుతో ముడిపడింది. అత్యంత ప్రతిభావంతులు మాత్రమే అక్కడికి వెళ్లడానికి అర్హులు. తమ తమ దేశాల్లో మంచి ర్యాంకులతో రాణించి, అవసరమైన ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తరువాత మాత్రమే అమెరికాకు వెళ్లే అనుమతి పత్రమైన వీసాను పొందగలుగుతారు. అంతేకాదు, ప్రతిభ మాత్రమే చాలదు. ఒక్కొక్క విద్యార్థి కనీస పక్షంగా రూ. 50 లక్షలు ఖర్చు చేయగలిగేతే తప్ప అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ (ఎమ్ఎస్) పొందలేరు. అలా పొందిన డిగ్రీతో అక్కడ ఉపాధి పొంది చదువు కోసం చేసిన రూ. 50 లక్షల అప్పును క్రమంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అప్పు తీరిన తరువాత కొంత మెరుగైన జీవితాన్ని పొందగలుగుతారు. ఇలా అక్కడికి వెళ్లిన ప్రతిభావంతులైన యువత మేధోశ్రమ ఫలితంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. అమెరికన్ యువతలో మేధస్సు, ప్రతిభా సామర్థ్యాలు ఉండి ఉంటే విదేశీ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావు కదా. ఈ వాస్తవాన్ని పక్కన బెట్టి వలస వ్యతిరేక ప్రచారాన్ని మొదలు పెట్టింది అక్కడి తెల్ల తోలు అహంకారం. ఈ ధోరణి తోడుగా అధ్యక్ష దొరవారు చిత్రవిచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవన్నీ విదేశీ యువతకు పెద్ద ప్రతిబంధకాలుగా మారిపోయాయి. ఈ వలస వ్యతిరేక ధోరణి ప్రబలిపోయిన ఫలితంగా ఉపాధి అవకాశాలు చాలా వరకు అడుగంటాయి. ట్రంప్ నిర్ణయాల ఫలితంగా ఇప్పుడు అమెరికాలో షట్ డౌన్ (ప్రభుత్వ ఆర్థిక కార్యక్రమాల్లో స్తంభన) నడుస్తున్నది. 35 రోజులుగా షట్ డౌన్ కొనసాగుతున్నది. షట్డౌన్ ఫలితంగా ఇప్పటికే ఎన్నో బిలియన్ల డాలర్లను అమెరికా కోల్పోయిందని అమెరికా ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనసాగుతున్న ట్రంప్ మూర్ఖ ధోరణి కారణంగా షట్డౌన్ ఇంకెన్నాళ్లు ఉంటుందో తెలియని అనిశ్చితి అమెరికాలో ఇప్పుడున్నది. ఈస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ త్వరలో కుప్పకూలిపోయే ప్రమాదం సైతం ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే ఆయన గద్దెపై కూర్చొని తొమ్మిది నెలలు గడిచిపోయాయి. మరో 40 నెలల పాటు ఆయనకు పాలనా అధికారం ఉంటుం ది. ఆయన తీరు ఇంకా ఇలాగే కొనసాగితే 250 యేళ్ల మేధస్సు, శ్రమల ఫలితంగా నిర్మించబడిన అమెరికా ఆర్థిక వ్యవస్థ పాలిట ట్రంప్ భస్మాసురుడిగా మారిపోతాడని కూడా అంటున్నారు. ఎంఎజిఎ/ మాగా (మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్) నినాదం అర్థం లేనిదై పోవడం ఖాయం అని చెబుతున్నారు. వలస వెళ్లిన చోటు అమెరికా అయినా, యూరప్ దేశాలు అయినా, పెట్రోలియం వనరులు అధికంగా లభించే అరబ్ దేశాల్లోనైనా శ్రమించి నాలుగు డబ్బులు సంపాదించవలసిందే తప్ప మరోమార్గం మాత్రం లేదు. తాను ఉన్న చోట లభించే వేతనం కంటే కొంత మెరుగైన వేతనం, ఇంకొంత మెరుగైన జీవితం లభించే ప్రాంతానికి వలస వెళ్లడానికే ఏ మనిషిఅయినా మొగ్గుచూపుతాడు. దాన్ని తప్పుగా చూడడం, అభ్యంతరం వ్యక్తం చేయడం అనుచితం. మానవ సమాజాలు దేశాలుగా మారిన తరువాత ఏ దేశానికి ఆ దేశం కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు, చట్టాలు ఏర్పరచుకున్నాయి. వాటిలో భాగమే వీసాల లాంటి అనుమతి పత్రాలు. అలాంటి అనుమతి పత్రాలను ఒక్కో దేశం ఒక్కో రీతిలో తమ తమ దేశాల అవసరాలకు అనుగుణంగా రూపొందించుకున్నాయి. తమ దేశ ఆర్థిక, సాంకేతిక అవసరాలను తీర్చుకునేందుకు ఇతర దేశాల పౌరులను రప్పించే, ఆకర్షించే అనేక ప్రయత్నాలను చాలా దేశాలు చేశాయి. అలా అనేక దేశాల మేధస్సును విస్తృతంగా ఆకర్షించింది అమెరికా. అలా అనేక దేశాల జాతుల ప్రజల రెండున్నర శతాబ్దాల నిరంతర శ్రమ, కృషి, మేధస్సుల వల్ల మాత్రమే నేటి అమెరికా నిర్మాణం సాధ్యమైంది. ప్రపంచం నలుమూలల నుంచి అనేక దేశాల ప్రజల వలసల శ్రమతో మాత్రమే ఆధునిక అమెరికా నిర్మాణం సాధ్యమైందనేది అందరూ అంగీకరించవలసిన సత్యం. నేటి అమెరికా అనేది ఎంతమాత్రం ఒక ఒకే ఒక్క జాతి సమూహం ఎంతమాత్రం కాదు. భిన్నజాతుల మిశ్రమం అయిన నానా జాతి సమితి లాంటి ఒక సంకరజాతి మానవ సమూహమే నేటి ఆధునిక అమెరికా. అలా అమెరికా ఒక గొప్ప దేశంగా మారిపోయింది. గోవర్ధన్ గందె 93470 56621
అవినీతికి అడ్డుకట్ట సాధ్యమేనా?
భూకబ్జాలు, కమీషన్లు, దౌర్జన్యాలకు పాల్పడే రాజకీయ నాయకులు, నకిలీ, కల్తీసరుకులు అమ్ముతూ, పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులు, చేతులు తడపందే ఫైల్ వైపు చూడని ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ మూడు వర్గాలు కూడబలుక్కొని దేశాన్ని పందికొక్కుల్లా మేస్తున్నారు. దృఢమైన గొలుసులా ఏర్పడి సొంత ఆస్తులను గుట్టలుగా పోగు చేసుకుంటున్నారు. వీరి ధనదాహం, అధికార అహం వల్ల దేశంలో వంద కోట్లకు పైగా సామాన్యుల జీవితాలు కష్టాల ఊబిలోకి జారుతున్నాయి. పని చేసి పెట్టేందుకు లంచంకోసం చేయి చాచే ఉద్యోగి ప్రజలకు ప్రత్యక్షంగా కనబడతాడు. వ్యాపారి మోసాలు మాత్రం సామాన్యుడి కంటికి అగపడవు. ఇక రాజకీయ నాయకుడు పెద్ద మాయలోడు. వారి సంపాదన అండర్ గ్రౌండ్ డ్రైనేజిలా ఎటునుంచి ఎటు వెళుతుందో అంతుపట్టదు. ఉద్యోగి పట్టుబడితే కష్టాలే. వ్యాపారి నష్టపోతే తిప్పలే. నాయకుడు ఓడిపోయినా దివాళా తీయడు. ఈ పోలిక ఆధారంగా దేశ సంపద, పౌరుడి శ్రమ ఈమేరకు ఎవరి జేబులోకి వెళుతుందో ఊహించవచ్చు. ఈ మూడింటిలో అత్యంత బలమైనది వ్యాపార వర్గమే. ఒక రకంగా రాజకీయ, ఉద్యోగ వర్గాలు వ్యాపారికి ఊడిగం చేసేవే. వ్యాపారులు ఇచ్చే విరాళాలు రాజకీయ పార్టీలకు ఇంధనంలా పనికొస్తాయి. ఒక పరిశ్రమ తమ రాష్ట్రానికి రావడానికి పాలకులు పడే ఆరాటం చూస్తుంటే పారిశ్రామికవేత్తలు ఎంత శక్తిమంతులో అర్థమవుతుంది. మంత్రులను తమ కనుసన్నలపై ఆడించే వ్యాపారుల ఇంటి గేటు తాకడానికి కూడా అధికారులు వణికిపోతారు. ప్రభుత్వ బ్యాంకుల్లోంచి తీసుకొన్న వేల కోట్ల అప్పును గుర్తుచేయడానికి కూడా అధికారికి సాహసమే కావాలి. బ్యాంకుల్లోని ప్రజల పొదుపు సొమ్మును వేల కోట్ల దాకా ఎగ్గొట్టిన మన వ్యాపారులు విదేశాలకు వెళ్లి రాజాల్లా బతకగలరు. ఆ అప్పులకు మాఫీ చేస్తున్నట్లు మంత్రులతో ప్రకటనలు ఇప్పించగలరు. రాజకీయ, వ్యాపార వర్గాల చెప్పుచేతల్లో నడిచేవారు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు. ప్రతి దొంగపనిని చూసీచూడనట్లు ఉన్నందుకు వీరి టిప్పు వీరికి అందుతుంది. రెస్టారెంట్లు, బ్రాందీ షాపులు, పబ్బుల నుండి పోలీసులకు, మున్సిపాలిటీకి, కార్మిక, వాణిజ్య పన్నుల శాఖలకు నెలవారీగా లంచం సొమ్ము టంచనుగా అందుతుంది. పరిశ్రమల, వ్యాపారుల అక్రమ దందాలు ఎలాంటి అడ్డంకి లేకుండా యథేచ్ఛగా సాగడానికి ఎన్నో విభాగాల తనిఖీ అధికారులకు లంచం ముడుతుంది. డిపార్ట్మెంట్ వారీగా అందిన సొమ్ము హోదాల క్రమంగా జేబులోకి చేరుకుంటుంది. ఇలా నిశ్శబ్దంగా రోజుకు కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. రోజుకు సగటున లక్ష రూపాయలు ఇంటికి తీసికెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క రాష్ట్రంలో వేలల్లో ఉంటారు. మాఫియాలో బ్లాక్ మనీ, స్మగ్లింగ్, హత్యలు ఉంటాయి. లంచగొండి వ్యవస్థ కూడా వైట్ కలర్ మాఫియానే. వారానికి ఒకరిద్దరు లంచగొండి అధికారులు అవినీతి శాఖకు చిక్కుతున్నారనే వార్తలు కనబడుతుంటాయి. అవినీతి నిరోధక శాఖ బాగా పనిచేస్తుందని చర్చ సాగుతుంది. వాస్తవానికి ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే ఎసిబి స్పందిస్తుంది. ఊర్లో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటుందో అందరికీ తెలుసు. అవినీతి నిరోధక స్టేషన్ మాత్రం ఎక్కడా కనబడదు. ఆ సిబ్బంది కూడా అందులోనే ఉంటే బయట బోర్డుపెట్టాలి. దాని మార్గం విడిగా ఉండాలి. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కౌంటర్ కనబడేలా పెట్టినట్లు లంచాలు అడిగే ఆఫీసుల వద్ద ఎసిబి కౌంటర్లు పెట్టాలి. ఈ వ్యవస్థ లేకపోవడం వల్లనే తమను లంచం అడిగారని ఆ శాఖ దృష్టికి తీసుకువెళ్లే వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోంది. సిబ్బంది కోరిన ప్రకారం సమర్పించుకొని తమ పనులు పూర్తి చేసుకొని బయట పడడానికే జనం ఇష్టపడుతున్నారు. చాలా సందర్భాల్లో అధికారుల అత్యాశే విషయం ఎసిబి దాకా వెళ్లేలా చేస్తుంది. బిల్లు మంజూరుకు అధికారి లక్ష డిమాండ్ చేస్తాడు. అంత ఇవ్వలేము, 70 వేలతో సరిపెట్టుకోండి అని వేడుకుంటారు. ససేమిరా కుదరదు. లక్ష ఇవ్వాల్సిందే అని అధికారి మొండికేస్తాడు. చిర్రెత్తిన లబ్ధిదారు ఎసిబిని ఆశ్రయిస్తాడు. శ్రమలేకుండా ఎసిబి వారికి ఓ చేప పడుతుంది. దానికో వార్త. ఇదేం పెద్ద నేరమన్నట్లు ఉద్యోగి దర్జాగా ఫోటోకి పోజు ఇస్తాడు.లంచం తీసుకోవడం తప్పు అనే భావన సమాజంలోంచి ఎగిరిపోయింది. బాధితుల ఫిర్యాదుపైనే కాకుండా, ఉద్యోగుల ఇళ్లపై దాడి చేసి కూడా అవినీతి ఉద్యోగులను ఎసిబి పట్టుకుంటుంది. ఆ ఉద్యోగులకు ఆదాయాన్ని మించిన ఆస్తులున్నాయని లెక్కలేసి మరీ చెబుతుంది. మిగతా వారికి అక్రమాస్తుల లేవా అంటే వారికీ ఉన్నాయనే సమాధానం వస్తుంది. చాలా డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిలో మునిగేవే. వాటిపై చర్యలు తీసుకుంటే ఆఫీసులే ఖాళీ అవుతాయి. జైళ్లు సరిపోవు. బలమైన ఈ చక్రవ్యూహంలో సామాన్యుడు సర్దుకు బతకడమే తప్ప మరో మార్గం లేదు. బి.నర్సన్, 9440128169
మన తెలంగాణ/హైదరాబాద్ : “మీకు చేతనైతే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థినవీన్ కుమార్ను ఓడించండి...”అని సిఎం రేవంత్ రెడ్డి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని, బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సవాల్ విసిరారు. ప్రధాని మోడీ, కెసిఆర్ ఒకవైపు, తాను, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాం ధీ, మజ్లీస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోవైపు నిలబడ్డామని అన్నారు. కాంగ్రెస్ అం టేనే ముస్లింలని, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉ ప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం సిఎం రేవంత్ రోడ్-షో నిర్వహించారు. షేక్పేట డివిజన్లో జరిగిన రోడ్-షోలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కౌసర్, కాంగ్రెస్ అభ్యర్థి నవీ న్ కుమార్, స్థానిక కార్పోరేటర్ ఫరహత్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సిఎం షేక్పేటలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక ప్రార్థన చే శారు. ఈ సందర్భంగా రోడ్-షోలో పాల్గొన్న వారినుద్ధేశించి ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ బిజెపి, బిఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు. బిఆర్ఎస్ సహకారం వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని ఆయన ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో బిజెపికి బిఆర్ఎస్ సహకరించినందువల్లే బిజెపికి ఎనిమిది సీట్లు వచ్చాయని, బిఆర్ఎస్కు డిపాజిట్లు రాలేదని ఆయన తెలిపారు. అందుకే కెసిఆర్ను, కెటిఆర్ను అవినీతి కేసుల్లో బొక్కలో వేయలేదని ఆయన విమర్శించారు. ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో సహా అనేక మందిపై ఈడి కేసులు పెట్టారు కానీ తండ్రీ-కొడుకును బొక్కలో వేసి, చిప్పకూడు ఎందుకు తినిపించలేదని ఆయన ప్రధాని మోడీని, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతి విషయంలో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కోరితే, ఒక్క రోజులోనే కెసిఆర్పై సిబిఐ విచారణ చేపట్టి, జైలుకు పంపిస్తామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని తాను మంగళవారం రోడ్-షోలో కిషన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తే, మా ఇంటికి వచ్చి చర్చిస్తానంటూ మళ్ళీ తనను ఎదురు ఛాలెంజ్ చేశారని ఆయన దుయ్యబట్టారు. తన ఇంటికి రావాల్సిన అవసరం లేదని, గజదొంగ కెసిఆర్ను అరెస్టు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి తెచ్చుకోవాలని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్లో బిజెపికి డిపాజిట్ దక్కదన్నారు. డిపాజిట్ తెచ్చుకుంటే కిషన్ రెడ్డి గెలిచినట్లేనని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కారు టైర్లు పీకేసి గ్యారేజీకి పంపించారని, కొడితే కెసిఆర్ ఫాం హౌస్లో బొక్కా బొర్లా పడ్డారని అన్నారు.వేల కోట్లతో కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్, కవిత వేర్వేరు చోట్ల ఫాం హౌస్లు కట్టుకున్నది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి నేతలు బిఆర్ఎస్ గుర్తు అయిన కారు గుర్తుతో ఓట్లు అడుగుతున్నారని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్కు ఓట్లు వేస్తే బిజెపికే వేసినట్లు అవుతుందని ఆయన తెలిపారు. నాణేనికి రెండు వైపులా బిజెపి, బిఆర్ఎస్ అని ఆయన విమర్శించారు. సర్కార్కు రెండు కళ్ళు.. హిందూ-ముస్లింలు తమ సర్కారుకు రెండు కళ్ళ వంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అజహరుద్దీన్ను తన సహచర మంత్రిగా తీసుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏమి ఇబ్బంది అయ్యిందని ఆయన ప్రశ్నించారు. ‘నీ అయ్య జాగీరు ఏమైనా అడిగామా? లేక గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ భూములేమైనా అడిగామా?’ అని ఆయన ప్రశ్నించారు. అమిత్ షా వచ్చి అడ్డు చెప్పినా అజహర్ను మంత్రివర్గంలోకి తీసుకునే వాడినని ఆయన తెలిపారు. ముస్లింలకు వివిధ కార్పొరేషన్ పదవులు ఇచ్చానని, క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చామని ఆయన వివరించారు. షెక్పేట్ డివిజన్ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి పదిహేను వేల మెజారిటీ ఇవ్వాలని ఆయన కోరారు. సబర్మతి నదీ, యమునా నదీ అభివృద్ధి చేసినట్లు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయరాదని ఆయన ప్రశ్నించారు. ఏకగ్రీవం సంప్రదాయానికి తిలోదకాలు ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయానికి కెసిఆర్ తిలోదకాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. గతంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణిస్తే, ఆ కుటుంబం నుంచి ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వస్తే సెంటమెంట్ ఏమీ లేదని కెసిఆర్ అభ్యర్థిని పోటీకి దించారని ఆయన తెలిపారు. ఇప్పుడేమో కెటిఆర్ సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్కు రాని సన్నాసులు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కృష్ణానగర్ నంది అవార్డులు తెచ్చింది, ఇప్పుడు ఆస్కార్ అవార్డులు తెచ్చిందని ఆయన తెలిపారు. సినీ కార్మికులకు చిత్రపురి కాలనీలో భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది అవార్డు ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గద్దర్ అవార్డులు ఇచ్చిందని ఆయన తెలిపారు. కెటిఆర్ మాత్రం గెస్ట్ హౌస్ల్లో సినీ నటులతో తిరిగారు తప్ప ఏనాడూ సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఈ ప్రాంతాలో ఉండే కార్మికులకు ఆరోగ్య భద్రత, జీవిత భీమా, ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి, లంచ్ కూడా ఏర్పాటు చేయిస్తానని అన్నారు. ఉత్తమ్కుమార్ రెడ్డి మంత్రి అయిన తర్వాత సన్న బియ్యం ఇస్తున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన దొడ్డు బియ్యం బర్లకు కూడా పెట్టేవారు కాదన్నారు. దసరా పండుగకు ఆడబిడ్డలు వెళ్ళాలనుకుంటే ఉచితంగా వెళ్ళేందుకు బస్సు సౌకర్యం కల్పించామన్నారు. డ్బ్బై వేల ఉద్యోగాలు కల్పించి పత్రాలు స్టేడియంలో అందించామన్నారు. సన్న బియ్యం, ఉచిత బస్సు సౌకర్యం, రేషన్ కార్డులు కెసిఆర్ ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ-కార్ల కేసులో యాభై కోట్ల అవినీతికి పాల్పడిన కెటిఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ రోడ్-షోలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
కాళేశ్వరం సరే..మీ హామీల మాటేమిటి?
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి, కాంగ్రెస్పార్టీల మధ్య మాటల తూ టాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిలదీతలతో బిజెపి, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు మా టల దాడి చేసుకుంటున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఇత ర రాష్ట్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్రావులను సీబీఐ అరెస్ట్ చేయడం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11లోగా వీరిద్దరిని సీబీఐతో అరెస్ట్ చేయించి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కిషన్రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా 'ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి కేంద్రంపై ధ్వజమెత్తారు. ఇందుకు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి బుధవారం తన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి ముందు మీడియాతో మాట్లాడుతూ అంతే ధీటుగా రేవంత్రెడ్డికి సమాధానం ఇచ్చారు. బిజెపి ఎన్నికలకు ముం దు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిస్తామని ఎటువంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రేవంత్రెడ్డే కేసీఆర్, హరీశ్లను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు వారిని అరెస్టు చేయలేదని కిషన్రెడ్డి నిలదీశారు. తమకు సంబంధం లేని విషయాలను ఆపాదించడం సరికాదని అన్నారు. అరెస్టులు సం గతి పక్కన పెట్టి రేవంత్రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన డిక్లరేషన్లు, 420 హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తమపై అకారణంగా ఆరోపణలు చేయడం సరికాదని, ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభు త్వం దృష్టిసారించాలని కిషన్రెడ్డి హితవు పలికారు. అవినీతి పెరిగిందే తప్ప తగ్గలేదు తెలంగాణలో కెసిఆర్ పోయి, రేవంత్రెడ్డి వచ్చినా అవినీతి పెరిగిందే తప్ప తగ్గలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. అడుగడుగునా రాష్ట్రం లో అవినీతి తాండవిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులతో సహా అన్ని వర్గాలను రేవంత్రెడ్డి ప్రభుత్వం మో సం చేసిందని ఆరోపించారు. ఎర్రగడ్డ డివిజన్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డికి మద్దతుగా బుధవారం సా యంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కిషన్రెడ్డి గత కెసిఆర్ ప్రభుత్వం, ఇప్పటి రేవంత్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సీఎం పదవిలోకి కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చినా అవినీతి తగ్గలేదని, ఇంకా ఏ ముఖం పెట్టుకుని రేవంత్ ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. మైనార్టీ ఓట్లతో కాంగ్రెస్ ఈ ఎన్నికలో విజ యం సాధించాలని చూస్తోందని విమర్శించారు. పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగితే మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్సు గురించి మాట్లాడి దాట వేత వైఖరిని అవలంభిస్తున్నారని అన్నారు. జాబ్క్యాలెండర్, బంగారం కానుకలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. వెంకటగిరి, యూ సుఫ్ గూడా డివిజన్లలో బిజెపి కార్యకర్తలతో కలి సి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సాయంత్రం బోరబండ డివిజన్, ఎర్రగడ్డ డివిజపలో బిజెపి అభ్యర్థి దీపక్రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 6-11-2025
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 6-11-2025
గురువారం రాశి ఫలాలు (06-11-2025)
మేషం: సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు ఇది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూసంభందిత క్రయవిక్రయాలు లాభిస్తాయి. ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు. వృషభం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం. ఆకస్మిక ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారమున కీలక సమయంలో నిర్ణయాలు తీకోలేరు. మిధునం: ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకుపరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం: బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగిన అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబసభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. సింహం: కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. కన్య: దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబమున అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. తుల: ఋణదాతలనుండి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబసభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారా, ఉద్యోగాలు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృశ్చికం: చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తికావు. ఆత్మవిశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున ధైర్యముగా నిర్ణయాలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ధనస్సు: ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులకు నచ్చే విధంగా ఉండవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటాయి. మకరం: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంభందిత వివాదాలు కొలిక్కి వస్తాయి. శుభవార్తలుఅందుతాయి. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభం: చేపట్టిన పనులు నత్తనడక సాగుతాయి. కత్తులు తగినంత ఆదాయం లభించదు. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారమున భాగస్తులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు కలిగే సూచనలున్నవి. మీనం: అనారోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహయ సహకారాలు అందుతాయి. ధనదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతాన విద్యవిషయాలు పట్ల సంతృప్తికరంగా సాగుతాయి.
రశ్మిక, దీక్షిత్ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్ కాకుండా మరో టైటిల్ ఈ సినిమాకు చెప్పమంటే నీ జీవితమంతా నేనే అని చెప్పాలి. అమ్మాయి, అబ్బాయి తమ జీవిత భాగస్వామి గురించి ఇలాగే అనుకుంటూ అతి సున్నితంగా సాగే ఈ సినిమా చివరకు అతి ఘాటుగా ముగుస్తుంది. ఈ సినిమా చూశాక చాలామంది ఆ రాత్రి నిద్రపోరు. అంతగా ఈ మూవీ వారిని వెంబడిస్తుంది. రశ్మిక ఈ సినిమాలో జీవించేసింది”అని అన్నారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ సినిమానే ప్రపంచంగా జీవించే డైరెక్టర్ రాహుల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని తెలియజేశారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా నా కెరీర్ లో ఒక బ్యూటిఫుల్ జర్నీగా మిగిలిపోతుంది. అల్లు అరవింద్ ఓకే చెప్పకుంటే ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదు. ఈ సినిమాలో రశ్మిక, దీక్షిత్ నటనను ప్రేక్షకులు మర్చిపోలేరు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దీక్షిత్ శెట్టి, ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి, హేషమ్ అబ్దుల్ వాహబ్ తదితరులు పాల్గొన్నారు.
. నేపాల్లో ఏకీకృత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం. సమన్వయకర్తలుగా ప్రచండ, నేపాల్ ఏకగ్రీవం ఖాట్మండు: నేపాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 10 వామపక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. సీపీఎన్ (మావోయిస్టు సెంటర్), సీపీఎన్ (ఏకీకృత సోషలిస్టు), నేపాల్ సోషలిస్ట్ పార్టీ, సీపీఎన్ (సోషలిస్ట్), జన సమాజ్వాదీ పార్టీ, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్`సోషలిస్ట్), సీపీఎన్ (సమాజ్వాదీ)తో పాటు వామపక్ష పార్టీలన్నీ కలిసి ఐక్య పార్టీ ఏర్పాటునకు అంగీకారం తెలిపాయి. దీనికి సంబంధించి 18 అంశాల ఒప్పందంపై సంతకాలు చేశాయి. […] The post ఒక్కటైన 10 వామపక్షాలు appeared first on Visalaandhra .
. న్యూయార్క్ మేయర్గా సోషలిస్టు జొహ్రాన్ మమ్దానీ. స్థానిక పోరులో డెమొక్రాట్ల ప్రభంజనం. వర్జీనియాలో భారత సంతతి ముస్లిం ఎన్నిక. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, సిన్సినాటిలోనూ రిపబ్లికన్లు చిత్తు న్యూయార్క్: ట్రంప్ సర్కారుకు స్థానిక ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తిగిలింది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో రిపబ్లికన్లు ఘోర పరాభవాన్ని చవిచూశారు. 2024 ఎన్నికలప్పుడు ట్రంప్ హవాలో కొట్టుకుపోయిన డెమొక్రాట్ పార్టీకి ఈ ఎన్నికలతో కొత్త ఊపిరి లభించింది. ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయాలతో చరిత్ర సృష్టించారు. […] The post ట్రంప్ పాలనకు ఛీత్కారం appeared first on Visalaandhra .
సీపీఐ నూతన కార్యదర్శివర్గం ఇదే
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శివర్గాన్ని విజయవాడ దాసరిభవన్లో పి.రామచంద్రయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర సమితి సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్యతోపాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా జేవీ సత్యనారాయణమూర్తి, పి.హరినాథరెడ్డి, కేవీవీ ప్రసాద్, డి.జగదీశ్, జంగాల అజయ్కుమార్, డేగా ప్రభాకర్, తాటిపాక మధు, పి.దుర్గాభవాని, కె.రామాంజనేయులు, శాశ్వత ఆహ్వానితులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ ఎన్నికయ్యారు. The post సీపీఐ నూతన కార్యదర్శివర్గం ఇదే appeared first on Visalaandhra .
అధ్వాన పాలనను అడ్డుకోకపోతే అధోగతే
పన్డీఏ విధానాలపై రామకృష్ణ, వెంకటరెడ్డి . ప్రైవేటీకరణ, అప్పులు, అవినీతితో అరాచకం. తీవ్ర పేదరిక నిర్మూలనలో కేరళ విధానం స్ఫూర్తిదాయకం. బీహార్ పన్నికల్లో పన్డీఏకు పరాభవం తప్పదు. డిసెంబరు 26న ‘చలో ఖమ్మం’. 18న సామాజిక న్యాయం కోసం ఆందోళనలు. ఉద్యమాలు ఉధృతం చేస్తాం: జి.ఈశ్వరయ్య విశాలాంధ్ర- విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరాచక పాలనతో ప్రజల జీవన పరిస్థితులు దయనీయంగా మారిపోయాయని, బలమైన ఉద్యమాలు నిర్మించడం ద్వారా ఈ అధ్వాన పాలనకు చరమగీతం పలకాల్సిన […] The post అధ్వాన పాలనను అడ్డుకోకపోతే అధోగతే appeared first on Visalaandhra .
భారత మహిళల జట్టుకు ప్రధాని మోడీ ఆతిథ్యం..
మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని సాధించిన భారత క్రికెట్ జట్టు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసింది. ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీ టీమిండియా సభ్యులకు ఆతిథ్యం ఇచ్చారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి జట్టు సభ్యులు ప్రధానీతో భేటి అయ్యారు. ఈ క్రమంలో క్రికెటర్లు వరల్డ్కప్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని అభినందనలు తెలిపారు. కాగా, 47ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ తొలిసారి భారత జట్టు వన్డే ప్రపంచకప్ సాధించింది. నవీ ముంబై వేదిగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ లో భారత్ 52 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. టీమిండియాపై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. వన్డే ప్రపంచకప్ గెలిచిన 4వ జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఏడు సార్లు, ఇంగ్లండ్ నాలుగు సార్లు, న్యూజిలాండ్ ఒక్కసారి ప్రపంచకప్ ను గెలుచుకున్నాయి.
కూతురిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన తల్లిదండ్రులు
తాము వద్దన్నా వినకుండా ప్రేమ పేరుతో కులాంతర వివాహాం చేసుకున్న కుమార్తెను అత్తవారింటికి వెళ్లకుండా అడ్డుకునేందుకు కన్న తల్లిదండ్రులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా. ఎండపల్లి మండలం, రాజారాంపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా, పాలకురి మండలం, బసంత్నగర్కు చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం, రాజక్కపల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేశ్ గత ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. తమ బిడ్డను ప్రేమించిన రాకేశ్ దళితుడు కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు ఆ పెళ్లికి అడ్డు చెప్పారు. అయితే రాకేశ్నే పెళ్లి చేసుకుని అతడితోనే జీవిస్తానంటూ ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రియాంక జూలై 27న అతనిని కులాంతర వివాహం చేసుకుంది. తాము వద్దన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఆమె తల్లిదండ్రులు వారిద్దరినీ విడదీసేందుకు అప్పటి నుంచి విఫల ప్రయత్నాలు చేశారు.రాకేశ్తోనే తన జీవితమంటూ ప్రియాంక అతడి వైపు గట్టిగా నిలబడటంతో ఏమీ చేయలేకపోయారు. ప్రియాంక గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న ఆమె తల్లి బిడ్డతో ఫోన్లో మాట్లాడటం ప్రారంభించింది. వైద్య పరీక్షల కోసం తన అత్తతో కలిసి బుధవారం జగిత్యాలలోని ఆస్పత్రికి వస్తున్నట్లు తెలుసుకున్న ప్రియాంక తల్లి జగిత్యాల ఆస్పత్రికి చేరుకుంది. ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం తిరిగి రాజక్కపల్లి వెళ్లేందుకు వెల్గటూర్ బస్సు కోసం బస్టాండ్కు చేరుకోగా అప్పటికే బస్సు వెళ్లిపోవడంతో ధర్మారం వెళ్లే బస్సు ఎక్కి రాజారాంపల్లిలో వారు దిగారు. అయితే జగిత్యాల ఆస్పత్రిలో ఉన్నప్పుడే ప్రియాంక తల్లి తన భర్తకు ఫోన్ చేసి బిడ్డను బలవంతంగా తీసుకెళ్లేందుకు పథకం రచించినట్లు తెలుస్తోంది. ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు భర్తకు సమాచారం అందించింది.రాజారాంపల్లిలో దిగగానే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తన బిడ్డ వెంట ఉన్న అత్తను మూత్ర విసర్జనకు వెళదామని చెప్పి వెంట తీసుకెళ్లగా, అప్పటికే ప్రియాంక తండ్రి వెంకటేశ్, అన అక్క భర్త గుంజ కుమార్ కారులో రాజారాంపల్లికి వేచిచూస్తున్నారు. ప్రియాంక రోడ్డుపై ఒంటరిగా ఉండటాన్ని గమనించిన వారు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. తనను కిడ్నాప్ చేస్తున్నారంటూ ప్రియాంక కేకలు వేస్తూ స్థానికుల సహాయంతో వారి బారి నుంచి తప్పించుకుంది. పోలీస్స్టేషన్కు చేరుకుని తన తండ్రి, బావ కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్నారని, చంపుతానని బెదిరించారంటూ వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు, తన భర్త రాకేశ్కు తండ్రితో పాటు బావతో ప్రాణ భయం ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన అమ్మే తనను నమ్మించి మోసం చేసిందని కన్నీళ్ల పర్యంతమైంది.
భారత్ వాంటెడ్ జకీర్ నాయక్కు బంగ్లాదేశ్ షాక్
ఢాకా : ఇస్లాం మత ప్రచారకుడు, భారత్ వాంటెడ్ జాకీర్ నాయక్ కు బంగ్లాదేశ్ గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా ఆయనను తమ దేశంలోకి రానిచ్చేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు జాకీర్ నాయక్కు అనుమతి లభించినట్టు మొదట అక్టోబర్ చివర్లో మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వారం రోజుల్లోనే ఆ పర్యటన పూర్తిగా రద్దు అయినట్టుగా ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. 2016లో ఢాకా హోలీ ఆర్టిజన్కేఫ్పై జరిగిన దాడిలో 29 మంది మరణించగా, జాకీర్ నాయక్ ప్రసంగాలతోనే ఉగ్రవాదులు ప్రేరణ పొంది దాడికి పాల్పడ్డారని బంగ్లాదేశ్.. జాకీర్ నాయక్పై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించింది.
ఎన్డిఏ కోటి వరాల హామీలు బూటకం: మంత్రి పొంగులేటి
రెండు దశాబ్దాల పాటు అవినీతి, అక్రమాలు, అవకాశవాద రాజకీయాలతో బీహార్ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని బీహార్ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులు,రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీహార్ రాష్ట్రం పశ్చిమ చంపారన్ జిల్లా చనుపటియా అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తో కలిసి మంత్రి పొంగులేటి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్డిఏ కూటమికి ఓటమి భయం పట్టుకుందని, అందువల్లనే అలవికాని హామీలను ఇస్తోందని విమర్శించారు. వారి ఎన్నికల ప్రణాళికలో కోటి వరాలు ప్రకటించడి, యువతకు కోటి ఉద్యోగాలు, కోటి మంది లక్పతి దీదీలు హామీలు ఇచ్చారని, అధికారంలో ఉన్న ఈ 20 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారోచ ఎంతమంది దీదీలను లక్పతులుగా చేశారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు వీటిని ఎందుకు అమలు చేయలేదని పొంగులేటి ప్రశ్నించారు. బీహార్ ప్రజలను కొత్త హామీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మహా ఘట్ బంధన్ను గెలిపిస్తే తెలంగాణ మోడల్ పాలనను బీహార్లో అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది, సంక్షేమానికి సమ ప్రాధాన్యతను ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని వివరించారు. రైతులకు రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయిలకే సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన పేదలందరికీ ఇందిర్మమ్మ ఇళ్ల నిర్మాణం వంటి హామీలు అమలు చేస్తున్నామని వివరించారు. బహిరంగ సభలో బీహార్ రాష్ట్ర ఇంచార్జ్ కృష్ణ అల్వర్, మహా ఘట్ బంధన్ అభ్యర్థి అభిషేక్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా.. బిగ్ మూవీ
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం బ్యానర్ పై భారత సినీ రంగంలో మైలు రాయిగా నిలిచే మహత్తరమైన ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఇద్దరు మహానటుల మధ్య ఐదు దశాబ్దాల స్నేహం, సహోదర బంధాన్ని సెలబ్రేట్ చేసుకునే బిగ్ సినిమాటిక్ ఈవెంట్. రజనీకాంత్, కమల్ హాసన్ల అనుబంధం తరతరాల కళాకారులకు, ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తుంది. రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ 44 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకొని రూపొందుతున్న ‘తలైవర్ 173’ సూపర్స్టార్ రజనీకాంత్ మాగ్నటిక్ స్క్రీన్ పవర్, సుందర్ సి డైరెక్షన్ కలిపి ప్రేక్షకులకు విశేషమైన అనుభూతిని అందించబోతుంది. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా పొంగల్ 2027 సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
Photos : Aaryan Movie Press Meet
The post Photos : Aaryan Movie Press Meet appeared first on Telugu360 .
పంటనష్టం అంచనా నిరంతరం కొనసాగుతోంది : కృష్ణాకలెక్టర్
పంటనష్టం అంచనా నిరంతరం కొనసాగుతోంది : కృష్ణాకలెక్టర్ ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్
నెలలో 7సార్లు పాము కాటు #SnakeBite #Jagtial #Wildlife #Telangana #ViralNews #viralvideo #telugupost
శ్రీ శ్రీ రవిశంకర్కు “వరల్డ్ లీడర్ ఫర్ పీస్” అవార్డు
బోస్టన్ : ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్కు బోస్టన్ గ్లోబల్ ఫోరం 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు లభించింది. ప్రపంచ శాంతి,సయోధ్య, మానవతానాయకత్వంలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది. బోస్టన్ గ్లోబల్ ఫోరం, ఎఐ వరల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో అమెరికా లోని బోస్టన్లో ఆయనను ఘనంగా సన్మానించారు. వరల్డ్ లీడర్ ఫర్పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు పదో వార్షికోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి గాను గురుదేవ్ ఎంపికయ్యారు. గతంలో ఈ పురస్కారం అందుకున్న వారిలో జపాన్ మాజీ ప్రధాని షింజోఅబె, జర్మనీ అప్పటి ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ,ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బాన్కీ మూన్ తదితరులు ఉన్నారు.
కన్నుల పండువగా గంగా హారతి బాసర, ఆంధ్ర ప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం
'చికిరి చికిరి'.. అదిరిపోయిన 'పెద్ది' ఫస్ట్ సింగిల్ ప్రోమో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ’పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రకు ప్రాణం పోసేందుకు చరణ్ అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇక మేకర్స్ ఫస్ట్ సింగిల్- చికిరి చికిరి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో, దర్శకుడు బుచ్చి బాబు సానా, అకాడమీ అవార్డు విన్నింగ్ కంపోజర్ ఎ.ఆర్. రెహమాన్ పట్ల తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకుంటూ, పాట సందర్భాన్ని వివరిస్తూ ప్రారంభమవుతుంది. కొండల మధ్య నివసించే హీరో, ఒక అమ్మాయిని చూసిన వెంటనే ఉప్పొంగే భావోద్వేగం సంగీతంగా, సంబరంగా వెలువడుతుందని సందర్భాన్ని వివరించారు. హీరో అమ్మాయిని ‘చికిరి’ అని పిలుచుకోవడం ఈ పాటకు ప్రాణం అయింది. రెహమాన్ సృష్టించిన హై వోల్టేజ్ బీట్లకు అనుగుణంగా రామ్ చరణ్ తన సిగ్నేచర్ మాస్ డాన్స్ స్టైల్, ఎనర్జీ తో అదరగొట్టారు. నవంబర్ 7న విడుదల కాబోతున్న ‘చికిరి చికిరి’ లిరికల్ వీడియో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా, చరణ్ ప్రేమికురాలు‘చికిరి’గా కనిపించనుంది. పెద్ది మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
Mega fans waiting for Vaisshnav Tej
Mega hero Vaisshnav Tej made an impressive debut with Uppena. The actor has tested his luck with films like Konda Polam, Ranga Ranga Vaibhavanga and Aadikeshava. His last film Aadikeshava released in 2023 and the actor hasn’t announced any new film for two years. There are speculations that Vaisshnav Tej is quite selective and he […] The post Mega fans waiting for Vaisshnav Tej appeared first on Telugu360 .
మెరసిన ఇంద్రకీలాద్రి ..వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు..
మెరసిన ఇంద్రకీలాద్రి ..వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. విజయవాడ, ఆంధ్రప్రభ : కార్తీక
Crucial Weekend for Many in Telugu Cinema
November 7th will witness several releases in Tollywood. Rashmika’s The Girlfriend, Sudheer Babu’s Jatadhara, Thiruveer’s The Great Pre Wedding Show and others are hitting the screens. This weekend is crucial for many in Telugu cinema. Rashmika: The actress has delivered some of the biggest hit films like Pushpa and Chhaava. For the first time, she […] The post Crucial Weekend for Many in Telugu Cinema appeared first on Telugu360 .
రిపబ్లికన్ అభ్యర్థుల ఓటమి.. ట్రంప్ విచిత్ర స్పందన
వాషింగ్టన్ : అమెరికా స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడు ట్రంప్కు ఓటర్లు షాక్ ఇచ్చారు. కీలకమైన న్యూయార్క్ మేయర్ పదవితోపాటు అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్లే గెలుపొందారు.ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ట్రంప్ విచిత్రంగా స్పందించారు. ఎన్నికల బ్యాలెట్ పేపర్పై తన ఫోటో లేకపోవడమే కారణంగా చూపించారు. ట్రూత్ వేదికగా స్పందిస్తూ “ఎన్నికల బ్యాలెట్ పేపర్పై ట్రంప్ ఫోటోలేదు. అమెరికాలో షట్డౌన్ కొనసాగుతోంది. ఈ రెండు ముఖ్య కారణాలే అధికార రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోవడానికి ప్రధాన కారణాలు” అని పోల్స్టర్స్ సర్వే అభిప్రాయాన్ని ట్రంప్ తన ట్రూత్ వేదికలో పోస్ట్చేశారు. ఇది వైరల్గా మారింది. కాలిఫోర్నియాలో ఈ ఎన్నికల ఫలితాలపై అసహనం వ్యక్తం చేస్తూ రాజ్యాంగ విరుద్దమైన రీమ్యాపింగ్ పేరుతో భారీ స్కామ్ జరిగిందని, ఓటింగ్లోనూ రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. మెయిల్ ఇన్ ఓట్లను పక్కన బెట్టేయడం తీవ్రమైన అంశంగా ఆరోపించారు. న్యూయార్క్ మేయర్ పదవికి భారత మూలాలున్న డెమోక్రాట్ నేత జొహ్రాన్ మమ్దానీ, న్యూజెర్సీలో డెమోక్రాటిక్ అభ్యర్థిమైకీ షెరిల్ గవర్నర్గా గెలిచారు.
కరాటే పోటీలో గోల్డ్ మెడల్స్ సాధించిన సాబా మొహీంని అభినందించిన కెటిఆర్
మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో 18 కరాటే కాంపిటీషన్లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించిన ఓల్డ్ సిటీ కిషన్బాగ్కు చెందిన12 యేండ్ల సాబా మొహీంని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ అభినందించారు. భవిష్యత్తులో ఒలంపిక్స్ లో ఆడాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సాబా మొహీంకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు. వచ్చే డిసెంబర్ నెలలో దుబాయ్లో జరిగే అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. కెటిఆర్తోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పోర్ట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. కెటిఆర్ని కలవడం గర్వంగా ఉందని, తెలంగాణ తరుపున గోల్డ్ మెడల్ సాధించిన తనను కెటిఆర్ అభినందించడం సంతోషంగా ఉందని కరాటే క్రీడాకారిణి సాబా మొహీం అన్నారు.
వచ్చాడు.. రాళ్లు వేశాడు ..పోయాడు –మంత్రి కొల్లు
వచ్చాడు.. రాళ్లు వేశాడు ..పోయాడు – మంత్రి కొల్లు మచిలీపట్నం ప్రతినిధి, ఆంధ్రప్రభ
కెసిఆర్ కుటుంబమే రౌడీ కుటుంబం:మంత్రి జూపల్లి
ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కోనసాగిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కోనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మంత్రి జూపల్లి కృష్ణారావు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించిన జూపల్లి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్ లో బోరబండలోని సాయిబాబా నగర్లో బుధవారం నవీన్ యాదవ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వృద్దులను, మహిళలను అప్యాయంగా పలుకరిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు. ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. కేసీఆర్ కుటుంబమే రౌడీ కుటుంబం రాష్ట్ర ఖజానాను లూటీ చేసిన కేసీఆర్ కుటుంబమే రౌడీ కుటుంబమని మంత్రి జూపల్లి మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే పునీతులా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉంటే రౌడీ షీటర్లు అంటారా అని నిలదీశారు. జూబ్లీహిల్స్లో గెలుస్తామని బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. కేటీఆర్ కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదని అన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని బాకీ కార్డు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ద్వజమెత్తారు. దోచుకున్న డబ్బుతో విచ్చలవిడిగా ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని అన్నారు. ప్రజా వ్యతిరేఖ బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా నిలదీయాలని కోరారు. బీఆర్ఎస్ను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.
మెక్సికో అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు..
మెక్సికోసిటీ : మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్కు బహిరంగంగా నడిరోడ్డుపైనే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. హిస్టారిక్ డౌన్టౌన్లో మంగళవారం ఆమె ప్రజలతో బహిరంగంగా మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె వెనుక నుంచి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా, ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యకరంగా తాకడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనకు ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని అతడిని పక్కకు నెట్టివేశారు. అయినప్పటికీ అతడు క్లాడియాను అసభ్యంగా తాకుతుండడంతో ఆమె ఇబ్బంది పడ్డారు. అతడు చేతిని పక్కకు నెట్టేశారు. ఈ సంఘటన దృశాలు వైరల్ అవుతున్నాయి. దేశాధ్యక్షురాలికే భద్రత లేదా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి అధ్యక్షురాలి వద్దకు వచ్చేవరకు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో నిందితుడు మద్యం మత్తులోఉన్నాడని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అధ్యక్ష కార్యాలయం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
హిందూపురంలో వైసీపీ దూకుడు హిందూపురం, ఆంధ్రప్రభ : వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన కోటి
అందరం సమష్టిగా కృషి చేద్దాం : ఏపీ జెన్ కో ఎండీ
అందరం సమష్టిగా కృషి చేద్దాం : ఏపీ జెన్ కో ఎండీ ఇబ్రహీంపట్నం
కలినరీ ఎక్స్పీరియెన్సెస్ ను ప్రారంభించిన డిస్ట్రిక్ట్ బై జొమాటో
కోటక్ మహీంద్రా బ్యాంక్ భాగస్వామ్యంతో డిస్ట్రిక్ట్ బై జొమాటో అనే గో-అవుట్ ప్లాట్ ఫామ్, లగ్జరీ డైనింగ్లో కొత్త అధ్యాయాన్ని పరిచయం చేస్తోంది. ఇది భారతదేశంలోని అత్యంత వివేకవంత మైన పోషకుల కోసం రూపొందించబడింది. కోటక్ సాలిటైర్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ఇది ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పాక నిపుణులచే నిర్వహించబడిన, ప్రఖ్యాత డైనింగ్ గమ్యస్థానాలలో నిర్వహించబడిన ఈ అరుదైన, రిఫైన్డ్, ప్రగాఢ వ్యక్తిగత అనుభవాలు విశేష అతిథులు ఆహారం, సంస్కృతితో నిమగ్నమయ్యే విధానాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడ్డాయి. మిషెలిన్ స్టార్ రేటింగ్ పొందిన రెస్టారెంట్స్ లెజెండ్లతో కూడిన ఇంటిమేట్ షెఫ్ టేబుల్స్ నుండి గ్లోబల్ మిక్సాలజీ ఐకాన్లచే నిర్వహించబడిన లీనమయ్యే సాయంత్రాల వరకు, కోటక్ సాలిటైర్ క్రెడిట్ కార్డ్ అసాధారణమైన పసందైన విందు క్షణాలకు విశేష ప్రాప్యతను అందిస్తుంది. ప్రారంభ కార్యక్రమం ‘‘నార్ x దేవాకన్’’, అలాగే ది భోగ్ టేబుల్ బై షెఫ్ ఆరోని & బెంగళూరు ఊటా కంపెనీ ఈ ప్లాట్ఫామ్పై అద్భుతమైన స్పందనను పొందాయి. ఈ క్యూరేటెడ్ ఈవెంట్లకు ముందస్తు యాక్సెస్తో పాటు, కోటక్ సాలిటైర్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఈ క్రింది ప్రత్యేక హక్కులను పొందుతారు: ● డిస్ట్రిక్ట్ ద్వారా డైనింగ్ పై 20% ఆదా (బిల్లుకు ₹5,000 వరకు, నెలకు రెండుసార్లు) ● భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న రెస్టారెంట్లలో ప్రయారిటీ టేబుల్ యాక్సెస్ ● రూ. 1 కి ఎలివేటెడ్ డైనింగ్ ప్రివిలేజెస్ కోసం జొమాటో గోల్డ్ సభ్యత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - అఫ్లుయెంట్ అండ్ శాలరీడ్ ప్రొపోజిషన్స్ హెడ్ జ్యోతి సమాజ్పతి మాట్లాడుతూ, కోటక్ సాలిటైర్లో, నిజమైన లగ్జరీ అనేది వ్యక్తిగత మరియు సులభమైన అనుభవాలలో ఉందని మేం నమ్ముతాం. మా క్లయింట్లకు, భోజనం అనేది కేవ లం భోజనం మాత్రమే కాదు, రుచి, సంస్కృతి, గుర్తింపు యొక్క వేడుక. డిస్ట్రిక్ట్తో ఈ భాగస్వామ్యం అనేది అరు దైన మరియు చిరస్మరణీయమైన క్షణా లను రూపొందించడం గురించి’’ అని అన్నారు. డిస్ట్రిక్ట్ బై జొమాటో ప్రతినిధి మాట్లాడుతూ, డిస్ట్రిక్ట్లో, భోజనం అనేది రుచుల వేడుక మరియు ప్రజలను ఒకచోట చేర్చే సార్వత్రిక అనుభవం అని మేం నమ్ముతున్నాం. కోటక్తో మా భాగస్వామ్యం ద్వారా, మేము నార్ x మిషె లిన్ సిరీస్ వంటి ప్రత్యేకమైన ఈవెంట్లను సృష్టించడం మాత్రమే కాదు, భారతదేశం యొక్క చక్కటి భోజన సంస్కృతిని పునర్నిర్వచించడానికి, ఈ అసాధారణమైన కలినరీ భాగస్వామ్యాలను మా వినియోగదారులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి మేము ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం’’ అని అన్నారు. గతంలో వ్యక్తిగత సంబంధాలు లేదా పరిశ్రమ నెట్వర్క్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండే ఈ తరహా క్యూరే టెడ్ అనుభవాలను ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఇది సౌలభ్యం ద్వారా అసాధారణమైన భోజనాన్ని కనుగొనే కొత్త యుగాన్ని సూచిస్తుంది. స్థానిక ఆహారం, ప్రపంచ కళాత్మకత, వినూత్న సాంకేతికతలో పాతుకుపోయిన అసాధారణ మెనూలను అతిథులు చవిచూస్తారు. ప్రతి ఈవెంట్ నిజంగా పునరావృతం కాని భోజన క్షణాలను సృష్టిస్తుంది. కోటక్ సాలిటైర్ అనేది కోటక్తో లోతైన, బహుముఖ సంబంధాలు కలిగిన వ్యక్తులు, కుటుంబాల కోసం ప్రత్యేకిం చబడిన ఒక మార్గదర్శక బ్యాంకింగ్ ప్రతిపాదన. ఇది ఆహ్వానం ద్వారా మాత్రమే. ఇది ఈ క్రింది వాటిని అందిస్తుంది*: ● రుణాలు మరియు కార్డులలో ₹8 కోట్ల వరకు ముందస్తు అనుమతి పొందిన క్రెడిట్ లైన్లు** ● సంపద నిర్వహణ సేవలు ● సంపన్న కస్టమర్ల జీవనశైలికి అనుగుణంగా రూపొందించబడిన ఆహ్వానితులకు మాత్రమే అందుబాటు లో ఉన్న సాలిటైర్ క్రెడిట్ కార్డ్ యాక్సెస్, వేగవంతమైన ఎయిర్ మైల్స్, జీరో ఫారెక్స్ మార్క్-అప్, అపరి మిత లాంజ్ యాక్సెస్, ప్రీమియం ప్రాపర్టీలలో బస ప్రయోజనాలు, ప్రత్యేకమైన ఈవెంట్లకు యాక్సెస్ వంటి ప్రయోజనాలను* అందిస్తుంది. ● ఫారెక్స్ సొల్యూషన్స్ ● షేర్డ్ ప్రివిలేజెస్ తో కుటుంబ-కేంద్రీకృత బ్యాంకింగ్** ప్రపంచ అధునాతనత మరియు సాంస్కృతిక గొప్పతనం జీవనశైలిలో ఆర్థిక పరిష్కారాలు సజావుగా మిళితమైన అనుభవపూర్వక బ్యాంకింగ్ను అందించడంలో కోటక్ నిబద్ధతకు నిదర్శనం ఈ కార్యక్రమం.
వైభవంగా తులాభారం… మక్తల్, ఆంధ్రప్రభ : కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు
మహారాష్ట్రలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దైవదర్శనానికి కారులో వెళ్లి, మొక్కులు తీర్చుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన వారిని మృత్యువు రూపంలో వచ్చిన బొలెరో వాహనం షిఫ్ట్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హలిఖేడ్ టోల్గేట్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అప్పటికే ముగ్గురు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ ప్రాంతవాసులు. మృతుల్లో నారాయణఖేడ్ మండల పరిధిలోని జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40) ఉన్నారు. మరొకరు మనూర్ మండలంలోని ఎల్గోయి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న హలిఖేడ్ పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిరాదర్ ప్రతాప్ అనే వ్యక్తిని బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారంతా కుటుంబ సభ్యులు, బంధువులే కావడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రమాద సంఘటన తెలుసుకున్న ఖేడ్ ఎంఎల్ఎ సోదరుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీదర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బిరాదర్ ప్రతాప్ను పరామర్శించారు.
హాస్టల్ బాలికలపై పైశాచికం ఫలితం
హాస్టల్ బాలికలపై పైశాచికం ఫలితం తిరుపతి క్రైమ్ , ఆంధ్రప్రభ : మైనర్
తడిచిన ధాన్యం కొంటాం.. సివిల్ సప్లై ఎండి హామీ
తడిచిన ధాన్యం కొంటాం.. సివిల్ సప్లై ఎండి హామీ విజయవాడ, ఆంధ్రప్రభ :
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసిన బండి సంజయ్
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసిన బండి సంజయ్ ఉమ్మడి
కొనసాగుతున్న ఇంటింటి ప్రచారం..
కొనసాగుతున్న ఇంటింటి ప్రచారం.. హైదరాబాద్, ఆంధ్రప్రభ : టీపీసీసీ ఆదేశాల మేరకు కొమరం
వైభవంగా గోదావరి మహా హారతి మంథని, ఆంధ్రప్రభ : మంథని గోదావరి మహా
పంట నష్టపరిహారం ఇవ్వాల్సిందే మోతె, ఆంధ్రప్రభ : రైతులు పండించిన పంటలకు నష్టపరిహారం
Rajinikanth, Kamal Haasan, A Historical Collaboration
Superstar Rajinikanth and Universal Hero Kamal Haasam are celebrated for their legendary careers. Although they shared screen space together in many super hit movies during the initial days of their career, it’s been long since they didn’t work together again. In an official announcement, Kamal Haasan confirmed that his home banner, Raaj Kamal Films International […] The post Rajinikanth, Kamal Haasan, A Historical Collaboration appeared first on Telugu360 .
పూజ గదిలో కర్టెన్ కు దీపం అంటుకుని…
పూజ గదిలో కర్టెన్ కు దీపం అంటుకుని… ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా )
టీపీఎల్ క్రికెట్ పోటీలు.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి క్రీడల్లో రాణించాలని కోరిన మంత్రి శ్రీహరి జూపర్ ఎల్ఈడీ సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 600 టీమ్లతో లీగ్ టోర్నీ ప్రైజ్ మనీ రూ.80 లక్షలు హైదరాబాద్: తెలుగు ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) క్రికెట్ పోటీల పోస్టర్ను తెలంగాణ క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. మంత్రిని ఆయన కార్యాలయంలో టీపీఎల్ను నిర్వహిస్తున్న జూపర్ ఎల్ఈడీ సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, లీగ్ విశేషాలను వివరించారు. యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రమశిక్షణ గల క్రీడాకారుడిగా, బాధ్యయుత పౌరుడిగా తయారు చేసే శక్తి క్రీడలకు ఉందని శ్రీహరి అన్నారు. క్రికెట్తో పాటు ఏదొక క్రీడలో యువత రాణించాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. ‘సే నో టూ’ డ్రగ్స్ ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ టీపీఎల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం లీగ్ నిర్వాహక సంస్థ జూపర్ ఎల్ఈడీ డైరెక్టర్ ఒ.రమేష్ మాట్లాడుతూ.. తమ సీఎస్ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లీగ్ను కేవలం వినోదం కోసం నిర్వహించకుండా సమాజంలో ఆరోగ్య భద్రత, ఫిట్నెస్, క్రీడలపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 వేదికల్లో 600 టీమ్లతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. నాకౌట్ పోటీలకు తెలంగాణ నుంచి 4, ఆంధ్ర నుంచి 4 జట్లు ఎంపిక చేస్తామని అన్నారు. గ్రామీణ క్రికెటర్లకు పెద్ద వేదికలపై క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనేది కూడా తమ ఆలోచన అని తెలిపారు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ రూ.80 లక్షలు.
తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం..!
తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం..! తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా
భారత్పై ట్రంప్ ఘాటు దెబ్బ.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేత
న్యూఢిల్లీ : వచ్చే నెల నుంచి భారత్, రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని నిలిపివేస్తుంది. నేరుగా రష్యా క్రూడాయిల్ రాక మనకు ఆగిపోతుంది. రష్యా ప్రముఖ చమరు కంపెనీలు రోస్నెఫ్ట్, లూకాయిల్పై అమెరికా భారీ స్థాయి ఆంక్షలు విధించిన తరువాత దీని ప్రభావం భారత్పై పడింది. అనివార్యంగా ఈ కంపెనీల నుంచి ముడిచమురు దిగుమతిని నిలిపివేయాల్సిన చక్రబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ నెల చివరి నుంచి రష్యా ముడిచమురు దిగుమతిని తగ్గించుకుంటూ వచ్చే నెల నాటికి పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడైంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా చమురును భారత్ పూర్తి స్థాయిలో నిలిపివేస్తుందని ట్రంప్ పదేపదే చెపుతూ వచ్చారు. రష్యా కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు ఈ నెల 21 నుంచి అమలులోకి వస్తాయి. దీనితో ఆయా కంపెనీలపై ఆధారపడే పలు దేశాలు ఇకపై వేరే మార్గాలను వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో చమురు సరఫరా గొలుసుకట్టు వ్యవస్థకు కుదేలు కానుంది. ఉక్రెయిన్తో యుద్ధం తరువాత రష్యాపై ఆంక్షల దశ నుంచి భారతదేశం రష్యా నుంచి అతి ఎక్కువ మోతాదులో ముడిచమురు నేరుగా దిగుమతి చేసుకొంటోంది. ప్రత్యేకించి ట్రంప్ ఆంక్షలకు గురైన ప్రధాన కంపెనీల నుంచి రిలయన్స్ పెట్రో సంస్థ అత్యధిక వాటాలో చమురు తెప్పించుకొంటోంది. ఇప్పుడు రష్యా క్రూడాయిల్ దిగుమతి ఆగిపోనుండటంతో రిలయన్స్ ఇతర భారతీయ కంపెనీలకు పిడుగు పాటు కానుంది. భారతీయ రిఫైనరీలు తమ దిగుమతులలో సగం వరకూ రష్యా నుంచే తెప్పించుకుంటున్నాయి. రిఫైనరీల ద్వారానే మార్కెట్కు అవసరం అయిన పెట్రోలు, డీజిల్ అందుతుంది. ఇప్పుడు రష్యా ఆంక్షలతో క్రమేపీ భారతీయ చమురు కంపెనీలు, రిఫైనరీలు ఈ లోటును ఇతరత్రా మార్గాల ద్వారా భర్తీ చేసుకోవల్సి ఉంటుంది. మారిటైం ఇంటలిజెన్స్ విశ్లేషణ సంస్థ కెప్లెర్ ఇప్పటి పరిస్థితి గురించి స్పందించింది. డిసెంబర్లో రష్యా నుంచి భారీ స్థాయిలో క్రూడాయిల్ రాక తగ్గుతుంది. డిసెంబర్లో ఈ క్షీణత ప్రభావం మన మార్కెట్పై తీవ్రంగానే పడుతుంది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో క్రమేపీ ఈ ప్రభావం నుంచి బయటపడవచ్చు. కానీ క్రూడాయిల్ రప్పించుకునేందుకు సంబంధిత మధ్యవర్తులు లేదా దళారులు , ప్రత్యామ్నాయ మార్గాలను తక్షణ రీతిలో ఇప్పటి నుంచే వెతుక్కోవల్సి ఉంటుందని విశ్లేషణ సంస్థ తెలిపింది.
స్వయంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్…
స్వయంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్… శ్రీశైలం, ఆంధ్రప్రభ
ఎక్కడ దొరికారంటే…. ధర్మపురి ఆంధ్రప్రభ : ధర్మపురి పట్టణంలోని పేకాట ఆడుతున్న స్థావరంపై
అభిరథ్ ధాటికి హైదరాబాద్ గెలుపు #RanjiTrophy #HyderabadCricket #AbhirathReddy #BCCI #SportsNews
కారు బోల్తా.. ఒకరి మృతి.. మోతె, ఆంధ్రప్రభ : కుక్కను తప్పియ్యబోయి కారు
నకిలీ ‘IEXS ట్రేడింగ్’ యాప్ ద్వారా చీటింగ్విత్డ్రా పేరుతో మళ్లీ మళ్లీ డబ్బు అడిగిన మోసగాళ్లు
శ్రీశైలం ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
అచ్చంపేట : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీశైలం వైపు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అక్కమ దేవి ఘాట్ రోడ్డులోని కఠిన మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా తిరిగిపోయింది.వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ నుండి శ్రీశైలం దిశగా బయలుదేరిన బస్సు వేగం ఎక్కువగా ఉండటంతో అక్కమ దేవి మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. బస్సు రోడ్డుపై అడ్డంగా తిరిగిపోవడంతో ఘాట్ రహదారిపై రెండు గంటలకు పైగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనా చివరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
త్వరలో దివి సీమ ప్రజల కల సాకారం .. డిప్యూటీ సీఎం అంగీకారం
త్వరలో దివి సీమ ప్రజల కల సాకారం .. డిప్యూటీ సీఎం అంగీకారం
TVK పార్టీ సిఎం అభ్యర్థిగా విజయ్
చెన్నై: తమిళిగ నెట్రి కళగం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ పేరును ప్రకటించారు. బుధవారం ఉదయం మహాబలిపురం లోని ప్రైవేట్ హోటల్లో జరిగిన పార్టీ ప్రత్యేక సాధారణ కౌన్సిల్ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు, కోయంబత్తూరులోని మహిళపై లైంగిక దాడి, ఓటర్ల జాబితాల సర్వే, తదితర 12 కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. కరూర్ ర్యాలీలో తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడంపై రెండు నిమిషాలు మౌనం పాటించారు. విజయ్, టివికె పార్టీ నిర్వహించే సమావేశాలకు తగిన పోలీస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
కుక్కను తప్పించబోయి కారు పల్టీ.. భార్య మృతి.. భర్త, పిల్లలకు గాయాలు
మన తెలంగాణ/మోతె: సూర్యాపేట జిల్లా, మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం సమీపంలో కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఒక మహిళ మరణించగా, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న పలువురు వ్యక్తులు సూర్యాపేట ఖమ్మం 365 బిబి నేషనల్ హైవే 1033 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి, టోల్గేట్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. వెంటనే 1033 పెట్రోలింగ్ సిబ్బంది, 1033 అంబులెన్స్ సిబ్బంది, ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకొని క్షతగాత్రులకు ఫస్ట్ ఎయిడ్ చేసి ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం, పోచవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు పనిపై హైదరాబాద్ వెళ్లి తిరిగి కారులో తెల్లవారుజామున బయల్దేరారు. సూర్యాపేట జిల్లా, మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం సమీపంలో కుక్కను తప్పించబోయి చెట్లపొదల్లోకి కారు దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాణి (38) అనే గృహిణి మృతి చెందగా, ఆమె భర్త శ్రీరామ్ (52)కు స్వల్ప గాయాలయ్యాయి. వారి కుమార్తె జాహ్నవి (11), కుమారుడు లోకేష్ (10) తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతురాలి భర్త శ్రీరామ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ టి. అజయ్కుమార్ కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్ట్టు తెలిపారు. కాగా, 1033 వాహనానికి సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించిన సిబ్బందిని పలువురు అభినందించారు.
సదరన్ డిస్కమ్ సరికొత్త ప్రయోగం
సదరన్ డిస్కమ్ సరికొత్త ప్రయోగం తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : ప్రీ
భారతదేశ పౌరులు అవినీతిని నేరుగా నివేదించడానికి నంబర్ ను ప్రకటించలేదు#TeluguPost #telugu #post #news
వెదుళ్లపల్లిలో అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత..
వెదుళ్లపల్లిలో అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత.. బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ : గోవుల
We are releasing Aaryan with a new climax – Vishnu Vishal
Vishnu Vishal delivered hits like Ratsasan, Matti Kushti, FIR and now, he is starring in a crime thriller, Aaryan. Praveen K has directed the film and Vishnu Vishal produced it. Nithiin’s Shrestha Movies is releasing the movie in Telugu. Now, the makers have conducted a pre-release press meet interacting with Telugu Media. Speaking at the […] The post We are releasing Aaryan with a new climax – Vishnu Vishal appeared first on Telugu360 .
ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు…
ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు… గద్వాల, ఆంధ్రప్రభ : గద్వాల జిల్లా
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బిసిసిఐ(బీసీసీఐ) టీమిండియా జట్టును ప్రకటించింది. శుభ్ మన్ గిల్ సారథ్యంలోని15 మంది సభ్యుల జట్టును బుధవారం ఎంపిక చేసింది. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో గాయపడిన రిషబ్ పంత్ కోలుకుని మళ్లీ జట్టులోకి తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికా Aతో జరిగిన మొదటి అనధికారిక మ్యాచ్లో ఇండియా ఎకి విజయాన్ని అందించిన పంత్.. తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. పంత్ తోపాటు ఆకాష్ దీప్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా, భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నవంబర్ 14 నుండి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. నవంబర్ 22 నుండి గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ స్టేడియం మొదటిసారి టెస్ట్ క్రికెట్కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు: శుబ్మాన్ గిల్ (సి), రిషబ్ పంత్ (WK) (VC), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ లోని చునార్ రైల్వేస్టేషన్లో బుధవారం ఉదయం పట్టాలు దాటుతున్న ప్రయాణికులను రైలుఢీకొనడంతో ఆరుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సవిత(28), సాధన ( 16 ) .శివకుమారి ’( 12) అంజుదేవి (20). సుశీలాదేవి (60),కళావతి (50) గా గుర్తించారు. ఈ సంఘటన ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగింది. చునార్ స్టేషన్ నాలుగో ప్లాట్ఫారం వద్దకు చోపన్ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు వచ్చి ఆగగానే ప్రయాణికులు దిగి ఫుట్ఓవర్బ్రిడ్జి కాకుండా పట్టాలు దాటడానికి ప్రయత్నించారు. అదే సమయంలో హౌరా కల్కాజీ నుంచి ఎదురుగా వస్తున్న నేతాజీ ఎక్ప్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రయాణికులు కార్తీక్ పూర్ణిమ స్నానాల కోసం మీర్జాపూర్ వచ్చారని ఎన్సిఆర్ ప్రయాగ్రాజ్ డివిజన్ పిఆర్ఒ అమిత్ సింగ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి , స్థానిక ఎంపీ అనుప్రియ పటేల్ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రమాద స్థలానికి జాతీయ, రాష్ట్ర వైపరీత్యాల స్పందన బృందాలను వెళ్లాలని ఆదేశించారు.
హర్యానాలో ఓట్ల చోరీ వల్లనే కాంగ్రెస్ ఓటమి:రాహుల్ గాంధీ
బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. 2024లో హర్యానాలో ఓట్ల చోరీ కారణంగానే కాంగ్రెస్ పార్టీ విజయం అంచులనుంచి ఓటమి పాలైందని ఆయన అన్నారు. హర్యానాలో 2 కోట్ల మంది ఓటర్లలో 25 లక్షలమంది నకిలీ ఓటర్లేనని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ విమర్శించారు. బోగస్ ఓటర్ల సంఖ్య రాష్ట్రంలో 12 శాతం మేరకు ఉందని. ఇందుకు సంబంధించి తమ వద్ద 100 శాతం రుజువులు ఉన్నాయని ఆయన తెలిపారు. తమ బృందం 5.21 లక్షల నకిలీ ఓటర్ల ఎంట్రీలను కనుగొన్నట్లు తెలిపారు. అంటే హర్యానాలో ప్రతి8 మంది ఓటర్లలో ఒకరు నకిలీ అని ప్రతిపక్షనేత ఎద్దేవా చేశారు. ఒక బ్రెజిలియన్ మోడల్ ఫోటో గ్రాఫ్ సీమా, స్వీటీ, సరస్వతి వంటి వివిధి పేర్లతో ఓటర్లజాబితాలో అనేకసార్లు కన్పించిందని, ఆమె 22 సార్లు ఓటు వేసిందనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, ఓటర్ల జాబితాలోని తేడాలను చూపే స్లయిడ్ లను రాహుల్ ప్రదర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడిచేందుకు బీజేపీ కుట్రపూరితంగా ఇలాంటి పన్నాగాలు పన్నుతోందని రాహుల్ ఆరోపించారు. హర్యానా చరిత్రలోనే తొలిసారిగా, పోస్టల్ బ్యాలెట్లు వాస్తవ ఓట్లతో సరిపోలలేదన్నారు. ఇంతకు ముందు ఎన్నడూ ఇలా జరగలేదని చెబుతూ, కాంగ్రెస్ అఖండవిజయాన్ని ఓటమిగా మార్చేందుకు కుట్ర అమలయిందని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల తర్వాత వచ్చిన వీడియోను చూపుతూ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీపై కూడా విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన రెండు రోజులతర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని అందరూ చెబుతున్న సమయంలో నైనీ నవ్వుతున్న ఫోటో ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా రెండింటిలోనూ వేలాదిమంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఒక్ పాల్వాల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇంటి నెంబర్ .150లోని బీజేపీ నాయకుడి చిరునామాలో 66 మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. ఒక వ్యక్తి ఇంట్లో ఏకంగా 500 మంది ఓటర్లు నమోదయ్యారని ఆయన ఆరోపించారు. తాను ఆషామాషీగా ఆరోపణలు చేయడం లేదని, తన ఆరోపణలను ధ్రువీకరించే డేటా ఉందని రాహుల్ స్పష్టం చేశారు. ఈసీని మాత్రమే కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియనే ప్రశ్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓట్ల చోరీ విషయంలో బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్నికల కమిషన్ నకిలీ ఓట్లను ఎందుకు తొలగించడం లేదు. అలా చేస్తే, న్యాయంగా ఎన్నికలు జరుగుతాయికదా. అన్నారు రాహుల్. ఈసీ. న్యాయమైన ఎన్నికలను కోరుకోవడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీ కుట్రకు, ఈసీ వత్తాసు ఉందనడానికి ఇదే రుజువు అని దుయ్యబట్టారు.
KTR : రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాదు .. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆగ్రహం
టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాదు .. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆగ్రహం
ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన చత్తీస్ గఢ్- తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. బీజాపూర్ జిల్లలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. జిల్లలోని తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం- మరిమల అడవుల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు ఘటన స్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
విశాలాంధ్ర శింగనమల.. శింగనమల నియోజకవర్గం పుట్లూరులో స్కూలు పిల్లలతో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది, బుధవారం సాయంకాలం స్కూలు పూర్తవగానే పుట్లూరు మోడల్, జడ్పీ స్కూళ్లకు చెందిన విద్యార్థులను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సు మడ్డిపల్లికి బయల్దేరింది, చింతకుంట వద్దకు బస్సు రాగానే స్టీరింగ్ స్ట్రక్ కావడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు బస్ ఎక్కడం వల్ల అధిక లోడుతో వెళుతూ ప్రమాదం జరిగిందని పలువురు భావిస్తున్నారు. ఈ […] The post అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. appeared first on Visalaandhra .
అండగా ఉంటాం.. ఎల్ఓసీ అందజేత…
అండగా ఉంటాం.. ఎల్ఓసీ అందజేత… మక్తల్, ఆంధ్రప్రభ : నర్వ మండలం పాతర్చేడు
తెలుగు రాష్ట్రాలలో ఆగని బస్సు ప్రమాదాలు #Accident #Putlur #RTC #AndhraPradesh #PublicSafety
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..
విశాలాంధ్ర: చిలమత్తూరు.. శ్రీ సత్య సాయి జిల్లా .చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం పై బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించారు, ప్రభుత్వ కార్యాలయ అధికారుల పై చాలా కాలం నుండి అవినీతి అక్రమాల ఆరోపణలు ఉన్నాయి,ఈనేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఏసీబీ సీఐ జయమ్మ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం తనిఖీలు చేశారు. ఏసీబీ అధికారులు కార్యాలయ లోపలికి వెళ్లి ఇంటి స్థలాలు. సాగు భూములు క్రయవిక్రయాలకు వచ్చిన వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.అయితే అందుకు భిన్నంగా […] The post సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. appeared first on Visalaandhra .
కదిలిస్తే కఠిన చర్యలే!! జన్నారం, ఆంధ్రప్రభ : అడవుల్లోని విలువైన టేకు చెట్లను
నవీన్ యాదవ్కే ఓటు వేయాలి.. మంత్రి అడ్లూరి
నవీన్ యాదవ్కే ఓటు వేయాలి.. మంత్రి అడ్లూరి జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని
శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు
తెలుగు రాష్ట్రాల్లో కార్తీకపౌర్ణమిని అంతటా ఘనంగా జరుపుకున్నారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే అలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి, భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదిలారు. భక్తులు దానధర్మాలు, నదీ స్నానాలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పలువులు భక్తులు నదుల్లో వద్ద పుణ్య స్నానాలు ఆచరించి ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. కార్తిక మాసంలో అత్యంత పవిత్రమైన పౌర్ణమి పర్వదినాన్ని భక్తులు పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాలన్నీ భక్త జన సందోహంతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. కార్తిక పౌర్ణమి రోజున శివాలయాల్లో దీపం వెలిగించడం వల్ల పుణ్యం వస్తుందని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు వచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేకంగా మహిళలు ఆలయ పరిసరాల్లో కార్తిక దీపాలను వెలిగించి, 365 వత్తులతో కూడిన దీపాలను సమర్పించారు. వరంగల్ వేయిస్తంబాల దేవాలయం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, రామప్ప దేవాలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఝారాసంగం కేతకి సంగమేశ్వర, సంగారెడ్డి సోమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించారు. దీపాలు వెలిగించి పూజలు చేశారు. మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు : హైదరాబాద్లోని శేరిలింగంపల్లి, మదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని ప్రధాన శివాలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా భక్తులందరికీ సకాలంలో దర్శనం లభించేలా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు, భక్తులు వెలిగించిన దీపాల కాంతులతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. కీసరగుట్టలో పౌర్ణమి వేడుకలు : సుప్రసిద్ధ శైవ క్షేత్రం కీసరగుట్టలో భక్తుల సందడి నెలకొంది. శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. దర్శన అనంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివ లింగాలకు పంచామృత అభిషేకాలు చేశారు. అలాగే ఆలయ పరిసరాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. సత్యనారాయణ స్వామి వత్రాలు నిర్వహించారు. యాదగిరిగుట్టలో కార్తిక శోభ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ఆలయంలోని వ్రత మండపంలో భక్తులు సత్యదేవుడికి పూజలు నిర్వహించారు. కార్తీక దీపారాధన మండపంలో దీపాలు వెలిగించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ఆలయ మాఢ వీధులు కార్తిక పూజలు నిర్వహించే భక్తులతో సందడిగా మారాయి. కార్తీక పూజలు జరిపించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణస్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం, కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపా రాధన ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడాయి.
వేంకటేశ్వర స్వామి దర్శనం… రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా రేగొండ మండలం
అండగా… ఏపీ సర్కారు మృతుడి కుటుంబానికి పెడన ఎమ్యెల్యే రూ.5లక్షల పరిహారం అందజేత
విజయం ఒక పెద్ద ఉద్యమానికి నాంది…
విజయం ఒక పెద్ద ఉద్యమానికి నాంది… హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారతదేశంలో నీటి
నవీన్ యాదవ్ ను గెలిపించాలి… కడియం కావ్య
నవీన్ యాదవ్ ను గెలిపించాలి… కడియం కావ్య జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ ఉప
నవీన్ యాదవ్కి మద్దతుగా… మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్
Pawan Kalyan’s Flamingo Plan at Pulicat Lake Sparks Bhumana’s Witty Reaction
Andhra Pradesh Deputy Chief Minister and Environment Minister Pawan Kalyan has directed officials to take steps to create a permanent habitat for flamingos at Pulicat Lake. The scenic lake, known for attracting migratory birds from Siberia every winter, is set to be developed as a major ecotourism destination. Pawan Kalyan emphasised that the flamingos, which […] The post Pawan Kalyan’s Flamingo Plan at Pulicat Lake Sparks Bhumana’s Witty Reaction appeared first on Telugu360 .

21 C