SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

Tirumala : తిరుమలకు వెళ్లే వారికి నేడు అలెర్ట్.. వేచి ఉండాల్సిన సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తెలుగు పోస్ట్ 6 Dec 2025 8:24 am

మోత్కూర్ మండలంలో సర్పంచ్ 90, వార్డు సభ్యులకు 349 నామినేషన్ లు

మోత్కూరు మండలంలో వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్ నామినేషన్ల వివరాలు: అనాజిపురం-13 దాచారం-6 దత్తప్పగూడెం-18 ముశిపట్ల-5 పాలడుగు-11 పాటిమట్ల-7 పనకబండ-7 పొడిచేడు-10 రాగిబావి-6  సదర్శాపురం-7  మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మండలం 10 గ్రామ పంచాయతీలలో 10 సర్పంచ్ స్థానాలకు 90 నామినేషన్లు, 88 వార్డులకు 349 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామాలలో వార్డుల వారిగా నామినేషన్ దాఖల వివరాలు ఇలా ఉన్నాయి. 10 గ్రామ పంచాయితీ లోని 88 వార్డులకు 349 మంది అభ్యర్థులు నామినేషన్ లు వేశారని అధికారులు తెలిపారు. అనాజీపురం లో 8 వార్డులకు 24,దాచారం లో 10 వార్డులకు 22, దత్తప్పగూడెం లో 10 వార్డులకు 41,ముషిపట్ల లో8 వార్డులకు 19, పాలడుగు లో10 వార్డులకు 38, పాటిమట్ల లో8 వార్డులకు 22, పనకబండ లో 8 వార్డులకు 23,పొడిచేడు లో 10 వార్డులకు 35, రాగిబావి లో8 వార్డులకు 18, సదర్శాపురం లో 8 వార్డులకు 17 మంది అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేశారు.

మన తెలంగాణ 6 Dec 2025 8:16 am

Road Accident : తమిళనాడులో ఐదుగురు ఏపీకి చెందిన భక్తులు మృతి

తమిళనాడులోని రామనాధపురంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీకి చెందిన వారు మరణించారు.

తెలుగు పోస్ట్ 6 Dec 2025 8:15 am

Mega star |చిరు, వెంకీ మూవీ ఇంట్రెస్టింగ్ న్యూస్..

Mega star | చిరు, వెంకీ మూవీ ఇంట్రెస్టింగ్ న్యూస్.. Mega star,

ప్రభ న్యూస్ 6 Dec 2025 8:14 am

కాలువలో పడిన బైక్... భార్య మృతి, కుమారుడు గల్లంతు... భర్తే హత్య చేశాడా?

అమరావతి: దంపతులు బైక్‌పై వెళ్తుండగా బొలెరో వాహనం అడ్డురావడంతో భార్య, కుమారుడు కాలువలో పడిపోయారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా కుమారుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావు పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రొంపిచర్ల మండలం కొత్తపాలెం గ్రామంలో శ్రీకాంత్(30), త్రివేణి(25) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఏడు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. బాలుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కుమారుడిని ఆస్పత్రికి బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఓ కాలువ వద్ద బొలెరో వాహనం అడ్డురావడంతో ద్విచక్రవాహనం కాలువలో పడిపోయింది. శరత్, త్రివేణి, బాలుడు కాలువలో పడ్డారు. భార్య, కుమారుడు గల్లంతు కావడంతో వెంటనే శరత స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. భార్య మృతదేహం కనిపించగా బాలుడి ఆచూకీ కనిపించలేదు. భార్య, కుమారుడిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య శరీరంపై గాయాలు ఉన్నాయని బంధువుల ఆరోపణలు చేస్తున్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 8:13 am

ఉచిత కంటి వైద్య శిబిరం

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలం రామన్నపాలెం లో శుక్రవారం నాడు ఆమెన్ ట్రస్ట్ ఏలూరు శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు ఆమెన్ ట్రస్ట్ మేనేజర్ అశోక్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్ మాట్లాడుతూ పౌష్టిక ఆహారం కూరగాయలు తీసుకోవడం ద్వారా కంటి సమస్యలు రాకుండా ఉంటాయని అన్నారు ఆనంద్ మాట్లాడుతూ సెల్ ఫోన్లు ఎక్కువగా […] The post ఉచిత కంటి వైద్య శిబిరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Dec 2025 8:02 am

సిరీస్ దక్కేదెవరికో?

ఇరు జట్లకు కీలకం నేడు విశాఖలో భారత్, సఫారీ చివరి వన్డే విశాఖపట్నం: సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో, చివరి వన్డేకు సాగర తీర నగరం విశాఖపట్నం సిద్ధమైంది. భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం విశాఖ వేదికగా ఆఖరి వన్డే జరుగనుంది. ఇందులో గెలిచే టీమ్‌కు సిరీస్ దక్కుతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. తొలి వన్డేలో భారత్, రెండో పోరులో సఫారీ టీమ్ జయభేరి మోగించాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారికే సిరీస్ దక్కుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఇరు జట్లు పరుగుల వరద పారించాయి. విశాఖలో కూడా భారీ స్కోర్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. రాయ్‌పూర్‌లో భారత్ భారీ స్కోరు సాధించినా లక్ష్యాన్ని కాపాడుకోలేక పోయింది. మొదటి వన్డేలో కూడా 349 పరుగులు చేసినా అతి కష్టం మీద విజయం సాధించింది. ఇరు జట్లకు బౌలింగ్ సమస్య వెంటాడుతోంది. అయితే బ్యాటర్లు జోరుమీదుందడం కలిస వచ్చే అంశంగా చెప్పాలి. దూకుడుమీదున్న విరాట్ ఓపెనర్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లిలు ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. వీరికి తోడు కిందటి వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ కళ్లు చెదిరే శతకంతో అలరించాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈసారి భారీ స్కోరు సాధించాలనే లక్షంతో ఉన్నాడు. రోహిత్‌తో కలిసి జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించాలని భావిస్తున్నాడు. ఇద్దరు శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే కోహ్లి, రుతురాజ్‌లు ధాటిగా ఆడేందుకు వీలుంటుంది. వరుసగా రెండు మ్యాచుల్లో శతకాలతో చెలరేగిన కోహ్లి ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. కోహ్లి విజృంభిస్తే భారత్‌కు మరోసారి భారీ స్కోరు ఖాయం. రుతురాజ్, రాహుల్‌లు కూడా తమ బ్యాట్‌లకు పనిచెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను బరిలోకి దించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. జోరుమీదున్న సఫారీ ఇక సౌతాఫ్రికా కూడా జోరుమీదుంది. మార్‌క్రమ్ కిందటి మ్యాచ్‌లో మెరుపు శతకం సాధించాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే క్వింటన్ డికాక్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. కానీ కెప్టెన్ బవుమా, మాథ్యూ బ్రిట్జ్‌కి, డెవాల్డ్ బ్రెవిస్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. అంతేగాక జాన్సన్, బోస్చ్, మహారాజ్ వంటి ఆల్‌రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇదిలావుంటే ఇరు జట్లను బౌలింగ్ సమస్య వెంటాడుతోంది. తొలి రెండు వన్డేల్లో బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో రెండు జట్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాయి. విశాఖ మ్యాచ్‌లోనైనా బౌలర్లు మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.   

మన తెలంగాణ 6 Dec 2025 7:51 am

India |పుతిన్ పర్యటన విజయవంతం..

India | పుతిన్ పర్యటన విజయవంతం.. India, న్యూఢిల్లీ ఆంధ్రప్రభ : రష్యా

ప్రభ న్యూస్ 6 Dec 2025 7:48 am

Bigg Boss Telugu 9: Kalyan wins Ticket to Finale amidst Controversies & Collusion

As the Ticket to Finale race intensified, today ‘s episode delivered drama, disputes and decisive victories. What began as a routine continuation of tasks quickly escalated into one of the most contentious episodes of the season, ultimately producing the first confirmed finalist. A Completed Task Reopens: Tanuja Questions Ritu’s Win The episode resumed at the […] The post Bigg Boss Telugu 9: Kalyan wins Ticket to Finale amidst Controversies & Collusion appeared first on Telugu360 .

తెలుగు 360 6 Dec 2025 7:42 am

Panchayat Elections |ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా..

Panchayat Elections | ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా.. Panchayat Elections,

ప్రభ న్యూస్ 6 Dec 2025 7:42 am

Nara Lokesh : నేటి నుంచి నారా లోకేశ్ విదేశీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు

తెలుగు పోస్ట్ 6 Dec 2025 7:38 am

Modi, Putin |ఒత్తిళ్లకు అతీతం.. మన బంధం..

Modi, Putin | ఒత్తిళ్లకు అతీతం.. మన బంధం.. Modi, న్యూఢిల్లీ ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 6 Dec 2025 7:27 am

Visakha : నేడు విశాఖలో భారత్ - దక్షిణాఫ్రికా మూడో వన్డే

నేడు విశాఖపట్నంలో భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది

తెలుగు పోస్ట్ 6 Dec 2025 7:25 am

Akhanda 2 |న్యూ రిలీజ్ డేట్ అప్ డేట్..

Akhanda 2 | న్యూ రిలీజ్ డేట్ అప్ డేట్.. Akhanda 2,

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:55 am

Nari Nari Naduma Murari |సంక్రాంతి బరిలో శర్వా..

Nari Nari Naduma Murari | సంక్రాంతి బరిలో శర్వా.. Nari Nari

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:29 am

Ayyappa Swamy |పడిపూజోత్సవం..

Ayyappa Swamy | పడిపూజోత్సవం.. Ayyappa Swamy, గోదావరిఖని, ఆంధ్రప్రభ : అయ్యప్ప

ప్రభ న్యూస్ 6 Dec 2025 6:07 am

లక్ష కోట్లే లక్ష్యం

మన తెలంగాణ/హైదరాబాద్: లక్ష కోట్లు లక్షం గా రాష్ట్రం ప్రభుత్వం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఫ్యూచర్ సిటీ లో ఏ రంగంలోనైనా సరే పెట్టుబడులు పెట్టేలా పె ట్టుబడిదారులను తెలంగాణ ప్రభుత్వం ఆకర్షిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మక కార్యాచరణను అమలు చేస్తోంది. దాదాపు 3 నెలల పాటు కసర త్తు చేసిన రూపొందించిన ఫ్యూచర్ సిటీ 4.0 ఫా ర్ములాను ప్రపంచం ముందు ఆవిష్కరించనుంది. డిసెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగా ణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047కు అనేక మంది ప్రముఖులు తరలి రానున్నారు. అనేక పరిశ్రమల అధినేతలతో పాటు ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లను తెలంగాణ ప్రభుత్వం ఒకే వేదికపైకి తీసుకురానుంది. సదస్సుకు 4,800 మందికి ఆహ్వానాలు పంపింది. చాలా మంది ప్రముఖులు సదస్సుకు వచ్చేందుకు అంగీకరించారు. 2 వేల మందికిపైగా అతిథులు వస్తారని సర్కారు అంచనా వేస్తోంది. కా గా ఫ్యూచర్ సిటీలో 70 ఎకరాల విస్తీర్ణంలో వరల్ ట్రేడ్ సెంటర్ నిర్మించే ఛాన్స్ ఉంది. ఈ సదస్సుకు గౌతమ్ అదానీ, అనంత్ అంబానీ, ఎరిక్ స్త్వ్రడర్ ఆనంద్ మహీంద్రా వంటి వారు కూడా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పె ట్టేందుకు పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. విద్య, నైపుణ్య,క్రీడా, పర్యాటక, పరిశ్రమ రంగాల్లో ప్రభుత్వంతో సుమారు 90కి పైగా పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 8, 9 న జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రూ.వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకునేందుకు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా పెట్టుబడుల ఆకర్షణను కీలక అంశంగా ప్రభుత్వం పరిగణిస్తోంది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించేలా ప్రణాళికలు రచిస్తోంది. స్థిరమైన విధానాలు, ప్రపంచస్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, వ్యాపార సౌలభ్యం, బలోపేతమైన ఆవిష్కరణ వ్యవస్థలు అన్నింటికి మించి మెరుగైన జీవన నాణ్యత ఈ ఐదు అంశాలు ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మార్చాయనే విషయాన్ని సదస్సులో సర్కార్ ప్రస్తావించనుంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులకు ఇప్పటికే 50 కంపెనీలు సంసిద్ధత తెలిపాయి. పలు సంస్థలతో ఒప్పందాలు ఫ్యూచర్ సిటీలో రూ.3 వేల కోట్లతో 3 హోటళ్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కన్వెన్షన్‌ను నిర్మించనున్న ఫుడ్ లింక్ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్-ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. వంతారా రిలయన్స్ గ్రూప్‌తో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నైట్ సఫారీపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అజయ్ దేవగన్‌తో ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై ఒప్పందం, ఐఐఎఫ్‌ఏతో ఫిల్మ్ ఇన్ తెలంగాణ కార్యక్రమంలో భాగస్వామ్యం, టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ తో పర్యాటక శాఖ పీఎంయూ స్థాపన ఒప్పందం చేసుకోనున్నారు. బౌద్ధ పర్యాటక సర్క్యూట్ ప్రోత్సాహంపై ఏసియన్ రాయబారులతో, కొత్వాల్ గూడలో ఆర్టిఫిషియల్ బీచ్‌పై స్పెయిన్‌కు చెందిన పూయిడ్రాతో ఒప్పందం చేసుకోనున్నారు. రూ.850 కోట్లతో ఫ్యూచర్ సిటీలో అర్బన్ బీచ్‌తో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ కోసం యూఎస్‌ఏకు చెందిన క్రిస్టల్ లగూన్స్ అండ్ గ్రీన్ పాంథర్స్ ప్రాపర్టీస్ లిమిటెడ్‌తో ఎంవోయూ కుదుర్చుకోనుంది. రూ.70 వేల కోట్లతో హైపర్ వాల్ట్ డేటా సెంటర్ల ఏర్పాటుపై టీసీఎస్-టీపీజీతో సర్కార్ ఒప్పందం చేసుకోనుంది. రూ.850 కోట్లతో ఏఐ కార్యక్రమాలు, డేటా సెంటర్లకు అక్విలోన్ నెక్సస్ లిమిటెడ్ అండ్ నార్త్‌స్టార్ ఆపర్చునిటీస్ ఫండ్‌తో అవగాహన కుదుర్చుకోనున్నారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ విస్తరణకు చందన్‌పల్లిలో భూమి కేటాయించనున్నారు. రూ.8 వేల కోట్లతో జహీరాబాద్‌లో హ్యుండాయ్ టెస్ట్ ట్రాక్, తయారీ ప్లాంట్‌తో పాటు రూ.400 కోట్లతో ప్లాంట్ల విస్తరణకు మహీంద్రా అండ్ మహీంద్రాతో ఒప్పందం చేసుకోనున్నారు. ఫాక్స్‌కాన్‌తో ఫిట్ పేజీ -2 విస్తరణ ఒప్పందం చేసుకోనున్నారు. రూ.1500 కోట్లతో ఎంఎస్‌ఎన్, రూ.200 కోట్లతో బయోలాజికల్-ఈ తో పరిశోధన అభివృద్ధి హబ్‌ల ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకోనుంది. లులు-హైపర్‌తో విమానాశ్రయానికి సమీపంలో లులు హైపర్ మాల్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. పెట్టుబడులకు ప్రముఖ కంపెనీల ఆసక్తి రూ.150 కోట్లతో హౌజింగ్ ఎక్విప్ తయారీ ప్లాంటుకు జపాన్‌కు చెందిన లిక్సిల్ గ్రూప్‌తో అవగాహన ఒప్పందాన్ని సర్కార్ కుదుర్చుకోనుంది. టీసీసీఐతో కొంగరకలాన్ సమీపంలోని తైవాన్ మినీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఎంవోయూ చేసుకోనున్నారు. సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్‌తో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్కు, ట్రంప్ మీడియా అండ్ టెక్ గ్రూప్ బీ టెక్స్‌తో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఆల్ట్ మిన్‌తో ఎస్‌సీసీఎల్, కబిల్ భాగస్వామ్యంతో దేశంలోనే తొలి లిథియం రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. మొత్తం 250 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఫేజ్-1లో 50 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేలా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కానుంది. రూ.4 వేల కోట్లతో నేపియర్ గడ్డి ఆధారంగా చేసుకునే 25 సీబీజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అధిరాథ్ హోల్డింగ్స్‌తో ఒప్పందం చేసుకోనున్నారు. హార్ట్ ఫోర్డ్ ఇన్సూరెన్స్, జురిచ్ ఇన్సూరెన్స్, నెట్‌ఫ్లిక్స్, ఎల్-ఓరియల్ ఓఎస్‌ఎఫ్ డిజిటల్ జీసీసీల ఏర్పాటుకు అవగాహన కుదరనుంది. రూ.350 కోట్లతో సనౌఫీ జీసీసీ విస్తరణతో పాటు పంచ్ ఏఐ ఆధ్వర్యంలో ఏఐ టెక్ సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకోనున్నారు. టామ్‌కామ్‌తో కలిసి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జర్మనీకి చెందిన నెక్స్‌వేవ్ మొబిలిటీ, తైవాన్ నియామకాలు, అపోలో మెడ్‌స్కిల్స్‌తో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు చేసేలా యూనివర్సిటీ ఆఫ్ లండన్‌తో ఒప్పందం జరగనుంది. దుబాయ్ జీఎంఆర్ స్పోర్ట్ వెంచర్స్‌తో ఫ్యూచర్ సిటీ శాటిలైట్ స్పోరట్స్ సిటీ అభివృద్ధికి అవగాహన కుదుర్చుకోనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫిఫా ఐఎఫ్‌తో మహిళల ఫుట్‌బాల్ అకాడమీ, పురుషుల ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ప్రధాన క్రీడా టోర్నమెంట్ల నిర్వహణపై సదస్సులో ప్రకటన చేయనున్నారు. సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ ఫండ్‌ను ఆవిష్కరించనున్నారు. దేశ తొలి సమగ్ర తారామండల్ ఆర్బిటల్ వాహన వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. బ్లూ ఎర్త్ క్లైమెట్ తో కలిపి నెట్ జీరో ప్రాజెక్ట్ పెట్టనున్నారు. స్టెప్తో స్కూల్ ఆఫ్ టూరిజం కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కోసం టవర్స్ ఏర్పాటు సుమారు 3 వేల మంది దేశ, విదేశీ అతిథులు ఈ సదస్సుకు హాజరు అవుతారని అంచనా. సీఎం, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఇతర సేవలందించే వారిని కలుపుకుంటే సుమారు 5 వేల మంది వరకు ప్రాంగణం లోపల, బయట ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరందరికీ సెల్ ఫోన్ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు సెల్ టవర్ ఆన్ వీల్స్ విధానంలో బీఎస్‌ఎన్‌ఎల్, జియో, వొడాఫోన్, ఎయిర్‌టెల్ తదితర నెట్‌వర్క్‌ల టవర్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మొబైల్ నెట్‌వర్క్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వంద ఎకరాల్లో భారీ ఏర్పాట్లు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వంద ఎకరాల్లో ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. యాభై ఎకరాల్లో పార్కింగ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ఒకవేదికపై ప్రతినిధులు ప్రసంగించడానికి, మరొక వేదికను తెలంగాణ సాంస్కృతిక కళాకారులు విభిన్న ప్రదర్శనలు చేయనున్నారు. వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు చర్చించుకోవడానికి ప్రత్యేక లాంజ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించనుంది.

మన తెలంగాణ 6 Dec 2025 6:00 am

రెఫరెండం అన్నవారిని బండకేసి కొట్టారు

మన తెలంగాణ/నర్సంపేట: జూబ్లీహిల్స్ ఉప ఎ న్నికను రెఫరెండంగా ప్రకటించిన వారిని ఓటర్లు బండకేసి కొట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్ప ష్టం చేశారు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో ఓ టమిపాలవుతున్నా జనంలో తిరుగుతున్నారని ఆక్షేపించారు. ‘రాష్ట్ర ప్రజలంతా నాకు అండగా ఉండండి.. ఢిల్లీని ఢీకొడతా.. ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా.. కేంద్ర మంత్రులను కలిసి నిధులు తీసుకొ స్తా. నాకు వయస్సు ఉంది. ఓపిక ఉంది’ అని రే వంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా పాల న.. ప్రజా విజయోత్సవాల సభ వరంగల్ జిల్లా, నర్సంపేట పట్టణ కేంద్రంలో శుక్రవారం జరిగిం ది. ఈ సందర్భంగా సుమారు రూ.508.84 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభకు నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతి మాధవరెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, పలువురు ఎంఎల్‌ఎ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సిఎం మాట్లాడుతూ.. 2023, డిసెంబరు 3న గడిల పాలనను బద్దలుకొట్టి ఓటు అనే ఆయుధంతో ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయి.. అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశించగా తెలంగాణ రావడంతో వాళ్ల ఆస్తులు పెరిగాయి.. ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. హెలికాఫ్టర్లు కొనుక్కున్నారని పరోక్షంగా గత పాలకులను ఉద్దేశించి తీవ్రంగా ఆరోపించారు. గత ముఖ్యమంత్రి వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని, రైతులకు ఉరే అని మీ దిక్కున్నచోట చెప్పుకోమంటే..తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గింజ లేకుండా సన్న వడ్లు కొనుగోలు చేసి రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ వస్తే రైతులకు 24 గంటలు కరంటు ఉండదన్న వారి గడీల్లో కరంటు లేకుండా పోయి రైతులకు 24 గంటల కరంటు ఇస్తున్నామన్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత విద్యుత్‌ను అమలుచేశారని, ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్‌దేనని అన్నారు. ఎకరాకు గత ప్రభుత్వం రైతు బంధు రూ.10 వేలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.12 వేలు ఇచ్చి రైతులకు భరోసా ఇచ్చిందన్నారు. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు రూ.20.614 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. దేశంలోనే అత్యధిక శాతం ధాన్యం పండిస్తున్నది తెలంగాణ రాష్ట్రమని, మన దగ్గర పండిన 56 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశామన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని ప్రతీ గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకుంటున్నామని అన్నారు.రాష్ట్రంలో గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిన దిక్కులేదని కాంగ్రెస్ ప్రభుత్వం 1.10 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే ఏ ఒక్కరూ అవి తినకుండా మళ్లీ రేషన్ షాపు డీలర్‌కే అమ్ముకొని రీసైక్లింగ్ చేసుకొనేవారని అన్నారు. తాము అలా కాకుండా ప్రతీ పేద వాడు సన్న బియ్యం తినాలని 3.10 కోట్ల మంది ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నామని అన్నారు. ఈ పథకం వల్ల సంవత్సరానికి రూ.13 కోట్లు భారం అయినప్పటికీ పేదల శ్రేయస్సు కోసం భరిస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఉండని గ్రామం లేదు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా హనుమాన్ గుడి లేని గ్రామం ఉండదని.. కానీ ఇందిరమ్మ ఇల్లు ఉండని గ్రామం లేదన్నారు. తెలంగాణలో ప్రతీ నియోజకవర్గానికి గూడు కల్పించాలనే లక్షంతో 3,500 ఇళ్లు మంజూరు చేశామన్నారు. వచ్చే బడ్జెట్‌లో నర్సంపేట నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాను గత ప్రభుత్వం అభివృద్ధిలో పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణలో కనీసం రెండో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా గత ప్రభుత్వం చేయలేదని వ్యాఖ్యానించారు. గత కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుచేసిందన్నారు. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలని, మామునూరులో ఎయిర్‌పోర్టు, నగరంలో అండర్ డ్రైనేజీ, ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. మార్చి 31 వరకు వరంగల్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభించబోతున్నామని అన్నారు. తెలంగాణలో కోటి మంది మహిళలకు పుట్టింటి సారె ఇవ్వాలనే లక్షంతో ఓ అన్నలా ప్రతీ ఆడబిడ్డకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇప్పటివరకు 65 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ జరిగిందని, కొన్ని గ్రామాల్లో ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీ చేయలేదని, ఎన్నికల అనంతరం వాటిని పూర్తి చేస్తామన్నారు. పట్టణాల్లోని మహిళల్లో 35 వేల మందికి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మహిళలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, ప్రతీ ఒక్కరూ విద్యపై దృష్టి ఉంచి ఐఏఎస్, ఐపిఎస్, ఇంజినీర్లుగా, డాక్టర్లుగా రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేకంగా విద్యపైనే దృష్టి పెట్టాలని చదువుతోనే జీవితంలో మార్పు వస్తుందని, విద్యారంగం ముందుకెళ్లడానికి బాధ్యత తనదే అన్నారు. త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 61 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నిరుద్యోగ యువత పోటీపడి ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలను సాధించాలని సూచించారు. గ్రామాల్లో జరిగే ఎన్నికలపై యువత దృష్టి పెట్టవద్దని.. ఎన్నికల్లో ఎప్పుడైనా పోటీ చేయవచ్చని ప్రభుత్వ ఉద్యోగానికి మాత్రం వయస్సుతో ముడిపడి ఉంటుందన్నారు. విద్యతోనే అన్ని రంగాల్లో రాణించవచ్చని అందుకు తాను, ఇక్కడున్న మంత్రులు సీతక్క, సురేఖ ఉదాహరణ అన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల మనస్సులు గెలుచుకోండి స్థానిక ఎన్నికల్లో ప్రజల మనస్సులు గెలుచుకోండి. పైసలు ఖర్చు పెట్టకండి గ్రామాభివృద్ధే లక్షంగా ఎవరైతే గ్రామంలో సమస్యల పరిష్కారానికి మంత్రి వద్దకు వెళ్లి కృషిచేసే అవకాశాలున్న వ్యక్తులను ఎంచుకొని వారిని గెలిపించుకోవాల అన్నారు. ‘మీరు ఎన్నుకోబోయే సర్పంచ్ ప్రభుత్వ పథకాలను సాధించగలిగే వ్యక్తి కావాలని.. మహిళలకు ఎవరికైతే ఇందిరమ్మ చీరలు రావో వారికి కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ చేసే బాధ్యత ఆ గ్రామ సర్పంచ్‌దే’ అని స్పష్టం చేశారు. జనవరిలో మేడారం జాతరకు వచ్చి తల్లులను దర్శించుకుంటానని తెలిపారు. ఈ సభలో మహబూబాబాద్ ఎంపి పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, రామచంద్రునాయక్, ఎంఎల్‌సి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 5:30 am

బంధం బలోపేతానికి ఐదేళ్ల ప్రణాళిక

న్యూఢిల్లీ: అమెరికా భారీగా విధిస్తున్న సుంకాలు, ఆం క్షల నేపథ్యంలో భారతదేశం రష్యా వచ్చే ఐదేళ్లలో ఆర్థి క, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఓ ప్రణాళికపై శుక్రవారం నాడు నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశం - రష్యా మధ్య ఎనిమిది దశాబ్దాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, మరింద దృఢంగా కొత్త పుంతలు తొక్కేలా చేసేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. రష్యా - భారతదేశం వార్షిక శిఖరాగ్ర చర్చల సందర్భంగా ఉభయు లూ ప్రసంగిస్తూ, రెండు దేశాల స్నేహబంధం ఎప్పటికీ కొనసాగుతుందని, భౌగోళిక, రాజకీయ గందరగోళ పరిస్థితులు ఉన్నా, స్నేహబంధం దృవనక్షత్రంలా స్థి రంగా ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పరస్పర గౌరవం, దృఢ నమ్మకంపై నిర్మించిన ఈ స్నేహబంధం ఎల్లప్పుడూ కాలపరీక్షకు నిలిచిందని. ఈ పునాది మరింత బలోపేతం చేయడానికి అన్నిరంగాలలో సహకారంపై శుక్రవారం నాడు చర్చించామని, ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యం అన్నారు ప్రధాని మోదీ. 2030 ఆర్థిక కా ర్యక్రమాన్ని ఖరారు చేయడంతో పాటు, ఆరోగ్యం, ఆ హార భద్రత, షిప్పింగ్ రంగాలతో పాటు వలసలు, ప్ర జల మధ్య పరస్పర మార్పిడి వంటి అనేక రంగాలలో సహకారాన్ని విస్తరించడానికి సంబంధించిన అనేక ఒ ప్పందాలపై ఉభయపక్షాలు సంతకాలు చేశాయి. ర ష్యా పౌరులకు భారతదేశం త్వరలో 30 రోజుల ఉచిత ఈ- టూరిస్ట్ వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసాలను ప్రవేశపెడుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. రెండు పక్షాలు వార్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతం ఉన్న 64 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచాలని చూస్తున్నాయని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తెలిపారు. భారతదేశం ఇంధన అవసరాలను తీర్చడానికి రష్యా చమురు, గ్యాస్, బొగ్గు వంటి ఉత్పత్తుల నమ్మకమైన సరఫరాదారు అని పుతిన్ స్పష్టం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం ఇంధనాన్ని నిరంతరాయంగా రవాణా చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. భారత ఉత్పత్తులకు రష్యా మార్కెట్ కల్పిస్తుందని, చిన్న, మాడ్యులర్ అణు రియాక్టర్లు, తేలియాడే అణువిద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సహకారం కోసం ఇరు పక్షాలు ఆసక్తితో ఉన్నాయని కూడా పుతిన్ తెలిపారు వైద్య, వ్యవసాయ రంగాలలోనూ రష్య సహాయం అందించగలదని తెలిపారు. మోదీ మాట్లాడుతూ, ఇంధన భద్రత ఉభయదేశాల భాగస్వామ్యానికి బలమైన పునాది అన్నారు పౌర అణుశక్తి రంగంలో సహకారం చాలా కీలకమని పేర్కొన్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 5:00 am

బంగారు భవిష్యత్ ఎమ్మెల్యే బత్తుల

విద్యార్థుల బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వ లక్ష్యంగా అనేక సంస్కరణలతో ముందుగు సాగుతుంది అని రాజానగరం నియోజకవర్గఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ , ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గార్ల సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం సీతానగరం మండలం […] The post బంగారు భవిష్యత్ ఎమ్మెల్యే బత్తుల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Dec 2025 4:38 am

కుటుంబ విలువలు బంధాలు పెరుగుతాయి

విశాలాంధ్ర – కొవ్వూరు: కుటుంబాలు, బంధాలు, విలువలు విద్యార్థులు లో పెరిగేందుకు పేరెంట్స్ టీచర్స్ మీట్ దోహదపడుతుంది అని పూర్వ విద్యార్థి, జిల్లా టిడిపి వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు మద్దుల సత్యనారాయణ అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర ఎయిడెడ్ పాఠశాల లో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ చిట్టెం బాలకృష్ణ, స్కూల్ మేనేజ్మెంట్ […] The post కుటుంబ విలువలు బంధాలు పెరుగుతాయి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Dec 2025 4:33 am

త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు

మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రా ష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. తొలి విడత లో 4లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశా లు జరుగుతాయని తెలిపారు. 3 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, జూన్ నా టికి మరో 2లక్షల గృహ ప్రవేశాలు జరుగనున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏ డాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పారు. పార్టీలతో సంబంధం లే కుండా, కులమత బేధాలు లేకుండా పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపా రు. లబ్దిదారుల ఖాతాలకే నేరుగా నిధులు జమ చేస్తున్నామని చెప్పారు. కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో కొంతమంది పంచాయతీ కార్యదర్శులను విధుల నుంచి తొలగించామని అన్నారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతోపాటు భవిష్యత్తులో పేదల ఇండ్లకు ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పథకాలను వివరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని పేర్కొన్నారు. పేదలకు ఇళ్లు..ఆత్మగౌరవం, భద్రత, భరోసా అని వ్యాఖ్యానించారు. పేదలకు ఇండ్ల నిర్మాణంపై తమ ఎన్నికల వాగ్దానాలను అమలు చేసేలా తమ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కార్యాచరణ చేపడుతుందని తెలిపారు. రాబోయే మూడేళ్లలో అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందుగా ఇంటి స్థలం ఉన్నవారు ఇండ్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు. మూడో విడతలో వచ్చే ఏడాది ఇంటి స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కొత్త పథకం తీసుకురానున్నట్లు వెల్లడించారు. నగరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రణాళిక రాష్ట్రంలోని జిహెచ్‌ఎంసితో సహా అన్ని పట్టణాలు, నగరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రణాళిక సిద్దమైందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందుకోసం ముంబయి, బెంగుళూరు, ఢిల్లీ నగరాలలో అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించామని చెప్పారు. త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రకటిస్తామని అన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల సమస్యను శాస్త్రీయంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే జి ప్లస్ 3 లేదా జి ప్లస్ 4 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే విధంగా త్వరలో పాలసీని ప్రకటించబోతున్నామని వెల్లడించారు. పట్టణాలలో నివాసం ఉండే చిరువ్యాపారులకు, చిన్న చిన్న పనులు చేసుకునే కుటుంబాలకు చెందిన వారికి దూరం ప్రాంతాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తే వారు అక్కడ నివాసం ఉండటం లేదని, వారు మళ్లీ నగరంలోని మురికివాడల్లోనే నివాసం ఉంటూ తమ జీవనోపాధికి అవసరమైన పనులు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో నగరంలోనే పేదలకు ఇండ్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివాసం ఉండని వారిని గుర్తించి వారికి కేటాయించిన ఇండ్లను ఆయా ప్రాంతాలలో అర్హులైన పేదలకు ఇస్తామని తెలిపారు. నగరంలో నివాసం ఉండే చిరువ్యాపారులు, చిన్న చిన్న పనులు చేసుకునే వారి కోసం నగరంలోనే ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. మధ్యతరగతి ప్రజలకు ఇండ్ల కోసం త్వరలో కొత్త పాలసీ మధ్యతరగతి ప్రజల సహా అందరికీ అందుబాటులో ఉండే విధంగా(అఫర్డబుల్ హౌజింగ్ స్కీం) రెండు మూడు నెలల్లో పాలసీని ప్రకటించబోతున్నామని పేర్కొన్నారు. దీనికోసం ఓఆర్‌ఆర్ చుట్టూ నాలుగు స్థలాలను గుర్తించామని తెలిపారు. వైఎస్‌ఆర్ హయాంలో తీసుకువచ్చిన రాజీవ్ స్వగృహ పథకం తరహాలో పట్టణ ప్రాంతాల ప్రజలకు ఇండ్ల నిర్మాణం కోసం త్వరలో కొత్త పథకం తీసుకురానున్నట్లు వెల్లడించారు. గృహ నిర్మాణ శాఖను పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను పూర్తిగా రద్దు చేస్తే పేదలకు పక్కా ఇండ్లు నిర్మించాలన్న ఆలోచనతో తిరిగి గృహ నిర్మాణ శాఖను పునరుద్దరించామని, దీనికోసం 394 మంది డిఇలను వెనక్కి రప్పించి 800 మంది కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకున్నామని తెలిపారు. వివిధ శాఖల నుంచి అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకుని వ్యవస్థను పటిష్టం చేశామని వివరించారు. హౌజింగ్ బోర్డు లీజుకు వచ్చిన సుమారు వెయ్యి ఎకరాలను స్వాధీనం చేసుకుని ప్రహరీ గోడలు నిర్మించామని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నవాటిని తొలగించి హైరైజ్ అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని అన్నారు. గృహ జ్యోతి పథకంతో పాటు గతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మధ్యలోనే వదిలేసిన సుమారు 15 వేల మందికి కొత్త పథకం వర్తించేలా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హిల్ట్ పాలసీపై కెటిఆర్ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ హిల్ట్ పాలసీపై బిఆర్‌ఎస్ విమర్శలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిప్పికొట్టారు. మీడియా సమావేశంలో హిల్ట్ పాలసీపై బిఆర్‌ఎస్ ఆరోపణలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానమిచ్చారు. హిల్ట్ పాలసీలో రెండు అంశాలు బిఆర్‌ఎస్ పాలనలో వచ్చినవే అని, ఆ ఫైల్‌పై మంత్రిగా కెటిఆర్ సంతకం చేసిన సంగతి మరిచారా...? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కోకాపేట, నియోపోలిస్ ప్లాట్లు వేలం వేశారని అన్నారు. హిల్ట్ పాలసీని దోపిడీ పాలసీ అంటున్న కెటిఆర్‌కు ఇవి గుర్తులేవా..? అని అడిగారు. ఓఆర్‌ఆర్ నిర్వహణను కూడా వేలం వేశారని విమర్శించారు. తండ్రి ముఖ్యమంత్రిగా కొడుకు పరిశ్రమల శాఖ మంత్రిగా కావలసిన వారి దగ్గర ముడుపులు తీసుకొని భూములను కన్వర్షన్ చేశారు.. ప్రభుత్వ భూములు వేలం వేశారని అన్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాది ఎకరాలు వేలం వేశారని మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌బి నగర్‌లోని దాదాపు 40 ఎకరాల స్ధలాన్ని పివి రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇచ్చిందని, అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ తోటి భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన కూడా చేశారని గుర్తు చేశారు. ఈ కెమికల్ ఇండస్ట్రీని రెసిడెన్షియల్ జోన్‌గా మార్చింది బిఆర్‌ఎస్ కాదా..? అని ప్రశ్నించారు. ఈ ఫైలుపై అయ్యా కొడుకులు సంతకాలు చేయలేదా.. ఏ పాలసీతో ఈ కన్వర్షన్ చేశారు..? అంటూ నిలదీశారు. ఐడిపిఎల్‌లో కూడా ఇదే విధంగా చేశారని అన్నారు. కెటిఆర్ కడుపునిండా విషమే ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిల్ట్ పాలసీపై బిజెపి, బిఆర్‌ఎస్‌ది ఒకే డ్రామా అని, స్క్రిప్ట్ రాసేది ఒకరు... డెలివరీ చేసేది మరొకరు అని విమర్శించారు. నా కొడుకైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు: మంత్రి పొంగులేటి తప్పు చేస్తే తన కుమారుడైనా, తాను అయినా శిక్షకు అర్హుడేలమే అని, చట్టం ముందు అందరూ సమానమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తన కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థపై నమోదైన భూ వివాదం కేసుకు సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారని అన్నారు. తాము ప్రభుత్వంలో ఉన్నామని తన కుమారుడిపై కేసు నమోదు చేయవద్దని చెప్పే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. కేసు నమోదైన తర్వాత విచారణలో నిజ నిర్ధారణ జరుగుతుందని పేర్కొన్నారు. 

మన తెలంగాణ 6 Dec 2025 4:30 am

మండలంలో ఘనంగా మెగా పిటిఎం3.0

విశాలాంధ్ర – నల్లజర్ల : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యం అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు అన్నారు. నల్లజర్ల మండలం దూబచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పి.టీఎం3.0 ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను […] The post మండలంలో ఘనంగా మెగా పిటిఎం3.0 appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Dec 2025 4:23 am

కష్టాలకు వెరవకుండా పనిచేయాలి

మన తెలంగాణ/హైదరాబాద్/ముర్కుక్: అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు అని, కష్టాలకు వెరవకుండా పనిచేయాలని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలకు సూచించారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ధీ మా వ్యక్తం చేశారు. పల్లెలకు మంచి రోజులు వస్తాయని, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూ ర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుం టూ ముందుకు నడవాలని గ్రామస్థులకు వివరించారు. తాను దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచు లు, వార్డు మెంబర్లు శు క్రవారం కెసిఆర్‌ను మ ర్యాద పూర్వకంగా కలి సి ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామస్థుల సమష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచులను కెసిఆర్ శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్‌ను కలిసిన వారిలో నూతనంగా ఎన్నికైన ఎర్రవెల్లి గ్రామ సర్పంచి, నారన్నగారి కవితా రామ్మోహన్ రెడ్డి  దంపతులు, ఆ గ్రామ ఉప సర్పంచ్ ఎడ్మ సబితా కరుణాకర్ సహా వార్డు మెంబర్లు., నర్సన్న పేట గ్రామ సర్పంచ్ గిలక బాల నర్సయ్య సహా ఇరు గ్రామాలకు చెందిన ప్రముఖులు, మాజీ ఎంఎల్‌సి శేరి సుభాష్ రెడ్డి తదితరులు ఉన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని, మన పని మనం చేసుకుంటూ, మన పల్లె అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఎవరో ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని తెలిపారు. ఈ సందర్భంగా వారికి జాతీయ అంతర్జాతీయంగా పల్లెల ప్రగతికోసం గొప్ప వ్యక్తులు చేసిన కృషి గురించి కెసిఆర్ వివరించారు. బంగ్లాదేశ్‌కు చెందిన సామాజిక ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు స్ఫూర్తిదాత ప్రొఫెసర్ యూనిస్‌తో పాటు మన దేశానికే చెందిన అన్నా హజారే లాంటి దార్శనికుల గురించి వారి కృషిని వివరించారు. వారిని ఆదర్శంగా తీసుకుని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో తమ పల్లెలను సామాజిక ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చి దిద్దుకోవాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 6 Dec 2025 4:00 am

ఇండిగో సంక్షోభంపై విచారణ

న్యూఢిల్లీ: ఇండిగో విమాన యాన సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని, మూడు రోజుల్లో పూర్తి స్థా యిలో విమాన సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రమ్మోహన్ నాయుడు శుక్రవారం అన్నారు. ఇం డిగో విమానాల రద్దు, విమానాల రాకపోకల  జాప్యం నివారణకు, కొత్త విమాన డ్యూటీ నిబంధనలను పక్కన పెట్టామని, వివిధ కార్యాచరణ చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. గత నాలుగు రోజులుగా వందలాది ఇండిగో విమానాల రద్దు, జాప్యానికి దారితీసిన కారణాలు కనిపెట్టి, జవాబుదారీ ఎవరద్దని నిర్ధారించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపించేందుకు నిర్ణయించింది. విమానాల షెడ్యూల్ లో, ముఖ్యంగా ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాల షెడ్యూల్ లో కొనసాగుతున్న సమస్యల పరిష్కారానికి పౌరవిమానయాన మంత్రిత్వశాఖ అత్యవసర చర్యలు చేపట్టినట్లు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) నిర్దేశించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్ డిటిఎల్) ఆదేశాలను తక్షణమే నిలిపివేశారు. విమాన భద్రత విషయంలో రాజీ పడకుండా, ముఖ్యంగా విమాన ప్రయాణంపై ఆధారపడే సీనియర్ సిటిజన్లు, ఇతర పౌరుల ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పౌర విమానయాన శాఖమంత్రి ఆదేశాలతో విమాన సర్వీసులు వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా చర్యలు మొదలయ్యాయి. మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో పైలట్ల విధుల నిబంధనల్లో మార్పులు న్యూఢిల్లీ : స్వదేశీ సంస్థ ఇండిగో విమాన సర్వీసుల గందరగోళంతో వేలాది మంది ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఇండిగోకు ఊరట కలిగించేలా పైలట్ల విధుల నిబంధనలను సవరించింది. గతంలో పైలట్లకు వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచగా, ఇప్పుడు ఈ విశ్రాంతి సమయాన్ని సెలవుగా పరిగణించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అంతకు ముందు ఈ వీక్లీ రెస్ట్‌ను సెలవుగా పరిగణించే అవకాశం లేదు. వీక్లీ రెస్ట్ పీరియడ్, సెలవులను వేర్వేరుగా చూసేవారు. పైలట్ల అలసట సమస్యను పరిష్కరించేందుకు ఈ కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇండిగో సర్వీసుల రద్దు నేపథ్యంలో ఈ నిబంధనను ఇండిగో అభ్యర్థనపై సడలించారు. పైలట్లు వరుసగా రెండు కంటే ఎక్కువ రాత్రి షిఫ్టులు చేయకూడదనే నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు డీజీసీఎ తెలిపింది. ఇండిగో సంస్థ పైలట్లు వారంలో ఆరు నైట్‌డ్యూటీలు నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం కొనసాగుతున్న గందరగోళాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీజీసీఎ తెలిపింది. ఈ మినహాయింపులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వరకు అమలులో ఉంటాయని వెల్లడించింది.న అంతేగాక, ప్రతి 15 రోజులకోసారి వీటిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది. ఇదంతా ప్రభుత్వ గుత్తాధిపత్య ఫలితమే : రాహుల్ న్యూఢిల్లీ : ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలకు ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మరోసారి సాధారణ పౌరులో ఈ నిస్సహాయతకు మూల్యం చెల్లించుకోవలసి వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితి మరోసారి ఎదురుకాకుండా ఉండేలా విమానయాన రంగంతోసహా అన్నింటిలోనూ న్యాయమైన పోటీ ఉండాలని ,అంతేతప్పమ్యాచ్ ఫిక్సింగ్, గుత్తాధిపత్యాలు కాదంటూ మండిపడ్డారు . కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి పవన్‌ఖేరా విమానాశ్రయాల్లో ఈరోజు గుత్తాధిపత్యమే జరుగుతోందన్నారు. ఇద్దరు వ్యక్తులు పార్టీని నడిపిస్తారు. ఇద్దరు ప్రభుత్వాన్ని పాలిస్తారు. ఇద్దరు వాణిజ్యాన్ని నిర్వహిస్తారు. అందువల్ల ఏం జరుగుతుంది ? అని ప్రశ్నించారు. ‘విమానయాన రంగంలో 92 శాతం వాటా కేవలం రెండు కంపెనీల ఇండిగో, టాటా చేతుల్లో ఉంది. ప్రభుత్వం వారి ముందు మోకరిల్లుతోంది. ఈ కంపెనీల ఒత్తిడి వల్ల నూతన ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు వదులుకోవలసి వస్తుంది ’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ దేశం మొత్తం మీద చాలా సంస్థలు కేవలం కొంతమంది చేతుల్లో ఉంటున్నాయని , అదే ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ఇది దేశానికి, ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన పరిణామం కాదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒకప్పుడు పోటీ ఉండే ఈ పరిశ్రమను కేవలం ఇద్దరి వరకే పరిమితం అయ్యేలా మోడీ ప్రభుత్వం దిగజార్చిందని విమర్శించారు. 

మన తెలంగాణ 6 Dec 2025 3:30 am

హవాలా రాకెట్ గుట్టురట్టు

మన తెలంగాణ/సికింద్రాబాద్: పోలీసుల కళ్లుగప్పి ఏడాది కాలంగా తప్పించుకు తిరుగుతున్న కేటగాళ్లను బోయిన్‌పల్లి పోలీసులు ఆరెస్టు చేసి వారి వద్ద నుండి 4.05 కోట్ల రూపాయల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డిసిపి కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి రష్మీ పెరుమాల్ వివరాలను వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. 2024 డిసెంబర్‌లో నాగోల్‌కు చెందిన విశ్వనాథచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లిలో చీటింగ్ కేసు నమోదు చేశారు. విశ్వనాథచారి ఆయన మి త్రులు ప్రదీప్, రవిలు మధ్యవర్తి మహ్మద్ సుబాన్ కు 50 లక్షల రూపాయల నగదును అందజేశా రు. ఆర్‌టిజిఎస్ ఎక్సైంజ్ ద్వారా 60 లక్షలు ఇస్తామని నమ్మబలికి వారికి తిరిగి ఇవ్వకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు గత సంవత్పరం డిసెంబర్‌లో బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా పెట్టిన బోయిన్‌పల్లి పోలీసులు ప్రధాన నిందితుడు ప్రకాష్ మోతిబాయ్ ప్రజాపతి (30)తోపాటు మరో నిందితుడు ప్రగ్నేష్ కీర్తిబాయ్ ప్రజాపతి (28)లను మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల పోలీస్ స్టేషన్ పరిధిలో హుండాయ్ కారులో ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించగా 50 లక్షలు తీసుకొని ఫిర్యాదుదారుని మోసం చేసినట్టు అంతేకాకుండా 4.05 కోట్ల నగదును హవాలా మార్గంలో నాగ్‌పూర్ నుండి బెంగళూరుకు తరలిస్తున్నట్టు తెలిపారు. 4.05 కోట్ల నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. హవాలా ద్వారా నగదును బదిలీ చేయడం, అదిక మొత్తం చెల్లిస్తామని నమ్మబలికి డబ్బులు వసూలు చేయడమే వృత్తిగా కొనసాగుతున్నట్టు దర్యాప్తులో తేలిందని తెలిపారు. కేసును ఛేదించడంలో సహకరించిన బోయిపల్లి పోలీస్‌స్టేషన్ డిఐ ఎంఎన్ ఆనందర్, డిఎస్‌ఐ కె. చందర్, నార్త్‌జోన్ సైబర్ సెల్ ఎస్‌ఐ శ్రీధరన్, కార్కాన ఎస్‌ఐ అశోక్ రెడ్డి తో పాటు సిబ్బందిని ఆమె అభినందించారు. ఆత్యాశకు పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దని , అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తామనే మోసగాళ్ల మాటలు నమ్మవద్దని ఆమె ప్రజలకు సూచించారు. 

మన తెలంగాణ 6 Dec 2025 3:00 am

శనివారం రాశి ఫలాలు (06-12-2025)

మేషం మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృషభం చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మిధునం వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. కర్కాటకం వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విభేదాలు మానసికంగా చికాకుగా వస్తాయి. సింహం చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్య పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. స్థిరస్తి వివాదాలలో శిరో బాధలు తప్పవు. తుల వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వృశ్చికం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు . ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. మకరం ఉద్యోగులకు పనిఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పనుల్లో ఆటంకాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కుంభం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.  

మన తెలంగాణ 6 Dec 2025 12:10 am

భారీ బ్యాటరీతో రెడ్‌మి 15సి 5జి ఫోన్

షియోమీ ఇండియా రెడ్‌మి 15సి 5జిను విడుదల చేసింది. ఈ మొబైల్ ఫీచర్లు చూస్తే, 17.53 సెం.మీ. భారీ డిస్‌ప్లే, స్లిమ్ 3డి క్వాడ్ కర్వ్ డిజైన్, 50ఎంపి ఎఐ కెమెరా, 6000 ఎంఎహెచ్ బ్యాటరీ, 33డబ్లు టర్బో ఛార్జింగ్ వంటివి ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 16జిబి వరకు ర్యామ్, 1టిబి స్టోరేజ్, హైపర్ ఓఎస్2తో వస్తుంది. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. షియోమీ సిఎంఒ అనుజ్ శర్మ మాట్లాడుతూ, ఈ ఫోన్ రోజువారీ వినియోగదారుల అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ఫోన్ ధరలు రూ.12,499 నుంచి ప్రారంభమవుతాయి.

మన తెలంగాణ 5 Dec 2025 11:20 pm

సోమాజిగూడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: సోమాజిగూడలోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రెస్టారెంట్ కిచెన్‌ నుంచి

ప్రభ న్యూస్ 5 Dec 2025 11:08 pm

శ్రీకన్య రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

పంజాగుట్టలోని శ్రీకన్య రెస్టారెంట్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్‌లోని కిచెన్‌లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటితో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రావడంతో రెస్టారెంట్‌లోని కస్టమర్లు, సిబ్బందిని బయటికి పంపించి మంటలను ఆర్పివేశారు.బిల్డింగ్ 5వ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ నుండి పొగలు రావడంతో స్థానికులు, బిల్డింగ్ లో ఉన్న వాళ్లు భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 5 Dec 2025 10:56 pm

ഫാക്ട് ചെക്ക്: അറബ് നേതാക്കളുടെ ചിത്രമുയർത്തി പൂരം? പ്രചരിക്കുന്ന വീഡിയോ കേരളത്തിൽ നിന്നുള്ളതല്ല

യുഎഇ ഭരണാധികാരിയുൾപ്പടെയുള്ള ചിത്രമാണ് പൂരത്തിന് പ്രദർശിപ്പിച്ചതെന്നാണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 5 Dec 2025 10:50 pm

వైజాగ్ వన్డేకు కట్టుదిట్టమైన బందోబస్తు….

ఆంధ్రప్రభ, విశాఖపట్నం : ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా

ప్రభ న్యూస్ 5 Dec 2025 10:42 pm

ఎసిబి వలలో పంచాయతీ కార్యదర్శి

మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండలం, పంచాయతీ కార్యదర్శి గొర్లపల్లి రాజ్ కుమార్ ఎసిబికి చిక్కాడు. వివరాల్లోకెళ్తే ..కన్నేపెల్లి పంచాయతీకి చెందిన ఓ లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు బిల్లుల డబ్బులు ఇప్పించేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల ప్రకారం.. పంచాయతీ కార్యదర్శికి బెల్లంపల్లిలో డబ్బులు ఇస్తానని చెప్పడంతో అక్కడికి పంచాయతీ కార్యదర్శి వచ్చాడు. బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో బాధితుడు రూ.5 వేలు డబ్బులు ఇస్తుండగా ఎసిబి డిఎస్‌పి మధు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  

మన తెలంగాణ 5 Dec 2025 10:40 pm

హైదరాబాద్ లో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం

ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 హైదరాబాద్‌లో శుక్రవారం అద్భుతంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతికవేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరై వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు. యూరోపియన్ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో ఈ స్థాయి ఫెస్టివల్‌ను నిరంతరం నిర్వహించడంలో సారథి స్టూడియోస్ మద్దతు ఎంతో కీలకం అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎంఎస్‌ఆర్‌వి ప్రసాద్, ఈయు ప్రతినిధి బృందం, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు కెవి రావు, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఇక డిసెంబర్ 5 నుంచి 14 వరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్, సారథి స్టూడియోస్, అలియెన్స్ ఫ్రాన్సైజ్ వేదికల్లో సినిమా ప్రదర్శనలు జరుగనున్నాయి.

మన తెలంగాణ 5 Dec 2025 10:30 pm

పొంగులేటి స్వగ్రామం ఏకగ్రీవం

రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, నారాయణపురం పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. మూడో విడతలో జరగాల్సిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ లేకుండానే ఫలితం తేలిపోయింది.ఈనెల 9న ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. ఎస్‌సి జనరల్‌కు రిజర్వ్ అయిన ఈ స్థానానికి గ్రామాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా గ్రామ పెద్దలు, అన్ని పార్టీల నాయకులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు ఒకే అభిప్రాయంతో ముందుకొచ్చారు. రాజకీయాలను పక్కనబెట్టి కాంగ్రెస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ ఏకగ్రీవానికి మంత్రి పొంగులేటి సోదరుడు, పార్టీ రాష్ట్ర నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. గ్రామంలోని అన్ని వర్గాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి అభిప్రాయ భేదాలను సర్దుబాటు చేసి ఏకాభిప్రాయాన్ని కల్పించారు. దీంతో పంచాయతీ పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఏర్పడే దిశగా మార్గం సుగమమైంది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వర్లుకు మంత్రి శ్రీనివాసరెడ్డి, అతని సోదరుడు ప్రసాద్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపురం అభివృద్ధి పథంలో ఇది శుభ సూచికమని మంత్రి వ్యాఖ్యానించారు.

మన తెలంగాణ 5 Dec 2025 10:20 pm

మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం నా నైజం కాదు : బున్నె రవి

నిజామాబాద్‌/మోపాల్‌, డిసెంబర్‌ 5 : ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఊరి ప్రజలందరిపై నమ్మకంతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నానని, సుదీర్ఘ అనుభవాన్ని, ఊరి …

జనం సాక్షి 5 Dec 2025 10:17 pm

ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధం: దానం నాగేందర్

 ఎన్నికల్లో పోటీ చేసి, గెలవడం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం హిమాయత్ నగర్ డివిజన్ లో రూ. 1.40 కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై దానం నాగేందర్ స్పందించారు. రాజీనామా ప్రస్థావన ఇంకా రాలేదని, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, ఇప్పటికి 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర తనకి ఉందని చెప్పారు. అనర్హత కేసు అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, తన వైపు నుండి వాదనలు వినిపిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. రైజింగ్ తెలంగాణ కోసం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పవన్, ప్రవీణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి.రామన్ గౌడ్, అశోక్, యాదగిరి, యతితిరాజ్, ప్రభాకర్, నయీమ్, రాజేంద్రప్రసాద్, గణేష్, మన్సూర్, జాకి, సోహెల్, అజార్, ఫారుక్, ఓం ప్రకాష్, జ్ఞాని, నందు, మల్లేష్, సర్ఫరాజ్, శ్రీనాథ్, అశ్విన్, అనీష్, ప్రియ రాజ్, పూర్ణచందర్, రమేష్, బాలకృష్ణ, మహేష్,జ్యోతి రెడ్డి, మాధవి, సుజాత,హమీద్, పాషా, అఖిల్, హాసన్, అభిషేక్, జై కృష్ణ, మోసిన్, శేఖర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 5 Dec 2025 10:10 pm

Birmingham |అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో మంటలు…

అమెరికాలోని బర్మింగ్‌హామ్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు

ప్రభ న్యూస్ 5 Dec 2025 9:56 pm

హోప్ అజేయ శతకం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక వెస్టిండీస్ టీమ్ పోరాడుతోంది. భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే చివరి రోజు విండీస్ మరో 319 పరుగులు చేయాలి. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు చందర్‌పాల్ (6), జాన్ కాంప్‌బెల్ (15) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అథనాజె (5), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (4) కూడా నిరాశ పరిచారు. దీంతో విండీస్ 72 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ దశలోఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను షాప్ హోప్ తనపై వేసుకున్నాడు. అతనికి జస్టిన్ గ్రీవ్ 55(బ్యాటింగ్) అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హోప్ 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా 116 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 466 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది.

మన తెలంగాణ 5 Dec 2025 9:54 pm

విమానాల రద్దు ప్రభావం.. ఆన్‌లైన్‌లోనే కొత్త జంట రిసెప్షన్

 ఇండిగో విమానసర్వీసుల రద్దు ప్రభావం నూతన వధూవరుల రిసెప్షన్‌పై చూపించింది. ఇటీవలనే పెళ్లి చేసుకున్న ఈ నవదంపతులు ఆన్‌లైన్‌లోనే రిసెప్షన్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక లోని హుబ్బళ్లికి చెందిన మేధా క్షీరసాగర్, ఒడిశా లోని భువనేశ్వర్‌కు చెందిన సంగమ దాస్‌లు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. నవంబరు 23న భువనేశ్వర్‌లో వీరి పెళ్లి జరిగింది. వధువు స్వస్థలం వద్ద బుధవారం రిసెప్షన్ ఏర్పాటైనా, భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానసర్వీసుల్లో అంతరాయం వల్ల వీరు వెళ్లలేక పోయారు. రిసెప్షన్‌కు అతిధులు హాజరవ్వడంతో ఇక చేసేది లేక రిసెప్షన్ హాల్‌లో స్క్రీన్ ద్వారా వధూవరులను చూపించ వలసి వచ్చింది. 

మన తెలంగాణ 5 Dec 2025 9:51 pm

AP CM Chandrababu gets invite for Telangana Rising Summit

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu got invited for the Telangana Rising Global Summit. Telangana Roads and Buildings Minister Komatireddy Venkat Reddy visited Amaravati on Friday, to personally invite AP CM for the prestigious event conducted by the Revanth Sarkar. The Revanth Reddy Government is holding Telangana Rising Global Summit – 2025 on a […] The post AP CM Chandrababu gets invite for Telangana Rising Summit appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 9:45 pm

Ambati Rambabu Accuses Chandrababu of Derailing Polavaram

Former minister Ambati Rambabu has accused Chandrababu Naidu of damaging the Polavaram project and reducing it to nothing more than a barrage. Speaking to the media in Tadepalli on Friday, he said that the State government had taken over Polavaram from the Centre only to misuse funds, even though the project was originally mandated to […] The post Ambati Rambabu Accuses Chandrababu of Derailing Polavaram appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 9:26 pm

భార్యను గెలిపిస్తే కటింగ్, షేవింగ్ ఫ్రీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఎన్నో హామీలు ఇస్తున్నారు.

తెలుగు పోస్ట్ 5 Dec 2025 9:26 pm

సర్పంచ్ అభ్యర్థిగా విద్యావంతురాలు…

సదాశివనగర్, ఆంధ్రప్రభ : సమాజ సేవనే లక్ష్యంగా పెట్టుకుని గత ఏడు సంవత్సరాలుగా

ప్రభ న్యూస్ 5 Dec 2025 9:21 pm

గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తా…

ఉట్నూర్, , ఆంధ్ర ప్రభ : ఉట్నూర్, ఆంధ్రప్రభ : లక్కారం పంచాయతీ

ప్రభ న్యూస్ 5 Dec 2025 9:13 pm

Utnur |ఆదరించండి… అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

ఉట్నూర్ , ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా

ప్రభ న్యూస్ 5 Dec 2025 9:04 pm

Tangutur |ఊపందుకుంటున్న బద్దం హరిత కృష్ణారెడ్డి ప్రచారం…

శంకర్‌పల్లి, ఆంధ్రప్రభ : శంకర్‌పల్లి మండలంలోని టంగుటూరు గ్రామంలో బద్దం హరిత కృష్ణారెడ్డి

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:58 pm

హిల్ట్ పాలసీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

హిల్ట్ పాలసీపై రాష్ట్ర హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ జీఓ నిబంధనలకు విరుద్ధమని పర్యావరణవేత్త పురుశోత్తం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. హిల్ట్ పాలసీ పేరుతో ప్రభుత్వం 9,292 ఎకరాల భూకేటాయింపు నిబంధనలకు విరుద్ధమని, ఈ భూ కేటాయింపు అంశంపై సిబిఐ, ఇడితో దర్యాప్తు చేయించాలని, రికార్డులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.

మన తెలంగాణ 5 Dec 2025 8:51 pm

జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ. 347 కోట్లు

 జోగులాంబ అమ్మ వారి ఆలయ అభివృద్ధికి రూ. 347 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. తక్షణం బాలాలయం, వజ్ర లేపనం, కుంబాభిషేకం వంటి పనులు ప్రారంభించేందుకు రూ. 35 కోట్లు అవసరం అని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, స్తపతి గోవింద హరి, ఆలయ అభివృద్ధి రూపశిల్పి సూర్యనారాయణ మూర్తి జోగులాంబ ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. త్వరలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కావాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జోగులాంబ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం సిఎం రేవంత్ రెడ్డికి ఉందని, ఈ ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పించాలన్న తపన సిఎంకు ఉందని చిన్నారెడ్డి తెలిపారు. రూ. 347 కోట్ల ప్రణాళికలో మొదటి దశలో రూ. 138.40 కోట్లు, రెండవ దశలో రూ. 117.60 కోట్లు, మూడవ దశలో రూ. 91 కోట్లు అవసరం అని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.

మన తెలంగాణ 5 Dec 2025 8:48 pm

పేదల సొంతింటి కల సాకారం

తిరువూరు, ఆంధ్ర ప్రభ : సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ముఖ్యమంత్రి

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:39 pm

వచ్చే రెండేళ్లు కష్టపడితే… వైసీపీ జెండా ఎగరడం ఖాయం!

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : కూటమి పార్టీలకు ఎందుకు ఓటు వేసామా అన్న

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:34 pm

ఆహ్లాదకర వాతావరణంలో ఎర్త్ సమ్మేట్..

ఆంధ్రప్రభ, విజయవాడ: అహ్మదాబాద్‌లో జరిగిన ఎర్త్ సమ్మిట్–2025లో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు,

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:27 pm

ఎసిబి వలలో డిప్యూటీ తహసీల్దార్

ఆర్‌టిఎ చట్టం కింద సమాచారం ఇవ్వడానికి ఒక రైతును రూ.20 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ ఎసిబి వలలో చిక్కుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన ఎసిబి అధికారులు తెలిపిన ప్రకారం వివరాల్లోకి వెళ్తే..నల్లగొండ జిల్లా, చండూర్ డిప్యూటీ తహసీల్దార్‌గా చంద్రశేఖర్ విధులు నిర్వహిస్తున్నాడు. గట్టుప్పల గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమి తన తండ్రి పేరు మీద నుంచి వేరే వ్యక్తులకి బదిలీ అయ్యింది. ఈ భూమి ఏ విధంగా ఏ సంవత్సరంలో బదిలీ అయ్యిందో తెలపాలని ఆర్టీఐ చట్టం కింద బాధితుడు సమాచారం కోరాడు. అందుకు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ రోజులు గడుపుతున్నాడు.. దీంతో బాధితుడు ఆ అధికారిని నిలదీయగా రూ.20 వేలు లంచం ఇస్తే సమాచారం ఇస్తానని స్పష్టం చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. డిప్యూటీ తహసీల్దార్ చెప్పిన విధంగా సదరు రైతు రూ.20 వేలు నగదు తీసుకొని హైదరాబాద్ బాలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద డిప్యుటీ తహసీల్దార్ ఇంటికి వెళ్లాడు. ఎసిబి అధికారులు పథకం ప్రకారం దాడి చేసి బాధితుడు లంచం డబ్బులు ఇచ్చే సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలిస్తున్నట్టు ఎసిబి అధికారులు తెలిపారు.

మన తెలంగాణ 5 Dec 2025 8:19 pm

అధైర్యపడొద్దు.. రాబోయేది మన సర్కారే..: కెసిఆర్

ఎర్రవెల్లి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హవా నడుస్తున్న వేళ.. బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సిఎం కెసిఆర్ సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని కొన్ని కష్ట సమయాలు వస్తాయని, వాటిని తట్టుకొని నిలబడాలని పేర్కొన్నారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని అప్పటివరకూ ప్రజలు అధైర్యపడొద్దని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చేస్తుందని, ప్రజలు ఆశలు పెట్టుకొని ఆగం కావొద్దని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాజీ సిఎం వ్యాఖ్యలు చేశారు.

మన తెలంగాణ 5 Dec 2025 8:17 pm

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ : యార్లగడ్డ

గన్నవరం, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:14 pm

Rs. 347 crore |జోగులాంబ దేవాలయ అభివృద్ధికి ప్రణాళిక

Rs. 347 crore | జోగులాంబ దేవాలయ అభివృద్ధికి ప్రణాళిక తక్షణ పనులకు

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:11 pm

రహదారి భద్రతతోనే స్వర్ణాంధ్ర కల సాకారం…

ఆంధ్రప్రభ, విజయవాడ : 2024తో పోలిస్తే 2025లో ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు,

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:10 pm

Sharwa Joins Sankranthi Battle With NNNM

Charming Star Sharwa officially joins the Sankranthi battle with his upcoming family entertainer Nari Nari Naduma Murari. Despite several major films arriving for Sankranthi, the makers of NNNM are confident enough that the content will appeal to family audiences during the festival holidays. Sharwa himself has an impressive Sankranthi record. His earlier festival outings Shatamanam […] The post Sharwa Joins Sankranthi Battle With NNNM appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 8:07 pm

ఎసిబి వలలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్

అవినీతి నిరోధక శాఖ వలలో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఓ జిల్లా స్థాయి ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎసిబి డిఎస్‌పి సాంబయ్య తెలిపిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ కార్యాలయంలో వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి గత రెండేళ్ల నుంచి అడిషనల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల  హనమకొండ డిఇఓ బదిలీపై వెళ్లడంతో ఇన్చార్జి డిఇఒగా అడిషనల్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖకు సంబంధించి ఒక ఫైల్ క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. వరంగల్ రేంజ్ ఎసిబి డిఎస్‌పి సాంబయ్య ఆధ్వర్యంలో పకడ్బందీగా వల పన్ని శుక్రవారం అదనపు కలెక్టర్, హనుమకొండ ఇన్చార్జి డిఈఓ అయిన వెంకట్‌రెడ్డిని పట్టుకున్నారు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయం కాంప్లెక్స్‌లోని అడిషనల్ కలెక్టర్ ఛాంబర్‌లో ఓ వ్యక్తి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయితే ఎసిబి అధికారులు అదనపు కలెక్టర్‌తో పాటు మరో జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగిని కలెక్టర్ కార్యాలయంలోనే విచారిస్తున్నట్లు తెలిసింది . పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని ఎసిబి డిఎస్‌పి సాంబయ్య తెలిపారు. ఇదిలావుండగా, హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా వెంకటరెడ్డి బాధ్యతల స్వీకరించినప్పటి నుంచి ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి అనేక వివాదాస్పద స్థలాలను ముడుపులు తీసుకొని క్లియర్ చేసినట్లు తెలిసింది.

మన తెలంగాణ 5 Dec 2025 8:06 pm

Record Deal: Netflix Acquires Warner Bros

Top digital giant Netflix has acquired Warner Bros for a record breaking deal of 82.7 Billion USD. They have announced about entering into a definitive agreement under which Netflix will acquire Warner Bros., including its film and television studios, HBO Max and HBO. The cash and stock transactions are valued at $ 27.75 per WBD […] The post Record Deal: Netflix Acquires Warner Bros appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 8:03 pm

Nominations |మూడో విడత చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు

Nominations | మూడో విడత చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు Nominations |

ప్రభ న్యూస్ 5 Dec 2025 8:02 pm

Rising Global Summit |రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

Rising Global Summit | రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం Rising Global

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:55 pm

మారేడుమిల్లి నిజనిర్ధారణకు వెళ్లిన విశ్వవిద్యాలయ విద్యార్థులు నిర్భంధం

మారేడుమిల్లి ‘ఎన్‌కౌంటర్’పై నిజ నిర్ధారణకు వెళ్లిన విశ్వవిద్యాలయ విద్యార్థుల అక్రమ నిర్బంధాన్ని ఎపి మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.జగన్నాధరావు, వై.రాజేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో మారేడుమిల్లిలో జరిగిన ‘ఎన్‌కౌంటర్’పై  ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థుల బృందం శుక్రవారం నిజనిర్ధారణ కోసం అక్కడికి వెళ్లిందన్నారు. 12 మంది విద్యార్థులు, జీప్ డ్రైవర్, వారికి సహాయంగా వచ్చిన ఒక ఆదివాసీ యువకుడు మొత్తంగా 14 మందిని ఎలాంటి చట్టబద్ద కారణం లేకుండా ఎపి పోలీసులు అడ్డగించి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధించారని తెలిపారు. ఇది రాజ్యాంగబద్ద హక్కులను కాలరాయడమేనని, ఈ విద్యార్థులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 5 Dec 2025 7:53 pm

తెలుగు అయ్యప్ప భక్తుడి తల పగులగొట్టిన స్థానిక వ్యాపారి

 తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం పళనిలో దారుణం చోటు చేసుకుంది. శబరిమల యాత్రలో భాగంగా సుబ్ర మణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఎపికి చెందిన ఓ అయ్యప్ప భక్తుడిపై స్థానిక దుకాణదారుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఎపికి చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల యాత్రలో భాగంగా పళని క్షేత్రానికి చేరుకుంది. వారిలో ఒక భక్తుడు సమీపంలోని దుకాణానికి వెళ్లి వాటర్ బాటిల్, కూల్‌డ్రింక్ కొనుగోలు చేయబోయారు. వాటిపై ఎంఆర్‌పి రూ.30 ఉండగా, దుకాణదారుడు రూ.40 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారని భక్తుడు ప్రశ్నిం చడంతో, వ్యాపారి తమిళంలో దూషిస్తూ మాటామాటా పెంచాడు. ఆవేశంతో ఊగిపోయిన అతను గాజు సీసాతో భక్తుడి తలపై దాడి చేశాడు. ఈ ఘటన లో భక్తుడికి తీవ్ర రక్తగాయమైంది. అంతటితో ఆగకుండా, దుండగుడు బాధితుడి మెడలోని పవిత్రమైన అయ్యప్ప దీక్షా మాలను సైతం తెంచి వేశాడు. ఈ విషయం తెలియగానే సమీపంలో ఉన్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యాపా రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే, స్థానికులు వ్యాపారికి మద్దతుగా నిలవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగింది. భక్తులు రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. నింది తుడిని అరెస్ట్ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భక్తులు స్పష్టం చేశారు. అయితే పోలీసులు కూడా వ్యాపారులకే సపోర్టుగా ఉన్నా రంటూ తెలుగు భక్తులు భారీ నిరసన తెలిపారు.

మన తెలంగాణ 5 Dec 2025 7:48 pm

BKR Foundation |పాలఉట్లు కొట్టిన వారికి వెండి నగదు బహుకరణ

BKR Foundation | పాలఉట్లు కొట్టిన వారికి వెండి నగదు బహుకరణ BKR

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:47 pm

Pink flag |గులాబీ జెండా రెపరెపలాడించాలి

Pink flag | గులాబీ జెండా రెపరెపలాడించాలి Pink flag | భువనగిరి,

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:41 pm

Development |బాలయ్యపల్లి సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక….

Development | బాలయ్యపల్లి సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక…. Development | రేగొండ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:35 pm

Vehicle inspections |ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు

Vehicle inspections | ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు Vehicle inspections | బెల్లంపల్లి,

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:24 pm

Flag March |ఎన్నికలు శాంతియుతంగా జరిగే దిశగా చర్యలు

Flag March | ఎన్నికలు శాంతియుతంగా జరిగే దిశగా చర్యలు Flag March

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:19 pm

Car collision |రోడ్డు ప్రమాదం…

Car collision | రోడ్డు ప్రమాదం… Car collision | కరీమాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:13 pm

KCR : కేసీఆర్ కీలక ప్రకటన.. ఆగం కావద్దంటూ?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.

తెలుగు పోస్ట్ 5 Dec 2025 7:12 pm

water supply |ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తాం

water supply | ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తాం water supply |

ప్రభ న్యూస్ 5 Dec 2025 7:04 pm

డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏఐ ఎక్స్ లెన్స్ సెంటర్

 ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వం శుక్రవారం కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే ఈ తరహా నైపుణ్య శిక్షణ కేంద్రం (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్) మొట్టమొదటిది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యా మంత్రి జూలియన్ హిల్ తో కలిసి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల బాబు ఎంఓయు వివరాలను వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను నెలకొల్పనున్నట్టు శ్రీధర్ బాబు తెలిపారు. డీకిన్ అప్లయిడ్ ఆర్టిఫిషియల్ ఇన్‌స్టిట్యూట్ ఈ ఎక్సెలెన్స్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తుందని ఆయన వివరించారు. కాలేజీల నుంచి అకడమిక్ గ్రాడ్యుయేట్లను కాకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో కూడిన ప్రతిభావంతులను తయారు చేయాలన్న లక్ష్యంతోనే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకురావడానికి సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఒప్పందం జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాలన, ఆరోగ్యం, విద్య, ఐటీ, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ రంగాల్లో పరిశోధన, నైఫుణ్య శిక్షణ అందజేయడానికి ఈ సెంటర్ ఎక్స్ లెన్స్ ఉపయోగపడుతుంది. డిజిటల్ ఇండియా భవిష్యత్తుకు తెలంగాణా ముఖ ద్వారం కానుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో కూడా నైపుణ్య శిక్షణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాను సందర్శించిన సందర్భంగా డీకిన్ యూనివర్సిటీని రాష్ట్రంలో క్యాంపస్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించాం. తెలంగాణాలో నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన ఎకో సిస్టం ఉంది. దీనికి ఈ ఎక్స్ లెన్స్ సెంటర్ సేవలు మరింత ఉపయోగపడతాయి. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వృత్తి నిపుణులకు తమ దేశంలో ఉన్నత స్థాయి నైపుణ్యాల్లో శిక్షణ అందించడానికి కూడా ఆస్ట్రేలియా అంగీకరించింది. ఎంఓయు కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు ఐ. సాయిక్రిష్ణ, ఆస్ట్రేలియా ప్రతినిధులు క్యామ్ గ్రీన్, కరేన్ సాండర్ కాక్, నథానియెల్ వెబ్, స్టీవెన్ బిడిల్, హిల్లరీ మెక్ గీచి, స్టీవెన్ కానోలీ, విక్రం సింగ్, ఐటీ శాఖ చీఫ్ స్ట్రాటెజిస్ట్ శ్రీకాంత్ లంకా తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 5 Dec 2025 6:59 pm

Ward Member |ఇల్లందకుంట అభివృద్ధికి కృషి చేస్తా..

Ward Member | ఇల్లందకుంట అభివృద్ధికి కృషి చేస్తా.. Ward Member |

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:59 pm

Revanth Reddy |వరంగల్ కు సీఎం రేవంత్ వరాలు…

Revanth Reddy | వరంగల్ కు సీఎం రేవంత్ వరాలు… తెలంగాణ ముఖ్యమంత్రి

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:58 pm

రూట్ మ్యాప్ చూపించే బడ్జెట్ స్మార్ట్ వాచ్: boAt Lunar Discovery రివ్యూ, ఫీచర్లు

బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా? కేవలం టైమ్ చూసుకోవడానికే కాకుండా, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు నావిగేషన్ చూపించే వాచ్ అయితే బాగుంటుందని అనిపిస్తోందా? అయితే మీ కోసమే మార్కెట్లోకి వచ్చింది boAt Lunar Discovery. తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లు ఇవ్వడం నిజంగా సాహసమే. ఈ వాచ్ డిజైన్, పనితీరు, బ్యాటరీ లైఫ్ ఎలా ఉన్నాయి? ఇది మీకు ఎంతవరకు అవసరం? పూర్తి వివరాలు ఈ రివ్యూలో చూద్దాం. డిజైన్, డిస్‌ప్లే:ఎండలో కూడా […] The post రూట్ మ్యాప్ చూపించే బడ్జెట్ స్మార్ట్ వాచ్: boAt Lunar Discovery రివ్యూ, ఫీచర్లు appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 5 Dec 2025 6:57 pm

పాన్ మసాలా తయారీ యునిట్లపై సెస్సు బిల్లును ఆమోదించిన లోక్ సభ

న్యూఢిల్లీ పాన్ మసాలా తయారీ యునిట్లపై సెస్సు విధించడానికి సంబంధించిన బిల్లును లోక్ సభ శుక్రవారం నాడు ఆమోదించింది. ఈ సెస్సు ద్వారా సేకరించే నిధిని జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ప్రజారోగ్యాన్ని మెరుగు పరచడానికి వినియోగిస్తారు. ఆరోగ్య భద్రత, జాతీయ భద్రతా సెస్సు బిల్లు 2025 పై జరిగిన చర్చకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ప్రజారోగ్యం రాష్ట్రం అంశం కాబట్టి సెస్సును రాష్ట్రాలతో పంచుకుంటామని అన్నారు. మూజువాణి ఓటుతో బిల్లును లోక్ సభ ఆమోదించింది. జాతీయ ప్రాముఖ్యం కలిగిన ఆరోగ్యం, జాతీయ భద్రతకు అవసరమైన ఆర్థికవనరుల కల్పనే ఈ బిల్లు ఉద్దేశ్యం అని నిర్మలా సీతారామన్ అన్నారు. పాన్ మసాలా, దాని వినియోగం పై గరిష్టంగా జిఎస్టీ కింద 40 శాతం పన్ను విధిస్తున్నారు. ఈ సెస్ విధఇంచడం వల్ల జిఎస్టీ ఆదాయం ఏమాత్రం తగ్గబోదని కేంద్రమంత్రి తెలిపారు.

మన తెలంగాణ 5 Dec 2025 6:55 pm

TG MRS School |విద్యార్థులు కనబడుట లేదు….

TG MRS School | విద్యార్థులు కనబడుట లేదు…. TG MRS School

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:54 pm

Rs. 5 lakh |అయ్యప్ప స్వామి ఆలయానికి ఐదు లక్షల విరాళం..

Rs. 5 lakh | అయ్యప్ప స్వామి ఆలయానికి ఐదు లక్షల విరాళం..

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:38 pm

MLA |గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను

MLA | గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను MLA | నవాబుపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:33 pm

Check Post |చెక్ పోస్ట్ తనిఖీ…

Check Post | చెక్ పోస్ట్ తనిఖీ… Check Post | నాగర్

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:27 pm

OTT Options for this Weekend

A number of options are available for the audience on the digital space this weekend. Telugu films like The Girlfriend, Jatadhara, The Great Pre-Wedding Show are streaming this weekend. Rashmika’s Hindi film Thamma is streaming on a rental basis on Prime Video. Malayalam film Dies Irae is streaming on Jio Plus Hotstar. Here are the […] The post OTT Options for this Weekend appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 6:27 pm

Andhra Pradesh : ఏపీలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్' కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి

తెలుగు పోస్ట్ 5 Dec 2025 6:23 pm

2,500 Drones |డ్రోన్ షోలు కాదు.. డొక్కలు నింపే విధానం రావాలి

2,500 Drones | డ్రోన్ షోలు కాదు.. డొక్కలు నింపే విధానం రావాలి

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:21 pm

One more Sequel Scrapped

Vijay Deverakonda has allocated much time for Kingdom and the makers have spent lavishly on this action drama. Jersey fame Gowtam Tinnanuri is the director and the makers also announced that the film has a second part. A portion of the shoot for the second part too has been completed even before the release of […] The post One more Sequel Scrapped appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 6:21 pm

development villagers |ఎల్లవేళలా అందుబాటులో ఉంటా

development villagers | ఎల్లవేళలా అందుబాటులో ఉంటా development villagers | మంథని,

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:15 pm

Rajkumar |జగన్మాతను దర్శించుకున్న నటుడు రాజ్ కుమార్..

Rajkumar | జగన్మాతను దర్శించుకున్న నటుడు రాజ్ కుమార్.. ఆంధ్రప్రభ, విజయవాడ :

ప్రభ న్యూస్ 5 Dec 2025 6:14 pm