TDP |ముమ్మాటికి ఇది రాజకీయ హత్య..!
TDP | తణుకు, ఆంధ్రప్రభ : తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో హత్యకు
Hospital |18వందల మంది రోగులు… Ranga Reddy | చేవెళ, ఆంధ్రప్రభ :
Pawan Kalyan : ఉడుములకు పవన్ అభినందన.. ఎర్ర చందనం స్మగ్గింగ్ ఇన్విస్టిగేషన్ పై ప్రశంస
ఎర్రచందనం మాఫియా దర్యాప్తుపై సీనియర్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ఉడుముల సుధాకర్ రెడ్డికి ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ప్రశంసించారు.
Nagar Kurnool |జిల్లాస్థాయి ఐక్యత పాదయాత్ర విజయవంతం
Nagar Kurnool | జిల్లాస్థాయి ఐక్యత పాదయాత్ర విజయవంతం Nagar Kurnool |
Govt School |అభివృద్ధి పనులు పర్యవేక్షించాలి…
Govt School | అభివృద్ధి పనులు పర్యవేక్షించాలి… Adilabad | పెద్దపల్లి రూరల్,
Nitish Kumar : నితీశ్ కు పాలన ఒక్కటే కాదు.. అంతా ఇక కత్తిమీద సామే
భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం కేంద్రంలోనే కాదు రాష్ట్రాల్లోనూ పాతుకుపోయేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లే
Klavakuntla Kavitha : హరీశ్ పై మరోసారి కవిత షాకింగ్ కామెంట్స్
మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు
TEMPLE |ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలి
TEMPLE | భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: దేవాలయాలకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం
Adilabad |కాపాస్ కిసాన్ యాప్ను రద్దు చేయాలి…
Adilabad | కాపాస్ కిసాన్ యాప్ను రద్దు చేయాలి… Adilabad | తిర్యాణి,
Telangana |శ్రీచౌడేశ్వరిమాత వార్షికోత్సవ వేడుకలు
Telangana | శ్రీచౌడేశ్వరిమాత వార్షికోత్సవ వేడుకలు Telangana | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
ఉగ్రవాదంతో సంబంధాలు: నలుగురు డాక్టర్లపై ఎన్ఎంసీ వేటు
ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాల ఆరోపణలునలుగురు డాక్టర్ల రిజిస్ట్రేషన్ల రద్దు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు డాక్టర్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ, దేశంలో ఎక్కడా వైద్య వృత్తి చేపట్టకుండా వారిపై నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఉగ్రవాద మాడ్యూల్తో వీరికి సంబంధాలున్నట్లు తేలడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. […] The post ఉగ్రవాదంతో సంబంధాలు: నలుగురు డాక్టర్లపై ఎన్ఎంసీ వేటు appeared first on Visalaandhra .
POLICE |శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ధ్యేయం
POLICE | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పశ్చిమగోదావరి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర
Pawan Kalyan |డిప్యూటీ సీఎం విజిలెన్స్
Pawan Kalyan |డిప్యూటీ సీఎం విజిలెన్స్ మంగళం పేట అడవి కబ్జాపెద్దిరెడ్డికి మరో
Nizamabad |పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన
Nizamabad | పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన Nizamabad | నిజామాబాద్: బాల్కొండ
MLA |బ్యూటిఫుల్ బాపట్లగా తీర్చిదిద్దుదాం..
ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు MLA | బాపట్ల టౌన్ , ఆంధ్రప్రభ
Narayanapet |గుర్తుతెలియని మృతదేహం కలకలం
Narayanapet | గుర్తుతెలియని మృతదేహం కలకలం Narayanapet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ
Narayanpet |క్రమశిక్షణ తప్పనిసరి
Narayanpet | క్రమశిక్షణ తప్పనిసరి ఆర్ఐ నరసింహ Narayanpet | నారాయణపేట ప్రతినిధి,
BJP : నెక్ట్ టార్గెట్ మీరే.. కాచుకోండి.. తొక్కుకుంటూ వెళుతారంతే
బీహార్ శాసనసభ ఎన్నికల్లో విజయంతో భారతదేశం మొత్తం కాషాయమయం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేయనుంది.
జైపూర్లో కొత్త ఎయిర్ ప్యూరిఫయర్లు #Environment #Jaipur #AirQuality #AQI #CivicUpdates
Sangareddy |నిబద్ధతతో పనిచేస్తేనే సార్ధకత
Sangareddy | నిబద్ధతతో పనిచేస్తేనే సార్ధకత వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంతరావు
Bigg Boss 9: ఎట్టకేలకు పదోవారంలో తనూజ కలనిజమయిందిగా?
బిగ్ బాస్ సీజన్ 9 కెప్టెన్ గా తనూజ పదో వారంలో ఎంపికయింది.
"గాయని మైథిలీ ఠాకుర్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం #MaithiliThakur #BiharElections #YoungMLA
Rangareddy | ఆటో బోల్తా Rangareddy | రంగారెడ్డి, ఆంధ్రప్రభ : రంగారెడ్డి
నోయిడా ఫ్లాట్ గోడలు పెన్సిల్తో రంధ్రాలు #Noida #RealEstate #ConstructionQuality #HomeBuyers
Telangana: హ్యాకింగ్ కు గురైన తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కు గురయింది.
Chandrababu : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.
Vikarabad |స్పీకర్ కు కృతజ్ఞతలు
Vikarabad | స్పీకర్ కు కృతజ్ఞతలు Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ :
TTD |సతీష్ కుమార్ హత్యపై ఎఫ్ఐఆర్
TTD | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : సంచలనంగా మారిన టీటీడీ మాజీ
చింతలపూడిలో మరో స్టూడెంట్ రివేంజ్ ( చింతలపూడి, ఆంధ్రప్రభ ) ఏలూరు జిల్లా
KTR : మాగంటి సునీతతో కేటీఆర్ భేటీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాగంటి సునీతను కలిశారు.
Telangana |మత్స్యకారులకు అండగా ఉంటాం
Telangana | మత్స్యకారులకు అండగా ఉంటాం మంత్రి ప్రభాకర్ Telangana | హుస్నాబాద్,
దళారులను నమ్మి మోసపోవద్దు: టౌన్ ప్లానింగ్ అధికారి బాల శ్రీనివాస్
మల్కాజిగిరి,నవంబర్14(జనంసాక్షి) సర్కిల్ పరిధిలో అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టే వారు నిబంధనల ప్రకారం మాత్రమే నిర్మాణాలు …
వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య
కారేపల్లి, నవంబర్ 14 (జనంసాక్షి) : తనను ప్రేమించిన గ్రామీణ వైద్యుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య …
రూ.400 కోట్లతో 470 ఎకరాల్లో ఇండో–తైవాన్ పారిశ్రామిక పార్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా 50
హైదరాబాద్, నవంబర్ 14 (జనంసాక్షి) ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదలయ్యింది. శనివారం నుంచి ఫీజు చెల్లి ంపు, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్నది. ఈ …
బన్నేరు ఘట్ట జూలో చిరుత దాడి #Wildlife #Bannerghatta #Karnataka #ZooUpdate #Safari #viralvideo
ఆశ్రితులకు మంత్రి లోకేష్ భరోసా విశాఖలో 73వ రోజు ప్రజాదర్బార్ ( విశాఖపట్నం,
Narsinghi | బీజేపీ సంబరాలు Narsinghi | నార్సింగి, ఆంధ్రప్రభ : బీహార్
బూమ్ బూమ్ బుమ్రా #INDvsSA #Cricket #Bumrah #Siraj #EdenTest #TeamIndia #viralvideo
Andhra Pradesh : స్థానిక సంస్థలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు గుడ్ న్యూస్ చెప్పింది
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో ఓ వ్యూహాత్మక మార్పు కు ప్రతిబింబంగా నిలిచింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కన్పించని ఓ పాజిటివ్ మార్పుకు ఈ ఎన్నిక వేదిక అయింది. జాతీయ పార్టీ కావడంతో సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఐక్యత అంతగా ఉండదు. ఎవరికివారే గొప్ప లీడర్లుగా చెలామణి అయ్యారు. నాయకత్వానికి కిందిస్థాయి నుంచి ఏకరీతిలో ఎప్పుడూ సహకారం అందదు. గతంలో ఒక్క వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే నాయకత్వానికి అన్ని వర్గాల నుంచి బాసట లభించింది. అంతకు ముందు ఏ నేత కూడా పట్టుమని పది ఇరవై నెలలకు మించి ముఖ్య పదవిలో ఉండలేకపోయేవారు. ఈ సంస్కృతికి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి చెక్పెట్టారు. తనదైన శైలిలో రాజకీయాలు నడిపి.. ఇటు ప్రజల మద్దతు.. అటు అధిష్టానం మద్దతు.. మధ్యలో స్థానిక అగ్రనేతల మద్దతు కూడగట్టి ఆయన లీడర్గా వెలుగు వెలిగారు. ఆ తర్వాత.. ఇన్ని రోజులకు మళ్లీ కాంగ్రెస్లో ఓ ఐక్యతా స్ఫూర్తి కన్పించింది. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అంత ప్రాధాన్యమైనది ఏమీ కాదు.కానీ సిఎం రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన రెండేళ్ల పాలనను పరీక్షించుకున్నారు. బిఆర్ఎస్ దూకుడుకు కల్లెం వేయాలని భావించారు. అందుకు ఆయనకు పార్టీ నేతలంతా పూర్తిగా సహకరించడం ఇక్కడ కీలక అంశంగా చెప్పొచ్చు. రేవంత్ కంటే సీనియర్లు అయిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వంటి అగ్రనేతలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్లోని ఇగో సంస్కృతికి ఇది విరుద్ధం. అదృష్టం కలిసొస్తే మేమే ముఖ్యమంత్రి అయ్యే వాళ్లం అనుకునే నేతలు భట్టి, ఉత్తమ్. కానీ వారు తమ ఇగోలను.. సీనియర్ అనే భేషజాలను పక్కనపెట్టారు. ‘జూబ్లీహిల్స్లో గెలిస్తే రేవంత్కు క్రెడిట్ దక్కుతుంది.. మాకేం వస్తుంది’ అనుకోకుండా భట్టి, ఉత్తమ్, పొన్నం, పొంగులేటి, తుమ్మల, సీతక్క వంటి అగ్రనేతలు, పిసిసి చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్లో అన్ని డివిజన్లలో కలియతిరిగి నవీన్ యాదవ్ గెలుపుకోసం విస్తృత కృషి చేశారు. ఇది కాంగ్రెస్ గత సంస్కృతికి విరుద్ధమే. గతంలో ఎన్నడూ ఇలా కాంగ్రెస్ అగ్రనేతలు ఏకం కాలేదు. ఇది తెలంగాణ కాంగ్రెస్లో గొప్ప పరిణామమే అని చెప్పొచ్చు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అయినా.. ఆ క్రెడిట్ను అడ్డం పెట్టుకుని ప్రజల మనసులు గెలవలేకపోయారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించలేకపోయారు. ఈ క్రమంలో అప్పట్లో టిపిసిసి నేతగా పనిచేసిన ఉత్తమ్కుమార్రెడ్డి చాలా అపవాదులు మూటగట్టుకున్నారు. ఆయన నాయకత్వంపై అంతటా అసంతృప్తి వ్యక్తమైంది.ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ గెలవడం అసాధ్యమని తేల్చారు. అందుకు తగ్గట్టు పాపం ఆయన టిపిసిసి పదవిని త్యాగం చేశారు కూడా. అనంతర పరిణామాలతో కాంగ్రెస్లో పూర్తి స్తబ్ధత నెలకొంది. వ్యూహాలను మార్చినా రెండోసారీ కెసిఆర్ సిఎం కావడంతో ఇక మూడో సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం మార్చింది. తన వాగ్ధాటి, ఆర్థిక, అంగబలం, ప్రజాకర్షక శక్తితో అకస్మాత్తుగా తెరపైకివచ్చి.. కెసిఆర్ ను తీవ్రంగా విమర్శించి టాక్ ఆఫ్ ది స్టేట్గా మారిన ఎనుముల రేవంత్రెడ్డిని టిపిసిసి అధ్యక్షుడిగా ప్రకటించడంతో కాంగ్రెస్లో మళ్లీ కదలిక వచ్చింది. కెసిఆర్ను ఎదుర్కొనేశక్తి రేవంత్రెడ్డికి ఉందని భావించడంతో ఆయనకు అప్పటి వరకు సీనియర్లుగా ఉన్న నేతలు సైతం మద్దతు తెల్పక తప్పలేదు. ముఖ్యంగా అధిష్టానం నిర్ణయం కాబట్టి అందరూ ఆమోదించారు. ఈక్రమంలో రేవంత్రెడ్డి అనూహ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం.. సీఎం పీఠం అధిష్టించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో సీనియర్లు అందరికీ మంచి పదవులే దక్కాయి. కెసిఆర్ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలంతా.. రేవంత్ సిఎం అయ్యాక మంచి పదవులు మూటగట్టుకుని మళ్లీ రాజకీయంగా ప్రజా జీవితం చవిచూశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు అనుభవించారు. మనలో మనం పోట్లాడుకుంటే ఈ పదవులుకూడా దక్కేవి కావేమో అనుకుంటూ ఓ రాజకీయ మార్పుకు నాంది పలికారు. అందరూ ఏకమై.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోప్రత్యర్థి గెలుపును శాసించారు. ఈ క్రెడిట్ ఏ ఒక్కరిదీ కాదు.. అందరి సమష్టి శ్రమ అని చాటి చెప్పారు. ఇదే మార్పు మరో రెండున్న ఏళ్ల వరకూ కొనసాగితే.. 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. -ఎన్. మల్లేష్బాబు - 70133 59750
Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది ఫలితాలివే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో ఎన్డీఏ కూటమికి 202 స్థానాలు వచ్చాయి
అడవులు, పర్వత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న గిరిజన సమూహాలు భారత ఉపఖండ నాగరికతలో అత్యంత పురాతన దశలను ప్రతిబింబిస్తాయి. వీరు భూమి, నీరు, అటవీ వనరుల అసలైన సంరక్షకులు. ప్రకృతి ఆధారిత ప్రత్యేక సామాజిక వ్యవస్థలు, పర్యావరణ పరిజ్ఞానం, ఆధ్యాత్మిక జీవన విధానాలను వీరు రూపొందించారు. శతాబ్దాల తరబడి తక్కువగా చూడబడినప్పటికీ వీరు తమ ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకొని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారు. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో వీరి కృషిని చరిత్రకారులు సముచిత రీతిలో ప్రస్తావించలేదు. నిజానికి బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా, భూస్వామ్య దోపిడీకి ఎదురు నిలిచిన మొదటి తిరుగుబాట్లను వీరే ప్రారంభించారు. ఈ గిరిజన పోరాటాలు భారతదేశంలో జాతీయ చైతన్యానికి పునాది వేశాయి. గిరిజన సాంస్కృతిక వారసత్వం: గిరిజన సంస్కృతి కేవలం గతానికి చెందినదే కాదు; అది నేటికీ జీవిస్తున్న, ప్రకృతి సమన్వయంతో కూడిన, సామూహిక ఐక్యతను ప్రతిబింబించే జీవన విధానం. గిరిజన సమాజాలు సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు, అటవీ వనరుల వినియోగంలో శతాబ్దాల అనుభవాన్ని గడించాయి. పోడు సాగు, పవిత్ర అరణ్యాలు, టోటెమిక్ ఆరాధన వంటి ఆచారాలు వారి పర్యావరణ నైతికతను సూచిస్తాయి. ఆదివాసులు వర్లీ (మహారాష్ట్ర), సవర (ఒడిశా), గోండు (మధ్యప్రదేశ్), కోయ (తెలంగాణ) చిత్రకళలతో ప్రసిద్ధి చెందారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఓజాల లోహకళ, ఖమ్మం జిల్లాలోని నాయకపోడ్ల దారు పనులు (మాస్కులు), మైదాన ప్రాంత లంబాడీల వస్త్ర కళ (ఎంబ్రాయిడరీ) -ఇవన్నీ దైనిక, దైవిక ప్రయోజనాలతో పాటు వారి కళాత్మకతకు నిదర్శనాలు. ప్రతి గిరిజన పండుగ జీవనోత్సవం. ఢోల్, తుడుం, ఔజం, తప్పెటగూళ్ళు (డప్పులు) వంటి వాద్యాలతో చేసే గుస్సాడి, డెమ్సా, కొమ్ముకోయ (తెలంగాణ- ఆంధ్ర), కర్మ (చత్తీస్గఢ్), గోటిపువా (ఒడిశా) వంటి వారి నృత్యాలు వారి సామూహిక ఐక్యతను, ప్రకృతిపట్ల గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. సంతాళ్ల మంజీ-పర్గణ వ్యవస్థ, గోండుల దొర్ల గుట్ట పంచాయితీ, భిల్లుల గమేటి సభ వంటి సంస్థలు వలస పాలనకు ముందే మనుగడలో ఉన్న ప్రజాస్వామ్య పరిపాలనా వ్యవస్థలకు నిదర్శనాలు. గిరిజన తిరుగుబాట్లు: జాతీయ స్వాతంత్య్ర ఉద్యమం పుట్టకముందే గిరిజన సమాజాలు వలస పాలన, దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేపట్టాయి. చువార్, భూమిజ తిరుగుబాట్లు (1760- 1830, బెంగాల్): జంగల్ మహల్ ప్రాంత గిరిజనులు అధిక పన్నులు, అరణ్య భూములపై బ్రిటిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా ఉద్యమించారు. కోల్ తిరుగుబాటు (183132, ఛోటానాగ్పూర్): కోల్ గిరిజనులు వడ్డీ వ్యాపారులు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సంతాల్ హుల్ (1855- 56): సిద్ధూ, కన్హు ముర్ము నాయకత్వంలో సంతాళ్లు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవాన్ని ప్రారంభించారు. ఇది 1857 తిరుగుబాటుకు ముందున్న అతి పెద్ద ఆదివాసీ ఉద్యమం. బిర్సా ముండా ఉద్యమం (1899 -1900): బిర్సా ముండా ఛోటా నాగ్పూర్ ప్రాంతానికి చెందిన యువ ఆదివాసీ నాయకుడు. బ్రిటిష్ పాలన, క్రైస్తవ మిషనరీ జోక్యానికి వ్యతిరేకంగా ఉల్గులాన్ (మహా తుఫాను)ను నడిపించాడు. ఆయన అబువా దిశుమ్, అబువా రాజ్ (మన భూమి, మన రాజ్యం) అనే నినాదం ద్వారా స్వాతంత్య్రం, సమానత్వం, స్వదేశ విశ్వాస సంరక్షణకై పోరాడాడు. భిల్ తిరుగుబాట్లు (1818-1858): పశ్చిమ భారతదేశంలోని భిల్లులు తమ అరణ్య హక్కుల రక్షణకై, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. రంపా తిరుగుబాట్లు (1879, 1922- 24, ఆంధ్రప్రదేశ్): తమన్ దొర, అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో కోయ, ఇతర తెగలు బ్రిటిష్ అటవీ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. రాజు గాంధేయ సిద్ధాంతాలను గెరిల్లా యుద్ధ పద్ధతులతో కలిపి పోరాటం చేశారు. గోండు తిరుగుబాట్లు (జోడేఘాట్, ఆసిఫాబాద్, 1940): కుమ్రం భీమ్ నిజాం అధికారుల దోపిడీకి వ్యతిరేకంగా జల్, జంగల్, జమీన్, ‘మావె నాటే మావె రాజ్‘ (మా ప్రాంతంలో మా రాజ్యం) అనే నినాదాలతో అసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ లో పోరాడాడు. ఆయన త్యాగం తెలంగాణ గిరిజన గౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఖాసీ, గారో తిరుగుబాట్లు (ఈశాన్య భారతం): టిరోట్ సింగ్, పా టోగన్ నెంగ్మింజా సంగ్మా వంటి నాయకులు మేఘాలయ -అస్సాం పర్వత ప్రాంతాల్లో బ్రిటిష్ విస్తరణను ప్రతిఘటించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గిరిజనుల పాత్ర (1857- 1947): 1857 తర్వాత భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గిరిజనులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు. భిల్, గోండు దళాలు 1857 తిరుగుబాటులో పాల్గొన్నాయి. 1857 నాటి సిపాయి తిరుగుబాటు పిలుపునందుకొని నిర్మల్లో రాంజీ గోండ్ 500 ల మంది గిరిజనులు, రోహిల్లా సైనికులను వెంటేసుకుని ఆనాటి నిజాం, బ్రిటీష్ సైన్యాలకు వ్యతిరేకంగా నిర్మల్ ఘాట్ లో పోరాడి అసువులు బాసాడు. సహాయ నిరాకరణ, భారత్ విడిచి పో (క్విట్ ఇండియా) ఉద్యమాలలో గిరిజన కార్యకర్తలు ప్రజలను సంఘటితం చేశారు. హైదరాబాద్, మధ్య ప్రదేశ్ ప్రాంతాలలో లంబాడీలు, కోయలు భూస్వామ్య, వలస వ్యతిరేక పోరాటాలకు మద్దతు ఇచ్చారు. స్వాతంత్య్రం అనంతరం జైపాల్ సింగ్ ముండా వంటి గిరిజన నాయకులు రాజ్యాంగ సభలో గిరిజన హక్కులు, స్వపాలన, భూస్వామ్య రక్షణ అంశాలను ప్రవేశపెట్టారు. ఆధునిక భారతదేశానికి గిరిజనుల చేర్పులు: గిరిజన సంప్రదాయాలు భారతదేశపు బహుళ సంస్కృతికి అందాన్ని అద్దాయి. గిరిజన జానపద కళలు, సంగీతం, జానపద గాథలు, పర్యావరణ పరిజ్ఞానం వంటి రంగాల్లో వీరి పాత్ర అపారమైనది. భారత రాజ్యాంగంలోని ఐదవ, ఆరవ షెడ్యూల్స్ గిరిజన స్వపరిపాలన, సాంస్కృతిక హక్కులను కాపాడుతున్నాయి. భూమిని తల్లిగా, అడవిని పవిత్రంగా భావించే గిరిజన దృక్పథం సుస్థిర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుంది. భారత గిరిజన సమాజ చరిత్ర అంటే వారి పోరాటాలు, ఆత్మగౌరవ ప్రకటనల చరిత్ర. జార్ఖండ్ అడవుల నుండి తెలంగాణ కొండల వరకు, ఈశాన్య పర్వతాల వరకు, ఆదివాసులు తమ భూమి కోసం, తమ ఆత్మ గౌరవ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడారు. వీరి తిరుగుబాట్లు కేవలం ప్రాంతీయ ఉద్రిక్తతలు కావు అవి స్వాతంత్య్రం, న్యాయం, ఆత్మగౌరవం కోసం చేసిన తొలి జ్వాలలు. బిర్సా ముండా జయంతి సందర్భంగా జరుపుకునే జనజాతీయ గౌరవ దివస్ (నవంబర్ 15) గిరిజన వీరుల త్యాగం, ధైర్యం, స్వాభిమానం పట్ల జాతీయ నివాళి. భారత స్వాతంత్య్రం సంపూర్ణత.. గిరిజన సమాజాల గౌరవం, స్వాతంత్య్రంతోనే సాధ్యమవుతుంది. - డా. ద్యావనపల్లి సత్యనారాయణ - 94909 57078
Andhra Pradesh : ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Hyderabad : ఐ బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్?
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు
భార్య వేధింపులు?... ఐటి ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: ముషీరాబాద్ పరిధిలోని పద్మారావునగర్ ప్రాంతం గాంధీనగర్లో కుటుంబ కలహాలతో ఓ ఐటి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాల్ గౌడ్(28) అనే వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం నవ్య అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడు టిసిఎస్లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో పెద్దలు పలుమార్లు దంపతులకు నచ్చజెప్పారు. మార్చి నెలలో దంపతుల మధ్య గొడవ జరగడంతో నవ్య పుట్టింటికి వెళ్లింది. రెండు నెలల క్రితం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విశాల్ పిఎస్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అనంతరం కేసు నమోదు కావడంతో మరోసారి పిఎస్కు రమ్మని పోలీసులు కబురు పంపారు. దీంతో అతడు ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. గాంధీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Weather Report : ఫ్యాన్ స్విచ్ వేస్తే ఒట్టు.. సింగిల్ డిజిట్ కు టెంపరేచర్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలితీవ్రత రాను రాను పెరుగుతోంది.
నేడు పుట్టపర్తికి కేంద్ర మంత్రి పియూష్ గోయల్
పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకల సందర్భంగా నేడు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పర్యటించనున్నారు
Ram and Sharwanand Films in Risky Zone
Nandamuri Balakrishna and Boyapati Sreenu are teaming up for the fourth time and the film titled Akhanda 2 releases on December 5th. The expectations are big and the film will open on a super strong note. The makers have closed the deals for record prices and the distributors are planning a record release for the […] The post Ram and Sharwanand Films in Risky Zone appeared first on Telugu360 .
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో అర్థరాత్రి కారు అదుపుతప్పి బోల్తాపడింది. విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టి బోల్తాపడింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో డ్రైవర్ సీట్లులో కూర్చున్న యువతి స్వల్పగాయాలతో బయటపడింది. వెంటనే స్థానికులు స్పందించి కారు అద్ధం పగులగొట్టి ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో యువతి కారు నడిపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
‘మాస్టర్ సంకల్ప్’ ట్రైలర్ విడుదల
శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్పై ఆరవ చిత్రం గా డా. భీమగాని సుధాకర్ గౌడ్ ‘మాస్టర్ సంకల్ప్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను ప్రముఖ నటులు శివాజీ రాజా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత డా. భీమగాని సుధాకర్ గౌడ్, శ్రీ మిత్ర చౌదరి, పెంచల్ రెడ్డి పాల్గొన్నారు.
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ನೋಯ್ಡಾ ಮತ್ತು ಫರಿದಾಬಾದ್ನಲ್ಲಿನ ಪ್ರಸ್ತುತ ಮಾಲಿನ್ಯದ ಪರಿಸ್ಥಿತಿ ಎಂದು ಚೀನಾದ ಚಿತ್ರಗಳು ಹಂಚಿಕೆ
ನೋಯ್ಡಾ ಮತ್ತು ಫರಿದಾಬಾದ್ನಲ್ಲಿನ ಪ್ರಸ್ತುತ ಮಾಲಿನ್ಯದ ಪರಿಸ್ಥಿತಿ ಎಂದು ಚೀನಾದ ಚಿತ್ರಗಳು ಹಂಚಿಕೆ
భర్త పెగ్గేస్తే, భార్య ఐస్క్రీమ్ తినే స్వేచ్చ ఇవ్వాలి: స్పీకర్
అమరావతి: కొందరు డెవలపర్లు చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి వెంచర్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఎపి శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. అక్రమ లేఔట్లను అరికట్టాలని లేకుండా తనే రంగంలోకి దిగుతానని హెచ్చిరంచారు. గత ఐదు సంవత్సరాలు ఎపిలో చీకటి యుగంగా ఉందని, రియల్ ఎస్టేట్ రంగం ఆగమైందని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎపికి మంచి రోజులు వచ్చాయని ప్రశంసించారు. విశాఖలో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో షాలో అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. పర్యాటకులు కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వస్తారని, పది గంటలు దాటి వారిపై కేసులు పెడితే ఎలా అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. విశాఖలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే ఫ్రీజోన్గా మార్చాలని డిమాండ్ చేశారు. ఎపి ప్రజలు సరదా కోసం శ్రీలంక, గోవాలాంటి ప్రాంతాల వెళ్తున్నారని, అక్కడ ఉండే వాతావరణం ఇక్కడే కల్పిస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. భర్త సరదాగా రెండు పెగ్గులు వేస్తే భార్య ఐస్క్రీమ్ తినేలా స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తే బాగుంటుందని అయ్యన్న పాత్రుడు చమత్కరించారు.
Hyderabad : వీడిని పట్టుకోకుంటే.. పెను ప్రమాదమే జరిగేది.. ప్రాణలు గాలిలో కలిసిపోయేవి
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్కాడ్ దర్యాప్తులో ఆశ్చర్యకరరమైన విషయాలు బయటపడుతున్నాయి.
Andhra Pradesh : నేడు రోజు సీఐఐ సదస్సులో ఒప్పందాలివే
విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సదస్సులో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు భేటీ కానున్నారు
ఈ ప్రాంతాల్లో నేడు పవర్ కట్ !
ఎడపల్లి, ఆంధ్రప్రభ: బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్ మండలాల్లో
తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12
పులివెందులలో వేటకోడవళ్లతో నరికి దారుణ హత్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో దారుణ హత్య చోటుచేసుకుంది. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న రంగాపురం గ్రామానికి చెందిన వంశీకృష్ణ యాదవ్ (30) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. గ్రామ సమీపంలో వంశీకృష్ణ యాదవ్ ను గుర్తుతెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరకడంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh : నేటి నుంచి హిందూపురంలో నందమూరి బాలకృష్ణ
హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నేటి నుంచి నియోజకవర్గంలో పర్యటించనున్నారు
శ్రీనగర్ లో భారీ పేలుడు.. ఏడగురు దుర్మరణం.. 30 మంది పైగా తీవ్ర
Gold Rates Today : బంగారం కొనేవారికి సూపర్ న్యూస్.. ఇంత ధరలు ఎప్పుడైనా తగ్గాయా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి
BRS |జెండా మోసినోళ్లకే.. జై అనాలె!
BRS | జెండా మోసినోళ్లకే.. జై అనాలె! గల్లీ నుంచి ఢిల్లీ దాకా
సిఐ సతీష్ ను గొడ్డలితో నరికి హత్య... కీలక విషయాలు వెలుగులోకి
అమరావతి: టిటిడి మాజీ ఎవిఎస్ఒ సతీష్కుమార్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వేట్రాక్పై చంపి పడేశారని శవ పరీక్షలో తేలింది. సిఐ సతీష్ తలపై నరకడంతో పాటు శరీరంలో పలు చోట్లు ఎముకలు విరిగిపోయాయని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి గుంతకల్లు రైల్వే స్టేషన్లో ఫస్ట్ ఎసి బోగీలోకి సతీస్ ఎక్కాడు. తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వేట్రాక్పై టిటిడి మాజీ ఎవిఎస్ వి సతీష్కుమార్ మృతదేహం కనిపించింది. తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య మృతి చెందినట్టు తెలుస్తుంది. ఎసి బోగీలో ఎవరెవరు ప్రయాణించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్లోనే చంపి అతడిని బయటపడేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అతడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని పోలీసులు విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. సతీష్ కుమార్ మృతదేహాన్ని డిఐజి షిమోషి, ఎస్ పి జగదీష్ పరిశీలించారు. తిరుమల పరకామణి అక్రమాల కేసులో సిఐ సతీష్ కుమార్ ఫిర్యాదు దారుడిగా ఉన్నారు. టిటిడి పరకామణి కేసులో కీలక వ్యక్తి మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు ప్రాణహాని ఉందని తరచూ చెప్పేవారని సతీష్ కుమార్ స్నేహితుడు రామాంజనేయులు తెలిపాడు. పరకామణి కేసు వల్లే సతీష్ ప్రాణం పోయిందిని ఆరోపణలు చేశారు. సతీష్ సూసైడ్ చేసుకునే వ్యక్తి మాత్రం కాదు అని, పైఅధికారుల నుంచి భారీ ఒత్తిడి ఉందని తమకు పలుమార్లు చెప్పేవారని స్నేహితుడు రామాంజనేయులు ఆరోపణలు చేశాడు. 2003లో ఏప్రిల్లో టిటిడి ఉద్యోగి రవికుమార్ శ్రీవారి ఆలయ పరకామణిలో విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై ఎవిఎస్ఒ హోదాలో రవికుమార్పై సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు రవికుమార్, సతీష్ కుమార్ ఇద్దరు రాజీ కుదుర్చుకున్నారు. రవికుమార్ ఆస్తులను కొంతమేర టిటిడికి ఇవ్వగా మరికొన్ని ఆస్తులు సతీష్ పేరుపై రాయించుకొని కేసు మాఫీ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సతీష్ చాలా రోజులు రిజర్వ్ పోలీస్ విభాగంలో పని చేశాడు. డిప్యుటేషన్పై టిటిడిలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించాడు. 2022లో ఎవిఎస్హోగా పదోన్నతి లభించడంతో టి టిడి ఆలయంలో సతీస్ విధులు నిర్వహించిన విషయం విధితమే. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే రిజర్వ్ ఇన్స్ పెక్టర్ గా సతీష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
Tirumala : తిరుమలకు శనివారం వెళ్లే వారికి గుడ్ న్యూస్... దర్శనం?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం అయినా భక్తుల రద్దీ సాధారణంగా ఉంది
CONG | ఐక్యతతోనే ‘హస్త’గతం! హస్తం పార్టీ ఐక్యత చాటింది. భారీ విజయంతో
Bobby making Crucial changes for Mega158
Bobby Kolli is all set to direct his demigod Megastar Chiranjeevi for the second time after their successful outing Waltair Veerayya. The film was planned to be launched in August and the shoot was planned in December. But Bobby Kolli wanted to push the shoot of the film to next year as he is making […] The post Bobby making Crucial changes for Mega158 appeared first on Telugu360 .
Bigg boss 9: Boring BB Kingdom task ends; Tanuja Becomes Captain
Bigg Boss Telugu Season 9 moved into an emotional yet unevenly paced episode as the long-running BB Kingdom saga finally reached its conclusion. While the week lacked the spark viewers usually expect, the captaincy task and childhood-memory segment brought some high points to an otherwise dull stretch. Tanuja Wins the Captaincy Task The final leg […] The post Bigg boss 9: Boring BB Kingdom task ends; Tanuja Becomes Captain appeared first on Telugu360 .
Telangana : నేడు మరోసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
India vs South Africa : బౌలర్లదే పై చేయి.. ఈరోజు ఆటలో కుదురుకుంటే?
కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ పట్టుబిగింది.
ఫుల్లు అయిని విశాఖ ఎయిర్ పోర్టు
విశాఖ విమానాశ్రయం ప్రత్యేక విమానాలతో నిండిపోయింది.
విశాఖ సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులు.. అవగాహన ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ పట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు మంచి స్పందన లభించిం
జమ్మూ కాశ్మీర్ లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
జమ్మూ కశ్మీర్ లో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు
Prabhas and Prem Rakshith Film on Cards?
Prabhas is the busiest actor of the country and he has several films in the making. Apart from these, several big-budget attempts are lined up and Prabhas is occupied for the next few years. As per the ongoing buzz, Prabhas has now given his nod for one more new film. Oscar-winning-choreographer Prem Rakshith has impressed […] The post Prabhas and Prem Rakshith Film on Cards? appeared first on Telugu360 .
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ -2025) రెండో విడత నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు శనివారం(నవంబర్ 15) నుంచి ఈనెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 31వ తేదీ మధ్య ఆన్లైన్ పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2025లో మొదటి విడత పరీక్షను జూన్లో నిర్వహించగా, తాజాగా రెండో ఈ ఏడాది నోటిఫికేషన్ను విద్యాశాఖ విడుదల చేసింది. ప్రభుత్వ టీచర్లుగా పని చేస్తున్న వారు ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1వ తేదీన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారు సైతం ఈసారి టెట్కు పోటీ పడనున్నారు. టెట్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్ రాసి, అందులో ఉత్తీర్ణత పొందాలి. టెట్ పేపర్-1కు డి.ఇడి, పేపర్ -2కు బి.ఇడి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రెండేళ్ళ తమ పాలనపై ప్రజలు చాలా స్పష్టంగా తీర్పు (రెఫరెండం) ఇచ్చారని, దీంతో తమ బాధ్యత మరింత పెరిగిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఇకనైనా బిఆర్ఎస్, బిజెపి నాయకులు రాబోయే రెండేళ్ళూ ప్రభుత్వానికి సహకరించాలని, చివరి నంవత్సరంలో రాజకీయాలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఫలితం వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్ళ పాలనపై ప్రజలు తమను ఆశీర్వదించారని అన్నారు. బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుర్చీ లాక్కోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే బి. హరీష్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనక పోవడంపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ కెసిఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని, ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందన్నారు. హరీష్ రావు అసూయ తగ్గించుకోవాలని, కెటిఆర్ అహంకారం తగ్గించుకోవాలని ఆయన సూచించారు. అసెంబ్లీలో హరీష్ రావు చూసే చూపులకు తమవైపు కుర్చీలు కాలిపోతాయేలా ఉంటాయని ఆయన విమర్శించారు. సచివాలయానికి కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా.. భూకంపానికి ముందు చిన్న ప్రకంపనలు వచ్చినట్లు బిజెపికి చిన్నపాటి ప్రకంపన వచ్చిందని ఆ పార్టీ నేతలు విశ్లేషించుకోవాలని ఆయన సూచించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర మంత్రు లు కిషన్రెడ్డి, బండి సంజయ్ సహకరించాలని ఆ యన కోరారు. ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన అ నేక అంశాలు ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి వాటిపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సచివాలయానికి ఆహ్వానిస్తున్నానని అన్నారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న వాటిపై రాజ్యసభ, లోక్సభ సభ్యులతో చర్చించి నివేదిక రూపొందించాలని ఆయ న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కోరారు. కిషన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పు డు 65 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని, ఈ దఫా జూబ్లీహిల్స్ అభ్యర్థి తానే అన్నట్లు విస్తృతంగా ప్ర చారం చేసినా 17 వేల ఓట్లు వచ్చాయని, చివరకు డిపాజిట్ గల్లంతు అయ్యిందని అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎక్కువ డివిజన్లలో బిజెపి గెలుపొందినా, ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ను గెలిపించి తమ ప్రభుత్వ పని తీరుతో సంతోషంగా ఉన్నామ ని తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు ఉంది కాబట్టి రెండే ళ్ళ పాటు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేసుకోవచ్చన్నారు. నేను చెప్పిందే నిజమైంది.. ఉప ఎన్నిక పోలింగ్కు ముందు తాను మీడియా సమావేశంలో నిజమైందని ముఖ్యమంత్రి అన్నా రు. బిజెపికి డిపాజిట్ రాదని, బిఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పినట్లే జరిగిందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కెసిఆర్ కాలుకు బలపం కట్టుకుని తిరిగినా, ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి తమకు పట్టం కట్టారని ఆయన చెప్పారు. గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్ చరిత్రలో లేదన్నారు. ఫేక్ సర్వేలతో భ్రమల్లో బిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు ఫేక్ సర్వేలతో భ్రమల్లో ము నిగిపోయారని ఆయన విమర్శించారు. డబ్బులిచ్చి సర్వే చేయించుకుంటే ఆ సర్వే చేసే వారు వారికి అనుకూలంగానే సర్వే రిపోర్టు ఇస్తారని ఆయన చెప్పారు. ఆ సంస్థలకు ఎన్నికల సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఓ అవకాశమని ఆయన తెలిపారు. గత ఎన్నిక ఫలితంతో పోల్చి చూస్తే ఈ దఫా ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఈ దఫా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చాయని ఆయన వివరించారు. కర్మ ఎవరినీ వదిలి పెట్టదు.. జూబ్లీహిల్స్ ఫలితంపై కెసిఆర్ కుమార్తె, జాగృతి అధ్యక్షురాలు కె. కవిత కర్మ ఎవరినీ వదిలి పెట్టదని చేసిన వ్యాఖ్య గురించి ప్రశ్నించగా, దీనిపై తాను స్పందించనని, కెటిఆర్ సమాధానం చెబితే బాగుంటుందన్నారు. మజ్లిస్ పార్టీ వల్ల ఇక్కడ మేలు జరిగింది కానీ బీహార్లో జరగలేదు కదా అని ప్రశ్నించగా, పరిస్థితులు ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా ఉంటాయని అన్నారు. అందుకే వాతావరణ పరిస్థితులను బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక విధమైన పంటలు ఉంటాయని అన్నారు. విజన్ డాక్యుమెంట్తో.. 2047 సంవత్సరం వరకూ విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ ఏడున విడుదల చేయనున్నామని ముఖ్యమంత్రి వివరించారు. అభివృద్ధిపై దృష్టి పెడతామని, దీనికి ప్రతిపక్షాలు సహకరించాలని ఆ యన కోరారు. జూబ్లీ ఫలితంతో స్థానిక సంస్థల ఎన్నికలకూ వెళతారా? అని ప్రశ్నించగా, ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ని ర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ల అంశం స్పీకర్ పరిథిలో ఉందని, విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు: పిసిసి చీఫ్ పిసిసి చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడు తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లను కైవసం చేసుకుంటామని ధీమాగా చెప్పారు. జిహెచ్ఎంసి, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ పార్టీదే విజయమని అన్నారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్లో విజయం సాధించిన నవీన్ కుమార్ యాదవ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. బీహార్ ఫలితాలపై దృష్టి పెట్టలేదు ‘మన తెలంగాణ’ దిన పత్రిక ఎడిటర్ దేవులపల్లి అమర్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ తాను బీహార్ ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించలేదన్నారు. బీహార్ ఫలితంపై తాను అధ్యయనం చేసి తప్పకుండా స్పందిస్తానని చెప్పారు.
మన తెలంగాణ/సిటీ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. నవీన్ యాదవ్కు 98,988(51%) ఓట్లు వచ్చాయి. మాగంటి సునీతకు 74,259 (38%) ఓట్లు రాగా బీజెపి అభ్యర్థి లంకల దీపక్రెడ్డికి 17,061(9%) ఓట్లు పోలయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా జూబ్లీహిల్స్లో భారీ మెజారిటీ రావడం, అది కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం సంచలనంగా మారింది. దీంతో బీఆర్ఎస్ సిట్టిం గ్ సీటును కోల్పోవాల్సి వచ్చింది. శుక్రవారం ఉ.8గం.లకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని రౌండ్లలోనూ ఆధిక్యత కొనసాగించింది. ఇక బీ జెపి అభ్యర్థి డిపాజిట్ను కూడా దక్కించుకోలేకపోయారు. పోటీ లో ఉన్న 58మంది అభ్యర్థులలో 55 మంది అభ్యర్థులకు నోటాకు పోలైన ఓట్లకన్నా తక్కువగా రావడం విశేషం. ఈ ఎన్నికలో విజయం సాధించిన నవీన్యాదవ్కు రిటర్నింగ్ అధికారి సాయిరాం దృవీకరణ పత్రం అందేజేశారు. ఫలించిన సిఎం రేవంత్రెడ్డి వ్యూహం రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్న పాలనకు రెఫరెండంగా ఈ ఉప ఎన్నిక అంటూ ప్రచా రం జోరుగా సాగిన నేపథ్యంలో ఇక్కడ గెలుపు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఎం కొత్త ఎ త్తు లు ప్రయోగించి సక్సెస్ అయ్యారు. ముందుగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపట్టా రు. అనంతరం నియోజకవర్గానికి ఇన్చార్జీని నియమించారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన తర్వాత మునిసిపల్ డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. స్టార్ కాంపేయిన్లను ప్రకటించారు. 4సార్లు సిఎం స్వ యంగా రోడ్ షోలు నిర్వహించారు. మునుపెన్నడు లేని విధంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాలను తమకు మద్దతునిచ్చేలా దళిత, బీసీ, ఓసీ, సెటిలర్స్, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులకు డివిజన్ల వారీగా ఇన్చార్జీ బాధ్యతలను అప్పగించారు. పిజెఆర్ పేరును ప్రస్తావించడం, అజహార్కు మంత్రి పదవిని కేటాయించడం వంటివి నియోజకవర్గంలో కాంగ్రెస్కు పట్టం కట్టేలా చేశాయనేది టాక్. అభ్యర్థి బీసి కావడం, స్థానికుడై ఉండటం, గతంలోనూ రెండు మార్లు పోటీచేసిన అనుభవం, రాజకీయాలు తెలియడం ఆయన ఈ విజయానికి ప్లస్పాయింట్స్గా మారినట్టు రాజకీయ వర్గాల్లోని అభిప్రాయం. కెసిఆర్ దూరం అధికార పక్షానికి ప్రధాన పోటీదాడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పక్షాన ప్రచారానికి గులాబీ దళం అధినేత మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు దూరంగా ఉన్నారు. కనీసం పా ర్టీకి ఓటెయ్యండి, సునీతను గెలిపించండి అం టూ ఒక ప్రకటనను కూడా చేయలేదు. పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు విస్తృత ప్రచా రం చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు కూడా ప్రచారం చేసి.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు, అధికార పక్షంపై విమర్శలు, ఆరోపణలు సంధించినా.. రోడ్ షోలు నిర్వహించి నా.. సీటును నిలుపుకోలేకపోయారు. స్థానికం గా పార్టీ బలంగా ఉన్నా.. కార్పోరేటర్లు బీఆర్ఎస్ను వీడటాన్ని ఆపలేకపోవడం, బలమైన నా యకులు లోకల్గా లేకపోవడం లోపంగా కనిపించిందనీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పదేపదే ప్రస్తావించినా ఓటర్లను తమవైపునకు తిప్పుకోలేకపోయారేది రాజకీయ వర్గాల్లోని అభిప్రాయం. కేంద్రమంత్రి కిషన్రెడ్డికి షాక్ ఈ ఉపఎన్నికల ఫలితంలో డిపాజిట్ లేకుండా స్థానిక ఓటర్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి షాక్ ఇచ్చారు. బీజెపికి కేవలం 17,061ఓట్లు మాత్రమే వేసి పార్టీ వర్గాలను, నగర వాసులను ఆశ్చర్యానికి గురిచేశారు. కేంద్ర మంత్రులు కిషనర్ రెడ్డి, బండిసంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావులు, ఎంపీ డికె ఆరుణలు ప్రచారం చేసి నా కనీసం గత ఎన్నికల్లో ఓట్లను రాబట్టుకోలేక చివరికి డిపాజిట్ను కోల్పోవడం గమనార్హం.
మన తెలంగాణ/హైదరాబాద్: ‘జూబ్లీహి ల్స్ ఉప ఎన్నికలో గెలువబోతున్నాం, రాసిపెట్టుకోండి. ఇక్కడ మరో విశేషం ఏ మిజరుగబోతుందంటే, బీజేపీకి డిపాజి ట్ గ ల్లంతు కావడం ఖాయం’ అని సిఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భం గా చె ప్పిన జోస్యం వందుకు వందశాతం ఫలించింది. ఇదే కాకుండా తమ అభ్యర్థి నవీన్ యాదవ్ 30 వేల మెజార్టీ సాధించబోతున్నారని సీఎం చెప్పిన మాట కూ డా కాస్త అటు ఇటుగా (25 వేలు) నిజమైంది. ప్ర స్తుతం జరిగింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక్కటే అయినప్పటికీ ఈ ఫ లితం రాజకీయంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని, అటు కాంగ్రెస్ పార్టీని మ రింత బలోపేతం చేసినట్లు అయింది. మ రోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మొన్నటి కంటోన్మెంట్ ఉప ఎన్నిక, నేటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సాధించిన వరుస విజయాలు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను మరింత బలహీన పరిచినట్టు అయింది. ఇదే కాకుండా సీఎం రేవంత్రెడ్డికి వ్యక్తిగతంగా కూడా పార్టీపై, ప్రభుత్వంపై పట్టుబిగించడానికి, అలాగే అధిష్టానం వద్ద తన ప్రతిష్ట పెంచుకునేందుకు దోహదం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఇది రెండవ విజయం. మొదటి విజయం సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండవ విజయంగా ఆయన ఖాతాలో పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కానీ క్షేత్రస్థాయిలో అలాంటిదేమి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఎలాంటి వ్యతిరేకత లేదని కూడా ఈ ఎన్నికల ఫలితం పరోక్షంగా చాటి చెప్పినట్లు అయింది. ఒకరకంగా ఈ ఫలితం తమ రెండేండ్ల పాలనపై ప్రజలు ఇచ్చిన రెఫరాండమ్గా సీఎం రేవంత్రెడ్డి తాజాగా అభివర్ణించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూల తీర్పు రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించాలనుకుంటున్న స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ చేసినట్టు అయింది. అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న జూబ్లీహిల్స్ జోష్తో స్థానిక ఎన్నికలపై రెండు మూడు రోజులల్లో నిర్ణయం తీసుకోబోతున్నట్టు సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించడం గమనార్హం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ కు జరిగిన ఉప ఎన్నికను సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ మంచి మెజార్టీ సాధించగలిగారని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకుగాను ఒక్కో డివిజన్కు ఇద్దేరేసి మంత్రులను ఇంచార్జీలుగా నియమించడంతో పాటు తానే స్వయంగా ప్రతి డివిజన్లో రోడ్ షోలు నిర్వహించారు. తమ రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్ల ముందు ఉంచారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో నిర్లక్షానికి గురైన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి దాదాపు రూ. 400 కోట్లు మంజూరు చేయడంతో పాటు అప్పటికప్పడు నిధులను విడుదల చేయడం ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. మరోవైపు ఇక్కడ ముస్లిం మైనార్టీల జనాభా అధికంగా ఉండటంతో వారిని ఆకట్టుకునే వ్యూహంతో ముందుగానే ఎంఐఎం పార్టీతో మద్దతు కూడగట్టుకోవడంతో పాటు అజహరుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోవడం వంటి వ్యూహత్మక ఎత్తుగడల వల్ల ఆ వర్గం ఓటు బ్యాంక్ను గంపగుత్తగా పొందడం కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రధానంగా కలిసివచ్చిన అంశం. ఇప్పటికే ఇక్కడి నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటి చేసిన నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడమే కాకుండా, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశం ట్రెండింగ్గా మారిన నేపథ్యంలో ఇక్కడి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించడం కూడా కాంగ్రెస్ విజయానికి దోహదం చేసిన మరో అంశం. ఇక్కడ వరుసగా మూడు పర్యాయాలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మృతి వల్ల వచ్చిన ఉప ఎన్నికలో ఆయన భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా బరిలోకి దించింది. ఆమె భర్త ఆకస్మిక మృతి కారణంగా సునీతకు సానుభూతి ఓట్లు కలిసివస్తాయని బీఆర్ఎస్ భావించింది. కానీ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టే అనవాయితీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా తూట్లు పొడించింది సీఎం రేవంత్రెడ్డి తన ప్రచారంలో తిప్పకొట్టడం లో కృతకృత్యులయ్యారు. దీనికి తోడు మాగంటి గోపినాథ్కు మొదటి భార్య గా ఒక ఆవిడ, ఆమెకు మద్దతుగా గోపినాథ్ తల్లి పోలింగ్కు ముందు చేసిన విమర్శలు, ఆరోపణలు కూడా సానుభూతి ఓట్లకు గండికొట్టడం కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది.
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్న యం బిఆర్ఎస్ ఒక్కటే అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇది నిజంగా తమకు సానుకూలమైన అంశం అని పేర్కొన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రాజకీయాలకు కొత్త అయినప్పటికీ అద్భుతంగా పనిచేశారని.. పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలకు కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కెటిఆర్ స్పందిస్తూ రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని పేర్కొన్నారు. ఇకపైనా ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిజాయతీగా కొట్లాడాం బిఆర్ఎస్ గత రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్రను అద్భుతంగా పోషించిందని కెటిఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిజాయతీగా కొట్లాడమని స్పష్టం చేశారు. 2014 నుంచి 2023 వరకు దాదాపు ఏడు ఉప ఎన్నికలు జరిగాయని చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నిక ల్లో కూడా గెలవలేదని గుర్తుచేశారు. దాదాపు ఐ దింటిలో తాము గెలిచామని చెప్పారు. జిహెచ్ఎం సి ఎన్నికలో కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్కి ఒకటి 2సీట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. డైవర్షన్ రాజకీయాలు చేయలేదు ఎన్నికల్లో లబ్ధి కోసం కులం, మతం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయలేదని కెటిఆర్ అన్నారు. బూతులు అస్సలు మాట్లాడలేదని, హుందాగా కేవ లం ప్రజాసమస్యలపై మాత్రమే కొట్లాడామని తెలిపారు. ప్రజలకు అవసరమైన పాయింట్లను మాత్ర మే చర్చకు పెట్టామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఎంత కవ్వించేందుకు యత్నించినా కూ డా సమన్వయం పాటించామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో కూడా తెలిపామని చెప్పారు. రెండేళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయని ముఖ్యమంత్రి.. ఆఖరి రోజు ఆరు గ్యారంటీల మీద సమీక్ష చేయక పరిస్థితి వచ్చిందంటే అది బిఆర్ఎస్ విజయమే అని పేర్కొన్నారు. రెండేళ్లలో మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు అని, దీనిపై బిఆర్ఎస్ గట్టిగా మాట్లాడి.. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాల్సిన అనివార్యతను కల్పించామని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు ఈ ఎన్నిక ఏ విధంగా జరిగిందో ప్రజల్లో, మీడియాలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా అక్రమాలకు పాల్పడుతుందో నెల రోజుల ముందే చెప్పామని, స్వయంగా అభ్యర్థి తమ్ముడికి దొంగ ఓట్లు ఉండడం, దొంగ ఓటరు కార్డుల పంపిణీ, షెడ్యూల్ మొదలు పోలింగ్ రోజు వరకు జరిగిన అక్రమాల గురించి ఎన్నికల కమిషన్కు అనేక ఫిర్యాదులు చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నదని, ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం బానే వర్కవుట్ అయినట్టుందని కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పది ఉపఎన్నికలు వస్తే ఏం చేస్తారో చూద్దాం పశ్చిమబెంగాల్లో బిజెపి నుంచి టిఎంసిలో చేరిన ఎంఎల్ఎపై హైకోర్టు అనర్హత వేటు వేసిందని, అక్కడ జరిగిందే ఇక్కడా జరుగుతుందని ఆశిస్తున్నామని కెటిఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై దేశమంతా ఒకటే న్యాయం ఉంటుంది కదా...? అని అడిగారు. ఒక్క ఉపఎన్నికకే కాంగ్రెస్ నేతలు ఆపసోపాలు పడ్డారని, 10 ఉపఎన్నికలు వస్తే వాళ్లకు ముచ్చెమటలు పడతాయేమో..ఏం చేస్తారో చూద్దాం అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసిబి మరోమారు మెరుపు దాడులు నిర్వహించింది. ఈనెల 6నకూకట్పల్లి, కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసిబి అ ధికారులు మరోమారు రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని కార్యాలయాల్లో డాక్యుమెంట్లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు కొన్ని చోట్ల నగదును, ఫోన్లను సైతం అధికారులు తమవెంట తీసుకెళ్లారు. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, గండిపేట్, మే డ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, నల్లగొండ జి ల్లాలోని మిర్యాలగూడ, ఖమ్మం జిల్లాలోని వైరా, జహీరాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, వనపర్తి సబ్ రి జిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసిబి దాడులు నిర్వహించింది. శనివారం తెల్లవారుజాము వరకు ఏ సిబి అధికారులు ఈ తనిఖీలను కొనసాగించా రు.వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి అధికారులు చేపట్టిన ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. ఈ సోదాల్లో అధికారులు కార్యాలయంలోని పలు రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలించి స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మహబూబ్నగర్ ఏసిబి డిఎస్పీ బాలకృ ష్ణ ఆధ్వర్యంలోసోదాలు జరగ్గా ఈ కార్యాలయం లో డాక్యుమెంట్ రైటర్స్, కార్యాలయ సిబ్బంది దగ్గర నగదును ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్ చేసిన రికార్డులను, పలు డాక్యుమెంట్లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ మహిళ అనధికారికంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ఈ కార్యాలయంలో 60,160 రూపాయలను ఏసిబి అధికారులు సీజ్ చేశారు. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది ఫోన్ల స్వాధీనం పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ విజయ్కుమార్ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. ముందుగా సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకొని గదిలో ఉంచారు. వైరాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసిబి డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ముందుగా ఈ దాడుల్లో ఓ సీనియర్ డాక్యుమెంట్ రైటర్ వద్ద సుమారు రూ. 2.90 లక్షల రూపాయల నగదును ఏసిబి అధికారులు గుర్తించారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద సుమారుగా రూ.42,300లు జహీరాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో 10 మంది ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్టు ఏసిబి గుర్తించింది. ప్రైవేటు వ్యక్తుల వద్ద సుమారుగా రూ.42,300లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ అయిన 113 డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ వారికి ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నారని ఏసిబి అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఏసిబి ఆరా తీస్తోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ జి.మధు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఫైళ్లను పరిశీలించిన ఏసిబి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. పలు ఫైళ్లను క్షుణ్ణంగా ఏసిబి అధికారులు పరిశీలించారు. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ ఏసిబి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు రికార్డులను, డాక్యుమెంట్లను ఏసిబి అధికారులు పరిశీలించారు. త్వరలోనే మరికొన్ని త్వరలోనే మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసిబి అధికారులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం. మూసాపేట్, ఎల్బినగర్, హయత్నగర్, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శంషాబాద్, ఫరూక్నగర్, షాద్నగర్, చౌటుప్పల్, ఉప్పల్, భువనగిరి, యాదగిరి గుట్ట, సరూర్నగర్, పెద్ద అంబర్పేట్, బీబీనగర్, ఘట్కేసర్, చంపాపేట్, కీసర, నారపల్లి తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసిబికి అధికంగా ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. సబ్ రిజిస్ట్రార్లపై ఆరోపణలు వస్తే అందినకాడికి తమ నుంచి డిఆర్లు, డిఐజిలు వసూళ్లు చేస్తున్నారని ఏసిబి దాడులు వారిపై ఎందుకు చేయడం లేదని సబ్ రిజిస్ట్రార్లు ప్రశ్నిస్తున్నారు. డాక్యుమెంట్ల విషయంలో తమపై ఫిర్యాదులు వస్తే వెంటనే డిఆర్లు భయబ్రాంతులకు గురి చేసి తమనుంచి అందినకాడికి దండుకుంటున్నారని సబ్ రిజిస్ట్రార్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ డిఆర్లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.
మన తెలంగాణ/హైదరాబాద్ : హైడ్రాపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఏజెన్సీకి ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేయవద్దని, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కోర్టు అధికారం చూపుతామని కమిషనర్ ఎ.వి. రంగనాథ్ను హెచ్చరించారు. హైడ్రా 50, 100 గజాల్లో నిర్మాణాలే లక్షంగా ఎందుకు వెళుతున్నారని కమిషనర్ను ప్రశ్నించారు. తుమ్మిడి కుంట చెరువు పునరుద్దరణ పనులపై ఇతర భూముల్లో యధాస్థితిని కొనసాగించాలని ఆదేశించారు. శుక్రవారం తుమ్మిడి కుంట చెరువుపై కోర్టు ధిక్కార పిటిషన్ విచారణను చేపట్టిన జస్టిస్ విజయ్సేన్ రెడ్డి హైడ్రాపై విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా హాజరయ్యారు. ప్రజలకు సేవ చేయడం కోసమే అధికారులకు అధికారం ఇవ్వబడిందని కోర్టులకు ఉన్నతమైన అధికారం ఉందని అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు. అలాంటి అధికారాన్ని ఉపయోగించమని మమ్మల్ని బలవంతం చేయవద్దుని న్యాయమూర్తి వర్చువల్గా హాజరైన హైడ్రా కమిషనర్తో అన్నారు. బఫర్ జోన్లు, సరస్సు ప్రాంతాలలో ఉన్న భూములలో భవనాలు వచ్చినప్పటికీ, చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానాలను పాటించకుండా నిర్మాణాల కూల్చివేతలు చేపట్టకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రభావిత వ్యక్తులకు సరైన నోటీసులు జారీ చేయకుండా నిర్మాణాలను కూల్చివేసే అధికారాన్ని హైడ్రా ఎక్కడి నుండి పొందిందో తెలపాలని న్యాయమూర్తి కోరారు. పెద్దపెద్ద నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని, 50, 100 గజాల నిర్మాణలే లక్షంగా ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు. కొంతమంది తమ ఇంటి నిర్మాణం కోసం 50 నుండి 100 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేస్తారని న్యాయమూర్తి అన్నారు. కొన్నిసార్లు, ప్రభుత్వాలు భూమి క్రమబద్ధీకరణ పథకం, భవన క్రమబద్ధీకరణ పథకం కింద అటువంటి ప్లాట్లలో ఏర్పడిన నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తాయని గుర్తు చేశారు. హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయకుండా శని, ఆదివారాల్లో వాటిని కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ఆక్రమణదారులు అకస్మాత్తుగా ఎక్కడికి వెళతారు? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అన్ని కేసులలోనూ ఏజెన్సీ చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని హైడ్రా కమిషనర్, ప్రభుత్వ న్యాయవాది ఇమ్రాన్ఖాన్ ధర్మాసనానికి తెలియజేశారు. ప్రభుత్వ ప్రజా వాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చర్య తీసుకుంటూ కూల్చివేతలను చేపట్టామని కమిషనర్ కోర్టుకు తెలిపారు. హైటెక్ సిటీ, చార్మినార్, ఇతర ప్రాంతాలలో వరదలను నివారించడానికి తుమ్మిడి కుంట సరస్సు అడుగుభాగం నుండి టన్నుల కొద్దీ బయో-వేస్ట్లు, శిధిలాలను తొలగిస్తూ హైడ్రా చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని కమిషనర్ రంగనాథ్ కోర్టు వివరించారు. ప్రజా వాణి కార్యక్రమం ద్వారా వచ్చిన అనేక ఫిర్యాదులపై అటువంటి చర్య అవసరమని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా కూల్చివేతలు చేపట్టడానికి చట్టం ఏజెన్సీకి ఎటువంటి అధికారాన్ని ఇవ్వలేదని పిటిషనర్ మొహమ్మది బేగం న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో తుమ్మిడి కుంట చెరుపు పునరుద్దరణ నిర్మాణ పనులు, ఇతర భూముల్లో యధాతద స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను కోర్టు ధిక్కార కేసును ఈనెల 27కి వాయిదా వేశారు.
శనివారం రాశి ఫలాలు (15-11-2025)
మేషం విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహయం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారములో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృషభం ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. మిధునం ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. కర్కాటకం చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వ్యాపారమునకు సకాలంలో పెట్టుబడులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి. సింహం సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహన లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపార వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. కన్య వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. తుల ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. ఇంటాబయట చికాకులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృశ్చికం ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఇంటాబయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. ధనస్సు భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. మకరం ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. కుంభం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలసి వస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీనం కొన్ని పనులలో శ్రమ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దాయదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.
బాలాజీ నగర్లో జార్ఖండ్ యువకుడి ఆత్మహత్య
జార్ఖండ్కు చెందిన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాజీ నగర్లో చోటుచేసుకుంది. బాలాజీ నగర్లోని మా భూమి న్యాచురల్స్లో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బినాయి కుమార్(27) సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అక్కడే ఉంటున్నాడు, ఈ నెల 13వ తేదీన షాపులోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డైరీలో కుటుంబ సభ్యులకు సారీ, గుడ్బై, ఫర్గివ్ అని రాసుకున్నాడు. డిప్రెషన్లో ఉండేవాడని, ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉరివేసుకొని పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య…
ఖమ్మం రూరల్, (ఆంధ్రప్రభ) : ఖమ్మం నగర పోలీస్ హెడ్క్వార్టర్స్లో స్పెషల్ బ్రాంచ్
అత్యంత చిన్న వయస్కురాలైన ఎంఎల్ఎగా మైథిలి ఠాకూర్
బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఓ మెరుపు మెరిసింది. ఎన్నికల్లో బరిలో నిలిచే అర్హత కలిగిన పాతికేళ్ల యువతి, జానపద గాయని మైథిలి ఠాకూర్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ విజయం సాధించారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున బరిలో దిగిన ఆమె ఆర్జెడికి చెందిన 63 ఏళ్ల అభ్యర్థి వినోద్ మిశ్రాపై 12వేలకుపైగా ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేసింది. తొలి ప్రయత్నంలో విజయం సాధించడమే కాకుండా అసెంబ్లీ అత్యంత చిన్న వయస్కురాలైన ఎంఎల్ఎగా రికార్డు సాధించారు. ఇప్పటి వరకు ఈ రికార్డు తెలంగాణకు చెందిన మైనంపల్లి రోహిత్పై ఉండేది. ఆయన 26 ఏళ్ల వయసులో బరిలో దిగి ఎన్నికయ్యారు. తాజాగా ఆ రికార్డును మైథిలి సొంతం చేసుకున్నారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే అలీనగర్ పేరును సీతానగర్గా మార్చుతానని ఆమె హామీ ఇచ్చారు.
మోత్కూర్, (ఆంధ్రప్రభ): మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో జనావాసాల మధ్య నూతన వైన్స్ దుకాణాలు,
రాయల్ ర్యాప్చీ సంస్థ ‘టీబీడీ’ ఓటీటీని దుబాయ్లో లాంచ్ చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన లోగో లాంచ్ కార్యక్రమానికి సంస్థ ఎండి ధరమ్ గుప్తా, సీఈఓ సునీల్ భోజ్వానీ, డి.యస్.రావు, వి. సముద్ర, వి.యన్. ఆదిత్య, చంద్రమహేష్, ఇ.సత్తిబాబు, శివనాగు, బసిరెడ్డి, సురేష్ కొండేటి తదితరులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ చేతుల మీదుగా ఈ యాప్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టిబిడి ఎండి ధరమ్గుప్తా మాట్లాడుతూ టిబిడి ఓటీటీ సబ్స్క్రిప్షన్ నెలకు కేవలం రూ.10 మాత్రమేనని అన్నారు.
రైతులు నాణ్యమైన పత్తిని తీసుకురావాలి…
మోత్కూర్, ఆంధ్రప్రభ: రైతులు నాణ్యమైన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తేనే ప్రభుత్వ
తాడ్వాయిలో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు..
తాడ్వాయి, ఆంధ్రప్రభ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో
We are happy with how people are warming up to Kaantha – Rana
Kaantha starring Dulquer Salmaan, Bhagyashri Borse, Samuthirakani, Rana Daggubati has released to highly positive reviews and praises for DQ’s performance. Bhagyashri shocked many with her Kumari character, being a newcomer. Rana Daggubati and Dulquer have produced the film and Rana interacted with media about the film. He stated that Telugu people are taking time to […] The post We are happy with how people are warming up to Kaantha – Rana appeared first on Telugu360 .

26 C