ఎంఎల్ఎల అనర్హత పిటిషన్లపై రేపటినుంచి విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్ఎల అనర్హత పిటిషన్లపై ఈ నెల నుంచి తిరిగి విచారణ చేపట్టాలని అసెంబ్లీ స్పీ కర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం షెడ్యూలు ప్రకటించింది.ఈనెల 6న డాక్టర్ సంజయ్, 7న పోచారం శ్రీనివాస్రెడ్డి, 12న తెల్లం వెంకట్రా వు, 13న అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్ల పై విచారణ చేపట్టనున్నారు. తొలుత పిటిషనర్ల తరఫున న్యాయవాదుల వాదనలను స్పీకర్ ప్ర సాద్ కుమార్ వింటారు. అనంతరం ప్రతివాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిరాయింపు ఎం ఎల్ఎలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఇదివరకే ప్రకాష్గౌడ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిల విచారణ ఇటీవల ముగిసింది. ఇదిలాఉండగా మొత్తం పది మంది ఎంఎల్ఎలపై బిఆర్ఎస్ ఎంఎల్ఎలు స్పీకర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ కార్యాలయం నుంచి పది మందికీ నోటీసులు వెళ్ళగా, అందులో కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంత వరకూ కౌంటర్ దాఖలు చేయలేదు. సుప్రీం జోక్యం.. తాము పది మంది ఫిరాయింపు ఎంఎల్ఎలపై స్పీకర్కు ఫిర్యాదు చేసినా స్పీకర్ కనీసం వారికి నోటీసులు కూడా పంపించలేదంటూ బిఆర్ఎస్ ఎంఎల్ఎలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టు మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్కు సూచించింది. దీంతో వెంటనే నోటీసులు పంపించి విచారణ చేపట్టారు. ఆ గడువు అక్టోబర్ నెలాఖరుతో ముగిసింది. తమకు అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్ల కాన్ఫరెన్స్కు వెళ్ళడం ద్వారా సమయం సరిపోలేదని, ఇంకా నలుగురు ఎంఎల్ఎల విచారణ పూర్తి చేయడానికి మరో రెండు నెలల గడువు కావాలని స్పీకర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు మిగతా నలుగురు ఎంఎల్ఎల విచారణ పూర్తి చేయడానికి విచారణ చేపట్టనున్నారు. కడియం, దానం సంగతి ? మరోవైపు ఎంఎల్ఎలు కడియం శ్రీహరి, దానం నాగేందర్పై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారోనని వివిధ పార్టీల నాయకులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
మన తెలంగాణ/వరంగల్ కార్పొరేషన్/నాగర్కర్నూల్ /మహేశ్వరం : వరంగల్,నాగర్కర్నూల్, రంగారెడ్డిజిల్లాలో మంగళవారం భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో వ ర్షం కారణంగా పత్తి బస్తాలు తడిసిపోవడంతో రై తులు లబోదిబోమన్నారు. నాలుగు రోజుల క్రిత మే వాతావరణ శాఖ వరుణుడు మళ్లీ విరజిమ్మనున్నట్లు హెచ్చరించినా ఏనుమాముల మార్కెట్ యార్డు అధికారులు రైతులకు తాటిపత్రులు సమయానికి ఇవ్వకపోవడంతో పత్తి బస్తాలు వర్షాని కి తడిసిపోయాయి. రైతులు పత్తిని మార్కెట్కు తెచ్చినా వర్షం కారణంగా బస్తాలు నీటిలో తడిసిపోతున్నాయని అన్నారు. అధికారులు పరిస్థితిని గమనించి ముందుగానే సరిపడా తాడిపత్రులు ఏర్పాటు చేసి ఉంటే ఈ నష్టం తప్పేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీ సుకొని తాటిపత్రులు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా నాగర్కర్నూల్ జిల్లా కేం ద్రంతో పాటు, నాగర్కర్నూల్ మండల పరిధిలో ని చుట్టుపక్కల గ్రామాల్లో మంగళవారం మధ్యా హ్నం అకాల వర్షం కురిసింది. ప్రధాన రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే వాన వరద కారణంగా దాదాపు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన వరి, పత్తి తదితర పంటలు విక్రయానికి సిద్ధంగా ఉండగా అకాల వర్షం కారణంగా వారి కష్టం నీటిపాలైందని లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వపరంగా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు రామచంద్రగూడ కుంట తెగిం ది. దీంతో మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్, డైట్ కాలేజీలు నీట మునిగాయి. విద్యార్థులు భయందోళనతో బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూశారు. పోలీసులు, స్థానికులు స్పం దించి సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను వ రద నీటి నుండి రక్షించారు. అయితే వరద నీటి లో విద్యార్థుల వస్తువులు పాఠ్య పుస్తకాలు నీటిపాలయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో, స్థానిక పోలీసు శాఖ నేతృత్వంలో సహాయక చర్యలు చేపట్టారు. సిఐ వెంకటేశ్వరులు, ఎస్ఐలు ప్రసాద్, రాఘవేందర్రావు, ధనుంజయ్ తదితరులు వరద నీరు చేరిన బాధితుల ఇళ్లల్లో పర్యటించి, నీటమునిగిన ఇళ్ల నిర్మాణ నష్టం, నివాసితుల పరిస్థితులను సమీక్షించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు సమస్యలపై సూచనలు అందజేశారు.
మనతెలంగాణ/హైదరాబాద్: ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు రూ.10,000 కోట్లకుపైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య ను పొందే హక్కును దూరం చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా మంగళవా రం సోమాజిగూడ డివిజన్లో కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడిన వేలాది కుటుంబాల ఆశయాలను నాశనం చేసి, తెలంగాణ వి ద్యావంతులైన యువతను బలహీనపరిచేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల ను విడుదల చేయకుండా, మనుగడ కోసం పోరాడుతు న్న ప్రైవేట్ కళాశాలలు, విద్యా సంస్థలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని అన్నారు. బకాయిలు చెల్లించకపోవడం ద్వారా దళిత, ఆదివాసీ, బహుజన, పేద అగ్రకుల విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, అణగారిన వర్గాల ఆశలను అణిచివేసేందుకు పన్నిన పన్నాగం అని ఆరోపించారు. విద్యార్థుల ఫీజులు కూడా చెల్లించలేని ముఖ్యమంత్రి, జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రం ఏం చేస్తారని ప్రశ్నించారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో నిర్వీర్యమైందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి, సంస్థలను బెదిరించి భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం 2023 ఎన్నికలకు ముందు 420 తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, హామీలు అమలు చేయడంలో విఫలమైందని కెటిఆర్ విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు, రైతుబీమా, కెసిఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ కానుకలు వంటి అన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు. హైదరాబాద్లో ఉచిత నీటి సరఫరా పథకాన్ని కూడా ఆపివేసిందని పేర్కొన్నారు. భార్యలకు ఉచిత బస్సు ప్రయాణం అంటారు.. కానీ, భర్తలకు మాత్రం టికెట్ ధరను రెట్టింపు చేశారని, ఇదేనా వాళ్ళు చెప్పే సంక్షేమం..? అని ప్రశ్నించారు. కెసిఆర్ నాయకత్వంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని గుర్తు చేశారు. 2014కి ముందు నగరంలో కరెంటు కోతలు, నీటి కొరత తీవ్రంగా ఉండేవని, ప్రతి ఇంట్లో ఇన్వర్టర్ ఉండేది, ప్రతి వేసవిలో నీటి కొరత తప్పేది కాదని పేర్కొన్నారు. కానీ, కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, తెలంగాణ నిరంతర విద్యుత్, స్వచ్ఛమైన తాగునీరు, వేగవంతమైన పట్టణాభివృద్ధికి నమూనా రాష్ట్రంగా మారిందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 3 లక్షల నుంచి 10 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామని, పరిశ్రమలను విస్తరించి, శాంతిభద్రతలను కాపాడామని వివరించారు. ఇది కారుకు.. బుల్డోజర్కు మధ్య జరుగుతున్న పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ, ధనవంతులు, పలుకుబడి ఉన్నవారిని మాత్రం వదిలిపెడుతోందని కెటిఆర్ మండిపడ్డారు. మురికివాడల్లో ఉండేవాళ్ల ఇళ్లను కూల్చుతారు..కానీ మంత్రులు, కాంట్రాక్టర్ల బంగ్లాలను మాత్రం తాకరు అని, ఇదేనా న్యాయం..?అని నిలదీశారు. ఇది సాధారణ ఎన్నిక కాదు అని, కారుకు.. బుల్డోజర్కు మధ్య జరుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు. బుల్డోజర్ ప్రభుత్వాన్ని ఆపడానికి ప్రజలు కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. మోసపోయిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి ఈ ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని కెటిఆర్ జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. ఈ మొండి ప్రభుత్వానికి గట్టి సందేశం పంపే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు ఉందని,- కారు గుర్తుకు ఓటు వేసి, కెసిఆర్ పాలనను తిరిగి తీసుకురావడానికి జూబ్లీహిల్స్ నుంచే విజయయాత్ర ప్రారంభం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నిక పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల గందరగోళానికి మధ్య జరుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు. తేడా ఏంటో ప్రజలు చూశారు.. ఇప్పుడు తెలంగాణ బిఆర్ఎస్తో ముందుకు సాగాలా లేక కాంగ్రెస్తో వెనక్కి వెళ్లాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. నవంబర్ 11న కారు గుర్తుకు ఓటు వేసి, తెలంగాణ భవిష్యత్తును రక్షించచాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.
పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే మందు బంద్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీ లు మరోసారి అల్టిమేటం జారీ చేశాయి. పెండింగ్ బకాయిలను చె ల్లించకపోతే లిక్కర్ ఉత్పత్తి ఆపేస్తామని హెచ్చరించాయి. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే డిసెంబర్లో మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని లిక్కర్, బేవరేజెస్ కంపెనీల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ప్రభుత్వం నుంచి రూ.3,366 కోట్ల బకాయిలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో మద్యం తయారీ కంపెనీలు ఇబ్బంది పడుతున్నట్లుగా పేర్కొంది. బిల్లులు చెల్లించకుంటే మద్యం ఉత్పత్తిని నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని కంపెనీల సంఘం స్పష్టం చేసింది. ఈ బకాయిల్లో రూ.2,300 కోట్లకు పైగా గత ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉండగా ప్రస్తుతం ఈ ప్రభుత్వం రూ.1,366 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో సరఫరా సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతోపాటు తాత్కాలికంగా అడ్వాన్స్ ఎక్సైజ్ డ్యూటీని 30 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశాయి.
బుధవారం రాశి ఫలాలు (05-11-2025)
మేషం : కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభం : స్థిరస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితులనుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలనుండి ఉపశమనం కలుగుతుంది. మిధునం : చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. కర్కాటకం : ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో శ్రమపడ్డా ఫలితం ఉండదు. సోదరులతో ఆస్తివివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. సింహం : సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంటా బయటా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కన్య : నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలనుంచి బయటపడగలుగుతారు. దూరపు బంధువులను కలుసుకుని వివాహవిషయమై చర్చ చేస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. తుల : ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. వృశ్చికం : శ్రమతో కూడిన దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. కుటుంబసభ్యుల ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చుల పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ధనస్సు : బంధుమిత్రులతో గృహమున మరింత ఉత్సాహంగా గడుపుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు విస్తరణకు కుటుంబసభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మకరం : వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. కుంభం : ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. సంతానం విద్యావిషయాల సంతృప్తినిస్తాయి. మీనం : కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 05-11-2025
భారీ వర్షాలకు తెగిన రామచంద్రగూడ కుంట
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు రామచంద్రగూడ కుంట తెగింది. దీంతో మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్, డైట్ కాలేజీలు నీట మునిగాయి. విద్యార్థులు భయందోళనతో బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూశారు. పోలీసులు, స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను వరద నీటి నుండి రక్షించారు. అయితే వరద నీటిలో విద్యార్థుల వస్తువులు పాఠ్య పుస్తకాలు నీటిపాలయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో, స్థానిక పోలీసు శాఖ నేతృత్వంలో సహాయక చర్యలు చేపట్టారు. సిఐ వెంకటేశ్వరులు, ఎస్ఐలు ప్రసాద్, రాఘవేందర్రావు, ధనుంజయ్ తదితరులు వరద నీరు చేరిన బాధితుల ఇళ్లల్లో పర్యటించి, నీటమునిగిన ఇళ్ల నిర్మాణ నష్టం, నివాసితుల పరిస్థితులను సమీక్షించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు సమస్యలపై సూచనలు అందజేశారు.
కాళేశ్వరం అవినీతి పై రేవంత్ సవాల్
హైదరాబాద్, (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు
ఫిబ్రవరిలో నిర్వహించాలని ఏపీయూడబ్ల్యూజే నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) ప్లీనరీ సమావేశాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో విజయవాడలో నిర్వహించాలని ఏపీయూడబ్ల్యూజే నిర్ణయించింది. యూనియన్ అధ్యక్షులు ఐవీ సుబ్బారావు అధ్యక్షతన మంగళవారం విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో యూనియన్ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఐజేయూ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీ చైర్మన్ […] The post విజయవాడలో ఐజేయూ ప్లీనరీ appeared first on Visalaandhra .
. భూకంప నిరోధకంగా నిర్మాణాలు. ధ్వని, వాయు కాలుష్య రహితం. పచ్చదనానికి ప్రాధాన్యం. విరివిగా సోలార్ ప్యానల్స్ వినియోగం. పకడ్బందీగా పర్యావరణ నిబంధనల అమలు విశాలాంధ్ర-సచివాలయం:రాజధానిలో నిర్మాణాలు, అభివృద్ధికి సంబంధించి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన శిక్ష తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నియమ, నిబంధనలు అమల్లోకి తేనుంది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రాజధానిలో భవన నిర్మాణాలు, రహదారులు, వంతెనలు., ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతి అంశంలో పర్యావరణ అనుమతుల పర్యవేక్షణకు సాంకేతికతను సంస్థలు అమలు చేయనున్నాయి. […] The post రాజధాని భవనాలు సరికొత్తగా… appeared first on Visalaandhra .
వికారాబాద్ జిల్లా ఎస్పి కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సిహెచ్. శ్రీనివాస్ (40) మంగళవారం పోలీస్ వాహనాన్ని శుభ్రం, కడుగుతుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన తోటి పోలీసులు వెంటనే వికారాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. 2007 నుంచి హోంగార్డుగా వికారాబాద్ జిల్లా ఎస్పి కార్యాలయంలో విధులను నిర్వహిస్తున్నాడు. మృతుడికి భార్య మాధవి, ఇద్దరు పిల్లలు కూతురు భవ్యశ్రీ (7), కుమారుడు (5) ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పి నారాయణరెడ్డి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యాన్ని కల్పించారు. హోం గార్డ్ కుటుంబ సభ్యులను ఆదుకుంటాం హోం గార్డ్ సిహెచ్. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని జిల్లా ఎస్పి కె.నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హోంగార్డు కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. జిల్లా పోలీస్ కార్యాలయం లోని ఎంటి సెక్షన్ (మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్)లో విధులు నిర్వహిస్తూ, అకాల మరణం చెందిన హోం గార్డ్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని పూర్తి భరోసా కల్పించారు. శ్రీనివాస్ హఠాత్ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని, ఇది పోలీస్ శాఖకు కూడా తీరని లోటన్నారు. మృతుని మరణానికి సంబంధించి ఉన్న అనుమానాలు, ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో కరెంట్ షాక్కు గురై మరణించారా, మరేదైనా ఇతర కారణంతో మృతి చెందారా అనే విషయంపై దర్యాప్తు జరుగుతుందని అన్నారు. ఈ కేసులో వాస్తవాలు తెలుసుకోవడానికి శాస్త్రీయ పద్ధతి అయిన పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ తుది నివేదిక కీలకం అవుతుందని, ఆ నివేదిక వచ్చే వరకు ఎలాంటి ముందస్తు నిర్ధారణకు రావద్దన్నారు. ఈ కష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులు ఎవరూ కూడా అధైర్య పడకుండా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటామని తెలిపారు. కేసు దర్యాప్తు విషయంలో, శాఖాపరమైన సహకారం అందించడానికి తాము అందుబాటులో ఉంటామని అన్నారు. ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు, హోంగార్డు అసోసియేషన్ తరపున ఒకరోజు వేతనాన్ని బాధిత కుటుంబానికి అందజేసేలా చూస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
టీనేజర్పై హర్యానా ఆగంతకుని కాల్పులు
హర్యానా లోని ఫరీదాబాద్కు చెందిన ఓ వ్యక్తి మంగళవారం 17 ఏళ్ల టీనేజర్ను వెంబడించి, వేధించి కాల్పులు జరిపాడు. ప్రైవేట్ లైబ్రరీ బయట ఈ సంఘటన జరిగింది. నిందితుడు పిస్తోలును అక్కడే విడిచిపెట్టి పరారయ్యాడు. హతురాలు, నిందితుడు రోజూ స్టడీ తరగతులకు హాజరవుతుండేవారు. రోజూ ఆమె కోసం నిందితుడు ఎదురు చూసేవాడని, రోజూ ఆమె రాకపోకలు గమనించే వాడని పోలీసులు చెప్పారు. గాయపడిన బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె తనను తరచుగా వేధిస్తున్నాడని, అతడిని గుర్తు పడతానని చెప్పింది. నిందితుడు విడిచిపెట్టిన పిస్తోలును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.
బీహార్లో కొత్త వారికి అవకాశంవిద్యార్థి నాయకులకు ప్రాధాన్యతపిన్న వయస్సు అభ్యర్థుల్లో ధనుంజయ్ పట్నా:వామపక్ష పార్టీలలో యువతరం రాణిస్తోంది. కొత్త వారికి అవకాశం లభిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ యువ నాయకులకు వామపక్ష పార్టీలు టికెట్లు కేటాయించాయి. పిన్న వయస్సు అభ్యర్థులను రంగంలోకి దించాయి. విద్యార్థి నాయకులకు, రైతు`భూ పోరాటయోధులకు ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో సీనియర్లకు, యువనేతలకు మధ్య సమతుల్యత చెడిపోకుండా టికెట్ల పంపిణీ జరిగింది. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, సీపీఐ, సీపీఎం అభ్యర్థుల సగటు వయస్సు […] The post లెఫ్ట్లో యువరక్తం appeared first on Visalaandhra .
ఒక్క ఓటు తొలగించినా సర్కారు కూల్చేస్తాం బీజేపీకి మమత హెచ్చరిక. ఈసీపై రహస్య రిగ్గింగ్ ఆరోపణలు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా బెంగాల్లో భారీ ర్యాలీ కోల్కతా: ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ గర్జించింది. నిప్పుతో చెలగాటం వద్దంటూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అన్యాయంగా ఒక్క ఓటు తొలగించినా దిల్లీలో పీఠం కదులుతుందని, సర్కారు కూలుతుందని స్పష్టంచేసింది. ఎస్ఐఆర్ పేరిట ఒక్క ఓటరు పేరు తొలగించినా బెంగాల్ సత్తా ఏమిటో దిల్లీకి చూపిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. దిల్లీలో బెంగాలీల […] The post నిప్పుతో చెలగాటం వద్దు appeared first on Visalaandhra .
చత్తీస్గఢ్లో గూడ్స్ను ఢీకొట్టిన ప్యాసింజర్..ఐదుగురు దుర్మరణం
చత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. బిలాస్పూర్ స్టేషన్కు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 14మందికి గాయాలయ్యాయి. మంగళవారంనాడు 4గంటలకు గటోరాబిలాస్పూర్ స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. పొరుగున ఉన్న కోబ్రా జిల్లాలోని గెవ్రాకు వెళ్తున్న గూడ్స్ రైలును వెనక నుంచి మెమూ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలు ఇంజిన్ గూడ్స్ బోగీపైకి ఎక్కింది. క్షతగాత్రులను బిలాస్పూర్లోని సిఐఎంఎస్, అపోలో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, గాయపడిన వారి సంఖ్యను ఆయన ధృవీకరించలేదు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల సహాయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణకు రైల్వే ఆదేశించింది. రైల్వే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ, రక్షణ కార్యకలాపాలను ప్రారంభించింది. పరిస్థితిని పర్యవేక్షించడానికి సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై సిఎం విష్ణుదేవ్ సహాయ్ విచారం వ్యక్తం చేశారు. బిలాస్పూర్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేసి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
సీఎం రేవంత్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి అజారుద్దీన్
హైదరాబాద్, (ఆంధ్రప్రభ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
కాంగ్రెస్ కుర్చీ మడత పెట్టండి –కేటీఆర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని
మధ్యాహ్న భోజన వంట సరుకుల ధరల పెంపు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిఎం పోషణ్ పథకం కింద మధ్యాహ్న భోజనం వంట సరుకుల ధరలను కేంద్రం పెంచింది. కాగా, కేంద్రం ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంట సరకుల ధరలను పెంచుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వంట ఏజెన్సీ మహిళలు 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పున చెల్లిస్తుండగా దానిని రూ.6.19కి పెంచారు. 6 నుంచి 8 తరగతులకు ఒక్కో విద్యార్థికి రూ.8.17 నుంచి రూ.9.29కు, 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.10.67 నుంచి రూ.11.79కి పెంచారు. ఈ ధరలు గుడ్డును మినహాయించి మిగిలిన వంట సరుకులకిచ్చేవి. ఒక్కో విద్యార్థికయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తాయి.
బిసి గురుకులాలకు రూ.79.5 కోట్లు మంజూరు
బిసి గురుకుల విద్యాలయాలకు ప్రభుత్వం రూ. 79.5 కోట్లు మంజూరు చేసింది. రూ. 75 కోట్లు మంజూరు చేస్తూ బిసి సంక్షేమ శాఖ మంగళవారం జిఓ 164, బిసి గురుకులాలకు రూ. 4.50 కోట్లు మ ంజూరు చేస్తూ జిఓ 163 జారీ చేసింది. ప్రి మెట్రిక్ స్కాలర్ షిప్ పథకం కింద రూ. 7.58 కోట్ల అదనపు నిధులు మంజూరు చేస్తూ బిసి సంక్షేమ శాఖ జిఓ 165 జారీ చేసింది.
సత్యసాయి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం
శ్రీ సత్యసాయి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన సోమవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, బెంగళూరు నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో వెళ్తున్న జబ్బర్ ట్రావెల్స్కు చెందిన బస్సు దామాజిపల్లి వద్దకు చేరుకున్నప్పుడు, ముందు వెళ్తున్న ఐషర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అధిక వేగంతో ఢీకొనడంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డా రు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏజెన్సీలో భక్తిశ్రద్ధలతో తులసి కళ్యాణ వేడుకలు..
ఉట్నూర్, (ఆంధ్రప్రభ): కార్తీక మాసం సందర్భంగా అదిలాబాద్, కొమరం భీం-ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : ‘‘అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసెనే
సందేహాలపై సందేహాలు – పోలీసుల మౌనం
తిర్యాణి, (ఆంధ్రప్రభ) : తిర్యాణి మండలంలోని మంగి పిట్టగూడలో జరిగిన హత్య కేసు
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనను సుమోటోగా తీసుకున్న హెచ్ఆర్సీ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సి) సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. మీడియా ఛానల్స్, పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారం గా కమిషన్ చర్యలు తీసుకుంది. చేవెళ్ల-తాండూరు మధ్య ప్రాంతాన్ని డెత్ కారిడార్గా అభివర్ణిస్తూ, ఈ మార్గంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితు లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో తరచూ ప్రాణాంతక ప్రమాదాలు జరగడానికి గల కారణాలను హెచ్ఆర్సి విశ్లేషించింది. రోడ్డు పరిస్థితులు అధ్వాన్నంగా ఉండటం, డివైడర్లు లేకపోవడం, వాహనాల అతి వేగం, ఓవర్ లోడింగ్, ఎన్హెచ్ 163 జాతీయ రహదారి విస్త రణ పనులలో జరుగుతున్న తీవ్ర జాప్యం వంటి అంశాలు ఈ ప్రమాదాలకు దారితీస్తున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ఇది పూర్తిగా పరి పాలనా నిర్లక్ష్యం, సంబంధిత అధికారుల వైఫల్యమేనని హెచ్ఆర్సి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై డిసెంబర్ 15వ తేదీన ఉద యం 11 గంటలలోపు సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా ఆయా శాఖలను రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రవా ణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి, రంగా రెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టిసి ఎండిలను సైతం నివేదిక పంపాలని ఆదేశించింది. చేవెళ్ల మీర్జాగూడ వద్ధ ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొన్న ఘటన లో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 24 మందికి గాయాలైన సంగతి విదితమే. ఈ ఘటన బస్సు ప్రయాణికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడం, టిప్పర్ అతివేగం ప్రమాదానికి దారి తీశాయి. ప్రమాదం తర్వాత రోడ్డు విస్తరణ కోసం స్థాని కులు వరుస ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని మంగళ వారం ఆందోళనకారులు ఘెరావ్ చేశారు.
కాంగ్రెస్ లో కాచే శశిభూషణ్కు కీలక బాధ్యతలు..
మంథని, (ఆంధ్రప్రభ): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో
హైదరాబాద్ వ్యాపారికి ₹37.8 లక్షల మోసం
యూకే ఆధారిత ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో నకిలీ యాప్
అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం:భట్టి విక్రమార్క
జూబ్లీహిల్స్ ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మూసాపేట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా భట్టి విక్రమార్క స్థానిక పండ్ల వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అలాగే నవీన్ యాదవ్ కు మద్దతుగా మధురానగర్ డివిజన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రచారం నిర్వహించారు. ఆయనతోపాటు షబ్బీర్ అలీ, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, గిడ్డంగుల చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మమేకమై గెలుపు దిశగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. .
కార్తీక పౌర్ణమి నది స్నానం.. కోటి జన్మల పుణ్యఫలం…
మహదేవపూర్, (ఆంధ్రప్రభ) : కార్తీక పౌర్ణమి అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన
BIG BREAKING |దూసుకొచ్చిన మృత్యువు..
వికారాబాద్ టౌన్, (ఆంధ్రప్రభ) : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఏపీ కళాశాల వద్ద
Jatadhara blends mythology and beliefs masterfully – Prerna Arora
Jatadhara starring Sudheer Babu, Sonakshi Sinha, Shilpa Shirodkar marks a significant milestone for producer Prerna Arora, as she realised her dream to produce a Telugu Film. The mythological folklore thriller has been one of the eagerly awaited films in recent times with teaser, trailer receiving huge appreciation. Promoting the film, Prerna Arora interacted with Telugu […] The post Jatadhara blends mythology and beliefs masterfully – Prerna Arora appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్, (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు కోసం
రైతును విస్మరిస్తే రాజ్యం బాగుపడదు:కల్వకుంట్ల కవిత
రైతును విస్మరిస్తే రాజ్యం బాగుపడదని జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం ఉదయం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇక్కడి ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రంగం రైతులను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. రైతుకు అన్యాయం చేయ వద్దని హితవు పలికారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంతో ఆ దిశగా ముందుకు సాగుతున్నామని, తమ ఎజెండా నచ్చినవారిని, నచ్చని వారిని స్వాగతం పలుకుతున్నామని అన్నారు. నాలుగు నెలల పాటు ప్రజల తో మమేకమైన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇస్తామన్నారు. జాగృతిని బలోపేతం చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎక్కడికి వెళ్ళినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చాలా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని అన్నారు. జిల్లాలో చరాఖ, కోరట, కుప్తి ప్రాజెక్టులు కావలసిన అవసరం ఉందన్నారు. ఆదిలాబాద్ నడిబొడ్డున ఉన్న కొమురంభీమ్ కాలనీలోని 181 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్ద వారికి ధారాదత్తం చేశారని ఆరోపించారు. బోథ్ను రెవెన్యూ డివిజన్ చేసేందుకు జాగృతి శ్రేణులు పోరాటం చేయనున్నట్లు చెప్పారు. బోథ్ ప్రాంతంలోని అన్ని ప్రాజెక్ట్లు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని అన్నారు. ఆదిలాబాద్లో ఐటి టవర్, ఎయిర్పోర్ట్, పఠాన్ చెరువు, ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్వే లైన్, కొత్త పరిశ్రమలు లేవని, వీటి వల్ల ఆదిలాబాద్ మరింతగా అభివృద్ధి జరిగేదని అభిప్రాయపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ జాగృతి నాయకులు శ్రీనివాస్ రావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రభ, విజయవాడ : ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) ప్లీనరీ సమావేశాలను ఫిబ్రవరి
సికింద్రాబాద్ వ్యక్తికి ఆన్లైన్ ట్రేడింగ్ మోసం.. కోటి రూపాయలకు పైగా నష్టం
ఫేక్ ఐపీవో పెట్టుబడుల పేరుతో మోసం చేసిన దుండగులువాట్సాప్ మెసేజ్తో వల వేసి రెండు నెలల్లో మొత్తం సొమ్ము గుంజారు
చిత్తూరు, (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు సమీపంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాలలో విషాదం
పేరు నమోదైన డీలర్ వద్దనే తీసుకోవాలని నిబంధన
పేరు నమోదైన డీలర్ వద్దనే తీసుకోవాలని నిబంధన హుజూర్నగర్, ఆంధ్రప్రభ : రేషన్
60 కోట్లు గెలుచుకున్నావ్ ఫోన్ తీయవయ్యా!!
లాటరీలో 60 కోట్లు గెలుచుకున్న భారతీయుడికి ఆ విషయం చెప్పాలని నిర్వాహకులు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది.
అక్కా చెల్లెళ్లకు కొవ్వొత్తుల నివాళి…
అక్కా చెల్లెళ్లకు కొవ్వొత్తుల నివాళి… వెల్గటూర్, ప్రభన్యూస్ : చేవెళ్లలో సోమవారం జరిగిన
కఠిన చర్యలు తప్పవు… ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని
రేవంత్ రెడ్డికి నోటి విలువ..నీటి విలువ తెలియదు: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటి విలువ, నీటి విలువ తెలియదు అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శించారు. 60 ఏండ్ల కలను సాకారం చేసిన కెసిఆర్ గురించి సిఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడడం సరికాదని అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏం చేస్తారో చెప్పకుండా ఇప్పుడు కూడా కెసిఆర్ మీద, హరీష్ రావు మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏండ్లు ఒక ప్రత్యేకమైన పద్దతిలో ప్రపంచ ఉద్యమాలకు కొత్త నిర్వచనం ఇచ్చేలా కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాడామని తెలిపారు. 60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేయడం కోసం తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడి, వివక్ష, అవమానాలను ప్రజలకు వివరించి తెలంగాణ సబ్బండ వర్గాలను ఏకంచేసి తెలంగాణను సాధించిన కెసిఆర్ గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10 ఏండ్లు తెలంగాణ పునర్నిర్మాణంలో కెసిఆర్ అద్భుతంగా పనిచేశారని, దానికి ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదని పేర్కొన్నారు. సమాజం, చరిత్ర గుర్తిస్తుందని చెప్పారు. భారత సమకాలీన రాజకీయాల్లో 9 సార్లు ఎంఎల్ఎగా, నాలుగు సార్లు ఎంపీగా, ఐదు దశాబ్దాలకు పైగా సమకాలీన రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు కెసిఆర్ అని నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. రాజకీయాల్లో పార్టీలకు, వ్యక్తులకు మధ్య భిన్నాభిప్రాయాలు, విశ్వాసాలు ఉంటాయని, అంతమాత్రాన ఇష్టమున్నట్లు ఎదుటివారిని తూలనాడడం అనేది కుసంస్కారాన్ని తెలియజేస్తుందని అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ రెండు తరాల భవిష్యత్ కోల్పోయిందని, మరో తరం నష్ట పోవద్దని దీక్షా, దక్షతలతో శక్తిని కూడగట్టుకుని అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేశారని చెప్పారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్నా, మరోవైపు ఇంటి దొంగలు, పక్కవారు రకరకాల కేసులతో ప్రాజెక్టులు, ఉద్యోగుల, హైకోర్టు విభజనలను అడ్డుకుంటూ అవరోధాలు కల్పించినా అన్నింటినీ చేదించుకుంటూ కెసిఆర్ తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టారని వ్యాఖ్యానించారు. అన్నింటికీ కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, ప్రకటనలు, అవార్డులు, పార్లమెంటులో కేంద్రం చేసిన ప్రకటనలే సాక్ష్యం అని పేర్కొన్నారు.
వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : మానవ తప్పిదాలు,పోరబాట్ల వల్లనే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని
ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంక్షేమ శాఖ ప్రత్యేక సిఎస్ ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారని జివొ జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కోదండరాం, కంచె ఐలయ్య, ఆర్థిక, విద్య, ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఉన్నత విద్యాసంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పాలసీపై కమిటీ సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేక ట్రస్టు ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ సాధ్యాసాధ్యాలను కమిటీ పరిశీలించనుంది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జివొలో పేర్కొంది. విద్యాసంస్థలు పేర్కొన్న సూచనలపై కమిటీ అధ్యయనం చేయనుంది. గత నెల 28న ఇచ్చిన జివొను ప్రభుత్వం బయటపెట్టింది.
Raja Saab needs a Strong Promotional Strategy
Prabhas’ upcoming movie Raja Saab is all set for Sankranthi 2026 release. The team is yet to kick-start the promotions of the film. The first single release got postponed and the team has to promote the film in all the languages before the release. Prabhas will participate in a promotional event in USA and he […] The post Raja Saab needs a Strong Promotional Strategy appeared first on Telugu360 .
నర్సింగ్ ఆఫీసర్ అనిత ఆత్మహత్యా
నర్సింగ్ ఆఫీసర్ అనిత ఆత్మహత్యా భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి
టీ20 ప్రపంచ కప్ 2026 కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో మూడు
మణికొండలో కాల్పులు కలకలం సృష్టించాయి, ఎపికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఇంటి వివాదంలో మంగళవారం కాల్పులు జరిపారు. పోలీసుల కథనం ప్రకారం...ఎపికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కెఈ ప్రభాకర్కు మణికొండలోని పంచవటి కాలనీ, రోడ్డు నంబర్ 18లో ఇళ్లు ఉంది. దీనిని తన కూతురికి వివాహం సమయంలో రాసి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్కు మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ కూతురును 14ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. దంపతుల మధ్య వివాదం రావడంతో ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అభిషేక్ తనకు వివాహం సమయంలో రాసి ఇచ్చిన ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా గత నెల 25వ తేదీన మణికొండకు వెళ్లి అందులో ఉంటున్న వారిని గన్తో బెదిరించారు. ఈ సమయంలో అక్కడికి కెఈ ప్రభాకర్ రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంతో తన అల్లుడు తనపై గన్ పెట్టి బెదిరించాడని కెఈ ప్రభాకర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అభిషేక్ గౌడ్పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ మంగళవారం మణికొండలోని ఇంటికి 25మంది అనుచరులను తీసుకుని వెళ్లాడు. భవనాన్ని లీజుకు తీసుకుని ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయాలని గొడవకు దిగాడు. తమకు సమయం ఇవ్వాలని వారు చెబుతున్న సమయంలోనే సహనం కోల్పోయి గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల భయానికి అక్కడ ఉన్న వారు పారిపోయారు, కాల్పుల శబ్ధం విన్న స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. లీజులో ఉన్న భవనం... వివాదానికి కారణమైన భవనాన్ని కృష్ణ ధర్మ పరిషత్కు చెందిన ఐదేళ్లు లీజుకు తీసుకున్నారు. నెలకు రూ.1.50లక్షలు చెల్లించేలా లీజుకు తీసుకున్న తర్వాత ధర్మ పరిషత్కు చెందిన సభ్యులు రూ.1.8కోట్లు పెట్టి రినోవేషన్ చేయించారు. లీజుకు తీసుకుని ఏడాది కావడంతో ఇంకా ఐదేళ్లు ఉంది, గడవు ముగియకముందే అభిషేక్, కెఈ ప్రభాకర్ అందులో ఉంటున్న వారిని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. దీనిపై కృష్ణ ధర్మ పరిషత్కు చెందిన వారు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫైరింగ్ మా దృష్టికి రాలేదుః వెంకన్న, రాయదుర్గం ఇన్స్స్పెక్టర్ మణికొండలోని పంచవటి కాలనీలో కాల్పులకు సంబంధించిన జరిగిన కాల్పుల విషయం తమ దృష్టికి రాలేదని రాయదుర్గం ఇన్స్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న ఆస్తి గురించి ఎపికి చెందిన రాజకీయ నాయకుడు, అతడి అల్లుడి మధ్య వివాదం ఉందని తెలిపారు. దీనిపై ఇరువురు అక్టోబర్ 25వ తేదీన ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కుటుంబ కలహాల వల్ల భార్యభర్తలు ఏడాది నుంచి వేరువేరుగా ఉంటున్నారని తెలిపారు. గన్ఫైరింగ్కు సంబంధించిన విషయం తమ దృష్టికి రాలేదని, దానికి సంబంధించిన సాక్షాలు కూడా తమ దృష్టికి రాలేదని తెలిపారు. కాల్పులకు సంబంధించిన సాక్షాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
‘జూబ్లీ 'లో బిజెపికి జనసేన మద్దతు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నువ్వా-నేనా అన్నట్లు త్రిముఖ పోటీ జరుగుతున్న సమయంలో తెలంగాణ జనసేన పార్టీ బిజెపికి మద్దతు ప్రకటించింది. తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎన్. శంకర్ గౌడ్ను మంగళవారం సాగర్ సొసైటీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు కలిసి చర్చించారు. జనసేన అధినేత, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు శంకర్ గౌడ్ బిజెపి ముఖ్య నాయకులతో మంతనాలు జరిపారు. బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఒక రోజు రోడ్-షో, బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా పవన్ కళ్యాణ్ను ఆహ్వానించాలని బిజెపి నాయకులు నిర్ణయించారు. జనసేన ఎన్డీయే భాగస్వామ్యపక్ష పార్టీ కాబట్టి తప్పకుండా ప్రచారంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని బిజెపి నాయకులు భావిస్తున్నారు. బిజెపికి మద్దతుగా తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తారు. ఇరు పార్టీల నాయకులు బుధవారం ప్రచారానికి సంబంధించిన కార్యాచరణను ప్రకటించనున్నారు.
ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలు ఏడాది పొడిగింపు
తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న 1037 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలకు రూ.19,500 వేతనం ప్రస్తుతం చెల్లిస్తున్న మాదిరిగానే మరో ఏడాది పాటు కూడా వారికి వేతనం చెల్లించేందుకు నియమనిబంధనలు వెల్లడిస్తూ ప్రభుత్వం జివో విడుదల చేసింది. జిల్లాలో పంచాయతీ సెక్రటరీల సంఖ్య గ్రామ పంచాయతీల సంఖ్యను మించకుండా చూసుకోవాలని ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు వీరి సేవలు వినియోగించుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాలు… ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఇంపార్టికస్ ఆధ్వర్యంలో ప్రైవేట్ బ్యాంకులలో
భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి…
భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి… ధర్మపురి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం
చేవెళ్ల ప్రమాదానికి సవాలక్ష కారణాలు !
చేవెళ్ల ప్రమాదానికి సవాలక్ష కారణాలు ! చేవెళ్ల, ఆంధ్రప్రభ : చేవెళ్ల దుర్ఘటనకు
డిజిటల్ తెలంగాణలో మీసేవ పాత్ర కీలకం
డిజిటల్ తెలంగాణలో మీసేవ పాత్ర కీలకం ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : డిజిటల్
కొత్త ప్రయోగానికి సిద్ధమైన నవీన్ పొలిశెట్టి
విభిన్నమైన సినిమాలు చేయడంలో యువ హీరో నవీన్ పొలిశెట్టి ఎప్పుడూ ముందుంటాడు. ‘జాతిరత్నాలు’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన నవీన్ ఆ తర్వాత.. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి రకరకాలుగా ప్రమోషన్లు చేస్తూ సినిమాపై హైప్ పెంచేశాడు నవీన్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమాలో నవీన్ కొత్త ప్రయోగం చేసేందుకు రెడీ అయ్యాడట. ఈ సినిమాలో నవీన్ పాట పాడుతున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మిక్కీ సంగీతంలో నవీన్ పాడే పాటని డిసెంబర్లో విడుదల చేస్తున్నట్లు సమాచారం. మరి మిక్కీ సంగీతంలో నవీన్ పాడే పాట ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
వెంటనే సహాయం చేయాలి… చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా(Nalgonda District) చిట్యాల
ట్రాఫిక్ రూల్స్ పాటించడం మన విధి
ట్రాఫిక్ రూల్స్ పాటించడం మన విధి లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : ప్రతి
నాగోల్, (ఆంధ్రప్రభ) : నాగోల్, (ఆంధ్రప్రభ): నాగోల్ సాయినగర్ కాలనీలో రిటైర్డ్ ప్రభుత్వ
ఉచిత చేప పిల్లల పంపిణీ ఎంతో మేలు
ఉచిత చేప పిల్లల పంపిణీ ఎంతో మేలు లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ :
బండ్ల గణేశ్ సంచలన పోస్ట్.. చేతులెత్తి నమస్కరిస్తానంటూ..
అటు నిర్మాతగా, ఇటు నటుడిగా ఒకప్పుడు ఫుల్ జోష్లో ఉన్న బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినిమాలు చేయడం లేదు. కానీ, అడప దడపాగా సినిమా ఫంక్షన్లలో కనిపిస్తూ.. తనదైన శైలీలో స్పీచ్లు ఇస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి కూడా. అయితే తాజాగా బండ్ల గణేశ్ ఎక్స్లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. బండ్డ గణేశ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి సోషల్మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి ఇలాంటి వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి. చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను.’’ అంటూ పోస్ట్ పెట్టారు. మరి పోస్ట్ ఎవరి ఉద్దేశించి పెట్టారనే విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
రామగుండం ఆస్పత్రి ఆర్ఎంఓగా కృపాబాయి…
గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతులు
బొమ్మ గోవుతో గృహప్రవేశం #ViralVideo #Tradition #Environment #Telangana #viralvideo #latestnews
ఇంట్లో ఎవరికీ చెప్పకుండా… చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామానికి
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కి, కవిత మద్దతు పలుకుతున్నారంటూ వైరల్ #TeluguPost
రైతులకు వరి, గోధుమ పంటలపై బోనస్
బీహార్లో ఇండియా కూటమి అధికారం లోకి వస్తే రైతులకు వరిపంటపై క్వింటాల్కు రూ.300, గోధుమపై రూ.400 వంతున బోనస్ అందజేస్తామని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ మంగళవారం వెల్లడించారు. పత్రికావిలేకరుల సమావేశాన్ని ఉద్దేశిస్తూ విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వియాదవ్ విపక్ష కూటమి అధికారం లోకి వస్తే అన్ని రాష్ట్రాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్) , ప్రాథమిక మార్కెటింగ్ సహకార సొసైటీల (వ్యాపార మండళ్లు) అధిపతులకు “ ప్రజా ప్రతినిధుల హోదా ” కల్పించడమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో 8400 పిఎసిఎస్లు ఉన్నాయని తెలిపారు. ఇవే కాకుండా బీహార్ లోని రైతులకు నీటిపారుదల ప్రయోజనాల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేయడమవుతుందని, ప్రస్తుతం వ్యవసాయానికి వినియోగించే విద్యుత్కు యూనిట్కు 55 పైసలు రైతులకు ఛార్జి విధిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రిజిస్టర్ అయిన 8400 వ్యాపార మండళ్లు, పిఎసిఎస్ల మేనేజర్లకు గౌరవవేతనం అందివ్వాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. మై బహన్ స్కీమ్ కింద మహిళలకు ప్రతినెలా వారి బ్యాంకు అకౌంట్లలో రూ. 2500 బదిలీ చేయడానికి ఇప్పటికే హామీ ఇచ్చామని, ఇదే స్కీం కింద జనవరి 14న మకర సంక్రాంతి నాటికి ముందుగా రూ.30 వేలు వంతున వారి అకౌంట్లలో బదిలీ చేయడానికి నిర్ణయించామన్నారు.
నవీన్ యాదవ్కు ప్రైవేట్ టీచర్ల మద్దతు..
జూబ్లీహిల్స్ (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ను అత్యధిక మెజారిటీతో
ఎన్ హెచ్ రహదారి మూసివేత… ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : మల్లంపల్లి సమీపంలోని
‘నీ కోసమే నా పెళ్లాన్ని చంపేశా‘
అతడో డాక్టర్ పేరు డాక్టర్ మహేంద్ర రెడ్డి, తన భార్యను హత్యచేశాడనే ఆరోపణలతో గతనెల అరెస్ట్ అయ్యాడు.హత్య చేసిన కొన్నివారాల తర్వాత నలుగురు, ఐదుగురు మహిళలకు ‘నీ కోసమే నా పెళ్లాన్ని చంపేశా‘ అని దారుణమైన సందేశం పంపాడని పోలీసులు మంగళవారం తెలిపారు.వారిలో గతంలో అతడిని తిరస్కరించిన మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్న మహిళ కూడా ఉందట. ఫోన్ పే చెల్లింపు యాప్ ద్వారా ఈ సందేశం పంపాడు. అతడి భార్య కూడా చర్మవ్యాధుల నిపుణురాలైన డాక్టరే. డాక్టర్ మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అతడి ఫోన్ ను, ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరెటరీకి పంపగా, ఈ సందేశాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ కృతిక విక్టోరియా హాస్పిటల్ లో పనిచేశారు. 2024 మే 26న వారు వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం లోపే 2025 ఏప్రిల్ 23న కృతిక ఆరోగ్య సమస్యల కారణంగా మారత హళ్లి ప్రాంతంలోని తన తండ్రి ఇంట్లో కుప్పకూలిపోయింది.భార్యను చూసే మిషతో వెళ్లిన మహేంద్ర రెండురోజులుగా ఆమెకు ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇచ్చి, ఆమె కోలుకునేటట్లు చేసేందుకు చికిత్సలో భాగంగానే ఇంజక్షన్లు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆమె పరిస్థితి మరీ దిగజారడంతో దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్తే ఆమె మరణించినట్లు అక్కడి డాక్టర్లు ప్రకటించారు. మొదట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అయితే, డాక్టర్ కృతిక చెల్లెలు డాక్టర్ నిఖిత ఎం రెడ్డి కి అనుమానం రావడంతో పూర్తగా దర్యాప్తు చేయాలని కోరగా, ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ నివేదికలో మృతురాలి శరీరంలోని పలు అవయవాలలో ఫ్రోఫో ఫోల్ అనే మత్తుమందు అవశేషాలు ఉన్నట్లు నిర్థారణ అయింది. కృతికకు అధిక మొత్తంలో మత్తుమంది ఇచ్చినట్లు స్పష్టమైంది. ఆ తర్వాత ఆ కేసును పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (బిఎన్ ఎస్ ) 2023 సెక్షన్ 103 కింద రిజిస్టర్ చేసి ఉడిపి లోని మణిపాల్ లో ఉన్న మహేంద్రను అరెస్ట్ చేశారు. భార్యను హత్య చేసిన తర్వాత నుంచి మహేంద్ర అక్కడికి మకాం మార్చినట్లు పోలీసులు తెలిపారు. నిజానికి మహేంద్ర రెడ్డి కుటుంబానికి క్రిమినల్ కేసుల చరిత్రనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహేంద్ర రెడ్డి కవల సోదరుడు డాక్టర్ నాగేంద్ర రెడ్డి 2018లో చాలా కేసులు ఎదుర్కొన్నాడు. వాటిలో మోసం, క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరో సోదరుడు రాఘవ రెడ్డి కూడా 2023 లో ఓ బెదిరింపు కేసులో నహ నిందితుడు. అయితే మహేంద్ర రెడ్డి, కృతిక వివాహ సమయంలో ఈ వివరాలను ఆ కుటుంబం దాచి పెట్టారని కృతిక కుటుంబ సభ్యులు ఆరోపించారు.
నాలుగేళ్ల చిన్నారితో అసభ్య ప్రవర్తన.. నిందితుడు అరెస్ట్
హైదరాబాద్: నాలుగేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడిన జ్ఞానేశ్వర్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని బోయిన్పల్లి పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ బోయిన్పల్లిలోని సుబ్బు డాన్స్ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్ తన వద్ద డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చే నాలుగేళ్ల చిన్నారితో స్టూడియోలో ఎవరూ లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఆ చిన్నారి డ్యాన్స్ స్టూడియోకు వెళ్లను అని మారాం చేసింది. ఏమైందని తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టింది. జ్ఞానేశ్వర్ తనని లైంగికంగా వేధించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. జ్ఞానేశ్వర్ను రిమాండ్కు తరలించి స్టూడియోను సీజ్ చేసినట్లు ఉత్తర మండల డిసిపి రష్మీ పెరుమాళ్ తెలిపారు.
రైతుల కళ్ళలో వెలుగులు నింపడమే ప్రభుత్వ సంకల్పం
రైతుల కళ్ళలో వెలుగులు నింపడమే ప్రభుత్వ సంకల్పం హుజూర్నగర్, ఆంధ్రప్రభ : రైతుల
Jubilee Hills Bye Elections : మెజారిటీపై మూడు పార్టీల లెక్కలివే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఈ నెల 11న ఎన్నికలు జరుగుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు.
మీస్సింగ్ కేసు మిస్టరీ వీడింది…
మీస్సింగ్ కేసు మిస్టరీ వీడింది… కోనరావుపేట, ఆంధ్రప్రభ : తప్పిపోయిన వ్యక్తి చెరువులో
బ్రెస్ట్ క్యాన్సర్కు దూరంగా ఉండొచ్చు….
బ్రెస్ట్ క్యాన్సర్కు దూరంగా ఉండొచ్చు…. నకిరేకల్, ఆంధ్ర ప్రభ : ప్రతి మనిషి
బాల కార్మిక రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలి
బాల కార్మిక రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలి జిల్లా సంక్షేమ అధికారి తుల
రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన సదస్సు
హుజూర్నగర్ (ఆంధ్రప్రభ): హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం లారీ, బస్సు, ఆటో డ్రైవర్లు,
Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం.. నీట మునిగిన పలు ప్రాంతాలు
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. గత కొద్ది గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాయదుర్గం ప్రాంతంలో సోమవారం భూ వివాదం కారణంగా కాల్పుల
36గంటల్లోపు ఆ గుడిసెలను తొలగించాలి
36గంటల్లోపు ఆ గుడిసెలను తొలగించాలి సూచనలు పాటించకుంటే గుడిసెలు మేమే తొలగిస్తాం దండేపల్లి,
చందు జ్ఞాపకార్థంగా వైద్య శిబిరం
చందు జ్ఞాపకార్థంగా వైద్య శిబిరం చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలం చిన్నకాపర్తి
Hyderabad : హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు
హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. మణికొండలోని పంచవటి కాలనీలో ఈ కాల్పులు జరిగాయి
తాండూర్లో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం. #Vikarabad #Tandur #BusAccident #PoliceAction #RoadSafety
12క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలి
12క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలి ఏడు క్వింటాళ్ల పత్తి కొనుగోలు నిబంధనను ఎత్తివేయాలి..
ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి..
ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి.. ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : రాష్ట్ర
Telangana : ఫీజు రీఎంబర్స్ మెంట్ కమిటీ
ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానంపై అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ఛత్తీస్ గఢ్లో ఘోర రైలు ప్రమాదం. #TrainAccident #Chhattisgarh #IndianRailways #BreakingNews
ఘోర రైలు ప్రమాదం... పది మంది మృతి
చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది వరకూ మరణించారు.
చేనేత సమస్యలు పై చలో హ్యాండ్లూమ్..
పుట్టపర్తి లో ధర్నా విజయవంతం చేయండి..విశాలాంధ్ర ధర్మవరం;; చేనేత సమస్యలపై చలో హ్యాండ్లూమ్ పుట్టపర్తి ధర్నాలు ఈనెల 7వ తేదీన నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చేనేత సంఘం నాయకులు ఎస్హెచ్ భాష, హరికుమార్, ఖాదర్బాషా, జంగం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూవ్యవసాయం తర్వాత చేనేత ప్రధాన వృత్తిగా ప్రసిద్ధి చెందిన పరిశ్రమ కార్పొరేట్ విధానాల వలన సంక్షోభంలో చిక్కుకున్నది అని, దాని ఫలితంగా చేనేత కార్మికులు ఆకలి చావులు […] The post చేనేత సమస్యలు పై చలో హ్యాండ్లూమ్.. appeared first on Visalaandhra .
ఫ్యాక్ట్ చెక్: కాంగ్రెస్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ను సీఎం రేవంత్ రెడ్డి అవమానించలేదు
కాంగ్రెస్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ను సీఎం రేవంత్ రెడ్డి అవమానించలేదు
Kaantha First Spark: Intriguing
Dulquer Salmaan plays the lead role, besides producing his next outing Kaantha on Wayfarer Films Pvt. Ltd. The film directed by presented by Rana’s Spirit Media, is due for release in 10 more days on November 14th. Already, promotional activities are in full swing, with the makers unveiling updates one after the other. All the […] The post Kaantha First Spark: Intriguing appeared first on Telugu360 .
కావ్య మారన్ కీలక నిర్ణయం.. దాని పేరు మార్పు..
ఐపిఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఇష్టపడే వాళ్లకి జట్టు ఓనర్ కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన ఫ్రాంచేజీ మ్యాచ్ ఆడుతుందంటే స్టాండ్స్లో ఉంటూ తన టీంకి మద్ధతు ఇస్తూ సందడి చేస్తుంటారు కావ్య. అయితే సన్ గ్రూప్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ది హండ్రెడ్ లీగ్లో తమ ప్రాంచైజీ నార్తర్న్ సూపర్ఛార్జెస్ పేరును సన్రైజర్స్ లీడ్స్గా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐపిఎల్, సౌతాఫ్రికా టి-20 లీగ్లలో ఉన్న సన్ పిక్చర్స్ తాజాగా ధి హండ్రెడ్ లీగ్లో ప్రవేశించింది. ఈ లీగ్లో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ జట్టును కావ్య మారన్ కొనుగోలు చేసింది. తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్య మారన్ యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తో చర్చలు జరిపి మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసింది.
రాష్ట్ర స్థాయి పత్తి రైతుల సమ్మేళనం జయప్రదం చేయండి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : నవంబరు 19,20 తేదీలలో ఆదోనిలో రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగు రాష్ట్ర స్థాయి పత్తి రైతుల సమ్మేళనంను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం వద్ద రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో […] The post రాష్ట్ర స్థాయి పత్తి రైతుల సమ్మేళనం జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
మంచిర్యాలదే మొదటి స్థానం… దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి జడ్పీహెచ్ఎస్

24 C