SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

18    C
... ...View News by News Source

Ys Jagan :నేటి నుంచి మూడు రోజులు కడపలో జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 25 Nov 2025 8:22 am

Telangana : నేడు తెలంగాణవ్యాప్తంగా వడ్డీలేని రుణాల పంపిణీ

నేడు తెలంగాణవ్యాప్తంగా వడ్డీలేని రుణాల పంపిణీ జరగనుంది.

తెలుగు పోస్ట్ 25 Nov 2025 8:17 am

Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం

నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది.

తెలుగు పోస్ట్ 25 Nov 2025 8:11 am

An Emotional Tribute for Dharmendra

At the age of 89, Bollywood legendary actor Dharmendra breathed his last and his last rites were held in Mumbai yesterday. Most of the top Bollywood celebrities have rushed to offer their last condolences and goodbye for the legendary actor. Condolence messages poured in from all the corners. All the celebrities, actors who are associated […] The post An Emotional Tribute for Dharmendra appeared first on Telugu360 .

తెలుగు 360 25 Nov 2025 8:08 am

Hyderabad : కోకాపేట్ లో భూములను కొనలేమా?

హైదరాబాద్ లోని కోకాపేటలో రికార్డు ధరలు ప్లాట్లు పలికాయి.

తెలుగు పోస్ట్ 25 Nov 2025 8:07 am

Nara Lokesh Calls for Gender Equality and Moral Education to Shape a Progressive Society

Andhra Pradesh HRD and IT Minister Nara Lokesh has reiterated the need for a major societal shift towards gender equality and value-based education. Speaking at a state-level seminar on Moral Values at Tummalapalli Kalakshetram in Vijayawada, Lokesh said that meaningful change begins at home and extends into classrooms, culture, and public behaviour. “Respect Starts at […] The post Nara Lokesh Calls for Gender Equality and Moral Education to Shape a Progressive Society appeared first on Telugu360 .

తెలుగు 360 25 Nov 2025 7:56 am

ఇలాంటి కథతో సినిమా రాలేదు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బో ర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో కి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ బా బు.పి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఈ సినిమా 2002 సమయంలో జరుగుతుంది. అప్పు డు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి. కాబట్టి సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ పెట్టడం జరిగింది. - -సినిమాలోని సూర్య పాత్రలో ఉపేంద్ర సరిగ్గా సరిపోయారు. సూర్యలో అందరు స్టార్స్ కనిపిస్తారు. అభిమాని ఆధారంగా చేసుకుని కొన్ని సినిమాల్లో వచ్చాయి. కానీ ఇలాంటి కథతో సినిమా ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇందులో నేను చెబుతున్న కథ పూర్తిగా డిఫరెంట్, చాలా యూనిక్. రామ్ చాలా విలక్షణ నటుడు. ఆయన నటనలో చాలా ఎనర్జీ ఉంటుంది. నేను రాసుకున్న పాత్రకి గొప్ప ఎనర్జీ కావాలి. ఇలాంటి క్యారెక్టర్‌కి రామ్ పర్ఫెక్ట్. -భాగ్యశ్రీ పాత్ర ఈ కథలో చాలా కీలకం. ఒక జీవితాన్ని చూసినట్టుగా ఉంటుంది. మురళీ శర్మ, రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ... ఇలా ప్రతి క్యారెక్టర్ ఒక భావోద్వేగంతో ఉంటుంది. -వివేక్, మెర్విన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. సినిమాలో మ్యూజిక్‌ను ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు”అని అన్నారు. 

మన తెలంగాణ 25 Nov 2025 7:52 am

India vs South Africa : అయిపోయిందయ్యా.. ఇది కూడా ఓడినట్లేనా?

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియా కష్టాలు పడుతుంది

తెలుగు పోస్ట్ 25 Nov 2025 7:48 am

Narendra Modi : నేడు అయోధ్యలో మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు అయోధ్యలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 25 Nov 2025 7:44 am

Hyderabad : తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 25 Nov 2025 7:33 am

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ మంగళవారం జరుగనుంది. సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్‌లో సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. అయితే, ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లు, అలాగే డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల వేడుకలు, శాఖల వారీగా పనితీరు, సమీక్ష, విద్యుత్ పంపిణీ సంస్థల బలోపేతం, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు కెటిఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో దానిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కూడా ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

మన తెలంగాణ 25 Nov 2025 7:30 am

Cyclone |తుఫాను హెచ్చరిక..

Cyclone | తుఫాను హెచ్చరిక.. Cyclone, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 25 Nov 2025 7:24 am

Bigg Boss Telugu 9: Secret Nominations and Explosive Confrontations

This week’s Bigg Boss episode delivered one of the fiercest nomination rounds of the season. With two stages of nominations—private and open—the house turned into a battleground of confrontations, emotional eruptions, strategic attacks, and even physical chaos. By the end, eight contestants landed in danger. Stage 1: Secret Nominations Begin the Firestorm Emanuel nominated Pavan. […] The post Bigg Boss Telugu 9: Secret Nominations and Explosive Confrontations appeared first on Telugu360 .

తెలుగు 360 25 Nov 2025 7:24 am

బాలయ్య విశ్వరూపం చూస్తారు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2 : తాండవం’. రామ్ ఆ చంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రా మ్, -లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో డైరెక్టర్ బోయపాటి... బాలయ్య విశ్వరూపం చూపించారు. భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రని ఢీకొనాలంటే ప్రత్యర్థి క్యారెక్టర్ కూడా బలంగా ఉండాలి. అలాంటి విలన్ క్యారెక్టర్ లో ఆది పినిశెట్టి కూడా అద్భుతంగా నటించారు. -టీజర్, ట్రైలర్ లో గన్, త్రిశూలంతో ఉన్న యాక్షన్ సీ క్వెన్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చిం ది. ఓ సన్నివేశం కోసం బాలకృష్ణ మంచులో నిలబడి అద్భుతమైన యాక్షన్ చే శారు. ఒక పాత్రలో అంతగా లీనమైపో యే నటుడు, పాత్ర కోసం ప్రాణాలు పెట్టే బాలకృష్ణ లాంటి నటుడు ఉండడం మనందరికీ గర్వకారణం”అన్నారు. 

మన తెలంగాణ 25 Nov 2025 7:17 am

భూం..ధాం.. కోకాపేటలో ఎకరం ధర రూ.137.25 కోట్లు

 9.90 ఎకరాలకు రూ.1,350 కోట్ల ఆదాయం  హెచ్‌ఎండిఎ ఇవేలానికి భారీ స్పందన 28న రెండో విడత వేలానికి ఏర్పాట్లు  మన తెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియో పోలీస్ లే ఔట్1లోని రెండు ప్లాట్లకు ప్రభుత్వం సోమవారం ఈ-వేలం నిర్వహించింది. ఈ- వేలంలో ప్లాట్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం విశేషం. కోకాపేటలో ఎకరం ధర 137.25 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 17, 18లకు సోమవారం అధికారులు ఈ వేలం నిర్వహించారు. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి 136.50 కోట్ల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరా లు ఉండగా ఈ వేలంలో ఎకరానికి 137.25 కోట్ల ధర పలకడం గమనార్హం. సోమవారం జరిగిన ఈ వేలంలో 9.90 ఎకరాల వేలానికి గాను రూ. 1,356 కోట్ల ఆదాయం హెచ్‌ఎండిఏకు రావడం విశేషం. కాగా, అంతర్జాతీయ సంస్థలు, భారీ నిర్మాణ దారులను దృష్టిలో ఉంచుకొని హెచ్‌ఎండిఏ ఈ వేలం నిర్వహించింది. గతంలో కోకాపేట్‌లో ఎకరం రూ.100 కోట్ల వరకు వేలం వేయగా, ఈసారి కూడా దానికి మించి ధర పలకడం విశేషం. అంతర్జాతీయ హంగులతో ఈ లే ఔట్ ఉండగా మరోవైపు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓఆర్‌ఆర్, మరోవైపు రాయదుర్గం ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉండడంతో నియో పోలీస్ లే ఔట్‌lలో భూముల ధరలకు రెక్కలొచ్చాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఒక్కో ఎకరానికి రూ.99 కోట్ల ప్రారంభ ధర కోకాపేట నియోపోలీస్1లో ఒక్కో ఎకరానికి రూ.99 కోట్ల ప్రారంభ ధరను హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. ఈనెల 28వ తేదీన, డిసెంబర్ 3, (నియోపోలీస్1లో) 5వ తేదీన (గోల్డెన్‌మైన్‌లో) మిగతా ప్లాట్లకు హెచ్‌ఎండిఏ ఈ వేలం నిర్వహించనుంది. కోకాపేట్ నియోపోలీస్ ప్లాట్లకు ఎకరానికి రూ.99 కోట్లు, కోకాపేట గోల్డెన్ మైల్ ప్లాట్లకు రూ.70 కోట్లు, మూసాపేట్ ప్లాట్లకు రూ.75 కోట్ల చొప్పున ప్రారంభ ధరను హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. కోకాపేటలోని నియోపోలీస్ లే ఔట్‌లో ప్లాట్లను కొనుగోలు చేసే వారికి ఎన్ని అంతస్థులైనా నిర్మించుకునేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. ఈ లే ఔట్‌లో ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. దాదాపు రూ.300 కోట్లతో ఈ లే ఔట్‌లో అభివృద్ధి పనులు చేపట్టారు. 40 ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. ఇందులో సైక్లింగ్, 45 మీ.ల వెడల్పు రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలను కల్పించారు. అలాగే కమర్షియల్, రెసిడెన్సీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ల అవసరాలకు భవనాలు నిర్మించుకునేందుకు అనుమతించనున్నారు. అంతర్జాతీయ సంస్థలు, భారీ నిర్మాణ దారులను దృష్టిలో ఉంచుకొని హెచ్‌ఎండిఏ ఈ వేలం నిర్వహించింది. ఒక్కో ప్లాట్ 1.98 ఎకరాల నుంచి 5.31 ఎకరాలు ఒక్కో ప్లాట్ 1.98 ఎకరాల నుంచి 5.31 ఎకరాల వరకు ఉంది. 2023లో కోకాపేటలో భూములను వేలం వేయగా ఎకరానికి 100.75 కోట్లు పలికింది. ఈసారి కూడా దానికి మించి ధర పలకడం విశేషం. తాజా వేలానికి బిడ్డింగ్‌లోనే ప్రభుత్వం నిర్ణయించిన ధర కోకాపేటలో ఎకరానికి రూ.99 కోట్లు కాగా, గోల్డెన్‌మైన్‌లో లే ఔట్‌లో రూ.70 కోట్లు, మూసాపేటలో రూ.75 కోట్లుగా నిర్ణయించారు. ఈ ప్లాట్ల వేలం ద్వారా దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని హెచ్‌ఎండిఏ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం జరిగిన వేలంలో 10 మంది ప్రముఖ జాతీయ, స్థానిక డెవలపర్లు పోటీ పడ్డారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ వేలం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 

మన తెలంగాణ 25 Nov 2025 6:50 am

తెలంగాణ నోయిడా కొడంగల్‌..

పారిశ్రామిక, విద్య హబ్‌గా మారుస్తాం రూ.5వేల కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్ నియోజకవర్గానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం మూడు నెలల్లో ప్రతీ గ్రామానికి కృష్ణా నీళ్లు త్వరలో కొడంగల్‌లో రైలు కూత అడబిడ్డల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు మూడు, నాలుగు రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అభివృద్ధికి పాటుపడే వాళ్లనే సర్పంచ్‌లుగా ఎన్నుకోండి కొడంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అక్షయపాత్ర ఫౌండేషన్ కమ్యూనిటీ కిచెన్ పరిశీలన భవన నిర్మాణానికి భూమిపూజ మన తెలంగాణ/కొడంగల్/దౌల్తాబాద్: వికారాబాద్ జిల్లాలోని -కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గంలో రూ.103 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ..కొడంగల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చుతున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీ, వెటర్నరీ, వ్యవసాయ కాలేజీ, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరఫీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ, జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు లేని సైనిక్ స్కూల్‌ను కొడంగల్‌లో ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కొడంగల్ పిల్లలను భాగస్వామ్యం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 5 వేల కోట్ల రూపాయలతో ఎడ్యుకేషన్ క్యాంపస్‌ను నిర్మించుకుంటున్నామని, గొప్ప చదువు చదవాలంటే కొడంగల్ వెళ్లాల్సిందే అనేవిధంగా తీర్చిదిద్దాలని క్యాంపస్‌ను నిర్మిస్తున్నామని అన్నారు. 16 నెలలు తిరిగే లోపు అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. కొడంగల్ ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా, దేశ రాజధాని ఢిల్లీ పక్కన నొయిడా అభివృద్ధి చెందినట్టుగా, తెలంగాణ నొయిడాగా తీర్చిదిద్ది కొడంగల్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని తెలిపారు. ఇక్కడి పిల్లలకు విద్యతో పాటు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్ కావాలని, అందుకే వికారాబాద్ - కృష్ణా రైల్వే లైన్ (వికారాబాద్, పరిగి కొడంగల్ నారాయణపేట్, మక్తల్) నుంచి కర్నాటక రాష్ట్రానికి రైలు మార్గం కోసం కేంద్ర ప్రభుత్వ ఆమోదించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేశామని తెలిపారు. 70 ఏండ్లుగా వత్తులేసుకుని ఎదురుచూస్తున్న రైల్వే లైను పనులు తొందరలోనే మొదలుపెట్టబోతున్నామని తెలిపారు. ఇక్కడ ఉన్న సున్నపు గునులను దృష్టిలో పెట్టుకుని కొడంగల్ మండలంలో తొందరలోనే సిమెంట్ పరిశ్రమను పెట్టి ఇక్కడ ఉద్యోగాలు కల్పించబోతున్నామని తెలిపారు. ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుతాం 2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్‌ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి చూసేలా అభివృద్ధి చేసుకుని ఆదర్శవంతంగా నిలబెడదామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. కొడంగల్‌లో హరేకృష్ణ సంస్థ వారి ఆధునిక అల్పాహార వంటశాల (సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్)ను పరిశీలించారు. అనంతరం అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిడ్ డే కిచెన్ భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఇంట్లో అమ్మ ఏ విధంగా ఆలోచన చేస్తుందో, అదేవిధంగా అక్షయపాత్ర సహకారంతో నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో చదువుకుంటున్న 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం అల్పాహారం పెడుతున్నారని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి ఆకలితో బాధ పడకూడదని, ఆకలితో చదువుపై శ్రద్ధ కోల్పోవద్దని విద్యార్థులకు ఆల్పాహారం పెట్టాలని నిర్ణయించామని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇదే సందర్భంగా నియోజకవర్గంలో రూ.103 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. కొండగల్‌ను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సంబంధించి ప్రణాళికలను ఆవిష్కరించారు. ఆడబిడ్డలు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసంతోనే వారిని ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రధానమైన విద్య, నీటి పారుదల రంగం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు కొడంగల్ ఒక ప్రయోగశాలగా ఎంచుకున్నామని తెలిపారు. కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్, మక్తల్, నారాయణపేట ప్రాంతాలను కృష్ణా నదీ జలాలతో తడపాలని, ప్రతి ఎకరాకు నీరివ్వాలని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడమే కాకుండా దాదాపు 5 వేల కోట్ల రూపాయలతో ప్రతి ఎకరాకు నీరివ్వాలని సంకల్పించామని తెలిపారు.. భూ సేకరణ విషయంలో 95 శాతం రైతులు స్వతంత్రంగా ముందుకొచ్చి ప్రాజెక్టులు కట్టాలని భూములిచ్చారని, మంత్రివర్గంలో ఆమోదం పొందితే మూడు నెలల్లో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. రైతులు అడిగిన ఇండ్లు, నష్టపరిహారం ఇచ్చామని, లగచర్ల, హకీంపేట, పోలెపల్లి ప్రాంతంలో రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను స్థాపించి లగచర్ల పారిశ్రామికవాడను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో బడి, గుడి, తాగడానికి మంచినీరు, ఇందిరమ్మ ఇండ్లు.. కావాలి. ఇలాంటి పనులు చేయాలంటే రాబోయే సర్పంచు ఎన్నికల్లో మంచి వారిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని 300 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. అంతకుముందు మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమాఖ్య సౌజన్యంతో నడపనున్న బస్సును ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రూ.5.83 కోట్లతో నియోజకవర్గంలో 28 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, రూ.5.01 కోట్లతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.3 కోట్లతో నియోజకవర్గంలో 10 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, రూ. 3.65 కోట్లతో బంజారా భవన్ కోసం అదనపు సౌకర్యాలు (కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా, విద్యుదీకరణ), రూ.1 కోటితో కొడంగల్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. రూ.1.30 కోట్లతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం, రూ. 1.40 కోట్లతో కొడంగల్‌లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం, రూ. 4.91 కోట్లతో కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం, రూ. 4.45 కోట్లతో సిసి రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు (యుజిడిలు) నిర్మాణం, రూ. 2.95 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రంథాలయ భవనాల ప్రారంభం, రూ.60 కోట్లతో కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణ, రూ. 5 కోట్లతో గెస్ట్‌హౌస్ నిర్మాణం, రూ. 4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్‌లో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మహిళలు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకోవడం, ఆర్టీసీలో అద్దె బస్సులు నడిపించే విధంగా వెయ్యి మంది మహిళలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మించుకునేందుకు సహకరిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్నబియ్యాన్ని అందిస్తున్నామని,, అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని గుర్తుచేశారు. కొడంగల్ నియోజకవర్గాన్ని పారిశ్రామిక, విద్యారంగాల్లో అభివృద్ధి చెందే దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. మైనార్టీ శాఖ ద్వారా 625 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం నిమిత్తం వికారాబాద్, నారాయణపేట జిల్లాలోని కొంతమంది లబ్ధిదారులకు పౌల్ట్రీ, గొర్రెల ఫామ్ ఏర్పాటు నిమిత్తం ఆర్థిక సహాయ చెక్కులను ముఖ్యమంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పోలీస్ హౌసింగ్ ఛైర్మన్ గురునాథ్‌రెడ్డి, శాసన సభ్యులు టి.రామ్మోహన్‌రెడ్డి, బి.మనోహర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్లు రాజేశ్వర్ రెడ్డి, విజయ కుమార్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీకై జైన్, నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్, వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమెహ్రా, జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, అక్షయపాత్ర ఫౌండేషన్ ఛైర్మన్ సత్యగౌడ చంద్రప్రభు దాస్‌జీతో పాటు వివిద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 25 Nov 2025 6:50 am

లీకులపై సీరియస్

ముసాయిదా దశలోనే ఉత్తర్వుల్లోని సమాచారం బయటికి పొక్కడంపై ప్రభుత్వం ఆగ్రహం లీకు వీరులపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా వివిధ శాఖల యూజర్ ఐడిలు, పాస్‌వర్డ్‌లు మార్పు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు భూముల కేటాయింపుపై ఇటీవల కెటిఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కలకలం మన తెలంగాణ/హైదరాబాద్: సచివాలయంలో డ్రాఫ్ట్ దశలోనే ఉత్తర్వులు మాయమవుతుండటం, అవి కాస్తా బిఆర్‌ఎస్ ఆఫీసుకు చేరుతుండటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సమగ్ర విచారణ కు ప్రభుత్వం ఆదేశించింది. సమాచారాన్ని లీక్ చేస్తున్నదెవరు? జీఓ బయటకు రాకముందే ఎక్కడి నుంచి ఈ సమాచారం బయటకు వెళుతుందన్న అంశాలపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖలకు సంబంధించిన యూజర్ ఐడిలను, పాస్‌వర్డ్‌లను మార్చివేసింది. దీంతోపాటు ప్రభు త్వం తీసుకునే నిర్ణయాలు, డ్రాప్ట్‌లు, జిఓలు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించే వరకు బ యటకు రాకూడదని ఒకవేళ వస్తే ఆ శాఖ ఉన్నతాధికారులనే బాధ్యులను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఆ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ప్రభుత్వం అన్ని విభాగాల ఇన్‌చార్జీలను ఆదేశించింది. దీంతో రానున్న రోజుల్లో ఆయా విభాగాలు తీసుకునే నిర్ణయాలు, మంత్రిమండలి ఆమోదాలు, జిఓలు తదితర విషయాల ను లీక్ చేయకుండా పటిష్టమైన చర్యలను చేపట్టాలని ప్రభుత్వం అన్ని శాఖల ఉన్నతాధికారులకు సూచించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని ప్ర భుత్వం హెచ్చరించింది. ఇటీవల భూముల కే టాయింపు అంశంపై మాజీ మంత్రి కెటిఆర్ ప్రెస్‌మీట్ పెట్టి హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ పాలసీ వెనుక రూ.5లక్షల కోట్ల భూ కుంభకోణం ఉందని ఆరోపించారు. కెటిఆర్ ఆరోపణలపై ప్రెస్ మీట్ పెట్టిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బిఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన జీఓనే తాము ఫాలో అవుతున్నామని క్లారిటీ ఇచ్చారు. తాము ఇంకా అలాంటి జీఓనే ఇవ్వలేదంటూ వివరణ ఇచ్చారు. మీరు జీఓ ఇవ్వకుండానే బిఆర్‌ఎస్ పార్టీకి ఎలా చేరిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన దాట వేశారు. ఈ క్రమంలోనే ఇంటిదొంగలెవరో తేల్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇలా ప్రతిపక్షానికి ఎలాంటి సమాచారం లీకవుతోంది..? డ్రాఫ్ట్ దశలో ఉన్న జీఓలు ఎలా బయటకు వెళ్తున్నాయన్న అంశంపై ఆరా తీసే పనిలో ఇంటెలిజెన్స్ నిమగ్నమైనట్టుగా తెలిసింది.

మన తెలంగాణ 25 Nov 2025 6:40 am

మహిళా సంఘాలకు రూ.304 కోట్లు

ఎస్‌హెచ్‌జిలకు నేడు వడ్డీలేని రుణాల పంపిణీ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సిఎం భట్టి సిఎం, డిప్యూటీ సిఎంలకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు మన తెలంగాణ/హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో రూ.304కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వము జమ చేసింది. మొత్తం 3,57,098 సంఘాలకు ఈ నిధులు చేరాయి. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సిఈఓ దివ్యా దేవరాజన్, జిల్లా డిఆర్‌డిఎ అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా ప ర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరునాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఈ సందర్భంగా మం త్రి స్పష్టం చేశారు. ప్రతి ఏడాది రూ. 25 వేల కోట్లకు తగ్గకుండా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ, వాటికి వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం తరఫునే వడ్డీలను చెల్లించడం కొనసాగుతోందని తెలిపారు. తాజాగా రూ.304 కోట్ల వడ్డీలను చెల్లించినట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు గ్రామీణ సంఘాలకు రూ.1,118 కోట్ల వడ్డీ రహిత రుణాలు చేరాయన్నారు. ఇవి కాకుండా పట్టణ మహిళా సంఘాలకు సుమారు రూ.300 కోట్ల వడ్డీ లేని రుణాలను చెల్లించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, ఆడబిడ్డల ఆర్థిక భద్రత కోసం వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తూ, వారి అభివృద్ధికి దారితీసే పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలపై వడ్డీల భారం లేకుండా ప్రభుత్వమే వాటిని భరిస్తోందని, మహిళల సాధికారతను శాశ్వతంగా నిలబెట్టే విధానాలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సిన రూ. 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందని, స్వయం సహాయక మహిళలు కష్టపడి పొదుపుగా పెట్టుకున్న అభయహస్తం నిధులను కూడా కాజేసిందని గుర్తు చేశారు. మహిళల కష్టాన్ని దోచుకున్న బిఆర్‌ఎస్ పెద్దలకు మహిళా సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కే లేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు నిధులను పారదర్శకంగా, సకాలంలో అందిస్తూ వారి ఆర్థిక శక్తిని మరింతగా పెంచే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తోందని అన్నారు.

మన తెలంగాణ 25 Nov 2025 6:30 am

సిజెఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం

ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గైర్హాజరు తొలి రోజే 17 కేసులు విచారించిన జస్టిస్ సూర్యకాంత్ న్యూఢిల్లీ : భారత దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా (సిజెఐ) జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోజరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదివారం నాడు పదవీ విరమణ చేసిన సీజేఐ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్‌సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రత్యేకహోదా రద్దు కావడం, బీహార్ ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష తదితర అనేక చారిత్రక తీర్పులు వెలువరించిన ఘనత సాధించుకున్న సూర్యకాంత్ తదుపరి సిజేఐ గా అక్టోబర్ 30న నియామకమయ్యారు. ఈ పదవిలో దాదాపు 15 నెలల పాటు తన వయస్సు 65 ఏళ్లు పూర్తయ్యేవరకు 2027 ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోడీ, తదితర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ఫోటోలను ప్రధాని మోడీ తన ఎక్స్ పోస్ట్‌లో షేర్ చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ కూడా కార్యక్రమంలో పాల్గొని కొత్త సిజెఐ కి అభినందనలు తెలిపారు. ఆదివారం బాధ్యతలనుంచి వైదొలగిన జస్టిస్ గవాయ్ కొత్త సిజెఐని ప్రేమాభిమానాలతో హత్తుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో తొలిసారిగా భూటాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్,శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్‌లు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావడం విశేషం. జస్టిస్ సూర్యకాంత్1962 ఫిబ్రవరి 10న హర్యానా లోని హిసార్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1984లో రోహ్‌తక్ లోని మహర్షి దయానంద్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా, హైకోర్టు న్యాయవాదిగా నియమితులయ్యారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. వివిధ ధర్మాసనాల్లో పలు కీలక తీర్పుల్లో ఆయన భాగమయ్యారు. 370 వ అధికరణను రద్దు చేయడం, స్వేచ్ఛగా భావ ప్రకటన, పౌరసత్వం హక్కులు కల్పిస్తూ తీర్పులు వెలువరించారు. కొత్తచట్టం వచ్చేవరకు వలసవాద దేశద్రోహ చట్టం కింద ఎలాంటి కేసులు దాఖలు కాకుండా ఆపివేయించారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణలో తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలను వెల్లడించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు. తొలిరోజు 17 కేసుల విచారణ ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజు సోమవారమే సిజెఐ సూర్యకాంత్ 17 కేసులు విచారించారు. అదే విధంగా ఓ కొత్త విధానపరమైన నియమాన్ని తీసుకొచ్చారు. ఇకపై అర్జెంట్ లిస్టింగ్ కేసులను తప్పనిసరిగా లిఖిత పూర్వకంగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం వంటి అసాధారణ పరిస్థితుల్లోనే మౌఖిక అభ్యర్థనలను అనుమతించనున్నట్టు చెప్పారు. రాహుల్ గైరుహాజరు సిగ్గుచేటు: బీజేపీ ఆగ్రహం నూతన ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ప్రమాణస్వీకారానికి లోక్‌సభ విపక్షనేత రాహుల్ గాంధీ హాజరు కాకపోవడంపై బీజేపీ మండిపడింది. హర్యానా రాష్ట్రం వేడుక చేసుకుంటోంద ని, మోడీ, రాష్ట్రపతి ముర్ము తదితర అగ్రనేతలు హా జరు కాగా, విపక్షనేత హాజరుకాకపోవడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌పూనావాలా విమర్శించారు. 

మన తెలంగాణ 25 Nov 2025 6:30 am

Rahul Sipligunj |సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్..

Rahul Sipligunj | సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. Rahul Sipligunj, హైదరాబాద్,

ప్రభ న్యూస్ 25 Nov 2025 6:24 am

నేను రాజీనామా చేయట్లేదు

ఉప ఎన్నిక గురించి ఆలోచించొద్దు స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా.. ఎదుర్కొనేందుకు సిద్ధం నా బ్రాండ్ విలువ ఢిల్లీ వరకు తెలుసు  నాకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంది కార్యకర్తలు తలదించుకునే పని చేయను స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు  మన తెలంగాణ/స్టేషన్ ఘనపూర్: బిఫాంలు, పదువులు అమ్ముకునే అలవాటు తనకు లేదని, తాను ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేయడం లేదని, తన ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పట్టణ కేంద్రంలోని ఈఆర్‌ఎల్ గార్డెన్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తల దించికునే పని ఎప్పటికీ చేయనని గల్లా ఎగేరుకునేలానే పనిచేస్తానని అన్నారు. స్పీ కర్ నిర్ణయం ఎలా ఉన్నాఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉన్నానని, తనకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తనకు ని యోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కడియం శ్రీహరి అంటేనే ఒక బ్రాండ్ అని, రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. ఢిల్లీ వరకు బ్రాండ్ విలువ బ్రాండ్ కే ఉంటుందని అన్నారు. అందుకు కారణం నిజాయితీగా కచ్చితత్వంలో పనిచేయడమేనని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత గ్రామ స్థాయి నాయకులదేనని, వారిని గెలిపించే బాధ్యత కూ డా గ్రామ నాయకులదేనని స్పష్టం చేశారు. గ్రా మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తు ల ఏకాభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరగాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఒకే అభ్యర్థి పోటీలో ఉండే విధంగా గ్రామ నాయకులు మండల స్థాయి నాయకుల సహకారంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పాత, కొత్త అనే బేధం లేకుండా అందరూ కలిసి పని చే యాలని కోరారు. గ్రామంలోని మహిళా, యువజన, అన్ని కుల సంఘాల మద్దతు కూడగట్టుకొ ని అందరిని కలుపుకొనిపోవాలని సూచించారు. అందుకు తగ్గట్లుగా కార్యాచరణలు, ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం అందరి చూపు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వైపే ఉందని, అందరికీ నియోజకవర్గంలో కాం గ్రెస్‌కు తిరుగులేదని నిరూపించాలని పిలుపునిచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని అన్ని సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలను గెలిపించి కానుకగా ఇచ్చి మరిన్ని అభివృద్ధి నిధులు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మకంగా పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతీ ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలిపారు. ప్రతీ గ్రామ పంచాయతీ ముఖ్యమేనని అన్నారు. గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలలో పార్టీ తరపున ఒక్కరికే అవకాశం వస్తుందని, ఇప్పుడు అవకాశం రాలేదని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి చాలా అవకాశాలు వస్తాయని, పార్టీకి విధేయులుగా పనిచేసేవారికి అవకాశం కల్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చని సూచించారు. ఫలానా వారే అభ్యర్థి అని తాను ఎవరికీ చెప్పానని అభ్యర్థి ఎంపిక నిర్ణయం మీదే... అభ్యర్థి గెలుపు బాధ్యత కూడా మీదేనని వెల్లడించారు. ఇది మీ ఎన్నికలని పార్టీని గెలిపించుకునే బాధ్యత కూడా మీదేనని సూచించారు. అభ్యర్థి ఎంపిక ఏకగ్రీవం చేస్తే గ్రామ అభివృద్ధికి 10లక్షలు, సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే గ్రామ అభివృద్ధికి 25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రెండు పంటలకు సాగు నీరు అందించే బాధ్యత తీసుకుంటానన్నారు.

మన తెలంగాణ 25 Nov 2025 6:20 am

హస్తినలో కర్నాటకం

బృందాలుగా ఢిల్లీ బాట పడుతున్న డిప్యూటీ సిఎం డికె అనుచరవర్గం హైకమాండ్‌కు కట్టుబడి ఉంటా: సిఎం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి మాటే నాకు వేదవాక్కు: డికె బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత తగాదా ఇప్పుడు ఢిల్లీ వరకూ తారాస్థాయికి చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ వర్గీయులైన ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి వెళ్లారు. డికెకు సిఎం పీఠం అప్పగించాలని తమ డిమాండ్‌ను అధిష్టానం వద్ద తీవ్రతరం చేయనున్నారు. ఇప్పటికే కొందరు ప్రముఖులు డికె కోసం ఢిల్లీలో ఉన్నారు. వీరికి తోడుగా ఇప్పుడు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రావడంతో ఇక హై కమాండ్ స్పందన ఏమిటనేది కీలకం అయింది. కాగా సిఎం పదవిలో కొనసాగడం అనేది అధిష్టానం నిర్ణయం బట్టి ఉంటుందని, వారు ఏది నిర్ణయిస్తారనేది కీలకం అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తెలిపారు. పార్టీ నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. సోమవారం శివకుమార్ వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చారు. హై కమాండ్ ఏది నిర్ణయిస్తే దానికి తానే కాకుండా తన డిప్యూటి డికె కూడా కట్టుబడి ఉంటారని విలేకరులకు సిద్ధరామయ్య చెప్పారు. డికె సిఎం కానున్నారా? అనే ప్రశ్నకు ఆయన విసుక్కున్నారు. తాను చెపుతున్నది వినకుండా పదేపదే ఈ ప్రశ్ననే ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. డికె క్యాంప్ ఢిల్లీలో మకాం వేయడంతో క్రమేపీ సిద్ధరామయ్యలో టెన్షన్ పెరుగుతోంది. 2023 అధికారం దశలో చెరో సగం సిఎం పదీకాలం అనే ఫార్మూలా కుదిరింది. ఇప్పుడు ఈ గడువు రావడంతో కర్నాటకలో సిఎం పీఠం కోసం తగవు నెలకొంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డికె శివకుమార్ ఉన్నారు. ఆయన ఇప్పటి పరిణామాలపై ఎక్కడా స్పందించడం లేదు. కానీ ఆయన వర్గీయులు ఢిల్లీకి వెళ్లడం, మార్పు కోసం పట్టుపట్టడంతో ఇప్పుడు నాయకత్వ అంశం బహిరంగ విషయం అయింది. కాగా ఈ ఇద్దరు కాదు . తానే సిఎం ఎందుకు కాకూడదని పార్టీ సీనియర్ నేత, కెపిసిసి మాజీ చీఫ్ , హోం మంత్రి జి పరమేశ్వరన్ కొత్తగా తమ వాదన విన్పిస్తున్నారు. దళితులకు ఈ పదవి దక్కడం న్యాయం అన్నారు. సిఎం చెప్పిందే వేదవాక్యం: డికె ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పిందే తనకు వేదవాక్యం అని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ చెప్పారు. పార్టీ హై కమాండ్ ఏది నిర్ణయిస్తే అదే పాటిస్తానని సిద్ధరామయ్య చెప్పడంపై డికె సోమవారం స్పందించారు. ఆయన ఆ విధంగా చెప్పి ఉంటే , అది తనకు శిరోధార్యమని, దీనిపై తాను చెప్పేందుకు ఏదీ లేదని వివరించారు. పార్టీలో సిఎం పీఠం కోసం ఎమ్మెల్యేల వేట సాగుతోందనే బిజెపి వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అది వారి సంస్కృతి అని, అదేవిధంగా మాట్లాడుతారని చికబళ్లాపురంలో ఓ కార్యక్రమానికి హాజరైన దశలో తెలిపారు. ఎమ్మెల్యేల బేరసారాలు, పార్టీల ఫిరాయింపులు పద్ధతి వారికే తెలిసిన విషయం అని వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 25 Nov 2025 6:10 am

GHMC general meeting |కౌన్సిల్‌.. సాఫీగా సాగేనా!

హైదరాబాద్‌ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : నేటి సమావేశమే చివరిదో, మరో సమావేశం

ప్రభ న్యూస్ 25 Nov 2025 5:54 am

బాలీవుడ్ హీమాన్ ధర్మేంద్ర కన్నుమూత

అనారోగ్యంతో తుదిశ్వాస 300కు పైగా సినిమాల్లో నటన  రొమాంటిక్ హీరో, యాక్షన్ కింగ్‌గా స్టార్‌డమ్ ఆయన సొంతం  పద్మభూషణ్ సహా పలు అవార్డులతో సత్కరించిన ప్రభుత్వాలు రాష్ట్రపతి, ప్రధాని, బాలీవుడ్ ప్రముఖుల నివాళి  ముంబై: బాలీవుడ్ వీరూ, హీమాన్ పేరే బ్రాండ్‌గా నిలిచిన స్టార్ హీరో ధర్మేంద్ర(89) సోమవారం కన్నుమూశారు. మూడు తరాల సుదీర్ఘ యాక్షన్ జీవితంతో 65 ఏం డ్లుగా హీరోగా చలామణి అయిన ధర్మేంద్ర 300కు పైగా సినిమాల లో నటించారు. తనకు అంటూ ధీ రోదాత్త, చలాకీ తనపు ప్రత్యేకతను సంతరించుకున్నారు. కొంతకాలం గా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ధర్మేంద్ర ఉదయం మృతి చెందారని ముంబై పోలీసు వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. వచ్చే నెల 8న ధర్మేంద్ర 90వ వసంతంలోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఈ లోగానే ఆయన మరణించారు. చాలా రోజులుగా ధర్మేంద్ర అనారోగ్యంపై పుకార్లు వెల్లువెత్తాయి. కొద్దిరోజుల క్రితమే ఆయన చనిపోయినట్లు ప్రచారం జరిగినా కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ధర్మేంద్రను ముంబైలోని జుహూ ప్రాంతంలోని ఆయన నివాసానికి చేర్చారు. కొద్ది రోజులుగా ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. ఆయన అంత్యక్రియలను సోమవారం సాయంత్రం అభిమానులు, బాలీవుడ్ ప్రముఖుల అంతిమ నివాళి నడుమ ఇక్కడి విలే పార్లేలోని శ్మశాన వాటికలో నిర్వహించారు. ఇందుకు ఏర్పాట్లు జరిగాయని పోలీసు వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం నుంచే జుహూలోని ధర్మేంద్ర నివాసానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. భార్య హేమామాలిని, కూతురు ఈషా డియోల్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తదితరులు అంత్యక్రియలకు తరలివచ్చారు. ధర్మేంద్ర జీ మృతితో భారతీయ సినిమా చరిత్రలో ఓ అధ్యాయం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోడీ తరఫున ప్రకటన వెలువడింది. ఆయన సినీ దిగ్గజం, ప్రతి పాత్రపై తన ప్రత్యేక ముద్ర వేశారు. అసంఖ్యాక జనం అభిమానం పొందారు. సినిమాకు ఆకర్షణ తీసుకురాడం ఆయన ఘనత అని ధర్మేంద్రకు మోడీ నివాళులు అర్పించారు. నిరాడంబరత , అందరిని ఆదరించడం, ప్రేమ ఆయన వ్యక్తిత్వం. ఈ దశలో ఆయన లోటును అనుభవించే కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. సత్యకామ్ సినిమాతో ఆరంభం అయిన ధర్మేంద్ర హీరోయిజం షోలే వరకూ అంతకు మించి కూడా సాగింది. అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి స్క్రిప్ట్ రైటర్ సలీం ఖాన్ , హీరోలు అమీర్ ఖాన్, సెలబ్రిటిలు కరణ్ జోహార్, కాజోల్, అజయ్ దేవగన్, కరీనా కపూర్ వంటి వారు ధర్మేంద్ర కు నివాళులు అర్పించారు. ధర్మేంద్ర బాపు అని స్పందించారు. సినిమా చరిత్రలో ఓ పుట తిరిగిందని పలువురు వ్యాఖ్యానించారు. అవిభక్త పంజాబ్‌లోని లూథియానా జిల్లా నస్రైల్ గ్రామంలో జన్మించారు. తండ్రి స్కూల్ టీచరు . బదిలీవల్ల ధర్మేంద్ర బాల్యం ఎక్కువగా అక్కడికి దగ్గరిలోని సహ్నేవాల్‌లో జరిగింది. ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్‌సింగ్ కేవల్ కోషన్ డియోల్. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. ప్రకాశ్ కౌర్, సినిమా హీరోయిన్ హేమామాలిని ఆయన వివాహమాడారు. ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఇద్దరూ పేరు మోసిన హీరోలే, కూతుళ్లు విజేత, అజీత, ఈషా, అహ్న డియోల్. వీరిలో ఈషా డియోల్ హీరోయిన్‌గా రాణించారు. ధర్మేంద్ర 2012లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. లివింగ్ లెజెండ్‌తో పాటు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాలు ఆయనను వరించాయి. ఫాల్కేరత్న అవార్డు కూడా ధర్మేంద్ర సొంతమైంది. 

మన తెలంగాణ 25 Nov 2025 5:50 am

Illegal construction’s |అక్రమ నిర్మాణాలు మిగిలిన వాటి పరిస్థితేంటి..

Illegal construction’s | అక్రమ నిర్మాణాలు మిగిలిన వాటి పరిస్థితేంటి.. ఆంధ్రప్రభ నిఘా

ప్రభ న్యూస్ 25 Nov 2025 5:42 am

AI |త్వరలో ఏఐతో ప్రాపర్టీ ట్యాక్స చెల్లింపులు…

AI | త్వరలో ఏఐతో ప్రాపర్టీ ట్యాక్స చెల్లింపులు… హైదరాబాద్‌ సిటీ బ్యూరో,

ప్రభ న్యూస్ 25 Nov 2025 5:40 am

Editorial |విఫల ప్రయోగంగా డోజ్‌

Editorial | విఫల ప్రయోగంగా డోజ్‌ అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి

ప్రభ న్యూస్ 25 Nov 2025 5:31 am

భావి తరాల దారులు ఎటువైపు…

మాడ్గుల, (ఆంధ్రప్రభ) : విద్యార్హత కలిగి నైపుణ్యత లేని యువత ఒక ప్రక్కన

ప్రభ న్యూస్ 25 Nov 2025 5:25 am

TG |నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ…

TG | నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ… హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) :

ప్రభ న్యూస్ 25 Nov 2025 1:58 am

మంగళవారం రాశి ఫలాలు (25-11-2025)

మేషం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. వృషభం నిరుద్యోగుల యత్నాలు సఫలమౌతాయి. మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. మిధునం చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కర్కాటకం వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సింహం వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కన్య కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తుల వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. రాజకీయ ప్రముఖుల నుండి సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృశ్చికం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ధనస్సు వృత్తి, వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసి రావు. సోదరులతో ఆస్తి విషయంలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆలయ సందర్శనం చేసుకుంటారు. మకరం వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుంభం వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. మీనం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.  

మన తెలంగాణ 25 Nov 2025 12:10 am

Telangana Reservation |రిజర్వేషన్ల లెక్క తప్పిందా..!?

Telangana Reservation | రిజర్వేషన్ల లెక్క తప్పిందా..!? ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి :

ప్రభ న్యూస్ 24 Nov 2025 11:54 pm

కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్‌ ఫ్యామిలీ కార్డ్‌

. ఆర్టీజీఎస్‌ డేటా లేక్‌ ద్వారా వివరాల సేకరణ. ప్రభుత్వ పథకాలు, పౌర సేవల పర్యవేక్షణ. కుటుంబ ప్రయోజన నిర్వహణ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ […] The post కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్‌ ఫ్యామిలీ కార్డ్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 11:19 pm

మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ విశ్వవిజేత భారత్‌

ఫైనల్‌ పోరులో చైనీస్‌ తైపీపై ఘనవిజయంవరుసగా రెండోసారి కప్‌ కైవసం ఢాకా: మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చైనీస్‌ తైపీ జట్టును భారత్‌ చిత్తుగా ఓడిరచి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్‌లో భారత్‌ మహిళలజట్టు చైనీస్‌ తైపీ జట్టును 35-28 తేడాతో ఓడిరచింది. వరుసగా రెండోసారి కబడ్డీ ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా వేదికగా జరిగిన టైటిల్‌ పోరులో భారత్‌ తొలి అర్ధ […] The post మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ విశ్వవిజేత భారత్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 11:15 pm

Shalibanda |పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం

Shalibanda | పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం ఆంధ్ర్రప్ర‌భ : పాతబస్తీ శాలిబండ

ప్రభ న్యూస్ 24 Nov 2025 11:14 pm

వీడని సందిగ్ధం

సీఎం ఆదేశించినా కదలని పదోన్నతుల ఫైలు. అయోమయంలో ఆర్టీసీ ఉద్యోగులు. 3 వేల మందికి పైగా ఎదురుచూపులు విశాలాంధ్ర-సచివాలయం: ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై సందిగ్ధత వీడటం లేదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతులకు ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపారంటూ ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున హడావుడి చేశారు. రోజులు తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ పదోన్నతులపై ఆర్టీసీలో స్పందన లేదు. రాష్ట్రంలోని పదోన్నతులకు అర్హులైన ఉద్యోగుల జాబితా నాలుగు నెలల క్రితమే అధికారులు రూపొందించారు. వీరిలో డ్రైవర్‌, […] The post వీడని సందిగ్ధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 11:11 pm

పోలీస్ పెట్రోలింగ్ వాహనంపై రీల్స్…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ

ప్రభ న్యూస్ 24 Nov 2025 11:00 pm

ഫാക്ട് ചെക്ക്: അസമിൽ മതപരിവർത്തനത്തിനെതിരെ പ്രതിഷേധം? വസ്തുത അറിയാം.

ജാർഖണ്ഡിൽ ആദിവാസി വിഭാഗം നടത്തിയ പ്രതിഷേധത്തിൽ നിന്നുള്ള ദൃശ്യങ്ങളാണ് പ്രചരിക്കുന്നത്

తెలుగు పోస్ట్ 24 Nov 2025 10:56 pm

చేతులెత్తేసిన బ్యాటర్లు.. టీమిండియాకు మరో వైట్ వాష్ తప్పదా?

గౌహతి: సొంత గడ్డపై ఎదురులేని శక్తిగా ఉన్న టీమిండియా ఇటీవల కాలంలో టెస్టుల్లో పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టుకు మరోసారి అలాంటి చేదు అనుభవాన్ని చవిచూసే పరిస్థితి నెలకొంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య భారత జట్టు చెత్త ఆటతో గడ్డు స్థితినిఎదుర్కొంటోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓటమి పాలైనటీమిండియా రెండో టెస్టులోనూ ఓటమి బాటలో ప్రయాణిస్తోంది. ఏదైనఅద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత జట్టు మ్యాచ్‌లో ఓటమిని తప్పించుకోవడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. రెండు విభాగాల్లోనూ విఫలం కావడంతో భారత్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేయగా, భారత్ 210 పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన సౌతాఫ్రికా మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది.

మన తెలంగాణ 24 Nov 2025 10:33 pm

ధర్మేంద్ర ఒక ఐకానిక్ ఫిగర్ : సిఎం రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్ : ధర్మేంద్ర మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.ధర్మేంద్ర మరణం తీవ్ర విచారానికి గురి చేసిందన్నారు. భారతీయ సినిమాకు ఆయన ఒక ఐకానిక్ ఫిగర్ అని, అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ధర్మేంద్ర మృతి పట్ల పలువురు రాష్ట్ర మంత్రులు తమ సంతాపం తెలిపారు. ‘మరపురాని నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ధర్మేంద్ర’ ధర్మేంద్ర మృతి పట్ల ఎపి సిఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని వారు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ, ‘ధర్మేంద్ర జీ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఒక లెజెండరీ నటుడిగా తన మరపురాని నటనతో ఆయన కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. భారత సినిమాకు ఆయన చేసిన సేవ తరతరాలు గుర్తుంచుకుంటాయి‘ అని పేర్కొన్నారు. తొలి తరం యాక్షన్ హీరో ధర్మేంద్ర : పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ సైతం ధర్మేంద్ర మృతికి నివాళులర్పించారు. ‘హిందీ చిత్ర పరిశ్రమలో తొలితరం యాక్షన్ హీరోగా సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. అందుకే అభిమానులు ఆయన్ను ’యాక్షన్ కింగ్’, ’హీ-మ్యాన్’ అని పిలుచుకున్నారు. ‘షోలే’, ‘ధరమ్ వీర్’ వంటి చిత్రాలతో ఆయన తనదైన ముద్ర వేశారు‘ అని పవన్ గుర్తు చేసుకున్నారు. ఎంపిగా ధర్మేంద్ర చేసిన సేవలు చిరస్మరణీయం: వెంకయ్య మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కూడా ధర్మేంద్ర మృతికి సంతాపం తెలిపారు. ఆయనతో తనకు చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌తో పాటు ప్రజా జీవితంలో ఎంపీగా కూడా ధర్మేంద్ర చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

మన తెలంగాణ 24 Nov 2025 10:27 pm

డిజిటల్ అరెస్ట్.. మూడు రోజులు నిర్భందంలో డాక్టర్ కుటుంబం..

సైబర్ ఉచ్చు నుంచి డాక్టర్ కుటుంబాన్ని రక్షించిన టిజిసిఎస్‌బి డిజిటల్ అరెస్ట్‌లు ఉండవు టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖాగోయొల్ మన తెలంగాణ/హైదరాబాద్: సిబిఐ అధికారులమని సైబర్ మోసగాళ్లు బెదిరింపులకు పాల్పడి డిజిటల్ అరెస్టు ఉచ్చును నుంచి డాక్టర్ కుటుంబాన్ని కాపాడినట్లు టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖాగోయొల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. భద్రాచలంలో నీలా నర్సింగ్ హోమ్‌ను నిర్వహిస్తున్న 80 ఏళ్ల డాక్టర్ బుద్ధరాజు సుబ్బరాజు ఆయన కోడలు, మనవరాలు ఈ సైబర్ మోసానికి బాధితులయ్యారన్నారు. నవంబర్ 20వ తేదీ డాక్టర్ సుబ్బరాజుకు సిబిఐ అధికారులమని వాట్సాప్ వీడియో కాల్ వచ్చిందని, ఆయన ఆధార్ కార్డుతో ముంబైలో ఓ బ్యాంకు ఖాతా ఉందని, అది ఏకంగా 100కు పైగా క్రిమినల్ కేసులలో ఉపయోగించబడిందని అబద్ధాలు చెప్పి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసినట్లు చెప్పారు. దీంతో పాటు సిబిఐ పర్యవేక్షణలో కుటుంబాన్ని ఉంచామని హెచ్చరించి, ఎవరితోనూ మాట్లాడకూడదని, ప్రతి గంటకూ వీడియో కాల్ ద్వారా అందుబాటులో ఉండాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో వారి బ్యాంకు ఖాతాల వివరాలు, ఎఫ్‌డిలు, ఇంట్లో ఉన్న నగదు వివరాలను మోసగాళ్లు తెలుసుకున్నారు. ఎఫ్‌డిలను వెంటనే రద్దు చేసి, ఆ డబ్బును వారికి పంపడానికి సిద్ధం కావాలని మూడు రోజులుగా కుటుంబాన్ని ఒత్తిడికి గురిచేశారు. ఈ కారణంగా ఆ కుటుంబం మూడు రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఇంట్లోనే ఉన్నారని డైరెక్టర్ శిఖా గోయొల్ వెల్లడించారు. సహాయకుడి అప్రమత్తతతో కాపాడిన పోలీసులు కుటుంబం ఫోన్ ఎత్తకపోవడం, డాక్టర్ సుబ్బరాజు ఆసుపత్రికి రాకపోవడాన్ని గమనించిన ఆయన సహాయకుడు అనుమానం వ్యక్తం చేశాడు. పదేపదే ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ సహాయకుడు నవంబర్ 23 రాత్రి కొత్తగూడెం సైబర్ క్రైమ్ డిఎస్పి అశోక్ బాబుకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే డిఎస్పి అశోక్ బాబు, ఇన్స్పెక్టర్ జితేందర్‌లు డాక్టర్ సుబ్బరాజు ఇంటికి చేరుకున్నారు. వెంటనే మోసగాళ్లతో ఆ కుటుంబానికి ఉన్న సమస్యను అడ్డుకున్నారు. అధికారుల వేగవంతమైన చర్యల వల్ల ఆ కుటుంబానికి జరగాల్సిన పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం తప్పినట్లు టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖాగోయొల్ వెల్లడించారు. ప్రస్తుతం, సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక దర్యాప్తును ప్రారంభించారని, మోసగాళ్ల ఐపి చిరునామాలు, కాల్ రూటింగ్ వివరాలు, పరికరాల గుర్తింపు సంఖ్యలను విశ్లేషిస్తున్నామన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు, జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ప్లాట్‌ఫామ్‌తో సమన్వయం చేసుకుంటూ మోసగాళ్ల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడానికి చర్యలు కొనసాగుతున్నట్లు ఆమె తెలిపారు. డిజిటల్ అరెస్టులు ఉండవు ఈ సంఘటల సందర్భంగా టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖాగోయొల్ పలు సూచనలు చేశారు. పోలీసులు, సిబిఐ, ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఎప్పుడూ డిజిటల్ అరెస్టులు, వాట్సాప్ విచారణలు చేయదని, ఏ అధికారికి కూడా డబ్బును ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పే అధికారం చట్టంలో లేదని స్పష్టం చేశారు. సైబర్ మోసం జరిగిందని అనుమానం వస్తే వెంటనే 1930కు కాల్ చేయాలని, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. సమయోచితంగా స్పందించి వృద్ధుడి కుటుంబాన్ని రక్షించిన డిఎస్పి అశోక్ బాబు, ఇన్స్పెక్టర్ జితేందర్‌లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అభినందించారు.

మన తెలంగాణ 24 Nov 2025 10:19 pm

TG |మహిళలకు వడ్డీ లేని రుణాలు….

ఆసిఫాబాద్, (ఆంధ్రప్రభ) : రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను

ప్రభ న్యూస్ 24 Nov 2025 10:19 pm

తెలంగాణలో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లు ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 14 కొత్త ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం 14 ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లకు సంబంధించి రంగారెడ్డిలో తొమ్మిది, హైదరాబాద్‌లో మూడు, సంగారెడ్డిలో 1, వరంగల్ జిల్లాల్లో ఒక్కో ఎక్సైజ్ స్టేషన్‌లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్‌లోని మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లలో బంజారాహిల్స్ ఎక్సైజ్ స్టేషన్‌ను జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ప్రారంభించగా, చిక్కడపల్లి ఎక్సైజ్ స్టేషన్‌ను జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్ సుప్రియలు, మారేడుపల్లి ఎక్సైజ్ స్టేషన్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, ఈఎస్ పంచాక్షరీ, ఏఈఎస్ శ్రీనివాసరావులతో పాటు మూడు స్టేషన్ల సిఐలు బానోతు పటేల్, రామకృష్ణ, జగన్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. శంషాబాద్ ఈఎస్ పరిధిలోని గండిపేట్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌ను ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్, కొండపూర్ స్టేషన్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ కృష్ణప్రియ ఇతర అధికారులు పాల్గొన్నారు. సరూర్‌నగర్ ఈఎస్ పరిధిలోని మీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌ను రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, పెద్ద అంబర్‌పేట్ స్టేషన్ ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డిలు ప్రారంభించారు. మేడ్చల్ ఈఎస్ పరిధిలోని కొంపల్లి, కూకట్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌లను ఎక్సైజ్ సూపరింటెండ్ ఫయాజుద్దీన్, ఏఈఎస్ మాధవయ్యలు ప్రారంభించారు. మల్కాజిగిరి ఈఎస్ పరిధిలో కాప్రా పోలీస్‌స్టేషన్‌ను ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, నాచారం స్టేషన్‌ను ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు, అల్వాల్ స్టేషన్‌ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు ప్రారంభించగా ఈఎస్ నవీన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్‌లోని అమీన్‌పూర్ ఎక్సైజ్ స్టేషన్‌ను ఎంపి రఘునందన్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ప్రారంభించగా ఈ కార్యక్రమంలో మెదక్ డిప్యూటీ కమిషనర్ జె. హరికిషన్, ఏఈఎస్ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. హసన్‌పర్తి స్టేషన్‌ను వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించగా ఈ కార్యక్రమంలో డిసి అంజన్‌రావు, ఈఎస్ చంద్రశేఖర్లు పాల్గొన్నారు.

మన తెలంగాణ 24 Nov 2025 10:12 pm

ప్రజావాణి నిర్వహణలో నిర్లక్ష్యం..

తాడ్వాయి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో

ప్రభ న్యూస్ 24 Nov 2025 10:09 pm

సర్పంచ్ ఎన్నికలు.. రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జిఒ 46 ప్రకారం 50 శాతానికి లోబడి రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్ల కేటాయించడంతో పాటు లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఎస్‌సి, ఎస్‌టిల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22 శాతం మాత్రమే బిసి రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో కొన్ని చోట్ల బిసిల రిజర్వు స్థానాలు మారాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్‌లను రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలను సమర్పించినట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

మన తెలంగాణ 24 Nov 2025 10:07 pm

డ్రగ్స్ విక్రయిస్తూ ముగ్గురి అరెస్టు.. 15గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం

మనతెలంగాణ, సిటిబ్యూరోః తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న ముగ్గురు యువకులను చందానగర్, మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, నిందితుల వద్ద నుంచి 15గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి రితీరాజ్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శేరిలింగంపల్లి, బాపు నగర్ దేవ్రా హరీష్, కుంచాల సాయి కృష్ణ, గుంజి సాయిమణికంఠ ముగ్గురు కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. హరీష్ సోదరుడు అరుణ్ బెంగళూరులో ఉంటున్నాడు, తరచూ అతడి వద్దకు వెళ్లేవాడు. అక్కడ హరీష్ స్నేహితులతో కలిసి డ్రగ్స్ తీసుకునేవాడు. ఈ సమయంలో బెంగళూరులో తక్కువ ధరకు లభిస్తున్న ఎండిఎంఏ డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకుని వెళ్లి ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ వేశాడు. ఈ విషయం తన స్నేహితులు సాయి కృష్ణ, సాయి మణికంఠకు చెప్పాడు. వారు అంగీకరించడంతో బెంగళూరులో ఉంటున్న అరుణ్‌కు డ్రగ్స్ కొనుగోలు చేయాలని చెప్పాడు. అరుణ్ 15గ్రాముల ఎండిఎంను కొనుగోలు చేశాడు. వెంటనే బెంగళూరు వెళ్లిన హరీష్ అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి స్నేహితుల సాయంతో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మన తెలంగాణ 24 Nov 2025 10:03 pm

Collector |వేగం పెంచాలని –

Collector | వేగం పెంచాలని వివిధ శాఖల పనితీరుపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

ప్రభ న్యూస్ 24 Nov 2025 9:51 pm

Ritika Nayak |డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న మిరాయ్ బ్యూటీ

Ritika Nayak | డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న మిరాయ్ బ్యూటీ శ్రీకాకుళం,

ప్రభ న్యూస్ 24 Nov 2025 9:34 pm

Congress |త్వరలోనే జిల్లా అధ్యక్షుల నియామకం..

Congress |త్వరలోనే జిల్లా అధ్యక్షుల నియామకం.. ఏఐసీసీ సెక్రటరీ సూరత్ సింగ్ ఠాకూర్

ప్రభ న్యూస్ 24 Nov 2025 9:33 pm

Space |వాహ్‌.. స్పేస్ ఆన్ వీల్స్‌!

Space | వాహ్‌.. స్పేస్ ఆన్ వీల్స్‌! Space | విజయవాడ ,ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 24 Nov 2025 9:26 pm

Stadium |ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ తో స్డేడియం అభివృద్ధి..

Stadium | ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ తో స్డేడియం అభివృద్ధి.. Stadium | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 24 Nov 2025 9:16 pm

జక్కా జడ్సన్ అరెస్ట్ అన్యాయం…

కరీమాబాద్, (ఆంధ్రప్రభ) : సామాజికవేత్త జక్కా జడ్సన్ అరెస్టును స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్

ప్రభ న్యూస్ 24 Nov 2025 9:14 pm

Buzz: Dulquer Salmaan in a Biopic?

Malayalam young actor Dulquer Salmaan emerged as one of the most bankable actors in South. He is doing films in Telugu, Tamil and Malayalam languages. The actor’s recent offering Kaantha did not do well but he has an impressive lineup of films. As per the latest buzz, Dulquer Salmaan is in talks for the biopic […] The post Buzz: Dulquer Salmaan in a Biopic? appeared first on Telugu360 .

తెలుగు 360 24 Nov 2025 9:12 pm

Alert Hyd |ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం…

Alert Hyd | ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం… హైదరాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 24 Nov 2025 9:09 pm

AP |గుండ్రేవుల జలాశయం కోసం ఐక్య పోరాటం…

AP | గుండ్రేవుల జలాశయం కోసం ఐక్య పోరాటం… కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 24 Nov 2025 9:06 pm

Irrigation Scheme |నాగటూరు లిఫ్ట్ ఎత్తిపోతల యంత్రాల మరమ్మతుకు 38 లక్షల మంజూరు….

Irrigation Scheme | నాగటూరు లిఫ్ట్ ఎత్తిపోతల యంత్రాల మరమ్మతుకు 38 లక్షల

ప్రభ న్యూస్ 24 Nov 2025 9:00 pm

That is Dy.CM : మాటంటే.. మాటే

That is Dy.CM : మాటంటే.. మాటే ( ద్వారకాతిరుమల , ఆంధ్రప్రభ)

ప్రభ న్యూస్ 24 Nov 2025 8:55 pm

ఆ కార్పొరేటర్లకు భవిష్యత్తులో పదవులు: కెటిఆర్

ఉప ఎన్నిక సమయంలో కార్పొరేటర్లు అద్భుతంగా పోరాడారు జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశంలో భూముల అమ్మకంపై నిలదీయాలి బిఆర్‌ఎస్ కార్పొరేటర్లకు కెటిఆర్ దిశానిర్దేశం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత నగరంలో ఉన్న కార్పోరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందించారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ కార్పోరేటర్లందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జిహెచ్‌ఎంసి పరిధిలోని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, కార్పొరేటర్లతో కెటిఆర్ సమావేశమయ్యారు. బల్దియా సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు కెటిఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ కార్పొరేటర్లకు వివిధ అంశాలపైన మార్గదర్శనం చేశారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఎలాంటి అవినీతికి తావులేకుండా పనిచేశారని, కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతంగా సేవలందించారని ప్రశంసించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కార్పొరేటర్లు అద్భుతంగా పోరాడారని అభినందించారు. పరిశ్రమలకు కేటాయించిన వాటితో పాటు హైదరాబాద్‌లో భూముల అమ్మకంపై జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశంలో నిలదీయాలని కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం వైఫల్యంపై నిలదీయాలని సూచించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ అందరినీ గెలిపించుకుంటుందని వారికి కెటిఆర్ భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లకి రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందని కెటిఆర్ తెలిపారు. ఈనెల 29వ తేదీన జరగనున్న దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని కెటిఆర్ కోరారు. దీక్ష దివాస్ సంబరాలకు సంబంధించి నగరంలో ఏర్పాట్లపై మాజీమంత్రి, ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల తెలంగాణ పోరాటంలో ఎన్ని ప్రయత్నాలు జరిగినా, కెసిఆర్ దీక్ష తర్వాతనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. ఇంతటి గొప్ప ఘట్టాన్ని ప్రజలందరికీ మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఆ దిశగా ఈనెల 29వ తేదీన నగరంలో భారీగా దీక్ష దివాస్‌ను నిర్వహించనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి, జిహెచ్‌ఎంసి పరిధిలోని ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 24 Nov 2025 8:52 pm

తప్పుగా అర్థం చేసుకున్నారు: బ్రహ్మానందం

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మోహన్ బాబు 50 ఏళ్ళ సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన ఈవెంట్ కి హాజరయ్యారు.

తెలుగు పోస్ట్ 24 Nov 2025 8:50 pm

టైటిల్ నెగ్గిన పాకిస్థాన్

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టైటిల్‌ను పాకిస్థాన్-ఏ కైవసం చేసుకుంది.

తెలుగు పోస్ట్ 24 Nov 2025 8:47 pm

ఆ.. డబ్బా ప్రచారం ఇకనైనా ఆపేయండి:హరీష్‌ రావు

మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న డబ్బా ప్రచారం ఆపేయండి మధ్యాహ్న భోజనం కార్మికులకు వెంటనే పెండిగ్ బిల్లులు చెల్లించాలి మాజీ మంత్రి హరీష్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్ : మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామనే డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపేయాలని సిఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అప్పుల పాలయ్యాం మొర్రో అని మొత్తుకుంటున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 13 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మధ్యాహ్న భోజన కార్మికురాలు తమ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన వీడియోను హరీష్‌రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.

మన తెలంగాణ 24 Nov 2025 8:46 pm

Good News |త‌గ్గిన ప‌సిడి రేట్లు!

Good News | త‌గ్గిన ప‌సిడి రేట్లు! Good News | వెబ్

ప్రభ న్యూస్ 24 Nov 2025 8:36 pm

Godavarikhani |మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి…

Godavarikhani | మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి… గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి

ప్రభ న్యూస్ 24 Nov 2025 8:27 pm

భర్త వేధింపులు భరించలేక.. హత్య చేసిన ఇద్దరు భార్యలు

నిజామాబాద్: మద్యం సేవించి తరచూ వేధిస్తున్న భర్తను అతడి భార్యలు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌ మండలం దేవక్కపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవక్కపేటకు చెందిన మలవత్ మోహన్(42)కు కవిత, సంగీత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. మోహన్ తరుచూ మద్యం తాగుతూ వచ్చి భార్యలతో గొడవ పడుతుండేవాడు. ఆదివారం రాత్రి వారిద్దరినీ గదిలో బంధించాడు. దీంతో విసుగు చెందిన ఇద్దరు భార్యలు మోహన్‌‌ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం పెట్రోల్ కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఇంటి ఆవరణలో నిద్రపోతున్న మోహన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మంటలు అంటుకొని మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 24 Nov 2025 8:25 pm

Urea |యూరియా కోసం ఎదురు చూస్తున్నా రైతు

Urea | యూరియా కోసం ఎదురు చూస్తున్నా రైతు జలగం జనార్ధన్ రావురాంపూర్

ప్రభ న్యూస్ 24 Nov 2025 8:20 pm

Land prices hit new highs in Hyderabad

For all those who have been propagating the belief that Hyderabad real estate is in a slump, here is an eye opener. In the latest e-auctions conducted by the Hyderabad Metropolitan Development Authority (HMDA), an acre has been bid for a whopping Rs 137.25 Cr per acre. The HMDA is conducting online auctions for the […] The post Land prices hit new highs in Hyderabad appeared first on Telugu360 .

తెలుగు 360 24 Nov 2025 8:19 pm

గడువు ఇవ్వండి లొంగిపోతాం.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

పార్టీలో చర్చించేదుకు గడువు కోరాం సోనూ దాదా నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నాం వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు గడువు కోరిన మావోయిస్టు పార్టీ అప్పటి వరకు భద్రతా దళాల కూంబింగ్ ఆపాలి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అనంత్ పేరుతో లేఖ మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ ఆయుధ విరమణపై కీలక ప్రకటన చేసింది. మహారాష్ట్ర-, మధ్యప్రదేశ్, -ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి జోన్) ప్రతినిధి అనంత్ పేరుతో బహిరంగ లేఖ రాసింది. గడువు ఇస్తే ఆయుధ విరమణ చేస్తామని ప్రకటించింది. అప్పటి వరకు భదత్రా దళాల కూబింగ్ నిలిపివేయాలని కోరింది. ఇంకా లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. సిసిఎం సతీష్ దాదా, మరొక సిసిఎం కామ్రేడ్ చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేసింది. ఎంఎంసి(మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్) స్పెషల్ జోనల్ కమిటీ ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నట్లు లేఖలో స్పష్టం చేసింది. తాము ఆయుధాలు విడిచిపెట్టడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సమయం ఇవ్వాలనిఅభ్యర్థించింది. పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని, ఈ నిర్ణయాన్ని అందరితో పంచుకోవడానికి కొంత సమయం పడుతుందని, సహచరులను సంప్రదించి, పార్టీ పద్దతి ప్రకారం ఈ సందేశాన్ని తెలియజేయడానికి సమయం కోరింది. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థించింది. సమయం కోరడం వెనుక ఎటువంటి నిగూఢ ఉద్దేశ్యం లేదని, సమాచారం చేరవేసేందుకు ఈ సమయం కోరామని లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మావోయిజం నిర్మూలనకు విధించిన గడువు (మార్చి 31, 2026)లోపే తాము కోరిన సమయం ఉందని, అప్పటి వరకు, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించి, భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని కోరింది. కాగా, పిఎల్‌జిఏ వారోత్సవాలు నిర్వహించమని, ఈ క్రమంలో రాబోయే పిఎల్‌జిఏ వారంలో ఎటువంటి కార్యకలాపాలను ప్రభుత్వం నిర్వహించకూడదని, ఇన్‌ఫార్మర్ల కార్యకలాపాలను సైతం నిలిపివేయాలని, ఇతర సమాచారం ఆధారంగా దళాలను నియమించకూడదని లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇరువైపులా ఇలాంటి ప్రయత్నాలతో సంభాషించుకోవడానికి మెరుగయిన నిర్ణయం తీసుకోవడానికి సాధ్యమవుతుందని, ఆహ్లాదకరంగా, సానుకూల వాతావరణం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు జోన్‌ల్ కమిటీలు తమ కార్యకలాపాలన్నింటిని నిలిపివేయాలని అనంత్ విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలోని సారాంశాన్ని మీడియా ద్వారా సహచర మావోయిస్టులకు తెలియజేయాలని అనంత్ కోరారు. ఆయుధ విరమణపై త్వరలోనే తేదీ ప్రకటిస్తాం ఆయుధ విరమణపై త్వరలోనే తేదీని ప్రకటిస్తామని అనంత్ లేఖలో స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులతో సమావేశం నిర్వహించడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించాలని కోరారు. సమిష్టిగా ఆయుధ విరమణ చేసి ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాల కార్యకలాపాలను నిర్ణీత తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభుత్వం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే ఈ ప్రక్రియ సాధ్యమవుతుందని అనంత్ పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం ప్రభుత్వ ప్రతిస్పందన కోసం వేచి చూస్తామని లేఖలో తెలిపారు. సహచరులు సోను దాదా, సతీష్ దాదా మూడు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి తగిన సమయం ఇవ్వాలని కోరారు.

మన తెలంగాణ 24 Nov 2025 8:18 pm

Naveen Yadav | 26న ప్ర‌మాణ స్వీకారం..

Naveen Yadav | 26న ప్ర‌మాణ స్వీకారం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం

ప్రభ న్యూస్ 24 Nov 2025 8:16 pm

స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ వాయిదా

మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సెలవుపై వెళ్లడంతో సోమవారం జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలో మంగళవారం ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత విచారణ సందర్భగా స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో సోమవారం హైకోర్టు నిర్ణయం ఆధారంగా మంగళవారం జరగబోయే కెబినెట్ సమావేశంలో ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అనూహ్యంగా హైకోర్టులో విచారణ వాయిదా పడటంతో కెబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందకు వెళుతుందనే అంశం ఉత్కంఠంగా ఉంది. కాగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది.

మన తెలంగాణ 24 Nov 2025 8:12 pm

Clash of Titans: Salman Khan Vs Yash in 2026

2026 will witness the biggest ever clash in Indian cinema. Bollywood Superstar Salman Khan and Kannada Superstar Yash will test their luck with their respective films during the Eid 2026 season in March. The team have announced the release dates of their films and both these are high on expectations. The clash is almost confirmed […] The post Clash of Titans: Salman Khan Vs Yash in 2026 appeared first on Telugu360 .

తెలుగు 360 24 Nov 2025 8:02 pm

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానం.. ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు

మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హిడ్మా ఎన్‌కౌంటర్‌పై విచారణ కోరుతూ ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు చేశారు. మావోయిస్టు నాయకుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయవాది విజయ్ కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)ను ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ ఫేక్ అయ్యి ఉండి అవకాశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎఫ్‌ఐఆర్ నెంబర్లు 52/2025, 53/2025లో అనుమానాస్పద అంశాలు ఉన్నాయని న్యాయవాది ఆరోపించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి గైడ్‌లైన్స్ ప్రకారం ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, దర్యాప్తు కూడా తటస్థ అధికారుల ద్వారా జరగలేదని పేర్కొన్నారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు నిజాలు తెలియాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయవాది విజయ్ కిరణ్ మాట్లాడుతూ హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అసలు సమాచారం, సాక్షాలు ప్రజలకు వెల్లడించాలి. ఫేక్ ఎన్‌కౌంటర్ అయితే అది ప్రభుత్వం నుండి జరిగిన చారిత్రాత్మక తప్పిదం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇక, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే నేరమే అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసు కోవడం మావోయిస్టులైనా, పోలీసులైనా నేరమే. ఎవరూ చట్టానికి పైబడిన వారు కాదన్నారు. ఈ మొత్తం కేసు వ్యవహారాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సి దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. అయితే, ఈ ఫిర్యాదు నేపథ్యంలో హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అధికారిక దర్యాప్తు చేపడుతుందా? అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, ఈ వ్యవహారంతో కేసు ఇప్పుడు జాతీయ దృష్టిలో పడినట్లయింది.

మన తెలంగాణ 24 Nov 2025 7:53 pm

బిసిలకు అన్యాయం చేస్తే.. రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది: జాజుల

సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో బిసిలకు తీరని అన్యాయం బిసిలతో చర్చించిన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించాలి బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మన తెలంగాణ / హైదరాబాద్: త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి శాస్త్రీయత లేకుండా అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు రిజర్వేషన్లు కేటాయించారని బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అధికారులు చేసిన తప్పిదాలకు బిసిలకు గతం కంటే ప్రస్తుతం జరగబోయే నష్టం ఎక్కువ అని ఆయనన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కాదు కదా ఇప్పుడు ఉన్న బిసి రిజర్వేషన్ల కే రాష్ట్ర ప్రభుత్వం గండికోడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బిసి రిజర్వేషన్లు అతి తక్కువ కేటాయించి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు 18 శాతం నుండి 22 శాతం వరకు బిసి రిజర్వేషన్లు అమలు జరిగితే ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో 16 శాతం నుండి 20 శాతం వరకే రిజర్వేషన్ల ను కేటాయించారని, అనేక డివిజన్లలో మండలాలలో బిసిలకు ఒక్కటి కూడా సర్పంచ్ సీటు రిజర్వు కాలేదని, మండలాల వారీగా చూస్తే ఒక మండలంలో గత ఎన్నికలలో కంటే కనీసం రెండు మూడు గ్రామాల బిసి కోటను తగ్గించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బిసి రిజర్వేషన్ కోటాను తగ్గించి జనరల్ కోట ను పెంచారన్నారు. దీనిని బట్టి బిసిలకు రావలసిన సర్పంచ్ స్థానాలను అగ్రకులాలకు కట్టబెట్టాలని కుట్ర ఇందులో దాగి ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అన్ని వివరాలను సేకరించి అతి త్వరలోనే సి ఎస్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని, ఆయన న్యాయం చేయకుంటే కోర్టుల ద్వారా పోరాటం చేస్తామని జాజుల హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బిసి మంత్రులు, ప్రజాప్రతినిధులు బిసిలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. 25న మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం, 30న చలో హైదరాబాద్, డిసెంబర్ 8 న చలో ఢిల్లీ కార్యక్రమాలను నిర్వహించి బిసి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

మన తెలంగాణ 24 Nov 2025 7:49 pm

Activists |ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన ఉద్యమకారులు

Activists | ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన ఉద్యమకారులు Activists | నర్సింహులపేట,ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 24 Nov 2025 7:45 pm

AKT happens during united AP hence the title – Mahesh

Director Mahesh Babu P provided fascinating insights into the unique conceptualization of his upcoming film, Energetic Star Ram Pothineni’s Andhra King Taluka. He confirmed the film is a deep emotional exploration of the bond between a fan and their idol, a subject that never had been told in this manner. The director was inspired by […] The post AKT happens during united AP hence the title – Mahesh appeared first on Telugu360 .

తెలుగు 360 24 Nov 2025 7:35 pm

Temple Foundation |అయ్యప్ప స్వామి దేవాలయం శంకుస్థాపన.

Temple Foundation | అయ్యప్ప స్వామి దేవాలయం శంకుస్థాపన. Temple Foundation |అయ్యప్ప

ప్రభ న్యూస్ 24 Nov 2025 7:34 pm

మహిళ అనుమానాస్పద మృతి..

విశాలాంధ్ర, తాడిపత్రి: పులిపొద్దుటూరు గ్రామంలో ఒక అనుమానాస్పద మృతి చెందిన సంఘటన జరిగింది . 50 ఏళ్ల రత్నమ్మ సోమవారం ఉదయం 11 గంటల సమయం లో తన ఇంట్లోని ఫ్యానుకు వేలాడుతూ అనుమానాస్పదంగా మృతి చెందింది.ఆమె తమ్ముడు మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీఐ ఎస్. శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో కేసు వివరాలు బట్టి విచారిస్తున్నారు. The post మహిళ అనుమానాస్పద మృతి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 7:32 pm

మహిళల కబడ్డీ ప్రపంచకప్ విజేత భారత్

ఢాకా: భారత మహిళ కబడ్డీ జట్టు మరోసారి తన సత్తా చాటుకుంది. ఢాకా వేదికగా కబడ్డీ ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో చైనీస్ తైపీని చిత్తుగా ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 35-28 పాయింట్ల తేడాతో భారత మహిళ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌లో ఆరంభం నుంచి భారత్ తన ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. గ్రూప్ స్టేజీలో థాయ్‌లాండ్‌పై 65-20, బంగ్లాదేశ్‌పై 43-18, జర్మనీపై 63-22, ఉగాండాపై 51-16 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఇక సెమీఫైనల్‌లో ఇరాన్‌తో తలపడిన భారత్ 33-21 తేడాతో నెగ్గింది. ఇక ఫైనల్‌లోనూ భారత్ దూకుడు తగ్గలేదు. చైనీస్ తైపీని ముప్పుతిప్పలు పెట్టింది. ఫలితంగా 35-28 పాయింట్ల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను మద్దాడింది భారత్. ఈ సందర్భంగా భారత మహిళ కబడ్డీ ఆటగాళ్లు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.

మన తెలంగాణ 24 Nov 2025 7:25 pm

Sarees |ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు.

Sarees | ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు. మహిళలకు ఇందిరమ్మ చీరలను

ప్రభ న్యూస్ 24 Nov 2025 7:17 pm

వికటించిన ప్రేమ.. గొంతు కోసుకున్న యువకుడు

విశాలాంధ్ర, గుడిబండ: గుడిబండ మండల కేంద్రంలో ఒక యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది.మోపురుగుండు గ్రామానికి చెందిన ఈర రామప్ప కుమారుడు రామాంజి మూడు సంవత్సరాలుగా హెరేతూర్పి గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు 25 వేల రూపాయల విలువైన సెల్‌ఫోన్, రెండు లక్షల రూపాయల విలువ చేసే బంగారు గొలుసు చేయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిసెంబర్ నెలలో వారి వివాహానికి పెద్దలు కూడా ఒప్పందం […] The post వికటించిన ప్రేమ.. గొంతు కోసుకున్న యువకుడు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 7:03 pm

పటాన్‌చెరు ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్

హైదరాబాద్: పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అటాచ్ చేసింది. మధుసూదన్ రెడ్డి‌కి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మధుసూదన్ రెడ్డికి చెందిన కంపెనీ రూ.300 కోట్ల అక్రమాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ రూ.300 కోట్లు అక్రమాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి మధుసూదన్ రెడ్డి రూ.39 కోట్ల రాయల్టీ చెల్లించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇడి ఆయన ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం. 

మన తెలంగాణ 24 Nov 2025 6:53 pm

JAC 42 శాతం బీసీ రిజ‌ర్వేషన్ల‌కు చట్టబద్ధత కల్పించాల్సిందే

JAC 42 శాతం బీసీ రిజ‌ర్వేషన్ల‌కు చట్టబద్ధత కల్పించాల్సిందే బీసీ జేఏసీ ఆధ్వ‌ర్యంలో

ప్రభ న్యూస్ 24 Nov 2025 6:49 pm

ఆ పోస్ట్‌లను డిలీట్ చేసిన స్మృతి.. కారణం ఏంటో మరి..

భారత మహిళ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. వివాహనికి కొంత సమయం ముందే ఆమె తండ్రి అనారోగ్యానికి గురి కావండతో వివాహాన్ని వాయిదా వేశారు. అయితే తన పెళ్లికి సంబంధించిన పోస్ట్‌లను స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పలాశ్ ముచ్చల్‌తో ఎంగేజ్‌మెంట్‌ను ధృవికరిస్తూ స్మృతి ఇటీవల తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. సహచర క్రికెటర్లతో కలిసి ‘సమ్‌జో హో హి గయా’ అనే బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ సందర్భంగా తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో ఆమె ఇ‌న్‌స్టా ఖాతాలో కనిపించడం లేదు. అయితే ఈ వీడియోని ఆమె డిలీట్ చేసిందా.? లేదా హైడ్ చేసిందా.? అనే విషయంపై క్లారిటీ లేదు. అంతేకాదు స్మృతి స్నేహితురాళ్లు జెమీమా, శ్రేయాంక కూడా తమ సోషల్‌మీడియా ఖాతాల్లో ఈ వీడియోని తొలగించడం గమనార్హం. మరోవైపు పలాశ్ స్మృతికి ప్రపోజ్ చేసిన వీడియో మాత్రం అతని ఖాతాలో కనిపిస్తోంది. మరి స్మృతి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

మన తెలంగాణ 24 Nov 2025 6:43 pm

BC Reservation |రిజర్వేషన్లు సవరించాలంటూ రాస్తారోకో

BC Reservation | రిజర్వేషన్లు సవరించాలంటూ రాస్తారోకో BC Reservation | జన్నారం,

ప్రభ న్యూస్ 24 Nov 2025 6:34 pm

Huzurnagar |ఔటర్ రింగ్ రోడ్డు 95 శాతం పూర్తి

Huzurnagar | ఔటర్ రింగ్ రోడ్డు 95 శాతం పూర్తి Huzurnagar |హుజూర్‌నగర్,

ప్రభ న్యూస్ 24 Nov 2025 6:20 pm

Seethakka |మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న…

Seethakka | మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న… మహిళ సంఘాలకు వ్యాపార

ప్రభ న్యూస్ 24 Nov 2025 6:13 pm

Telangana : 80 కోట్ల విలువైన ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు సీజ్

పటాన్ చెర్వు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి సోదరుడు ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేశారు

తెలుగు పోస్ట్ 24 Nov 2025 6:12 pm

మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు కృషి చేస్తున్నాం: రేవంత్

కొడంగల్: కొడంగల్‌లో ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. జీవితాల్లో మార్పు రావాలంటే.. పిల్లలను చదివించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్‌లో 28 వేల మందికి ఉదయం అల్పాహారం అందిస్తున్నామని, ఐదు వేల కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్‌ను నిర్మిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోనే తొలి సైనిక్ స్యూల్‌ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కొడంగల్‌ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్‌గా 16 నెలల్లోపు చేసి తీరుతామన హామీ ఇచ్చారు. మహిళలు ఆత్మ గౌరంవగా బతికేందుకు కృషి చేస్తున్నామని, ప్రజలకు సన్నబియ్యం పంపిణఈ చేస్తున్నానమని, మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని.. సిఎం అన్నారు. వెయ్యి ఆర్టిసి బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని పేర్కొన్నారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలను ప్రోత్సాహిస్తున్నామని అన్నారు. సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులకు కూడా మహిళలను యజమానులను చేశామని చెప్పారు. మహిళా సంఘాల ఉత్పత్తులు అమెజాన్‌లో అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

మన తెలంగాణ 24 Nov 2025 6:06 pm

Telangana : సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ లో ప్రమాదం

సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు సమాచారం

తెలుగు పోస్ట్ 24 Nov 2025 6:04 pm