విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఎఐ) దుర్వినియోగం అరికట్టేందుకు ప్రపంచ కట్టుబాట్ల కూటమి ఏర్పాటు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. జి 20 సమ్మిట్లో ఆయన మూడో సెషన్లో ఆదివారం టి, వినూత్న పరిణామాల విషయంపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. అత్యంత కీలకమైన సాంకేతికతు మానవ కేంద్రీకృతం కావాల్సిందే. కేవలం ఆర్థిక లావాదేవీలతోనే సాగరాదని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎఐ ఇతర ఐటి వైపరీత్య లక్షణాల ఆటకట్టుకు అత్యవసరంగా గ్లోబల్ కూటమి అవసరం అని కోరారు. టెక్నాలజీ విధానాలు కేవలం జాతీయం దేశాల పరిమితం కాకుండా అవి గ్లోబల్ కావల్సి ఉంటుందన్నారు. వినూత్న ఆవిష్కరణలు కేవలం పరిమితం , కొందరికే సొంతం కాకుండా అవి బహిరంగ టెక్ వనరుగా మారాల్సి ఉందని కోరారు. ఇప్పటికే తమ దేశం ఈ విస్తృత విధానంతోనే ముందుకు సాగుతోందని వివరించారు. ఇండియన్ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ దీనిని అనుసంధానం చేసుకుని ఉందని, ఈ క్రమంలో ప్రజలకు బహుళ ప్రయోజనాలు దక్కుతున్నాయని తెలిపారు. అంతరిక్ష రంగం మొదలుకుని ఎఐ వరకూ డిజిటల్ చెల్లింపుల దాకా ఇదే పంథా ఉందన్నారు. డిజిటల్ పేమెంట్స్లో భారత్ గ్లోబల్ స్థాయిలో అగ్రదశలో ఉందని తెలిపారు. ప్రధానమైన ఖనిజాలు, పనివిధానాలు, ఎఐ ఇతర విషయాలలో అందరకి సరైన న్యాయం, భవిత అనే ఇతివృత్తంతో ఈ సెషన్ జరిగింది. ఎఐ రాకను కాదనలేమం అయితే ఇది మానవాళికి ఉపయుక్తం అంతకు మించి మేలు చేసేదిగా ఉండాల్సిందే. , దుర్వినియోగం అరికట్టాల్సిందే. ఇందుకు అంతా ఏకాభిప్రాయంతో కట్టడికి తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవల్సి ఉందని తెలిపారు. ఎఐను కొన్ని నిర్థిష్ట మౌలిక సూత్రాల పరిధిలోనే వాడుకోవల్సి ఉంటుంది. సమర్థవంతమైన మానవ పర్యవేక్షణ, డిజైన్పరంగా సెఫ్టీ, పారదర్శకత, డీప్ ఫేక్, క్రైమ్, ఉగ్రవాద చర్యలలో దీని వాడకం లేకుండా చూడటం వంటివి అత్యవసరం అని పిలుపు నిచ్చారు. అన్నింటికీ మించి ఎఐతో మానవ సమర్థత , ఫలితం పెరగాల్సిందే. మానవ శక్తి ఇనుమడించాల్సిందే అయితే ఎఐని ఏ విధంగా ఏ స్థాయిలో వాడుకోవల్సిందనే తుది నిర్ణయాధికారం మానవుడిదే అయి ఉండాలి. అది కూడా సమగ్ర గ్లోబల్ కట్టుబాట్ల పరిధిలో ఉండాలని స్పష్టం చేశారు. ఇది ఎఐ కాలం ,ఈ క్రమంలో మన దృక్పథంలో మార్పు అవసరం, ఇప్పటి ఉద్యోగాల అవసరం అనే ఆలోచన క్రమేపీ రేపటి సమర్థవంతమైన అవకాశాల దిశకు మారాల్సి ఉంటుందని. ఉద్యోగ నిర్వహణ నుంచి ఉద్యోగ ఉపాధి సృష్టి దశకు దారితీయాల్సిందే అన్నారు.
అనుకోని ఆపద.. స్మృతి వివాహం వాయిదా
ముంబై: టీం ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడింది. మరికొన్ని గంటల్లో ఆమె పెళ్లి జరుగుతుందనే సమయంలో ఆమె కుటుంబంలో అనుకోని ఆపద వచ్చింది. స్మృతి తండ్రి శ్రీనివాస్కు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ అస్వస్థతగా కనిపించారు. వెంటనే ఆయన్ను సాంగ్లీలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితిలో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా ధృవీకరించారు. తండ్రి పూర్తిగా కోలుకునే వరకూ ఈ వేడుకను వాయిదా వేయాలని స్మృతి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కాగా మంధాన వివాహం ఆదివారం సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్తో జరగాల్సి ఉంది. గత రెండు రోజులుగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్మృతి సహచర క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. కానీ, ఇంతలోనే ఇలా అనుకోని ఆపద రావడంతో స్మృతి వివాహాన్ని వాయిదా వేసుకుంది.
అమెరికా వీసా రాలేదని గుంటూరు యువ వైద్యురాలి ఆత్మహత్య
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలన్న కల నెరవేరలేదన్న తీవ్ర మనస్తాపంతో గుంటూరుకు చెందిన యువ వైద్యురాలు డాక్టర్ రోహిణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే డాక్టర్ రోహిణి గత ఏడాది కాలంగా అమెరికాలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పిజి) చేసేందుకు జే1 వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇటీవల ఆమె వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో తన భవిష్యత్ ఆశలు అడియాసలయ్యాయని భావించిన ఆమె, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీసా రాకపోవడం వల్లే రోహిణి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వస్థలమైన గుంటూరుకు తరలించారు.
తల్లి చనుపాలలో యురేనియం.. ఆ మాట వింటేనే జనం భయాందోళనలకు గురవుతున్నారు. బీహార్ లో పాలిచ్చే తల్లుల చను పాలలో యురేనియం ఉన్నట్లు ఒక అధ్యయనం లో వెల్లడి కావడంతో ఆందోళన వ్యక్తమైంది. కాగా, ఈఅంశంపై అంతగా భయపడాల్సిన అవసరం లేదని సీనియర్ శాస్త్రవేత్త, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్ డిఎం ఏ) సభ్యుడు భరోసా ఇచ్చారు. ఈ అధ్యయనం ఫలితాలు ప్రజారోగ్యానికి ఎటువంటి హాని కలిగించబోవని, బీహార్ నమూనాలలో కనుగొనబడిన యురేనియం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కన్నా చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. ఎన్ డిఎంఏ సభ్యుడు, బాబా అటామిక్ రీసర్చ్ సెంటర్ మాజీ గ్రూప్ డైరెక్టర్ అయిన అణు శాస్త్రవేత్త డాక్టర్ దినేశ్ కె. అస్వాల్ ఓ ఇంటర్ వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అధ్యయనం ఫలితాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.గుర్తించిన స్థాయి కన్నా పరిమితిలోనే ఉన్నాయన్నారు. వాస్తవానికి తాగునీటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉందన్నారు. అధ్యయనం ఇలా బీహార్ నుంచి వచ్చిన తల్లి పాల నమూనానలో 5 పిపిబి (పార్ట్స్ ఫర్ బిలియన్ ) వరకూ యురేనియం ఉన్నట్లు పట్నాసోని మహవీర్ క్యాన్సర్ సంస్థాన్, పరిశోధన కేంద్రం, లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. బీహార్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ఈ అధ్యయనం ఫలితాలను ప్రచురించారు. అధ్యయనంలో ప్రధానంగా పాల్గొన్న ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ అశోక్ శర్మ తెలిపినదాని ప్రకారం ఈ అధ్యయనం 40 మంది పాలిచ్చే తల్లుల పాలను విశ్లేషించింది. అన్ని నమూనాలలో యురేనియం (యు-238) ఉన్నట్లు తేలింది. 70 శాతం మంది శిశువులు క్యాన్సర్ కారక ఆరోగ్య ప్రమాదాన్ని చూపించినప్పటికీ, మొత్తం యురేనియం స్థాయిలు అనుమతించిన పరిమితుల కన్నా తక్కువగా ఉన్నాయని డాక్టర్ అశోక్ శర్మ తెలిపారు. తల్లులు, శిశువులు ఇద్దరిపైనా కనీస వాస్తవ ఆరోగ్య ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీర్ఘకాలిక యురేనియం బహిర్గతం శిశువులపై చాలా హానికరమైన ఆరోగ్య ప్రభావాలను చూపుతుంది. బీహార్ అధ్యయనం ఫలితాలు శిశువు ఆరోగ్యం పై వాస్తవ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్ అశోక్ శర్మ తెలిపారు. మహిళలు పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు.
Bellampally |పట్టించుకునే వారేరీ?
Bellampally | పట్టించుకునే వారేరీ? బెల్లంపల్లి, (ఆంధ్రప్రభ) : బెల్లంపల్లి పట్టణంలోని వన్
తెల్లారితే కుమార్తె వివాహం.. అంతలోనే
తెల్లారితే భాజాభజంత్రీల మధ్య వివాహ వేడుక జరగాల్సి ఉంది. కుమార్తె పెళ్లికి బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. వివాహ వేడుక కోసం ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. సున్నం వేసి, రంగులు అద్దిన ఇంటి ఎదుట టెంట్ వేశారు. బంధువుల రాకతో ఇల్లంతా సందడి నెలకొంది. అంతలోనే అందిన ఓ విషాద వార్త అందరినీ కన్నీటి సంద్రంలో ముంచింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా, యాలాల మండలం, సంగెంకుర్దు గ్రామానికి చెందిన అండాల అనంతప్ప (46) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని మొదటి భార్య శాకమ్మకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. పదిహేనేళ్ల క్రితం శాకమ్మ చనిపోవడంతో లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. ఇదిలా ఉండగా మొదటి భార్య కూతురు అవంతిని సొంతూరుకు చెందిన భరత్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించాడు. ఆదివారం వివాహం జరిపించేందుకు అనంతప్ప అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాడు. చిన్నచిన్న పనుల నిమిత్తం శనివారం సాయంత్రం మండల కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. దీంతో స్థానికులు అతనిని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలియడంతో పెళ్లికి వచ్చిన బంధువులతో పాటు గ్రామమంతా విషాదంలో మునిగిపోయారు. పచ్చటి పందిట్లో పెళ్లి జరగాల్సిన సమయంలో తండ్రి అంత్యక్రియలు జరుగుతుండటం అందర్నీ తీవ్రంగా కలిచివేసింది. ఈ విషాదకర సంఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Govt. Advisor |థాంక్యూ సీఎం సార్
Govt. Advisor | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సౌదీ అరేబియాలోని మదీనా
అనిల్ రావిపూడి బర్త్డే.. చిరంజీవి సినిమా సెట్లో గోల గోల
హైదరాబాద్: టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్లో అనిల్ రావిపూడి ఒకరు. కామెడీని ప్రధాన ఆధారంగా చేసుకొని ఇప్పటివరకూ ఆయన తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు అనిల్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనేది ఈ సినిమా టైటిల్. కాగా, ఆదివారం అనిల్ రావిపూడి తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర యూనిట్ ఆయనకు ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్స్తో కలిపి ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూస్తే సినిమా ఇంకేంత ఫన్నీగా ఉంటుందో అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ అనే పాట సూపర్ హిట్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
Article |ఆంధ్రప్రభ కథనంలో.. అధికారుల్లో చలనం
రహదారి మరమ్మతులకు అధికారులు స్పందన Article | అచ్చంపేట, (ఆంధ్రప్రభ) : అచ్చంపేట
ELECTRIC SHOCK |నలుగురికి కరెంట్ షాక్ !
Electric shock | ఉయ్యూరు, ఆంధ్రప్రభ : ఉయ్యూరు పట్టణంలో ఆదివారం జరిగిన
Distribution |మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తాం
Distribution |లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం
సత్యసాయి ‘శత జయంతి’ ఉత్సవాలు.. విజయ్ ఎమోషనల్ పోస్ట్
హైదరాబాద్: పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకలకు హాజరయ్యారు. చాలా మంది భక్తులు సత్యసాయి బాబాను తలుచుకుంటూ సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. తాజాగా సత్యసాయిని స్మరించుకుంటూ హీరో విజయ్ దేవరకొండ కూడా సోషల్మీడియాలో పోస్ట్ పెట్టారు. నెలల వయసులో తనకు సత్యసాయి ‘విజయ సాయి’ అని నామకరణం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మేం రోజూ మీ గురించి ఆలోచిస్తూనే ఉంటాం. మీరెప్పటికీ మాతోనే ఉంటారు. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాం. ప్రపంచానికి ఏదైనా ఇవ్వగలిగేలా మాలో స్పూర్తి నింపారు’’ అని సత్యసాయి గురించి విజయ్ రాసుకొచ్చారు. అంతేకాక.. చిన్న తనంలో ఆయనతో దిగిన ఫోటోని కూడా షేర్ చేశారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి పాఠశాలలోనే విజయ్ విద్యాభ్యాసం చేశారు. ‘పుట్టపర్తి సాయి దివ్య కథ’ పేరుతో రూపొందించిన టివి సీరియల్లోనూ అతడు నటించారు. ఇక ఈ ఏడాది ‘కింగ్డమ్’ అనే సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా అంత సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం అతడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో కీర్తి సురేశ్ హీరోయిన్.
నకిలీ సర్టిఫికేట్ల తయారీ ముఠా అరెస్టు
నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితుల వద్ద నుంచి ఎస్ఆర్ఎం, బెంగళూరు సిటీ యూనివర్సిటీల సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...మీర్జా అక్తర్ అలీ బైగ్ అలియాస్ అస్లాం- ప్రధాన నిందితుడు, మహ్మద్ అజాజ్ అహ్మద్, - వడ్డేపల్లి వెంకట్ సాయి, విస్టాలా రోహిత్ కుమార్, సత్తూరి ప్రవీణ్ని అరెస్టు చేశారు. వెంకట్, రోహిత్, ప్రవీణ్ - నకిలీ బి.టెక్ సర్టిఫికెట్ను కొనుగోలు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు నార్సింగి పోలీసులకు సమాచారం రావడంతో నార్సింగిలోని చింతచెట్టు ప్రాంతంలో నకిలీ సర్టిఫికేట్లు అవసరం ఉన్న వారికి ఇచ్చేందుకు వచ్చిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఎస్ఆర్ఎం యూనివర్శిటీ, బెంగుళూరు సిటీ యూనివర్శిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర నకిలీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. యబడ్డాయి. సులభంగా డబ్బులు సంపాదించేందుకే నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమండ్ విధించింది.
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ తనకు సమాధానం చెప్పేందుకు మరి కొంత గడువు కావాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కోరారు. పార్టీ ఫిరాయించిన దానంతో సహా మొత్తం పది మంది ఎంఎల్ఏలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ బిఆర్ఎస్ ఇదివరకే స్పీకర్ను కోరిన సంగతి తెలిసిందే. కాగా స్పీకర్ పంపించిన నోటీసులకు ఎనిమిది మంది స్పందించి కౌంటర్ దాఖలు చేయగా, ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కౌంటర్ దాఖలు చేయలేదు. తాము న్యాయ నిపుణులతో సంప్రదించి సమాధానం ఇస్తామని గత నెలలో స్పీకర్కు చెప్పినా, ఇంత వరకూ సమాధానం ఇవ్వలేదు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ పది రోజుల క్రితం మళ్లీ నోటీసు పంపించగా, ఆ నోటీసుకు సమాధానం ఇచ్చే గడువు ఆదివారం (23)తో ముగిసింది. దీంతో దానం నాగేందర్ ఆదివారం స్పీకర్ను కలిసి తనకు మరింత గడువు కావాలని కోరాలనుకున్నారు. కాగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉదయమే వికారాబాద్ పర్యటనకు వెళ్ళడంతో, దానం నాగేందర్ స్పీకర్కు ఫోన్ చేసి సమాధానం ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కోరినట్లు సమాచారం. పది మంది ఎంఎల్ఏల విచారణ నాలుగు వారాల్లో ముగించాల్సి ఉన్న విషయాన్ని స్పీకర్ ప్రసాద్ కుమార్ దానంతో అన్నట్లు తెలిసింది. సోమవారం దానం గడువు కోసం లిఖితపూర్వకంగా స్పీకర్కు లేఖ అందించినున్నట్లు ఆయన అనుయాయుల ద్వారా సమాచారం.మరోవైపు ఫిరాయింపు ఎంఎల్ఏగా ఆరోపణ ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి కూడా స్పీకర్ను గడువు కోరారు. అందుకు స్పీకర్ వారం రోజుల గడువు ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇరువురూ అనర్హత వేటు పడడానికి ముందే తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది.
Jagan Coterie |ఏ పార్టీలోనూ చేరను…
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్
PRINCIPAL |ప్రిన్సిపాల్ కు లీగల్ నోటీసులు
మైనారిటీ గురుకుల పాఠశాల వివాదం మహబూబాబాద్ మైనారిటీ గురుకుల పాఠశాల వివాదం ఆదివారం
RSS|ఆర్ఎస్ఎస్ జన జాగరణ అభియాన్ ప్రారంభం
ఆజాద్ నగర్ లో జన జాగరణ అభియాన్ కరపత్రము RSS|మక్తల్ , ఆంధ్రప్రభ
Suchitra X Roads|ఫ్లైఓవర్ పనులు వెంటనే పూర్తి చేయాలి
Suchitra X Roads| సుచిత్ర–మేడ్చల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నిరవధికంగా నిలిచిపోవడంతో ప్రాంతీయ
SPACE |అంతరిక్ష విజ్ఞాన వీచిక…
‘స్పేస్ ఆన్ వీల్స్’ ఆకర్షణ ఆంధ్రప్రభ, విజయవాడ: అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై విద్యార్థులు,
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. టీం ఇండియాకు కొత్త కెప్టెన్
భారత్, సౌతాఫ్రికా మధ్య ప్రస్తుతం రెండు టెస్ట్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. అయితే సఫారీలతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ నొప్పి కారణంగా అతను మైదానరం వీడాడు. ఆ తర్వాత వైద్యుల పరిరక్షణలో ఉన్నాడు. రెండో టెస్ట్ కోసం కోల్కతా నుంచి గౌహతి వచ్చిన గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో రిషబ్ పంత్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు వన్డే జట్టుకు కూడా కొత్త కెప్టెన్ని నియమించారు. టీం ఇండియా స్టార్ కీపర్, బ్యాట్స్మెన్ కెఎల్ రాహుల్ ఈ సిరీస్లో భారత్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అంతేకాక.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు అనధికారిక వన్డేల సిరీస్లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్కి జట్టులో చోటు కల్పించారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టు : రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కెఎల్ రాహుల్ (కీపర్, కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ధృవ్ జురెల్.
MP |భగవాన్ సత్యసాయి బాబా చేసిన సేవలు శాశ్వతం
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుశతజయంతి వేడుకల్లో నేతలు, అధికారులు భావోద్వేగం MP |
SEVA |ఇడెం స్వరూప సేవా సంస్థ సేవలు
SEVA | ఇడెం స్వరూప సేవా సంస్థ సేవలు SEVA | వెల్లంకి
భక్తుడి అచంచల సంకల్పానికి నెటిజన్ల సెల్యూట్! #sabarimala #telugupost #devotee #physicallychallenged
TG | మహిళా శక్తి చీరల పంపిణీ TG | తాడ్వాయి, ఆంధ్ర
Collector |భగవాన్ శ్రీ సత్యసాయి..నిత్య సేవా స్ఫూర్తి..
శ్రీ సత్యసాయి చూపిన మార్గం యువత భవితకు వెలుగు పథం..స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్
BABA |ప్రేమ,సేవలే నిజమైన ఆధ్యాత్మికత
BABA | ప్రేమ,సేవలే నిజమైన ఆధ్యాత్మికత BABA | కర్నూల్ కార్పొరేషన్, ఆంధ్రప్రభ
కరీంనగర్...6 లక్షల కు శిశువు విక్రయం #telugupost #karimnagar #viralvideo #latestnews #newsupdates
ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ ఎంత వెనుకంజలో ఉందంటే..
గౌహటి: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్, రెండో రోజు ఆటలో సఫారీలే ఆధిపత్యం చూపించారు. రెండో రోజు 247/6 ఓవర్నైట్ స్కోర్తో ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. తొలి సెషన్లో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. టీ విరామ సమయానికి 316/6 పరుగులు చేసింది. రెండో సెషన్లో దూకుడుగా ఆడుతున్న కైల్ వెరినె వికెట్(45)ను భారత బౌలర్లు ఔట్ చేయగలిగారు. కానీ, ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన యాన్సెన్తో ముత్తుస్వామి అద్భుతంగా ఇన్నింగ్స్ నిర్మిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ముత్తుస్వామి తన టెస్ట్ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా.. యాన్సెన్ అర్థ శతకాన్ని నమోదు చేశాడు. అయితే వీరిద్దరి 97 పరుగుల భాగస్వామ్యానికి సిరాజ్ అడ్డుకట్ట వేశాడు. సెంచరీ సాధించిన ముత్తుస్వామిని ఔట్ చేశాడు. కానీ, యాన్సెన్ మాత్రం తన బ్యాటింగ్లో వేగం తగ్గించలేదు. భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. వేగంగా పరుగులు రాబట్టాడు. మరోవైపు బ్యాటింగ్ చేస్తున్న హార్మర్ (5)ని బుమ్రా ఔట్ చేశాడు. ఈ క్రమంలో 93 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటై.. సెంచరీని చేజార్చుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా 489 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలింగ్లో కుల్దీప్ 4, బుమ్రా, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 6 ఓవర్లు ఆడి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసి.. 480 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్లో జైస్వాల్ (7), రాహుల్ (2) ఉన్నారు.
STUDENT |విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ
STUDENT |విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ HOSTEL | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ
Telangana |ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్
Telangana |చెన్నూర్ ఆంధ్రప్రభ : 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేంతవరకు స్థానిక
తెలిసిన అమ్మాయి కదా అని ఇంట్లోకి రాణిస్తే..#theft #telugupost #viralvideo #nizamabad #latestnews
Choodu From Godari Gattupaina: Refreshingly Lively
Sumanth Prabhas’s upcoming flick Godari Gattupaina marks the directorial debut of Subash Chandra. As the film’s promotions pick up steam, the team has dropped its first song, Choodu Choodu, a track that instantly steals attention with its pleasing composition and village-side warmth. Composer Naga Vamshi crafts the melody weaving together classical instruments to form a […] The post Choodu From Godari Gattupaina: Refreshingly Lively appeared first on Telugu360 .
మహిళలు శభాష్.. మరో ప్రపంచకప్ నెగ్గిన భారత్
కొలంబో: కొద్ది రోజుల క్రితమే భారత మహిళలు ఐసిసి వన్డే ప్రపంచకప్ను గెలిచిన విషయం తెలిసిందే. నేవి ముంబై వేదికగా సౌతాఫ్రికా మహిళలతో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఇదిలా ఉండగానే భారత మహిళలు మరో ప్రపంచకప్ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ సారి అంధుల టోర్నమెంట్లో. భారత అంధ మహిళల క్రికెట్ జట్టు తొలి టి-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంకతో పాటు యుఎఇ కూడా పాల్గొన్నాయి. అయితే నేపాల్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. పూలా సరెన్ (44) అద్భుతంగా రాణించింది. దీంతో తొలి ఎడిషన్లోనే టి-20 ప్రపంచకప్ను సొంతం చేసుకొని భారత్ అంధ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో జట్టుపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
PROMOTION |కాటారం ట్రాన్స్ కో డీఇ గా నాగరాజు
PROMOTION | కాటారం ట్రాన్స్ కో డీఇ గా నాగరాజు -ఏ డీ
Sathya Sai Baba |శతజయంతి వేడుకలు
100 మంది పేదలకు బట్టల పంపిణీ, అన్నదానం Sathya Sai Baba |
Sathya Sai Baba |బెల్లంపల్లిలో సత్య సాయిబాబా శతజయంతి వేడుకలు
100 మంది పేదలకు బట్టల పంపిణీ, అన్నదానం Sathya Sai Baba |
కార్మికనగర్ లో వంటగ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: మధురానగర్ లో పోలీస్ స్టేషన్ పరిధిలోని విషాదం చోటు చేసుకుంది. కార్మిక నగర్ లో వంటగ్యాస్ సిలిండర్ పేలింది. మొదటి అంతస్తులోఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సకాలంలో స్పందించగా, సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Telangana |పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు!
Telangana |పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు! ములుగు, అబ్దులాపూర్ రిజర్వేషన్లు ఇలా… Telangana |ములుగు
POLICE |నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి
POLICE | నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా
HYD |మధురానగర్లో పేలిన సిలిండర్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: మధురానగర్లోని కమాన్ గల్లీలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది.
6 కిమీ పాటు అంబులెన్స్ను బ్లాక్ చేసిన కారు…#latestnews #viralvideo #ambulance #rashdriving
YCP |మునిసిపల్ నిధులున్నా.. అభివృద్ధి సున్నా
YCP | మునిసిపల్ నిధులున్నా.. అభివృద్ధి సున్నా గుడ్ మార్నింగ్ నరసరావుపేటలో డాక్టర్
CONTAINER SCHOOL |ఆదర్శం అంతేనా?
మిగిలిన గ్రామాలకు విస్తరించని వైనం CONTAINER SCHOOL |ములుగు జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ
Video: Actor Navdeep Exclusive interview | Celebrity Travel Secrets Unlocked
The post Video: Actor Navdeep Exclusive interview | Celebrity Travel Secrets Unlocked appeared first on Telugu360 .
GOAL |మహిళా అభివృద్ధే లక్ష్యం GOAL |సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): మహిళలను అన్ని
రాణించిన టెయిలెండర్లు.. సౌతాఫ్రికా ఆలౌట్..
గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. మొత్తానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించి సౌతాఫ్రికా బ్యాటర్లను పెవిలియన్ పంపించారు. 247/6 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా బ్యాటర్లు మన బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓవైపు వికెట్లను కాపాడుకుంటూనే పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సెనురన్ ముత్తుస్వామి (109) సెంచరీ చేసి ఔట్ కాగా.. మార్కో జెన్సన్ 93 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. వీరిద్దరు కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. మొత్తానికి సౌతాఫ్రికా 489 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్లో కుల్దీప్ 4, బుమ్రా, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు.
CHECK |మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
CHECK | నర్సంపేట, ఆంధ్రప్రభ : మహిళలు ప్రగతి సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం
Red gold : ఎర్ర బంగారం స్మగ్లింగ్
Red gold : ఎర్ర బంగారం స్మగ్లింగ్ ( ఏలూరు, ఆంధ్ర ప్రభ
SAREES |కన్నెపల్లి మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ
SAREES | కన్నెపల్లి మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ SAREES | బెల్లంపల్లి
BIRTHDAY |ఘనంగా బీఆర్ఎస్ నేత జన్మదిన వేడుకలు
BIRTHDAY |ఘనంగా బీఆర్ఎస్ నేత జన్మదిన వేడుకలు BIRTHDAY |సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ
తెలంగాణ సిఎంవొ, మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్స్ హ్యాక్
హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించిన ఏదో మూల చాప కింద నీరులా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాలకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరూ అతీతులు కారు. తాజాగా తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వాట్సాప్ గ్రూప్తో పాటు, పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్లను హ్యాక్ చేశారు. ఎస్బిఐ అకౌంట్ ఆధార్ వెరిఫికేషన్ పేరుతో ప్రమాదకర ఎపికె ఫైల్స్ని కేటుగాళ్లు పంపించారు. వెంటనే సదురు ప్రమాదకరమైన లింకులు క్లిక్ చేసి ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇది గమనించిన సైబర్ నిపుణులు అలాంటి లింక్స్ జోలికి వెళ్లవద్దని సూచించారు. కాగా, ఎనిమిది రోజుల క్రితమే సైబర్ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ను హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు అర్డర్ కాపీలు డౌన్లోడ్ చేసేందుకు చూస్తే.. అది గేమింగ్ సైట్లోకి వెళ్లేలా మార్చేశారు. దీనిపై హైకోర్టు రిజిస్టార్ డిజిపికి ఫిర్యాదు చేశారు.
Telangana |రహత్నగర్ను మరింత అభివృద్ధి చేస్తా
Telangana |రహత్నగర్ను మరింత అభివృద్ధి చేస్తా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్
HANUMAN |ముమ్మరంగా అంజన్న జాతర ఏర్పాట్లు
HANUMAN | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో
ఐబొమ్మ రవి అరెస్ట్ ఆటోపై మద్దతు పోస్టర్ #ibommaravi #telugupost #ibommaarrest #latestnews
సరూర్ నగర్ లో మెట్రో పిల్లర్ ను ఢీకొని ఇద్దరు మృతి
హైదరాబాద్ః సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ( పిల్లర్ నెం. 1618 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు స్నేహితులు అక్కడిక్కడే మృతి చెందారు. అతివేగంతో బైక్పై ప్రయాణిస్తున్న వీరు నియంత్రణ కోల్పోయి మెట్రో పిల్లర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నగర వాసులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మధు, హరీష్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
MISSION BHAGIRATHA |ఆరు రోజులుగా నీటి సరఫరా బంద్
ఆరు రోజులుగా నీటి సరఫరా బంద్ MISSION BHAGIRATHA | ఆరు రోజులుగా
CONGRESS |ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
CONGRESS | ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చీరల పంపిణీతో మహిళల్లో సంబరాలు CONGRESS
Chandrababu Naidu and Revanth Pay Glowing Tributes at Sri Sathya Sai Baba’s Centenary Celebrations
The Sri Sathya Sai Centenary Celebrations at Puttaparthi turned into a historic and spiritually charged gathering as leaders from both Telugu states paid heartfelt tributes to Bhagawan Sri Sathya Sai Baba. Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu, AP IT Minister Nara Lokesh and Telangana Chief Minister A. Revanth Reddy joined Vice President C.P. Radhakrishnan […] The post Chandrababu Naidu and Revanth Pay Glowing Tributes at Sri Sathya Sai Baba’s Centenary Celebrations appeared first on Telugu360 .
Telangana |లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు
Telangana |లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు Telangana |మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి
మృతదేహంతో ఆందోళన DEAD | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వైద్యుల నిర్లక్ష్యంతో
TVK Viijay :విజయ్ యాక్షన్ లోకి దిగినట్లుందిగా.. తమిళనాట ఆట మొదలైనట్లే
టీవీకే అధినేత విజయ్ ఎలాగైనా రాజకీయంగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లుంది.
రాజంపేట కాలనీవాసుల అవస్థలు Drainage | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాజంపేట
నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతికి పదవీ
Unemployees |నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
అప్లికేషన్ డెవలపర్ – వెబ్ & మొబైల్ కోర్సులో ఉచితంగా శిక్షణఎమ్మెల్యే కాగిత
Minister |సత్య సాయి మార్గం ఆచరణీయం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు Minister | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో :
Danam Nagender : గడువు కావాలన్న దానం నాగేందర్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్కుమార్ ను మరికొంత గడువు కోరారు
RTC | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపెల్లి పోలీసులు పారుపల్లి
Chiranjeevi’s Special Birthday Gift To Anil Ravipudi
Megastar Chiranjeevi turned his director’s birthday into a memorable occasion by personally inviting Anil Ravipudi to his home and presenting him with a high-end wristwatch. The celebration was not merely a mark of appreciation; it also reflected the star’s admiration for Anil Ravipudi’s creative approach while working on the much-anticipated Mana Shankara Vara Prasad Garu. […] The post Chiranjeevi’s Special Birthday Gift To Anil Ravipudi appeared first on Telugu360 .
IBomma : ఐబొమ్మ రవికి ఇంత మద్దతు సోషల్ మీడియాలో ఎందుకో అర్థమయిందా?
ఐబొమ్మ ఇమ్మడి రవిపై సోషల్ మీడియాలో మద్దతు రావడానికి కారణాలపై టాలీవుడ్ పెద్దలు ఆలోచించాలి.
AUDIT |ఆర్టీసీ ఉద్యోగి చేతివాటం
AUDIT |ఆర్టీసీ ఉద్యోగి చేతివాటం సొమ్ము మరో ఖాతాలోకి మళ్లింపునంద్యాల ఆర్టీసీ డిపోలో
Satyasaibababa |మానవత్వానికి మారు పేరు..
సాయిబాబా శత జయంతి Satyasaibababa | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : భగవాన్
POLICE | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని
Telangana : తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీపై రేవంత్ ఆశలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఫ్యూచర్ సిటీని సందర్శించనున్నారు
మనుషుల్లో దేవుడిని సాయిబాబా చూశారు: రేవంత్ రెడ్డి
అమరావతి: భగవాన్ సత్య సాయిబాబా ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. సాయిబాబా శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని తెలియజేశారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సాయి కుల్వంత్ హాలులోని సత్య సాయిబాబా మహాసమాధిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సాయిబాబా సేవలను గుర్తుచేసుకున్నారు. మానవ రూపంలోని దేవుడు సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా ఉందని తెలిపారు. సాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచారని, సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారని, మానవులను ప్రేమించాలని ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. సత్య సాయిబాబా మన మధ్యన లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, భావన నిర్వాహకుల అందరిలో కనిపిస్తోందని, ముఖ్యంగా ప్రతి వారూ చదువుకోవాలని ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ టు పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని, విద్య, వైద్య, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారని, జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువబడుతున్నారని కొనియాడారు. పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న కాలంలో, ప్రభుత్వాలు సైతం తాగునీటి సౌకర్యాలు కల్పించలేని కాలంలో సొంత జిల్లా పాలమూరు దాహర్తిని తీర్చారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించారని, తమిళనాడు రాష్ట్రంలో సైతం బాబా గారు సేవలను విస్తృత పరిచి ఈనాడు అందరి మనసుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సాధించారని రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు. మానవ సేవ మాధవ సేవ బోధించడమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించారని, ఈనాడు 140 దేశాల్లో బాబా భక్తులు ఉండటమే కాకుండా వారంతా వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నారని, సాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారంటే వారి ప్రత్యేకతను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. సత్య సాయిబాబా ఆలోచనలను, వారు అనుసరించిన విధానాలను ప్రజలకు చేరవేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రకటించారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
RSS |పరివర్తన కోసం.. RSS | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : వ్యక్తి
ELECTION | మోత్కూర్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మ్రోగనుండడంతో
ముత్తుస్వామి తొలి సెంచరీ.. అరుదైన రికార్డు సొంతం
గౌహటి: బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్లో సఫారీల వికెట్లు పడగొట్టడానికి భారత బౌలర్లు తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే సౌతాఫ్రికా 400+ మార్కును దాటేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సెనురన్ ముత్తుస్వామి సెంచరీ సాధించాడు. 192 బంతుల్లో అతడు మూడంకెల స్కోర్ దాటేశాడు. టెస్ట్ క్రికెట్లో అతడిని ఇదే తొలి శతకం కావడం విశేషం ఈ క్రమంలో ఏడు లేదా అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్కి వచ్చి సెంచరీ చేసిన మూడో సౌతాఫ్రికా ఆటగాడిగా ముత్తుస్వామి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో క్వింటన్ డికాక్ (111), లాన్స్ క్లూజ్నర్ (102) ఈ రికార్డును సాధించారు. ఇక మరో సౌతాఫ్రికా టెయిలెండర్ మార్కో జెన్సన్ కూడా అర్థ శతకం సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా 136 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసింది. క్రీజ్లో ముత్తుస్వామి 106, జెన్సన్ 50 ఉన్నారు.
Telangana |శ్మశానవాటిక పనులు ప్రారంభం
Telangana |శ్మశానవాటిక పనులు ప్రారంభం Telangana | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల
అండర్–14 కరాటే పోటీలలో ప్రతిభ KARATE | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ
TEMPLE |నందీశ్వరుడికి పూజలు మహానంది ఆలయాన్నిసందర్శించిన జాయింట్ కలెక్టర్ TEMPLE |నంద్యాల బ్యూరో,
Mines | 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలు
రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర Mines| ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు
Fact Check: Viral Video Claiming Aishwarya Rai Confronted PM Modi at Sai Baba Event Is a Deepfake
The viral video shows Aishwarya Rai questioning PM Modi about losing jets to Pakistan, Rafale aircraft, S-400 systems, and soldiers.
పెళ్లికి ముందు వరుడితో స్మృతి మ్యాచ్.. విజేత ఎవరంటే..
టీం ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ని ఆమె వివాహమాడనుంది. ఇటీవల వీరిద్దరి హల్దీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. అయితే పెళ్లికి ముందు స్మృతి, తనకు కాబోయే భర్తతో క్రికెట్ మ్యాచ్లో పోటీ పడింది. ఈ మ్యాచ్లో టీమ్ బ్రైడ్కి స్మృతి కెప్టెన్గా వ్యవహరించగా.. టీమ్ గ్రూమ్కి పలాశ్ కెప్టెన్సీ చేశాడు. స్మృతి జట్టులో షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, రాధా యాదవ్, రిచా ఘోష్ ఉన్నారు. సరదాగా సాగిన ఈ మ్యాచ్లో స్మృతి జట్టు విజేతగా నిలిచింది. కాగా, కొద్ది రోజుల క్రితం ఐసిసి వన్డే మహిళల ప్రపంచకప్ నెగ్గిన జట్టులో స్మృతి కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచకప్ గెలిచిన డివై పాటిల్ మైదానంలోని పిచ్పై పలాశ్ స్మృతికి ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇక ఆదివారం వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. Smriti Mandhana is playing cricket with her soon-to-be husband Palash Muchhal at their wedding event. pic.twitter.com/8o5nXiqijN — Mention Cricket (@MentionCricket) November 22, 2025
MONEY | ఆదర్శం.. ఆటో డ్రైవర్.. MONEY | నర్సింహులపేట, ఆంధ్రప్రభ :
ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలి: విజయ్
చెన్నై: ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనేది మా లక్ష్యమని నటుడు, టివికె అధినేత విజయ్ తెలిపారు. రెండు నెలల తర్వాత విజయ్ ప్రజల్లోకి వచ్చాడు. కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆడిటోరియంలో స్థానిక సమస్యలపై ప్రజలతో విజయ్ ముఖాముఖి మాట్లాడారు. కరూర్ తొక్కిసలాట దృష్ట్యా పోలీసుల ఆంక్షలు విధించారు. రెండు వేల మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ఉన్నవారికి మాత్రమే ఆడిటోరియంలోకి ప్రవేశం కల్పించారు. టివికె పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలని, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని, శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని విజయ్ స్పష్టం చేశారు. వరదలు ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 27వ తేదీన కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఆయన సిద్ధాంతాన్ని మనకు ఇచ్చి వెళ్లారు: చంద్రబాబు నాయుడు
అమరావతిః సత్యసాయి ఒక ఉద్దేశంతో లోకానికి వచ్చి దాని కోసమే జీవించారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పుణ్యభూమి పుట్టపర్తిలో ఒక లక్షం కోసం సత్యసాయి అవతరించారని అన్నారు. పుట్టపర్తి లోని హిల్వ్యూ ఆడిటోరియంలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పుట్టపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సత్యసాయిబాబా మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారని, సత్యసాయిబాబా తన బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారని తెలియజేశారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి సత్యసాయిబాబా చెప్పారని, మానవ రూపంలో మనం చూసినదైవస్వరూపం శ్రీ సత్యసాయి అని కొనియాడారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింసా సిద్ధాంతాలుగా నూతన అధ్యాయం ప్రారంభించారని,1960లో బాబాస్థాపించిన శ్రీసత్యసాయి బాబా సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చిందని అన్నారు. తన మహిమలతో అన్ని మతాలతో అన్ని మతాలు ఒక్కటేనని, భక్తులకు ప్రత్యక్షంగా నిరూపంచారని చంద్రబాబు పేర్కొన్నారు. భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని, సత్యసాయి సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని సూచించారు. సత్యసాయిబాబా కోట్లమంది జీవితాలను ప్రభావితం చేశారని, సకలజనుల సంక్షేమాన్ని సత్యసాయి కోరుకున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. సత్యసాయిబాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని, సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని అన్నారు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చునని సత్యసాయిబాబా నిరూపించారని, సత్యసాయిబాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యతని గుర్తుచేశారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు సత్యసాయి ట్రస్ట్ నెరవేర్చిందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జయంతి ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి రాధాకష్ణన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, ఛత్తీస్గఢ్, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకుందాం.
POCSO | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలో 17 ఏళ్ల బాలిక
RICE |రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
RICE | రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
18 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా స్కూటీలను అందించే కొత్త ప్రభుత్వ పథకాన్ని
Male Balappa |బీఆర్ఎస్ నాయకుడు మృతి
Male Balappa | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల

26 C