బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం..బెస్ట్ క్వాలిటీ ఇవ్వండి
పద్ధతి మార్చుకోకపోతే..మిమ్మల్ని మార్చుతాం జాప్యాన్ని సహించం..ఇదే చివరి అవకాశం అంగన్వాడి సరుకుల సరఫరాలో జాప్యం, నాణ్యతపై మంత్రి సీతక్క ఆగ్రహం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు, సరుకుల సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరుకుల సరఫరాలో జరుగుతున్న జాప్యంపై మండిపడ్డారు. ‘మాకు కారణాలు చెప్పకండి, అంగన్వాడీ చిన్నారుల కోసం కోడి గుడ్లు పది రోజులకు ఒకసారి తప్పనిసరిగా సరఫరా కావాలని, సాకులు చెప్పి జాప్యం చేస్తే కాంట్రాక్టులు రద్దు చేస్తామ’ని హెచ్చరించారు. చిన్నారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన, నిర్దిష్ట సైజు గుడ్లను సరఫరా చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. చిన్న గుడ్లు, నాసిరకం గుడ్ల సరఫరా మహా పాపమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు, పప్పు, మంచి నూనె, పాలు, ఇతర అవసరమైన సరుకులపై జిల్లాల వారీగా మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారులు, సరుకులు, గుడ్లు, సరఫరాదారులు, పాల సరఫరాదారులు, పాల్గొన్నారు. కోడి గుడ్లు, సరుకుల సరఫరా పరిస్థితులు, జాప్యం, నాణ్యత సమస్యలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీలకు నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్షమని తెలిపారు. మారుతున్న వాతావరణంలో గుడ్లు త్వరగా పాడవుతుండటంతో పది రోజులకు ఒకసారి సరఫరా వ్యవస్థ తప్పనిసరి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది కోడిగుడ్ల నిల్వపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లల బరువు, ఎత్తు పెరగడానికి నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. సరుకుల నాణ్యతలో లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు సరుకుల నాణ్యతలో లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మసాలా వస్తువుల నాణ్యతపైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అయ్యే జీలకర, ఆవాలు, పసుపు, ఉప్పు, కారం పొడి, చింతపండు వంటి వస్తువుల నాణ్యత ఆశించిన స్థాయిలో లేక పోవడాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా పరిగణించారు. అంగన్వాడి కేంద్రాలకు రెస్టారెంట్లుగా భావించి నాసిరకం వస్తువులు ఇస్తే అస్సలు సహించేది లేదని, నాణ్యత లేని వస్తువులు పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్కు సరుకుల కాంట్రాక్టులు ఇచ్చినా నాణ్యత పరంగా ఆశించిన ఫలితాలు రాలేదని మంత్రి సీతక్క తెలిపారు. ఆయిల్ ఫెడ్ నేరుగా రైతులు, మహిళా సంఘాల నుంచి ప్రొక్యూర్మెంట్ చేయాలి. లేదంటే అంగన్వాడి కేంద్రాలకు వస్తువుల సరఫరా కాంట్రాక్టులను నేరుగా మహిళా సంఘాలకు ఇస్తాము, అని మంత్రి స్పష్టం చేశారు. మహిళా సంఘాలను ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించినట్టు ఆమె తెలిపారు. ఇది మీకు చివరి అవకాశం, నాసిరకం వస్తువులు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు. పిల్లలు దేవుళ్లతో సమానమని, వారికి అందించే ఆహారంలో రాజీ ఉండదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కోడి గుడ్లు సరఫరాదారుల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళతా:మంత్రి ఈ సమావేశంలో కోడిగుడ్ల సరఫరాదారులు తమ సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకు వచ్చారు. సంక్షేమ హాస్టళ్లతో కలిపి సరఫరా చేయడం వల్ల సమన్వయం కుదరక ఇబ్బందులు వస్తున్నాయని సరఫరాదారులు వివరించారు. కొన్ని సందర్భాల్లో అంగన్వాడి కేంద్రాలకు కేటాయించిన కోడిగుడ్లను హాస్టల్ నిర్వాహకులు ఒత్తిడి చేసి తీసుకుంటున్నారని వివరించారు. వీరి సమస్యలు విన్న మంత్రి సీతక్క ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, టీజీ ఫుడ్స్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
వికసిత్ భారత్ కోసం ప్రణాళిక బద్ధంగా కృషిచేద్దాం
` వేగంగా అనుమతులు లభిస్తేనే పురోగతి సాధ్యం ` కేంద్రం నిర్దేశించిన లక్ష్యంలో మేమూ భాగస్వామ్యం ` 30 ట్రిలియన్ డాలర్ల ఎకానవిూలో 10శాతం ఉంటాం ` …
పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2 ఫలితాలు రద్దు
` తెలంగాణ హైకోర్టు ఆద్ఱేశం హైదరాబాద్(జనంసాక్షి):పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఎంపిక జాబితాను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 2015- 16లో నిర్వహించిన గ్రూప్-2లో ఎంపికైన …
ఆదివాసీ యోధుడు, మావోయిస్టు నేత హిడ్మా ఎన్కౌంటర్
` మారేడుమిల్లిలో ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, ఆయన సహచరితో కలిపి ఆరుగురు మావోయిస్టులు మృతి ` ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రాలోకి ప్రవేశిస్తుంగా ఘటన ` 17 ఏళ్ల …
బుధవారం రాశి ఫలాలు (19-11-2025)
మేషం బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించాలి. ఆలయాలు దర్శనాలు చేసుకుంటారు. వృషభం వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణదాతల నుండి ఒత్తిడులు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిధునం మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి సభ, సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. కర్కాటకం ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందగలుగుతారు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సింహం వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. కన్య విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగపరంగా అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిరుత్సాహ పరుస్తాయి. తుల వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. విందు వినోదాది కార్యక్రమాలకు హాజరు అవుతారు. వృశ్చికం చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి కొన్ని పనులలో ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ధనస్సు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. మకరం వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. కుంభం ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. మీనం కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు.
ఫ్యాక్ట్ చెక్: సౌదీ అరేబియాలో 42 భారతీయులు సజీవదహనం అయిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇవి కావు
వైరల్ అవుతున్న విజువల్స్ భారత ప్రయాణీకులకు సంబంధించిన ప్రమాద వీడియో కాదు
ఐ బొమ్మ కేసులో రంగంలోకి ఇడి...
కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి లేఖ క్రిప్టో ద్వారా రవి బ్యాంక్ ఖాతాలకు నెలకు రూ.15లక్షలు ట్రాన్స్ఫర్ ప్రహ్లాద్ పేరుతో పాస్పోర్ట్, విదేశాలకు పారిపోవాలని ప్లాన్ బెట్టింగ్ డబ్బులతో హైదరాబాద్, విశాఖ, కరేబియన్ దీవుల్లో ఆస్తుల కొనుగోలు మనతెలంగాణ, సిటిబ్యూరోః ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో ఇడి రంగంలోకి దిగింది. ఐ బొమ్మ పేరుతో వెబ్సైట్ నిర్వహించిన రవి పలు బెట్టింగ్ యాప్ల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. క్రిప్టో వాలెట్ నుంచి రవికి చెందిన ఐసిఐసిఐ ఎన్ఆర్ఐ బ్యాంక్ ఖాతాకు నెలకు రూ.15లు ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. రవికి సంబంధించిన నాలుగు బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.20కోట్ల వరకు లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. అంతేకాకుండా విదేశాల నుంచి మనీలాండరింగ్ ద్వారా రవి డబ్బులు తీసుకున్నట్లు తెలియడంతో ఇడి అధికారులు రంగంలోకి దిగారు. మరో వైపు రవి పోలీసుల విచారణకు సహకరించనట్లు తెలిసింది. రవిని ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా బుధవారానికి వాయిదా వేశారు. రవిని అదుపులోకి తీసుకుని హార్డ్ డిస్క్లు, సర్వర్లలో ఉన్న సినిమాలు, నెట్ వర్క్ గురించి రాబట్టాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. ఐ బొమ్మ ద్వారా రవి భారీ డబ్బులు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. తనను పోలీసులు వేటాడుతున్నారని గుర్తించిన రవి, ప్రహ్లాద్ పేరుతో పాస్పోర్టు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. 2022లో ఇండియా సిటీజన్ షిప్ వదులుకుని కరేబియన్ దీవి నెవెడా పౌరసత్వం తీసుకున్నాడు. ఇక్కడ ఉన్న ఆస్తులను విక్రయించి విదేశాల్లో స్థిరపడాలని భావించిన రవి, బెట్టింగ్ నుంచి వచ్చే డబ్బులతో నెలకొక దేశం తిరిగేవాడు. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బులతో హైదరాబాద్, కరేబియన్ దీవుల్లో రవి ఇళ్లు కొనుగోలు చేశాడు. తనకు యూరప్ దేశాల్లో తిరగడం చాలా ఇష్టమని చెప్పినట్లు తెలిసింది. డేటా క్లియర్... రవిని కూకట్ పల్లిలోని ఇంటి నుంచి అరెస్టు చేసేందుకు వెళ్లిన సైబర్ క్రైం పోలీసులకు డోర్లు తెరవకుండా ఉన్నాడు. పోలీసులు వచ్చినట్లు గ్రహించిన రవి ఇంట్లోనే ఉండి టెలీగ్రాం, మొబైల్లో డేటాను క్లియర్ చేసి, ల్యాప్టాప్ను బాత్రూంలో దాచిపెట్టాడు. భారీగా డబ్బులు సంపాదించిన రవి బంధువులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. రవిని రెండు డొమైన్లు పట్టించినట్లు తెలిసింది, అమెరికాలో ఒకటి, అమీర్పేట్లో మరో డొమైన్ను రవి రిజిస్టర్ చేసినట్లు తెలిసింది. 17వెబ్సైట్లు నిర్వహించిన వరి ఐ బొమ్మ, బప్పం టివిలను నిర్వహించాడు. వీటి ద్వారా పైరసీ సినిమాలను అప్లోడ్ చేసి విన్బెట్, వన్ ఎక్స్ బెట్ను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రేమికులు ఎంత బలంగా నిలబడతారు అనేది కథ
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో నేను చేసిన రాజు పాత్ర ప్రతి అబ్బాయికి కనెక్ట్ అవుతుంది. ప్రతి ప్రేమలో బాధ, కోపం, సంతోషం ఉంటాయి. నిజమైన ప్రేమలో ఉన్న ప్రేమికులు ఒకరి కోసం మరొకరు ఎంత బలంగా నిలబడతారు అనేది ఈ మూవీ కథ”అని అన్నారు. హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ “రాంబాయి పాత్రలో అనేక లేయర్స్ ఉన్నాయి. ఆమె కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడుతుంది, తన ప్రేమను తండ్రి అంగీకరించాలని తపన పడుతుంది. తెలుగు సినిమాలో బ్యూటిఫుల్ గా రాసిన క్యారెక్టర్ అనే ప్రశంసలు రాంబాయి పాత్రకు దక్కుతాయి”అని పేర్కొన్నారు.
ఎపిని షెల్టర్గా మార్చుకుని బుక్కయిన మావోయిస్టులు
5 జిల్లాల్లో 50 మందికి పైగా అరెస్ట్, భారీగా డంపులు గుర్తింపు మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో పలు చోట్ల మావోయిస్టులు షెల్టర్గా మార్చుకుని ఆజ్ఞాతంలో ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 60 నుంచి 70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. విజయవాడ, కాకినాడ, అల్లూరి, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరులో మావోయిస్టుల ఉనికి తీవ్ర కలకలం రేపింది. ఇంటలిజెన్స్ సమాచారంతో విజయవాడ న్యూ ఆటోనగర్ను మావోయిస్టులు షెల్టర్ జోన్గా మార్చుకున్నారన్న పక్కా సమా చారంతో మంగళవారం ఉదయం నుంచి కేంద్ర బలగాలు, ఆక్టోపస్, బాంబ్ స్కాడ్, స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దాదాపు రెండు, మూడు బస్సుల్లో పోలీసుల బలగాలు వచ్చిన ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నాలుగు అంతస్తుల భవనాన్ని పోలీసులు చుట్టుముట్టారు. చుట్టుపక్కల ఉన్న దుకాణాలు, పరిశ్రమలను మూసివేసి తనిఖీలు చేపట్టారు. సోదాల్లో 28 మంది మావో యిస్టులను అరెస్ట్ చేశారు. వారిలో 21 మంది మహిళలు, మరో ఏడుగురు కీలక హోదాల్లోని వ్యక్తులున్నట్లు తెలిసింది.. వీరంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. అయితే మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ దగ్గర హిడ్మా డైరీ దొరికిందని అందులో ఉన్న సమాచారం ఆధారంగానే సెర్చ్ ఆపరేషన్ జరిగిందని అంటున్నారు. ఇందులో పలు కీలక విషయాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. డైరీలో షెల్టర్ల గురించిన సమాచారం రాసుకున్నారా? లేదంటే ఎలాంటి విషయాలు ఉన్నాయనే విషయం తెలియాల్సి ఉంది. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో విజయవాడ, కాకినాడ నగరాల్లో నిర్వహించిన సోదాల్లో ఇప్పటి వరకు (విజయవాడలో 32 మంది), (కాకినాడ నగరంలో 2) మొత్తంగా 34 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు తెలిసింది. విచారణలో మావోయిస్టులు నగర శివార్లలో నాలుగు చోట్ల ఆయుధాలు, పేలుడు పదార్థాలతో కూడిన డంప్లను ఏర్పాటు చేసినట్లు కీలక సమాచారం లభించింది. దీంతో అప్రమత్తమైన బలగాలు ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు, మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన భవన యజమాని గత నెలన్నరగా విదేశాల్లో ఉన్నట్లు తేలింది. దీంతో భవన వాచ్మేన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నా రు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతా లకే పరిమితమైన మావోయిస్టులు వ్యూహం మార్చి విజయవాడ వంటి కీలక నగరంలో స్థావరం ఏర్పాటు చేసుకోవడం భద్రతా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నగరంలో ఉంటూ తమ కార్యకలా పాలను విస్తరించే ప్రణాళికలో భాగంగానే ఇక్కడికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమా నిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎపి నగరాల్లో అరెస్టు కావడం ఇదే తొలిసారి. ప్రత్యేకంగా బిహార్, ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడి వస్తున్నందున ఎవరికీ అనుమానం రాదని అందుకే దీన్ని సురక్షిత ప్రాంతంగా భావించినట్లు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా వీరు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ షెల్టర్ జోన్ ఎవరు ఇచ్చారు? మావోయిస్టులకు ఎవరైనా సానుభూతిపరులు ఉన్నారా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు కదలికలు పీక్లో ఉన్న ప్పుడు కూడా ఇలా జరగలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చత్తీస్గఢ్లో మావోయిస్టులు బలగాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటు న్నారు. ఈ క్రమంలో మే 2025లో నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత చార్జీ తీసుకున్న జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి (దేవూజీ) తమ ఉద్యమాన్ని పునరుజ్జీవనం చేయాలని పథక వేశాడు.. హిడ్మా ఈ ప్లాన్లో కీలక పాత్ర పోషించాడు. ఎపిలో కీలకమైన నేతల్ని హత్య చేయడం ద్వారా తమ ఉనికి బలంగా చాటాలనుకున్నారు. అయితే ఇంటలిజెన్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అరెస్టు చేశారు. అరెస్టుల తర్వాత పోలీసులు విజయవాడ న్యూ ఆటోనగర్, పెనమలూరు, ఏలూరు, కాకినాడలో సోదాలు చేశారు. హిడ్మా డైరీలో రాసిన డంపులు ఆయుధాలు, సరుకులు, మెడిసిన్లు దాచిన చోట్ల కోసం రెండు రాష్ట్రాల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఎపితో పాటు చత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా లో కూడా ఫోర్ -స్టేట్ సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. ‘మిగిలిన మావోయిస్టులు వలస కూలీల రూంలో దాక్కుని ఉండవచ్చని అనుమాని స్తున్నారు. ఈ ఘటనతో విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అరెస్ట్ అయిన వారిని మరింత లోతుగా విచారించి, వారి నెట్వర్క్ను ఛేదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా ఏలూరులో 15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆధ్వర్యంలో ఏలూరు శివారులోని గ్రీన్సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఓ భవనంలో 15 మంది మావోయిస్టులను స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్టు చేసినట్లు సమా చారం.అదుపులోకి తీసుకున్న వారిని ఏలూరు రూరల్ పోలీసుస్టేషన్కు తరలిం చారు. ఒడిశాకు చెందిన వీరంతా గత వారం రోజులుగా గ్రీన్ సిటీలో తలదాచుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ ఎడిజి కీలక ప్రకటన రాష్ట్రంలో హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ ఎడిజి మహేష్ చంద్ర లడ్హా కీలక ప్రకటన చేశారు. ‘మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. మంగళవారం ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్యలో ఎన్కౌంటర్ జరిగింది. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేశాం. అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. రెండు రోజులుగా ఇంటెలిజెన్స్ సమాచారంతో మావోయిస్టుల గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాం. అలాగే మావోయిస్టులతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. వీటిలో రెండు ఎకె 47లు,, ఒక పిస్టోల్ , ఒక రివాల్వర్, సింగిల్ బోర్ ఆయుధం, 1525 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, మరో ఎలక్ట్రికల్ వైర్ బండిల్, కెమెరా ఫ్లాష్ లైట్ , కటింగ్ బ్లేడ్ , 25 మీటర్ల ప్యూజ్ వైర్, ఏడు కిట్ బ్యాగులు ఉన్నాయి. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంద’ని ఎడిజి మహేష్ చంద్ర లడ్హా తెలిపారు.
సాంఘీక దురాచారాలపై సంఘటితంగా పోరాడాలి
సిఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి పిలుపు ప్రజాభవన్లో సిఎం ప్రజావాణి లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 55 బాధిత కుటుంబాల హాజరు మన తెలంగాణ/హైదరాబాద్ : శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకుని వెళ్తున్న ప్రస్తుత ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్షత కొనసాగడం బాధాకరమని, సాంఘిక దురాచారాలపై సంఘటితంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిఎం ప్రజావాణి ఇంఛార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి అన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో సీఎం ప్రజావాణి, దళిత స్త్రీ శక్తి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళల పట్ల జరుగుతున్న వివక్షత, అత్యాచారాలకు గురైన మహిళల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని, పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళల పట్ల జరిగిన దాడులు, అన్యాయాలను మానవతా దృక్పథంతో పరిష్కరించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు చేపడుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది బాధితులు వచ్చి తమ సమస్యలు చెప్పి పునరావాసం కల్పించాలని, పరిహారం ఇప్పించాలని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సమావేశంలో కోరారు. దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గడ్డం ఝాన్సీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఎన్ఆర్ఐ అడ్వైజర్ కమిటీ చైర్మన్ అంబాసిడర్ వినోద్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ క్షితిజ, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ కమిషనర్ సర్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, విజయేందర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సత్యనారాయణ, మూడు పోలీస్ కమీషనరేట్స్ నుంచి సీనియర్ పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం : రాంచందర్ రావు
స్థానిక ఎన్నికల్లో బిసిలకు పెద్ద పీట బిజెపి అధ్యక్షుడు రాంచందర్ రావు మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి, వారికి పెద్ద పీట వేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. పార్టీ పరంగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చే నాయకులు, కార్యకర్తల గుణ గణాలను, పూర్తి వివరాలు పరిశీలించి ఎంపిక చేస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులకో మాట్లాడుతూ అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. బిసిల ఓట్లు పొందేందుకు బిసి రిజర్వేషన్ల గురించి చెప్పినా, అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు చేపట్టలేదని ఆయన విమర్శించారు. తమ పార్టీ బిసిల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో దేశంలో ఉగ్రవాదం, మావోయిస్టు చర్యలను నిర్మూరించేందుకు వీలుగా నిర్ణయం తీసుకుందన్నారు. గత అనేక దశాబాలుగా మావోయిస్టులు పేదలను, దళితులను, గిరిజనులను, పోలీసులను, పోలీస్ ఇన్ఫార్మల పేరిట అనేక మందిని, ఇంకా బిజెపి, ఎఐవిపి కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా తుపాకులు వదిలి లొంగిపోవాలని హెచ్చరించడమే కాకుండా లొంగిపోవడానికి తగిన సమయం కూడా ఇచ్చిందని ఆయన వివరించారు. కాబట్టి మావోయిస్టులు తుపాకి వీడి జన జీవన స్రవంతిఓ కలవాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. కీలక సమావేశం.. ఇదిలాఉండగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన మంగళవారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, మోర్చా అధ్యక్షులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి కమిటీల ఏర్పాటు, ప్రస్తుత కార్యాచరణ ప్రణాళికలు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన వ్యూహాత్మక కార్యక్రమాలపై వారు సవివరంగా చర్చించారు. రాంజీ గోండ్ మ్యూజియం గిరిజన నాయకుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా, జన జాతీయ గౌరవ దివస్లో భాగంగా బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ అధ్వర్యంలో ఆబిడ్స్లోని రాంజీ గోండ్ మ్యూజియం ఏర్పాటైంది.
శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే
పోటెత్తిన అయ్యప్ప భక్తులు స్వామి దర్శనానికి 16 గంటల సమయం సోమవారం1.25 లక్షల మంది, మంగళవారం మధ్యాహ్నం వరకు 1.97 లక్షల మంది భక్తులకు అయ్యప్ప దర్శనం మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సాయంత్రం గుడి తలుపులు తెరుచుకోగా వేలాదిగా అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకుంటున్నారు. దీంతో స్వామి దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. కిలోమీటర్ల మేర భక్తుల పడిగాపులు కాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన అయ్యప్ప భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోమవారం రికార్డు స్థాయిలో 1.25 లక్షల మంది భక్తులు ఆ హరిహరపుత్రుడిని దర్శించుకోగా, మంగళవారం మధ్యాహ్నం వరకు 1.97 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆన్లైన్లో (www.sabarimalaonline.org)లో రోజుకు 70 వేల మందికి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు స్లాట్ బుకింగ్ కోసం అవకాశం కల్పించింది. అదనంగా మరో 20వేల మందికి స్పాట్ బుకింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసింది. అయితే, సోమవారం ఏకంగా 37 వేల మంది, మంగళవారం 32 వేల మంది భక్తులు స్పాట్ బుకింగ్ చేసుకున్నారని, అందుకే రద్దీ విపరీతంగా పెరిగిందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టిడిబి) అధికారులు పేర్కొన్నారు. పంపా బేస్ల్లో రద్దీని బట్టి ఆన్లైన్ బుకింగ్ లేని భక్తులను నీలకల్లోనే పోలీసులు నిలిపివేస్తున్నారు. నీలక్కల్లో భక్తులకు వసతి సదుపాయాలను పోలీసులు కల్పిస్తున్నారు.
మెట్రో, మూసీ, ఆర్ఆర్ఆర్కు సహకరిస్తాం
అమృత్యోజన కింద నిధులు మంజూరు చేస్తాం ఎల్ అండ్ టి వైదొలిగినందున మెట్రోలో కేంద్రం భాగస్వామిగా చేరుతుంది రెండోదశ విస్తరణకు సంపూర్ణ సహకారం కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ హామీ మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు, ఆర్ఆర్ఆర్కు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ తెలిపారు. ఇందుకోసం అమృత్ యోజన నిధులు మంజూరు చేస్తామన్నారు. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల పురపాలక శాఖ మంత్రుల సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై కేంద్ర మంత్రి సమీక్ష జరిపారు. ప్రధానమంత్రి అవాస్ యోజన, అమృత్ యోజన పథకం సహా పలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్అండ్టి వైదొలిగిందని, ఇకపై కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగస్వామ్యం కానుందన్నారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం కింద హైదరాబాద్ మెట్రోలో కేంద్రం చేరుతుందన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా మెట్రోకు విశేష ఆదరణ లభించడంతో ఎక్కువ రాష్ట్రాలు మెట్రోను కోరుతున్నాయని ఆయనచెప్పారు. అయితే, భూసేకరణ పూర్తయిన ప్రాజెక్టులకు సంబంధించి ముందుగా ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు. హైదరాబాద్లో రెండో దశ మెట్రో విస్తరణకు పూర్తిగా సహకరిస్తామని కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ హామీ ఇచ్చారు. ఇక మూసీ ప్రాజెక్ట్ పనులకు కూడా నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. అమృత్ యోజనలో భాగంగా నగర ప్రజలకు పరిశుభ్రరమైన త్రాగునీరు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. పిఎం ఆవాస్ యోజనకు సంబంధించిన గృహాల మంజూరు కూడా ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేస్తామని కట్టర్ వెల్లడించారు. అమృత్ 2.0 కింద గుజరాత్, తెలంగాణ, గోవా రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 కింద గుజరాత్, తెలంగాణ, గోవా రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే మూడు సంవత్సరాల్లో తమ నగరాల్లో 100 శాతం నీటి సరఫరాను సాధిస్తాయని, మహారాష్ట్ర, డామన్ నగరాలు 90 శాతం కవరేజీని మించి చేరుకుంటాయని కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర అమృత్ 2.0 కింద 3,000 ఎంఎల్డి నీటిని రీసైక్లింగ్ చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గుజరాత్ 2030 నాటికి శుద్ధి చేసిన నీటిలో కనీసం 40 శాతం రీసైక్లింగ్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల కోసం కమిటీలను వేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచుతాం
డిజిటల్ విద్యా హబ్ దిశగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ల మధ్య అవగాహన ఒప్పందం మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకురావడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడమే కాకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని సిఓఎల్ అధ్యక్షుడు అండ్ సిఈఓ పీటర్ స్కాట్తో ముఖ్యమంత్రి వెల్లడించారు. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి ఐడియా ఆధునిక డిజిటల్ హబ్గా ఇది పనిచేస్తుందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నాణ్యమైన విద్యను అందించనుందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్తో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ స్థాపనకు సంబంధించిన అవగాహన ఒప్పందం మంగళవారం సిఎం అధికారిక నివాసంలో జరిగింది. టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విద్యను అందించడంలో ఎంఓయూ కీలకం: ఘంటా ఈ సందర్భంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రముఖ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయనున్నట్లు విసి ప్రొ. ఘంటా చక్రాపాణి వెల్లడించారు. ఈ ఒప్పందంతో బోధన, అభ్యాసం, పరిశోధనా రంగాల్లో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టేందుకు ఆధునిక డిజిటల్ హబ్గా పనిచేయనుందని ఆయన వెల్లడించారు. టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విద్యను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. దూర విద్యలో చేరి ఎక్కువగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడే చాలా మంది విద్యార్థులు ఆయా విద్యా సంస్థల్లో చేరుతారని కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షుడు, సి ఈ ఓ ప్రొఫెసర్ పీటర్ స్కాట్ పేర్కొన్నారు. ఉత్పాదక ఉత్పత్తి, ఉమ్మడి ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేలా విద్యా విధానం ఉండాలన్నారు.
Nithiin is currently in a struggling phase. His last films Robinhood and Thammudu were made on massive budgets and the failures of these films have done enough damage for Nithiin’s career. The actor is on a break and is lining up several projects. There are a lot of speculations about his upcoming movies being shelved […] The post Nithiin takes up Ishq 2 appeared first on Telugu360 .
మావోయిస్టులను ఫేక్ ఎన్కౌంటర్స్ చేయడం విచారకరం
కేంద్ర విధానాలు జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మన తెలంగాణ / హైదరాబాద్ : మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని ఆయనన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారని కూనంనేని పేర్కొన్నారు. మాడేరుమిల్లులో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్, అంతకు ముందు మావోయిస్టులపై జరిగిన ఎన్కౌంటర్స్ మొత్తం ఫేక్ ఎన్కౌంటర్స్ అని కూనంనేని తెలిపారు. బూటకపు ఎన్ కౌంటర్స్తో మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. మావోయిస్టులు ఏదైన నేరాలు చేసివుంటే వారిని అరెస్టు చేసి చట్టభద్దంగా విచారణ జరిపించాలని, ఇలాంటి ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం విచార కరమని అన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
Andhra King Taluka Trailer: Ram’s Nata Vishwaroopam
Andhra King Taluka, starring Energetic Star Ram Pothineni and Bhagyashri Borse, with Upendra in a pivotal role, is riding high on expectations. The songs, teaser, and promotional material have already created a strong buzz everywhere. Now, the makers have unveiled the trailer at a grand public event in Kurnool. The trailer showcases a fresh concept […] The post Andhra King Taluka Trailer: Ram’s Nata Vishwaroopam appeared first on Telugu360 .
Sameer Wankhede wins over Aryan Khan’s The Bads of Bollywood
It all started after Sameer Wankhede arrested Shah Rukh Khan’s son Aryan Khan in a drugs case. Years after this, Aryan Khan directed The Bads of Bollywood backed by Netflix. Sameer Wankhede has approached the court saying that the show has defamed him. The Delhi High Court has now supported Sameer Wankhede and his legal […] The post Sameer Wankhede wins over Aryan Khan’s The Bads of Bollywood appeared first on Telugu360 .
Cartoon 19 Nov 2025 |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
Cartoon 19 Nov 2025 | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా Cartoon
రిజర్వేషన్లపై విచారించి... సుప్రీంను అభ్యర్థించాలి : బిసి కమిషన్
రిజర్వేషన్లు 50 శాతం పరిమితిపై ... విస్తృత ధర్మాసనంలో విచారించేందుకు సుప్రీంను అభ్యర్థించాలి : బిసి కమిషన్ మన తెలంగాణ / హైదరాబాద్ : రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న 5 గురు జడ్జిల బెంచ్ ఇచ్చిన తీర్పును వెంటనే ఛాలెంజ్ చేస్తూ 7 గురు జడ్జిల విస్తృత ధర్మాసనం విచారించి బిసిలకు న్యాయం చేసేలా సుప్రీంకోర్టును అభ్యర్థించాలని రాష్ట్ర బిసి కమిషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో బిసిలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు కల్పించి, ఆ దిశలో తీవ్రంగా ప్రయత్నించి చివరకు బిసిల ఆశలపై నీళ్ళు చల్లే విధంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం లోపు కల్పించే విధంగా నిర్ణయించడం ఆత్మహత్యాసదృశ్యమని బిసి కమిషన్ అభిప్రాయపడింది. పరిస్థితులకనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు జరిగాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి. ఆర్. గవాయ్ అమరావతిలో జరిగిన ఒక సమావేశంలో చెప్పిన విషయాన్ని బిసి కమిసన్ గుర్తు చేసింది. భారత రాజ్యాంగం స్థిరంగా ఉండే పత్రం కాదని, పరిస్థితులకు, సహజ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణకు అధికరణ 308 ద్వారా వెనులుబాటు కల్పించారని, సాంఘిక, ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొనే క్రమంలో పార్లమెంట్ రాజ్యాంగ సవరణలు చేస్తుందని, బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో అటు సుప్రీంకోర్టులో ఇటు హైకోర్టులో జరుగుతున్న వాద ప్రతివాదనలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు కనువిప్పు కలిగించాలన్నారు. కె. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (11 మే 2010) కేసులో 5 గురు జడ్జిల బెంచ్ రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువగా ఉండొద్దన్న తీర్పును ఆధారంగా చేసుకొని, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇది కాలానుగుణమైన మార్పులను పరిగణలోకి తీసుకోకుండా జరుగుతున్న వాదనలని, బిసిలకు గొడ్డలిపెట్టుగా మారుతున్న విషయం గమనించాలన్నారు. వ్యయ ప్రయాసలతో నిర్వహించిన ఇంటింటి సర్వే బిసిల వెనుకబాటుతనాన్ని గుర్తించిన విషయాన్ని ఏమాత్రం లెక్కపెట్టకుండా 5 గురు జడ్జిలతో కూడిన తీర్పునే ఉటంకిస్తూ అడ్డుకోవడం క్షంతవ్యం కాదన్నారు. రాజకీయ కారణాలతో బిసి బిల్లులను 9వ షెడ్యూలులో పెట్టకపోవటం దురదృష్టకరమని, ఇది బిసిలకు తీవ్రమైన అన్యాయం చేసే చర్యగా భావించాల్సివస్తోందని నిరంజన్ అన్నారు.
సివిల్స్ అభ్యర్థులకు రెండో విడత రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ప్రోత్సాహకం
* తెలంగాణకు చెందిన అభ్యర్థులందరూ అర్హులే * గతంలో దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు అవకాశం * సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడి మన తెలంగాణ / హైదరాబాద్ : సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు శుభవార్త. సింగరేణి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకంలో భాగంగా సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం కోసం అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మంగళవారం తెలిపారు. ఈ పథకంలో భాగంగా గతంలో మెయిన్స్ కు ఎంపికై ఇప్పటికే లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందుకున్న వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదని, తెలంగాణకు చెందిన ఇతర అభ్యర్థులు ఎవరైనా ఇంటర్వ్యూలకు ఎంపికైతే వారికి కూడా ఈ ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. సమాచారం లేకపోవడం వల్ల తాము దరఖాస్తు చేసుకోలేదని, సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యామని, తమకు ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారని, ఈ నేపథ్యంలో వారికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సంబంధిత అభ్యర్థులు తమ దరఖాస్తులను, వివరాలను ఈ నెల 21వ తేదీ లోపు హైదరాబాద్ సింగరేణి భవన్ లో అందజేయాలని కోరారు. త్వరలో అర్హులందరికీ రెండో విడత లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. యువతకు చేయూతగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం : గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం ద్వారా మొదటగా మెయిన్స్ కు ఎంపికైన 140 మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందచేయగా వారిలో 20 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని సీఎండీ బలరామ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మందికి మరో విడతగా రూ.లక్ష చొప్పున సాయం అందించగా వారిలో ఏడుగురు విజేతలుగా నిలిచారని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచిన 11వ ర్యాంకర్ కూడా ఇందులో ఉన్నారని వివరించారు. ఈ ఏడాది ప్రిలిమ్స్ పాసైన 202 మందికి ఆర్థిక చేయూత అందించగా 43 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని వెల్లడించారు.
మంచి భవిష్యత్తు కోసం వైద్య విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి
వైద్య విద్యార్థులకు, యువతకు మంత్రి అడ్లూరి పిలుపు మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్టాన్ని మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని ఎస్సి, ఎస్టి, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. డ్రగ్స్కు దూరంగా జీవిత లక్ష్యాలకు దగ్గరగా అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి, యువకుడి వద్దకు చేరేలా సమగ్రమైన అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మంగళవారం గాంధీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట దివ్యాంగులు వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధకారిత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నషాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాదకద్రవ్యాల దుష్ప్రభాలపై మంత్రి అడ్లూరి ప్రసంగించారు. యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా చదువు, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం వైపు దృష్టి సారించేలా ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాల నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో డ్రగ్ సరఫరా మార్గాలను పూర్తిగా నిర్మిలించడానికి ప్రవేశపెట్టిన ఈగల్ స్పెషల్ యూనిట్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నగరాల్లో, విద్యాసంస్థల పరిసరాల్లో, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో డార్క్నెట్ ద్వారా జరిగే లావాదేవీలపై ఈగల్ టీమ్ నిరంతరం నిఘా పెడుతోందని చెప్పారు. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, డేటా విశ్లేషణ, వేగవంతమైన ఆపరేషన్లతో ఈ వ్యవస్థ రాష్ట్ర పోలీసింగ్ విధానాన్ని కొత్త దిశగా నడిపించిందన్నారు. డ్రగ్ మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. మత్తు వ్యసనం వ్యక్తిగత అలవాటు కాదని, ఇది కుటుంబాలను కూల్చివేసే ఒక అగ్నికీల అని మంత్రి పేర్కొన్నారు. యువత రక్షణ తెలంగాణ భవిష్యత్తు రక్షణేనని ఆయన వ్యాఖ్యానించారు. యువత కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, కళాశాలల్లో కౌన్సెలింగ్ సేవలు, స్పోర్ట్ కల్చరల్ ఈవెంట్లు, డ్రగ్ ఫ్రీ క్యాంపెయిన్లు, మారథాన్లు నిర్వహిస్తూ సానుకూల వాతావరణం ఏర్పడుతోందన్నారు. డ్రగ్స్కు దూరంగా, కెరీర్కు దగ్గరగా, విజయాలకు దగ్గరగా, భవిష్యత్తుకు దగ్గరగా అనే నినాదాన్ని విద్యార్థి జీవన సూత్రంగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ కొద్ది రోజుల ‘కిక్’తో మొదలై, భవిష్యత్తును చీకటిలోకి నెట్టేస్తుందని, మనం చూస్తున్న కేసుల్లో అనేక మంది విద్యార్థులు అలవాటు బారిన పడి చదువు, అవకాశాలు, కుటుంబాలను కోల్పోతున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ భవిష్యత్తు పై ఒక పెద్దముప్పుగా పరిణమించిందన్నారు. ప్రవర్తనలో మార్పులు, అర్థరాత్రి తిరగడం, కొత్త అలవాట్లు ఇవన్నీ మత్తు వ్యసన సూచనలుగా కనిపిస్తాయని, వెంటనే కౌన్సెలింగ్కు తీసుకెళ్లాలని సూచించారు. విద్యాసంస్థల్లో ప్రత్యేక క్లబ్లు ఏర్పాటు చేసి విద్యార్థులపై నిఘా కొనసాగించాలని సూచించారు. మత్తు నిరోధక చర్యల్లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఎమ్బిఎ కమిటీలు ఏర్పాటు చేసి, పాఠశాలలు-, కళాశాలల్లో క్లబ్లు స్థాపించామని మంత్రి వివరించారు. ఇప్పటివరకు 15,891 విద్యాసంస్థల్లో 7,018 కార్యక్రమాల ద్వారా 1.45 కోట్ల మందికి అవగాహన కల్పించామన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ అవగాహన కార్యక్రమమని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. యువత పునరావాసానికి ప్రత్యేక చర్యల్లో భాగంగా సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్లో పిల్లల కోసం డీ- అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు, చెర్లపల్లి, నిజామాబాద్, చంచల్గూడ, సంగారెడ్డి జైళ్లలో ప్రత్యేక చికిత్సా సేవలు ప్రారంభించామని తెలిపారు. పది జిల్లాల్లో ఎన్జిఓలతో కలిసి పునరావాస కేంద్రాలు, త్వరలో పన్నెండు జిల్లా ఆసుపత్రుల్లో కొత్త చికిత్సా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. మాదక ద్రవ్య రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం, -సమాజం-, యువత కలిసి ముందుకు సాగాలి అని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదకద్రవ్యాల నిరోధక 2025 ప్రతిజ్ఞను వైద్య విద్యార్థులచేత చేయించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో సేవలందిస్తున్న వాలంటీర్లను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన నాటక ప్రదర్శన, ఆటలు,పాటలు యువతలో మత్తు వ్యసనంపై అవగాహన కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, టిజి ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సీనియర్ సిటిజన్, ట్రాన్స్జెండర్ విభాగం డైరెక్టర్ శైలజ, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, గాంధీ హాస్పిటల్ సూపరిండెంటెంట్ డాక్టర్ వాణి, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పి సీతారాం తదితరులు పాల్గొన్నారు.
బనకచర్ల ప్రాజెక్టును ఏ రూపంలో నిర్మాణం చేపట్టాలనుకున్నా ప్రతిఘటిస్తాం
కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోను అనుమటించొద్దు ఆల్మట్టి ఎత్తు పెంచితే సహించేది లేదు ఎత్తు పెంచకుండా కర్ణాటకను నిలువరించండి కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ భేటీ కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ఏ రూపంలో నిర్మించాలనుకున్న ప్రతిఘటిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ మట్టి ఎత్తు పెంపు తెలంగాణాకు నష్ట దాయకమని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తు పెంపుకు అనుమతులు ఇవ్వదద్దని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎపి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వవద్దని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్lను కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం విలేఖరులతో మాట్లాడారు. 45 టీఎంసీలు వెంటనే కేటాయించండి : కొంత కాలం నుంచి జల్ శక్తి మినిస్ట్రీలో తెలంగాణకు చెందిన అంశాలు పెండింగ్లో ఉన్నాయని, కేంద్రమంత్రిగా చొరవ చూపి వాటిని త్వరగా పరిష్కరించాలని కోరామని ఉత్తమ్కుమార్రెడ్డి వివరించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు మొత్తం 90 టీఎంసీల నీటి కేటాయింపు అడిగామని, వాటిల్లో 45 టీఎంసీల నీటిని వెంటనే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు కేటాయించాలని అడిగామన్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్తో సహా సీడబ్ల్యూసీ ఛైర్మన్ కూడా ఉన్నారని, వారికి కూడా ఇదే విషయాన్ని చెప్పామన్నారు. ఈ అంశం మీ దగ్గరే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉందని చెప్పామని, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు మొదటి 45 టీఎంసీల నీటిని వెంటనే కేటాయించాలని రిక్వెస్ట్ చేయడం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సమ్కక్క- సారక్క ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వండి : గోదావరి జలాల్లో సమ్కక్క- సారక్క ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను సబ్మిట్ చేశామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పారు. సీడబ్ల్యూసీకి అనేక సందర్భాల్లో వారు అడిగిన వివరాలు ఇచ్చామని, ఇప్పటికే చాలా సమయం గడిచిపోయిందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని క్లియరెన్స్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని, దాని పూర్తి వివరాలు మళ్లీ సమర్పించామన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ (కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్- 2) ఏపీ-తెలంగాణ మధ్య 811 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు డివైడ్ చేయాలని, దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా చాలా స్లోగా వెళ్తున్నాయన్నారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చొరవ చూపి జస్టిస్ బ్రిజేష్ను రిక్వెస్ట్ చేసి ఈ ప్రొసీడింగ్స్ను వేగవంతంగా ఫైనలైజేషన్ చేయించాలని కోరామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పోలవరం...బనకచర్లకు మేము వ్యతిరేకం :’ఆంధ్రప్రదేశ్ పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజుబులిటీ రిపోర్ట్ను సబ్మిట్ చేసిందని, దాన్ని తాము వ్యతిరేకించామని ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్పారు. అది చాలా స్పష్టంగా గోదావరి వాటర్ డిస్ప్యూట్ 1980 అవార్డులో ఫ్లడ్ వాటర్ కేటాయించడానికి ఎవరికీ ఎటువంటి ఆస్కారం లేదనే విషయాన్ని అప్పుడు కూడా పాయింటవుట్ చేశామని వివరించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టర్మినల్ ఫేజ్ మార్చి, ప్రాజెక్టు పేరు మార్చి తిరిగి గోదావరి ఫ్లడ్ వాటర్ స్పేర్పై మరోసారి కేంద్రానికి వస్తున్న సందర్భంగా తాము దీనికి కూడా వ్యతిరేకం అని చెప్పామని, స్పష్టంగా, లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రికి వివరించామన్నారు. ఈ ప్రాజెక్టు ఇల్లీగల్ అని స్పష్టంగా చెప్పామని, ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఆ రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో కేంద్రమంత్రికి తెలియచేశామని, దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దని చెప్పామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు..ఆదేశాలు ఇవ్వండి : ఆల్మట్టి డ్యాం 519 మీటర్ల కంటే ఎత్తు పెంచవద్దని సుప్రీంకోర్టులో స్టే ఉందని, ఈ స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసి, జీవో ఇచ్చి ఎత్తు పెంచడానికి భూసేకరణ కోసం ప్రొసీడింగ్స్ ఇచ్చిందన్నారు. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, ఇది చట్ట వ్యతిరేకం అని, కేంద్ర ప్రభుత్వంగా మీరు కూడా కర్ణాటక ప్రభుత్వానికి చెప్పండని విజ్ఞప్తి చేసినట్లు ఉత్తమ్కుమర్రెడ్డి తెలిపారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ అన్యాయం జరుగుతుందని, అందుకే దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పామని మంత్రి వివరించారు. ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి : గత 22 నెలల నుంచి కేంద్ర ఫండింగ్ ఇరిగేషన్ కోసం అడిగామని, ఇప్పటివరకు ఫండింగ్ ఇచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని గతంలో తాను, సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చెప్పామని, ఆ సూచన మేరకు దేవాదుల ప్రాజెక్టు మినహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము కొన్ని ప్రాజెక్టులను లిస్టవుట్ చేశామని, వాటికి సీడబ్ల్యూసీ నుంచి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇప్పించాలని కోరినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు, నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, పాలమూరు -రంగారెడ్డి లిఫ్ట్, , చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మోదికుంట వాగు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు అడిగామనిని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా నది నీటిని ఎవరూ ఎక్కువ డైవర్ట్ చేయవద్దని, దుర్వినియోగం చేయవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వివరించారు. దీనిపై కేఆర్ఎంబీకి అధికారం ఇచ్చారని, అయితే గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదన్నారు. తాము వచ్చిన తర్వాత పదేపదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, కేఆర్ఎంబీకి నిధులు ఇచ్చి టెలిమెట్రీ స్టేషన్ ఇన్స్టాలేషన్లలో కొంత ప్రొగ్రెస్ తీసుకువచ్చామన్నారు. ఫేజ్-1 కింద 18 టెలిమెట్రీ స్టేషన్లు ఇన్స్టాల్ అయ్యాయని, ఫేజ్-2 కింద మరో 9 చేయాల్సి ఉందన్నారు. ఫేజ్-3 కింద 11 టెలిమెట్రీ స్టేషన్ ఇన్స్టాలేషన్ చేయాల్సి ఉందని, ఫేజ్-2, ఫేజ్-3కి సంబంధించి కేఆర్ఎంబీకి ఆదేశాలు ఇచ్చి వేగవంతంగా పూర్తి చేయాలని కోరినట్లు వివరించారు. అప్పుడు ఏ రాష్ట్రం ఎంత కృష్ణా నది నీటిని వాడుకుంటుందో స్పష్టంగా తెలుస్తుందని చెప్పామని, అంతర్రాష్ట్ర వివాదాలు తగ్గుతాయని కేంద్రమంత్రికి వివరించామన్నారు. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కేఆర్ఎంబీకి, ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తామని చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీడబ్ల్యూసీ ఛైర్మన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కేంద్రమంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీడబ్ల్యూసీ ఛైర్మన్తో సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు అత్యంత వెనుకబడ్డ జిల్లాలో ఉందన్నారు. 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వెంటనే కేటాయించాలని, ట్రిబ్యునల్ కేటాయింపు కోసం చూడకుండా మైనర్ ఇరిగేషన్ కోసం 45 టీఎంసీల నీరు కేటాయించాలని కోరారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు టిఎసి, ఐటిసి అనుమతులు ఇవ్వాలని, తెలంగాణ -ఆంధ్రా మధ్య కృష్ణా నీటి పంపకాలు ట్రిబ్యునల్ ద్వారా త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం గోదావరి వరద జలాలు వినియోగం సాధ్యం కాదని, ఇదే అంశాన్ని సీడబ్ల్యూసీ ఛైర్మన్కి తెలిపామని వివరించారు. తెలంగాణ నీటి పారుదల రంగానికి ఎక్కువ నిధులు ఖర్చు చేసే రాష్ట్రం అని, తెలంగాణ ప్రాజెక్టులకు పిఎంకెఎస్వై కింద 2026 - 2031 వరకు ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. టెలీ మెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు ఏపీ ముందుకు రాకపోతే తామే పూర్తి నిధులు వెచ్చిస్తామని కేంద్ర మంత్రికి తెలిపామని వివరించారు. ఏపీ టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు ఇవ్వడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ శశాంక్ గోయెల్, నీటిపారుదల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
12 ఏళ్ల బాలుడికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి
విషపూరితమైన కలుపు మందు తాగిన అతి పిన్న వయస్కుడికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి * 12 ఏళ్ల మాస్టర్ అనురాగ్ సందీప్కు బైలాటరల్ లోబార్ లాంగ్ ట్రాన్స్ ప్లాంట్తో సరికొత్త జీవితం * ప్రపంచంలోనే అరుదైన ‘డబుల్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్’తో చరిత్ర సృష్టించిన యశోద ఆసుపత్రి మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ వైద్య చరిత్రలో యశోద ఆసుపత్రి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అవయవమార్పిడి ఆపరేషన్ల తో దేశంలోనే ముందున్న యశోద ఆసుపత్రి ఇపుడు ప్రమాదవశాత్తూ పారాక్వాట్ పాయిజన్ (విషపూరితమైన కలుపు మందు) తాగిన అతి పిన్న వయస్కుడికి ప్రపంచంలోనే మొదటిసారిగా విజయవంతంగా (బైలాటరల్ లోబార్ లాంగ్ ట్రాన్స్ ప్లాంట్) ఊపిరితిత్తుల మార్పిడి చేసి సరికొత్త చరిత్ర నృష్టించింది. పెద్దపల్లి జిల్లా, ఓదెల గ్రామానికి చెందిన రైతు సతీష్ కుమార్, సుమలతల కొడుకు ఆరవ తరగతి చదువుతున్న 12 ఏళ్ల అనురాగ్ సందీప్ ప్రమాదవశాత్తూ పారాక్వాట్ పాయిజన్ తాగి ప్రాణాపాయస్థితిలో ఉన్న అనురాగ్ సందీప్ కు యశోద హాస్పిటల్స్ విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడిని నిర్వహించి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే విషం (పురుగు మందు) తాగిన అతి పిన్న వయస్కుడికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన మెట్టమొదటి కేసు. ఈ సందర్బంగా యశోద ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి వైద్యులను అభినందించారు. యశోద ఆసుపత్రి ఊపిరితిత్తుల వైద్య నిపుణుల బృందం - డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్, డాక్టర్ చేతన్ రావు, డాక్టర్ పంక్తి శేత్, డాక్టర్ రమ్య రెడ్డి ఊపిరితిత్తుల మార్పిడి సర్జన్లు డాక్టర్. కె.ఆర్. బాలసుబ్రమణియన్, డాక్టర్. మంజునాథ్ బేల్ చేత బైలాటరల్ లోబార్ లాంగ్ ట్రాన్స్ ప్లాంట్ యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీలో విజయవంతంగా నిర్వహించారు. తీవ్ర ప్రాణాపాయంలో ఉన్న 12 ఏళ్ల మాస్టర్ అనురాగ్ సందీప్ కు బైలాటరల్ లోబార్ లాంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్తో సరికొత్త జీవితాన్ని అందించడంద్వారా ప్రపంచ వైద్యరంగం-ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ రంగంలో చరిత్ర సృష్టించడం మన తెలుగు రాష్టాలకు ఎంతో గర్వకారణమన్నారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రి సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్. విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ ప్రాణాపాయస్థితిలో తమ దగ్గరకు వచ్చిన మాస్టర్ అనురాగ్ సందీప్ కు వెంటనే అధిక ప్రవాహ ఆక్సిజన్ చికిత్స, ద్వితీయ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చికిత్సకు తగిన యాంటీబయాటిక్స్ ఇచ్చామని, ఇచ్చిన చికిత్సతో, అతని కాలేయం, మూత్రపిండాలు క్రమంగా సాధారణ స్థాయికి తిరిగి వచ్చాయన్నారు. మెకానికల్ వెంటిలేటర్పై వైద్యం అందించి ఆ తర్వాత అదనపు కార్పోరల్ సపోర్ట్ కి మార్చడం జరిగిందని, అతను 2 వారాల పాటు ఎక్మో మద్దతు పొందినప్పటికీ అతనిలో ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో ఊపిరితిత్తుల మార్పిడి కోసం పరిగణించబడ్డాడన్నారు. కుటుంబ సభ్యులతో వివరణాత్మక, విస్తృతమైన కౌన్సెలింగ్ తర్వాత, రోగిని అత్యవసరంగా ఊపిరితిత్తుల మార్పిడి కోసం జాబితా చేయబడిందని వివరించారు. తెలంగాణ స్టేట్ జీవన్ దాన్ సంస్థ అవయవ దానం చొరవలో భాగంగా బ్రెయిన్ డెడ్ అయిన రోగి (దాత) నుండి సేకరించిన ఊపిరితిత్తులను విజయవంతంగా ట్రాన్స్ ప్లాంట్ చేయడం జరిగిందని చెప్పారు. దాత నుండి సేకరించిన ఊపిరితిత్తులను 12 ఏళ్ల రోగికి సరిపోయే విధంగా అదనపు భాగాన్ని ఎంతో ఖచ్చితత్వంతో తొలగించి ట్రాన్స్ ప్లాంట్ చేయవలసి ఉంటుందని, అందుకోసం యశోద హాస్పిటల్స్ యొక్క బహుళ విభాగ సమర్థులైన మార్పిడి వైద్య బృందం చేతుల్లో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందన్నారు.
‘పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్’లో రోల్ మోడల్ గా తెలంగాణ
* ఏటా 10 లక్షల మంది యువతకు ‘ఏఐ’పై శిక్షణ * మా దృష్టిలో టెక్నాలజీ అంటే ఒక సమానత్వ సాధనం * ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’లో ఇతర రాష్ట్రాలకు బెంచ్ మార్క్ * ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్’ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మన తెలంగాణ / హైదరాబాద్ : ‘పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఏటా 10 లక్షల మంది తెలంగాణ యువతను ‘ఏఐ’ నిపుణులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మెటా, మీ సేవ సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్’ను మంగళవారం బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణాలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘గవర్నెన్స్’ అంటే కేవలం నాలుగు గోడల మధ్య పాలించడం కాదన్నారు. రాచరిక పోకడలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసేలా వ్యవహరించిందన్నారు. ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేస్తూ క్నాలజీ సాయంతో పౌర సేవలను వారి ముంగిటకే చేరుస్తూ ‘గుడ్ గవర్నెన్స్’వైపు అడుగులు వేస్తున్నామన్నారు. మా ప్రభుత్వం టెక్నాలజీని కేవలం సాఫ్ట్ వేర్ గా మాత్రమే చూడటం లేదని, ఒక సమానత్వ సాధనంగా చూస్తున్నామన్నారు. టెక్నాలజీ ఫలాలను రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న చివరి వ్యక్తి వరకూ చేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్ ఛేంజ్, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, తెలంగాణ ఇన్నోవేషన్ హబ్ తో ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’లో తెలంగాణ ఒక బెంచ్ మార్కెట్ ను సెట్ చేస్తోందన్నారు. తాజాగా ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించేలా మీ సేవ ద్వారా అందించే 580కు పైగా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన పౌర సేవలను ఫింగర్ టిప్స్ పై వాట్సాప్ లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ డిజిటల్ యుగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జెన్ ఏఐ, మొబైల్ ఫస్ట్ అప్రోచ్ ద్వారా పౌర సేవల డెలివరీ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత ‘తెలంగాణ’కే దక్కిందన్నారు. త్వరలోనే తెలుగు, ఉర్దూలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఇతర ప్రభుత్వ విభాగాలకు ఈ వాట్సాప్ సేవలను విస్తరిస్తామన్నారు. టైప్ చేయాల్సిన అవసరం లేకుండా వాయిస్ కమాండ్ తోనే అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, మీ సేవ కమిషనర్ రవి కిరణ్, మెటా ప్రతినిధి నటాషా తదితరులు పాల్గొన్నారు.
చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించండి
తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో 2047 రోడ్ మ్యాప్ అన్ని రకాల పాలసీలను ఇందులో ప్రకటిస్తాం భవిష్యత్తుకు సిద్ధమయ్యే తెలంగాణను నిర్మిద్దాం హ్యామ్ రహదారుల నిర్మాణంతో మారనున్న రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం భారీ స్థాయిలో 2047 తెలంగాణ రైజింగ్ ఉత్సవాలు 47వ ఎస్ఎల్ బిసి త్రైమాసిక సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మన తెలంగాణ / హైదరాబాద్ : బ్యాంకర్లు కార్పొరేట్ సంస్థలతోపాటు స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ మధ్యతరహా, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఈ రెండు రంగాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతోపాటు సంపద సృష్టించబడుతుందని తద్వారా జిడిపి పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2047 తెలంగాణ రైజింగ్ ఉత్సవాలను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనుంది. ఇందులో అన్ని రకాల పాలసీలను ప్రకటిస్తామని ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన బ్యాంకర్స్ 47వ త్రైమాసిక సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా 13 శాతం జీడీపీ పెరుగుదల టార్గెట్ గా 2047 రోడ్ మ్యాప్ ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యుత్తు సరఫరా లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. మొదటి సంవత్సరం ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందో వివరించారు. రెండో సంవత్సరం చేసిన కార్యక్రమాలు వివరించడంతోపాటు రాష్ట్రం పట్ల మా కల ఏంటి, ఆ కలను సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నామనేది తెలంగాణ రైజింగ్ ఉత్సవంలో వివరించబోతున్నామని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ అనేక ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం, మూసీ పునర్జీవం వంటి అంశాలను వివరించి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడి దారులను ఆకర్షించబోతున్నామని తెలిపారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యూహాత్మకంగా, వాతావరణం, భాష, భూమి, తక్కువ ధరలకే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, బలమైన విద్యుత్ సరఫరా వ్యవస్థ వంటి అంశాలను వివరించి పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు తెలిపారు. విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి : రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిందని బ్యాంకర్లు సిఎస్ఆర్ నిధులను చీఫ్ సెక్రటరీ మొదలు కలెక్టర్ వరకు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని సంప్రదించి ఈ రంగాల్లో నిధులను ఖర్చు చేయాలని సూచించారు. విద్యను ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, డిజిటలైజ్ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఇప్పుడు కీలకమైన అభివృద్ధి దశలో ప్రవేశిస్తోందని, ఈ పరివర్తనలో బ్యాంకింగ్ రంగం ముందు వరుసలో ఉండాలని డిప్యూటీ సీఎం కోరారు. బ్యాంకులు ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 49.45% ప్రాధాన్య రంగ రుణాలను సాధించాయి. క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 130.18%గా ఉండటం తెలంగాణ ఆర్థిక ప్రయాణంపై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తుందనీ తెలిపారు. ఈ వేగం ప్రోత్సాహకరం, కానీ ఇదే సమయంలో మనం మరింత ఎత్తుకు చేరే బాధ్యత కూడా మనపై ఉందని గుర్తు చేశారు. వ్యవసాయ మౌలిక వసతుల నిధి కింద మంచి పురోగతి సాధించామని, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిజంగా మార్పు చేయాలంటే పంట కోత తర్వాత మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, సూక్ష్మ పంట నీరు, మరియు అనుబంధ రంగాల్లో బ్యాంకు రుణాలను మరింతగా పెంచాని బ్యాంకర్లకు సూచించారు. పంట రుణాలు సమర్థవంతంగా అందుతున్నప్పటికీ, వ్యవసాయ టర్మ్ లెండింగ్ అవసరానికి తగ్గట్లు లేదన్నారు. ఇది రైతులు ఆధునీకరించుకోవడం, వైవిధ్యం చేర్చుకోవడం, ఆత్మనిర్భర స్థాయి నుంచి సంపన్న స్థాయికి చేరడం సహాయపడదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ఈ లోటును బ్యాంకులు అత్యవసరంగా భర్తీ చేయాలని కోరుతున్నానన్నారు. విభిన్న పంటలకు బ్యాంకులు మద్దతు ఇవ్వాలి : తెలంగాణలో వరి ఉత్పత్తి అద్భుతం అని, కానీ ఇప్పుడు పరిమాణం నుంచి విలువ వైపు అడుగులు వేయాలన్నారు. భవిష్యత్ ఆదాయాలను భద్రపరిచే పామాయిల్ తో పాటు ఇతర విభిన్న పంటలకు బ్యాంకులు ఎక్కువ మద్దతు ఇవ్వాలని కోరుతున్నానన్నారు. మహిళా సంఘాల సభ్యులు కేవలం లబ్ధిదారులు మాత్రమే కాదని, వారు ఇప్పుడు వ్యాపారవేత్తలుగా, సంస్థల నాయకులుగా ఎదుగుతున్నారన్నారు. అయితే కొన్ని జిల్లాల్లో ఇంకా ఎస్హెచ్జీ రుణాలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడం లేదని, మహిళలు తమ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించేందుకు ఎక్కువ పరిమితులు, వేగవంతమైన రీపీట్ ఫైనాన్స్ అందించాన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ఒక శక్తివంతమైన వేదిక అని, దీనిని పూర్తిస్థాయిలో వినియోగించి మహిళా ఆధారిత ఆర్థిక మార్పును వేగవంతం చేయాలని బ్యాంకులను కోరుతున్నానన్నారు. ఎంఎస్ఎంఈలు తెలంగాణలో ఉపాధి, ఆవిష్కరణలకు వెన్నెముకగా నిలుస్తున్నాయని ఇప్పటివరకు ఎంఎస్ఎంఈల కోసం ఏసీపీ లక్ష్యాలలో 50.23 శాతం సాధించినప్పటికీ, వర్కింగ్ క్యాపిటల్ కొరతలు, రుణాల ప్రక్రియలో ఆలస్యం వల్ల సంస్థలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. సీజిటిఎంఎస్ఈ, డిజిటల్ అసెస్మెంట్ పద్ధతులను మరింతగా వినియోగించి, క్లస్టర్ ఆధారిత రుణ వ్యూహాలను అనుసరించాలని కోరుతున్నానని చెప్పారు. భరోసాతో కూడిన, బలమైన ఎంఎస్ఎంఈ వ్యవస్థ వచ్చే దశాబ్దం తెలంగాణ రైజింగ్కు పునాది అని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. వచ్చే దశాబ్దం తెలంగాణ రైజింగ్కు పునాది : 13,000 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణం, ఒక రూపాంతర కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోందని భట్టి వివరించారు. ఇది రాష్ట్ర ఆర్థిక పటాన్ని సమూలంగా మారుస్తుందని, దీనిని బ్యాంకులు ప్రాధాన్య రంగ రుణ అవకాశంగా చూడాలని కోరుతున్నానన్నారు. ప్రస్తుతం మౌలిక వసతుల ఫైనాన్సింగ్లో పాల్గొనడం రాష్ట్ర అవసరాలకు సరిపడడం లేదని, తెలంగాణ అభివృద్ధిలో తన నేతృత్వాన్ని కొనసాగించాలంటే బ్యాంకులు ఇక్కడ మరింత బలమైన పాత్ర వహించాలని సూచించారు. ప్రధానంగా పీఎంజెడీవై శాతం, బీమా కవరేజ్, గ్రామ పంచాయతీల్లో బీసీల లభ్యత వంటి అంశాలను వివరించారు. ఈ లోటును వేగంగా భర్తీ చేయాలని డిప్యూటీ సీఎం బ్యాంకర్లను కోరారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థల్లో ఆన్బోర్డింగ్ను వేగవంతం చేసి, చివరి మైలు డెలివరీని బలోపేతం చేయాలని కోరుతున్నానని, తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు రాష్ట్రం సిద్ధమవుతోందని, మన దృష్టి, రాబోయే దశాబ్దానికి గాను రోడ్మ్యాప్ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నామన్నారు. గ్రామీణ పరివర్తనం, బలమైన ఎంఎస్ఎంఈ క్లస్టర్లు, అధిక విలువ కలిగిన తయారీ, డిజిటల్ పరిపాలన, గ్రీన్ గ్రోత్ ఇవి తదుపరి దశకు దారి తీసే రంగాలని వివరించారు. దీని కోసం బ్యాంకులు లావాదేవీ విధానం నుంచి రూపాంతరక భాగస్వామ్యం వైపు మారాలి. తెలంగాణ స్థిరత్వం, ఆశయం, అవకాశాలను అందిస్తోంది అని వివరించారు. ఈ ఆశయానికి తగినంత ధైర్యవంతమైన క్రెడిట్ విస్తరణ, నవీన ఆర్థిక పరిష్కారాలతో మనం సిద్ధంగా ఉన్నామా అనేది ప్రధానమన్నారు. ఆత్మవిశ్వాసం, సమిష్టి కర్తవ్యంతో ఒక ఆధునిక, సమగ్ర, భవిష్యత్ సిద్ధ తెలంగాణను నిర్మిద్దామిని, తదుపరి దశాబ్దాన్ని తెలంగాణ చరిత్రలో అత్యంత రూపాంతరక కాలంగా మలుద్దామని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.
Dollars 10 |బాసర హుండీ ఆదాయం 43 లక్షలు
Dollars 10 | బాసర హుండీ ఆదాయం 43 లక్షలు Dollars 10
10 lakh |ఏటా పది లక్షల మందికి ‘ఏఐ’పై శిక్షణ
10 lakh | ఏటా పది లక్షల మందికి ‘ఏఐ’పై శిక్షణ 10
Medaram | 250 మంది చిరు వ్యాపారస్తులు
Medaram | 250 మంది చిరు వ్యాపారస్తులు Medaram | తాడ్వాయి, ఆంధ్రప్రభ
CM Revanth |వ్యవసాయ మార్కెట్లకు రండి.. రైతుల కష్టాలు చూడండి
CM Revanth | వ్యవసాయ మార్కెట్లకు రండి.. రైతుల కష్టాలు చూడండి CM
Akhanda 2 Jajikaya Song: Instant Chartbuster
Akhanda 2 starring God of Masses Nandamuri Balakrishna, Samyuktha, Aadhi Pinisetty in the direction of Boyapati Srinu, is the most anticipated Pan-Indian movie. The movie teaser and first single, Thaandavam, created such high impression that entire Indian audiences are waiting for the film eagerly. Now, the makers have released the second single, Jajikaya Jajikaya, in […] The post Akhanda 2 Jajikaya Song: Instant Chartbuster appeared first on Telugu360 .
Clues Team | 8 తులాలు వెండి చోరీ
Clues Team | 8 తులాలు వెండి చోరీ Clues Team |
Call 100 | 100కు గానీ, 1908కి గానీ…
Call 100 | 100కు గానీ, 1908కి గానీ… Call 100 |
Temple |వైభవంగా మాస కల్యాణోత్సవం
Temple | వైభవంగా మాస కల్యాణోత్సవం Temple | మునుగోడు, ఆంధ్రప్రభ :
127 Sheep |పశువులకు ఉచిత వైద్యం…
127 Sheep | పశువులకు ఉచిత వైద్యం… 127 Sheep | కమ్మర్
18 Days |వేటాడి చంపిన నిందితులకు రిమాండ్..
18 Days | వేటాడి చంపిన నిందితులకు రిమాండ్.. 18 Days |
కేజీఎఫ్, సలార్లకు మించి.. ఎన్టీఆర్ కొత్త చిత్రం#TeluguPost #telugu #post #news
After AP, now Telangana laps up Whatsapp Governance
The bonding between the Chief Ministers of both the Telugu states is well known. At the same time, the competition between two states in case of leveraging and utilising technology for public good, is also equally prominent. Taking a cue from Andhra Pradesh, now Telangana has also lapped up Whatsapp governance. Telangana Government launched Whatsapp […] The post After AP, now Telangana laps up Whatsapp Governance appeared first on Telugu360 .
Accident |గీతకార్మికుడికి తీవ్ర గాయాలు
Accident | గీతకార్మికుడికి తీవ్ర గాయాలు Accident | మోత్కూర్, ఆంధ్రప్రభ :
2 youths |బైంసా రహదారిపై ఆందోళన
2 youths | బైంసా రహదారిపై ఆందోళన 2 youths | బాసర
Fire |జిన్నింగ్ మిల్లులో ఇద్దరు కార్మికులు సజీవదహనం
Fire | జిన్నింగ్ మిల్లులో ఇద్దరు కార్మికులు సజీవదహనం Fire | జడ్చర్ల,
కెనాల్ లో పడి ప్రభుత్వ వైద్యుడు మృతి
విశాలాంధ్ర బెళుగుప్ప, : పంపనూరు సమీపంలోని కెనాల్లో ప్రమాదవశాత్తు పడిపోయిన బెళుగుప్ప మండల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడి మృతదేహం తీవ్ర గాలింపు చర్యల తర్వాత సోమవారం సాయంత్రం లభ్యమైంది. ఈ విషాద ఘటన స్థానిక వైద్య వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, రెవిన్యూ అధికారులు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఆత్మకూరు పొలం సర్వే నెంబర్ 543 సమీపంలోని హంద్రీనీవ కాలువ […] The post కెనాల్ లో పడి ప్రభుత్వ వైద్యుడు మృతి appeared first on Visalaandhra .
ఎసిబికి చిక్కిన ఎస్సై.. టపాసులు కాల్చిన గ్రామస్థులు..
టేక్మాల్: సాధారణంగా అవినీతి అధికారులు ఎసిబికి చిక్కితే అంత హడావుడి ఏం కనిపించదు. కానీ, ఈ ఎస్సై ఎసిబికి చిక్కినందుకు గ్రామస్థులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా పని చేసే ఎస్సై రాజేశ్ ఎసిబి అధికారులకు చిక్కాడు. ఓ కేసు విషయంలో రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా.. అతన్ని ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎసిబి అధికారులను చూసిన రాజేశ్ పొలాల్లోకి పరిగెత్తాడు. దీంతో అతడిని వెంబడించి పట్టుకున్నారు ఎసిబి అధికారులు. పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి రాజేశ్ని విచారిస్తున్నారు. ఎస్సై ఎసిబి అధికారులకు చిక్కడంతో గ్రామస్థులు.. స్టేషన్ ఎదుట టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
6 am to 5 pm |ఇసుకకొరత లేకుండాచూడండి…
6 am to 5 pm | ఇసుకకొరత లేకుండాచూడండి… 6 am
HIDMA ENCOUNTER : హిడ్మా అంతం
HIDMA ENCOUNTER : హిడ్మా అంతం ( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్
Tirumala : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? మీకొక గుడ్ న్యూస్
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
10 lakhs |టెస్టుల పేరుతో 500 కోట్లు దుబారా…
10 lakhs | టెస్టుల పేరుతో 500 కోట్లు దుబారా… 10 lakhs
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ప్రారంభం…
ఘనంగా సత్యసాయి రథోత్సవం. రథోత్సవంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు… విశాలాంధ్ర పుట్టపర్తి:- శ్రీ భగవాన్ సత్యసాయిబాబా రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం వేద పండితుల వేదమంత్రోచ్ఛానులతో రథోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.సత్యమ్మ దేవాలయం నుంచి ప్రారంభమై ఉత్తర గోపురం వరకు రథాన్ని లాగారు. విశేష ఆకర్షణగా కోలాటాలు, కళా జాతర బృందాలు,కీలుగుర్రాలు , డబ్బు వాయిద్యాలు , మంగళ వాయిద్యాలు, గరగర నృత్యం, పిల్లల వేషధారణ, భక్తులను అబ్బురపరిచాయి. సాయి నామస్మరణలతో పురవీధులు పులకరించాయి.రథోత్సవ […] The post శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ప్రారంభం… appeared first on Visalaandhra .
Kurnool |మాదకద్రవ్య రహిత సమాజంగా మారుద్దాం
Kurnool | మాదకద్రవ్య రహిత సమాజంగా మారుద్దాం నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
فیکٹ چیک: ایمبولینس سے مریض کے گرجانے کا وائرل ویڈیو تمل ناڈو کا نہیں بلکہ اے آئی سے تیار کردہ ہے
مصنوعی ذہانت سے تیار کردہ ایمبولنس سے مریض کے گرجانے کا ویڈیو تمل ناڈو کے کونّور کے حقیقی واقعے کے طور پر فرضی دعوے کے ساتھ شئیر کیا جارہا ہے۔
Maoists : షెల్టర్ జోన్ గా బెజవాడే ఎందుకు?? మావోయిస్టుల ప్లాన్ ఏంటి?
విజయవాడ నగరాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఎంచుకోవడం చర్చనీయాంశమైంది
వాళ్ల మాట విని చెడిపోవద్దు: బండి సంజయ్
వేములవాడ: మంగళవారం పోలీసులు, కేంద్ర బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో పలువురు మావోలు ఎన్కౌంటర్లో మృతి చెందగా.. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో కీలక మావోయిస్టు నేత హిడ్మా ఆయన భార్య హతమయ్యారు. ఈ విషయపై కేంద్ర మంత్రి బండి జంజయ్ సంజయ్ మాట్లాడారు. అర్భన్ నక్సలైట్ల మాటలు విని చెడిపోవద్దని సంజయ్ హితవు పలికారు. వాళ్లంతా ఎసి గదుల్లో ఉండి పైరవీలు చేసుకుంటున్నారని విమర్శించారు. వేములవాడలో పంజయ్ వీడియాతో మట్లాడుతూ.. బుల్లెట్లను నమ్ముకున్న మావోయిస్టులు ఏం సాధించారని ప్రశ్నించారు. ‘‘ఇన్నాళ్లూ తుపాకీ చేతబట్టిన హిడ్మ ఏం సాధించారు. ఇవాళ ఏపిలో జరిగన ఎదురు కాల్పల్లో హిడ్మా, ఆయన భార్య మరణించారు. తపాకీ చేతపట్టి చర్చలు కావాలంటే కుదరదు. ఇప్పటికే లొంగిపోయిన మావోలు క్షేమంగా ఉన్నారు. బుల్లెట్లను నమ్మకుంటే ఏం సాధించలేరు.. బ్యాలెట్ను నమ్ముకోండి అన సంజయ్ అన్నారు.
కుష్టువ్యాధి రాకుండా అవగాహన ఉండాలి
-జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ జయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : కుష్టు వ్యాధిబారిన పడకుండా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా డి ఎం హెచ్ ఓ జిల్లా కుష్టువ్యాధి అధికారి డాక్టర్ జయలక్ష్మి సూచించారు. కుష్టువ్యాధిపై అవగాహన కల్పిస్తూ ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మంగళవారం రాప్తాడులో పరిశీలించారు. ప్రతి ఆశా కార్యకర్త రోజు కు 20 ఇళ్ల వరకు కుష్టు వ్యాధి సర్వే చేయాలన్నారు. ఇంటి వద్దకు వెళ్లినపుడు ఇంట్లో వారందరికీ స్పర్శ లేని రాగి రంగు […] The post కుష్టువ్యాధి రాకుండా అవగాహన ఉండాలి appeared first on Visalaandhra .
Farmer | అన్నదాత సుఖీభవ జిల్లాలో 2.72 లక్షల మంది రైతులకు రూ.181
అర్హులందరికీ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.ఎమ్మెల్యే
విశాలాంధ్ర తాడిపత్రి : ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం క్రింద 32, 33, 34 వార్డుల లబ్ధిదారులకు గృహమంజూరు పత్రాలను మంగళవారం ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి అందజేశారు. నందలపాడు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ప్రగతి పాఠశాలలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే, అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని, రాబోవు రోజుల్లో పేద […] The post అర్హులందరికీ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.ఎమ్మెల్యే appeared first on Visalaandhra .
Collector |రైతులకు అవగాహన అవసరం..
Collector | రైతులకు అవగాహన అవసరం.. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి Collector |
ఘనంగా జరిగిన కవి సమ్మేళన కార్యక్రమం..
గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల పౌర శాఖ ప్రధాన గ్రంథాలయంలో నాలుగవ రోజు 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కవి ప్రఫుల్ల చంద్ర, టీటీడీ ధర్మాచార్యులు వెంకటేశులు, కాకుమాని రవీంద్ర గాయకులు నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అని తెలిపారు. అనంతరం ముఖ్య […] The post ఘనంగా జరిగిన కవి సమ్మేళన కార్యక్రమం.. appeared first on Visalaandhra .
Kurnool |వేసవికి ముందస్తు చర్యలు
Kurnool | వేసవికి ముందస్తు చర్యలు జిల్లా కలెక్టర్ డా. సిరి.. Kurnool
56 women |గర్భిణీ స్ర్తీలకు అమ్మ ఒడి
56 women | గర్భిణీ స్ర్తీలకు అమ్మ ఒడి 56 women |
ఐబొమ్మ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి పెట్టారు.
టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరం..
మండల విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమం కింద ఉపాధ్యాయులందరికీ టీచ్ టు ట్రైనింగ్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏపీ ఎంఈఓ గోపాల్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు ఏ విధంగా అయితే మన మూల్యాంకనం చేస్తామో ,అదేవిధంగా టీచ్ టూల్ అనేది ఉపాధ్యాయుల […] The post టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరం.. appeared first on Visalaandhra .
Puttaparthi |కనుల పండుగగా సత్యసాయి రథోత్సవం…
Puttaparthi | కనుల పండుగగా సత్యసాయి రథోత్సవం… బ్రహ్మోత్సవాలను తలపించిన వేడుకలు…భారీ ఎత్తున
త్వరలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం..
బలిజ సంక్షేమ సంఘం, బలిజ మహిళా మండలి, బలిజ యూత్విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని లోని కోటలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని త్వరలో ప్రతిష్టించనున్నామని బలిజ సంక్షేమ సంఘం, బలిజ మహిళా మండలి, బలిజ యూత్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు లోని కోటలో “జయహో శ్రీకృష్ణదేవరాయ” కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం బలిజ సంగం నాయకులు తొండ మాల బాబు మాట్లాడుతూ అప్పటి శ్రీకృష్ణదేవరాయలు ధర్మవరం పట్టణంలో కోట నిర్మించడం జరిగిందని, కాలక్రమమైన ఆ వీధికి […] The post త్వరలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం.. appeared first on Visalaandhra .
COLLECTOR |వికలాంగులకు వినికిడి యంత్రాల పంపిణీ
COLLECTOR | వికలాంగులకు వినికిడి యంత్రాల పంపిణీ COLLECTOR | చిత్తూరు, ఆంధ్రప్రభ
నృత్య పోటీలలో రాణించిన సూర్యా హై స్కూల్ విద్యార్థిని యామిని
విశాలాంద్ర ధర్మవరం:: పట్టణంలోని సాయి నగర్లో గల సూర్య ఉన్నత పాఠశాల విద్యార్థిని టీఎం. యామిని రాకింగ్ స్టార్స్ డాన్స్ ధర్మవరం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ 2025 పోటీల్లో ప్రతిభ ఘనపరిచి ప్రశంసా పత్రం పొందడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ నరేంద్రబాబు, డాన్స్ మాస్టర్ లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా కర్రీస్పాండెంట్, డాన్స్ మాస్టర్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు టీఎం యామినీకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. మా పాఠశాలలో చదువుతోపాటు […] The post నృత్య పోటీలలో రాణించిన సూర్యా హై స్కూల్ విద్యార్థిని యామిని appeared first on Visalaandhra .
డిగ్రీ స్పాట్ అడ్మిషన్లను సద్వినియోగం చేసుకోండి..
ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు వివిధ గ్రూపులలో స్పాట్ అడ్మిషన్లు కలవు అని ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ , కళాశాల ఇంచార్జి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మేనేజెంట్ కోటా కింద బిసిఎ, బీబీఏ గ్రూపుల నందు 18 సీట్లు, బీకాం నందు 30 సీట్లు, బీఎస్సీ కంప్యూటర్స్ నందు 25 సీట్లు, బీఎస్సీ బాటని నందు 15 […] The post డిగ్రీ స్పాట్ అడ్మిషన్లను సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
MLA |ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
MLA | ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం MLA| శ్రీకాకుళం, ఆంధ్రప్రభ :
ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్,డాక్టర్ సోనియావిశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి దగ్గర గల స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యందు ఈ నెల 19వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోవాలని స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలు పుట్టకపోవడం […] The post ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
30 years | 30 సంవత్సరాల నుండి పోరాటం…
30 years | 30 సంవత్సరాల నుండి పోరాటం… 30 years |
Award | ప్రకాశం… భేష్ !! @. వాటర్ షెడ్ పనుల్లో ఉత్తమ
Exclusive detials about Varanasi Budget
SS Rajamouli is currently crafting the biggest film of his career and the film titled Varanasi features Mahesh Babu, Priyanka Chopra, Prithviraj Sukumaran in the lead roles. From the past few days there are speculations about the film’s budget saying that the film costs Rs 1200-1300 crores. This is completely untrue. Rajamouli has worked on […] The post Exclusive detials about Varanasi Budget appeared first on Telugu360 .
ACB trap |గోడ దూకి.. పరుగులు తీసిన ఎస్ఐ
ACB trap | గోడ దూకి.. పరుగులు తీసిన ఎస్ఐ ఏసీబీ ట్రాప్
విషాదం: ప్రముఖ నటుడి తండ్రి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ కమెడియన్ జోష్ రవి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ (68) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గత వారమే ఈ ఘటన జరిగినప్పటికీ.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రవి ఆ తర్వాత జోష్ రవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు తెలుగు చిత్రాల్లో నటించడంతో పాటు.. ‘జబర్దస్త్’ కామెడీ షోలో పలు స్కిట్లు చేసి ప్రేక్షకులను నవ్వించాడు. అయితే రవి తల్లిదండ్రులు అతడి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో నివసిస్తుంటారు. కార్తీక మాసం మూడో సోమవారం శివాలయంలో అభిషేకం చేయించడానికి వెళ్లి సూర్య వెంకట నరసింహ శర్మ.. ఆలయంలోనే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటు ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సూర్య వెంకట నరసింహ శర్మకు రవి ఒకడే సంతానం. అందరితో ఎంతో కలిసిమెలిసి ఉండే వ్యక్తి మరణంతో మార్టేరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గ్లోబ్ట్రాటర్ ఈవెంట్.. డైరెక్టర్ రాజమౌళిపై కేసు నమోదు#telugupost #ssrajamouli #varanasi
Photos : santhana prapthirasthu Success Meet
The post Photos : santhana prapthirasthu Success Meet appeared first on Telugu360 .
ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ 19 సెప్టెంబర్ 2025న సింగపూర్లో మరణించారు
Nandyal |ఉద్యోగం కావాలంటే రూ.3లక్షల డిపాజిట్
Nandyal | ఉద్యోగం కావాలంటే రూ.3లక్షల డిపాజిట్ రూ.35 కోట్ల మోసంలో నలుగురు
Disastrous time for Theatre Industry
November is usually a dull season for films. With all the recent new releases rejected badly, the exhibitors are struggling to run the theatres. Ravi Teja’s Mass Jathara ended up as a disaster and followed by new releases like Jatadhara, Kaantha and others. The Girlfriend provided some relief for the multiplexes but the numbers dropped […] The post Disastrous time for Theatre Industry appeared first on Telugu360 .
విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం
ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డావిజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. అరెస్ట్ అయిన వారిలో ఛత్తీస్గఢ్కు చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.విజయవాడ శివారులోని కానూరు న్యూ ఆటోనగర్లో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి […] The post విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం appeared first on Visalaandhra .
2800 Crore |రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చని కాంగ్రెస్
2800 Crore | రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చని కాంగ్రెస్ 2800 Crore
Tirupati |భూసేకరణ పనులను వేగవంతం చేయాలి
Tirupati | భూసేకరణ పనులను వేగవంతం చేయాలి గడువులోగా రైల్వే ప్రాజెక్టులు పూర్తి
Andhra Prabha Smart Edition |హిడ్మా ఎన్కౌంటర్/బెజవాడలో గెరిల్లా ఆర్మీ
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 18-11-2025, 4.00PM హిట్ మ్యాన్ హతం.. హిడ్మా ఎన్కౌంటర్
CMRF 4 lakh |సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
CMRF 4 lakh | సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత CMRF 4 lakh
విజయవాడలో మావోయిస్టుల కలకలం… ఒకే భవనంలో 27 మంది నక్సల్స్ అరెస్ట్
కేంద్ర, రాష్ట్ర బలగాల జాయింట్ ఆపరేషన్లో 27 మంది అరెస్ట్ అరెస్టయిన వారిలో 12 మంది మహిళలు, నలుగురు కీలక నేతలుఆయుధ డంపుల కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపువిజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. అత్యంత పకడ్బందీగా అందిన సమాచారంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. కానూరు కొత్త ఆటోనగర్ ప్రాంతంలోని ఓ భవనాన్ని షెల్టర్గా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వీరిని అదుపులోకి […] The post విజయవాడలో మావోయిస్టుల కలకలం… ఒకే భవనంలో 27 మంది నక్సల్స్ అరెస్ట్ appeared first on Visalaandhra .
ట్రోలింగ్పై కఠిన చర్యలు తీసుకోనున్న సజ్జనార్ #TeluguPost #telugu #post #news
వైభవ్ని ప్రత్యక్షంగా కలవడం ఆనందంగా ఉంది: ఒమన్ ప్లేయర్స్
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. యుఎఇ అండర్19తో జరిగిన మ్యాచ్లో కేవలం 32 బంతుల్లోనే శతకం సాధించిన వైభవ్.. ఆ మ్యాచ్లో 42 బంతుల్లో 144 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 15 సిక్సులు ఉన్నాయి. ఆ తర్వాత పాకిస్థాన్ అండర్19తో జరిగిన మ్యాచ్లో 28 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. ప్రస్తుతానికి రెండు మ్యాచుల్లో కలిపి 189 పరుగులతో టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కాగా, మంగళవారం భారత ఏ జట్టు, ఒమన్తో తలపడనుంది. ఈ సందర్భంగా వైభవ్ని కలుసుకోవడం ఆనందంగా ఉందని ఒమన్ ఆటగాళ్లు ఆర్యన్ బిస్త్, సమయ్ శ్రీవాత్సవ అన్నారు. ‘వైభవ్ని కేవలం టివిల్లో చూడటమే.. మరికాసేపట్లో ప్రత్యక్షంగా అతడితో తడపడనున్నాం. మనకు 14 సంవత్సరాల వయసున్నప్పుడు బంతిని అంత దూరం బాదలేం. కానీ, వైభవ్ మాత్రం అందుకు మినహాయింపు. అతడు అద్భుతంగా, అలవోకగా సిక్సులు బాదుతున్నాడు’ అని ఆర్యన్ బిస్త్ అన్నాడు. ‘అతన్ని కలవబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను క్రికెట్పై అతడి దృక్పథం ఏంతో తెలుసుకొనేందుకు ఉత్సాహంగా ఉన్నాను. అతడు కేవలం 14 సంవత్సరాల వయసులోనే అంత పెద్ద సిక్సులు కొడుతున్నాడు. నేను అతడిని కలిసి.. మాట్లాడదామని అనుకుంటున్నా’ అని సమయ్ శ్రీవాత్సవ తెలిపాడు.
Rains |నెల్లూరు జిల్లాలో వర్షాలు
Rains | నెల్లూరు జిల్లాలో వర్షాలు rains | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ
110 students |పాఠశాలకు తాళం!
110 students | పాఠశాలకు తాళం! 110 students | అచ్చంపేట, ఆంధ్రప్రభ
POLICE |రైళ్లలో ఫోన్లు దొంగలు అరెస్ట్…
POLICE | రైళ్లలో ఫోన్లు దొంగలు అరెస్ట్… 6లక్షల విలువ గల 26
2 crores |ఆదిలాబాద్ కలెక్టర్కు జలసంరక్షణ పురస్కారం
2 crores | ఆదిలాబాద్ కలెక్టర్కు జలసంరక్షణ పురస్కారం 2 crores |

17 C