SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక అత్యాచారినికి పాల్పడింది: ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్

 సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలో రూ. 3.48 లక్షల కోట్ల భారీ అప్పులు చేసి ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. ఇవి కాకుండా మరో లక్ష కోట్లు బడ్జెట్‌కు సంబంధం లేని అప్పులు తెచ్చారని అన్నారు. ఇన్ని కోట్ల అప్పు తెచ్చి చేసిందేమీ లేదని విమర్శించారు. కాగ్ రిపోర్ట్ సిఎం రేవంత్ రెడ్డి బట్టలు విప్పేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటే... ఇంతకంటే ఏం జరుగుతుందని అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ నేతలు సతీష్ రెడ్డి, హరి రమాదేవి, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కమీషన్లు, విచ్చలవిడి అవినీతికి అర్రులు చాస్తూ రేవంత్‌రెడ్డి రాష్ట్ర ఆర్ధిక రంగాన్ని కుదేలు చేశారని ధ్వజమెత్తారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ.. రేవంత్ రెండేండ్ల పాలనలో అధోగతి పాలైందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేశారని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 2 లక్షల 30 వేల కోట్లుగా ప్రతిపాదించారని, సెప్టెంబర్ నాటికి రూ. 76 వేల కోట్లు మాత్రమే విడుదలయ్యాయని తెలిపారు. నిర్ధేశించుకున్న లక్ష్యంలో 33 శాతం మాత్రమే చేరుకున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ వసూళ్లలో 40 శాతం మాత్రమే సాధించారని, జిఎస్‌టి వసూళ్లలో 42 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్‌ను సర్వనాశనం చేశారని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా రూ. 19 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా రూ. 7 వేల కోట్లు మాత్రమే వసూలు అయ్యిందని చెప్పారు. ఎక్సైజ్ ఆదాయం కూడా 35 శాతంలోపే వచ్చిందని, అప్పులు మాత్రం 83 శాతానికి చేరుకున్నాయని పేర్కొన్నారు.హైడ్రా పేరుతో ఆర్‌ఆర్ టాక్స్‌తో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు.

మన తెలంగాణ 13 Nov 2025 9:09 pm

ఎసిబి వలలో ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు

గృహ నిర్మాణానికి సంబందించిన పర్మిషన్ విషయంలో ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎసిబి వలలో చిక్కారు. ఎసిబి డిఎస్పీ శ్రీధర్ కథనం మేరకు వివరాలు.. బిల్డింగ్ పర్మిషన్ కోసం ఆదిభట్ల మున్సిపల్ టౌన్‌ ప్లానింగ్ అధికారి వర ప్రసాద్, అసిస్టెంట్ వంశీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఓ వ్యక్తి వద్ద లంచం డిమాండ్ చేశారు. నాలుగు వందల గజాల స్థలంలో నాలుగంతస్తుల భవన నిర్మాణం అనుమతి కోసం ఆ వ్యక్తి వద్ద లక్షన్నర డిమాండ్ చేసారు. ఎట్టకేలకు 80 వేల రూపాయలకు ఆంగీకారం తెలిపారు. ఈ మేరకు గురువారం బాదితుడి వద్ద నుండి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీ రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎసిబి డిఎస్పీ తెలిపారు. కాగా ఎవరైనా అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు.

మన తెలంగాణ 13 Nov 2025 9:02 pm

ఎస్ఆర్బిసి కాలువలో విద్యార్థి గల్లంతు..

నంద్యాల, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణానగర్‌కు చెందిన వీరేష్‌

ప్రభ న్యూస్ 13 Nov 2025 8:58 pm

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను మెహిదీపట్నం, సౌత్‌వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.4,75,000 నకిలీ రూ.500 నోట్లు, కారు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌వెస్ట్ ఎడిసిపి సిద్ధిఖీ గురువారం మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోస్గి, గుడిమల్ గ్రామానికి చెందిన కస్తూరీ రమేష్ బాబు తాండూరులో ఉంటూ కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సైబరాబాద్, ఫిష్ బిల్డింగ్, సులేమాన్ నగర్‌కు చెందిన అబ్దుల్ వాహిద్, మహ్మద్ అబ్దుల్ ఖదీర్ అలియాస్ తాహా, మహ్మద్ సోహైల్, ఎండి ఫహద్, షేక్ ఇమ్రాన్, ఒమర్ ఖాన్, సయిద్ అల్తామాష్ అహ్మద్ డిగ్రీ చదువుతున్నాడు. తాండూరుకు చెందిన రమేష్ బాబు, అతడి సోదరి రామేశ్వరి కలిసి నకిలీ రూ.500 నోట్లను ముద్రిస్తున్నారు. ఇద్దరు కలిసి గతంలో కూడా నకిలీ నోట్లను ముద్రించడంతో గుజరాత్, చాంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. తాండూరులోని ఇంట్లోనే అన్నా, చెల్లి కలిసి నోట్లను ముద్రించి 1ః4 నిష్పత్తిలో పంపిణీ చేస్తున్నారు. నిందితులు జేకె బాండ్ పేపర్‌పై నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నారు. రమేష్ ఇన్‌స్టాగ్రాంలో వీడియో పోస్ట్ చేసి కింద తన మొబైల్ నంబర్ ఇచ్చాడు. వాటిని చూసిన నగరానికి చెందిన నిందితులు సంప్రదించారు. వారికి రమేష్ బాబు నకిలీ నోట్లు ఇవ్వడంతో నగరంలో చెలామణి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు మల్లేషం, సంతోష్ కుమార్ తదితరులు దర్యాప్తు చేశారు.

మన తెలంగాణ 13 Nov 2025 8:56 pm

W.Godavari |దొంగ దొరికాడు…..

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: ఇల్లు అద్దెకు కావాలని నటిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని

ప్రభ న్యూస్ 13 Nov 2025 8:48 pm

జూబ్లీహిల్స్ గెలుపుపై బిఆర్‌ఎస్ ధీమా

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయని బిఆర్‌ఎస్ పార్టీ ధీమాగా ఉన్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పార్టీ నిర్ణయించింది. ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ కోసం పార్టీ సీనియర్ నాయకులను, ప్రముఖులను ఎలక్షన్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించింది. ఈ ఏజెంట్లందరితో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు తదితర ముఖ్య నేతలు గురువారం తెలంగాణ భవన్‌లో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కౌంటింగ్ ఏజెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా అనుసరించాల్సిన అంశాలపై మార్గదర్శనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పోలింగ్ సందర్భంగా అన్ని రకాల అక్రమాలకు పాల్పడిందని, ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని బిఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్క కౌంటింగ్ ఏజెంట్, ఎలక్షన్ ఏజెంట్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు చేసే అవకాశం ఉందో వివరించినట్లు బిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిఆర్‌ఎస్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలోనూ జాగ్రత్తగా వ్యవహిరిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకున్నది.

మన తెలంగాణ 13 Nov 2025 8:46 pm

ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు నేనే చెల్లిస్తా: కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు అందరికి పరీక్ష ఫీజులు తానే చెల్లిస్తానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముందుకొచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని విద్యార్థుల వివరాలను తనకు అందజేయాలని కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ కలెక్టర్ హరిచందనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం లేఖ రాశారు. ఇదే తరహాలో మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఇటీవల నిరుపేద పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తనకు ఇచ్చే వ్యక్తిగత వేతనం నుంచే వీరికి పరీక్ష ఫీజులు చెల్లించాలని నిర్ణయించుకుని ఆ ప్రకటన చేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేసేందుకు వీలుగా ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆయన లేఖలు కూడా రాసి పంపించారు. పరీక్ష ఫీజు చెల్లించలేక ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకుండా చూసేందుకు కేంద్రమంత్రులు ఇద్దరూ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన అంత్యోదయ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి పిల్లలకు తన వంతుగా సహాయం చేయాలని అనుకుంటున్నానని, అందుకే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులందరికీ తెలంగాణ ఎస్‌ఎస్‌సి బోర్డు పరీక్ష ఫీజు మొత్తాన్ని తన జీతం నుంచి చెల్లించాలని నిర్ణయించినట్లు ఆయన ఢిల్లీ నుంచి ఒక ప్రకటనలో వివరించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని మస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పలు సేవా కార్యక్రమాలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు అవసరమైన వస్తువుల పంపిణీ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పాఠశాలల్లో మరుగు దొడ్ల నిర్మాణం, మెకనైజ్డ్ టాయిలెట్ క్లీనింగ్ మెషీన్స్ అందజేస్తున్నారు. దీంతోపాటుగా డబుల్ డెస్క్ బెంచీలను కూడా కిషన్ రెడ్డి సమయానుగుణంగా అందజేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో నోట్ బుక్స్ పంపిణీ, పలు పాఠశాలల్లో డిజిటల్ తరగతులకు కూడా కేంద్రమంత్రి సహకారం అందించిన సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 13 Nov 2025 8:42 pm

Crime |భర్త చేతిలో భార్య దారుణ హత్య..

Crime | భర్త చేతిలో భార్య దారుణ హత్య.. విజయవాడ, క్రైమ్ ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 13 Nov 2025 8:35 pm

మంత్రి కొండాపై పరువు నష్టం కేసు ఉపసంహరణ

రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. మంత్రిపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసును గురువారం ఆయన ఉపసంహరించుకున్నారు. మంత్రి కొండా సురేఖ బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్న క్రమంలో సినీ నటుడు అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వాఖ్యలను తీవ్రంగా పరిగణించిన నటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మంత్రి కొండా సురేఖ ట్విటర్ వేదికగా నాగార్జున కుటుంబపై చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు చెప్పారు. నాగార్జున కుటుంబాన్ని బాధపెట్టాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, వారిని ఇబ్బంది పెట్టాలని, వారి పరువు ప్రతిష్టకు భంగం కలిగించాలని ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. నాగార్జున కుటుంభంపై చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నా, నా వాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అని మంత్రి పేర్కొన్నారు. ఈ క్షమాపణపై నాగార్జున స్పందించి మంత్రిపై దాఖలు చేసిన పరువు నష్టం దావాను ఉపసంహరించుకున్నారు. కాగా, మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ సాగింది. ఈ విచారణను అంతకు ముందు డిసెంబర్ 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో నాగార్జున కేసు ఉప సంహరించుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగినట్లుయింది.

మన తెలంగాణ 13 Nov 2025 8:34 pm

భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేసిన కసాయి

విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే కట్టుకున్న భార్యను నడిరోడ్డుపైనే గొంతు కోసి హత్య చేశాడు ఓ కిరాతకుడు. సూర్యారావు పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటన స్థానికులను సైతం భయాందోళనలకు గురి చేసింది. తెలిసిన వివరాల ప్రకారం హత్యకు గురైన మహిళ విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సరస్వతీగా గుర్తించారు. ఆమె భర్త విజయ్‌తో గత కొంతకా లంగా దాంపత్య జీవితం సజావుగా సాగడం లేదు. తరచూ చిన్నచిన్న విషయాలపై ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయని, ఇటీవల వీరిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విజయ్ కోపంతో భార్య ఉన్న చోటుకు వెళ్లి, కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో సరస్వతీ అక్కడికక్కడే మృతి చెందింది. హత్య అనంతరం కూడా విజయ్ కత్తితో వీరంగం సృష్టించాడని, స్థానికులు భయంతో దగ్గరికి రాలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘ఎవరైనా దగ్గరికి వస్తే చంపేస్తా’ అంటూ విజయ్ కేకలు వేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న సూర్యా రావుపేట పోలీసులు నిందితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య కొన సాగుతున్న వ్యక్తిగత విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారం భించారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ఇటువంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ సమ స్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ, ఇలా ప్రాణాలు తీయడం మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇటు వంటి చర్యలతో సదరు వ్యక్తులు కూడా జైలు పాలై నిండు జీవితాన్ని కోల్పోతారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మన తెలంగాణ 13 Nov 2025 8:30 pm

కోర్టుకు రాకుండా ఉంటే పదిలం.. లాయర్లకు సుప్రీం సలహా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర రీతిలో వాయు నాణ్యత పడిపోయింది. లాయర్లు ఎందుకైనా మంచిది వర్చువల్‌గా విచారణలో క్లయింట్ల తరఫున పాల్గొంటే మంచిదని సలహాలు వెలువడ్డాయి. గురువారం సుప్రీంకోర్టులో వ్యాజ్యాల ప్రస్తావన దశలో న్యాయమూర్తి పిఎస్ నరసింహ లాయర్లకు ఈ సూచన చేశారు. ఢిల్లీలో వాయుకాలుష్య తీవ్రత విపరీత స్థాయికి చేరుకుంది. ఈ గాలి పీలిస్తే చాలు జనం అనారోగ్యాల బారిన పడే ముప్పు ఏర్పడుతోంది. మాస్క్‌లతో కోర్టులకు వచ్చినా ఉపయోగం లేదని, పలువురం మాస్క్‌లతోనే కోర్టుకు వస్తున్నామనే విషయాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్‌తో కలిసి బెంచ్‌లో ఉన్న న్యాయమూర్తి నరసింహ దీనితో ఏకీభవించారు. ఇంతటి ఘాటు కాలుష్య గాలికి మాస్క్‌లు ఏం సరిపోతాయి? కాలుష్యానికి సోకితే ఎవరికైనా శాశ్వత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని జడ్జి చెప్పారు. లాయర్లకు వర్చువల్ వాదన అవకాశం ఉన్నందున, దీనిని వాడుకుంటే సరిపోతుందని మిత్రవాక్యం పలికారు. నవంబర్ నెల ఆరంభం నుంచే ఢిల్లీ పౌరులు వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వారం ఇది అత్యంత తీవ్రస్థాయికి చేరింది. మంగళ, బుధవారాలలో గాలిలో కాలుష్య రేణువుల సాంద్రత అత్యంత ఎక్కువగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తమ లెక్కల్లో తెలిపింది.

మన తెలంగాణ 13 Nov 2025 8:29 pm

Sreeleela bags one more Crazy Project

Sreeleela has delivered a bunch of flops in Telugu but the actress is signing more number of films. She is all set to be seen beside Sivakarthikeyan in his upcoming movie Parasakthi and the film is due for Sankranthi 2026 release. Sudha Kongara is the director. As per the latest buzz, Sreeleela has signed one […] The post Sreeleela bags one more Crazy Project appeared first on Telugu360 .

తెలుగు 360 13 Nov 2025 8:26 pm

Bollywood Director joins Jaat 2

Tollywood mass director Gopichand Malineni directed Jaat with Bollywood actor Sunny Deol after all the Tollywood actors were occupied. The film did not make any noise in Telugu but the film made decent money in North India. Two top Tollywood production houses Mythri Movie Makers and People Media Factory joined hands for this film. The […] The post Bollywood Director joins Jaat 2 appeared first on Telugu360 .

తెలుగు 360 13 Nov 2025 8:23 pm

TG TET |టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల!

TG TET | టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల! హైదరాబాద్‌, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Nov 2025 8:19 pm

గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పాత బస్టాండ్ సమీపంలోని మొండి గేరిలో పాత భవనంకు మరమ్మత్తుల పనులు చేస్తుండగా ఒక్క సారిగా గోడ కూలింది.ఈ సంఘటనలో ఇద్దరు భవన నిర్మాణ కూలీలు దుర్మణం చెందారు. మరి కొందరు గాయపడ్డారు. శిథిలాల కింద మరి కొందరు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్‌పి జానకి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది వెంటనే చేరుకొని శిథిలాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా శిథిలాల కింద ఎంత మంది ఉన్నారన్నది తెలియడం లేదు. పాత భవనం ఓనర్ లక్ష్మణ్ గురువారం తన పాత భవనానికి మరమ్మతులు చేసే క్రమంలో నల్గురు భవన నిర్మాణ కార్మికులను పని అప్పగించారు. భవనానికి పైన డ్రిల్లింగ్ చేపట్టడంతోపాటు పక్కన ఉన్న రాగి చెట్టును కూడా తొలగించే క్రమంలో ఒక్క సారిగా గోడ కూలింది. ఈ ఘటనలో గోడ కింద ఉన్న వారిపై గోడ కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరు శిథిలాల కింద ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మరమ్మతులు చేసే క్రమంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ఇంటి ఓనర్ సేఫ్టీ పికాషన్స్ తీసుకోకపోవడం వలనే ఈ ఘటన జరిగిందన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.అటెండర్ చెబుతున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరు చనిపోయారని, ఇంకా ఇద్దరు శిథిలాల కిందనే ఉన్నట్లు చెబుతున్నారన్నారు. సహాయక చర్యలు చేపడుతున్నామని,అధికారులు సిబ్బంది అందరూ ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కలెక్టర్ విజయేంద్రీ బోయి మాట్లాడుతూ మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పారు. సంఘటనా స్థలంలో మున్సిపల్ కమిషనర్ కూడా పాల్గొన్నారు.

మన తెలంగాణ 13 Nov 2025 8:10 pm

ఆర్‌టిసి బస్సులో అకస్మాత్తుగా పొగలు

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ నుండి కర్నూలుకు బయలుదేరిన బస్సు మానవపాడు మండలం మద్దూరు స్టేజ్ సమీపంలో అయిజ నుండి కర్నూలు వెళ్ళే బస్సులో టైర్లో పొగలు వ్యాపించాయి. దానిని గమనించిన ప్రయాణికులు అరుపులు, కేకలతో బస్సు కిటికిల నుంచి కిందికి దిగి ప్రయాణికులు పారిపోయారు. ఆర్టీసీ డ్రైవర్ చాక చక్యంతో బస్సును ఆపి, పొగలను నియంత్రించే ప్రయత్నాలు చేశారు. ఓవర్ లోడ్‌తోనే ఈ సంఘటన జరిగిందని డ్రైవర్ తెలిపారు. వద్దంటే కూడా ప్రయాణికులు ఎక్కుతున్నారని తెలిపారు. బస్సులు లేక పోవడంతోనే నిండుగా ఉన్న బస్సులను ఎక్కుతుండడంతో సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఎవరికి ఏలాంటి ప్రమాదం జరగక పోవడముతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు

మన తెలంగాణ 13 Nov 2025 8:08 pm

AP |అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలి..

AP | అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలి.. కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Nov 2025 8:05 pm

Adilabad |దౌర్జన్యానికి పాల్పడ్డ పోలీసులను శిక్షించాలి

Adilabad | దౌర్జన్యానికి పాల్పడ్డ పోలీసులను శిక్షించాలి Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Nov 2025 8:03 pm

రాజేంద్రనగర్ లో గుజరాత్ ఏటీఎస్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోదాలు చేశారు.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 8:00 pm

Pune Accident |పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం….

Pune Accident | పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం…. మహారాష్ట్ర : పూణేలో

ప్రభ న్యూస్ 13 Nov 2025 7:58 pm

Mahabubnagar |ఐదుగురు నిందితుల రిమాండ్

Mahabubnagar | ఐదుగురు నిందితుల రిమాండ్ Mahabubnagar | ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Nov 2025 7:58 pm

ఘోర ప్రమాదం.. రెండు ట్రక్కుల మధ్య చిక్కుకున్న కారు.. ఐదుగురు సజీవదహనం

న్యూఢిల్లీ: పుణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్తున్న రెండు పెద్ద కంటైనర్ ట్రక్కులు ఢీకొన్నాయి. అయితే, వాటి మధ్య కారు ఇరుక్కుపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కారుతోపాటు కంటైనర్ ట్రక్కులు కూడా మంటల్లో చిక్కుకుని ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పుణే నగర శివార్లలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పారు. సాయంత్రం రద్దీ సమయంలో ప్రమాదం జరగడంతో సింహ్‌గడ్ రోడ్, వార్జే, కాట్రాజ్-దేహు బైపాస్‌లలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. కంటైనర్ ట్రక్కుల మధ్య కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులను ఇంకా గుర్తించలేదని.. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 13 Nov 2025 7:57 pm

పొలాల్లో వేలాది కోళ్లు పోలీసులు విచారిస్తే!!

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారిపై వేలాది నాటుకోళ్లు కనిపించాయి.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 7:50 pm

Warangal |ఘ‌న స‌న్మానం…

Warangal | ఘ‌న స‌న్మానం… తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి మండల ఎంపీడీవో

ప్రభ న్యూస్ 13 Nov 2025 7:45 pm

నితీశ్ ను తప్పిస్తూ!!

కోల్‌కతా వేదికగా నవంబర్‌ 14 నుంచి సౌతాఫ్రికాతో జరగబోయే తొలి టెస్ట్‌ నుండి ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిని భారత జట్టు నుంచి విడుదల చేశారు.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 7:40 pm

Warangal |మీ భద్రతయే మా బాధ్యత

Warangal | మీ భద్రతయే మా బాధ్యత Warangal | గీసుగొండ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Nov 2025 7:39 pm

Nara Lokesh Leads the Next Tech Wave: Major IT and Infrastructure Projects Launched in Visakhapatnam

Andhra Pradesh Industries and IT Minister Nara Lokesh continues to drive the state’s digital and industrial transformation, this time from the scenic IT Hills of Visakhapatnam. In a grand ceremony, Lokesh laid the foundation stones for several major projects, including Sales Software Solutions, iSpace Software Solutions, Tech Thammin Software Solutions, Phenom People Ltd, Raheja IT […] The post Nara Lokesh Leads the Next Tech Wave: Major IT and Infrastructure Projects Launched in Visakhapatnam appeared first on Telugu360 .

తెలుగు 360 13 Nov 2025 7:39 pm

అమెరికాలో ముగిసిన ఆర్థిక షట్‌డౌన్..

వాషింగ్టన్ : అమెరికా చరిత్రలో అత్యధిక కాలం 43 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఆర్థిక “ షట్‌డౌన్‌”ఎట్టకేలకు ముగిసింది. షట్‌డౌన్‌ను ఎత్తివేసే ప్రభుత్వ ఫండింగ్ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ బుధవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం ) సంతకం చేశారు. అంతకు ముందు అమెరికా ప్రతినిధుల సభలో 222-209 తేడాతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ తరువాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు సంతకం కోసం ఈ బిల్లు వచ్చింది. అక్టోబర్ 1నుంచి షట్‌డౌన్ వల్ల అమెరికాలో వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం కనిపించింది. ముఖ్యంగా ఆర్థిక వృద్ధి, ఫెడరల్ సర్వీసులు, ప్రజల జీవనాలపై , విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అఫర్డబుల్ కేర్ యాక్ట్ (ఎసీఏ)సబ్సిడీల విస్తరణ కోసం డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేసినప్పటికీ, రిపబ్లికన్ నేతలతో రాజీ కుదరడంతో ఈ సమస్య పరిష్కారమైంది. షట్‌డౌన్ వల్ల సుమారు 1.4 మిలియన్ ఫెడరల్ ఉద్యోగుల జీతాలు బాగా ఆలస్యమయ్యాయి. సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ( ఎస్‌ఎన్‌ఏపీ) వంటి ఆహార సహాయ పథకాలు 42 మిలియన్ అమెరికన్లకు సరిగ్గా అందకుండా పోయాయి. ఆర్థిక వృద్ధి రెండు శాతం తగ్గి, మూడు బిలియన్ డాలర్ల వరకు నష్టం కలిగించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి కీలక సర్వీసులు ఆగిపోవడంతో ప్రయాణికులు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు . ఈ పరిస్థితి ప్రజల్లో అసంతృప్తిని పెంచడంతో రెండు పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చింది.

మన తెలంగాణ 13 Nov 2025 7:35 pm

Nagarjuna Withdraws Defamation Case Against Konda Surekha

Akkineni Nagarjuna has withdrawn the defamation case he filed against minister Konda Surekha, bringing an end to a long-standing dispute that once drew major public attention. The actor decided to drop the case after Konda Surekha formally apologised for her earlier remarks on X, which allegedly damaged his reputation. The controversy began when Konda Surekha […] The post Nagarjuna Withdraws Defamation Case Against Konda Surekha appeared first on Telugu360 .

తెలుగు 360 13 Nov 2025 7:35 pm

పశ్చిమ ప్రజల భద్రతే ధ్యేయం..

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజల భద్రతే ధ్యేయంగా ట్రాఫిక్

ప్రభ న్యూస్ 13 Nov 2025 7:34 pm

పెళ్లి మండపం నుండి నిందితుణ్ని వెంటాడిన డ్రోన్‌

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో పెళ్లికుమారుడిపై ఓ వ్యక్తి కత్తితో మూడు సార్లు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 7:28 pm

Warangal |పొలం ప‌నుల‌కు వెళ్లి…

Warangal | పొలం ప‌నుల‌కు వెళ్లి… Warangal | ములుగు జిల్లా, మంగపేట,

ప్రభ న్యూస్ 13 Nov 2025 7:27 pm

అశోక్ రాణా దిద్దిన సామ్రాట్

ఈజిప్టు రాజధాని కైరోలో నిర్వహించిన ISSF వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్‌ సామ్రాట్‌ రాణా గోల్డ్ కొట్టాడు.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 7:22 pm

‘రాజు వెడ్స్ రాంబాయి‘ ట్రైలర్ రిలీజ్..

యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ప్రమోషన్ లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను గురువారం సాయంత్రం మేకర్స్ రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సిినిమా ట్రైలర్ అదిరిపోయింది. హృదయానికి హత్తుకునేలా ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ లో బిజిఎం అదిరిపోయింది. ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో లిటిల్ హార్ట్స్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్లుగా ట్రైలర్ ఉంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ’రాంబాయి నీ మీద నాకు..’ లిరికల్ సాంగ్ అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కాగా ,‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్‌సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

మన తెలంగాణ 13 Nov 2025 7:19 pm

కుట్రదారులలో ముగ్గురు యూనివర్సిటీ ఉద్యోగులే

యూనివర్సిటీ నిధులు, వైద్యుల ఆర్థిక లావాదేవీలపై ఇడి దర్యాప్తు తప్పుడు అక్రిడిటేషన్ క్లయిమ్ పై ఎన్ ఏఏసి నోటీసులు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ తొలగింపు వర్సిటీపై చర్యకు సిద్ధమైన నేషనల్ మెడికల్ కమిషన్ న్యూఢిల్లీ ఎర్రకోట పేలుడు తర్వాత టెర్రరిస్ట్ కుట్రకు సంబంధించి రోజురోజుకూ కొత్త వివరాలు వెలుగులోకి వస్తుండడంతో హర్యానాలోని అల్ -ఫలాహ్ యూనివర్సిటీకి కొత్త ఇబ్బందులకు అంతు లేకుండా పోయింది. ఆ యూనివర్సిటీకి నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయి. వర్సిటీ గుర్తింపు ఎన్నాళ్లవరకూ ఉంది అన్న విషయంతో సహా పలు విషయాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. ఎర్రకోట పేలుళ్ల నిందితులు యూనివర్సిటీలో పనిచేయడం తో వారికి జైష్ -ఎ- మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో గల సంబంధాలపై ఆరా మొదలైంది.గరువారం తప్పుడు అక్రిడిటేషన్ క్లెయిమ్ ను ప్రదర్శించినందుకు ఎన్ ఏఏసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫలితంగా విశ్వవిద్యాలయ వెబ్ సైట్ ను తొలగించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి, విశ్వవిద్యాలయ నిధులతోపాటు, దాని వైద్యుల ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేపట్టింది. ఎర్రకోట వద్ద పేలుడుతో ఫరీదాబాద్ లోని దౌజ్ గ్రామంలో ఉన్న ఈయూనివర్సిటీ దేశంలో అందరి దృష్టిలోనూ పడింది. కారు పేలుడుకు పాల్పడి 13 మంది మృతికి కారకుడైన డాక్టర్ ఉమర్ నబీ ఇక్కడే పని చేస్తున్నాడని తేలింది. ఉమర్ తోపాటు అతడి ఇద్దరు సహచరులు, వైట్ కాలర్ టెర్రరిస్ట్ నెట్ వర్క్ లో కీలక పాత్ర ధారులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ షాహిద్ కూడా ఈ విశ్వవిద్యాలయంలో పని చేసినవారే. టెర్రరిస్ట్ మాడ్యూల్ ను ఛేదించి ముజమ్మిల్, షాహీన్ అరెస్ట్ లతో యూనివర్సిటీ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అరబిక్ లో అల్ -ఫలాహ్ అంటే, విజయం లేదా శ్రేయస్సు అని అర్థం. కానీ ఈ వారం పరిణామాలతో విశ్వవిద్యాలయం స్థాయి పూర్తిగా దిగజారి పోయింది. అక్రిడిటేషన్ గడువు ముగియడంతో నోటీసు గురువారంనాడు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అయిన ఎన్ ఏఏసి యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ అక్రిడిటేషన్ గడువు ముగిసిందని, సంస్థపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకో కూడదో చెప్పాలని నిలదీసింది. యూనివర్సిటీ వెబ్ సైట్ లో ప్రదర్శించబడిన గ్రేడ్ ఏ అక్రిడి టేషన్ పూర్తిగా తప్పు అనీ, ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఎన్‌ఏఏసి పేర్కొంది. యూనివర్సిటీ ఏడు రోజులలో స్పందించాలని గడువు విధించింది.అల్- ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కి గల -గ్రేడ్ ఏ -గుర్తింపు 2018లోనే ముగిసింది. అల్ -ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గుర్తింపు 2011 నుంచి 2016 వరకు చెల్లుబాటులో ఉంది. మరో పక్క నేషనల్ మెడికల్ కమిషన్ కూడా యూనివర్సిటీపై తగిన చర్య తీసుకునేందుకు సిద్ధమైంది. అల్- ఫలాహ్ వర్సిటీపై ఈడీ ఆరా ఢిల్లీ పేలుడు కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడంతో యూనివర్సిటీ, అందులో పనిచేసే వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నిర్వహిస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఈడీ డైరెక్టర్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఈడీ యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ల కు బదిలీ అయిన నిధుల పై దర్యాప్తు తీస్తుంటే,ఢిల్లీ పేలుళ్లపై దర్యాప్తు చేపట్టిన ఎన్ ఐఏ ఫరీదాబాద్ మాడ్యూల్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల అంశాన్ని పరీశీలిస్తుంది. అల్- ఫలాహ్ వర్సిటీలో పోలీసులు మరో పక్క హర్యానా పోలీసులు రంగంలోకి దిగి యూనివర్సిటీలోని 50 మందికి పైగా ఉద్యోగులు, ఆస్పత్రికి సంబంధించిన వైద్యులను ప్రశ్నించారు. ముగ్గురు డాక్టర్లకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీలో డాక్టర్ల రిక్రూట్ మెంట్ కు అనుసరించిన విధానాన్ని ఆరా తీస్తున్నారు.పేలుడుకు కారకుడైన డాక్టర్ ఉమర్ నబీ గతంలో అనంతనాగ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసేవాడు. అతడి నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి చనిపోవడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించినా, ఆ విషయాన్ని పట్టించుకోకుండా 2023లో అల్- ఫలాహ్ లో డాక్టర్ గా నియమించడం పై దర్యాప్తు సాగుతోంది.

మన తెలంగాణ 13 Nov 2025 7:14 pm

Adilabad |గాజుల సవ్వడి…

Adilabad | గాజుల సవ్వడి… Adilabad | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి

ప్రభ న్యూస్ 13 Nov 2025 7:12 pm

ఢిల్లీ పేలుడు ఘటన దేశ వ్యతిరేక శక్తుల కుతంత్రమే: రాంచందర్ రావు

ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద పేలుడు ఘటన దేశ వ్యతిరేక శక్తుల కుతంత్రమేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు.ఈ దాడి దేశంలో శాంతిని భగ్నం చేసేందుకు, దేశ ప్రగతిని అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా పాల్పడిన చర్యగా అభివర్ణించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దోషులను కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టదని అన్నారు. దేశం మొత్తం ఇలాంటి ఉగ్రవాద చర్యలను అరికట్టేందుకు కేంద్రానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 13 Nov 2025 7:07 pm

Nalgonda |సొంత నిధుల‌తో…

Nalgonda | సొంత నిధుల‌తో… Nalgonda | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్

ప్రభ న్యూస్ 13 Nov 2025 7:06 pm

Adilabad |ఉద్యోగుల నిరసన..

Adilabad | ఉద్యోగుల నిరసన.. Adilabad | జైనూర్, ఆంధ్రప్రభ : సమగ్ర

ప్రభ న్యూస్ 13 Nov 2025 7:00 pm

Nalgonda |ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలి

Nalgonda | ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలి Nalgonda | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Nov 2025 6:54 pm

Video : Exclusive Interview with Dushyanth & Ashika Ranganath

The post Video : Exclusive Interview with Dushyanth & Ashika Ranganath appeared first on Telugu360 .

తెలుగు 360 13 Nov 2025 6:52 pm

Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ మోసానికి వృద్ధుడి బలి, ₹87.9 లక్షలు కోల్పోయిన రిటైర్డ్ ఉద్యోగి

పోలీసులుగా, సీబీఐ అధికారులుగా నటించిన మోసగాళ్లు

తెలుగు పోస్ట్ 13 Nov 2025 6:51 pm

Warangal |సంక్షేమ ప‌థ‌కాలు అందించాలి…

Warangal | సంక్షేమ ప‌థ‌కాలు అందించాలి… Warangal | కరీమాబాద్, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 13 Nov 2025 6:46 pm

Defamation case |మంత్రి సురేఖ కు ఊరట !!

Defamation case | మంత్రి సురేఖ కు ఊరట !! హైదరాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Nov 2025 6:44 pm

Kalvakuntla Kavitha : కవిత ఇక వారి ట్రాప్ లో పడరట.. రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసుకున్నట్లే

తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 6:40 pm

Ranga Reddy |ఆక‌స్మిక త‌నిఖీ…

Ranga Reddy | ఆక‌స్మిక త‌నిఖీ… Ranga Reddy | తాండూర్‌, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 13 Nov 2025 6:35 pm

కెబీఆర్ పార్క్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు..

హైదరాబాద్: గంజాయి, డ్రగ్క్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.50కిలోల గంజాయి, 2గ్రాముల ఎండిఎంఏ, రూ.5,500 నగదు, రెండు బైక్‌లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ సమీపంలోని బంజారాహిల్స్‌లోని కెబీఆర్ పార్క్ వద్ద గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరుగు తున్నాయనే సమాచారం వచ్చింది. వెంటనే హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్న పి. వేమేష్, కె. దేవి చరణ్, వై. హేమంత్‌ను అరెస్టు చేశారు. ఈ దాడిలో సీఐతో పాటు కానిసేబుళ్లు కిరణ్, శ్రీకాంత్, సాయి కుమార్, ప్రసాద్ పాల్గొన్నారు. కేసు దర్యాప్తు కోసం గంజాయి, డ్రగ్స్‌తోపాటు ముగ్గురు నిందితులను అమీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. 48 మద్యం బాటిళ్ల స్వాధీనం... గోవా, ఢిల్లీ, హర్యానా నుంచి తీసుకుని వస్తున్న నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్‌ను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఎస్టీఎఫ్ సీ అండ్ డీ టీమ్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి హహాడ్ షరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. పలు వాహనాలను తనిఖీలు చేయగా 48 నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ పట్టుబడినట్లు ఎస్టీఎఫ్ సీ టీమ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మంజు తెలిపారు.

మన తెలంగాణ 13 Nov 2025 6:23 pm

IPL 2026 |ఈసారి కూడా అంతే !

IPL 2026 | ఈసారి కూడా అంతే ! ఆంధ్రప్రభ : ఇండియన్

ప్రభ న్యూస్ 13 Nov 2025 6:19 pm

Adilabad |గంజాయి ముఠా అరెస్ట్..

Adilabad | గంజాయి ముఠా అరెస్ట్.. Adilabad | ఖానాపూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Nov 2025 6:18 pm

Telangana |దొంగనోట్ల తయారీ కలకలం

Telangana | దొంగనోట్ల తయారీ కలకలం హైదరాబాద్ లో పట్టుబడిన ముఠాతో గుట్టు

ప్రభ న్యూస్ 13 Nov 2025 6:17 pm

Video : Hero Surya Sethupathi Exclusive Interview

The post Video : Hero Surya Sethupathi Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 13 Nov 2025 6:12 pm

Nizamabad |అనువైన స్థ‌లం ఎంపిక‌…

Nizamabad | అనువైన స్థ‌లం ఎంపిక‌… Nizamabad | బిక్కనూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Nov 2025 6:12 pm

Telangana |రైల్వేస్టేషన్ లో విస్తృత తనిఖీలు

Telangana | రైల్వేస్టేషన్ లో విస్తృత తనిఖీలు Telangana | కరీమాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Nov 2025 6:08 pm

ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జనగామ, ఆంధ్రప్రభ : విద్యా

ప్రభ న్యూస్ 13 Nov 2025 6:06 pm

Telangana |ఏసీబీ వలలో….

Telangana | ఏసీబీ వలలో…. ఆదిబట్ల మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు…ఏసీబీ వలలో చిక్కిన

ప్రభ న్యూస్ 13 Nov 2025 5:58 pm

WGL |దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వ ఆర్థిక సహాయం

WGL | దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వ ఆర్థిక సహాయం హనుమకొండ ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 13 Nov 2025 5:56 pm

మంత్రి కొండా సురేఖ క్షమాపణ.. నాగార్జున కీలక నిర్ణయం

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై పెట్టిన కేసు విషయంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రిపై పెట్టిన పరువు నష్టం దావా కేసును గురువారం నాగార్జున ఉపసంహరించుకున్నారు. గతంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ మంత్రి కొండా సురేఖ బుధవారం ట్వీట్‌ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు. నాగార్జున బాధపడి ఉంటే.. అందుకు చింతిస్తునన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని.. నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పారు. దీంతో నాగార్జున.. మంత్రి సురేఖపై కేసును విత్ డ్రా చేసుకున్నారు.

మన తెలంగాణ 13 Nov 2025 5:40 pm

Nalgonda |హోల్డింగ్ రూమ్ ఏర్పాటు…

Nalgonda | హోల్డింగ్ రూమ్ ఏర్పాటు… Nalgonda | చిట్యాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Nov 2025 5:28 pm

Gold Price |ఊహించ‌ని షాక్‌.. ప‌సిడి ర‌న్‌!

Gold Price | ఊహించ‌ని షాక్‌.. ప‌సిడి ర‌న్‌! వెబ్ బిజినెస్ డెస్క్‌,

ప్రభ న్యూస్ 13 Nov 2025 5:27 pm

Telangana |ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి..

Telangana | ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి.. రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్​ డైరెక్టర్

ప్రభ న్యూస్ 13 Nov 2025 5:24 pm

Warangal |క‌లెక్ట‌ర్‌కు విన‌తి ప‌త్రం…

Warangal | క‌లెక్ట‌ర్‌కు విన‌తి ప‌త్రం… Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Nov 2025 5:16 pm

Adilabad |రైతులు అధైర్య‌ప‌డొద్దు…

Adilabad | రైతులు అధైర్య‌ప‌డొద్దు… Adilabad | జైనూర్, ఆంధ్రప్రభ : రైతులు

ప్రభ న్యూస్ 13 Nov 2025 5:05 pm

AP |భారీ వాహనాలు వెళ్లొద్దు..

AP | భారీ వాహనాలు వెళ్లొద్దు.. కుందూ పాత వంతెన పునరుద్ధరణ పనులు

ప్రభ న్యూస్ 13 Nov 2025 5:01 pm

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తాం

: భారత్-ఈయూ సదస్సులో సీఎం చంద్రబాబుముగిసిన భారత్-ఈయూ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంగ్రీన్ ఎనర్జీయే ప్రపంచానికి కీలకమని స్పష్టం చేసిన చంద్రబాబు భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు.. సుస్థిరాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యతపై కీలక ప్రసంగం చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. […] The post ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Nov 2025 4:55 pm

AP |కొండచిలువను కొట్టిచంపారు..

AP | కొండచిలువను కొట్టిచంపారు.. AP | తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి

ప్రభ న్యూస్ 13 Nov 2025 4:49 pm

Warangal |పరీక్ష ప్యాడ్స్ పంపిణీ…….

Warangal | పరీక్ష ప్యాడ్స్ పంపిణీ……. Warangal | రేగొండ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Nov 2025 4:43 pm

Telangana |ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి

Telangana | ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి Telangana | కమ్మర్ పల్లి,

ప్రభ న్యూస్ 13 Nov 2025 4:38 pm

Andhra Prabha Smart Edition |టెర్ర‌ర్ హ‌బ్‌/స్వ‌ర్గ‌ధామం/రెన్యూ ప‌వ‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 13-11-2025, 4.00PM రూమ్ నెం.17.. టెర్ర‌ర్ హ‌బ్‌ పెట్టుబ‌డుల

ప్రభ న్యూస్ 13 Nov 2025 4:28 pm

రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన చిగిచెర్ల విద్యార్థులు

విశాలాంధ్ర -ధర్మవరం : రాష్ట్రస్థాయి జూడో పోటీలలో స్వర్ణ పథకాలు చికిచెర్ల విద్యార్థులు సాధించడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ6వ తేదీ నుండి 10 వ తేదీ వరకూ కాకినాడ డి ఎస్ ఏ స్టేడియం లో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్ 17 రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో చిగిచెర్ల పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభతో స్వర్ణ పతకాలు సాధించి ఉమ్మడి అనంతపురం జిల్లా జూడో […] The post రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన చిగిచెర్ల విద్యార్థులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Nov 2025 4:23 pm

ఆటో బోల్తా.. ఏడుగురు కూలీలకు గాయాలు

 హైదరాబాద్: నల్గొండ జిల్లా లో రోడ్డు చందంపేట మండలం బుగ్గతండా వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పత్తి ఏరివేతకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. గమనించిన స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలకు వెళితే.. క్షతగాత్రులు పెద్ద ఆడిషర్లపల్లి మండలం పెద్దగుమ్మడం వాసులుగా పోలీసులు గుర్తించారు.

మన తెలంగాణ 13 Nov 2025 4:20 pm

Telangana |గ్రీజర్లు ఏర్పాటు చేయాలి

Telangana | గ్రీజర్లు ఏర్పాటు చేయాలి Telangana | నల్లబెల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Nov 2025 4:07 pm

ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు పెడతాం : భట్టి

హైదరాబాద్: విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా కరెంటు సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామని డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. ప్రజలకే జవాబు దారీగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొనియాడారు. ఎంత త్వరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేస్తామని భట్టి తెలియజేశారు. ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు పెడతామని, ప్రజల సొమ్ము దోపిడీకి గురి కానివ్వమని అన్నారు. ఎక్కడ ఉన్నా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని, మధిర ప్రజలు వేసిన ప్రతి ఓటుకు గౌరవం తీసుకువస్తామని భట్టి పేర్కొన్నారు.  

మన తెలంగాణ 13 Nov 2025 4:05 pm

plane |సిగరెట్ తాగిన ప్రయాణికుడు

plane | సిగరెట్ తాగిన ప్రయాణికుడు plane | శంషాబాద్ రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Nov 2025 3:59 pm

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం) : ఉరవకొండ పట్టణంలో సెంట్రల్ హైస్కూల్లో (1985-86) విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక బెంగళూరులోని వెన్యూ రెస్టారెంట్లో ఘనంగా నిర్వహించారు.సెంట్రల్ హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థి పార్థసారథి కూతురు పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు ఒకరిని ఒకరు కలుసుకొని వారి వారి పాత జ్ఞాపకాలను యోగక్షమలను కుటుంబాల పరిస్థితులను, అడిగి తెలుసుకున్నారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన రోజుల్లో గత స్మృతులను నెమరు చేసుకున్నారు. […] The post పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Nov 2025 3:54 pm

వసతి గృహాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ఎస్సీ బాలికల వసతి గృహాల అభివృద్ధికి సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి పేర్కొన్నారు. మండలంలో పరింపూడి గ్రామంలో ఉన్న వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం శిధిలావస్థకు చేరుకుంటుందని సంబంధిత అధికారులు వసతి గృహ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. వసతి గృహాన్ని ఆమె గురువారం సందర్శించారు. వసతి గృహంలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. […] The post వసతి గృహాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Nov 2025 3:50 pm

Chief Whip |పంటలను ఎలుకల బారి నుండి కాపాడుకోవాలి

ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ Chief Whip | శావల్యాపురం, పల్నాడు జిల్లా

ప్రభ న్యూస్ 13 Nov 2025 3:49 pm

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

విశాలాంధ్ర, నెల్లిమర్ల: జనసేన కూటమి ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చేతుల మీదుగా పసుపులేటి భాను ప్రసాద్ తల్లిదండ్రులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడం జరిగింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు భాను ప్రసాద్ ఆరోగ్యం బాగోక తీవ్ర స్థితికి చేరుకున్నారు. ఎన్నికల అనంతరం లోకం నాగ మాధవి కూటమి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఆమె ప్రత్యేక శ్రద్ధతో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తును ముందుకు తీసుకెళ్లారు. రెండుసార్లు తిరస్కరించబడిన దరఖాస్తును పట్టుదలతో ముందుకు నెట్టి […] The post సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Nov 2025 3:47 pm

Adilabad |వ్యాధి నివారణ టీకాలు…

Adilabad | వ్యాధి నివారణ టీకాలు… Adilabad | ఇచ్చోడ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Nov 2025 3:40 pm

విశాఖ చేరుకున్న నారా లోకేశ్.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి

విశాఖలో లోకేశ్ కు ఘన స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలుచంద్రబాబుతో కలిసి కీలక కార్యక్రమంలో పాల్గొననున్న లోకేశ్ రహేజా ఐటీ స్పేస్, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ పనులకు శ్రీకారంఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం చేరుకున్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు విశాఖ విమానాశ్రయంలో కూటమి ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.విమానాశ్రయం నుంచి మంత్రి లోకేశ్ నేరుగా నోవాటెల్ హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ […] The post విశాఖ చేరుకున్న నారా లోకేశ్.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Nov 2025 3:39 pm

Minister |గుడ్ కాంబినేషన్.. కావాలి హిట్ కాంబినేషన్

కలెక్టర్, ఎస్పీలకు మంత్రి సవిత కితాబు శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Nov 2025 3:36 pm

AP |కార్యకర్తలే బాస్ లు

AP | కార్యకర్తలే బాస్ లు కష్టపడిన వారికే టీడీపీ పార్టీలో సముచిత

ప్రభ న్యూస్ 13 Nov 2025 3:35 pm

MLA |దార్శనికత అమలుకు శ్రీకారం

MLA | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : స్వర్ణ ఆంధ్ర 2047 విజన్

ప్రభ న్యూస్ 13 Nov 2025 3:25 pm

Pakistan |క‌య్యానికి కాలు దువ్వుతున్న పాక్‌!

Pakistan | క‌య్యానికి కాలు దువ్వుతున్న పాక్‌! Pakistan | వెబ్ డెస్క్‌,

ప్రభ న్యూస్ 13 Nov 2025 3:20 pm

Hanumakonda |ఘోర రోడ్డు ప్ర‌మాదం

Hanumakonda | ఘోర రోడ్డు ప్ర‌మాదం ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర

ప్రభ న్యూస్ 13 Nov 2025 3:18 pm

Seetakka |అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Seetakka | అభివృద్ధి పనులకు శంకుస్థాపన Seetakka |ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి :

ప్రభ న్యూస్ 13 Nov 2025 3:08 pm

Lokesh |మంత్రి లోకేష్‌కు ఘనస్వాగతం

Lokesh | విశాఖపట్నం, ఆంధ్ర‌ప్ర‌భ : విశాఖ విమానాశ్రయంలో విద్య, ఐటీ శాఖల

ప్రభ న్యూస్ 13 Nov 2025 3:01 pm

A Big Shock for Rajinikanth and Kamal Haasan Film

Two Superstars Rajinikanth and Kamal Haasan are all set to collaborate for a film and Kamal’s Raajkamal Films International is on board to bankroll the film while Rajinikanth plays the lead role. Talented director Sundar C came on board to direct the project and an official announcement was made. In a sudden shock, Sundar has […] The post A Big Shock for Rajinikanth and Kamal Haasan Film appeared first on Telugu360 .

తెలుగు 360 13 Nov 2025 3:01 pm

Donald Trump H-1B |అమెరికాలో శిక్ష‌ణ ఇవ్వ‌డానికే?!

Donald Trump H-1B | అమెరికాలో శిక్ష‌ణ ఇవ్వ‌డానికే?! Donald Trump |

ప్రభ న్యూస్ 13 Nov 2025 2:57 pm