మంగిన పూడి బీచ్ లో భక్తజనం కోటి పరవళ్లు
మంగిన పూడి బీచ్ లో భక్తజనం కోటి పరవళ్లు మచిలీపట్నం ప్రతినిధి, ఆంధ్రప్రభ
ఏసీబీ రైడ్స్ కిటికీలోనుంచి డబ్బుల వర్షంఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
శ్రీశైలం ఘాట్లో బస్సు ప్రమాదం
తప్పిన ప్రాణాపాయం నాగర్ కర్నూల్, నంద్యాల, ఆంధ్రప్రభ : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్
వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నకిరేకల్, నవంబర్ 5 (ఆంధ్రప్రభ) : కార్తీక
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
రైతులను పట్టించుకోని ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రైతులు కష్టాల్లో
పులివెందుల మెడికల్ కాలేజీ నుంచి అత్యాధునిక పరికరాలను ఎందుకు తరలిస్తున్నారు: అవినాష్ రెడ్డి
అమరావతి: పులివెందుల అంటే ఎందుకింత కక్ష్య అని వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని, అయినా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. పైగా పులివెందుల మెడికల్ కాలేజ్ లో ఉన్న అత్యాధునిక పరికరాలను ఎక్కడికి తరలిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపి అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీకి అత్యాధునిక పరికరాలు సమకూర్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ సీట్లు రాకుండా చేసిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రైవేటీకరణ, పరికరాల తరలింపు ఆపాలని డిమాండ్ చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీలో పరికరాల తరలింపుపై కడప టిడిపి నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వైసిపి కార్యకర్తలను వేధింపులకు గురి చేయడమే టిడిపి లక్ష్యమని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. డిఎంఇ ఉత్తర్వుల మేరకు పరికరాలను తరలిస్తున్నామని సూపరింటెండెంట్ మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే.
పోటెత్తిన భక్తజనం.. క్యూలైన్లలో బారులు..
పోటెత్తిన భక్తజనం.. క్యూలైన్లలో బారులు.. పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం
192 మద్యం బాటిల్స్ పట్టివేత.. హైదరాబాద్ (ఆంధ్రప్రభ):గోవా, ఢిల్లీ, పాండిచ్చేరి ప్రాంతాల నుంచి
తాండూరు వాసుల దుర్మరణం దురదృష్టకరం
తాండూరు వాసుల దుర్మరణం దురదృష్టకరం తాండూరు, ఆంధ్రప్రభ : ఆర్టీసీ బస్సు రోడ్డు
రాజారాం పల్లెలో కిడ్నాప్ కలకలం..
రాజారాం పల్లెలో కిడ్నాప్ కలకలం.. ఎండపల్లి (ఆంధ్రప్రభ)ఎండపల్లి మండలం రాజారాం పల్లె వద్ద
ట్రేడింగ్ పేరిట భారీ మోసం... కిలాడీ వలకు చిక్కిన వ్యాపారి
హైదరాబాద్: స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మహిళలు ఓ వ్యాపారిని రూ.4.89 కోట్లు మోసం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన వ్యాపారి (41) స్టాక్ ట్రేడింగ్లో లాభాలు వస్తాయని అంటూ ఇద్దరు మహిళలు మాయమాటలతో రూ.4.89 కోట్లు స్టాక్ మార్కెట్ లో పెట్టించారు. విశాఖపట్నం జిల్లా భీమిలి ప్రాంతానికి చెందిన లావణ్య దాసరి,అర్పితగా సదరు వ్యాపారిని పరిచయం చేసుకున్నారు. మొదట ఫోన్పే ద్వారా 50,000 పెట్టుబడి పెట్టాలని సూచించారు. లాభంతో వచ్చిందని సదరు వ్యాపారి చెప్పడంతో నకిలీ ప్రూఫ్ ను చూపించారు. ఆ తర్వాత మొత్తం రూ. 4.89 కోట్ల రూపాయాలను బదిలీ చేయించుకున్నారు. ఖాతాలో 16 కోట్లు రూపాయలు లాభం వచ్చిందని చూపించారు, చివరగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పేరిట రూ. 2.5 కోట్లు అడిగారు. దీంతో బాధితుడు మోసపోయానని గ్రహించి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లిక్కర్ కేసులో జగన్ పాత్ర ఉంది: ఆది నారాయణ రెడ్డి
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంతో మంది పాత్ర ఉంది అని బిజెపి నేత ఆది నారాయణ రెడ్డి తెలిపారు. తాము మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు సూపర్ చెక్ పెట్టబోతున్నాం అని అన్నారు. భారత రాజ్యాంగాన్ని జగన్ అమలు చేశారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు దోషులు దాక్కున్నారని, కేసును సిబిఐ కి అప్పగించాలని అధికారులకు సూచించారు. తాము, బిటెక్ రవి, సతీష్ రెడ్డి కలిసి వివేకాను చంపామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ కేసులో జగన్ పాత్ర ఉందని,జగన్ తో పాటు అనేకమంది జైలుకు వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. జగన్ మాట్లాడే ప్రతి మాటకు తాను సమాధానం చెబుతానని, ప్రజలతోనే కాదని, చెల్లెళ్లతో కూడా ఛీ కొట్టించుకున్నారని మండిపడ్డారు. జగన్ కు డబ్బులు, పదవి ఉంటే చాలని.. ధర్మం, న్యాయం అవసరం లేదని ధ్వజమెత్తారు. ధర్మ సంస్కృతి కూటమి ప్రభుత్వానిది అని ధర్మ వికృతి జగన్ ది అని విమర్శించారు. పూర్ణోదయ ప్రాజెక్టు కింద ఎపికి రూ. 26 వేల కోట్లు ఇస్తున్నారని, జగన్ పేదల ఇళ్లు కట్టకుండా ప్యాలెస్ లు కట్టుకున్నారని ఆది నారాయణ రెడ్డి దుయ్యబట్టారు.
Chandrababu Naidu at London Forum: ‘Governments and Industry Must Unite for a Sustainable Future’
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has called for urgent global collaboration to tackle the growing threat of climate change. Speaking at the Institute of Directors Global Convention in London, Naidu emphasised that nations must act now before adverse climate conditions push humanity toward irreversible damage. He said it is the responsibility of both […] The post Chandrababu Naidu at London Forum: ‘Governments and Industry Must Unite for a Sustainable Future’ appeared first on Telugu360 .
కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఊట్కూర్, (ఆంధ్రప్రభ)కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం వీఆర్ పురం, ఏఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రభ :
TDP : ఆరోజు కోసమే పితాని వెయిట్ చేస్తున్నాడటగా
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తన కంటూ ఒక రోజు వస్తుందని బలంగా నమ్ముతున్నారు
హైదరాబాద్-విజయవాడ హైవే ఆరు లేన్ల విస్తరణకు కేంద్ర అనుమతి
హైదరాబాద్ నుండి విజయవాడ వరకు సాగుతున్న 65వ జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ హైవేలో 40వ కిలోమీటరు నుంచి 269వ కిలోమీటరు వరకు, మొత్తం 229 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్లను ఆరు లేన్లుగా మార్చేందుకు భూసేకరణ అవసరం.ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంబంధిత అధికారులను నియమిస్తూ కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో..యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో […] The post హైదరాబాద్-విజయవాడ హైవే ఆరు లేన్ల విస్తరణకు కేంద్ర అనుమతి appeared first on Visalaandhra .
కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుతారు? #TeluguPost #telugu #post #news
కర్నూలులో మొబైల్ రికవరీ మేళా
కర్నూలులో మొబైల్ రికవరీ మేళా 669 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత కర్నూలు
విద్యార్థుల జీవితాలతో చెలగాటం..
విద్యార్థుల జీవితాలతో చెలగాటం.. అమరవీరుల స్థూపానికి వినతిపత్రం నర్సంపేట, నవంబర్ 5 (ఆంధ్రప్రభ):
తుఫాన్ బాధితులను ఆదుకోవాలి.. తొర్రూరు, (ఆంధ్రప్రభ):మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను
ఎన్టీఆర్ జిల్లాలోకి రెండు నియోజకవర్గాలు.. నేటి మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో చర్చ
ఎన్టీఆర్ జిల్లాలో గన్నవరం,నూజివీడు నియోజకవర్గాలను కలపడం,అలాగే కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లా పరిధిలో ఉంచడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నది.విజయవాడకు అనుబంధంగా ఉన్న పెనమలూరు నియోజకవర్గం మాత్రం ఇప్పటికీ కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలనే నిర్ణయం ఉన్నట్లు తెలుస్తోంది.మార్కాపురం,మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలని,అదనంగా పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించబడ్డాయి.ఇప్పుడు మరోకొన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ మొదలైంది. బుధవారం సచివాలయంలో […] The post ఎన్టీఆర్ జిల్లాలోకి రెండు నియోజకవర్గాలు.. నేటి మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో చర్చ appeared first on Visalaandhra .
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులా…
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులా… రహదారులపై అసెంబ్లీలో ప్రశ్నించినమంత్రి కోమటిరెడ్డి హామీ శూన్యందండుపాళ్యం ముఠా
మహానంది, ఓంకార క్షేత్రాల్లో ఏఎస్పీ పర్యటన
మహానంది, ఓంకార క్షేత్రాల్లో ఏఎస్పీ పర్యటన నంద్యాల బ్యూరో నవంబర్ 5 ఆంధ్రప్రభ
Telangana : మరో ఆర్టీసీ బస్సు కు ప్రమాదం
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు లో ఈ ఘటన జరిగింది.
పటాన్ చెరులో ఆర్టిసి బస్సుకు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జాతీయ రహదారి 65 పై ఆర్టిసి బస్సుకు ప్రమాదం తప్పింది. ముత్తంగి గ్రామ సమీపంలో ముందు ఉన్న కార్లను తప్పించబోయి బ్రేక్ పడకపోవడంతో డివైడర్ ఎక్కించి కరెంట్ స్తంభానికి ఆర్టిసి బస్సు ఢీకొంది. మేడ్చల్ డిపోకు చెందిన బస్సు మేడ్చల్ నుండి బాలానగర్ మీదుగా ఇస్నాపూర్ వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు సమాచారం మేరకు పటాన్ చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడకపోవడంతో ఆర్ టిసి, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. అదే విధంగా నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి బస్సు అదుపు తప్పి బురదలో కూరుకుపోయింది. రహదారిపై రోడ్డుకు అడ్డం బస్సు తిరగడంతో బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. సుమారు గంట పాటు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.
భక్తులతో కిటకిటలాడిన సోమేశ్వరాలయం
భక్తులతో కిటకిటలాడిన సోమేశ్వరాలయం నల్గొండ, నవంబర్ 5(ఆంధ్ర ప్రభ): కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని
జమ్మూకశ్మీర్లో ఆపరేషన్ ఛత్రు.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు
జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు బుధవారం ఆపరేషన్ ఛత్రును ప్రారంభించాయి.కిష్త్వార్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారన్న గూఢచారి సమాచారం రావడంతో బలగాలు అక్కడకు చేరుకుని వారిని పూర్తిగా ముట్టడించాయి.దీనితో సైనికులు,ఉగ్రవాదుల మధ్య భీకరంగా కాల్పులు జరిగినట్లు తెలిసింది.కిష్త్వార్లోని ఛత్రు ప్రాంతంలో ఆ ముగ్గురుఉగ్రవాదులు గతకొన్ని నెలలుగా నల్లచాటున ఉంటున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి.ఈసమాచారంపై ఆధారపడి భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్,కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలు తెల్లవారుజామునే ఇంటి ఇంటికీ తనిఖీలతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.ఉగ్రవాదులు […] The post జమ్మూకశ్మీర్లో ఆపరేషన్ ఛత్రు.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు appeared first on Visalaandhra .
ఒకే ఫొటోతో ఒకే అసెంబ్లీ స్థానంలో 100 ఓట్లు ఎలా ఉంటాయి: రాహుల్ గాంధీ
ఛండీగఢ్: ఓట్ చోరీపై హెచ్ ఫైల్స్ పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపణలు చేశారు. హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లలో భారీ అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు అందాయన్నారు. పోలైన పోస్టల్ ఓట్లకు, ఫలితాలకు చాలా తేడా ఉందన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోనూ భారీగా ఓట్ల చోరీ జరిగిందని దుయ్యబట్టారు. హర్యానాలో ఒక యువతికి 10 బూత్లలో 22 ఓట్లు ఉన్నాయని ఫొటోలను రాహుల్ చూపించారు. సీమా, స్వీటీ, సరస్వతి.. ఇలా వివిధ పేర్లతో ఒకే యువతికి అన్ని ఓట్లు ఎలా ఉంటాయని అడిగారు. సదరు యువతిని బ్రెజిల్కు చెందిన మోడల్గా గుర్తించామని వివరించారు. హర్యానాలో 2 కోట్ల ఓటర్లు ఉన్నారని, 25 లక్షల ఓట్లను దొంగలించారని ఆరోపణలు చేశారు. ఒకే ఫొటోతో ఒకే అసెంబ్లీ స్థానంలో 100 ఓట్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఓ మహిళ పేరుతో రెండు పోలింగ్ కేంద్రాల్లో 223 ఓట్లు ఎలా ఉంటాయని నిలదీశారు. హర్యానాలో గెలుస్తామని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని, అయినప్పటికీ ఫలితాలు తారుమరయ్యాయని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానాలో ఐదు లక్షలకు పైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని ధ్వజమెత్తారు. తప్పుడు చిరునామాలతో 93 వేలకు పైగా ఓట్లు ఉన్నాయని, ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. బిజెపికి లబ్ధి కలిగించేందుకు ఇలా వ్యవహరించారని మండిపడ్డారు. హర్యానాలో ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి నకిలీ ఓటు ఉందన్నారు. ఎన్నికల సంఘటం తలుచుకుంటే డూప్లికేట్ ఓట్లను సెకన్లలోనే తొలగించొచ్చని పేర్కొంది. ఇసికి బిజెపి సహాయం చేసిందని, ఉత్తర ప్రదేశ్లో ఓటు వేసి వారు వేల సంఖ్యలో హర్యానాలో ఓటు వేశారని రాహుల్ దుయ్యబట్టారు. బిజెపి వాళ్లు అయినంత మాత్రాన దేశంలో ఎక్కడైనా ఓటు వేస్తారా? అని ధ్వజమెత్తారు. వేల మందికి యుపి, హర్యానాలో డబుల్ ఓట్లు ఉన్నాయని చురకలంటించారు. ఇళ్లు లేని ఓటర్లకు ఇంటి నంబర్ 0 ఇచ్చామని ఇసి చెప్పిందని, ఇంటి నంబర్ 0 ఉన్న ఓటర్లను కూడా తాము తనిఖీ చేశామన్నారు.
ఏపీకి వర్ష సూచన.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నేడు కోస్తా, రాయలసీమలోని 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలుఎల్లుండి నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వానలు కురిసే అవకాశంపిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరికబంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాగల రెండు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఏపీ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ […] The post ఏపీకి వర్ష సూచన.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు appeared first on Visalaandhra .
Jana Sena : జనసేన ఎమ్మెల్యే పై కుట్ర జరుగుతుందా? లోకం తీరు మారదా?
జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి కూటమి పార్టీలోని నేతలకు అస్సలు పడటం లేదు.
చట్నీ మీద పడిందని హత్య చేసిన కిరాతకులు
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఒక యువకుడిని కిరాతకంగా హత్య చేశారు
ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో వేకువజాము నుంచే భక్తుల రద్దీ కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తిక మాసంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ రోజున శివ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.రాష్ట్రంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంతో పాటు పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట, భీమవరం, పాలకొల్లులో భక్తుల సందడి నెలకొంది. అదేవిధంగా […] The post శివాలయాలకు పోటెత్తిన భక్తులు appeared first on Visalaandhra .
శ్రీశైలం, మహానంది, ఓంకారం పుణ్యక్షేత్రాలు కిటకిట
నంద్యాల బ్యూరో నవంబర్, ఆంధ్రప్రభ : జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ
రాజేంద్రనగర్ లో గంజాయి బ్యాచ్ హల్ చల్... పట్టించుకోని పోలీసులు
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబొడ కాలనీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. పార్క్ చేసిన కారు అద్దాలను గంజాయి గ్యాంగ్ ధ్వంసం చేసింది. ఈ విషయమై ప్రశ్నించిడంతో యజమానితో గంజాయి బ్యాచ్ దురుసుగా ప్రవర్తించింది. తనకు పగలగొట్టాలనిపించింది అందుకే పగలగొట్టాను అని గరుకుగా సమాధానం చెప్పి వారు వెళ్లిపోయారు. కారు మొత్తం తగలబెడతామని యాజమానిని ఉల్టా బెదిరింపులకు పాల్పడ్డారు. అడ్డు వచ్చిన వారిపై దాడులకు పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు ఫోన్ కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు చేస్తేనే వస్తామని వస్తామని ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో వింత సమాధానం చెప్పారు. పోలీసుల తీరుపై ఎర్రబొడ వాసుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు నమోదు చేయకుండా లీడర్లు సముదాయిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబొడలో బీరప్ప గుడిమెట్లపై మందుబాబులు మద్యం సేవించి అనంతరం బీర్ బాటిల్స్ అక్కడే పడేసి వెళ్లిపోయారు. ఈ విషయంపై ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోను కూడా అదే ప్రాంతంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పలువురు మహిళలతో గంజాయి బ్యాచ్ అసభ్యంగా ప్రవర్తించింది. వెకిలి సైగలతో మహిళలు ఆవేదనకు గురవుతున్నారు. పోలీసులకు సమాచారం అందించినప్పటికీ ఘటన స్థలానికి చేరుకోలేదని వాపోయారు.
మూడేండ్లు గడిచినా షరా మాములే… మట్టి రోడ్డే శరణ్యంచోద్యం చూస్తున్న అధికారులు, కాంట్రాక్టర్
America : వర్జీనియా లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా హైదరాబాదీ.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన హష్మి
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా డెమోక్రాట్ గజాలా హష్మీ విజయం సాధించారు
కార్తిక పౌర్ణమి వేళ విషాదం.. రైలు ఢీకొని ఆరుగురు భక్తుల మృతి
మీర్జాపూర్లో ఘోర రైలు ప్రమాదం ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చునార్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ఆరుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కార్తిక పౌర్ణమి పుణ్యస్నానాల కోసం వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.చోపాన్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లే ప్యాసింజర్ రైలు (13309) చునార్ స్టేషన్లోని 4వ నంబర్ ప్లాట్ఫామ్పై ఆగింది. ఈ రైలులో వచ్చిన భక్తులు, ఫుట్ ఓవర్బ్రిడ్జిని […] The post కార్తిక పౌర్ణమి వేళ విషాదం.. రైలు ఢీకొని ఆరుగురు భక్తుల మృతి appeared first on Visalaandhra .
ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుంది..
ప్రతీ గింజను ప్రభుత్వమే కొంటుంది.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలిచండూర్ వ్యవసాయ
దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి #telugupost #rangareddy #hyderabad #latestnews #richestdist
మార్మోగిన శివనామస్మరణ మార్మోగిన శివనామస్మరణ నర్సంపేట నవంబర్ ( ఆంధ్రప్రభ) : వరంగల్
Ex-Minister Jogi Ramesh Caught in Land Scam Linked to Fake Liquor Case
Former Andhra Pradesh minister Jogi Ramesh finds himself at the centre of another storm. After being named in a fake liquor case, new reports now reveal his deep involvement in a major land scam. Investigations suggest that during his tenure as minister, Ramesh used his political power to illegally acquire valuable AgriGold properties that had […] The post Ex-Minister Jogi Ramesh Caught in Land Scam Linked to Fake Liquor Case appeared first on Telugu360 .
ఆలయానికి ముస్లిం వ్యాపారి రూ.కోటి విరాళం #Karnataka #Temple #Harmony #SyedUllaSakhaf #Basaveshwara
Bigg Boss 9 : రెబల్స్ టాస్క్ నుంచి ఈరోజు తప్పించేదెవరినంటే?
బిగ్ బాస్ టాస్క్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మూడు టీంలుగా విడగొట్టి బిగ్ బాస్ ను మరింత హైప్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
శాశ్వత పరిష్కారం చూపాలి.. వర్షాలకు నీరు నిల్వ లేకుండా చర్యలుఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల
Sharwanand turns Most Determined
Young actor Sharwanand has delivered a series of flops. His theatrical and non-theatrical market has seen a huge decline. The actor surprised and shocked everyone in a lean and stylish look. Keeping an end to all the speculations, the actor is busy completing all his pending projects. He has wrapped up the pending shoot of […] The post Sharwanand turns Most Determined appeared first on Telugu360 .
బీహార్ రాష్ట్రం కొన్నేళ్లుగా నిరుద్యోగంతో అల్లాడుతుండగా ఎన్నికల జాతరలో నాయకులు, పార్టీలు ఇచ్చిన హామీల జల్లు నిరుద్యోగ యువతకు ఏమాత్రం ఊరట కలిగించడం లేదు. ఈ సమస్యను అంతగా పట్టించుకోని పాలక వర్గాలు, విపక్షాలు మహిళల ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ఆకర్షణీయ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళల ఓట్లు ఎంతవరకు గెలుపును నిర్ణయిస్తుందన్నదే ప్రశ్న. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రంలోని 21 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అయ్యేలా మొత్తం రూ. 2100 కోట్లు బదిలీ చేశారు. ఇది ప్రతి మహిళా ఓటరుకు రూ. 10 వేలు వంతున ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద ఆర్థిక సాయం చేయడమే. ఈ పథకాన్ని గత సెప్టెంబర్ నెలాఖరులో ప్రధాని మోడీ ప్రారంభించారు. దీనికి దీటుగా విపక్షం ఆర్జెడి తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చేలా ఓటు వేస్తే ఆర్థికంగా బలహీనులైన, వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతి మహిళకు నెలకు రూ. 2500 వంతున ఆర్థికసాయం అందేలా ‘మై బహిన్ మాన్ యోజన’ పథకాన్ని అమలు చేస్తామని హామీ ప్రకటించడం విశేషం. ఈ రెండు భారీ ప్రకటనలు బీహార్ మహిళలపట్ల తమకున్న అచంచలమైన నిబద్ధతను చాటి చెబుతున్నాయి. కులగతిశీలత, పితృస్వామ్యంతో నిండిన రాష్ట్రంలో స్త్రీలను స్వతంత్రంగా చూసుకోవడం చాలా విడ్డూరంగా ఉంటోంది. ఈ విషయంలో ప్రతి నియోజకవర్గం రెండుగా చీలిపోవడం ఆశ్చర్యం కాదు. 2014 నుంచి మహిళల కేంద్రంగా ఓటు బ్యాంకు కొల్లగొట్టడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగని మహిళల ఓట్లే విజయావకాశాలను నిర్ణయిస్తాయని కాదు. బీహార్లోని మహిళలు తమ అభ్యర్థి ఎవరో ఎంచుకుని ఓటేసే స్వతంత్రత కూడా లేదు. నితీశ్ కుమార్ మొదటిసారి 2005 లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మహిళలను ఆకర్షించే పథకాలతో మహిళా కేంద్రీకృత రాజకీయాలనే నడుపుతున్నారు. ఫలితంగానే 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళా ఓటర్లు పోటెత్తారు. మహిళా ఓటింగ్ 54.5% ఉండగా, పురుషుల ఓటింగ్ 51.1% మాత్రమే ఉంది. ఈ వ్యత్యాసం జాతీయంగా 2019 ఎన్నికల్లో తీరింది. అయితే విచిత్రమే మంటే ఈసారి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) తుది జాబితాలో లేని 47 లక్షల ఓటర్లలో 16 లక్షల మంది మహిళా ఓటర్లే ఉండడం ప్రత్యేకంగా గమనించవలసి ఉంది. వీరంతా ఇబిసిలు, దళితులే. ఇదిలా ఉండగా 2023 లో బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కులాల సర్వే రాజకీయ వైఖరులను శాశ్వతంగా మార్చివేసింది. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను నిర్ణయించడానికి వాస్తవంగా ఏ పార్టీలకూ ఆయా కుల సముదాయాల కచ్చితమైన సంఖ్యాబలం ఎంతో అవసరం లేదు. కానీ వెల్లడవుతున్న అంశాలను పరిశీలిస్తే కొన్ని అంచనాలు తెరపైకి వస్తున్నాయి. వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఇబిసి) జనాభాలో 36 శాతం ఉండగా, చాలా వెనుకబడిన ఇతర తరగతులు (ఒబిసి)తో కలుపుకుని 60% వరకు ఉన్నారు. ఇందులో ‘పెద్దల’కు తప్పనిసరిగా సర్దుబాటు చేయాల్సిందే. ఇబిసిలను గమనిస్తే ‘మహాఘట్బంధన్ (ఎంజిబి)’లోనే వికాస్షీల్ ఇన్సాన్ (విఎస్ఐపి) కె చెందిన ముకేష్ సహానీ, డిప్యూటీ సిఎం పదవికి తప్పనిసరి అయ్యారు. 2020లో కులాల సర్వేకు ముందు ఆయనకు నిరాకరించినప్పటికీ, తరువాత ఇవ్వక తప్పలేదు. దీన్ని బట్టి, ఇబిసి, ఒబిసి వర్గాల నిర్ణయాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర వహిస్తాయని తెలుస్తోంది. ఏ ప్రభుత్వం వచ్చినా తమ స్థానాలు తమకు దక్కాలన్న పట్టుదల ఇబిసి, ఒబిసి వర్గాల్లో ప్రముఖంగా కనిపిస్తోంది. ఎన్డిఎలో ఇబిసి అభ్యర్థి నితీశ్ కుమార్ తన 2005లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సంక్షేమమే తన ప్రాధాన్యంగా నెగ్గుకు వస్తున్నారు. జెడియు పాప్యులారిటీని ఎన్డిఎ గ్రహించవలసి ఉంటుంది. నితీశ్పట్ల విధేయత చూపించవలసి ఉన్నప్పటికీ నిరుద్యోగ సమస్య తీవ్ర విఘాతంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తున్నారు. కానీ ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహించే పరీక్షల్లో పేపర్లీక్, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి, నోటిఫికేషన్లలో జాప్యం ఇవన్నీ యువతను కుంగదీస్తున్నాయి. కీలకమైన ప్రభుత్వ విభాగాల్లో రిక్రూట్మెంట్ ఆగిపోయింది. 2024, 2025 సంవత్సర మొదటి భాగంలో ఎగ్జామ్ పేపర్ లీక్ ఫలితంగా పోలీస్, స్టాఫ్ సెలెక్షన్, రెవెన్యూతోపాటు అనేక ప్రభుత్వ విభాగాల్లో రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చాలామంది యువ ఉద్యోగార్థుల్లో ఈ రిక్రూట్మెంట్ల్లో ఆలస్యాలు ప్రభుత్వ నమ్మకద్రోహమన్న నిర్లిప్తతను, నిరసనను మరింతపెంచాయి. తరచుగా ప్రభుత్వం ప్రకటనలు ఇస్తున్నా అనేక ఉద్యోగాలు, అనధికారికంగా, అస్థిరంగా ఉంటున్నాయి. ది పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం బీహార్లో నిరుద్యోగం రేటు 5% మించి ఉంది. కానీ కార్మిక భాగస్వామ్యం, వాస్తవానికి పనిచేస్తున్న లేదా పనికోసం నిరీక్షిస్తున్న వ్యక్తుల నిష్పత్తి దేశం మొత్తం మీద అత్యల్పంగా ఉంది. 15 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్న యువత వంద మందిలో కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అదే మహిళల్లో ఆ సంఖ్య చాలా చిన్నదిగా ఉంటోంది. నిరుద్యోగ సమస్య గ్రామాల్లో, పట్టణాల్లో యువత కుంగుబాటు పెంపునకు దోహదం చేస్తోంది.
America : అమెరికా షట్ డౌన్ అయి నేటికి 35 రోజులు.. ఇంకా ఎంతకాలం?
అమెరికా ప్రభుత్వం షట్డౌన్ అయి ఈరోజుకు 35వ రోజుకు చేరింది
కార్తీక పూజలతో శైవ క్షేత్రాలు కిటకిట..
కార్తీక పూజలతో శైవ క్షేత్రాలు కిటకిట.. ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ :కార్తీక
జూబ్లీహిల్స్ లోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్యే అవగాహన ఒప్పందం కుదిరిందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారని విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యుసఫ్ గూడ డివిజన్ వెంకటగిరిలో కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా కాంగ్రెస్, బిఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలోనూ, జూబ్లీహిల్స్ లోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
యుపిలో రైలు ఢీకొట్టడంతో నలుగురు ప్రయాణికులు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మిర్జాపూర్ ప్రాంతం చునార్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులను రైలు ఢీకొట్టింది. 13309 అనే నంబర్ గలం చోపాన్-ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నుంచి దిగుతున్న ప్రయాణికులను నేతాజీ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ప్రయాణికులు రాంగ్ వేలో పట్టాలపై వెళ్తుండగా 12311 అనే నంబర్ గల నేతాజీ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికి కూడా పట్టాలపై నుంచి దాటడంతోనే ఈప్రమాదం జరిగింది. ప్రయాణికుల నిర్లక్షమే వారి ప్రాణాలు తీసింది.
Road Accident : కర్ణాటకలో ఘోర ప్రమాదం.. తెలంగాణ వాసులు నలుగురు మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మరణించారు
A dual test for Bhagyashri Borse this month
Happening beauty Bhagyashri Borse stole the spotlight with her glamorous screen presence in Ravi Teja’s flop outing Mr. Bachchan, which marked her debut as an actress. Despite not getting a break with her second outing Kingdom, she has a promising career ahead in Tollywood with numerous offers in her kitty. Bhagyashri will now face a […] The post A dual test for Bhagyashri Borse this month appeared first on Telugu360 .
Ram Charan’s Peddi Chikiri Promo: Sensational and Engrossing
Mega Power Star Ram Charan created a huge viral sensation with the First Shot Glimpse of his magnum opus Peddi. The movie is being directed by Buchi Babu Sana and legendary music composer AR Rahman is composing music. Buchi Babu Sana, who showcased his great music taste in his debut blockbuster Uppena, looked like a […] The post Ram Charan’s Peddi Chikiri Promo: Sensational and Engrossing appeared first on Telugu360 .
Breaking : ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు... కుషాయిగూడలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడంతో ఆటో డ్రైవర్ మీన్రెడ్డి(32) ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ ఆటో డ్రైవర్ మీన్ రెడ్డి పట్టుబడ్డాడు. అతడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి కుషాయిగూడ ట్రాఫిక్ పిఎస్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రాఫిక్ పోలీసులు మంటలు ఆర్పేసి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మీన్రెడ్డిని దమ్మాయిగూడా వాసిగా పోలీసులు గుర్తించారు. ఆటోను వేరే ఓనర్ నుంచి అద్దెకు తీసుకొని మీన్రెడ్డి నడుపుతున్నాడు. శవ పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి మృతదేహం తరలించారు. పోలీసుల దురుసు ప్రవర్తనే ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 120 వచ్చిందని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Breaking |రైలు ఢీకొని… ఆరుగురు మృతి
రైలు ఢీకొని… ఆరుగురు మృతి మీర్జాపూర్ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో
సంగంబండ వరద ఒక గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల మక్తల్, (ఆంధ్రప్రభ)
వందేమాతరం.. తరతరాలకు స్ఫూర్తిదాయకం
భారత స్వాతంత్య్ర పోరాటంలో సాధారణ భారతీయులను సైతం భావోద్వేగంతో ఉర్రూతలూగించి, స్వతంత్ర సమరం వైపు నడిపించి, విప్లవకారులు నవ్వుతూ ఉరికంభంల వైపు తీసుకెళ్లి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చివేసేందుకు స్ఫూర్తి ఇచ్చిన అసాధారణమైన గేయం ‘వందేమాతరం’. ఇప్పటికి కూడా భాష, ప్రాంతం, మతం, కులం, వర్గం వంటి అన్ని విభేదాలతో సంబంధం లేకుండా భారతీయులు అందరికీ ఉత్తేజం కలిగించే గీతం ఇది. భారత మాతను ఇంతకన్నా ఘనంగా కీర్తించి, సమర్పించుకొనే గేయం మరొకటి లేదని చెప్పవచ్చు. ఇది మన దేశ జాతీయ గేయం. దీన్ని 1875లో నవంబరు 7న బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ కూర్చారు. ఆయన రచించిన బెంగాలీ నవల ‘ఆనంద్ మఠ్’లో ఈ గేయాన్ని పొందుపరిచారు. వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవం ఈ ఏడాది నవంబరు 7న మొత్తం దేశ ప్రజలు జరుపుకుంటున్నారు. ఆ రోజున ఒక నిర్ణీత సమయంలో దేశ ప్రజలు అందరూ ఈ గేయాలాపన జరపాలని కేంద్ర ప్రభుత్వం పిలుపిచ్చింది. ఈ వేడుకను అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. నాడు, నేడూ కోట్లాదిమంది భారతీయులను ఏకం చేస్తున్న వందేమాతరం పాట స్వాతంత్య్ర సమరయోధుల నినాదం, స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో నిరసనలు, సమావేశాలు, కాంగ్రెస్ సమావేశాల ద్వారా ప్రతిధ్వనించింది. ప్రజలలో అంతులేని ధైర్యం, ఐక్యతలను సూచిస్తుంది. స్వేచ్ఛ కోసం తహతహలాడే ప్రతి భారతీయ హృదయాన్ని కలుపుతుంది. చరిత్రపుటల్లోకి వెళితే 1769 నుంచి 1773 మధ్యకాలంలో బంగాల్లో దారుణమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటి బంగాల్ ప్రాంతం భౌగోళికంగా చాలా పెద్ద పరిణామంలో ఉండేది. తూర్పు భారత్లోని పలు రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్ కూడా అప్పటి బంగాల్లోనే భాగంగా ఉండేవి. ప్రత్యేకించి 1770లో కరువుతో బంగాల్ ప్రజానీకం అల్లాడిపోయారు. ఈ పరిస్థితుల్లో దాదాపు కోటి మందికిపైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో 1770 నుంచి 1775 వరకు బ్రిటీష్ పాలకులు, భూస్వాములపై హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు ఎక్కడికక్కడ తిరుగుబాటు చేశారు. బ్రిటీష్ పాలకులకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆహార గోదాములు, కోశాగారాలు, సంపన్న ఉన్నతాధికారుల ఇళ్లపై తిరుగుబాటుదారులు దాడులు చేశారు. అక్కడి నుంచి సేకరించిన డబ్బు, ధాన్యాలను పేదలకు పంచారు. ‘ఆనంద్ మఠ్’ నవలను బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ రచించేందుకు హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్ల తిరుగుబాటు ఉద్యమమే స్ఫూర్తిని ఇచ్చింది. దేశభక్తిని, జాతీయతా వాదాన్ని రగిల్చేలా సాగిన ఆ ఉద్యమ ఘటనల గురించి ‘ఆనంద్ మఠ్’ నవలలో కళ్లకుకట్టేలా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. బంగాలీ భాషలోని ఈ నవలలోనే వందేమాతర గేయం ఉంది. ‘ఆనంద్ మఠ్’ నవల 1882లో ప్రచురితమైంది. ‘వందేమాతరం’ అంటే ‘మాతృభూమికి నమస్కారం’ అని అర్థం. ‘ఆనంద్ మఠ్’ రచన ద్వారా ఆధునిక భారతీయ నవలా సాహిత్యానికి బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ బలమైన పునాదులు వేశారు. సామాజిక, కుటుంబ, చారిత్రక అంశాలపైనా ఆయన పలు నవలలు రాశారు. ‘ఆనంద్ మఠ్’ లోని వందేమాతర గేయమే బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్కు విశేషమైన ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. 1905లో జరిగిన బంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమానికి కూడా వందేమాతర గేయమే స్ఫూర్తిని ఇచ్చింది. అది భారతీయులందరి మదిలో దేశభక్తి భావాన్ని రగిల్చింది. బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ 1838 సంవత్సరం జూన్ 26న కోల్కతా సమీపంలోని నహాతీ పట్టణంలో జన్మించారు. ప్రఖ్యాత కోల్కతా యూనివర్శిటీ తొలి గ్రాడ్యుయేట్లలో ఆయన కూడా ఒకరు. 1858లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తయింది. లా కోర్సు చేసిన అనంతరం బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్కు బ్రిటీష్ ప్రభుత్వంలో డిప్యూటీ మెజిస్ట్రేట్గా ఉద్యోగం వచ్చింది. దాదాపు 30 ఏళ్లపాటు (1891 వరకు) ఆయన ప్రభుత్వ సర్వీసుల్లో కొనసాగారు. అయినప్పటికీ జాతీయతా వాదంతో రచనలు చేయడాన్ని బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ ఆపలేదు. బ్రిటీష్ ప్రభుత్వ సర్వీసులో ఉండగానే వందేమాతర గేయంతో కూడిన ఆనంద్ మఠ్ నవలను రాయడం, ప్రచురించడం జరిగాయి. మన భారత దేశానికి, యావత్ భారతీయులకు గొప్ప గేయాన్ని అందించి 1894 ఏప్రిల్ 8న బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ తుదిశ్వాస విడిచారు. 1950 జనవరి 24 న భారత రాజ్యాంగ సభ ‘వందేమాతరం’ను జాతీయ గేయంగా అధికారికంగా స్వీకరించింది. భారతదేశ తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ 1950లో దీనికి జాతీయ గీత హోదాను ఇచ్చారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఇది కీలక పాత్ర పోషించిందని, ‘జన గణ మన’తో సమానంగా దీనిని గౌరవించాలని అప్పట్లో రాజేంద్రప్రసాద్ తెలిపారు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్య్రం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓమ్ప్రకాశ్ వందేమాతర గీతాన్ని పార్లమెంటులో ఆలపించారు. ఏ వాద్య సంగీతమూ లేకుండా అచ్చమైన గాత్రంతో పాడి వినిపించారు. పాట లోని మాధుర్యం, పదాల్లోని భావతీవ్రత సంగీతం మాటున మిగిలిపోకూడదని అలా పాడించారని చెబుతారు. అందుకనే దూరదర్శన్లో ప్రతిరోజూ సుప్రభాత గీతంగా వినిపించే వందేమాతరానికి నేపథ్య సంగీతం ఉండదు. స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్ వారు ‘గాడ్ సేవ్ అవర్ క్వీన్’ ను బ్రిటిష్ ఇండియా జాతీయ గీతంగా ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ‘వందేమాతరం’ అనధికారికంగానే జాతీయ గీతంగా ప్రసిద్ధి చెందింది. 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని పఠించిన తర్వాత దీనికి ప్రాముఖ్యత లభించింది. మాతృభూమికి ఉత్తేజకరమైన గీతం, ఇది ఇలా ఉంటుంది. వందేమాతరం! సుజలం, సుఫలం, మలయజ శీతలం, సస్యశ్యామలం, మాతరం! వందేమాతరం! బిబిసి వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్లో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో రెండో స్థానం అందుకుంది వందేమాతరం. మొదటిస్థానం ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవ గీతానికి దక్కింది. విప్లవ నాయకుడు అరబిందో ఘోష్ 1909 1910 మధ్య కాలంలో ఈ నవలను ఆంగ్లంలోకి అనువదించారు. ఆయన రాసిన కవితా ఇలా ఉంది, అమ్మా, నేను నీకు నమస్కరిస్తున్నాను! నీ ఉప్పొంగే ప్రవాహాలతో సమృద్ధిగా, నీ పండ్ల తోట మెరుస్తున్న ప్రకాశవంతంగా, ఆనందపు గాలులతో చల్లగా, ఊగుతున్న చీకటి పొలాలతో, శక్తి యొక్క తల్లి, స్వేచ్ఛా తల్లి! 1906లో పాథే ఫోన్స్ కంపెనీ వందేమాతర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గళంలో గ్రామఫోన్ రికార్డుగా తెచ్చింది! ఆ తర్వాతి సంవత్సరమే ఆ కాపీలన్నింటినీ బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేసేశారు. దానికి సంబంధించిన ఒరిజినల్ ప్రతి చాలా రోజులు పారిస్లోనే ఉండిపోయింది. 1966 లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని మళ్లీ కాపీ చేయించి మన దేశానికి తెప్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది. సామాన్యులనూ సమరయోధులుగా మార్చింది. బెంగాల్ సాయుధ పోరాట దళం నుంచి ఉరిశిక్షకి గురైన తొలి యోధుడు కుదిరామ్ బోస్. బ్రిటిష్ మేజిస్ట్రేట్ కింగ్స్ఫోర్డ్ హత్యాయత్నం కేసులో అతను దోషిగా అరెస్టయ్యా డు. 1908, ఆగస్టు 11న ఉరిశిక్ష ఖరారైంది. ఆ సందర్భంగా న్యాయమూర్తి, ‘నువ్వేమైనా చెప్పదలచుకున్నావా?’ అని అడిగాడు. తల అడ్డంగా ఊపి, ‘వందేమాతరం!’ అంటూ చిరునవ్వుతో ఉరికొయ్య వైపు నడిచాడు కుదిరామ్. అప్పటికి అతని వయసు పద్దెనిమిదేళ్లే! ఆ వీరుడి భౌతికకాయాన్ని తీసుకెళ్తుంటే కోల్కతా వీధులు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. అందరి నినాదం వందేమాతరం. ‘దేశభక్తి... భారత మాత పట్ల ప్రేమ... ఇది మాటలకు అతీతమైన భావోద్వేగం అయితే, వందేమాతరం అనేది ఆ అమూర్త భావనకు స్పష్టమైన స్వర రూపాన్ని ఇచ్చే పాట. శతాబ్దాల దాస్యం వల్ల బలహీనపడిన భారతదేశంలోకి కొత్త జీవితాన్ని నింపడానికి బంకిం చంద్ర ఛటోపాధ్యాయ్ దీనిని స్వరపరిచారు(రాశారు). వందేమాతరం 19వ శతాబ్దంలో రాయబడి ఉండవచ్చు, కానీ దాని ఆత్మ వేల సంవత్సరాల నాటి భారతదేశపు అమర చైతన్యంతో ముడిపడి ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా, పెరుగుతున్న సామాజిక విభజనల మధ్య, పౌరులు ఈ పాట స్ఫూర్తిని స్వీకరించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే కోరారు. ‘భారతదేశ దేశభక్తి నిఘంటువులో అంతర్భాగంగా, ‘వందేమాతరం’ స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చింది. పత్రికా, సాహిత్యంలో శాశ్వత వారసత్వాన్ని పొందింది’ అని కొనియాడారు. - చలసాని నరేంద్ర - 98495 69050
వర్జీనియాలో ఘజాలా ఘన విజయం #USPolitics #GhazalaHashmi #Virginia #IndianAmerican #Democrats #news
భక్తి శ్రద్ధలతో కార్తీక పూజలు
భక్తి శ్రద్ధలతో కార్తీక పూజలు కిటకిటలాడిన ఆలయాలు మంచిర్యాల జిల్లా చెన్నూర్, ఆంధ్రప్రభ
తెలుగు రాష్ట్రాలను ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోకముందే మరో ఘోరం వెంటాడుతోంది. 2025 సంవత్సరం తెలుగు రాష్ట్రాలకు ఎంతో మందికి కలిసి వచ్చిందో తెలియదు గానీ, అనేక కుటుంబాల్లో మాత్రం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు వరుస విషాద ఘటనల్లో పదుల సంఖ్యలో అమాయకులు బలైపోయారు. మొత్తం వంద మందికిపైగా ప్రాణాలు ఇలాంటి దుర్ఘటనలకు బలయ్యాయి. నిర్లక్ష్యం, విధుల్లో వైఫల్యం లేదా కేవలం ప్రమాదాలు.. కారణం ఏదైనా సరే, సంభవించిన మరణాలు మాత్రం అత్యంత బాధాకరం. కనీసం ఐదుగురి కంటే ఎక్కువ మరణాలు సంభవించిన ప్రధాన దుర్ఘటనలు పది ఉన్నాయి. జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటతో విషాదాల పరంపర మొదలైంది. ఏకాదశి పర్వదినం సందర్భంగా దర్శన టిక్కెట్లు తీసుకోవడానికి బైరాగి పట్టెడ వద్ద క్యూ లైన్లోకి ప్రజలు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువకు అనుసంధానంగా దోమలపెంట వద్ద నిర్మిస్తున్న టన్నెల్లో ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. మట్టి పెళ్లలు పడిపోవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు ఊపిరాడక సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది మృత్యువాత పడ్డారు. టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ప్రమాద తీవ్రతకు ధ్వంసమైంది. మార్చి 28న ఒంగోలు తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగిపోయింది. మొత్తం 12 మందితో వెళ్లిన బోటు తిరగబడి ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మరణించారు. ఏప్రిల్ 29న సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మే 18న హైదరాబాద్లోని చార్మినార్ దగ్గరున్న గుల్జార్ హౌస్లో ఉదయం 6:00 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటల్లో 17 మంది ఆహుతైపోయారు. మృతుల్లో ఎనిమిదిమంది చిన్నారులు, నలుగురు వృద్ధులు ఉండడం అత్యంత విషాదకరం. జూన్ 30న సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలంలోని పాశమైలారంలో ఉన్న సికాచి పరిశ్రమలో రియాక్టర్ పేలింది. భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి.పేలుడు ధాటికి రియాక్టర్ దగ్గర పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో 46 మంది దుర్మరణం పాలవ్వగా, 30కి పైగా క్షతగాత్రులయ్యారు. జూన్ 14న అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్కు మామిడికాయల లోడుతో వెళుతున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తాపడింది. ఘటన జరిగిన సమయంలో లారీలో 18 మంది కూలీలు ఉండగా, ఎనిమిది మంది మృతి చెందారు. కర్నూలు హైవేపై తెల్లవారుజాము 3:00 గంటల ప్రాంతంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొని అగ్నిప్రమాదానికి కారణమైంది. మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వరాలయంలో జరిగిన తొక్కిసలాట మాటల్లో వర్ణించలేనిది. రైలింగ్ ఊడిపడటంతో భక్తులు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఏకాదశి కావడంతో భారీగా తరలివచ్చిన భక్తుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఆలయంలో భద్రతా చర్యలు లేకపోవడం ఈ ఘటనకు కారణమైంది. నవంబర్ 3న చేవెళ్ల దగ్గరలోని మీర్జాగూడ వద్ద ఘోరం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఆర్టిసి బస్సు, ఓవర్లోడ్, ఓవర్స్పీడ్తో వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. స్పాట్లో 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్ కూడా మృతి చెందారు. ఈ విషాదంలో విద్యార్థులు, మహిళలు ఎక్కువగా చనిపోయారు, వారిలో రెండు నెలల పసికందు కూడా ఉంది. బంధువుల రోదనలతో చేవెళ్ల ఆస్పత్రి ప్రాంగణమంతా గంభీరంగా మారింది. ఈ వరుస ఘటనలు తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మరో వైపు భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని కేంద్రం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాలవారీగా రోడ్డు ప్రమాదాల సంఖ్యను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 8,276 రోడ్డు ప్రమాదాలు జరిగి, దేశంలో ఏడో స్థానంలో నిలవగా, తెలంగాణలో 8,103 ప్రమాదాలు జరిగి ఎనిమిదో స్థానంలో ఉంది. మరణాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో 3,806 మంది, తెలంగాణలో 3,508 మంది మరణించారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా అత్యధిక మరణాలు సంభవించిన రాష్ట్రాల జాబితాలో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయి. - ఐనం ప్రసాద్ 98489 28787
చేతి వేళ్లకు గాయమైన సెమీస్, ఫైనల్ లో రిచా ఆడింది: కోచ్ శంకర్
హైదరాబాద్: భారత మహిళజట్టు వన్డే వరల్ కప్ గెలిచి సంచలనం సృష్టించింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా, ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి వరల్డ్ కప్ ముద్దాడింది. రెండు విజయాల్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, స్మృతి మంధాన కీలక పాత్ర పోషించారు. టీమిండియా వరల్డ్ కప్ నెగ్గడంతో మరో బ్యాటర్ రిచా ఘోస్ చేసిన పరుగులు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎనిమిది ఇన్నింగ్స్లలో 133.52 స్ట్రైక్రేటుతో 235 పరుగులు చేసింది. సెమీస్, ఫైనల్లో ఆమె బ్యాటింగ్ చేసిన తీరు అబ్బురపరిచింది. ఈ సందర్భంగా రిచా చిన్ననాటి బ్యాటింగ్ కోచ్ శంకర్ పాల్ మీడియాతో మాట్లాడారు. సెమీ ఫైనల్కు ముందు రిచా వేలుకు గాయమైందని కోచ్ శంకర్ తెలిపారు. నొప్పి తట్టుకుంటేనే బ్యాటింగ్ చేసిందని కొనియాడారు. సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా భారీ లక్ష్యం విధించిన కూడా 16 బంతుల్లో 26 పరుగులు చేసి జెమీమాపై ఒత్తిడి లేకుండా చేసిందన్నాడు. ఫైనల్ మ్యాచ్లో రిచా అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని, 24 బంతుల్లో 34 పరుగులు చేసిందని శంకర్ పేర్కొన్నారు. చివర ఓవర్లలో దూకుడిగా ఆడి పరుగులు చేయడమే తన ప్రధాన కర్తవ్యం అని రిచా తెలిపింది. తనకు బ్యాటింగ్ అవకాశం వచ్చినప్పుడల్లా ఫినిషింగ్పైనే ఎక్కువ దృష్టి పెట్టానన్నారు. ఎక్కువ స్ట్రైక్రేటు రోటేట్ చేయడంతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచానని వివరణ ఇచ్చాడు. మా కోచ్ అమోల్ మజుందార్ జట్టులో ఒక్కోక్కరికి ఒక్కో రోల్ కేటాయించారని రిచా తెలియజేశారు. తన వరకు వచ్చేసరికి నిర్భయంగా ఆడడంతో పాటు భారీ షాట్లు ఆడమని చెప్పారన్నారు.
మార్మోగిన శివనామస్మరణ ప్రకాశంలో కార్తీక శోభఒంగోలు, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రకాశం జిల్లాలో
నిజాంను అల్లాడించిన నల్లా నరసింహులు
తెలంగాణ స్వాతంత్య్రోద్యమ పుటల్లో శాశ్వతంగా చెరగని అక్షరాలతో నిలిచిపోయిన పేరు నల్లా నరసింహులు. అణచివేత, దోపిడీ, బానిసత్వం నిండిన నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా ప్రాణాలర్పించి పోరాడిన మహావీరుడు ఆయన. ఆయన జీవితం ప్రజాస్వాతంత్య్రం కోసం అహర్నిశలు నడిచిన త్యాగయాత్ర. ప్రజల విముక్తి కోసం శస్త్రం ఎత్తి, న్యాయంకోసం గొంతుఎత్తిన ఆ ధీరుని పోరాట చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గాథలో ఒక అజేయ అధ్యాయం. 1940 దశకంలో తెలంగాణ ప్రజల జీవితం దుర్భరంగా ఉండేది. భూస్వాములు, దేశముఖ్లు, సర్దేశ్ముఖ్లు, దేశాయిలు, రజాకార్లు కలిసి ప్రజలపై అమానుష దోపిడీ సాగించారు. రైతులు తమ కష్టార్జిత పంటను భూస్వాముల కడుపు నింపేందుకు మాత్రమే పండించేవారు. నిజాం పాలనలోని 7430 గ్రామాలు ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీ కింద ఉండగా, రైతు కేవలం కూలీగా, బానిసగా మిగిలిపోయాడు. ఈ అన్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా పెల్లుబికిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రజాచరిత్రలో గొప్ప మైలురాయి అయింది. ఈ మహా సమరానికి దళ నాయకుడిగా ముందుండి పోరాడిన యోధుడు నల్లా నరసింహులు. నల్లా నరసింహులు 1926 అక్టోబరు 2న తెలంగాణలోని కడవెండి, జనగామ జిల్లా, దేవరుప్పులలో జన్మించారు. జనగామ ప్రాంతంలో సాయుధ దళాలను ఏర్పాటు చేసి భూస్వామ్య వ్యవస్థకు గట్టి ప్రతిఘటనగా నిలిచారు. ప్రజలలో ధైర్యం నింపి రజాకార్లపై, దోపిడీదారులపై గెరిల్లా దాడులు నిర్వహించారు. నరసింహుల కేక దోపిడీదారుల పాలనకు ఇక అంతం! అని అణగారిన ప్రజల గుండెల్లో మంటగా మండింది. ఆ కాలంలో తెలంగాణలో కమ్యూనిస్టు భావజాలం విస్తరిస్తున్నది. ఆంధ్ర మహాసభ అనే వేదిక ద్వారా పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి వంటి నేతలు ప్రజలను సంఘటితం చేశారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామగ్రామంలో కమిటీలు, దళాలు ఏర్పాటయ్యాయి. నరసింహులు ఈ పోరాటానికి తమ జీవితం అంకితం చేశారు. జనగామ తాలూకాలోని గ్రామాల్లో ఆయుధ దళాలను నిర్మించి స్వయంగా నాయకత్వం వహించారు. భూస్వాములు, రజాకార్లు, నిజాం సైన్యం ఈ మూడింటి మధ్యలో ప్రజల పక్షాన నిలిచిన నరసింహులు శత్రువుల నిద్రను చెడగొట్టారు. 1947 సెప్టెంబర్ 11న ఆయన స్వగ్రామమైన కడవెండి నుంచే మొదటి తిరుగుబాటును ప్రారంభించి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ఆ పిలుపు యుద్ధభేరీగా మారి తెలంగాణ అంతటా విప్లవ జ్వాలలు వ్యాపించాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆయన ఆదేశాలపై ఎర్రజెండాల కింద పోరాట రంగమయ్యాయి. వేల ఎకరాల భూములు భూస్వాముల పంజానుండి విడిపించబడి, దున్నేవాడికే భూమి హక్కు! అన్న నినాదం ప్రతిధ్వనించింది. సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతుండగా, నరసింహులు అనేకసార్లు అరెస్టుకాబడి చిత్రహింసలు అనుభవించారు. మూడుసార్లు ఉరిశిక్ష విధించబడ్డా ఆయన ధైర్యం ఒక్క క్షణం తగ్గలేదు. అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థలు, భారత ట్రేడ్ యూనియన్ సంఘాల ఆందోళనల ఫలితంగా ఆయన ఉరిశిక్ష చివరి నిమిషంలో నిలిపివేయబడింది. నల్లగొండ జైలులో బంధితుడిగా ఉన్న నరసింహులను చూడటానికి వచ్చిన యూనియన్ సైనిక జనరల్ జె.ఎస్. చౌదరికి జిల్లా ఎస్.పి. ధన్రాజ్ నాయుడు పరిచయం చేస్తూ ఈయనే తెలంగాణ టైగర్ నల్లా నరసింహులు అని చెప్పడం చరిత్రలో నిలిచిపోయింది. 1948లో ‘పోలీస్ యాక్షన్’ అనంతరం కమ్యూనిస్టులపై నిషేధం విధించబడింది. నెహ్రూ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారనే తప్పుడు ఆరోపణలతో అనేక మంది నేతలు అణచివేతకు గురయ్యారు. నరసింహులు వంటి యోధులు అరణ్యాలలో ఆశ్రయం పొందారు. చివరికి 1951 అక్టోబరులో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం విరమిస్తున్నట్లు ప్రకటన చేయడంతో ఉద్యమం చల్లారిపోయింది. అయినా నరసింహులు పోరాట భావజాలాన్ని విడిచిపెట్టలేదు. 1959 జనవరి 26న దీర్ఘ నిర్బంధ జీవితం ముగించి ఆయన తిరిగి స్వేచ్ఛా లోకంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో పేదల హక్కుల కోసం ఆలోచనాత్మకంగా పనిచేశారు. నల్లా నరసింహులు పేద పద్మశాలి కుటుంబంలో జన్మించి చేనేత పనిని జీవనాధారంగా చేసుకున్నారు. ఉర్దూ మీడియంలో ఏడవ తరగతి వరకు మాత్రమే చదివినా ప్రజల బాధలను అర్థం చేసుకున్న చైతన్యవంతుడు. భార్య వజ్రమ్మతో కలిసి జీవితాంతం ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించారు. ఆయన తన చివరి వరకు కూడా పోరాట మిత్రులను, రైతాంగ యోధులను స్మరించుకుంటూ ప్రజా హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ గడిపారు. 1993 నవంబర్ 5న ఆయన జీవన యాత్ర ముగిసింది. కానీ ఆయన త్యాగం, ధైర్యం, ప్రజా సంకల్పం తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. వేలాది మంది వీరుల త్యాగానికి ప్రతీకగా, పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిన విజయానికి చిహ్నంగా ఆయన పేరు ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. నల్లా నరసింహుల జీవితం ఒక పాఠం. స్వేచ్ఛ అనేది ఇచ్చేది కాదు, పొందేది. అణచివేతకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యమే నిజమైన విముక్తి శక్తి. తెలంగాణ రైతాంగ పోరాటం, భూస్వామ్య వ్యవస్థ కూల్చివేత, పేదల భూ హక్కుల సాధనలో ఆయన చూపిన త్యాగపథం తరతరాలకు మార్గదర్శకం. నవంబర్ 5 నల్లా నరసింహుల వర్ధంతి రోజున ఈ ప్రజా వీరుడిని స్మరించుకుంటూ తెలంగాణ నేల తన గర్వకారణాన్ని మరలా గుర్తు చేసుకుంటుంది. ఆయన త్యాగజ్వాల ఎప్పటికీ మసకబారదు. ఆ జ్వాలే తెలంగాణ ప్రజా చైతన్యానికి చిరస్ఫూర్తి. - రామకిష్టయ్య సంగనభట్ల 94405 95494
రవూఫ్పై రెండు మ్యాచ్ల నిషేధం సూర్యకు జరిమానా #ICC #AsiaCup #SuryakumarYadav #HarisRauf #Cricket
చెన్నూర్ మాజీ సర్పంచ్ మధుసూదన్ మృతి
చెన్నూర్ మాజీ సర్పంచ్ మధుసూదన్ మృతి చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
రైతు కష్టం ధ్వంసం పత్తి మొక్కలను పీకేసీన అటవీ అధికారులుచండ్రుగొండ (ఆంధ్రప్రభ): భద్రాద్రి
కర్టాటకలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకలోని హల్లిఖేడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు,
సముద్ర స్నానాలు ఆచరించి.. మంగినపూడి బీచ్లో సాగర సుప్రభాత హారతి ఇచ్చిన మంత్రి
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి ’రాంబాయి నీ మీద నాకు..’ లిరికల్ సాంగ్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్, భూమా మౌనిక చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ “ఒక పల్లెటూరిలో జరిగిన యదార్ధ ఘటన ఈ సినిమా. జరగకూడని ఘటన అది. ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవుతుంది. అన్ని అవార్డులు ఈ సినిమాకు వస్తాయి”అని పేర్కొన్నారు. నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ “ప్రేమ చాలా ప్రమాదకరమైనది, అది సింహాసనం ఎక్కిస్తుంది, శిలువనూ వేయిస్తుంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమా కథ దర్శకుడి ఊహలోనుంచో, పుస్తకాల నుంచో, కల్పన నుంచో రాలేదు. ఈ మట్టి నుంచి వచ్చింది. రాజు, రాంబాయి ప్రేమే ఈ సినిమాను నిలబెడుతుందని నమ్ముతున్నా”అని అన్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ “ఒక్క డైలాగ్, ఒక్క పాట కోసం ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ పాట ఇదే”అని తెలియజేశారు. డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ “ప్రేమికులు ఈ సినిమాను చూసి నవ్వుతారు, ఏడుస్తారు. సినిమా చూస్తున్న వాళ్లకు వాళ్ల ప్రేమ గుర్తుకొస్తుంది. ఈ పాట ఎంత బాగుందో సినిమా అంత బాగుంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ సతీమణి భూమా మౌనిక, సాయికృష్ణ, నితిన్, హీరో అఖిల్ ఉడ్డెమారి, హీరోయిన్ తేజస్వినీ రావ్, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, మిట్టపల్లి సురేందర్, సురేష్ బొబ్బిలి, రాహుల్ మోపిదేవి, నల్లగొండ గద్దర్ నర్సన్న పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో వినూత్న నిరసన #telugupost #jubileehillsbyelection #unemployedyouth
కర్నాటకలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు రంగారెడ్డి వాసులు మృతి
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో బీదర్ జిల్లా హల్లిఖేడ్లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. వ్యాను-కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పురం గ్రామానికి చెందిన వాసులు నవీన్(40), రాచప్ప(45), కాశీనాథ్(60)గా గుర్తించారు. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లవస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
విద్యుత్ షాక్ తగిలి గొర్రెల మృతి..
విద్యుత్ షాక్ తగిలి గొర్రెల మృతి.. బిక్కనూర్, (ఆంధ్రప్రభ).. మండలంలోని పెద్ద మల్లారెడ్డి
స్మృతికి షాక్ — వోల్వార్ట్ టాప్ #Cricket #SmritiMandhana #ICC #WomensCricket #LauraWolvaardt
భారీ నష్టాల్లో రైతన్న .. వెల్దండ, ( ఆంధ్రప్రభ )మహబూబ్ నగర్ జిల్లా
కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్ఫుల్ క్రేజీ ఎంటర్టైనర్ జిగ్రీస్. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఇప్పటికే విడుదలైన టీజర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తాజాగా మీరేలే సాంగ్ లాంచ్ చేశారు. సయ్యద్ కమ్రాన్ ఈ సాంగ్ని ఫ్రెండ్ షిప్ మెలోడీగా కంపోజ్ చేశారు. హరీష్ రెడ్డి ఉప్పుల రాసిన సాహిత్యం ఫ్రెండ్స్ మధ్య భావోద్వేగాన్ని చూపించింది. జిగ్రీస్ సినిమా ఫ్రెండ్షిప్, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. జిగ్రీస్ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
“అంతరిక్షంలో చైనా వంట చరిత్ర” #Space #China #TianGong #Astronauts #Innovation #Science #viralvideo
America : అమెరికాలో కూలిన విమానం
అమెరికాలోని లూయీస్ విల్లాలో విమానం కూలిపోయింది.
సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు..
వర్సటైల్ సింగర్ రామ్ మిరియాల ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా టైటిల్ సాంగ్ పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. -’సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు...’ అంటూ సాగే ఈ పాట నేటి యువత వైవాహిక జీవితాన్ని చూపిస్తుంది. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన లిరికల్ సాంగ్స్కు మంచి స్పందన వచ్చింది.
బ్లాక్ మెయిలింగ్... టివి5 మూర్తిపై కేసు నమోదు
కూకట్ పల్లి: బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డాడని టివి5 మూర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టివి5 మూర్తి తన ఫోన్ ట్యాప్ చేసి, తన వ్యక్తిగత వివరాలు టెలికాస్ట్ చేయకూడదంటే రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని కోర్టును ఎపి మాజీ మంత్రి కుమారుడు, నటుడు ధర్మ సత్యసాయి మహేష్ ఆశ్రయించాడు. టివి5 మూర్తి మహేష్ భార్యతో కలిసి మహేష్ ఇంట్లో స్పై కెమెరాలు ఏర్పాటు చేసి, వ్యక్తిగత దృశ్యాలు, రహస్యంగా రికార్డు చేశారు. దీంతో దృశ్యాలు బయటకు రాకుండా ఉండాలంటే పది కోట్ల రూపాయలు ఇవ్వాలని టివి5 మూర్తి డిమాండ్ చేశారు. మూర్తి వద్ద ఎనిమిది గంటల ఆడియో రికార్డు ఉందని హైకోర్టును మహేష్ ఆశ్రయించాడు. బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంలో పోలీసులు అధికారులు కూడా కుమ్మక్కయ్యారని పిటిషనర్ ఆరోపణలు చేశారు. కోర్టు ఆదేశాలతో మూర్తిపై కూకట్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో ఎ1గా గౌతమి చౌదరి, ఎ2గా టివి5 మూర్తిని చేరుస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Sreeleela’s Flop Streak Continues
Telugu beauty Sreeleela has delivered a series of flops. She had all her hopes on Ravi Teja’s recent outing Mass Jathara and the film is rejected badly by the audience. The film also suffered to register decent openings. Sreeleela is trolled for her poor script selection. Her role looked outdated and had no scope to […] The post Sreeleela’s Flop Streak Continues appeared first on Telugu360 .
కింగ్ నాగార్జున ఆల్టైం కల్ట్ క్లాసిక్ ’శివ’ బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను ’బిఫోర్ శివ’, ’ఆఫ్టర్ శివ’గా పునర్నిర్వచించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4కె డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సమక్షంలో శివ రీరిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ “నా మిత్రుడు రామ్ గోపాల్ వర్మ 36 ఏళ్ల క్రితం నాతో శివ సినిమా తీసి నన్ను పెద్ద స్టార్ ని చేశారు. శివ 4కె డాల్బీ ఆట్మాస్ సినిమా చూశాను. అద్భుతంగా అనిపించింది. రాము దాదాపు 6 నెలలు చాలా ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్ ని మళ్లీ ఒరిజినల్ సినిమా చేసినట్టుగా, ఒక మైల్ స్టోన్ గా నిలబెట్టాలని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు. నవంబర్ 14న అందరూ ‘శివ’ని కొత్తగా అనుభూతి చెందుతారు”అని అన్నారు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ “శివ సినిమా రీ రిలీజ్ కోసం సౌండ్ని చాలా మెరుగ్గా డిజైన్ చేశాం. కొత్త టెక్నాలజీని ఉపయోగించాం. చిరంజీవి చెప్పినట్టు సినిమా ఉన్నంతవరకు శివ చిరంజీవిలా చిరస్మరణీయం”అని తెలిపారు.
కార్యదర్శి మందలించాడని.. పంచాయతీ స్వీపర్ ఆత్మహత్యాయత్నంములుగు, (ఆంధ్రప్రభ ప్రతినిధి) : ములుగు జిల్లా
Revanth Reddy :నేడు ఎన్నికల ప్రచారంలో రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు
వీరేశ్వర ఆలయంలో కార్తీకమాస పూజలు..
వీరేశ్వర ఆలయంలో కార్తీకమాస పూజలు.. బిక్కనూర్, (ఆంధ్ర ప్రభ) మండలంలోని కాచాపూర్ గ్రామంలో
Exclusive: Balakrishna rejects Two Biggies
Nandamuri Balakrishna is delivering back-to-back hits in his career. The actor is occupied with Akhanda 2 and he has Gopichand Malineni’s mass entertainer ready for shoot. In the recent times, Balakrishna has rejected two big-budget projects. One is Ram’s Andhra King Taluka and the second is Rajinikanth’s Jailer 2. Mythri Movie Makers, the producers of […] The post Exclusive: Balakrishna rejects Two Biggies appeared first on Telugu360 .
America : గవర్నర్, మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయం.. అదే సంకేతమా?
అమెరికాలో ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్లు ఓడిపోయారు
పామర్రు మాజీ ఎమ్మెల్యేపై కేసు..
పామర్రు మాజీ ఎమ్మెల్యేపై కేసు.. పోలీస్ విధులకు భంగం కలిగిస్తే సహించం కృష్ణా
పట్టు తప్పిందా.. యానాదుల పల్లెలో జీవన పోరాటం.. చెక్డ్యాం మీదే రాకపోకలు..వర్షం పడితే

29 C