SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

Vande Mataram Turns Into a Political Weapon: What Politics Is This?

The 150th anniversary of Vande Mataram should have been a moment of national pride. Instead, it turned into a fiery clash in Parliament. The national song that once united freedom fighters has now become a tool in a political tug of war. The ruling NDA brought the issue to the House with full force. The […] The post Vande Mataram Turns Into a Political Weapon: What Politics Is This? appeared first on Telugu360 .

తెలుగు 360 9 Dec 2025 10:27 am

నిర్లక్షం నిప్పు.. ఎవరిది తప్పు?

గోవా క్లబ్‌లో ఆదివారం (7.12.2025) అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వరకు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు ఎలా జరిగాయో బట్టబయలు చేసింది. ఈ ప్రమాదానికి దారితీసిన భద్రతా వైఫల్యాల్లో బాధ్యులైన వారందరూ “తిలాపాపం తలా పిడికెడు” అన్న చందంగా వ్యవహరించారు. బూడిద కుప్పల సాక్షంగా పాతిక ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మృతుల్లో 20 మంది నైట్‌క్లబ్ సిబ్బందే. వీరంతా వలస కార్మికులు, వీరిలో నలుగురు నేపాల్, ఐదుగురు ఉత్తరాఖండ్ నుంచి, జార్ఖండ్, అసోం నుంచి ముగ్గురేసి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరేసి, పశ్చిమబెంగాల్ నుంచి ఒకరు వచ్చారు. వీరితోపాటు ఐదుగురు టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. టూరిస్టుల్లో ఢిల్లీకి చెందిన ఒకే కుటుంబం లోని ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షలు వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం ఆనవాయితీగా జరిగింది. అంతటితో ఈ ప్రమాదాలకు ముగింపు పలికినట్టు కాదు. ఇది దేశం మొత్తం మీద భద్రతా ప్రమాణాలపై నేరపూరిత నిర్లక్షం మళ్లీ వెలుగు లోకి తెచ్చింది. ఈ ప్రమాదానికి దారి తీసిన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు మీవల్ల కాదు మీవల్లనే అంటూ గ్రామ పంచాయితీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అధికారుల పరస్పర నిందారోపణలు స్వైర విహారం చేస్తున్నాయి. గోవా అర్పోరా వద్ద బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్ ఏర్పాటైన స్థలమే పర్యావరణ పరిరక్షణ జోన్‌లో ఉంది. గోవా చట్టం ప్రకారం ఈ స్థలాన్ని వ్యవసాయేతర సంస్థలకు వినియోగించరాదు. ఈ స్థలాన్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రమాణాలను పట్టించుకోకుండా బగానది నుంచి వెలువడిన నిల్వనీటిపై అంటే నీటికయ్యపై ఈ క్లబ్‌ను నిర్మించారు. సాధారణంగా ఈ ఉప్పునీటి కయ్యల్లో రొయ్యలు సాగు చేస్తుంటారు. ఈ క్లబ్ నుంచి మెయిన్ రోడ్డుకు అనుసంధానంగా సన్నని ఇరుకు రోడ్డు నిర్మించారు. ఈ క్లబ్ చిన్న నీటి కొలనుకు విభజనగా నిర్మాణమైంది. ఒకవైపు చిన్న నీటి కొలను ఉండగా, మరోపక్క బగానది ఆనుకుని ఉంది. భవన భద్రతా నిబంధనలకు విరుద్ధంగా ఈ క్లబ్‌ను నిర్మించారని పంచాయతీ అధికారులు భవనం కూలగొట్టడానికి సిద్ధం కాగా, రాష్ట్ర పంచాయతీ రాజ్ అధికారులు అడ్డుకున్నారని అర్పోరా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రోషన్ రేడ్కర్ ఆరోపించారు. అయితే ఎంఎల్‌ఎ మైకేల్ లోబో పంచాయతీ అబద్ధాలు చెబుతోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెస్టారెంట్ నడపడానికే అనుమతి ఇవ్వగా, గ్రామ పంచాయతీ రెస్టారెంట్‌కు, నైట్‌క్లబ్‌కు కూడా అనుమతించిందని ఆరోపించారు. నైట్‌క్లబ్‌కు అనుమతి ఇవ్వాల్సింది ఎక్సైజ్ డిపార్టుమెంటే తప్ప పంచాయతీ బాధ్యత కాదని వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల నాటి ఈ క్లబ్‌కు తాజాగా 2023లో గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చింది. గత ఇరవై ఏళ్లలో ఈ క్లబ్ యాజమాన్యం అనేక చేతులు మారింది. ఆదివారం రాత్రి క్లబ్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోకుండా పైరోగన్‌లు, బాణాసంచా కాల్పుల ప్రదర్శన నిర్వహించారు. దీనికి తోడు కొబ్బరి ఆకులతో తాత్కాలిక షెడ్ నిర్మించడం, మండే వస్తువులు ప్లాస్టిక్, ఫైబర్, ఫోమ్ ప్యాకేజింగ్ వంటి అలంకరణలు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. క్లబ్ ప్రవేశమార్గం చాలా సన్నగా, ఇరుగ్గా ఉండడంతో అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లడానికి వీలు కలగక, 400 మీటర్ల దూరంలోనే అవి ఉండిపోవలసి వచ్చింది. క్లబ్‌కు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు లేవు. ప్రమాద సమయంలో ఫస్ట్‌ఫ్లోర్‌లో డాన్స్ ఏరియాలో 100 మంది వరకు ఉన్నారు.కమ్ముకున్న పొగ వల్ల చాలామంది ఊపిరాడక పోవడం వల్లనే చనిపోయారని తేలింది.2023లో ఈ క్లబ్ నిర్వహణకు వీలు కల్పించిన బాధ్యులైన ముగ్గురు అధికారులను ఆదివారం రాత్రి సస్పెండ్ చేశారు. క్లబ్ యజమానులు ఇంకా పట్టుబడలేదు. ప్రమాదంపై దర్యాప్తునకు సిఎం ప్రమోద్ సావంత్ ముగ్గురు అధికారులలతో కమిటీ వేశారు. ఈ కమిటీ వారం లోగా దర్యాప్తు నివేదిక సమర్పించవలసి ఉంది. ఈ ప్రమాదం మళ్లీ దేశం మొత్తం మీద అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారో సమగ్రంగా సమీక్ష జరగవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. గత ఏడాది రాజ్‌కోట గేమింగ్ జోన్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంనుంచి ఇటీవల అక్టోబర్‌లో జైపూర్ సవాయి మాన్‌సింగ్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం వరకు సమీక్షించవలసిన అవసరం కనిపిస్తోంది. భద్రతా ప్రమాణాలపై నిర్లక్షం నిప్పు ఈ ప్రమాదాలకు దారితీస్తోందని సర్వసాధారణంగా తెలిసిన విషయమే. నోయిడా అధికార యంత్రాంగం గత ఏడాది 131 సొసైటీలు సరైన అగ్ని ప్రమాద భద్రతా ప్రమాణాల లోపంతో ఉన్నాయని గుర్తించింది. మంటలను ఆర్పే సామర్ధం, సాంకేతిక సౌకర్యాలు దేశం లోని ఫైర్ స్టేషన్లలో 96 శాతం లోపించాయని ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించడం గమనార్హం. కొన్ని ఫైర్ స్టేషన్లు కాలం చెల్లిన పరికరాలతో అల్లాడుతున్నాయి. వీటి నిర్వహణలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అగ్నిమాపక శకటాల్లో చాలా వాటికి ఇంధనం నింపేందుకు తగిన ఆర్థిక వనరులు కూడా లేకపోవడం పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తుంది. భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన వారెంతవారైనా సరే కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవడం ప్రారంభమైతేనే కొంతవరకైనా ప్రమాదాలను నివారించిన వారవుతారు. ఈ విషయంలో ప్రభుత్వాలు మేల్కోడానికి మరెన్ని విషాద సంఘటనలు చోటు చేసుకోవాలి ? 

మన తెలంగాణ 9 Dec 2025 10:25 am

Couple |విస్తృత ప్రచారం..

Couple | విస్తృత ప్రచారం.. రాంపురం బీసీల మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే..ప్రచారంలో దూసుకుపోతున్న

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:20 am

Candidate |సంధ్యారాణి గెలుపుతోనే..

Candidate | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఖిలాషాపూర్

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:19 am

Tsunami in Japan  :  ఫసిఫిక్​ తీరంలో భయం భయం    

Tsunami in japan : ఫసిఫిక్​ తీరంలో భయం భయం జపాన్​

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:14 am

Bonus |బోనస్ పంపిణీ..

Bonus | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటశాల పాల ఉత్పత్తి దారుల పరస్పర

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:14 am

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ .. పెరుగుతున్న మరణాలు..లక్షణాలివే

ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతుంది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 10:05 am

Vote |ప్రజలు మెచ్చేలా…

Vote | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలంలో సంగెం అరుణాక్క గెలుపు

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:05 am

అక్రమ బహిష్కరణలు ఆగేదెన్నడు?

బంగ్లాదేశ్‌లో ఆరు నెలల నిర్బంధం తర్వాత 25 ఏళ్ల సునాలి ఖాతుర్ మాల్టాలోకి అడుగుపెట్టింది. ఇది కొంత ఉపశమనం కలిగించినా, సామూహిక అవమానంగా భావించి ఉండాలి. ఆమె అక్రమ వలసదారు కాదు, చొరబాటుదారు కాదు. వీసా గడువు ముగిసినా మన దేశంలో ఉంటున్న విదేశీ పౌరురాలు కాదు. అమె పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్త్రీ, గర్భిణి. చిన్న కొడుకుతో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి న్యాయపరమైన అనుమతి లేకుండా భారతీయ అధికారులు బలవంతంగా అంతర్జాతీయ సరిహద్దులను దాటించారు. న్యాయవాదులు, వలసహక్కు సంఘాల జోక్యం, ఆమె కేసు కోర్టు ముందుకు తెచ్చేందుకు చేసిన యత్నాల పుణ్యమా అని ఆమె తిరిగి రావడం సాధ్యమైంది. దీనిపై ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టాల గురించి అస్పష్ట సూచనలు తప్ప ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆ సూచనలు కూడా సరైన ప్రక్రియ లేకుండా భారతీయ పౌరులను మరో దేశానికి నెట్టివేయడాన్ని ఏమాత్రం సమర్థించవు. సునాలీకి ఎదురైన కఠిన పరీక్ష చిత్రం ఏమీ కాదు. అసోం, చుట్టుపక్కల జిల్లాలనుంచి వచ్చిన పేద బెంగాలే మాట్లాడే ముస్లింలను అనుమానిత అక్రమ వలసదారులుగా ముద్రవేసి, చట్టబద్ధమైన బహిష్కరణలకు బదులుగా రహస్యంగా బహిష్కరణ మాదిరిగా సరిహద్దుల నుంచి నెట్టివేయబడుతున్న ఎన్నో కేసులలో ఇది ఒకటి. కేసు తర్వాత.. బంగ్లాదేశ్ ఈ వ్యక్తులను తమ పౌరులుగా అంగీకరించేందుకు నిరాకరించడం, వారు బంగ్లాదేశ్ జాతీయులు కాదని నొక్కి చెప్పి భారతదేశానికి తిరిగి పంపడం మామూలయింది. పదేపదే ఇలా పలువురు తిరిగి రావడం పలు ప్రశ్నలకు దారితీస్తున్నది. బంగ్లాదేశ్ వారిని కోరుకోకపోతే, భారతదేశం వారిని గుర్తించడానికి నిరాకరిస్తే, వారి చట్టబద్ధమైన, మానవ పరమైన హోదా ఏమిటి? ఏ ప్రభుత్వం తమ సొంత పౌరులను భౌతికంగా తొలగించి, వదిలి వేయాల్సినంతగా భారంగా భావిస్తుంది. 2025 మే లో అసోంకు చెందిన ఇద్దరు మహిళలు -సోనా భాను, రహిమా బేగం- ను వారి ఇళ్లనుంచి తీసుకెళ్లి మిలిటరీ జోన్ మీదుగా తరలించి, భారతదేశం బంగ్లాదేశ్ మధ్య ఉన్న నో మ్యాన్ లాండ్ -నిర్జన ప్రదేశంలో వదిలి వేశారు. వారికి తిండిలేదు. నిలువ నీడలేకుండా కొన్నిరోజుల తరబడి బయటపడ్డారు. బంగ్లాదేశ్ అధికారులను వారిని తిరిగి తీసుకువచ్చి సరిహద్దు గార్డులకు అప్పగిస్తే, వారి నుంచి వేధింపులు భరించాల్సి వచ్చింది. అదే సమయంలో మాజీ పాఠశాల టీచర్ బైరుల్ ఇస్లాంను సుప్రీం కోర్టులో అప్పీలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌కు బలవంతంగా తరలించారు. చాలా కాలం క్రితం డి- ఓటరుగా గుర్తించబడిన హజేరా ఖాతున్ అనే వృద్ధ మహిళను ఇదే విధంగా బహిష్కరించారు. బంగ్లాదేశ్ ఆమెను తమ దేశంలో చేర్చుకోవడానికి నిరాకరించే వరకూ ఆమె తనను తాను రక్షించుకుంటూ బతకాల్సివచ్చింది. ఇవి చట్టపరమైన బహిష్కరణలు కావు. అవి భారత చట్టం ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లు, విచారమలు, పర్యవేక్షణ లేకుండా చేసిన బహిష్కరణ చర్యలు. వారు తగిన సాక్ష్యాలు లేకుండా సామాజిక పరమైన కమ్యూనిటీలపై కేవలం అనుమానంతో ఈ చర్యలకు దిగారు. అసోం సంక్లిష్ట వలస చరిత్ర చాలా కాలంగా రాజకీయ పరంగా రూపుదిద్దుకున్నది. ఈ మధ్య కొద్ది కాలంగా అక్రమ వలసపై పాలనాపరమైన ధ్రువీకరణ మరింత దూకుడుగా, నిర్ణయాత్మకంగా మారుతున్నట్లు కన్పిస్తోంది. చట్టపరమైన ప్రక్రియను కానీ, పేదల వాస్తవిక జీవితాలను కానీ అంతగా పట్టించుకోవడం లేదు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం, వలసదారుల (అసోం నుంచి బహిష్కరణ) చట్టం 1950 కింద వందలాది మంది సరైన పత్రాలులేని వ్యక్తులను వెనక్కి నేట్టివేసిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకుంటోంది. ఇలాంటి ప్రకటనలు రాజకీయంగా నియోజకవర్గాల్లో బాగా పనిచేస్తాయి. కానీ, ఏకపక్ష బహిష్కరణలు చట్టబద్ధంగా అసాధ్యం అన్న అంశాన్ని మరుగుపరుస్తాయి. భారతదేశం - బంగ్లాదేశ్ మధ్య పరస్పరం వ్యక్తులను స్వదేశాలకు పంపించే ఒప్పందం లేదు. బహిష్కణకు స్పష్టమైన డాక్యుమెంట్‌లు, రుజువులు, వారిని స్వీకరించే దేశం అంగీకారం చాలా అవసరం. ఇవి లేకుండా నెట్టివేతలు నాటకాల వంటివే. దీనివల్ల తలెత్తే పరిణామాలు ప్రభుత్వాలకన్నా, ఆ పౌరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జీవితాలే తల్లకిందులైపోతాయి. నెట్టివేతకు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులు.. పేదవారై ఉంటారు. వారి చదువు అంతంత మాత్రమే. ఎక్కువ నిరక్షరాస్యులై ఉంటారు. అక్రమ వలస విషయంలో ఎలాంటి చిక్కులు ఎదురైనా, తమను తాము రక్షించుకునే సామర్థ్యం కూడా వారికి తక్కువే ఉంటుంది. రాజకీయపరంగా వాయిస్ లేని వారి వలసలకు, భాషా, -మతపరమైన మైనారిటీలకు మధ్య ఉండే తేడా తక్కువ. బెంగాలీ మాట్లాడే వారిని ఇప్పటికీ అనుమానితులు గానే చూస్తారు. ఒకప్పుడు రాజ్యాంగ పరమైన హామీగా ఉన్న పౌరసత్వం, కొన్ని కమ్యూనిటీల విషయంలో తాత్కాలిక హోదా మాదిరిగా ఉంది. ఇది డాక్యుమెంటేషన్ పై కాకుండా రాజకీయాలపై ఆధారపడి ఉంటోంది. సునాలీ కేసు ఈ లోపాలను స్పష్టం చేస్తోంది. ఆమె కుటుంబానికి ఓటర్ల కార్డులు, రికార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయి. కుటుంబానికి పశ్చిమబెంగాల్, అసోం రెండు రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయి. ఇంతవరకూ ఆమెకు అనుకూలంగా తీర్పురాలేదు. అయినా, ఆమెను, ఆమె భర్త, ఇద్దరు పిల్లలనుంచి వేరు చేసి తీసుకెళ్లారు. గర్భిణి అయి కడుపులో బిడ్డను మోస్తున్న సమయంలో ఆమెను సరిహద్దులు దాటించి పంపివేశారు. ఆమె, చిన్నకొడుకు అర్థం చేసుకోలేని కష్టాల చిక్కుకుని, అతని కుటుంబం చట్టపరమైన సహాయం కోసం ఇబ్బంది పడుతుండగా, నెలల పాటు విదేశీ గడ్డపై బతకాల్సి వచ్చింది. ఆమె వివరాలు పరిశీలించిన తర్వాత, బంగ్లాదేశ్ అధికారులు ఆమె బంగ్లా జాతీయురాలు కాదని నిర్ధారించి. ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. సునాలీ విషయంలో ఆమె పౌరసత్వం ఉన్న దేశం కంటే నెట్టివేయబడిన పొరుగు దేశం ఆమెకు తగిన ప్రక్రియకు కట్టుబడి ఉండడం విశేషం. తీవ్ర ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అధికారుల ఓవర్ యాక్షన్ మాత్రమే కాదు, దేశం లో చట్టాలను గౌరవించకపోవడం. ప్రభుత్వ అధికారులు న్యాయవ్యవస్థను అతిక్రమించడం, రాజ్యాంగం కల్పించిన రక్షణలను ఇబ్బందికరంగా పరిగణించిన పక్షం అసలు పౌరసత్వం వ్యవస్థే దుర్బలంగా తయారవుతుంది. అనేక సందర్భాల్లో, కోర్టులు జోక్యం చేసుకుని సంజాయిషీ కోరడంతోపాటు, బహిష్కరణలను ఆపాయి. తప్పిపోయిన వ్యక్తులుగా ప్రకటించిన వారిని వెతికి పట్టుకుని హాజరుపరచాలని ప్రభుత్వాలను ఆదేశించాయి. న్యాయవ్యవస్థ జోక్యం, ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుంది. ఈలోగా బాధితులు నెలల తరబడి వేదన అనుభవిస్తారు. ప్రజాస్వామ్య గణతంత్రం లో ఏ పౌరుడూ ఎదుర్కోకూడని పరిస్థితులు అనుభవిస్తాడు. ఆ తర్వాత అందే న్యాయం వల్ల ఏం లాభం. మనదేశంలో కోర్టులు, లాయర్ల ఫీజులు ఖరీదైనవి, చాలా కుటుంబాలకు కేసులు ఏళ్ల తరబడి కొనసాగించే అవకాశాలు లేవు, అలాంటి వారు తక్కువే. రాజకీయ పరమైన చిక్కులు చాలా విస్తృతంగా ఉంటాయి మతం, భాష, సామాజిక ఆర్థిక స్థితి ఆధారంగా పౌరసత్వాన్ని తలగించడం చేస్తే, అది గందరగోళానికి దారితీస్తుంది. కొందరు పౌరుల విషయంలో వివక్షకు దారితీస్తుంది. అది సాంకేతిక పరమైన, లేదా పాలనా పరమైన సమస్య కాదు, గణతంత్ర దృక్పథంలోనే మార్పునకు దారితీస్తుంది. స్వాతంత్య్రం అంతరం భారత రాజ్యాంగం విలువలపై ఆధారపడిన సమ్మిళిత వర్గంగా పౌరసత్వాన్ని పరిగణించాలని ఆకాంక్షించింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, పౌరసత్వాన్ని అప్పుడప్పుడు చట్టవిరుద్ధ బలవంతం ద్వారా బహిష్కరణలకు సాధనంగా మార్చే ప్రమాదం ఉంది. ముందుకు సాగాలంటే, చట్టవిరుద్ధమైన బహిష్కరణలు వెంటనే నిలిపివేయాలి. ప్రభుత్వం ఎంతమంది ఇలాంటి ఇబ్బందులకు గురయ్యారో బహిర్గతం చేయాలి. ప్రతి కేసుకు చట్టపరమైన ఆధారం అందించాలి. విదేశీయుల ట్రిబ్యునళ్లకు నిర్మణాత్మక సంస్కరణలు, న్యాయపరమైన పర్యవేక్షణ అవసరం. పేదలకు పౌరహక్కు కోల్పోకుండా చట్టపరమైన సహాయాన్ని విస్తృతం చేయాలి. అన్నిటికంటే ముఖ్యం ఒక వర్గం పౌరులను శాశ్వత అనుమానితులుగా భావిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది. మత పరమైన అంతరాలను తీవ్రతరం చేస్తుందని రాజకీయ నాయకులు గుర్తించాలి. సునాలి ఖాతున్, ఇతరుల పునరాగమన ఉదంతం కోర్టులు, పౌర సమాజం, సాధారణ పౌరులు అన్యాయాన్ని తిప్పికొట్టగలరని రుజువు చేసింది. సరిహద్దులను దాటడం భౌగోళికం మాత్రమే కాదు ఓ హెచ్చరిక కూడా. గణతంత్ర రాజ్యం ఈ హద్దును మరచిపోకూడదు.   - గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్) (రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయాల అంశాల విశ్లేషకుడు)

మన తెలంగాణ 9 Dec 2025 10:05 am

Meeting |నారా లోకేష్‌తో బొబ్బా గోవర్ధన్ కీలక భేటీ..

Meeting | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:00 am

India - South Africa : వన్డే సిరీస్ ను కొట్టేశారు.. ఇక టీ20 సిరీస్ మిగిలింది.. కట్ పిచ్ రిపోర్టు ఇలా

ఇండియా - దక్షిణాఫ్రికాల మధ్య ఈరోజు కటక్ లో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 10:00 am

Kerala : నేడు కేరళలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు

తొలి దశ కేరళ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 9:54 am

Horror thriller |ట్రైలర్‌తో భయపెట్టిన ‘ఈషా’

Horror thriller | ట్రైలర్‌తో భయపెట్టిన ‘ఈషా’ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 9 Dec 2025 9:53 am

Telangana : నేడు జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

నేడు అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 9:40 am

Weather Report : ఈ చలికి గడ్డకట్ట పోతామా ఏందిరా అయ్యా?

దేశంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి దేశంలో చలితీవ్రత పెరుగుతుంది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 9:32 am

నేడు లోక్ సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ

ఏడోరోజు పార్లమెంట్‌ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 9:28 am

నెలసరి సమస్యలపై గురిపెట్టి..!

వైద్య విద్యార్థినిగా ఉన్నప్పుడే కుటుంబం నిర్వహిస్తున్న “కడియం ఫౌండేషన్‌” ద్వారా పాఠశాల విద్య మానేసే బాలికల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గమనించారు. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యురాలిగా పనిచేసేటప్పుడు, మహిళలు తమ నెలసరి చక్రం సమయంలో శుభ్రత పాటించే విధానంపై అవగాహన పెంచారు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు నెలసరి సమయంలో అవసరమైన ప్యాడ్లను ఉచితంగా అందించే పథకానికి పునాది వేసారు. అదే ధోరణి కొనసాగిస్తూ, ప్రస్తుత లోక్‌సభ సభ్యురాలిగా మహిళలు, ముఖ్యంగా ఉద్యోగిణులు పనిచేసే స్థలాల్లో అవసరమైన సౌకర్యాలపై చట్టసభను కదిలించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య. 2025 డిసెంబర్ 5న, వరంగల్ నుంచి కాంగ్రెస్ ఎంపిగా ఉన్న డాక్టర్ కడియం కావ్య ఒకే సమావేశంలో రెండు ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టిన తొలి తెలంగాణ మహిళగా నిలిచారు. వీటిలో ఒకటైన మెన్‌స్ట్రువల్ బెనిఫిట్స్ బిల్ -2024, మహిళల నెలసరి ఆరోగ్యం పట్ల చట్టబద్ధత కల్పించడానికి చేసిన ధైర్యవంతమైన అడుగు. ఈ బిల్లులో ప్రభుత్వం, ప్రైవేటు రంగాలతోపాటు అన్ని కార్యాలయాల్లో సురక్షిత, శుభ్రమైన టాయిలెట్స్ తగిన ఆరోగ్య వసూలు కల్పించే విధంగా, ఉచిత/ రాయితీ ధరల ద్వారా శానిటరీ నాప్కిన్స్‌ను అందించాలని, అలాగే నెలకు రెండు రోజుల చెల్లింపులతో కూడిన విశ్రాంతి ఇవ్వాలని ఎంపి డా. కడియం కావ్య ప్రతిపాదించారు. మహిళల్లో తీవ్రమైన నెలసరి నొప్పి హార్ట్ అటాక్ నొప్పికీ సమానమనే యూనివర్శిటీ కాలేజ్ లండన్ పరిశోధనను ఎంపి డాక్టర్ కావ్య ఆధారంగా చూపించారు. ఇది ఒక సాధారణ బిల్లు కాదు; మహిళల నెలసరి గురించి భారతీయ సమాజంలో శతాబ్దాలుగా నెలకొన్న నిశ్శబ్దం, అపహాస్యం, నిర్లక్ష్యానికి ఇది ధైర్యమైన సవాలు. భారతదేశంలో పరిస్థితి ఎంత తీవ్రమో గణాంకాలు చెబుతున్నాయి. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 ప్రకారం, 15 -24 ఏళ్ల యువతుల్లో కేవలం 58% మంది మాత్రమే పరిశుభ్రమైన శానిటరీ నాప్కిన్స్‌ను ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాతం మరింత తగ్గుతుంది -అక్కడ 60% కంటే ఎక్కువ మంది ఇప్పటికీ పాత బట్టలపై ఆధారపడుతున్నారు. ఇవి సరైన రీతిలో శుభ్రం చేయకపోవడంతో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. పలువురు బాలికలు నెలలో నాలుగు- ఐదు రోజుల పాటు పాఠశాలకు దూరమవుతారు. నొప్పి, అవసరమైన శానిటరీ నాప్కిన్స్ లభ్యత లేకపోవడం, మరుగుదొడ్లు లేని దుస్థితి ఇవన్నీ కారణాలు ఉన్నాయి. వీటి కారణంగా విద్యార్థుల పాఠశాలకు గైర్హాజరు కావడంతో పిల్లల విద్యలో లింగ వ్యత్యాసం మరింత పెరుగుతోంది. ఆర్థిక భారం కూడా చిన్నది కాదు. ఒక సానిటరీ ప్యాక్ ధరే రూ. 30 -నుంచి రూ. 50 ఉండటం వల్ల లక్షల కుటుంబాలకు ఇది నెలనెలా వారికి భారం అవుతుంది. కొవిడ్ సమయాల్లో సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో అనేక మంది మహిళలు చిరిగిన బట్టలతో గడపాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. నెలసరి సమయంలో రక్తనష్టం, పోషకాహార లోపంతో మహిళల్లో రక్తహీనత మరింత తీవ్రమైంది. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అరబిలియన్ మహిళలు పిరియడ్ పావర్టీతో బాధపడుతున్నారు. అమెరికాలో ప్రతి నాలుగురు టీనేజ్ అమ్మాయిల్లో ఒకరు ఈ సమస్య వల్ల పాఠశాలకు వెళ్లలేరు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ప్రపంచ పార్లమెంట్లు చర్యలు చేపడుతున్నాయి. స్కాట్లాండ్ 2020లో అందరికీ ఉచిత శుభ్రతా ఉత్పత్తులు అందించే చట్టం చేసింది. స్పెయిన్ 2023 నుండి నెలసరి విశ్రాంతిని అమలు చేస్తోంది. జపాన్ 1947 నుంచే ఈ విధానాన్ని అమల్లో ఉంచింది. అమెరికాలో అనేక రాష్ట్రాలు ‘ట్యాంపాన్ ట్యాక్స్’ ను రద్దు చేశాయి. భారతదేశం కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. ఎఎస్సేఎ వర్కర్ల ద్వారా రాయితీ ధరల పంపిణీ, పాఠశాలల్లో వెండింగ్ మెషిన్లు, ఇన్సినిరేటర్లు ఏర్పాటు, శుభ్రతా ఉత్పత్తుల వినియోగం 42% నుంచి 58% కి పెరగడం వంటి పురోగతి ఉంది. కానీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కవరేజ్ ఇంకా చాలా తక్కువగా ఉంది. ఈ నెలసరికి సంబంధించిన సౌకర్యాలు, విశ్రాంతి హక్కుగా ఇచ్చే కేంద్ర చట్టం ఇప్పటికీ లేదు. ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టే ప్రయత్నమే డాక్టర్ కావ్య బిల్లు. ఫ్యాక్టరీ కార్మికులు నుంచి వైద్యులు, ఉపాధ్యాయుల నుంచి గృహ సహాయకులు వరకు- అన్ని రంగాల మహిళలకు రక్షణ కల్పించేలా ఇది రూపుదిద్దుకుంది. మహిళల నెలసరి అనేది వ్యక్తిగత సిగ్గు విషయం కాదని, ఇది ప్రజారోగ్యానికి, లింగ న్యాయానికి సంబంధించిన అంశమని స్పష్టం చేస్తుంది. వ్యతిరేకాలు, వ్యయభారం వంటి అభ్యంతరాలు వచ్చినా, ఇతర దేశాల అనుభవాలు ఈ సౌకర్యాలు ఉత్పాదకతను పెంచుతాయని చూపాయి. పాఠశాల్లో ప్యాడ్లు అందిస్తే బాలికల హాజరు పెరిగిందన్న ఉదాహరణలు స్పష్టంగా ఉన్నాయి. వరంగల్ వంటి ప్రాంతాలనుంచి వచ్చిన ఈ చట్టప్రయత్నం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అంచున ఉన్న వర్గాల వాయిస్ కూడా జాతీయ విధానాలను మార్చగలవని ఇది నిరూపిస్తోంది. ఈ నెలసరి ప్రక్రియను గౌరవంతో చూడడం, దానికి అవసరమైన సౌకర్యాలను హక్కుగా ఇవ్వడం -ఇవి విలాసం కాదు; ప్రాథమిక మానవ హక్కులు. డాక్టర్ కడియం కావ్య వేసిన ఈ చిన్న దీపకాంతిని ఇప్పుడు ప్రభుత్వం, పార్లమెంట్, సమాజం కలిసి పిరియడ్ షేమ్ ని శాశ్వతంగా ముగించే జ్వాలగా మార్చాల్సిన సమయం ఇది. - కేశిరెడ్డి మాధవి

మన తెలంగాణ 9 Dec 2025 9:26 am

కవితా.. నీ బండారం బయటపెడతా

కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 9 Dec 2025 9:12 am

ఇండిగో సంక్షోభం.. ఇదిగో పరిష్కారం

ఇండిగో సంక్షోభం కారణంగా ఇప్పుడు దేశం మొత్తం పబ్లిక్ రంగం ప్రాధాన్యతపై చర్చ మొదలైంది. వేలాదిమంది సోషల్ మీడియాలో పబ్లిక్ రంగం పాత్ర ఈ దేశ విమానయాన రంగంలో షోషించిన నిర్మాణాత్మక పాత్రపై అనేక చర్చలు జరుగుతున్నాయి. పబ్లిక్ రంగం పాత్రను చరిత్రలోనే మనం తొంగిచూస్తే అనేక విజయాలు మనకు కనిపిస్తాయి. భారత దేశంలో పబ్లిక్ రంగం అనేది సాధారణ ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యపు సామాజిక, ఆర్థిక బలాన్ని నిలబెట్టే స్తంభం. స్వాతంత్య్రం తర్వాత ఈ దేశం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ప్రజల అవసరాలను కేంద్రంగా పెట్టుకున్న ఆర్థిక నిర్మాణం అవసరమైంది. అదే బాధ్యతను పబ్లిక్ రంగం నెరవేర్చింది. బ్యాంకింగ్ నుంచి రైల్వేలు, విమానయానం, కోల్ ఇండియా నుంచి స్టీల్ అథారిటీ వరకు, కోట్లాది ప్రజల ప్రయాణాలు, పొదుపులు, ఉపాధి, జీవన ప్రమాణాలు పబ్లిక్ రంగాలపై ఆధారపడి ఉన్న వాస్తవం. లాభాలను కంటే ప్రజల అవసరాలను ముందుకు పెట్టడం, దూరప్రాంతాలకు సేవలు చేర్చడం, సామాజిక సమానత్వాన్ని చూపించడం ఇవన్నీ పబ్లిక్ రంగం నుంచే సాధ్యమయ్యాయి. కానీ నేడు ఈ రంగం దాడులు పెరుగుతున్నాయి. ప్రైవేటీకరణను అభివృద్ధి అని అమ్మే ప్రభుత్వాలు పబ్లిక్‌రంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నాయి. లాభాల్లో ఉన్న సంస్థలకూ ‘స్ట్రాటజిక్ డిస్‌ఇన్వెస్ట్‌మెంట్’ పేరుతో వేలం వేయడం సాధారణమైంది. ప్రజల సొమ్ముతో నిర్మించిన సంస్థలను కొంతమంది కార్పొరేట్ వర్గాలకు అప్పగించడం ద్వారా ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థను క్రిమినలైజ్ చేస్తున్నాయి. బ్యాంకులను విలీనాలు, మూసివేతల దిశగా నెట్టడం, బొగ్గు బ్లాకులను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం, రైల్వే, ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను విడదీసి ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం ఇవన్నీ ప్రజలపై భారాలు మోపే నిర్ణయాలే. ప్రైవేటు రంగం లాభాలను మాత్రమే చూసే క్రమంలో సామాజిక బాధ్యతలు, ధర నియంత్రణ, గ్రామీణ సేవలు అన్నీ అరుదైపోయే ప్రమాదం ఉంది. భారతదేశం లాంటి అసమానతలున్న దేశంలో పబ్లిక్‌రంగం కేవలం వ్యాపారం కాదు. అది సామాజిక సమీకరణ యంత్రాంగం.లాభాలు లేకున్నా సేవలను విరమించకుండా కొనసాగించగల రంగం ఇదొక్కటే. ప్రైవేటీకరణ పేరుతో పబ్లిక్ రంగాన్ని ముసుగులో హరించడం నేరం. ఒక తరానికి చెందిన సొమ్ము, శ్రమ, కలలతో నిర్మించిన ఈ ఆస్తులు దేశ భవిష్యత్తుకు కేవలం పెట్టుబడులు కాదు, రక్షణ. ప్రస్తుత అసమానతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ రంగం బలోపేతం అత్యవసరం. ఉపాధి తగ్గిపోతున్న సమయంలో పబ్లిక్ రంగ విస్తరణ తప్ప మరే ప్రత్యామ్నాయం లేదు. చిన్న, పెద్ద, మధ్యతరగతి ప్రజలందరూ ఆధారపడే భద్రతా వల ఈ రంగమే. కాబట్టి పబ్లిక్ రంగాన్ని రక్షించడం అనేది కేవలం గతాన్ని కాపాడడం కాదు, భవిష్యత్తును కాపాడడం. కానీ పాలకులు ప్రజలకంటే, దేశం అవసరాల కంటే పెట్టుబడి దారుల అవసరాలే మిన్నగా ఉంటున్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఇండిగో సంక్షోభం అన్నది వాస్తవం. ఇండిగోలో ఇటీవలే బయటపడిన యాజమాన్య, వాటాదారుల మధ్య అధికార పోరు దేశ విమానయాన రంగం ఎంత అస్థిరంగా మారిందో ప్రత్యక్షంగా చూపిస్తున్న సంఘటన. మార్కెట్‌లో 60 శాతానికి పైగా వాటా ఉన్న సంస్థ ఒక్కరోజు అంతర్గత ఒడిదుడుకులకు లోనైతే దేశవ్యాప్తంగా వేలాది ఫ్లైట్లు రద్దయ్యే ప్రమాదం, ప్రయాణికులు ఇరుక్కుపోయే పరిస్థితి, షేర్ మార్కెట్‌లో కోట్లు ఆవిరయ్యే అనిశ్చితి, ఇవి అన్నీ ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఇది కేవలం ఒక కంపెనీ గొడవ కాదు; ఇది విమానయాన రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించిన ప్రభుత్వ విధానాల ఘోర వైఫల్యం. ఆ వైఫల్యాన్ని ప్రశ్నించే ఆలోచనే పాలకవర్గానికిలేదు. ఎయిర్ ఇండియాను భారాలు అవుతున్న పబ్లిక్ రంగం అని తక్కువ చేసి, నష్టాలను ఉద్దేశపూర్వకంగా పెంచిన తరువాత అతి తక్కువ ధరకు ప్రైవేటు చేతుల్లో వదిలేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇండిగో సంక్షోభం గురించి పెదవి విప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. ఒక పబ్లిక్‌రంగ విమానయాన సంస్థ పనిచేసేది కేవలం లాభాల కోసం కాదు; అది జాతీయ అవసరాలను తీర్చే బాధ్యతను కూడా మోసేది. దూరప్రాంతాలకూ, లాభం రానివాటికీ సేవలందించేది. అత్యవసర సమయాల్లో విదేశాల్లో ఇరుక్కున్న భారతీయులను కొలువరించేది. విపత్తుల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొనేది. ఇవన్నీ ప్రైవేట్ రంగం చేయగలదా? వారి బోర్డు సమావేశాల్లో వాటాదారుల ఒత్తిడి ఒక మూలను ఇరుకోబెడితే, ఆ రాత్రే ధరలు ఎగసిపడతాయి;సేవలు నిలిచిపోతాయి. ఇండిగో సంక్షోభం తర్వాత మార్కెట్ ఎలా స్పందించిందో చూస్తే భారత గగనయాన రంగం అనిశ్చితి ఎంత తీవ్రమో అర్థమవుతుంది.షేర్ ధర పతనంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందినా, సాధారణ ప్రజల సమస్య మాత్రం మరింత సూటిగా మెదులుతుంది. ప్రయాణ ఖర్చులు పెరగటం, టికెట్లు అకస్మాత్తుగా దొరక్కపోవటం, సేవా నాణ్యత పడిపోవడం, మార్గాల ఎంపిక పూర్తిగా సంస్థల ఖజాన, లాభాల లెక్కల ఆధారంగా నిర్ణయించబడటం. విమానయాన రంగంలాంటి కీలక రంగాన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం ఒక దేశ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పే. విమాన రూట్ల కేటాయింపు, అత్యవసర ఎయిర్‌లిఫ్ట్‌లు, అభివృద్ధి చెందని ప్రాంతాలకు కనెక్టివిటీ వంటి సేవలను ప్రైవేట్ కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్‌లను చూసుకుని మాత్రమే నిర్వహిస్తాయి. అలా లాభం రాకపోతే, ఆ సేవలు నిలిచిపోతాయి. పబ్లిక్ రంగం ఉన్నప్పుడు మాత్రం లాభ-నష్టాలతో సంబంధం లేకుండా ప్రజా ప్రయోజనాలే కేంద్రంగా నిలిచేవి. ఇది పబ్లిక్ రంగం ప్రాధాన్యతను సాక్ష్యాలతో రుజువు చేసే ముఖ్యమైన ఉదాహరణ. ఇండిగోలో జరిగిన మేనేజ్‌మెంట్ విభేదాలు, వాటాదారుల మధ్య అధికార యుద్ధాలు, అంతర్గత చెత్త పాలన దేశ విమానయాన రంగంలో ఒకే సంస్థ ఆధీనత ఎలా ప్రమాదకారకమో చూపుతున్నాయి. ప్రైవేట్ సంస్థల అప్రతిహత అధికారం, ప్రభుత్వ మౌన సమ్మతి రెండూ కలిపి ప్రజలకే భారమయ్యాయి. ఒక సంస్థ గందరగోళం కారణంగా దేశవ్యాప్తంగా వందల ఫ్లైట్లు ఆలస్యం కావటం అంటే, కొద్దిమంది పెట్టుబడిదారుల మీద దేశం మొత్తం ఆధారపడి ఉన్నదని అర్థం. ఇది అస్వాభావికమైన ఆర్థిక నిర్మాణం. ఇండిగో సంక్షోభం ఒక సంఘటన కాదు, అది ఒక సందేశం. దేశ విమానయాన రంగాన్ని పూర్తిగా ప్రైవేటు ఆధీనానికి అప్పగించినప్పుడు ఏమి జరుగుతుందో ఇది స్పష్టంగా చెబుతోంది. పబ్లిక్ రంగం మరింత బలపడాల్సిన అవసరం ఉంది. విమానయానాన్ని ప్రజా సేవగా తిరిగి నిర్వచించాల్సిన సమయం వచ్చింది. అప్పుడే ప్రజల ప్రయాణం సురక్షితం, అందుబాటు, సమానత్వం కలిగినదిగా ఉంటుంది. లేకపోతే ఇండిగో నేటి సంక్షోభం రేపటి మరింత పెద్ద దుర్ఘటనలకు పునాది మాత్రమే అవుతుంది. - టి.నాగరాజు 9490098292

మన తెలంగాణ 9 Dec 2025 9:09 am

Bikkanoor |ప్రజాసేవకు అంకితం..

Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : చేతులెత్తి మొక్కుతున్నా.. మీ బిడ్డగా తమను

ప్రభ న్యూస్ 9 Dec 2025 9:05 am

Peddamallareddy | 24 గంటలు అందుబాటులో..

Peddamallareddy | 24 గంటలు అందుబాటులో.. Peddamallareddy, బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని

ప్రభ న్యూస్ 9 Dec 2025 8:53 am

Nara Lokesh : అమెరికాలో కొనసాగుతున్న లోకేశ్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పర్యటన అమెరికాలో కొనసాగుతుంది.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 8:49 am

indigo crisis | 4,500 బ్యాగేజీలు ప్రయాణికులకు అప్పగింత

indigo crisis | 4,500 బ్యాగేజీలు ప్రయాణికులకు అప్పగింత డంప్ యార్డుల్లా ఎయిర్పోర్టులుకుప్పలు

ప్రభ న్యూస్ 9 Dec 2025 8:48 am

Rajapeta |ప్రజలు సమస్యలు పరిష్కరిస్తా..

Rajapeta | ప్రజలు సమస్యలు పరిష్కరిస్తా.. Rajapeta, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశం

ప్రభ న్యూస్ 9 Dec 2025 8:46 am

Telangana : నేడు విజన్ డాక్యుమెంట్ విడుదల

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో నేడు విజన్ డాక్యుమెంట్ 2047 ను విడుదల చేయనున్నారు.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 8:39 am

Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారికి అలెర్ట్... దర్శనం కోసం?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ కొద్దిగా పెరిగింది.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 8:31 am

Hyderabad : శంషాబాద్ లో విమానానికి బాంబు బెదిరింపు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 8:17 am

Telangana : గ్లోబల్ సమ్మిట్ లో భారీగా ఒప్పందాలు

హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి

తెలుగు పోస్ట్ 9 Dec 2025 8:08 am

Alwala |ఆశీర్వదించండి.. గెలిపించండి..

Alwala | ఆశీర్వదించండి.. గెలిపించండి.. Alwala, పెద్దమందడి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని

ప్రభ న్యూస్ 9 Dec 2025 8:03 am

Telangana : నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్

నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 8:00 am

Manigilla |కాంగ్రెస్ వలనే సాధ్యం..

Manigilla | కాంగ్రెస్ వలనే సాధ్యం.. Manigilla, పెద్దమందడి, ఆంధ్రప్రభ : మండల

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:52 am

Congress |ప్రజాసేవకే జీవితం అంకితం..

Congress | ప్రజాసేవకే జీవితం అంకితం.. Congress, దస్తూరాబాద్, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:42 am

India vs South Africa : నేడు భారత్ - దక్షిణాఫ్రికా తొలి టీ20

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్ వేదికగా జరగనుంది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 7:37 am

చాయ్ షాట్స్’ ప్రారంభం

తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్న చాయ్ బిస్కెట్... దేశంలోని తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్ లో 2 నిమిషాలకు లోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయి. ‘చాయ్ షాట్స్’ ఏంజెల్ ఇన్వెస్టర్లుగా రానా దగ్గుబాటి (నటుడు, నిర్మాత), శ్రీ హర్ష మజేటి, నందన్ రెడ్డి (స్విగ్గీ వ్యవస్థాపకులు), ఫణీంద్ర సమా (రెడ్‌బస్ స్థాపకుడు), అలఖ్ పాండే, ప్రత్యీక్ మహేశ్వరి (ఫిజిక్స్‌వాలా వ్యవస్థాపకులు), అరవింద్ సాంకా, పవన్ గుంటుపల్లి, రిషికేశ్ (రాపిడో స్థాపకులు), రోహిత్ చెన్నమనేని (డార్విన్‌బాక్స్ సహ వ్యవస్థాపకుడు), అమర్ నగరం (విర్జియో వ్యవస్థాపకుడు) ఉన్నారు. ’చాయ్ షాట్స్’ యాప్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి మాట్లాడుతూ “చాయ్ షాట్స్.. కంటెంట్ క్రియేటర్స్ చేతిలో ఒక అడ్భుతమైన పవర్. శరత్, అనురాగ్ ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి. వాళ్ళు తెలుగు యంగ్ ఆడియన్స్‌ని అద్భుతంగా అర్థం చేసుకున్నారు. వాళ్ల జర్నీలో నేను ఒక చిన్న పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది”అని అన్నారు. చాయ్ బిస్కెట్ శరత్ మాట్లాడుతూ “’చాయ్ షాట్స్’ను ప్రస్తుతం తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నాం. త్వరలోనే అన్ని భాషల్లో లాంచ్ చేస్తాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్, చాయ్ బిస్కెట్ అనురాగ్, సీటీవో కృష్ణ, రాపిడో సహ వ్యవస్థాపకుడు రిషికేశ్, రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర, డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని, రాహుల్ హుమాయున్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 7:36 am

Indaram |నిరంతరం కృషి చేస్తా..

Indaram | నిరంతరం కృషి చేస్తా.. Indaram, జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:33 am

Bikkanur |ఆదర్శ పట్టణంగా మారుస్తా..

Bikkanur | ఆదర్శ పట్టణంగా మారుస్తా.. Bikkanur, ఆంధ్ర ప్రభ : ఫుట్

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:27 am

Godserial |అభివృద్ధి చేసి చూపిస్తా..

Godserial | అభివృద్ధి చేసి చూపిస్తా.. Godserial, దస్తూరాబాద్, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:19 am

District Judge |బండ్ల స్నేహ..

District Judge | బండ్ల స్నేహ.. District Judge, ఘంటసాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:55 am

AP |రేషన్ బియ్యం సీజ్..

AP | రేషన్ బియ్యం సీజ్.. AP, పెడన, ఆంధ్రప్రభ : పెడన

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:38 am

Hero |రాజశేఖర్ కు గాయాలు. అసలు ఏం జరిగింది..?

Hero | రాజశేఖర్ కు గాయాలు. అసలు ఏం జరిగింది..? Hero, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 9 Dec 2025 6:25 am

రైజింగ్ అన్‌స్టాపబుల్

మనతెలంగాణ/హైదరాబాద్: చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 20 ఏళ్లుగా అత్యధిక పెట్టుబడులు, ఉత్పత్తితో చైనాను లీడ్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ విధంగానే తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి సరికొత్త లక్ష్యాలతో ముందుకెళ్లనున్నట్లు సిఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి, అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు ‘తెలంగాణ రైజింగ్- 2047’ పేరుతో విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామని ఆయ న తెలిపారు. ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతాన్ని మూడు రకాలుగా వర్గీకరిస్తున్నామని వివరించా రు. మహిళలు, రైతులు, యువత, వివిధ సామాజిక వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ విజన్ డాక్యుమెంట్‌ను రెడీ చేశామని ఆయన తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లో స్పష్టమైన విధానాలతో దేశంలోనే తెలంగాణను మొదటిస్థానంలో నిలపాలన్న లక్ష్యాలను నిర్ధేశించామని తెలిపారు. ఈ లక్ష్యాల రూపకల్పనలో ప్రజల నుంచి అభిప్రాయాలను కోరామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వారి అంచనాలు, ఆలోచనలు, కలలను తమతో పంచుకున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యం త్రాంగం, అధికారులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి సహాయ, సహకారాలను తీసుకున్నామన్నారు. తెలంగాణ రైజింగ్ దార్శనికతను రూపొందించడంలో సహాయ పడిన వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రకంగా నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా బృహత్తరమైన సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపు ణులు ఇందులో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ నిపుణులు హాజరైన ఈ సమ్మిట్‌లో మీరందించే సలహాలు, ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో 2047కు ఓ ప్రత్యేకత ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047కు ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అవుతుందని ఆయన తెలిపారు. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు మన నాయకులు దేశాన్ని ముందుకు నడిపించడానికి దూరదృష్టితో ఆలోచనలు చేశారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడానికి చర్చోపచర్చల అనంతరం ప్రజాస్వామిక, సార్వభౌమ, ప్రజాస్వామిక, లౌకిక, గణతంత్ర దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపొందించా రన్నారు. దేశ భవిష్యత్‌గా ఒక రోడ్ మ్యాప్ వేయాలని భావించిన మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌లతో పాటు రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతోమంది నుంచి తాము ప్రేరణ పొందామన్నారు. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని, 2014లో సోనియా గాంధీ, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ కలను సాధించుకున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఒక కొత్త యువ రాష్ట్రంగా అవతరించింది. అలాంటి తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన తెలిపారు. దేశంలోనే తెలంగాణ యువ రాష్ట్రమని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 9 Dec 2025 6:00 am

తొలిరోజు 2.5లక్షల కోట్లు

మ నతెలంగాణ/హైదరాబాద్ : భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది. రాష్ట్ర ఉజ్జ్వల భవిష్యత్ విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సద స్సు తొలిరోజున పేరొందిన కంపెనీలు.. దేశ విదేశాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తల దృష్టిని అమితంగా ఆకట్టుకుంది. తొలి రోజే సుమారు రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 35 ఎంఒయులపై సంతకాలు జరిగాయి. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం విజన్ 2047 దిశ గా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా తన సుస్థిర స్థానాన్ని చాటుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో ప లు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశా రు. తెలంగాణలో పెట్టుబడులకు మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దీంతో ఒకే రోజున రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. ఈ పెట్టుబడు లు రాష్ట్ర అభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉద్యోగావకాశా ల సృష్టికి దోహదపడనున్నాయి. ప్రముఖ సంస్థ లు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ముందుకువచ్చాయి. ప్రత్యేకంగా, పునరుత్పాదక ఇంధనం, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడి యా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు రావటం విశేషం. ప్రధాన పెట్టుబడులు భారత్ ప్యూచర్ సిటీలో బ్రుక్‌ఫీల్ యాక్సిస్ వెంచర్స్ కూటమి రూ. 75 వేల కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్, డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ - రూ. 27,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఎస్‌ఐడిబిఐ స్టార్టప్‌లకు రూ.1,000 కోట్లు పెట్టబడులకు ముందుకు వచ్చింది. వరల్డ్ ట్రేట్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈవ్‌రెన్ యాక్సిస్ ఎనర్జీ రూ.31,500 కోట్లతో సోలార్ పవర్ , విండ్ పవర్ మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. మెఘా ఇంజనీరింగ్ గ్రూప్ రూ.8 వేల కోట్లతో సోలార్, పంప్‌డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది.ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో ఎమ్మార్వోతో పాటు కార్గో విస్తరణకు జీఎంఆర్ గ్రూప్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. డిఫెన్స్, ఏవియానిక్స్ తయారీకి అపోల్ మైక్రో సిస్టమ్ లిమిటెడ్ రూ.1,500 కోట్లు పెట్టుబడులకు సిద్ధపడింది. సోలార్ ఎరోస్పేస్, డిపెన్స్ రంగంలో మిస్త్స్రల్ భాగాలు, ఏరో ఇంజన్ స్ట్రక్షర్‌కు రూ. 1,500 కోట్లు, ఎంపీఎల్ లాజిస్టిక్స్ కంపెనీ రూ.700 కోట్లు, టివిఎస్ ఐఎల్‌పి రూ.200 కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. రెన్యూసిస్, మిడ్ వెస్ట్, అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్స్ హైడ్రోజన్ టెక్ విస్తరణకు రూ. 7,000 కోట్లు పెట్టుబడులు పెడుతాయి. డిస్ట్రిబ్యూషన్ హైడ్రో టెక్ రంగంలో సాహీటెక్ ఇండియా రూ. 1,000 కోట్లు. ఇంటిగ్రేటేడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృష్ణా పవర్ యుటిలిటీస్ రూ. 5,000 కోట్లు. సిమెంట్ రంగ విస్తరణకు అల్ట్రా బ్రైట్ సిమెంట్స్, రెయిన్ సిమెంట్స్ రూ.2000 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సీతారాం స్పిన్నర్స్ రూ.3 వేల కోట్లతో టెక్స్ టైల్ యూనిట్ నెలకొల్పనుంది. షోలాపూర్ తెలంగాణ టెక్స్ టైల్ అసోసియేషన్ అండ్ జీనియస్ ఫిల్టర్స్ పవర్ లూమ్ టెక్నికల్ యూనిట్కు రూ. 960 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దేశీయ, అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నాణ్యమైన ఉపాధి అవకాశంగా, మౌలిక సదుపాయాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. డీప్‌టెక్ సిటీ నుండి టెక్స్ టైల్ యూనిట్ వరకు అన్ని రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వైవిధ్యమైన పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకు రావటం తెలంగాణ సుస్థిర పరిశ్రమల విధానాన్ని ప్రపంచానికి చాటిచెపుతోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ భారీ పెట్టుబడులు తెలంగాణ రైజింగ్ 2047 దిశలో బలమైన పునాదులు వేస్తాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 5:30 am

తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్ విడుదల

డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళం సినిమా 'జయ జయ జయహే'కు ఇది రిమేక్. 2022లో వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటిటిలో అందుబాటులో ఉంది. తెలుగులోనూ  డబ్ చేశారు. ఈ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి రూపొందించారు. ఏఆర్ సజీవ్ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 9 Dec 2025 5:20 am

పదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు

మన తెలంగాణ / హైదరాబాద్ : ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ సదస్సు నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సదస్సు వేదికగా కంపెనీ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ఈ విషయాన్ని ప్రకటించారు. రానున్న పదేళ్లలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. గత కొన్ని నెలలుగా మమ్మల్ని తెలంగాణకు ఆహ్వానిస్తునే ఉన్నా కుదరలేదని, ఆలస్యం జరిగిందన్నారు. తెలంగాణ ముఖ్యముంత్రి రేవంత్ రెడ్డి మా పెట్టుబడులను ఆహ్వానించారని, ఇక్కడ అభివృద్దికి గొప్ప అస్కారం ఉండడంతో చివరికి రాక తప్పలేదన్నారు. భారత దేశంలో అద్భుతమైన నైపుణ్య మానవ వనరులు ఉన్నాయని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇండియానే పెద్దన్నగా కనబడుతుందన్నారు. ఇది ఎవరికి కనబడడం లేదని, ఇండి యా రైజింగ్ రాబోయే పదేళ్లలో భారతదేశం ప్రపంచ టెక్నాలజీ రంగంలో ముందుంటుందని చెప్పారు. 

మన తెలంగాణ 9 Dec 2025 5:00 am

రెండేళ్ల కాంగ్రెస్ పాలన నిస్సారం, నిరర్థకం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం ప్రజలకు మొండి చే యి చూపిందని, పాలన పూర్తిగా ఆగమాగంగా ఉందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు విమర్శించారు. రెండేళ్ల పాలన అనేది ప్రభు త్వ పనితీరుకు గీటురాయిలాంటిదని, కానీ కాం గ్రెస్ ప్రభుత్వ పాలన నిస్సారం, నిష్పలం, నిరర్ధకంగా మిగిలిపోయిందని దుయ్యబట్టారు. ఈ రెం డేళ్లలో ఆత్మస్తుతి, పరనింద తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీ డియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, రెండేళ్ళ కాం గ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించా రు. తమ ప్రభుత్వం రాగానే మిషన్ భగీరథ, మిష న్ కాకతీయ వంటి పథకాలు తెచ్చామని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా దర్బార్ కూడా ఇప్పుడు అమలు కావడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి ప్రతి రోజు ప్రజా దర్బార్‌లో ప్రజల ను కలుస్తా అన్నారని.. ఆ గొప్పలు ఏమయ్యాయ ని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి బిల్డప్ బాబాయ్ అం టూ ఘాటు విమర్శలు చేశారు. జల్సాలకు, విం దులకు పెళ్లిళ్లకు, సిఎల్‌పి మీటింగ్‌లకు ప్రజా భవన్‌ను వాడుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ తెచ్చిన మెట్రో రైలు, ఫార్మా సిటీ వంటి కీలక ప్రాజెక్టులను రద్దు చేయడం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయిందని ఆరోపించారు. మక్కలు కొని 50 రోజులు దాటినా రైతులకు ఇంకా డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. రైతులకు బేడీలు వేసిన ఈ ప్రభుత్వం రైతు సంక్షోభ ప్రభుత్వం అని మండిపడ్డారు.పూర్తిస్థాయి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని... నిరూపించలేకపోతే రాజీనామాకు సిఎం రేవంత్ రెడ్డి సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మద్యం దుకాణాలకు నోటిఫికేషన్లు ఇచ్చి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్లు బిల్లులు అడిగితే ప్రభుత్వం విజిలెన్స్, ఎసిబి దాడులు చేయిస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారు గ్లోబల్ సమ్మిట్‌ను ‘గోబెల్స్ సమ్మిట్‘ అంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు. గతంలో దావోస్ వెళ్లి డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రేవంత్ నవ్వులపాలయ్యారని విమర్శించారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూమి, ఫార్మా సిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమి బిఆర్‌ఎస్ హయాంలో సమీకరించినదే గుర్తు చేశారు. అందులో రేవంత్ చెమట చుక్క కూడా లేదని అన్నారు. కెసిఆర్ యువత ఉద్యోగాల కోసం ఆలోచిస్తే, రేవంత్ ఆ భూములను తన అనుయాయులకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. రెండో ఏడాది పాలన పెనంలోంచి పొయ్యిలో పడినట్లు ఉందని, మూడో ఏడాది ఏమవుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దుయ్యబట్టారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారన్నారు. రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు. రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో చూసుకోవాలని పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ కరప్షన్ పాలన రేవంత్ కుటుంబం, మంత్రులది అని ఆరోపించారు. కరప్షన్ ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు మొండి చేయి చూపించిందని... అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం విజన్, విధానం ఏంటో ఎవరికి ఇప్పటికీ అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు జరుపుకోవాలని హరీష్‌రావు అన్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 4:00 am

మంగళవారం రాశి ఫలాలు (09-12-2025)

మేషం వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారమున పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలుంటాయి. వృషభం దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి . ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. మిధునం చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. బందు మిత్రులతో సక్యతగా వ్యవహారిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కర్కాటకం సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. దైవచింతన కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సింహం ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కన్య ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. తుల పాత మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. రుణయత్నాలు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులుంటాయి. వృశ్చికం సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు నుండి బయటపడతారు. ధనస్సు పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. మకరం చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఋణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము వసూలవుతుంది. నూతన వస్తులాభాలు పొందుతారు. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. కుంభం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మీనం చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు.  

మన తెలంగాణ 9 Dec 2025 12:10 am

పూలమ్మి, పాలమ్మి వందల ఎకరాలు కబ్జా పెట్టిండు!

మేడ్చల్ జిల్లా మేడిపండు చందంగా ఉందే తప్పితే ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్న కవిత సోమవారం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా మేడ్చల్ జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలతోపాటు పెరెన్నికగన్న యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, డిఫెన్స్, ఎరోనాటిక్స్ లాంటి సంస్థలు, ఫార్మా కంపెనీలకు నెలవుగా ఉన్నా జిల్లాలోని అన్ని బస్తీలు, కాలనీలో కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని అన్నారు. జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి నోచుకోలేదని గుర్తు చేశారు. జిల్లా పరిధిలోని 5 నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా బీటి బ్యాచ్ అని, ఉద్యమకారులు లేరని, ఉన్న ఒక్క శంభీపూర్‌రాజుకు మంత్రిపదవి రాకుండా అడ్డుకున్నారని, మిగతా వారంతా అధికారం, డబ్బు సంపాదన , భూముల ఆక్రమణ కోసమే వేరే పార్టీలో గెలిచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారని వారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ భజన చేయడం అలవాటు చేసుకున్నారని కవిత విమర్శించారు. కుత్బుల్లాపూర్ ఇప్పుడు కబ్జాల పూర్‌గా మారిందని స్థానికులు అంటున్నారని కవిత ఆరోపించారు. మేడ్చల్‌లో మల్లారెడ్డి పూలమ్మిన, పాలమ్మిన అని డైలాగులు చెబుతూ వందల ఎకరాలు కబ్జా చేశాడని ఆరోపించారు. గతంలో రేవంత్‌రెడ్డిపై తొడలు గొట్టి ఇప్పుడు మనువడితో రేవంత్‌రెడ్డి కాళ్ళుమొక్కించి సెటిల్‌మెంట్ చేసుకున్నాడని ఆరోపించారు. 

మన తెలంగాణ 8 Dec 2025 11:14 pm

9 dec cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

9 dec cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 9 dec cartoon

ప్రభ న్యూస్ 8 Dec 2025 11:10 pm

జపాన్‌లో భారీ భూకంపం .. ఎగసి పడిన సునామీ అలలు

 జపాన్ ఉత్తర తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6 గా నమోదైంది. కోస్తాలో 40 సెంమీ ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ ప్రధాన హోన్సు ద్వీపంలో ఉత్తర ప్రాంతంలో అయోమోరికి తూర్పు భాగంలో భూకంపం కేంద్రీ కృతమైందని వివరించింది. దీని ప్రభావంతో హొక్కైడో ద్వీపంలో యురాక్వా పట్టణం, ముత్సు ఒగవారా రేవుపట్టణాన్ని సునామీఅలలు 40 సెంమీ ఎత్తున ఎగసి చుట్టుముట్టాయని వివరించింది. హచినోహి పట్ణంలో ఒక హోటల్‌లో సునామీ అలల తాకిడికి అనేక మంది గాయపడ్డారు. అత్యవసరంగా నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఎమర్జెన్సీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని ప్రధాని సనాయె తకైచి వెల్లడించారు. ప్రజల ప్రానాలు కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు. 

మన తెలంగాణ 8 Dec 2025 11:09 pm

భారత్ ఫ్యూచర్ సిటిలో అన్నపూర్ణ స్టూడియో

భారత్ ప్యూచర్ సిటిలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం చేయనున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు నటుడు అక్కినేని నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ చాలా అద్భుతంగా ఉందని నాగార్జున ప్రశంసించారు. ఫ్యూచర్ సిటి లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఒక ప్రత్యేకమైన ఫిలిం హబ్ ను ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రణాళికలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి చోటు కల్పించడం పట్ల నటుడు నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సినిమా షూటింగ్‌లకు, నిర్మాణాలకు ప్యూచర్ సిటి ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 8 Dec 2025 11:03 pm

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందంటూ టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, ఈ-కామర్స్ సైట్లు తన పేరు, ఫొటోలను వాడుతూ అభ్యం తరకరమైన, తప్పుడు సమాచారంతో కూడిన పోస్టులను వ్యాప్తి చేస్తున్నాయని తన పిటిషన్‌లో వెల్లడించారు. ఈ వ్యవహారంపై సోమవారం జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్టీఆర్ తరఫున న్యాయవాది జె. సాయిదీపక్ వాదనలు వినిపించారు. తన క్లయిం ట్ వ్యక్తిగత హక్కులకు, ప్రతిష్ఠకు హాని కలిగించేలా ఉన్న పోస్టులను తక్షణమే తొలగించాలని, వాటిని ప్రచారం చేసిన వారిపై 2021 ఐటి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను, స్క్రీన్‌షాట్‌లను కోర్టుకు సమర్పించారు. ముందుగా ఆయా సోషల్ మీడియా సంస్థలను సంప్రదించి పోస్టుల తొలగింపునకు ప్రయత్నించాలని, అప్పటికీ ఫలితం లేకపోతేనే కోర్టును ఆశ్రయించాలని న్యాయమూర్తి సూచించారు. ఇక, వాదనలు విన్న న్యాయస్థానం ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరకర మైన కంటెంట్‌ను మూడు రోజుల్లోగా తొలగించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది. గతంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ విషయంలోనూ ఢిల్లీ హైకోర్టు ఇలాంటి ఆదేశాలే ఇచ్చిందని ఎన్టీఆర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో పరువు నష్టంపై ఇటీవల నాగార్జున, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖులు కూడా న్యాయపోరాటం చేసిన విషయం విదితమే.

మన తెలంగాణ 8 Dec 2025 11:00 pm

surabhi group|రాష్ట్రంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి

surabhi group| రాష్ట్రంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి ప్రభుత్వంతో ఎంఓయు1000

ప్రభ న్యూస్ 8 Dec 2025 10:57 pm

21మంది మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్, అలియాస్ దేవ్ మజ్జి, ఆయన భార్య సహా పది మంది మావోయిస్టులు సోమవారం నాడు చత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల తలలపై మొత్తం రూ.2.95 కోట్ల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. ఎకె 47 రైఫిల్ సహా మూడు ఇన్సాస్ రైఫిళ్లు, ఇతర పేలుడు పదార్థాలను కూడా పోలీసులకు అప్పగించారు. రాంధెర్‌కు హొరుపు, అమర్జీత్ అనే పేర్లు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దేవ్ మజ్జి ఎంఎంసి జోన్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన తలపైనే రూ.1.05 కోట్ల రివార్డు ఉంది. ఆయన భార్య అనిత, అలియాస్ లత డివిజినల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో నలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, మరో నలుగురు సభ్యులు, ఇద్దరు ఏరియా కమిటీ మెంబర్లు. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో 10మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా పోలీసులకు లొంగిపోయారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. వీరి లొంగుబాటుతో దిండోరి, మాండ్లా ప్రాంతాలు పూర్తిగా మావోయిస్టు రహితం అయ్యాయని ఆయన వెల్లడించారు. లొంగిపోయిన నక్సల్స్‌పై రూ.2.36కోట్ల రివార్డు ఉన్నట్లు తెలిపారు. 

మన తెలంగాణ 8 Dec 2025 10:53 pm

సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానని సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఓ సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానేమోనని భయంతో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్ పల్లి గ్రామంలో సోమవారం నాడు చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పిప్పడ్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి చాల్కి రాజు (36) అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేసి బరిలో నిలిచారు. అయితే ఆయన అప్పటికే అయ్యప్ప మాలాధారణ వేసి మండలంలోని శంషాద్దీన్ పూర్ గ్రామ శివారులో గల అయ్యప్ప సన్నిధానంలో తోటి అయ్యప్ప స్వాములతో ఉంటున్నాడు. కాగా రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి తోటి స్వాములతో నిద్రించాడు. సోమవారం తెల్లవారు జాము నాలుగు గంటల ప్రాంతంలో నిద్ర లేచి తోటి స్వాములతో కలిసి కాలకృత్యాలు చేయడానికి బయటకు వెళ్లాడు. అయితే బయటకు వెళ్లినఅయ్యప్ప స్వాములు తిరిగి సన్నిధానానికి వచ్చారు.. కాని రాజుస్వామి మాత్రం రాలేదు. దీంతో అయ్యప్ప స్వాములు చుట్టు పక్కల వెతికినా.. రాజు స్వామి ఆచూకి లభించలేదు. దీంతో చేసేదేమి లేక శంషాద్దీన్ పూర్ గ్రామస్తులకు సమాచారం అందించడంతో వెంటనే కొంత మంది గ్రామస్తులు అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకొని సమీప ప్రాంతంతో వెతికడంతో ఓ చెట్టుకు టావల్ తోని ఉరి వేసుకొని కనిపించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, రాయికోడ్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలాన్ని సంగారెడ్డి జిల్లా ఏఎస్పీ రఘునందన్ రావు, జహీరాబాద్ డీఎస్పీ సైదా, రూరల్ సీఐ హన్మంత్ లు పరిశీలించి జరిగిన విషయాన్ని అయ్యప్ప స్వాములను అడిగి తెలుసుకున్నారు. మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయికోడ్ ఎస్‌ఐ చైతన్య కిరిణ్ తెలిపారు.

మన తెలంగాణ 8 Dec 2025 10:10 pm

తప్పుడు ప్రచారంతో టిఆర్‌ఎస్ గోబెల్స్ రాష్ట్ర సమితిగా మారింది:మంత్రి సీతక్క

తప్పుడు ప్రచారంతో టిఆర్‌ఎస్ గోబెల్స్ రాష్ట్ర సమితిగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైతే హరీష్ రావు ఓర్చుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్ కాదని, గోబెల్స్ సమ్మిట్ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా సమాధానం చెప్పారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే సహించలేకపోతున్నారని, కళ్ళల్లో నిప్పులు పోసుకొని తెలంగాణ ఆగం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కెసిఆర్ కుటుంబమే గొప్పదన్న అహంకారంతో హరీష్ రావు మాట్లాడుతూ విజనరీ ఉన్న నేతలను చులకన చేసి మాట్లాడటం హరీష్ రావు నైజమని మండిపడ్డారు. ఖరీదైన భూములను పప్పు బెల్లాలకు అమ్ముకున్న చరిత్ర బిఆర్‌ఎస్ పెద్దలదని ఆరోపించారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ దేశ విదేశా కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు వేల కొలది ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయని చెప్పారు. నిరుద్యోగులను సొంత అవసరాలకు వాడుకొని కేసీఆర్ కుటుంబం వదిలేసిందని అన్నారు. అయితే తమ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ కల్పన చేస్తున్నామని చెప్పారు. దావోస్ సమ్మిట్ ను వినడమే కానీ నేను చూడలేదని, భారత్ ఫ్యూచర్ సిటీలో దావోస్ సమ్మిట్‌కు మించి ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని మంత్రి సీతక్క వివరించారు.

మన తెలంగాణ 8 Dec 2025 10:06 pm

ముగ్గురు సీఎంలు చదివిన కాలేజ్

గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదువుకున్న ఎంతో మంది వివిధ రంగాల్లో రాణించారు..

తెలుగు పోస్ట్ 8 Dec 2025 9:50 pm

మా పెళ్లి రద్దు

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయింది. ఈ విషయాన్ని స్మృతి మంధాన స్వయంగా తన ఇన్ స్టా ద్వారా వెల్లడించింది.

తెలుగు పోస్ట్ 8 Dec 2025 9:48 pm

టికెట్ ధరలను తగ్గించిన ఎయిర్ ఇండియా

ఇండిగోలో తలెత్తిన సంక్షోభం కారణంగా దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలపై ప్రభావం పడింది.

తెలుగు పోస్ట్ 8 Dec 2025 9:40 pm

DHOOM 3 :  రూ.3 కోట్లు  లూటీ

DHOOM 3 : రూ.3 కోట్లు లూటీ * తెరమీదకు హవాలా స్టోరీ

ప్రభ న్యూస్ 8 Dec 2025 9:38 pm

రిటైర్‌మెంట్ తీసుకోలేదు: షకీబ్

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్నాడు.

తెలుగు పోస్ట్ 8 Dec 2025 9:36 pm

Chandrababu Naidu Breaks Silence on IndiGo Crisis, Blames Airline’s Poor Management

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu addressed the media at the AP Secretariat and responded for the first time to the ongoing IndiGo Airlines crisis. He stated that the mass cancellations and passenger distress were the direct result of IndiGo’s failure to follow the rules set by the Directorate General of Civil Aviation. He […] The post Chandrababu Naidu Breaks Silence on IndiGo Crisis, Blames Airline’s Poor Management appeared first on Telugu360 .

తెలుగు 360 8 Dec 2025 9:32 pm

సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత హామీలు నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేస్తా..బాండ్ పేపర్‌ రిసిచ్చిన అభ్యర్థి

జుక్కల్ నియోజకవర్గం పిట్లం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్ రాజీ నామా బాండ్ పేపర్‌ను అందజేశారు. ఈ సందర్బంగా నవాబ్ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ- తన పదవీకాలం సగం అంటే 2.5 ఏళ్లు పూర్తయ్యేలోగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైతే, ఎలాంటి పదవి మోహం లేకుండా తాను స్వయంగా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసి ప్రకటించారు. తమ మాట, తమ హామీల పరిరక్షణ పట్ల ప్రజల ముందే ప్రమాణం చేస్తున్నానని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం పారదర్శక పాలన, మౌలిక వసతుల మెరుగుదల, పంచాయతీ పనుల్లో ప్రజా భాగస్వామ్యం పెంపు వంటి అంశాలను ప్రధాన ప్రాధాన్యాలుగా తీసుకొని ముందుకు సాగనున్నట్లు తెలిపారు. గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని నమ్మకమిస్తున్నట్లు నవాబ్ సుదర్శన్ గౌడ్ తెలిపారు. పిట్లం గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

మన తెలంగాణ 8 Dec 2025 9:13 pm

అండమాన్ నికోబార్ టూర్: మీ మరపురాని ప్రయాణానికి ఒక కంప్లీట్ గైడ్

అండమాన్ నికోబార్ దీవుల టూర్ కోసం ప్లాన్ చేస్తున్నారా? తప్పక సందర్శించాల్సిన ప్రాంతాల కోసం వెతుకుతున్నారా? సమగ్ర వివరాలు ఈ ప్రత్యేక కథనంలో డియర్ అర్బన్ అందిస్తోంది. నీలి సముద్రపు లోతుల్లో దాగి ఉన్న అద్భుతమైన ప్రపంచం, తీరం వెంబడి దట్టంగా పెరిగిన పచ్చని అడవులు, ఇసుక తిన్నెలు మీకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. మీ సాహసయాత్రకు ఇలా సిద్ధమవ్వండి. 1. అండమాన్ లో ది బెస్ట్ ఏవో తెలుసుకోండి: మీ ఐలాండ్ విహార ప్రణాళిక అండమాన్ […] The post అండమాన్ నికోబార్ టూర్: మీ మరపురాని ప్రయాణానికి ఒక కంప్లీట్ గైడ్ appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 8 Dec 2025 9:00 pm

జపాన్ లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

టోక్యో: జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. జపాన్ ఉత్తర తీరంలో సోమవారం 7.2 తీవ్రతతో భారీ భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారీ భూకంపం నేపథ్యంలో మూడు మీటర్ల ఎత్తులో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. అమోరి, హక్కైడో తీరంలో భూకంపం సంభవించిందని ఏజెన్సీ పేర్కొంది. జపాన్ తీరాన్ని భూకంపం అతలాకుతలం చేయడంతో సీలింగ్ లైట్లు ఊగుతున్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. కాగా, భూకంపం కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గానీ జరగలేదని అధికారులు తెలిపారు.

మన తెలంగాణ 8 Dec 2025 8:58 pm

తెలంగాణ హైకోర్టులో ఐఎఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు

 సీనియర్ ఐఎఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కేడర్ కేటాయింపుపై గతంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ స్టే విధించింది. ఈ పరిణామంతో ఆమ్రపాలికి తాత్కాలికంగా చుక్కెదురైంది. గత ఏడాది అక్టోబర్‌లో కేంద్రంలోని డివొపిటి ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్రపాలి డివొపిటి ఆదేశాలను సవాల్ చేస్తూ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేయగా క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. క్యాట్ ఆదేశాల మేరకు ఐఎఎస్ అధికారి హరికిరణ్‌తో స్వాపింగ్ పద్ధతి ద్వారా ఆమ్రపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. అయితే క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివొపిటి తెలంగాణ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. ఐఎఎస్ కేటాయింపు నిబంధనల ప్రకారం ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదని డివొపిటి ప్రధానంగా వాదించింది. ఐఎఎస్ హరికిరణ్ రిజర్వ్ కేటగిరీకి చెందిన అధికారి కాబట్టి ఓపెన్ కేటగిరీకి చెందిన ఆమ్రపాలికి ఆయనతో స్వాపింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని డివొపిటి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. డివొపిటి అప్పీల్‌ను పరిశీలించిన హైకోర్టు క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది. అప్పటివరకు క్యాట్ ఉత్తర్వులు అమలులో ఉండవని, వాటిపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి తరఫు న్యాయవాదికి కూడా హైకోర్టు ఆదేశించింది.

మన తెలంగాణ 8 Dec 2025 8:54 pm

ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ సజీవదహనం

బేస్తవారిపేట: ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు వద్ద టమాటా లోడ్‌తో వెళ్తున్న లారీ టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ లో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ ను పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన దుర్గారావుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మన తెలంగాణ 8 Dec 2025 8:48 pm

నెహ్రూ వాటిని ఆరంభించకపోయి ఉంటే..?: ప్రియాంక గాంధీ

పధాని మోడీ విమర్శలకు కాంగ్రెస్ సభ్యురాలు, గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక వాద్రా కౌంటర్ ఇచ్చారు. వందేమాతరంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ తరపున ఆమె మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు ఉన్నందునే బిజెపి వందేమాతరంపై ప్రత్యేక చర్చ చేపట్టిందన్నారు. జాతీయ గేయం ఇప్పటికీ ప్రజల్లోనే ఉన్నదని, ప్రజా సమస్యలు ఇప్పుడు దేశంలో ఎన్నో ఉన్నాయని, వాటిని పక్కన పెట్టి ఈ చర్చ ఇప్పుడు చేపట్టడం అవసరమా అని ప్రశ్నించారు. భవిష్యత్‌ను వదిలి ప్రధానమంత్రి గతాన్ని తవ్వుతున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యను పక్కనపెట్టి వందేమాతరం చర్చ చేపట్టి అందులో నెహ్రూపై ప్రధానమంత్రి విమర్శలకు పాల్పడుతున్నారని, అయితే నెహ్రూపై కూడా ఈ తరహాలోనే చర్చకు సమయం తీసుకుందామని ప్రతిపాదించారు. ఆయన గురించి ఒక జాబితా రూపొందించి అంశాల వారీగా మాట్లాడుకుందామని ప్రియాంక సూచించారు.   ప్రియాంక ప్రధాని మోడీపై పదునైన విమర్శలు గుప్పించారు. ‘మీరు పదేపదే నెహ్రూతో పాటు ఆయన వారసత్వంపై విమర్శలకు దిగుతున్నారు. 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి పదవిలో ఉంటున్నారు. కానీ నెహ్రూ 17 ఏళ్లు ఆ పదవిని అధిష్టించారు. ఆయనపై ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఆయన ఇస్రో ఆరంభించకపోయి ఉంటే ఈనాడు మంగళయాన్ ఉండకపోయేది. ఆయన డిఆర్‌డిఓను తీసుకురాకపోయి ఉంటే తేజాస్ మనుగడ సాధ్యమయ్యేదా?. నెహ్రూ ఐఐటిలు, ఐఐఎంలు ప్రారంభించకపోయి ఉంటే ఐటి ఎక్కడిది? ఆయన ఎయిమ్స్ మొదలు పెట్టి ఉండకపోతే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం సాధ్యమయ్యేదా? అని ప్రశ్నలు గుప్పించారు. నెహ్రూ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా 9 సార్లు జైలు పాలయ్యారు. మొత్తం 3200 రోజులు కారాగారంలో ఉన్నారని గుర్తు చేశారు. నెహ్రూను అవమానించదలచుకుంటే ఒక జాబితా తయారు చేయాలని, ఆ సంఖ్య 99 లేదా 999 మీ ఇష్టం అని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సమయం నిర్ణయించి చర్చ చేపడితే దానికి మేం సిద్ధమని ప్రియాంక సవాల్ విసిరారు. ఇందిర, రాజీవ్ ఈ దేశానికి ఏం చేశారు? వారసత్వ రాజకీయాలు అంటే ఏంటీ? నెహ్రూ చేసిన తప్పిందాలు ఏమేం ఉన్నాయి వీటన్నింటిపై చర్చ చేపడదామన్నారు. అదే సమయంలో దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కూడా మాట్లాడుకుందామని ప్రియాంక పేర్కొన్నారు.

మన తెలంగాణ 8 Dec 2025 8:24 pm

మరికొన్ని గంటల్లో పుట్టినరోజు వేడుకలు.. అంతలోనే

పుట్టిన రోజే ఆ బాలుడికి మరణ దినంగా మారింది. మరికొన్ని గంటల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో విధి వక్రీకరించి వేడి సాంబార్ గిన్నెలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ గురుకుల విద్యాలయంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.... గురుకుల విద్యాలయం వసతిగృహం వంట మనిషిగా పని చేస్తున్న మొగిలి మధుకర్ ఆదివారం వంట చేసి సాంబారు గిన్నె పక్కనే పెట్టగా మధుకర్ కుమారుడు నాలుగు సంవత్సరాల మోక్షిత్ ఆడుకుంటూ వెళ్లి వేడి సాంబార్ గిన్నెలో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన మధుకర్ బాలుడు మోక్షిత్‌ను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మోక్షిత్ మృతి చెందాడు. ఆదివారం నాడే మోక్షిత్ పుట్టిన రోజు కాగా అదే రోజు మరణం సంభవించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాలుడి తండ్రి మధుకర్ ఫిర్యాదు మేరకు ధర్మారం ఎస్సై ఎం.ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 8 Dec 2025 8:18 pm

MD |జగన్మాత సేవలో ఆంధ్రప్రభ ఎండి..

MD | జగన్మాత సేవలో ఆంధ్రప్రభ ఎండి.. MD | విజయవాడ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 8 Dec 2025 8:16 pm

ఫ్యూచర్ సిటీలో జూపార్క్ ఏర్పాటు.. కుదిరిన ఒప్పందం

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో కొత్త జూపార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. జూపార్క్ ఏర్పాటుకు వంతారా ఎంవొయు కుదుర్చుకుంది. సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జూపార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. వన్యప్రాణులకు సేవ అనే నినాదంతో వంతారా పని చేస్తోందని కొనియాడారు. ఈ నెల చివర్లో గుజరాత్‌కు వెళ్లి వంతారాను సందర్శిస్తామని పేర్కొన్నారు. వంతారా సంస్థ ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి చెందినది అన్న విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 8 Dec 2025 8:12 pm

బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఇద్దరి మృతి

వేగంగా దూసుకు వచ్చిన లారీ కిందపడి ఇద్దరు వ్యక్తులు దూర్మరణం. సూరారం పోలీస్ స్టేషన్ పరిధి జ్యోతి మిల్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుండి వేగంగా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల దర్యాప్తు లో తెలింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పాండు బస్తీ కి చెందిన రాపిడో డ్రైవర్ సురేందర్ రెడ్డి (45). సూరారం వెంకటరమణ కాలనీ కి చెందిన జ్యోతి (32) పల్సర్ బైక్ పైన నర్సాపూర్ రోడ్డులో వెళ్తున్నారు. బైక్ పై వెళ్తున్న వారిని వెనుక నుండి వచ్చిన లారీ అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సురేందర్ రెడ్డి, జ్యోతి కింద పడిపోయారు. లారీ ముందు టైర్లు జ్యోతి, సురేందర్ పై నుండి వెళ్ళగా అక్కడికక్కడే చనిపోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. లారీని ట్రేస్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూరారం సీఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.

మన తెలంగాణ 8 Dec 2025 8:12 pm

Govt |కాపు, బీసీ భవనాల నిర్మిస్తా

Govt | కాపు, బీసీ భవనాల నిర్మిస్తా నా సొంత నిధులు వెచ్చిస్తున్నారాష్ట్ర

ప్రభ న్యూస్ 8 Dec 2025 8:08 pm

రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారు: హరీష్‌రావు

గ్లోబల్ సమ్మిట్‌ను ‘గోబెల్స్ సమ్మిట్‘ అంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు. గతంలో దావోస్ వెళ్లి డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రేవంత్ నవ్వులపాలయ్యారని విమర్శించారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూమి, ఫార్మా సిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమి బిఆర్‌ఎస్ హయాంలో సమీకరించినదే గుర్తు చేశారు. అందులో రేవంత్ చెమట చుక్క కూడా లేదని అన్నారు. కెసిఆర్ యువత ఉద్యోగాల కోసం ఆలోచిస్తే, రేవంత్ ఆ భూములను తన అనుయాయులకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. రెండో ఏడాది పాలన పెనంలోంచి పొయ్యిలో పడినట్లు ఉందని, మూడో ఏడాది ఏమవుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దుయ్యబట్టారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారన్నారు. రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు. రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో చూసుకోవాలని పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ కరప్షన్ పాలన రేవంత్ కుటుంబం, మంత్రులది అని ఆరోపించారు. కరప్షన్ ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు మొండి చేయి చూపించిందని... అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం విజన్, విధానం ఏంటో ఎవరికి ఇప్పటికీ అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు జరుపుకోవాలని హరీష్‌రావు అన్నారు.

మన తెలంగాణ 8 Dec 2025 8:07 pm

పెట్టుబడులకు కొత్త వేదిక - గ్లోబల్ సమ్మిట్: మంత్రి సురేఖ

గ్లోబల్ సమ్మిట్‌లో స్టాల్స్‌ను సందర్శించిన మంత్రి సురేఖ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త వేదిక - తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రులు, విశిష్ట అతిథులతో కలిసి మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను విస్తృతంగా సృష్టించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. స్టాల్స్‌ను పరిశీలించిన మంత్రి సురేఖ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ప్రతి స్టాల్‌కు సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సమ్మిట్ వద్ద సంప్రదాయ నృత్యకారిణిలతో కలసి నృత్యం చేశారు. మంత్రి ఆత్మీయ పలకరింపునకు సంప్రదాయ నృత్యకారిణీలు హర్షం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 8 Dec 2025 8:03 pm

Cricket |బ్లైండ్ టీమ్ కెప్టెన్ దీపికకు నీరాజనం

Cricket | బ్లైండ్ టీమ్ కెప్టెన్ దీపికకు నీరాజనం Cricket | శ్రీ

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:58 pm

TET |టెట్ పై పునః సమీక్ష అవసరం

TET | టెట్ పై పునః సమీక్ష అవసరం TET | పల్నాడు

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:47 pm

నవజ్యోత్ కౌర్ సిద్ధూను సస్పెండ్ చేసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, పంజాబ్ మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూపై కాంగ్రెస్ వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల పార్టీపై నవజ్యోత్ కౌర్ సిద్ధూ సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవల నవజ్యోత్ సింగ్ సిద్ధూ క్రియాశీల రాజకీయాలకు తిరిగి రావడంపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. కాంగ్రెస్ 2027కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తేనే ఆయన మళ్లీ పోటీ చేస్తారని చెప్పారు. రూ.500 కోట్లు సూట్ కేసు ఇచ్చేవారే ముఖ్యమంత్రి అవుతారని..ఆ పదవిని కొనడానికి అంత డబ్బు తమ వద్ద లేవని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు పార్టీలో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆమెను ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు.

మన తెలంగాణ 8 Dec 2025 7:47 pm

Ravi Teja’s BMW Second Single Promo: A Dazzling Melody

Mass Maharaja Ravi Teja and writer-director Kishore Tirumala have come together for the first time for a grand family entertainer, Bhartha Mahasayulaku Wignapthy. The movie first single, Bella, has become a good hit adding to the excitement created by the glimpse. Now, the makers are releasing the second single, Addam Mundu, on 10th December. The […] The post Ravi Teja’s BMW Second Single Promo: A Dazzling Melody appeared first on Telugu360 .

తెలుగు 360 8 Dec 2025 7:41 pm

Welcome |బాల సదనాల్లో మహిళా కమిషన్ తనిఖీ

Welcome | బాల సదనాల్లో మహిళా కమిషన్ తనిఖీ Welcome | కర్నూలు,

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:39 pm

OSSS Teaser: Tharun, Eesha’s Fun Ride

Tharun Bhascker joined hands with a debutant A R Sajeev for a rustic entertainer Om Shanti Shanti Shantihi. Eesha Rebba is cast opposite Tharun Bhascker in the movie which is done with its shoot and is getting ready for its theatrical release. Meanwhile, the makers started the promotions by revealing the teaser. Tharun Bhascker plays […] The post OSSS Teaser: Tharun, Eesha’s Fun Ride appeared first on Telugu360 .

తెలుగు 360 8 Dec 2025 7:37 pm

Collector |తక్షణమే పరిష్కరించండి

Collector | తక్షణమే పరిష్కరించండి Collector | మచిలీపట్నం,- ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:35 pm

కిరాయి వ్యక్తులతో అల్లుడిపై దాడి చేయించిన అత్త

పెనగలూరు: అన్నమయ్య జిల్లా పెనగలూరులో దారుణం చోటు చేసుకుంది. అల్లుడిపైనే ఓ అత్త కిరాయి వ్యక్తులతో దాడి చేయించింది. మునుస్వామి అనే వ్యక్తిపై నలుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాపూరు వాసి మునుస్వామి నాలుగు రోజుల క్రితం భార్యతో గొడవపడి పెనగలూరులోని తన మేనత్త ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన అత్త పెంచలమ్మ అల్లుడిపై దాడికి పురమాయించింది. రెండు బైక్‌లపై వచ్చిన కిరాయి వ్యక్తులు కత్తితో మునుస్వామి గొంతుపై దాడి చేశారు. స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. కత్తితో సహా రాజంపేట ప్రభుత్వాస్పత్రికి బాధితుడిని తరలించారు. పెనగలూరు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 8 Dec 2025 7:33 pm

Gold |లక్కీ క్రికెటర్‌కు గోల్డ్ కాయిన్

Gold | లక్కీ క్రికెటర్‌కు గోల్డ్ కాయిన్ యువ హీరోలు రామ్ -హరి

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:28 pm

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వృద్ధుడి మృతి

విశాలాంధ్ర – బెలుగుప్ప:రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వెంకటాద్రిపల్లి గ్రామానికి చెందిన చంద్రమౌళి (60) మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం ప్రకారం, హోటల్ నిర్వహణ చేస్తూ జీవనోపాధి సాగిస్తున్న చంద్రమౌళి బెలుగుప్పకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా, ఆవులెన్న క్రాస్ సమీపంలో తిప్పేస్వామి నడుపుతున్న బైక్ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో చంద్రమౌళికి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించిగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలిపారు.ఆయన మృతితో కుటుంబ […] The post రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వృద్ధుడి మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Dec 2025 7:26 pm

health |శతాధిక వృద్ధురాలు కన్నుమూత

health | శతాధిక వృద్ధురాలు కన్నుమూత health | చల్లపల్లి, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:22 pm

Award |ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు

Award | ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు Award |

ప్రభ న్యూస్ 8 Dec 2025 7:16 pm