Government |రైతును రాజుగా చేయటమే ప్రభుత్వం లక్ష్యం
Government | రైతును రాజుగా చేయటమే ప్రభుత్వం లక్ష్యం దివి మార్కెట్ కమిటీ
Spectacular Saudi |ముగిసిన ‘స్పెక్టాక్యులర్ సౌదీ’ బహుళ-నగర ప్రదర్శన
Spectacular Saudi| ముగిసిన ‘స్పెక్టాక్యులర్ సౌదీ’ బహుళ-నగర ప్రదర్శన Spectacular Saudi |
రైతులకు తప్పని యూరియా తిప్పలు #telugupost #ureacrisis #telangananews #latestnews
Grain| వదంతులు నమ్మవద్దు.. రైతులకు స్పష్టం చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ Grain|
ముగిసిన నాల్గవ రోజు ఆట.. మరోసారి కష్టాల్లో భారత్
గౌహటి: రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ మరోసారి పీకల్లోతు కష్టాల్లోపడింది. బర్సపార స్టేడియం వేదిగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారీ లక్ష్య చేధనలో భారత్ ఆరంభంలోనే తడబడింది. రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో 549 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని భారత్ ఎదుట ఉంచింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. మార్కో యాన్సెన్ బౌలింగ్లో యశస్వీ జైస్వాల్ (13) వెర్రెనెకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా.. హార్మర్ బౌలింగ్లో రాహుల్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 15.5 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజ్లో సాయి సుదర్శన్ (2), కుల్దీప్ యాదవ్ (4) ఉన్నారు. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే భారత్కు మరో 522 పరుగులు కావాల్సి ఉంది.
DEO|క్రిష్ణగిరిలో డీఈఓ ఆకస్మిక తనిఖీలు
DEO| క్రిష్ణగిరిలో డీఈఓ ఆకస్మిక తనిఖీలు DEO| కర్నూలు, ఆంధ్రప్రభ : క్రిష్ణగిరి
AndhraPrbahaSmartEdition |రామ మందిరపై/బైసన్/రెడీ/కోపమొచ్చింది
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 25-11-2025, 4.00PM రామ మందిరపై కాషాయ జెండా బైసన్..
Midday meals |పకడ్బందీగా మధ్యాహ్న భోజనం పథకం
Midday meals | పకడ్బందీగా మధ్యాహ్న భోజనం పథకం Midday meals |
Komaram Bheem | ఘన సన్మానం… Komaram Bheem | జైనూర్, ఆంధ్రప్రభ
కుంగిన బేస్మెంట్.. ప్రభుత్వ విప్కు తప్పిన ప్రమాదం
వేములవాడ: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి ఆయన వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. ఇన్చార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్, పార్టీ నేతలతో కలిసి గృహ సముదాయం వద్ద బేస్మెంట్పై నిల్చొని ఆయన పరిశీలిస్తున్నారు. ఎక్కువ మంది నిలుచోవడంతో బేస్మెంట్ ఒక్కసారిగా కుంగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన్ను పట్టుకొవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
Alcohol | మందుబాబుల ఆగడాలు.. పంట కాల్వల్లో మద్యం సీసాలుమందుబాబులకు అడ్డాగా పంట
Big Boss |వాగ్వాదాలు.. ఘర్షణలు.. 78వ రోజు ఇవే దృశ్యాలు!
Big Boss | వాగ్వాదాలు.. ఘర్షణలు.. 78వ రోజు ఇవే దృశ్యాలు! Big
అమెరికాలో హనీట్రాప్ యువతి వీడియోతో కలకలం #NRINews #Honeytrap #Dallas #Ohio #USAViral #SocialMedia
CM Revanth |మత్స్యకారులకు పెద్దపీట…
CM Revanth | మత్స్యకారులకు పెద్దపీట… CM Revanth | తొర్రూరు, ఆంధ్రప్రభ
Rs.750 Wages | 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి
Rs.750 Wages | 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి Rs.750 Wages
డిక్లేర్ చేసిన దక్షిణాఫ్రికా.. భారత్ ఎదుట భారీ లక్ష్యం
గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. నాలుగో రోజు 26/0 ఓవర్నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు పకడ్బందీగా బ్యాటింగ్ చేస్తూ వచ్చారు. భారత బౌలర్లు సఫారీలను ఔట్ చేసేందుకు తెగ కష్టపడ్డారు. 77 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా నాలుగో వికెట్ 178 పరుగుల వద్ద కోల్పోయింది. స్టబ్స్, జోర్జిల జోడీ నాలుగో వికెట్కి 101 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసింది. ఈ క్రమంలో జడేజా జోర్జి(49)ని ఎల్బిడబ్ల్యూ చేయడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత ముల్డర్తో కలిసి స్టబ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. ఐదో వికెట్కి 82 పరుగులు జోడించారు. అయితే 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టబ్స్ జడేజా బౌలింగ్లో సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చేసి.. భారత్కి 549 పరుగుల విజయలక్ష్యాన్ని ఇచ్చింది. భారత బౌలింగ్లో జడేజా 4 వికెట్లు తీయగా.. సుందర్ 1 వికెట్ తీశాడు.
MLA | కోదాడ డిఎస్పీగా… MLA | కోదాడ, ఆంధ్రప్రభ : సూర్యాపేట
పెళ్లి వాయిదా వేసింది మా అబ్బాయే: పలాశ్ తల్లి
ముంబై: సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్తో.. స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. వివాహం అనుకున్న రోజు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో వివాహాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే తండ్రి చూడని పెళ్లి తనకు వద్దని స్మృతి ఈ వివాహాన్ని వాయిదా వేసినట్లు ఆమె మేనేజర్ తెలిపారు. మరోవైపు పలాశ్ కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. వరుస మ్యూజిక్ కాన్సర్టులు, పెెళ్లి సెలబ్రేషన్స్ కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటితో అతను ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నేఫథ్యంలో ఇరు కుటుంబాల మధ్య సఖ్యత చెడిందా అనేలా గాసిప్రాయుళ్లు పుకార్లు పుట్టిస్తున్నారు. అయితే పలాశ్ తల్లి అమిత ఈ పుకర్లపై స్పందించారు. తమ రెండు కుటుంబాలకు ఎటువంటి విబేధాలు కలగలేదని ఆమె స్పష్టం చేశారు. నిజానికి పెళ్లిని వాయిదా వేసింది తన కుమారుడే అని తెలిపారు. ‘‘స్మృతి తండ్రి అంటే పలాష్కు ఎంతో ఇష్టం. స్మృతి కంటే ఆమె తండ్రి దగ్గరే పలాష్కు సాన్నిహిత్యం ఎక్కువ. ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే.. స్మృతి కంటే ముందు పలాష్ స్పందించాడు. తనే పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. స్మృతి తండ్రి కోలుకునేంత వరకు వివాహ వేడుకను వాయిదా వేయాలని చెప్పాడు’’ అని పేర్కొన్నారు.
CM Revanth |చెక్ డ్యాంలు కూలిపోతున్నాయి..
CM Revanth | చెక్ డ్యాంలు కూలిపోతున్నాయి.. CM Revanth | కరీంనగర్,
Vijaya Sai Reddy :అంత సులువు కాదు.. సాయిరెడ్డీ.. ఎంత మంది.. ఇలా?
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ పెట్టి ఏం చేయాలని భావిస్తున్నారన్నది అర్థం కాకుండా ఉంది
48 crores 89 lakhs |మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..!
48 crores 89 lakhs | మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! 48
Nandigama |అందరికీ సురక్షిత తాగునీరు..
Nandigama | అందరికీ సురక్షిత తాగునీరు.. గుడిమెట్ల గ్రామపంచాయతీ మంచినీటి స్కీమ్ ప్రభుత్వ
MLA |నిరుపేదలందరికీ సొంత గృహాలు..
MLA | నిరుపేదలందరికీ సొంత గృహాలు.. .కొత్తగా 1.38 లక్షల గృహాలు మంజూరు...త్వరితగతిన
Blind Champions : అందరూ అంధులే
Blind Champions : అందరూ అంధులే ( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్
CM Revanth |ఇందిరమ్మ చీరల పంపిణీ…
CM Revanth | ఇందిరమ్మ చీరల పంపిణీ… CM Revanth | కడం,
అఫ్గాన్లో బాంబు దాడి. 9 మంది చిన్నారులు మృతి
అఫ్గానిస్థాన్లో సోమవారం అర్థరాత్రి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో తొమ్మిది మంది చిన్నారులతో సహా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాకిస్థాస్ కారణమని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. తమ దేశ:లోని పౌరల ఇళ్లను టార్గెట్ చేసిందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ దాడిపై పాకిస్థాన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మృతి చెందారు. ఆ ఘటనకు టీటీపీ కారణమని ప్రకటించారు. కాగా అఫ్గాన్ టీటీపీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని పాక్ నిందిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్తో ప్రత్యక్ష యుద్ధానికి కూడా వెనుకాబోమని దేశ్ మంత్రి ఖవాజా హెచ్చరించారు.
ధర్మేంద్ర చివరి చిత్రం ఇదే.. మరణించిన రోజునే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్
బాలీవుడ్కు చిరస్మరణీయమైన నటుడు ధర్మేంద్ర ఇకలేరన్న వార్త భారతీయ సినీ వర్గాలను మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులకు గాఢమైన విషాదాన్ని మిగిల్చింది. 89 ఏళ్ల వయసులో నవంబర్ 24న ఆయన కన్నుమూశారు. ఇటీవల కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ సుమారు 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఆరోగ్యం మరింత దిగజారడంతో డిశ్చార్జ్ అయ్యి తనయుడు బాబీ డియోల్ ఇంటికి వెళ్లారు. అక్కడే ఆయన ప్రాణాలు విడిచారు. ధర్మేంద్ర […] The post ధర్మేంద్ర చివరి చిత్రం ఇదే.. మరణించిన రోజునే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ appeared first on Visalaandhra .
దూసుకొస్తున్న తుపాను.. ఏపీకి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో 48 గంటల్లో తుపానుగా మారనున్న అల్పపీడనం తుపానుగా మారితే సెన్యార్ అని నామకరణంఆంధ్రప్రదేశ్ తీరంలో 29, 30 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు బంగాళాఖాతంలో మరో తుపాను ముంచుకొస్తోంది. మలేషియా, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, రాబోయే 24 గంటల్లో […] The post దూసుకొస్తున్న తుపాను.. ఏపీకి భారీ వర్ష సూచన appeared first on Visalaandhra .
తిరుమల పరకామణి చోరీ కేసులో భూమనకు సీఐడీ నోటీసులు
తిరుమల శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. 2023 ఏప్రిల్ 7న తిరుమల పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ రవి అనే ఉద్యోగి పట్టుబడ్డాడు. ఈ ఘటనపై అప్పటి […] The post తిరుమల పరకామణి చోరీ కేసులో భూమనకు సీఐడీ నోటీసులు appeared first on Visalaandhra .
Election |నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్..
Election | నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. Election | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్:
TDP : నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా ఎగురుతున్నది ఇక్కడే
తెలుగుదేశం పార్టీ ఏర్పాటయి దాదాపు నలభై రెండేళ్లయింది.
మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుంది : మోడీ
ఉత్తర ప్రదేశ్: భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందని అన్నారు. జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగం ప్రారంభించారు. రామాలయ నిర్మాణ యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి అని.. ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని తెలియజేశారు. ఈ ధర్మధ్వజం భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం అని..సంకల్పం, సఫలతకు ఈ ధ్వజం చిహ్నం అని ప్రశంసించారు. ఈ ధ్వజం శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందని, ఈ ధర్మధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణను ఇస్తుందని అన్నారు. కర్త, కర్మవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మధ్వజం చెప్తుందని, పేదలు, దు:ఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా రాముడిని చూసినంత పుణ్యం వస్తుందని, కోట్లాది మంది రామభక్తుల కల ఇవాళ సాకారమైందని మోడీ పేర్కొన్నారు. రామమందిర నిర్మాణానికి సహకరించిన అందరికి నమస్కరిస్తున్నానని, ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో అమోధ్య చెప్తుందని తెలిపారు. రాముడు కులం చూడడు.. భక్తి మాత్రమే చూస్తాడని, ఆ ధర్మ పురుషుడు శ్రీరాముడికి బేధభావాలు ఉండవని అన్నారు. శతాబ్దాల నాటి గాయాలకు ఇవాళ ఉపశమనం లభించిందని, ఐదు శతాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారమైందని అన్నారు. ధర్మధ్వజంపై ఉన్న కోవిదార్ వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీకని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మన చుట్టూ కొందరు బానిస భావజాలం ఉన్నవారు ఉన్నారని, బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు చోటు ఇవ్వొద్దు అని సూచించారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారత్ అని.. శతాబ్దాల క్రితమే భారత్ ప్రజాస్వామ్య విధానం ఉందని అన్నారు. తమిళనాడు ఉత్తర మేరూర్ శాసనం ప్రజాస్వామ్యం గురించి చెప్తోందని, భారత్ లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడని గుర్తుచేశారు. రాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని.. బానిస భావజాలం ఉన్నవారని చెబుతున్నారని, వచ్చే వెయ్యేళ్లు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుందని, అయోధ్య రాముడిని ఇప్పటికే 45 కోట్ల మంది దర్శించుకున్నారని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిర శిఖరంపై వైభవంగా రామాలయ ధ్వజారోహణం మోడీ ఎగరవేశారు. ఆలయ శిఖరంపై కాషాయ పతాకాన్ని ఆవిష్కరించారు. అభిజిత్ ముహూర్తంలో రామాలయ శిఖరంపై ధ్వజారోహణం చేశారు. 2020 ఆగస్టు 5న రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. అయోధ్యలో 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట చేశారు. ధర్మధ్వజంపై శ్రీరాముడు, సూర్యుడు, ఓం కోవిదర చెట్టు చిహ్నాలు ఉన్నాయి. ధ్వజరోహణంతో అయోధ్య రామమందిర నిర్మాణం సంపూర్ణమైంది.
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు..
ఈ నెల 30న అఖిలపక్ష భేటీపార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధం సభ సజావుగా సాగేందుకు కేంద్రం కసరత్తుఓటర్ల జాబితా సవరణ అంశంపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలుడిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నవంబర్ 30వ తేదీన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు […] The post డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. appeared first on Visalaandhra .
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ హబ్సిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యమార్కులు తక్కువొచ్చాయని తల్లిదండ్రులు మందలించడమే కారణం హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న శ్రీ వైష్ణవి అనే విద్యార్థిని తమ అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కులు తక్కువగా వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన వైష్ణవి బిల్డింగ్ పై నుండి కిందకు దూకినట్టు ప్రాథమిక విచారణలో బయటపడింది. అపార్ట్మెంట్ పైనుంచి కిందపడిన వెంటనే స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న వైష్ణవిని వెంటనే గాంధీ […] The post తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య appeared first on Visalaandhra .
వేములవాడలో నిర్మాణంలోనే కుంగిన డబుల్ బెడ్రూం ఫ్లోరింగ్. #Vemulawada #DoubleBedroom #Collector
అయోధ్య రామమందిరం ప్రారంభం మోదీ చేత శంకుస్థాపన #Ayodhya #RamMandir #TeluguNews #India #PMModi
రూపాయి పతనం అడ్డుకునేందుకు RBI భారీగా డాలర్ల అమ్మకాలు
సెప్టెంబర్లో రూపాయి విలువ క్షీణించడంతో దాన్ని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు 8 బిలియన్ డాలర్లు మార్కెట్లో విక్రయించింది. సోమవారం విడుదలైన డేటా ప్రకారం, RBI ఆ నెలలో మొత్తం 7.91 బిలియన్ డాలర్లను నెట్గా అమ్మింది. సెప్టెంబర్లో రూపాయి 88.80 రూపాయల చరిత్రాత్మక కనిష్టాన్ని తాకడంతో, కరెన్సీ స్థిరత్వం కోసం ఈ చర్య చేపట్టింది. ఇదే తరహా ఒత్తిడుల మధ్య ఆగస్టులో కూడా RBI 7.7 బిలియన్ డాలర్లను విక్రయించింది. అమెరికాతో […] The post రూపాయి పతనం అడ్డుకునేందుకు RBI భారీగా డాలర్ల అమ్మకాలు appeared first on Visalaandhra .
Padmavathi |వైభవంగా అమ్మవారి పంచమీ తీర్థం..
Padmavathi| వైభవంగా అమ్మవారి పంచమీ తీర్థం.. Padmavathi| తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ :
Andhra King Taluka: Ram’s Best Outing!
Energetic star Ram Pothineni has put in his best efforts for Andhra King Taluka, and he is showing the same energy and enthusiasm in the promotional activities as well. The reports from the censor board are highly optimistic, and the film has got a U/A certificate. Given the expansive nature of the story, the final […] The post Andhra King Taluka: Ram’s Best Outing! appeared first on Telugu360 .
కర్నూలులో హైకోర్టు బెంచ్పై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన
రాయలసీమ వాసుల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు.చాలా కాలంగా చర్చల్లో ఉన్న ఈ అంశానికి మొట్టమొదటిసారి స్పష్టతనిస్తూ, నగరంలోని ఏబీసీ క్యాంప్ క్వార్టర్స్ను హైకోర్టు బెంచ్ స్థాపనకు నిర్ణయించినట్టు వెల్లడించారు.కర్నూలు సమగ్ర అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా అవసరమైన చర్యలను వేగంగా ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.ఇక ప్రభుత్వ క్వార్టర్స్లో జరుగుతున్న అనుచిత, అసాంఘిక కార్యకలాపాలపై మంత్రి గట్టిగా స్పందించారు.ప్రభుత్వ ఆస్తుల […] The post కర్నూలులో హైకోర్టు బెంచ్పై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన appeared first on Visalaandhra .
Loans|వడ్డీ లేని రుణాలు మంజూరు..
Loans| బోధన్, ఆంధ్రప్రభ: మహిళలను మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి వీలుగా పథకాలు
PM Modi | సంతకాల సేకరణ… PM Modi | డోంగ్లి, ఆంధ్రప్రభ
Ayodhya : అయోధ్యలో కాషాయ పతాకం ఆవిష్కరణ
అయోధ్య రామాలయంలో కాషాయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆవిష్కరించారు
కొండగట్టు ప్రేమ పెళ్లి కలకలం #telugupost #viralvideo #latestnews #lovemarriage
ఆ మెసేజ్లు నమ్మొద్దు.. బ్లాక్ చేయండి: రకుల్ ప్రీత్#TeluguPost #telugu #post #news
ట్రంప్ కొత్త వీసా వ్యాఖ్యలపై వివాదం: క్లారిటీ ఇచ్చిన వైట్హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగుల నియామకంపై కఠిన ధోరణి పాటిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల ఆయన హెచ్-1బీ వీసాలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు మద్దతుదారుల్లో తీవ్ర అసంతృప్తిని రేపాయి.ఈ వివాదంపై వైట్హౌస్ తాజా వివరణ ఇచ్చింది. విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధానాలకు పాటుపడుతున్నప్పటికీ, అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను కాపాడటం ట్రంప్ ప్రధాన లక్ష్యమని స్పష్టంచేసింది. హెచ్-1బీ వీసాలపై కూడా దృష్టివైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ జర్నలిస్టులతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.ఁఅమెరికన్ల ఉద్యోగాలను […] The post ట్రంప్ కొత్త వీసా వ్యాఖ్యలపై వివాదం: క్లారిటీ ఇచ్చిన వైట్హౌస్ appeared first on Visalaandhra .
Hyderabad : జూబ్లీహిల్స్ లో దోపిడీకి యత్నం
జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి దోపిడీ యత్నం జరిగింది.
Hyderabad : జీహెచ్ఎంసీ కౌన్సిల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాకముందే కార్యాలయ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది.
స్పష్టమైన లక్ష్యమే విజయానికి దారి: నారా లోకేశ్
విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సిద్ధం చేసిన పుస్తకాలను అందిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ నిర్వహించిన విలువల విద్య సదస్సులో ఆయన చాగంటితో కలిసి పాల్గొన్నారు.పిల్లలను సరైన దారిలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులపై ఎంతో ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల్లో చాలావరకు పరిష్కారం చూపాం: లోకేశ్పిల్లల్లో మార్పు ముందుగా ఇంటి పరిసరాల నుంచే రావాలి. మహిళలకు గౌరవం ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. […] The post స్పష్టమైన లక్ష్యమే విజయానికి దారి: నారా లోకేశ్ appeared first on Visalaandhra .
మంధానతో మా సోదరుడి వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు: పలాక్ ముచ్చల్
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లలో ఒకరైన స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం అనుకోని పరిస్థితుల వల్ల వాయిదా పడింది.పెళ్లి వేడుకల మధ్యలోనే మంధాన తండ్రికి గుండెపోటు లక్షణాలు కనిపించడంతో, వెంటనే ఆయనను సాంగ్లీలోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ పరిణామాల నేపథ్యంలో పెళ్లిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంధాన నిర్ణయించిందని, ఆమె మేనేజర్ వెల్లడించారు.అసలు ఈ వివాహం ఆదివారం జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగా, పలాశ్ ముచ్చల్ […] The post మంధానతో మా సోదరుడి వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు: పలాక్ ముచ్చల్ appeared first on Visalaandhra .
భారత్ నడినెత్తిన బూడిద మేఘం.. విమాన ఇంజిన్లకూ డేంజర్..!#Volcano #DelhiAirQuality #WeatherAlert
festival|శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె
festival| తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన
బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. రెండు రోజుల్లో తుపాను ఏర్పడే అవకాశం
బంగాళాఖాతంలోని తాజా వాతావరణ మార్పులు నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.ఇప్పటికే ఒక అల్పపీడనం క్రియాశీలంగా ఉండగానే, మరో కొత్త అల్పపీడనం ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడవచ్చని, రాబోయే రోజుల్లో ఇవి కలిసిపోయే అవకాశమున్నట్లు సూచనలు వెలువడుతున్నాయి.ప్రస్తుతం మలక్కా జలసంధి దగ్గర తీవ్ర అల్పపీడనం చురుగ్గా కొనసాగుతోంది.ఇది పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణించి, మంగళవారం నాటికి వాయుగుండంగా మారి, గురువారానికి తుపానుగా అభివృద్ధి చెందవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.తుపానుగా మారడానికి […] The post బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. రెండు రోజుల్లో తుపాను ఏర్పడే అవకాశం appeared first on Visalaandhra .
Ayodhya | రామయ్య క్షేత్రంలో.. Ayodhya, మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో
Video: Ram Pothineni Roundtable Interview
The post Video: Ram Pothineni Roundtable Interview appeared first on Telugu360 .
sarees|ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ..
sarees| కాటారం, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బయ్యారం
ఇంటి నుంచే పని చేయండి.. ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం
ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే హాజరు ఢిల్లీలో తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం.. పడిపోయిన ఏక్యూఐప్రైవేటు ఆఫీసుల్లోనూ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేయించాలని ఆదేశాలుఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 300 పైగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందికి హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రతిరోజూ 50 […] The post ఇంటి నుంచే పని చేయండి.. ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం appeared first on Visalaandhra .
పోరాడుతున్న భారత బౌలర్లు.. భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికా
గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 201 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ప్రోటీస్ జట్టు వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. నాలుగో రోజు రవీంద్ర జడేజా ఓపెనర్ రికెల్టన్(35)ను పెవిలియన్కు పంపించాడు. అనంతరం మరో ఓపెనర్ మార్క్రమ్(29)ను కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాత కొంత సమయానికే కెప్టెన్ బవుమా(3) సుందర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. నాలుగో వికెట్ తీసేందుకు భారత బౌలర్లు తీవ్రస్థాయిలో పోరాడుతున్నారు. ప్రస్తుతం 49 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజ్లో స్టబ్స్(23), జోర్జి(37) ఉన్నారు. సౌతాఫ్రికా ప్రస్తుతం 420 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అనారోగ్యంతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి.. ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఆయన ఏ38గా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే, గత రెండు రోజులుగా తన కాళ్లకు వాపు వస్తోందని, వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నానని చెవిరెడ్డి జైలు అధికారులకు తెలిపారు. వాస్కులర్ సర్జన్కు […] The post అనారోగ్యంతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి.. ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు appeared first on Visalaandhra .
High School |కబడ్డీ పోటీలకు మౌనిక ఎంపిక
High School | కబడ్డీ పోటీలకు మౌనిక ఎంపిక High School |
బీహార్లో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రిమండలి కూర్పులో కానీ, మంత్రి పదవుల కేటాయింపులో కానీ జెడి(యు) కన్నా బిజెపి ఆధిపత్యమే స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరువాత రెండోస్థానంలో జెడి(యు) పార్టీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని జెడి(యు) సుప్రీం నితీశ్కుమార్ తిరిగి పొందగలిగారు. అయినప్పటికీ తన ఇరవై ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానంలో మొట్టమొదటిసారి ఇప్పుడు హోం శాఖపై తన ఆధిపత్యానికి అవకాశం లేక దూరం కావలసి వచ్చింది. బిజెపికి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రుల్లో ఒకరైన సమ్రాట్ చౌదరి ఇప్పుడు అత్యంత అధికార శక్తియుతమైన హోంశాఖ పగ్గాలు చేపట్టారు. అలాగే బిజెపికి చెందిన మరో ఉపముఖ్యమంత్రి విజయ్కుమార్ సిన్హా రెవెన్యూ, భూసంస్కరణలు, గనులు, భౌగోళిక విభాగాల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదంతా పాలనా విభాగాలపై బిజెపి నియంత్రణను మరింత బలోపేతం చేసింది. అంటే నితీశ్ కుమార్ను ఒక విధంగా బలహీనుడిని చేయడమే. మొత్తం 26 మంత్రి పదవుల్లో 14 బిజెపి పట్టులోనే ఉన్నాయి. ఆరోగ్యం, న్యాయం, రోడ్ల నిర్మాణం, అర్బన్ డెవలప్మెంట్, వ్యవసాయం వంటి కీలకమైన శాఖలు బిజెపి నియంత్రణలో ఉండటం విశేషం. బిజెపి తన మిత్రపక్షం జెడి(యు) సోపానక్రమాన్ని తనకు అనుకూలంగా తారుమారు చేయడంలో అత్యంత సమర్థవంతంగా, చాకచక్యంగా నిర్ణయాత్మకమైన చర్య తీసుకోగలిగింది. 2020 లో బిజెపి పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ నితీశ్కుమార్ మంత్రివర్గంలో కీలకమైన శాఖలను తన వద్దనే ఉంచుకోగలిగారు. ఇదివరకటి అసెంబ్లీలో సామాజిక న్యాయం అనే ముఖ్యమైన సూత్రం ప్రకారం జెడి(యు) కు తన మిత్రపక్షం ఆర్జెడికి చోటు కల్పించడానికి అవకాశం ఉండేది. అయితే ఈసారి నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ సాధించిన అఖండ విజయం బిజెపిని అగ్రస్థానంలో పటిష్టంగా ఉంచగలగడమే కాక, సాధ్యం కాకపోయినా జెడి(యు) ద్వారా ప్రత్యామ్నాయాల అన్వేషణను కష్టతరం చేసింది. నితీశ్కుమార్ అనారోగ్యంతో పోరాటం సాగిస్తున్నారు. అయినా బిజెపికి నితీశ్ తప్పనిసరిగా అనివార్యం అవుతున్నారు. మరోవైపు బిజెపి తన దీర్ఘకాలిక మార్గాన్ని సుస్థిరం చేసే ప్రయత్నంలో ఉంటోంది. సామాజిక వర్గాలకు జెడి(యు) యే తమకు అనుకూల వేదిక అన్న నమ్మకం ఉన్నప్పటికీ ఆయా సామాజిక వర్గాలకు చేరువ కావడానికి బిజెపి విస్తారమైన లోతైన కులాల సంకీర్ణాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తోంది. లాలూప్రసాద్ యాదవ్కు ఒకనాటి అత్యంత విధేయుడైన రామ్కృపాల్ యాదవ్ను బిజెపి ఇప్పుడు అక్కున చేర్చుకుని యాదవ సామాజిక వర్గానికి కూడా బిజెపిలో చోటు ఉందన్న సంకేతాలను అందించింది. సామాజిక వర్గాలను బుజ్జగించడం, పరిపాలనా యుక్తి, తదితర వ్యూహాలతో బీహార్ రాజకీయాల్లో బిజెపి తనకు తాను కేంద్ర స్థానంగా నిలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే ముఖ్యమంత్రి నితీశ్కుమార్ రాష్ట్రంలోని 21 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేలా మొత్తం రూ. 2100 కోట్లు బదిలీ చేశారు. ఇది ప్రతి మహిళా ఓటరుకు రూ. 10 వేలు వంతున ఆర్థిక సాయం చేయడమే . అందుకే ఎన్డిఎ కూటమి విజయంలో మహిళలే కీలక పాత్రదారులయ్యారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి ఊరించే పథకాలతో అభివృద్ధి జరగదు. ఇప్పుడు ముందున్న అసలైన సవాలు చక్కని పరిపాలన.ఇదివరకటి తమ పరిపాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం, ఆదరణ ఉన్నందునే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగలిగామని బిజెపి వాదించవచ్చు. కానీ బీహార్ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉందన్నది వాస్తవం. బీహార్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నితీశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదెంతవరకు సాధ్యమో ఇప్పుడు ఆలోచించవలసి ఉంది. గత రెండేళ్లుగా ప్రభుత్వ విభాగాల్లో రిక్రూట్మెంట్ జరగడం లేదు. ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహించే పరీక్షల్లో పేపర్లీక్, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి, నోటిఫికేషన్ల జారీలో విపరీత జాప్యం ఇవన్నీ గత కొన్నేళ్లుగా వెంటాడుతున్నాయి. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం బీహార్లో 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగ రేటు 20.1 శాతం ఉండగా, అదే వయసువారిలో జాతీయ నిరుద్యోగ సరాసరి రేటు 12.4 శాతం వరకు ఉంది. దీన్ని బట్టి బీహార్లో నిరుద్యోగం ఎలా తాండవిస్తుందో ఊహించాల్సిందే. కార్మిక భాగస్వామ్యం, వాస్తవానికి పనిచేస్తున్న లేదా పనికోసం నిరీక్షిస్తున్న వ్యక్తుల నిష్పత్తి దేశం మొత్తం మీద అత్యల్పంగా ఉంది. 15 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్న యువత వంద మందిలో కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మహిళల విషయానికి వస్తే ఆ సంఖ్య ఇంకా తక్కువ. ఉద్యోగాలు, ఉపాధి కరువై లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు వలసపోవడం సర్వసాధారణం. అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కొని బీహార్ రాష్ట్రాన్ని ఎలా ముందుకు ప్రగతి పథంలో కొత్త మంత్రి మండలి తీసుకెళ్తుందో ఒక అగ్నిపరీక్ష. దేశ జనాభాలో పదోవంతు జనాభా బీహార్ రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రపురోగతి సానుకూలంగా యావత్ దేశాన్నే ప్రభావితం చేస్తుంది. ఇప్పటివరకు పాలనలో లోపాలు కనిపిస్తున్నా అవన్నీ నిజాయితీగా సరిదిద్ది చక్కని పాలన అందిస్తారని ఓటర్లు ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎన్డిఎ కూటమికి పట్టం కట్టారు. కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ పాలన వల్లనే ప్రగతి సాధ్యం అనే నినాదం పదేపదే వల్లెస్తోంది. మరి ఈసారి అదెంతవరకు ఆచరణలో నెరవేరుతుందో చూడాలి.
AP | అసెంబ్లీకి విద్యార్థి.. AP, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాజ్యాంగ
హిడ్మా ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు..
విచారణకు న్యాయవాది అభ్యర్థనహిడ్మా ఎన్కౌంటర్పై జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు నవంబర్ 18న మారేడుమిల్లిలో ఘటనఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల 18న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్కౌంటర్పై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ న్యాయవాది కె. విజయ్ కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన కమిషన్లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 18వ తేదీన మారేడుమిల్లిలో జరిగిన పోలీసుల కాల్పుల్లో […] The post హిడ్మా ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు.. appeared first on Visalaandhra .
Narendra Modi : అయోధ్య మందిరంలో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు
మరోసారి వాయిదా పడిన నెతన్యాహు భారత పర్యటన
ఢిల్లీ పేలుళ్లే తాజా వాయిదాకు కారణమని వెల్లడిఈ ఏడాది నెతన్యాహు టూర్ రద్దు కావడం ఇది మూడోసారివచ్చే ఏడాది కొత్త తేదీని ప్రకటించే అవకాశంఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు, తదనంతర భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఆయన పర్యటన రద్దు కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.వాస్తవానికి, ఈ ఏడాది సెప్టెంబర్ 9న నెతన్యాహు […] The post మరోసారి వాయిదా పడిన నెతన్యాహు భారత పర్యటన appeared first on Visalaandhra .
Bigg Boss 9 : బంధాలు తెగిపోయినట్లేనా.. నామినేషన్లు అలా జరిగినట్లే
బిగ్ బాస్ 9వ సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది
భారతదేశంలో సమాఖ్యవాదం ఏమేరకు మనుగడ సాగిస్తుంది. మార్పులేకుండా కొనసాగుతుందా. సహకార స్ఫూర్తి క్రమంగా చనిపోతుందా అన్నదే నేటి ప్రశ్న. సుప్రీంకోర్టు 2023 శర్మ కమిటీ తీర్పుతో మొదలై 2024, 2025లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై ఇచ్చిన తీర్పులలో కేంద్రం అధికారాలు అనంత స్థితిస్థాపకత (ఇన్ఫినిటి ఎలాస్టిసిటీ)- అన్నపదం వాడింది. ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో జస్టిస్ (రిటైర్డ్) బి.ఆర్. మెహతా తీవ్ర పదజాలంతో రాసిన వ్యాసంలో ఆ తీర్పులలో కోర్టు సాంప్రదాయ సిద్ధాంతాలను విడిచి పెట్టి ఆక్రమణ కొత్త ప్రమాణాలకు అనుకూలంగా వ్యవహరించిందన్నారు. ఇది దాదాపు ఏ పాలనా రంగంలోనైనా జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేసినట్లే. రాజ్యాంగం రాష్ట్రాలకు స్పష్టంగా కేటాయించిన రంగాలలో కూడా కేంద్రానికి శాశ్వతంగా, తిరుగులేని ఆధిపత్యాన్ని స్పష్టంగా ఆమోదించడం ఇబ్బందికరమైన అంశమే. ఈ న్యాయపరమైన మార్పు ఆందోళన కలిగిస్తుంది. ఇది అకస్మాత్తుగా జరిగిన పరిణామం కాదు. దశాబ్దాలుగా సాగుతున్న పరిణామాలకు పరాకాష్ట. గతంలో కాంగ్రెస్ అయినా, నేడు బిజెపి అయినా కేంద్రంలో అధికారం చేపట్టిన ఏ పార్టీ కూడా నిజమైన ఫెడరలిజం అనుసరిస్తూ, సుఖంగా ఉండలేదు. ప్రతి పార్టీ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరల్ ప్రాథమిక విలువగా కాక, ఇబ్బందికరంగానే భావించాయి. కేంద్రప్రభుత్వాల పెత్తనం చెలాయింపు కొత్తకాదు. రిపబ్లిక్ గా అవతరించిన తొలి దశాబ్దాలనుంచి ఆర్టికల్ 356ను తరచు పక్షపాత ధోరణితో కేంద్రప్రభుత్వం వాడుకుంది. తమను ధిక్కరించిన రాష్ట్రప్రభుత్వాలను కూల్చివేసేందుకు, రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆర్టికల్ 356ను ఆయుధంగా ప్రయోగించింది. కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్, ఆంధ్రప్రదేశ్లో ఎన్టి రామారావు, కర్ణాటకలో ఎస్ఆర్బొమ్మై సర్కార్లను రాత్రికిరాత్రి తొలగింపులే ఇందుకు ఉదాహరణ. ఎమర్జెన్సీ హయంలో 42వ రాజ్యాంగ సవరణతో మరింత దూకుడుగా వ్యవహరించింది. విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చడంతోపాటు పలు రంగాలపై కేంద్రం ఆధిపత్యం విస్తరించింది. ముఖ్యమంత్రులు నిజానికి ప్రణాళికా సంఘం ఫీల్డ్ ఆఫీసర్ల స్థాయికి దిగజారారు. కేంద్రం రూపొందించిన కేంద్రం స్పాన్సర్ చేసిన పథకాలనే అమలు చేయాల్సి వచ్చింది. కేంద్రం నిబంధనల ప్రకారమే నిధులు సమకూరుతాయి. 1990వ దశకం, 2000 దశకంలో సంకీర్ణ ప్రభుత్వాల పెరుగుదలతో ఫెడరలిజం పునరుజ్జీవనం జరుగుతుందన్న భ్రమ కల్పించింది. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం, జ్యోతిబసు, లాలూప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఎన్టి రామారావు, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, నవీన్పట్నాయక్ వంటి నాయకుల రాకతో కేంద్రంతో బేరసారాలు ఆడే శక్తివచ్చింది. కేంద్ర -రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడానికి సర్కారియా, పుంచి కమిషన్లు చక్కటి సిఫార్సులు చేశాయి. అయినా ఆ కాలంలోనూ ఆర్థిక సమాఖ్యవాదం క్షీణించింది. సర్వీస్ టాక్స్, తర్వాత జిఎస్టి, రాష్ట్రాల స్వతంత్ర ఆదాయ అధికారాలను క్రమంగా తగ్గించాయి. కేంద్రం అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేకుండా జిఎస్టి కౌన్సిల్లో ఓటింగ్ వ్యవస్థతో కేంద్రానికి పూర్తి ఆధిపత్యం వచ్చేసింది. 2014లో కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఎన్డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రీకరణ వేగం పుంజుకుంది. ఆర్టికల్ 360 రద్దు, జమ్మూకశ్మీర్ను, దాని అసెంబ్లీ అనుమతి లేకుండా రెండు రాష్ట్రాలుగా చేయడం రాజ్యాంగాన్ని తూట్ల పొడవడమే. ఎన్నికైన ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ నియంత్రణలోకి ఉంచే ఢిల్లీ ఎన్సిటి సవరణ చట్టం పెడరల్ విధానం సూచించిన సరిహద్దులను ఏకపక్షంగా చెరిపి, తిరగరాయడానికి కేంద్రం కొత్త సంసిద్ధతను సూచిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల విషయంలో కేంద్రం చొరబాట్లు పెరిగాయి. మూడు వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ మార్కెట్లో దూసుకొచ్చింది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన కార్మిక కోడ్లు కార్మిక నియంత్రణలో పెద్దఎత్తున పనిచేస్తున్నాయి. నీట్ ప్రవేశపెట్టడం, వివిధ విద్యా సంస్కరణలు రాష్ట్రాల పరిధిని దాటవేశాయి. కొవిడ్19 మేనేజిమెంట్ సాకుతో ప్రజారోగ్యంలో కేంద్రం ఆధిపత్యం మరింత పెరిగింది. ప్రతిపాదిత విద్యుత్(సవరణ)బిల్లు, ముసాయిదా ప్రసారబిల్లుతో కేంద్రం చొరబాటు మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఆర్థిక నియంత్రణ మరో శక్తివంతమైన కేంద్రీకరణ సాధనంగా మారింది. కేంద్రం అందించే పథకాలకు నిధులు ఇప్పుడు 8, 9,- 10 లేదా 100 నిష్పత్తులలో పనిచేస్తున్నాయి. ఈ దెబ్బతో కేంద్రం రాష్ట్రాలను కేవలం పథకాలను అమలు చేసే ఏజెన్సీల స్థాయికి దిగజార్చింది. జిఎస్టిలో వాటా చెల్లింపులు పదేపదే ఆలస్యం కావడంతో రాష్ట్రాలు కనీసం జీతాలు చెల్లింపు, ఇతర బాధ్యతల నిర్వహణకు కూడా భారీగా రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆఫ్- బడ్జెట్ రుణాలు మాత్రం ఆర్థికలోటు లెక్కలనుంచి మినహాయింపబడడం విశేషం. ఈ విషయం లో రాష్ట్రాలపై పర్యవేక్షణ పెరిగింది. అప్పడప్పుడు జరిమానాలు కూడా తప్పడం లేదు. రాష్ట్రాలలో గవర్నర్లను రాజకీయంగా ఆయుధాలుగా మార్చడం పెడరలిజానికి మరో పెద్ద విఘాతం. అసెంబ్లీలు ఆమోదించిన, కేబినెట్ సిఫార్సు చేసిన బిల్లులను గవర్నర్లు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి నిర్ణయించకుండా పెండింగ్లో పెట్టడం నిత్యకృత్యంగా మారింది. తమిళనాడులో దాదాపు పది బిల్లులను గవర్నర్ మూడేళ్లపాటు ఆమోదించకుండా తొక్కిపెట్టారు.సుప్రీంకోర్టు బలవంతం చేస్తూ నిర్ణయం తీసుకునే వరకూ ఈ ఉదంతం సాగింది. పంజాబ్ గవర్నర్ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు నిరాకరించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రలలోనూ గవర్నర్లు వ్యవహరించిన తీరువల్ల దీర్ఘకాలిక ప్రతిష్టంభనలు తప్పలేదు. గవర్నర్లు తమ ఇష్టానుసారం బిల్లులను రాష్ట్రపతికి రిజర్వు చేసుకోవచ్చునని ఇటీవల సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు బొమ్మై కేసులో తీర్పు సందర్భంగా మూసివేసిన అధికార దుర్వినియోగం తలుపులు తిరిగి తెరిచినట్లు కనిపిస్తోంది. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు చెప్పనవసరం లేదు. కేంద్రంతో ఘర్షణకు దిగే ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులపై తలచినంతనే.. అన్నట్లు దాడులు చేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అరెస్ట్లు, మనీష్ సిసోడియా, సత్యేంత్ర జైన్ వంటి వారిని సుదీర్ఘకాలం పాటు జైలులో ఉంచడంతో.. అసమ్మతిని సహించరని, దానిని నేరంగా పరిగణించే వాతావరణం ఏర్పడిందని తేటతెల్లమైంది. రాష్ట్రాల అనుమతి లేకుండా కేంద్రం ఐఎఎస్ లేదా ఐపిఎస్ అధికారులను రీకాల్ చేయడానికి వీలు కల్పించే అఖిల భారత సర్వీస్ నిబంధనల మార్పు ప్రతిపాదన పాలనా యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వం పట్టును మరింత బలోపేతం చేస్తుంది. ఒకప్పుడు ఫెడరల్ వ్యవస్థకు కాపలాదారుగా ఉన్న న్యాయవ్యవస్థ ఇప్పుడు ఈ దిగజారిన పరిస్థితులను అరికట్టేందుకు ఇష్టపడడం లేదు. ఆ విషయంలో న్యాయవ్యవస్థ సామర్థ్యం దశాబ్దాలుగా తగ్గింది. ఒకప్పుడు ఎస్ఆర్ బొమ్మై, రామేశ్వర్ ప్రసాద్ వంటి కేసుల్లో బలమైన తీర్పులు, 2018 ఎన్సిటీ ఢిల్లీ తీర్పు కేంద్రం అధికారాలను మితిమీరి వినియోగానికి వ్యతిరేకంగా బలమైన రక్షణ కవచాలు అందించాయి. అయితే ఈ మధ్య సుప్రీంకోర్టు స్వరం మారిపోయింది. ఆర్టికల్ 370పై జరిగిన విచారణలు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణను సమర్థించే మొగ్గును సూచిస్తున్నాయి. ఢిల్లీ సర్వీసుల తీర్పు, తమిళనాడు గవర్నర్ కేసులోని పరిశీలనలు, బొమ్మై తీర్పునకు ముందు శకాన్ని గుర్తుచేసే విసృ్తత కేంద్ర ఆధిపత్య సిద్ధాంతాన్ని పునరుజ్జీవింప జేస్తున్నాయి. అనంతమైన స్థితిస్థాపకత అనే భావన ఒక హెచ్చరికగా కాక, రాజ్యాంగ వాస్తవికతగా మారే ప్రమాదం ఉంది. భారతదేశపు ఫెడరల్ వ్యవస్థ ఒక రాజీ. ఓ గిఫ్ట్ కాదు. నెహ్రూ, పటేల్ వంటి కేంద్రీకరణ వాదులు, మద్రాస్, బెంగాల్, ఇతర రాచరిక రాష్ట్రాలనుంచి బలమైన ప్రాంతాల స్వరాల మధ్య జరిగిన చర్చలలో ఆవిర్భవించి వ్యవస్థ. రాజకీయ చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే, కేంద్రానికి రాష్టాలు అవసరమైనప్పుడు లేదా రాష్ట్రాలపై ఆధారపడాల్సి న పరిస్థితి తలెత్తినప్పుడే సమాఖ్యపరమైన సమతుల్యతలు పునరుద్ధరించబడతాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, ఫెడరల్ వ్యవస్థను ఎవరు కాపాడతారు? ఏ జాతీయ పార్టీ కూడా నిజంగా ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి కొనసాగాలని కోరుకోవడం లేదని రికార్డులు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం పెత్తనం కేంద్రీకృతమైంది. ప్రస్తుతం బిజెపి మరింత ఆత్యాధునికంగా రాజకీయ క్రమశిక్షణతో పెత్తనాన్ని కేంద్రీకృతం చేసుకుంటున్నది. ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడే ఫెడరలిజాన్ని సమర్థిస్తాయి. ఇక పౌర సమాజం మీడియా సమాఖ్యవాదాన్ని సంక్షేమ పంపిణీ, పోలీసింగ్, స్కూళ్లలో పాఠ్యాంశాలు, మార్కెట్ వ్యవస్థలు, సాంసృ్కతిక హక్కుగా కాక, రాజ్యాంగ ఆలోచనగా పరిగణిస్తాయి. సమాఖ్య విధానం మనుగడ సాధించాలంటే, సాధారణ పౌరులే శ్రద్ధ వహించాలి. తమిళులు తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి ఎంత విలువ ఇస్తారో, ఉత్తరప్రదేశ్ లోని ఓటర్లు తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి అంతే విలువ ఇవ్వాలి. కేంద్రం రూపొందించిన వ్యవసాయ విధానం తమ అవసరాలను ప్రతిబింబించకపోవచ్చునని బీహార్ రైతులు గ్రహించాలి. అసోం వాసులు తమ సంసృ్కతి, భూమి, భాష, విద్యపై స్థానిక నియంత్రణ కేంద్రం ఇస్తున్న తాయిలం కాదనీ, రాజ్యాంగబద్ధమైన హక్కు అని అర్థం చేసుకోవాలి. భారతదేశం నేడు ఒక కీలకమైన దశలో ఉంది. మనం కో ఆపరేటివ్ ఫెడరలిజం నుంచి సమ్మతితో కూడిన సమాఖ్యవాదానికి మారాం. మనం కేంద్రం లాగుతున్న వైపు కదులుతున్నాం. న్యాయవ్యవస్థ అనంత స్థితి స్థాపకత వంటి సిద్ధాంతంతో కేంద్రానికి తోడ్పడుతోంది. అందరికీ ఆమోదయోగ్యమైన ఫెడరల్ వ్యవస్థ పరిఢవిల్లాలని రాజ్యాంగ సభ కోరింది. అదే సమయంలో సభ వ్యక్తం చేసిన ఆందోళననే జస్టిస్ మెహతా హెచ్చరిక ప్రతిధ్వనిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ సంపూర్ణ నియంత్రణనే కోరుకుంటున్నప్పుడు.. పిల్లి మెడ లో గంటకట్టేది ఎవరు? భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ వ్యవస్థపై సమాధానం బాధాకరంగానే కన్పిస్తోంది. కేంద్రం దీనిని పట్టించుకోవడం లేదు. ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాలంటే, దానిని సుప్రీంకోర్టో, రాష్ట్ర అసెంబ్లీలు మాత్రమే కాదు 140 కోట్ల మంది ప్రజల రాజకీయ చైతన్యం తోడవ్వాలి. - గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు
JC Pawan Reddy’s Next Political Stop? YSRCP Seems More Interested Than Ever
Andhra Pradesh politics has entered a new season of surprises. Parties are already polishing their strategies for the 2029 elections, and every influential leader suddenly looks like a prized catch. Interestingly, YSRCP, which was blindsided by its shocking defeat in 2024, now appears to be operating with a little more caution and a lot more […] The post JC Pawan Reddy’s Next Political Stop? YSRCP Seems More Interested Than Ever appeared first on Telugu360 .
భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
టి-20 ప్రపంచకప్ షెడ్యూల్.. ఎప్పుడు విడుదలంటే..
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి-20 ప్రపంచకప్ షెడ్యూల్కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టి-20 ప్రపంచకప్-2026 జరుగనుంది. ఈ టోర్నమెంట్కి సంబంధించిన షెడ్యూల్ మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు విడుదల కానుంది. ఈసారి ఈ మెగా టోర్నమెంట్లో 20 జట్లు పోటీ పడుతున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యుఎఇ, ఒమన్, వెస్టిండీస్, యుఎస్ఎ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ ఈసారి భారత్ మరియు శ్రీలంక వేదికగా జరగుతుంది. భారత్లో ఐదు వేదికల్లో(అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై), శ్రీలంకలో మూడు వేదిక జరుగనున్నట్లు సమాచారం. ఇక టోర్నీ ప్రారంభ, ముగింపు వేడుకలు అహ్మదాబాద్లో నిర్వహిస్తారని టాక్. అయితే ఒకవేళ పాక్ ఫైనల్స్కి చేరితే ఆ మ్యాచ్ శ్రీలంకకు షిఫ్ట్ అవుతుంది. టీం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది.
రైల్వేస్టేషన్లో అశుభ్ర నీటితో బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ #RailwayStation #FakeWater #ConsumerSafety
Development|సమగ్ర అభివృద్ధి దిశగా విజయవాడ..
అభివృద్ధికి రూ. 2 వేల కోట్ల నిధులుతయారవుతున్న డీపీఆర్డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తాంవిజయవాడ పార్లమెంటు
From the past few weeks, there is a mad rush of releases on several OTT platforms for the Indian audience. From the originals to the regional movies, there are a lot of options. Ravi Teja’s Mass Jathara and Sasivadane are the Telugu films that will be streaming this weekend. Karimulla Biryani Point from ETV Win […] The post OTT Picks for this Weekend appeared first on Telugu360 .
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) అనేది కొత్త డేటాను సృష్టించగల అత్యాధునికి పరిజ్ఞానం. అంతర్జాతీయ స్థాయిలో ఎఐ టెక్నాలజీకి గణనీయమైన ప్రాచుర్యం కొనసాగుతున్న తరుణంలో భారతదేశం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్సీని వినియోగించుకోవడంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రతికూల ప్రభావాలను నివారించుకుంటూ... ఎఐ ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి సిద్ధపడాలి. రాకెట్ కంటే పదిరెట్ల వేగంతో పుంజుకుంటున్న ఆర్ట్టిఫిషియల్ టెక్నాలజీలో మంచి చెడులను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేటురంగ సంస్థల నిర్వహణ, ఉద్యోగుల భద్రతపై నిశితంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే భారత్ తన ఆధిపత్యాన్ని ఒక్కో రంగంలో చేజిక్కించుకుంటూ.. శతృదేశాల నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. అదే సమయంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలోనూ ఆచితూచి అడుగులు వేయకపోతే.. తప్పులో కాలేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం. ఆవస్యకత ఎంతో ఉంది. అయితే.. ఈ ఎఐ టెక్నాలజీ మంచికి దారి తీస్తుందా? చెడును దరికి చేరుస్తుందా? అనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది! ఈ రోజు ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పాదకపై అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏఐ వాడకంలో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, వినియోగదారుల అభ్యర్థనలకు ప్రతిస్పందనగా టెక్స్, ఇమేజ్లు, కోడ్లను రూపొందించడానికి ఈ టెక్నాలజీని సాధారణంగా ఉపయోగిస్తారు. అయితే రోజురోజుకూ విస్తృతమైన వాడకం పెరగడంతో పాటు ఎఐ సంస్థల ఏర్పాటుకు, టెన్నాలజీని దత్తత తీసుకోవడానికి ప్రపంచ దేశాలు ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ఆయా దేశాల సామర్థ్యాలను టెన్నాలజీతో అలంకరిస్తున్నాయి.ఈ విషయం కాస్తంత విస్మయానికి, ఆందోళనకు దారితీసింది. ఓపెన్ ఎఐ (ఓపెన్ ఎఐ) ఛాట్ జిపిటి (ChatGPT), చాట్సాట్ మేధస్సును ఇప్పుడున్న జనరేషన్ ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎఐ టెన్నాలజీ అనేది క్రమేణా అతిపెద్ద ఉత్పాదక సామర్థ్యం కలిగిన టెక్నాలజీ సంస్థగా అడుగులు వేస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఈ టెక్నాలజీ డేటా సెట్లపై శిక్షణ పొందిన న్యూరల్ నెటవర్కర్ల మద్దతుతో, తగినంత కంప్యూటింగ్ పవర్తో కూడిన ఎఐ మోడల్స్, కొత్త యాంటీబయాటిక్, మిశ్రమాలను కనుగొనడంలో ముందుంది. అలాగే ప్రస్తుత అత్యాధునికకాలంలో అన్నితరాల వారికి పసందైన వినోదాన్ని అందించడం కోసం వినూత్న రీతిలో, వినోదంతోపాటు సాంస్కృతిక కార్యకలాపాలను రూపొందించి ప్రశంసలు అందుకుంటోంది. అయితే చాలా సామాన్యమైన టాస్క్ల కోసం మంచి చేయడానికి ఉపయోగించారు. కానీ డేటాను తప్పుగా మార్చే సామర్థ్యంతో ఇది చాలా కంపెనీల వారి దృష్టిని ఆకర్షించింది. వాస్తవికతను విశ్వసనీయంగా ప్రతిబింబించే డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడంలో కొన్ని సందర్భాలలో సమాజంలోని చెడును విస్తరింపజేయడానికి కొంతమంది వినియోగించడం బాధాకరం. ఎఐతో రూపొందించే కథనాలు, స్కిట్స్, మినీ వీడియో క్లిప్లింగ్స్తో సమాజంపై దుష్ప్రభావం పెడేలా ఉంటున్నాయన్న విమర్శలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపించడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో చెడు -విశ్వాసలపై ప్రభావం చూపించడంతో ఎఐ టెన్నాలజీ ఆధారంగా రూపొందించిన డేటా మధ్య ప్రపంచం విశ్వసనీయతకు దూరంగా ఉంటుందన్న తేడాను గుర్తించగలిగింది. దీంతో ఈ టెక్నాలజీపై ఉన్న అభిప్రాయాలు రోజురోజుకూ రూపుమార్చుకుంటున్నాయి. ఇతర పరిణామాలు ఎఐ టెక్నాలజీ రూపకర్తల సమూహంలో హెచ్చరికల గంటలు మారుమ్రోగుతున్నాయి. దీంతో ఎఐ నుండి అంతరించిపోయే ప్రమాదాన్ని తగ్గించడం అనేది మహమ్మారి అణుయుద్ధం వంటిదనే సంకేతాలను ప్రముఖులు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇతర సామాజిక- స్థాయి ప్రమాదాలతో పాటు ప్రపంచ ప్రాధాన్యతగా ఉండాలని, ఎఐని ఉపయోగించే వారు తగిన క్రమశిక్షణతో లేకుంటే అదే సమాజంపై తీవ్ర పరిణామాలను తీసుకురావడం ఖాయమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కమ్యూనిక్యూలలో పేర్కొన మరికొన్ని నిర్దిష్టమైన ఆందోళనలను కూడా ఇక్కడ తీవ్రంగా పరిగణించాలి. అయితే ఎఐ మోడల్స్ అంతర్గత పని తీరు అస్పష్టత, కాపీరైట్చేసిన డేటాను ఉపయోగించడం, మానవ గౌరవం, గోప్యతతోపాటు తప్పుడు సమాచారంనుండి రక్షణ కల్పించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతో ఉంది. నేడు అభివృద్ధి చేనసిన టెక్నాలజీతో పాటు, వివిధ సంస్థలు ఉపయోగిస్తున్న మోడళ్లు అనుసరించడం తప్పనిసరి కాదని వివరిస్తున్నాయి. ఎందుకంటే వాటిలో ఎదురయ్యే ప్రమాదాలను అర్థం చేసుకోవడానికి ఎటువంటి మార్గం లేదు కాబట్టి. ఎఐ మోడళ్లను పూర్తిగా అమలు చేయడానికి అవసరమైన వనరుల వినియోగదారులు కేవలం ఎలక్ట్రానిక్స్ విభాగంలోని వారే అందుబాటులో ఉన్న వాటితో సమస్యలను, ఇబ్బందులను సరిచేయడానికి వీలుంటుంది. అలాగే. పరిష్కారానికి వీలుగా ఉన్నప్పుడు కూడా, ప్రమాదకరమైన సంస్థలపై బ్రేకులు వేయడానికి ప్రజాస్వామ్య సంస్థల కు తలుపులు తెరిచి ఉంచే కనీసం రోలింగ్ విధానాలు ఈ ఎఐ ప్రపంచానికి ఎంతో అవసరం. ఈ సమయంలో, భారత ప్రభుత్వం ముందుగానే ఓపెన్ సోర్స్ ఎఐ రిస్క్ ప్రొఫైల్స్ ప్రారంభించి, ఆధునిక టెక్నాలజీ సహాయంతో నిర్వహించాలి. అధిక- రిస్క్ ఉన్న ఎఐ మోడల్స్ పరీక్షించడానికి శాండ్బాకస్డ్ రిసెర్చి అండ్ డెవలప్మెంట్ (ఆర్ ఆండ్ డి) పరిసరాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలతో కూడిన సంస్థలు మన దేశంలో వినియోగించే టెక్నాలజీని వినియోగించేందుకు తగిన ఎఐ అభివృద్ధిని ఆచితూచి పరిశీలించిన తరువాతే ప్రోత్సహించాలి. - వివి వెంకటేశ్వరరావు 63008 66637
BRS | నిరసన.. BRS, హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీని
Murder Case : భార్య లిద్దరూ కూడబలుక్కుని .. భర్తను హత్య చేసిందిలా?
తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యలు భర్తను కలిసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది
Peddapalli | ఆత్మహత్య.? Peddapalli , పెద్దపల్లి, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో బాధపడుతూ
జోష్ రవిని పరామర్శించిన పూరి జగన్నాధ్ తనయుడు.#TeluguPost #telugu #post #news
Andhra Pradesh : గ్రామాల్లో ఆలయనిర్మాణాలకు టీటీడీ నిధులు
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ గ్రామాల్లో ఆలయ నిర్మాణాలకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది
BRS : కల్వకుంట్ల కవితపై నిరంజన్ రెడ్డి ఫైర్.. లిక్కర్ రాణి అంటూ...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి, సీనియర్ నేత ఎస్. నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
హబ్బిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
సికింద్రాబాద్: హబ్బిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. తన నివాస భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్రీచైతన్య పాఠశాలలో బాలిక చదువుకుంటుంది. తల్లిదండ్రులు తిట్టారనే మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సరిగా చదవడం లేదని తల్లిదండ్రులు మందలించారని సమాచారం ఇచ్చారు. మృతురాలు శ్రీవైష్ణవి (15) గా పోలీసులు గుర్తించారు. నివాస భవనం పై నుంచి దూకి
పాతబస్తీ శాలిబండలో భయానక అగ్నిప్రమాదం#FireAccident #Hyderabad #Shalibanda #FireService #viralvideo
Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్..రెండు అల్పపీడనాలు రెడీ
ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడే అవకాశముందని తెలిపింది.
Telangana : పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమయింది
పోలీస్ వాహనంపై కూర్చుని రీల్స్#TeluguPost #telugu #post #news
NTR | టైటిల్ మారబోతుందా..? NTR, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Nara Lokesh : వచ్చే నెలలో అమెరికాకు లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళుతున్నారు
Andhra Pradesh : ఏపీ మహిళలలూ.. నెలకు పదిహేను వందలు కావాలంటే ఇలా చేయల్సిందే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది
Sadaram : దివ్యాంగులు మోసపోవద్దు.. ప్రభుత్వం హెచ్చరికలు
Sadaram : దివ్యాంగులు మోసపోవద్దు.. ప్రభుత్వం హెచ్చరికలు
Thaman back to his Testing Time
Top music composer Thaman is habitual of staying in news for wrong reasons. He was trolled badly for his work several times and he admitted the same during media interactions. The top music composer is working without breaks and he has two prestigious films lined up for release: NBK’s Akhanda 2 and Prabhas’ Raja Saab. […] The post Thaman back to his Testing Time appeared first on Telugu360 .

27 C