SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
...

ట్రంప్ శాంతి మంత్రం..ఇరాన్ తిరస్కారం

టెహరాన్: తమ షరతులకు అమెరికా ,ఇజ్రాయె ల్ తలొగ్గితేనే యుద్ధం ఆగుతుందని ఇరాన్ బుధవారం స్పష్టం చేసింది. చర్చలకు వచ్చిన ట్రంప్ , తమకు షరతులు విధించడం కుదరదు. ట్రంప్ అ దుపాజ్ఞలు, ఆదేశాలు చెల్లనేరవని పేర్కొంటూ ఇ రాన్ అమెరికా శాంతి ప్రతిపాదనలను తిరస్కరించింది. దీనితో ప్రస్తుత గల్ఫ్ యుద్ధ సంక్షోభం కొనసాగే పరిస్థితి తలెత్తింది. ట్రంప్ గడువులు, కాలపరిమితి సందేశాలను తాము అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. పశ్చిమాసియా యుద్ధం దశలో అ మెరికా ప్రతిపాదనలు అతిగా ఉన్నాయని ఇరాన్ అధికారికంగా తేల్చిచెప్పినట్లు ఇరాన్ ప్రెస్ టీవీ తెలిపింది. యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షులు చేసిన 15 అంశాల ఫార్మూలాను, హర్మూజ్‌పై ఉమ్మడి నియంత్రణ అంశాన్ని ఇరాన్ పూర్తి స్థాయిలో సమీక్షించుకుంది. ఈ ప్రతిపాదనలు తమ దేశానికి ఆమోదయోగ్యంగా లేవని ఇరాన్ తేల్చిచెప్పింది. ట్రంప్ ప్రతిపాదనలను తిప్పికొట్టిం ది. అమెరికా నుంచి వెలువడ్డ ప్రతిపాదనలకు త మ తొలిస్పందన సానుకూలంగా ఉందనే వాదన సరికాదని , ఇప్పటికీ వీటిని పరిశీలించడం జరుగుతోందని ఇరాన్ ఉన్నత స్థాయి వ్యక్తి ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఏది ఏమైనా యుద్థాన్ని ఎప్పుడు ముగించాలనేది ఇరాన్ నిర్ణయాధికారంపైనే ఆధారపడి ఉంటుంది. ఇతరుల ఆదేశాలకు అనుగుణంగా యుద్ధం విరమించుకుని , మోసపోయే స్థితిలో ఇరాన్ లేదని తెలిపారు. తాము పెట్టే షరతులకు అమెరికా సరేనంటేనే తమ దేశం చర్యలు నిలిచిపోతాయని స్పష్టం చేశారు. ఒకటి రెండు కాదు. మొత్తం తమ షరతులు అంగీకరించాల్సిందే అని ట్రంప్ దౌత్యానికి సవాలు విసిరారు. ఇతరుల ఆధిపత్యం లేకుండా హర్మూజ్‌పై ఇరాన్ సార్వభైమాధికారానికి కట్టుబడి ఉండాలనేది తమ ప్రధాన డిమాండ్ అని ఇరాన్ అధికారి పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై తమకు సహజసిద్ధమైన చట్టపర హక్కు ఉందన్నారు. ఇక ఇప్పటి యుద్ధంపై బాధ్యత ఎవరిది అనేది నిర్థారణ కావల్సి ఉంది. ఇది తేలితే జరిగిన నష్టానికి పరిహారానికి గ్యారంటీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇకపై ఎప్పుడూ ఇరాన్‌పై శత్రుపక్షం దాడికి దిగరాదని, ఈ హమీ ఇవ్వాలని తెలిపారు. తమ అన్ని షరతులు ఆమోదించేంత వరకూ ఇప్పుడు సాగుతున్న తమ దేశ చర్యలన్నింటిని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో గల్ఫ్‌పై దాడులు ఆగబోవని పరోక్షంగా వెల్లడించారు.

మన తెలంగాణ 26 Mar 2026 4:00 am

అసెంబ్లీలో సారా లొల్లి

మనతెలంగాణ/హైదరాబాద్: ఇప్పసారాపై అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. ఇప్పపువ్వు సారాకి ఒక నేత పేరు పెట్టవద్దని ఎమ్మెల్యే రాకే ష్ రెడ్డి చేసిన అభ్యంతకర వ్యాఖ్యలతో అధికార కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ ప్పపువ్వు సారా గురించి చర్చ సందర్భంగా బిజె పి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభ లో ఒక్కసారిగా దుమారం రేగింది. మంత్రులు వర్సెస్ బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిల మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీలో బుధవారం జడ్చ ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ‘ఇప్ప పుప్పు సారా’పై మాట్ల్లాడగా అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల తూటాల పేలాయి. ఈ క్రమంలోనే బిజె పి ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్ప పు వ్వు సారా అంశం ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందని, ఆ ఉత్పత్తి ద్వారా 130 దేశాల్లో ఆదా యం వస్తుందంటూ అనిరుధ్ రెడ్డి చేసిన ప్రసంగంపై ఆయన సెటైర్లు వేశారు. ఇప్పపువ్వు సా రాకు ‘ఇప్పటకీలా అనండి’ ఇంకేమైనా పేరు పె ట్టండి కానీ, ఒక నేత పేరు పెట్టకండి అనటంతో సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. అ యితే, రాకేశ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం తమాషాగా ఉందా రాకేశ్ రెడ్డి అంటూ మంత్రి పొన్నం మండిపడ్డారు. సారా అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు సభలో ఆ నేత పేరు తీసినందుకు రాకేశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. అ నంతరం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆ నేతపై అంత కక్ష ఎందుకు?, మహిళా నేతను కించ పరిచిన ఎమ్మెల్యే రాకేశ్ రె డ్డి క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాం డ్ చేశారు. సంక్షేమ పథకాలకు మాత్రమే ఆ నేత పేరు పెడతామన్నారు. సంక్షోభం తెచ్చేవాటికి కాదన్నారు. ఇప్ప పువ్వు సారా అంశంలో ఆ నే త పేరు ఎత్తడం మహిళా లోకాన్ని అవమానించడమేనని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బిజెపి క్షమాపణలు చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు పట్టుబట్టారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ నేత పేరుని అవమనిస్తారా అని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు బిజెపి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. రాకేశ్ రెడ్డి నోరు జారారని, క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. సభ గౌరవాన్ని కాపాడాలి: ప్యానల్ స్పీకర్ బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మాట్లాడుతూ ఆ నేత పేరుపై గంటకు పైగా సభా సమయం వృథా చేయడం సరికాదన్నారు. సభ్యుడు తప్పుగా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తే సరిపోతుందని హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. స్వర్గస్తులైన ఆ నేతపై సభలో కామెంట్స్ చేసిన రాకేష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ప్యానల్ స్పీకర్ బాలు నాయక్ సూచించారు. సభ్యులు సభ గౌరవాన్ని కాపాడాలని ఆయన కోరారు. సభలో రాకేష్‌రెడ్డి చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు బాలునాయక్ ప్రకటించారు. ఎవరూ అపార్థం చేసుకోవద్దు: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇప్ప పువ్వు సారా చర్చ సందర్భంగా తాను మాట్లాడిన మాటలను ఎవరూ అపార్థం చేసుకోవద్దని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కోరారు. ఒకవేళ ప్రభుత్వం ఇప్పపువ్వు సారాను అందుబాటులోకి తెస్తే, దానికి ఆ నేత పేరు పెట్టవద్దని చెప్పడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ తాను మాట్లాడిన మాటలు తప్పనిపిస్తే వాటిని సభ రికార్డుల నుంచి తొలగించాలని ఆయన పేర్కొన్నారు. తన మాటలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాను ఆ నేతను అవమానించలేదని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ నేత ఉక్కు మహిళ, ప్రపంచస్థాయి నేత అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ఆ నేత పేరు పెడుతుంటారు. ఇప్పపువ్వు సారా పథకానికి గొప్ప మహిళానేత పేరు పెట్టొద్దని గౌరవంతో సూచించానని, అవమానించాలని కాదని ఆయన అన్నారు. నా వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, తమాషా చేస్తున్నారా అంటూ నన్ను బెదిరిస్తారా?, నేనేం తప్పు మాట్లాడానో రికార్డులు పరిశీలించాలని ఆయన సూచించారు. అవసరమైతే హౌస్ కమిటీ వేయండి, క్షమాపణ చెప్పాల్సి వస్తే చెబుతా, మాజీ ప్రధాని అంటే తమకు ఎప్పుడూ గౌరవమేనని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలుగజేసుకొని రాకేశ్ రెడ్డి ఎక్కడా అసభ్య పదజాలం వాడలేదని స్పష్టం చేశారు. మంత్రులు అనవసరంగా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాకేశ్ రెడ్డి మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని ఏలేటి ధ్వజమెత్తారు.

మన తెలంగాణ 26 Mar 2026 3:30 am

కాంగ్రెస్‌కు ఇక సెలవు

మన తెలంగాణ /జగిత్యాల ప్రతినిధి : ఆత్మాభిమానం చంపుకుని కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక, పార్టీతో ఉన్న 42 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్‌లో తన అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి, ఎఐసిసి సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు రాసిన నాలుగు పేజీల రాజీనామా పత్రాన్ని చూపించారు. సమావేశంలో జీవన్‌రెడ్డి సుమారు గంటకు పైగా మాట్లాడి గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో తాను ఎ దుర్కొన్న పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం ఏర్పడే నాటికి తాను పట్టభద్రుల ఎంఎల్‌సిగా ఉన్నానని, మండలిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక సభ్యుడిగా ఉండి బిఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగిత్యాల నియోజకవర్గంలో నామినేటేడ్ పదవులను భర్తీ చేయాలని, పార్టీలో సీనియర్లకు అవకా శం కల్పించాలని కోరుతూ పలువురి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించానన్నారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్న తర్వాత నామినేటేడ్ పదవుల విషయాన్ని పక్కనబెట్టారని ఆయన వివరించారు. 20 23 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు గెలుచుకోవడంతో పాటు సిపిఐ పార్టీకి చెందిన ఒకరు ఉం డగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏమోచ్చిందని ఆయన ప్రశ్నించారు. అప్పుడే నా ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేస్తానంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సముదాయించి పార్టీలో మీకు సముచిత స్థానం ఉం టుందని సర్ధి చెప్పడంతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షీ నా గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో నా బాధను దిగమింగుకుని పార్టీలో కొనసాగానన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నా ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి పట్టపగలు నడి వీధిలో హత్యకు గురి కాగా పార్టీ నుంచి కనీసం ఓదార్పు చేయలేదని ఆరోపించారు. ము న్సిపల్ ఎన్నికల సందర్బంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశానికి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించా రు. ఆయన మన పార్టీ కాదని స్పీకర్ పేర్కొంటుండగా, కాంగ్రె పార్టీతో సంబంధం లేని ఎమ్మెల్యేను పార్టీ కార్యాలయానికి ఎలా పిలుస్తారని ప్రశ్నిస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చానన్నారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన నన్ను ప్రతి విషయంలో అణగదొక్కాలని చూశారని, నాకు పోరాటాలు కొత్త కాదని, టిడిపి హాయాంలో చంద్రబాబు నాయుడు, పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కెసిఆర్‌పై పోరాటం చేశానని అదే తరహాలో ఇప్పుడు రేవంత్‌రెడ్డిపై పోరాటం చేస్తానన్నారు. ఎంత కాలం ఈ అవమానాలు భరిస్తూ ఉండాలి?, నీ చెప్పు చేతల్లో ఉండే వాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? నిన్ను ఎదురించేటోడు పార్టీలో ఉండొద్దా? రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచేటోడిని అణగదొక్కుతున్నావా అంటూ రేవంత్‌రెడ్డి తీరును ఆయన తప్పుబట్టారు. నాకు అడ్డం వస్తే తొక్కేస్తానంటూ రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని, ఎంత మందిని తొక్కుతావు... మేం జగిత్యాలలో ఎదురు తిరిగితే మమ్మల్ని ఎవరూ ఆపలేరన్నారు. 

మన తెలంగాణ 26 Mar 2026 3:00 am

గురువారం రాశి ఫలాలు (26-03-2026)

మేష రాశి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారులకు చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృషభం ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది. మిధునం ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. కర్కాటకం గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగులకు దీర్ఘ కాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సింహం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కన్య వృత్తి వ్యాపారాలు అనుకున్నది సాధిస్తారు. దైవచింతన పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. తుల వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనం చేసుకుంటారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశములు లభిస్తాయి. వృశ్చికం ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. బంధు మిత్రులతో మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగం వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది. ధనస్సు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. అవరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకరం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది. కుంభం మిత్రుల నుంచి శుభవర్తలు అందుతాయి. భూ వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. ఉద్యోగులకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. మీనం వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మారులుంటాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున పరిస్థితులు అంతగా అనుకుంలించవు.  

మన తెలంగాణ 26 Mar 2026 12:10 am

ఫ్యాక్ట్ చెక్: ఎల్పీజీ బుకింగ్ గడువును 35 రోజులకు ప్రభుత్వం పెంచలేదు

ఎల్పీజీ బుకింగ్ గడువును 35 రోజులకు ప్రభుత్వం పెంచలేదు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 12:01 am

సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ: కెటిఆర్

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ ఎంఎల్‌సి ఎల్.రమణతో కలిసి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ బుధవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారంపై ఆయనకు సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి, వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల పట్టణం రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు గుండెకాయ వంటిదని కెటిఆర్ పేర్కొన్నారు. గతంలో అక్కడ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన చేదు జ్ఞాపకాలను డిప్యూటీ సిఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న బ్యాక్ బిల్లింగ్ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వివరించారు. రూ. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలి 2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్.ఎస్.ఐ యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని, అది సర్‌చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరిందని కెటిఆర్ తెలిపారు. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మానవీయ కోణంలో ఈ బిల్లుల భారాన్ని రద్దు చేసి నేతన్నను అదుకోవాలని కోరారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలని, కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని తెలిపారు.

మన తెలంగాణ 25 Mar 2026 11:42 pm

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య పోలీసులకు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. పోలీసులు సాధారణంగా నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భాగంగా ఒక కారును ఆపారు. ఆ కారులో లావణ్య ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగా ఆమె మద్యం సేవించినట్లు తేలింది. దీంతో పోలీసులు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి, కారును సీజ్ చేశారు. భవిష్యత్తులో ఆమెకు కౌన్సిలింగ్ కోసం నోటీసులు ఇవ్వొచ్చని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో మరో ఘటన కూడా వెలుగుచూసింది. మల్కాపూర్ మండలం మల్లెపల్లి గ్రామం వద్ద లావణ్య ప్రయాణిస్తున్న కారు, బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీ కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత ఆగకుండా వెళ్లిపోవాలని ప్రయత్నించగా, గ్రామస్థులు కారును అడ్డుకున్నారు. గ్రామస్థులు ఆమెను ఆపి క్షమాపణ చెప్పాలని కోరగా, లావణ్య వారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఆ సమయంలో కారులో ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత కూడా కొంతసేపు లావణ్య వారితో వాదించినట్లు తెలిసింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం కారులో మద్యం బాటిళ్లు కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇక లావణ్య పేరు ఇదే మొదటిసారి వార్తల్లోకి రావడం కాదు. గతంలో ఆమె సినీ నటుడు రాజ్ తరుణ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, అలాగే గర్భస్రావం చేయించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఈ వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. ప్రస్తుతం జరిగిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మరోసారి లావణ్యను వార్తల్లో నిలిపింది. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది. 

మన తెలంగాణ 25 Mar 2026 10:30 pm

‘అబ్రహం లింకన్’పై ఇరాన్ దాడులు

 పశ్చిమాసియా ఘర్షణల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్, అమెరికాకు హెచ్చరికలు జారీ చేసిన అనంతరం, అమెరికాకు చెందిన విమాన వాహన నౌక యూఎస్‌ఎస్ అబ్రహామ్ లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ లో వీడియోను కూడా విడుదల చేసింది. అయితే ఈ ఘటనపై అమెరికా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ఇరాన్ సైన్యం పబ్లిక్ రిలేషన్స్ విభాగం ప్రకారం, తీర ప్రాంతం నుంచి ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులు అమెరికా యుద్ధనౌక దిశగా వెళ్లినట్లు పేర్కొంది. ఇది జరగడానికి ముందు, ఇరాన్ నౌకాదళం అమెరికాకు నేరుగా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ సముద్ర పరిధికి సమీపంలోకి వస్తే యూఎస్‌ఎస్ అబ్రహామ్ లింకన్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశముందని హెచ్చరించిన గంటలోపే దాడి చేసింది. ప్రెస్ టీవీ నివేదిక ప్రకారం, ఇరాన్ నౌకాదళాధిపతి రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ, ఆ యుద్ధనౌక ఇరాన్ క్షిపణి పరిధిలోకి వస్తే దానిపై దాడి చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఆ నౌకను నిరంతరం గమనిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో, ఇరాన్ సైన్యాధికారులు అమెరికా ప్రభావాన్ని తక్కువగా చూపిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఖాతమ్ అల్-అన్‌బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారి, అమెరికా చెప్పుకునే వ్యూహాత్మక శక్తి ఇప్పుడు వ్యూహాత్మక వైఫల్యంగా మారిందని విమర్శించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు ఇచ్చిన గడువును వెనక్కి తీసుకోవడం, పరిస్థితులను కొంత శాంతింపజేసే చర్యగా భావిస్తున్నారు. ఇరాన్ నుంచి ప్రతిదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మన తెలంగాణ 25 Mar 2026 10:20 pm

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: RG Kar బాధితురాలి తల్లికి బిజెపి టికెట్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మూడవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే రెండు జాబితాలను రిలీజ్ చేసిన బిజెపి.. మూడో జాబితాలో కీలక నియోజకవర్గాల నుంచి మరో 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆర్.జి. కార్ మెడికల్ కాలేజీ అత్యాచారం, హత్య బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్‌కు బిజెపి టికెట్ ఇచ్చింది. బిజెపి, ఆమెను పానిహటి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దింపుతోంది. తన కుమార్తెకు న్యాయం కోసం, పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు రత్న దేబ్‌నాథ్ గతంలో చెప్పారు.

మన తెలంగాణ 25 Mar 2026 10:19 pm

సోనియా గాంధీకి అస్వస్థత.. నిలకడగా ఆరోగ్యం

కాంగ్రెస్ నాయకురాల సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆమెను వెంటనే స్థానిక సర్ గంగారామ్ హాస్పిటల్‌లో చికిత్సలకు చేర్పించారు. సోనియా గాంధీ ఆరోగ్యంనిలకడగా ఉంది. పూర్తిగా వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తమ ప్రకటనలో తెలిపారు. కడుపులో , మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్ సంబంధిత సమస్యలను గుర్తించారు. వీటిపై పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారని అజయ్ స్వరూప్ వివరించారు. అంతకు ముందు పార్టీ వర్గాలు ఓ ప్రకటన వెలువరించాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పులతో ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వివరించారు. వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, పరిస్థితి విషమంగా లేదని తెలిపారు. 

మన తెలంగాణ 25 Mar 2026 10:09 pm

IPL 2026... హర్షిత్ రాణా స్థానంలో సైనీ

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ ప్లేయర్లు గాయాల కారణంగా ఐపిఎల్ కు దూరమయ్యారు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఐపిఎల్ కు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రాణా తన కుడి మోకాలిలోని లిగమెంట్‌కు గాయం కావడంతో కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ వేశాడు. తర్వాత అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను తీసుకున్నారు. మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న రాణా.. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నందున ఐపీఎల్ 2026 నుండి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో నవదీప్ సైనిని తీసుకున్నట్లు కోల్‌కతా ప్రకటించింది. కుడిచేతి వాటం పేసర్ నవదీప్ సైని ఇప్పటివరకు ఆడిన 32 ఐపీఎల్ మ్యాచ్‌లలో 23 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా 23 వికెట్లు తీశాడు. గాయపడిన హర్షిత్ స్థానంలో అతను 75 లక్షల రూపాయలకు కేకేఆర్‌లో చేరనున్నాడు. అలాగే, గాయపడిన పృథ్వీరాజ్ యర్రా స్థానంలో ఖేజ్రోలియాను గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఎంపిక చేసింది. ఎడమచేతి వాటం పేసర్ అయిన ఖేజ్రోలియా గతంలో జీటీ, కేకేఆర్, ఆర్‌సీబీ తరఫున ఆడాడు. ఇప్పుడు 30 లక్షల రూపాయలకు జీటీలో చేరనున్నాడు.

మన తెలంగాణ 25 Mar 2026 10:04 pm

సౌతాఫ్రికాదే టి20 సిరీస్

న్యూజిలాండ్‌తో బుధవారం జిరగిన ఐదో, చివరి టి20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీ టీమ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 32తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కానర్ విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న కానర్ 33 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లు, ఐదు ఫోర్లతో 75 పరుగులుచేశాడు. రుబిన్ హర్మాన్ (39), వియాన్ ముల్డర్ (31), డియాన్ ఫారెస్టర్ 21 (నాటౌట్) తమవంతు సహకారం అందించడంతో సఫారీ టీమ్ ప్రత్యర్థి ముందు మెరుగైన లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. బెవన్ జాకబ్స్ (36) ఒక్కడే కాస్త పోరాడాడు.

మన తెలంగాణ 25 Mar 2026 9:53 pm

యువతిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు

యువతిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కాసిపేట

ప్రభ న్యూస్ 25 Mar 2026 9:51 pm

వన్య ప్రాణులకు నీటి వసతి..

వన్య ప్రాణులకు నీటి వసతి.. జుక్కల్, ఆంధ్రప్రభ : అటవీ శాఖ ఆధ్వర్యంలో

ప్రభ న్యూస్ 25 Mar 2026 9:43 pm

Heat Wave Alert AP 2026 : ఆ 3 నెలలు యమ డేంజర్ Andhra Prabha news ​

Heat Wave Alert AP 2026 : ఆ 3 నెలలు యమ

ప్రభ న్యూస్ 25 Mar 2026 9:37 pm

పాలకుల వివక్ష కు వ్యతిరేకంగా…కదంతొక్కిన కలం కార్మికులు

పాలకుల వివక్ష కు వ్యతిరేకంగా..కదంతొక్కిన కలం కార్మికులు ఐఅండ్ పీఆర్ కమీషనరేట్ ముట్టడిజర్నలిస్టుల

ప్రభ న్యూస్ 25 Mar 2026 9:35 pm

సమన్వయంతో మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకోవాలి

సమన్వయంతో మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకోవాలి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తొర్రూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 25 Mar 2026 9:27 pm

సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిరంజన్ గౌడ్

సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిరంజన్ గౌడ్ మహిళా విభాగం జిల్లా

ప్రభ న్యూస్ 25 Mar 2026 9:24 pm

మోత్కూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు ..?

మోత్కూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు ..? మోత్కూర్,ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ,

ప్రభ న్యూస్ 25 Mar 2026 9:21 pm

క్రికెటర్ దినేష్ కార్తిక్‌కు అరుదైన గౌరవం

 భారత స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. దినేష్ కార్తిక్‌పై తమ అభిమానాన్ని చెన్నైస్ అమృత విద్యాసంస్థల విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అమృత విద్యా సంస్థల వార్షిక క్రీడోత్సవంలో భాగంగా కార్తిక్ జెర్సీ నంబర్ ‘19’ ఆకారంలో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి అమృత విద్యా సంస్థలకు చెందిన దాదాపు మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరంత కలిసి సిఎడికె19 అనే ఆకారంలో మానవహారాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఒక క్రీడాకారుడి జెర్సీని ప్రతిబింబించే మానవహారంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడంతో దీనికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు లభించింది. అమృత గ్రూప్ చైర్మన్ భూమినాథన్, డాక్టర్ ఎంజిఆర్ మెడికల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.నారాయణ స్వామి, స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మన తెలంగాణ 25 Mar 2026 9:20 pm

ఉగాది, శివరాత్రి రోజున మాంసం తింటా.. సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని సమర్థిస్తూ.. నేను ఉగాది, శివరాత్రి రోజులలో మాంసం తింటా. రాహుకాలాన్ని నమ్మను అని అన్నారు. దీంతో ఆయన కొత్త రాజకీయ చర్చకు తెరలేపారు. చాలా మంది హిందువులు అశుభకరమైనదిగా భావించే 'రాహుకాలం' తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిపక్ష నాయకులు విమర్శించడంతో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. బుధవారం రాష్ట్ర శాసనసభలో సిఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. తాను రాహుకాలం వంటి భావనలను పాటించనని అన్నారు. అధికారులు, తన భార్యతో సహా కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాతే బడ్జెట్ సమయాన్ని నిర్ణయించానని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. అలాంటి కాలాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి తనకు ఎలాంటి సంకోచం లేదని, పాలన నిర్ణయాలు మూఢనమ్మకాలతో నడవకూడదని ఆయన చెప్పారు. జ్యోతిష్యపరమైన అంశాల కంటే ప్రజాస్వామ్య ప్రక్రియలకే తాను ప్రాధాన్యత ఇస్తానని ఆయన పేర్కొన్నారు. ఉగాది, మహాశివరాత్రి వంటి పండుగలను హిందువులు భక్తికి చిహ్నంగా శాకాహారంతో జరుపుకుంటారు. అయితే, అటువంటి ఆచారాలు వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయమని..  వ్యక్తిగత నమ్మకాలు వేర్వేరుగా ఉంటాయని, ఆహారపు అలవాట్లను మత ఆచారాలు ఎందుకు నిర్దేశించాలని ఆయన ప్రశ్నించారు. కాగా.. ఉగాది, శివరాత్రి వంటి పండుగల్లో మాంసాహారం తినడంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

మన తెలంగాణ 25 Mar 2026 9:13 pm

జనగణనతో ప్రణాళికలకు బలం..

జనగణనతో ప్రణాళికలకు బలం.. మే 1 నుంచి తొలి దశ గృహ గణన

ప్రభ న్యూస్ 25 Mar 2026 9:02 pm

The Paradise: Nani Delighted with the Buzz

Natural Star Nani is one actor who has a habit of completing his film shoots in quick schedules and he moves on to his next project. But things are completely different for The Paradise. He is teaming up with Dasara director Srikanth Odela for the second time. The Paradise is a big-budget attempt and Nani […] The post The Paradise: Nani Delighted with the Buzz appeared first on Telugu360 .

తెలుగు 360 25 Mar 2026 8:57 pm

మానికొండలో రైతన్న మీ కోసం కార్యక్రమం…

మానికొండలో రైతన్న మీ కోసం కార్యక్రమం… రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాంఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 25 Mar 2026 8:54 pm

Ippasara Debate Sparks Uproar in Telangana Assembly

The Telangana Assembly witnessed a highly charged session as a discussion on Ippasara turned into a full-scale political confrontation, marked by sharp exchanges, personal remarks, and mounting tensions between ruling and opposition members. The debate was initially triggered by Jadcherla MLA Anirudh Reddy, who proposed that Ippasara, a beverage made from ippapuvvu, could be developed […] The post Ippasara Debate Sparks Uproar in Telangana Assembly appeared first on Telugu360 .

తెలుగు 360 25 Mar 2026 8:53 pm

పల్లెసీమల సమగ్ర వికాసమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి

పల్లెసీమల సమగ్ర వికాసమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి స్వర్ణ పంచాయతీ, మూడు సీసీ

ప్రభ న్యూస్ 25 Mar 2026 8:51 pm

జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్‌కు విస్సన్నపేట బాలిక ఎంపిక

జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్‌కు విస్సన్నపేట బాలిక ఎంపిక ఆర్థిక సహాయం చేసిన

ప్రభ న్యూస్ 25 Mar 2026 8:47 pm

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు గురుకులాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు

ప్రభ న్యూస్ 25 Mar 2026 8:42 pm

మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఒబిసి మహిళలకు సబ్ కోటా కేటాయించాలి: కల్వకుంట్ల కవిత

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల నెరవేరే సమయం ఆసమన్నమవుతున్న తరుణంలో సామాజిక న్యాయాన్ని కూడా పాటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఆ రిజర్వేషన్లలో ఒబిసి మహిళల కోసం సబ్ కోటా ఉండటం అంతే ముఖ్యం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును ప్రస్తుత లోక్‌సభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కవిత స్పందించారు. మహిళా బిల్లులో ఒబిసి మహిళలకు ఉప కోటా కల్పించకపోవడం అంటే మెజారిటీ ప్రజలను మోసం చేయటమే అని పేర్కొన్నారు. చట్టసభల్లో సామాజిక సమానత్వం రావాలంటే ఒబిసి మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు. రిజర్వేషన్లలో రిజర్వేషన్ ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఒబిసి మహిళలకు ఉప కోటా లేకుండా ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తే మరోసారి పోరాటం తప్పదని హెచ్చరించారు. దేశంలో అన్ని వర్గాలకు మేలు చేయటమే సామాజిక న్యాయమని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఒబిసి వర్గాల మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే వారికి ఎలా న్యాయం దక్కుతుందని ప్రశ్నించారు. ఎస్‌సి,ఎస్‌టి మహిళలకు రాజ్యాంగబద్ద వాటా ఉందని...కానీ ఒబిసిల పరిస్థితి ఏంటనీ నిలదీశారు. ఈ విషయంలో అన్ని పార్టీల నాయకులు, ఆయా పార్టీల్లో ఉన్న ఒబిసి మహిళ నేతలు, మహిళా సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఒబిసి మహిళలకు ఉప కోటా కేటాయించే వరకు జాగృతి తరఫున మరోసారి పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

మన తెలంగాణ 25 Mar 2026 8:40 pm

70 క్వింటాళ్ల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం

హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్‌లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. డెక్కన్ ట్రేడర్స్ గోదాములపై పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. 70 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర రసాయనాలతో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం, ఫుడ్ అడల్టరేషన్ విభాగం అధికారులు కలిసి ఈ తనిఖీలు చేశారు. నిందితులు ముగ్గురు కలిసి ఎం.ఎం.పహాడీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గోదాంలు నడుపుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడం కోసం శాంటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, వెల్లుల్లి పొట్టును కలిపి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన ప్రమాదకరమైన పేస్ట్‌ను ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి.. హైదరాబాద్ నగరంలో హోల్‌సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

మన తెలంగాణ 25 Mar 2026 8:40 pm

దిమ్మదుర్తిలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభం

దిమ్మదుర్తిలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభం మామడ, ఆంధ్ర ప్రభ: మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో

ప్రభ న్యూస్ 25 Mar 2026 8:27 pm

ఆడ-మగ మొక్కజొన్న… రైతులో ఆందోళన

ఆడ-మగ మొక్కజొన్న… రైతులో ఆందోళన కొనుగోళ్లలు చేయని కంపెనీ యజమానులు,చాందిని సీడ్ కంపెనీ

ప్రభ న్యూస్ 25 Mar 2026 8:24 pm

మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మున్సిపల్ చైర్ పర్సన్ పావని

ప్రభ న్యూస్ 25 Mar 2026 8:19 pm

వెకేషన్ లో విరోష్ జంట.. స్పెషల్ వీడియో షేర్ చేసిన రష్మిక

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి ఆనందమైన క్షణాలను ఎంజాయ్ చేసేందుకు వెకేషన్ కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన స్పెషల్ మీడియోను రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానుతో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఫిబ్రవరి 26, గురువారం రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లికి ముందు జరిగిన వేడుకలు కూడా ఎంతో వైభవంగా జరిగాయి. ఫిబ్రవరి 25, బుధవారం జరిగిన హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు సందడి చేశారు. హల్దీ ఫోటోలను కూడా రష్మిక ఇటీవల షేర్ చేసింది.

మన తెలంగాణ 25 Mar 2026 8:18 pm

Rs 3.40cr ramatheertham road : రాములోరికి సుమమాల Andhraprabha latest News

Rs 3.40cr ramatheertham road : రాములోరికి సుమమాల Andhraprabha latest News

ప్రభ న్యూస్ 25 Mar 2026 8:14 pm

Peddi: Charan’s Power-Packed Birthday Blast

Mega Power Star Ram Charan’s birthday on March 27th is all set to become a high-voltage celebration, thanks to a massive surprise lined up from his Pan-India extravaganza Peddi. The makers have officially confirmed that a special blast will be dropped in 2 more days, amplifying the already sky-high anticipation surrounding the film. The film’s […] The post Peddi: Charan’s Power-Packed Birthday Blast appeared first on Telugu360 .

తెలుగు 360 25 Mar 2026 8:13 pm

మూడేళ్లుగా ప్రేమ… పెళ్లికి నిరాకరణ

మూడేళ్లుగా ప్రేమ… పెళ్లికి నిరాకరణ ఊట్కూర్, ఆంధ్ర ప్రభ : ప్రేమ పేరుతో

ప్రభ న్యూస్ 25 Mar 2026 8:10 pm

ఓవైపు కామెడీ.. ఓవైపు హారర్.. ఆసక్తికరంగా ‘రాకాస’ ట్రైలర్

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రాకాస’. హారర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమాను మాసన శర్మ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఓవైపు కామెడీతో నవ్వులు పూయిస్తూనే.. మరోవైపు హారర్‌తో భయపెడుతోంది ఈ సినిమా ట్రైలర్. ఇక ఈ సినిమాలో గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనుదీప్ దేవ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని మీరు చూసేయండి...

మన తెలంగాణ 25 Mar 2026 8:02 pm

ఘనంగా ముగిసిన ఉర్సు మహోత్సవం

ఘనంగా ముగిసిన ఉర్సు మహోత్సవం ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు

ప్రభ న్యూస్ 25 Mar 2026 7:56 pm

డ్రంకెన్ డ్రైవ్ లో నలుగురికి జరిమానా…

డ్రంకెన్ డ్రైవ్ లో నలుగురికి జరిమానా… పట్టుబడ్డ 4 గురు వ్యక్తులకు 4

ప్రభ న్యూస్ 25 Mar 2026 7:54 pm

గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై ప్రభుత్వం ప్రణాళిక: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలనే ప్రభుత్వం ఆలోచన చేస్తుందని డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలు నూనాయక్, కందుకూరు జయవీర్‌తో పాటు పలువురు సభ్యలు విద్యుత్ రంగంపై అడిగిన ప్రశ్నలకు డిప్యూటి సిఎం సమాధానం చెప్పారు. విద్యుత్ రంగంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేదిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ప్రభుత్వం పరిశీలన చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో గృహ ఉపయోగ, వ్యవసాయ రంగానికి సంబంధించి 81 గ్రామాల్లో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను చేపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 38,216 గ్రామాలు, 16,078 వ్యవసాయ పంప్ సెట్ లకు సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గృహ ఉపయోగ రూఫ్ టాప్ సోలార్ కింద, పీఎం సూర్యగర్ ప్రభుత్వ బిజిలీ కింద 40,349 గృహాల్లో 2 కే సామర్థ్యం రూప్‌టాఫ్ సోలార్ ఏర్పాటు చేశామని తెలియజేచేశారు. వ్యవసాయ సేవల్లో భాగంగా పిఎం కుసుమ కాంపోనెంట్ సి కింద 7.5 కిలోవాట్ హై రిజ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో16,708 వ్యవసాయ సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేశామని డిప్యూటి సిఎం పేర్కొన్నారు. అయితే పలువురు సభ్యలు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు, వ్యవసాయంలో రైతులు సాంప్రదాయ విద్యుత్ వినియోగం, మోటార్ వాడకానికి అలవాటు పడి సోలార్ అంటే అవగాహాన లేక, లేనిపోని అపోహలతో ముందుకు రావడం లేదని తెలిపారు. దీనిపై అధికారులతో విస్తృత అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భట్టి స్పందిస్తూ గతంలో అవగాహాన కార్యక్రమాలు నిర్వహించామని, వాటిని మరింత ఎక్కువగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

మన తెలంగాణ 25 Mar 2026 7:53 pm

హోటల్ పరిశ్రమను ఆదుకోండి…

హోటల్ పరిశ్రమను ఆదుకోండి… ముఖ్యమంత్రికి హోటల్ అసోసియేషన్ విన్నపం విజయవాడ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 25 Mar 2026 7:51 pm

అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు హైకోర్టు నోటీసు

బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురికీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారు పార్టీ ఫిరాయించలేదని ఈ నెల 11వ తేదీన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. బుధవారం హైకోర్టు వీటిని పరిశీలించి స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు ఇంకా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, టి. ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 16న విచారణ చేపడతామని, ఈ లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

మన తెలంగాణ 25 Mar 2026 7:47 pm

వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొరత లేదు..

వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. చిట్యాల,ఆంధ్రప్రభ : మండల పరిధిలో వాహన

ప్రభ న్యూస్ 25 Mar 2026 7:46 pm

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు ​చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని పాసిగడ్డ తండా

ప్రభ న్యూస్ 25 Mar 2026 7:23 pm

సంపద సృష్టించేందుకు సీ అండ్ డీ ప్లాంట్…

సంపద సృష్టించేందుకు సీ అండ్ డీ ప్లాంట్… కమిషనర్ ధ్యాన చంద్ర విజయవాడ

ప్రభ న్యూస్ 25 Mar 2026 7:16 pm

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ

ప్రభ న్యూస్ 25 Mar 2026 7:13 pm

Rakasa Trailer: Fun and Fantasy Loaded

Niharika Konidela floated Pink Elephant Pictures and produced Committee Kurrollu in the past. Her second film as producer is titled Rakasa and it is gearing up for April release. The film is a horror comedy set in a village backdrop. The trailer of Rakasa is out and it is thoroughly entertaining. The real plot is […] The post Rakasa Trailer: Fun and Fantasy Loaded appeared first on Telugu360 .

తెలుగు 360 25 Mar 2026 7:12 pm

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల‌కు స్వాగతం…

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల‌కు స్వాగతం… అమరావతి, ఆంధ్రప్రభ : బుధవారంపొన్నూరుశాసనసభ్యులు, సంగం

ప్రభ న్యూస్ 25 Mar 2026 7:09 pm

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అఖిలపక్ష భేటీ

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ భవనంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత ఈ సమావేశం ప్రారంభమైంది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన కిరణ్‌ రిజిజు, జేపీ నడ్డా, హర్దీప్‌ సింగ్‌ పురీ, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ హాజరయ్యారు. పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, దేశ సన్నద్ధతపై నాయకులకు వివరించనున్నారు. కాగా, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరిపడంతో సంక్షోభం ప్రారంభమైంది. ముఖ్యంగా ఇంధన సరఫరా, వాణిజ్య మార్గాలు, ప్రాంతీయ స్థిరత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ఘర్షణ ప్రభావం ప్రపంపై దీర్ఘకాలం కొనసాగవచ్చని ప్రధాని మోడీ గతంలో పార్లమెంట్‌లో హెచ్చరించారు. తలెత్తే సవాళ్లకు సిద్ధంగా ఉండాలని ఆయన పౌరులను, రాష్ట్రాలను కోరారు. ఈ సంక్షోభం వల్ల కలిగే ప్రభావాలను ఎదుర్కోవడానికి, ఇంధన సరఫరా, ఎరువులు, సరఫరా గొలుసులు వంటి రంగాలను నిశితంగా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం పలు బృందాలను ఏర్పాటు చేసింది. దేశంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం, నిత్యావసర సేవలు సజావుగా కొనసాగేలా ఈ బృందాలు పనిచేస్తాయి.

మన తెలంగాణ 25 Mar 2026 7:08 pm

కాంగ్రెస్ కార్యాలయాల ఖాళీకి నోటీసు

దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయాలను శనివారం లోగా (28 వ తేదీ)ఖాళీ చేయాలని ఎస్టేట్ విభాగం నోటీసు వెలువరించింది. 24 అక్బర్ రోడ్ ఆఫీసు, 5, రైసినా రోడ్డు భవనాలను ఈ ఉత్తర్వుల మేరకు పార్టీ ఖాళీ చేయాల్సి ఉంటుంది. దీనిని తమ ఫైనల్ నోటీసుగా గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.అక్బర్ రోడ్‌లో దాదాపు 48 ఏండ్లుగా పార్టీ కార్యాలయం ఉంది. అయితే ఇది ప్రభుత్వ బంగళాగా ఉంది. ప్రభుత్వ బంగళాలలో పార్టీ కార్యాలయాలు ఉండరాదని మోడీ ప్రభుత్వం గతంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే పలు పార్టీలు సొంత ఆఫీసు భవనాలను ఏర్పాటు చేసుకున్నాయి. కాంగ్రెస్ కూడా స్థానికంగా ఇందిరా భవన్‌ను ఏర్పాటు చేసుకుంది. పాత భవనాన్ని ఖాళీ చేయలేదు. అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 1978 నుంచి కాంగ్రెస్‌కు అక్బర్ రోడ్ కార్యాలయం ఉంది. పార్టీకి చెందిన యూత్ కాంగ్రెస్‌రైసినా రోడ్ కార్యాలయం నుంచి సాగుతున్నాయి. ఇటీవలే ఈ ఖాళీ ఉత్తర్వులతో నోటీసు వెలువడింది. కనీసం వారం రోజుల సమయం కూడా ఇవ్వలేదని పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ ఆకస్మిక నోటీసుపై ఏమి చేయాలనేది పార్టీ వర్గాలు ఇప్పటికైతే ఏమి నిర్ణయించుకోలేదు. అవసరం అయితే ఈ చర్యను నిలిపివేసేందుకు , స్టే తెచ్చుకునేందుకు కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ప్రస్తుత విషయంపై నిబంధనల మేరకు స్పందిస్తామని, ఆలోచించుకుంటామని , ఇతరులకు వర్తించే రూల్స్ తమకూ వర్తిస్తాయని పార్టీ ఎంపి కార్తీ చిదంబరం తెలిపారు.

మన తెలంగాణ 25 Mar 2026 7:07 pm

వేసవి క్రీడా శిబిరాలకు శాప్ సిద్ధం..

వేసవి క్రీడా శిబిరాలకు శాప్ సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లుమే 1 నుంచి

ప్రభ న్యూస్ 25 Mar 2026 7:06 pm

ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి మృతి

ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి మృతి నివాళులర్పించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌

ప్రభ న్యూస్ 25 Mar 2026 7:04 pm

భక్తులకు సౌకర్యాలపై పర్యవేక్షణ…

భక్తులకు సౌకర్యాలపై పర్యవేక్షణ… దేవాలయాల్లో తాగునీరు, పారిశుద్యంపై ప్రత్యేక దృష్టిఐ వి ఆర్

ప్రభ న్యూస్ 25 Mar 2026 6:57 pm

పెన్షన్ దారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

పెన్షన్ దారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి రాయపర్తి, ఆంధ్రప్రభ : పెన్షన్ దారుల

ప్రభ న్యూస్ 25 Mar 2026 6:53 pm

ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. రామ్‌చరణ్ కోలుకున్నారు: ‘పెద్ది’ టీమ్

గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. విలేజ్ స్టోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. అయితే ఈ సినిమా సెట్స్‌లో రామ్‌చరణ్ గాయపడ్డారని తెలిసింది. దీనిపై ‘పెద్ది’ టీమ్ స్పందించింది. ప్రస్తుతం రామ్‌చరణ్ కోలుకుంటున్నారని తెలిపింది. సెట్స్‌లో చరణ్ కుడి కంటికి స్వల్ప గాయమైందని, తగిన ట్రీట్‌మెంట్ జరిగిందని పేర్కొంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు సూచించింది. చరణ్ గాయం విషయంలో వస్తున్న రూమర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. గురువారం (మార్చి 26) నుంచి చరణ్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని పేర్కొంది. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.

మన తెలంగాణ 25 Mar 2026 6:50 pm

అధ్వానంగా మారిన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ…

అధ్వానంగా మారిన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ… సమస్యలను పట్టించుకోని డిప్యూటీ కమిషనర్…. మేడ్చల్,

ప్రభ న్యూస్ 25 Mar 2026 6:50 pm

Global Oil Crisis 2026 : నయా కరోనా Anadhra Prabha SPL Story

Global Oil Crisis 2026 : నయా కరోనా Anadhra Prabha SPL

ప్రభ న్యూస్ 25 Mar 2026 6:49 pm

ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ దుకాణాల బంద్

పౌల్ట్రీ కంపెనీల విధానాలకు నిరసనగా ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి చికెన్ దుకాణాలను బంద్ చేసేందుకు చికెన్ వ్యాపారులు సిద్దమవుతున్నారు. ఇచ్చే మార్జిన్ సరిపోవడంలేదని, తద్వారా తీవ్ర నష్టాలకు గురికావల్సివస్తోందని పలు పర్యాయాలు పౌల్ట్రీ కంపెనీలకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో ఇచ్చే మార్జిన్ కంటే 20 రూపాయలు తక్కువగా ఇస్తున్నారని, రోజురోజుకు చికెన్ ధరలు పెరుగుతున్నా తమకు ఇచ్చే మార్జిన్‌ను మాత్రం తగ్గిస్తున్నారని, ఇందుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బంద్‌ను నిర్వహిస్తున్నామని చికెన్ వ్యాపారులు తెలిపారు. తక్షణమే స్పందించి తమకు మార్జిన్‌ను పెంచాలని, లేనిపక్షంలో చికెన్ దుకాణాలను మూసివేసి ఆందోళనలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.

మన తెలంగాణ 25 Mar 2026 6:37 pm

హైదరాబాద్ టు -విజయవాడ నేషనల్ హైవే పై భారీగా ట్రాఫిక్ జాం

జంట నగరాల్లో నెలకొన్న ఇంధన సెగ ప్రభావం కేవలం నగరం లోపలే కాకుండా ప్రధాన రహదారులపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. బంకుల వద్ద వాహనాల క్యూలైన్లు ప్రధాన రోడ్లపైకి రావడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో ఇంధన కొరత లేదని, ఆయిల్ కంపెనీల వద్ద సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని అధికారులు పదేపదే స్పష్టం చేస్తున్నప్పటికీ, ప్రజల్లో నెలకొన్న సందేహాల కారణంగా బంకుల వద్ద ఈ రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పలు మెట్రో నగరాల్లోని పలు బంక్‌ల్లో నోస్టాక్ అన్న బోర్డులు దర్శనమిస్తుండడం విశేషం.

మన తెలంగాణ 25 Mar 2026 6:32 pm

BJP : మర్రి రాజకీయం ఇక ముగిసినట్లే.. నిర్ణయం అదేనా?

సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో నామమాత్రంగానే ఉన్నారు

తెలుగు పోస్ట్ 25 Mar 2026 6:28 pm

2ndoption |గ్యాస్ కొరత వేళ ప్రత్యామ్నాయాల ఆలోచనలు

2ndoption | గ్యాస్ కొరత వేళ ప్రత్యామ్నాయాల ఆలోచనలు 2ndoption |గ్రామాల్లో బయోగ్యాస్

ప్రభ న్యూస్ 25 Mar 2026 6:24 pm

Jagan’s Narrative: Backing Women’s Reservation While Facing Heat Over Credit Claims

YSR Congress Party chief Y. S. Jagan Mohan Reddy has once again found himself at the centre of political attention, this time for two sharply contrasting reasons. On one side, he has extended strong support to the proposed implementation of the Women’s Reservation Act. On the other hand, his remarks claiming credit for the ArcelorMittal […] The post Jagan’s Narrative: Backing Women’s Reservation While Facing Heat Over Credit Claims appeared first on Telugu360 .

తెలుగు 360 25 Mar 2026 6:19 pm

ఆ పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారు: బండి సంజయ్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసస్థాయిలో విమర్శలు చేశారు. మహిళలకు 33 శాతం పీట్లు కేటాయిస్తే రేవంత్ రెడ్డికి నష్టమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ, పార్లమె్ంట్ సీట్ల సంఖ్య పెంపుతో దక్షిణాదికి ఏం జరుగుతుందని అన్నారు. ‘‘ప్రాంతీయ అసమానత పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారు. దేశాన్ని విభజించాలని చూస్తున్నారా? దేశ భక్తి, జాతీయవాదం మీలో మచ్చుకైనా కనిపించవా? తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందనే వణకు మీలో మొదలైందా? అక్కడ ఎన్ని గిమ్మిక్కులు చేసినా పారడం లేదని అర్థమైందా? అందుకే దక్షిణాదికి అన్యాయం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. మీకు, కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే ద్వేషం. అందుకే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వలేదు. మీరెన్ని కుట్రలు చేసినా మహిళ రిజర్వేషన్లు అమలు చేస్తాం’’ అని బండి సంజయ్ అన్నారు.

మన తెలంగాణ 25 Mar 2026 6:19 pm

అకాల వర్షానికి జుక్కల్‌లో పంటనష్టం…

అకాల వర్షానికి జుక్కల్‌లో పంటనష్టం… జుక్కల్ (కామారెడ్డి)ఆంధ్రప్రభ : నిన్న సాయంత్రం జుక్కల్

ప్రభ న్యూస్ 25 Mar 2026 6:10 pm

Ram Charan’s Injury, No Major Concern

Mega Power Star Ram Charan, known for pushing boundaries with every role, encountered a brief hiccup during the shoot of his Pan India film Peddi. The team was filming a high-octane action sequence when a sudden movement led to the actor receiving a minor cut above his eye. Though the moment caused concern on the […] The post Ram Charan’s Injury, No Major Concern appeared first on Telugu360 .

తెలుగు 360 25 Mar 2026 6:02 pm

ఈవీఎం గోడౌన్ తనిఖీ

విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ పరిసరాలను వారు పరిశీలించారు. అనంతరం భద్రత, గోడానికి వేసిన తాళాల సీజ్ విధానం తదితర వాటిని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల నడుమ పరిశీలించారు. అనంతరం గోడౌన్ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. తిరిగి రాజకీయ ప్రతినిధుల […] The post ఈవీఎం గోడౌన్ తనిఖీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Mar 2026 6:00 pm

భూతగాదా లో అన్నపై గొడ్డలితో తమ్ముని దాడి

భూతగాదా లో అన్నపై గొడ్డలితో తమ్ముని దాడి చెన్నూర్ ఆంధ్రప్రభ :మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 25 Mar 2026 5:59 pm

అలర్ట్.. రానున్న 2-3 గంటల్లో భారీ వర్షాలు

తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రానున్న రెండు మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక, హైదరాబాద్, మేడ్చల్, మంచిర్యాల, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడింది.

మన తెలంగాణ 25 Mar 2026 5:58 pm

Anirudh Reddy |ఈ పువ్వుతో లాభాలు ఎన్నో…

Anirudh Reddy | ఈ పువ్వుతో లాభాలు ఎన్నో… Anirudh Reddy |

ప్రభ న్యూస్ 25 Mar 2026 5:56 pm

చెరువు కట్ట అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి

టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండల కేంద్రం సమీపంలోని రాప్తాడు చెరువు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ అధికారులకు సూచించారు.బుధవారం ఆయన చెరువు వద్ద జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో ఏపీఓ సావిత్రి, ఈసీ మురళి, సోమర నారాయణస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్లు తలారి శివ, వినోద్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్ […] The post చెరువు కట్ట అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Mar 2026 5:51 pm

Hyderabad : హైదరాబాద్ లో వాన

హైదరాబాద్ లో వర్షం కురిసింది

తెలుగు పోస్ట్ 25 Mar 2026 5:49 pm

ఇందిరమ్మ ఇండ్లతో పేదల జీవితాల్లో మార్పు..

ఇందిరమ్మ ఇండ్లతో పేదల జీవితాల్లో మార్పు.. నిర్మల్ డిసిసి ప్రధాన కార్యదర్శి పి

ప్రభ న్యూస్ 25 Mar 2026 5:48 pm

అర్హులైన పేదలకు స్థలం ఇవ్వాలి

సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం పట్టణంలో అర్హులైన పేదలకు రెండు సెంట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా మూడు సెంట్ల ఇంటి స్థలమును ఇవ్వాలని సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ధర్మవరం పట్టణం రూరల్ ప్రాంతాల్లో అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని […] The post అర్హులైన పేదలకు స్థలం ఇవ్వాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Mar 2026 5:47 pm

వృత్తి విద్య కోర్సులు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. ప్రిన్సిపాల్ పద్మశ్రీ

విశాలాంధ్ర ధర్మవరం:: వృత్తి విద్యా కోర్సులు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఒకేషనల్ విద్యార్థులు సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో 10 రోజులు ఇంటర్సిప్ కార్యక్రమం జరిగిందన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ పద్మశ్రీ మాట్లాడుతూ ఇది పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు. పట్టణంలోని సంజయ్ నగర్ లో గల ఇంటర్ షిప్ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ గల శ్రీ లక్ష్మీ కంప్యూటర్ ఎంబ్రా డైరీ, […] The post వృత్తి విద్య కోర్సులు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. ప్రిన్సిపాల్ పద్మశ్రీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Mar 2026 5:42 pm

FINE |బాటిళ్లలో పెట్రోల్ కొట్టిస్తే జైలుశిక్ష!

FINE | బాటిళ్లలో పెట్రోల్ కొట్టిస్తే జైలుశిక్ష! FINE | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 25 Mar 2026 5:39 pm

సంతకవిటి మండలానికి మానవత ఆధ్వర్యంలో డెడ్‌బాడీ ఫ్రీజర్ బాక్స్ అందజేత

విశాలాంధ్ర.రాజాం, విజయనగరం జిల్లా -మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో సంతకవిటి మండలానికి డెడ్‌బాడీ ఫ్రీజర్ బాక్స్‌ను బుధవారం అందజేశారు. సుమారు రూ.75 వేల విలువ కలిగిన ఈ ఫ్రీజర్ బాక్స్‌ను మండల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందించడం జరిగింది.ఈ సందర్భంగా మానవత చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, అవసర సమయంలో పేదలకు మరియు సాధారణ ప్రజలకు ఈ ఫ్రీజర్ బాక్స్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మానవత సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని పేర్కొన్నారు.ఈ […] The post సంతకవిటి మండలానికి మానవత ఆధ్వర్యంలో డెడ్‌బాడీ ఫ్రీజర్ బాక్స్ అందజేత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Mar 2026 5:37 pm

విజయవాడ టెర్రర్ లింక్.. మరో ఇద్దరు అరెస్ట్

విజయవాడ టెర్రర్ లింక్ లో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యాయి. బుధవారం హైదరాబాద్ కు చెందిన సైదాబేగం, బెంగళూరకు చెందిన అబ్దుల్ ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరిని కోర్టులో హాజరుపర్చారు.  ఏడాది క్రితం భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న సైదా బేగం.. 42 మందితో టెర్రర్ గ్రూపును ఏర్పాటు చేసింది.  రాత్రి సమయాల్లో సోషల్ మీడియాలో టెర్రర్ పోస్టింగ్ లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టెర్రర్ పోస్టింగ్ ల కోసవ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకొని ప్రచారం చేస్తోంది. యువతను టెర్రర్ వైపు మళ్లిస్తుందని పోలీసులు తెలిపారు. కాగా.. నిన్న విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్‌ఐఎస్, ఆఖిస్ (ఎక్యూఐఎస్)లతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని మహమ్మ ద్ రహమతుల్లా షరీఫ్, ఎండి. డానిష్, మీర్జా సో హైల్ బేగ్‌లుగా గుర్తించారు. 

మన తెలంగాణ 25 Mar 2026 5:34 pm

ఉద్య‌మ్‌, పీఎంఈజీపీపై అవ‌గాహ‌న స‌ద‌స్సు…

ఉద్య‌మ్‌, పీఎంఈజీపీపై అవ‌గాహ‌న స‌ద‌స్సు… జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : కేంద్ర ప్ర‌భుత్వ రైజింగ్

ప్రభ న్యూస్ 25 Mar 2026 5:32 pm

Telangana : తెలంగాణలో ఇప్పసారాపై రగడ

తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా, ఇందిరమ్మ పేరు పై వివాదం జరిగింది

తెలుగు పోస్ట్ 25 Mar 2026 5:31 pm

650 కిలోల పాతపుస్తకాలు సేకరించిన అన్నపూర్ణ..

650 కిలోల పాతపుస్తకాలు సేకరించిన అన్నపూర్ణ.. ఐటీసీ ‘వావ్’ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్

ప్రభ న్యూస్ 25 Mar 2026 5:28 pm

ఘనంగా అథెటిక్స్ ఎంపికలు

విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ వారి ఆదేశాల మేరకు ఈ అథెటిక్స్ ఎంపికలు నిర్వహించడం జరిగిందని హాకీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాష్, స్కూల్ గేమ్ కార్యదర్శి లక్ష్మీనారాయణ, సుహాసిని, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్, బాక్సింగ్ కోచ్ ఓం ప్రకాష్, హాకీ కోచ్ హసేన్, ఫెన్సింగ్ కోచ్ ప్రతాప్, అథ్లెటిక్స్ కోచ్ శబరి గిరి తెలిపారు. వారు మాట్లాడుతూ […] The post ఘనంగా అథెటిక్స్ ఎంపికలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Mar 2026 5:27 pm

రైతులకు ప్రకృతి సాగుపై అవగాహన..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం -ఏఓ కృష్ణచైతన్య విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రైతులు ప్రకృతి వ్యవసాయం సాగుపై దృష్టి సారించాలని, రాబోయే ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి (ఏఓ) కృష్ణచైతన్య పేర్కొన్నారు. గొందిరెడ్డిపల్లి రైతుసేవ కేంద్రం పరిధిలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంనిర్వహించారు. ఏఓ మాట్లాడుతూ, రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలను […] The post రైతులకు ప్రకృతి సాగుపై అవగాహన.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Mar 2026 5:23 pm

ఘనంగా బాల జన్మదిన వేడుకలు..

ఘనంగా బాల జన్మదిన వేడుకలు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : బీజేపీ సీనియర్ నాయకుడు

ప్రభ న్యూస్ 25 Mar 2026 5:22 pm

వేసవి తాపం నుండి ఉపశమనానికి చలివేంద్రం

విశాలాంధ్ర -రాప్తాడు : వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎంపీడీఓ బి.విజయలక్ష్మి చేతులమీదుగా బుధవారం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బుధవారం చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా కార్యాలయానికి వచ్చే ప్రజలకు, బాటసారులకు తాగునీటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అర్జీదారులకు, పరిసర ప్రాంతాల వారికి ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ […] The post వేసవి తాపం నుండి ఉపశమనానికి చలివేంద్రం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Mar 2026 5:13 pm

వేణుగోపాల స్వామి ఆదాయం రూ.15,17,776…

వేణుగోపాల స్వామి ఆదాయం రూ.15,17,776… గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా

ప్రభ న్యూస్ 25 Mar 2026 5:10 pm

శ్రీ రామనవమి ఉత్సవాల పత్రిక ఆవిష్కరణ

శ్రీ రామనవమి ఉత్సవాల పత్రిక ఆవిష్కరణ చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపాలిటీలో

ప్రభ న్యూస్ 25 Mar 2026 5:09 pm

ప్రత్యేక వాతావరణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి

ప్రత్యేక వాతావరణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి వాతావరణ మౌలిక సదుపాయాల లోటుపాట్లపై ఆందోళనవరంగల్

ప్రభ న్యూస్ 25 Mar 2026 5:08 pm

ఇల్లు, సాగు భూమిని పంపిణీ చేయాలి

ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ:: ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలతోపాటు భూమి లేని పేదలకు కూడా సాగు భూమిని పంపిణీ చేయాలన్న డిమాండ్తో, సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మండలములోని రెవెన్యూ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు నిర్వహించారు. అనంతరం డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ మహేశ్వర్ రెడ్డికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో వేల మంది […] The post ఇల్లు, సాగు భూమిని పంపిణీ చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Mar 2026 5:06 pm

​చిన్నకపర్తిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం

​చిన్నకపర్తిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం ​చిట్యాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 25 Mar 2026 5:04 pm