ఆ 29 అంశాలను పరిష్కరిస్తాం: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: ఆర్ టిసి సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించాలని ఆర్టీసీ సోదరులు, తన కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సమ్మె సమస్యకు పరిష్కారం కాదు అని, ప్రభుత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని, నాలుగు వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. పొన్న ప్రభాకర్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు అని, ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి వ్యతిరేకత లేదు అని స్పష్టం చేశారు, వెంటనే పరిష్కారం అయ్యే అంశాలు పూర్తి చేస్తామని, ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చర్చించాల్సి ఉందని, వారు అధ్యయనం చేయడానికి నాలుగు వారాల గడువు అడిగామన్నారు. ఈ రెండు అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దగ్గర చర్చిస్తామని, నలుగురు అధికారుల కమిటీకి తెలియజేశామన్నారు. ఆర్టీసీ విలీనం ఆలస్యం అయిన ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయని తెలియజేశారు. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం నాయకత్వ అంశాలు ఉన్నాయని, ప్రభుత్వం ఏర్పడగానే గతంలో పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశామని, పెండింగ్ డీఏ లు లేకుండా క్లియర్ చేశామన్నారు. 2013 పెండింగ్ బాండ్స్ క్లియర్ చేశామని, రూ.1205 కోట్లు ఉన్న పిఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించామని, రూ.690 కోట్లు ఉన్న సిసిఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామని, ఇవే కాకుండా నెల వారిగా పిఎఫ్, సిసిఎస్ కి 75 కోట్లు చెల్లిస్తున్నామని పొన్నం స్పష్టం చేశారు. ఉద్యోగులపై పని భారం పడకుండా ఉండడానికి 4538 ఉద్యోగాల నియామకాలు భర్తీ త్వరలోనే పూర్తవుతుందని, సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 1134 కారుణ్య నియామకాలు చేపట్టామని, గత ప్రభుత్వం లో వివిధ కారణాలతో శాశ్వతంగా సర్వీసు నుండి రిమూవ్ అయిన వారిలో ఇప్పటి వరకు దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని అంశాలు పరిష్కారం చేస్తామని, ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు వద్దు అని, గత ప్రభుత్వం లో 10 సంవత్సరాలుగా ఆర్టీసీ లో ఏం జరిగిందో కార్మికులందరికీ తెలుసునని, ఆర్టీసీ లో ప్రయాణించింది పేదలు గ్రామీణ ప్రాంత ప్రజలు మన అక్కా చెల్లెల్లు అని తెలిపారు. ప్రతి రోజు 65 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 45 లక్షల మంది మహిళలే ఉన్నారని తెలియజేశారు. ఆర్టీసీ లో నిత్యం ఉపాధి కోసం విద్య ,వైద్యం కోసం పోయే పరిస్థితి ఉందని, ప్రభుత్వం పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నమని, సమ్మె వద్దు అని ఆర్ టిసి కార్మికులను పొన్నం కోరారు. మిమ్మల్ని ఎవరు అడ్డుకోరని, ప్రజాస్వామ్య పద్ధతి లో మీ నాయకులు నిరసన చేయవచ్చని, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకరావచ్చని, పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బందులు కలగజేయవద్దని, పేద ప్రజలకు కార్ల లో పోయే స్థోమత లేదన్నారు. ప్రతి ఒక్క ఆర్టిసి కుటుంబ సభ్యుడికి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరుపున కొట్లాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని, కార్మికుల సమస్యల పరిష్కారం పై సానుకూలంగా ఉన్నామని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. తాను విద్యార్థి నాయకుడిని కార్మికులకు అండగా ఉంటానని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లైఫ్ లైన్ అయిన ఆర్టీసీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఆర్ టిసి నాయకులు నిరసనలు చెసుకొనే హక్కు వారికి ఉందని, మిగతా వారంతా విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
నిరుపేద కుటుంబంలో విరిసిన విద్య కుసుమం ఇరిగి సాయి చాందిని
దళిత సంఘాలు సన్మానం గంభీరావుపేట ఏప్రిల్ 21 (జనం సాక్షి): గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన తిరిగి సాయి చాందిని విడుదలైనటువంటి ఫలితాల్లో జేఈఈ మెయిన్స్ లో …
inquiry |హైకోర్టు సంచలన తీర్పు…
inquiry | హైకోర్టు సంచలన తీర్పు… inquiry | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క
April Third Weekend OTT Release Chart
It is the third week of April and there are a series of films and web series streaming on various platforms for the Indian audience. Band Melam and Lechindi Mahila Lokam are the only Telugu titles streaming for the weekend. Here is the complete list of streaming titles for the third weekend of April: April […] The post April Third Weekend OTT Release Chart appeared first on Telugu360 .
America - Iran - Ceasefire : చమురు ధరలు తగ్గుతాయా? ట్రంప్ తాజా నిర్ణయంపై ఆసియా మార్కెట్ పై?
అమెరికా–ఇరాన్ చర్చలు ముందుకు సాగడం లేదు
హైదరాబాద్: ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకష్ణ అభిమానులకు కొత్త కబులు వినిపించేందుకు సిద్దపడుతున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప్పుడు దీనితో పాటే మరో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దర్శకుడు కొరటాల శివతో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆయనకు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల కథలు వినిపించినట్లు తెలిసింది. కానీ…ఇప్ప్పుడు తదుపరి సినమా కోసం కొరటాలకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇప్పటికే […] The post కొరటాల శివతో బాలకష్ణ appeared first on Visalaandhra .
యువతను మత్తులోకి నెడుతున్న రాజకీయ నేతలు
పి.వై.ఎల్ జిల్లా మహాసభలో కోలా లక్ష్మీ నారాయణ భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 22 (జనం సాక్షి): దేశంలో, రాష్ట్రంలో గంజాయి, మత్తు …
కాళేశ్వరం కమిషన్ రిపోర్టు నిలిపితే.. హైకోర్టులో కెసిఆర్, హరీష్ కు ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును నిలిపివేస్తున్నట్లు బుధవారం హైకోర్టు వెల్లడించింది. ఆ రిపోర్టు ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో కెసిఆర్, హరీష్ రావులకు ఊరట లభించింది. కాగా, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు విచారణ అర్హతను సవాల్ చేస్తూ కెసిఆర్, అప్పటి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ నేతృ త్వంలోని కమిషన్ను ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని వారు హైకోర్టును కోరారు. కాగా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇదివరకే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి కోర్టు.. అలాంటి తీర్పే ఇచ్చింది.
Minister |ఆర్టీసీ కార్మికులకు మంత్రి విజ్ఞప్తి
Minister | ఆర్టీసీ కార్మికులకు మంత్రి విజ్ఞప్తి Minister | ఆంధ్రప్రభ, వెబ్
సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
గోడ పత్రికను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 22 (జనం సాక్షి): …
తొమ్మిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలి
తుర్కపల్లి, ఏప్రిల్ 21 జనం సాక్షిసుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం తొమ్మిదో వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు అంబటి చెన్న కిష్టయ్య తెలిపారు.మంగళవారం తుర్కపల్లి …
ఐసీసీ పదవి నుంచి వైదొలిగిన వాసిమ్ ఖాన్
క్రీడలు: పాకిస్థాన్ మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కమిటీ నుంచి వైదొలిగారు. ఐసీసీ జనరల్ మేనేజర్ పదవికి రాజీనామా చేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన పదవిని వీడారు. జెఫ్ అల్లార్డెస్ నుంచి 2022లో వాసిమ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు ఆయన పీసీబీ సీఈవోగా మూడేళ్లు పనిచేశారు. ఇప్ప్పుడు వైదొలిగినా… మరో పదవీ బాధ్యతలను తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఐసీసీలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. […] The post ఐసీసీ పదవి నుంచి వైదొలిగిన వాసిమ్ ఖాన్ appeared first on Visalaandhra .
AP | ఘటనాస్థలంలోనే… AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క : పశ్చిమ
Breaking : హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావులకు బిగ్ రిలీఫ్
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావులకు ఊరట లభించింది
ఆదివాసీలతో కలిసి మంత్రి జూపల్లి బస్సు ప్రయాణం..
ఆదివాసీలతో కలిసి మంత్రి జూపల్లి బస్సు ప్రయాణం.. ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర
suicide |తమ్ముడి అంత్యక్రియల దగ్గరే…
suicide | తమ్ముడి అంత్యక్రియల దగ్గరే… suicide | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క
భర్త చావు అంచులకు వెళ్లి బయటకు వచ్చాడు.... దొరికిన భార్య, ప్రియుడు
గాంధీనగర్: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి అతడిని కాలువలో పడిసింది. భర్త కాలువలో ఈదుతూ నిర్మాణాన్ని పట్టుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం వడోదరలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చానీ ప్రాంతంలో గిరీష్ పటేల్, పాల్గుణీ పటేల్ అనే దంపతులు నివసిస్తున్నారు. గిరష్ పార్లర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఖేడాకు చెందిన సెలూన్ యజమాని కౌశిక్ శర్మతో పల్గూణి అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని హత్య చేయాలని ప్రణాళిక వేశారు. కౌశిక్ తన స్నేహితుడు నికుల్ గోస్వామితో హత్య చేసి ఒప్పందం చేసుకున్నాడు. తొలుత ముప్పై ఐదు వేల రూపాయలు సుపారీ గ్యాంగ్ కు ఇచ్చారు. ఏప్రిల్ 15న రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గిరీష్ ను కిడ్నాప్ చేశాడు. కత్తితో బెదిరించి వివిధ ప్రాంతాలలో తిప్పి సోజిత్ర శివారులోని ఓ కాలువలో అతడిని పడేశారు. గిరీష్ చనిపోయాడని భావించి అక్కడి నుంచి దుండగులు వెళ్లిపోయారు. కాలువలో కొట్టుకొని పోతూ ఒక నిర్మాణాన్ని గట్టిగా పట్టుకొని బయటకు వచ్చాడు. మూడు గంటల పాటు మృత్యువుతో పోరాటం చేసి కాలువ నుంచి బయటకు వచ్చాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో గిరీష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య, ప్రియుడితో పాటు ముగ్గురిని అరెస్టుచేసి రిమాండ్ కు తరలించారు.
పెద్దూరులో త్రీఫేస్ విద్యుత్తుకు శ్రీకారం..
పెద్దూరులో త్రీఫేస్ విద్యుత్తుకు శ్రీకారం.. కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్దూరు
అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు: ట్రంప్
ఇప్పట్లో చర్చలు లేవు: జేడీ వాన్స్ వాషింగ్టన్: ఇరాన్తో రెండోవిడత చర్చలపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. అమెరికా- ఇరాన్ మధ్య ఈనెల 8న రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల విరమణ ముగియడానికి కొన్ని […] The post అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు: ట్రంప్ appeared first on Visalaandhra .
Video: Raghu Kunche Exclusive Interview
The post Video: Raghu Kunche Exclusive Interview appeared first on Telugu360 .
సామాజిక సేవ మనందరి బాధ్యత.. పాయకాపురం, ఆంధ్రప్రభ : కల్వరి ప్రేమ ప్రార్ధన
Hyderabad : మెట్రో రైళ్లన్నీ కిటకిట.. పార్కింగ్ అంతా ఫుల్లు
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి
ఉప్పల్ డిపో వద్ద ఆర్టీసి కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా
మన తెలంగాణ బోడుప్పల్ : ఆర్టీసి కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆర్టీసి కార్మికుల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది.దీంతో బుధవారం ఉప్పల్ డిపో ముందు సమ్మె నిర్వహించారు.ఈ సమ్మె కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. ఆర్టీసి కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో బుధవారం నుంచి ఆర్టీసి జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు ఆర్టీసి కార్మికులు ఉప్పల్ డిపో ముందు సమ్మెకు దిగారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళకుండా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ...ఆర్టీసి కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. ఆర్టీసి కార్మికుల వల్లే తెలంగాణ వచ్చిందని, ఆర్టీసితో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు. గత ప్రభుత్వానికి పట్టిన గతే రేవంత్ ప్రభుత్వానికి పడుతుందని విమర్శించారు. అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడపడం వలన కరీంనగర్ లో ప్రమాదం జరిగిందని, తృటిలో పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా? అని మండిపడ్డారు. కార్మికులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
How did Koratala join NBK’s Project?
It may not be known to many but Koratala Siva met Nandamuri Balakrishna last year and discussed about directing a film. But somehow the talks did not reach the final stages and there are various inside speculations for this. Koratala Siva shares a great bond with a young Tollywood actor and Balayya kept him aside […] The post How did Koratala join NBK’s Project? appeared first on Telugu360 .
హైదరాబాద్లో హైబ్రిడ్ గంజాయి పట్టివేత.. ₹36 లక్షల విలువైన సరుకు సీజ్ #Hyderabad#Excise#OGKush
Summer Effect : ఎండలు ఇన్ని సమస్యలు తెచ్చిపెడుతున్నాయా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి
బస్సు స్టాప్ లేకపోవడంతో.. కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్
సింగపూర్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతుంది
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు #TGSRTC#RTCStrike#Telangana#BusStrike
దశలవారీగా కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తాం: ఆర్ టిసి ఎండి
హైదరాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో ఆర్ టిసి జెఎసి నేతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్ టిసి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఐఎఎస్ అధికారుల కమిటీతో జెఎసి నేతలు సుదీర్థంగా చర్చలు జరిపినప్పటికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కార్మికులు డిపోల ముందు ధర్నాకు దిగారు. ఈ రోజు నుంచి ఆర్ టిసి కార్మికులు సమ్మెకు పిలుపు నివ్వడంతో ఆర్ టిసి ఎండి నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్ టిసి కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని, కార్మికులు డిమాండ్లను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. రాజకీయ లబ్ది కోసమే కార్మికులను నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని కోరారు. ఇప్పటికే కార్మికులు డిపోలకు చేరుకొని ధర్నాకు దిగారు. మాటలు వద్దు అని చేతలే ముద్దు అంటూ నినాదాలు చేస్తన్నారు. కానీ ప్రభుత్వం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడిపించడానికి ప్రయత్నిస్తోంది. పోలీసుల భద్రతాలో బస్సులు నడిపిస్తుండడగా ఆర్ టిసి కార్మికులు అడ్డుకుంటున్నారు.
కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి –వనపర్తి జేఏసీ
కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి – వనపర్తి జేఏసీ వనపర్తిటౌన్, ఆంధ్రప్రభ :
కార్మికుల సమ్మెతో కదలని బస్సులు
కార్మికుల సమ్మెతో కదలని బస్సులు వరంగల్, ఆంధ్రప్రభ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం
Ys Jagan : కడప జిల్లాలో నేడు వైఎస్ జగన్
కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన నేడు రెండో రోజు సాగనుంది
మెట్రో స్టేషన్లకు పోటెత్తిన జనం.. ఆర్టీసీ సమ్మెతో భారీ రద్దీ #telugupost #rtcstrike #metro
శిధిలావస్థలో ఎఫ్.డీ.వో కార్యాలయం
శిధిలావస్థలో ఎఫ్.డీ.వో కార్యాలయం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాలో నాడు ఉమ్మడి
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..?
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం తెల్లవారు జామునుంచి తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇక, తిరుమల వెంకన్నను 73,324 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 22,955 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
Gold Prices Today : హై అలెర్ట్.. బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో తగ్గుదల కనిపించింంది
కరీంనగర్ లో లారీని ఢీకొట్టిన ఆర్ టిసి బస్సు... ప్రయాణికులకు గాయాలు
హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా ఆర్ టిసి కార్మికులు సమ్మె చేపట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను బంద్ చేశారు. ప్రభుత్వం ప్రైవేటు డ్రైవర్ల సాయంతో బస్సులను నడుపుతోంది. కరీంనగర్ 2కు చెందిన బస్సులో ప్రయాణికులను ఎక్కించి ఓ ప్రైవేటు డ్రైవర్ సహాయంతో వరంగల్ కు పంపించారు. అల్గూనుర్ సమీపంలోకి రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఎదురుగా వస్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ వణికిపోయారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన ప్రయాణికులను 108 అంబులెన్స్ లో కరీంనగర్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉగ్రవాదానికి భారత్ ఎప్పటికీ తలొగ్గదు.. పహల్గామ్ ఉగ్రదాడిపై మోడీ..
న్యూఢిల్లీ: గతేడాది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సంతాపం తెలిపారు. ఉగ్రవాదానికి భారతదేశం ఎప్పటికీ తలొగ్గదని, అటువంటి హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఏప్రిల్ 22, 2025న ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. గత ఏడాది ఇదే రోజున జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరించుకుంటున్నాను. వారిని ఎన్నటికీ మరచిపోలేము. ఈ నష్టం నుండి కోలుకుంటున్న బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఒక దేశంగా, మనం దుఃఖంలోనూ, సంకల్పంలోనూ ఐక్యంగా ఉన్నాము. భారతదేశం ఏ రకమైన ఉగ్రవాదానికి తలొగ్గదు. ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావు అని ప్రధాని పేర్కొన్నారు కాగా, గత ఏడాది ఏప్రిల్ 22న, దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్, ప్రతీకారం తీర్చుకునేందుకు.. మే 7న భారత్ సైనిక చర్యను ప్రారంభించి, పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది.
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు కరీంనగర్, ఆంధ్రప్రభ : ఆర్టీసీ బస్సు
సూచిక బోర్డును ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వీరవల్లి టోల్ ప్లాజా వద్ద సూచిక బోర్డును కారు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమేప్రమాదానికికారమనిపోలీసులుభావిస్తున్నారు.
Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది
ఆపదలో అండగా ప్రభుత్వం.. ఖానాపూర్ రూరల్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మండల పరిధిలోని
Karnataka : షాకింగ్.. ఇలా కూడా చేస్తారా.. ఒక యువతి మర్డర్ చేసిన తీరు చూస్తే?
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. పెళ్లి చేసుకోడని అనుమానించిన యువతి ప్రియుడిని దారుణంగా చంపేసింది.
ఆర్టీసీ సమ్మె.. మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన
మోగిన సమ్మె సైరన్.. నిలిచిన ఆర్టీసీ సర్వీసులు
మోగిన సమ్మె సైరన్.. నిలిచిన ఆర్టీసీ సర్వీసులు కొత్తూరు, ఆంధ్రప్రభ : తమ
IPL 2026 : ఐపీఎల్ నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్
నేడు ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది.
Road Accident : ఏపీలో రోడ్ యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
ట్రాఫిక్ పోలీసులకు మిస్ట్ ఫ్యాన్స్ #HyderabadTrafficPolice#MistFans#TrafficPolice#SummerHeat
Tirumala : తిరుమలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. వెంటనే దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. గేల్ వరల్డ్ రికార్డు బ్రేక్
హైదరాబాద్: టీ20 క్రికెట్ లో టీమిండియా బ్యాటర్, సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ పొట్టి ఫార్మాట్లో అభిషేక్ నాలుగోసారి 130+ స్కోరును నమోదు చేశాడు. దీంతో క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ.. నయా రికార్డును నెలకొల్పాడు. ఈ ఫార్మాట్ లో గేల్, ఫించ్ లు చెరో మూడుసార్లు 130 పరుగుల మార్కును దాటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా మంగళవారం రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ కేవలం 68 బంతుల్లో10 ఫోర్లు, 10 సిక్సులతో అజేయంగా 135 పరుగులు చేశాడు. అభిషేక్ తన కెరీర్లో కేవలం 188 మ్యాచ్లలో మాత్రమే ఈ ఘనతను సాధించాడు. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి, సన్రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. 20 ఓవర్లలో 242 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ పూర్తి ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్పై 47 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ఇక, ఏప్రిల్ 25న రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది.
నేటి నుంచే కేదార్నాథ్ దర్శనం
నేటి నుంచి కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పరారీలో ఉన్నారు
KVN Productions: Strict on Megastar’s Film
K Venkata Narayana, the man behind the Prestige Constructions has ventured into South Indian films. He floated KVN Productions and paid big advances to several stars. When Vijay’s last film was in trouble, KVN paid the quoted sum for Vijay and completed the film on time. The film is struggling for release and is occupied […] The post KVN Productions: Strict on Megastar’s Film appeared first on Telugu360 .
టాలీవుడ్ లో విషాదం..చిట్టిబాబు మృతి
సినీ నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గుండెపోటుతో మృతి చెందారు
టాలీవుడ్ లో విషాదం.. నిర్మాత చిట్టి బాబు కన్నుమూత
టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని వరప్రసాద్(చిట్టి బాబు) కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయనకు చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వెైద్యులు తెలిపారు. గుండెపోటు కారణంగా ఆయన చనిపోయారని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Telangana : ఆర్టీసీ సమ్మె అర్థరాత్రి నుంచి ప్రారంభం.. ప్రత్యామ్యాయ ఏర్పాట్లలో ప్రభుత్వం
Telangana : ఆర్టీసీ సమ్మె అర్థరాత్రి నుంచి ప్రారంభం.. ప్రత్యామ్యాయ ఏర్పాట్లలో ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్.. డిపోల వద్ద కార్మికుల నిరసన
తెలంగాణలో అర్దరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసి సమ్మెకు దిగింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్న టీజి ఆర్టీసి జెఎసి స్పష్టం చేసింది. దీంతో అర్ధరాత్రి నుంచే బస్సులు బంద్ అయ్యాయి. సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పలు జిల్లాల్లో డిపోల వద్ద ఆర్టీసి కార్మికులు నిరసనలు చేపట్టారు. ఉప్పల్ డిపో వద్ద నిరసనకు దిగిన కార్మికులకు మద్దతూ తెలుపుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసనలో పాల్గొన్నారు. మరోవైపు, బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.ఇక, ఆర్టీసీ యాజమాన్యం.. యథావిధిగా అద్దె బస్సులు నడుపుతోంది.
IPL 2026 : ఢిల్లీ చిత్తు.. చిత్తు.. హైదరాబాద్ దే గెలుపు
ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది
America - Iran - Ceasefire : అమెరికా - ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు... ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం కీలక ప్రకటన చేశారు
22ndaprilsplstory |క్రీడల ద్వారా మహిళల ఎదుగుదల
22ndaprilsplstory | క్రీడల ద్వారా మహిళల ఎదుగుదల 22ndaprilsplstory | పరిపాలనలో మహిళల
నిత్యం ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. రోజూ దినపత్రికలను తిరగేసేవారికి రోడ్డు ప్రమాదాలు జరగని రోజంటూ ఉండదేమో అనిపించకమానదు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చేంతవరకూ ప్రాణాలకు హామీ లేదంటే అతిశయోక్తి కాదు. ఏవైపునుంచి ఏ వాహనం మీదకు దూసుకువస్తుందో, ఏ మూలమలుపులో మృత్యుదేవత మాటువేసుకుని కూర్చుందో తెలియదు. తాజాగా జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ సమీపాన ఓ బస్సు లోయలో పడి, 21 మంది కన్నుమూసిన ఘటన దిగ్భ్రాంతికరం. కొండప్రాంతంలో బస్సు ప్రయాణిస్తుండగా మూలమలుపు వద్ద దారి కనబడకపోవడంతోనే బస్సు లోయలో పడిపోయినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారణాలు ఏవైనా, ప్రమాదం జరిగాక మృతుల బంధువులకు మిగిలేది తీరని శోకమే. ప్రమాదం మిగిల్చిన అవకరాలతో క్షతగాత్రులు జీవితాంతం దీనంగా బతుకు ఈడ్వవలసిందే. ప్రభుత్వాలు అప్పటికప్పుడు లక్షల్లో నష్టపరిహారాలను ప్రకటించవచ్చుగాక, అవేవీ కోల్పోయిన తమ బంధువులను తిరిగి తీసుకురావడానికి ఎంతమాత్రం సహాయపడవు కదా. వాహనాలను నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై చోదకుల నిర్లక్ష్యం, పరిమితికి మించి అతివేగంగా నడపడం వంటివి ప్రమాదాలకు ప్రధాన హేతువులు కాగా, వాహనాలలోని సాంకేతిక లోపాలు సైతం పదుల సంఖ్యలో ప్రాణాలను కబళిస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. స్లీపర్ బస్సులలో ఉన్నపళంగా మంటలు చెలరేగి, అందులో ఉన్న ప్రయాణికులు సజీవంగా ఆహుతి అవుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి రాత్రివేళ బయల్దేరిన ఓ ప్రవేటు బస్సు, బయల్దేరి నాలుగు కిలోమీటర్లు దాటిందో లేదో మంటల్లో చిక్కుకోవడం ఈ తరహా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయనడానికి నిదర్శనం. ఇలాంటి ప్రమాదాలకు గల కారణాలపై నిపుణులతో అధ్యయనం జరిపించాలన్న ఆలోచన, ఒకవేళ అధ్యయనాలు జరిగినా వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలన్న చిత్తశుద్ధి పాలకుల్లో లోపిస్తున్నాయి. ప్రపంచంలోని వాహనాలలో భారతదేశంలో ఉన్నవి కేవలం ఒక్క శాతమే అయినా రోడ్డు ప్రమాదాల సంఖ్యలో మాత్రం మన దేశం అగ్రస్థానంలో ఉండటం శోచనీయం. ఏటా భారతదేశంలో 4.8 లక్షల ప్రమాదాలు జరుగుతుంటే, అందులో లక్షా డబ్భైవేలమంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారట. దేశంలో సగటున రోజూ 474 మంది రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి నెట్ వర్క్ ఉన్నది భారతదేశంలోనే. కానీ, ఇక్కడ జాతీయ, ప్రధాన రహదారులలో అనేక లోపాలు ఉన్నాయని, బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన చోట్ల కూడా మరమ్మతులు అనుకున్నంత వేగంగా సాగడం లేదని కేంద్ర రోడ్డు రవాణా మంత్రే స్వయంగా పార్లమెంటులో ఆ మధ్య వాపోవడం మన రహదారుల దుస్థితికి అద్దం పడుతోంది. రోడ్డు ప్రమాదాలపై సందర్భం వచ్చినప్పుడల్లా సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెడుతూనే ఉన్నా, అవేవీ పాలకుల చెవికి ఎక్కడం లేదు. రాజస్థాన్ లోని ఫలోడి, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల్లో గత ఏడాది నవంబర్ 2, 3 తేదీల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ ప్రమాదాలకు కారణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన మార్గదర్శకాలను రెండు రోజుల క్రితమే ప్రకటించింది. సురక్షితమైన రహదారి ప్రయాణం రాజ్యాంగంలోని జీవించే హక్కు (ఆర్టికిల్ 21) లో అంతర్భాగమని, ప్రమాద రహిత ప్రయాణం ప్రతి పౌరుడి హక్కు అని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు పాలనాపరమైన నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలే ప్రాణనష్టానికి కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో రహదారి భద్రతను రాజ్యంగాబద్ధమైన బాధ్యతగా పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. నిర్దేశిత ప్రాంతాల్లో మినహా భారీ వాహనాలను జాతీయ రహదారులపై ఎక్కడబడితే అక్కడ నిలపకూడదని, రియల్ టైమ్ అలెర్టులు, జిపిఎస్ ఆధారిత ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలు, ఇ- చలాన్ల ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి జిల్లాలో జాతీయ రహదారులు ఉన్న చోట జిల్లాస్థాయిలో రహదారి భద్రత టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిపై దృష్టిపెట్టాలని హితవు చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలను శిరోధార్యంగా భావించి, అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రమాదం జరిగినప్పుడల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, నష్ట పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోగానే సరిపోదని గుర్తించాలి.
భారత్కు చావోరేవో.. నేడు సఫారీ మహిళలతో కీలక పోరు
జోహెన్నస్బర్గ్: వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన భారత మహిళా క్రికెట్ జట్టుకు బుధవారం సౌతాఫ్రికాతో జరిగే మూడో టి20 మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. ఇక ఇప్పటికే రెండు విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఇందులోనూ గెలిచి సిరీస్ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. రెండు మ్యాచుల్లోనూ టీమిండియా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయింది. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలం కావడంతో భారత్కు వరుస ఓటములు తప్పలేదు. ఇలాంటి స్థితిలో మూడో టి20 సవాల్గా మారింది. సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలవడం తప్పించి మరో మార్గం భారత్కు లేకుండా పోయింది. ఆతిథ్య సౌతాఫ్రికా మాత్రం విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. రెండు విభాగాల్లో బలంగా ఉన్న సఫారీ టీమ్ సిరీస్పై కన్నేసింది.
ప్రియుడి కళ్లకు గంతలు కట్టి... కూర్చీలో కట్టేసి... సజీవదహనం చేసిన ప్రియురాలు
బెంగళూరు: ప్రియుడు మోసం చేస్తాడనే అనుమానంతో ప్రేమ పేరుతో అతడిని కూర్చికి కట్టేసి పెట్రోల్ పోసి దహనం చేసింది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని బైదరహళ్లి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంజనానగర్ లో ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. తుమకూరుకు చెందిన కిరణ్ పరిచయం కావడంతో అతడితో ప్రేమలో పడింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. గత కొంతకాలంగా యువతిని యువకుడు పట్టించుకోకపోవడంతో అనుమానం పెంచుకుంది. కిరణ్ తనని పెళ్లి చేసుకోడేమోనని అనుమానం కలిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించింది. ప్రియుడితో సరసాలు జరిపిన తరువాత వినూత్నంగా ప్రేమను తెలియజేస్తానని అతడిని కళ్లకు గంతలు కట్టి కూర్చీకి కట్టేసింది. అనంతరం అతడిపై పెట్రోల్ పోసి తగలబెట్టింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకునేసరికి కూర్చీలో కిరణ్ సజీవదహనమయ్యాడు. తాను బాత్రూమ్ లో ఉన్నప్పుడు కిరణ్ కూర్చీలో కాలిపోయాడని నాటకం మాడింది. పోలీసులు యువతిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
22ndaprilchintana |చాణక్య నీతిలో శిరస్సు ప్రాధాన్యం
22ndaprilchintana | చాణక్య నీతిలో శిరస్సు ప్రాధాన్యం 22ndaprilchintana | గౌరవం, విధేయతలో
ఆర్ టిసి బస్సు బోల్తా: పది మంది ప్రయాణికులకు గాయాలు
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మార్కపురం జిల్లాలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు బోల్తాపడింది. తుమ్మలబైలు గ్రామశివారులో ఆర్టిసి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. పది మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ౩౦ మంది ప్రయాణికులతో శ్రీశైలం నుంచి మార్కపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు.
TGSRTC Indefinite Strike From Midnight: Talks Fail, Employees Press 32 Demands
Employees of Telangana State Road Transport Corporation (TGSRTC) are set to begin an indefinite strike from Tuesday midnight after talks failed to break the deadlock between unions and management. The agitation could disrupt bus services across Telangana and affect lakhs of daily commuters. The strike is being led by the Joint Action Committee (JAC), which […] The post TGSRTC Indefinite Strike From Midnight: Talks Fail, Employees Press 32 Demands appeared first on Telugu360 .
22ndaprileditorial |చర్చలు విఫలమైతే యుద్ధ భయం..
22ndaprileditorial | చర్చలు విఫలమైతే యుద్ధ భయం.. 22ndaprileditorial | శాంతి చర్చలకు
22aprilpahalgam |మరువని భారత్, వదలని సైన్యం!
22aprilpahalgam | మరువని భారత్, వదలని సైన్యం! 22aprilpahalgam | పహల్గామ్లో నెత్తురోడిన
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్ర భుత్వం రైతులకు అండగా నిలుస్తూ రై తు భరోసా పథకం కింద రెండోవిడత ని ధులను విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తె లిపారు. దీంతో 45,11,947 మంది రైతులు లబ్ధి పొందనున్నారని, ఈ క్ర మంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,206.06 కోట్లు నేడు (బుధవారం) జ మ కానున్నాయని మంత్రి తెలిపారు. ఇ ప్పటికే నర్మెట్టలో ఏర్పాటు చేసిన ఆయి ల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సందర్భంగా మొదటి విడతలో భాగంగా రూ. 3,446.94 కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేశామని, ఈ రెండు విడతలు కలిపి ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద మొత్తం రూ. 5,653 కోట్లు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. దీని ద్వారా మొత్తం 71.06 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. రైతుల సంక్షేమానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని , వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. మొత్తం సోమవారం నాటికి 71,05,572 మంది రైతుల ఖాతాల్లో రూ.5,653,00,36,827 కోట్లు జమ అయ్యాయని మంత్రి తుమ్మల తెలిపారు.
హడావుడి ‘బిల్లు’తో సాధించిందేమిటి?
సెప్టెంబర్ 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశాల ప్రత్యేక భేటీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి నోచుకోకపోవడంతో గత 12 ఏళ్లలో మొదటిసారిగా పార్లమెంట్లో ఈ ప్రభుత్వం అనూహ్యమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. బహుశా గత మూడున్నర దశాబ్దాలలో మొదటిసారిగా ఓ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో ఓటమికి గురయింది. అయితే ఈ బిల్లు ఓటమితో ప్రతిపక్షాలను ‘మహిళా వ్యతిరేకులు’ అంటూ వెంటనే ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని మోడీ, ఇతర నాయకులు దిగడం మినహా అందుకు దారితీసిన కారణాల గురించి ఆత్మపరిశీలన చేసుకొనే ప్రయత్నం చేయడం లేదు. తమకు మూడింట రెండు వంతుల మెజారిటీ లేదని తెలిసి కూడా, ముందుగా ఎటువంటి సంప్రదింపులు, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొనే ప్రయత్నం చేయకుండా కీలకమైన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అర్ధాంతరంగా ఈ బిల్లులను ఎందుకు తీసుకు వచ్చారో ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకనే ఈ ప్రభుత్వం ఎవ్వరి విశ్వాసాన్ని పొందలేకపోతున్నది. చివరకు బిజెపి నేతలు సైతం ప్రభుత్వ ధోరణిని అర్ధం చేసుకోలేకపోతున్నారు. మెజారిటీ లేనప్పుడు పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపి, ఇతర పక్షాల మద్దతు కూడదీసుకుని ప్రయత్నం చేయవచ్చు గదా? అనే ప్రశ్నలు ఆ పార్టీ నాయకులతోనే తలెత్తుతున్నాయి. ‘బిజెపి 11ఏళ్లుగా అధికారంలో ఉన్న మా అనుభవంలో, ఒక మహిళను ప్రధానమంత్రిగా నియమిస్తామని బిజెపి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినా కూడా, మేము వారిని నమ్మము’ అంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న విశ్వాస రాహిత్యాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ప్రతి రాష్ట్రానికి సీట్ల సంఖ్యను 50 శాతం పెంచేందుకు అధికారిక సవరణ తీసుకు రావడానికి వీలుగా సభా కార్యకలాపాలను గంటసేపు నిలిపివేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదనకు, లోక్సభ చర్చ సందర్భంగా అఖిలేష్ ఇచ్చిన ఈ పదునైన సమాధానం, ప్రస్తుత రాజకీయాల స్థితిని స్పష్టం చేస్తుంది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యవస్థను కొనసాగించడంలో సహకరించే పార్లమెంటరీ సంప్రదాయాలలో కీలకమైన ‘సంప్రదింపులు’ ప్రక్రియకు ఈ ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలివ్వడంతో ఈ సమస్య ఏర్పడింది. 1991లో పివి నరసింహారావు ప్రధాని కాగానే నాటి ఆర్థిక దుస్థితిని తట్టుకునేందుకు రూపాయి విలువ తగ్గించాలని, అందుకోసం వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయమని ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కోరారు. కానీ ప్రధాని మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ సీనియర్లు అందరూ అందుకు వ్యతిరేకిస్తారని చెబుతూ తనకు కొంత సమయం ఇస్తే పరిష్కారం ఆలోచిస్తానని చెప్పి పంపారు. ఓ గంట తర్వాత రూపాయి విలువ తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయమని మన్మోహన్ సింగ్ను ఆదేశించారు. ఓ గంటలో ఏ అద్భుతం జరిగిందో తెలియక ఆయన తికమక చెందారు. విచారించగా, వెంటనే పివి నరసింహారావు నాటి ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయీకి ఫోన్ చేసి ఈ విషయమై చర్చించి, ఆయన సహకారం కోరారు. అందుకు ఆయన ఆమోదం తెలపడంతో ప్రతిపక్షం నోరువిప్పకపోతే ఇక అభ్యంతరం ఎవ్వరు చెబుతారు? అంటూ నాటి ప్రభుత్వం ముందుకుపోయింది. వాజ్పేయీ ప్రభుత్వంలో సైతం కీలక అంశాలపై పార్లమెంట్లో బిల్లులు తీసుకువచ్చే ముందు స్వయంగా ప్రధాని, సీనియర్ మంత్రులైన అద్వానీ, జశ్వంత్ సింగ్, జార్జ్ ఫెర్నాండెస్ వంటి వారు ప్రణబ్ ముఖర్జీ వంటి ప్రతిపక్ష ప్రముఖులతో సవివరమైన సమాలోచనలు జరిపేవారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సైతం ప్రధాని లేదా సీనియర్ మంత్రులు ప్రతిపక్ష నేతలతో తరచూ సమాలోచనలు జరిపేవారు. లేదా సాంకేతిక అంశాలైతే సంబంధిత శాఖల ఉన్నతాధికారులను పంపి ప్రతిపక్ష నాయకులకు వివరించమనేవారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు, ప్రత్యేక సమయాలలో స్వయంగా ప్రధానులు అఖిలపక్ష సమావేశాలు జరిపేవారు. కానీ నరేంద్ర మోడీ ఈ సంప్రదాయాలు అన్నింటికీ తిలోదకాలిచ్చారు. ప్రతిపక్షాలతో మాత్రమే కాకుండా సొంత పార్టీలో సైతం ఎవ్వరితో సంప్రదింపులు జరపడం జరగడం లేదు. స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానికి లేఖలు రాసారు. ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపవచ్చని, ఎన్నికల ప్రచారం మధ్యలో హడావుడిగా ఎందుకని ప్రశ్నించారు. ఈ బిల్లుల గురించి వివరణ ఇచ్చేందుకు అఖిలపక్ష సమావేశం జరపమని కోరారు. కానీ ప్రభుత్వం నుండి స్పందన లేదు. రాజ్యాంగ సవరణపై జరిగిన చర్చలో 103 మంది పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. వారంతా మహిళా రిజర్వేషన్ల అమలుకు సంపూర్ణ మద్దతు తెలిపారు. 2023లో ఆమోదించిన బిల్లును వెంటనే అమలు జరపమని అప్పుడే కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ, ఆ విషయాన్నీ నియోజకవర్గాల పునర్విభజన, జనగణనతో కలపాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాధానం లేదు. అంటే ప్రభుత్వానికి రహస్య అజెండా ఉందని అనుమానించాల్సి వచ్చింది. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల సంఖ్య పెంచుతామని హోంమంత్రి అమిత్ షా తన ప్రసంగంలో చెప్పడమే గాని, ఆ మేరకు బిల్లుల్లో ఎక్కడా లేదు. ఈ విషయాన్నీ చివరకు స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రశ్నించగా, ఓ గంటసేపు సమావేశానికి విరామం ఇస్తే, బిల్లులో మార్పులు చేస్తానని అమిత్ షా చెప్పడం చూస్తుంటే అవసరమైన కసరత్తు లేకుండా, రాజకీయ ప్రయోజనాలకోసం ఈ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారని అభిప్రాయం బలపడుతుంది. పైగా, లోక్సభలో ఓ రోజంతా చర్చించిన తర్వాత, ఆ రాత్రికి హడావుడిగా 2023లో ఆమోదించిన బిల్లును వెంటనే అమలులోకి తెస్తూ రాష్ట్రపతి ఉత్తరువు జారీచేయడం గమనిస్తే పార్లమెంటరీ వ్యవస్థపట్ల ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనతగా వ్యవహరిస్తుందో వెల్లడి అవుతుంది. అవసరమైన కసరత్తు చేయలేకపోవడంతో రాజ్యాంగ సవరణకు తగు మద్దతు పొందటంలో విఫలమైన ప్రభుత్వం ప్రతిపక్షాలను ‘మహిళా వ్యతిరేకులు’గా చిత్రీకరిస్తూ ఓ భారీ ప్రచారాన్ని చేపట్టడం ప్రభుత్వ ఉద్దేశాలను బహిర్గతం చేస్తుంది. యుద్ధాలలో, తీవ్రవాదుల దాడులలో, మావోయిస్టుల ఆపరేషన్లలో మహిళలను ‘రక్షణ కవచం’గా ఏర్పాటు చేసుకొని, హింసాయుత దాడులకు పాల్పడుతూ ఉండటం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. అటువంటి దాడులను ‘పిరికితనంతో పాల్పడే చర్య’గా భావిస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రభుత్వ ధోరణి సైతం అందుకు భిన్నంగా లేదు. అందుకనే దేశసమాఖ్య సమతుల్యతను దెబ్బతీసేందుకు మహిళలను రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకొనే, నియోజకవర్గాల పునర్విభజనకు పాల్పడుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పుడు, మరో పదేళ్ల వరకు అమలు సాధ్యం కాదని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు అకస్మాత్తుగా అమలుకు పూనుకోవడం, అర్ధాంతరంగా పార్లమెంట్ సమావేశాలు జరపడం గమనిస్తుంటే నిగూఢమైన ఎత్తుగడ ఉందని స్పష్టం అవుతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి దారితీసిన సంఘటనల క్రమం గమనిస్తే ఈ ప్రభుత్వం పట్ల డిఎంకె, ఇతర ప్రతిపక్షాలలో అవిశ్వాసం ఎందుకు పెరిగిందో స్పష్టం అవుతుంది. మార్చి 22న, బడ్జెట్ సమావేశాల మధ్యలో, 2029 లోక్సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసే మార్గాలపై చర్చించడానికి అమిత్ షా ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా, చిన్న చిన్న బృందాలుగా పిలిచారు. అనేక ప్రధాన పార్టీలు షా సమావేశానికి హాజరుకాకుండా, అఖిలపక్ష సమావేశాన్ని కోరాయి. సమావేశానికి హాజరైన పార్టీలు ఆయన మాటలు విన్నప్పటికీ, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ ముగిసే ఏప్రిల్ 29 తర్వాత ఈ చర్చను నిర్వహించవచ్చని చెబుతూ, మరింత వివరంగా చర్చించాలని కోరాయి. అయినప్పటికీ, ప్రభుత్వం ముందుకు వెళ్లి ఏప్రిల్ 16- 18 సమావేశాలను ప్రకటించింది. ఈ వారం ప్రారంభంలో పంపిణీ చేసిన ముసాయిదా బిల్లులలో, కేవలం మహిళలకు సాధికారత కల్పించడం కాకుండా, దేశ ‘రాజ్యాంగ స్వరూపాన్ని’ మార్చే ప్రయత్నం ఉందని ప్రతిపక్షం భావించింది. జాతీయ రాజకీయ వేదికపై బిజెపి ఒక ఆధిపత్యశక్తిగా అవతరించినప్పటి నుండి చూస్తే, మొదటిసారి ప్రతిపక్షాలు అత్యంత ఐక్యతను ప్రదర్శించినట్లు కనిపిస్తున్నాయి. దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న బిజెపికి, అది అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి భారీ శాసనపరమైన ఓటమిని రుచి చూపించారు. గతంలో మాదిరిగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను చూపి భయపెట్టడం ద్వారా ప్రతిపక్షాలలో చీలిక తీసుకువచ్చే ప్రయత్నాలు ఫలించలేదు. టిఎంసి, సమాజ్వాదీ పార్టీ ఎంపిలు ఓటింగ్ లో పాల్గొనకుండా చేసేందుకు ఆయా పార్టీలలో కీలకమైన నేతలపై ఒత్తిడులు తెచ్చిన్నట్లు తెలిసింది. అందుకనే మొదటిరోజు కనీసం ఏడుగురు టిఎంసి ఎంపిలు సభకు హాజరుకాలేదు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేరుగా ఆయా నాయకులకు ఫోన్ చేసి, వారంతా ఓటింగ్లో పాల్గొనేటట్లు చేయగలిగారు. ఈ బిల్లులను తిరస్కరించడంలో ప్రతిపక్ష పార్టీలు అందరూ తమ తమ రాష్ట్రాలలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకోకుండా విశాల జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి వ్యవహరించడం అత్యంత ప్రశంసనీయమైన పరిణామం అని చెప్పవచ్చు. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీకి మాత్రం అపారమైన ప్రశంసలు లభించాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ఉత్తరప్రదేశ్ అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వ చర్యలను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలకు ఆ పార్టీకి చెందిన 37 మంది ఎంపిలు అందరూ సంపూర్ణ మద్దతు తెలపడం గమనార్హం. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఓ ప్రాంతీయ పార్టీ వ్యవహరించిన తీరు ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రాంతీయ పార్టీలకు చెంపపెట్టు కాగలదు. చలసాని నరేంద్ర 98495 69050
దాదాపు మూడు దశాబ్దాల కల కలగానే మిగిలిపోనుందా అనే సందేహం మహిళలకే కాదు స్త్రీల ఉన్నతికి పాటుపడే వారందరి మదిలోమెదులుతున్న ప్రశ్న. 131 రాజ్యాంగ సవరణ మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడంపై రకరకాల అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. మహిళా బిల్లు వీగిపోవడం ఇప్పుడు కొత్తేంకాదు. సుమారు ఆరు ఏడు సార్లు అయింది. ఎన్డిఎ కూటమి ఏమో మహిళా బిల్లుకు డీలిమిటేషన్ కలుపడంద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్ష నేతలు వ్యతిరేకించి ఓటు వేశారని అర్థమైంది. పార్లమెంట్ ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు రావడంతో ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతు 352 మెజారిటీ దక్కలేదు. 2/3 మెజారిటీకి 54 ఓట్లు తక్కువపడ్డాయి. మహిళా బిల్లు ఎన్డిఎ కుట్రలో భాగమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బిల్లు 2011 జనాభా లెక్కల ప్రకారం డీమిలిటేషన్తో ముడిపెట్టి ఓటింగ్ పెట్టడమే తప్పిదమని, బిజెపి చాణక్య నీతికి మించి అత్యుత్సాహం చూపుతున్నదని బలంగా వాదిస్తున్నారు ఇండియాకూటమి నేతలు. ఒబిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీ రిజర్వేషన్పై కూడా స్పష్టతలేదు. అందుకే విపక్షాలు మద్దతు తెలుపలేదు. మహిళా బిల్లు వ్యతిరేకించిన వారిని దేశప్రజలు క్షమించరని, మహిళలను ఓటు అడిగే నైతిక హక్కు లేదంటుంది ఎన్డిఎ కూటమి. మహిళా బిల్లుపై ఎవ్వరికి ఎంత బాధ్యత ఉంది అనేది భవిష్యత్తులో తేలనుంది. ఎవరి వాదనలు ఎలా ఉన్న మహిళలు చట్టసభలలోకి వెళ్లడం వారి హక్కు ఇకనైనా మహిళలపై గౌరవంతో వీలైనంత త్వరగా మహిళా బిల్లు ఆమోదానికై కలిసికట్టుగా పనిచేయాలి. మహిళా బిల్లుకు చట్టబద్ధతకు ఎన్డిఎ కూటమి ఆమోదించేలా ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత విపక్షాలపై ఉంది. ఎవరి పాత్ర వారు సమర్థవంతంగా నిర్వహించి చిత్తశుద్ధి కాపాడుకుంటారో ఆ పార్టీలను మహిళా లోకం గుర్తిస్తుందని మారువరాదు. దేశంలో కొన్ని రాష్ట్రాలు స్వయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చిన వారి అధికారులను కూడా తమ ఇంట్లో వారు అధికార దర్పం చాటుకుంటున్నారు. మహిళా ప్రజాప్రతినిధులకు పూర్తి స్వేచ్ఛ లేదనే చెప్పవచ్చు. సమాన హక్కులతోపాటు చట్టసభల రిజర్వేషన్ కల్పించినప్పుడే మహిళలకు న్యాయం సంపూర్ణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా నిస్వార్థంగా మహిళా బిల్లును ఆమోదం తెలిపేలా చేసి ఉంటే మహిళల దృష్టిలో బిజెపికి ప్రత్యేకమైన ఆదరణ ఉండేదేమో. రాజకీయ దూరదృష్టితో మహిళా బిల్లును కావాలనే సంపూర్ణ మద్దతు తెలుపడం లేదా అనే ఆలోచన మేధావులు, రాజకీయ విశ్లేషకులు, విద్యావంతులలో వస్తుంది. ఎందుకంటే జనాభా, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలి అంటున్నాం. చట్టసభలలో కూడా 50% జనాభా ఉన్న మహిళలకు రిజర్వేషన్ ఎక్కడ ఉంది, వారికి రావాల్సిన వాటా హక్కు ఇవ్వాలి కదా, ఎందుకు జాప్యం చేస్తున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదిఏమైనప్పటికీ మహిళా బిల్లు రావాలి ఎందుకంటే శాసన నిర్మాణ, అభివృద్ధిలో మాహిళల పాత్ర ఉండాలి. ఈ సృష్టిలో నింగి నుండి నేల వరకు మహిళామణులు సేవలు అందిస్తున్నారు. రాజకీయాలలో మాత్రం మహిళలకు రావాల్సిన 33% పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 1/3 వంతు సీట్లు రిజర్వేషన్ అమలు చేయాలి కానీ మహిళా బిల్లు సుదీర్ఘ కాలంగా ఆమోదం పొందలేకపోయింది. చివరగా మహిళలు చైతన్యం అయితే తప్ప బిల్లు ముందుకు సాగదు. మహిళలు ఉద్యోగ విధులు నిర్వహించడమే కాకుండా ఇంట్లో వారికి సేవలు అందిస్తూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే స్త్రీ అంటే అబల కాదు సబల కావాలంటూ వీర వనితలను ఆదర్శంగా చూపెడుతాము. అలాంటిది దేశ రాజకీయాల్లో ఆశించిన ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. ఎందుకంటే స్వాతంత్య్ర పోరాటం మొదలుకుని సామాజిక ఉద్యమాల వరకు శంఖారావం పూరించిన ఘనత స్త్రీలదే అని చరిత్ర తెలుపుతుంది. స్త్రీలు ఏకమై కదంతొక్కుతూ ఉప్పెనలా కదిలితేనే మహిళా బిల్లు ఆమోదానికి అడుగులు పడతాయి. మహిళలను గౌరవించుకుంటూ ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఘనంగా నిర్వహిచుకుంటూ మహిళలో చైతన్యం రావాలని నినదిస్తూ మహిళా బిల్లుపై అధికార, ప్రతిపక్షాలు మాటలు కోటలు దాటుతాయి. ఆచరణలోకి వచ్చే సరికి శూన్యం. పార్టీలు రాజకీయాలకు అతీతంగా మహిళల అభ్యున్నతి ముఖ్యమని భావించినప్పుడే మహిళా బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. ప్రపంచ ఉద్యమాలలో సైతం మహిళా పాత్రయే కీలకమైంది, మహిళలు వారి హక్కుల కోసం ప్రశ్నించే గళాలతో నినదించి పోరాడిన సందర్భాలు చూశాం. అదే ఒరవడితో మహిళా బిల్లుకై ఒక్కటై పోరాడాలి. 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి వారి హక్కులకోసం పని చేస్తుంది. ప్రతి ఏటా మహిళల సాధికారతకై ఒక థీమ్ తీసుకు వస్తూ వారి అభివృద్ధిని ప్రోత్సాహిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పురుషులకు దీటుగా పోటీపడి అవార్డులు, రివార్డులు సాధిస్తున్నా వారి హక్కులను కాలరాస్తున్నాం. మహిళలను ప్రధానంగా పట్టిపీడించిన కొన్ని రుగ్మతలు బాల్యవివాహాలు, దేవదాసీ, సతీసహగమనం, నిరక్షరాస్యత వంటివి వారి వెనుకబాటుకు కారణమైనవని గతం తెలుపుతుంది. దశాబ్దాల కాలం తర్వాత మహిళలు చైతన్యమై సమాజంలో ముందుకు వెళ్తున్న తరుణంలో మహిళా రిజర్వేషన్ వారికి తోడ్పాటు అందిస్తే రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతి సాధిస్తారు. ఒక్కప్పుడు మహిళ అంటే వంట గదికే పరిమితం అనే ఆంక్షలను తెంచుకుని నేడు దేశాభివృద్ధిలో మహిళలదే పైచెయ్యిగా ఉంది. మహిళ అంటే ఒక శక్తిగా భావిస్తూ మహిళా బిల్లుకు జనమంతా జాగృతమై మద్దతు తెలుపుదాం. మహిళల పురోగతికి కృషి చేసిన మహనీయులైన కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, రాజారామోన్ రాయ్, జ్యోతిరావు ఫూలే వంటివారి ఆశయాలను గౌరవిస్తూ మహిళ సంక్షేమ, అభివృద్ధి చైతన్యాన్ని కాంక్షిస్తూ మహిళా బిల్లుకై ఏకమై ఉద్యమిద్దాం. స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడిన వీరవనితలు ఝాన్సీ లక్ష్మిబాయ్, సరోజిని నాయుడు, దుర్గాబాయ్ దేశ్ముఖ్ వంటి వారి త్యాగాలను యాదికి చేసుకుంటూ, స్త్రీ జనోద్ధారణకు కృషి చేసిన సావిత్రీ బాయ్ ఫూలే, తెగువకు ఐల్లమ్మ, పౌరుషానికి రాణి రుద్రమదేవి నేటికి ఆదర్శప్రాయులు వారి స్ఫూర్తితో మహిళలు సంఘటితం కావాలి, మహిళా బిల్లుకు ఏకమై గళమెత్తాలి. మిద్దె సురేష్ 97012 09355
వామపక్షాలన్నీ కలిస్తేనే గెలుపు
భారతదేశ సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై ఎర్రజెండా ఒక చెరగని సంతకం. దానికో ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. అయితే, వందేళ్ల ప్రస్థానం తర్వాత కూడా ‘అధికారం’ అనే గమ్యం ఎందుకు అగమ్యగోచరంగా మారింది? సిద్ధాంతం పటిష్టంగా ఉన్నా, ఆచరణలో ఎక్కడ అడుగులు తడబడ్డాయి? ప్రజల నాడిని పట్టుకోవడంలో జరిగిన పొరపాట్లను సమీక్షించుకోవాలి. ‘ప్రజల నుండి... ప్రజల వైపుగా’ ఒక నూతన ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కేవలం సిద్ధాంతాల చట్రంలో కాకుండా, భారతీయ మట్టి వాసనను, ఇక్కడి మనుషుల మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి. ‘పుస్తకంలో ఉన్న సిద్ధాంతం కేవలం అక్షరం.. ప్రజల ఆకలిని తీర్చినప్పుడే అది అధికారం!’ ‘పుస్తకాల్లో ఉన్న మార్క్సిజం విజ్ఞానాన్ని ఇస్తుంది.. కానీ ప్రజల కళ్లలో ఉన్న కన్నీటిని తుడిచే మార్క్సిజం అధికారాన్ని ఇస్తుంది.’ కమ్యూనిజం అంటే కేవలం రష్యా, చైనా విప్లవాల చరిత్రకాదు. భారతదేశంలో ఎర్రజెండా గెలవాలంటే, అది ఇక్కడి సామాజిక రుగ్మతలపై ఎక్కుపెట్టిన అస్త్రం కావాలి. అణచివేత ఎక్కడ ఉన్నా అక్కడ ఎర్రజెండా ఉండాలి. అది ఆర్థిక దోపిడీ కావచ్చు లేదా వేలఏళ్లుగా పేరుకుపోయిన కులవివక్ష కావచ్చు. మనువాద భావజాలం సృష్టించిన అగ్ర-నీచ భేదాలను తుడిచివేయడంలో ఎర్రజెండా మహాత్మా జ్యోతిరావు ఫూలే, - అంబేద్కర్ ఆశయాలను’ తన భుజానికెత్తుకోవాలి. భారతదేశం కేవలం ‘వర్గాల’ దేశం కాదు, ఇది ‘వర్ణాల’ దేశం కూడా. ఇక్కడి పేదరికం వెనుక కేవలం ఆర్థిక కారణాలే లేవు, శతాబ్దాల సామాజిక వివక్ష ఉంది. మార్క్సిజాన్ని కేవలం ఆర్థిక కోణంలోనే చూడటం వల్ల, భారతీయ ఆత్మ అయిన ‘కులం’ అనే సంకెళ్లను తెంచడంలో ఎర్రజెండా కొంత వెనకబడింది. ‘మనువాదం నుంచి మనిషికి విముక్తి పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి శ్రమకు విముక్తి’ అనే రెండు కత్తులను ఎర్రజెండా ధరించాలి. అప్పుడే అది సామాన్యుడి ఆయుధమవుతుంది. ప్రజల నుండి కమ్యూనిస్టు నాయకులు పుట్టాలి. నాయకత్వం అనేది ఒక హోదాగా కాకుండా, ప్రజల కష్టాలను మోసే బాధ్యతగా మారాలి. సామాన్యుడికి తన కష్టం వస్తే గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఎర్రజెండా కార్యకర్త కావాలి. నాయకులు ఎసి గదుల్లో చర్చలు జరపడం కంటే, ఎండలో శ్రమిస్తున్న కూలీతో, పొలంలో ఉన్న రైతుతో, ఐటి ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కొంటున్న యువతతో మమేకం కావాలి. నాయకత్వం అంటే ప్రసంగాలు చేయడం కాదు, ప్రజల కష్టాల్లో భాగస్వామి కావడం. కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వం ప్రజాబాహుళ్యం నుంచి, ముఖ్యంగా దళిత, బహుజన, మైనారిటీ వర్గాలనుంచి ఎదగాలి. నాయకుడు ప్రజలకు ‘మార్గదర్శి’గా మాత్రమే కాదు, ‘సొంత మనిషి’గా కనిపించాలి. ‘నాయకుడు అంటే జెండా పట్టుకునేవాడు కాదు, ప్రజల గుండె చప్పుడిని తన జెండాగా మార్చుకునేవాడు.’ భారతదేశం మత విశ్వాసాలు కలిగిన దేశం. ఇక్కడ ‘నాస్తికత్వం’ కంటే ‘మానవత్వం’ ముఖ్యం. భారతీయ సామాన్యుడికి మతం అనేది ఒక భావోద్వేగం. ‘మతం మత్తుమందు’ అనే నిర్వచనాన్ని నేరుగా ప్రజలపై రుద్దడంవల్ల ఉద్యమం ప్రజలకు దూరమైంది. మతాన్ని విమర్శించడం కంటే, మతం పేరుతో సాగుతున్న రాజకీయాలను, దోపిడీని ఎండగట్టాలి. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని నిర్మించాలి. ఆధ్యాత్మికతకు, మతోన్మాదానికి మధ్య ఉన్న తేడాను గుర్తించాలి. శ్రమజీవుల సంస్కృతిని, జానపద కళలను, గ్రామదేవతల పండుగలను విప్లవ భావజాలంతో అనుసంధానించాలి. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూనే, వారిని దోపిడీ నుంచి రక్షించాలి. ‘ముక్కలైన ఎరుపు - ఒక్కటి కావాలి’. వ్యక్తిగత ఇగోలను పక్కన పెట్టి, పేదవాడి రాజ్యస్థాపన కోసం అన్ని వామపక్షాలు ఒకే జెండా కిందకు రావాలి. అప్పుడే అది ప్రజల్లో గెలుపుపై ధీమాను నింపుతుంది. సిద్ధాంతపరమైన చిన్న చిన్న భేదాలవల్ల పార్టీలు ముక్కలవ్వడం కేవలం శత్రువుకే లాభం చేకూరుస్తుంది. చీలికలు ఎప్పుడూ బలహీనతనే ఇస్తాయి. సిద్ధాంత చర్చల పేరుతో ముక్కలైన ఎరుపు ఇవాళ ఒక్కటవ్వాల్సిన చారిత్రక సంధికాలంలో ఉంది. కార్యకర్తలు, నాయకులు ఇగోలను పక్కన పెట్టి ‘ఒకే జెండా ఒకే అజెండా’ వైపు రావాలి. పది మంది పది దిశల్లో లాగితే రథం కదలదు, అందరూ ఒక్కటై లాగితేనే అది విజయ తీరాలకు చేరుతుంది. కమ్యూనిస్టులు పాతకాలపు నినాదాలకు పరిమితం కాకూడదు, ఆధునికతను ఆహ్వానించడం ద్వారా 21వ శతాబ్దపు సవాళ్లును అధిగమించాలి. నేడు శ్రమ దోపిడీ డిజిటల్ రూపంలో జరుగుతోంది. సోషల్ మీడియాను, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. యువతకు అర్థమయ్యే భాషలో, ఆసక్తికరమైన పద్ధతుల్లో సమానత్వం గురించి చెప్పాలి. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కాదు.. అభివృద్ధి అంటే ఉచిత విద్య, మెరుగైన వైద్యం, ప్రతి చేతికీ పని, పనికి తగ్గ వేతనం ఉండాలని బలంగా చాటాలి. కార్పొరేట్ శక్తుల నుంచి ప్రకృతి వనరులను రక్షించాలి. ఆధునిక టెక్నాలజీని సామాన్యుడి సేవలో ఉపయోగించాలి. నేటి తరం యువతకు ఐటి ఉద్యోగాలు, స్టార్టప్లు, డిజిటల్ స్వేచ్ఛ ముఖ్యమని గుర్తించాలి. ‘జెండా ఎర్రగా ఉందని కాదు.. అది గుండె రక్తంలా ప్రతి మనిషిలోనూ ప్రవహిస్తుందని నిరూపించాలి. ‘ఎర్రజెండా అంటే కేవలం ధర్నాలు, ఆందోళనలు కాదు. అది ఒక ప్రత్యామ్నాయ జీవన విధానం కావాలి. ప్రజల విద్య, వైద్యం, పెళ్లిళ్లు, కష్టసుఖాల్లో పార్టీ ఒక కుటుంబంలా ఉండాలి. ప్రజల మనసు గెలవకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యం. ఎర్రజెండా ప్రయాణం వంద ఏళ్లకే ఆగిపోయేది కాదు. ఇది నిరంతర ప్రవాహం. సిద్ధాంతంపట్ల నిబద్ధత, ఆచరణలో పారదర్శకత, ప్రజల పట్ల అంకితభావం ఉన్నప్పుడు ప్రజలే నాయకత్వాన్ని స్వీకరిస్తారు. ప్రజలను ఐక్యం చేయడమే మన కర్తవ్యం. ప్రజల నుండి పుట్టిన ఈ ఉద్యమం, తిరిగి ప్రజల వైపుకు వెళ్లినప్పుడే.. ఎర్రకోటపై ఎర్రజెండా రెపరెపలాడుతుంది. గడిచిన 100ఏళ్ల అనుభవాల పాఠం.. రాబోయే కాలం ప్రజావిజయాల కేతనం. మనువాదాన్ని మట్టికరిపిస్తూ, మతతత్వశక్తులను తరిమికొడుతూ, కార్పొరేట్ కబంధ హస్తాలనుంచి దేశాన్ని రక్షించాలంటే.. ఎర్రజెండా వెలుగులో భారత జాతీయవాద కమ్యూనిజం ఒక్కటే శరణ్యం. అణగారిన వర్గాల ఆశలు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు కలిసిన రోజున భారతదేశంలో ‘ప్రజా ప్రభుత్వం’ ఏర్పడటం ఖాయం. ‘సూర్యుడు అస్తమించేది చీకటికోసం కాదు.. రేపటి ఉదయం నూతన కాంతితో ఉదయించడం కోసం.’ విశ్వ జంపాల 77939 68907
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు విచారణ అర్హతను సవాల్ చేస్తూ హైకోర్టు దాఖలు అయిన పిటిషన్పై బు ధవారం కీలక తీర్పు వెలువడనున్నది. ఈ కమిషన్కున్న అర్హతలను సవాల్ చే స్తూ ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించిన విషయంతెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ నేతృ త్వంలోని కమిషన్ను ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని వారు హైకోర్టును కోరారు. కాగా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇదివరకే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం వెలువడే తీర్పు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష రాజకీయ వర్గాలలో ప్రాధా న్యం సంతరించుకుంది. ఈ కేసులో కోర్టు వెలువరించే తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కుంగిన బ్యారేజీలు, ప్రాజెక్టు నిర్మాణం జరిగిన అవకతవకలపై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14, 2024న నియమించింది. కమిషన్ నియామకం, దానికున్న అర్హతలను సవాలు చేస్తూ కెసిఆర్, హరీశ్రావుతో పాటు ఐఎఎస్ అధికారులు స్మితా సభర్వాల్, మాజీ ఐఎఎస్ ఎస్.కె. జోషి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ల బెంచ్ విచారణను తొలుత ఈ నెల 8కి , అనంతరం ఈ నెల 22కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా పిటిషన్దారుల తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలోని చట్టబద్ధమైన ఉల్లంఘనలు ఉన్నాయని తన వాదనలను గట్టిగా వినిపించారు. అలాగే సహజ న్యాయసూత్రాలను కమిషన్ పాటించలేదని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు సుప్రీంకోర్టులో ‘ఓటుకు నోటు కేసు’ విచారణ సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు కేసు’ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున రాష్ట్రంలోని ఎసిబి కోర్టులో విచారణ పారదర్శకంగా జరగదని, ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్నది.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభు త్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివే స్తూ జీఓ 31లో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం బదిలీల ప్రక్రియ మే 1వ తేదీ నుంచి మే 31, 2026 వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 1, 2026 నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థికశాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. 1 జనవరి 2026 నాటికి ఒకే చోట మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి అర్హులుగా పేర్కొంది. అయితే, నా లుగేళ్లు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. బదిలీ ఉత్తర్వులు వెలువడిన మూడు రోజుల్లోపు ఉద్యోగులు విధుల నుంచి రిలీ వ్ కావాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హె చ్చరించింది. సెన్సస్ (జనగణన) విధుల్లో ఉన్న ఉ ద్యోగులకు బదిలీల మార్గదర్శకాలు వర్తించవని ఆ ర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఈ జీఓలో పేర్కొన్నారు. అదేవిధంగా 31-.12-.2025 నాటికి ఒకే చోట నాలుగు సంవత్సరాలు విధులు నిర్వహించిన ఉద్యోగులను అక్కడ కొనసాగించరాదు. అంటే నాలుగు సంవత్సరాలకుపైగా ఒకే చోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే, రిటైర్మెంట్కు సమీపంలో ఉన్న ఉద్యోగులకు కొంత ఉపశమనం కల్పించారు. 31-.05-.2027 లోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు నాలుగు సంవత్సరాల సేవ పూర్తి చేసినప్పటికీ, వారు స్వయంగా బదిలీ కోరితే తప్ప వారిని బదిలీ చేయరాదు. మే 31, 2027 లోపు పదవీ విరమణ చేయనున్న ఉ ద్యోగులు కోరుకుంటేనే బదిలీ చేయాలని ఈ జీఓ లో పేర్కొన్నారు. జీవిత భాగస్వామి (స్పౌస్) కేసు ఆధారంగా కోరుకునే బదిలీలకు మూడేళ్ల నిబంధన వర్తించదని ఈ జీఓలో స్పష్టం చేశారు. ఏ ఒక్క కేడర్లో 40 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను బదిలీ చేయకూడదని ఆర్థికశాఖ సూచించింది. బదిలీల ప్రక్రియ మొత్తం కౌన్సెలింగ్ పద్ధతిలో సాధ్యమైనంత వరకు ఆన్లైన్/వెబ్ ఆధారిత అప్లికేషన్ ద్వారా పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. భార్యాభర్తల కేటగిరీలో మూడేళ్ల నిబంధన వర్తించదని ప్రభుత్వం ఈ జీఓలో పేర్కొంది. అలాగే బదిలీల సమయంలో భార్యాభర్తలు (ఒకరికి మాత్రమే), పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు, మానసిక వికలాంగులైన పిల్లలున్న తల్లిదండ్రులు, వితంతువులు, క్యాన్సర్, కిడ్నీ, లివర్ మార్పిడి వంటి తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ జీఓలో ఆదేశాలు జారీ చేశారు. బదిలీల ప్రక్రియను పర్యవేక్షించడానికి కేడర్ వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఈ జీఓలో స్పష్టం చేసింది. స్టేట్, మల్టీ-జోనల్/జోనల్, జిల్లా స్థాయిల్లో అధికారుల నేతృత్వంలో ఈ కమిటీలు పని చేయనున్నాయి. విద్యాశాఖ, పోలీస్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, అటవీశాఖలకు ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. బదిలీ షెడ్యూల్ వివరాలు ఇలా.. మే 1 వ తేదీ నుంచి- 7వ తేదీ వరకు: ఉద్యోగ సంఘాలతో చర్చించి ఖాళీలు, కచ్చితంగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను వెల్లడిస్తారు. దీంతోపాటు బదిలీల విధి, విధానాల ఖరారు చేయడంతో పాటు ఖాళీ పోస్టులు, తప్పనిసరిగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల జాబితా సిద్ధం చేసి దానిని ప్రచురించాలి. మే 8-వ తేదీ నుంచి 15వ తేదీ వరకు: ఉద్యోగులు తమకు కావలసిన బదిలీ ప్రాంతాల కోసం ఆప్షన్లను సమర్పించాల్సి ఉంటుంది. మే 16-వ తేదీ నుంచి 24వ తేదీ వరకు: దరఖాస్తులను పరిశీలించి బదిలీ విధానం ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలి. అనంతరం మాస్టర్ జాబితాను సిద్ధం చేయాలి. మే 25-వ తేదీ నుంచి 31వ తేదీ వరకు: బదిలీ ఉత్తర్వులను జారీ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి టిజిఈజేఏసీ నాయకుల కృతజ్ఞతలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బదిలీల జిఓను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి టిజిఈజేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓతో సహనంతో ఎదురుచూస్తున్న వేలాది ఉద్యోగులకు ఎంతో ఉపశమనం సంతృప్తిని కలిగించిందని టిజిఈజేఏసీ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు పేర్కొన్నారు. ఈ జీఓతో ప్రభుత్వ పాలన పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, సంబంధిత అధికారులకు ఉద్యోగుల అసలు సమస్యలను అర్థం చేసుకుని సముచిత నిర్ణయం తీసుకున్నందుకు తాము రుణపడి ఉంటామని వారు తెలిపారు.
బిఆర్ఎస్ ఉత్తి కథలు..కాంగ్రెస్ పిట్టకథలు
మన తెలంగాణ/హైదరాబాద్: వెయ్యేండ్లు అయినా బిఆర్ఎస్ పార్టీ మారదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.ఓటమిపై బిఆర్ఎస్ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని.. ప్రజలే తప్పు చేశారని ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల కురువృద్ధుడిని చే ర్చుకుని ఆయనకే 25 ఏండ్లు తగ్గిపోయాయి, నవ యువకుడు అంటే తెలంగాణలో ఉన్న యువత పరిస్థితి ఏమిట ని ప్రశ్నించారు. తాము ఏర్పాటు చేసే పార్టీలో యువ నా యకత్వాన్ని ప్రోత్సహిస్తామని.. యువత పెద్ద ఎత్తున చేరాలని పిలుపునిచ్చారు. జగిత్యాల సభలో 75 ఏళ్ల కురువృద్ధుడిని చేర్చుకొని రాజకీయ పునరేకీకరణ అంటున్నారని విమర్శించారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగా ణ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తున్నారంటే వెయ్యేండ్లు అయినా బిఆర్ఎస్ పార్టీ మారదు అని తేల్చిచెప్పారు. మేధావులు, విద్యావేత్తలు బిఆర్ఎస్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోరారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ నాయకత్వం రెండు సార్లు పదవులకు రాజీనామా చేసినప్పుడు తనకు వైఎస్ నాయకత్వం ఉంటే చాలు తెలంగాణ ఎందుకంటూ ప్రశ్నించిన వ్యక్తి జీవన్రెడ్డి అని, ఉద్యమ నాయకత్వంపై రెండుసార్లు ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేశారని గుర్తు చేశారు.తెలంగాణ జాగృతి కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. జగిత్యాల సభలో తెలంగాణ కోసం ఉరిమే ఉత్సాహంతో పోరాడిన ఉద్యమకారుల గురించి ఒక్క మాట మాట్లాడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటన చేసే దుస్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఏమీ అనకపోవడంలో ఆంతర్యం ఏమిటి..? జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ నాయకత్వం పల్లెత్తు మాట కూడా అనకపోవడంలో ఆంతర్యం ఏమిటని కవిత ప్రశ్నించారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటూ లోక్సభలో మహిళా బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్ బిల్లు, జనగణనపై ఒక్కమాట మాట్లాడలేదన్నారు. బిఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదని, అందుకే మహిళా కోటా బిల్లు వీగిపోయినా ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓటమికి ప్రజలకే కారణమని ఇప్పటికీ బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కేంద్రంగా రాజకీయ నాయకత్వం ఉండాలి రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒకే రోజు భారీ బహిరంగ సభలు పెట్టి తూ కిత్నా అంటే.. అంటే మై కిత్నా అంటూ బలప్రదర్శనకు దిగుతున్నాయి తప్పితే ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ఉత్తి కథలు చెప్తే.. కాంగ్రెస్ పార్టీ పిట్టకథలు చెప్పిందని విమర్శించారు. పార్టీల కేంద్రంగా కాకుండా ప్రజల కేంద్రంగా రాజకీయ నాయకత్వం ఉండాలని, అందుకే తాము కొత్త రాజకీయ శక్తిగా ఈనెల 25న వస్తున్నామని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఒక ఆడబిడ్డగా తాను ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలంతా తరలివచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య ఉంటే దానిని పరిష్కరించే వరకు పోరాడేందుకు తాము రాజకీయాల్లోకి వస్తున్నామని తెలిపారు. కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సిఎం మాట్లాడుతున్నారు “గుంట నక్క ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్లారని గుంపుమేస్త్రీ అంటున్నారని.. ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవడానికి బిఆర్ఎస్ నాయకుడు వెళ్తే ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా” అని కవిత ప్రశ్నించారు. కాళేశ్వరం కేసులో ఏదో జరగబోతుందని కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సిఎం మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను తక్కువ చేసేలా సిఎం మాట్లాడారని పేర్కొన్నారు. కోర్టులపై తనకు గౌరవం ఉందని, కానీ ఫలానా కేసులో ఇలాంటి తీర్పు రాబోతుందని ముఖ్యమంత్రి చెప్పడం ఏమిటని నిలదీశారు. “ఢిల్లీలో గుంటనక్క ఎవరిని కలిశారో చెప్పాలా” అంటూ ఆయనతో సిఎం డీల్ మాట్లాడుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు. ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో, ఎవరు పాలకపక్షంలో ఉండాలో నిర్ణయం చేయాల్సింది ప్రజలు కదా..? ప్రశ్నించారు. పదేళ్లు తానే సిఎంగా ఉంటానని ఎలా చెబుతారని.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలు రెండోసారి ఓట్లేస్తారని అడిగారు. సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా సగం మందికి రైతుభరోసా ఇవ్వలేదని అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చేస్తున్నారని, కుమ్మెర జాతరలో రెండు నెలల పాప చనిపోయినా మాట్లాడలేదని మండిపడ్డారు. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారని రేవంత్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారా..? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రజల విషయంలో ఏ లెక్కలేని తనం ప్రదర్శిస్తుందో అదే లెక్కలేని తనం కాంగ్రెస్ ప్రదర్శిస్తుందని అన్నారు. ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఆర్టిసి కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. ఆర్టిసిలో కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈనెల 25న తెలంగాణ రాజకీయాల్లోకి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని, ప్రజలందరికీ ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభకు సిరిసిల్ల నుంచి పార్టీ కార్యకర్తలు మంగళవారం పాదయాత్రగా బయలుదేరారని తెలిపారు. తమ పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే క్యాడర్ వాహనాలకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కోరారు. సమ్మెకు దిగిన ఆర్టిజన్లను బెదిరించి విధుల్లో చేరేలా ఒత్తిడి చేశారని అన్నారు. ప్రజలందరూ సమస్యల్లో ఉంటే అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని అన్నారు. ఆర్టిసిని ప్రైవేటుపరం చేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరిచారు. వెంటనే ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతిలో ఫార్వర్డ్ బ్లాక్ సీనియర్ నేత ప్రసాద్ చేరిక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఆర్ వి ఆర్ ప్రసాద్ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.అలాగే టిడిపి మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు.
అక్రమ కేసులు ఎదుర్కొనేందుకే హస్తినకు వెళ్లాం
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ పా ర్టీ అధినేత కెసిఆర్ సూచన మేరకే ఢిల్లీ వెళ్లి లాయర్లను కలిసినట్లు మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు తెలిపారు. కానీ, తన ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎంఒ నుంచి లీకులు ఇచ్చారని, మీడియా వాళ్లతో అర్థం లేని బ్రేకింగ్లు పెట్టించారని ఆరోపించారు. విషయం ఉన్న వారు ఎవరైనా ఇలాంటి పనులు చేయరని, విషయం లేనివారే ఇలా చేస్తారని విమర్శించారు. సిఎం పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొనేందుకే అక్కడి లాయర్లతో మాట్లాడినట్లు చె ప్పారు. కాళేశ్వరం కేసులపై సీనియర్ లాయర్లతో చర్చించేందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. అలాగే మే 6వ తేదీన హైకోర్టులో రాబోతున్న ఎంఎల్ఎల ఫిరాయింపుల కేసుల విచార ణపై సీనియర్ లాయర్లతో చర్చించామని అ న్నారు. కాంగ్రెస్ బి.ఫామ్పై గెలిచి తాను ఇం కా బిఆర్ఎస్లోనే ఉన్నానని ఒక ఎంఎల్ఎ అనడం, దానిని స్పీకర్ ధృవీకరించడం అ త్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు.ఓటుకు నోటు కేసు కూడా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు సుప్రీంకోర్టులో విచారణకు రానుందని, ఆ కేసు గురించి కూడా న్యాయవాదులతో చర్చించామని తెలిపారు. పట్టపగ లు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఇప్పుడు హోంమంత్రిగా ఆయనే ఉన్నాడు కాబట్టి కంప్లైంట్ కూ డా ఆయనే అని పేర్కొన్నారు. ఈ ఓటుకు నో టు కేసులో బిఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్ రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మ హమూద్ అలీ ఇంప్లీడ్ అయ్యారని చెప్పారు. ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్ల ను పెట్టి, సిఎం రేవంత్రెడ్డి వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నారని విమర్శించారు. ఆనాడు సమాఖ్య వాదులతో చేతులు కలిపి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది రేవంత్ రెడ్డి కాదా..? అని ప్రశ్నించారు. నాలుగున్నరేండ్ల నుంచి స్టేల మీద బతుకుతున్న రేవంత్ రెడ్డికి ఆ స్టే వెకేట్ అయిందంటే.. ముఖ్యమంత్రి సీటు ఊడటం,జైలుకు వెళ్లడం ఖాయం అని చెప్పారు. తెలంగాణ భవన్లో మంగళవారం బిఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్రావు మీడియాతో మాట్లాడారు. తమ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే తాను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లామని, అందులో దాచిపెట్టేదేమీ లేదని చెప్పారు. తన ఢిల్లీ పర్యటనపై కూడా చిల్లర ప్రచారం చేశారని మండిపడ్డారు. కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..? కెసిఆర్ సభ జరుగుతుందని ముందే తెలిసి, ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన కుచిత బుద్ధికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అని హరీష్రావు విమర్శించారు. కెసిఆర్ ప్రసంగం ఎప్పుడు ప్రారంభమవుతుందో చూసి అదే సమయానికి మైకు పట్టుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అని పేర్కొన్నారు. సోమవారం కెసిఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారని అన్నారు. కెసిఆర్ వ్యూవర్షిప్లో కనీసం 10 శాతం కూడా రేవంత్కు రాలేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ అధికారిక లైవ్లో బిఆర్ఎస్ సభను 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ లైవ్లో కేవలం 54 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కెసిఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎంతో హుందాగా, రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే..రేవంత్ రెడ్డి మాత్రం రాంకెలు వేయడం, ఏడవడం తప్ప ఇంకేం చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ జేజమ్మ దిగివచ్చినా దానిని ఆపలేరు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయని అన్నారు. ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి.. సోమవారం జగిత్యాల సభలో కెసిఆర్ గర్జిస్తారని భయపడి రాత్రికి రాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశారని చెప్పారు. కెసిఆర్ బయటకు వస్తే తప్ప రైతు భరోసా వేయరా..? అని ప్రశ్నించారు. పంట పెట్టుబడిగా ఇవ్వాల్సింది, పంట చేతికి వచ్చాక వేశారని తెలిపారు. కాళేశ్వరం కూలిపోయిందని దుష్ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాత్రి రాహుల్ గాంధీతో, ఉదయం బిజెపి వాళ్లతో తిరిగారని హరీష్ రావు వివర్శించారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఇన్నాళ్లు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ, రెండు పిల్లర్లు కుంగిపోయాయని, మరమ్మతులు చేస్తామని చెప్పారని సిఎం తాజాగా చెప్పారని పేర్కొన్నారు. మేడిగడ్డ రిపేరు చేసుకుని వాడుకుంటామని సిఎం ఒప్పుకున్నారని, రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్లా..? అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఎల్నినో రానుందని తెలియడంతో మేడిగడ్డ అవసరం తెలిసిందని అన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని, కాళేశ్వరం వృథా అయితే మూసీలోకి గోదావరి నీళ్లు ఎలా ఎత్తిపోస్తావని ప్రశ్నించారు. కెసిఆర్ ఎంతో గొప్పగా ఆలోచించి కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని చెప్పారు. వరద ఉంటే మిడ్ మానేరు నుంచి, మధ్యస్థంగా నీరుంటే ఎల్లంపల్లి నుంచి, కరువు వస్తే మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునేలా కాళేశ్వరాన్ని డిజైన్ చేశారని తెలిపారు. రేవంత్ శంకుస్థాపన చేసిన గంధమల్ల కూడా కాళేశ్వరంలో భాగమే అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి నూకలు చెల్లాయి రైతుబంధు, రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకు రేవంత్రెడ్డికి ప్రజలు ఓట్లు వేయాలా..? అని హరీష్రావు ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పగించినందుకా, తెలంగాణ డబ్బులను తీసుకెళ్లి ఢిల్లీకి, కుప్పానికి కడుతున్నందుకా..2 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసినందుకా..నెలకు రూ. 2500 ఇస్తామని మహిళలను దగా చేసినందుకా..స్కీములు లేవు కానీ రాష్ట్రాన్ని స్కాములతో నింపినందుకా..సింగరేణిని దోచుకున్నందుకు రేవంత్రెడ్డి ప్రజలు ఓట్లు వేయాలా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టినందుకా... ఖమ్మం వెలుగుమట్లలో వేల ఇండ్లు కూల్చినందుకా...కలుషిత ఆహారంతో 200 మంది గురుకుల విద్యార్థులను పొట్టన పెట్టుకున్నందుకా.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా లక్షలాది విద్యార్థులను అంధకారంలో నెట్టినందుకా.. ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను, అంగన్వాడీలను రోడ్డున పడేసినందుకా..ఫార్మా కంపెనీల కోసం లగచర్ల రైతుల చేతులకు బేడీలు వేసినందుకా..కులవృత్తులను ధ్వంసం చేసినందుకు ప్రజలు ఆయనకు ఓట్లు వేయాలా..? అని నిలదీశారు. ఎన్ని డ్రామాలు ఆడినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి నూకలు చెల్లాయి అని, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని అన్నారు.
ఇస్లామాబాద్: కాల్పుల విరమణ ఒప్పంద గడువు ముగియనున్న నేపథ్యంలో, అమెరికా ఇరాన్ మధ్య మలివిడత చర్చలు జరగనున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్లో సమావేశమయ్యే అవకాశముందని ఆ యా వర్గాలు మంగళవారం వెల్లడించాయి. అ యితే, చర్చల సమయంపై అమెరికా లేదా ఇ రాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకారం, ఇ ప్పటివరకు తమ అధికార ప్రతినిధులు ఎవరూ పాకిస్తాన్ రాజధానికి చేరుకోలేదని పేర్కొంది. పాకిస్తాన్ మధ్యవర్తుల సమాచారం మేరకు, అ మెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఖాలిబాఫ్ బుధవారం ఉదయం ఇస్లామాబాద్కు చేరుకు ని చర్చలకు నేతృత్వం వహించే అవకాశం ఉం దని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, గో ప్యతా నిబంధనల నేపథ్యంలో పేర్లు వెల్లడించకుండా ఉంచినట్లు సమాచారం. ఏప్రిల్ 8న ప్రారంభమైన కాల్పుల విరమణ ఒప్పందం బు ధవారం ముగియనుంది. ఇరు దేశాలు మాటల యుద్ధంలో మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. ఒప్పందం కుదరకపోతే భారీ బాంబు ల దాడులు మొదలవుతాయి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, ఇరాన్ చర్చల ప్రధాన ప్రతినిధి ఇంకా బయటపెట్టని కొత్త వ్యూహాలు తమ వద్ద ఉన్నాయి అని పేర్కొన్నారు. అయితే చర్చలు పునఃప్రారంభమైతే కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా తరఫున జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తారని వైట్హౌస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు పాకిస్థాన్ కూడా ఇరాన్, అమెరికా బృందాల రాకను నిర్ధారించింది. ఇరు దేశాలు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. బుధవారంనాడు ఉదయానికల్లా రెండు దేశాల ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్ చేరుకుంటాయన్నారు. అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేతృత్వంలో ఒక బృందం, ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ నాయకత్వంలో బృందం వస్తున్నాయని ప్రకటించింది. ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. మలి విడత చర్చలకు దారులు పడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు మరోదారి లేదని, ఒప్పందానికి రావాల్సిందేనని స్పష్టం చేశారు. కాల్పుల విరమణను మరోసారి పొడిగించే ఉద్దేశం లేదన్నారు. ఒప్పదం చేసుకుంటేనే ఇరాన్ పరిస్థితి బాగుంటుందన్నారు. లేకపోతే మా సేనలు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయని సిఎన్బిసితో మాట్లాడుతూ హెచ్చరించారు. ఈ సారి భీకరమైన దాడులు తప్పవని స్పష్టం చేశారు. బెదిరింపుల నీడలో చర్చలా? బెదిరింపుల నీడలో జరిగే చర్చలను మేము అంగీకరించము అని ఇరాన్ ప్రతినిధి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, చర్చలు పునఃప్రారంభమవుతాయన్న ఆశాభావాన్ని పాకిస్థాన్ వ్యక్తం చేసింది. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ ప్రతినిధి బృందం కూడా ఇస్లామాబాద్కు చేరుకునే అవకాశముందని పాకిస్థాన్ అధికారులు తెలిపారు. తద్వారా చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముందని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బద్ అబ్దెలాత్తీతో తాజా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఇదే సమయంలో, ఇరాన్కు ముఖ్య వాణిజ్య భాగస్వామి అయిన చైనా రాయబారితో కూడా సమావేశమయ్యారు. బీజింగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రస్తుత పరిస్థితి యుద్ధం నుంచి శాంతి వైపు మారుతున్న కీలక దశలో ఉందని పేర్కొంది. ఈ సందర్భంలో అన్ని పక్షాలు నిజాయితీగా వ్యవహరించి, రాజకీయ పరిష్కారానికి కట్టుబడి ఉండాలని, కాల్పుల విరమణ, చర్చల వేగాన్ని కొనసాగించాలని మంత్రిత్వ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ సూచించారు. ఇక ఇస్లామాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వేలాది భద్రతా సిబ్బందిని మోహరించి, విమానాశ్రయానికి వెళ్లే మార్గాల్లో పర్యవేక్షణను పెంచారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత చర్చల కంటే ఈసారి ఏర్పాట్లు మరింత కఠినంగా ఉన్నట్లు కనిపిస్తోంది. చర్చలు ముందుకు సాగితే, అమెరికాఇరాన్ అగ్రనేతలు పాకిస్థాన్ను సందర్శించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్లామాబాద్కు చెందిన భద్రతా విశ్లేషకుడు సయ్యద్ మహ్మద్ అలీ అభిప్రాయపడ్డారు. ఒప్పంద దశకు చర్చలు చేరితే, అగ్రనేతల పర్యటనకు అవకాశం ఉండొచ్చు అన్న భావనతో పాకిస్థాన్ సిద్ధమవుతోంది అని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ లెబనాన్ చర్చలు ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్లెబనాన్ మధ్య చారిత్రాత్మక దౌత్య చర్చలు గురువారం వాషింగ్టన్లో పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్గత చర్చలకు సంబంధించిన సమాచారం కావడంతో, అధికారులు గోప్యతా నిబంధనల మేరకు పేర్లు వెల్లడించలేదు. దశాబ్దాల తరువాత గత వారం ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు నేరుగా సమావేశమై చర్చలు జరపడం గమనార్హం. ఈ చర్చల ద్వారా హిజ్బుల్లా మిలిటెంట్లను నిరాయుధీకరించడం, లెబనాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం లక్ష్యమని ఇజ్రాయెల్ వెల్లడించింది.
విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్ షురూ
హైదరాబాద్: టాలీవుడ్లో రెండు క్రేజీ ప్రాజెక్టులు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఒకటి విజయ్ దేవరకొండది కాగా మరొకటి బెల్లంకొండ గణేశ్ది. నాని హీరోగా తెరకెక్కించిన ‘హాయ్ నాన్న’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మెప్పించారు శౌర్యువ్. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శౌర్యువ్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ప్రారంభమైంది. నాని ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా సమయంలో నాని, విజయ్ ఎంత స్నేహంగా […] The post విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్ షురూ appeared first on Visalaandhra .
హైదరాబాద్: అభిమానులు ఎప్ప్పుడెప్ప్పుడా అని ఎదురు చూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుపుతూ చిత్ర బందం కొన్ని ఫొటోలు పంచుకుంది. మాఫియా, ప్రతీకార నేపథ్యం, కుటుంబ అంశాల మేళవింపుగా రూపొంది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ‘జైలర’ చిత్రానికి కొనసాగింపుగా ‘జైలర్ 2’ వస్తోన్న సంగతి తెలిసిందే. అగ్రహీరో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. […] The post ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి appeared first on Visalaandhra .
. తాజాగా జట్టుకు దూరమైన యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే. ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగిన బౌలర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ఐపీఎల్ 2026లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్ ఆయుష్ మాత్రే ఎడమ కాలి గాయం (హామ్స్ట్రింగ్) కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇవాళ సీఎస్కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18న సన్రైజర్స్ హైదరాబాద్తో […] The post సీఎస్కేను వెంటాడుతున్న గాయాలు appeared first on Visalaandhra .
కెప్టెన్సీ తర్వాత…ముందు జట్టులోకి రావాలిశ్రేయస్ అయ్యర్కు జహీర్ఖాన్ సూచన
న్యూదిల్లీ: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా, జట్టులో కీలక బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అయ్యర్కు మాజీ పేసర్ జహీర్ ఖాన్ కీలక సూచనలు చేశాడు. టీమిండియా కెప్టెన్సీ గురించి ఆలోచించొద్దని, బ్యాటర్గా రాణిస్తూ టీ20 జట్టులో పునరాగమనంపై దృష్టిసారించాలని తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ 600కు పైగా పరుగులు చేయడంతోపాటు జట్టును […] The post కెప్టెన్సీ తర్వాత…ముందు జట్టులోకి రావాలిశ్రేయస్ అయ్యర్కు జహీర్ఖాన్ సూచన appeared first on Visalaandhra .
కెనడా క్రికెట్లో బిష్ణోయ్ గ్యాంగ్!బజ్వాను కెప్టెన్గా నియమించడం వెనుక హస్తం
న్యూదిల్లీ: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్కు సంబంధించి కెనడా క్రికెట్ జట్టులో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడటంతో ఐసీసీ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా ప్రమేయంపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణ జరుపుతోంది. కాగా ఈ ఫిక్సింగ్ వ్యవహారంలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు కెనడియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (సీబీసీ) ఓ కథనం ప్రచురించింది. న్యూజిలాండ్తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో దిల్ప్రీత్ బజ్వా అసాధారణంగా, ఖరీదైన […] The post కెనడా క్రికెట్లో బిష్ణోయ్ గ్యాంగ్!బజ్వాను కెప్టెన్గా నియమించడం వెనుక హస్తం appeared first on Visalaandhra .
ఢిల్లీపై ఘన విజయం.. SRH హ్యాట్రిక్ విజయం
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ పై సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఎస్ఆర్ హెచ్ నిర్దేశించిన 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాటర్లలో నితీష్ రాణా(57) అర్ధ శతకంతో చెలరేగాడు. సమీర్ రిజ్వీ(41), కెఎల్ రాహుల్(37), స్టబ్స్(27)లు భారీ స్కోరు చేయలేకపోయారు. దీంతో ఢిల్లీపై హైదరాబాద్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో టాస్ 3 స్థానానికి దూసుకెళ్లింది. అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. మరోసారి ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. స్టేడియంలో సిక్సుల మోత మోగించాడు. ఈ మ్యాచ్ లో అభిషేక్, 10 సిక్సులు, 10 ఫోర్లతో అజేయంగా 135 పరుగులతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. అభిషేక్ తోపాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(37), కెప్టెన్ ఇషాన్ కిషన్(25), క్లాసెన్(37 నాటౌట్)లు రాణించారు.
విశాలాంధ్ర-జేఎన్టీయూ: ఏపీ ఈసెట్ పరీక్ష 23న జరగనుంది. సెట్ చైర్మన్ ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ భానుమూర్తి ఈ విషయం వెల్లడించారు. జేఎన్టీయూ ఆర్యభట్టు ఆడిటోరియంలో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వీసీ ప్రొఫెసర్ సుదర్శన్రావు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేశామని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని చెప్పారు. పరీక్ష కేంద్రాలలోకి గంట ముందే అనుమతిస్తామని తెలిపారు. అనంతపురం జేఎన్టీయూ అధ్వర్యంలో నిర్వహించే […] The post రేపు ఏపీఈసెట్ పరీక్ష appeared first on Visalaandhra .
రాత్రివేళ బైక్ ర్యాలీలపై నిషేధం: ఈసీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఆంక్షలు విధించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, శాంతియుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడానికి బైక్ ర్యాలీలను నిషేధించడం, పగటిపూట వెనుక కూర్చొని ప్రయాణించడంపై పరిమితులు విధించింది. పోలింగ్కు రెండు రోజుల ముందు నుంచి అంటే మంగళవారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 23న బెంగాల్లో 152 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. వైద్యారోగ్యం, కుటుంబ కార్యక్రమాల వంటి […] The post రాత్రివేళ బైక్ ర్యాలీలపై నిషేధం: ఈసీ appeared first on Visalaandhra .
కేరళలో భారీ పేలుడు…13 మంది మృతి
తిరువనంతపురం: కేరళలోని త్రిసూర్ జిల్లాలోని బాణసంచా గిడ్డంగిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మృతి చెందగా 30 మందికిపైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పూరం వేడుక కోసం నిల్వ ఉంచిన బాణసంచా కేంద్రాల్లో ఈ పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. స్థానికంగా పంటపొలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో బాణసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు గాయపడిన వారిని […] The post కేరళలో భారీ పేలుడు…13 మంది మృతి appeared first on Visalaandhra .
ప్రధానిపై హక్కుల ఉల్లంఘన నోటీసు
. స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించిన కాంగ్రెస్. సభ్యులపై నిందారోపణలు చేశారని ఆరోపణ న్యూదిల్లీ: లోక్సభ సభ్యులపై ‘నిందారోపణలు’ చేయడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రధానికి వ్యతిరేకంగా హక్కుల నోటీసును లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ మేరకు ఓం బిర్లాకు వేణుగోపాల్ లేఖ రాశారు. ‘18 ఏప్రిల్, 2026న టెలివి జన్లో ప్రసారమైన తన ప్రసంగంలో లోక్సభ సభ్యు […] The post ప్రధానిపై హక్కుల ఉల్లంఘన నోటీసు appeared first on Visalaandhra .
తమిళనాడులో రేపు పోలింగ్బెంగాల్లో మొదటిదశకు కూడా… చెన్నై/కోల్కతా: తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మొదటి దశ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్కు ముందు తప్పనిసరి 48 గంటల నిశ్శబ్ద కాలం అమలులోకి వచ్చింది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభలు లేదా ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదు. టెలివిజన్, రేడియో, సోషల్ మీడియా, […] The post ఎన్నికల ప్రచారానికి తెర appeared first on Visalaandhra .
కొసెళ్లేదాక ఉంటవో.. ఊడుతవో తెలియదు
రాష్ట్రానికి రేవంత్రెడ్డి శని పట్టిందని, ఆ శని పీడ విరగడ కావాలంటే రేవంత్రెడ్డి పోవాలి... కేసీఆర్ రావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా జగిత్యాలలో కేసీఆర్ సభ జరిగిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసిన గొప్ప వ్యక్తి కేసిఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పుణ్యంతోనే నీవు సీఎం అయ్యావని, కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించకుంటే నీవు సీఎం అయ్యేవాడివా అని జీవన్రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభ సక్సెస్ కాకూడదనే నీవు మేడిగడ్డ వద్ద సభ పెట్టావు.. 30 మాసాలుగా అక్కడికి ఎందుకు పోలేదు? నిద్ర పోయావా అని రేవంత్ను ప్రశ్నించారు. మేడిగడ్డ మరమ్మతు పనులకు కేవలం రూ.400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని, మరమ్మతులు చేయకుండా కేసీఆర్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నేను పదవుల కోసం లొంగేవాడిని కాదని, నేనెవరిని తొక్కుకుంటూ రాలేదన్నారు. నాదేండ్లను ఎన్టీఆర్ మంత్రి వర్గంలో తొలగించడంతో నా మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వచ్చానన్నారు. 1984లో పార్టీ ఫిరాయింపు చట్టమే లేదని, అయినా నా పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరానన్నారు. నేను ఇంకా పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్ విర్రవీగి మాట్లాడుతున్నాడని, ఈ రెండేండ్లు పూర్తిగా ఉంటాడో, ఊడతాడో కూడా తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలుండగా తన సొంత కుంపటి కోసమే బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్లో చేరికతో నా ప్రజా జీవితానికి నూతన అధ్యయం ఏర్పడిందని, తెలంగాణ పునర్నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రేవంత్ సీఎంలా వ్యవహరించకుండా వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నాడన్నారు. నోరు తెరిస్తే బండ బూతులు మాట్లాడటం సీఎం స్థాయిలో ఉన్న రేవంత్రెడ్డికి తగదన్నారు. చావుకు ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకా కేసీఆర్ను ఊరి తీసేదని ప్రశ్నించారు? ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకా? రైతన్నలకు అండగా నిలిచినందుకా, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆరాటపడినందుకా? ఎందుకు కేసీఆర్ను ఉరి తీయాలని ఈశ్వర్ రేవంత్రెడ్డిని నిలదీశారు.

37 C