SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

Amaravathi : అమరావతిలో క్రికెట్ స్టేడియం.. ప్రారంభమయితే రూపురేఖలు మారతాయిగా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రికెట్ స్టేడియం పనులు పూర్తి కావచ్చాయి

తెలుగు పోస్ట్ 4 Feb 2026 10:15 am

Telangana : ఎన్నికల బరిలో మున్సిపల్ అభ్యర్థులు ఎంతమందంటే?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

తెలుగు పోస్ట్ 4 Feb 2026 10:12 am

Mothkur |కౌన్సిలర్ బరిలో.. కమ్యూనిస్టులు..!

Mothkur | కౌన్సిలర్ బరిలో.. కమ్యూనిస్టులు..! Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Feb 2026 10:07 am

రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి

రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 10:06 am

ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈనెల 18న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 4 Feb 2026 10:01 am

లండన్ నుంచి ఖతార్ కు నారాయణ

లండన్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది.

తెలుగు పోస్ట్ 4 Feb 2026 9:55 am

BJP |శాంతిరెడ్డి ప్రచారం..

BJP | శాంతిరెడ్డి ప్రచారం.. BJP, ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 4 Feb 2026 9:54 am

Hyderabad : తల్లిని తాను ఇక చూసుకోలేని యువతి బలవన్మరణం

హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో దూకి యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెనక తల్లికి దూరమవుతానన్న బాధ ఉంది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 9:47 am

Anganwadi |పౌష్టికాహారం అందజేత..

Anganwadi | పౌష్టికాహారం అందజేత.. Anganwadi, టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా

ప్రభ న్యూస్ 4 Feb 2026 9:46 am

BRS |ఒక్క అవకాశం ఇవ్వండి- తాటికొండ మధు..

BRS | ఒక్క అవకాశం ఇవ్వండి- తాటికొండ మధు.. BRS, స్టేషన్‌ఘన్‌పూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Feb 2026 9:38 am

Weather Report : చలితీవ్రత పెరుగుతున్నప్పటికీ.. రానున్న రోజుల్లో మాత్రం?

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గలేదు

తెలుగు పోస్ట్ 4 Feb 2026 9:34 am

తెలంగాణలో పవన్ ప్రచారం

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 9:31 am

అసెంబ్లీలో నేడు కడియం కేసు విచారణ

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేడు స్పీకర్ విచారణకు హాజరుకానున్నా

తెలుగు పోస్ట్ 4 Feb 2026 9:24 am

Rajamouli gives a Clarity on Varanasi

Ever since the shoot of Varanasi directed by SS Rajamouli started, there are lot of rumors about the runtime and the film being released in two parts. In an exclusive interview, SS Rajamouli made it clear that the film will release in a single part and it will not have any second instalment. Rajamouli said […] The post Rajamouli gives a Clarity on Varanasi appeared first on Telugu360 .

తెలుగు 360 4 Feb 2026 9:06 am

kalki2 |ఇంట్రెస్టింగ్.. కమల్ స్క్రీన్ టైమ్ షాక్ ..?

Kalki2 | కమల్ హాసన్ పాత్ర ఎంత కీలకమో తెలుసా? kalki2 |

ప్రభ న్యూస్ 4 Feb 2026 9:03 am

ఫొన్ నంబర్ బ్లాక్ చేశాడని.... ప్రియుడ్ని పైకి పంపించింది

రాయ్‌పూర్: ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని ప్రియురాలు కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ సంఘటన చత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుభమ్ విహార్ టీచర్స్ కాలనీలో ప్రసాద్ సూర్యవంశీ(25) అనే యువకుడు ఓ హోటల్‌లో పని చేసేవాడు. అతడి సోషల్ మీడియాలో యువతి పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు ప్రతీ రోజు ఫోన్లలో చాటింగ్ చేసుకునేవారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆమె నంబర్‌ను అతడు బ్లాక్ చేశాడు. దీంతో ప్రియురాలు అతడి రూమ్‌కు వెళ్లి తన నంబర్ ఎందుకు బ్లాక్ చేశావని ప్రశ్నించింది. మొబైల్‌లో చాటింగ్ చూపించాలని పట్టుబడడంతో అతడు నిరాకరించాడు. కోపంతో రగిలిపోయిన యువతి కత్తి తీసుకొని అతడిని పలుమార్లు పొడిచింది. తీవ్ర గాయాలతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

మన తెలంగాణ 4 Feb 2026 9:00 am

Tirumala : తిరుమలకు నేడు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. వేచి ఉండకుండానే?

తిరుమలలో భక్తుల నేడు ర‌ద్దీ తగ్గింది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 8:43 am

2chandra |చంద్ర దోషం ఉంటే ఇలా జరుగుతుంది..! లక్షణాలు, పరిహారాలు తెలుసుకోండి

2chandra | చంద్ర దోషం లక్షణాలు, ప్రభావాలు & శక్తివంతమైన పరిహారాలు 2chandra

ప్రభ న్యూస్ 4 Feb 2026 8:31 am

Visakha Steel Plant : లాభాల బాటలో విశాఖ ఉక్కు...ఏడాదిన్నరలో లాభమెంతంటే?

విశాఖ ఉక్కు మళ్లీ లాభాల్లోకి వచ్చింది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 8:29 am

ఉద్యోగుల జెఎసిలో చీలిక

 టిజిఓ, టిఎన్జీఓ నేతల ఎడమొహం, పెడమొహం వాట్సాప్ గ్రూపు నుంచి టిఎన్జీఓ సంఘం ఎగ్జిట్ రెండు నెలలుగా సమావేశం కాని జేఏసి నేతలు మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగుల జేఏసిలో (టిజిఈజేఏసీ) చీలిక రావడంతో ఉ ద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జేఏసి లో ముఖ్య సంఘాలైన టిజిఓ, టిఎన్జీఓల మధ్య వి భేదాలు ముదరడంతో ఈ జేఏసిలో చీలిక తప్పదని ఉద్యోగసంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇ ప్పటికే ఈ రెండు సంఘాల మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ జేఏసీలోని మిగతా సంఘాలు నాయకులు కూడా వీరిద్దరిని క లపడానికి ప్రయత్నించడం లేదని దీంతో వీరి మ ధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఈ రెండు సంఘాల మధ్య మనస్పర్ధల నేపథ్యంలో ఈ జేఏసి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా టిజిఓ, టిఎన్జీఓల ఆధిపత్య పోరు అధికం కావడంతో ఈ మధ్య జేఏసి వాట్సాప్ గ్రూపు నుంచి టిఎన్జీఓ సంఘం నాయకులు ఎగ్జిట్ అయ్యారు. అప్పటి నుంచి ఈ రెండు సంఘాల నాయకులు అంటీముట్టనట్టుగా వ్యవహారించడంతో పాటు కనీసం జేఏసి సమావేశాన్ని సైతం నిర్వహించ లేదు. అయితే, ఈ విషయమై ఇరు సంఘాల నాయకులు ఉద్యోగులకు వేర్వేరు కారణాలు చెబుతుండడంతో అసలు తప్పు ఎవరిది, ఎందుకు వీరి మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యిందన్న విషయాల గురించి ఉద్యోగులు ఆరా తీస్తున్నారు. 206 సంఘాలతో జేఏసి స్టీరింగ్ కమిటీ అయితే టిజిఓ, టిఎన్జీఓ సంఘాల నాయకులు (టిజిఈజేఏసీ) పేరుతో ఉద్యోగుల జేఏసిని ఏర్పాటు చేయడం కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టం లేక వీరి మధ్య రాజకీయ నాయకులే చిచ్చు పెట్టారని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నా రు. 206 సంఘాలతో తెలంగాణ ఉద్యోగుల జేఏసి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయగా ఈ జేఏసి చైర్మన్‌గా మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌గా ఏ లూరి శ్రీనివాసరావులను ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నుకున్నారు. ఈ జేఏసి స్టీరింగ్ కమిటీలో 27 ఉద్యోగ సంఘాల నాయకులకు సైతం చోటు కల్పించారు. అయితే, ఈ జేఏసిలో ప్రభుత్వ గుర్తింపుపొందిన 9 ఉద్యోగ సంఘాలైన టిఎన్జీఓ, టిజిఓ, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, టిఆర్‌టి యూ, యూటిఎఫ్, ఎస్‌టియూ, టిఆర్‌టిఎఫ్ సం ఘాలతో పాటు టీచర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయ సంఘాలైన ఈఎస్‌పిసి, టిటిజేసి, జాక్టో, టిఏజేఏసి తదితర సంఘాలు ఇందులో భాగస్వామయ్యా యి. వీటితో పాటు పెన్షనర్‌ల సంఘాలు సైతం ఈ జేఏసికే మద్ధతు ప్రకటించాయి. దీంతో ఈ జేఏసికి సుమారుగా 206 ఉద్యోగ సంఘాలు మద్ధతు ప్రకటించడంతో మొత్తంగా 3 లక్షల ఉద్యోగులతో పాటు 3,50,000 లక్షల పెన్షనర్‌ల మద్ధతు ల భించింది. అయితే, ఈ జేఏసిలో మొదటి నుంచి ఒ క నాయకుడంటే మరో నాయకుడికి గిట్టడం లేదు. జేఏసిలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వెంటనే దానిని లీక్ చేస్తున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం విశేషం. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ప్రభుత్వ ఉద్యోగులు తమ సం ఘాలతో జేఏసిని ఏర్పాటు చేసుకొని అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడంలో సఫలీకృత మయ్యాయి. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సుమారు 10 ఏళ్ల పాటు తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వానికి టిఎన్జీఓ, టిజిఓ, రెవెన్యూ, టీచర్ల సంఘాలు పలుమార్లు వినతిపత్రాలను ఇచ్చి కొంతమేర తమ సమస్యలను పరిష్కరించుకున్నాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రం లో డిసెంబర్ 2023న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం సిఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉద్యోగ సంఘాల నాయకులు మారిపోవడంతో కొత్తగా 206 ఉద్యోగ సంఘాలతో ఈ జేఏసిని ఏర్పాటు చేసుకొని సమస్యల సాధన కోసం పోరాడుతున్నాయి.

మన తెలంగాణ 4 Feb 2026 8:28 am

ప్రణీత్ రావుకు డిమోషన్

ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు ప్రణీత్‌రావు డీఎస్పీ హోదాను రద్దు ప్రభుత్వం రద్దు చేసింది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 8:11 am

జూన్‌లో ‘విశ్వంభర’?

‘మన శంకర వరప్రసాద్ గారు’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ విజయంతో ఆయన తదుపరి చిత్రం ‘విశ్వంభర’పై అంచనాలు భారీగా పెరిగాయి. వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ షూటింగ్ పూర్తయినా వీఎఫ్‌ఎక్స్ కారణంగా ఆలస్యమైంది. ఇటీవల చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ విశ్వంభర జూన్‌లో విడుదలయ్యే అవకాశముందని అన్నారు. యూవీ క్రియేషన్స్‌కు చెందిన అజయ్ కుమార్ మాట్లాడుతూ.. “ఈ సినిమా టీజర్‌లోని విఎఫ్‌ఎక్స్ కి మంచి స్పందన రాలేదు. అందుకే, రెండో టీజర్ లో పటిష్టమైన విఎఫ్‌ఎక్స్ ఉండేలా చూసుకున్నాం. విశ్వంభర ఒక పెద్ద సినిమా. అందుకే సీజీకి సమయం పడుతుంది. దీంతో సినిమా ఆలస్యమైన పర్వాలేదు కానీ క్వాలిటీ విషయంలో మాత్రం రాజీపడకూడదని నిర్ణయించుకున్నాము”అని తెలిపారు. కాగా ఈ సినిమాలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ సోషియో ఫాంటసీ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది. కాగా సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మన తెలంగాణ 4 Feb 2026 8:10 am

Ys Jagan : నేడు గుంటూరు లో జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 4 Feb 2026 7:49 am

నాకు, మహిళకు జరిగిన విషయం వ్యక్తిగతం: జనసేన ఎంఎల్ఎ

అమరావతి: తనకు, ఓ మహిళకు మధ్య జ‌రిగింది వ్య‌క్తిగ‌త విషయమని జనసేన ఎంఎల్ఎ అరవ శ్రీధర్ తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యానని, తన వాదనను కమిటీకి తెలిపానని, కమిటీ తన నివేదికను అధిష్టానానికి ఇచ్చాక నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ముందు హాజరైన తరువాత శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఇది తన వ్యక్తిగత వ్యవహారమని, జనసేన పార్టీకి ఆపాదించవద్దని కోరారు. తనపై కేసు నమోదైన విషయం తనకు తెలియదని, వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా చట్ట ప్రకారం ఎదుర్కోడానికి తాను సిద్ధంగా ఉన్నానని జనసేన ఎంఎల్ఎ అరవ శ్రీధర్ పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీ ప్రాంగణం నుండి సదరు మహిళకు వీడియో కాల్ చేసిన వీడియోను బాధితురాలు విడుదల చేయడంతో అది నిజామా? కాదా? ఎంఎల్ఎను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కమిటీకి అన్ని విషయాలు చెప్పానని, జనసేన పార్టీ నిర్ణయం తీసుకున్న తరువాతే జనంలోకి వస్తానని వివరించారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల బాధితురాలు సదరు ఎంఎల్ఎ తో చనువుగా ఉన్న వీడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదిన్నరగా సదరు ఎంఎల్ఎ నరకం చూపిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. శారీరకంగా తనను హింసించడని జ‌న‌సేన ఎమ్మెల్యే బాధితురాలి వీడియో విడుద‌ల‌ చేసింది. ప‌రిచ‌య‌మైన రెండు రోజులకే తనని బెదిరించారని, తన కుమారుడు, తాను మాత్ర‌మే ఉంటున్నానని జాగ్ర‌త్త‌ అని ఎంఎల్ఎ ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. క‌డ‌ప‌కు వెళ్దామ‌ని కారులో తీసుకెళ్లి రాజంపేట వ‌ద్ద నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి, తన ప్రైవేట్ పార్ట్స్ తాకడంతో పాటు యువతి కారు డోరు ఓపెన్ చేయ‌బోతే గ‌ట్టిగా కొట్టి తనపై అత్యచారం చేశాడని ఆరోపణలు చేసింది. ఆగ‌స్టులో ఫ‌స్ట్ ప్రెగ్నెన్సీ వ‌స్తే దాన్ని అబార్ష‌న్ చేయించుకోవాల‌ని ఎంఎల్ఎ ఒత్తిడి చేశాడని, పెళ్లి చేసుకుంటాన‌ని ప్రామీస్ చేయ‌డంతో అబార్ష‌న్ చేసుకున్నానని, గ‌త ఏడాదిన్న‌ర కాలంలో ఐదుసార్లు అబార్ష‌న్స్ చేశారని, తన భ‌ర్త‌కు కాల్ చేసి విడాకులు ఇవ్వాల‌ని బెదిరించారని, ఏడాదిన్న‌ర‌గా తన సదరు ఎంఎల్ఎ తనని టార్చ‌ర్ చేశాని బాధితురాలు ఆరోపణలు చేసింది.

మన తెలంగాణ 4 Feb 2026 7:48 am

Medaram : నేడు మేడారంలో తిరుగువారం పండుగ

మేడారం జాతర ముగిసింది. అయితే నేడు తిరుగువారం పండగను నిర్వహించనున్నారు

తెలుగు పోస్ట్ 4 Feb 2026 7:41 am

T20 World Cup : టీం ఇండియాతో పాక్ 15న ఆడకపోయినా.. మరోసారి ఆడాల్సిందేనా?

టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ షిప్ కు వేళయింది. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 7:35 am

రాజమండ్రిలో పెద్దపులి.... భయంతో వణికిపోయిన వాహనదారులు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి ప్రాంతం తొర్రేడు పెద్దపులి కనిపించింది.  దివాన్ చెరువు హైవే సమీపంలో నడిరోడ్డులో వాహనదారులకు పెద్దపులి కంటపడింది. దివాన్ చెరువు వాసులు భయంతో వణికిపోతున్నారు. రాజమండి ప్రాంతంలో పలు గ్రామంలో పెద్ద పుల్లిని అటవీ శాఖ అధికారులు పట్టుకోవాలని కోరుతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. పెద్దపులిని అతి త్వరంలో పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. 

మన తెలంగాణ 4 Feb 2026 7:26 am

అండర్19 ప్రపంచకప్‌.. నేడు అఫ్గాన్‌తో భారత్ సెమీస్ పోరు

బులవాయో: అండర్19 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో అఫ్గానిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఇందులో గెలిచే జట్టు ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఎదుర్కొంటోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో యువ భారత్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. అంతేగాక మ్యాచ్ విన్నర్ ఆల్‌రౌండర్లు జట్టులోఉన్నారు. దీంతో భారత్‌కే ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్ వంటి స్టారర్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కూడా వైభవ్ సూర్యవంశీ జట్టుకు కీలకంగా మారాడు. అయితే కెప్టెన్ ఆయుష్ మాత్రె ఫామ్ జట్టును కలవరానికి గురి చేస్తోంది. మాత్రె కనీసం ఈ మ్యాచ్‌లోనైనా తన బ్యాట్‌కు పని చెప్పాల్సి ఉంది. మరోవైపు అఫ్గాన్‌లో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఆ జట్టు కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది.

మన తెలంగాణ 4 Feb 2026 7:10 am

రాహుల్ ప్రసంగంపై రభస

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో మంగళవారం నాడు లోక్ సభలో మరోసారి గం దరగోళ పరిస్థితి నెలకొంది. లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా అధికార పక్షం సభ్యులు అభ్యంతరాలు, ప్రతిపక్షసభ్యులు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో  ఏడుగురు కాంగ్రెస్ స భ్యులు, సిపిఎం ఎంపిని మంగళవారం లోక్ సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా నిబంధనలకు వి రుద్ధంగా ప్రవస్తిస్తున్నారని పేర్కొంటూ వారిని స స్పెండ్ చేశారు. దీంతో వారు పత్రాలను చింపి స్పీకర్ వేదిక పైకి విసిరారు.బడ్జెట్ సమావేశాలు ఈ సెషన్ ఏప్రిల్ 2న ముగియనుంది. అప్పటివర కూ వారిని సభనుంచి సస్పెండ్ చేయడంతో , అ ధికార ప్రతిపక్షాల మధ్య వివాదం మరింత ముదురే అవకాశం ఉంది. 2020లో భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణ, వివాదంపై మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎంనరవాణే రాసిన ఇంకా ప్రచురితంకాని జ్ఞాపకాల నుంచి కొన్ని అంశాలను సభలో ప్రస్తావించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించినప్పుడు అందుకు స్పీకర్ అనుమతి నిరాకరించడంతో గొడవ మొదలైంది. అలాగే అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారత - అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించడం, వారణాశి లోని మణికర్ణికా ఘాట్ లో చేపట్టిన కూల్చివేతలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం నుంచి సభ పలు సార్లు వాయిదా పడిన తర్వాత, మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమైనప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న దిలీప్ సైకియా 8 మంది సభ్యుల పేర్లను ప్రస్తావించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు 8 మంది సభ్యును బడ్జెట్ సెషన్ లోని మిగతా కాలానికి సస్పెండ్ చేయాలని కోరుతూ ఓ తీర్మానాన్ని చదివి విన్పింంచారు.సస్పెండ్ అయిన కాంగ్రెస్ సభ్యులు గుర్జీత్ సింగ్ అజ్లా, హిబి ఊడెన్, సి. కిరణ్ కుమార్ రెడ్డి, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణిక్కం ఠాగూర్, ప్రశాంత్ పడోల్, డీన్ కురియాకోస్,సిపిఐ (ఎం) సభ్యుడు ఎస్ వెంకటేశన్. ఈ సభ్యులు స్పీకర్ చైర్ గౌరవాన్ని కూడా విస్మరించారని, వారు స్పీకర్ చైర్ పై చించిన కాగితాలను విసిరి వేశారని, వారి ప్రవర్తనకు చైర్ వారి పేర్లను ప్రస్తావించిందని రిజిజు పేర్కొన్నారు. మూజువాణి ఓటుతో వారి సస్పెన్షన్ తీర్మానాన్ని సభ ఆమోదించింది. మాజీ ఆర్మీ చీఫ్ జ్ఞాపకాల ప్రస్తావన మంగళవారం ఉదయం రాహుల్ గాంధీ మాజీ ఆర్మీ చీఫ్ నవరణ రాసిన జ్ఞాపకాల వ్యాసం కాపీని సభకు సమర్పించారు. రాహుల్ ను అడ్డుకునేందుకు అధికారపక్షం, వారిని నివారించేందుకు ప్రతిపక్ష సభ్యులు పరస్పర నినాదాలతో సభను హోరెత్తించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. హరీష్ బాలయోగి ప్రసంగిస్తుండగా, ప్రతి పక్ష ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో సభను మధ్యాహ్నం 3 గంటలవరకూ వాయిదా వేశారు. రాజ్యసభలో భారత్‌అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చకు విపక్షాలు మంగళవారం రాజ్యసభలో డిమాండ్ చేశాయి. తరువాత వాకౌట్ చేశాయి.జీరో అవర్ పూర్తి కాగానే కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఈ వాణిజ్య ఒప్పందం అంశాన్ని తీసుకు వచ్చారు. ప్రభుత్వం నుంచి రావలసిన ఈ సమాచారం వాషింగ్టన్ నుంచి రావడాన్ని ఆయన ఆక్షేపించారు. సభలో విపక్షాలు అసమ్మతి తెలియజేయగానే సభా నాయకుడు జెపి నడ్డా భారత ఎగుమతులపై సుంకాలు తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియజేశారని, తరువాత ప్రధాని నరేంద్రతో కూడా ఆయన మాట్లాడారని వివరించారు. మంచి విషయాల్లో కూడా చెడుగా చూడడం ప్రారంభం కావడంతో విపక్షం అసమ్మతి బయటపడిందని నడ్డా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై పూర్తి వివరాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,సుమోటో ప్రకటనతో ప్రభుత్వం ముందుకు వస్తుందని సభకు హామీ ఇచ్చారు. కానీ ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, ఇది భారత కాంగ్రెస్, ఇండియా కూటమి బాధ్యతారాహిత్యమని నడ్డా విమర్శించారు. దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తూ విపక్షం నినాదాలు కొనసాగిస్తుండడంపై చైర్మన్ సిపి రాధాక్రిష్ణన్ జోక్యం చేసుకుని ప్రభుత్వం ప్రకటన చేస్తామని చెప్పినప్పుడు వినాలని సూచించారు. అయినా సరే విపక్షాలు వెనక్కు తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు చొచ్చుకుని వెళ్లారు. నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం ఈరోజే దీనిపై సుమోటో స్టేట్‌మెంట్ ఇస్తుందని దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతీదీ రాజకీయం చేయడం వారికి ఆసక్తి అని, దానికి ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్నదేనని నడ్డా విపక్షాలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్చకు దూరంగా ఉంటుందని దేశంలో వాతావరణం సృష్టించడానికి వారు ప్రయత్నిస్తున్నారని నడ్డా వ్యాఖ్యానించారు. “చర్చించడానికి ఎలాంటి అంశాలు లేని పార్టీ మీది. ఇది బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన. ఒకవిధంగా దేశ వ్యతిరేక ప్రవర్తన ” అని నడ్డా విపక్షంపై ధ్వజమెత్తారు. టిఎంసి తప్ప మిగతా విపక్షాలన్నీ నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశాయి. టిఎంసి సభ్యుడు సాకేత్ గోఖలే కూడా సభలో కొంతసేపు కూర్చుని వాకౌట్ తరువాత బయటకు వెళ్లారు. “ సర్‌” బాధిత కుటుంబాలపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా తాము వేరేగా వాకౌట్ చేశామని టిఎంసి వెల్లడించింది.

మన తెలంగాణ 4 Feb 2026 6:00 am

డిజిటల్ విద్యా విప్లవంలో టి-సాట్ జ్ఞానయాత్ర

తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో ఉదయం తెల్లవారుజామునే ఒక యువకుడు టివి ముందు కూర్చుంటాడు. అతని చేతిలో ఖరీదైన పుస్తకాలు లేవు. ఖరీదైన కోచింగ్ సెంటర్లకూ వెళ్లలేడు. అయినా అతని కళ్లలో మాత్రం ఒక ప్రశ్న నాకు కూడా అవకాశం ఉంటుందా? అని. ఈ ప్రశ్నకు సమాధానంగా టి సాట్ మారింది. టి సాట్ ద్వారా నగరంలోని నిపుణులైన గురువుల పాఠాలు, గ్రామంలోని ఆ ఇంటికి చేరి తెలంగాణ యువత కలలకు ప్రాణం పోస్తోంది. ఇటీవల సచివాలయంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు టి సాట్ సిఇఒ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డితో కలిసి ఎడ్‌సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్‌ను ఆవిష్కరించడం, ప్రభుత్వ విద్యా సంకల్పానికి స్పష్టమైన సంకేతాన్ని తెలియజేస్తుంది. ఎడ్‌సెట్‌లో ఉన్నత ర్యాంకులు సాధించడానికి టి సాట్ అందించే డిజిటల్ కంటెంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి చేసిన సూచన, వేలాది బిఎడ్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది కేవలం ఒక పరీక్షకు సంబంధించిన ప్రకటన కాదు. ఇది ప్రభుత్వ ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తోంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే, లక్షలకు లక్షలు ఫీజులు కట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లాల్సిన పని లేకుండా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు రోజుకు నాలుగు గంటల పాటు మొత్తం 392 ఎపిసోడ్‌లతో, 98 రోజుల పాటు బయాలజీ, ఫిజికల్ సైన్స్, గణితశాస్త్రం, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగు వంటి కీలక సబ్జెక్టులపై నిపుణులతో ప్రసారాలు చేయనుంది. ఇది ప్రభుత్వ వ్యవస్థ ద్వారా తెలంగాణ పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు అందుతున్న ఒక విస్తృత అకాడమిక్ మద్దతు అనే చెప్పాలి. టి సాట్ విద్య, నిపుణ ఛానళ్లతో పాటు యాప్, యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా ఈ కంటెంట్ అందుబాటులో ఉండటం వల్ల, గ్రామీణ విద్యార్థికీ, నగర విద్యార్థితో సమానంగా చదువుకునే అవకాశం లభిస్తోంది. ఈ కార్యక్రమాల విలువను అర్థం చేసుకోవాలంటే, ఒకసారి గ్రామీణ విద్యార్థి జీవితాన్ని చూడాలి. దూరపు గ్రామంలో, సరైన అధ్యాపకులు లేక, ఆర్థిక పరిమితులతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు టి సాట్ ఒక గురువుగా మారింది. తరగతి గదిలో కూర్చోలేని విద్యార్థికి, టెలివిజన్ తెరపై కనిపించే ఉపాధ్యాయుడే ఆశగా మారారు. నాకు కోచింగ్ సాధ్యం కాదు అనే నిరాశను, నాకు కూడా ఉద్యోగం వస్తుంది అనే నమ్మకంగా మార్చే శక్తి ఈ టి సాట్ డిజిటల్ విద్యలో ఉంది. టి సాట్ సేవలు ఎడ్‌సెట్‌కే పరిమితం కావడం లేదు. ఎప్‌సెట్, పిజి ఇసెట్, డిఎస్‌సి వంటి అనేక కీలక పరీక్షల కోసం కూడా ప్రత్యేక డిజిటల్ కంటెంట్‌ను ప్రభుత్వం అందిస్తోంది. ఉన్నత విద్య, ఉపాధ్యాయ నియామకాలు, సాంకేతిక విద్య... ప్రతి దశలో విద్యార్థులకు తోడుగా నిలవాలన్న సంకల్పం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే వేదికపై విభిన్న పరీక్షలకు అవసరమైన నాణ్యమైన కంటెంట్‌ను అందించడం, విద్యలో సమగ్రతను తీసుకొచ్చే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. టి సాట్ పాత్ర విద్యతో మాత్రమే ముగియదు. వ్యవసాయం, ఆరోగ్యం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో కూడా ఈ వేదిక కీలకంగా మారింది. రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన, మహిళలకు ఉపాధి శిక్షణ, యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఒకే ప్రసార వేదిక ద్వారా ప్రజల వద్దకు చేరుతున్నాయి. ఇలా టి సాట్ ప్రజలకు కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా పంచుతోంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా సాగుతున్న టి సాట్ కార్యక్రమాలు గ్రామీణ -నగర అసమానతలను తగ్గించే శక్తివంతమైన సాధనంగా మారుతున్నాయి. ఒకప్పుడు నగరాల్లోనే లభించిన విద్యా వనరులు, ఇప్పుడు గ్రామాల్లోని ఇళ్లలోకి చేరుతున్నాయి. ఇది విద్యా సమానత్వం దిశగా ఒక పెద్ద అడుగు. ఈ కృషికి నాయకత్వం వహిస్తున్న టి సాట్ సిఇఒ వేణుగోపాల్ రెడ్డిని మంత్రి అభినందించడం, ఒక వ్యక్తికి కాదు ఒక వ్యవస్థకు ఇచ్చిన గుర్తింపుగా భావించాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే, టి సాట్ ముందు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ మేధ ఆధారిత విద్యా కంటెంట్, వర్చువల్ ల్యాబ్‌లు, ఇంటరాక్టివ్ అభ్యాస విధానాలు ప్రవేశపెడితే తెలంగాణ విద్యా రంగం జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందగలదు. ప్రభుత్వం చూపుతున్న ఆసక్తి, విధానపరమైన మద్దతు చూస్తే, ఈ దిశలో ముందడుగులు వేయడం ఖాయం అనిపిస్తోంది. అయితే అవకాశాలను మన యువత ఎంతవరకు వినియోగించుకుంటుంది? అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రభుత్వం టి సాట్ అనే వేదికను సిద్ధం చేసింది. ఈ వేదిక ద్వారా నిపుణులు జ్ఞానాన్ని పంచుతున్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉంది. కాబట్టి, యువత దీనిని సద్వినియోగం చేసుకుని పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధనతో పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి. టి సాట్ తరగతులు ఒక మార్గాన్ని చూపుతాయి. కానీ, ఆ మార్గంలో నడిచే బాధ్యత యువతదే. విద్య ఒక కాలానికి పరిమితమైన అవసరం కాదు. అది తరతరాల భవిష్యత్తును తీర్చిదిద్దే శాశ్వత శక్తి. పుస్తకాలు చేతిలో ఉండటం ఒక్కటే విద్య కాదని, సరైన మార్గనిర్దేశం, సమాన అవకాశాలు అందినప్పుడే జ్ఞానం సమాజాన్ని ముందుకు నడిపిస్తుందని తెలంగాణ ప్రభుత్వం తన విధానాలతో నిరూపిస్తోంది. ఈ దిశలో టి సాట్ నెట్‌వర్క్ ద్వారా చేపడుతున్న డిజిటల్ విద్యా కార్యక్రమాలు, రాష్ట్రంలో ఒక నిశ్శబ్దమైన విద్యా విప్లవానికి నాందిగా నిలుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ డిజిటల్ విద్యా యాత్ర, విద్య రంగంపై పెట్టుబడి పెడితే, యువత భవిష్యత్తు వెలుగొందుతుంది. జ్ఞానం ప్రజల వద్దకు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం. టి సాట్ రూపంలో సాగుతున్న ఈ జ్ఞానయాత్ర, యువత కలలను నిజం చేసే వరకు నిరంతరం కొనసాగాలి. ఇదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష!. జి. లక్ష్మీదేవి

మన తెలంగాణ 4 Feb 2026 6:00 am

4Feb2026 |పంచాంగం &నేటి రాశి ఫలితాలు

4Feb2026 | పంచాంగం & నేటి రాశి ఫలితాలు 4Feb2026 | నేటి

ప్రభ న్యూస్ 4 Feb 2026 6:00 am

భారత్ నుంచి మాకు సమాచారం లేదు.. చమురు కొనుగోళ్ల నిలిపివేతపై రష్యా

మాస్కో : రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ఆచితూచి స్పందించింది. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మంగళవారంనాడు స్పందించారు. తమకైతే ఈ అంశంలో భారత్‌న నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. భారత్‌తో తమకు విలువైన సంబంధాలు ఉన్నాయని, ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగ్యస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తామని, అదే సమయంలో రష్యా-ఇండియా మధ్య కీలక రంగాల్లో అత్యంత లోతైన, విస్తృతమైన సహకారం కూడా ఏమాత్రం తక్కువ కాదన్నారు. భారత్ మాకు అత్యంత ముఖ్యమని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి భారీ డిస్కౌంట్‌తో ముడిచమురును కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ కీలకంగా ఉంది. ఇది పశ్చిమ దేశాలకు కంటగింపుగా మారింది. 

మన తెలంగాణ 4 Feb 2026 5:50 am

లంక పునర్నిర్మాణం సాధ్యమేనా?

హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం సముద్రాల సరిహద్దులతో ఏర్పడిన ద్వీప దేశంగా భారత దేశ తీరానికి 50 కి.మీ దూరంలో ఉన్న శ్రీలంక 04 ఫిబ్రవరిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లలో మునిగి ఉన్నది. 1972 వరకు ఈ ద్వీపాన్ని ‘సిలోన్’గా పిలవడం జరిగేది. 1948లో పాక్షిక స్వాతంత్య్రం పొంది, 22 మే 1972లో పూర్తి స్వాతంత్య్రం పొందిన తర్వాత 1978, 04 ఫిబ్రవరి రోజున బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొంది అధికారికంగా ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్ర శ్రీలంకగా రూపాంతరం చెంది ప్రెసిడెన్షియల్ -పార్లమెంటరీ మిశ్రమ వ్యవస్థగా తనదైన రాజ్యాంగంతో అనేక ఒడుదుడుకులు మధ్య నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని 04 ఫిబ్రవరి 2026న నిర్వహించుకుంటున్నది. పశ్చిమ ఈశాన్య భారత బెంగాల్, ఒడిశా నుంచి వలస వచ్చిన ఆధునిక ఇండో-ఆర్యన్ సెటిలర్స్‌ను సింహలీస్ అని పిలవడం జరుగుతున్నది. ప్రస్తుతం 23.5 మిలియన్ల శ్రీలంక జనాభాలో 75 శాతం సింహలీస్, 11 శాతం శ్రీలంక తమిళులు, 9 శాతం వరకు ముస్లిం మూర్‌లు, 4 శాతం భారత తమిళుల జనాభా ఉన్నది. అత్యధిక సింహలీలు బుద్ధిస్టులుగా, తమిళులు హిందువులుగా రెండు గ్రూపుల మధ్య విభేదాలతో రెండున్నర దశాబ్దాలపాటు ఎల్‌టిటిఇ, అధిక జనాభా ఉన్న సింహలీస్ (ప్రభుత్వ సహకారంతో) మధ్య వర్గ పోరు (1976- 2002) కూడా జరగడం, అనేక హింసాత్మక ఘటనలు చేటు చేసుకోవడం, చివరికి ఎల్‌టిటిఇ పోరాటాలను అడ్డుకోవడం, అంతం చేయడం చూసాం. శ్రీలంక ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభాల నడుమ కొనసాగుతున్న శ్రీలంక ప్రయాణంలో ఆహార, ఇంధన, ఔషధాల కొరతలు కూడా తోడుకావడంతో పలు ప్రజా ఉద్యమాగ్నులు ఎగిసిపడడం చూసాం. శ్రీలంక సంస్కృతి, నాగరికతను పరిశీలిస్తే దానిపై బుద్ధిస్టుల, హిందువుల, వలస పాలకుల, జాతి వైవిధ్య, ఆధునిక ప్రపంచీకరణ ప్రభావాలు ప్రస్ఫుటంగా కనుపిస్తాయి. శ్రీలంకలో సామాజికపరంగా కులమత వ్యవస్థలు భారతదేశంలో ఉన్నట్లుగానే కనిపిస్తాయి. 16వ శతాబ్దంలో శ్రీలంక తీరప్రాంతాలు పోర్చుగీస్ ఆధీనంలో, 17వ శతాబ్దంలో డచ్‌ల ఆధీనంలో పాలన కొనసాగింది. 1796 నుంచి ఈ ద్వీప ప్రాంతం బ్రిటీష్ ఆధీనంలోకి క్రమంగా మారడం, 1833లో పూర్తిగా బ్రిటీష్ పాలన పగ్గాలు చేపట్టి ఈ ద్వీపానికి ‘సిలోన్’గా నామకరణం చేసి వలస పాలన కొనసాగించడం, వలస పాలన 1948 వరకు కొనసాగడం చూసాం. సిలోన్ ప్రాంతం 1972లో శ్రీలంక రిపబ్లిక్‌గా పేరు మారడం, 04 ఫిబ్రవరి 1948న పూర్ణ స్వాతంత్య్ర పొందిన తనదైన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్ర శ్రీలంకగా రూపాంతరం చెందడం జరిగింది. శ్రీలంక రాజధానిగా ‘శ్రీ జయర్ధనేపుర కొట్టె (కొలంబో)’ పాలన కేంద్రంగా పని చేస్తున్నది. శ్రీలంక అధ్యక్షుడిని ఎన్నిక ద్వారా ఎంచుకోవడంతోపాటు 225 మంది కలిగిన లెజిస్లేటివ్ పార్లమెంట్ ద్వారా ప్రధాన మంత్రిని ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ‘అరుణ కుమార దిసనాయకె’, ప్రధానిగా ‘హరిణి అమరసూర్య’లు సేవలు అందిస్తున్నారు. గతంలో దీర్ఘకాలం పాటు శ్రీలంకకు పెద్దన్నవలే నిలిచింది మన భారత్. ప్రస్తుత డిజిటల్ యుగంలో మారుతున్న సమీకరణాల ఆధారంగా ఆర్థిక చేయూత బూచీ చూపుతూ చైనా నాయకత్వం శ్రీలంకను మచ్చిక చేసుకోవడం చూస్తున్నాం. 04 ఫిబ్రవరి 2026న శ్రీలంక జరుపుకుంటున్న 78వ స్వాతంత్య్ర దినోత్సవం -2026 ఇతివృత్తంగా శ్రీలంకను నిర్మించుకుందాం (లెట్జ్ బిల్ శ్రీలంక) అనే అంశాన్ని తీసుకొని ఘనంగా నిర్వహించుకోవడానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో రాజధాని కేంద్రంగా జాతీయ పతాకాన్ని ఎగిరేయడం, ఆకర్షణీయ రక్షణ దళాల కవాతులు, సంస్కృతి సంప్రదాయాల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ ఘన కీర్తిని చాటే ప్రదర్శనలు లాంటివని అనేకం నిర్వహిస్తారు. అనేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక రానున్న రోజుల్లో శాంతియుతంగా ప్రగతి పథాన స్థిరంగా అడుగులు వేయాలని కోరుకుందాం. మన పొరుగు దేశవాసులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం.  డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి 99497 00037

మన తెలంగాణ 4 Feb 2026 5:40 am

ఒప్పందం.. అపూర్వం

న్యూఢిల్లీ: భారతదేశం - అమెరికా వాణిజ్య ఒప్పందంలో దేశ ప్రయోజనాలే కీలకం అని, ఇది దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే గొప్ప ఒ ప్పందం అని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నాడు వెల్లడించారు. ఎ న్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని ఈ ప్రకటన చేయగానే ఎం పీలు అంతా హర్షామోదాలతో ఆమోదించారు. కొద్ది రోజుల వ్యవధిలో అ టుయురోపియన్ యూనియన్, ఇటు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నందుకు ఎన్డీఏ సంకీర్ణ సభ్యులు ప్రధాని మోదీని అభినందించారు. ఈ ఒప్పందాలు భారతదేశంలో తయారీదారులు, ఎగుమతిదారులు, పారిశ్రమల వ్యవస్థాపకులను బలోపేతం చేస్తుందని ప్రధాని అన్నా రు. భారతదేశం- అమెరికా మధ్య కుదిరిన వాణిజ్యం గొప్ప నిర్ణయంగా అభివర్ణించారు.ఉభయ దేశాల మధ్య కుదిరిన వాణిజ్యఒప్పందం పట్ల దేశవ్యాప్తంగా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో తొమ్మిది అతిపెద్ద వాణిజ్య ఒప్పందాలు కుదరడం పట్ల ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. మనదేశం మొత్తం 39 దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇది చరిత్రాత్మకం , ఒప్పందాలు కుదుర్చుకున్న మొత్తం 39 దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుఅన్నారు. దీనివల్ల దేశంలో వాణిజ్యపరంగా చక్కటి వాతావరణం నెలకొంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శివసేన ఎంపి మిలింద్ దేవర మాట్లాడుతూ, ప్రభుత్వం భారతదేశ ప్రయోజనాలకోసమే పని చేస్తుందని, వాణిజ్యం ఒప్పంద అయినా, బడ్జెట్ అయినా, ప్రధాని మోదీ ఎంపీలకు స్వయంగా వివరించడం గొప్ప నిర్ణయం అన్నారు.ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వాణిజ్య ఒప్పందాలపై విసృ్తతస్థాయిలో చర్చించినట్లు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు.ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబిన్ ను స్వాగతించారు. పార్టీ అత్యున్నత పదవికి ఎన్నికైన ఆయనను అభినందించారు. ప్రజా సంక్షేమం, స్నేహ పూర్వక విధానాలు, కార్యకర్తల కృషి ఫలితంగా ఎన్డీఏ మిత్రపక్షాలు వివిధ ఎన్నికలలో విజయం సాధిస్తున్నారని ప్రధాని పేర్కొన్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు. స్థానిక సంస్థలతో సహా వివిధ ఎన్నికలలో విజయం తో సంతృప్తి చెందరాదని, క్షేత్ర స్థాయిలో గట్టి కృషి చేయాలని ప్రధాని ఎంపీలను కోరారు. ప్రజా సంక్షేమ పథకాలు, క్షేత్ర స్థాయిలో కృషి వల్లనే ఈ విజయాలు లభించాయని గుర్తెరిగి మసులు కోవాలన్నారు మోదీ. భారతదేశం ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంతో పాటు,, వికసిత్ భారత్ దార్శనికత తో దేశాన్ని ప్రగతిమార్గంలో తీసుకువెళ్ల డానికి ఎన్డీఏ అన్నిపక్షాలు నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు జేడీ(ఎస్) నాయకుడు, కేంద్రమంత్రి హెచ్ డి కుమారస్వామి అన్నారు. ఎల్ జేపి(ఆర్ వి) నాయకుడు, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ ఎన్డీఏ సమావేశంలో సాధారణ బడ్జెట్ పై కూడా చర్చించామని, దీనిని దేశ ప్రజల్లో అత్యధికులు ప్రశంసించారని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ, టీడీపీ , జెడి(యు), జెడి(ఎస్) శివసేన, ఎల్ జేపి (ఆర్) సభ్యులు ఎన్డీఏకు చెందిన వివిధ నియోజకవర్గాల ఎంపీలు పాల్గొన్నారు.

మన తెలంగాణ 4 Feb 2026 5:30 am

రెబెల్స్‌తో జాగ్రత్త

మన తెలంగాణ/హైదరాబా:మున్సిపల్ ఎన్నిక ల్లో విపక్షాల వ్యూహాలకు ధీటుగా ఎదుర్కొంటూ ఏడు కార్పొరేషన్లను, మెజారిటీ మున్సిపల్ చైర్మ న్ల పదవులనూ కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్వర్యంలో జరిగిన మంత్రులు, ముఖ్య నేతల కీలక సమావేశంలో నిర్ణయించారు. విపక్షాల వ్యూహాలను ఎక్కడికక్క డ ఎదుర్కొవాలని ముఖ్యమంత్రి అన్నారు. ము న్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సా యంత్రం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడ తలెత్తిన రెబెల్స్ బెడద అంశంపై చర్చించారు. ఈ రెబెల్స్‌ను బుజ్జగించడంలో లోక్‌సభ నియోజకవర్గాల ఇంఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెబెల్స్ నామినేషన్లు దాఖలు చేయకుండా నిరోధించడంలో ఎందుకు విఫలమయ్యారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, వారిని బుజ్జగించి నామినేషన్ ఉపసంహరింపజేయాలని, లేనిపక్షంలో విపక్షాలకు మేలు జరుగుతుందని ఆయ న ఆందోళన వ్యక్తం చేశారు.' బుధవారం నుంచి ముఖ్యమంత్రి మిర్యాలగూడ నుంచి విస్తృతంగా చేపట్టనున్న పర్యటన సందర్భంగా జనసమీకరణ గురించి కూడా వారు చర్చించారు. అనేక స్థానా ల్లో బిఆర్‌ఎస్ కంటే బిజెపితోనే పోటీ ఉండే అవకాశం ఉందని ఇరువురు మంత్రులు సమావేశం లో ప్రస్తావించినట్లుతెలిసింది. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటన, హార్వర్డ్ యూనివర్సిటీకి విద్యార్థిగా వెళ్ళిన అనుభూతుల గురించి మంత్రులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులంతా ముఖ్యమంత్రిని అభినందించారు. ఇదిలాఉండగా సమావేశానంతరం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తొంబై శాతం మున్సిపల్ చైర్మన్ పదవులను, ఏడు కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నదని ధీమాగా చెప్పారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి లేవదీసిన అభ్యంతరాలు, ఇంకా పలు జిల్లాల్లో వివాదాలు వచ్చిన విషయాల గురించి విలేకరులు ప్రశ్నించగా, జగిత్యాల, గద్వాల ఒకటి, రెండు చోట్ల తప్ప ఎక్కడా సమస్య లేదన్నారు. జీవన్ రెడ్డి మనోభావాలను అర్థం చేసుకున్నామని, ఆయనతో మాట్లాడుతానని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. చిన్న సమస్యలన్నీ బుధవారం పరిష్కారమవుతాయని ఆయన చెప్పారు.

మన తెలంగాణ 4 Feb 2026 5:00 am

తపాలాశాఖలో అవినీతి అనకొండ

మన తెలంగాణ/గోషామహల్: దక్షిణాదిలోనే ఖ్యాతిగాంచిన తపాలా శాఖకు కేంద్ర బిందువైన ప్రధాన కార్యాలయంలో నకిలీ క్యాజువల్ కార్మికుల జీ త భ త్యాలను కైంకర్యం చేసిన ఓ ఘరానా అధికారి నిర్వాకమిది. నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై ఉండే తపాలా శాఖలో అరకోటికి పైగా అవినీతి చోటు చేసుకోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తుంది. క్యాజువల్ కార్మికుల జీతాల పేరిట అరకోటికి పైగా ఎగనామం పెట్టిన అవినీతి అధికారికి అండగా నిలవడంతో పాటు పదోన్నతి కల్పించి అందలమెక్కించిన ఘనత తపాలా శాఖ అధికారులకు దక్కింది. తపాలా శాఖ హైదరాబాద్ సా ర్టింగ్ డివిజన్‌లో చోటు చే సుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తపాలా శాఖలో సదరు అధికారిపై అనేక ఫిర్యాదులు రావడంతో తప్పని పరిస్ధితుల్లో విచారణ కమిటీ వేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. తపాలా శాఖలో క్యా జువల్ కార్మికుల బకాయిల చెల్లింపులో అవినీతి జరిగిందని కమిటీ తేల్చి నా, చర్యలు తీసుకునేందుకు తపాలశాఖ ఉన్నతాధికారులే జంకుతున్నారని కింది స్థాయి ఉద్యోగులు చెవులు కొరు క్కుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తపాలా సర్కిల్‌లో సాధారణ పోస్టల్ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే తనపై అధికారులతో సహా తపాలా శాఖనే శా సించే స్థాయికి ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ సర్కిల్‌లో పోస్టల్ సర్వీసెస్ గ్రూప్ బి అధికారి స్థా యికి ఎదిగారు. హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ రీజియన్లలో వివిధ డివిజన్లలో పని చేస్తూ, అధికార దాహంతో అక్రమంగా అందినకాడికి దండుకున్నారు. సుమారు అరకోటికి పైగా ప్రభుత్వ ఖజానాను స్వాహా చేశారు. తపాలా శాఖలో ఆ యన చెప్పిందే వేదం..చేసిందే వైద్యం అన్నట్లుగా అతని హవా కొ నసాగుతుంది. ఆయన అవినీతి అక్రమాలకు అంతే లేదు. అతనిపై చర్యలకు తపా లా శాఖ ఉన్నతాధికారులే జంకు తున్నారంటే ఆయన లెవల్ ఏపా టిదో ఇట్టే అర్దం చేసుకోవచ్చు. పోస్టల్ సర్వీసెస్ గ్రూప్ బి అధికారిగా పనిచేసిన సదరు అధికారి, తన డివిజన్ పరిధిలో కార్యాలయాలకు కావాల్సిన సాంకేతిక స్టేషనరీ సామగ్రి కొ నుగోలు చేసినట్లు కాగితాలపై చూపించి, సదరు కార్యాలయాలకు సామగ్రిని సరఫరా చేయకుండా తన సొంత ఖజానాకు తరలించుకున్నారన్న ఆరో పణలు గుప్పుమంటున్నాయి. హైదరాబాద్ సార్టింగ్ డివిజన్‌లో సీనియర్ సూపరింటెంటెండ్ గా పని చేసిన కాలంలో 223 మంది క్యాజువల్ కార్మికుల జీత భత్యాల బకాయిలకు సంబంధించి తపాలా శాఖకు చెందిన సుమారు అరకోటికి పైగా నిధులను దారి మళ్లీంచారు. 223 మంది క్యాజువల్ కార్మికుల్లో 19 మందికి డీపీసీ చేయకుండా అక్రమంగా గ్రామీణ డాక్ సేవక్‌లుగా పదోన్నతి కల్పి ంచి, వారితో క్యాజువల్ కార్మికులుగా, గ్రామీణ డాక్ సేవక్‌లుగా పని చేయించి, ఫోర్జరీ పత్రాలతో 19 మంది జీత భత్యాలను అక్రమంగా స్వాహా చే శారని స్పెషల్ ఆడిట్ రిపోర్టులో ఆడిట్ అధికారులు నిర్దారించారు. అయినప్పటికీ సదరు అధికారిపై తపాలా శాఖ ఉన్నతాధికారులు నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం గమనార్హం. ఉన్నతాధికారుల అండదండలు... తపాలా శాఖలో సదరు అధికారి లక్షల్లో నిధులు దారి మళ్లించారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తపాలా శాఖ ఉన్నతాధికారులు విచారణ నిమిత్తం త్రి సభ్య కమిటీని నియమించారు. ఈ కమిటి శాఖాపరమైన (అంతర్గత) ఆడిట్ వివరాల సమగ్ర విచారణ చేపట్టి, క్యాజువల్ కార్మికుల బకాయిల చెల్లిం పులో అవకతవకలు జరిగాయని, తపాలా శాఖకు చెందిన దాదాపు రూ. 52 లక్షల నగదు చెల్లింపుల్లో అవకతవకలు, అవినీతి జరిగిందని తేల్చింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. తపాలా శాఖ నిధులను తమలపాకులా కైంకర్యం చేసినప్పటికీ సదరు అధికారి తపాలా శాఖ లో దర్జాగా విధులు వెలగ బెడుతుండటం గమనార్హం. ప్రభుత్వ ఖజానాను అక్రమంగా కొల్లగొట్టి, తపాలా శాఖను ముంచేసిన సదరు అధికారిపై చర్య లు చేపట్టాల్సిన ఉన్నతాధికారులు సదరు అధికారికి పోస్టల్ సర్వీసెస్ గ్రూప్ = ఏ అధికారిగా పదోన్నతి కల్పించడం విడ్డూరంగా ఉందని తపాలాశాఖ అధికారులు, ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా తపాలా శాఖ ఉన్నతాధికారులు స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకుని, తపాలా శాఖ లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

మన తెలంగాణ 4 Feb 2026 4:30 am

మరో హామీకి ఎగనామం!

మనతెలంగాణ/హైదరాబాద్ : రెండు లక్షల ఉ ద్యోగాలు మొదటి ఏడాదిలోనే అని ఇచ్చిన మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వా న్ని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అడ్డదారి లో గద్దెనెక్కిన రేవంత్.. తీరా అది ఐదేళ్ల హామీ అ ని, పిసిసి చీఫ్‌తో సిఎం పలికిస్తున్న చిలుక ప లుకులు చూసి యువతరం ఛీకొడుతోందని విమర్శించారు. తొలి సంవత్సరమే రెండు లక్షల ని యామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కెసిఆర్ హ యాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలకు ఫోజు లు కొట్టిన సిఎం, ఆ తరువాత మొత్తానికే చేతులెత్తేయడంతోనే తెలంగాణలో రిక్రూట్‌మెంట్ జీరో గా మారిపోయిందని పేర్కొన్నారు. అప్పటికే ల క్షా 65 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పనిగట్టుకుని రేవంత్‌రెడ్డి చల్లిన బు రద అంతా అబద్ధాలతో అందలం ఎక్కడానికేనని అందరికీ అర్థమైపోయిందని చెప్పా రు. పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వని చేతకాని దద్దమ్మ పాలన చూసి నిరుద్యోగులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా దు మ్మెత్తి పోస్తున్నారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్‌కు పాతరేసి, వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును నిత్యం తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉందని వ్యా ఖ్యానించారు. ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన ప్రజలు ఊరుకుంటారని అనుకుంటే అది పొరపాటే అని హెచ్చరించారు.

మన తెలంగాణ 4 Feb 2026 3:40 am

రైల్వే హబ్‌గా హైదరాబాద్

మన తెలంగాణ/హైదరాబాద్: రైల్వే హబ్ గా హైదరాబాద్ మారబోతున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. యాదగిరి గుట్టకు ఎంఎంటిఎస్ మార్గం వేసేందుకు త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని ఆయన చెప్పారు. బడ్జెట్ అంటే ఉచితాలు ఇవ్వడం కాదని ఆయన మంగళవారం పార్టీ ముఖ్య నేతలు ఎన్‌వి సుభాష్, వెంకట్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. త్వరలో కాంగ్రెస్ కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో కనుమరుగు కాబోతున్నదని ఆయన జోస్యం చెప్పారు.రైల్వేకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రానికి లేనివిధంగా హైదరాబాద్ కు ప్రాజెక్టులు కేటాయించిందని, 2009-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల కోసం అప్పటి ప్రభుత్వం రూ.886 కోట్లు కేటాయించగా, తమ ప్రభుత్వం ఏకంగా 6 రెట్లు అధికంగా రూ.5,454 కోట్లు కేటాయించిందని ఆయన వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన రైల్వే ట్రాక్ ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, అమృత్ భారత్ పథకం ద్వారా 42 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నామని. వాటిలో ఇప్పటికే 5 స్టేషన్లు పూర్తి అయ్యాయని,ఇంకా బేగంపేట, కరీంనగర్, వరంగల్, చర్లపల్లి స్టేషన్ల ఆధునీకరణ పూర్తయిందని ఆయన తెలిపారు. త్వరలోనే కొమురవెల్లి మల్లన్న, జోగులాంబ రైల్వే స్టేషన్లు కూడా పూర్తికానున్నాయని, 2026లో 30 కి పైగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి అవుతాయని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటికే 5 వందే భారత్ రైళ్లు, 2 అమృత్ భారత్ రైళ్లు కేటాయించారని, 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 900 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అందులో బేగంపేట, కరీంనగర్, వరంగల్, చర్లపల్లి స్టేషన్ల ఆధునీకరణ పూర్తయిందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కానున్నదని, దేశంలో 7 హైస్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్స్ ప్రకటిస్తే.. అందులో మూడు మన హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభం అవుతున్నాయని, అవి హైదరాబాద్-పుణే, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై అని ఆయన తెలిపారు. ఎంఎంటిఎస్ రెండో దశ నిర్మాణం కోసం రూ.12 వేల కోట్లతో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. యాదగిరిగుట్టకు ఎంఎంటిఎస్ లైన్ ను తీసుకొచ్చి, భక్తులకు అందుబాటులోకి తేనున్నామని, త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారని ఆయన తెలిపారు. మేడారానికి 3 కోట్లకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ నిధులను ఇప్పించే బాధ్యత తనదేనని అన్నారు. నిధులు ఇవ్వలేదని రాష్ట్ర మంత్రులు చేసిన విమర్శను ఆయన తోసిపుచ్చారు. కేంద్రం ఇచ్చే నిధులను మంత్రులు పంచుకోకుంటే చాలు అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అన్ని వర్గాలకూ మేలు చేసే బడ్జెట్.. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉందన్నారు. బడ్జెట్ అంటే ఉచితాలు ప్రవేశపెట్టడం, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బడ్జెట్ ప్రవేశ పెడతారనే ప్రజల ఆలోచనకు, భావనకు భిన్నంగా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన వివరించారు.రాష్ట్రంలో ఉన్న 23 లక్షల ఎంఎస్‌ఎంఇలకు ఈ బడ్జెట్ ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. ఈ బడ్జెట్లో వచ్చే ఐదేళ్ల కోసం రూ.10 వేల కోట్లతో ప్రకటించిన బయోఫారా ‘శక్తి’ కార్యక్రమం ద్వారా ఫార్మా క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్‌డకు చాలా మేలు జరగనుందని అన్నారు.తెలంగాణలో దాదాపు 5 వేల కిలో మీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేశామని ఆయన తెలిపారు. రూ.2,471.76 కోట్ల వ్యయంతో 64 కిలో మీటర్ల పొడవున ఆర్మూర్- జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణం జరగనుందని ఆయన చెప్పారు. రూ.2,484 కోట్ల అంచనా వ్యయంతో 59 కిలోమీటర్ల మేర జగిత్యాల- కరీంనగర్ జాతీయ రహదారి నిర్మించనున్నాట్లు ఆయన తెలిపారు. రూ.2,730 కోట్ల ఖర్చుతో 68 కిలో మీటర్ల పొడవున 4 లేన్లతో ఆర్మూరు-జగిత్యాల-మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణం జరగనుందని ఆయన వివరించారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగం)కు రూ.21,629 కోట్లను కేంద్రం కేటాయించిందని, రాష్ట్రంలో రూ.42 వేల కోట్ల నిధులతో కొత్తగా జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 4 Feb 2026 3:30 am

చట్టాలను దేశం వీడండి

న్యూఢిల్లీ : ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌పై దేశ స ర్వోన్నత న్యాయస్థానం ఆగ్ర హం వ్యక్తం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేసింది. భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటిం చి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఈమేరకు వా ట్సాప్ మాతృసంస్థ మెటాకు మంగళవారం సు ప్రీం కోర్టు హెచ్చరిక జారీ చేసింది. “ మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరు. మా డేటాకు సంబంధించి ఒక్క అంకెను పంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించము’ అని అమెరికాకు చెందిన మెటాను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూ ర్యకాంత్ మందలించారు. దేశ చట్టాలను పాటించకపోతే భారతదేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాట్సాప్ 2021ప్రైవసీ పా లసీకి సం బంధించిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తాజాగా విచారించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడం దోపిడీ అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దేశం లోని లక్షలాది మంది పేదలు, చదువురాని ప్రజలు ప్రైవసీ పాలసీని అర్థం చేసుకోగలరా అని మెటా ప్రతినిధులను చీఫ్ జస్టిస్ సూటిగా ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో మెటా పాలసీలు అర్థం చేసుకోవడం తమకే ఇబ్బందిగా మారుతోందని, ఒకసారి తనకు ఓ వైద్యుడు వాట్సప్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపితే దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్‌లో కనిపించాయన్నారు. ఇక దేశం లోని లక్షలాది మంది పేద, చదువురాని ప్రజలు ఈ విధానాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్ర శ్నించారు. కాగా, మెటా ఇంజినీరింగ్ బృందం ఇతరుల వాట్సాప్ మెసేజ్‌లను చదవగలదని వాట్సాప్ అంతర్జాతీయ వినియోగదారుల బృందం ఇటీవల అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

మన తెలంగాణ 4 Feb 2026 3:00 am

వాణిజ్య యుద్ధంలో ఎవరిది పైచేయి?

భారత్- అమెరికా మధ్య గత కొన్ని నెలలుగా సన్నగిల్లుతున్న ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ బలోపేతమయ్యేలా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ముందడుగు పడటం హర్షించదగిన పరిణామం. రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తూ, ఆ దేశం ఉక్రెయిన్‌పై యుద్ధం సాగించడానికి పరోక్షంగా సాయపడుతోందన్న అక్కసుతో భారత్‌పై అధిక సుంకాలు విధించిన అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తూ, తాము విధించిన ప్రతీకార సుంకాలను తగ్గించుకుంటున్నామంటూ తాజాగా చేసిన ప్రకటన ఒక విధంగా భారత్‌కు కాస్త ఊరట కలిగించే అంశమే. ఒకవైపు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకుంటూనే, మరోవైపు అమెరికాతో వాణిజ్య చర్చలలో దృఢమైన వైఖరిని కనబరిచినందుకు ఇది భారత్‌కు దక్కిన విజయంగా అభివర్ణించవచ్చు. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఇప్పటివరకూ భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాలు ఇకపై 18 శాతానికి తగ్గుతాయి. రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన 25 శాతం అదనపు సుంకాలను సైతం ఉపసంహరించుకుంటామన్న ట్రంప్ హామీతో, ఇండో -పసిఫిక్ ప్రాంతంలో అమెరికా అతి తక్కువ పన్నులు విధించే దేశాల జాబితాలో ఇండియా చేరినట్లయింది. పదిరోజుల క్రితం భారత్- ఐరోపా యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక విధంగా ట్రంప్‌ను పునరాలోచనలోకి నెట్టిందని చెప్పవచ్చు. ప్రపంచ జిడిపిలో 25 శాతానికి, వాణిజ్యంలో మూడో వంతుకు ప్రాతినిధ్యం వహించే ఈ ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ గా దేశదేశాలన్నీ ప్రస్తుతిస్తున్నాయి. ఇది అమలులోకి వస్తే అమెరికా అధిక సుంకాల ప్రభావం భారత్‌పై అంతగా ఉండకపోవచ్చు. అమెరికా సుంకాల వల్ల భారత్‌కు కలిగే నష్టాలను భర్తీ చేసే స్థాయిలో ఈ ఒప్పందం ఉండటమే ఇందుకు కారణం. పైపెచ్చు మరో రెండు నెలల్లో కెనడాతో భారత్ కుదుర్చుకోబోయే పాతిక వేల కోట్ల రూపాయల విలువైన యురేనియం ఒప్పందం సైతం ట్రంప్‌ను కంగారు పెట్టి ఉండవచ్చు. ఇవి చాలవన్నట్లు పలు దక్షిణ అమెరికా దేశాలతోనూ భారత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇవన్నీ కార్యరూపం దాల్చితే, భారత్‌పై తాము విధించిన అధిక సుంకాల ప్రభావం ఉండకపోగా, ఆసియాలో కీలక మిత్రదేశమైన భారత్.. అమెరికాకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఆసియాలో చైనా ప్రాబల్యానికి ముకుతాడు వేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇవన్నీ ఆలోచించిన మీదట ట్రంప్ దిగిరాక తప్పలేదు. ఐరోపా యూనియన్‌తో చారిత్రాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా తిరుగులేని దౌత్యనీతిని కనబరచిన భారత్, అగ్రరాజ్యంతో కోరి తగవు కొనితెచ్చుకోకుండా చివరివరకూ సంయమనం పాటించింది. రష్యా చమురు కొనుగోలు చేయొద్దన్న అమెరికా హూంకరింపులకు తలవంచినట్లే వంచిన భారత్, ఇప్పుడు వెనెజువెలా చమురును చౌకగా కొనుగోలు చేసేందుకు అమెరికాతో బేరసారాలు ఆడబోతోంది. వెనెజువెలాను తన గుప్పిట్లో పెట్టుకున్న అమెరికాకు ఆ దేశ చమురును విక్రయించడం తలనొప్పిగా మారింది. భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా వెనెజువెలా చమురును భారత్‌కు విక్రయించవచ్చన్నది ట్రంప్ ఆలోచన కాగా, వీలైనంత చౌకగా కొనుగోలు చేయాలన్నది భారత్ ఎత్తుగడ. అయితే తాజా వాణిజ్య ఒప్పందం పూర్తిగా భారత్‌కు అనుకూలమా అంటే కాదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ ఒప్పందంలోని వివరాలేమీ ఇంకా వెల్లడికాకపోయినా, అమెరికా దిగుమతులపై సుంకాలేమీ విధించకూడదన్న షరతుకు భారత్ అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించడం, దీనిపై ప్రధాని మోడీ స్పందించకపోవడం కొంతమేరకు ఆందోళన కలిగించే అంశం. ఏటా 500 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు కూడా ట్రంప్ చెబుతున్నారు. అదే జరిగితే, వ్యవసాయం, ఇంధనం, టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో దేశీయ ప్రయోజనాలు దెబ్బతింటాయనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యం గా అమెరికా వ్యవసాయోత్పత్తులు ముంచెత్తితే గ్రామీణ భారతం అతలాకుతలమయ్యే ప్రమాదం లేకపోలేదు. దేశ జనాభాలో 50% ప్రజానీకానికి వ్యవసాయమే జీవనాధారమనే సంగతి గమనార్హం. తన దౌత్యనీతి ద్వారా వాణిజ్య ఒప్పందానికి అమెరికా దిగివచ్చేలా చేయడం భారత్ విజయమయితే, తమ ఉత్పత్తులపై సుంకాలు విధించకుండా భారత్ తలవొగ్గేలా చేయడం అమెరికా సాధించిన విజయమని చెప్పాలి.  

మన తెలంగాణ 4 Feb 2026 12:50 am

బుధవారం రాశి ఫలాలు (04-02-2026)

మేషం ఇంటబయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దైవానుగ్రహం తో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వృషభం శారీరక మానసిక అనారోగ్యాలు ఉంటాయి. ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకొన్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బందికి గురవుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు కోపానికి గురి కావల్సి వస్తుంది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. మిధునం నూతన వస్తు, వాహన సౌకర్యం పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. కర్కాటకం ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. సింహం ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వ్యాపారమున ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది. శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కన్య ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. తుల నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తిఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. వృశ్చికం ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సౌకర్యాల కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి. కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి. ధనస్సు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం. మకరం చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. బంధువుల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగ విషయమై చెయ్యను పనికి నిందలు పడతారు. నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు. కుంభం బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి. మీనం ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు. వ్యాపారపరంగా ఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  

మన తెలంగాణ 4 Feb 2026 12:20 am

డబ్లూపిఎల్ 2026.. ఫైనల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్

వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) సీజన్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ టీమ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ బేథ్ మూనీ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ 6 ఫోర్లతో 62 పరుగులు సాధించింది. జార్జియా వరెహమ్ (35) తనవంతు పాత్ర పోషించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 15.4 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఢిల్లీకి ఓపెనర్లు లిజెల్లి లీ, షఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్ని అందించారు.లీ 24 బంతుల్లోనే 43, షఫాలీ 21 బంతుల్లో 31 పరుగుల చేశారు. లౌరా వాల్వర్డ్ 32 (నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన జెమీమా రోడ్రిగ్స్ 23 బంతుల్లోనే 41 పరుగులు చేసి తనవంతు సహకారం అందించింది. గురువారం జరిగే ఫైనల్లో బెంగళూరుతో ఢిల్లీ తలపడుతుంది.

మన తెలంగాణ 3 Feb 2026 11:54 pm

ఫైనల్లో ఇంగ్లండ్

 పురుషుల అండర్19 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా యువ జట్టును ఓడించి తుది పోరుకు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. కెప్టెన్ థామస్ అద్భుత సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన థామస్ 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 110 పరుగులు చేశాడు. కాలెబ్ ఫాల్కనర్ (40), ఫర్హాన్ అహ్మద్ (28), జోసెఫ్ (25), మేయ్స్ (24) పరుగులు చేసి తమవంతు సహకారం అందించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలో 250 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఒలివర్ పీక్ అద్భుత సెంచరీ సాధించినా ఫలితంలేకుండా పోయింది. దూకుడుగా ఆడిన ఒలివర్ 88 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. సమన్వయంతో ఆడిన ఓపెనర్ నితేశ్ శామ్యూల్ (47) పరుగులు సాధించాడు. మిగతా వారిలో ఆర్యన్ శర్మ (34) ఒక్కడే కాస్త రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మోర్గాన్, జేమ్స్, అల్బర్ట్ తలో రెండేసివికెట్లను పడగొట్టారు.

మన తెలంగాణ 3 Feb 2026 11:39 pm

రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి: కల్వకుంట్ల కవిత

 మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థిని అశ్మిత పాము కాటుకు గురవడం కలచివేసిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాల్లో నిత్యం కలుషిత ఆహారం, విద్యార్థుల ఆత్మహత్యలు, పాము కాట్లు వంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి మాత్రం కనువిప్పు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మొద్దు నిద్ర వీడి అస్తవ్యస్తంగా మారిన గురుకులాలను, సంక్షేమ హాస్టళ్లను గాడినపెట్టాలని, పాము కాటుకు గురైన అస్మితకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 3 Feb 2026 11:35 pm

కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన బాన్సువాడ కౌన్సిలర్లు

 మున్సిపల్ ఎన్నికల వేళ బాన్స్‌వాడలోని కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం, బాన్సువాడ పట్టణానికి చెందిన ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కెటిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్‌ఎస్లో చేరిన కౌన్సిలర్లు, బాడి శ్రీనివాస్, లాయక్, అక్బర్, ఖాదర్, గంగారామ్, రైటర్ రాజు కెటిఆర్ సమక్షంలో చేరారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ఎలమంచిలి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఇప్పటికే నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ బీ-ఫామ్స్ సమర్పించి ప్రచారంలో దూసుకుపోతుండగా, తాజా చేరికలతో కాంగ్రెస్ పార్టీ కోట కుప్పకూలినట్లయింది. పొచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి, బాన్సువాడ ప్రజలకు చేసిన ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ చేరికలతో బాన్సువాడలో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని, బీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని స్థానిక నేతలు ధీమా వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 3 Feb 2026 11:11 pm

సముద్రంలో కుటుంబాన్ని కాపాడిన బాలుడి సాహసం..

ఆస్ట్రేలియాకు చెందిన 13 ఏళ్ల ఆస్టిన్ ఆపిల్‌బీ , సముద్రంలో కొట్టుకుపోతున్న తన తల్లి, ఇద్దరు తోబుట్టువులను రక్షించడానికి ఎంతో సాహసం చేయడం సంచలనం కలిగించింది. రాష్ట్ర రాజధాని పెర్త్ నుంచి వచ్చిన ఆస్టిన్ అతని తల్లి జోనె ఆపిల్‌బీ (47), తమ్ముడు బియయు (12), చెల్లి గ్రేస్ (8) కలిసి చిన్న పడవలు(కయాక్), ఫెడల్‌బోర్డ్‌ల సాయంతో సముద్రం లో విహారానికి వెళ్లారు. అంతలోనే సముద్రంలో వాతావరణం మారిపోయింది. వారంతా దూరంగా తీరానికి కొట్టుకుపోయారు. సాయం కోసం తల్లి సూచనతో కయాక్‌పై ఆస్టిన్ బయలుదేరినా, కయాక్‌లో నీరు చేరింది. ఈతకు లైఫ్‌జాకెట్ కూడా పనికి రాకపోవడంతో దాన్ని తీసివేశాడు. భారీ అలల మధ్య నాలుగు కిలోమీటర్ల దూరం ఈది ఒడ్డుకు చేరుకున్నాడు. అధికారులకు సమాచారం ఇవ్వగా వారు హెలికాప్టర్‌తో గాలింపు మొదలెట్టారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అధికారులు తల్లిని, ఇద్దరు పిల్లలను గుర్తించారు. ఆ సమయంలో వారు తీరానికి 14 కిలో మీటర్ల దూరంలో పెడల్ బోర్డులను పట్టుకుని వేలాడుతూ కనిపించారు. బాలుడి ధైర్యసాహసాలను అధికారులు ప్రశంసించారు. నలుగురికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో ముగ్గురు పిల్లలను వదిలేసి తాను వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పటికీ, ఆస్టిన్‌ను ఒడ్డుకు పంపడం తాను తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయమని తల్లి జోవాన్ మంగళవారం తెలిపారు. సముద్రంలో కొట్టుకుపోయినప్పుడు మొదట్లో తాము ధైర్యంగానే ఉన్నా చీకటవుతున్న కొద్దీ అలల ఉధృతి పెరగడంతో భయంతో చలితో వణికిపోయామని ఆమె చెప్పారు. 

మన తెలంగాణ 3 Feb 2026 10:49 pm

డీఆర్‌డీవో మరో ఘనత..'ఎస్‌ఎఫ్‌డీఆర్' పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ : దేశ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత రక్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థ (డిఆర్‌డివొ)మంగళవారం ఒడిశా తీరంలో చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుండి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ (ఎస్‌ఎఫ్‌డిఆర్) టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయవంతమైన ప్రదర్శనతో భారతదేశం ఈ సాంకేతికతను కలిగి ఉన్న ఎంపికైన దేశాల సమూహంలో చేరింది. ఇది దీర్ఘశ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల అభివృద్ధిని అనుమతిస్తుంది. ప్రత్యర్థులపై వ్యూహాత్మక విజయాన్ని అందిస్తుంది. ఈ పరీక్షలో భాగంగా నాజిల్ లెస్ బూస్టర్ , సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ మోటార్,ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ వంటి అన్ని వ్యవస్థలు ఆశించిన రీతిలో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. ఐటీఆర్ ఏర్పాటు చేసిన వివిధ ట్రాకింగ్ పరికరాల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ పరీక్ష విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఎస్‌ఎఫ్‌డిఆర్ ప్రొపల్షన్ వ్యవస్థ పరీక్ష విజయవంతం కావడంతో శత్రుదేశాల లక్షాలను అత్యంత దూరం నుంచే అడ్డుకోగల క్షిపణుల తయారీ దిశగా భారత్ ముందడుగు వేసినట్టయింది. ఈ ప్రయోగాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ , హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ(హెచ్‌ఇఎంఆర్‌ఎల్), రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సిఐ), ఐటీఆర్ శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. ఎస్‌ఎఫ్‌డిఆర్ సాంకేతికతను విజయవంతంగా ప్రదర్శించినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవోను అభినందించారు. ఈ పరీక్షలో పాల్గొన్న అన్ని బృందాలను రక్షణ పరిశోధన , అభివృద్ధి శాఖ కార్యదర్శి డిఆర్‌డివో ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ అభినందించారు. 

మన తెలంగాణ 3 Feb 2026 10:47 pm

మాజీ ఎంఎల్ఎ పాషాఖాద్రి మృతి

మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి(71) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఖాద్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మృతిచెందారు. అహ్మద్ పాషా ఖాద్రి ఎంఐఎం పార్టీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మూడు సార్లు చార్మినార్ నియోజకవర్గం నుంచి, ఒకసారి యాకత్‌పుర నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఖాద్రి ఎంఐఎం అధినేత దివంగత సుల్తాన్ సలావుద్దిన్ ఓవైసీ, ఎంపి అసదుద్దిన్‌లకు అత్యంత సన్నిహితుడు. మాజీ ఎమ్మెల్యే ఖాద్రి మృతికి పలువురు సంతాపం తెలిపారు. 

మన తెలంగాణ 3 Feb 2026 10:39 pm

పారిశుద్ధ కార్మికురాలికి సూపర్ స్టార్ బహుమానం

చెన్నై: నిజాయితీకి నిలువుటద్దం అనిపించుకున్న పారిశుద్ధ కార్మికురాలు పద్మకు సూపర్‌స్టార్ రజనీకాంత్ బంగారు గొలుసును బహుమతిగా ఇవ్వడం అందరినీ ఆకట్టుకొంటోంది. పద్మ తన కుటుంబీకులతో కలిసి మంగళవారం పొయస్ గార్డెన్ లోని రజనీ కాంత్ నివాసానికి వెళ్లి ఈ బహుమతిని అందుకున్నారు. శాలువాతోపాటు, ఓం అనే డాలరుతో ఉన్న రెండు సవరల బంగారు హారాన్ని ఆమెకు బహూకరించి సత్కరించారు. ఇటీవల రోడ్డుపై తనకు లభించిన రూ.45 లక్షల విలువైన బంగారాన్ని పారిశుద్ధ కార్మికురాలు పద్మ అసలైన యజమానికి పోలీసుల ద్వారా అందజేసి తన నిజాయితీని చాటుకున్నారు. ఈ సందర్బంగా పద్మ మాట్లాడుతూ తాను సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలుసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని భావోద్వేగంతో అన్నారు. పద్మతోపాటు ఇద్దరు కుమార్తెలు, భర్త వచ్చారు. సద్మ నిజాయితీని అభినందిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవలనే పద్మ నిజాయితీని ప్రశంసిస్తూ సత్కరించి రూ. లక్ష చెక్కును బహుమతిగా అందజేశారు. టి నగర్‌లో పారిశుద్ధ విధులు నిర్వహిస్తుండగా పద్మకు రోడ్డుపై ఒక సంచి కనిపించింది. అది విప్పి చూడగా అందులో 45 సవరల బంగారు ఆభరణాలు కనిపించాయి. పై అధికారులకు ఈ సంగతి తెలియజేసి ఆ ఆభరణాల సంచిని పాండీ బజార్‌పోలీసులకు అప్పగించింది. వారు దర్యాప్తు చేసి అసలు యజమానికి ఆ నగలు అప్పగించగలిగారు. పద్మకు రజనీకాంత్ సత్కరించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మన తెలంగాణ 3 Feb 2026 10:28 pm

మోహన్‌బాబు యూనివర్సిటీలో కిడ్నాప్ కలకలం

తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ వ్యవహారంపై తిరుపతి పోలీసులు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం యూనివర్సిటీలో అధిక ఫీజులపై నిరసన తెలపడానికి విద్యార్థి సంఘం నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలైన అక్బర్, వినో ద్‌లను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు వాహనంలో బలవంతంగా ఎక్కించి, కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి సంఘం నేత బండి చలపతి తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి..కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసులు చేజ్ చేసిఅడ్డగించారు. ఈ సందర్భంగా కిడ్నాప్‌కు పాల్ప డినట్లు భావిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కిడ్నాప్‌కు గురైన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు సురక్షితంగా రక్షించారు. విద్యార్థి సంఘ నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదుతో... విద్యార్థి సంఘం నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు యూనివర్సిటీకి చెందిన వీఆర్వో సతీష్‌తో పా టు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్ల డిం చారు. నిందితులపై 191(2), 115(2), 140(1), 126(2), 351(2), r/w 190, 61(2) బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద (క్రైం నెంబర్: 23/2026)కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఎ1గా సతీష్, ఎ2గా మోహన్ బాబు, ఎ3గా మంచు విష్ణుబాబుపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితు లతో పాటు మరో 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉన్నత విద్యామండలి ఆదేశాలను ధిక్కరిస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నేతల ఆరోపణ మోహన్ బాబు యూనివర్శిటీలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం సూచించిన ఫీజులనే అమలు చేయా లని విద్యార్థి సంఘాలు గత కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి ఆదేశాలను ధిక్కరిస్తూ విద్యార్థులను వేధిస్తు న్నారని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ అంశంపై ఎంబీయూ నుంచి ఎవరూ ఇంకా స్పందించలేదు.

మన తెలంగాణ 3 Feb 2026 10:12 pm

దేశానికి ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్: మంత్రి కిషన్ రెడ్డి

బీబీనగర్ మండల పరిధిలోని ఎయిమ్స్ ఆసుపత్రిని అన్ని హంగులతో తీర్చిదిద్ధి యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుపనున్నట్లు కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిని మంగళవారం డైరెక్టర్ అమిత అగర్వాల్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఆసుపత్రిలో కల్పిస్తున్న వైద్య సదుపాయాలు,భవన నిర్మాణ పనులు పురోగతిపై ఎయిమ్స్ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భవనాలను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో ఎయిమ్స్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయామని ఆయన అన్నారు.గతంలో భవన నిర్మాణాలను ఇష్టానుసారంగా నిర్మించారని వాటిని రీ మార్కింగ్ చేసి మరల నిర్మాణ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రి భవన నిర్మాణాలతోపాటు వైద్య విద్యార్థుల వసతి గృహాలు సరికొత్తగా నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 86% పనులు పూర్తయ్యాయని అత్యంత ప్రతిష్టాత్మకంగా 24 అంతస్థుల భవనాలను నిర్మించి వైద్య విద్యార్థుల వసతి గృహాలకు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఆసుపత్రిలో 15 లక్షల మంది వైద్యసేవలు పొందారని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రక్కన ఆసుపత్రి నిర్మాణం జరుగుతూనే మరోపక్క వైద్య సేవలు అందిస్తూ రోజుకు 1800 మంది ఓపికి చికిత్స పొందే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో వైద్యం కోసం వచ్చే పేషంట్లకు సౌకర్యాలను మరింత మెరుగుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతం సెమి రూరల్ కాకుండా సెమి అర్బన్ లా ఉంటుంది కాబట్టి పేషంట్లతో వచ్చే సహాయకులకు సరైన ఆకామినేషన్ అందుబాటులో లేదు కాబట్టి ప్రయివేట్ సంస్థలు ముందుకు వచ్చి భవనాలను నిర్మించి మెయింటైన్ చేస్తామంటే ప్రభుత్వం తరుపున ఆలోచిస్తామని ఆయన తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ లో ఇప్పటికే రెండు బ్యాచ్ లు ఎంబీబీఎస్ విద్యార్థులు పూర్తిస్థాయిలో ఎంబీబీఎస్ పూర్తిచేసుకొని పట్టాలు తీసుకొని బయటకు వెళ్లారని బిఎస్సి నర్సింగ్,ఎమెస్సి నర్సింగ్ విద్యార్థులు సుమారు 800 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని ఆయన తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి హైద్రాబాద్ సిటి ఔటర్ రింగ్ రోడ్డు కు బయట రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల ఉండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికి ఎయిమ్స్ ఆసుపత్రి సౌకర్యంగా ఉపయోగకరంగ ఉంటుందని అయన అన్నారు.హైదరాబాద్ నగరంలో అనేక రకాల ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ రోజు గ్రామీణ ప్రాంతాల ప్రజానీకానికి హైదరాబాద్ నగరంతో సహా అందుబాటులో ఉండే విధంగా ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. త్వరలోనే బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్,రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి,బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తరుణ్ రెడ్డి,బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, బీజేపీ బీబీనగర్ మండల అధ్యక్షులు భువనగిరి సదానంద్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి,కాసుల శ్రీకాంత్ గౌడ్, నాయకులు ఇంజమూరి ప్రభాకర్, బోయపల్లి గోపాల్ రెడ్డి,పశులాది రాంచందర్,కొలను లక్ష్మ రెడ్డి, పొట్ట నవీన్, దాసమోని వెంకటేష్, పంజాల ప్రవీణ్, నక్కీర్తి శ్రీకాంత్, జల్లి సాయి దత్త,బాను తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 3 Feb 2026 10:08 pm

యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్న ఆనంద్ దేవరకొండ.. 'తక్షకుడు' టీజర్ రిలీజ్

బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ మరోసారి డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంద్, డైరెక్టర్ వినోద్ అనంతోజు కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరూ కలిసి నటించిన మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీ కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తక్షకుడు అనే డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఫ్రెష్ గా, ఆసక్తికరంగా ఉంది. సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా టీజర్ ను రూపొందించారు. అయితే, థియేటర్లలో కాకుడా ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.  లాపతా లేడీస్ మూవీ ఫేమ్ నీతాన్షీ గోయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.త్వరలోనే విడుదల తేదీని వెల్లడించనున్నారు. కాగా, ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. బేబి తర్వాత హీరోయిన్ వైష్ణవి చైతన్యతో కలిసి మరోసారి ఆనంద్ నటిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో ఎపిక్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మన తెలంగాణ 3 Feb 2026 9:50 pm

ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహం చోరీ..

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ లోని భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే రోవ్ విల్లే ప్రాంతంలో గాంధీ మహాత్ముని కాంస్య విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడమే కాక, విగ్రహాన్ని కాజేశారు. విగ్రహం పాదాలు మాత్రమే ఉంచి, కాళ్ల వరకు కోసి వేసి ఎత్తు కెళ్లారు. ఈ సంఘటనపై భారతీయ సమాజం స్థానిక విక్టోరియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ విషయాన్ని అధికారికంగా చర్చించింది. విగ్రహాన్ని తక్షణం వెతికి పట్టుకోవాలని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. మీడియా ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ అపహరణకు గురైన విగ్రహాన్ని త్వరగా కనిపెట్టాలని ఆస్ట్రేలియా అధికారులను కోరినట్టు చెప్పారు. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) ఈ విగ్రహాన్ని ఆస్ట్రేలియా భారతీయ సమాజానికి బహుమతిగా అందజేసింది. ఆస్ట్రేలియా అప్పటి ప్రధాని స్కాట్ మోరిసన్ 2021నవంబర్ 12న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆస్ట్రేలియా భారత సమాజానికి ప్రముఖ సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం కలగిన చిహ్నంగా ఈ విగ్రహం గుర్తింపు పొందుతోంది. రోవ్‌విల్లే లోని కింగ్‌స్లే క్లోజ్ అనే ధార్మిక సంస్థ ఆవరణలోని ఆగంతకులు ముగ్గురు ఈ విగ్రహాన్ని చోరీ చేసారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మన తెలంగాణ 3 Feb 2026 9:24 pm

2students |మోహన్ బాబుపై కిడ్నాప్ కేసు నమోదు

2students | మోహన్ బాబుపై కిడ్నాప్ కేసు నమోదు 2students | మోహన్

ప్రభ న్యూస్ 3 Feb 2026 9:20 pm

రైతుల అంశంలో రాజీపడేది లేదు: కేంద్రం

ఆంక్షలు ఎత్తివేస్తే వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లు అమెరికాతో ట్రేడ్ డీల్‌పై విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టారని విపక్షం నుంచి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక ప్రకటన చేశాయి. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ సందర్భంగా రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భగం వాటిల్లలేదని, పైగా మరింత పరిరక్షించబడ్డాయని మంగళవారం ఒక ప్రకటలో కేంద్రం వెల్లడించింది. సున్నితమైన రంగాలైన వ్యవసాయం, డెయిరీ తదితర అనుబంధ రంగాలకు ఎలాంటి ఢోకా ఉండబోదని, సంప్రదింపుల సమయంలోనూ ఎలాంటి రాజీ కుదుర్చుకోలేదని తెలిపాయి. వివిధ రంగాల్లో ప్రభుత్వ స్థిరత్వానికి చర్చలు అద్దం పట్టాయని, ఇంధన రంగంలో కూడా భారత్ ప్రయోజనాలే కీలకంగా సంప్రదింపులు జరిగాయని ఆ ప్రకటనలో వెలువరించారు. వెనెజువెలా సహా ఆంక్షలు ఉన్న ఏ దేశం నుంచి కూడా చమురు కొనుగోళ్లు ఉండబోవని కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఒకవేళ ఆంక్షలను ఎత్తివేసే తప్పకుండా చమురు దిగుమతి చేసుకుంటామని తెలిపింది.

మన తెలంగాణ 3 Feb 2026 8:56 pm

అక్టోబర్ నుంచి ‘దేవర 2’?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో-హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ’దేవర’ పార్ట్-1 పాన్-ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధ ఆర్ట్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో పెరుగుతున్న వేళ ‘దేవర’ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని ఇటీవల ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. దీంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర పార్ట్-2 షూట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా క్లారిటీ లేదు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభించడానికి కొరటాల శివ కసరత్తులు చేస్తున్నాడట. దేవర సీక్వెల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ పార్ట్-2 కోసం మ్యూజిక్ పై వర్క్ చేస్తున్నాడట. అన్నట్టు కొరటాల శివ ‘దేవర పార్ట్-2’ కథలో చాలా మార్పులు చేసి షూట్ కోసం కసరత్తులు చేస్తున్నారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక ఈ దేవర 1 మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి దేవర సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సీక్వెల్ ఏ రేంజ్‌లో అందుకుంటుందో చూడాలి.

మన తెలంగాణ 3 Feb 2026 8:38 pm

మణిపూర్ సిఎంగా ఖేమ్‌చంద్

మణిపూర్‌లో దాదాపు ఏడాదిగా అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలనకు తెరపడింది. నూతన ముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన ఖేమ్‌చంద్ సింగ్ బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధం అయ్యింది. మంగళవారంనాడు సమావేశమైన బిజెపి శాసనసభాపక్షం ఆయనను నాయకుడిగా ఎన్నుకుంది. డిప్యూటీ సిఎంగా మహిళ నాయకురాలు నెమ్చా కిప్జెన్‌కు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఇదిలా ఉండగా మణిపూర్ అసెంబ్లీ కాలపరమితి 2027వరకు ఉంది. అంటే కొత్తగా కొలువుదీరబోయే ప్రభుత్వం ఏడాది పాటు పాలన సాగిస్తుంది. కొంత కాలంగా జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో గత ఏడాది బీరేన్ సింగ్ సిఎం పదవికి రాజీనామా చేయడంతో అప్పటి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. తాజాగా ఖేమ్‌చంద్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 

మన తెలంగాణ 3 Feb 2026 8:35 pm

అనారోగ్యంతో మంథని మాజీ ఎంఎల్ఎ రాంరెడ్డి మృతి

మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి (80) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి. గ్రామస్థాయి నుండి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగారు. 1994లో టిడిపి నుంచి రాంరెడ్డి మొదటిసారిగా మంథని నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యేగా ఎన్నికై 1999 వరకు పనిచేశారు. ప్రజా సమస్యలను తనవిగా భావించి పని చేశారు. రైతుల కష్టాలు, గ్రామీణ అభివృద్ధి అంశాలపై ఆయన చూపిన చిత్తశుద్ధి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. రామన్నగా పేరు తెచ్చుకున్న రాంరెడ్డి రైతు పక్షపాతిగా, ప్రజల మనిషిగా ఆయన సంపాదించిన గౌరవం అపారమైంది. రాంరెడ్డికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. రాంరెడ్డి మృతి పట్ల పలువరు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు సంతాపం తెలిపారు.

మన తెలంగాణ 3 Feb 2026 8:16 pm

after6months |మణిపూర్ సీఎంగా యుమునాం కేంచంద్

after6months | మణిపూర్ సీఎంగా యుమునాం కేంచంద్ after6months | మణిపూర్‌లో ముగియనున్న

ప్రభ న్యూస్ 3 Feb 2026 8:08 pm

కాలనీలో ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి ఇంటింటి పర్యటన..

విశాలాంధ్ర–తాడిపత్రి: పట్టణంలోని టైలర్స్ కాలనీ పరిధిలోని 21, 23, 24వ వార్డుల్లో మంగళవారం ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమవుతూ మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక అవసరాలపై వివరాలు సేకరించారు. ఈ పర్యటన సందర్భంగా పలువురు కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తూ పెండింగ్ అంశాలను ప్రాధాన్యంగా […] The post కాలనీలో ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి ఇంటింటి పర్యటన.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Feb 2026 8:06 pm

హన్మకొండ జూపార్క్‌లో తెల్లపులి మృతి

హన్మకొండ హంటర్ రోడ్డులోని జూలజికల్ పార్క్‌లో తెల్ల పులి(శరణ్) మంగళవారం తెల్లవారుజామున ఎక్లోజర్‌లో మృతి చెందింది. వృద్ధాప్యం, మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్‌తో తెల్ల పులి మృతి చెందినట్లు జూ అధికారులు వెల్లడించారు. శరణ్ అంతక్రియలు మంగళవారం చేసినట్లు జూ పార్క్ పర్యవేక్షణ అధికారి తెలిపారు. శరణ్‌ను హైదరాబాద్ జూ పార్క్ నుండి జులైలో తీసుకువచ్చామని అన్నారు. జూ పార్కులో పులి సంరక్షణ సరిగ్గా లేకనే అనారోగ్యంతో మరణించినట్లు తెలుస్తుంది. కానీ జూ అధికారులు సిబ్బంది మాత్రం అనారోగ్యంతో గుండెపోటుతో మరణించినట్లు చెప్తున్నారు.

మన తెలంగాణ 3 Feb 2026 8:06 pm

Venky Doubles his Remuneration

Victory Venkatesh has delivered super hits in his career and he is one of the most successful actors. Venkatesh is not very strict on his remuneration and he keeps his producers comfortable. The actor has been charging close to Rs 10 crores as remuneration for years. His last film Sankranthiki Vastunnam is a blockbuster hit […] The post Venky Doubles his Remuneration appeared first on Telugu360 .

తెలుగు 360 3 Feb 2026 7:59 pm

Nominations |మోత్కూర్ మున్సిపల్ బరిలో 49 మంది అభ్యర్థులు

Nominations | మోత్కూర్ మున్సిపల్ బరిలో 49 మంది అభ్యర్థులు Nominations |

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:57 pm

రైతుల రక్తాన్ని, దేశాన్ని మోడీ అమ్మకానికి పెట్టారు: రాహుల్ గాంధీ

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అకస్మాత్తుగా జరగడంపై లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఒప్పందానికి సంబంధించిన సమగ్ర వివరాలు కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ఒత్తిడితోనే మోడీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారని, రైతుల రకాన్ని, వాళ్లు చిందించే చెమటను, దేశాన్ని అమ్మకానికి పెట్టారని ఆరోపణ చేశారు. తన ప్రాబల్యం ఎక్కడ దెబ్బతింటుందోనని మోడీ భయపడుతున్నారని మండిపడ్డారు. మంగళవారంనాడు పార్లమెంటు బయట రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీ వణికిపోతున్నారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నాలుగు నెలలుగా నిలిచిపోయింది. దానిపై సోమవారం రాత్రి నరేంద్ర మోడీ అనూహ్యంగా సంతకం చేశారు. ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ట్రేడ్ డీల్ విషయంలో రాజీపడ్డారు. ఇంతవరకూ కాపడుకుంటూ వస్తున్న తన ఇమేజ్ ఇప్పుడు దెబ్బతింటుందోనని మోడీ భయపడుతున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీపై అమెరికాలో కేసు ఉందని, నిజానికి ఒకరకంగా ఇది మోడీపై కేసు అన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో చాలా విషయాలున్నాయని, దానిని అమెరికా ఇప్పటికీ విడుదల చేయలేదని ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. ఆ ఒత్తిడి కూడా ఉందని, ఒత్తిడికి కారణమవుతున్న రెండు పాయింట్లు ఇవేనని అన్నారు. వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నవరణే అంశాన్ని సైడ్ చేయడానికి ఇదో కొత్త డ్రామా అని అన్నారు. రైతులు ఇలాంటి ఒప్పందాలపై ఓ కన్నేయాలని, వాటిని అర్థం చేసుకోవాలన్నారు. 

మన తెలంగాణ 3 Feb 2026 7:56 pm

Reserve |ఎఫ్డీపీటీ వాహనాన్ని అడ్డుకున్న ఇండ్ల లబ్ధిదారులు

Reserve | ఎఫ్డీపీటీ వాహనాన్ని అడ్డుకున్న ఇండ్ల లబ్ధిదారులు Reserve | జన్నారం,

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:53 pm

భారత్ నుంచి మాకు సమాచారం లేదు

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ఆచితూచి స్పందించింది. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మంగళవారంనాడు స్పందించారు. తమకైతే ఈ అంశంలో భారత్‌న నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. భారత్‌తో తమకు విలువైన సంబంధాలు ఉన్నాయని, ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగ్యస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తామని, అదే సమయంలో రష్యా-ఇండియా మధ్య కీలక రంగాల్లో అత్యంత లోతైన, విస్తృతమైన సహకారం కూడా ఏమాత్రం తక్కువ కాదన్నారు. భారత్ మాకు అత్యంత ముఖ్యమని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి భారీ డిస్కౌంట్‌తో ముడిచమురును కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ కీలకంగా ఉంది. ఇది పశ్చిమ దేశాలకు కంటగింపుగా మారింది. 

మన తెలంగాణ 3 Feb 2026 7:52 pm

supervisor |అంగన్వాడి కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి,

supervisor | అంగన్వాడి కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి, supervisor | చిట్యాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:46 pm

District Collector |రెవెన్యూ అంశాలపై సీసీఎల్ఏ సమీక్ష

District Collector | రెవెన్యూ అంశాలపై సీసీఎల్ఏ సమీక్ష District Collector |

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:42 pm

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లాలోని మల్లాపూర్ మండలంలోని ముగిలిపేట వద్ద చోటుచేసుకుంది. కొందరు వ్యవసాయ కూలీలు.. పసుపు కోతకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 3 Feb 2026 7:41 pm

Bypass road |రూ.4.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

Bypass road | రూ.4.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన… Bypass road

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:38 pm

హార్వర్డ్‌లో సిఎం కాస్ట్లీ చదువు..గురుకుల విద్యార్థులకు పాము కాట్లు

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతున్న వార్త కలచివేస్తోందని -మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు విద్యా నిలయాలా.. లేక విషసర్పాలకు ఆవాసాలా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా..? అని నిలదీశారు. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ రంగుల లోకం చూపిస్తున్న సిఎం గురుకులాలను గాలికి వదిలేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. గురుకులాల్లో పిచ్చి మొక్కలు తొలగించే దిక్కు లేదు...చిమ్మచీకట్లో లైట్లు వేసే నాథుడు లేడు అని ఆందోళన వ్యక్తం చేశారు. అపరిశుభ్రత కారణంగా నేడు గురుకులాల్లో కుక్క కాట్లు, పాము కాట్లు సర్వసాధారణంగా మారిపోవడం అత్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు. గురుకుల బిడ్డలకు కడుపు నిండా తిండి లేదు.. ప్రాణాలకు రక్షణ లేదని వాపోయారు. ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫోటోలకు పోజులిస్తే...ఇక్కడ పేద విద్యార్థులు ఆసుపత్రి పాలై కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. తమ పిల్లలు గురుకులాలకు చదువుకోవడానికి వెళ్తున్నారా.. లేక చావుతో పోరాడటానికి వెళ్తున్నారా..? అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పతనమవుతున్న గురుకులాలను కాపాడాలి... విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టాలని కోరారు. అశ్మితకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షసాధింపుల మీద ఉన్న శ్రద్ధలో కొంత అయినా పేద పిల్లల బతుకుపై పెట్టాలని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. పాము కాటుకు గురై ఆసుపత్రిలో చేరిన గురుకుల బిడ్డ ప్రాణానికి రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు.

మన తెలంగాణ 3 Feb 2026 7:33 pm

Teacher |తల్లీ కొడుకు హత్యల ఘటనా స్థలాన్ని పరిశీల‌న‌…

Teacher | తల్లీ కొడుకు హత్యల ఘటనా స్థలాన్ని పరిశీల‌న‌… Teacher |

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:33 pm

కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్న బిఆర్‌ఎస్: ఎంపి చామల

తమ పార్టీపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నోటిసు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయించడం దేనికని ఆయన ప్రశ్నించారు. విచారణకు పిలిస్తేనే ఇంత రాద్ధాంతమా? అని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. కెసిఆర్ జాతిపిత అంటూ కెటిఆర్, హరీష్ రావు పిట్టకథలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏదో రకంగా ప్రజలను మాయ చేసి గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. తన కుటుంబంలో అందరూ సెటిల్ అయ్యారని, కుమారుడు కెటిఆర్ అమెరికాలో ఉన్నాడని, అమ్మాయి పెళ్ళి చేసానని, ఎవరికీ పదవుల మీద ఆశ లేదని ఉద్యమం సమయంలో కెసిఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. కానీ అధికారంలోకి రాగానే ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎంపీ చామల విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచాచమని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతూ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ఎంపీ చామల తెలిపారు.

మన తెలంగాణ 3 Feb 2026 7:28 pm

market |త‌గ్గేదెలా….

market | త‌గ్గేదెలా…. market | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదోని

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:25 pm

అక్రమ ఇసుక రవాణాపై డిఎస్పి కి రైతుల ఫిర్యాదు..

విశాలాంధ్ర, గోరంట్ల: బూదిలి పంచాయతీ పరిధిలోని పాపిరెడ్డిపల్లి గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామ రైతులు డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. సమస్యపై స్పందించిన డీఎస్పీ తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు, స్థానికంగా కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు నిర్వహించి రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఇది భూగర్భ జలాల స్థాయిపై, వ్యవసాయ భూములపై ప్రతికూల ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్పీ […] The post అక్రమ ఇసుక రవాణాపై డిఎస్పి కి రైతుల ఫిర్యాదు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Feb 2026 7:23 pm

Collector |రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…

Collector | రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి… Collector | ఆసిఫాబాద్,

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:21 pm

Tickets |మెదక్ అభ్యర్థుల జాబితా విడుదల..

Tickets | మెదక్ అభ్యర్థుల జాబితా విడుదల.. Tickets | మెదక్ ప్రతినిధి,

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:18 pm

30k Above |బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు పతనం అయ్యాయి? ఇప్పుడు కొనవచ్చా?

30k Above | బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు పతనం అయ్యాయి? ఇప్పుడు

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:14 pm

Funding |కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తా

Funding | కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తా Funding | నిర్మల్

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:14 pm

Electricity |విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేసిన కేసులో ట్రాక్టర్ సీజ్…

Electricity | విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేసిన కేసులో ట్రాక్టర్ సీజ్… Electricity

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:10 pm

ఇండో-యూఎస్ వాణిజ్య ఒప్పందంపై చర్చకు విపక్షాల డిమాండ్

న్యూఢిల్లీ : భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చకు విపక్షాలు మంగళవారం రాజ్యసభలో డిమాండ్ చేశాయి. తరువాత వాకౌట్ చేశాయి. జీరో అవర్ పూర్తి కాగానే కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఈ వాణిజ్య ఒప్పందం అంశాన్ని తీసుకు వచ్చారు. ప్రభుత్వం నుంచి రావలసిన ఈ సమాచారం వాషింగ్టన్ నుంచి రావడాన్ని ఆయన ఆక్షేపించారు. సభలో విపక్షాలు అసమ్మతి తెలియజేయగానే సభా నాయకుడు జెపి నడ్డా భారత ఎగుమతులపై సుంకాలు తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియజేశారని, తరువాత ప్రధాని నరేంద్రతో కూడా ఆయన మాట్లాడారని వివరించారు. మంచి విషయాల్లో కూడా చెడుగా చూడడం ప్రారంభం కావడంతో విపక్షం అసమ్మతి బయటపడిందని నడ్డా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై పూర్తి వివరాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,సుమోటో ప్రకటనతో ప్రభుత్వం ముందుకు వస్తుందని సభకు హామీ ఇచ్చారు. కానీ ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, ఇది భారత కాంగ్రెస్, ఇండియా కూటమి బాధ్యతారాహిత్యమని నడ్డా విమర్శించారు. దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తూ విపక్షం నినాదాలు కొనసాగిస్తుండడంపై చైర్మన్ సిపి రాధాక్రిష్ణన్ జోక్యం చేసుకుని ప్రభుత్వం ప్రకటన చేస్తామని చెప్పినప్పుడు వినాలని సూచించారు. అయినా సరే విపక్షాలు వెనక్కు తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు చొచ్చుకుని వెళ్లారు. నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం ఈరోజే దీనిపై సుమోటో స్టేట్‌మెంట్ ఇస్తుందని దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతీదీ రాజకీయం చేయడం వారికి ఆసక్తి అని, దానికి ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్నదేనని నడ్డా విపక్షాలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్చకు దూరంగా ఉంటుందని దేశంలో వాతావరణం సృష్టించడానికి వారు ప్రయత్నిస్తున్నారని నడ్డా వ్యాఖ్యానించారు. “చర్చించడానికి ఎలాంటి అంశాలు లేని పార్టీ మీది. ఇది బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన. ఒకవిధంగా దేశ వ్యతిరేక ప్రవర్తన ” అని నడ్డా విపక్షంపై ధ్వజమెత్తారు. టిఎంసి తప్ప మిగతా విపక్షాలన్నీ నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశాయి. టిఎంసి సభ్యుడు సాకేత్ గోఖలే కూడా సభలో కొంతసేపు కూర్చుని వాకౌట్ తరువాత బయటకు వెళ్లారు. “సర్‌” బాధిత కుటుంబాలపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా తాము వేరేగా వాకౌట్ చేశామని టిఎంసి వెల్లడించింది. 

మన తెలంగాణ 3 Feb 2026 7:03 pm

Lift irrigation |ధనార్జన కోసమే రాయలసీమ లిఫ్టు

Lift irrigation | ధనార్జన కోసమే రాయలసీమ లిఫ్టు Lift irrigation |జూపాడు

ప్రభ న్యూస్ 3 Feb 2026 7:02 pm

Tax |పన్ను ఎగవేతదారులకు రెడ్ నోటీసులు

Tax |పన్ను ఎగవేతదారులకు రెడ్ నోటీసులు Tax |కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 3 Feb 2026 6:55 pm

Nutrition |భూసార పరీక్షలతో లోపాలను గుర్తించవచ్చు…

Nutrition | భూసార పరీక్షలతో లోపాలను గుర్తించవచ్చు… Nutrition | శావల్యాపురం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 3 Feb 2026 6:52 pm

Sharwa’s Biker Releasing On April 3rd

Charming Star Sharwa is set to shift gears once again, this time with his sports-driven emotional entertainer Biker. After the roaring success of Nari Nari Naduma Murari, the actor is riding into a new zone, and the team has confirmed the film’s arrival on April 3rd. This striking release poster that highlights Sharwa’s lean, athletic […] The post Sharwa’s Biker Releasing On April 3rd appeared first on Telugu360 .

తెలుగు 360 3 Feb 2026 6:50 pm

భారత్ చట్టాలను పాటించాల్సిందే.. లేదంటే దేశం విడిచి వెళ్లిపొండి

న్యూఢిల్లీ : ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేసింది. భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఈమేరకు వాట్సాప్ మాతృసంస్థ మెటాకు మంగళవారం సుప్రీం కోర్టు హెచ్చరిక జారీ చేసింది. “ మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరు. మా డేటాకు సంబంధించి ఒక్క అంకెను పంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించము’ అని అమెరికాకు చెందిన మెటాను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మందలించారు. దేశ చట్టాలను పాటించకపోతే భారతదేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాట్సాప్ 2021ప్రైవసీ పాలసీకి సంబంధించిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తాజాగా విచారించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడం దోపిడీ అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దేశం లోని లక్షలాది మంది పేదలు, చదువురాని ప్రజలు ప్రైవసీ పాలసీని అర్థం చేసుకోగలరా అని మెటా ప్రతినిధులను చీఫ్ జస్టిస్ సూటిగా ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో మెటా పాలసీలు అర్థం చేసుకోవడం తమకే ఇబ్బందిగా మారుతోందని, ఒకసారి తనకు ఓ వైద్యుడు వాట్సప్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపితే దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్‌లో కనిపించాయన్నారు. ఇక దేశం లోని లక్షలాది మంది పేద, చదువురాని ప్రజలు ఈ విధానాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. కాగా, మెటా ఇంజినీరింగ్ బృందం ఇతరుల వాట్సాప్ మెసేజ్‌లను చదవగలదని వాట్సాప్ అంతర్జాతీయ వినియోగదారుల బృందం ఇటీవల అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీం కోర్టు హెచ్చరికలు మెటాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ప్రైవసీ పాలసీ 2021 జనవరిలో వాట్సప్ తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం యూజర్లు వాట్సప్ బిజినెస్ అకౌంట్లతో జరిపే సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకునేందుకు అనుమతి లభిస్తుంది. కొత్త పాలసీకి అంగీకరించని వారి ఖాతాలను రద్దు చేస్తామని తొలుత హెచ్చరించింది. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని అభ్యంతరాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పాలసీ అమలును నిలిపివేయాలని ఆదేశించింది.ఐటీ చట్టం లోని నిబంధనలకు ఈ కొత్త పాలసీ పూర్తి విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. ఈ పాలసీపై దాఖలైన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. 

మన తెలంగాణ 3 Feb 2026 6:49 pm