పదేళ్ల పాలనలో 25 కోట్లమందికి పేదరికం నుంచి విముక్తి పేదలకు 4 కోట్ల పక్కాఇళ్లు వందకోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు 95కోట్ల మందికి సామాజిక భద్రత ఆయుష్మాన్ భారత్ కింద 11 కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి న్యూఢిల్లీ: దేశంలో అన్నివర్గాలకు సామాజిక న్యాయం, భద్రత కల్పించేందుకే తమ ప్రభు త్వం నిరంతరం కృషిచేస్తున్నదని బుధవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రభుత్వం సబ్కా సాథ్, సబ్కా వికాస్ ( అందరితో అభివృద్ధి, అందరికీ అనే దృక్పథం తో అన్నివర్గాల ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా దళితులు, వెనుకబడినవర్గాలు, అణగారిన, గిరిజన వర్గాల కోసం కృషిచేస్తున్నదన్నారు. 2014 ప్రారంభంలో, సామాజిక భద్రతా పథకాలు కేవలం 25 కోట్ల మంది పౌరులకే చేరువయ్యాయని,తమ ప్రభుత్వం నిరంతర కృషి వల్ల, నేడు దాదాపు 95 కోట్ల మంది భారతీయులకు సామాజిక భద్రత కల్పించబడిందని రాష్ట్రపతి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎప్పుడూ సమానత్వం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వ నిబద్ధత వల్లనే గత దశాబ్దంలో 25 కోట్ల మంది పౌరులు పేదరికాన్ని అధిగమించారని ముర్ము చెప్పారు.గత పదేళ్ల కాలంలో పేదలకోసం నాలుగు కోట్ల పక్కాఇళ్లు నిర్మించామని చెప్పారు.గత ఏడాదిలోనే 32 లక్షల కొత్త ఇళ్లను పేదలకు కల్పించిన విషయాన్ని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం కింద గత ఏడాది 11 కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు అందాయని, ఆస్పత్రులలో చేరిన రెండున్నర కోట్ల మందికి ఉచిత చికిత్స లభించిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, దేశవ్యాప్తంగా 1.80 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లు పనిచేస్తున్నాయని ముర్ము వివరించారు. జాతీయ అనీమియా నివారణ మిషన్ కింద 6.5 కోట్ల మంది మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాలలోని వారికి పరీక్షలు నిర్వహించి, వ్యాధిని గుర్తించడంతో సమర్థవంతంగా నివారణ సాధ్యమవుతున్నదన్నారు. భారత సైనిక దళాల పాటవం గర్వకారణం భారత సైనిక దళాలు ఆపరేషన్ సిందూర్ , తర్వాత జరిగిన ఘర్షణలో చూపిన ధైర్యసాహసాలు దేశానికే గర్వకారణమని రాష్ట్రపతి అన్నారు. టెర్రరిస్ట్ శిబిరాలను నేలమట్టం చేయడం ద్వారా ప్రపంచానికి భారత సైనిక సత్తా చాటారన్నారు. జాతీయ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు మిషన్ సుదర్శన్ చక్ర పై దేశం కృషిచేస్తున్నదని రాష్ట్రపతి తెలిపారు. మావోయిస్ట్ ఉగ్రవాదం పై భద్రతా దళాలు నిర్ణయాత్మక చర్య తీసుకున్నాయని ప్రశంసించారు.
నయీం కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన ఇడి
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణను వేగవంతం చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఇడి అధికారులు బుధవారం హైదరాబాద్లోని రంగారెడ్డి కోర్టులో ఛార్జిషీట్ను దాఖలు చేశారు. ఛార్జిషీటును పరిగణలోకి తీసుకుని పరిశీలించిన కోర్టు విచారణకు స్వీకరించింది. కాగా, నయీం తన గ్యాంగ్తో సంపాదించిన సుమారు రూ.11.30 కోట్ల విలువైన 91 ఆస్తులను గుర్తించిన ఇడి పాశం శ్రీనివాస్, హసీనా బేగం, మహమ్మద్ తాహెరా బేగం, మహమ్మద్ సలీమా బేగం, మహమ్మద్ అబ్దుల్ సలీమ్, అహేలా బేగం, సయ్యద్ నీలోఫర్, ఫిర్దౌస్ అంజుమ్, మహమ్మద్ ఆరిఫ్,హీనా కౌసర్ అనే పది మందిపై అభియోగాలు మోపింది. ఆస్తులు బలవంతంగా బాధితులను బెదిరించి రిజిస్టర్ అయినట్లుగా గుర్తించారు. అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోని షాపింగ్ కాంప్లెక్స్లు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ నయీం తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లపై బినామీలుగా రిజిస్టర్ చేసినట్లుగా అధికారులు ధృవీకరించారు. కేసులో నయీం భార్య హసీనా బేగంతో పాటు పలువురు కుటుంబ సభ్యుల పేర్లను ఇడి తన ఛార్జిషీట్లో పేర్కొంది.
బ్రూవరీలకు బిఆర్ఎస్ హయాంలోని నిబంధనలే అమలు మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే అడ్డగోలు ఆరోపణలు: మంత్రి జూపల్లి మన తెలంగాణ/హైదరాబాద్ : బ్రూవరీలకు అనుమతులకు బిఆర్ఎస్ హాయాంలో ఉన్న నిబంధనలే ఉన్నాయని, బిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన రవీంధ్ర భారతిలో మీడియాతో మాట్లాడుతూ బ్రీవరీలకు సంబంధించి రెండేళ్లలో ఎటువంటి కొత్త చట్టం తీసుకురాలేదని 2015 ఆగస్ట్లో జారీ చేసిన జీఓ నెంబర్ 151 ద్వారానే నిబంధలు ఉన్నాయన్నారు. ఆ జీఓ ప్రకారమే 2016లో 20 కంపెనీలకు అనుమతిచ్చారని, 50 దరఖాస్తులు వస్తే ఎటువంటి లాటరీ విధానం పాటించకుండా 20 దరఖాస్తులకు అనుమతిచ్చినట్లు చెప్పారు. మైక్రో బ్రీవరీలకు సంబంధించి అనుమతుల కోసం తన వద్దకు ఎలాంటి ఫైళ్లు రాలేదని, సంబంధిత శాఖకు మాత్రమే వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు. కొత్త బ్రీవరీలకు దరఖాస్తులు వస్తే- ఆయా సంస్థలకు ఉన్న భూ లభ్యత, మౌలిక వసతులపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే- అప్పుడు వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గత బిఆర్ఎస్ హయాంలో 105 ఎలైట్ బార్లకు అనుమతి ఇచ్చారని, లాటరీ లేకుండా నచ్చిన వారికి అనుమతులు ఇచ్చింది నిజం కాదా అని నిలదీశారు. ప్రతి 15 రోజులకు బకాయిలు చెల్లిస్తే బిఆర్ఎస్ హయాంలో ఎక్సైజ్ శాఖలో రూ. 3,500 కోట్లు ఎలా బకాయిలు పడ్డాయని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది బిఆర్ఎస్ అని మండిపడ్డారు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఎక్సైజ్ ఆదాయం రూ. 10, 012 కోట్లు మాత్రమేనని, 2014 నుండి 2023 వరకు ఎక్సైజ్ ఆదాయాన్ని రూ. 34,869 కోట్లకు పెంచారని దుయ్యబట్టారు. సింగూర్ జలాలను బీర్ల కంపెనీలకు తరలిస్తున్నారని, క్రాప్ హలిడే ప్రకటించారని విమర్శలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కంపెనీకి అనుమతి ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు.
అభ్యర్థుల ఎంపికలో అప్రమత్తంగా ఉండండి
పార్టీ నేతలకు అమెరికా నుంచి సిఎం రేవంత్రెడ్డి ఆదేశం అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే: పిసిసి చీఫ్ మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక, గెలిపించుకునే బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇదిలాఉండగా అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కూడా మున్సిపల్ ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. నామినేషన్ల దాఖలుకు రెండే రోజులు ఉన్నందున అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఇదివరకే లోక్సభ వారీగా నియమించిన ఇన్ఛార్జి మంత్రులు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. పోటీ చేసేందుకు ఆశావాహుల్ సంఖ్య ఎక్కువ ఉన్నట్లయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో జిల్లా పార్టీ ముఖ్యులతో, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థుల ఎంపికకు వడపోసే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి పేరు ఉన్న నాయకులను, ఇంకా బలమైన నాయకులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. ఏకాభిప్రాయం కుదర్చకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే తిరుగుబాటు తలనొప్పులు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలపై వార్ రూంలో చర్చించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సహపంక్తి భోజనం కార్యక్రమం కుదింపు బుధవారం నుంచి శనివారం (31) వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామ పథకం కూలీలతో కలిసి సహపంక్తి భోజనం చేయాలనుకున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన కార్యక్రమాన్ని కుదించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున ఈ కార్యక్రమాన్ని కుదించుకుని, బుధవారం మెదక్ జిల్లా, మానుకొండూలో గ్రామ సభలో మాత్రమే పాల్గొన్నారు.
29th jan 2026 | నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు
ఇరాన్ దిశగా మరిన్ని యుద్ధనౌకలు
` వాటిని వినియోగించే అవసరం రాకూడదని ఆశిస్తున్నా ` ట్రంప్ హెచ్చరికలు వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి హెచ్చరికలు చేశారు మరిన్ని యుద్ధనౌకలు ఆ …
మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
` పార్టీ పనితీరు, గెలుపు అవకాశాలు లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ` మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్గానే తీసుకుంది ` సీఎం లేనప్ప్పుడు మంత్రులు తనను కలవడంలో …
మహా డిప్యూటీ సిఎం అజిత్పవార్ దుర్మరణం
బారామతి ఎయిర్పోర్ట్ సమీపంలో నేల కూలిన విమానం ఉప ముఖ్యమంత్రి పవార్, మరో నలుగురు మృతి మృతుల్లో పైలట్ కెప్టెన్ సుమిత్కుమార్, ఫస్ట్ లేడీ ఆఫీసర్ శాంభవీ పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలీ, పవార్ వ్యక్తిగత సహాయకుడు విదిప్ జాదవ్ బారామతి : మహారాష్ట్రలో బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన న్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మరాఠా సీనియర్ నేత అజిత్ పవార్, మరో నలుగురు మృతి చెందారు. ప్రమాదానికి కారణాలు ఏమిటనేవి వెనువెంటనే తెలియలేదు. అయితే అత్యవసర లాండింగ్ పరిస్థితుల్లో తలెత్తిన విషమ పరిస్థితితోనే ఈ ఛార్టెడ్ ఫ్లెయిట్ రెండు ముక్కలై పోలిపోయిందని ప్రాధమికంగా తేలింది. బుధవారం ఉదయం పుణే జిల్లాలోని పవార్ల బలీయ ప్రాంతమైన బారామతిలోని విమానాశ్రయం వద్దనే ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలో దాదాగా పిలవబడే 66 సంవత్సరాల అజిత్ పవార్ ఎన్సిపి చీలిక వర్గం అధినేతగా ఉన్నారు. ఆయన ఫిబ్రవరి 5వ తేదీన జరిగే జడ్పి ఎన్నికల్లో ప్రచారానికి ముంబై నుంచి బయలుదేరారు. ఈ విమానాన్ని ఢిల్లీకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్ నిర్వహిస్తోంది. ముంబై నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరిన తరువాత ఈ లియర్జెట్ 45 ఛార్టెడ్ విమానం దాదాపు 8.45 ప్రాంతంలో రాడార్ వ్యవస్థలో కన్పించకుండా పోయింది. సరిగ్గా ఐదు నిమిషాల్లో అంటే 8.50 నిమిషాలకు విమాన పతనం జరిగింది. పవార్తో పాటు ఈ ప్రమాదంలో మరణానికి గురైన వారిలో ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఓ అటెండెంట్ ఇద్దరు విమాన సిబ్బంది పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ సుమిత్ కుమార్, ఫస్ట్ లేడి ఆఫీసరు కెప్టెన్ శాంభవి పాఠక్ ఉన్నారని విమానయాన వ్యవహారాల డిజిసిఎ అధికారి ప్రకటన వెలువరించారు. ప్రమాదం తరువాత విమానంలో మంటలు చెలరేగాయని జిల్లా ఎస్పి సందీప్ సింగ్ గిల్ తెలిపారు. పూర్తిగా గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉన్న స్థితిలో మృతదేహాలను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అత్యంత సీనియర్ నేత అయిన శరద్ పవార్ అజిత్ పవార్కు బాబాయి అవుతారు. అజిత్ పవార్కు భార్య సునేత్ర ఇద్దరు కుమారులు పార్ధ్ , జై ఉన్నారు. భార్య సునేత్ర రాజ్యసభ ఎంపి. మంటల్లో దగ్ధమైన విమానం బారామతి విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ సమయంలో విమానంలోపల సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం కూలిపోయే ముందు విమానం కుదుపులకు గురైంది. తరువాత మంటలు చెలరేగాయి. ఈ దశలోనే నాలుగు అయిదు సార్లు పేలుళ్ల చప్పుళ్లు విన్పించాయి. అయితే ఈ విషయాలను అధికారులు నిర్థారించలేదు. రాష్ట్రపతి, ప్రధాని ప్రముఖుల సంతాపం అజిత్ పవార్ ఇతరులు విమాన ప్రమాదంలో మృతిచెందిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రగతికి అజిత్ పవార్ సర్వదా పాటుపడ్డారని కొనియాడారు. ప్రత్యేకించి రాష్ట్రానికి అత్యవసరం అయిన సహకార రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమ స్పందనలో అజిత్ పవార్కు జన బాహుళ్యంతో ఉన్న బంధం విస్తృతం అన్నారు. అకాల మరణంతో రాజకీయాల్లో అగాథానికి దారితీసిందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎన్డికు కుటుంబానికరే కాకుండా తనకు కూడా వ్యక్తిగతంగా బాధాకరం అని ప్రకటన వెలువరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ ముంబైలో మాట్లాడుతూ ఈ విషాద వార్త తనకు నమ్మశక్యంగా కాకుండా ఉందన్నారు. తాను ఓ మంచి స్నేహితుడిని కోల్పోయ్యానని చెప్పారు. ఆయన లేని లోటును పూడ్చడం కస్టమని తెలిపారు. ఘటనా స్థలికి శరద్ పవార్ .. బోరున విలపించిన ఎంపి సుప్రియా అజిత్ పవార్ దుర్మరణం గురించి తెలియగానే సీనియర్ నేత శరద్ పవార్ కొద్ది మంది నేతలతో కలిసి బారామతి ఎయిర్పోర్టు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి వెంటనే అజిత్ పవార్ భౌతిక కాయం ఉంచిన స్థానిక మెడికల్ కాలేజ్ వద్దకు కూడా వెళ్లారు. బారామతి ఎంపి సుప్రియా సూలే ఈ ఘటనతో షాక్ అయ్యారు.
అనర్హతపై వేగం పెంచిన స్పీకర్ దానంకు నోటీసులు
` రేపు స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ …
వికసిత్ భారత్ వైపు దేశం పయనిస్తోంది
` పదేళ్లలో పేదల కోసం 4కోట్ల ఇళ్ల నిర్మాణం ` జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు ` వందేభారత్, అమత్ భారత్ రైళ్ల ద్వారా …
హైదరాబాద్ వేదికగా అఖిలభారత పోలీస్ ఫుట్ బాల్ సమరం
` మార్చిలో నిర్వహణ ` ఏర్పాట్లపై బి శివధర్ రెడ్డి సమీక్ష హైదరాబాద్(జనంసాక్షి): జనవరి 28:74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ …
` ఎక్సైజ్ శాఖలో మైక్రో బేవరేజెస్కు అనుమతుల్లో అవినీతి:హరీశ్రావు హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో మరో అవినీతి కుంభకోణాన్ని బయటపెడుతున్నట్లు మాజీ మంత్రి, బీఆరఎస్ నేత హరీశ్ రావు తెలిపారు. …
ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం …
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
` ఆయనతో పాటు ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలెట్లు మతి ` ఎమర్జెన్సీ ల్యాండింగ్కి యత్నించి.. బండరాయిని ఢీ కొట్టడంతో దుర్ఘటన ` ఎన్నికల ప్రచారం నిమిత్తం …
విశాఖపట్నం: నాలుగో టి20 భారత్ చిత్తయింది. వరుస విజయాలతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాకు న్యూజిలాండ్ షాకిచ్చింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో50 పరుగుల తేడాతో సూర్యాకమార్ సేనాను చిత్తు చేసింది కివీస్. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో దెవోన్ కాన్వే(44), టిమ్ షెఫార్ట్(64)లు టీమిండియా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. తొలి వికెట్కు 101 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరికి తోడు డారీల్ మిఛెల్(38), గ్లెన్ ఫిలిఫ్స్(24)లు బ్యాట్ ఝలిపించడంతో కివీస్ భారీ స్కోరు చేయగలిగింది. అనంరతం లక్ష ఛేదనకు దిగిన టీమిండియాకు అదిలో గట్టి షాక్ తగిలింది. ఫించ్ హిట్టర్ అభిషేక్ శర్మ(0) పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు. అనంతరం సంజూ సామ్సన్(24) కాసేపు మెరిసినా.. పరుగులు రాబట్టలేక పోయాడు. సాట్నర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా పెవిలియన్కు దారిపట్టాడు. సూర్యా కుమార్(8) సయితం రాణించలేక పోయాడు. రింకు సింగ్(39), శివం ధూబె(64) బ్యాట్ ఝలిపించినా మిగతావారెవరూ రాణించక పోవడంతో పూర్తి ఓవర్లు ఆడకుండానే 165 పరుగులకే టీమిండియా చాపచుట్టేసింది. దీంతో భారత్ ఘోరపరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో ’స్పిరిట్’, ’ఫౌజి’ సినిమాలు సెట్స్పై ఉన్నాయి. ’స్పిరిట్’ను వచ్చే ఏడాది మార్చిలో విడుదలకు ప్లాన్ చేస్తుండగా, ’ఫౌజి’ ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలున్నాయి. ఈ రెండు చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ’కల్కి 2898 ఎడి: పార్ట్ 2’ను కూడా సెట్స్పైకి తీసుకెళ్లాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే పార్ట్ 2 షూట్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది కానీ ప్రభాస్ ఇతర సినిమాల మూలాన ఆగుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం కల్కి 2 సినిమా షూట్ కి ప్రభాస్ సిద్ధమైనట్టు తెలిసింది. కల్కి 2 షూట్ని ఫిబ్రవరి 2 నుంచి డార్లింగ్ మొదలు పెట్టనున్నాడట. దీనితో పాటు స్పిరిట్ షూట్ని కూడా ప్రభాస్ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తాడని తెలిసింది. ఇక ఈ భారీ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. వైజయంతి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ‘కల్కి’ ఫస్ట్ పార్ట్లో దీపికా పదుకొనే నటించిన సుమతి పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు దీపిక స్థానం కోసం మొదట అలియా భట్, ప్రియాంకా చోప్రా, అనుష్క శెట్టి, శ్రద్ధా కపూర్, కల్యాణి ప్రియదర్శన్ పేర్లు వినిపించాయి. ముఖ్యంగా ప్రియాంకా చోప్రా పేరు గట్టిగా ప్రచారంలోకి వచ్చినా, చివరికి ఈ కీలక పాత్రకు సాయి పల్లవి పేరు బలంగా వినిపిస్తోంది. సాయి పల్లవి అయితే ’కల్కి 2’ స్టోరీకి, ప్రభాస్కు జోడీగా సెట్ అవుతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడనే టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞప్తి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి అనేక కీలక అంశాలపై చర్చించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర గోడ నిర్మాణానికి సంబంధించి కాకినాడ జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రతిపాదనను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందు ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. […] The post సహకరించండి appeared first on Visalaandhra .
. కార్మిక సంఘాల ఐక్యవేదిక మెరుపు ఆందోళన. లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ నినాదాలు. పోలీసులు, కార్మిక సంఘాల మధ్య వాగ్వాదం. కేంద్ర మంత్రికి, అధికారులకు వినతి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర పర్యటన నిమిత్తం వచ్చిన కేంద్ర మంత్రికి కేంద్ర కార్మిక సంఘాల నుంచి ఊహించని నిరసన సెగ ఎదురైంది. విజయవాడ రింగ్ రోడ్డులోని నోవోటెల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి శోభా కరంధాంజే రెండు రోజులుగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ […] The post కేంద్ర మంత్రికి నిరసన సెగ appeared first on Visalaandhra .
మేడారం జాతరకు అధికారికంగా సెలవు దినం ప్రకటించాలి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క-సారక్క జారతకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పెద్ద జాతర అని చెప్పుకుంటున్న ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం విడ్డూరమని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రెండేళ్లకోసారి కనీవినీ ఎరుగని రీతిలో గిరిజన వేడుక జరగడం తెలంగాణకే తలమానికమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడంబరాలు చేస్తోందని, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడటం లేదన్నారు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపుని ఇవ్వకపోవడం శోచనీయమని, ఆడంబరాలతో గుర్తింపు రాదని ఎద్దేవా చేశారు. మేడారం జాతరలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 30, 31 వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా అధికారిక సెలవు దినం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. తూతూ మంత్రంగా జాతర జరిగే ప్రాంతాలలో ఆప్షన్ హాలిడే ఇవ్వడం, తర్వాత వచ్చే నెలలో రెండో శనివారం రద్దు చేస్తూ దానిని పని దినంగా నిర్వహించడం అనేది దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఇంటిల్లిపాది సమ్మక్క సారక్క తల్లులను కొలిచేందుకు తరలి వెళ్తున్నారని, ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు, పత్రికా ప్రకటనలకు పరిమితం కాకుండా అధికారికంగా సమ్మక్క సారక్క వేడుకలకు సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అబ్బురపరిచిన డ్రోన్ షో#telugupost #BegumpetAirport #WingsIndia2026 #droneshow l
తెలంగాణలోని నల్గొండలో చోటు చేసుకున్న ఘటనను ఉత్తరప్రదేశ్ లో
జైళ్లలో సంస్కరణలు తీసుకువస్తాం: బండి సంజయ్
జైళ్ల ఆధునీకరణ, హైసెక్యూరిటీ జైళ్ల నిర్మాణం కోసం రూ.950 కోట్ల కేటాయింపు పేద ఖైదీలకు మద్దతు పథకం కింద ఏటా రూ.20 కోట్లు కేటాయింపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విశాఖపట్నంలో ‘జైలు అధికారుల 9వ జాతీయ సమ్మేళం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి మన తెలంగాణ / అమరావతి : దేశవ్యాప్తంగా జైళ్ల బలోపేతంతోపాటు ఆయ జైళ్లను సంస్కరించి ఖైదీల్లో మార్పు తీసుకురావడంపై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు కింద రూ.950 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.. హై-సెక్యూరిటీ జైళ్లతోపాటు ఆయా జైళ్లలో భద్రతా మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలోని సాయిప్రియా రిసార్ట్లో రెండు రోజులపాటు నిర్వహించిన “జైలు అధికారుల 9వ జాతీయ సమ్మేళం’ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీపీఆర్డీ డైరెక్టర్ అలోక్ రంజన్, ఏపీ జైళ్ల శాఖ డీజీ అంజనీకుమార్, ఉన్నతాధికారులు రవి లోకు, జితేంద్ర మీనా, తెలంగాణ జైళ్ల డీజీ సౌమ్య మిశ్రాతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన జైళ్ల ఉన్నతాధికారులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ విశాఖపట్నంలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ కారాగారాలు, సవరణ సేవల విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘జైలు అధికారుల 9వ జాతీయ సమ్మేళం’ దేశవ్యాప్తంగా జైలు సంస్కరణలను మరింత బలోపేతం చేసే కీలక వేదికగా నిలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ సదస్సు ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన కరెక్షనల్ అడ్మినిస్ట్రేటర్స్ పరస్పర అనుభవాలను పంచుకునే అవకాశం లభించడమే కాకుండా, ఉత్తమ ఆచరణల, వినూత్న కార్యక్రమాల, విధానపరమైన అవసరాలుపై లోతైన చర్చ జరగడం ద్వారా జైలు పరిపాలన నాణ్యతను మెరుగుపర్చేందుకు అవసరమైన కార్యాచరణకు మార్గం సుగమం చేస్తోందని వివరించారు. పునరావాసం అంశాలపై దృష్టి సారించాలి కస్టడీలో ఉంటూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న పేద ఖైదీల సంరక్షణ, మోడల్ జైలు ప్రమాణాల అమలు, ఖైదీల విడుదల అనంతర పునరావాసం వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు. పేద ఖైదీలకు మద్దతు పథకం, జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు అమలులో వ్యూహాలు, మోడల్ ప్రిజన్ మాన్యువల్-2016, మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ చట్టం- 2023 అమలులో సవాళ్లపైనే ఈ సదస్సులో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత - సెక్షన్ 479 అమలు, జైళ్లలో సాంకేతికత వినియోగం, ఆధార్ ధృవీకరణ, వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీమెడిసిన్, జైలు శిక్షణా సంస్థల ప్రామాణీకరణ, గుర్తింపు వంటి అంశాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం నిరంతరం మార్గదర్శనం జైళ్లలో సంస్కరణలకు విధాన మార్గదర్శకాలు, చట్టపరమైన నిర్మాణం, లక్ష్యిత పథకాల ద్వారా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిరంతరం మార్గదర్శనం చేస్తోందని పేర్కొన్నారు. పేద ఖైదీలకు మద్దతు పథకం కింద ఏటా రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని, ఇప్పటివరకు 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 237 మంది ఖైదీలకు ఈ పథకం ద్వారా ఉపశమనం లభించిందని అన్నారు. జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు కింద మొత్తం రూ.950 కోట్లు కేటాయించామని వెల్లడించారు. హై-సెక్యూరిటీ జైళ్లు, భద్రతా మౌలిక సదుపాయాల బలోపేతమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని, 2025 -26 ఆర్థిక సంవత్సరానికి రూ.101.45 కోట్లు కేటాయించినట్లు వివరించారు. పరిశోధనాధారిత ప్రమాణాలు, సామర్థ్యవృద్ధి కార్యక్రమాల ద్వారా మానవీయ, సురక్షిత, సంస్కరణాత్మక జైలు వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక దృషి జాతీయ జైలు శిక్షణ విధానం-2025 ద్వారా మానవ హక్కులు, వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. 1997 నుంచి ఇప్పటివరకు 701 శిక్షణా కోర్సులు నిర్వహించి 15,875 మంది జైలు అధికారులకు శిక్షణ అందించారని తెలిపారు. జైలు పరిపాలన రాష్ట్ర అంశమైనప్పటికీ, కేంద్రం-రాష్ట్రాల సమన్వయంతో సురక్షితమైన, మానవీయమైన, పునరావాస దృష్టితో కూడిన జైలు వ్యవస్థను నిర్మించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో జరిగే చర్చలు, తీర్మానాలు భవిష్యత్తు పాలసీలు, చట్టాలు, పరిపాలనా సంస్కరణలకు దిశానిర్దేశం చేయాలని కోరారు.
Rajinikanth working on his Autobiography
Superstar Rajinikanth is busy with Jailer 2 and the film releases in August this year. He will soon kick-start the shoot of his next film that will be produced by Kamal Haasan. The veteran actor announced that he is working on his Autobiography. His daughter Soundarya Rajinikanth has revealed that Superstar has started working on […] The post Rajinikanth working on his Autobiography appeared first on Telugu360 .
రాష్ట్రంలో మరో కొత్త స్కామ్కు తెర: హరీశ్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం బీరు కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. మీకు బీరు కంపెనీలు ముఖ్యమా... రైతులు ముఖ్యమా అంటే బీరు కంపెనీలే ముఖ్యం అంటున్నారని ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన హరీశ్ రావు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా సింగూరు డ్యాం రిపేర్ పేరు మీద రైతులకు క్రాఫ్ హాలిడే ప్రకటించారని ఈ ప్రాజెక్టు కింద. 40వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు. మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్ట కింద 30వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు. ఇదే సంగారెడ్డి జిల్లాలో ఉన్న బీరు కంపెనీలకు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా నీటి సరఫలా జరుగుతోందని ఇది మద్యం తయారీదారు ప్రభుత్వమా? లేక రైతు ప్రభుత్వమా? అని నిలదీశారు. అబ్కారీ శాఖ స్పెషల్ సీఎస్ సంగారెడ్డి జిల్లాకు వెళ్లి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై రైతులకు నీటి సరఫరా ఆపి బీర్ల కంపెనీలకు నీటి కొరత రాకుండా చూడండని ఆదేశించారని ఆరోపించారు. తెలంగాణలో మరో కొత్త స్కామ్ జరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అబ్కారీ శాఖలో ఓ ముఖ్యనేత, మంత్రి కోటా కింద అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖలో కొత్తగా మైక్రో బేవరేజెస్ కు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ఇందుకోసం 110 అప్లికేషన్లు వస్తే తొలుత 25 ఇవ్వబోతున్నట్లు చెప్పారు. అయితే ఇందులో మంత్రి కోటా 4, మరో ముఖ్య నేత కోటా కింద 21 మైక్రో బెవరేజులను సెలెక్ట్ చేసుకున్నారని పంచుకున్నారని ఆరోపించారు. ఈ మధ్య ముఖ్య నేతకు తోడై, నీడై, ఇంట్లోనే ఆ నాయకుడు ఉంటున్నాడని, ఈ మధ్య వార్తల్లో కూడా ఉన్నారని ఆరోపించారు. కారు నేరుగా ముఖ్య నేత ఇంట్లోకి వెళ్తుందని, ఈ మధ్య ఈ ముఖ్య నేత తిరుపతి వెళితే సదరు నేత నీడగా వెంటే ఉన్నాడని ఆరోపించారు. ఒక్కో బ్రూవరీకి 1.80 కోట్లుగా ధర నిర్ణయించారని ఇందులో రూ.ఒక్కటిన్నర కోటి ముఖ్యనేతకు, మిగతా రూ.30 లక్షలు తోడు నీడ కు అని ఆరోపించారు. 21 తోడు నీడ ఫైనల్ చేసుకుంటే 4 మంత్రి ఫైనల్ చేసుకున్నారన్నారు. మైక్రో బేవరేజీల కోసం 110అప్లికేషన్లు వచ్చాయని అంటున్నారని అలాంటప్పుడు వైన్స్లకు లాటరీ తీసినట్టు వీటికి ఎందుకు లాటరీ తీయడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనివిధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు 4500 కోట్లు బకాయిలు పడ్డారని, కొన్ని బకాయిలు 16 నెలలకు పైబడి ఉన్నాయన్నారు. గతంలో ఎన్నడు కూడా ఈ విధమైన పరిస్థితి లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 15 రోజుల్లో చెల్లింపులు జరిగేవన్నారు. బకాయిల వల్ల సరఫరా ఆగిపోయిందని దీంతో చాలా షాపుల్లో సరుకు అందుబాటులో లేకుండా పోతోందన్నారు. ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు కూడా సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించాయని లేఖలు కూడా రాశాయన్నారు. వాటాల పంపకాల్లో తేడాతోనే బకాయిలు నిలిచిపోయాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో మరికొన్ని బ్రాండ్స్ నిలిపివేసే పరిస్థితి ఉన్నదని దీనితో ప్రభుత్వం ఆదాయం పడిపోతోందన్నారు. ఇప్పటికే హాలోగ్రామ్ టెండర్లు విషయంలో ముఖ్య నేత అల్లుడుకి, మంత్రి కొడుక్కి కావాలని పట్టుపట్టారని హరీష్రావు ఆరోపించారు.
ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కవిత
మన తెలంగాణ/హైదరాబాద్: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. ఆటో యూనియన్ల నాయకులతో బుధవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటోడ్రైవర్లకు ఇస్తామన్న రూ. 12 వేలు వెంటనే ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఇతర జిల్లాల ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలిగించటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అన్ని ఆటో సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. అవసరమైతే కార్మిక శాఖ మంత్రి ని కలుస్తామన్నారు. చట్టబద్దమైన అనుమతులు ఉన్నప్పటికీ జిల్లాల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లను అడ్డుకోవటం సరికాదన్నారు. కార్మికుల భద్రతతో పాటు వారి ఉపాధి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందన్నారు. సమావేశంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ఆటో జాగృతి అధ్యక్షుడు ఎంఏ సలీమ్, ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ వెంకటేష్, ఐఎన్ టీయూసీ జనరల్ సెక్రెటరీ మల్లేశం గౌడ్, టీ ఏడీఎస్ ప్రెసిడెంట్ సత్తిరెడ్డి, టీ ఎన్ టీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి, జీ యూ టీఎస్ అధ్యక్షులు శ్రీనివాస్, బీఆర్టీయూ అధ్యక్షుడు పరశురాముడు, తెలంగాణ జాగృతి నాయకులు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల
ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 12 నుండి ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి 16 వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ సమర్పణకు చివరి గడువు మన తెలంగాణ/హైదరాబాద్: టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ‘టీఎస్ ఐసెట్- 2026’ షెడ్యూల్ విడుదలైంది.. బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో జరిగిన సమావేశంలో షెడ్యూల్ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష బాధ్యతలను ఉన్నత విద్యా మండలి నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి అప్పగించింది. టీఎస్ ఐసెట్ కన్వీనర్గా ఎంజీయూ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ సీనియర్ ప్రొఫెసర్, యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, వివిధ యూనివర్సిటీల వీసీలు, వివిధ సెట్స్ కన్వీనర్లు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజును -ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550 ఆన్లైన్లో చెల్లించాలి. - ఇతర అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులకు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. - ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు మే 13, 14న కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి : ప్రొఫెసర్ అల్వాల రవి తెలంగాణ వ్యాప్తంగా టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్షలు నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగానే అర్హులైన అభ్యర్థులంతా సకాలంలో దరఖాస్తులను సమర్పించాలని ప్రొఫెసర్ అల్వాల రవి కోరారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని వివరించారు.
దేశానికే రోల్మోడల్గా తెలంగాణ డిజాస్టర్ మేనేజ్మెంట్
రూ.100 కోట్లతో ఆధునిక పరికరాలు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ శిక్షణా కేంద్రం క్షేత్రస్థాయి వరకు అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్ల ఏర్పాటు రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల నిర్వహణా సంస్థ (డిజాస్టర్ మేనేజిమెంట్) విభాగాన్ని బలోపేతం చేసి దేశానికి ఒక రోల్ మోడల్గా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కొనేలా వంద కోట్ల రూపాయిలతో ఆధునిక పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో విపత్తుల నిర్వహణా విభాగం, ఫైర్ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఐసిసిసి విభాగాలతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరికరాలను కొనుగోలు చేయాలన్న విషయమై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. వరదలు, అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన స్పందించడానికి కచ్చితమైన సమాచార వ్యవస్థ, రియల్టైమ్ మానిటరింగ్ సాధ్యమయ్యేలా విపత్తు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, డ్రోన్లు, శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్, ఆధునిక రెస్క్యూ పరికరాలు, అత్యాధునిక ఫైర్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను సాంకేతికతను రెవెన్యూ- విపత్తు నిర్వహణ విభాగాలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. విపత్తు విభాగంలో పనిచేసే వారికి శిక్షణ విపత్తు విభాగంలో పనిచేసే వారికి శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో అత్యుత్తమ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే వాతావరణ పరిస్థితులు క్షేత్రస్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేలా ఆయా స్థానిక పరిస్థితులను బట్టి మండలస్థాయి వరకు అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. భారీ వర్షాలు వరదల సమయంలో వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎయిర్లిఫ్ట్ మెకానిజం తయారు చేసుకోవాలని ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని తరలించడానికి 70 నుంచి 80 కిలోల బరువును ఎత్తే డ్రోన్లను కొనుగోలు చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. 77 హైస్పీడ్ బోట్లను కొనుగోలు చేయాలి ఎయిర్ లిఫ్ట్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల 2024 సంవత్సరంలో తన పాలేరు నియోజవకర్గంలో వాగుల్లో చిక్కుకున్న బాధితులను రక్షించుకోలేకపోయానని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా మాట్లాడడానికి వీలుగా సిమ్ ఆధారిత విహెచ్ ఎఫ్ రేడియో సిస్టమ్స్ అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇప్పటికే ఈ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. ఈ వ్యవస్థను క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లాలని మంత్రి సూచించారు. అలాగే హైదరాబాద్లో హైరేజ్డ్ భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని హైడ్రా కమిషనర్కు సూచించారు. 77 హైస్పీడ్ బోట్లను కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని, ఒక్కో బృందంలో వెయ్యిమంది వరకు ఉన్నారని వారికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, అగ్నిమాపకశాఖ డైరెక్టర్ విక్రమాన్ సింగ్, హైడ్రా కమిషనర్ రంగనాధ్, ఐసిసిసి డైరెక్టర్ కమల్హాసన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి పొంగులేటి ఆరా మేడారం మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటి భక్తుల కొంగు బంగారం, తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో అత్యంత పవిత్రమైన మొదటి ఘట్టం బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో సచివాలయం నుంచి హై ఫ్రీక్వెన్సీ వాకీటాకీతో మేడారంలో ట్రాఫిక్ విధులను పర్యవేక్షిస్తున్న సిబ్బందితో మంత్రి పొంగులేటి మాట్లాడారు. తొలిరోజు కావడంతో భక్తుల సంఖ్య, సారలమ్మ వార్ల రాక ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన, జాతరలో నెలకొన్న పరిస్థితులు గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తూ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, భక్తుల సౌకర్యార్థం తాగునీరు, రవాణా సౌకర్యాలు ఎప్పటికప్పుడు పరీక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
రౌడీలకు లేడీ సింగం వార్నింగ్ #Hyderabad #Secunderabad #PoliceAction #PDAct#LawAndOrder
మున్సిపల్ ఎన్నికలు.. తొలిరోజు 902 నామినేషన్లు
కాంగ్రెస్ 382, బిఆర్ఎస్ 258, బిజెపి నుంచి 169 దాఖలు ఈనెల 30వ తేదీన నామినేషన్ల దాఖలుకు చివరిగడువు మనతెలంగాణ/హైదరాబాద్:మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీల అభ్యర్థులు మొదటిరోజు నామినేషన్లు వేయడానికి ఉత్సాహం చూపారు. ఈ నేపథ్యంలోనే మొదటిరోజు (బుధవారం) నామినేషన్ల పర్వం భారీగా కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి భారీగా నామినేషన్లు రాగా, బిఆర్ఎస్ నుంచి, బిజెపిల నుంచి నామమాత్రంగా నామినేషన్లు దాఖలు కావడంతో మొత్తంగా 902 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం ఎన్నికల కమిషనర్ మున్సిపల్ షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఈనెల 30వ తేదీ వరకు నామినేషన్లకు చివరిగడువుగా పేర్కొన్నారు. దీంతో మొదటిరోజు వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్లను దాఖలు చేయడానికి ఆసక్తి చూపారు. ఇంకా రెండు రోజులే నామినేషన్లకు గడువు ఉండడంతో నేడు, రేపు నామినేషన్లు భారీగా దాఖలవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. 123 మున్సిపాలిటీల్లోని 2,996 వార్డుల్లో ఎన్నికలు 123 మున్సిపాలిటీల్లోని 2,996 వార్డుల్లో ఎన్నికలు జరుగనుండగా మొదటిరోజు 890 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 902 నామినేషన్లను దాఖలు చేశారు. ఆప్ నుంచి (1), బిఎస్పీ నుంచి (7), బిజెపి నుంచి (169), సిపిఐ నుంచి (08), కాంగ్రెస్ నుంచి (382), ఐఏఎంఐఎం నుంచి (03), బిఆర్ఎస్ నుంచి (258), టిడిపి నుంచి (0), వైఎస్ఆర్ సిపి నుంచి (0), ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి (19), స్వతంత్ర అభ్యర్థుల నుంచి (55) నామినేషన్లు కలిపి మొత్తంగా 902 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. నో- డ్యూ సర్టిఫికెట్కు రూ.3 నుంచి రూ.5వేలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి నో- డ్యూ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి అన్న నిబంధనను విధించడంతో ప్రస్తుతం దానికోసం అభ్యర్థులు నానాతంటాలు పడుతున్నారు. ఈ సర్టిఫికెట్ కోసం అధికారులు సుమారుగా రూ.3 నుంచి రూ.5 వేలు వసూళ్లు చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత పురపాలకల్లో ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలను పెండింగ్ లేకుండా చెల్లిస్తేనే ఈ సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు బకాయిలను చెల్లించడానికి పురపాలికల వద్ద క్యూ కడుతున్నారు. గతంలో నెలల తరబడి బకాయిలు చెల్లించని వారు ఒక్కసారిగా మొత్తం చెల్లించేందుకు ముందుకు వస్తుండడంతో పురపాలిక అధికారులు దానిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
నాలుగో టీ20లో చెలరేగిన కివీస్ ఓపెనర్లు.. భారత్ కు భారీ టార్గెట్
విశాఖ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ జట్టు, : టీమిండియాకు 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టుకు ఓపెనర్లు సీఫెర్ట్ (62), కాన్వే(44)లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 8.2 ఓవర్లలోనే వంద పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో కివీస్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఓవర్లలో కొంచెం నిదానంగా ఆడినా.. క్రమంగా కవీస్ బ్యాటర్లు దూకుడు పెంచారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు, స్కోరు బోర్డు మాత్రం తగ్గకుండా పరుగులు రాబట్టారు. చివర్లలో డారిల్ మిచెల్ ధనాధన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మిచెల్.. 18 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సులతో 39 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు సాధించింది. ఇక, భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా..బుమ్రా, రవి బిష్ణోయ్ లు ఒక్కో వికెట్ తీశారు.
தமிழ்நாடு அரசின் ஊர்தியில் இந்திக்கு முக்கியத்துவமா? - உண்மை இதுதான்
குடியரசு தினத்தில் தமிழ்நாடு அரசு இயக்கிய ஊர்தியில் இந்திக்கு முக்கியத்துவம் அளிக்கப்படுவதாக தவறான தகவல் பரப்பப்படுகிறது.
Video : Medaram Sammakka Saralamma Jatara 2026
The post Video : Medaram Sammakka Saralamma Jatara 2026 appeared first on Telugu360 .
Dhanush to Launch his son Yatra
Top Tamil actor Dhanush is busy as an actor in Tamil, Hindi and Telugu languages. Apart from this, he is busy producing content-driven films and is directing at least one film every year. One wonders how Dhanush manages to work on so many projects and how he manages to handle all the crafts of cinema. […] The post Dhanush to Launch his son Yatra appeared first on Telugu360 .
Road accident |ఘోర రోడ్డు ప్రమాదం….
Road accident | ఘోర రోడ్డు ప్రమాదం…. Road accident | బిక్కనూర్,
న్యూజిలాండ్ దూకుడుకు బ్రేక్ వేసిన భారత్.. స్కోర్ ఎంతంటే..
విశాఖ: ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టి-20లో న్యూజిలాండ్ దూకుడుకు భారత బౌలర్లు బ్రేక్ వేశారు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్కి దిగిన కివీస్కు ఓపెనర్లు కాన్వే, సీఫెర్ట్ శుభారంభం అందించారు. తొలి వికెట్కి వీరిద్దరు కలిసి 100 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యానికి కుల్దీప్ యాదవ్ బ్రేక్ వేశాడు. కుల్దీప్ బౌలింగ్లో కాన్వే(44) రింకూ సింగ్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కొంత సమయానికే రచిన్ రవీంద్ర(2) బుమ్రా బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజ్లో సీఫెర్ట్ (62), ఫిలిప్స్(16) ఉన్నారు.
Gajjelamma |కొలనులో వెలసిన గ్రామ దేవత
Gajjelamma | కొలనులో వెలసిన గ్రామ దేవత Gajjelamma | కుంటాల, ఆంధ్రప్రభ
సినిమా తరహా గంజాయి దందా ₹2.936 కేజీలు స్వాధీనం #Crime #Machilipatnam #Excise #DrugsBust
నేను పార్టీ ఫిరాయించలేదు.. బిఆర్ఎస్లోనే ఉన్నా: దానం
మన తెలంగాణ/హైదరాబాద్ః ‘నేను పార్టీ ఫిరాయించలేదు, బిఆర్ఎస్లోనే ఉన్నాను..’ అని ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బుధవారం స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసు రావడంతోనే దానం నాగేందర్ స్పందించారు. తాను పార్టీ ఫిరాయించలేదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు అందజేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. తాను బిఆర్ఎస్కు రాజీనామా చేయలేదని, ఆ పార్టీలోనే ఉన్నానని ఆయన అందులో తెలిపారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగతంగా వెళ్ళానే తప్ప బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కాదని తెలిపారు. మీడియా కథనాల ఆధారంగానే తాను పార్టీ మారినట్లు బిఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నదని ఆయన వివరించారు. కాబట్టి తనపై దాఖలైన అనర్హత పిటిషన్ను కొట్టివేయాలని ఆయన కోరారు. 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ ఆ తర్వాత (2024) లోక్సభకు జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, కాంగ్రెస్ నుంచి లోక్సభకు పోటీ చేయడం బహిరంగంగా కనిపిస్తున్న సాక్షమని, ఇంకా వేరే ఆధారాలు అవసరం లేదని ఆయన పిటిషన్లో తెలిపారు.
టోల్ప్లాజా గడ్డరు తగిలి ఇంటర్ విద్యార్థి మృతి
డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్ప్లాజా వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. అన్నంపల్లి పంచాయతీ లక్ష్మిదేవిలంక గ్రామానికి చెందిన విద్యార్థి సోంపల్లి వెంకట రవీంద్ర.. అమలాపురం నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లేందుకు రోజూలాగే ఆర్టిసి పల్లె వెలుగు బస్సు ఎక్కాడు. తోటి విద్యార్థులతో కలిసి వెనుక సీట్లో కూర్చుని కిటీకి నుంచి తల బయటకు పెట్టడంతో టోల్ప్లాజా గడ్డరు తగిలి మరణించాడు. ఊహించని పరిణామంతో తోటి విద్యార్థులంతా షాక్కి గురయ్యారు.
అజిత్ పవార్ కుటుంబం ధైర్యంగా ఉండాలి: సిఎం రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్ర డిప్యూటీ సిఎంఅజిత్ పవార్ మృతిపట్ల సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సంతాపం తెలిపారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని సిఎం రేవంత్రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. బారామతిలో జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందడం ఎంతో బాధాకరమని, ఈ కష్ట కాలంలో ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలని సిఎం రేవంత్రెడ్డి కోరారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని, అజిత్ పవార్ మృతిపట్ల సంతాపాన్ని ఆయన ప్రకటించారు. కాగా, అజిత్ పవార్ బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడంతో దేశ రాజకీయాల్లో పెను విషాదం నెలకొంది. ఆయన మృతదేహాన్ని తరలించిన ఆస్పత్రి వద్ద భారీ ఎత్తున పార్టీ నేతలు, ప్రజలు చేరుకొని కంటతడి పెట్టుకున్నారు.
Govinda Raju |భక్తుల నీరాజనాలు
Govinda Raju | భక్తుల నీరాజనాలు Govinda Raju | ఏటూరు నాగారం,
బేగంపేట విమానాశ్రయంలో అట్టహాసంగా ప్రారంభమైన 'వింగ్స్ ఇండియా 2026' #WingsIndia2026 #Hyderabad
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న టీమిండియా #Visakhapatnam #TeamIndia #Cricket #Simhachalam
ఇందిరమ్మ ఇళ్లు.. లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన హౌసింగ్ ఏఈ
మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన నార్నూర్ హౌసింగ్ ఏఈ శ్రీకాంత్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. శ్రీకాంత్ పై క్రిమినల్ కేసు నమోదు చేశామని, అలాగే ఆయన్ను బ్లాక్ లిస్టులో పెట్టినట్టు ఎండి గౌతమ్ తెలిపారు. ఇళ్ల ఫొటోలను యాప్లో అప్లోడ్ చేసేందుకు ఎవరైనా అధికారులు నిరాకరిస్తే లబ్ధిదారులే యాప్ లో ఆ ఫొటోలు పెట్టుకోవచ్చని ఎండి తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే కాల్ సెంటర్ (18005995991) కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎండి గౌతమ్ సూచించారు. ఫొటోల అప్డేట్ కోసం రూ.10 వేలు కాగా, ఆదిలాబాద్ జిల్లా నార్నూల్ మండలంలోని హౌసింగ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఏఈగా పని చేస్తున్న శ్రీకాంత్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డాడు. ఓ లబ్ధిదారు ఇంటికి సంబంధించిన ఫొటోలను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి మొత్తం రూ. 20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసిబిని ఆశ్రయించారు. అధికారుల సూచన మేరకు అతడు డిమాండ్ చేసిన డబ్బుల్లో రూ. 10 వేలు ఇస్తుండంగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
తహసిల్దార్ కార్యాలయాన్ని జెసి ఆకస్మిక తనిఖీ
విశాలాంధ్ర పెనుకొండ.. సత్య సాయి జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ మంత్రి మౌర్య భరద్వాజ బుధవారం పెనుకొండ తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని అడదకులపల్లి గ్రామానికి సంబంధించిన రీసర్వే వీఆర్ఓ లాగిన్ డేటా ఎంట్రీని సమీక్షించారు. జీటీ దశ నుండి ఇప్పటివరకు చేపట్టిన రీసర్వే ప్రక్రియపై సంబంధిత వీఆర్ఓ, వీఎస్, ఎంఎస్ మరియు తహశీల్దార్ నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ తనిఖీ కార్యక్రమంలో పెనుకొండ ఆర్డీఓ టి. ఆనంద కుమార్ మరియు […] The post తహసిల్దార్ కార్యాలయాన్ని జెసి ఆకస్మిక తనిఖీ appeared first on Visalaandhra .
అజిత్ పవార్ మృతికి సచిన్ సంతాపం
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మరణం గురించి తెలిసి ఎంతో బాధపడుతున్నా..ప్రజల కోసం అంకితభావంతో పని చేసిన ఓ మంచి నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందని..ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా సానుభూతి.. ఓ శాంతి అని సచిన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా, బుధవారం ఎన్నికల ప్రచారం నిమిత్తం అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి విమానంలో బయలుదేరి వెళ్లారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురి కావడంతో పవార్తో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు.
హైదరాబాద్లో 4 కుషల్స్ జ్యువెలరీ స్టోర్లను ప్రారంభించిన ప్రియాంక
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్ మరియు వెండి ఆభరణాల బ్రాండ్ అయిన కుషల్స్, నేడు హైదరాబాద్లో 4 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండ్ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. కొండాపూర్ స్టోర్లో భారీ ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ఆకర్షణను మరియు ఉత్సాహాన్ని జోడిస్తూ, ఈ వేడుకలో ప్రముఖ దక్షిణ భారత అందాల నటి మరియు దక్షిణ భారతదేశం కోసం కుషల్స్ యొక్క కొత్త బ్రాండ్ అంబాసిడర్ ప్రియాంక మోహన్ హాజరయ్యారు. కొత్తగా ప్రారంభించబడిన ప్రతి స్టోర్ సుమారు 1300 చదరపు అడుగుల నుండి 1700 చదరపు అడుగుల వరకు విస్తరించి, ఆత్మీయ, లీనమయ్యే, ఉన్నతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది. ఐదు వేలకు పైగా జాగ్రత్తగా రూపొందించిన డిజైన్లతో, ఈ స్టోర్ లు వేడుక నుండి సొగసైన వర్క్ వేర్ , అద్భుతమైన పెళ్లి సెట్లు మరియు రోజువారీ నిత్యావసరాలు వరకు విస్తృతమైన ఆభరణాలను ప్రదర్శిస్తాయి. యాంటిక్, కుందన్, జిర్కాన్, టెంపుల్ మరియు స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాలతో సహా విభిన్న శ్రేణి డిజైన్లను వినియోగదారులు అన్వేషించవచ్చు. నెక్లెస్లు, చోకర్లు, చెవిరింగ్ లు , ఫింగర్ రింగ్లు, పెండెంట్ సెట్లు, బ్రాస్లెట్లు, కడాలు, మాంగ్ టికాలు మరియు బ్రోచెస్ల యొక్క వైవిధ్యమైన ఎంపికతో సహా విస్తృత శ్రేణి అభిరుచులు , ప్రాధాన్యతలకు అనుగుణంగా కుషల్స్ ఆభరణాలు అందిస్తుంది-సాంప్రదాయ భారతీయ సౌందర్యశాస్త్రం , సమకాలీన ఫ్యాషన్ ఎంపికలకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి. ఈ విస్తరణ గురించి కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ మార్కెటింగ్ డైరెక్టర్ అంకిత్ గులేచా మాట్లాడుతూ, “ఫ్యాషన్ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్, హైదరాబాద్. ఇక్కడి వినియోగదారులు ఫ్యాషన్ మరియు ఆభరణాలలోని సరికొత్త పోకడల గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. గత కొద్ది సంవత్సరాలుగా, నగరంలో కుషల్స్ కలెక్షన్లకు మరియు బ్రాండ్కు స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది, హైదరాబాద్ షాపర్ల తో మా బలమైన సంబంధాన్ని పునరుద్ఘాటిస్తోంది. మేము మా కార్యకలాపాలను విస్తరిస్తూన్న వేళ, అధిక-నాణ్యత కలిగిన పనితనం , విస్తృత శ్రేణి ఆకర్షణీయమైన ఆభరణాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము, అదే సమయంలో నగరంలో మరిన్ని దుకాణాలను ప్రారంభించడం ద్వారా కుషల్స్ను హైదరాబాద్ అంతటా మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటి ప్రియాంక మోహన్ మాట్లాడుతూ, “కుషల్స్ ఆభరణాలు సంప్రదాయం, ఆధునిక డిజైన్ను అందంగా సమతుల్యం చేస్తాయి. ఈ కలెక్షన్లు ఆకర్షణీయమైనవి, వైవిధ్యతతో కూడి ఉన్నవి. పండుగ వేడుకలకైనా లేదా సాధారణ రోజు అయినా స్టైల్ చేయడానికి అత్యంత సులభమైనవి. వ్యక్తిగతంగా నేను ధరించడానికి ఇష్టపడే బ్రాండ్ ఇది. హైదరాబాద్లో జరుగుతున్న ఈ ప్రత్యేక ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగం కావడం మరియు కుషల్స్ తమ వినియోగదారులకు ఇంత విస్తృత శ్రేణిలో ఆలోచనాత్మకంగా రూపొందించిన ఆభరణాలను తీసుకురావడం చూడటం నాకు సంతోషంగా ఉంది” అని అన్నారు. ఈ సందర్భాన్ని వేడుక చేసుకునేందుకు, కొనుగోలుదారుల కోసం ప్రత్యేకమైన ప్రారంభోత్సవ ఆఫర్లను కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ అందిస్తోంది. ఈ ప్రారంభంతో, కుషల్స్ ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం 17 స్టోర్లను కలిగి ఉంది, ఇది తెలంగాణలో బ్రాండ్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుంది , రాష్ట్రవ్యాప్తంగా కస్టమర్లకు దగ్గర చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్లో 20 స్టోర్లను చేరుకోవాలని బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ వ్యాప్తంగా 40 నగరాల్లో 100కు పైగా స్టోర్లు మరియు kushals.comలో బలమైన ఆన్లైన్ ఉనికితో, బ్రాండ్ తన వేగవంతమైన విస్తరణ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది, రాబోయే మూడు సంవత్సరాలలో భారతదేశం అంతటా 300 కి పైగా స్టోర్లను తెరవాలని ప్రణాళికలు చేస్తోంది . దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ఫ్యాషన్, అధిక-నాణ్యత కలిగిన ఆభరణాలను తీసుకురావాలనే బ్రాండ్ లక్ష్యంను హైదరాబాద్ లోని ఈ ప్రారంభోత్సవాలు మరింతగా పునరుద్ఘాటిస్తాయి. నల్లగండ్ల, కూకట్పల్లి, లేక్షోర్ వై జంక్షన్ మాల్ మరియు కొండాపూర్లోని మా కొత్త హైదరాబాద్ స్టోర్లను సందర్శించి తాజా కలెక్షన్లను అన్వేషించండి. స్టోర్ సమయాలు: ఉదయం 11:00 నుండి రాత్రి 9:00 వరకు.
బాలికపై దాడి చేసిన శునకం.. స్పందించిన హెచ్ఆర్సి
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్లోని శ్రీనివాస్నగర్లో మంగళవారం ఉదయం బాలికపై శునకం దాడి చేసిన ఘటన తెలిసిందే. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల శార్విపై వీధి కుక్క దాడి చేసింది. దీంతో ఆ పాపకు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు మల్లికార్జున్, రేవతిలు పాపను రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యలు, అమలులో ఉన్న నివారణ చర్యలపై వివరణాత్మక నివేదిక ఫిబ్రవరి 24లోగా ఇవ్వాలని జిహెచ్ఎంసి కమిషనర్ను ఆదేశించింది.
మొయినాబాద్ మృగవాణి పార్క్ వద్ద స్కూల్ బస్సు బోల్తా #Hyderabad #SchoolBusAccident #Moinabad
CM Cup |సీఎం కప్ పోటీలలో మెరిసిన సంజూత
CM Cup | సీఎం కప్ పోటీలలో మెరిసిన సంజూత CM Cup
నాలుగో టి-20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
విశాఖ: ఐదు టి-20ల సిరీస్లో భాగంగా విశాఖపట్నంలోని ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న నాలుగో టి-20 మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి మూడు మ్యాచుల్లో గెలిచి విజయోత్సాహంతో ఉన్న భారత్ ఈ మ్యాచ్లో కూడా గెలిచి కివీస్ని చిత్తు చేయాలని అనుకుంటోంది. మరోవైపు చివరి రెండు మ్యాచుల్లో అయినా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ మ్యాచ్లో భారత్ ఒక మార్పు చేసింది. ఇషాన్ కిషన్ స్థానంలో అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్ కూడా జట్టులో ఒక మార్పు చేసింది. జెమీసన్ బదులు ఫౌల్క్స్ని జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: భారత్: అభిషేక శర్మ, సంజూ శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), జాకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ.
Kalki 2898 AD Sequel: Did Prabhas change Plan?
The debacle of Raja Saab has done enough damage for Prabhas. The actor has to be extra cautious about his upcoming movies. Prabhas has returned back from his Italy holiday and is lining up the schedules of his upcoming movies. He allocated dates for Fauji and the shoot starts soon. As per the recent developments, […] The post Kalki 2898 AD Sequel: Did Prabhas change Plan? appeared first on Telugu360 .
Shankar’s deal with Pen Studios?
Top director Shankar has been struggling to deliver a decent hit. The debacles of Indian 2 and Game Changer brought huge criticism for his work. Shankar is yet to complete the pending portions of Indian 3 and there are a lot of speculations going on. Lyca Productions made it clear that they are not ready […] The post Shankar’s deal with Pen Studios? appeared first on Telugu360 .
1000s of years |సమ్మక్క–సారలమ్మల కంటే ముందే మేడారం..
1000s of years | దండకారణ్యంలో భాగమైన మేడారంరామాయణ కాలంలో దండకారణ్యం ప్రస్తావనవనదేవతల
Veena’s Explosive Revelations, Jagan’s Sharp Questions, Arava Sreedhar in Deep Political Trouble
A serious allegations against Arava Sreedhar, a sitting MLA from the Jana Sena Party, blown into a political storm after a government employee named Veena appeared before the media with her lawyer and gave a detailed account of alleged harassment and abuse. From Online Contact to Alleged Coercion Veena stated that her interaction with the […] The post Veena’s Explosive Revelations, Jagan’s Sharp Questions, Arava Sreedhar in Deep Political Trouble appeared first on Telugu360 .
Underground |మురికి సమస్యకు శాశ్వత విముక్తి
Underground | మురికి సమస్యకు శాశ్వత విముక్తి Underground | ఖమ్మం, ఆంధ్రప్రభ
Bronze medal |ఉదయ్పూర్లో అశోక్కు కాంస్య పతకం
Bronze medal | ఉదయ్పూర్లో అశోక్కు కాంస్య పతకం Bronze medal |
Telangana : మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి?
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రిఫరెండంగానే చూడాలి
danam nagendar |నేను కారు దిగలే..
నేను కారు దిగలే.. danam nagendar |వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : పార్టీ ఫిరాయింపుపై
Statue unveiling |ఘనంగా కొమురం భీమ్ విగ్రహవిష్కరణ
Statue unveiling | ఘనంగా కొమురం భీమ్ విగ్రహవిష్కరణ Statue unveiling |
Hey Bhagawan: Hilarious Chaos begins on Feb 20th
Suhas continues to impress with his steady pace and penchant for choosing distinctive scripts. He is currently starring in a new project directed by debutant Gopi Atchara. This full-on entertainer is being produced by B. Narendra Reddy under the banner of Trishul Visionary Studios. Today, makers unveiled the fun and hilarious teaser in a grand […] The post Hey Bhagawan: Hilarious Chaos begins on Feb 20th appeared first on Telugu360 .
సుహాస్ ‘హే భగవాన్’ టీజర్.. ఆద్యంతం నవ్వులే..
యూట్యూబర్గా కెరీర్ మొదలు పెట్టి.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై తన నటనతో అందరినీ మెప్పిస్తున్నాడు సుహాస్. సుహాస్ హీరోగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేశాడు. తాజాగా సుహాస్ నటిస్తున్న చిత్రం ‘హే భగవాన్’. ఎలాగైనా బిజెనెస్లో సక్సెస్ కావాలనే ఓ మధ్య తరగతి వ్యక్తిగా సుహాస్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఇక శివానీ నాగారం ఈ సిమిాో హీరోయిన్గా నటిస్తుండగా.. బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. గోపి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. మీరు కూడా ‘హే భగవాన్’ టీజర్ చూసేయండి.
Adilabad |కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు…
Adilabad | కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు… Adilabad | లక్షేట్టిపేట,
Nomination |నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో…
Nomination | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో… Nomination | చౌటుప్పల్, ఆంధ్రప్రభ
TB disease |టీబీ వ్యాధిపై అవగాహన శిబిరం..
TB disease | టీబీ వ్యాధిపై అవగాహన శిబిరం.. TB disease |
Employment Guarantee |మోడీ, అమిత్ షా కుట్ర…మహేష్ కుమార్ గౌడ్
Employment Guarantee | మోడీ, అమిత్ షా కుట్ర… Employment Guarantee |
Weather |పగలు సురసుర.. రాత్రి గజగజ
Weather | పగలు సురసుర.. రాత్రి గజగజ Weather | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా : దానం నాగేందర్
స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమాధానమిచ్చారు
రాష్ట్రం ఒక జంగిల్ రాజ్ గా మారింది : వైఎస్ జగన్
రాష్ట్రం ఒక జంగిల్ రాజ్ గా మారిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు
విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
పుస్తకాలను అందజేస్తున్న రమేష్, కృష్ణ.. విశాలాంధ్ర-డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా):మండలంలోని అడపావలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.విశాఖపట్నం వాస్తవ్యులు, అంతర్జాతీయ గాయకులు, ఆర్కెస్ట్రా అధినేత శేఖర్ సహకారంతో పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్, జిల్లా నాయకులు కృష్ణ సుమారు 20 విద్యార్థిని-విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు తదితర విద్యా సామగ్రిని తమ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థులు చదువుకు […] The post విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ appeared first on Visalaandhra .
ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో గ్రహణమొర్రి– పెదవి చీలికలకు ఉచిత వైద్య శిబిరం
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంతపురము జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఈ.బి. దేవి ఆధ్వర్యంలో, ఆర్బీఎస్కే జిల్లా కార్యక్రమ అధికారి డా. ఎస్.బి. విష్ణుమూర్తి పర్యవేక్షణలో, బుధవారం డిఈఐసి నందు గ్రహణ మొర్రి మరియు పెదవి చీలిక కార్యక్రమం ఏవిర్ హాస్పిటల్ వారి సహకారం తో విజయవంతంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుంచి గుర్తించబడిన పిల్లలను తీసుకువచ్చి, వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు నిపుణ […] The post ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో గ్రహణమొర్రి– పెదవి చీలికలకు ఉచిత వైద్య శిబిరం appeared first on Visalaandhra .
ఖాదర్ బాబా ఉరుసు ఉత్సవాలకు..పటిష్ట నిఘాతో బందోబస్తు..!
వంద మంది సిబ్బంది..షాడో టీమ్స్..డ్రోన్స్.. సీసీ కెమెరాలు, విజిబుల్ పోలీసింగ్ తో పర్యవేక్షణ.. టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు విజయనగరం టౌన్ : పట్టణంలోని బాబామెట్టలో గల ప్రముఖ ఆధ్యాత్మిక సూఫీ క్షేత్రం హజరత్ ఖాదర్ బాబా 67 వ ఉరుసు మహోత్సవాలు సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పటిష్ట నిఘా వ్యవస్థతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రాత్రి ఖాదర్ బాబా […] The post ఖాదర్ బాబా ఉరుసు ఉత్సవాలకు..పటిష్ట నిఘాతో బందోబస్తు..! appeared first on Visalaandhra .
Singareni |సింగరేణి వ్యవహారంలో కథనాలన్నీ అవాస్తవం
Singareni | సింగరేణి వ్యవహారంలో కథనాలన్నీ అవాస్తవం Singareni | గోదావరిఖని, ఆంధ్రప్రభ
Tirupathi |తిరుమల కొండ.. భక్తుల కిటకిట
Tirupathi | తిరుమల కొండ.. భక్తుల కిటకిట Tirupathi | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ
మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
Budgets |ఒక్క మంచి పని జరగలేదు…
Budgets | ఒక్క మంచి పని జరగలేదు… Budgets | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దురంధర్.. ‘పుష్ప-2’, ‘బాహుబలి-2’ తర్వాత..
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దురంధర్’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మొదటి షో నుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ఈ సినిమా విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-ఛాప్టర్-1 సినిమాలను అధిగమించింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. ఇండియాలో వెయ్యి కోట్లపైగా వసూళ్లు సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. వెయ్యి కోట్లు సాధించిన సినిమాల లిస్టులో దురంధర్ మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో యశ్ నటించిన ‘కెజిఎఫ్-2’ సినిమాను దాటేసింది. ఈ జాబితాలో మొదటిస్థానంలో రూ.1,471 కోట్లతో అల్లు అర్జున్ ‘పుష్ప-2’, రెండో స్థానంలో రూ.1417 కోట్లతో ప్రభాస్ ‘బాహుబలి-ది కన్క్లూజన్’ సినిమాలు ఉన్నాయి. తాజాగా దురంధర్ రూ.1002 కోట్లతో మూడోస్థానాన్ని సొంతం చేసుకుంది. అంతేకాక... అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఇది నిలిచింది. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (రూ.760 కోట్లు)ను ఈ సినిమా అధిగమించింది. స్పై థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది మార్చిలో దురంధర్-2 సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
Distribution |ప్రజా పంపిణీలో ఆలసత్వం క్షమార్హం కాదు
Distribution | ప్రజా పంపిణీలో ఆలసత్వం క్షమార్హం కాదు Distribution | చండూర్,
Collector |ఆలేరు నామినేషన్ కేంద్రాన్ని సందర్శన…
Collector | ఆలేరు నామినేషన్ కేంద్రాన్ని సందర్శన… Collector | ఆలేరు, ఆంధ్రప్రభ
CM Cup | 30న మండల స్థాయి సీఎం కప్ పోటీలు
CM Cup | 30న మండల స్థాయి సీఎం కప్ పోటీలు CM
Utkoor |లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచుదాం….
Utkoor | లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచుదాం…. Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ
Mangapeta |ఇసుక వేస్తే రాలనంత….
Mangapeta | ఇసుక వేస్తే రాలనంత…. Mangapeta | మేడారం / మంగపేట,
TG |ఘనంగా ప్రారంభమైన మేడారం మహాజాతర
TG | ఘనంగా ప్రారంభమైన మేడారం మహాజాతర TG | మేడారం వాజేడు,
ఐసిసి టి-20 ర్యాంకులు.. సత్తా చాటిన భారత ప్లేయర్లు..
న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టి-20ల సిరీస్లో వరుసగా తొలి మూడు మ్యాచుల్లో విజయం సాధించి.. 3-0 తేడాతో భారత్ సిరీస్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసిసి టి-20 ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఎవరికి అందుబాటులో లేని విధంగా 929 పాయింట్లతో నెం.1 ర్యాంకులో స్థిరపడ్డాడు. ఇక కివీస్ టి-20 సిరీస్లో రాణిస్తున్న టీం ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. 717 పాయింట్లతో ఐదు స్థానాలు మెరుగుపరచుకొని ఏడో స్థానానికి ఎగబాకాడు. ఇక గాయం కారణంగా న్యూజిలాండ్ సిరీస్కి దూరమైన తిలక్ వర్మ మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు. బౌలర్ల విషయానికొస్తే.. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తొలి స్థానంలో ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా 4 స్థానాలు మెరుగుపర్చుకొని 13కు, రవి బిష్ణోయ్ 13 స్థానాలు ఎగబాకి 19కి, హార్థిక్ పాండ్యా 18 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంకుకు చేరారు. వరుణ్ మినహా టాప్-10లో భారత బౌలర్లు ఎవరూ లేరు. ఆల్ రౌండర్లలో టీం ఇండియా ఆటగాళ్లు హార్థిక్ పాండ్యా ఒకటి, శివమ్ దూబే 6 స్థానాలు మెరుగుపరచుకొని 3, 12 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. టాప్-1లో జింబాబ్వే ఆటగాడు సికందర్ రాజా, టాప్-2లో పాకిస్థాన్ ఆటగాడు సైమ్ అయుబ్ ఉన్నారు.
స్కానింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి….
ఫిర్యాదులను 18004256131 ఫోన్ చేయాలి… జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి… The post స్కానింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి…. appeared first on Visalaandhra .
Investigation |విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Investigation | విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు Investigation |
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన సాలె ధనుంజయ గ్రూప్ – 2 ఫలితాల్లో ప్రతిభ చాటి జోన్ – 4 ఎక్సైజ్ ఎస్ఐగా ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన ధనుంజయ తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయం వద్ద చిల్లర కొట్టు నడుపుతూ కుమారుడిని బీటెక్ వరకు చదివించారు. అమ్మ నాన్నల కష్టాన్ని గుర్తించిన ధనుంజయ పట్టుదలతో చదివి గ్రూప్ – 2 లో విజయం సాధించారు. సామాన్య కుటుంబం నుంచి […] The post ఎక్సైజ్ ఎస్ఐగా ఎంపికైన ధనుంజయ appeared first on Visalaandhra .
TG |వేరుశనగ రైతులకు శిక్షణ….
TG | వేరుశనగ రైతులకు శిక్షణ…. TG | మునుగోడు, ఆంధ్రప్రభ :
గ్రూప్–2 ఫలితాల్లో మెరిసిన కూలి కొడుకు
విశాలాంధ్ర- రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం మండలం గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన తుర్ల దుర్గారావు గ్రూప్–2 పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO)గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన దుర్గారావు విజయం ప్రాంతీయ యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. దుర్గారావు తల్లిదండ్రులు తుర్ల అప్పన్న, సూరమ్మలు వృత్తిరీత్యా వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పరిమిత ఆదాయం ఉన్నప్పటికీ, తమ కుమారుడు […] The post గ్రూప్–2 ఫలితాల్లో మెరిసిన కూలి కొడుకు appeared first on Visalaandhra .
TG |ఊట్కూర్ ముంపు గ్రామంగా ప్రకటించాలి….
TG | ఊట్కూర్ ముంపు గ్రామంగా ప్రకటించాలి…. TG | ఊట్కూర్, ఆంధ్రప్రభ

17 C