Scrub typhus |రాకూడదంటే ఏం చేయాలి..
Scrub typhus | రాకూడదంటే ఏం చేయాలి.. Scrub typhus, కృష్ణా ప్రతినిధి,
Telangana : ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం
ఫార్ములా ఈ-రేస్ కేసులో ప్రభుత్వం వేగం పెంచింది
NMMS | 20 కేంద్రాల్లో పరీక్ష..
NMMS | 20 కేంద్రాల్లో పరీక్ష.. NMMS, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఈ
Bigg Boss Telugu 9: Ticket to Finale Begins with Chaos, Clashes and Clever Strategy
The Ticket to Finale race began with high tension, strategic manoeuvring and emotional meltdowns. What should have been a competitive start quickly turned into a chaotic episode of the season, driven largely by Tanuja’s relentless arguments and the friction that followed. Tanuja’s Endless Nagging Tests Viewers’ Patience The episode opened with Tanuja revisiting the previous […] The post Bigg Boss Telugu 9: Ticket to Finale Begins with Chaos, Clashes and Clever Strategy appeared first on Telugu360 .
పవన్ కల్యాణ్ మాటలను వక్రీకరించవద్దు: జనసేన
అమరావతి: జనసేన అధినేత, ఉప ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించొద్దు అంటూ జనసేన పార్టీ కోరింది. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిష్టి అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను తెలంగాణ నేతలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండడంతో తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలివితక్కువ వారు అని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించిన విషయం విధితమే. కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి సాంకేతిక, భౌగోళిక కారణాలు ఉండగా, వాటిని రాజకీయం చేస్తూ 'దిష్టి' వంటి అంశాలను ప్రస్తావించడం సరికాదని పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు మండిపడ్డారు.
The Raja Saab |బొమన్ ఇరానీ క్యారెక్టర్ ఏంటి..?
The Raja Saab | బొమన్ ఇరానీ క్యారెక్టర్ ఏంటి..? The Raja
కడియంలో వైభవంగా గీతా జయంతి వేడుకలు. విశాలాంధ్ర – కడియం : మానవాళికి జీవన విధానాన్ని ప్రబోధించే శ్రీమద్ భగవద్గీత జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో, గోశాల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ మందిరం నందు గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు మహిళలు సామూహిక గీతా పారాయణం చేశారు. అనంతరం గోశాల సంరక్షణ సమితి అధ్యక్షులు గిరజాల […] The post కడియంలో వేడుకలు appeared first on Visalaandhra .
3 Dec Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా!
3 Dec Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా! 3 Dec
అనపర్తిలో ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే
నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం. అనపర్తిలో ప్రజా దర్బార్ లో 75 ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తి నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో […] The post అనపర్తిలో ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే appeared first on Visalaandhra .
India Vs South Africa : తేలిగ్గా తీసుకుంటే.. తన్నుకుపోతారంతే
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో వన్డే మ్యాచ్ నేడు రాయపూర్ వేదికగా జరగనుంది.
‘ఆంధ్ర కింగ్..’కు అదిరిపోయే స్పందన
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బా ్లక్బస్టర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మే కర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు. పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ స్పందనతో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ “స్టార్ అండ్ ఫ్యాన్కు మ ధ్య ఉన్న ఎమోషన్ చెబుతూ, హ్యూమన్ ఎ మోషన్ కూడా టచ్ చేసిన సినిమా ఇది. ఇలాంటి ఎమోషన్ ప్రపంచంలో ఎక్కడా లే దు. మన తెలుగు సినిమాకే సొంతం. వివేక్, మెర్విన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. భాగ్యశ్రీ గ్లామర్గా కనిపిస్తూనే అద్భుతంగా నటించింది”అని అన్నారు. ప్రొడ్యూసర్ రవి మా ట్లాడుతూ “ఇది చాలా మంచి సినిమా. అం దరూ చూడాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం”అని పేర్కొన్నారు. డైరెక్టర్ మహేష్ బాబు మాట్లాడుతూ సినిమా ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్లబోతోందిఅని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీ రోయిన్ భాగ్యశ్రీ ,మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్, మెర్విన్ పాల్గొన్నారు.
మలక్పేట: హైదరాబాద్లోని మలక్పేట చౌరస్తాలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. టివి టవర్స్ సమీపంలో టిప్పర్ లారీ అదుపుతప్పి మరో లారీ, బస్సు ఢీకొట్టింది. అనంతరం మెట్రో బిడ్జ్రి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ప్రాణప్రాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. త్రీవ ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో టిప్పర్ లారీని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు
Panchayat Elections |ఏకగ్రీవం చేస్తే పది లక్షలు..
Panchayat Elections | ఏకగ్రీవం చేస్తే పది లక్షలు.. Panchayat Elections, మంచిర్యాల
Chandrababu : నేడు తూర్పు గోదావరి జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు
నేడు రెండో వన్డే ..సిరీస్పై టీమిండియా కన్ను
రాయ్పూర్: సౌతాఫ్రికాతో బుధవారం జరిగే రెండో వన్డే మ్యాచ్కు ఆతిథ్య టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. రాయ్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. రాంచిలో జరిగిన మొదటి వన్డేలో అద్భుత విజయం సాధించిన భారత్ ఈసారి కూడా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్లు తొలి వన్డేలో అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. కోహ్లి ఏకంగా సెంచరీ సాధించగా రోహిత్, రాహుల్లు అర్ధ శతకాలతో అలరించారు. ఈ మ్యాచ్లో కూడా రోహిత్, కోహ్లిలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి కూడా వీరు జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యారు. కోహ్లి, రోహిత్లు ఫామ్లో ఉండడం భారత్కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇద్దరు మరోసారి చెలరేగితే రెండో వన్డేలోనూ భారత్కు భారీ స్కోరు ఖాయం. రాంచిలో విఫలమైన యశసవి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లు ఈసారైనా తమ బ్యాట్లకు పని చెప్పాల్సి ఉంది. కాగా, ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ను బరిలోకి దించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. తొలి వన్డేలో విఫలమైన రుతురాజ్ స్థానంలో పంత్ను ఆడించే అవకాశం ఉంది. ఇక వాషింగ్టన్ సుందర్ స్థానంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించినా ఆశ్చర్యం లేదు. అయితే తొలి వన్డేలో బౌలర్లు విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్లో బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే విజయం అంత సులువు కాదనే చెప్పాలి. మరోవైపు సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి స్థితిలో జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీన్ని తట్టుకుని ముందుకు సాగడం అనుకున్నంత తేలికకాదని చెప్పొచ్చు.
Vamsi paidipally |ఆమిర్ ఖాన్ తో అనుకుంటే.. ?
Vamsi paidipally | అమీర్ ఖాన్ తో అనుకుంటే.. ? Vamsi paidipally,
Vamsi paidipally |అమీర్ ఖాన్ తో అనుకుంటే.. ?
Vamsi paidipally | అమీర్ ఖాన్ తో అనుకుంటే.. ? Vamsi paidipally,
Ditwah cyclone |దిశ మార్చిన వాయుగుండం..
Ditwah cyclone | దిశ మార్చిన వాయుగుండం.. Ditwah cyclone, ఆంధ్రప్రభ వెబ్
Andhra King Taluka |ఆ.. ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ఇది –రామ్
Andhra King Taluka | ఆ.. ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ఇది –
హద్దుల్లేని హామీలతో అభివృద్ధి సాధ్యమా?
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల పోకడలు శ్రుతి మించుతున్నాయి. ఎంఎల్ఎ, ఎంపి పదవులకోసం అభ్యర్థులు ఎంతకైనా తెగించడం, కోట్లలో ఖర్చు చేయడం చూశాం. కానీ, ఒక గ్రామానికి మాత్రమే పరిమితమయ్యే సర్పంచ్ ఎన్నికల్లోనూ అభ్యర్థులు లక్షలు ఖర్చు పెట్టేందుకు వెనుకాడట్లేదు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయన్నది వట్టిమాట అని ఏనాడో నిరూపణ అయిపోయింది. పార్టీల అధినాయకులే వెనకుండి, అభ్యర్థులను బరిలోకి దింపుతున్న నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తరహాలోనే పంచాయతీ ఎన్నికలూ పార్టీలకు ‘ప్రతిష్ఠాత్మకం’గా మారుతున్నాయి. గెలిచేందుకు అడ్డదారులు తొక్కడం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, చాటుమాటుగా కోట్లు ఖర్చు చేయడం, పోలింగ్ రోజున ఓటర్లను మందు, మనీతో ప్రలోభపెట్టడం పార్లమెంటు, శాసనసభ ఎన్నికలకు మాత్రమే పరిమితమనుకునేవాళ్లు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల తీరును చూస్తే ముక్కున వేలేసుకోవలసిందే. రెండేళ్ల క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలన్నీ అలవిమాలిన, ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు ఇప్పటికీ ఆపసోపాలు పడుతోంది. రాజకీయాల్లో తమ అగ్రజులు హామీలు ఇవ్వగా లేనిది, తాము ఇస్తే తప్పేమిటనే ధోరణిలో ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు సైతం ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అన్న చందాన అడ్డమైన హామీలు ఇచ్చి, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థి 15 హామీలతో రూపొందించిన మేనిఫెస్టోను చూస్తే, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా పేరొందిన భారతదేశంలో ఎన్నికల తంతు ఎంత ప్రహసనంగా మారిందో అర్థమవుతుంది. ఆడబిడ్డ పుడితే రూ. 5వేల ఫిక్సెడ్ డిపాజిట్, ఆడపడుచు పెళ్లికి పుస్తెలు, మట్టెలు, అబ్బాయి వివాహానికి రూ. 5116 రూపాయలు ఇస్తాననీ సదరు అభ్యర్థి హామీల చిట్టా విప్పింది. అంతటితో ఆగకుండా, ఇల్లు కట్టుకునేవారికి పైకప్పు వేయించుకునేందుకు రూ.21 వేలు, శస్త్ర చికిత్స అవసరమైనవారికి రూ. 15 వేల సాయం, నెలకోసారి ఊళ్లో వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తాననీ మాట ఇచ్చిందామె. తానిచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కానివని తనకే అనిపించిందో ఏమో, ఓటర్లను నమ్మించేందుకు ఏకంగా వంద రూపాయల బాండ్ పేపర్పై హామీలు రాసి ఇచ్చింది. పంచాయతీలలో నిధులు ఉంటేనో లేక ప్రభుత్వం మంజూరు చేస్తేనో సర్పంచులు అభివృద్ధి పనులు చేయడం కద్దు. కానీ హరితహారం నర్సరీల నిర్వహణ, గ్రామీణ పార్కులు, చెత్త డంపింగ్ యార్డులు, శ్మశానవాటికల ఏర్పాటు వంటి పనుల అమలును చేపట్టవలసిందిగా సర్పంచులపై ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చి మరీ పనులు పూర్తి చేయిస్తున్నాయి. నిధుల మంజూరు విషయానికొచ్చేసరికి మొహం చాటేస్తున్నాయి. సొంత డబ్బు వెచ్చించి పనులు పూర్తి చేసి, బిల్లుల మంజూరు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న సర్పంచులు ఇప్పటికీ కోకొల్లలుగా కనిపిస్తారు. కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. గ్రామాలలో సర్పంచిగిరీ వెలగబెట్టేవారి వెనుక ఉండే ఇలాంటి విషాదగాథల గురించి తెలిసి కూడా ప్రస్తుత ఎన్నికల్లో పదవే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్న అభ్యర్థులను ఏమనాలి? ఏకగ్రీవాల పేరిట గ్రామాలలో జరుగుతున్న వేలం పాటల తీరు సైతం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తోంది. గ్రామస్థులంతా ఏకతాటిపైకి వచ్చి పోటీ లేకుండా ఎవరో ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎంచుకోవడం స్వాగతించదగిన పరిణామమే. ఇందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. అయితే, అక్రమార్కులు ఈ ఏకగ్రీవాలను కూడా పరిహాసం చేస్తున్నారు. పోటీదారులను ప్రలోభపెట్టి, సర్పంచ్ పదవిని తన్నుకుపోయే గద్దల వల్ల గ్రామాభివృద్ధి జరగదు సరికదా, అవినీతి పెచ్చరిల్లే ప్రమాదం పొంచి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో వేలంపాట నిర్వహించి, ఎవరు ఎక్కువగా పాడితే వారికే పదవి అప్పగించేందుకూ వెనుకాడటం లేదు. ఈసారి ఎన్నికల్లో ఇలాంటి దొడ్డిదారి ఏకగ్రీవాల సంఖ్య ఊపందుకునే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అసలే నిధుల లేమితో, పాలకుల నిర్లక్ష్యంతో నీరసిస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థకు గోరుచుట్టుపై రోకటిపోటు మాదిరిగా ఎన్నికలూ ప్రహసనంగా మారుతున్న నేపథ్యంలో గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యం సాధ్యమయ్యే పరిస్థితి కనుచూపు మేరలో కూడా కనపించడం లేదంటే అతిశయోక్తి ఏముంటుంది?
మాజీ సిఎం యడ్యూరప్పకు సుప్రీం ఊరట
బెంగళూరు: కర్ణాటక మాజీ సిఎం, బీజేపీ సీనియర్ నేత బిఎస్యడ్యూరప్పకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది.న ఆయనపై దాఖలైన పోక్సో కేసు విచారణపై స్టే విధించింది. పోక్సో చట్టం కింద చార్జిషీట్ను ట్రయల్ కోర్టు పరిగణన లోకి తీసుకోవడాన్ని సమర్ధిస్తూ, విచారణకు హాజరుకావాలని ఆదేశించిన కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ యడ్యూరప్ప స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఫిబ్రవరి18న ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక కోర్టు యడ్యూరప్పతోపాటు ముగ్గురు నిందితులను మార్చి 15న తన ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలతోపాటు ఫిర్యాదు సైతం కొట్టి వేయాలని యడ్యూరప్ప హైకోర్టులో సవాల్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని యడ్యూరప్ప స్పష్టం చేశారు. అయితే కేసును కొట్టివేసేందుకు కోర్టు నిరాకరించడంతో యడ్యూరప్ప సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
కొత్త చట్టాలతో అగాధంలోకి కార్మికులు
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్మిక చట్టాలను క్రోడీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య స్వాతంత్య్రం తర్వాత భారతదేశ కార్మిక చట్టాలలో తీసుకొచ్చిన అతిపెద్ద సవరణ. ఇప్పటికే ఉన్న 29 చట్టాలను నాలుగు విస్తృత కోడ్లతో భర్తీ చేయడం ద్వారా కేంద్రం వాటి అమలును సరళీకృతం చేస్తున్నట్లు, ‘వ్యాపారం చేసే వేగాన్ని’ పెంచుతున్నట్లు పేర్కొంది. అయితే, కీలకమైన చట్టాలను పార్లమెంటులో అర్థవంతమైన చర్చలకు అవకాశం లేకుండా తీసుకు రావడంలో ఆరితేరిన ప్రస్తుత ప్రభుత్వం కార్మిక సంఘాలతో అర్థవంతమైన సంప్రదింపులు లేకుండా, దాదాపు ఒక దశాబ్ద కాలంగా కనీసం భారత కార్మిక సదస్సును ఏర్పాటు జరిపే ప్రయత్నం కూడా చేయకుండా ఈ కోడ్లను ఆమోదించిన, నోటిఫై చేసిన విధానం విస్మయం కలిగిస్తుంది. పార్లమెంట్లో అర్థ్ధవంతమైన చర్చలు లేకుండానే పలు కీలక బిల్లులను గందరగోళ దృశ్యాల మధ్యనే అర్ధాంతరంగా ఆమోదింప చేసుకోవడం చూస్తుంటే మన ప్రజాస్వామ్య ప్రక్రియ గురించి తీవ్రమైన ఆందోళనలు కలుగుతున్నాయి. కార్మిక కోడ్ల ప్రక్రియ ప్రారంభించిన కేంద్ర కార్మిక సహాయ మంత్రిగా బండారు దత్తాత్రేయ అప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల భయాందోళనలతో ఉన్న కార్మిక సంఘాలను చర్చలకు ఒప్పించి, వారితో అర్ధవంతమైన సమాలోచనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక కోడ్ గురించి ఆయన అన్ని కార్మిక సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. కార్మిక సంఘాల నాయకులతో ప్రధానమంత్రి మోడీతో కూడా భేటీ ఏర్పాటు చేశారు. బహుశా ప్రధానిగా మోడీ కార్మిక సంఘాల నేతలతో భేటీ కావడం ఇదే మొదటి, చివరి సారి అని చెప్పవచ్చు. అయితే ఈ భేటీలలో తాము ప్రస్తావించిన ఒక్క అంశాన్ని కూడా ప్రభుత్వం కోడ్ల ఏర్పాటులో పరిగణలోకి తీసుకోలేదని ముంబైకి చెందిన ఓ ప్రముఖ కార్మిక నేత చెప్పారు. బండారు దత్తాత్రేయను మంత్రివర్గం నుండి తొలగించేందుకు ఆయన ఈ కోడ్ లను రూపొందిస్తున్న సమయంలో కార్మికుల ప్రయోజనాలగురించి పలు సందర్భాలలో పట్టుబడుతూ ఉండటం, కార్మికుల హక్కులను నిర్వీర్య పరచే ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం కారణంగా ఈ సందర్భంగా పలువురు భావిస్తున్నారు. అందుకనే ఆ తర్వాత వచ్చిన కార్మిక మంత్రులు కార్పొరేట్ల ప్రయోజనాలకు ఇస్తున్న ప్రాధాన్యతలను కార్మికుల హక్కులకు ఇవ్వకపోవడం గమనార్హం. కోడ్లు పార్లమెంటు నుండి కార్యనిర్వాహకుడికి అవసరమైన శాసన అధికారాలను బదిలీ చేస్తాయని, వేతనాలు, పని గంటలు, భద్రతపై కీలక నిర్ణయాలను పరిశీలన లేకుండా మార్చగల నియమాల ద్వారా నిర్ణయించడానికి వీలు కల్పిస్తుందని చాలా మంది పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రక్రియకు మించి, కోడ్ల కంటెంట్ కార్మికుల రక్షణలను గణనీయంగా బలహీనపరుస్తుందని భావిస్తున్నారు. తొలగింపుకు అధిక పరిమితులు, స్థిర-కాల ఉపాధిని ప్రవేశపెట్టడం, సడలించిన భద్రతా నిబంధనలు, తనిఖీ వ్యవస్థ నిర్వీర్యం కావడంతో ఉద్యోగ భద్రత, కార్యాలయ జవాబుదారీతనం ప్రమాదంలో పడతాయని భయందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సమ్మె హక్కును కూడా దాదాపు అసాధ్యమైన, విధానపరమైన అడ్డంకుల ద్వారా తగ్గిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ కోడ్లు గిగ్, ప్లాట్ఫామ్ కార్మికుల కోసం ఒక ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టినప్పటికీ, వారు వారిని ఉద్యోగులుగా గుర్తించడంలో ఆగిపోతారు. లక్షలాది మందికి అర్థవంతమైన సామాజిక భద్రత లేకుండా పోతుంది. ఈ మార్పులు సమానత్వం, గౌరవం, సంఘాలుగా ఏర్పడే స్వేచ్ఛ వంటి రాజ్యాంగ హామీలను దెబ్బతీస్తాయని భయపడుతున్నారు. భారతదేశాన్ని ఇప్పటికే తీవ్ర అసమానతలకు గురిచేస్తున్న ఇష్టం వచ్చినట్లు నియమించుకొని, ఇష్టం వచ్చిన్నపుడు తొలగించే ఉద్యోగాల వైపు దేశాన్ని నెట్టివేసే ప్రమాద ఘడియలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు కేంద్రీకృత చట్టాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు, వనరులను కేంద్రం కబళించి వేస్తూ దేశ సమాఖ్య వ్యవస్థను బద్దలు కావిస్తున్నదనే ఆందోళనల మధ్య కోడ్లు సైతం పలు మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కార్మికులు ఉమ్మడి జాబితాలో ఒక అంశం అయినప్పటికీ కేంద్రం ఇప్పుడు నియమాలను రూపొందించడం ద్వారా రాష్ట్రాల ప్రమేయం లేకుండా విస్తృత అధికారాలను కైవసం చేసుకుంటుంది. ఇది కార్మిక ప్రమాణాల ప్యాచ్ వర్క్ను సృష్టించే ప్రమాదం ఏర్పరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కార్మికులకు చట్టపరంగా లభిస్తున్న హక్కులు, రక్షణలను కుదించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడానికి పోటీ పడుతున్నాయి. ఇది కార్మికులకు హాని కలిగించే, భారతదేశ ప్రజాస్వామ్య సమతుల్యతను బలహీనపరిచే ‘అట్టడుగు స్థాయికి పయనం’ అని చెప్పక తప్పదు.కార్మిక సంఘాలు, రైతు సంస్థలు, అనేక రాజకీయ సమూహాలు ఈ కోడ్లను కష్టపడి సంపాదించిన కార్మిక హక్కులపై, రాజ్యాంగ సమాఖ్య నిర్మాణంపై దాడిగా భావిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి లక్ష్యం అయితే, అది కార్మికుల హక్కులను లేదా భారతదేశ ప్రజాస్వామ్య పునాదులను పణంగా పెట్టడం ద్వారా సాధ్యం కాదని గ్రహించాలి. ఇప్పటికే భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, త్వరలో మూడవ పెద్ద వ్యవస్థగా మారబోతుందని గర్వం గా భావిస్తూ ఉన్నప్పటికీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, తగ్గుతున్న ఉపాధి అవకాశాలు, వేతనాలలో చెప్పుకోదగిన పెరుగుదల లేకుండా పోవడం, అన్నింటికీ మించి కొనుగోలు తగ్గిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. అంటే ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం చెప్పుకోదగిన పెరుగుదలను నోచుకోలేకపోతున్నాయి. పతనం అవుతున్న రూపాయి విలువ ఈ ఆర్థిక సంక్షోభానికి కీలక సూచికగా ఉంది. గత వారం రూపాయి మొదటిసారిగా 89- డాలర్ మార్కును దాటి 89.46 వద్ద ముగిసింది. కానీ అది కేవలం అమెరికా డాలర్తో మాత్రమే కాదు. నవంబర్ 21 నుండి నవంబర్ 28 మధ్య, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం రేటు (88.64 నుండి 89.46 వరకు), యూరో (102.32 నుండి 103.63 వరకు), బ్రిటిష్ పౌండ్ (116.08 నుండి 118.27 వరకు), జపనీస్ యెన్ (0.5642 నుండి 0.5720 వరకు) కూడా బలహీనపడింది. నవంబర్ 28, 2024 నుండి ఒక సంవత్సరం కాలంలో తరుగుదల ఎక్కువగా ఉంది. భారత్ వాణిజ్యం 80 శాతం మేర జరుగుతున్న 40 ప్రధాన కరెన్సీలతో రూపాయి మారక విలువ పడిపోతుంది. కీలకమైన డాలర్, యూరో, పౌండ్, యెన్లతో పోలిస్తే రూపాయి విలువ పడిపోయింది. అంతర్జాతీయ కరెన్సీలతో రూపాయి సాధారణ బలహీనత (గత ఒక సంవత్సరంలో 11.66 నుండి 12.63 వరకు) నమోదయింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎస్) నవంబర్ 26న విడుదల చేసిన సిబ్బంది నివేదికలో, నవంబర్ 2023లో దీనిని ‘తేలియాడే’ నుండి ‘స్థిరీకరించిన’ స్థితికి మార్చిన తర్వాత. భారతదేశ మారకపు రేటు విధానాన్ని ‘క్రాల్ లాంటి అమరిక’ గా తిరిగి వర్గీకరించింది. ఇప్పటికే దేశీయ కంపెనీలు, పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. 2013 కంపెనీల చట్టం ప్రకారం గడిచిన ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 2,04,268 ప్రైవేటు కంపెనీలు మూతబడ్డాయని ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్షమల్హోత్రా లోక్సభలో తెలిపారు. 2021- 22 నుంచి గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 1,85,350 కంపెనీలను అధికారిక గణాంకాల నుంచి తొలగించినట్టు ఆయన వెల్లడించారు. ఇంతటి భారీ సంఖ్యలో కంపెనీలు మూతపడుతున్నా వాటిల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వపరంగా లభిస్తున్న ప్రోత్సాహకాలు అందుబాటులో లేకపోవడంతోనే లక్షలాది చిన్న కంపెనీలు మూతబడుతున్నాయని స్పష్టం అవుతున్నాయి. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు, బ్యాంకు రుణాల మాఫీలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం గురించి మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకనే దేశ ఆర్థిక వ్యవస్థ పరిణామం పెరుగుతున్న కొలదీ లభిస్తున్న ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతున్నది. దేశంలో కొత్తగా లభిస్తున్న ఉద్యోగాలకన్నా తొలగిస్తున్న ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. ఇటీవల తీసుకొచ్చిన లేబర్ కోడ్లలో ఈ విషయం మరోసారి ప్రస్ఫుటమైంది. కంపెనీలు మూతబడితే, కార్మికుల గతి ఏమిటన్న దానిపై ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020 ప్రకారం 300 మంది వరకు సిబ్బంది లేదా కార్మికులు ఉన్న కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపునకు, కంపెనీల మూసివేతకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకూ 100 మంది వరకు సిబ్బంది కలిగిన కంపెనీలకే ఈ వెసులుబాటు ఉండేది. దీన్ని ఇప్పుడు 300కు పెంచారు. ఒకవేళ, అధికారులు కంపెనీ మూసివేత విజ్ఞప్తికి స్పందించని పక్షంలో, మూసివేత ప్రతిపాదనకు ఆమోదం లాగానే పరిగణిస్తారు. పైగా, ఈ 300 పరిమితిని పెంచుకొనే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. అంటే, ఈ నిర్ణయంతో కార్పొరేట్లు తమకు ఇష్టం వచ్చినప్పుడు కంపెనీలను మూసివేసి, కార్మికులను రోడ్లపై పడవేసేందుకు రాచమార్గాన్ని ఏర్పాటు చేసినట్లయిందని భావిస్తున్నారు. కొద్దిమంది కార్పొరేట్ లు మన ఆర్థిక వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకొనే తమ సంపాదనకు పలు రెట్లు పెంచుకునేందుకు ఉపయోగపడినా, సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి ఈ కోడ్లు ఏమాత్రం ఉపయోగపడతాయన్నది ప్రశ్నార్థకమే కాగలదు. చలసాని నరేంద్ర 98495 69050
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/కొత్తగూడెం: ప దేళ్ల పాటు ప్రజలు అండగా నిలబడితే రాష్ట్రాన్ని దే శంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానని ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నె హ్రూ అమలు చేసిన ఎడ్యుకేషన్ -ఇరిగేషన్ విధానాన్ని దత్తత తీసుకొని తెలంగాణను దేశ పటంపై మొదటి స్థానంలో నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రే వంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తగూడెం లో నెలకొల్పిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని పలువురు రాష్ట్ర మంత్రులతో కలిసి ప్రారంభించి ఆయన ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన ఆనాడు తొలి ప్రధాని పండింట్ జవహర్ లాల్ నెహ్రూ దేశంలోని అకలి కేకలను పేదరికాన్ని చూసి ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రపంచంతో పో టీ పడాలన్నా ఎడ్యుకేషన్, ఇరిగేషన్ పాలసే ముఖ్యమని నమ్మి అమలు చేశారని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న గొప్ప విశ్వవిద్యాలయాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ ప్రారంభించినవేనని గుర్తు చేశా రు. దేశంలో అహార ఉత్పత్తులను పెంచడానికి బాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్సాగర్ వరకు నీటి పారుదల ప్రాజెక్టులను జవహర్ లాల్ నెహ్రూ నిర్మించారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం వల్లనే ఈ దేశంలోని ఆకలికేకలను రూ పు మార్చి ధాన్యగారంగా తీర్చిదిద్దారని అన్నారు. తాను కూడా నెహ్రూ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎడ్యుకేష న్, ఇరిగేషన్ అభివృద్ధితోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతుందని బలంగా నమ్ముతున్నానని అన్నారు. అందుకే రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ గురుకులాలు, మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. అందులో భా గంగానే ప్రజల మద్దతుకు ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం రెం డేళ్లు గడుస్తున్న సందర్భంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పే రు మీద ఖనిజసంపద పుష్కలంగా ఉన్న కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. విద్యాకు సంబంధించిన ప్రతి అవకాశాన్ని కొత్తగూడెం జిల్లాకు అందిస్తున్నామని సిఎం పేర్కొన్నా రు. తెలంగాణ ఉద్యమానికి ఉపిరిపోసిన పాల్వంచ ప్రాం తంలో ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు ఈ విశ్వవిద్యాలయానికి పెట్టుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తానన్నారు. 2004 నుంచి 2014 వరకు దేశానికి ప్రధానిగా ఉండి సంక్షోభవం నుంచి సంక్షేమం వరకు, అభివృద్ధి ఆకాశం వరకు ఎదగడానికి కారణమైన మన్మోహన్ సింగ్ పేరును దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఎర్త్ యూనివర్సిటీకి పెట్టుకున్నామని చెప్పారు. సింగరేణి లాంటివి అభివృద్ధి జరగాలనే ఎర్త్ యూనివర్సిటీని కొత్తగూడెంలో ఏర్పాటు చేశామన్నారు. కెసిఆర్ ఇంట్లో కురిసిన సిరులు కృష్ణా జలాలు పారే ఈ జిల్లాకు గోదావరి జలాలను కూ డా అందించేందుకే సీతారాయ ప్రాజెక్టును చేపట్టామని అన్నారు. జిల్లాలోని పత్రి బీడూ తడవాలి, పంటలు పండాలి, సిరులు కురవాలి అని తమ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మాత్రం సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నీ కెసిఆర్ ఇంట్లో కమీషన్ల కనకవర్గం కురిపించాయో గాని బీడు పొలాలకు చుక్క నీరు పారలేదన్నారు. మంచి సర్పంచ్ను ఎన్నుకోండి ప్రజలు వేసిన ఓటు ఫలితంగా రెండేళ్ల కాలంలో మంచి పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం బాగుండాలంటే గ్రామ స్థాయిలో పాలన బాగుండాలని, గ్రామా లు బాగుండాలి అంటే సర్పంచ్ బాగా పనిచేయాలని అన్నారు. గ్రామ సర్పంచ్ ఎన్నికలలో డబ్బులకు మద్యం బాటిళ్లకు, హాఫ్, ఫు బాటిళ్ళకు, ఇతర ప్రలోభాలకు లొంగవద్దని హితవు పలికారు. గ్రామాల్లో రాజకీయకక్షలను మాని అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి అభ్యర్థులను, పనిచేయగలిగే వారిని, అభివృద్ధి కోసం పాటుపడే వారిని ఎన్నుకోవాలని కోరారు. మందుకో డబ్బుకో వేరే వారికీ ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. రాష్ట్రానికి ఆయువు పట్టు ఖమ్మంలోనే ఉంది.. రాష్ట్ర పాలనకు ఆయువు పట్టు ఖమ్మం జిల్లాలో ఉందని, తెలంగాణకు తాను సిఎంగా ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లా మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల అనుకుంటే సా ధించలేనిది ఏమీ ఉండదని అన్నారు. ‘నేను ముఖ్యమంత్రిని కావచ్చు.. కానీ ముఖ్యమైన శాఖ మంత్రులు ఖమ్మం జిల్లా వాసులే.. ఇందిరమ్మ ఇళ్ళు కావాలన్నా, విద్యుత్ కావాలన్నా, ఇతర పథకాలకు నిధులు కావాలన్నా ఈ జిల్లా మంత్రులు ఇవ్వాల్సిందే..వారు అడిగిన అన్నింటికీ నేను అనుమతి ఇస్తున్నా’ అని అన్నారు. నేడు ప్రధానిని కలుస్తా డిసెంబర్ 8, 9 తేదీలలో జరిగే తెలంగాణ విజయోత్సవాలు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీని,తమ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళుతున్నానని తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేస్తోందని, భూమి పరిసరా లు, భూమి లోపల ఉన్న ఖనిజాల గురించి విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతాయని, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విద్యాలయంలకు నేడు తొలి అ డుగు వేసామన్నారు. దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి అవసరమైన వసతులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. దేశానికే తలమానికంగా ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు మీద కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భద్రా ద్రి కొత్తగూడెంకు విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మా ట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరు పెట్టి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఈ ప్రాంతానికి ఇవ్వ డం ప్రజలకు లభించిన ప్రత్యేక గౌరవమని అన్నారు.
నేడు శాస్త్ర సాంకేతికతతో ప్రపంచం దూసుకుపోతున్నది. భారతదేశం కూడా ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణలతో ముందుకు వెళ్తున్నది. మరోవైపు మూఢ నమ్మకాలు మనల్ని అథఃపాతాళానికి నెట్టుతున్నాయి. మరి ఈ మూఢ నమ్మకాలు చదువురాని అమాయక ప్రజలే నమ్ముతారని ఆలోచన సమాజంలో ఉంది. కానీ విద్యావంతులు, పాలకులు సైతం అంధ విశ్వాసాలు నమ్ముతున్న తీరును ఆశ్చర్యపరుస్తున్నది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత కొన్ని నెలలుగా కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ దిష్టి కారణమని చెప్పడం విస్మయం కలిగిస్తుంది. ఆయన కోట్లాది ప్రజలకు సినిమా హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఇలాంటి అశాస్త్రీయమైన మాటలు అంధకారానికి నిదర్శనం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇవి ప్రాంతీయ విద్వేషాలను కూడా రగిలిస్తున్నాయి. అసలు కొబ్బరి చెట్లు ఎండి పోవడానికి సముద్రపు నీరు వెనక్కి రావడం, మురుగు కాలువ నీటిలో లవణాల శాతం పెరగడం వంటి కారణాలను నివేదికలు చెబుతున్నాయి. మహిమ గల వ్యక్తిగా దిష్టి గురించి చెప్పడం పాలకుల అజ్ఞానానికి నిదర్శనం. ఇది ఒక రకంగా రాజకీయంగా తన ఉనికి మూఢ నమ్మకాలతో మూడు పెట్టినట్టుంది. ఇటీవల కాలంలో దేశంలో కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కూడా మూఢత్వాన్ని పెంచి పోషించే వ్యాఖ్యలు చేస్తున్నారు. మనిషి వైజ్ఞానిక ఫలాలు అనుభవిస్తూనే.. అంధత్వంలోకి జారుకుంటున్నాడు. ఇప్పటికే మంత్రగాళ్ళు, జ్యోతిష్కులు, బాబాలు, స్వాములతో ప్రజలు మోసపోతున్నారు. బాణమతి, చేతబడినీ నమ్ముతున్నారు. ఎడమ కాళ్లకు నల్లదారం కట్టుకునే సంస్కృతి పెరుగుతున్నది. తల్లి కడుపులోంచి పుట్టబోయే బిడ్డను ముహూర్తాలు చూస్తున్నారు. మనిషి మరణానికి సైతం మంచి చెడు చూస్తున్నారు. ప్రజల్లో అంధ విశ్వాసాలు ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. క్షుద్రపూజల వంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జోగిని వ్యవస్థ కొనసాగుతుంది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలోని ప్రాంతంలో మెజారిటీ గ్రామాల ప్రజలు వేములవాడ ప్రాంతానికి చెందిన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీరాజరాజేశ్వర స్వామి పేరు మీద లింగధారణ చేసుకొని దేవునికి అంకితమవుతున్నారు. ఈ ఆచారం ముఖ్యంగా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల్లోనే ఉంది. ఏ ఒక్క అగ్రకులం కూడా ఇలాంటి లింగ ధారణ చేయరు. దేవుని పేరిట ఆచారంలో కూడా అట్టడుగు వర్గాలను బలి చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ భూమి పూజ సందర్భంగా గర్భిణీ మహిళలు, వితంతువులు కొబ్బరి కాయలు కొట్టడానికి వెనుకాడుతున్నరని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇది మూఢాచారాలు, విశ్వాసాలు, అవగాహన లోపాలకు నిదర్శనమన్నారు. ఇంత సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు శాస్త్రీయ జీవన విధానాన్ని అవలంబించకపోవడం దురదృష్టకరం. నేడు సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ గ్రామ ప్రాంత ప్రజలు అస్వస్థతకు గురైనప్పుడు బాబాలను, స్వాములను, సిగం ఊగే వాళ్లను, పాస్టర్లును ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చే పసుపు, కుంకుమ, విభూతిని, నిమ్మకాయలను, కొబ్బరికాయలను రాత్రిపూట ఆది, గురువారం, అమావాస్య రోజున గ్రామ ప్రాంత నడి వీధుల్లో పెట్టి వారి రోగాలకు స్వాంతనగా భావిస్తారు. పట్టణాల్లో కొందరు విద్యావంతులు సైతం ఇలాంటి అజ్ఞానాన్ని ఆచరించడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల రంగురాళ్లు ధరించడం, సంఖ్యా శాస్త్రం ఆధారంగా పేర్లు మార్చుకోనే వారి సంఖ్య పెరిగింది. ఇప్పటికీ కొన్ని గ్రామాలో విజృంభించిన వ్యాధులను తగ్గించుకోవడానికి జంతుబలులు, నరబలులు చేస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట మండలం, మర్రివానిపల్లి గ్రామంలో ఐదు నెలలుగా వరుస మరణాలు సంభవించాయి. గ్రామానికి కీడు సోకిందని, వరుస మరణాలు జరుగుతున్నాయని భావించిన ప్రజలు, ఒక పండితుడి సూచనతో ఆ ఊరిని విడిచిపెట్టి, పొలాల వద్దకు వెళ్లి వంటలు చేసుకుని భోజనం చేశారు. ఇలాంటి మూఢ నమ్మకాలను అజ్ఞానులతో పాటు విజ్ఞానులు కూడా పాటించడం చాలా విచారించదగ్గ విషయం. మంత్రాల నేపంతో దాడులు, హత్యలు పెరుగుతున్నాయి. మానసిక బలహీనత వలన విచక్షణ కోల్పోయి అతీంద్రియ శక్తులు నమ్మడం వల్లనే సమాజంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఇవి శాంతిభద్రకు విఘాతం కలిగిస్తున్నాయి. ప్రజల్లో రోజురోజుకు శాస్త్రీయ వైఖరి, ప్రశ్నించే తత్వం లోపించడమే ఈ గుడ్డి నమ్మకాలకు కారణం. ఇదే కాకుండా పాలకుల్లో కూడా శాస్త్రీయ వైఖరి లోపించడం, ప్రభుత్వ విధానాలు కూడా దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. మితిమీరిన మతవిశ్వాసాలు, అశాస్త్రీయ బోధనలు, ప్రభుత్వ విధానాలు, మీడియా ప్రకటనలు ప్రజల్ని మరింత మూఢత్వ దిశగా ప్రేరేపిస్తున్నాయి. మన దేశంలో గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులకు ఇచ్చినంత ప్రాముఖ్యత విద్యాలయాలకు ఇవ్వడం లేదు. సైన్స్ ఆవిష్కరణల కన్నా సూడో సైన్స్కు ఆదరణ పెరిగిపోతుంది. భూత వైద్యానికి, అతీంద్రియ శక్తులకు ఆదరణ పెరుగుతుంది. సమాజ అభివృద్ధికి మూలం విజ్ఞాన శాస్త్రవే. కావున విద్యాసంస్థల్లో శాస్త్రీయ ప్రగతిశీల విద్య అభ్యసనం జరగాలి. ప్రభుత్వాలు హేతుబద్ధ, శాస్త్రీయ ఆలోచన విధానాలను ప్రోత్సహించాలి. నిత్య సమస్యలను ఎదుర్కోవడానికి గల శాస్త్రీయ పరిష్కారాలను ప్రజలకు తెలియచేయాలి. సైన్స్ ప్రచార సంస్థలు కూడా ఆ దిశగా కృషి చేయాలి. అప్పుడే దేశంలో వేళ్లూనుకొని ఉన్న సామాజిక రుగ్మతలను నిర్మూలించవచ్చు. మన విశ్వవిద్యాలయాలు పరిశోధన కేంద్రాలుగా ఎదగడానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించాలి. ఇవీ నవ కల్పనలకు నాంది పలుకాలి. యువతను పరిశోధన వైపు ఆకర్షించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. రాజకీయ నాయకుల ఆలోచన, ప్రభుత్వ పరిపాలన ప్రగతి శీలంగా ఉండాలి. అప్పుడే ప్రజల్లో వైజ్ఞానిక చైతన్యం వస్తుంది.
వికలాంగులకేదీ ‘స్థానిక’ ప్రాతినిధ్యం?
రాజకీయ ప్రాతినిధ్యం అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ సమాన హక్కుగా ఉండాలి. అయితే దీన్ని సాకారంగా అమలు చేయడంలో మన సమాజం ఇంకా అనేక వర్గాలకు ముఖ్యంగా వికలాంగులకు పూర్తి న్యాయం చేయలేకపోయింది. ఎన్నికల సమయంలో వికలాంగుల ఓట్ల కోసం తాపత్రయపడతారు. కానీ వారి సమస్యలపై వారే స్వరం వినిపించుకునే స్థాయిలో స్థానిక సంస్థలు, చట్టసభల్లో పాతినిధ్యం మాత్రం లభించడంలేదు. ఆల్ ఇండియా కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టో 2024లో చత్తీస్గఢ్ మాదిరిగా వికలాంగులకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పిస్తాం అని స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హామీని ప్రపంచ వికలాంగుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా అమలుకు అంగీకారం తెలియజేస్తే తెలంగాణలో సుమారు 25 వేలకు పైగా వికలాంగులకు రాజకీయ అవకాశాలు లభిస్తాయి. ఇందులో సగం ప్రాతినిధ్యం వికలాంగ మహిళలకే దక్కుతుంది. తెలంగాణలో సుమారు 10 లక్షల మంది వికలాంగులు నివసిస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులను కలుపుకుంటే ఇది 50 లక్షలకు పైగా ఓటర్ల ప్రభావం కలిగిన వర్గం. కానీ రాష్ట్రంలోని స్థానిక సంస్థలు, పంచాయతీలు, మండల పరిషత్లు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వీరికి ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. చాలా మంది వికలాంగులు చదువుకున్నవారు, నైపుణ్యం, సామర్థ్యం ఉండి ప్రజాప్రతినిధులుగా పని చేయగలిగినవారు ఉన్నారు. కానీ చట్టపరమైన అవకాశాలు లేనందున వికలాంగులు ప్రాతినిధ్యానికి దూరంగా ఉండవలసి వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు పలు సంక్షేమ పథకాలద్వారా వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నది. కానీ నిజమైన చేయూత అనేది రాజకీయ ప్రాతినిధ్యంలోనే ఉంది. కొన్ని దశాబ్దాలుగా వికలాంగులు తమ జీవితాలపై ప్రభావంచూపే నిర్ణయాల్లో భాగస్వాములుగా ఉండలేకపోతున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ఒక రాజ్యాంగ హక్కు మాత్రమే కాక, ఒక నైతిక బాధ్యత కూడా. ఇది గౌరవం, సమానత్వం, సమగ్ర అభివృద్ధికి దారితీసే కీలక మార్గం. తెలంగాణలో గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు ఎక్కడా వికలాంగులకు నామినేట్ లేదా రిజర్వేషన్ ప్రాతినిధ్యం లేదు. 2016 నుంచి అమలులో ఉన్న వికలాంగుల హక్కుల చట్టం Rights of Persons with Disabilities ACT (2016) ప్రకారం పాలన, రాజకీయ ప్రాతినిధ్యంలో వికలాంగులకు సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్తుంది. కానీ రాష్ట్రంలోని చట్టాలు ఇంకా దీనికి అనుగుణంగా సవరణ పొందలేదు. వికలాంగులు ఎన్నికలలో పోటీ చేయలేక, చట్టసభలలో నామినేట్ చేయబడక వారిపై తీసుకునే విధానాల్లో పాల్గొనలేక అణచివేతకు గురవుతున్నారు. 2019లో చత్తీస్గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చట్ట సవరణలు చేసి, ప్రతి పంచాయతీలో ఒక వికలాంగ పురుషుడు, ఒక వికలాంగ మహిళను నామినేట్ చేసే విధంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది వికలాంగుల రాజకీయ ప్రాతినిధ్యానికి చట్టబద్ధత కల్పించిన తొలి చలనం. తరువాత రాజస్థాన్ రాష్ట్రం కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. 2021లో స్థానిక సంస్థల్లో వికలాంగుల నామినేషన్ ద్వారా పాలనా ప్రమేయం కల్పించింది. ఏప్రిల్ 2025 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి వికలాంగులకు అన్నిస్థాయిలలో నామినేట్ చేయడం ప్రారంభించింది. వికలాంగులకు స్థానికి సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ప్రతినిధులుగా ఎంపికైన వికలాంగులు స్థానిక సమస్యలపై నేరుగా మాట్లాడగలుగుతారు. ప్రభుత్వ ప్రణాళికల్లో వికలాంగుల అవసరాలకు తగిన ప్రాధాన్యం లభిస్తుంది. సామాజికంగా వారిపై ఉన్న అనవసర దృష్టి కోణాలు తొలగిపోతాయి. ఇది ఆర్థికంగా ప్రభుత్వం మీద భారం కాదు. ఒకసారి నామినేషన్ చట్టం అమలు చేస్తే అది ప్రజాస్వామ్య నిర్మాణంలో ఒక పెద్ద పునాది రాయవుతుంది. చత్తీస్గఢ్ మాదిరిగా, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాల్లో సవరణలు చేసి గెజిట్ ద్వారా ఒక వికలాంగ పురుషుడు, ఒక వికలాంగ మహిళను ప్రతీ పంచాయతీ స్థాయిలో నామినేట్ చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియకు RPWD Act, 2016 (Rights of Persons with Disabilities Act) ద్వారా చట్టపరమైన గౌరవం కూడా ఉంది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243 డి, 243టి ప్రకారం స్థానిక సంస్థలలో బలహీనవర్గాలకు రిజర్వేషన్ కల్పించినందున తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాలలో అవసరమైన సవరణలు తీసుకురావాలి. చత్తీస్గఢ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల పంచాయితీరాజ్ చట్ట సవరణలు పరిశీలించాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ ఇచ్చిన హామీని అమలు చేయడంలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. ఇది నిజమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని సాధించే చారిత్రక అవకాశంగా నిలుస్తుంది. వికలాంగుల హక్కులు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం అనే అంశాలు ఈ రోజుల్లో సమాజంలో ప్రాధాన్యత కలిగినవిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో, తెలంగాణ రాష్ట్రం చరిత్రాత్మకమైన, సమానత్వాన్ని ప్రతిబింబించే నిర్ణయం తీసుకునే గొప్ప అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది. వికలాంగులకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించడంవల్ల ఈ చర్య రాష్ట్రానికి ఆర్థికంగా భారంగా ఉండదు. కానీ ఇది సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య మార్గంలో ఒక గొప్ప అడుగు. స్థానికంగా వికలాంగుల స్వరం వినిపించాలంటే వారికి అధికార భాగస్వామ్యం కల్పించాల్సిందే. ఇది సమసమాజ నిర్మాణానికి అవసరమైన మానవ హక్కుల దిశగా ముందడుగు. చట్టపరంగా అవసరమైన సవరణలు చేసి గెజిట్ నోటిఫికేషన్ద్వారా వికలాంగులను స్థానిక సంస్థల్లో నామినేట్ చేసే విధంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు ఎన్నికల నోటిఫికేషన్కు ముందే తీసుకుని పంచాయతీలు, మండల పరిషత్లు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ హామీని ప్రపంచ వికలాంగుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా అమలు చేస్తే అది రాజకీయంగా వికలాంగుల చరిత్రలో కీలక మలుపుగా నిలుస్తుంది. ఇది నిజమైన ప్రాతినిధ్యం కల్పించే చరిత్రాత్మక అవకాశం. ఇది కేవలం హక్కుల కోసం పోరాటం కాదు. ఇది సామాజిక న్యాయానికి అంకితమైన ఉద్యమం. దైనంపల్లి మల్లికార్జున్ 94903 00985
న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలపై డిసెంబర్ 9న పార్లమెంటులో విసృ్తత స్థాయి చర్చ నిర్వహించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా 12 రాష్ట్రాలలో ఓటర్ల జాబితా స్పె షల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రతిపక్షాలు నిరసన లు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సర్పై చర్చించడానికి తాము సిద్ధంగా లేమని నరేంద్రమోదీ ప్రభు త్వం మంగళవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై సోమవారం డిసెంబర్ 8న లోక్ సభలో చర్చ జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 9న మంగళవారం మధ్యాహ్నం 12 గంటలనుం చి ఎన్నికల సంస్కరణలపై చర్చ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. కిరణ్ రిజిజు మంగళవారం (డిసెంబర్ 2)న సోషల్ మీడి యా ఎక్స్లో ఓ పోస్ట్లో షెడ్యూల్ను ధృవీకరించారు. లోక్ సభ స్పీకర్ అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష సమావేశంలో డిసెంబర్ 8న సోమవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా లోక్ సభలో చర్చ నిర్వహించాలని, డిసెంబర్ 9న మంగళవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి ఎన్నికల సంస్కరణలపై చర్చ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 12 రాష్ట్రాలలో జరుగుతున్న సర్, విధినిర్వహణలో పలువురు బ్లాక్ స్థాయి అధికారుల మరణాలపై తక్షణం చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు మొదటి రెండు రోజులు ఉభయసభలు ఎలాంటి కార్యక్రమాలు లేకుండానే ముగిసిపోయాయి. రెండో రోజు రాజ్యసభలో కూడా ప్రతిపక్షాలు సర్ పై తక్షణ చర్చకు డిమాండ్ చేయడంతో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కార్యక్రమాలకు ,అంతరాయం ఏర్పడింది. దీంతో వివిధ పార్టీల నాయకులతో సంప్రదించి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు కేంద్రమంత్రి రిజిజు తెలిపారు. ఎంపీల నినాదాలతో సభ హోరెత్తింది. అయితే ప్రభుత్వం చర్చకు గడువు నిర్ణయించే ముందు సభ విధానపరమైన క్రమం ఉండాలని, సంభాషణలు జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారులపై సర్ ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 28 మంది బ్లాక్ స్థాయి అధికారులు (బిఎస్ఓ) లు అధిక పనిభారం కారణంగా చనిపోయారని పేర్కొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎ న్నికల రెండో దశ సంబంధించి నామినేషన్ల గ డువు సోమవారం సాయంత్రం ముగిసింది. నా మినేషన్ల దాఖలు చివరి రోజు మంచిరోజు కావడంతో అభ్యర్థులు భారీ ఎత్తున నామినేషన్లు దా ఖలు చేయడానికి కేంద్రాలకు వెళ్లారు. దాంతో నామినేషన్ దాఖలు చేసేందుకు సర్పంచ్, వార్డు అభ్యర్థులతో కిక్కిరిపోయాయి. అధికారులు అ భ్యర్థులకు టోకెన్లు ఇచ్చారు. సోమవారం రాత్రి వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. డిసెంబర్ 6న నా మినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. డి సెంబర్ 14న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉప స ర్పంచి ఎన్నిక ఉంటుంది. మూడో విడతలో 4, 150 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డుల స్థా నాలకు ఎన్నికలు జరుగనుండగా, మంగళవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్నది.
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర పరిధిలోని 5లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్ట్) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు బిఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులతో కూడిన నిజనిర్ధారణ బృందాలను నియమించారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎంఎల్ఎ లు, ఎంఎల్సిలతో కెటిఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయి ప ర్యటనలపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను, ఇప్పుడు ‘మల్టీ యూజ్ జోన్’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపించారు. సుమారు 9,300 ఎకరాల భూ ములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు, కేవలం ఎస్.ఆర్.ఓ రేటులో 30 శాతానికే రెగ్యులరైజ్ చేసి, సుమారు రూ. 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి, కనీసం స్మశాన వాటికలకు కూడా స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం, వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. నేడు,రేపు పారిశ్రామిక వాడల్లో పర్యటన ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి, పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బృందాలు పర్యటించనున్నాయి. అక్కడ స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు. వీటితోపాటు అక్కడి పారిశ్రామిక వాడల ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏమేమి చేయవచ్చు, అక్కడి స్థానిక ప్రజల సుదీర్ఘకాలం డిమాండ్లను, ఆకాంక్షలను పార్టీ నేతలు తెలుసుకోనున్నారు. హిల్ట్ పి స్కామ్పై నిజనిర్ధారణ కోసం బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎనిమిది బృందాలు బుధ, గురువారాలు (డిసెంబర్ 3, 4) ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఎమ్మెల్యేలు, ఇతర నేతలు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలలో పర్యటించనున్నారు.
حیدرآباد کی نجی ڈگری کالج میں امتحانات میں بڑے پیمانے پر نقل نویسی کے دعوے کے ساتھ وائرل ویڈیو گمراہ کن ہے۔ تحقیقات سے واضح ہوا کہ یہ کاغذات اسٹور روم سے گرے تھے، طلبہ نے کوئی نقل نویسی نہیں کی۔
అన్నకు మరణ శాసనం రాసిన తమ్ముడు
చేసిన అప్పులు తీర్చడానికి సొంత అన్నను తమ్ముడు అతికిరాతంగా హతమార్చిన సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి నరేశ్ 3 సంవత్సరాల క్రితం రెండు టిప్పర్ లారీలను కొన్నాడు. వాటిని అద్దెకిస్తుండేవాడు, కాగా కొన్నాళ్లుగా వ్యాపారం సరిగా నడవక ఈఎంఐలు కట్టడానికి అప్పులు చేశాడు. దీంతో పాటు షేర్ మార్కెట్ లోనూ పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. దీంతో రూ. 1.50 లక్షల దాకా అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు ఇబ్బంది పెట్టడంతో తన అన్న మామిడి వెంకటేశ్ ను చంపాలని పథకం వేశాడు. తన అన్నను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించబోయి పోలీసులకు దొరికిపోయాడు. రెండు నెలల క్రితం తన అన్న వెంకటేశ్ పేరు మీద రూ.4.14 కోట్లకు బీమా పాలసీ తీసుకున్నాడు. అయితే అదును చూసి అన్నను చంపాలని చూస్తున్నాడు. ఈ నేపధ్యంలో నముండ్ల రాకేష్ నరేష్ ను తనకు ఇవ్వాల్సిన రూ. 7 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. తన అన్నను చంపడానికి సహకరిస్తే రూ.7 లక్షలకు అదనంగా రూ.13 లక్షలు కలిపి మొత్తం రూ.20 లక్షలు ఇసస్తానని రాకేశ్ ను ఒప్పించాడు. ఇందుకోసం టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ ను ఒప్పించారు. ప్రణాళిక ప్రకారం నవంబర్ 29న రాత్రి 11 గంటలకు గ్రామశివారులోని పెట్రోల్ బంక్ పక్కన రోడ్డుపై టిప్పర్ ఆగిపోయిందని డ్రైవర్ ప్రదీప్ నరేశ్ కు ఫోన్ చేసి చెప్పాడు. నరేశ్ తన అల్లుడు సాయి బైక్ పై వెంకటేశ్ ను ఎక్కించి టిప్పర్ వద్దకు పంపించాడు.వాళ్ల వెనకాలే నరేశ్ కూడి వెళ్లాడు. అక్కడకు వెళ్లక ప్రదీప్ వెంకటేశ్ ను టైర్ కింద జాకీ పెట్టమని చెప్పాడు. వెంకటేశ్ జాకీ పెడుతుండగా నరేశ్ టిప్పర్ ను ముందుకు కదిలించాడు. దీంతో వెంకటేశ్ టైర్ కిందపడి సంఘటనా స్ధలంలోనే మృతి చెందాడు. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమని పోలీసులను నమ్మించాడానికి డ్రైవర్ ప్రదీప్ ను పారిపోమ్మనాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని పోలీసులను నమ్మించాడు. అయితే బీమా సంస్ధకు చెందిన ఉద్యోగులకు నరేశ్ చెప్పె విధానంపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నరేశ్ ను విచారించగా అసలు నిజం బయటపడింది. బీమా సోమ్ము కోసమే తన అన్న వెంకటేశ్ ను చంపానని పోలీసుల ఎదుట నరేశ్ ఒప్పుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నరేష్ తో పాటు డ్రైవర్ ప్రదీప్, రాకేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
కోల్కతా: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో రికార్డును సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో బిహార్కు ప్రాతినిథ్యం వహించిన 14 ఏళ్ల సూర్యవంశీ 61 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 108 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ముస్తాక్ అలీ ట్రోఫీలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా సూర్యవంశీ నయా రికార్డును నెలకొల్పాడు. వైభవ్ 14 ఏళ్ల 250 రోజుల్లో శతకం సాధించి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఆటగాడు విజయ్ జోల్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. విజయ్ 18 ఏళ్ల 118 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. కాగా, బిహార్తో జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మాజీ సిఎం యడ్యూరప్పకు సుప్రీంలో ఊరట
కర్ణాటక మాజీ సిఎం , బీజేపీ సీనియర్ నేత బిఎస్యడ్యూరప్పకు సుప్రీం కోర్టు ఊరట నిచ్చింది.న ఆయనపై దాఖలైన పోక్సో కేసు విచారణపై స్టే విధించింది. పోక్సో చట్టం కింద చార్జిషీట్ను ట్రయల్ కోర్టు పరిగణన లోకి తీసుకోవడాన్ని సమర్ధిస్తూ , విచారణకు హాజరుకావాలని ఆదేశించిన కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ యడ్యూరప్ప స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఫిబ్రవరి18న ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక కోర్టు యడ్యూరప్పతోపాటు ముగ్గురు నిందితులను మార్చి 15న తన ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలతోపాటు ఫిర్యాదు సైతం కొట్టి వేయాలని యడ్యూరప్ప హైకోర్టులో సవాల్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని యడ్యూరప్ప స్పష్టం చేశారు. అయితే కేసును కొట్టివేసేందుకు కోర్టు నిరాకరించడంతో యడ్యూరప్ప సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
శ్రీలంకకు కాలం చెల్లిన వస్తువులను పంపిన పాక్
శ్రీలంక తుపాను బాధితులకు గడువు ముగిసిన వస్తువులను పాకిస్తాన్ సాయంగా పంపిందన్న వార్తలు వస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ పంపిన ప్యాకెట్లపై గడువు తేదీ 2024 అక్టోబర్ లోనే ముగిసినట్టు తెలిసింది. వీటిని గమనించిన శ్రీలంక అధికారులు ఈ విషయాన్ని పాక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అసంతృప్తి తెలియజేసినట్టు సమాచారం. 2015లో నేపాల్ భూకంపం సంఘటన సమయంలోనూ కొన్ని ఆహార పదార్థాలను పాకిస్తాన్ పంపించి వివాదానికి కారణమైంది. తాజా పరిణామాలపై పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
వెనెజువెలా అధ్యక్షుడు దేశాన్ని విడిచిపెడతారా?
కారకాస్ : తాను తన కుటుంబంతో సహా దేశాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన చర్చల్లో వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో పేర్కొన్నట్టు తెలుస్తోంది.అయితే ఆందుకు ఆయన కొన్నిషరతులు విధించినట్టు సమాచారం. ఈ మేరకు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. గత నెలలో ట్రంప్, మదురోలు 15 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆసమయంలో తనకు, తన కుటుంబానికి ఆంక్షల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తే, తాను వెనెజువెలాను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని, మదురో తెలియజేసినట్టు సమాచారం. అమెరికా విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయడంతోపాటు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి తాను ఎదుర్కొంటున్న కేసును మూసివేయడం వంటి వాటి గురించి ప్రస్తావించారు. దీంతోపాటు అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవహక్కుల ఉల్లంఘనలకు సంబంధించి 100 మందికి పైగా వెనెజువెలా అధికారులపై విధించిన ఆంక్షల నుంచి అమెరికా ఉపశమనం కలిగించాలని కూడా ఆయన కోరినట్టు సమాచారం. అయితే మదురోషరతుల్లో చాలా వాటిని ట్రంప్ తిరస్కరించినట్టు రాయిటర్ పేర్కొంది. మదురో తన కుటుంబంతో సహా దేశాన్ని వీడేందుకు ట్రంప్ ఒక వారం రోజులు గడువు విధించినట్టు తెలుస్తోంది. అయితే అది శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో వెనెజువెలా భూభాగంపై అమెరికా దళాల సైనిక కార్యకలాపాలను విస్తరించారు.
ఐర్లాండ్తో మంగళవారం జరిగిన మూడో, చివరి టి20లో ఆతిథ్య బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లా మూడు మ్యాచ్ల సిరీస్ను 21తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.5 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్గా దిగిన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్టిర్లింగ్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్తో 38 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ టిమ్ టెక్టర్ (17) పరుగులు చేశాడు. మిగతా వారిలో డాక్రెల్ (19), డెలాని (10) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ముస్తఫిజుర్, రిశాద్ మూడేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 13.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ 36 బంతుల్లోనే అజేయంగా 55 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సైఫ్ హసన్ (19) పరుగులు సాధించాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన పర్వేజ్ 33 పరుగులు చేసి నాటౌగా నిలిచాడు. దీంతో బంగ్లా అలవోక విజయంతో సిరీస్ను దక్కించుకుంది.
సిఎం వ్యాఖ్యలపై రేపు బిజెపి నిరసన ప్రదర్శనలు
మందు తాగే వారికో దేవుడు, రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వారికో దేవుడు ఉన్నారంటూ హిందూ దేవుళ్ళను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అవమానించారని బిజెపి రాష్ట్ర శాఖ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. మహిళా మోర్చా, యువ మోర్చా అధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, సిఎం దిష్టి బొమ్మలు దగ్దం చేయనున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు నాంపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి భారీ ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో తాను చెప్పిందే నిజమవుతున్నదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హిందూ సమాజం ఆలోచించాలని, విడిపోయి అవమానాన్ని దిగమింగుతారా, ఏకమై సత్తా చాటుతారా? అనేది హిందూ సమాజం ఆలోచించుకోవాలని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళను, హిందువులను అవమానించారని ఆయన మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తున్నదని దీంతో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నరనరాల్లో హిందూ ద్వేషాన్ని నింపుకున్నదని ఆయన విమర్శించారు. తమ పార్టీ ఏనాడూ ఇతర మతాలను కించపరచలేదని మంత్రి బండి సంజయ తెలిపారు.
ఇక 'సేవాతీర్థ్'గా ప్రధాన మంత్రి కార్యాలయం..
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఇకనుంచి సేవాతీర్థ్గా పిలవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా సౌత్బ్లాక్ లోని పీఎంవో నుంచి ప్రధానులు విధులు నిర్వర్తిస్తుండటం పరిపాటిగా వస్తోంది. ఇక ఆ కార్యాలయం కొత్త భవనం లోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే ఏపేరు మార్పుపై ప్రకటన వచ్చింది. రాజ్భవన్ పేరుతో కొనసాగుతోన్న గవర్నర్ల అధికారిక నివాసాలను ఇకపై “లోక్భవన్ ”గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో ఇప్పటికే ఒడిశా, త్రిపుర, పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల గవర్నర్లు తమ బంగ్లాలను లోక్భవన్గా మార్చారు. మిగతా రాష్ట్రాలు కూడా పేరు మార్చాలని కేంద్రం నుంచి సూచనలు వచ్చాయి. వలసవాదానికి చిహ్నాలుగా ఉన్న పేర్లను తొలగించి ప్రజాస్వామ్య పంథాలో పేర్లను పెడుతున్నట్టు సమాచారం. సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ లోకి మార్చనున్నారు. వాయుభవన్కు పక్కన ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్1 లో ఒక భవనాన్ని సేవాతీర్థ్1గా పిలవనున్నారు. దానిలో పిఎంవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన రెండు భవనాలు సేవాతీర్థ్ 2, సేవాతీర్థ్ 3 నుంచి క్యాబినెట్ సెక్రటేరియట్ జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం పనిచేయనున్నాయి. ఇప్పటికే ఎన్క్లేవ్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
శబరిమల భక్తుల కోసం 10 ప్రత్యేక రైళ్లు
శబరిమల భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్థానాల మధ్య 10 శబరిమల ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ నెల 13న సిర్పూర్ కాగజ్నగర్కొల్లం జంక్షన్(07117), ఈ నెల 17, 31 తేదీల్లో చర్లపల్లికొల్లం జంక్షన్(07119), ఈ నెల 20న చర్లపల్లికొల్లం జంక్షన్ (07121)చ 24న హుజూర్ సాహిబ్ నాందేడ్కొల్లం జంక్షన్ (07123), ఈ నెల 15న కొల్లం జంక్షన్చర్లపల్లి(07118), ఈ నెల 19, జనవరి 2 తేదీల్లో కొల్లాం జంక్షన్చర్లపల్లి (07120), ఈ నెల 12న కొల్లాం జంక్షన్చర్లపల్లి (07122), ఈ నెల 26న కొల్లాం జంక్షన్చర్లపల్లి(07124) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దక్షిణ మధ్య రైల్వే నుండి బయలుదేరే సిర్పూర్ కాగజ్నగర్ కొల్లా జంక్షన్, చర్లపల్లి కొల్లాం జంక్షన్, చర్లపల్లి కొల్లాం జంక్షన్, హజరత్ సాహిబ్ నాందేడ్ కొల్లాం ప్రత్కేక రైళ్ల బుకింగ్ ఈ నెల 3నుండి ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. సిర్పూర్ కాగజ్నగర్ కొల్లా జంక్షన్ ప్రత్యేక రైలు బెల్లంపల్లి, మంచిర్యాల్, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోల్, నెల్లూర్, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూర్, కట్పడి, జోలార్ పెట్టాయి, సాలెమ్, ఈ రోడ్, తిరుపూర్, పొడనూర్, పలక్కాడ్, త్రిసూర్, ఆలువ, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెన్గనూర్, కాయన్కులం జంక్షన్ స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. చర్లపల్లి కొల్లాం ప్రత్యేక రైళ్లు సికిందరాబాద్, బేగంపేట్, లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్, తాండూర్, సేడమ్, యాద్గిర్, క్రిష్ణా, రాయిచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట, తిరుపతి, చిత్తూర్, కట్పడి, జోలార్పెట్టాయి స్టేషన్లలో ఆగుతాయి.
ఎపిలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఓ రివాల్వర్ కలకలం సృష్టించింది. శ్రీశైలం టోల్గేట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తనిఖీల్లో రివాల్వర్ బయటపడటంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి ఉత్పన్నమైంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి దగ్గర 9 ఎమ్ఎమ్ పిస్టల్ రివాల్వర్ ఉండటం గమనించారు. వెంటనే వారు అక్కడే విధుల్లో ఉన్న పోలీసులకు సమా చారం ఇచ్చారు. దీంతో, పోలీసులు రివాల్వర్ కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. తనను మధ్యప్రదేశ్కు చెందిన సైబర్ క్రైమ్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్నానని ఆ వ్యక్తి తెలిపాడు. అతని వద్ద ఉన్న రివాల్వర్ లైసెనస్డ్ ఆయుధమని, అధికారిక కారణాలతో ప్రయాణిస్తున్నానని తెలిపాడు. శ్రీశైలం సిఐ ప్రసాద్రావు ఆ వ్యక్తి వద్ద ఉన్న ఐడి కార్డు, రివాల్వర్ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు నిర్వహించారు. మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్పితో సంప్రదించి సదరు వ్యక్తి వివరాలు నిర్ధారించుకున్నారు. విచారణలో అతను నిజంగానే మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు అతని రివాల్వర్, ఐడి కార్డులను తిరిగి అప్పగించారు. కొద్ది సేపు ఆందోళన కలిగించిన ఈ ఘటనలో ఆ రివాల్వర్ కలిగి ఉన్న వ్యక్తి నిజంగానే పోలీసు అధికారి అని తేలడంతో ఆ రివాల్వర్ ఉత్కంఠ వీడింది. దీంతో, భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
భారత్ ఆందోళనలు మాకు తెలుసు.. రష్యా కీలక వ్యాఖ్యలు
మాస్కో: వాణిజ్య లోటు విషయంలో భారత్ ఆందోళనలు తమకు తెలుసని, అందుకే దాన్ని సమతూకం చేసేందుకు దిగుమతులను గణనీయంగా పెంచుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కీలక ప్రకటన చేశారు. అలాగే ఉగ్రవాదంపై ఉమ్మడిగా కలిసి పోరాటం చేయడానికి సిద్ధమని తెలిపారు. దైపాక్షిక వాణిజ్యంపై ఇతర దేశాల ఒత్తిడి లేని వ్యాపార విధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో పుతిన్ భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో భారత్ష్య్రా సంబంధాలపై రష్యా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. అమెరికా ఆంక్షల విధింపు ఎలా ఉన్నా భారత్కు రష్యా నుంచి చమురు సరఫరా తగ్గకుండా ప్రయత్నిస్తున్నట్టు పెస్కోవ్ తెలిపారు. భౌగోళిక రాజకీయాలకు అతీతంగా పనిచేసే ఒక వాణిజ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలని రష్యా కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ సహకారాన్ని కూడా మరింత విస్తరిస్తామని తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా మధ్యవర్తిత్వం చాలా ప్రభావవంతంగా ఉందని , వారి ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఈనెల 4,5 తేదీల్లో పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. భారత్పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల 23 వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
Nine out of Ten people loved our AKT – Ram
Energetic Star Ram Pothineni, Bhagyashri Borse, Upendra starrer Andhra King Teluka released recently and it got high critical positive recpetion and word-of-mouth from audienes. Mahesh Babu P has directed the film with Mythri Movie Makers prouducing it. The movie team have conducted Thank You Meet in Hyderabad. Mythri Ravi stated that the team have predicted […] The post Nine out of Ten people loved our AKT – Ram appeared first on Telugu360 .
సెల్ఫోన్లో సంచార్ సాథీ తప్పనిసరి.. కేంద్రం ఆదేశాలు
దేశంలో ఇక నుంచి విక్రయించే ప్రతి సెల్ఫోన్లో తప్పనిసరిగా ‘సంచార్ సాథీ’ యాప్ ముందుగానే ఇన్స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా యాప్ను ఇన్స్టాల్ చేయాలని పేర్కొంది. ఈ దిశగా తీసుకున్న చర్యలకు సంబంధించిన కంప్లయెన్స్ నివేదికను 120 రోజుల్లోగా సమర్పించాలని తెలిపింది. ఈ యాప్ ఫోన్ యూజర్లకు స్పష్టంగా కనిపించేలా ఇన్స్టాల్ చేయాలని , మొదటిసారి డివైజ్ సెటప్ సమయం లోనే ఇది యూజర్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం యాపిల్, సామ్సంగ్, గూగుల్, వివో, ఒప్పో, షియోమీ వంటి ప్రధాన కంపెనీలు భారత్లో హ్యాండ్సెట్లు తయారు చేస్తున్నాయి. వీటికి తాజా ఆదేశాలు వర్తిస్తాయి.సంచార్ సాథీ ఉత్తర్వును ప్రతిఘటించిన యాపిల్ ప్రతిసెల్ఫోన్లో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేయాలన్న టెలికాంశాఖ ఆదేశాలను పాటించడానికి యాపిల్ సంస్థ ముందుకు రావడం లేదని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి తన ఆందోళన తెలియజేయడానికి సిద్ధమైంది. దీనివల్ల ప్రపంచం మొత్తం మీద తమ కంపెనీ యొక్క ఇకోసిస్టమ్లో గోప్యత, భద్రతకు సంబంధించిన అనేక సమస్యలు లేవనెత్తుతాయని కేంద్రానికి చెప్పాలనుకుంటోంది. యాపిల్ తన యాప్ స్టోర్ను దాని యాజమాన్య ఐఒఎస్సాఫ్ట్వేర్ను కట్టుదిట్టంగా నియంతిస్తుంటుంది. ఏటా 100 బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఈ వ్యవస్థలు చాలా కీలకం. అయితే ఈ విషయంలో కోర్టును ఆశ్రయించడం కానీ లేదా ప్రభుత్వ వైఖరిని అనుసరించడం కానీ యాపిల్ చేయదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. శామ్సంగ్ వంటి సంస్తలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సమీక్షిస్తున్నట్టు చెప్పాయి.
UNANIMOUS : కొండపల్లి కో –ఆప్షన్ సభ్యులు
UNANIMOUS : కొండపల్లి కో – ఆప్షన్ సభ్యులు ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్
పార్లమెంట్లో ‘సంచార్సాథీ’ రగడ
ప్రజల గోప్యతపై దాడి అంటూ విపక్షాల నిరసన సెల్ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ : ‘సంచార్ సాథీ’ అంశం మంగళవారం పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేసింది. దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో సంచార్సాథీ యాప్ను ప్రీఇన్స్టాల్ (డిఫాల్ట్గా) చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై విపక్షాలు మండిపడుతున్నాయి.పార్లమెంట్లో మంగళవారం ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ప్రథానంగా కాంగ్రెస్, శివసేన, ఎంబిటి, టిఎంసి దీన్నితీవ్రంగా విమర్శిస్తూ ఇది ప్రజల ప్రైవసీ ఉల్లంఘనే అంటూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విపక్ష కాంగ్రెస్ దీని మీద వాయిదా తీర్మానం దాఖలుచేసి సంచార్ సాథీపై విస్తృత చర్చ కావాలని డిమాండ్ చేసింది. సంచార్సాథీయాప్ , ఫోన్ యూజర్ల కదలికలను, మెసేజెస్ , కాల్స్ మానిటర్ చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దీనిని ఇదొక డిస్టోపియన్ టూల్ అని, ఇది ప్రతిభారతీయుడిని మానిటర్ చేయడమే కాకుండా, వారి ఆర్థిక హక్కులపై దాడిగా అభివర్ణించారు. దీని అమలు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి దీనిపై వాయిదా తీర్మానం దాఖలు చేశారు. శివసేన యుబిటీ ఎంపి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ఇది ఒక దారుణమైన పరిణామమని, ఇది భవిష్యత్తులో నియంతృత్వానికి దారి తీస్తుందని, ప్రజల గోప్యతను హరిస్తుందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోష్ కూడా దీనిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ప్రభుత్వంపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుందని విమర్శించారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సంచార్ సాథీ యాప్పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంచార్ సాథీ మీద చర్చకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ ఎజెండా ప్రకారం సెషన్లో 14 బిల్లులపై ఫోకస్ పెడదామని సూచించారు. అటు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ కూడా దీనిపై స్పందించింది. సంచార్ సాథీ కేవలం ప్రజల సైబర్ సెక్యూరిటీ కోసం ఉద్దేశించింది మాత్రమేనని, ఇందులో ప్రైవసీ ఉల్లంఘన లేదంది. ఈ యాప్ యూజర్ డేటా రక్షిస్తుందని తెలియజేసింది. ‘సంచార్ సాథీ’ యాప్పై కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ ఇచ్చారు. వినియోగదారులు అక్కర్లేదనుకుంటే తమ స్మార్ట్ ఫోన్ల నుంచి యాప్ను డిలీట్ చేయవచ్చని చెప్పారు. ఇది ఐచ్ఛికమని అన్నారు. ప్రతి ఒక్కరి కోసం ఈ యాప్ను ప్రవేశ పెట్టడం తన డ్యూటీ అని, డివైస్లో యాప్ ఉంచుకోవాలా వద్దా అనేది వినియోగదారుని ఇష్టమని తెలిపారు సెల్ఫోన్లో సంచార్ సాథీ తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు దేశంలో ఇక నుంచి విక్రయించే ప్రతి సెల్ఫోన్లో తప్పనిసరిగా ‘సంచార్ సాథీ’ యాప్ ముందుగానే ఇన్స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా యాప్ను ఇన్స్టాల్ చేయాలని పేర్కొంది. ఈ దిశగా తీసుకున్న చర్యలకు సంబంధించిన కంప్లయెన్స్ నివేదికను 120 రోజుల్లోగా సమర్పించాలని తెలిపింది. ఈ యాప్ ఫోన్ యూజర్లకు స్పష్టంగా కనిపించేలా ఇన్స్టాల్ చేయాలని , మొదటిసారి డివైజ్ సెటప్ సమయం లోనే ఇది యూజర్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం యాపిల్, సామ్సంగ్, గూగుల్, వివో, ఒప్పో, షియోమీ వంటి ప్రధాన కంపెనీలు భారత్లో హ్యాండ్సెట్లు తయారు చేస్తున్నాయి. వీటికి తాజా ఆదేశాలు వర్తిస్తాయి. సంచార్ సాథీ ఉత్తర్వును ప్రతిఘటించిన యాపిల్ ప్రతిసెల్ఫోన్లో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేయాలన్న టెలికాంశాఖ ఆదేశాలను పాటించడానికి యాపిల్ సంస్థ ముందుకు రావడం లేదని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి తన ఆందోళన తెలియజేయడానికి సిద్ధమైంది. దీనివల్ల ప్రపంచం మొత్తం మీద తమ కంపెనీ యొక్క ఇకోసిస్టమ్లో గోప్యత, భద్రతకు సంబంధించిన అనేక సమస్యలు లేవనెత్తుతాయని కేంద్రానికి చెప్పాలనుకుంటోంది. యాపిల్ తన యాప్ స్టోర్ను దాని యాజమాన్య ఐఒఎస్సాఫ్ట్వేర్ను కట్టుదిట్టంగా నియంతిస్తుంటుంది. ఏటా 100 బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఈ వ్యవస్థలు చాలా కీలకం. అయితే ఈ విషయంలో కోర్టును ఆశ్రయించడం కానీ లేదా ప్రభుత్వ వైఖరిని అనుసరించడం కానీ యాపిల్ చేయదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. శామ్సంగ్ వంటి సంస్తలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సమీక్షిస్తున్నట్టు చెప్పాయి.
checking |ఇసుక టిప్పర్ పై కేసు నమోదు
checking | ఇసుక టిప్పర్ పై కేసు నమోదు Checking | నాగర్
గంజాయి బ్యాచ్ అరెస్ట్ ( గుడ్లవల్లేరు –, ఆంధ్రప్రభ) గుడ్లవల్లేరు పోలీసులు తొమ్మిది
ఇద్దరు దుర్మరణం ఓవర్ టేక్ .. బైక్ స్కిడ్ ( కర్నూలు, ఆంధ్రప్రభ
మందు తాగే వాళ్ళకో దేవుడు..: సిఎం రేవంత్ రెడ్డి
మందు తాగే వాళ్ళకో దేవుడు ఉన్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. మంగళవారం గాంధీ భవన్లో పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ డిసిసి నూతన అధ్యక్షులకు దిశా నిర్ధేశం చేశారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికే గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంది కాబట్టే నిలబడిందని, లేకపోతే జనతా పార్టీలా, మరో పార్టీలా మూతపడేదని అన్నారు. “హిందువులకు ఎంత మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు?, మూడు కోట్ల మంది ఉన్నారా?” అని ఆయన అంటూ ‘పెళ్ళికాని వారికి హనుమంతుడు, రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికో దేవుడు, మందు తాగే వారికో దేవుడు, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ కల్లు పోయాలి, కోడి కోయాలి అనోటోళ్ళకు, పప్పు తినే వారికో దేవుడు ఉన్నారు..అవునా, అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేవుళ్ళపైనే ఏకాభిప్రాయం లేదని, అలాగే డిసిసి అధ్యక్షుల విషయంలో ఏకాభిప్రాయం ఎలా తేగలమని అన్నారు. తాను సిఎం కావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. అదేవిధంగా మీరు కూడా కష్టపడాలని, కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమని ఆయన తెలిపారు. కాళ్ళలో కట్టే పెట్టే వారుంటారని ఆయన చెప్పారు. తాను ఫుట్ బాల్ ప్రాక్టిస్ చేస్తున్నానని, అదిగో ముఖ్యమంత్రి బాల్ను కాలితో తన్నుతున్నారంటే ఎలా?, ఫుట్ బాల్ అంటేనే కాలితో తన్నుతారని ఆయన అన్నారు. ఆటలో బొర్లా పడతామని, పడగానే ఇక లేవరని అనుకోరాదని, పడగానే లేచి నిలబడే వాడే ఆటగాడని ఆయన తెలిపారు. రాజకీయాల్లోనూ అదే విధంగా ఉంటుంది కాబట్టి మీరంతా కష్టపడి పని చేయాలని డిసిసిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిత బోధ చేశారు.
తెలంగాణ రాజ్భవన్.. ఇకపై ‘లోక్భవన్’
తెలంగాణ రాజ్భవన్ పేరును లోక్భవన్గా మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాజ్భవన్లను లోక్భవన్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. వలస వాద వాసనలను తుడిచిపెట్టే ఉద్దేశంలో భాగంగా, రాజ్భవన్, రాజ్ నివాస్ల పేర్లను లోక్భవన్, లోక్నివాస్లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాసిన లేఖకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అసోం, కేరళ, త్రిపుర, ఒడిశా రాజ్భవన్లను లోక్భవన్లుగా మార్చారు. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది.
రానున్న పదేళ్లలో అణుయుద్ధం: ఎలాన్మస్క్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వచ్చే ఐదేళ్లలో అణుయుద్ధం జరగవచ్చని పేర్కొన్నారు. ఎక్స్లో ఓ యూజర్ పోస్టుకు సమాధానంగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. హంటర్ యాష్ అనే ఓ యూజర్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టాడు. “ అణ్వాయుధాలు ప్రధాన శక్తుల మధ్య యుద్ధాన్ని , యుద్ధ ముప్పును నిరోధిస్తాయని ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు పిచ్చిగా నమ్ముతున్నాయి కాబట్టి, ఆ ప్రభుత్వాలపై బయటి శక్తుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు” అని రాసుకొచ్చాడు. దీనికి ఎలాన్ మస్క్ బదులిస్తూ యుద్ధం కచ్చితంగా జరుగుతుందని పేర్కొన్నారు. ‘యుద్ధం అనివార్యం. 5,10 ఏళ్లలో ఇది జరుగుతుంది ” అని రాసుకొచ్చారు. అయితే తన వ్యాఖ్యలపై మస్క్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ శాఖలో పనిచేసిన మస్క్... ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక యుద్ధం జరగబోతోందంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొందరు యూజర్లు ఎలాన్మస్క్ డెవలప్ చేసిన కృత్రిమ మేధ చాట్బాట్ “గ్రోక్” ను ్ల అడగ్గా, ఎలాన్మస్క్ తన పోస్టుకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని తెలిపింది. అయితే ఆయన గతంలో చేసిన ప్రకటన ఆధారంగా సామూహిక వలసలు, రాజకీయ కారణాల వల్ల యూరప్ యూకే లోని అంతర్యుద్ధం జరగవచ్చని మస్క్ హెచ్చరించినట్టు తెలిపింది. దీంతోపాటు తైవాన్ విషయంలో యూఎస్చైనా, ఉక్రెయిన్ లోని సంఘర్షణలు మూడో ప్రపంచయుద్ధంగా మారిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గురించి ప్రస్తావించింది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కౌటాల మండలంలో మంగళవారం తుపాకీ కలకలం సృష్టించింది. కౌటి=సాండ్గాం గ్రామానికి చెందిన ఓ యువకుడు డబ్బుల కోసం ఓ ఫెర్టిలైజర్ యజమాని తమ్ముడిని బెదిరించి తుపాకీతో కాల్పులకు పాల్పడినట్లు జిల్లా ఎస్పి నిఖిత పంత్ తెలిపారు. మంగళవారం కౌటాల సర్కిల్ కార్యాలయంలో కేసుకు సంబందించి వివరాలను ఆయన వెల్లడించారు. కౌటి=సాండ్గాం గ్రామానికి చెందిన కుర్బంకర్ అజయ్ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో యూట్యూబ్లో వీడియోలు చూసేవాడు. ఈ క్రమంలో జూన్ 12న రూ.50 లక్షలు తీసుకొని మహారాష్ట్రలోని చంద్రాపూర్ బస్టాండ్కు రావాలని, లేనిపక్షంలో చంపేస్తానని ఓ ఫెర్టిలైజర్ షాపు షట్టర్కు బోర్డు అంటించాడు. అయినా బాధితుడు స్పందించకపోవడంతో యూట్యూబ్లో తుపాకులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని జులైలో బీహార్ వెళ్ల్లి రూ.55 వేలు చెల్లించి 1 పిస్తోలు, 2 మ్యాగజైన్లు, 20 బుల్లెట్లు, 1 తపంచాను తీసుకొచ్చాడు. అక్టోబర్ 10న బాధితుడి తమ్ముడు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆ యువకుడు మార్గమధ్యలో ఆపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యక్తి ఆగకుండా వెళ్లడంతో బుల్లెట్ ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ చంద్రశేఖర్ విచారణ జరిపారు. ఈ క్రమంలో మంగళవారం ఫెర్టిలైజర్ యజమాని లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా షాపునకు వస్తారని గ్రహించి వారిని తుపాకీతో కాల్చి చంపాలనే ఉద్దేశంతో పిస్తోలు, 3 బుల్లెట్లు తీసుకొని బైక్పై వెళ్తున్నాడు. అయితే, స్థానిక ఎన్నికల సందర్భంగా మార్గమధ్యలో పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో ఆ యువకుడు పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసును ఛేదించిన కాగజ్నగర్ డిఎస్పి వహీదుద్దిన్, కౌటాల సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ చంద్రశేఖర్, పోలీసు సబ్బందిని ఎస్పి నిఖిత పంత్ అభినందించారు.
కుక్కల దాడిలో మూగ బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన మన్సూరాబాద్ డివిజన్ శివగంగా కాలనీలో చోటు చేసుకుంది. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో తిరుపతిరావు, చంద్రకళ దంపతులకు కూమారుడు ప్రేంచంద్ (8) కి మాటలు రావు. తిరుపతిరావు మేస్త్రి పని చేసుకుంటూ శివగంగా కాలనీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 7 గంటలకు బాలుడిపై మూకుమ్మడిగా వీధి కుక్కలు దాడి చేయగా , బాలుడికి శరీరమంతా గాయాలైయ్యాయి. స్దానికులు గమనించి వెంటనే కుక్కలను అక్కడి నుంచి తరిమి వేశారు. వెంటనే తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
’అఖండ 2’లో కీలకమైన పాత్ర చేశా: సంయుక్త మీనన్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త మీనన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “దర్శకుడు బోయపాటి శ్రీను చాలా గ్రేట్ విజన్తో ఈ సినిమా తీశారు. -ఈ సినిమాలో నా క్యారెక్టర్ ముఖ్యమైన సీక్వెన్స్లో చాలా కీలకంగా ఉంటుంది. నా క్యారెక్టర్ స్టయిలీష్గా ఉంటుంది. -హీరో బాలయ్య డైరెక్టర్ యాక్టర్. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ లక్షణం నాకు చాలా నచ్చింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు అన్నింటికీ అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో పాటలు శివుడికి నివాళిలా ఉంటాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాతలు రామ్, గోపి చాలా మంచి ప్రొడ్యూసర్స్. -ఇక ప్రస్తుతం స్వయంభు సినిమాలో యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నాను. శర్వా ‘నారి నారి నడుమ మురారి’లో నాది చాలా మంచి క్యారెక్టర్. అలాగే పూరితో వర్క్ చేయడం మంచి అనుభవాన్నిచ్చింది”అని అన్నారు.
traffic flow |స్పెషల్ డ్రైవ్..
traffic flow | స్పెషల్ డ్రైవ్.. traffic flow | విజయవాడ (క్రైమ్)ఆంధ్రప్రభ
Akhanda 2 Locks Rs 50 Lakh Deal for 5 Premiere shows
The makers of Akhanda 2 have applied for ticket hike and permissions for special shows along with paid premieres (on Thursday). The government of AP has granted hike and special permissions in AP and the permissions for the same will arrive in Telangana very soon. A record breaking deal for Akhanda 2 has been closed […] The post Akhanda 2 Locks Rs 50 Lakh Deal for 5 Premiere shows appeared first on Telugu360 .
sexual assault |రేపిస్టుకి 20 ఏళ్లు జైలు
sexual assault | రేపిస్టుకి 20 ఏళ్లు జైలు sexual assault |
GPO | ఈ జీపీవో మాకు వద్దు GPO | తాడ్వాయి, ఆంధ్ర
40 years |హ్యాపీ తెలుగు వర్సిటీ
40 years | హ్యాపీ తెలుగు వర్సిటీ 40 years | కూచిపూడి,
ఇమ్రాన్ సురక్షితంగానే ఉన్నారు.. కానీ: సోదరి ఉజ్మా
మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ కలిశారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఆయనను కలిసేందుకు జైలు అధికారులు మంగళవారం అనుమతించారు. దీంతో పాకిస్తాన్ లోని అడియాలా జైలులో ఇమ్రాన్ ను ఆయన సోదరి ఉజ్మా కలిశారు. అనంతరం జైలు బయట ఆమె మీడియాతో మాట్లాడారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. కానీ ఆయనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. కాగా, జైలులో ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిదే. ఆయనను జైలులో చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బలూచిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. ఇమ్రాన్ ఆరోగ్యంపై పుకార్లు రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రావిల్పిండిలోని అడియాలా జైలు వద్ద ఆందోళనకు దిగారు. ఆయనను కలిసేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కుటుంబంలోని ఒకరికి మాత్రమే అనుమతించడంతో ఇమ్రాన్ సోదరి ఉజ్మా జైలులోకి ఆయన వెళ్లి కలిశారు.
Grain | ధాన్యం కాంటా లేదు Grain | కూచిపూడి, ఆంధ్రప్రభ :
Railway Board |ప్రతి రైలు ఆపిస్తాం
Railway Board | ప్రతి రైలు ఆపిస్తాం Railway Board | శావల్యాపురం,
AP Goes Big on Electric Future: Chandrababu Unveils Massive EV Push
Andhra Pradesh is gearing up for a major electric revolution. Chief Minister N. Chandrababu Naidu has announced an aggressive plan to transform public transport and modernise the state’s power sector. In a key review meeting with the Energy Department, Naidu directed that all APSRTC buses be converted to electric vehicles within five years. As the […] The post AP Goes Big on Electric Future: Chandrababu Unveils Massive EV Push appeared first on Telugu360 .
భూ దందా కోసం ప్రభుత్వం హిల్ట్ పాలసి తెచ్చింది: బండ ప్రకాష్
కాంగ్రెస్ ప్రభుత్వం భూ దందా కోసం హిల్ట్ పాలసి తెచ్చిందని, ఇందుకోసం జిఒ విడుదల చేశారని బిఆర్ఎస్ నేత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పేర్కొన్నారు. దాదాపు పది వేల ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకే ఈ పాలసీ తెచ్చారని ఆరోపించారు. కేవలం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు దండుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఎంఎల్సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపి బడుగుల లింగయ్యలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ హయాంలో పరిశ్రమల స్థాపనకు టిఎస్ఐపాస్ తెచ్చి 15 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుందని తెలిపారు. పరిశ్రమలకు భూములు ఇచ్చే సమయంలోనే కాదు అమ్మేటప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయానలి, పర్యావరణ వేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు లీజు భూములకు హిల్ట్ వర్తించదని చెబుతున్నారని, జిఒలో మాత్రం తొమ్మిది వేల ఎకరాలపైనే ప్రస్తావించారని అన్నారు.బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి ఇఒలు ఎపుడూ ఇవ్వలేదని, పారదర్శకమైన విధానం అమలు చేశామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలు నడిపేలా చూడటం ప్రభుత్వ భాద్యత అని వ్యాఖ్యానించారు. పరిశ్రమలు లేకపోతే ఉపాధి ఎట్లా..? అని ప్రశ్నించారు. ఒఆర్ఆర్ అవతలకు పరిశ్రమలు స్థాపింవే అవకాశం పారిశ్రామిక వేత్తలకు కల్పించాలని, బిడ్డింగ్ ద్వారా ఉపయోగంలో లేని పరిశ్రమల భూములను అమ్మాలని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో ఈ పద్దతి అమలవుతోందని చెప్పారు. హిల్ట్ పాలసీ రావడం వెనుక వేల కోట్ల రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీలో ఉపాధి కల్పించే పరిశ్రమలు రావడం లేదని అన్నారు. ఫిలిం యూనిట్లపై ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు తప్ప మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావడం లేదని విమర్శించారు. ఎంఎల్సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విలువైన భూములు ప్రభుత్వ సంపద అని, ఈ సంపదను హిల్ట్ పేరుతో సిఎం, ఆయన ఆత్మీయులు కొల్లగొట్టే ప్రణాళిక వేశారని అన్నారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి భూ దందాలతో దోచుకో దాచుకో అనే విధానంపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని మండిపడ్డారు. బిసిలతో సహా అందరిని మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు. హిల్ట్ పాలసీపై ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.
Minister | కూరగాయల ధరలపై ఆరా Minister | విజయవాడ (పటమట) ఆంధ్రప్రభ
2007లో రోహిత్ ఆ మ్యాచ్ ఆడుతున్నప్పుడు.. నేను స్కూల్ లో ఉన్నా: బావుమా
టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ ఆడుతున్న సమయంలో తాను స్కూల్ లో చదువుకుంటున్నానని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నాడు. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డే బుధవారం రాయ్పూర్లో జరగనుంది. మొదటి వన్డేకు దూరమైన కెప్టెన్ బావుమా తిరిగి జట్టుతో కలిశారు. రెండో వన్డేకు ముందు రాయ్పూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బావుమా మాట్లాడుతూ.. 2007 T20 ప్రపంచ కప్ సమయంలో దక్షిణాఫ్రికా జట్టుతో ఆడుతున్నప్పుడు రోహిత్ ఆటను తాను మొదటిసారి చూశానని.. అప్పుడు తాను ఇంకా పాఠశాల విద్యార్థినేనని గుర్తుచేసుకున్నాడు. రోహిత్, విరాట్ కోహ్లీలు ప్రపంచస్థాయి ఆటగాళ్లు. వీరిద్దరూ తిరిగి రావడంతో భారత జట్టు బలంగా మారింది. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్లో ఆధిపత్యం చెలాయించారు. వీరికి చాలా అనుభవం, నైపుణ్యం ఉంది. అయినా వారిని ఎదుర్కోవడం మాకు కొత్తేమీ కాదు. వారితో చాలా మ్యాచ్ లు ఆడాం. కొన్ని సార్లు పైచేయి కూడా సాధించాం. ఇవన్నీ సిరీస్ను మరింత ఉత్తేజకరంగా చేస్తాయి అని బావుమా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మొదటి వన్డేలో 39 బంతుల్లో 70 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను విజయం అంచుకు తీసుకెళ్లిన మార్కో జాన్సెన్ను బవుమా ప్రశంసించారు. కాగా, తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాగా, రోహిత్ అర్థసెంచరీతో రాణించాడు.
అమెరికాలో F-1 విద్యార్థి వీసా నిబంధనలు: SEVIS, I-20, డీఎస్ఓల పాత్ర
అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు F-1 వీసా చాలా కీలకం. ఈ వీసా నిబంధనలను పాటించడం, విద్యార్థి అమెరికాలో చదువు పూర్తయ్యే వరకు లీగల్ స్టేటస్ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. దీనికి మూడు ప్రధాన అంశాలు ఎప్పుడూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి: SEVIS సిస్టమ్, విద్యా సంస్థ (DSOలు), ఫారం I-20. ఈ వ్యవస్థ విద్యార్థి చట్టపరమైన హోదాను స్థిరపరుస్తుంది. అలాగే వారి చదువు, ఆర్థిక వనరులు, ఉద్యోగానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను […] The post అమెరికాలో F-1 విద్యార్థి వీసా నిబంధనలు: SEVIS, I-20, డీఎస్ఓల పాత్ర appeared first on Dear Urban .
ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో హరీశ్రావు దిట్ట: కడియం శ్రీహరి
బిఆర్ఎస్ అగ్ర నేత హరీశ్రావు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో దిట్ట అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. మంగళవారం మండలంలోని పల్లగుట్టలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమపై వచ్చే ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే హరీశ్రావు, కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధరమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వందల ఎకరాల భూములు, వందల కోట్ల ఫాం హౌస్లు ఉన్నాయని.. కావాలనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ అంచనాలను రూ.1,100 కోట్ల నుంచి రూ.1,700 కోట్లకు పెంచారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు హరీశ్రావు సమాధానం చెప్పాలని అన్నారు. కవిత ఆరోపణలు చేస్తున్నా బిఆర్ఎస్ నాయకులంతా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి బిసిలకు రిజర్వేషన్లు కల్పించడం ఇష్టం లేదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిసి రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపిస్తే పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బిసి బిల్లును ఆమోదించిన 9వ షెడ్యూల్లో చేర్చితేనే రిజర్వేషన్ల అమలు సాధ్యమని తెలిపారు. దీనిని బిసి సంఘాల నాయకులు, ప్రజలు గమనించాలన్నారు. ఇదంతా తెలిసి కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే గ్రామాలభివృద్ధి కుంటుపడుతుందని అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల తరువాత నియోజకవర్గ అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తానన్నారు. అభివృద్ధిలో ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్న నియోజకవర్గానికి ప్రజలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో చిల్పూర్ ఆలయ కమిటీ ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
March fast |ఎన్నికలతో పోలీసుల మార్చ్ ఫాస్ట్..
March fast | ఎన్నికలతో పోలీసుల మార్చ్ ఫాస్ట్.. March fast |
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్టు
వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని ఎక్సైజ్ సిబ్బంది మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఎక్సైజ్ సిబ్బంది గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నానక్రాంగూడలో గంజాయి డాన్ నీతుబాయి ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమచారం రావడంతో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 786 గ్రాముల గంజాయి, 110 బీరు, బ్రిజర్, ఒక బైక్, రూ. 60,890 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్టిఎఫ్ బి టిం లీడర్ ప్రదీప్రావు , సిఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, సిబ్బంది దాడి నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న గోవింద్, దుర్గెష్, నీతుబాయి కుమారుడు దుర్గ ప్రసాద్ను అరెస్టు చేశారు. ఒడిసా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిపారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను, గంజాయి, నగదును శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. కాగా, నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మంగూరు బస్తీలో గంజాయి విక్రయిస్తున్న కాంబ్లె పరిమళ, ఎస్. బసంతిని అరెస్టు చేశారు. 1.2కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిసా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలు అక్కడ తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తీసుకుని వచ్చి నగరంలోని విక్రయిస్తున్నారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న మంగ్లీ నరేష్ అనే వ్యక్తిని శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 710 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్టిఎఫ్ సిబ్బంది నెహ్రూనగర్లో గంజాయి విక్రయిస్తుండగా ఎస్టిఎఫ్ సి టీం ఎస్సై మంజు, సిబ్బంది పట్టుకున్నారు.
Model School |ఆర్ధిక అక్షరాష్యతపై విద్యార్థులకు అవగాహన…
Model School | ఆర్ధిక అక్షరాష్యతపై విద్యార్థులకు అవగాహన… Model School |
Talent Test |విద్యార్థులకు టాలెంట్ టెస్ట్
Talent Test | విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ Talent Test | రెంజల్,
CPI |నిజాయితీ పరులను ఎన్నుకోవాలి…
CPI | నిజాయితీ పరులను ఎన్నుకోవాలి… CPI | జనగామ, ఆంధ్రప్రభ :
12 మంది విద్యార్థులకు అస్వస్థత
ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 12 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాలలోని ఎస్టి ప్రభుత్వ వసతి గృహం విద్యార్థులు ఉదయం ఉప్మా తిని పాఠశాలకు బయల్దేరారు. ప్రార్థన సమయంలో విద్యార్థులు ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయారు. గమనించిన పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్యం అందించిన అనంతరం విద్యార్థులను డిశ్చార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అందరికీ మాత్రలు, ఇంజక్షన్లు ఇచ్చామని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. హాస్టల్లో ఉదయం ఉప్మా చేయగా విద్యార్థులు టిఫిన్ చేయకపోవడంతోనే సొమ్మసిల్లి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా హాస్టల్లో నాణ్యమైన భోజనం అందిస్తలేరని, పురుగుల అన్నం, ఉప్మాలో కూడా పురుగులు వస్తున్నాయని పలువురు విద్యార్థులు తెలిపారు. జడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గం ఇన్ఛార్జి సరిత అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు, వార్డెన్కు సూచించారు.
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్ తెస్తాం..ఇవ్వకపోతే కొట్లాడుతాం: రేవంత్
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి మోడీని కలిసి బుల్లెట్ ట్రైన్ ఇస్తావా.. చస్తావా అని అడుగుతామని చెప్పారు. ఒకవేళ ఇవ్వకపోతే.. ఒకటికి పదిసార్లు అడుగుతామని.. బుల్లెట్ ట్రైన్ మాకెందుకు ఇవ్వరో కొట్లాడుతామని సిఎం అన్నారు. ఈ నెలాఖరున వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. 2034 వరకు తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమిగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ మహా నగరంలో నాచారంతో పాటు పలు ప్రాంతాల్లో పరిశ్రమలు ఉన్నాయని.. ఔటర్రింగ్ రోడ్డు లోపల ఉన్న కాలుష్య పరిశ్రమలన్నింటినీ బయటకు తరలిస్తామని సిఎం రేవంత్ చెప్పారు.
స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్: లాభాలు రావాలంటే ఈ తప్పులు చేయొద్దు
స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ లాభాలే ఆశిస్తారు. కానీ, సరైన ప్రణాళిక లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది. స్టాక్ మార్కెట్ అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే జాక్పాట్ కాదు. ఇది ఒక క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక ప్రయాణం. మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు, మార్కెట్ గమనాన్ని అర్థం చేసుకునే నేర్పు కూడా ఉండాలి. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు రిస్క్ తగ్గించుకుని, సంపద సృష్టించుకోవడానికి పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు, అలాగే చేయకూడని తప్పుల […] The post స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్: లాభాలు రావాలంటే ఈ తప్పులు చేయొద్దు appeared first on Dear Urban .
పెళ్లికి వచ్చిన వారికి హెల్మెట్లు #Rajasthan #ViralWedding #RoadSafety #Helmets
Nominations |ఓట్లేసేందుకు కాదు…
Nominations | ఓట్లేసేందుకు కాదు… Nominations | నర్సింహులపేట, ఆంధ్రప్రభ: ఫోటోలో వరుసలో
Vision @ 2047 |అభివృద్ధిలో కలుద్దాం
Vision @ 2047 | అభివృద్ధిలో కలుద్దాం Vision @ 2047 |
WATER |ధర్మవరం రైతులకు తీపికబురు
WATER | ధర్మవరం రైతులకు తీపికబురు మంత్రి సత్యకుమార్ కీలక నిర్ణయంబత్తలపల్లి–తాడిమర్రి చెరువులకునీరు
GGH |కర్నూలు బ్లడ్ బ్యాంక్ బెస్ట్
GGH | కర్నూలు బ్లడ్ బ్యాంక్ బెస్ట్ ఏడాదిలో 11,531 యూనిట్ల రక్తం
Rs. 2,830 crores |కంట్రోల్ రూమ్ రెడీ
Rs. 2,830 crores | కంట్రోల్ రూమ్ రెడీ Rs. 2,830 crores
Commissioner |బాధితులకు న్యాయం చేస్తాం
Commissioner | బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు కమిషనర్ పి.విశ్వనాథ్ Commissioner |
Rs.93 crore |ప్రగతికి పన్నులే పునాది
Rs.93 crore | ప్రగతికి పన్నులే పునాది Rs.93 crore | కర్నూలు,
Telangana : రాజకీయ గురువు వేస్తున్న ఎత్తుగడలకు చెక్ పెట్టాలనేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గడం లేదు.
హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాజ్ భవన్ల పేరును లోక్ భవన్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్లోని రాజ్ భవన్ పేరును లోక్ భవన్గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వలసవాద వాసనలను తుడిచి పెట్టేందుకు రాజ్ భవన్, రాజ్ నివాస్ల పేర్లను లోక్ భవన్, లోక్ నివాస్లుగా మార్చే అంశాన్ని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తే.. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాసిన లేఖకు అనుగుణంగా చాలా రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల్లో రాజ్ భవన్లను లోక్ భవన్లుగా మార్చారు. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది.
POLICE | ఫోక్సో కేసు నమోదు POLICE | బయ్యారం, ఆంధ్రప్రభ :
unanimity |యూత్ కాంగ్రెస్ కార్యవర్గం ఎన్నిక
unanimity | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండల పరిధిలోని సుంకెనపళ్లి(Sunkenapally) యూత్
టెస్లా కార్లపై ఆసక్తి చూపని భారతీయులు! #Tesla #IndianMarket #EVSales #Automobile #ElectricCars
Communication Skills |ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్
Communication Skills | ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్ Communication Skills |

21 C