PEOPLE | గెలుపు నాదే.. PEOPLE | మంథని, ఆంధ్రప్రభ : స్థానిక
Manthani |కత్తుకు ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా
Manthani | కత్తుకు ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా Manthani | మంథని, ఆంధ్రప్రభ
RTC |ఢీ కొట్టిన బస్సు.. బాలుడు మృతి
RTC | ఢీ కొట్టిన బస్సు.. బాలుడు మృతి RTC | నెల్లూరు
Eklaspur |అభివృద్ధి చేసి చూపిస్తా..
Eklaspur | అభివృద్ధి చేసి చూపిస్తా.. Eklaspur, మంథని, ఆంధ్రప్రభ : మంథని
B.b.raj Pally |నిరంతరం కృషి చేస్తా..
B.b.raj Pally | నిరంతరం కృషి చేస్తా.. B.b.raj Pally, గొల్లపల్లి, ఆంధ్రప్రభ
Pamireddypally |అభివృద్ధికి పట్టం కట్టండి..
Pamireddypally | అభివృద్ధికి పట్టం కట్టండి.. Pamireddypally, పెద్దమందడి, ఆంధ్రప్రభ : మండల
Kasna Thanda |అభివృద్ధి చేస్తా..
Kasna Thanda | అభివృద్ధి చేస్తా.. Kasna Thanda, నెల్లికుదురు, ఆంధ్రప్రభ :
స్టార్ హీరో కార్తి నటిస్తున్న మూవీ ‘అన్నగారు వస్తారు’ ఈ నెల 12న వరల్డ్ వైడ్గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ‘అన్నగారు వస్తారు’ చిత్రం నుంచి ’అలాపిక్కే ఉమ్మక్’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ను సంతోష్ నారాయణన్ ట్రెండీ ట్యూన్తో కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించి పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - ‘వలయ అహ్ కలయ, గోలయ్య, జై బాలయ్య, కలలే వలరా, గురువా నా మాటే వినరా..’ అంటూ కార్తి ఎనర్జిటిక్ స్టెప్స్తో ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్ రోడ్లకు అంతర్జాతీయ దిగ్గజాల పేర్లు: ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్
హైదరాబాద్: తెలంగాణను గ్లోబల్ మ్యాప్లో మరింత ప్రముఖంగా నిలపడానికి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు, దిగ్గజ టెక్ కంపెనీల పేర్లను హైదరాబాద్లోని ప్రధాన రహదారులకు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా, యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ’ (Donald Trump Avenue), ప్రముఖ రోడ్లకు ‘గూగుల్ స్ట్రీట్’ (Google Street) వంటి పేర్లను పెట్టాలని సంకల్పించారు. తెలంగాణ రైజింగ్ […] The post హైదరాబాద్ రోడ్లకు అంతర్జాతీయ దిగ్గజాల పేర్లు: ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్ appeared first on Dear Urban .
Padmajiwadi |అభివృద్ధి ధ్యేయం..
Padmajiwadi | అభివృద్ధి ధ్యేయం.. Padmajiwadi, సదాశివనగర్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధిలో
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್:ಸಕಲೇಶಪುರದಲ್ಲಿ ಕಾಡಾನೆಗಳ ದಂಡು ಎಂದು ಅಸ್ಸಾಂನ ವೀಡಿಯೊ ಹಂಚಿಕೆ
ಸಕಲೇಶಪುರದಲ್ಲಿ ಕಾಡಾನೆಗಳ ದಂಡು ಎಂದು ಅಸ್ಸಾಂನ ವೀಡಿಯೊ ಹಂಚಿಕೆ
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేస్తోంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఓజి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవన్ నుంచి ఈ సినిమా వస్తుండగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ని ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై లేటెస్ట్గా పవన్ ఎనర్జిటిక్ పోస్టర్ని విడుదల చేసి ఈ సాంగ్ తాలూకా ప్రోమోని డిసెంబర్ 9న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనితో ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాలిడ్ డాన్స్ నెంబర్ని పవన్ నుంచి వారు ఆశిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను సమ్ థింగ్ కంపోజ్ చేశాడట. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వచ్చే ఏడాదిలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు.
Gold Price Today : బంగారం, వెండిని ఇక మర్చిపోండి.. మీరు కొనలేరంతే
ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025: తొలి రోజు షెడ్యూల్
హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్తును రూపుదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 (Telangana Rising Global Summit) ఈరోజు, డిసెంబర్ 8న ప్రారంభమవుతుంది. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు ఫ్యూచర్ సిటీ వేదిక అవుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల దిగ్గజాలు పాల్గొంటారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Telangana […] The post తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025: తొలి రోజు షెడ్యూల్ appeared first on Dear Urban .
దుండిగల్ లో బైకును ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బైకును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా లారీని దుండిగల్ పిఎస్ కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Earth Quake In Nepal : నేపాల్ లో భూకంపం
Earth Quake in Nepal : నేపాల్ లో భూకంపం హిమాలయాల్లో అలజడి
IndiGo : దిగి వచ్చిన ఇండిగో.. ప్రయాణికులకు 610 కోట్ల చెల్లింపు
ఇండిగో ప్రయాణికుల ఖాతాల్లోకి రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు టికెట్ డబ్బులను చెల్లించింది
Hyderabad : హైదరాబాద్ లో మూడు విమానాలకు బాంబు బెదిరింపు
హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి
Tangutoor |ఆదర్శ గ్రామంగా నిలబెడతా..
Tangutoor | ఆదర్శ గ్రామంగా నిలబెడతా.. Tangutoor, శంకర్ పల్లి, ఆంధ్రప్రభ :
Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
Shankarpalli |స్పీడు పెంచిన రవి నాయక్..
Shankarpalli | స్పీడు పెంచిన రవి నాయక్.. Shankarpalli, ఆంధ్రప్రభ : శంకర్
Aamir Khan about Falling in Love at 60
Bollywood Superstar Aamir Khan has been in news majorly in the recent times because of his private life. After parting ways with his wife Kiran Rao, Aamir Khan has introduced his girlfriend Gauri Spratt and everytime, the duo is spotted together in public, the videos and pictures went viral. During a recent interaction, Aamir Khan […] The post Aamir Khan about Falling in Love at 60 appeared first on Telugu360 .
Bigg Boss Telugu 9: Fun, Games and a Shocking Elimination as Rithu Leaves
The Sunday episode delivered a blend of laughter, light-hearted games and an unexpected eviction that stunned both housemates and viewers. With only a few days left for the finale, every eviction shifts the dynamics, and this week’s ouster was one of the most surprising of the season. Rithu’s Maths Clip Sets a Fun Tone Nagarjuna […] The post Bigg Boss Telugu 9: Fun, Games and a Shocking Elimination as Rithu Leaves appeared first on Telugu360 .
Hyderabad May Soon Host Roads Named After Global Icons and Tech Giants
The Telangana government is preparing an ambitious plan to rename several key roads in Hyderabad after globally influential personalities and world-renowned companies. The initiative aims to give the city greater international visibility while honouring leaders and organisations that have shaped modern industry and global relations. One of the major proposals is to name the 100-metre […] The post Hyderabad May Soon Host Roads Named After Global Icons and Tech Giants appeared first on Telugu360 .
BRS | ఆదర్శ గ్రామం చేస్తా.. BRS, నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు
శంషాబాద్ విమానాశ్రయంలో మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కేరళలోని కన్నూర్ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్ లైన్స్, ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్, లండన్-హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ కాగానే అధికారులు తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతి స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రయాణికులను సురక్షితంగా దింపి ఐసోలేషన్కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Khanapur | ప్రజలే ప్రచారం.. Khanapur, మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం
Tirumala : తిరుమలలో ఈరోజు వెళ్లే వారికి గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಲಾರೆನ್ಸ್ ಬಿಷ್ಣೋಯ್ ಜಾಮೀನಿನ ಮೇಲೆ ಜೈಲಿನಿಂದ ಹೊರಬರುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು 2020ರ ವಿಡಿಯೊ ಹಂಚಿಕೆ
ಲಾರೆನ್ಸ್ ಬಿಷ್ಣೋಯ್ ಜಾಮೀನಿನ ಮೇಲೆ ಜೈಲಿನಿಂದ ಹೊರಬರುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು 2020ರ ವಿಡಿಯೊ ಹಂಚಿಕೆ
Komatireddy |అమ్మలా అందుబాటులో ఉంటా..
Komatireddy | అమ్మలా అందుబాటులో ఉంటా.. Komatireddy, రామన్నపేట, ఆంధ్రప్రభ : అమ్మలా
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం మల్టీ ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. తన 47వ చిత్రం కోసం ‘ఆవేశం’ ఫేమ్ మలయాళ ఫిల్మ్ మేకర్ జితు మాధవన్తో కలిసి పనిచేయబోతున్నాడు. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా నస్లెన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. జఘరమ్ స్టూడియోస్ ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తోంది. ‘సూర్య47’ చెన్నైలో సాంప్రదాయ పూజా కార్యక్రమంతో అధికారికంగా లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలో చిత్ర తారాగణం, సిబ్బంది, పరిశ్రమ నుండి అనేక మంది శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈ వేడుకకు చిత్ర నిర్మాత జ్యోతిక, నటుడు కార్తీ, రాజశేఖర్ పాండియన్. నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాశ్, ఎస్ఆర్ ప్రభు (డ్రీమ్ వారియర్ పిక్చర్స్) వంటి విశిష్ట అతిథులు హాజరయ్యారు, వీరందరూ సినిమా విజయానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పూజ తర్వాత, చిత్రీకరణను ప్రారంభించారు, అధికారికంగా మొదటి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది.
AP N NGO |నూతన కార్యవర్గం ఎన్నిక..
AP N NGO | నూతన కార్యవర్గం ఎన్నిక.. APN NGO, చల్లపల్లి,
Telangana : రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు
Christmas |సెమీ క్రిస్మస్ వేడుకల్లో..
Christmas | సెమీ క్రిస్మస్ వేడుకల్లో.. Christmas, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ
Hyderabad : నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది.
Teacher | గుండె పోటుతో మృతి.. Teacher, కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు
Congress |ఆసక్తికరంగా.. గొల్లపూడి రాజకీయం..
Congress | ఆసక్తికరంగా.. గొల్లపూడి రాజకీయం.. Congress, వైరా, ఆంధ్రప్రభ : కాంగ్రెస్
నేడు, రేపు గ్లోబల్ సమ్మిట్ భారత్ ఫ్యూచర్ సిటీ ముస్తాబు నేడు మధ్యాహ్నం సమ్మిట్ను లాంఛనంగా ప్రారంభించనున్నగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2:30 గంటలకు సిఎం రేవంత్తో పాటు ఆర్థిక, పారిశ్రామికవేత్తల ప్రసంగాలు సదస్సుకు 154మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 2వేల మంది అతిథులు, ప్రముఖులు వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు 3లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడమే లక్షం ఇప్పటికే 50 కంపెనీల సంసిద్ధత విజన్2047 డాక్యుమెంట్ ఆవిష్కరించనున్న ప్రభుత్వం 10వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత, సిసిటివిల నిఘా మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రై జింగ్ గ్లోబల్ సమ్మిట్కు భారత్ ఫ్యూచర్ సిటీ ముస్తాబైంది. తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించ టం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యం గా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సి ద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వం భారత్ ఫ్యూ చర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే 46మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. సోమవారం మధ్నాహ్నం ఒ కటిన్నరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనం గా సమ్మిట్ను ప్రారంభిస్తారు. 9వ తేదీ సా.6 గంటలకు సమ్మిట్ ముగియనుంది. సుమారు రెండువేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారం భ వేడుకకు హాజరవుతున్నారు. సమ్మిట్లో వివి ధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్ర్కైడర్, వరల్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా, తదితరులు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వంవైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యా లు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఆహుతులకు వివరిస్తారు. రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెష న్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్ధం చేశారు. వంద ఎకరాల్లో ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి కాగా, మొత్తం 500 ఎకరా ల భూమిని ఈ సమ్మిట్ కోసం వినియోగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం సమ్మిట్ ప్రారం భం కానుండగా ఆదివారం మంత్రులు, అధికారులు అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం సాయంత్రం నుంచి ప్రతినిధులు బస చేసే ప్రదేశాలు, వారు ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గాల్లో రిహార్సల్ను నిర్వహించారు. అతిథులు హైదరాబాద్కు వచ్చినప్పటి నుంచి వారు బస చేసిన ప్రదేశాలు, ఫ్యూచర్ సిటీకి వెళ్లే రహదారుల్లో పూర్తిగా సిసి కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల నుంచి 2వేల మందికి పైగా ప్రముఖులు, ప్రతినిధులు, పలు దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీల చైర్మన్లు, ఎండిలు, సీఈఓలు, మంత్రులు, అధికారులు, వివిధ రంగాల నిపుణులు హాజరవుతుండడంతో ప్రభుత్వం పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సు నిర్వహణ కోసం 20 రోజు ల నుంచి ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. రాను న్న 22 ఏళ్లలో రాష్ట్రంలో ఏం సాధిస్తామన్న విషయాన్ని తెలియచేయడమే ఈ సమ్మిట్ ఉద్ధేశ్యమని అధికారులు పేర్కొంటున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి 500ల నుంచి -600 మంది విఐపిలతో పాటు 1,500ల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్లో మొత్తం నాలుగు వేదికలపై చర్చలు జరుగనుండగా, రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన స్టాళ్ల ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. 50 కంపెనీలు, రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులకు 50 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 14 కంపెనీలకు ప్రభుత్వం తరపున లక్ష కోట్ల పెట్టుబడులపై అవగాహన కల్పించగా, తా జాగా మరో 36 సంస్థలతో అధికారులు పెట్టుబడులకు సం బంధించి జరిపిన చర్చలు కొలిక్కివచ్చాయి. ఈ సమ్మిట్లో మొత్తంగా రూ.3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రకటనలన్నీ కూడా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్భంగా వెలువడనున్నాయి. రైజింగ్ సమ్మిట్ను ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడుల కోసం ఉన్న అపారమైన అవకాశాల గురించి కంపెనీల ప్రతినిధులకు వివరించేందుకు భవిష్యత్, అభివృద్ధి, సంక్షేమ ప్రణాళిక విజన్ 2047ను ఆవిష్కరించే లక్షంతో సమ్మిట్ను ఏర్పాటుచేశారు. వంతారాకు 200 ఎకరాలు.. సెంబ్కార్ప్కు 1,000 ఎకరాలు రిలయన్స్ సంస్థకు చెందిన వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి 200ఎకరాలను ఫోర్త్ సిటీలోని ముచ్చర్లలో కేటాయించనున్నారు. ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వస్తే వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, అనుబంద ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. మరోవైపు సింగపూర్కు చెందిన సెంబ్కార్ప్ సంస్థ తమకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని కోరింది. ఈ వెయ్యి ఎకరాల్లో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టే బాధ్యత తీసుకుంటామని ప్రతిపాదించింది. వియత్నాంకు చెందిన విన్గ్రూప్ కూడా తామే ఒక సమీకృత పారిశ్రామిక పార్కును ఏర్పాటుచేసి అందులో తమ కంపెనీతో పాటు ఇతర సంస్థలు, అనుబంధ సంస్థలను కూడా తీసుకొస్తామని చెప్పింది. ప్రధాన వేదిక వద్ద వీడియో టన్నెల్ ప్రతి చోటా డిజిటల్ స్క్రీన్లు, అందమైన లాన్లు, రకరకాల పూలమొక్కలతో ఆకర్షణీయంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. ప్రధాన వేదిక వద్ద వీడియో టన్నెల్ ఏర్పాటు చేయడంతో పాటు టన్నెల్లోకి ప్రవేశిస్తుండగా ఇరు వైపులా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రారంభ వేదికపై 2వేల మందికి పైగా ప్రతినిధులు కూర్చునే లా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన అధికారులు 22 ప్రభు త్వ శాఖల స్టాళ్లు, ప్రైవేటు సంస్థల స్టాళ్లను కూడా ఏర్పా టు చేశారు. 8,9వ తేదీల్లో సమ్మిట్ జరుగనుండగా 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సాధారణ ప్రజలు ఎగ్జిబిషన్ను వీక్షించడానికి అనుమతిస్తారు. కంట్రోల్ రూంతో సిసి కెమెరాల అనుసంధానం సమ్మిట్కు హాజరవుతున్న ప్రతినిధుల కోసం పోలీసుశాఖ ప్ర త్యేక దృష్టి సారించింది. ఈ ప్రదేశంలో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. వివిధ దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు బస చేస్తున్న హోటళ్లు, అతిథిగృహాల వద్ద సాయుధ పోలీసు బలగాలను ఏర్పాటు చేసింది. కేవలం ఫ్యూచర్ సిటీలోనే వె య్యికి పైగా సిసి కెమెరాలను కంట్రోల్ రూంతో అనుసంధా నం చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన సీనియర్ పోలీసు అధికారులకు ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. భద్రతా విధుల్లో 10వేల మంది పోలీసులు నిమగ్నమయ్యారు. వారికి అదనంగా మరో వెయ్యి మం ది ట్రాఫిక్ పోలీసులు పనిచేయనున్నారు. ట్రాఫిక్ మార్షల్స్తో పాటు గ్రేహౌండ్స్, క్విక్ రెస్పాన్స్ టీం, తెలంగాణ ప్రత్యేక పోలీ సు బలగాలు మూడో భద్రతా వలయంలో ఉండనున్నారు. ప్రచార సామాగ్రి సిద్ధం వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిధులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్దం చేశారు. ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్ ప్రొజెక్షన్, 3డి ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్లో ఎల్ఈడీ స్క్రీన్స్తో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి. సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరి అతిధులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ముకోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాం స్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ద వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్దమయ్యాయి.
జాతి కోసం.. జనహితం కోసం తపనతో శ్రమించా
రెండేళ్ల ప్రస్థానంలో తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు అనునిత్యం ప్రయత్నించాం నవ తరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరిపోశాం రుణ భారంతో వెన్నువిరిగిన రైతుకు దన్నుగా నిలిచాం ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతునిచ్చాం గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్కు ప్రాణం పోశాం లోతైన మధనంతో తెలంగాణ మార్గదర్శక పత్రం సిద్ధం ప్రజలకు రెండేళ్ల పాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: జాతి కోసం, జనహితం కోసం, గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉం డాలి. గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంక ల్పం కావాలి. సరిగ్గా రెండేళ్ల క్రితం నాకు ఆ ధై ర్యం ఇచ్చి మీ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి నిండు మనస్సుతో ఆశీర్వదించిన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ రెండేళ్ల ప్రస్థానంలో అనునిత్యం, అహర్నిశలు అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించానని ‘ఎక్స్’ వేదికగా ఆయన తెలిపారు. గత పా లన శిథిలాల కింద కొనఊపిరితో ఉన్న నవతరాని కి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశామని పే ర్కొన్నారు. రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు ద న్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామని ఆ యన తెలిపారు. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్ధతు ఇచ్చి అదానీ, అంబానీల మాదిరిగా మహిళలను వ్యాపారరంగంలో నిలిపామన్నారు. బలహీనవర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పామన్నారు. రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు పలు పథకాలు వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశామని, చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని నమ్మి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామని, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్ధాంతంగా ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. జయ జయహే తెలంగాణ అన్న ప్రజాకవి అందెశ్రీ గేయానికి, జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చామని, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500లకే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500ల బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగు లేదు నేటి అవసరాలు తీర్చి, పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతం అని మేం సరిపెట్ట లేదని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి, ఎక్కడ ఉండాలో లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామన్నారు. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్కు మేం ప్రాణం పోశామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీ సౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత దేశ గ్రోత్ ఇంజన్గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశామని ఆయన అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని, నిన్నటి వరకు ఒక లెక్క అని, రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క అని, నిన్న, నేడు, రేపు మీ ఆశీర్వాదమే నా ఆయుధమని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. మీ ప్రేమాభిమానాలే నాకు సర్వసం అని, మీ సహకారమే నాకు సమస్తమని, తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగు లేదని, అందరికి ప్రజా పాలన రెండేళ్ల విజయోత్సవ శుభాకాంక్షలని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
చలికి వణుకుతున్న రాష్ట్రం సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్లో అత్యల్పంగా 8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రలో చలి పులి పంజా విసురుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన శీతల గాలులు వీచడం, కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు చేరుకున్నాయని, రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు వెల్లడించారు. చలి ప్రభావం ముఖ్యంగా రాత్రి, సాయంత్రం, తెల్లవారుజామన అత్యధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా పౌరులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కొమరంభీం ఆసిఫాబాద్లో 9.1, నిర్మల్ 10.5, రాజన్న సిరిసిల్ల 10.9, జగిత్యాల, సంగారెడ్డి 11.1, కామారెడ్డి 11.2, నిజామాబాద్, సిద్దిపేట 11.3, మంచిర్యాల 11.4, మెదక్ 11.5, వికారాబాద్, పెద్దపల్లి 11.8, ములుగు 12 డిగ్రీల ఉష్ణోగత్రల నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.
నైట్ క్లబ్లో అగ్నికీలలు.. 25 మంది దుర్మరణం
మృతుల్లో నలుగురు పర్యాటకులు మిగతావారంతా సిబ్బందే గోవాలో ఘోర విషాదం పనాజీ: గోవా ఉత్తరప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి ఉత్సాహంగా సాగుతున్న నృత్యకార్యక్రమం సందర్భంగా జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 25మంది మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలోని అర్పోరా వద్ద ఉన్న బిర్చ్ బై రో మియో లేన్ నైట్ క్లబ్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ప్ర మాదం జరిగింది. బయటకు వెళ్లే మార్గాలు ఇరు గ్గా ఉండడంతో బాధితులు చిక్కుకుపోయారు. ఎక్కువ మంది ఊపిరాడక చనిపోయినట్లు అగ్నిమాపక దళం అధికారి తెలిపారు. మరణించిన వారిలో నలుగురు టూరిస్ట్లు, 14మంది క్లబ్ సిబ్బంది ఉన్నారు. ఇంకా ఏడుగురిని గుర్తించవలసి ఉందని పోలీసులు తెలిపారు. క్లబ్ భవనం అనధికారికంగా నిర్మించిన కట్టడం. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినా పట్టించుకోకుండా క్లబ్ నిర్వహణకు అనుమతినిచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హెచ్చరించారు. క్లబ్ మొదటి అంతస్తులో మొదట మంటలు చెలరేగాయని, రద్దీ, బయటుకు వెళ్లే తలుపులు చిన్నగా ఉండడంతో బాధితులు బయటకు వెళ్లలేకపోయారని ప్రాథమిక విచారణలో తేలింది. కొందరు గ్రౌండ్ ఫ్లోర్ కి పరిగెత్తుకువెళ్లినా అక్కడ చిక్కుకు పోయారని ముఖ్యమంత్రి సావంత్ తెలిపారు. నైట్ క్లబ్ య జమాని, జనరల్ మేనేజర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేస్తామని సీఎం తెలిపారు. క్లబ్ య జమానితో పాటు, నిబంధనలు ఉల్లంఘించినా, క్లబ్ నిర్వహణకు అనుమతినిచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపా రు. టూరిస్ట్ సీజన్ సమయంలో ఇలాంటి సం ఘటన జరగడం దురదృష్టకరమని ముఖ్యమం త్రి తెలిపారు. మెజిస్టేట్ ఎంక్వయిరీకి ఆదేశించి దోషులను శిక్షిస్తామన్నారు. క్లబ్లో జరిగిన ప్ర మాదంలో పలువురి మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని మోదీ దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. క్లబ్ను సౌరవ్ లూ త్రా నడుపుతున్నారని అర్పోరా- నాగో వా పంచాయతి సర్పంచ్ రోషన్ రెడ్కర్ తెలిపారు. క్లబ్ నిర్మాణానికి అనుమతి లేదని, కూల్చివేతకు పంచాయతీ నోటీసులు జారీ చేసినా పంచాయతీ డైరెక్టరేట్ అధికారులు ఆ నోటీసులను నిలిపివేశారని సర్పంచ్ రెడ్కర్ చెప్పారు. నైట్ క్లబ్ యజామూనులపై కేసు, సర్పంచ్ నిర్బంధం గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ యజమానులు సౌరభ్ లూత్రా తో పాటు, క్లబ్ మేనేజర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్లబ్ కు గతంలో అనుమతిచ్చిన అర్పొరా- నాగోవా పంచాయతి సర్పంచ్ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడం, బయటకు వెళ్లే మార్గం ఇరుగ్గా ఉండడం, డాన్స్ వేదిక వద్ద భారీ రద్దీ కారణంగా క్లబ్ ప్రాణాంతకంగా మారింది.
విచ్చుకుంటున్న లోహ విహంగాల రెక్కలు
1,650 ఇండిగో విమానాల రాకపోకలు క్రమంగా కుదుటపడుతున్న ప్రయాణాలు విమానాలు రద్దయిన ప్రయాణికులకు రూ.610 కోట్ల రిఫండ్ శంషాబాద్లో కొనసాగిన సంక్షోభం, 126 సర్వీసులు రద్దు న్యూఢిల్లీ: దేశవ్యాప్ంతగా ఇండిగో విమానాల ప్రయాణాలు క్రమేపీ కుదుటపడుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దుతున్నామని సంస్థ సిఇఒ పీటర్ ఎల్బర్స్ చెప్పారు. దశలవారీగా మేం తిరిగి సవ్యమైన పరిస్థితికి చేరుకుంటున్నామని ఆయన ఆదివారం తెలిపారు. దేశంలో అత్యధిక విమానాల నిర్వహణ సంస్థ ఇండిగో ద్వారా ప్రతిరోజూ సాధారణంగా 2,300 విమానాలు నిర్వహిస్తారు. అయితే కొద్దిరోజులుగా పలు విమానాలు రద్దయ్యాయి. వందలాది విమానాల నిలిపివేతతో ప్రధాన విమానాశ్రయాలలో ప్రయాణికులు నానా అగచాట్లకు గురయ్యారు. తాము పెద్ద ఎత్తున చేపట్టిన దిద్దుబాటు చర్యలతో ఆదివారం సాయంత్రానికి దాదాపు 1,650 విమానాలను నడిపించినట్లు సిఒఒ తెలిపారు. ఆయన సిబ్బందికి అంతర్గత సందేశం లో ఈ విషయం తెలిపారు. ఆదివారం నిర్వహణ సామర్థం (ఒటిపి)75 శాతానికి చేరుకుందని వివరించారు. ఆదివారం మొత్తం 138 రూట్లలో 137 వరకూ సజావుగా ప్రయాణాలు సాగాయని వివరించారు. ఇక పరిస్థితిని బట్టి ముందుగా కొన్ని విమానాల కాన్సిల్ గురించి సకాలంలో తెలియచేయడం జరుగుతుంది. దీని వల్ల విమానాశ్రయాలలో రద్దీ , ప్రయాణికుల పడిగాపులు ఉండకుండా ఏర్పాట్లు జరిగాయి.ఇప్పటివరకూ ఇండిగో విమాన జాప్యం, రద్దు పరిణామాలతో ప్రయాణికులకు రిఫండ్ వేగవంతం అయింది. ఇప్పటివరకూ మొత్తం మీద రూ 610 కోట్ల వరకూ చెల్లింపులు జరిగాయి. ఇక 3వేల వరకూ బ్యాగేజ్లను దేశవ్యాప్తంగా ప్రయాణికుల చిరునామాలకు పంపించడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. టికెట్ల రిఫండ్ వేగవంతానికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఉత్తర్వులు వెలువరించింది. శంషాబాద్లో కొనసాగిన సంక్షోభం.. 126 సర్వీసుల రద్దు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)లో ఇండిగో విమానాల రద్దు పరంపర ఆదివారం కొనసాగింది. ఆదివారం ఏకంగా 126 సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఆదివారం రద్దయిన విమానాల్లో 66 శంషాబాద్ నుండి వెళ్లేవి కాగా, 60 రావాల్సిన విమానాలు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు రద్దు చేసిన మొత్తం ఇండిగో విమానాల సంఖ్య 519కి చేరుకుంది. సర్వీసుల రద్దు క్రమంగా తగ్గుతాయని ఇండిగో పేర్కొన్నప్పటికీ, త్వరలో ప్రయాణ ప్రణాళికలు ఉన్న ప్రయాణికులు తమ విమానాలు నడుస్తాయో లేదో అని ఖచ్చితంగా తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాల రద్దుతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇండిగో కౌంటర్ల వద్ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సె క్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) అదనపు భద్రతను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, విశాఖపట్నం, గోవా వంటి కీలక మార్గాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా, విశాఖపట్నం విమానాశ్రయంలో పది ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. తమ వ్యవస్థను పునరుద్దరించేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నామని, త్వరలోనే షెడ్యూళ్లను సాధారణ స్థితికి తీసుకొస్తామని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
Allu Arjun |ఆ ఆరుగురిలో నెక్ట్స్ ఎవరితో..?
Allu Arjun | ఆ ఆరుగురిలో నెక్ట్స్ ఎవరితో..? Allu Arjun, ఆంధ్రప్రభ
టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు!
విశాఖపట్నం: సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమిండియా 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో ఘోర పరాజయం పాలైన భారత్కు వన్డేల్లో గెలుపు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. రానున్న టి20 సిరీస్లోమరింత మెరుగ్గా బరిలోకి దిగేందుకు ఇది దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పరుగుల వరద పారిన సిరీస్లో ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. టీమిండియా సీనియర్ బౌలర్ విరాట్ కోహ్లి వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు బాదాడు. అంతేగాక విశాఖలో జరిగిన మూడో మ్యాచ్లో అజేయ అర్ధ సెంచరీతో అలరించాడు. మరో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా సిరీస్లో అత్యంత నిలకడైన బ్యాటింగ్ను కనబరిచాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలకమైన మూడో మ్యాచ్లో సెంచరీతో చెలరేగి పోయాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా రెండు మ్యాచుల్లో అర్ధ సెంచరీలతోఆకట్టుకున్నాడు. ఇక సీనియర్లు రోహిత్, కోహ్లిల బ్యాటింగ్ను ఎంత పొగిడినా తక్కువే. ఇద్దరు అసాధారణ బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సఫారీ సిరీస్లో రాణించడం ద్వారా సీనియర్లు జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అంతేగాక వచ్చే వరల్డ్కప్ టీమ్లో చోటు సంపాదించేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
ఆరు గ్యారంటీలు గల్లంతు అమలయ్యింది ఉచిత బస్సు, సన్నబియ్యం మాత్రమే దమ్ముంటే హామీల అమలుపై చర్చకు రావాలి అవినీతిలో బిఆర్ఎస్, కాంగ్రెస్ దొందూదొందే బిజెపి మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధ్వజం రైజింగ్ కాదు.. సింకింగ్ తెలంగాణ:ఎంపి లక్ష్మణ్ కాంగ్రెస్ సైతం భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు ధారాదత్తం చేస్తోంది: రాంచందర్ రావు మన తెలంగాణ/విద్యానగర్: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉత్సవాలు జరుపుకుంటుండగా, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, 420 హామీలతో ప్రజలను మాయ చేశారని బిజెపి నేతలు మండిపడుతూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీ జేపీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్లమెంటు సభ్యులు డా క్టర్ కె.లక్ష్మణ్, డి.కె.అరుణ, మాజీ ఎంపీ సుధాక ర్రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పలువురు రాష్ట్ర నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రెండేళ్ల పాలనా తప్పిదాలు, హామీల వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వంపై చార్జీ షీట్ విడుదల చేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట తప్పి ఉత్సవాలు చేయడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలే అని, ప్రజలను మోసం చేసే పార్టీలు అని ఆరోపించారు. నిజంగా చెప్పింది చేశామన్న నమ్మకం, దైర్యం ఉంటే హామీల అమలుపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను బీఆర్ఎస్పదేండ్ల పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చిందనీ, తెలంగాణ ప్రజలపై కుటుంబ పాలనను రుద్దిందనీ చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయనీ, ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజలంతా పోరాటం చేసి తెచ్చుకున్న రాష్ట్రం కేసీఆర్ నియంత పాలనతో ఆయన కుటుంబం చేతిలో బందీగా మారిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనతో విసిగి పోయిన ప్రజలు మార్పుకోసం, అనేక రకాల హామీలు, అభయహస్తాలను నమ్మి కాంగ్రెస్ పార్టీనీ గెలిపించారని పేర్కొన్నారు. కానీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పాలకులు ప్రజలను మళ్ళీ మోసం చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజా పాలన పేరుతో ఉత్సవాలు చేయడాన్ని తప్పుపట్టిన కిషన్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళుతున్నారని నిలదీశారు. ఇచ్చిన హామీలు ఎన్ని? మీరు అమలు చేసిన పథకాలెన్ని అని ప్రశ్నించారు. ఒక్క ఫ్రీబస్సు, ఇంకోటి సన్నబియ్యం తప్ప మరేం చేశారో చెప్పాలన్నారు. రేవంత్ సర్కారు ఇస్తున్నామంటున్న ప్రతి కిలో సన్నబియ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వాటా 43 రూపాయలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 13 రూపాయలు మాత్రమే ఇస్తున్నదనీ తెలిపారు. మీ రెండేండ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పండి, ఏ రంగంలో మీరు చెప్పిన మార్పు వచ్చిందో చెప్పాలని రేవంత్ రెడ్డినీ ప్రశ్నించారు. కేసీఆర్ పోయి రేవంత్, గులాబీ జెండా పోయి, కాంగ్రెస్ జెండా వచ్చిందనీ, పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. చివరకు పార్టీ ఫిరాయింపుల్లోను మార్పు లేదని, వైఎస్సార్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారనీ, కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారనీ, తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారనీ వాపోయారు. రైతులు, నిరుద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ఉద్యోగులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు అమలు ఏమయ్యాయని ప్రశ్నించిన కేంద్రమంత్రి ఇచ్చిన హామీలపై ఇందిరా పార్క్ వేదికగా చర్చకు వస్తారా లేదంటే ప్రజాభవన్, ప్రెస్ క్లబ్ లో చర్చకు వస్తారా అని సవాల్ చేశారు? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బిజెపి పోరాటం కొనసాగుతుందన్నారు. భూములను వేలం వేసే పాలసీతో ముందుకు సాగుతోందనీ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఘోరమే ఇండస్ట్రియల్ భూములను భారీ స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం అని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ప్రైవేట్ భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు దారాదత్తం చేస్తోందనీ మండి పడ్డారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. విద్యార్థుల ఫీజులు,ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకపోగా, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదనీ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి ఏమైందనీ, పదిహేను వేల రైతు భరోసాను ఎప్పుడూ ఇస్తారని ప్రశ్నించారు. ఎంపీ డి. కె అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు ఒరిగింది శూన్యమని చెప్పారు. రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు ఉండగా తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుందన్న సందే హాన్నీ వెలిబుచ్చారు.
ప్రధాని మోడీతో ప్రారంభం... కీలక అంశాల ప్రస్తావన న్యూఢిల్లీ ః జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవం నేపథ్యంలో లోక్సభలో సోమవారం చర్చ జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ చర్చను ప్రారంభిస్తారు. చర్చ ఆరంభ ప్రసంగంలో ప్రధాని మోడీ వందేమాతరంపై అనేక కీలక ఆసక్తికర విషయాలను, చరిత్రలో వెలుగుచూడని కోణాలను ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. గత వారం బిఎసి సమావేశంలో వందేమాతరంపై ఉభయ సభలలో వేర్వేరుగా పది గంటల పాటు చర్చను అజెండాలో ఖరారు చేశారు. ప్రధాని మోడీ తరువాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికార పక్షం తరుఫున రెండో వక్తగా ప్రసంగిస్తారు. కాంగ్రెస్ తరఫున లోక్సభలో పార్టీ ఉప నాయకులు గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ ఇతరులు మాట్లాడుతారు. మంగళవారం జరిగే చర్చలో కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. లోక్సభలో పది గంటల పాటు వందేమాతరంపై చర్చా కార్యక్రమాన్ని అధికార వర్గాలు నిర్థారించాయి. వందేమాతరంతో ముడివడి ఉన్న పలు కీలక అంశాలు ఈ చర్చ సందర్భంగా వెలుగులోకి వస్తాయని ప్రకటనలో తెలిపారు. బెంగాలీ కవి బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన గీతం ఆ తరువాత జాదూనాథ్ భట్టాచార్య సంగీత బాణిలో రూపుదిద్దుకుని , దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో స్ఫూర్తిని అందించే జాతీయ గీతంగా జనం మన్నన్నలు పొందింంది. ఈ గీతానికి 150 సంవత్సరాల వసంతం ఏడాది దశలో ఈ ఏడాది మొత్తం ఉత్సవాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాతీయ గీతంలోని కొన్ని ప్రధాన చరణాలను కాంగ్రెస్ పార్టీ 1937లో తొలిగించిందని, ఇది దేశ విభజనకు ఆద్యం పలికినట్లు అయిందని ఆరోపించారు. ఇక రాజ్యసభలో మరుసటి రోజు మంగళవారం వందేమాతరంపై పది గంటల చర్చను హోం మంత్రి అమిత్ షా ఆరంభిస్తారు. రాజ్యసభలో అధికార పక్షం నేత, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా రెండో వక్తగా ఉంటారు. ఎగువ సభలో ప్రతిపక్షాల తరుఫన చర్చను కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ఆరంభిస్తారు. సమావేశాల ఆరంభం నుంచి అత్యధిక సమయం సర్పై తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతిపక్షాల నిరసన హోరుతో ప్రతిష్టంభనల నడుమనే సాగుతూ వచ్చాయి. ఈ దశలో ఇప్పుడు సర్పై చర్చకు అంగీకారం కుదిరింది. మూడు రోజుల పాటు జరిగే వందేమాతరం చర్చలో కాంగ్రెస్ పార్టీ వక్తల జాబితా ఖరారు అయింది. దీపేందర్ హూడా, బిమోల్ అకోయిజమ్, ప్రణతి షిండే, ప్రశాంత్ పదోలే, చామల కిరణ్ రెడ్డి , జ్యోత్సా మహంత్ మాట్లాడుతారు. ఇక ఎన్నికల సంస్కరణలపై చర్చలో కాంగ్రెస్ తరఫున కెసి వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్షా గైక్వాడ్, మెహ్మద్ జావెద్, ఉజ్వల్ రామన్ సింగ్, ఇసా ఖాన్, మల్లు రవి, ఇమ్రాన్ మసూద్, జ్యోతిమణి పేర్లు ఖరారయ్యాయి.
సోమవారం రాశి ఫలాలు (08-12-2025)
మేషం మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభంలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి అందిన శుభవార్తలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. వృషభం వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. మిధునం ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. బందు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కర్కాటకం నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. బంధువర్గం నుండి విలువైన సమాచారం అందుతుంది. సింహం కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కన్య వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అధికారులతో సఖ్యత కలుగుతుంది. కుటుంబ పెద్దల నుండి అవసరానికి ధనసహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. తుల వ్యాపారాల విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి ఉపశమనం కలుగుతుంది. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృశ్చికం సహోద్యోగులతో మాటపట్టింపులు తొలగుతాయి. ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనస్సు విందువినోదాలు కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. మకరం కుటుంబమునకు కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. కుంభం వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి,వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీనం వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగమున అధికారులతో వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.
ములకలూరులో వ్యక్తి దారుణ హత్య…
నరసరావుపేట (పల్నాడు జిల్లా) ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు
ఆంధ్రప్రభ విజయవాడ : వారాంతపు సెలవులు, పెరిగిన భవానీళ్లు స్వాముల రాకతో ఇంద్రకీలాద్రి
విజయవాడ, ఆంధ్రప్రభ : టూ వీలర్స్ మెకానిక్స్ వాహనాల తయారీలో వస్తున్న సాంకేతికను
ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా : ఎన్టీఆర్ జిల్ల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్
సముద్రాల అభివృద్ధి కోసం.. సర్పంచ్గా ఒక అవకాశం ఇవ్వండి
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : మన సముద్రాల గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్గా
యాషెస్ సిరీస్.. ఆస్ట్రేలియా ఘన విజయం
బ్రిస్బేన్: ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం సాధించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో ఐదుమ్యాచ్ల సిరీస్లో 20 ఆధిక్యాన్ని అందుకుంది. 134/6తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ను తిరిగి ఆరంభించిన ఇంగ్లండ్ 241 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (50), విల్జాక్స్ (41) ఏడో వికెట్కు 96 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ ఆ మాత్రమైన స్కోరును సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నీసర్ ఐదు, స్టార్క్ రెండు వికెట్లను పడగొట్టారు.ఇక 65 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్టీవ్ స్మిత్ 23 (నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 334 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 511 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియాకు 177 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
గ్లోబల్ సమ్మిట్ను స్వాగతిస్తున్నాం : బిజెపి చీఫ్
మన తెలంగాణ/హైదరాబాద్: గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తు న్నామని బిజెపి చీఫ్ ఎన్.రామచంద్రరావు అన్నారు. సోమవారం గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని, తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాలని బిజెపి పార్టీ ఆకాంక్షిస్తుందని వెల్లడించారు. వికసిత్ భారత్ -2047 లక్ష్యంగా మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను కేంద్రం రూపొం దిస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తోందన్నారు.
ఉట్నూర్, (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దేవుడా సమీపంలోని కలవాటు
గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కాలేకపోతున్నా: ఖర్గే
మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలు, ముందస్తుగా షెడ్యూల్ చేయబడిన కార్యక్రమాల నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 కు హాజరు కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 విజయవంతం కావాలని ఖర్గే ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖర్గే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఖానాపూర్ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాభివృద్ధే లక్ష్యంగా
శాసనసభలో తీవ్రమైన లోపాలున్నాయి.. స్పీకర్ కు హరీష్ రావు లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ టి. హరీష్రావు బహిరంగ లేఖ రాశారు. గడిచిన రెండేళ్లుగా శాసనసభలో తీవ్రమైన లోపాలు జరుగుతున్నాయని, ఇది శాసనసభ రాజ్యాంగబద్ధమైన విశ్వసనీయతను దెబ్బతీస్తోందని ఆరోపించారు. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎంఎల్ఎలపై అనర్హత వేటు వేయడంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై హరీష్ రావు తన లేఖలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఎలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైన విషయమని అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ (ఫిరాయింపుల నిరోధక) నిబంధనలు-1986, ముఖ్యంగా రూల్స్ 3 నుండి 7 ప్రకారం.. విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా.. తీసుకోకపోవడం శోచనీయం అని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) కు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు చేసిన తీవ్ర హెచ్చరికలను ఆయన గుర్తుచేశారు. గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన కైశం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, ఆ తీర్పును పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లుగా సభా కమిటీలను ఏర్పాటు చేయకపోవడం, డిప్యూటీ స్పీకర్ నియామకం చేపట్టకపోవడం వల్ల ప్రివిలేజ్ కమిటీ వంటివి పనిచేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ పనిదినాలు గణనీయంగా తగ్గిపోయాయని, ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకు సరైన అవకాశం ఇవ్వడం లేదని, అన్స్టార్డ్ ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు రావడం లేదని పేర్కొన్నారు. ఈ లోపాలను సరిదిద్దేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ హరీష్ రావు పలు డిమాండ్లు చేశారు. ఏడాదికి కనీసం 30 రోజులు సభను నిర్వహించాలని, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలని, అన్-స్టార్డ్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని, ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలని, సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టం తోపాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని హరీష్రావు డిమాండ్ చేశారు. ఈ లేఖ ప్రతిని శాసనసభా వ్యవహారాల మంత్రికి కూడా పంపించారు.
జాతీయ రహదారిపై కూలిన జాతర ఆహ్వాన తోరణం
మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణం నల్లజానమ్మ దేవాలయం సమీపంలో జాతీయ రహదారి
మంథని, ఆంధ్రప్రభ : బ్యాట్ గుర్తుకు ఓటు వేసి, మీ సేవ చేసేందుకు
దస్తురాబాద్, ఆంధ్రప్రభ : ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే సర్పంచ్ పదవికి పోటీ
Adilabad |వామ్మో.. కోల్డ్ వేవ్..
Adilabad | వామ్మో.. కోల్డ్ వేవ్.. ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో :
తిమ్మాపూర్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా
ధర్మపురి, ఆంధ్రప్రభ : తిమ్మాపూర్ గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ
ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలి
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు అన్ని రాజకీయ
’అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు ప్రదానం చేసిన ఉడిపి పీఠాధిపతి పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ చేతుల మీదుగా సత్కారం రాష్ట్ర ప్రయోజనాల కోసమే 21 స్థానాల్లో పోటీ చేశానన్న పవన్ భగవద్గీత ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శి అని వ్యాఖ్య ధర్మ స్థాపనకే తన రాజకీయ ప్రస్థానమని స్పష్టీకరణ మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉడిపిలో ఆయనకు ’అభినవ కృష్ణ దేవరాయ’ అనే బిరుదును ప్రదానం చేశారు. కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహ త్ గీతోత్సవ కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈ బిరుదును పవన్ కు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లా డుతూ భగవద్గీత ప్రాముఖ్యత, ధర్మం, తన రాజకీయ ప్రయాణం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి తాను డిప్యూటీ సిఎంగానో, ప్రజాసేవకుడిగానో రాలేదని, ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని స్పష్టం చేశారు. సరైన పాలన, సేవ, బాధ్యతలతో కూడిన ప్రతి చర్యే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎపి ఎన్నికలకు ముందు తాను కూడా అర్జునుడిలాంటి సందిగ్ధతను ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని, ధర్మాన్ని అనుసరించే కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యానని వివరించారు. భగవద్గీత అనేది కేవలం ఒకసారి చదివి, ఎర్ర వస్త్రంలో చుట్టి పూజాగదిలో పెట్టే గ్రంథం కాదన్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి నిర్ణయంలో, ప్రతి గందరగోళంలో, ప్రతి అంతర్గత పోరాటంలో గీత మనతోనే నడుస్తుందని, మన కురుక్షేత్రాల్లో స్థిరమైన తోడుగా నిలుస్తుందని తెలిపారు. నేటి తరం యువత నిరంతరం సమాచార వెల్లువ, కెరీర్ ఒత్తిడి, గుర్తింపు సంక్షోభం, వైఫల్య భయాలు వంటి ఆధునిక కురుక్షేత్రాలను ఎదుర్కొంటోందని, వారికి అత్యంత అవసరమైన మానసిక బలం, భావోద్వేగ నిలకడను గీత అందిస్తుందని అభిప్రాయపడ్డారు. మన కర్మభూమి ఎన్నో దండయాత్రలను తట్టుకుని నిలబడింది ఆయుధాలు లేదా సంపదతో కాదని, ధర్మాన్ని సజీవంగా ఉంచిన గ్రంథాలు, సంప్రదాయాలు, సాధువులు, పవిత్ర సంస్థల వల్లేనని ఉద్ఘాటించారు. ఐన్స్టీన్ నుంచి ఓపెన్హైమర్ వరకు ఎందరో ప్రపంచ మేధావుల ఆలోచనలను గీత శతాబ్దాలుగా ప్రభావితం చేస్తోందని గుర్తు చేశారు. ఉడిపి వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు సమావేశమైనప్పుడు ’వసుధైక కుటుంబం’ అనే ప్రాచీన భారతీయ దార్శని కతకు జీవం పోస్తారని, ఇదే నేడు ప్రపంచానికి భారత్ అందిస్తున్న సందేశమని వెల్లడించారు. జగద్గురు మధ్వాచార్యుల శాశ్వత వార సత్వం ద్వారా మన ఆధ్యాత్మిక సంపదను కాపాడిన వారిని స్మరించుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
దస్తురాబాద్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా తీసుకుని రేవోజిపేట గ్రామ
ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుంది..
రేగొండ, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను
సరస్వతి విద్యానికేతన్ లో సైన్స్ ఫెయిర్
కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని సరస్వతి విద్యానికేతన్ హైస్కూల్లో సైన్స్ ఫెయిర్ అట్టహాసంగా
415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం..
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 44 గ్రామాలు, నల్గొండ, నిజామాబాద్లలో ఒక్కో జిల్లాలో 38 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మొత్తం 9,331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో దశలో 4,332 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 38,322 వార్డు స్థానాలకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించారు. అందులో శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, 4,236 సర్పంచ్ స్థానాలకు 415 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 38,322 వార్డు స్థానాలకు 8,304 స్థానాలు ఏకగ్రీవంగా అయ్యాయి. సర్పంచ్ స్థానాలకు మొత్తం 13,128 మంది అభ్యర్థులు పోటీలు నిలువగా, వార్డు స్థానాలకు 78,158 మంది పోటీలో ఉన్నారు. రెండో విడతలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 7,584 మంది తమ ఉపసంహరించుకోగా, వార్డు స్థానాలకు పోటీ చేసిన వారిలో 10,427 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది.
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా…
దండేపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తొలి సింగిల్ ఎప్పుడంటే..
పవర్స్టార్ పవన్కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని నెలల క్రితమే ‘ఒజి’ సినిమాతో సూపర్ హిట్ను అందుకున్నారు పవన్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా ప్రకటించి చాలా కాలమే అయింది. కానీ, ఇతర సినిమాలతో పవన్ బిజీగా ఉండటంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ రావడం కాస్త ఆలస్యం అయింది. చాలా రోజుల క్రితం ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై హైప్ పెంచుకున్నారు అభిమానులు. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమా తొలి పాట విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ 9వ తేదీన సాయంత్రం 6.30 నిమిషాలకు తొలి సింగిల్ని విడుదల చేస్తున్నట్లు సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ని కూడా వదిలింది చిత్ర యూనిట్. అందులో పవన్ ఫుల్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్-హరీశ్ల కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ అదే కాంబో రిపీట్ కావడం.. ఇందులోనూ పవన్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ చిత్రంపై భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తక్కువ కాలంలో అద్భుత విజయాలు తెలంగాణ సొంతం: పొంగులేటి
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం రెండేళ్ల పాలనకు ప్రజామోదం సంపూర్ణంగా ఉంది విలేకరులతో రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఆయన అన్నారు. రెండేళ్ల పాలనకు ప్రజామోదం సంపూర్ణంగా ఉందని కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఆదివారం మంత్రి పొంగులేటి భారత్ ఫ్యూచర్సిటీని సందర్శించినప్పుడు మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రెండేళ్ల పాలనపై స్పందించారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతిరథం పరుగులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకొని మూడో వసంతంలోకి అడుగుపెడుతోందని, రెండేళ్ల కాలం తక్కువే కానీ, ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అద్భుతమన్నారు. ధనిక రాష్ట్రాన్ని తమ స్వార్ధపూరిత నిర్ణయాలతో పదేళ్లలో దివాలా తీయించి ఆర్ధిక సంక్షోభంలో రాష్ట్రాన్ని అప్పగిస్తే సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్లలో సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తున్నామన్నారు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడినప్పుడు ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్ది దేశానికే ఆదర్శంగా ప్రజారంజక పాలన సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎక్కడలేని, ఎవరూ ఊహించని, అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి వాటిని దిగ్విజయంగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. సన్నబియ్యం ఇందిరమ్మ ఇళ్లు దేశానికి దిక్సూచిగా నిలిచాయన్నారు. ఏ రంగాన్ని విస్మరించకుండా ఏ ఒక్క వర్గం నిరాధారణకు గురికాకుండా అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతి రథం పరుగులు తీస్తోందన్నారు. నాలుగు గ్యారంటీలను అమలు చేశాం రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని వాటిలో నాలుగు గ్యారంటీలను అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిగిలిన రెండు గ్యారంటీలలో కొన్నింటిని పాక్షికంగా అమలు చేశామని ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఈ రెండు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయలేదని, అయినా వాటిని ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశామని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఆర్ధికవృద్దిలో తెలంగాణ అగ్రస్ధానంలో నిలిచిందని, తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం పాలన సాగిస్తోంది 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్ధేశించుకొని మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ, ద్విముఖ వ్యూహంతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని పొంగులేటి తెలిపారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను రెండేళ్లలో దేశానికి రోల్మోడల్గా నిలబెట్టామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి ఉందన్న విషయం ఇప్పటి జరిగిన ఉప ఎన్నికలే రుజువు చేస్తున్నాయని. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను రిఫరెండమ్ అని బిఆర్ఎస్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటే తమ ప్రభుత్వానికి, సిఎం రేవంత్రెడ్డి పాలనకు ఎన్ని మార్కులు ఇవ్వొచ్చో అందరికీ అర్థం అవుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఈ రెండేళ్లలో రెవెన్యూ, హౌసింగ్, సర్వే తదితర విభాగాల్లో విప్లవాత్మక మార్పుల తీసుకు వచ్చామని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భూ సమస్యలను వీలైనంత వరకు తగ్గించడం, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం తమ ప్రభుత్వం ముందున్న ప్రథమ లక్ష్యమన్నారు. ఇప్పటికే ఈ లక్ష్యం దిశగా తాము చేపట్టిన చర్యలు విజయవంతంగా అమలు అవుతున్నాయని మంత్రి పొంగులేటి చెప్పారు.
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా…
ధర్మపురి, ఆంధ్రప్రభ: తనను సర్పంచ్గా గెలిపిస్తే రాయపట్నం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం
విషాదం.. నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రమాదవశాత్తు ఇద్దరు అన్నదమ్ములు నీటికుంటలో పడి మృత్యువాత పడిన విషాద ఘటన ఎపిలోని అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నేరేంద్ర, చరణ్లు గ్రామ శివారులోని మామిడి తోటలో ఉన్న నీటి కుంటలో పడి మునిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు, మరికొందరు కూలీలతో కలిసి మామిడి చెట్లకు పురుగుమందు పిచికారీ చేసేందుకు వెళ్లారు. అనంతరం వారంతా మామిడి చెట్లకు పరుగుల మందు కొడుతున్నారు. ఈ తరుణంలో అన్నద మ్ములిద్దరూ నీటి కుంట వద్దకు వెళ్లారు. తమ్ముడు చరణ్ కాళ్లు కడుగుకుంటానని నీటి కుంటలో దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు. అన్నయ్య కాపాడు అని కేకలు వేయడంతో తన అన్న అయిన నరేంద్ర తమ్మడిని కాపాడేందుకు నీటికుంటలో దిగాడు. కాపాడ బోయే తరుణంలో అన్నకూడా నీటిలో మునిగిపోయాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఊపిరి ఆడక మరణించారు. ఎంతకి తిరిగి రాకపోవడంతో చుట్టు ప్రక్కల గాలించారు. నీటికుంట వైపు వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. దీంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
election |మన గ్రామాభివృద్ధి కోసం..ఒక్క అవకాశం ఇవ్వండి
election | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : మన నమిలిగొండ గ్రామాభివృద్ధి
ఆలయ ఈవో దొంగతనం #Crime #SriSathyaSai #TempleTheft #Police #GangammaTemple
కాంగ్రెస్ ను గద్దె దించే వరకూ పోరాటం ఆగదు: బిజెపి
మహా ధర్నాలో ఛార్జీ షీట్ విడుదల చేసిన బిజెపి నేతలు అమలుపై సిఎం చర్చకు రావాలిః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కాదు సింకింగ్ తెలంగాణః డాక్టర్ కె. లక్ష్మణ్ మన తెలంగాణ/హైదరాబాద్ః రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉత్సవాలు జరుపుకుంటుండగా, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, 420 హామీలతో ప్రజలను మోసం చేశారని బిజెపి నేతలు మండిపడుతూ మహా ధర్నా నిర్వహించారు. తమ ఈ పోరాటం అంతం కాదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ కొనసాగుతుందని పార్టీ నేతలు తమ ప్రసంగాల్లో హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన ఆదివారం ఇందిరా పార్కు (ధర్నా చౌక్) వద్ద జరిగిన మహా ధర్నాకు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Road repairs |భట్టుపల్లి సర్పంచ్ బరిలో ఆడబిడ్డ…
Road repairs | భట్టుపల్లి సర్పంచ్ బరిలో ఆడబిడ్డ… Road repairs |
వారిద్దరికి ఆట కొత్తేమీ కాదు: భారత మాజీ కోచ్
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శన చేశారు. కోహ్లీ రెండో సెంచరీలు, ఒక అర్థ శతకం సాధించగా.. రోహిత్ శర్మ రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే ఈ జోడి 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకూ కొనసాగాలని అంతా కోరుకుంటున్నారు. కానీ, బిసిసిఐ మాత్రం వీరిని దేశవాళీ టోర్నమెంట్లో పాల్గొనాలని కోరగా.. అందుకు ఈ జోడి ఒకె అన్నట్లు సమాచారం. అయితే ఈ రో-కోల జోడీని ఇతర ఆటగాళ్ల కంటే భిన్నంగా చూడాలని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. ‘జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్థానాన్ని ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఎన్నో సంవత్సరాలుగా వారు జట్టు కోసం ఏం చేశారో చూడండి. వారిద్దరూ రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. కానీ, ఫామ్ విషయంలో వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. వారికి ఆట కొత్తేమీ కాదు. కొన్ని ఓవర్లు ఆడితే లయ అందుకుంటారు. యువ ప్లేయర్ల వలే వీరి ఎక్కువ మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు. పరుగులు చేయాలనే తపన ఉండి ఫిట్గా ఉన్న నాణ్యమైన ఆటగాళ్లు మనకు అవసరం. ఈ విషయంలో రో-కోకు ఢోకా లేదు. వారిని ఇతర క్రికెటర్ల కన్నా భిన్నంగా చూడాలి. వారి ఉనికి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని మారుస్తుంది’’ అని సంజయ్ బంగర్ అన్నాడు.
Ring symbol |అమ్మలా అందరికీ అందుబాటులో ఉంటా…
Ring symbol | అమ్మలా అందరికీ అందుబాటులో ఉంటా… Ring symbol |
Development |అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
Development | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా Development | ధర్మపురి, ఆంధ్రప్రభ
national highway |కుక్క దాడిలో 20 మందికి గాయాలు
national highway | కుక్క దాడిలో 20 మందికి గాయాలు national highway
Election campaign |కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి.
Election campaign | కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి. Election campaign
Unanimous |ఏకగ్రీవ సర్పంచ్కు మాజీ మంత్రి సన్మానం
Unanimous | ఏకగ్రీవ సర్పంచ్కు మాజీ మంత్రి సన్మానం Unanimous | పెద్దవంగర,
inspection |ఓటును నిర్భయంగా వేయండి..
inspection | ఓటును నిర్భయంగా వేయండి.. inspection | జన్నారం రూరల్, ఆంధ్రప్రభ
Chief Minister Revanth Reddy |అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
Chief Minister Revanth Reddy | అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
PMSRI Scam : భళా.. అర్థ క్రీడ Andhra Prabha SPL Story)
PMSRI Scam : భళా.. అర్థ క్రీడ Andhra Prabha SPL Story)
Local Elections |తండాను అభివృద్ధి చేస్తా..
Local Elections | తండాను అభివృద్ధి చేస్తా.. Local Elections | పెద్దవంగర,
ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతా
రామన్నపేట, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా
హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ ట్రెండ్స్: ఇన్వెస్ట్ చేసే వారి కోసం ఇన్సైట్స్
హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో ఎక్కడ పెట్టుబడులు పెడితే బాగా వృద్ధి చెందుతాయి? ఫ్లాట్లయితే ఎటువైపు కొనాలి? ప్లాట్లయితే ఎక్కడ కొనాలి? వంటి ఆసక్తికర సమాచారం ఈ కథనంలో చూడొచ్చు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన కేంద్రం. ఐటీ రంగ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో నివాస ప్రాపర్టీలు గణనీయంగా తక్కువ ధరకే లభించడం వంటి కారణాల వల్ల […] The post హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ ట్రెండ్స్: ఇన్వెస్ట్ చేసే వారి కోసం ఇన్సైట్స్ appeared first on Dear Urban .

21 C