SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

Kuntala |మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలి

Kuntala | మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలి సమావేశంలో మాట్లాడుతున్న అడిషనల్

ప్రభ న్యూస్ 7 Feb 2026 11:26 am

చిన్నపిల్లలకు ఉచిత వైద్య శిబిరం

-స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్ .బషీర్, డాక్టర్ సోనియా విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి వద్ద గల స్పందన హాస్పిటల్ లో ఈనెల 8వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చిన్న పిల్లల ఉచిత వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్.బషీర్, డాక్టర్. సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పిల్లలకు జలుబు,అన్ని రకముల జ్వరాలు దగ్గు, పచ్చకామెర్లు, బేదులు […] The post చిన్నపిల్లలకు ఉచిత వైద్య శిబిరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 11:24 am

బిఆర్ఎస్ ను ప్రజల ఆదరిస్తారు

బిఆర్ఎస్ ను ప్రజల ఆదరిస్తారు ఆలేరు,ఆంధ్రప్రభ: ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్

ప్రభ న్యూస్ 7 Feb 2026 11:23 am

Gold Prices : పసిడి ప్రియులకు భారీ షాక్

బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది

తెలుగు పోస్ట్ 7 Feb 2026 11:22 am

Vemsoor |మొక్కలు నాటడమే కాదు –సంరక్షణ కూడా..

Vemsoor | మొక్కలు నాటడమే కాదు – సంరక్షణ కూడా.. ఆదర్శం జయలక్ష్మీపురం

ప్రభ న్యూస్ 7 Feb 2026 11:21 am

More Additions for Dhurandhar: The Revenge

After the super success of Dhurandhar, the entire nation is eagerly waiting for Dhurandhar: The Revenge, the second installment of the film which is due for March 19th release. Aditya Dhar and his team did not guess that the first part would emerge as such a big hit in Indian cinema. Akshaye Khanna and his […] The post More Additions for Dhurandhar: The Revenge appeared first on Telugu360 .

తెలుగు 360 7 Feb 2026 11:21 am

Minister Jogi |ఎందుకంటే..

Minister Jogi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, వైసీపీ

ప్రభ న్యూస్ 7 Feb 2026 11:16 am

ఫ్యామిలీ సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ

సంచలనం రేపిన ఫ్యామిలీ రేపిన స్యూసైడ్ కేసులో మిస్టరీ వీడింది

తెలుగు పోస్ట్ 7 Feb 2026 11:13 am

ప్రైవేట్ మెడికల్ లేబరేటరీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

– డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చెన్నారెడ్డి విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం డివిజన్ లోని డిప్యూటీ ఆఫీసు నందు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ విజయ్ ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్స్ కు రిజిస్ట్రేషన్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెప్పడం జరిగినది . అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ల్యాబ్ కు పర్మిషన్ అనేది తీసుకుంటే రిజిస్ట్రేషన్ తో మీకు గుర్తింపు వస్తుందని తెలిపారు. దానివలన మీకు […] The post ప్రైవేట్ మెడికల్ లేబరేటరీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 11:10 am

Is Toxic Telugu Deal a PR Stunt?

Kannada Superstar Yash emerged as a pan-Indian star after the KGF franchise. His next film is Toxic and the film is due for March 19th release in theatres. The film has been struggling for buzz after Dhurandhar: The Revenge is dominating the show and is releasing on the same day. In a sudden surprise, the […] The post Is Toxic Telugu Deal a PR Stunt? appeared first on Telugu360 .

తెలుగు 360 7 Feb 2026 11:07 am

ఇవాళ్టి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత-అమెరికా మధ్య శనివారం సాయంత్రం మ్యాచ్ జరగనుంది. భారత జట్టు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ దూరం కానున్నాడు. బుమ్రాకు వైరల్ ఫీవర్ సోకండంతో ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని తెలుస్తోంది. వాంఖేడ్ స్టేడియంలో జరిగిన టీమిండియా ట్రైనింగ్ సెషన్‌కు అతడు హాజరకాలేదు. వాషింగ్టన్ సుందర్ ఇప్పటికీ భారత జట్టులో చేరలేదు. పిట్‌నెస్ క్లియరెన్స్ కోసం అతడు ఎదురు చూస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో వార్మఫ్ మ్యాచ్ జరుగుతుండగా హర్షిత్ రాణాకు మోకాలికి గాయం కావడంతో టి20 వరల్డ్ కప్ నుంచి అతడిని తొలగించినట్టు బిసిసిఐ ప్రకటించిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్న విషయం విధితమే. ఇవాళ మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో లేకపోవడంతో సిరాజ్‌ను తుదిజట్టులోకి తీసుకోనున్నట్టు సమాచారం. పాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

మన తెలంగాణ 7 Feb 2026 11:07 am

‘సర్’ ఓటర్లను సుప్రీం రక్షిస్తుందా?

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్షలో భాగంగా పశ్చిమబెంగాల్ లోని ఓటర్ల జాబితాల్లోంచి వేలాది మంది ఓటర్లను అనర్హులుగా తొలగించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ విరుద్ధంగా ఈ విధంగా తొలగించడం అన్యాయమని ధ్వజమెత్తుతూ దీనిపై తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడం సంచలనం కలిగించింది. నిజాయితీగా అర్హులైన ఓటర్లకు జాబితాలో చోటు లభించాలి. ఈమేరకు హామీ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. ప్రత్యేక సమగ్ర సర్వే చేపట్టక ముందు పశ్చిమబెంగాల్ ఓటర్ల జాబితాలో 7.66 కోట్ల వరకు ఎంట్రీలు ఉండేవి. అందులోంచి 58 లక్షల పేర్లను తొలగించిన తరువాత ఎన్నికల కమిషన్ నమూనా జాబితాను ప్రకటించి 1.16 కోట్ల ఎంట్రీల్లో తార్కిక వైరుధ్యాలు ఉన్నాయని వెల్లడించింది. ఇది క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి చేసిన ఒక ప్రయత్నం లేదా నిర్ణయాన్ని సమర్ధించుకోవడానికి ఉపయోగించే తప్పుడు సాకును తెలియజేస్తుందని చెప్పవచ్చు. ఈ పొంతనలేని అసంబద్ధమైన పదజాలాన్ని ఉపయోగించి ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్ ప్రజలను తమ పాలకులను ఎన్నుకునే హక్కు నుంచి దూరం చేయడమే అవుతుంది. ఓటు వేసే హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా ఆచరణలో ఉంటోంది. భారత దేశం వివిధ భాషలు, మాండలికాలు కలిగిన బహుళ భాషా సమాజం. ప్రపంచం లోనే అత్యధికంగా భాషా వైవిధ్యం కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ పరిగణించబడుతోంది. రాజ్యాంగం లోని 8వ షెడ్యూల్‌లో 22 భాషలకు గుర్తింపు కలిగినప్పటికీ దేశవ్యాప్తంగా వందలాది భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ భాషల్లో సరైన నామవాచకాలు రాసేటప్పుడు తేడాలు, అనివార్యమైన తప్పులు చోటు చేసుకోవచ్చు. పురుషులు, మహిళలు వయసులో తేడాలు, 15 ఏళ్ల కన్నా తక్కువ లేదా 50 ఏళ్ల వరకు తమ తల్లిదండ్రులకు తమకు తేడా ఉండవచ్చు. కొన్నిసార్లు దంపతులకు ఆరు లేదా అంతకన్నా ఎక్కువ సంతానం ఉండవచ్చు. చాలా మంది మహిళలు తమ పేరు చివరన తమ భర్త పేరు చేర్చుకుంటుంటారు. ఇవన్నీ భారత దేశ ప్రజాజీవనంలో వాస్తవాలే తప్ప ఓటర్ల జాబితాలో పేర్లను కొట్టేసినంత శక్తివంతమైన తార్కిక వ్యత్యాసాలు కావు. ఈ సమస్యలను సుప్రీం కోర్టే స్వయంగా ప్రస్తావించిందని గుర్తు చేసుకోవాలి. ఓటర్ల జాబితాల్లోంచి పేర్లను తొలగించడానికి వాటిని సాకుగా ఉపయోగించడంపై తన అసమ్మతిని వ్యక్తం చేసింది కూడా. ఈ అసంబద్ధ కారణాలను ఎన్నికల కమిషన్‌కు ఎత్తిచూపడానికి తన వాదనలు వినిపించగా వాటిని ఎన్నికల కమిషన్ తిరస్కరించిందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఇక చేసేది లేక ఆమె నేరుగా సుప్రీం కోర్టు ముందు హాజరై తన వాదనలను వినిపించారు. దీనికి సుప్రీం కోర్టు స్వాగతించింది. ఈ గజిబిజి వ్యవహారంలో మరింత సున్నితంగా వ్యవహరించాలని ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు సూచించింది. మమతా బెనర్జీ వాదించిన అంశాలు ఒక సమస్యకు ప్రాధాన్యం ఇవ్వాలని మనల్ని అడుగుతున్నాయి. వి మనదేశం ప్రజాస్వామ్యయుతంగా పనిచేయడానికి కీలకమైన అంశాలు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం ఏ వ్యక్తి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు. చట్టం ద్వారా నిర్దేశించిన ప్రక్రియ ద్వారా తప్ప మరెప్పుడూ అలా జరగకూడదు. ప్రతి పౌరుడికీ గౌరవంగా జీవించే ప్రాథమిక హక్కు ఉంటుంది. అదే విధంగా సర్వసత్తాక గణతంత్ర దేశంలో ప్రతి పౌరునికీ ఓటు వేసే ప్రాథమిక హక్కు ఉంటుంది. కాబట్టి దానిని జీవించే హక్కుతో సమానంగా పరిగణించాలి. ఓటరు జాబితా నుంచి ఎవరిని తొలగించినా చట్ట నిబంధనల ప్రకారం మొదట సరైన విధానాన్ని అవలంబించాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటర్లు ఎవరినైనా అనర్హులని ప్రకటిచడం వెనుక పోల్ ప్యానెల్‌లో పనిచేసే అధికారుల ఇష్టాయిష్టాలు, అభిరుచులు మాత్రమే బలీయమైన కారణం కాకూడదు. భారతీయులు ప్రతివారూ ఓటు వేయాలి. ఎందుకంటే అది వారి ప్రాథమిక హక్కు. అంతే తప్ప ఎన్నికల కమిషన్ దయాభిక్ష కాదు. ఈ హక్కు ఒక సౌకర్యవంతమైన దృశ్యం కాదని వాదించడానికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. బీహార్ తరువాత గత నవంబర్ 4 నుంచి 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను చేపట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఇది సాగుతోంది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఈ రెండో దశలో కూడా అనేక లోపాలు కనిపిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదు. ఓటర్ల జాబితా తయారీ అన్నది సమ్మిళిత ప్రక్రియగా ఉండాలి తప్ప ఓటర్లను మినహాయించేలా ఉండకూడదని సుప్రీం కోర్టు అనేక సార్లు సూచించినా ఆ సూచనలను సరిగ్గా పాటించడం లేదు. బీహార్‌లో చాలా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తమ హక్కును కోల్పోయే రిస్కును తెచ్చిపెట్టిందని విపక్షాలు, వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా ఆందోళన వెలిబుచ్చారు. బీహార్‌లో సాధారణ నివాసులను తొలగించలేదని, వలసవాదులను మాత్రమే టార్గెట్‌గా పెట్టుకున్నామని ఎన్నికల కమిషన్ నమ్మబలికింది. అయినా ఎక్కువ శాతం మహిళలే జాబితాల్లోంచి తొలగించబడ్డారు. ఈ క్రమ రాహిత్యాలు ఎన్నికల కమిషన్ విధానపరమైన చట్రంలో రూపొందినట్టు కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో కూడా ఇదే కొనసాగడం ఆందోళన కలిగించే విషయం. 

మన తెలంగాణ 7 Feb 2026 11:07 am

tragic incident |ఎక్కడంటే….

tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కారు కాల్వలోకి దూసుకెళ్లి..

ప్రభ న్యూస్ 7 Feb 2026 11:06 am

KTR : నేడు నిజామాబాద్ జిల్లాలో కేటీఆర్ ప్రచారం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు

తెలుగు పోస్ట్ 7 Feb 2026 11:05 am

యూరప్ పట్ల సానుభూతా?

గ్రీన్‌లాండ్ విషయమై అమెరికా తీరు చూసి కొందరికి యూరప్ పట్ల సానుభూతి కలుగుతున్నట్లు కనిపిస్తున్నది. అమెరికా తీరు ఏ విధంగా చూసినా ఖండించదగినదన్నది నిజమే. దేశాల మధ్య సంబంధాలు, నాటో దేశాలు మధ్య అనుబంధాలు, అంతర్జాతీయ చట్టాలు అనే ఏ కొలబద్ద ప్రకారమైనా అది ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. కనుక ఆ మేరకు చూసినపుడు మాత్రం యూరప్‌ను బలపరచవచ్చు. అదే సమయంలో మొత్తం పరిణామాలకు విస్తృత పరిధి కూడా ఒకటుంది. అది ఉపేక్షించదగినది ఎంతమాత్రం కాదు. ఆ కోణం నుంచి పరిశీలించినపుడు యూరప్‌పై సానుభూతి చూపవలసిందేమీ కనిపించదు. ఎందుకంటే, అమెరికా ఎంత సామ్రాజ్యవాదో యూరప్ కూడా అంతకు తీసిపోని సామ్రాజ్యవాది. ఇంకా చెప్పాలంటే అమెరికా కన్నా సీనియర్ సామ్రాజ్యవాది. యూరప్ సామ్రాజ్యవాదం 500 సంవత్సరాల క్రితం మొదలు కాగా, అమెరికాది మొదలై ఇంకా వందేళ్లు కాలేదు. అంతకన్న ముఖ్యమేమంటే, యూరప్ సామ్రాజ్య వాదం ఎప్పటిదో కదా అని మరవటానికి వీలు లేకుండా ఈ రోజు వరకు కొనసాగుతున్నది. అందువల్ల, అంతర్జాతీయ నియమ నిబంధనలు అనే కోణంనుంచి కాస్త పక్కకు జరిగి మరొక స్థాయిలో చూస్తే, గ్రీన్‌లాండ్ వ్యవహారం సామ్రాజ్యవాద శిబిరంలో తలెత్తిన అంతర్గత వివాదం వంటిది. కొన్ని విషయాలను గమనిద్దాం. ఒక నాటో దేశమైన డెన్మార్క్‌కు చెందిన గ్రీన్‌లాండ్‌ను అమెరికా బల ప్రయోగంలోనైనా ఆక్రమించుకోచూడటం సామ్రాజ్యవాదమని యూరప్ విమర్శిస్తున్నది. ఇంతకూ డెన్మార్క్ గాని, యూరప్‌గాని గ్రీన్‌లాండ్ విషయంలో మాత్రమే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకమా లేక మౌలికంగానే ఆ విధానాలకా? గ్రీన్‌లాండ్ విషయంలో మాత్రమే అయితే అందుకు విలువ, నైతిక బలం ఉండవు. అట్లా గాక మౌలికంగానైతే వెంటనే తమ సామ్రాజ్యవాదాన్ని కూడా వదలివేయాలి. వార ఈ ద్వంద్వ ధోరణి అనేక విషయాలలో మరొక వైపు కొనసాగుతునే ఉన్నది. గ్రీన్‌లాండ్ అనే దీవి యూరప్‌కు పశ్చిమాన ఉండగా తూర్పున గల ఉక్రెయిన్ విషయమేమిటి? ఒకప్పటి సోవియెట్ యూనియన్ నాయకత్వాన ఉండిన వార్సా సైనిక కూటమి 1991 లోనే రద్దు కాగా, పాశ్చాత్య దేశాల నాటో కూటమిని ఇంకా కొనసాగించటం, అందులో ఉక్రెయిన్‌ను చేర్చుకుని రష్యాను చుట్టుముట్ట జూడటం వల్ల కాదా ఆ యుద్ధం మొదలైంది? ఈ మాట స్వయంగా ట్రంప్ కూడా ఇపుడు అంగీకరిస్తున్నారు గదా. మరి ఈ విధమైన తమ సామ్రాజ్య వాదానికి యూరప్ చెప్పేదేమిటి? తమది ఒప్పు అయి ట్రంప్‌ది ఎట్లా తప్పవుతుంది? ఇటువంటి దృష్టాంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. గాజాలో జరుగుతున్న నిరంతర మారణహోమం, వెస్ట్‌బ్యాంక్ ఆక్రమణల విషయమై యూరోపియన్ యూనియన్‌కు ఉమ్మడి వైఖరి ఏమైనా ఉందా? అమెరికా నాయకత్వాన మొత్తం యూరప్ తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్‌ను సృష్టించి ఉపయోగించుకుంటుండగా గాజాలో మారణకాండకు ఆయుధాలను, నిధులను ఎందుకు సరఫరా చేస్తున్నారు? రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా భారత నిధులు ఉక్రెయిన్ యుద్ధానికి అందుతున్నాయనే వాదనలు అమెరికాతో కలిసి చేస్తున్న యూరప్ దేశాలు, ఇజ్రాయెల్‌తో వ్యాపారం, పెట్టుబడులు కొనసాగించటం వల్ల గాజాపై యుద్ధానికి నిధులు సమకూర్చటం లేదా? అక్కడ 80,000 మంది పౌరులలు చనిపోయి ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచమంతా ఖండిస్తున్నా తమ సామ్రాజ్యవాద విధానాలను కొనసాగించటం లేదా? యూరప్‌లోని ఏవో కొన్ని మినహా మొత్తం 27 దేశాల యూరోపియన్ యూనియన్ పాలస్తీనాను గుర్తించనిది ఎందుకు? ఇవే రోజులలో జరిగిన వెనెజువెలా ఉదంతం అసాధారణమైన సామ్రాజ్యవాదం కాదా? ఒక స్వతంత్ర దేశంపై దాడి జరిపి దేశాధ్యక్షుడిని అపహరించి, ఆయన అమెరికాకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారంటూ అసత్యపు ఆరోపణలు చేయటం సామ్రాజ్యవాదమేనని యూరోపియన్లు ఎందుకు ఖండించటంలేదు? 27 దేశాల సంఖ్యలో ఒకరిద్దరు మినహా? పనామా కాలువ పనామా అనే స్వతంత్ర దేశానికి చెందినది. ఆ దేశం యూరప్‌లో లేకపోవచ్చుగాని అదే పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఆ కాలువ మీదుగా సరకుల రవాణాలు యూరప్ లాటిన్ అమెరికాలోని పశ్చిమ ప్రాంతాల మధ్య అట్లాంటిక్ మీదుగా పెద్ద ఎత్తున సాగుతుంటాయి. అటువంటి స్థితిలో అమెరికా అధ్యక్షుడు పనామా ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తేవటం, ఆ కాలువను సైనికంగానైనా స్వాధీన పరచుకోగలమని బెదిరించటం, అమెరికన్ నౌకలపై సుంకాలు విధించటానికి వీలులేదని హెచ్చరించటం, తమకు నచ్చని రేవు నిర్వహణా కంపెనీలతో ఉండిన ఒప్పందాలను రద్దు చేయించటం వంటి దంతా సామ్రాజ్యవాదమని యూరోపియన్ దేశాలకు తోచలేదా? ఇండో పసిఫిక్‌లో స్వేచ్ఛా నౌకాయానానికి అవకాశం ఉండాలని, అందుకు చైనానుంచి ఎటువంటి ఆటంకాలు కలగరాదని న్యాయంగానే వాదిస్తున్న యూరప్, అందుకోసం అమెరికాతో కలిసి పని చేస్తున్నదిగాని, ఇండో పసిఫిక్, దక్షిణ చైనా సముద్రాలవలెనే ఆర్కిటిక్ ప్రాంతం కూడా అంతర్జాతీయ సముద్రమని, అక్కడ కూడా రష్యా, చైనాలకు నౌకాయాన స్వేచ్ఛ ఉంటుందనే వైఖరిని ఎందుకు తీసుకోవటం లేదు? ఇదంతా అమెరికాతో కలిసి సాగించే ఉమ్మడి సామ్రాజ్యవాదం కాదా? అదే విధంగా ఒక విచిత్రం ఏమంటే, అమెరికా, తాము కూడా ఒకే చైనా సూత్రాన్ని బలపరుస్తారు. అనగా, చైనా అంతర్యుద్ధ కాలంలో విప్లవకారులతో ఓడిపోయిన చాంగ్ కైషేక్ వర్గం చైనాకే చెందిన తైవాన్‌కు పారిపోయి అక్కడ స్వతంత్ర దేశాన్నయితే ప్రకటించుకున్నా అది చెల్లుబాటు కాదని, ఆ ద్వీపం చైనాదేనని అంగీకరించటమన్నమాట. ఈ వాస్తవాల కారణంగానే ప్రపంచంలో సుమారు పది చిన్న దేశాలు మినహా అందరూ ఒకే చైనా సూత్రాన్ని గుర్తిస్తున్నారు. అదే విధంగా తాము కూడా ఒకవైపు గుర్తిస్తూనే మరొక వైపు తైవాన్‌తో సంబంధాలు నెరపటం, ఆయుధ సరఫరాల వంటివి సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం కాదా? అమెరికాతోపాటు కొన్ని యూరోపియన్ దేశాలు నేటికీ కొన్ని వలసలను కొనసాగిస్తుండటం, ఆఫ్రికాలో ఫ్రాన్స్ వలస ఆధిపత్యం కొనసాగుదల, ప్రపంచమంతటా ఇరువురు కలసి సుమారు వెయ్యి సైనిక స్థావరాలను నిర్వహిస్తుండటం వంటివన్నీ సామ్రాజ్యవాదం గాక మరేమవుతుంది? ఇండియాకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛలేదంటూ ట్రంప్ వాదించి అదనపు సుంకాలు విధిస్తుండగా యూరోపియన్ యూనియన్ చేసినపనేమిటి? తాము కూడా వంద శాతం సుంకాలు విధిస్తామన్నది. ఇదంతా సామ్రాజ్యవాదం కాదా? ఇందులోని వింత ఏమంటే, మరొకవైపు స్వయంగా అమెరికా, యూరప్‌లు రష్యన్ ఇంధనాన్ని ఖరీదు చేస్తున్నాయి. ఆ మాటవారే అంగీకరిస్తున్నారు. ప్రత్యక్ష వలసవాదం 1960 ల నాటికి ముగిసిపోయినా పరోక్ష వలసవాదం, నయా వలసవాదం, సామ్రాజ్యవాదాలను యూరోపియన్ దేశాలు అనేకానేక పేద దేశాలలో, చిన్న దేశాలలో నేటికీ కొనసాగించటం లేదా? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్ వుడ్స్ సమావేశాలతో ఆరంభించి డబ్లుటిఒ వరకు వారు సృష్టించిన అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య వ్వవస్థలన్నీ అమెరికా, యూరప్‌ల ఉమ్మడి సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే. గ్రీన్‌లాండ్ సందర్భంలో అమెరికాను నిరసిస్తున్న యూరోపియన్లు, పైన పేర్కొన్న అనేకానేక ఇతర సందర్భాలకు సంబంధించి తమ సామ్రాజ్యవాదాన్ని వదలుకోగలరా? ఆ పని చేయనపుడు వారికి కొన్ని టెక్నికల్ హక్కులు లభించవచ్చుగాని, నైతిక హక్కులేమీ ఉండవు. అవి కూడా కోరుకున్నట్లయితే యూరోఫియన్ ఒక ప్రత్యేక సమావేశం జరిపి, తమ చరిత్రను, వర్తమానాన్ని నిజాయితీగా సమీక్షించుకుని, చేస్తున్న తప్పులను అంగీకరించి ఇక నుంచి తమ తీరును మార్చుకోగలమని ప్రపంచం ఎదుట ప్రకటించాలి.   - టంకశాల అశోక్ (దూరదృష్టి) - రచయిత సీనియర్ సంపాదకులు 

మన తెలంగాణ 7 Feb 2026 10:58 am

కౌన్సిలర్ రేసులో వీరు…చైర్మన్ అయ్యేది ఎవ్వరు …?

కౌన్సిలర్ రేసులో వీరు…చైర్మన్ అయ్యేది ఎవ్వరు …? మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:57 am

గెలుపు బాటలో రజిని

గెలుపు బాటలో రజిని పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పట్టణంలోని 29 వార్డులో హస్తం

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:56 am

TG |భార్యను గొడ్డలితో నరికి..

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భార్య‌ను అత్యంత కిరాతకంగా గొడ్డ‌లితో

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:52 am

12వ పి. ఆర్. సి. ని అమలు చేయాలి

–– మధ్యంతర భృతి, ఆర్థిక అంశాలపై యుటిఎఫ్ పోస్ట్ కార్డ్ ఉద్యమం విశాలాంధ్ర ధర్మవరం:పట్టణం లోనీ శాంతినగర్ హై స్కూల్ నందు ఈరోజు యుటిఎఫ్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ద్వారా తమ ఆర్థిక సమస్యలను “పిఆర్సి, ఆర్థిక ఇతర డిమాండ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యు .టీ. ఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో 200 పోస్ట్ కార్డులను పోస్ట్ ద్వారా మొదటి విడతలో పోస్ట్ ద్వారా పంపడమైనది. ఈ కార్యక్రమంలో ధర్మవరం […] The post 12వ పి. ఆర్. సి. ని అమలు చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 10:51 am

‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ భారత్ మీడియా మౌనం

ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సామాజిక వర్గాలపై తీవ్ర ప్రభావం చూపిన అంశాల్లో ఇటీవలి కాలంలో ఎప్‌స్టీన్ ఫైల్స్ ఒకటి. లైంగిక దోపిడీ, బాలల అక్రమ రవాణా, శక్తివంతుల రహస్య నెట్‌వర్కులు, న్యాయ వ్యవస్థల వైఫల్యాలు ఇవన్నీ ఒకేచోట బయటపడటమే ఈ ఫైల్స్‌ను అంతర్జాతీయంగా సంచలనంగా మార్చాయి. అమెరికా నుంచి యూరప్ వరకూ మీడియా, పౌరసంఘాలు, మానవ హక్కుల సంస్థలు ఈ అంశాన్ని తీవ్రంగా చర్చిస్తున్నాయి. కానీ అదే సమయంలో భారతీయ ప్రధాన మీడియా ఈ విషయంలో చూపుతున్న మౌనం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. అమెరికాలో జెఫ్రీ ఎప్‌స్టీన్ అరెస్టు, ఆపై అతని అనుమానాస్పద మరణం జరిగినప్పటినుంచే అనుమానాలు మొదలయ్యాయి. కానీ తాజాగా బయటకు వచ్చిన కోర్టు డాక్యుమెంట్లు, సాక్ష్యాలు, ఇమెయిల్స్, ప్రయాణ వివరాలు ‘ఎప్‌స్టీన్’ ఒక వ్యక్తి మాత్రమే కాదని, అతడు కేంద్రంగా పనిచేసిన ఒక విస్తృతమైన శక్తివంతుల వలయం ఉందని ప్రపంచానికి స్పష్టంచేశాయి. రాజకీయ నాయకులు, బిలియనీర్లు, కార్పొరేట్ అధినేతలు, హాలీవుడ్ ప్రముఖులు ఇలా అనేక రంగాలలో ప్రముఖుల పేర్లు ఈ ఫైల్స్‌లో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ప్రస్తావనకు రావడం అమెరికా సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ప్రధాన పత్రికలు దీనిపై లోతైన కథనాలు రాశాయి. ‘న్యూయార్క్ టైమ్స్’, ‘ది గార్డియన్’, ‘వాషింగ్టన్ పోస్ట్’ వంటి పత్రికలు ఈ ఫైల్స్‌ను న్యాయవ్యవస్థ పారదర్శకత, ధనిక-పేద మధ్య న్యాయ అసమానతకు ఉదాహరణగా విశ్లేషించాయి. పౌరహక్కుల కార్యకర్తలు ఇది కేవలం లైంగిక నేరాల అంశం మాత్రమే కాదు; అధికారాన్ని దుర్వినియోగం చేసే గ్లోబల్ ఎలైట్ వ్యవస్థను బయటపెట్టే క్షణంగా అభివర్ణించారు. సామాజిక మాధ్యమాల్లో బాధితులకు న్యాయం (జస్టీస్ ఫర్ విక్టిమ్స్’) అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. యూరప్‌లోనూ ఇదే స్పందన కనిపించింది. ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఎప్‌స్టీన్ వ్యవహారం మహిళల భద్రత, బాలల రక్షణపై ఉన్న చట్టాల ప్రభావాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు కూడా మానవ అక్రమ రవాణా వ్యతిరేక చర్యల్లో అంతర్జాతీయ సహకారం ఎంత కీలకమో ఈ ఉదంతం చూపించిందని వ్యాఖ్యానించాయి. ఇంతటి ప్రపంచ చర్చ జరుగుతున్నప్పటికీ, భారతీయ ప్రధాన మీడియా మాత్రం ఈ అంశాన్ని పక్కన పెట్టినట్టే కనిపిస్తోంది. కొద్ది ఆన్‌లైన్ పోర్టల్స్ లేదా స్వతంత్ర జర్నలిస్టులు తప్ప, టెలివిజన్ చర్చలు గానీ, ప్రధాన పత్రికల ఫ్రంట్ పేజీలు గానీ ఎప్ స్టీన్ ఫైల్స్‌ను గంభీరంగా తీసుకున్న దాఖలాలు చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. అంతర్జాతీయ శక్తిమంతులతో సంబంధాలున్నాయన్న భయం? లేక దేశీయ రాజకీయ అజెండాలకు సరిపోని విషయం కావడమేనా? భారతీయ మీడియా మౌనం మరింత ఆందోళన కలిగించేది మరో కోణంలో. ఈ ఫైల్స్‌లో భారతీయులకు సంబంధించిన పరోక్ష ప్రస్తావనలు, వ్యాపార సంబంధాలపై వచ్చిన వార్తలు కూడా పూర్తిస్థాయిలో చర్చకు రాలేదు. ప్రపంచీకరణ యుగంలో, గ్లోబల్ ఎలైట్ నెట్‌వర్క్‌లు దేశ సరిహద్దులను లెక్కచేయవు. అటువంటి సందర్భంలో ఇది మన విషయం కాదు అన్న నిర్లక్ష్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచానికి ఒక కఠినమైన నిజాన్ని చెబుతున్నాయి ‘ధనం’, ‘అధికారం’ కలిసినప్పుడు ‘న్యాయం’ ఎంత సులభంగా అణచివేయబడుతుందో. ‘న్యాయ వ్యవస్థలు’, ‘మీడియా’, ‘ప్రభుత్వాలు’ నిజంగా స్వతంత్రంగా పనిచేయకపోతే, బాధితుల గొంతులు ఎంత సులభంగా మూగబోయే అవకాశముందో ఈ ఉదంతం చూపించింది. అందుకే పాశ్చాత్య దేశాల్లో ఇది కేవలం స్కాండల్‌గా కాకుండా, ఒక వ్యవస్థాపక వైఫల్యంగా చర్చకు వచ్చింది. 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో మీడియా పాత్ర మరింత కీలకం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా, మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వేయడం, ప్రజలను అవగాహన కల్పించడం మీడియా బాధ్యత. ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై భారతీయ మీడియా మౌనం, నిజానికి మన మీడియా ప్రాధాన్యతలను, దాని స్వతంత్రతను, దాని ధైర్యాన్ని ప్రశ్నించే అంశంగా మారింది. ఈ ఫైల్స్ మనకు ఒక హెచ్చరిక. న్యాయం ధనికుల ఇంటి ద్వారంలో ఆగిపోకూడదు. బాధితుల కథలు దేశాల సరిహద్దులు దాటినా, మన మనసుల్లో ప్రతిధ్వనించాలి. ప్రపంచం ఈ స్కాండల్‌ను ఒక మలుపుగా తీసుకుంటే, భారత సమాజం మాత్రం దానిని ‘చూసి కూడా చూడనట్టు’ గా మౌనంగా ఉండటం భవిష్యత్తుకు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో విజ్ఞానం, వివేచన గల మేధావులు సైతం మౌనంగా ఉండటం కూడా ఒక రాజకీయ వైఖరే కావచ్చు. కానీ అది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అయిన భారత్‌కు క్షేమకరం కాదు. మన దేశంలో మీడియా అది ఎవరికి అనుకూలంగా పనిచేస్తుందో మనం ఆలోచించాల్సిన సమయం ఇదే. - కోలాహలం రామ్ కిశోర్ 9849328496

మన తెలంగాణ 7 Feb 2026 10:44 am

ఇద్దరు బైకు దొంగలు అరెస్ట్

–12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం: డి.ఎస్.పి హేమంత్ కుమార్ విశాలాంధ్ర ధర్మవరం: దొంగతనాలు చేసిన ద్విచక్ర వాహనాలను తక్కువ ధరకు అమ్మి, సొమ్ము చేసుకుంటున్న దొంగలను టూటౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా టూటౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ హేమంత్ కుమార్, టూ టౌన్ సిఐ రెడ్డప్ప విలేకరులతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు తక్కువ ధరకు ఇప్పిస్తామని ఈ దొంగలు దొంగతనం చేసిన వాహనాలను అమ్మేవారిని తెలిపారు. ఇద్దరూ బైక్ దొంగలను అరెస్టు చేయడం జరిగిందని […] The post ఇద్దరు బైకు దొంగలు అరెస్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Feb 2026 10:40 am

జగిత్యాలలో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

జగిత్యాల: భార్యపై అనుమానంతో ఆమెను భర్త గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మీపూర్ గ్రామంలో మల్లయ్య, సత్తవ్వ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉంది. కూమారుడు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. కూతురు ఇంటి వద్ద ఉండి చదువుకుంటుంది. భార్య అనుమానంతో దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. శనివారం ఉదయం ఇంట్లో ఎవరు లేకపోవడంతో గొడ్డలి తీసుకొని నిద్రపోతున్న భార్య తల, మెడపై దాడి చేశాడు. ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 7 Feb 2026 10:38 am

ఆలేరులో ప్రచారం జరిపిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఆలేరులో ప్రచారం జరిపిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:29 am

బడ్జెట్: తెలంగాణకు అనుకూలమా?

ఫిబ్రవరి 1, 2026న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2026 -27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం వ్యయం రూ. 53.47 లక్షల కోట్లుగా ప్రకటించిన ఈ బడ్జెట్, గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 8 శాతం పెరుగుదలగా నమోదైంది. దేశవ్యాప్తంగా మౌలిక వసతులు, రక్షణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఈ బడ్జెట్ తెలంగాణకు మాత్రం మిశ్రమ ఫలితాలను ఇచ్చిందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2026 -27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం వ్యయం రూ. 53.47 లక్షల కోట్లుగా ప్రకటించింది. కొన్ని రంగాల్లో అవకాశాలు కనిపించినా, రాష్ట్ర ప్రత్యేక అవసరాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బడ్జెట్‌లో క్యాపిటల్ ఖర్చు రూ. 12.2 లక్షల కోట్లకు పెంచడం ప్రధాన ఆకర్షణ. ఇందులో రహదారులు, రైల్వేలు, లాజిస్టిక్స్ రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. రైల్వే శాఖకు మొత్తం రూ. 2.81 లక్షల కోట్లు కేటాయించగా, అందులో తెలంగాణకు రూ. 5,454 కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం ప్రకటించింది. కొత్త రైలు మార్గాలు, స్టేషన్ అభివృద్ధి, ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టులు రాష్ట్రానికి కొంత ప్రయోజనం కలిగించే అవకాశముంది. ముఖ్యంగా హైదరాబాద్-వరంగల్ -ఖమ్మం పారిశ్రామిక బెల్ట్‌కు ఇది అనుకూలంగా మారవచ్చు. అయితే వ్యవసాయ రంగం విషయంలో ఈ బడ్జెట్ తెలంగాణ రైతులకు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించింది. వ్యవసాయానికి మొత్తం కేటాయింపు రూ. 1.62 లక్షల కోట్లు మాత్రమే, ఇది మొత్తం బడ్జెట్‌లో కేవలం 3 శాతం కూడా కాదు. గత ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం తగ్గడమే గాక, ఎరువుల సబ్సిడీకి రూ. 1.35 లక్షల కోట్ల నుంచి రూ. 1.25 లక్షల కోట్లకు తగ్గించారు. పంట బీమా పథకానికి కేవలం రూ. 12,200 కోట్లు మాత్రమే కేటాయించడమే రైతులకు పెద్ద షాక్. సాగునీటి ప్రాజెక్టులు, మద్దతు ధరలపై ప్రత్యేక ప్రణాళిక లేకపోవడం తెలంగాణ వంటి వ్యవసాయాధారిత రాష్ట్రానికి తీవ్రమైన లోపంగా మారింది. ప్రత్యేకంగా తెలంగాణలో ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి పంట విషయంలో కేంద్ర బడ్జెట్ పూర్తిగా మౌనం వహించింది. దేశంలో అత్యధిక పత్తి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది రైతులు పత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయినా పత్తికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను వాస్తవ ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా పెంచలేదు. ప్రస్తుతం పత్తి సాగు ఖర్చు క్వింటాల్‌కు సుమారు రూ. 7,500 నుంచి -రూ. 8,000 వరకు ఉండగా, ఎంఎస్‌పి మాత్రం దాని కంటే తక్కువగానే ఉంది. దీంతో రైతులకు లాభం కంటే నష్టం ఎక్కువగా మిగులుతోంది. మరోవైపు పత్తి రైతులకు అవసరమైన పత్తి కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు, ఎగుమతి మౌలిక వసతుల గురించి బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టమైన కేటాయింపులు లేవు. విదేశీ పత్తి దిగుమతులపై నియంత్రణ లేకపోవడం వల్ల దేశీయ మార్కెట్ ధరలు పడిపోతున్నాయి. ఇది తెలంగాణ పత్తి రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది. పత్తి ఆధారిత టెక్స్‌టైట్స్ పరిశ్రమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోవడం కూడా పెద్ద లోపమే. గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్రం ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎకు రూ. 86,000 కోట్లు కేటాయించింది. ఇది సంఖ్యల పరంగా ఎక్కువగానే కనిపించినా, ధరల పెరుగుదల దృష్ట్యా ఈమొత్తం సరిపోదని నిపుణుల అభిప్రాయం. గ్రామీణ రహదారులు, తాగునీటి పథకాలకు నిధులు కొనసాగించినా, కొత్త ప్రాజెక్టులు ప్రకటించకపోవడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం ఇవ్వలేకపోయింది. ఐటీ, డిజిటల్ రంగాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా, తెలంగాణకు ప్రత్యేకంగా పెద్ద ప్రాజెక్టులు లేకపోవడం నిరుత్సాహకరం. స్టార్టప్‌లు, డీప్‌టెక్ ఫండ్‌లు ఉన్నప్పటికీ, హైదరాబాద్ వంటి ఐటి హబ్‌కు నేషనల్ లెవల్ ప్రాజెక్టులు రాకపోవడం కేంద్రం చిన్నచూపును ప్రతిబింబిస్తోంది. మొత్తంగా కేంద్ర బడ్జెట్ -2026 తెలంగాణకు కొంత మౌలిక వసతుల అభివృద్ధిని అందించినప్పటికీ, వ్యవసాయం, -ప్రత్యేకంగా పత్తిరైతుల విషయంలో -తీవ్ర నిరాశను మిగిల్చింది. రైతు ఆదాయం రెట్టింపు అనే నినాదాలు కాగితాలకే పరిమితమై, భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితులకు ఈ బడ్జెట్ పెద్దగా దోహదపడలేదు. రాష్ట్ర అభివృద్ధి నిజంగా కావాలంటే, కేంద్రం తెలంగాణ వ్యవసాయం, పత్తి మార్కెట్, గ్రామీణ జీవనాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలతో ముందుకు రావాల్సిన అవసరం ఇప్పటికైనా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా కేంద్ర బడ్జెట్ -2026 తెలంగాణకు కొంత మౌలిక వసతుల అభివృద్ధిని ఇచ్చినప్పటికీ, వ్యవసాయం -ప్రత్యేకంగా పత్తి రైతుల విషయంలో-తీవ్ర నిరాశనే మిగిల్చింది. రైతు ఆదాయం పెంపు, గ్రామీణ పునరుజ్జీవనం, సామాజిక రంగాల బలోపేతం వంటి కీలక అంశాలు మాటలకే పరిమితమయ్యాయి. ఈ బడ్జెట్ రాష్ట్రానికి పెద్ద ప్రాజెక్టుల ఆశలు చూపించి, ప్రజల జీవిత సమస్యలను విస్మరించిన బడ్జెట్‌గా మిగిలిపోతుంది. తెలంగాణకు నిజమైన సమగ్ర అభివృద్ధి కావాలంటే, కేంద్రం ఇకనైనా రాష్ట్ర అవసరాలను అర్థం చేసుకుని లక్షిత నిధులు, ప్రత్యేక ప్యాకేజీలతో ముందుకు రావాల్సిన అవసరం కావాలనే డిమాండ్ చేస్తోంది.  - ఆత్మకూరి ప్రశాంత్ చారి 79894 21153

మన తెలంగాణ 7 Feb 2026 10:29 am

ప్రైవేటు బస్సు ఆహుతి

ప్రైవేటు బస్సు ఆహుతి కీసరలో తప్పిన ఘోర ప్రమాదం 39 మంది ప్రయాణికులు

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:18 am

బిఆర్ఎఎస్ అభ్యర్థులను గెలిపించండి..

బిఆర్ఎఎస్ అభ్యర్థులను గెలిపించండి.. ఇంటింటి ప్రచారంతో ప్రజల్లోకి చల్లా ధర్మారెడ్డి పరకాల, ఫిబ్రవరి

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:15 am

ఇంటింటి ప్రచారంలో చల్లా జ్యోతి

ఇంటింటి ప్రచారంలో చల్లా జ్యోతి పరకాల, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ): పరకాల మాజీ

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:12 am

Amaravathi : రెండో దశ భూ సమీకరణ...జాప్యం ఎందుకు? ఏం జరుగుతుంది?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండోదశ భూ సమీకరణలో జాప్యం జరుగుతుంది

తెలుగు పోస్ట్ 7 Feb 2026 10:08 am

బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..

బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పరకాల, ఆంధ్రప్రభ : భారతీయ జనతా

ప్రభ న్యూస్ 7 Feb 2026 10:08 am

వందేభారత్ రైళ్లు పేల్చేస్తామని బెదిరింపులు

వందేభారత్ రైళ్లు పేల్చేస్తామని బెదిరింపులు రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు

తెలుగు పోస్ట్ 7 Feb 2026 10:05 am

కేకే కుమారుడికి బెదిరింపులు

మాజీ రాజ్యసభ్యుడు కే కేశవరావు కుమారుడుకు బెదిరింపులు వచ్చాయి

తెలుగు పోస్ట్ 7 Feb 2026 9:57 am

Weather Report : ఫిబ్రవరి మొదటి వారంలోనే దంచి కొడుతున్న ఎండలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువయ్యాయి.

తెలుగు పోస్ట్ 7 Feb 2026 9:47 am

కూల్, చార్మింగ్‌గా..

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల ‘ఇట్లు అర్జున’తో నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు, వాట్ నెక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఇది అతని మొదటి వెంచర్. అనిష్ హీరోగా మహేష్ ఉప్పల దర్శకత్వంలో, అనస్వర రాజన్ హీరోయిన్ గా ఈ సినిమా రూపొందుతోంది. అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చిన టైటిల్ గ్లింప్స్‌తో ఈ చిత్రం ఇప్పటికే సంచలనం సృష్టించింది. అనిష్ పుట్టిన సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్, వీడియో విడుదల చేశారు. పోస్టర్‌లో అనీష్ కూల్ అండ్ చార్మింగ్‌గా కనిపించారు. ఫైండింగ్ అర్జున వాల్యూమ్ 1 వీడియో ఒక క్యారెక్టర్‌ను పరిచయం చేయడమే కాదు - ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళడానికి అనీష్ చూపించిన కమిట్‌మెంట్, మైండ్‌సెట్‌ను ఆవిష్కరిస్తుంది.

మన తెలంగాణ 7 Feb 2026 9:46 am

Tirumala |శ్రీవారి సేవలో ముద్దాడ..

Tirumala | శ్రీవారి సేవలో ముద్దాడ.. రవిచంద్రకు ఈవోగా బాధ్యతలు..తిరుమల చేరుకున్న టీటీడీ

ప్రభ న్యూస్ 7 Feb 2026 9:44 am

Telangana : నేడు తెలంగాణలో దేవేంద్ర ఫడ్నవిస్ పర్యటన

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలంగాణలో నేడు పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 7 Feb 2026 9:41 am

Gold Prices Today : గుడ్ న్యూస్.. పసిడి ప్రియులకు ఊరట

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

తెలుగు పోస్ట్ 7 Feb 2026 9:32 am

‘నాగబంధం’లో అబ్దాలిగా..

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’ ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 15న మహా శివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. దీనికి ముందు ఈ ఇతిహాస కథనంలోని మరో కీలక పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ ‘ఫైటర్’లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రిషబ్ సాహ్నీ నాగబంధంలో ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి పాత్రను పోషించాడు. 1750 బ్యాక్‌డ్రాప్‌లోని ఈ చిత్రంలో భారత్‌లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను చూపించబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ పవర్ ఫుల్ గా వుంది. మంచుతో కప్పబడిన యుద్ధభూమిలో తుఫాన్ వాతావరణం మధ్య, భారీ రక్తంతో మచ్చలుపడ్డ గొడ్డలిని చేతబట్టి యుద్ధానికి దూసుకెళ్తున్న అబ్దాలీగా రిషభ్ కనిపిస్తారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ‘నాగబంధం’ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుంది.  

మన తెలంగాణ 7 Feb 2026 9:26 am

ప్రేమించానని దంపతులను విడగొట్టి... యువతి నోట్లో పురుగులు మందు పోసిన ప్రేమోన్మాది

అమరావతి: ప్రేమించానని వెంటపడ్డాడు, దంపతులు మధ్యగొడవలు సృష్టించి వారిని విడగొట్టాడు. వివాహిత మరో యువకుడితో మాట్లాడుతుందని ఆమె నోట్లో ప్రేమోన్మాది బలవంతంగా పురుగులు మందు పోసి చంపేయడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పమిడి ముక్కల మండలం ఓ గ్రామానికి చెందిన ఓ యువతి తన భర్తతో కలిసి జీవిస్తోంది. భవానీ శంకర ప్రేమించానంటూ ఆ వివాహిత వెంటపడ్డాడు. భర్తతో విడాకులు తీసుకొని తనతో ఉండాలని ఆమెను వేధించాడు. భర్తకు ఫోన్ చేసి భార్య గురించి చెడుగా చెప్పడంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో భర్తను వదిలేసి యువతి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. విజయవాడలో నర్సింగ్ కోర్సులో చేరేందుకు శిక్షణ తీసుకుంటుంది. భవాని శంకర్ ఆమె వెంటపడడంతో తల్లిదండులు అతడి దూరంగా హైదరాబాద్‌లో ఉంచి ఆమెను చదివిస్తున్నారు. యువతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫోన్ నంబర్ తెలుసుకొని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకుంటానని సదరు యువతిని నమ్మించి విజయవాడకు రప్పించాడు. దేవీనగర్‌లోని ఓ గదికి యువతిని తీసుకెళ్లాడు. ఆమె ఫోన్‌ను చెక్ చేయగా మహేష్ అనే యువకుడితో మాట్లాడుతున్నట్టు తేలింది. వెంటనే యువతిని అడగడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. భవానీ శంకర్ పురుగుల మందు యువతి నోట్లో బలవంతంగా పోశాడు. ఆమె అపస్మారకస్థితికి చేరుకోవడంతో వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించి యువతి తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. యువతి ఆస్పత్రికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 7 Feb 2026 9:22 am

Attitude Star Chandrahas gets a Shock

ETV Prabhakar is widely popular across the Telugu TV and film circles. He earned a decent name with his work. His son Attitude Star Chandrahas made his debut last year and was brutally trolled. Chandrahas landed into a controversy before the release of his recent outing Barabar Premistha for using vulgar words on stage of […] The post Attitude Star Chandrahas gets a Shock appeared first on Telugu360 .

తెలుగు 360 7 Feb 2026 9:19 am

‘టాక్సిక్’ హక్కులు దిల్‌రాజు సొంతం

రాకింగ్ స్టార్ యశ్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. మార్చి 19న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. విడుదలకు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను రూ.120 కోట్ల (అడ్వాన్స్ ఆన్ కమీషన్ బేసిస్)కు సొంతం చేసుకోవటం ఇండస్ట్రీలో ఇది చర్చనీయాంశంగా మారింది. నాన్ తెలుగు సినిమాకు కోసం జరిగిన ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ డీల్‌గా మారింది. ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు మాట్లాడుతూ “కెజియఫ్ 2 తర్వాత స్టార్ హీరో యశ్ మార్కెట్ మరింతగా పెరిగింది. ఆయన తదుపరి సినిమా టాక్సిక్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక మూవీని మా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుండటం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు. యశ్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తున్నారు.

మన తెలంగాణ 7 Feb 2026 9:10 am

జోగి రమేష్ పై నాన్ బెయిల్ బుల్ కేసు

మాజీ మంత్రి జోగి రమేష్ పై నాన్ బెయిల్ బుల్ కేసు నమోదయింది

తెలుగు పోస్ట్ 7 Feb 2026 9:07 am

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా..

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా.. కాంగ్రెస్ అభ్యర్థి చింతా నాగరాజు విస్తృత ప్రచారం..38

ప్రభ న్యూస్ 7 Feb 2026 9:06 am

15వ వార్డులో హస్తం జెండా రెపరెపలు..

15వ వార్డులో హస్తం జెండా రెపరెపలు.. గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్థి చింతల

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:57 am

Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 7 Feb 2026 8:53 am

దీవించండి… సేవకుడిగా పని చేస్తా..

దీవించండి… సేవకుడిగా పని చేస్తా.. -అభివృద్ధి లక్ష్యంగా ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దుతాను..-ఎల్లవేళలా మీ

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:52 am

మీ బిడ్డగా ఆదరించి అవకాశం ఇవ్వండి –తీగల రమేష్..

మీ బిడ్డగా ఆదరించి అవకాశం ఇవ్వండి – తీగల రమేష్.. క్యాతన్ పల్లి,

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:41 am

Revanth Reddy : నేడు పరిగిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు

తెలుగు పోస్ట్ 7 Feb 2026 8:36 am

8వ వార్డులో పాశికంటి శ్రీనివాస్ ప్రచారం..

8వ వార్డులో పాశికంటి శ్రీనివాస్ ప్రచారం.. ఆలేరు, ఆంధ్రప్రభ : ఆలేరు మున్సిపల్

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:36 am

బీజేపీ అభ్యర్థి శాంతి రెడ్డి ప్రచారం..

బీజేపీ అభ్యర్థి శాంతి రెడ్డి ప్రచారం.. ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:31 am

హైదరాబాద్‌కు వస్తుండగా ప్రైవేటు బస్సు దగ్ధం...

అమరావతి: ఆంధప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కంచికర్ల మండలంలో ప్రైవేటు బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. 39 ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా కేసర టోల్ గేట్ సమీపంలో బస్సులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశాడు. అనంతరం ప్రయాణికులు కిందకు దిగమని కేకలు వేశాడు. ప్రయాణికులు దిగిన వెంటనే చూస్తుండగానే బస్సు కాలి బూడిదగా మారింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులను వేర్వేరు బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు. 

మన తెలంగాణ 7 Feb 2026 8:29 am

మోత్కూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి..

మోత్కూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి.. కారు పోతుల వెంకన్నకు మద్దతుగా

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:24 am

Amaravathi :నేడు క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన

నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది

తెలుగు పోస్ట్ 7 Feb 2026 8:19 am

బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం..

బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం.. ఆంధ్రప్రభ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:19 am

Allu Arjun sets New Trend in Indian Cinema

Icon Star Allu Arjun emerged as one of the most bankable pan-Indian actors. His last movie Pushpa 2: The Rule is a major hit in all the major languages and the film registered record numbers. When there are debates and discussions about the remunerations of the top actors, Allu Arjun has set a new trend. […] The post Allu Arjun sets New Trend in Indian Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 7 Feb 2026 8:17 am

ఆలేరు 3 వ వార్డులో సందిల సురేష్ ప్రచారం..

ఆలేరు 3 వ వార్డులో సందిల సురేష్ ప్రచారం.. ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:11 am

అల్లూరి జిల్లాలో హెచ్ఎం దాష్టీకం..... ఆస్పత్రి పాలైన విద్యార్థులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లాలో గిరిజ‌న హాస్టల్ లో దారుణం జరిగింది. దారకొండ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో హెచ్ఎం దాష్టీకానికి పాల్పడ్డాడు. భోజనం బాగోలేదని అడిగినందుకు ఇద్దరు విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు చితకబాదాడు.  హెచ్ఎం కొట్టిన దెబ్బలకు విద్యార్థులు ఆసుపత్రిపాలయ్యారు.  మెరుగైన వైద్యం కోసం దారకొండ నుంచి విద్యార్థులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విద్యార్థులను చూడటానికి హాస్పటల్ వద్దకు చేరారు.  పిల్లలను చితకబాదిన హెడ్ మాస్టర్ పై ఎస్సి, ఎస్టి ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని దండకారుణ్య సమితి సభ్యులు డిమాండ్ చేశారు. 

మన తెలంగాణ 7 Feb 2026 8:09 am

YSRCP Liquor Scam: Andhra Pradesh Government Orders Attachment of ₹5.16 Crore Assets

The asset attachment process in the liquor scam that occurred during the YSR Congress Party regime has gathered pace in Andhra Pradesh. The state government has granted permission to attach properties linked to a key accused in the case. Marriboyina Balaji Yadav, listed as Accused No. 35, is alleged to have amassed large assets using […] The post YSRCP Liquor Scam: Andhra Pradesh Government Orders Attachment of ₹5.16 Crore Assets appeared first on Telugu360 .

తెలుగు 360 7 Feb 2026 8:08 am

కౌన్సిలర్ రేసులో వీరు.. చైర్మన్ అయ్యేది ఎవరు…?

కౌన్సిలర్ రేసులో వీరు.. చైర్మన్ అయ్యేది ఎవరు…? మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్

ప్రభ న్యూస్ 7 Feb 2026 8:07 am

T20 World Cup : ధనాధన్ మ్యాచ్ లకు వేళాయె.. నేడు భారత్ - అమెరికా మధ్య మ్యాచ్

టీ 20 ప్రపంచ కప్ కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది

తెలుగు పోస్ట్ 7 Feb 2026 8:06 am

Kadiyam Srihari |కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించాలి..

Kadiyam Srihari | కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించాలి.. Kadiyam

ప్రభ న్యూస్ 7 Feb 2026 7:58 am

17 ఏళ్ల బాలుడితో 37 ఏళ్ల మహిళ అక్రమ సంబంధం... అత్త గొంతు కోసి

అమరావతి: 37 ఏళ్ల వివాహిత, మైనర్‌తో వివాహేతర సంబందం పెట్టుకొని అత్త, భర్తను చంపేందుకు బాలుడిని ఉసిగొల్పింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా గిరింపేట ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గిరింపేట ప్రాంతంలో 37 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యతో గొడవపెట్టుకున్నాడు. అక్రమ సంబంధానికి భర్త, అత్త అడ్డుగా ఉండడంతో వారిని తొలగించాలని బాలుడితో ప్లాన్ వేసింది. భర్తలేని సమయంలో ఇంట్లో అత్త ఒంటరిగా పడుకుంది. బాలుడు అత్త కళ్లలో కారం కొట్టి గొంతు కోశాడు. అత్త కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు బాలుడి పట్టుకొని వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. వెంటనే కోడలు ఇంట్లో నుంచి పారిపోయింది. పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. 

మన తెలంగాణ 7 Feb 2026 7:53 am

Trade Deal : భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు

భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయింది.

తెలుగు పోస్ట్ 7 Feb 2026 7:45 am

అండర్-19 ప్రపంచ కప్ విజేతలకు సిఎం రేవంత్ అభినందనలు

హైదరాబాద్: అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. విశ్వ వేదికపై మన క్రీడాకారుల విజయ పరంపర దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. యువ ఛాంపియన్ల అసమాన ప్రతిభ భారత క్రికెట్ భవిష్యత్తుకు మరింత భరోసానిస్తోందని పేర్కొన్నారు. అంకితభావం, నైపుణ్యం, పోరాట పటిమలో గత తరం క్రీడాకారుల స్ఫూర్తిని కొనసాగిస్తూనే, ఈనాటి యువత అత్యంత ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ వేదికపై భారత కీర్తిని చాటడం అభినందనీయమని రేవంత్ రెడ్డి కొనియాడారు. అండర్ 12 వరల్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత జట్టు ఘన విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌పై టీమిండియా వంద పరుగుల తేడా భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వీర విహారం చేశారు. వైభవ్ 80 బంతుల్లో 175 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. వైభవ్ సూర్య వంశీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. 

మన తెలంగాణ 7 Feb 2026 7:29 am

BRS |మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలి –హరీష్ రావు..

BRS | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలి – హరీష్

ప్రభ న్యూస్ 7 Feb 2026 7:23 am

Flash news |ఎన్ హెచ్ 163 వరంగల్ జాతీయ రహదారి మూసివేత..

Flash news | ఎన్ హెచ్ 163 వరంగల్ జాతీయ రహదారి మూసివేత..

ప్రభ న్యూస్ 7 Feb 2026 7:15 am

నేను అందరివాడిని

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: నేను అందరివాడను.. నాకు కులం, మ తం లేదు.. అన్ని కులాలను, మతాలను స మన్వయం చేసుకుని రాష్ట్రాన్ని నెంబర్ వ న్‌గా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరంలో లక్షల కోట్లు మింగిన కెసిఆర్, హరీశ్‌రావులకు జైల్లో పెట్టడానికి కేంద్రం ఎందుకు వెనుకాడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. త మకు అవకాశం ఇస్తే 48గంటల్లో జైల్లో పెడ్తామని బీరాలు పలికిన కిషన్ రెడ్డి ఏబొక్కెలో దాక్కున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆయన శుక్రవారం నిజామాబాద్ శి వారులోని బర్దిపూర్‌లో వివిధ అభివృద్ధి ప నులకు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగి న సభలో మాట్లాడారు. కాళేశ్వరం బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎటియంలా మారిందని స్వయంగా మోడీ, అమిత్ షాలు తెలంగాణకు వచ్చి చెప్పారని గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని కెసిఆర్ కోట్ల రూపాయ లు కొల్లగట్టారని అసెంబ్లీలో తీర్మానం చే సి సిబిఐ విచారణ జరపాలని కేంద్రానికి సిఫారసు చేస్తే ఆరు నెలలు అయినా ఎం దుకు పట్టించుకోవడం లేదన్నారు. లక్షల కోట్లు దిగమింగిన కెసిఆర్, హరీశ్‌రావుల ను కిషన్‌రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇఫార్ములా కేసు లో కెటిఆర్ మీద చర్యలు తీసుకోవాలంటే ఆపైలును మోడీ ఆఫీస్‌లో మూలకు పడేశారన్నారు. తనను రేవంత్ ఉద్దీన్‌గా సం బోధిస్తున్న రాంచందర్ రావు, కిషన్‌రెడ్డి కెసిఆర్ కుటుంబాన్ని కాపాడుతోంది. కనిపించడం లేదా అన్నారు. కాళేశ్వరం అక్రమాల మీద విచారణకు సిబిఐకి ఇస్తే 48 గంటల్లో కెసిఆర్ హరీష్‌రావులో జైళ్లో వేస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పుడు కల్వకుంట్ల కిషన్‌రావుగా మారారని అన్నారు. కెసిఆర్‌కు దత్తపుత్రుడుగా మారారని ఆరోపించారు. కెసిఆర్, కెటిఆర్‌లను జైళ్లో పెట్టి చిప్పకుడు తినిపించాలని నిజామాబాద్ ఎంపి అర్వింద్ పదేపదే అంటున్నాడని అర్వింద్‌కు మోడీ వద్ద పరపతి ఉంటే ఆయనే వెళ్లి అడగాలన్నారు. కిషన్ రెడ్డి కెసిఆర్, కెటిఆర్‌లను ఏలా కాపాడుతున్నారో అర్వింద్‌కు కనిపించడం లేదా అన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపిలను గెలిపిస్తే కేంద్రం నుంచి నయా పైసా తేవడం లేదన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌లది ఫెవికాల్ బంధంగా మారిందని వారు వీణ వాణిలా మారారని ఆయన ధ్వజమెత్తారు. వారికి ఓట్లు వేస్తే మూసిలో వేసినట్లేనన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే మీ ప్రాంతాలకు అభివృద్ధి చేసే బాధ్యత మున్సిపల్ మంత్రిగా తీసుకుంటానని అన్నారు. అధికారం వచ్చిన రెండేళ్లలో 70వేల ఉద్యోగాలు ఇచ్చామని, తలలు లెక్కపెట్టి చూపిస్తామని అన్నారు. లేదంటే ఒకటి తగ్గినా తన తల తీసుకుంటున్నానని సవాల్ చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. అలాగే అజారుద్దీన్‌కు ఎలాంటి పదవీ లేకున్నా క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇచ్చామని, త్వరలోనే ఎమ్మెల్సీ కూడా ఇస్తామని 8 మంది మైనారిటీ నాయకులకు కార్పొరేషన్ పదవులు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే షబ్బీర్ అలీ ఓడిన ప్రభుత్వ సలహాదారుడిగా పదవి ఇచ్చామని అన్నారు. అన్ని వర్గాలు నన్ను అక్కున చేర్చుకున్నామని రేవంత్‌రెడ్డి బిసి రిజర్వేషన్‌లను అమలు చేస్తే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రేవంత్‌గౌడ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 40 రోజుల్లో వర్గీకరణకు చట్టభద్రత కల్పిస్తే మంత్రి దామోదర్ రాజ నర్సింహ తనను రేవంత్ మాదిగ అన్నారని, అందుకు తాను ఎంతో సంబరపడ్డనన్నారు. అలాగే వాకాటి శ్రీహరికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే ముదిరాజ్‌లంతా తనను రేవంత్ ముదిరాజ్ అన్నారని ముదిరాజ్‌లు తమవాడిగా అక్కున చేర్చుకుంటే సంతోష పడ్డానన్నారు. అతిచిన్న వయసులో అనిల్ యాదవ్‌ను పంపితే సాధారణ సభలో తనను రేవంత్ యాదవ్‌గా సంబోధించారని ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాలు తనను అక్కున చేర్చుకున్నాయన్నారు. నేను అందరివాడినని సిఎం ఈ సందర్భంగా ప్రకటించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేద ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నామని మహిళల పుట్టింటికి వెళ్లాలంటే భర్త ముందు చెయ్యి చాపేదని కాని ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అవకాశం ఇచ్చామన్నారు. ఆర్థిక భారం అయినా మహిళలకు ఇచ్చిన మాట కోసం వెనక్కి వెళ్లబోమన్నారు. పేద ప్రజల ఇండ్లకు ఉచితంగా కరెంటు ఇస్తున్నామన్నారు. నిండు మనస్సుతో తమ ప్రభుత్వాన్ని దీవించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇవ్వాలన్నారు. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉండగా మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేశారని పార్టీ అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు మహేష్ పిసిసి చీఫ్ అయ్యారు. నేను సీఎంగా మహేష్ పిసిసి చీఫ్‌గా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గతంలో ఇదే జిల్లాకు చెందిన డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా వై ఎస్ సి ఎల్పీ లీడర్‌గా ఉండి కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చారని వైఎస్ సిఎంగా డిఎస్ పిసిసి చీఫ్‌గా ఉండి రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 7 Feb 2026 6:00 am

7 Feb2026 |శనివారం, నేటి పంచాంగం : రాహుకాలం, శని ప్రభావం, ద్వాదశ రాశి ఫలితాలు

7 Feb2026 |శక్తివంతం…శనివారం, నేటి పంచాంగం : రాహుకాలం, శని ప్రభావం, ద్వాదశ

ప్రభ న్యూస్ 7 Feb 2026 6:00 am

హైదరాబాద్‌కు అభివృద్ధికి రెండేళ్లలో రూ.20వేల కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: నగరాన్ని ప్రపంచ స్థాయి మహానగరంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభు త్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాల్లోనే హైదరాబాద్ అభివృద్ధికి రూ.20,000 కోట్లు కేటాయించిందని డిప్యూటీ సి ఎం భట్టి విక్రమార్క తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.1,950.52 కోట్లు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి పరిధిలో రూ.12,500 కోట్లు, హెచ్‌ఎండిఏ పరిధిలో రూ.4,365 కోట్లు కేటాయించినట్లు ఆ యన వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ హై టెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని హాల్ 4లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. 8వ తేదీ వరకు సు మారు మూడురోజుల పాటు ఈ షో జరుగనుంది. ఈ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షోలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సిఎం భట్టి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎస్ రామకృష్ణారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ స్థాయి లో నగరాభివృద్ధికి నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి అని  ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా సమగ్ర ప్రణాళిక, ఒకే విధమైన పౌర సేవలు, ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో సమతుల్య అభివృద్ధి సాధ్యమైందన్నారు. రూ. 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు హెచ్-సిటి ప్రోగ్రాం ద్వారా రూ. 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేశామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కింద క్యూర్, ప్యూర్, రేర్ వ్యూహాంతో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీని కేంద్రంగా అభివృద్ధి సాగుతోందన్నారు. వరద భద్రత, వాతావరణ అనుకూలత కోసం సమగ్ర స్టార్మ్ వాటర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉమ్టా ద్వారా సమగ్ర స్పేషియల్, బ్లూ-గ్రీన్, మొబిలిటీ మాస్టర్ ప్లాన్లను రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. అభివృద్ధి కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాదని, ప్రజలపై నమ్మకం, సామాజిక న్యాయం, రాజకీయ స్థిరత్వం కూడా అవసరమని డిప్యూటీ సిఎం స్పష్టం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన, పెట్టుబడులకు అనుకూలమైన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, మున్సిపల్ ఎన్నికల బిజీ ఉన్నప్పటికీ ఈ సమావేశానికి హాజరుకావడం ద్వారా ప్రభుత్వానికి ఈ రంగంపై ఉన్న ప్రాధాన్యత స్పష్టమవుతుందని ఆయన తెలిపారు. స్మార్ట్, స్థిరమైన, సమగ్ర అభివృద్ధితో ప్రపంచ స్థాయి హైదరాబాద్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రియల్‌ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందించడంతో పాటు నిర్మాణరంగదారులకు అనువైన పద్ధతిలో చేయూత నందిస్తుందని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తుందన్నారు. అందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను సరళీకృతం చేయడంతో పాటు నీటిపారుదల శాఖ అనుమతుల్లో జాప్యాన్ని సత్వరమే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. విస్తరిస్తున్న మహానగరానికి అనుగుణంగా తరలివస్తున్న పెట్టుబడులతో హైదరాబాద్ భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌తో తన కుటుంబానికి ముడి పడి ఉన్న అనుబంధాన్ని, అనుభూతులను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీలలో తన తండ్రికి వ్యవసాయ భూములు ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు. 300కి పైగా రెరా -ఆమోదం పొందిన ప్రాజెక్టుల ప్రదర్శన ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి జాతీయ స్థాయిలో పేరు వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ వృద్ధికి బలమైన పునాదిని సృష్టించిందన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ బి. జగన్నాథ్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ నిర్ణయాత్మకంగా వైవిధ్యమైన ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందిందన్నారు. సాంకేతిక కేంద్రంగా దాని గుర్తింపును దాటి ఆవిష్కరణ, జీవనశైలి, దీర్ఘకాలిక మూలధన పెట్టుబడికి గమ్యస్థానంగా మారిందన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన సవాళ్లను, ముఖ్యంగా తప్పుదారి పట్టించే ధరలు, కొనుగోలుదారులను మోసం చేసే చట్టవిరుద్ధమైన ప్రీ లాంచ్ అమ్మకాలను అరికట్టడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు (ఐఏఎస్), ప్రాపర్టీ షో కన్వీనర్ సుశీల్ కుమార్ జైన్, కో -కన్వీనర్ ఎన్. వేణుగోపాల్, ఇతర మేనేజింగ్ కమిటీ సభ్యులు, సందర్శకులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో 300లకి పైగా రెరా -ఆమోదం పొందిన ప్రాజెక్టులను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

మన తెలంగాణ 7 Feb 2026 5:30 am

నేనేం పాపం చేశా.. నన్నెందుకు గోసపెడుతుండ్రు

మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: నేను ఏం పాపం చేసిన.. నన్ను ఎం దుకు గోస పోసుకుంటున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ పెద్దలను ప్రశ్ని స్తూ ఓటర్ల ఎదుట జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జగిత్యాల పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ టికెట్ దక్కని అభ్యర్థులకు మద్దతుగా జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జగిత్యాలలోఎన్నికలు చిత్రంగా మారాయని ,ఎవరు ఏ పార్టీ అ నేది తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇక్కడ ఒకాయన నేను కారు మనిషినే అని చెప్పుకుంటూనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల టిక్కెట్లు ఎత్తుకెళ్లారని అన్నారు. అభివృద్ధి అంటే ఏమిటి.. అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడమా మీరే చెప్పాలంటూ ఓటర్లను అభ్యర్థించారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జీవన్ రెడ్డికి తోడు నిలవడమే నేరమా...?జీవితంలో కాంగ్రెస్ కు ఓటు వేయని వారికి టిక్కెట్లు ఇస్తే నేను కార్యకర్తల పక్షాన నిలిచి పో రాటం చేయాలా.. వద్దా మీరే చెప్పాలంటూ కోరారు.నన్ను నమ్ముకున్నోళ్ల కు అన్యాయం జరుగుతుంటే వారికి అండగా నిల్వలా వద్దా చెప్పండి.. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడుస్తున్న.. ఇక మీ దయ అంటూ అవేదన వ్యక్తం చేశారు.అభివృద్ధి రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కు అని,పార్టీలు మారితే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు.రాజ్యంగా నాకు ఇచ్చిన పౌర హక్కులలో భాగంగా ఆనాడు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బోర్నపల్లి వంతెన కోసం రూ.70 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఆనాడు కెసిఆర్ నిధులు మంజూరు చేశారని, నేను వారి పక్కన చేరలేదన్నారు.2014 లో అందరి ఆశీర్వాదం తో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో మార్పు కోరుతూ టీ ఆర్ ఎస్ అరాచకాలను ఎదిరిస్తూ ఒంటరి పోరాటం చేశానని అన్నారు. పదేళ్లు సోయి లేకుండా. పదేళ్లు అధికారంలో ఉండికూడా పదేళ్లు యావర్ రోడ్డు ఎందుకు విస్తరించలేదు.. ఇది మీ వైఫల్యం కాదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.ఇప్పుడు కొత్తగా యావర్ రోడ్డు విస్తరించాలని ఎమ్మెల్యే సీఎంకు వినతి పత్రం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ చెట్టు నీడన ఉన్న.. నా మీద ఉన్న కోపాన్ని నన్ను నమ్ముకునోళ్లను మీద తీసుకున్నారని ఆవేదన చెందారు. నన్ను నమ్ముకున్న వారి కోసం కోట్లాడుతానన్నారు. ప్రజలారా ఫిరాయింపుదారులను ఓటు అనే ఆయుధంతో కొట్టాలని పిలుపునిచ్చారు.ఫిరాయింపుదారులు పదేళ్లు కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తల తినే కాడి పళ్ళెం ఎత్తుకెళ్లారని, అయినా నిజమైన కాంగ్రెస్ మేమేనని చెప్పుకొచ్చారు.ఎన్ని ఆటంకాలు సృష్టించినా నిలబడి కోట్లాడుతానని,నేను బలపరిచిన వారిని గెలిపించి నాకు అండగా నిలవాలని ఓటర్లను కోరారు. మిమ్మల్ని నమ్ముకున్నా అన్యాయం చేయొద్దంటూ గద్గద స్వరంతో జీవన్ మాట్లాడగా, మీరు అధైర్యపడవద్దు.. మీకు మేము అండగా ఉంటామంటూ పలువురు మహిళలు కంట తడి పెట్టుకోగా జీవన్ చెమ్మగిల్లిన కళ్ళతో చలించిపోయారు.

మన తెలంగాణ 7 Feb 2026 4:30 am

సింగరేణిని ఖతం పట్టిస్తరు

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: సిరుల గని సింగరేణిని సిఎం రేవంత్‌రెడ్డి స్కామ్‌ల మయంగా మార్చారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్ పి ఉప నేత హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం చెన్నూరు నియోజకవర్గం మం దమర్రి మున్సిపాలిటీలోని క్యాతన్‌పల్లిలో జరిగిన ప్రచార సభలో హరీశ్ పాల్గొని ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్‌ను చీరి చింతకు క ట్టాలని పిలుపునిచ్చారు. లేదంటే ఐదారేళ్లలో సిం గరేణిని ఆయన ఖతం పట్టిస్తారని ఆందోళన వ్య క్తం చేశారు. బ్యాంకుల్లో అప్పు తెస్తే గాని జీతాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. సైట్ విజిట్ పద్ధతి తెచ్చి ఓబీ కాంట్రాక్టుల్లో  వేల కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. అనుయాయులకు టెండర్లు ఇచ్చి, కమీషన్లు పంచుకున్నారని, సైట్ విజిట్ వచ్చాక మొదటి టెండర్ రేవంతు బామ్మర్ది సృజన్ రెడ్డికి దక్కిందని, మొత్తం ఆరువేల కోట్ల టెండర్ దక్కించుకున్నారని ఆరోపించారు. బిఆర్‌ఎస్ హయాంలో అయిన టెండర్లు రద్దు చేసి 20 శాతం అదనం కలిపి టెండర్లు ఇచ్చారని తెలియజేశారు. తప్పు చేయకుంటే ఎందుకు విచారణ జరపరని నిలదీశారు. సిట్టింగ్ జడ్జితో కానీ, సిబిఐతో కానీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ టెండర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి, ఫైనాన్స్ టెండర్ 7 సార్లు తేదీలు మార్చారు. లెక్కలు కుదరడం లేదని వాయిదా వేసారు. డీజిల్ స్కాం, జిలిటెన్ స్టిక్స్ స్కాం, నైనీ కోల్ స్కాం, సోలార్ పవర్ స్కాం చేసారు. బంగారు బాతును కోసుకుతింటున్నరు. ఇట్లనే పోతే ఐదు, పదేండ్లలో సింగరేణిని ఖతం చేస్తారు. చంద్రబాబు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేస్తే కేసీఆర్ పునరుద్దరించారు. నెల నెలా మెడికల్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి 16,500 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక మెడికల్ బోర్డు బంద్, డిపెండెంట్ ఉద్యోగాలు బంద్, నడవలేని వారిని గుండెకు బై పాస్ సర్జరీ చేసుకున్న వాళ్లను అన్ ఫిట్ చేయడం లేదు. కార్మిక మంత్రిగా ఉన్న వివేక్.. కార్మికులకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడడు అని ప్రశ్నించారు. ఏఐటీయూసీ నాయకులు, సీపీఐ నాయకులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌తో గళం కలిపేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. కార్మికులు ఇచ్చే బోనస్ కూడా బోగస్ చేసిండు రేవంత్ రెడ్డి. నిమ్స్‌కు తప్ప కార్పొరేట్ ఆసుపత్రుల్లో కార్మికులకు వైద్యం అందకుండా చేసిండు. రెండేళ్లుగా సింగరేణి సీఎండీని కూడా నియమించలేదు. సింగరేణి స్కాం బయట పెడితే తెల్లారి నాకు రేవంత్ రెడ్డి ప్రేమ లేఖ పంపిండు. నన్ను విచారణకు పిలిచిండు, నోటీసులు పంపిండు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ గురించి ఆయన మాట్లాడుతున్న భాషను ఒప్పుకుంటరా? ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? అని నిలదీశారు. స్కాంల గురించి అడిగితే డైవర్షన్ స్కీంలు తెస్తున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు డైవర్షన్ పెడుతరు అని జోస్యం చెప్పారు. 

మన తెలంగాణ 7 Feb 2026 4:00 am

స్పీకర్‌కు 3 వారాల గడువు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కేసు ను సుప్రీం కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. తమ ఈ ఆదేశాలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాటిస్తారని ఆశిస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శుక్రవారం సుప్రీం కోర్టు ధర్మాసనం వి చారణకు చేపట్టింది. స్పీకర్ ప్రసాద్ కుమార్ తరపున న్యాయవాది అ భిషేక్ సింఘ్వి కేసుపై తన వాదన వినిపిస్తూ మొత్తం పది మంది ఎ మ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లలో స్పీకర్ ఇప్పటికే ఎనిమిది పిటిషన్లపై స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు. మరో రెండు పిటిషన్ల పై విచారణ పూర్తి చేసేందుకు మరో నాలుగు వారాల గడువు కావాలని సింఘ్వి కోరారు. ఈ దశలో బిఆర్‌ఎస్ తరఫు న్యాయవాది మో హిత్‌రావు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే నాలుగు వారాల గడువు తీసుకున్నారని, మళ్ళీ గడువు కోరుతున్నారని అన్నారు. ఎనిమిది మంది ఎమ్మెలపై స్పీకర్ తీర్పు ఇచ్చిన తర్వాత మిగిలిన ఇద్దరికి నాలుగు వారాల గడువు ఎందుకంటూ అభ్యంతరం చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉంటూ లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని, ఇంత కంటే ప్రధాన సాక్షం అవసరం లేదన్నారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసినప్పుడు బహిరంగంగా ఆ పార్టీకి ప్రచారం చేశారని, ఇందుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ సమర్పించడం జరిగిందని ఆయన వివరించారు. న్యాయవాది సింఘ్వి కల్పించుకుని రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున గడువు కోరానని చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని మూడు వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. తమ ఆదేశాలను స్పీకర్ పాటిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అయినా స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో తాము ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపడతామని చెప్పారు.

మన తెలంగాణ 7 Feb 2026 3:30 am

నేపాలీ ముఠా భారీ చోరీ

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నేపాలీ ముఠా మరోసారి హైదరాబాద్‌లో భారీ చోరీ చేసింది. వాచ్‌మెన్‌కు మత్తుమందు ఇచ్చి యజమాని ఇంట్లోని రూ.20లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను ఎత్తుకుని వెళ్లారు. ఈ సంఘటన గురువారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందగిరి హిల్స్‌లో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం... నందగిరిహిల్స్‌లోని ఓ ఇంట్లో నేపాల్‌కు చెందిన భువన్ అనే వ్యక్తి 15 రోజుల క్రితం వంటమనిషిగా చేరాడు. ఇంట్లో పనిచేస్తూనే యజమానికి సంబంధించిన ఆభరణాలు, వజ్రాలు, విలువైన వస్తువులు ఎక్కడ పెడుతున్నాడో గమనించాడు. ఈ క్రమంలోనే ఇంటి యజమానులు లేని సమయం చూసి మరో ముగ్గురు నేపాలీలతో కలిసి భారీ చోరీ చేశాడు. గురువారం ఇంటి యజమానులు ఫంక్షన్‌కు వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన భువన్ ఇంట్లో పనిచేస్తున్న వారికి తన పుట్టిన రోజు అని చెప్పి స్వీట్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఇది తిన్న వాచ్‌మెన్‌తోపాటు మిగతా పనివారు నిద్రలోకి జారుకోవడంతో మరో ముగ్గురు నేపాలీలను ఇంట్లోకి చొరబడి లాకర్‌లో ఉన్న బంగారు ఆభరణాలు, వజ్రాలను ఎత్తుకుని పారిపోయారు. మత్తులో నుంచి పనివారు తేరుకున్న తర్వాత విషయం గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చెరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నందగిరి హిల్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు సిసి టివిల ఫుటేజ్‌ను పరిశీలించారు. నలుగురు నేపాలీలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన నేపాలీ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. దొంగల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

మన తెలంగాణ 7 Feb 2026 12:15 am

శనివారం రాశి ఫలాలు (07-02-2026)

మేషం వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వృషభం నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మిధునం విద్యార్థుల అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులు, సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. కర్కాటకం వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. సింహం ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. కన్య నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది. తుల ఆరోగ్యం మందగిస్తుంది. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృశ్చికం నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. ధనస్సు ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. మకరం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దైవచింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. కుంభం చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. మీనం ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.  

మన తెలంగాణ 7 Feb 2026 12:10 am

ఫ్యాక్ట్ చెక్: పాత వీడియోను USA జట్టు టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ లోకి అడుగు పెట్టగానే పానీ పూరీ తిన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు

USA జట్టు టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ లోకి అడుగు పెట్టగానే పానీ పూరీ

తెలుగు పోస్ట్ 7 Feb 2026 12:09 am

కొత్తగూడెం అభివృద్ధి సీపీఐకే సాధ్యం

నిబద్ధత గల అభ్యర్థులను గెలిపించండికమ్యూనిస్టులది అక్రమాలకు తావులేని పాత్రప్రలోభాలకు లొంగొద్దు: ప్రచార సభల్లో కూనంనేని విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం కార్పొరేషన్ అభివద్ధి చెందాలంటే అది ఒక్క సీపీఐ వల్లనే సాధ్యమౌతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కార్పొరేషన్ పరిధిలో 20, 57, 49, 10, 58. 59. 60 డివిజన్లలో శుక్రవారం భారీ రోడ్ షోలు, సభలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కూనంనేని […] The post కొత్తగూడెం అభివృద్ధి సీపీఐకే సాధ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Feb 2026 11:29 pm

భాగ్యనగరాభివృద్ధికి రూ.20 వేల కోట్లు ఓ చరిత్ర

పెట్టుబడులు, జీవన ప్రమాణాల్లో ప్రపంచంతోనే పోటీ27 మునిసిపాలిటీల విలీనం చరిత్రాత్మక నిర్ణయంతెలంగాణ రైజింగ్ విజన్ 2047కు క్యూర్ వ్యూహంప్రజలందరికీ ఓకే విధమైన పౌరసేవలు‘రియల్ ఎస్టేట’ సమస్యలు పరిష్కరిస్తాం: భట్టి విశాలాంధ్ర-హైదరాబాద్: భాగ్యనగరాభివృద్ధికి రెండేళ్ల వ్యవధిలోనే రూ.20 వేల కోట్లు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్‌లో శుక్రవారం క్రెడాయ్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన భట్టి మాట్లాడుతూ… జీహెచఎంసీ పరిధిలో 1,950.52 కోట్లు, హెచఎండబ్ల్యూఎస్ […] The post భాగ్యనగరాభివృద్ధికి రూ.20 వేల కోట్లు ఓ చరిత్ర appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Feb 2026 11:27 pm

ప్రగతిశీల శక్తుల ఐక్యతకు దోహదం

న్యూదిల్లీ: మార్క్సిస్టు సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తమిళనాడులోని లౌకిక ప్రగతిశీల ప్రభుత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక కతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నై, ఎగ్మోర్‌లో కొన్నెమరా ప్రజా గ్రంథాలయంలో మార్క్స్ విగ్రహాన్ని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఆవిష్కరించారు. దీనిని స్వాగతిస్తూ… ఈ చర్య ప్రగతి శీలశక్తుల ఐక్యతకు దోహదమని డి.రాజా అన్నారు. మానవ చరిత్రలోని మహనీయులను గౌరవించే […] The post ప్రగతిశీల శక్తుల ఐక్యతకు దోహదం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Feb 2026 11:24 pm

టీటీడీ ఈవో రవిచంద్ర బాధ్యతల స్వీకరణ

విశాలాంధ్ర – తిరుమల: శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమల ఆలయంలో ఆయన శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. టీటీడీ బోర్డు ఎక్సఅఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు సంప్రదాయం ప్రకారం వరాహ స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. నూతన ఈవోకు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరణ […] The post టీటీడీ ఈవో రవిచంద్ర బాధ్యతల స్వీకరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Feb 2026 11:22 pm

దెబ్బతిన్న మోదీ నైతికత: ఖడ్గే

న్యూదిల్లీ: ప్రధాని మోదీ దురుసుతనం తగ్గిందని, ఆయన నైతికత దెబ్బతిన్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే శుక్రవారం వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ప్రధాని ప్రసంగాన్ని విమర్శించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నల కు సమాధానం ఇవ్వడానికి మోదీ భయపడిపోయారని, అందుకోసమే దిగువ సభలో ప్రసంగించకుండా తప్పించుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకుల మాటలు, ప్రకటనలను మోదీ వక్రీకరిస్తున్నా రని ఆయనకు సమాధి తవ్వుతామన్న వ్యాఖ్యలనుద్దేశించి ఖడ్గే అన్నారు. వారి సిద్ధాంతానికి పాతేస్తామని చెబుతున్నామేగానీ వ్యక్తిని కాదని […] The post దెబ్బతిన్న మోదీ నైతికత: ఖడ్గే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Feb 2026 11:21 pm

జయహో భారత్

అండర్-19 ప్రపంచకప్ మనదే . ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌పై ఘన విజయం. ఆరోసారి జగజ్జేతగా యువభారత్. వైభవ్ విధ్వంసక శతకం…80 బంతుల్లో 175 హరారే: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో కెప్టెన్ ఆయుష్‌మాత్రే నేతత్వంలోని యవభారతజట్టు 100 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ అండర్-19 ప్రపంచకప్‌ను ఆరోసారి గెలుచుకుని తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. జింబాబ్వే రాజధాని హరారేలో శుక్రవారం భారత్`ఇంగ్లాండ్ జట్ల […] The post జయహో భారత్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Feb 2026 11:16 pm

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్

9 మంది మావోయిస్టులు, కమాండో మృతి విశాలాంధ్ర(చింతూరు): మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంది. చత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ మావోయిస్టు అగ్రనేత ఉదమిసింగ్ మృతి చెందిన 24 గంటల్లోనే మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా పాడెవాడ అభయారణ్యంలో భద్రతాబలగాలుమావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. గడ్చిరోలి – నారాయణపూర్ జిల్లాల సరిహద్దున పాదెవాడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో పోలీసులు, సీ-60 […] The post గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Feb 2026 11:13 pm

అమరావతిలో ‘క్వాంటం’ విప్లవం

. దేశంలోనే తొలి అధునాతన సాంకేతిక వ్యవస్థ. నేడు క్వాంటం భవనానికి శంకుస్థాపన విశాలాంధ్ర – సచివాలయం: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ అధ్వర్యంలో “అమరా వతి క్వాంటం వ్యాలీ” ఏర్పాటుకు శనివారం కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో, […] The post అమరావతిలో ‘క్వాంటం’ విప్లవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Feb 2026 11:11 pm

మార్క్స్ విగ్రహం ఆవిష్కరించిన స్టాలిన్

చెన్నై: ఎగ్మోర్ మ్యూజియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కారల్ మార్క్స్ విగ్రహాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం ఆవిష్కరించారు. కారల్ మార్క్స్‌కు రాష్ట్ర రాజధాని చెన్నైలో విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు 2025 ఏప్రిల్ 3న శాసనసభలో నిబంధన 110 కింద ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ మేరకు ఎగ్మోర్ మ్యూజియం ప్రాంగణంలోని కన్నిమారా పబ్లిక్ లైబ్రరీ ప్రవేశద్వారం వద్ద రూ.85.80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని స్టాలిన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు […] The post మార్క్స్ విగ్రహం ఆవిష్కరించిన స్టాలిన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Feb 2026 11:10 pm

అగ్ని3 పరీక్ష సక్సెస్

భారత సైనిక దళాలకు చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా జరిగిన అగ్ని3 పరీక్ష విజయవంతమైంది. ఒడిశా లోని చాందీపూర్‌లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజిలో ఈ పరీక్ష విజయవంతమైందని రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. సాంకేతిక, కార్యనిర్వహణ లక్షాలు అన్నిటినీ ఈ క్షిపణి సాధించిందని పేర్కొంది. ఈ పరీక్షతో భారత దళాల సామర్థం, యుద్ధ సన్నద్ధత, మరింత పెరిగిందని పేర్కొంది. అగ్ని సిరీస్‌కు సంబంధించి భారత్ వద్ద వివిధ రకాల క్షిపణులు ఉన్న విషయం తెలిసిందే. అగ్ని1 క్షిపణి 700కిమీ దూరంలో లక్షాలను, అగ్ని2 క్షిపణి 2 వేల కిమీ, అగ్ని3 క్షిపణి 3 వేల కిమీ దూరం లోని లక్షాలను సాధించగలవు. అగ్ని 4 నాలుగువేలకిమీ, అగ్ని 5 అత్యధికంగా 5 వేల కిమీ దూరంలో లక్షాలు సాధిస్తాయి. ఇక అగ్ని1 క్షిపణితో 220కిమీ కనిష్ఠ దూరం లోని లక్షాలను కూడా ధ్వంసం చేస్తాయని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా 150300 కిమీ దూరం లోని లక్షాలను ఛేదించే పృద్వి సిరీస్ క్షిపణులకు అనుబంధంగా అగ్ని1 క్షిపణిని వినియోగించుకోవచ్చని పేర్కొన్నాయి. మరోవైపు వివిధ దేశాలు అగ్ని క్షిపణులపై ఆసక్తి కనబరుస్తున్నాయి. వీటికోసం భారత ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి. 

మన తెలంగాణ 6 Feb 2026 11:09 pm

పాక్ మసీదులో ఆత్మాహుతి

69 మంది మృతి – 170 మందికి గాయాలు ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఇస్లామాబాద్, తర్లాయ్ ప్రాంతంలోగల ఖతీజాతుల్ కుర్బా మసీదు`ఇమాంబార్గా కిక్కిరిసిన సమయంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 69 మంది ప్రాణాలు కోల్పోగా, 170 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఆత్మాహుతికి సిద్ధమైన వ్యక్తిని ఇమాంబార్గ ప్రవేశం వద్ద అడ్డుకోగా అతను అక్కడికక్కడే ఆత్మాహుతికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మతుల సంఖ్య 31కు […] The post పాక్ మసీదులో ఆత్మాహుతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Feb 2026 11:08 pm

మణిపూర్‌లో బంద్...కుకీల ఆగ్రహంతో ఉద్రిక్తత

మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో శుక్రవారం పూర్తి స్థాయిలో హర్తాళ్ జరిగింది. దీనితో సాదారణ జనజీవితం స్తంభించింది. కుకీ జో ప్రాబల్యం ఉన్న ఈ జిల్లాలో రెండు ఆదివాసీ సంస్థలు బంద్‌కు పిలుపు నిచ్చాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఇద్దరు ఈ ప్రాంతపు ఎమ్మెల్యేలు కార్యక్రమాల్లో పాల్గొనడం వివాదానికి దారితీసింది. శుక్రవారం ఉదయం పలు ప్రాంతాల్లో నిరసనకారులు చేతుల్లో లాఠీలు పట్టుకుని జిల్లా ప్రదాన కేంద్రంలో వచ్చిపోయే వాహనాలను నిలిపివేశారు. మార్కెట్లు మూతపడ్డాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరీ తక్కువగా ఉంది. తుయిబాంగ్ ప్రాంతంలో బంద్ ప్రబావం తీవ్రంగా కన్పించింది. 

మన తెలంగాణ 6 Feb 2026 10:36 pm

దిగొస్తున్న వెండి ధరలు

లాభాల బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, శుక్రవారం వెండి ధర కిలోకు రూ.13,155 తగ్గి రూ.24184కు చేరుకుంది. గత రెండు రోజుల్లో వెండి మొత్తం రూ.41,278 తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,013 తగ్గి రూ.1,51,489గా నమోదైంది. రెండు రోజుల్లో బంగారం ధర రూ.6,669 తగ్గింది. జనవరిలో పసిడి, వెండి ఆల్‌టైమ్ హైని తాకాయి.

మన తెలంగాణ 6 Feb 2026 10:33 pm