TG |నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓపెన్ స్కూల్ సొసైటీ…
TG | నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓపెన్ స్కూల్ సొసైటీ… హైదరాబాద్, (ఆంధ్రప్రభ) :
మంగళవారం రాశి ఫలాలు (25-11-2025)
మేషం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. వృషభం నిరుద్యోగుల యత్నాలు సఫలమౌతాయి. మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. మిధునం చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కర్కాటకం వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సింహం వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కన్య కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తుల వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. రాజకీయ ప్రముఖుల నుండి సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృశ్చికం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ధనస్సు వృత్తి, వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసి రావు. సోదరులతో ఆస్తి విషయంలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆలయ సందర్శనం చేసుకుంటారు. మకరం వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుంభం వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. మీనం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
TG |బీసీ జపం.. కానీ బీసీలకే వెూసం..!
TG | బీసీ జపం.. కానీ బీసీలకే వెూసం..! కొందుర్గు, (ఆంధ్రప్రభ) :
25 Nov 2025 Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
Telangana Reservation |రిజర్వేషన్ల లెక్క తప్పిందా..!?
Telangana Reservation | రిజర్వేషన్ల లెక్క తప్పిందా..!? ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి :
కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్
. ఆర్టీజీఎస్ డేటా లేక్ ద్వారా వివరాల సేకరణ. ప్రభుత్వ పథకాలు, పౌర సేవల పర్యవేక్షణ. కుటుంబ ప్రయోజన నిర్వహణ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ […] The post కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ appeared first on Visalaandhra .
Shalibanda |పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
Shalibanda | పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం ఆంధ్ర్రప్రభ : పాతబస్తీ శాలిబండ
సీఎం ఆదేశించినా కదలని పదోన్నతుల ఫైలు. అయోమయంలో ఆర్టీసీ ఉద్యోగులు. 3 వేల మందికి పైగా ఎదురుచూపులు విశాలాంధ్ర-సచివాలయం: ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై సందిగ్ధత వీడటం లేదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతులకు ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపారంటూ ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున హడావుడి చేశారు. రోజులు తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ పదోన్నతులపై ఆర్టీసీలో స్పందన లేదు. రాష్ట్రంలోని పదోన్నతులకు అర్హులైన ఉద్యోగుల జాబితా నాలుగు నెలల క్రితమే అధికారులు రూపొందించారు. వీరిలో డ్రైవర్, […] The post వీడని సందిగ్ధం appeared first on Visalaandhra .
పోలీస్ పెట్రోలింగ్ వాహనంపై రీల్స్…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ
ഫാക്ട് ചെക്ക്: അസമിൽ മതപരിവർത്തനത്തിനെതിരെ പ്രതിഷേധം? വസ്തുത അറിയാം.
ജാർഖണ്ഡിൽ ആദിവാസി വിഭാഗം നടത്തിയ പ്രതിഷേധത്തിൽ നിന്നുള്ള ദൃശ്യങ്ങളാണ് പ്രചരിക്കുന്നത്
Medak |రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి…
ఉమ్మడి మెదక్ ప్రతినిధి, మిరుదొడ్డి (ఆంధ్రప్రభ): సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మిరుదొడ్డి
చేతులెత్తేసిన బ్యాటర్లు.. టీమిండియాకు మరో వైట్ వాష్ తప్పదా?
గౌహతి: సొంత గడ్డపై ఎదురులేని శక్తిగా ఉన్న టీమిండియా ఇటీవల కాలంలో టెస్టుల్లో పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్కు గురైన భారత జట్టుకు మరోసారి అలాంటి చేదు అనుభవాన్ని చవిచూసే పరిస్థితి నెలకొంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య భారత జట్టు చెత్త ఆటతో గడ్డు స్థితినిఎదుర్కొంటోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓటమి పాలైనటీమిండియా రెండో టెస్టులోనూ ఓటమి బాటలో ప్రయాణిస్తోంది. ఏదైనఅద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో భారత జట్టు మ్యాచ్లో ఓటమిని తప్పించుకోవడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. రెండు విభాగాల్లోనూ విఫలం కావడంతో భారత్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగులు చేయగా, భారత్ 210 పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన సౌతాఫ్రికా మ్యాచ్ను శాసించే స్థితికి చేరుకుంది.
ధర్మేంద్ర ఒక ఐకానిక్ ఫిగర్ : సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్ : ధర్మేంద్ర మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.ధర్మేంద్ర మరణం తీవ్ర విచారానికి గురి చేసిందన్నారు. భారతీయ సినిమాకు ఆయన ఒక ఐకానిక్ ఫిగర్ అని, అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ధర్మేంద్ర మృతి పట్ల పలువురు రాష్ట్ర మంత్రులు తమ సంతాపం తెలిపారు. ‘మరపురాని నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ధర్మేంద్ర’ ధర్మేంద్ర మృతి పట్ల ఎపి సిఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని వారు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ, ‘ధర్మేంద్ర జీ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఒక లెజెండరీ నటుడిగా తన మరపురాని నటనతో ఆయన కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. భారత సినిమాకు ఆయన చేసిన సేవ తరతరాలు గుర్తుంచుకుంటాయి‘ అని పేర్కొన్నారు. తొలి తరం యాక్షన్ హీరో ధర్మేంద్ర : పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ సైతం ధర్మేంద్ర మృతికి నివాళులర్పించారు. ‘హిందీ చిత్ర పరిశ్రమలో తొలితరం యాక్షన్ హీరోగా సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. అందుకే అభిమానులు ఆయన్ను ’యాక్షన్ కింగ్’, ’హీ-మ్యాన్’ అని పిలుచుకున్నారు. ‘షోలే’, ‘ధరమ్ వీర్’ వంటి చిత్రాలతో ఆయన తనదైన ముద్ర వేశారు‘ అని పవన్ గుర్తు చేసుకున్నారు. ఎంపిగా ధర్మేంద్ర చేసిన సేవలు చిరస్మరణీయం: వెంకయ్య మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కూడా ధర్మేంద్ర మృతికి సంతాపం తెలిపారు. ఆయనతో తనకు చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్తో పాటు ప్రజా జీవితంలో ఎంపీగా కూడా ధర్మేంద్ర చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
డిజిటల్ అరెస్ట్.. మూడు రోజులు నిర్భందంలో డాక్టర్ కుటుంబం..
సైబర్ ఉచ్చు నుంచి డాక్టర్ కుటుంబాన్ని రక్షించిన టిజిసిఎస్బి డిజిటల్ అరెస్ట్లు ఉండవు టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖాగోయొల్ మన తెలంగాణ/హైదరాబాద్: సిబిఐ అధికారులమని సైబర్ మోసగాళ్లు బెదిరింపులకు పాల్పడి డిజిటల్ అరెస్టు ఉచ్చును నుంచి డాక్టర్ కుటుంబాన్ని కాపాడినట్లు టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖాగోయొల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. భద్రాచలంలో నీలా నర్సింగ్ హోమ్ను నిర్వహిస్తున్న 80 ఏళ్ల డాక్టర్ బుద్ధరాజు సుబ్బరాజు ఆయన కోడలు, మనవరాలు ఈ సైబర్ మోసానికి బాధితులయ్యారన్నారు. నవంబర్ 20వ తేదీ డాక్టర్ సుబ్బరాజుకు సిబిఐ అధికారులమని వాట్సాప్ వీడియో కాల్ వచ్చిందని, ఆయన ఆధార్ కార్డుతో ముంబైలో ఓ బ్యాంకు ఖాతా ఉందని, అది ఏకంగా 100కు పైగా క్రిమినల్ కేసులలో ఉపయోగించబడిందని అబద్ధాలు చెప్పి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసినట్లు చెప్పారు. దీంతో పాటు సిబిఐ పర్యవేక్షణలో కుటుంబాన్ని ఉంచామని హెచ్చరించి, ఎవరితోనూ మాట్లాడకూడదని, ప్రతి గంటకూ వీడియో కాల్ ద్వారా అందుబాటులో ఉండాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో వారి బ్యాంకు ఖాతాల వివరాలు, ఎఫ్డిలు, ఇంట్లో ఉన్న నగదు వివరాలను మోసగాళ్లు తెలుసుకున్నారు. ఎఫ్డిలను వెంటనే రద్దు చేసి, ఆ డబ్బును వారికి పంపడానికి సిద్ధం కావాలని మూడు రోజులుగా కుటుంబాన్ని ఒత్తిడికి గురిచేశారు. ఈ కారణంగా ఆ కుటుంబం మూడు రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఇంట్లోనే ఉన్నారని డైరెక్టర్ శిఖా గోయొల్ వెల్లడించారు. సహాయకుడి అప్రమత్తతతో కాపాడిన పోలీసులు కుటుంబం ఫోన్ ఎత్తకపోవడం, డాక్టర్ సుబ్బరాజు ఆసుపత్రికి రాకపోవడాన్ని గమనించిన ఆయన సహాయకుడు అనుమానం వ్యక్తం చేశాడు. పదేపదే ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ సహాయకుడు నవంబర్ 23 రాత్రి కొత్తగూడెం సైబర్ క్రైమ్ డిఎస్పి అశోక్ బాబుకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే డిఎస్పి అశోక్ బాబు, ఇన్స్పెక్టర్ జితేందర్లు డాక్టర్ సుబ్బరాజు ఇంటికి చేరుకున్నారు. వెంటనే మోసగాళ్లతో ఆ కుటుంబానికి ఉన్న సమస్యను అడ్డుకున్నారు. అధికారుల వేగవంతమైన చర్యల వల్ల ఆ కుటుంబానికి జరగాల్సిన పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం తప్పినట్లు టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖాగోయొల్ వెల్లడించారు. ప్రస్తుతం, సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక దర్యాప్తును ప్రారంభించారని, మోసగాళ్ల ఐపి చిరునామాలు, కాల్ రూటింగ్ వివరాలు, పరికరాల గుర్తింపు సంఖ్యలను విశ్లేషిస్తున్నామన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు, జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్తో సమన్వయం చేసుకుంటూ మోసగాళ్ల నెట్వర్క్ను ధ్వంసం చేయడానికి చర్యలు కొనసాగుతున్నట్లు ఆమె తెలిపారు. డిజిటల్ అరెస్టులు ఉండవు ఈ సంఘటల సందర్భంగా టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖాగోయొల్ పలు సూచనలు చేశారు. పోలీసులు, సిబిఐ, ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఎప్పుడూ డిజిటల్ అరెస్టులు, వాట్సాప్ విచారణలు చేయదని, ఏ అధికారికి కూడా డబ్బును ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పే అధికారం చట్టంలో లేదని స్పష్టం చేశారు. సైబర్ మోసం జరిగిందని అనుమానం వస్తే వెంటనే 1930కు కాల్ చేయాలని, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. సమయోచితంగా స్పందించి వృద్ధుడి కుటుంబాన్ని రక్షించిన డిఎస్పి అశోక్ బాబు, ఇన్స్పెక్టర్ జితేందర్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అభినందించారు.
తెలంగాణలో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 14 కొత్త ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం 14 ఎక్సైజ్ పోలీస్స్టేషన్లకు సంబంధించి రంగారెడ్డిలో తొమ్మిది, హైదరాబాద్లో మూడు, సంగారెడ్డిలో 1, వరంగల్ జిల్లాల్లో ఒక్కో ఎక్సైజ్ స్టేషన్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్లోని మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో బంజారాహిల్స్ ఎక్సైజ్ స్టేషన్ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ప్రారంభించగా, చిక్కడపల్లి ఎక్సైజ్ స్టేషన్ను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్ సుప్రియలు, మారేడుపల్లి ఎక్సైజ్ స్టేషన్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, ఈఎస్ పంచాక్షరీ, ఏఈఎస్ శ్రీనివాసరావులతో పాటు మూడు స్టేషన్ల సిఐలు బానోతు పటేల్, రామకృష్ణ, జగన్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. శంషాబాద్ ఈఎస్ పరిధిలోని గండిపేట్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్ను ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్, కొండపూర్ స్టేషన్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ కృష్ణప్రియ ఇతర అధికారులు పాల్గొన్నారు. సరూర్నగర్ ఈఎస్ పరిధిలోని మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్ను రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, పెద్ద అంబర్పేట్ స్టేషన్ ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డిలు ప్రారంభించారు. మేడ్చల్ ఈఎస్ పరిధిలోని కొంపల్లి, కూకట్పల్లి ఎక్సైజ్ స్టేషన్లను ఎక్సైజ్ సూపరింటెండ్ ఫయాజుద్దీన్, ఏఈఎస్ మాధవయ్యలు ప్రారంభించారు. మల్కాజిగిరి ఈఎస్ పరిధిలో కాప్రా పోలీస్స్టేషన్ను ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, నాచారం స్టేషన్ను ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు, అల్వాల్ స్టేషన్ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు ప్రారంభించగా ఈఎస్ నవీన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్లోని అమీన్పూర్ ఎక్సైజ్ స్టేషన్ను ఎంపి రఘునందన్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు ప్రారంభించగా ఈ కార్యక్రమంలో మెదక్ డిప్యూటీ కమిషనర్ జె. హరికిషన్, ఏఈఎస్ శ్రీనివాస్లు పాల్గొన్నారు. హసన్పర్తి స్టేషన్ను వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించగా ఈ కార్యక్రమంలో డిసి అంజన్రావు, ఈఎస్ చంద్రశేఖర్లు పాల్గొన్నారు.
ప్రజావాణి నిర్వహణలో నిర్లక్ష్యం..
తాడ్వాయి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో
సర్పంచ్ ఎన్నికలు.. రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జిఒ 46 ప్రకారం 50 శాతానికి లోబడి రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. బిసి, ఎస్సి, ఎస్టిలకు రిజర్వేషన్ల కేటాయించడంతో పాటు లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఎస్సి, ఎస్టిల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22 శాతం మాత్రమే బిసి రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో కొన్ని చోట్ల బిసిల రిజర్వు స్థానాలు మారాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్లను రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలను సమర్పించినట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
డ్రగ్స్ విక్రయిస్తూ ముగ్గురి అరెస్టు.. 15గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం
మనతెలంగాణ, సిటిబ్యూరోః తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న ముగ్గురు యువకులను చందానగర్, మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, నిందితుల వద్ద నుంచి 15గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి రితీరాజ్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శేరిలింగంపల్లి, బాపు నగర్ దేవ్రా హరీష్, కుంచాల సాయి కృష్ణ, గుంజి సాయిమణికంఠ ముగ్గురు కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. హరీష్ సోదరుడు అరుణ్ బెంగళూరులో ఉంటున్నాడు, తరచూ అతడి వద్దకు వెళ్లేవాడు. అక్కడ హరీష్ స్నేహితులతో కలిసి డ్రగ్స్ తీసుకునేవాడు. ఈ సమయంలో బెంగళూరులో తక్కువ ధరకు లభిస్తున్న ఎండిఎంఏ డ్రగ్స్ను హైదరాబాద్కు తీసుకుని వెళ్లి ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ వేశాడు. ఈ విషయం తన స్నేహితులు సాయి కృష్ణ, సాయి మణికంఠకు చెప్పాడు. వారు అంగీకరించడంతో బెంగళూరులో ఉంటున్న అరుణ్కు డ్రగ్స్ కొనుగోలు చేయాలని చెప్పాడు. అరుణ్ 15గ్రాముల ఎండిఎంను కొనుగోలు చేశాడు. వెంటనే బెంగళూరు వెళ్లిన హరీష్ అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి స్నేహితుల సాయంతో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Chennur |రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి…
Chennur | రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి… Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ
Collector | వేగం పెంచాలని వివిధ శాఖల పనితీరుపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
ధనుష్–మృణాల్ కామెంట్స్ వైరల్ #Entertainment #Dhanush #MrunalThakur #TollywoodBuzz #Viral
Ritika Nayak |డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న మిరాయ్ బ్యూటీ
Ritika Nayak | డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న మిరాయ్ బ్యూటీ శ్రీకాకుళం,
Space |వాహ్.. స్పేస్ ఆన్ వీల్స్!
Space | వాహ్.. స్పేస్ ఆన్ వీల్స్! Space | విజయవాడ ,ఆంధ్రప్రభ
Stadium |ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్డేడియం అభివృద్ధి..
Stadium | ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్డేడియం అభివృద్ధి.. Stadium | ఆంధ్రప్రభ,
కరీమాబాద్, (ఆంధ్రప్రభ) : సామాజికవేత్త జక్కా జడ్సన్ అరెస్టును స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్
Buzz: Dulquer Salmaan in a Biopic?
Malayalam young actor Dulquer Salmaan emerged as one of the most bankable actors in South. He is doing films in Telugu, Tamil and Malayalam languages. The actor’s recent offering Kaantha did not do well but he has an impressive lineup of films. As per the latest buzz, Dulquer Salmaan is in talks for the biopic […] The post Buzz: Dulquer Salmaan in a Biopic? appeared first on Telugu360 .
మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త.. ప్రభుత్వానికి సీతక్క కృతజ్ఞతలు
మన తెలంగాణ / హైదరాబాద్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వము జమ చేసింది. మొత్తం 3,57,098 సంఘాలకు ఈ నిధులు చేరాయి. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు, పంచాయరిరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనుసూయ సీతక్క సెర్ప్ సిఈఓ దివ్యాదేవరాజన్, జిల్లా డిఆర్డిఎ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరునాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రభుత్వం చిత్త్శుద్దితో పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రతి ఏడాది రూ. 25 వేల కోట్లకు తగ్గకుండా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ, వాటికి వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం తరఫునే వడ్డీలను చెల్లించడం కొనసాగుతోందని తెలిపారు. తాజాగా రూ.304 కోట్ల వడ్డీలను చెల్లించినట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు గ్రామీణ సంఘాలకు రూ. 1,118 కోట్ల వడ్డీ రహిత రుణాలు చేరాయన్నారు. ఇవి కాకుండా పట్టణ మహిళా సంఘాలకు సుమారు రూ. 300 కోట్ల వడ్డీ లేని రుణాలను చెల్లించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, ఆడబిడ్డల ఆర్థిక భద్రత కోసం వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తూ, వారి అభివృద్ధికి దారితీసే పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి సీత్క్క తెలిపారు. మహిళలపై వడ్డీల భారం లేకుండా ప్రభుత్వమే వాటిని భరిస్తోందని, మహిళల సాధికారతను శాశ్వ్తంగా నిలబెట్టే విధానాలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సిన రూ. 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందని, స్వయం సహాయక మహిళలు కష్టపడి పొదుపుగా పెట్టుకున్న అభయహస్తం నిధులను కూడా కాజేసిందని గుర్తు చేశారు. మహిళల కష్టాన్ని దోచుకున్న బిఆర్ఎస్ పెద్దలకు మహిళా సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కే లేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు నిధులను పారదర్శకంగా, సకాలంలో అందిస్తూ వారి ఆర్థిక శక్తిని మరింతగా పెంచే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తోందని అన్నారు.
Alert Hyd |ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం…
Alert Hyd | ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం… హైదరాబాద్, ఆంధ్రప్రభ
AP |గుండ్రేవుల జలాశయం కోసం ఐక్య పోరాటం…
AP | గుండ్రేవుల జలాశయం కోసం ఐక్య పోరాటం… కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ
Irrigation Scheme |నాగటూరు లిఫ్ట్ ఎత్తిపోతల యంత్రాల మరమ్మతుకు 38 లక్షల మంజూరు….
Irrigation Scheme | నాగటూరు లిఫ్ట్ ఎత్తిపోతల యంత్రాల మరమ్మతుకు 38 లక్షల
ఆ కార్పొరేటర్లకు భవిష్యత్తులో పదవులు: కెటిఆర్
ఉప ఎన్నిక సమయంలో కార్పొరేటర్లు అద్భుతంగా పోరాడారు జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో భూముల అమ్మకంపై నిలదీయాలి బిఆర్ఎస్ కార్పొరేటర్లకు కెటిఆర్ దిశానిర్దేశం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత నగరంలో ఉన్న కార్పోరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందించారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ కార్పోరేటర్లందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్లో సోమవారం జిహెచ్ఎంసి పరిధిలోని బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, కార్పొరేటర్లతో కెటిఆర్ సమావేశమయ్యారు. బల్దియా సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు కెటిఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ కార్పొరేటర్లకు వివిధ అంశాలపైన మార్గదర్శనం చేశారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఎలాంటి అవినీతికి తావులేకుండా పనిచేశారని, కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతంగా సేవలందించారని ప్రశంసించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కార్పొరేటర్లు అద్భుతంగా పోరాడారని అభినందించారు. పరిశ్రమలకు కేటాయించిన వాటితో పాటు హైదరాబాద్లో భూముల అమ్మకంపై జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో నిలదీయాలని కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం వైఫల్యంపై నిలదీయాలని సూచించారు. జిహెచ్ఎంసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ అందరినీ గెలిపించుకుంటుందని వారికి కెటిఆర్ భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లకి రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందని కెటిఆర్ తెలిపారు. ఈనెల 29వ తేదీన జరగనున్న దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని కెటిఆర్ కోరారు. దీక్ష దివాస్ సంబరాలకు సంబంధించి నగరంలో ఏర్పాట్లపై మాజీమంత్రి, ఎంఎల్ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల తెలంగాణ పోరాటంలో ఎన్ని ప్రయత్నాలు జరిగినా, కెసిఆర్ దీక్ష తర్వాతనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. ఇంతటి గొప్ప ఘట్టాన్ని ప్రజలందరికీ మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఆ దిశగా ఈనెల 29వ తేదీన నగరంలో భారీగా దీక్ష దివాస్ను నిర్వహించనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎంఎల్ఎ సబితా ఇంద్రారెడ్డి, జిహెచ్ఎంసి పరిధిలోని ఎంఎల్ఎలు, ఎంఎల్సి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తప్పుగా అర్థం చేసుకున్నారు: బ్రహ్మానందం
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మోహన్ బాబు 50 ఏళ్ళ సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన ఈవెంట్ కి హాజరయ్యారు.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టైటిల్ను పాకిస్థాన్-ఏ కైవసం చేసుకుంది.
ఆ.. డబ్బా ప్రచారం ఇకనైనా ఆపేయండి:హరీష్ రావు
మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న డబ్బా ప్రచారం ఆపేయండి మధ్యాహ్న భోజనం కార్మికులకు వెంటనే పెండిగ్ బిల్లులు చెల్లించాలి మాజీ మంత్రి హరీష్రావు మనతెలంగాణ/హైదరాబాద్ : మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామనే డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపేయాలని సిఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అప్పుల పాలయ్యాం మొర్రో అని మొత్తుకుంటున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 13 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మధ్యాహ్న భోజన కార్మికురాలు తమ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన వీడియోను హరీష్రావు ఎక్స్లో పోస్టు చేశారు.
ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ.. రూ.100కోట్లు సంపాదించినట్లు గుర్తింపు
చంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టిన పోలీసులు టెలీగ్రాంలో సినిమాల కొనుగోలు.. క్రిప్టోలో లావాదేవీలు మనతెలంగాణ, సిటిబ్యూరోః పైరసీ సినిమాల కేసులో అరెస్టు అయిన ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి కస్టడీ ముగియడంతో పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టు రవిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వడంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణ చేశారు. దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. రవి ఒక్కడే సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐదేళ్ల నుంచి సినిమాలను ఐ బొమ్మ వెబ్సైట్ ద్వారా పైరసీ చేస్తున్న రవి బెట్టింగ్ యాప్లు, గేమింగ్, మ్యాట్రీమోని వెబ్సైట్లను ప్రమోట్ చేయడం ద్వారా రూ.100కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. వాటికి సంబంధించిన రూ.30కోట్ల లావాదేవీలను పోలీసులు గుర్తించారు. ఐడిఎఫ్సి బ్యాంక్ ద్వారా ఇతర బ్యాంక్ ఖాతాలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. లావాదేవీలను రవి క్రిప్టో కరెన్సీలో నిర్వహించినట్లు గుర్తించారు. ఐ బొమ్మను ఒకసారి క్లిక్ చేస్తే 15 ప్రకటనలు వచ్చే విధంగా డిజైన్ చేశారు, ఇందులో మ్యాట్రిమోనీ, గేమింగ్, బెట్టింగ్ యాప్లు ఓపెన్ అయ్యే విధంగా చేశాడు. తన వెబ్సైట్కు 50లక్షల వ్యూవర్ షిప్ ఉందని చెప్పి వ్యాపారం చేసినట్లు తెలిసింది. దానిని చూసిన బెట్టింగ్, గేమింగ్ యాప్ల నిర్వాహకులు ప్రకటనలు ఇవ్వడంతో భారీగా డబ్బులు సంపాందించాడు. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేయగా ఒక కేసులోనే రిమాండ్ చేశారని, బేయిల్ పిటీషన్ వేశామని రవి లాయర్ తెలిపారు. తన సోదరి, స్నేహితుడు నిఖిల్ గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు రవిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటీషన్ వేయనున్నట్లు తెలిసింది. టెలీగ్రాంలో కొనుగోలు... రవి కొత్త సినిమాలను టెలీగ్రాంలో బేరాలు ఆడి కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. కొనుగోలు చేసిన సినిమాలను హెచ్డి క్వాలిటీలోకి మార్చి ఐ బొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు. వెబ్సైట్లో పలు ప్రకటనలను ప్రమోట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించాడు.
Good News |తగ్గిన పసిడి రేట్లు!
Good News | తగ్గిన పసిడి రేట్లు! Good News | వెబ్
Godavarikhani |మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి…
Godavarikhani | మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి… గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి
భర్త వేధింపులు భరించలేక.. హత్య చేసిన ఇద్దరు భార్యలు
నిజామాబాద్: మద్యం సేవించి తరచూ వేధిస్తున్న భర్తను అతడి భార్యలు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం దేవక్కపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవక్కపేటకు చెందిన మలవత్ మోహన్(42)కు కవిత, సంగీత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. మోహన్ తరుచూ మద్యం తాగుతూ వచ్చి భార్యలతో గొడవ పడుతుండేవాడు. ఆదివారం రాత్రి వారిద్దరినీ గదిలో బంధించాడు. దీంతో విసుగు చెందిన ఇద్దరు భార్యలు మోహన్ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం పెట్రోల్ కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఇంటి ఆవరణలో నిద్రపోతున్న మోహన్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మంటలు అంటుకొని మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Land prices hit new highs in Hyderabad
For all those who have been propagating the belief that Hyderabad real estate is in a slump, here is an eye opener. In the latest e-auctions conducted by the Hyderabad Metropolitan Development Authority (HMDA), an acre has been bid for a whopping Rs 137.25 Cr per acre. The HMDA is conducting online auctions for the […] The post Land prices hit new highs in Hyderabad appeared first on Telugu360 .
గడువు ఇవ్వండి లొంగిపోతాం.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పార్టీలో చర్చించేదుకు గడువు కోరాం సోనూ దాదా నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నాం వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు గడువు కోరిన మావోయిస్టు పార్టీ అప్పటి వరకు భద్రతా దళాల కూంబింగ్ ఆపాలి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అనంత్ పేరుతో లేఖ మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ ఆయుధ విరమణపై కీలక ప్రకటన చేసింది. మహారాష్ట్ర-, మధ్యప్రదేశ్, -ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి జోన్) ప్రతినిధి అనంత్ పేరుతో బహిరంగ లేఖ రాసింది. గడువు ఇస్తే ఆయుధ విరమణ చేస్తామని ప్రకటించింది. అప్పటి వరకు భదత్రా దళాల కూబింగ్ నిలిపివేయాలని కోరింది. ఇంకా లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. సిసిఎం సతీష్ దాదా, మరొక సిసిఎం కామ్రేడ్ చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేసింది. ఎంఎంసి(మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్) స్పెషల్ జోనల్ కమిటీ ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నట్లు లేఖలో స్పష్టం చేసింది. తాము ఆయుధాలు విడిచిపెట్టడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సమయం ఇవ్వాలనిఅభ్యర్థించింది. పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని, ఈ నిర్ణయాన్ని అందరితో పంచుకోవడానికి కొంత సమయం పడుతుందని, సహచరులను సంప్రదించి, పార్టీ పద్దతి ప్రకారం ఈ సందేశాన్ని తెలియజేయడానికి సమయం కోరింది. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థించింది. సమయం కోరడం వెనుక ఎటువంటి నిగూఢ ఉద్దేశ్యం లేదని, సమాచారం చేరవేసేందుకు ఈ సమయం కోరామని లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మావోయిజం నిర్మూలనకు విధించిన గడువు (మార్చి 31, 2026)లోపే తాము కోరిన సమయం ఉందని, అప్పటి వరకు, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించి, భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని కోరింది. కాగా, పిఎల్జిఏ వారోత్సవాలు నిర్వహించమని, ఈ క్రమంలో రాబోయే పిఎల్జిఏ వారంలో ఎటువంటి కార్యకలాపాలను ప్రభుత్వం నిర్వహించకూడదని, ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను సైతం నిలిపివేయాలని, ఇతర సమాచారం ఆధారంగా దళాలను నియమించకూడదని లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇరువైపులా ఇలాంటి ప్రయత్నాలతో సంభాషించుకోవడానికి మెరుగయిన నిర్ణయం తీసుకోవడానికి సాధ్యమవుతుందని, ఆహ్లాదకరంగా, సానుకూల వాతావరణం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు జోన్ల్ కమిటీలు తమ కార్యకలాపాలన్నింటిని నిలిపివేయాలని అనంత్ విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలోని సారాంశాన్ని మీడియా ద్వారా సహచర మావోయిస్టులకు తెలియజేయాలని అనంత్ కోరారు. ఆయుధ విరమణపై త్వరలోనే తేదీ ప్రకటిస్తాం ఆయుధ విరమణపై త్వరలోనే తేదీని ప్రకటిస్తామని అనంత్ లేఖలో స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులతో సమావేశం నిర్వహించడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించాలని కోరారు. సమిష్టిగా ఆయుధ విరమణ చేసి ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాల కార్యకలాపాలను నిర్ణీత తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభుత్వం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే ఈ ప్రక్రియ సాధ్యమవుతుందని అనంత్ పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం ప్రభుత్వ ప్రతిస్పందన కోసం వేచి చూస్తామని లేఖలో తెలిపారు. సహచరులు సోను దాదా, సతీష్ దాదా మూడు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి తగిన సమయం ఇవ్వాలని కోరారు.
Naveen Yadav | 26న ప్రమాణ స్వీకారం..
Naveen Yadav | 26న ప్రమాణ స్వీకారం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం
స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సెలవుపై వెళ్లడంతో సోమవారం జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలో మంగళవారం ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత విచారణ సందర్భగా స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో సోమవారం హైకోర్టు నిర్ణయం ఆధారంగా మంగళవారం జరగబోయే కెబినెట్ సమావేశంలో ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అనూహ్యంగా హైకోర్టులో విచారణ వాయిదా పడటంతో కెబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందకు వెళుతుందనే అంశం ఉత్కంఠంగా ఉంది. కాగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది.
Ranbir Kapoor gets into Fresh Trolling
Bollywood Superstar Ranbir Kapoor is currently busy with the biggest projects: Ramayana (a mythological epic) directed by Nitesh Tiwari and Love & War directed by Sanjay Leela Bhansali. Ranbir Kapoor earlier revealed that he has taken a quit from non-vegetarian food and alcohol as he is playing Lord Rama in Ramayana. This has brought huge […] The post Ranbir Kapoor gets into Fresh Trolling appeared first on Telugu360 .
Clash of Titans: Salman Khan Vs Yash in 2026
2026 will witness the biggest ever clash in Indian cinema. Bollywood Superstar Salman Khan and Kannada Superstar Yash will test their luck with their respective films during the Eid 2026 season in March. The team have announced the release dates of their films and both these are high on expectations. The clash is almost confirmed […] The post Clash of Titans: Salman Khan Vs Yash in 2026 appeared first on Telugu360 .
హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానం.. ఎన్హెచ్ఆర్సికి ఫిర్యాదు
మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హిడ్మా ఎన్కౌంటర్పై విచారణ కోరుతూ ఎన్హెచ్ఆర్సికి ఫిర్యాదు చేశారు. మావోయిస్టు నాయకుడు హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయవాది విజయ్ కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి)ను ఆశ్రయించారు. ఎన్కౌంటర్ ఫేక్ అయ్యి ఉండి అవకాశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్లు 52/2025, 53/2025లో అనుమానాస్పద అంశాలు ఉన్నాయని న్యాయవాది ఆరోపించారు. ఎన్హెచ్ఆర్సి గైడ్లైన్స్ ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, దర్యాప్తు కూడా తటస్థ అధికారుల ద్వారా జరగలేదని పేర్కొన్నారు. హిడ్మా ఎన్కౌంటర్పై ప్రజలకు నిజాలు తెలియాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయవాది విజయ్ కిరణ్ మాట్లాడుతూ హిడ్మా ఎన్కౌంటర్పై అసలు సమాచారం, సాక్షాలు ప్రజలకు వెల్లడించాలి. ఫేక్ ఎన్కౌంటర్ అయితే అది ప్రభుత్వం నుండి జరిగిన చారిత్రాత్మక తప్పిదం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇక, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే నేరమే అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసు కోవడం మావోయిస్టులైనా, పోలీసులైనా నేరమే. ఎవరూ చట్టానికి పైబడిన వారు కాదన్నారు. ఈ మొత్తం కేసు వ్యవహారాన్ని ఎన్హెచ్ఆర్సి దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. అయితే, ఈ ఫిర్యాదు నేపథ్యంలో హిడ్మా ఎన్కౌంటర్పై అధికారిక దర్యాప్తు చేపడుతుందా? అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, ఈ వ్యవహారంతో కేసు ఇప్పుడు జాతీయ దృష్టిలో పడినట్లయింది.
బిసిలకు అన్యాయం చేస్తే.. రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది: జాజుల
సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో బిసిలకు తీరని అన్యాయం బిసిలతో చర్చించిన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించాలి బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మన తెలంగాణ / హైదరాబాద్: త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి శాస్త్రీయత లేకుండా అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు రిజర్వేషన్లు కేటాయించారని బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అధికారులు చేసిన తప్పిదాలకు బిసిలకు గతం కంటే ప్రస్తుతం జరగబోయే నష్టం ఎక్కువ అని ఆయనన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కాదు కదా ఇప్పుడు ఉన్న బిసి రిజర్వేషన్ల కే రాష్ట్ర ప్రభుత్వం గండికోడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బిసి రిజర్వేషన్లు అతి తక్కువ కేటాయించి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు 18 శాతం నుండి 22 శాతం వరకు బిసి రిజర్వేషన్లు అమలు జరిగితే ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో 16 శాతం నుండి 20 శాతం వరకే రిజర్వేషన్ల ను కేటాయించారని, అనేక డివిజన్లలో మండలాలలో బిసిలకు ఒక్కటి కూడా సర్పంచ్ సీటు రిజర్వు కాలేదని, మండలాల వారీగా చూస్తే ఒక మండలంలో గత ఎన్నికలలో కంటే కనీసం రెండు మూడు గ్రామాల బిసి కోటను తగ్గించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బిసి రిజర్వేషన్ కోటాను తగ్గించి జనరల్ కోట ను పెంచారన్నారు. దీనిని బట్టి బిసిలకు రావలసిన సర్పంచ్ స్థానాలను అగ్రకులాలకు కట్టబెట్టాలని కుట్ర ఇందులో దాగి ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అన్ని వివరాలను సేకరించి అతి త్వరలోనే సి ఎస్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని, ఆయన న్యాయం చేయకుంటే కోర్టుల ద్వారా పోరాటం చేస్తామని జాజుల హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బిసి మంత్రులు, ప్రజాప్రతినిధులు బిసిలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. 25న మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం, 30న చలో హైదరాబాద్, డిసెంబర్ 8 న చలో ఢిల్లీ కార్యక్రమాలను నిర్వహించి బిసి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
AKT happens during united AP hence the title – Mahesh
Director Mahesh Babu P provided fascinating insights into the unique conceptualization of his upcoming film, Energetic Star Ram Pothineni’s Andhra King Taluka. He confirmed the film is a deep emotional exploration of the bond between a fan and their idol, a subject that never had been told in this manner. The director was inspired by […] The post AKT happens during united AP hence the title – Mahesh appeared first on Telugu360 .
Temple Foundation |అయ్యప్ప స్వామి దేవాలయం శంకుస్థాపన.
Temple Foundation | అయ్యప్ప స్వామి దేవాలయం శంకుస్థాపన. Temple Foundation |అయ్యప్ప
విశాలాంధ్ర, తాడిపత్రి: పులిపొద్దుటూరు గ్రామంలో ఒక అనుమానాస్పద మృతి చెందిన సంఘటన జరిగింది . 50 ఏళ్ల రత్నమ్మ సోమవారం ఉదయం 11 గంటల సమయం లో తన ఇంట్లోని ఫ్యానుకు వేలాడుతూ అనుమానాస్పదంగా మృతి చెందింది.ఆమె తమ్ముడు మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీఐ ఎస్. శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో కేసు వివరాలు బట్టి విచారిస్తున్నారు. The post మహిళ అనుమానాస్పద మృతి.. appeared first on Visalaandhra .
మహిళల కబడ్డీ ప్రపంచకప్ విజేత భారత్
ఢాకా: భారత మహిళ కబడ్డీ జట్టు మరోసారి తన సత్తా చాటుకుంది. ఢాకా వేదికగా కబడ్డీ ప్రపంచకప్ ఫైనల్స్లో చైనీస్ తైపీని చిత్తుగా ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. 35-28 పాయింట్ల తేడాతో భారత మహిళ జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో ఆరంభం నుంచి భారత్ తన ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. గ్రూప్ స్టేజీలో థాయ్లాండ్పై 65-20, బంగ్లాదేశ్పై 43-18, జర్మనీపై 63-22, ఉగాండాపై 51-16 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఇక సెమీఫైనల్లో ఇరాన్తో తలపడిన భారత్ 33-21 తేడాతో నెగ్గింది. ఇక ఫైనల్లోనూ భారత్ దూకుడు తగ్గలేదు. చైనీస్ తైపీని ముప్పుతిప్పలు పెట్టింది. ఫలితంగా 35-28 పాయింట్ల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి వరుసగా రెండోసారి ప్రపంచకప్ను మద్దాడింది భారత్. ఈ సందర్భంగా భారత మహిళ కబడ్డీ ఆటగాళ్లు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
Drunk | పోలీసులా మజాకా Drunk | వరంగల్ క్రైమ్ ఆంధ్రప్రభ :
Sarees |ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు.
Sarees | ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు. మహిళలకు ఇందిరమ్మ చీరలను
వికటించిన ప్రేమ.. గొంతు కోసుకున్న యువకుడు
విశాలాంధ్ర, గుడిబండ: గుడిబండ మండల కేంద్రంలో ఒక యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది.మోపురుగుండు గ్రామానికి చెందిన ఈర రామప్ప కుమారుడు రామాంజి మూడు సంవత్సరాలుగా హెరేతూర్పి గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు 25 వేల రూపాయల విలువైన సెల్ఫోన్, రెండు లక్షల రూపాయల విలువ చేసే బంగారు గొలుసు చేయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిసెంబర్ నెలలో వారి వివాహానికి పెద్దలు కూడా ఒప్పందం […] The post వికటించిన ప్రేమ.. గొంతు కోసుకున్న యువకుడు appeared first on Visalaandhra .
పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్
హైదరాబాద్: పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అటాచ్ చేసింది. మధుసూదన్ రెడ్డికి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మధుసూదన్ రెడ్డికి చెందిన కంపెనీ రూ.300 కోట్ల అక్రమాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ రూ.300 కోట్లు అక్రమాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి మధుసూదన్ రెడ్డి రూ.39 కోట్ల రాయల్టీ చెల్లించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇడి ఆయన ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం.
ఆ పోస్ట్లను డిలీట్ చేసిన స్మృతి.. కారణం ఏంటో మరి..
భారత మహిళ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. వివాహనికి కొంత సమయం ముందే ఆమె తండ్రి అనారోగ్యానికి గురి కావండతో వివాహాన్ని వాయిదా వేశారు. అయితే తన పెళ్లికి సంబంధించిన పోస్ట్లను స్మృతి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పలాశ్ ముచ్చల్తో ఎంగేజ్మెంట్ను ధృవికరిస్తూ స్మృతి ఇటీవల తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. సహచర క్రికెటర్లతో కలిసి ‘సమ్జో హో హి గయా’ అనే బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ సందర్భంగా తన ఎంగేజ్మెంట్ రింగ్ను చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో ఆమె ఇన్స్టా ఖాతాలో కనిపించడం లేదు. అయితే ఈ వీడియోని ఆమె డిలీట్ చేసిందా.? లేదా హైడ్ చేసిందా.? అనే విషయంపై క్లారిటీ లేదు. అంతేకాదు స్మృతి స్నేహితురాళ్లు జెమీమా, శ్రేయాంక కూడా తమ సోషల్మీడియా ఖాతాల్లో ఈ వీడియోని తొలగించడం గమనార్హం. మరోవైపు పలాశ్ స్మృతికి ప్రపోజ్ చేసిన వీడియో మాత్రం అతని ఖాతాలో కనిపిస్తోంది. మరి స్మృతి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
BC Reservation |రిజర్వేషన్లు సవరించాలంటూ రాస్తారోకో
BC Reservation | రిజర్వేషన్లు సవరించాలంటూ రాస్తారోకో BC Reservation | జన్నారం,
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత #Bollywood #Dharmendra #Mumbai #PadmaBhushan #CinemaNews #RIP
Huzurnagar |ఔటర్ రింగ్ రోడ్డు 95 శాతం పూర్తి
Huzurnagar | ఔటర్ రింగ్ రోడ్డు 95 శాతం పూర్తి Huzurnagar |హుజూర్నగర్,
Seethakka |మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న…
Seethakka | మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న… మహిళ సంఘాలకు వ్యాపార
Telangana : 80 కోట్ల విలువైన ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు సీజ్
పటాన్ చెర్వు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి సోదరుడు ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేశారు
మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు కృషి చేస్తున్నాం: రేవంత్
కొడంగల్: కొడంగల్లో ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. జీవితాల్లో మార్పు రావాలంటే.. పిల్లలను చదివించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్లో 28 వేల మందికి ఉదయం అల్పాహారం అందిస్తున్నామని, ఐదు వేల కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్ను నిర్మిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోనే తొలి సైనిక్ స్యూల్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కొడంగల్ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్గా 16 నెలల్లోపు చేసి తీరుతామన హామీ ఇచ్చారు. మహిళలు ఆత్మ గౌరంవగా బతికేందుకు కృషి చేస్తున్నామని, ప్రజలకు సన్నబియ్యం పంపిణఈ చేస్తున్నానమని, మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని.. సిఎం అన్నారు. వెయ్యి ఆర్టిసి బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని పేర్కొన్నారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళలను ప్రోత్సాహిస్తున్నామని అన్నారు. సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులకు కూడా మహిళలను యజమానులను చేశామని చెప్పారు. మహిళా సంఘాల ఉత్పత్తులు అమెజాన్లో అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Telangana : సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ లో ప్రమాదం
సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు సమాచారం
Dandepally |విద్యార్థులకు బోదిస్తున్న ఉపాధ్యాయులు
Dandepally | విద్యార్థులకు బోదిస్తున్న ఉపాధ్యాయులు ప్రయోగాలతోనే ఉత్తమ ఫలితాలు Dandepally |
Balakrishna In Full Divine Glory In Akhanda2
God of Masses Nandamuri Balakrishna and director Boyapati Sreenu’s fourth film together, Akhanda 2, is set for release on December 5th, carrying huge expectations thanks to its powerful promotional content and the team’s vigorous publicity. The action sequences composed by Ram-Lakshman masters are said to be one of the film’s biggest highlights. Ram-Lakshman masters reveal […] The post Balakrishna In Full Divine Glory In Akhanda2 appeared first on Telugu360 .
R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్ను ప్రారంభించిన శామ్సంగ్
గురుగ్రామ్: శామ్సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, సాధారణ ఇమేజింగ్ కోసం తన సూపర్-ప్రీమియం, నెక్స్ట్-జనరేషన్ R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు, అత్యుత్తమ ఇమేజ్ క్లారిటీ మరియు వైద్యుడి సౌకర్యం మరియు సామర్థ్యంపై దృష్టి సారించిన ఎర్గోనామిక్ డిజైన్ను కలపడం ద్వారా సాధారణ ఇమేజింగ్లో R20 ఒక పెద్ద ముందడుగుని సూచిస్తుంది. శామ్సంగ్ యొక్క అత్యాధునిక క్రిస్టల్ ఆర్కిటెక్చర్™ ఆధారంగా నిర్మితమైన R20, సాధారణ ఇమేజింగ్ అప్లికేషన్ల విస్తృత శ్రేణిలో అద్భుతమైన చిత్ర ఏకరూపత, రిజల్యూషన్ మరియు లోతైన వివరాలను అందిస్తుంది. దీని నెక్స్ట్-జెన్ ఇమేజింగ్ ఇంజిన్, శక్తివంతమైన GPU మరియు అల్ట్రా హై-డెఫినిషన్ OLED మానిటర్ కలయిక ప్రతి స్కాన్లో అత్యుత్తమ విజువలైజేషన్ను అందించి, క్లినిషియన్లకు మరింత డయాగ్నొస్టిక్ విశ్వాసాన్ని కల్పిస్తుంది. సంక్లిష్ట విధానాలను సరళీకృతం చేసి, పునరావృత పనులను ఆటోమేట్ చేయడానికి రూపొందించిన AI-ఆధారిత క్లినికల్ మరియు వర్క్ఫ్లో ఎన్హాన్స్మెంట్ టూల్స్ యొక్క సమగ్ర సూట్ను R20 అందిస్తుంది. ప్రధాన సాంకేతికతలు దిగువన ఇవ్వబడ్డాయి: ● లైవ్ లివర్ అసిస్ట్ – లైవ్ అల్ట్రాసౌండ్ స్కాన్ సమయంలో అనుమానాస్పద ఫోకల్ గాయాన్ని గుర్తిస్తుంది ● లైవ్ బ్రెస్ట్ అసిస్ట్ –రొమ్ము గాయాలను నిజ-సమయంలో గుర్తించి, వాటికి అనుగుణమైన BI-RADS వర్గీకరణ మరియు రిపోర్టింగ్ను అందిస్తుంది. ● ఆటో మెజర్మెంట్ సాధనాలు – AI ఆధారిత ఆటోమేటిక్ డిటెక్షన్తో అంతర్గత నిర్మాణాలను ఖచ్చితంగా కొలుస్తూ, అధిక స్థిరత్వం మరియు గరిష్ట నిర్గమాంశం కోసం గైడెడ్ రిపోర్టింగ్ను అందిస్తుంది. ● డీప్ USFF – AI-ఆధారిత డీప్ అల్ట్రాసౌండ్ ఫ్యాట్ ఫ్రాక్షన్ క్వాంటిఫికేషన్, బంగారు ప్రమాణానికి నిరూపితమైన అధిక సహసంబంధాన్ని అందిస్తుంది - అంటే MRI-PDFF. దాని అధునాతన ఇమేజింగ్ నిర్మాణంతో, R20 పొత్తికడుపు, థైరాయిడ్, మస్క్యులోస్కెలిటల్, వాస్కులర్, రొమ్ము, ప్రసూతి, గైనకాలజీ మరియు యూరాలజీ ఇమేజింగ్ వంటి విస్తృతమైన క్లినికల్ అప్లికేషన్లలో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. అభివృద్ధి చెందిన డాప్లర్ సున్నితత్వం మరియు రంగు ప్రవాహ విజువలైజేషన్ వైద్యులకు సూక్ష్మ వాస్కులర్ నిర్మాణాలు మరియు పాథాలజీలను మరింత ఖచ్చితత్వం మరియు నమ్మకంతో గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఈ బహుముఖ ప్రజ్ఞ R20ని ఆరోగ్య సంరక్షణ నిపుణులు వివిధ రోగుల ప్రొఫైల్లలోనూ స్థిరమైన, ఉన్నత-నాణ్యత గల రోగనిర్ధారణ ఫలితాలను సాధించగల ఒక శక్తివంతమైన పరిష్కారంగా నిలబెడుతుంది. “తెలివైన ఆవిష్కరణల ద్వారా వైద్య సేవలను ముందుకు తీసుకెళ్లాలన్న శాంసంగ్ దృఢ నిబద్ధతకు R20 ఒక స్పష్టమైన ఉదాహరణ. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యుత్తమ ఇమేజ్ క్వాలిటీ మరియు క్లినిషియన్ సౌకర్యాన్ని కలిపి, R20 అల్ట్రాసౌండ్ టెక్నాలజీలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది. ప్రత్యక్ష స్కానింగ్లోనే సూక్ష్మ గాయాలను గుర్తించడానికి వైద్యులను శక్తివంతం చేస్తూ, ఇది డయగ్నస్టిక్ విశ్వసనీయతను కొత్త స్థాయికి తీసుకెళ్తుంది,” అని మిస్టర్ అటంత్ర దాస్ గుప్తా, HME బిజినెస్ హెడ్, శామ్సంగ్ ఇండియా అన్నారు. దాని ఇమేజింగ్ సామర్థ్యాలకు మించి, R20 వినియోగదారు సౌకర్యం మరియు కార్యాచరణ నైపుణ్యాన్ని నొక్కి చెబుతుంది. ఎర్గోనామిక్స్ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఇది తేలికైన ట్రాన్స్డ్యూసర్ కేబుల్స్, సహజమైన టచ్ ఇంటర్ఫేస్ మరియు విభిన్న క్లినికల్ అవసరాలను తీర్చడానికి అనుకూలీకరించదగిన సిస్టమ్ కాన్ఫిగరేషన్లను కలిగి ఉంది. వ్యవస్థ యొక్క మెరుగుపరిచిన డిజైన్ ఒత్తిడి మరియు అలసటను గణనీయంగా తగ్గిస్తూ, వైద్యులు అత్యంత ప్రాధాన్యమైన అంశం—తమ రోగుల సంరక్షణపై మరింత దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. R20 ప్రారంభంతో, ఆరోగ్య సంరక్షణ సాంకేతికత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో శామ్సంగ్ తన నిబద్ధతను మరోసారి స్పష్టం చేసింది. AI-ఆధారిత మేధస్సు, ఉన్నతమైన ఇమేజింగ్ పనితీరుతో మిళితమైన R20, సాధారణ ఇమేజింగ్ యొక్క ప్రకృతి దృశ్యాన్ని మార్చడానికి మరియు వైద్యులు మరియు రోగిని సంరక్షణ కేంద్రంలో ఉంచే రూపకల్పనకు సెట్ చేయబడింది.
Telangana : జీవన్ రెడ్డి నేరుగా సీఎం ను టార్గెట్ చేయడం వెనుక అందుకేనా?
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు
All india |ఎస్సీ రిజర్వేషన్స్ లో అన్యాయం
All india | ఎస్సీ రిజర్వేషన్స్ లో అన్యాయం All india |
Bhimgal | భర్తను చంపిన భార్యలు డీజీల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య
Congress |మహిళాభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
Congress | మహిళాభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి Congress |డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్
Telangana : కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ వరాలు
కొడంగల్ లో అత్యున్నతమైన విద్యాసంస్థను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు
రైతులను మోసం చేయడానికే రైతన్న మీకోసం కార్యక్రమం
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి విశాలాంధ్ర- ఉరవకొండ : రైతుల పడుతున్న కష్టాలు, బాధలు కనిపించనీయకుండా, దీనిమీద చర్చజరగకుండా వాటికి ముసుగు వేసి చంద్రబాబు తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రైతన్నా.. మీకోసం’’ అంటూ రైతులను మోసం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక వైసిపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో రైతులకోసం ఏం చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. […] The post రైతులను మోసం చేయడానికే రైతన్న మీకోసం కార్యక్రమం appeared first on Visalaandhra .
Dk Aruna : దిక్కులేని కాంగ్రెస్ దిక్కుమాలిన పనులు : డీకే అరుణ
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు
Agriculture |రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
Agriculture | రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం Agriculture | డోర్నకల్ ఎమ్మెల్యే
TG |పంచాయతీ రిజర్వేషన్లలో బిసిలకు తీవ్ర అన్యాయం
TG | పంచాయతీ రిజర్వేషన్లలో బిసిలకు తీవ్ర అన్యాయం బీసీ నేతల ఆందోళన!
_ గ్రామం నుండి పందుల తరలింపు _ విశాలాంధ్ర కథనానికి స్పందన విశాలాంధ్ర -వలేటివారిపాలెం : నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం అక్షర యుద్ధం చేస్తున్న విశాలాంధ్ర దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం విశాలాంధ్ర దినపత్రికలో ప్రచురితమైన ఇలా ఉంటే రోగాలు రావా..? అనే కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం కందుకూరు డివిజనల్ పంచాయతీ అధికారి కొండపి కృష్ణమోహన్ ఆదేశాలతో ఎంపీడీవో వై శంకర్ రావు డిప్యూటీ ఎంపీడీవో నారాయణ, […] The post పోకూరులో పారిశుద్ధ్య పనులు appeared first on Visalaandhra .
స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే జనసేన పార్టీ లక్ష్యం
రేగాటిపల్లి చెరువుకు పూజ చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని రేగాటిపల్లి చెరువు మంత్రినివా నీటి ప్రవాహంతో పూర్తిస్థాయిలో నిండిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిల కంమధుసూదన్ రెడ్డి, సతీమణి చిలకం ఛాయాదేవి తో కలిసి చెరువుకు గంగపూజ నిర్వహించారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రేగాటిపల్లి చెరువు పూర్తి దశలో నిండడం గ్రామ ప్రజలకు ఎంతో సంతోషదాయకమని తెలిపారు. ఈ […] The post స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే జనసేన పార్టీ లక్ష్యం appeared first on Visalaandhra .
Tamilnadu |ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఘణ స్వాగతం…
Tamilnadu | ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఘణ స్వాగతం… Tamilnadu | అచ్చంపేట, ఆంధ్రప్రభ
Telangana : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్...304 కోట్లు విడుదల
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీలేని రుణాలను రేపు పంపిణీ చేయనుంది
Adluri Laxman |నిరుపేదలకు సొంతింటి కల సాకారం…
Adluri Laxman | నిరుపేదలకు సొంతింటి కల సాకారం… Adluri Laxman |
ఆస్పత్రిలో కుప్పకూలిన సెంట్రింగ్.. ముగ్గరు మృతి
హైదరాబాద్: నగరంలోని సనత్నగర్ ఇఎస్ఐ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్లో పని చేస్తుండగా.. సెంట్రింగ్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఆస్పత్రిలో బిల్డింగ్ రెనోవేషన్ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు ఎమర్జెన్సీ వార్డులో పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రికెట్లో ప్రతిభ చూపిన ధర్మవరం జట్టు
విశాలాంధ్ర ధర్మవరం; బాలికల కోసం ప్రతిష్టాత్మక గ్రామీణ క్రికెట్ లీగ్ ప్రారంభమైంది అని, ధర్మారం క్రికెట్ జట్టు మంచి ప్రతిభను కనపరచడం జరిగిందని ధర్మవరం క్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లీగ్లో భాగంగా బత్తలపల్లిలో ధర్మవరం బాలికల జట్టు , బత్తలపల్లి బాలికల జట్టు మధ్య మ్యాచ్ జరుగగా, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని బత్తలపల్లి జట్టు నిర్ణయించుకున్నారని తెలిపారు. బత్తలపల్లి జట్టు 16.4 ఓవర్లలో కేవలం 41 పరుగులకే […] The post క్రికెట్లో ప్రతిభ చూపిన ధర్మవరం జట్టు appeared first on Visalaandhra .
ఎన్టిఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నాను: తుమ్మల
హైదరాబాద్: ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లో..ఇంత కళంకమైన కుచ్చితమైన రాజకీయాల్లో రాణిస్తున్నానంటే..అది దివంగత మాజీ సిఎం ఎన్టిఆర్ చలువే అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. ఎన్టిఆర్ శిష్యుడు ఎవరు అంటే తుమ్మల అనే పేరు తెచ్చుకున్నానని అన్నారు. ఖమ్మంలో ఎన్టిఆర్ విగ్రహావిష్కరణలో తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1983 నుంచి నేటి వరకు ఎన్టిఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానని, రాముడి పాదాల దగ్గర.. పార్టీలో ఎన్టిఆర్ చేర్చుకున్నారని తెలియజేశారు. నిజాయితీ, నిబధ్ధతతో పనిచేయడం నేర్చుకున్నానని, ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నానని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Chairmen |బాధ్యతలు చేపట్టిన సామ బాపురెడ్డి
Chairmen | బాధ్యతలు చేపట్టిన సామ బాపురెడ్డి Chairmen | కమ్మర్ పల్లి,
నాలుగు లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సిఐటియు నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్స్ నోటిఫికేషన్కు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కళా జ్యోతి సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నోటిఫికేషన్ కాఫీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ఓబులు మాట్లాడుతూ బీహార్ లో ఎన్నికలు జరిగిన అనంతరం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగానే కోట్లాదిమంది కార్మికులకు అన్యాయం జరుగుతున్న దేశంలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నటువంటి కార్పొరేట్లకు అనుకూలంగా […] The post నాలుగు లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సిఐటియు నాయకులు appeared first on Visalaandhra .
జిల్లాస్థాయి జూడో పోటీల్లో జీవీఈ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిల ప్రతిభ
విశాలాంధ్ర ధర్మవరం; జిల్లాస్థాయి జూడో పోటీల్లో ధర్మవరం పట్టణానికి చెందిన జీవీఈ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు ప్రతిభ కనపరచడం జరిగిందని జూడో కోచ్ భాషా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 21వ తేదీన అనంతపూర్ ఆర్టీడీ స్టేడియంలో జిల్లాస్థాయి జూడో పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలలో ధర్మవరం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సుమన మా పాఠశాల నుండి జూడో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనటువంటి […] The post జిల్లాస్థాయి జూడో పోటీల్లో జీవీఈ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిల ప్రతిభ appeared first on Visalaandhra .
Minister |ప్రతి ఆడబిడ్డకు చీర సారే
Minister | ప్రతి ఆడబిడ్డకు చీర సారే .. మహిళలను కోటీశ్వరులను చేయడమే
Mulugu |గుత్తికోయలకు బ్లాంకెట్స్, స్వెటర్ల పంపిణీ
Mulugu| గుత్తికోయలకు బ్లాంకెట్స్, స్వెటర్ల పంపిణీ Mulugu| ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు :
Kalvakuntla Kavitha launches a vitriolic attack on Niranjan Reddy
Telangana Jagrithi founder Kalvakuntla Kavitha launched a vitriolic attack on former Minister Niranjan Reddy. The firebrand woman leader delivered a strong warning to BRS senior Niranjan Reddy, using harshest terms, exposing the bitterness between the leaders. The rebel MLC Kalvakuntla Kavitha is touring across Telangana and visited Kothakota, which is part of Wanaparthy district, on […] The post Kalvakuntla Kavitha launches a vitriolic attack on Niranjan Reddy appeared first on Telugu360 .
అలరించిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్యం…
గురువు బాబు బాలాజీవిశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి శిల్పారామంలో శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి సందర్భంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలితా నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ , రామ లాలిత్య, శిష్య బృందం 20 మంది పాల్గొని చేసిన నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గురువు బాబు బాలాజీ మాట్లాడుతూ సాయిబాబా […] The post అలరించిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్యం… appeared first on Visalaandhra .
BJP |భారీగా చేరికలు Bjp | రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపిని ఆదరించాలి

19 C