SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

ఉద్యమం చేపడితే తప్ప సమస్యలు పరిష్కారం కావా?..

ఉద్యమం చేపడితే తప్ప సమస్యలు పరిష్కారం కావా?.. ఉపాధ్యాయుల పరిష్కరిస్తారో- ఉద్యమాన్ని మరింత

ప్రభ న్యూస్ 25 Feb 2026 2:29 pm

పరస్పర గౌరవంతో జీవితం కొనసాగించాలి: మోడీ

హైదరాబాద్: పెళ్లి చేసుకోబోతున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందనాకు పిఎం మోడీ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్-రష్మిక పెళ్లి వేడుకకు ప్రధానిని ఆహ్వానించడంతో ఆయన వారికి లేఖ రాశారు. వివాహ పత్రిక అందుకోవడం ఆనందంగా ఉందని మోడీ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాల్లో కాకుండా నిజం జీవితంలో ఇద్దరు ప్రేమానురాగాలతో కొత్త జీవితాన్ని అందంగా నిర్మించుకోవాలని పిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. సప్తపది పవిత్ర సంప్రదాయంతో జీవితాంతం స్నేహితులు, దంపతులుగా అన్యోన్యంగా ఉండాలన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితం సాఫీగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విజయ్-రష్మికల జీవితం అద్భుతంగా ఉండాలన్నారు. ఫిబ్రవరి 26న విజయ్-రష్మిక ఉదయ్ పూర్‌లో వివాహం చేసుకోనున్నారు. ఈ పెళ్లికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నటులు, అతిరథ మహారథులు హాజరుకానున్నారు. 

మన తెలంగాణ 25 Feb 2026 2:27 pm

ఆపరేషన్ వజ్ర ప్రహార్.. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం

ఆపరేషన్ వజ్ర ప్రహార్.. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం గంజాయి అక్రమ రవాణా…. ఇద్దరు అరెస్ట్2

ప్రభ న్యూస్ 25 Feb 2026 2:26 pm

Prabhas |కల్కి 2 సెట్ కి వచ్చేది ఎప్పుడు..?

Prabhas | కల్కి 2 సెట్ కి వచ్చేది ఎప్పుడు..? Prabhas |

ప్రభ న్యూస్ 25 Feb 2026 2:24 pm

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ఉద్యోగావకాశాలకు చక్కటి అవకాశం..తిరువూరు ప్రభుత్వ డిగ్రీ

ప్రభ న్యూస్ 25 Feb 2026 2:23 pm

ఈనెల 28న జాబ్ మేళా..

ఈనెల 28న జాబ్ మేళా.. గన్నవరం – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

ప్రభ న్యూస్ 25 Feb 2026 2:19 pm

ఘనంగా జన్మదిన వేడుకలు

ఘనంగా జన్మదిన వేడుకలు అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణులు

ప్రభ న్యూస్ 25 Feb 2026 2:11 pm

రంజీ ఫైనల్‌లో జగడం.. ఆటగాడి తలపై కొట్టిన ప్రత్యర్థి..

రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్‌ మ్యాచ్‌లో జమ్ము కశ్మీర్‌తో కర్ణాటక తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కర్ణాటక ఆటగాడు కెవి అనీష్‌పై జమ్ము కశ్మీర్ కెప్టెన్ పరాస్ డోగ్రా దాడికి దిగాడు. దీంతో మ్యాచ్‌లో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి జమ్ము కశ్మీర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ సీజన్‌లో మొత్తం రాణించిన ఈ జట్టు ఫైనల్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. శుభమ్ పుండిర్ (121) అద్భుత సెంచరీ చేయగా.. యావెర్ హస్సన్ (88), అబ్దుల్ సమద్ (61) అర్థ శతకాలు సాధించారు. దీంతో రెండో రోజు తొలి సెషన్‌ ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 380 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ప్రారంభం నుంచి బౌలర్లు ప్రశిద్ధ్ కృష్ణ, వైశాక్ విజయ్ కుమార్, విద్యాధర్ పాటిల్‌ బౌన్సర్లతో డోగ్రాను ఇబ్బంది పెట్టారు అదే పనిగా ఫీల్డర్డ స్లెడ్జింగ్ చేయసాగారు. దీంతోప ప్రశిద్ధ్ కృష్ణ వేసిన 101 ఓవర్‌లో బౌండరీ కొట్టిన తర్వాత షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కెవి అనీష్‌ వైపు దూసుకెళ్లి.. తన హెల్మ్‌ట్‌తో అతడి తలపై కొట్టాడు. దీంతో వాతావరణం హీటెక్కింది. కర్ణాటక సీనియర్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ డోగ్రాపై సీరియస్ అయ్యాడు. అంపైర్లు జోక్యం చేసుకొని గొడవ పెద్దతి కాకుండా ఆటగాళ్లకు సర్ధి చెప్పారు. ఈ విషయంపై కర్ణాటక కెప్టెన్ దేవదత్ పడిక్కల్ మ్యాచ్ రెఫరీకి కంప్లైంట్ చేశాడు. pic.twitter.com/pddcZJCrgs — crictalk (@crictalk7) February 25, 2026

మన తెలంగాణ 25 Feb 2026 2:09 pm

స్థానిక యువతకే ఉద్యోగాలివ్వాలి

స్థానిక యువతకే ఉద్యోగాలివ్వాలి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ​శ్రీకాళహస్తి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 25 Feb 2026 2:08 pm

పసిపాప ప్రాణాలకు భరోసా…

పసిపాప ప్రాణాలకు భరోసా… చిన్నారి పునర్విక వైద్యం కోసం…పి ఎం సహాయ నిధి

ప్రభ న్యూస్ 25 Feb 2026 2:03 pm

రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ వేడుకలు

రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ వేడుకలు మార్చి 7న సబ్ కలెక్టర్ కార్యాలయంలో

ప్రభ న్యూస్ 25 Feb 2026 2:00 pm

ఫ్యాక్ట్ చెక్: ఆటోలో కూర్చున్న యువతిని ఒక వ్యక్తి వేధిస్తున్నట్లుగా ఉన్న వీడియో నిజమైన ఘటన కాదు

ఆటోలో కూర్చున్న యువతిని ఒక వ్యక్తి వేధిస్తున్నట్లుగా ఉన్న వీడియో

తెలుగు పోస్ట్ 25 Feb 2026 1:53 pm

Vijay devarakonda |ఆ ప్రాజెక్ట్ కు నో చెప్పాడా..?

Vijay devarakonda | ఆ ప్రాజెక్ట్ కు నో చెప్పాడా..? Vijay devarakonda

ప్రభ న్యూస్ 25 Feb 2026 1:21 pm

Basara |పాపం ఏం జరిగిందో.. ఏమో..

Basara | పాపం ఏం జరిగిందో.. ఏమో.. Basara | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 25 Feb 2026 1:20 pm

45 Days: Fresh Twist in Tirumala Laddu Row

The Tirumala laddu controversy has entered a new phase with the Andhra Pradesh government appointing a one-man commission to conduct an independent inquiry. The issue has already escalated politically after Chief Minister N. Chandrababu Naidu presented details in the Assembly, and a heated debate is expected in the Legislative Council over allegations linked to Indapur […] The post 45 Days: Fresh Twist in Tirumala Laddu Row appeared first on Telugu360 .

తెలుగు 360 25 Feb 2026 1:18 pm

Hyderabad : న్యాయస్థానాలకు బాంబు బెదిరింపు

హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.

తెలుగు పోస్ట్ 25 Feb 2026 1:17 pm

Trump Claims He Saved Pakistan PM From Death, Prevented Nuclear War With India

US President Donald Trump has once again stirred global attention with a dramatic claim about India and Pakistan. Speaking at the 2026 State of the Union address, Trump declared that 35 million people would have died during the India-Pakistan military standoff if he had not intervened. He went a step further. Trump said Pakistan Prime […] The post Trump Claims He Saved Pakistan PM From Death, Prevented Nuclear War With India appeared first on Telugu360 .

తెలుగు 360 25 Feb 2026 1:17 pm

Marriage|బంగారం, వెండి ధ‌ర‌ల్లో స్వ‌ల్ప మార్పు

Marriage| బంగారం, వెండి ధ‌ర‌ల్లో స్వ‌ల్ప మార్పు ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : శుభ‌ముహూర్తాలు

ప్రభ న్యూస్ 25 Feb 2026 1:11 pm

విజయలక్ష్మి భౌతిక కాయానికి నివాళులు

విజయలక్ష్మి భౌతిక కాయానికి నివాళులు గుడివాడ – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా ఆదిమాంద్ర

ప్రభ న్యూస్ 25 Feb 2026 1:06 pm

జింబాబ్వేతో మ్యాచ్.. టీం ఇండియాకు రవిశాస్త్రి కీలక సూచనలు

ఐసిసి టి-20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీం ఇండియా 76 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో నాలుగుకు నాలుగు మ్యాచ్‌లు గెలిచిన సూర్యకుమార్ సేన.. సఫారీల ముందు చతికిలపడింది. దీంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత జట్టుకు మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు. సౌతాఫ్రికాతో ఓటమి భారత జట్టకు ఓ మేలుకొలుపు అని ఆయన అన్నారు. ‘‘భారత్ టి-20 ప్రపంచకప్‌లో వరుసగా 12 మ్యాచుల్లో (గత ప్రపంచకప్ విజయాలతో కలిపి) విజయం సాధించింది. కానీ, దక్షిణాఫ్రికాతో ఓటమిపాలయ్యారు. ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి. జట్టు కూర్పులో మార్పులు, చేర్పులు చేసేందుకు సమయం ఆసన్నమైంది. జట్టు ప్రణాళికల గురించి పునరాలోచన చేయాలి. భారత్ ఇకపై తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే మరో మ్యాచ్ ఓడితే చాలా ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది’’ అని శాస్త్రి అన్నారు. జింబాబ్వేతో జరిగే మ్యాచ్ నేపథ్యంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. ‘‘అక్షర్ పటేల్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకోవాలి. ఎందుకంటే అతడి అనుభవం జట్టుకు అవసరం. అలాగే వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఆడించాలి. అదనపు స్పిన్నర్ ఉంటే అది జట్టుకే మంచిది. అక్షర్‌ను నెం.8 స్థానంలో ఆడించాలి. ఐదో స్థానంలో హార్థిక్, నెం.6లో శివమ్ దూబె, నెం.7లో వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ ఆడాలి’’ అని రవిశాస్త్రి సూచించారు. 

మన తెలంగాణ 25 Feb 2026 1:04 pm

High Court |బాంబు బెదిరింపులు

High Court | బాంబు బెదిరింపులు High Court | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 25 Feb 2026 1:03 pm

Kalyanram |బింబిసార 2 తెర వెనుక ఏం జరిగింది..?

Kalyanram | బింబిసార 2 తెర వెనుక ఏం జరిగింది..? బింబిసార 2

ప్రభ న్యూస్ 25 Feb 2026 12:54 pm

Tirupati |పాపం మూడేళ్ల చిన్నారిని…

Tirupati | పాపం మూడేళ్ల చిన్నారిని… Tirupati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 25 Feb 2026 12:54 pm

Line man dead : ప‌ల్నాడులో విషాదం Andhra Prabha News

Line man dead : ప‌ల్నాడులో విషాదం Andhra Prabha News (నకరికల్లు,

ప్రభ న్యూస్ 25 Feb 2026 12:50 pm

Delhi |భార్య, ముగ్గురు పిల్లలను…

Delhi | భార్య, ముగ్గురు పిల్లలను… Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 25 Feb 2026 12:49 pm

H1B Visa Cancelled at Abu Dhabi Preclearance Sparks Online Debate

A Reddit post about an H1B visa cancellation at Abu Dhabi International Airport has triggered intense discussion across social media. Although the original post has since been deleted, screenshots continue to circulate widely. According to the account shared online, a woman working full time in the United States travelled to India in November to celebrate […] The post H1B Visa Cancelled at Abu Dhabi Preclearance Sparks Online Debate appeared first on Telugu360 .

తెలుగు 360 25 Feb 2026 12:46 pm

Chandrababu : చంద్రబాబు సమీక్షలు అంతవరకేనా? గ్రౌండ్ లెవెల్ లో వేరేలా ఉందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ జరుపుతారు

తెలుగు పోస్ట్ 25 Feb 2026 12:33 pm

కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి..

ఎండపల్లి, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేరా జాతరలో జరిగిన ఘటనలో

ప్రభ న్యూస్ 25 Feb 2026 12:27 pm

Nara Lokesh : మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

తెలుగు పోస్ట్ 25 Feb 2026 12:27 pm

మక్తల్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా

మక్తల్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీని

ప్రభ న్యూస్ 25 Feb 2026 12:23 pm

కసాయి తల్లి...ఏడుపు ఆపలేదని... పసిబిడ్డను పొయ్యిలో పడేసి

హైదరాబాద్ బౌరంపేటలో అమానుష ఘటన చోటు చేసుకుంది

తెలుగు పోస్ట్ 25 Feb 2026 12:20 pm

ఎన్మగండ్ల పాఠశాలలో ఘటన

పాలమూరు, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని ఎన్మగండ్ల

ప్రభ న్యూస్ 25 Feb 2026 12:20 pm

ప్రథమ ఇంటర్ థియరీ వార్షిక పరీక్షలు ప్రారంభం

ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ ; ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రథమ ఇంటర్ థియరీ

ప్రభ న్యూస్ 25 Feb 2026 12:12 pm

T202026|అలా జ‌రుగుతుందంటారా..?

T202026| అలా జ‌రుగుతుందంటారా..? T202026| టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో భార‌త్ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కంభార‌త్‌

ప్రభ న్యూస్ 25 Feb 2026 12:03 pm

T20 World Cup : భారత్ కు టాప్ ఆర్డర్ వైఫల్య కష్టాలు.. రేపు అధిగమించేనా?

టీ 20 వరల్డ్ కప్ లో రేపు భారత్ - జింబాబ్వే తలపడనున్నాయి

తెలుగు పోస్ట్ 25 Feb 2026 12:01 pm

అదుపుతప్పి కారు బోల్తా….

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామ

ప్రభ న్యూస్ 25 Feb 2026 11:53 am

శ్రీకాకుళంలో విజృంభిస్తున్న డయేరియా... నలుగురు మృతి?... పలువురి పరిస్థితి విషమం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తొంది. డయేరియాతో ఒకరు మృతి చెందగా 70 మంది బాధితులు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురు బాధితుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మంగువారితోట ప్రాంతంలో కండ్రవీధికి చెందిన మండల సురేశ్‌(43) మంగళవారం తెల్లవారుజామున డయేరియాతో చనిపోయాడు. స్థానిక మీడియాలో మాత్రం నలుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీకాకులం జిల్లా కేంద్రంలోని దమ్మలవీధి, గుడివీధి, కుమ్మరివీధి, కాకివీధి, సారంగడాల వీధి, ఎచ్చెర్లవారి వీధి, గోల్కొండరేవు, రంగిరీజు వీధుల్లో డయేరియా వీరవిహారం చేస్తోంది. డయేరియాను గుర్తించడంలో యంత్రాంగంతో పాటు ప్రభుత్వం విఫలమైందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. రోజురోజుకీ డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతున్నకూడా పట్టించుకోవడం లేదని,  వైద్య సేవలు కూడా అందుబాటులో లేవని బాధితుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరణాలు సంభవిస్తుండడంతో ఆయా ప్రాంతాల ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం తీరుపై బాధితుల కుటుంబాలతో పాటు శ్రీకాకుళం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంచినీటి కష్టాలు పెరగడంతో ప్రజలు మండిపడుతున్నారు. మంచినీరు సరఫరా చేయలేక యంత్రాంగం చేతులెత్తేసింది. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ క్రాస్ సొసైటీ నీరు అందిస్తుంది. దళిత వాడల్లో నీళ్లు కూడా ఇవ్వలేరా అని ప్రభుత్వాన్ని మహిళలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. దళిత మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.  

మన తెలంగాణ 25 Feb 2026 11:50 am

నేటి నుంచి ఇంటర్మిడియేట్ పరీక్షలు షురూ

చెన్నూర్, ఆంధ్రప్రభ : బోర్డ్ అఫ్ ఇంటర్మిడియేట్ ఇవ్వటినుంచి మొదలైయ్యాయి. నేటి నుంచి

ప్రభ న్యూస్ 25 Feb 2026 11:50 am

కనుముక్కులలో ఘనంగా తిరుకళ్యాణ మహోత్సవం

భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 25 (జనం సాక్షి):మండలంలోని కనుముక్కుల గ్రామంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి …

జనం సాక్షి 25 Feb 2026 11:49 am

ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం

–వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి: ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కడా నిర్లక్ష్యం వహించవు రాదు అని ఏపీ సీఎం చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నపాధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన, శ్రీకాకుళంలో డయేరియా అంశాలపై బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ఘటనల్లో బాధితుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్స గురించి […] The post ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Feb 2026 11:48 am

మార్కండేయుడిని దర్శించుకున్న శ్రీరామాలయం ట్రస్ట్ కమిటీ

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ లోని శివనగర్ శ్రీ శివ భక్త

ప్రభ న్యూస్ 25 Feb 2026 11:47 am

ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్‌ పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా 62.76 లక్షల మందికి రూ. 2725 కోట్ల విడుదలకొత్తగా 8,977 మందికి కూడా ఈ నెల నుంచే పెన్షన్ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కల్పించే వార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన పింఛన్లను ఒకరోజు ముందుగానే, అంటే ఫిబ్రవరి 28వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక […] The post ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్‌ పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Feb 2026 11:40 am

హైదరాబాద్ లో నడిరోడ్డుపై వెంటాడి వేటాడి ఓ వ్యక్తి హత్య

భరత్ నగర్: హైదరాబాద్‌లోని మూసాపేట ప్రాంతంలో నడిరోడ్డుపై కత్తులతో వెంటపడి దారుణంగా ఓ వ్యక్తిని చంపేశారు. భరత్ నగర్ బ్రిడ్జి పక్కన శంకర్(48) అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు.  మంగళవారం తెల్లవారుజామున నడిరోడ్డుపై కత్తులతో వెంటపడి హత్య చేశారు. వెంటాడి వేటాడి కత్తులతో పొడుస్తుండగా స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 25 Feb 2026 11:35 am

Chandrababu : అధికారులపై చంద్రబాబు సీరియస్

శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష‍ నిర్వహించారు

తెలుగు పోస్ట్ 25 Feb 2026 11:35 am

జల్లి గ్రామంలో ఘర్షణ

ఒకరి పై దాడి… పరిస్థితి విషమం.. చెన్నారావుపేట, ఫిబ్రవరి 24 ( జనం సాక్షి): మండలంలోని జల్లి గ్రామంలో ఘర్షణ జరిగిన …

జనం సాక్షి 25 Feb 2026 11:33 am

పునర్వికకు పునర్జన్మ..విజయవంతమైన నిధుల సేకరణ

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక కోసం కదిలిన తెలుగు ప్రజలు సోషల్ మీడియా ద్వారా విజయవంతమైన క్రౌడ్ ఫండింగ్.. సమకూరిన చికిత్స ఖర్చులుఇకపై విరాళాలు పంపవద్దని, నిధుల సేకరణ ఆపేయాలని కోరిన తండ్రిమానవత్వం గెలిచింది. అరుదైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకమయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఒక మహాయజ్ఞంలా సాగిన క్రౌడ్ ఫండింగ్ విజయవంతమైంది. చిన్నారి చికిత్సకు అవసరమైన భారీ మొత్తం సమకూరడంతో […] The post పునర్వికకు పునర్జన్మ..విజయవంతమైన నిధుల సేకరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Feb 2026 11:28 am

మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 25 Feb 2026 11:26 am

Sanatnagar |అదే కారణమా?

Sanatnagar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు

ప్రభ న్యూస్ 25 Feb 2026 11:25 am

OTT Releases: February Last Weekend

A bunch of English titles are available for streaming during the last week of February. There are no notable Telugu releases in the digital space this weekend. Sri Chidambaram Garu, Daughter Of Prasad Rao Kanabadutaledhu, Honey and Paanigrahanam are the Telugu releases. Ravi Teja’s Bhartha Mahasayulaku Wignyapthi was expected to stream this weekend but the […] The post OTT Releases: February Last Weekend appeared first on Telugu360 .

తెలుగు 360 25 Feb 2026 11:23 am

సుప్రీంకోర్టులో మల్లారెడ్డికి దక్కని ఊరట

సుప్రీంకోర్టులో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలకు చుక్కెదురైంది. జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు.మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీడిమెట్ల సర్వే నం. 82/1/ఈఈలో గల 0.33 గుంటల భూమికి హద్దులు నిర్ణయించాలని కోరుతూ శేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తన భూమికి వెళ్లే దారిని మూసివేశారని, […] The post సుప్రీంకోర్టులో మల్లారెడ్డికి దక్కని ఊరట appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Feb 2026 11:21 am

Hyderabad : బ్రేకప్ అయిందని యూట్యూబర్ బలవన్మరణం

ప్రేమించి పెళ్లికి యువకుడు నిరాకరించడంతో యూట్యూబర్ బలవన్మరణం పొందింది

తెలుగు పోస్ట్ 25 Feb 2026 11:20 am

వేంకటేశ్వర స్వామివారి చక్రస్నానం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన చక్రస్నానం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

మన తెలంగాణ 25 Feb 2026 11:18 am

Tragic incident |ఆ బాధతోనేనా…?

Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : యూట్యూబ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న

ప్రభ న్యూస్ 25 Feb 2026 11:15 am

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు.. కేంద్రాల వద్ద సందడి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయా కళాశాలల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. The post తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు.. కేంద్రాల వద్ద సందడి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Feb 2026 11:14 am

ఈమె తల్లేనా? వివాహేతర సంబంధం కోసం చిన్నారిని చిదిమేసిందిగా?

తిరుపతిలో చిన్నారి దుర్గ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు

తెలుగు పోస్ట్ 25 Feb 2026 11:08 am

మరోసారి భారత్‌ పై ట్రంప్‌ టార్గెట్

-సోలార్ ఉత్పత్తులపై 126 శాతం డ్యూటీ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేశారు. మన దగ్గరి నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 126 శాతం డ్యూటీ విధించారు. ఇండోనేసియాపై ప్రాథమిక సుంకాలను 86 శాతం నుంచి 143 శాతానికి పెంచారు. లావోస్‌పై 81 శాతం డ్యూటీ వేశారు. ఫారెన్‌ సబ్సిడీల ఆధారంగా రేటును నిర్ధరించినట్లు అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ మూడు దేశాల నుంచి అగ్రరాజ్యానికి […] The post మరోసారి భారత్‌ పై ట్రంప్‌ టార్గెట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 25 Feb 2026 11:08 am

తొందరపడి కూస్తున్న రాజకీయ కోయిలలు!

లోక్‌సభ ఎన్నికలకు మరో మూడేళ్లకు పైగా సమయం ఉంది. ప్రతిపక్షాల అనైక్యత కారణంగానే బొటాబొటీ ఆధిక్యతతో ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి పదవి చేపట్టగలిగారు. అయినా ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నిలదీయడంతో ప్రతిపక్షాలు విఫలం అవుతున్నాయి. ఎవ్వరి దారి వారిదిగా కనిపిస్తున్నది. ఈ సందర్భంగా త్వరలో జరుగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడులతో పాటు వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఈ ఎన్నికలపై దృష్టి సారించకుండా అకస్మాత్తుగా 2029లో జరిగే ఎన్నికలలో ప్రతిపక్షాల ప్రధానమంత్రి ఎవ్వరు? అనే చర్చ బయలుదేరడం ఒక విధంగా విస్మయం కలిగిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత ఇండియా కూటమి దాదాపు నిస్తేజంగా మిగిలింది. ఇప్పుడు ఆ కూటమికి నేతృత్వం వహించే సామర్థ్యం రాహుల్ గాంధీకి లేదని అంటూ ఇతర పేర్లను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ బారు మమతా బెనర్జీ పేరును ప్రతిపాదించగా, మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ పేరును తెరపైకి తెచ్చారు. వీరిద్దరూ కూడా గతంలో యుపిఎ హయాంలో కాంగ్రెస్ ప్రాపకంతో ప్రభుత్వంలో కీలక పదవులు పొందినవారే. వారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం కలగకపోయినా, వారు మంచి గుర్తింపు పొందారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తప్పదనే అంచనాతో ముందుగానే మన్మోహన్ సింగ్‌ను విడిచి వెళ్ళిపోయిన సంజయ్ బారు, ఎన్నికల అనంతరం మళ్ళీ ఆయనే ప్రధాని కావడంతో తిరిగి ప్రభుత్వంలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ ప్రాబల్యం పెరుగుతున్నప్పటి నుండే మణిశంకర్ అయ్యర్ తెరమరుగుకాక తప్పలేదు. సహజంగానే, సంజయ్ బారు ప్రతిపాదనను టిఎంసి నుండి ఎంపిగా మారిన జర్నలిస్ట్ సాగరికా ఘోష్ సమర్థించారు. టిఎంసి నాయకులతోపాటు డిఎంకె, ఉద్ధవ్ థాకరే శివసేన (యుబిటి) కూడా ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చాయి. ‘ఒక్క తమిళనాడు సిఎం మాత్రమే 2029 ఎన్నికల్లో కూటమికి విజయాన్ని చేకూర్చగలరు’ అంటూ మణిశంకర్ అయ్యర్ చేసిన ప్రతిపాదనకు ఆ పార్టీలోని వారు తప్ప మరెవ్వరూ స్పందించలేదు. పలు రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా తన తండ్రి ఎంకె స్టాలిన్ కూటమికి నేతృత్వం వహించాలని కోరుతున్నారని ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. రాజకీయాల్లోనూ, ప్రజాపాలనలోనూ స్టాలిన్ ఒక ఉదాహరణగా నిలుస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మమత, స్టాలిన్ తమ తమ రాష్ట్రాలలో తిరుగులేని నాయకులు కావచ్చు. అయితే, వారెవ్వరికీ జాతీయ స్థాయిలో ప్రాబల్యం లేదు. ఇతర రాష్ట్రాలలో వారికి ఎటువంటి మద్దతు లేదు. టిఎంసిని జాతీయ పార్టీగా చేసేందుకు మమత ఎంతగా ప్రయత్నించినా గోవా, త్రిపుర, మేఘాలయ వంటి చిన్నచిన్న రాష్ట్రాలలో తాత్కాలికంగా ప్రభావం చూపినా పార్టీని విస్తరింపలేకపోయారు. అట్టడుగు నుండి వీధి పోరాటాల ద్వారా ఎటువంటి కుటుంబ నేపథ్యం లేదా ‘గాడ్ ఫాదర్’ లేకుండా కీలకమైన నేతగా ఎదిగిన దేశంలో ఏకైక మహిళా నేత మమత అనడంలో సందేహం లేదు. పశ్చిమబెంగాల్ కాంగ్రెస్‌లో ప్రియరంజని దాష్ మున్షీ, ప్రణబ్ ముఖర్జీ వంటి నేతలను ధిక్కరించి, సొంతంగా పార్టీ పెట్టుకొని, 34ఏళ్ళ వామపక్ష పాలనకు చరమగీతం పాడారు. 15 ఏళ్లుగా అధికారంలో ఉండగలిగారు. బిజెపిని సైతం పదేళ్లుగా ఎదుర్కొంటున్నారు. ఆమెను ప్రధాని అభ్యర్థిగా జాతీయ స్థాయిలో మహిళా ఓటర్లను ఆకట్టుకొనే అవకాశం ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ఆమె మద్దతు పొందటం కష్టమే కాగలదు. ఇప్పటికీ జాతీయ స్థాయిలో బిజెపికి గట్టి పోటీ ఇవ్వగలిగిన స్థాయిలో కేవలం కాంగ్రెస్ మాత్రమే ఉంది. సుమారు 100 మంది ఎంపిలు ఉన్నారు. సుమారు 300 స్థానాలలో బిజెపికి కీలకమైన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ గెలిచే సీట్లు పెరిగితేనే బిజెపిని గద్దె దించడం సాధ్యం కాగలదు. అందుకనే బిజెపి సైతం కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుంటున్నది. ప్రాంతీయ పార్టీల నేతలను అంతగా పట్టించుకోవడం లేదు. విధానపరమైన అంశాలపై మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో, బైటా గట్టిగా నిలదీస్తోంది కూడా కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ. అయితే, ఇప్పుడు అనూహ్యంగా 2029లో జరగబోయే ఎన్నికలను ప్రస్తావిస్తూ మమత, స్టాలిన్‌లను ప్రధాని అభ్యర్థులుగా ప్రచారం చేయడం వెనుక రెండు ఉద్దేశాలు ఉండే అవకాశం ఉంది. మొదటగా, మరో రెండు నెలల్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మమత, స్టాలిన్‌లకు తమతమ రాష్ట్రాలలో తిరిగి గెలుపొందేందుకు అటువంటి ప్రచారం ఉపయోగపడే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో ప్రధాని మోడీని ఓడించగలిగేది వీరే అనే ప్రచారం ఎన్నికల ముందు జరగడం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే అని చెప్పవచ్చు. 15 ఏళ్ళ పరిపాలనలో మమత సహజంగానే కొంత ‘ప్రభుత్వ వ్యతిరేకత’ కు గురయ్యే అవకాశం ఉంది. ‘బెంగాల్ సంస్కృతి’కి తానే ప్రతినిధి అని, బీజేపీ ‘బయటివారి పార్టీ’ అని ఇప్పటివరకు చేస్తున్న ప్రచారం మరోసారి ఏమేరకు ఉపయోగపడుతుంది? అన్నదికూడా ప్రశ్నార్థకం కాగలదు. అందుకనే కొత్తకొత్త ఎత్తుగడలను అనుసరింపక తప్పదు. అందుకనే అటువంటి ప్రచారం పట్ల మమతా మౌనం వహిస్తున్నారు. తమిళనాడులో అధికారంలో భాగస్వామ్యం కోరుతున్న కాంగ్రెస్ నుండి డిఎంకె ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు స్టాలిన్ ను ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తేవడం ఆ పార్టీకి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మరోవంక, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నేరుగా ప్రధాన మంత్రి మోడీ లక్ష్యంగా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించడంతో బిజెపి ఇరకాటంలో పడిపోయింది. మాజీ సైన్యాధికారి నరవాణె గ్రంథం విషయంలో గాని, భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంలో గాని, జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయంలో గాని రాహుల్ లేవనెత్తిన అంశాలపై అధికార పక్షం నోరు విప్పలేకపోతున్నది. ఈ అంశాలలో నేరుగా ప్రధాని ప్రమేయం ఉండడంతో దేశంలో సైతం ఓ ‘బలమైన నాయకుడు’ గా ఇప్పటివరకు మోడీ చుట్టూ జరుగుతున్న ప్రచారంపై తెరపడింది. ఈ అంశాలపై స్టాలిన్, మమత వంటి ప్రతిపక్ష నేతలు దాదాపు మౌనంగా ఉంటున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ఆమోదించిన అవిశ్వాస తీర్మానంపై టిఎంసి సంతకం చేయకపోవడం గమనార్హం. మోడీ ప్రభుత్వ మనుగడకు నితీశ్ కుమార్,చంద్రబాబు నాయుడుల మద్దతు కీలకం అయినప్పటికీ వారిలో ఎవరు మద్దతు ఉపసంహరించుకున్నా తమ అధికారానికి ఢోకా లేదనే ధీమా బిజెపిలో కనిపిస్తున్నది. అందుకు ప్రధాన కారణం సంక్షోభం ఎదురైతే డిఎంకె, టిఎంసి వంటి పార్టీలు అక్కరకు వస్తాయనే నమ్మకం కూడా కావచ్చు. ఈ కారణాలతో మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఓ విధంగా ఒంటరి పోరాటం జరపాల్సి వస్తుంది. ఇదే సమయంలో రూ. 2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీపై అమెరికాలో 15 నెలల కిందట నమోదైన కేసులో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఇసి) నోటీసులను స్వీకరించడానికి అదానీ న్యాయవాదులు అంగీకరించడంతో ఈ కేసు ఇటీవలే చివరి దశకు చేరినట్లయ్యింది. ట్రంప్ విధించిన టారిఫ్‌లపై అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడానికి ముందుగానే ఈ కారణాలతోనే హడావుడిగా భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడంపై విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. ఈ పరిణామాలను గుర్తించిన సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ 2029 ప్రధానమంత్రి అభ్యర్థి గురించి ఇప్పుడు ఆలోచించడం ఏమిటని అంటూ ఈ చర్చకు దూరం జరిగారు. పైగా, ప్రతిపక్షాలు తమ ముందున్న ప్రాధాన్యతలను మరచిపోకూడదని సున్నితంగా మందలించారు. ‘మొదట, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో బిజెపిని ఓడించాలి’ అని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతానికి, మేము వేరే దేని గురించి ఆలోచించడం లేదు. బిజెపియేతర పార్టీలు తమతమ రాష్ట్రాలలో అధికారం చేపట్టకుండా నిరోధించడానికి కొత్త ‘రాజకీయ చిక్కులు’ కోరుకోవడం లేదు’ అని తేల్చి చెప్పారు. ఆ మాత్రం రాజకీయ పరిపక్వత మిగిలిన ప్రతిపక్ష నాయకులలో లోపించిందని చెప్పలేం. వ్యూహాత్మకంగానే, తమ తమ రాజకీయ అవసరాల కోసమే ప్రధాని అభ్యర్థి గురించి చర్చకు ఆజ్యం పోస్తున్నట్లు స్పష్టం అవుతుంది. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను దగ్గరకు చేర్చి ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర వహించింది నితీశ్ కుమార్. ఆయననే ఆ కూటమికి నాయకత్వం వహించాలని దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమయింది. ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ నుండి కాకుండా మమత నుండి అభ్యంతరం వ్యక్తమైంది. దానితో నితీశ్ తిరిగి ఎన్‌డిఎ గూటికి చేరుకున్నారు. నితీశ్ ఇండియా కూటమిలో కొనసాగి ఉంటే బీహార్‌లో ఆ కూటమికి అత్యధిక స్థానాలు లభించి ఉండేవి. అప్పుడు కేంద్రంలో ఎన్‌డిఎ మెజారిటీ సాధించడం కష్టమై ఉండెడిది. ఇండియా కూటమి కూడా అధికారానికి అందుబాటులోకి వచ్చెడిది.   చలసాని నరేంద్ర 98495 69050

మన తెలంగాణ 25 Feb 2026 11:03 am

NTR -AKHIL |ఈ క్రేజీ కాంబో నిజమేనా..?

NTR -AKHIL | ఈ క్రేజీ కాంబో నిజమేనా..? NTR -AKHIL |

ప్రభ న్యూస్ 25 Feb 2026 11:01 am

కల్తీ కల్లోలం.. కట్టడిలో విఫలం

దేశంలో పాలు, జున్ను, పండ్లు, కూరగాయలు కూడా రసాయనాల కల్తీతో వినియోగదారులను అస్వస్థత పాలు చేసే సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఆంధ్ర లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతంలో కల్తీపాల వల్ల కిడ్నీలు దెబ్బతిని నలుగురు మృత్యువాత పడటం, మరికొంతమంది అస్వస్థులు పాలుకావడం సంచలనం కలిగిస్తోంది. 2016లో పార్లమెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం భారతీయులు ప్రతి ముగ్గురిలో ఇద్దరు వినియోగించే పాలలో డిటెర్జెంట్, కాస్టిక్ సోడా, యూరియా, పెయింట్ కల్తీలుగా ఉంటున్నాయని వెల్లడైంది. 2022 23లో పరీక్షించిన ఆహార పదార్ధాల నమూనాల్లో కల్తీలు ఉన్నాయని బయటపడింది. ఆహార తనిఖీలు పకడ్బందీగా జరగకపోవడం, కల్తీని కనుక్కునే సాంకేతిక సిబ్బంది తగినంతగా లేకపోవడమే ఈ సమస్యలకు దారితీస్తోంది. ఎలాంటి నాణ్యత పాటించని ఏవో కంపెనీల బ్రాండ్ల పాలను, పాల ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు ఆరోగ్యానికి ముప్పు తెచ్చే పరిస్థితులు ఎదురవుతుంటాయి. కానీ వినియోగదారులు కల్తీయే కారణమని తెలుసుకోలేకపోతున్నారు. పాడి పరిశ్రమలో కీలకపాత్ర వహించే కో ఆపరేటివ్‌ల్లో సగానికి సగం అసంఘటిత కార్మికులే ఉంటారు. వీరికి నాణ్యత ప్రమాణాలు ఎలా ఉంటాయో అంతగా అవగాహన ఉండదు. వారు కేవలం ఉపాధి కోసం పనిచేసే కార్మికులే. అందువల్ల అక్కడ వారికి నాణ్యత ప్రమాణాలపై సరైన అవగాహన కల్పించడం చాలా అవసరం. పౌల్ట్రీలో యాంటీబయోటిక్స్ ప్రభావం లేదా నీటిలో ఆర్సెనిక్, సీసం లోహాల మూలకాలు ఇవన్నీ ఆహార నాణ్యతను దెబ్బ తీస్తుంటాయి. సుగంధ ద్రవ్యాలు, వంటకు వినియోగించే పాత్రలు కూడా చాలా వరకు కల్తీకి దోహదకాలుగా ఉంటున్నాయి. క్రిమి సంహారక మందులు, ఎరువులు అతిగా వాడడం వల్ల పంటలు, కూరగాయలు, పండ్లు విషతుల్యమవుతున్నాయని శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తున్నారు. మామిడి, బొప్పాయి వంటి పండ్లు, బెల్లం రంగు, రుచి రావడానికి రసాయనాలు వాడుతున్నారు. దీన్ని బట్టి కల్తీకి కాదేదీ అనర్హం అన్న సామెత సార్థకమవుతోంది. తిరుపతి లడ్డూల కల్తీ కల్లోలం ఇప్పుడు ఏ విధంగా భక్తుల్లో ఆందోళన కలిగిస్తోందో తెలిసిందే. సుప్రీం కోర్టు వరకు ఈ వ్యవహారం వెళ్లడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి ప్రఖ్యాత క్షేత్రాల్లో ప్రసాదం లేదా ఆహార నాణ్యతను పరీక్షించే వ్యవస్థ ఏ విధంగా ఉంటోంది? అన్ని క్షేత్రాల్లో ఇలాంటివి జరగకుండా అరికట్టే వ్యవస్థలు అమలులో ఉంటున్నాయా? నాణ్యతా ప్రమాణాలు ఉల్లంఘించినప్పుడు ఏ చర్యలు తీసుకుంటారు? రాష్ట్ర స్థాయిలో లేదా జాతీయ స్థాయిలో ఆహార కల్తీ నియంత్రణాధికారులు నాణ్యతను ఎలా పర్యవేక్షిస్తారు? ఇవన్నీ ఎదురయ్యే ప్రశ్నలు.. జాతీయ స్థాయిలో కల్తీ అన్నది వ్యవస్థీకృతమైపోతోంది. రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం ఎంత విజయవంతంగా సాగుతున్నా కల్తీ కారణంగా ఒడిదుడుకులు తప్పడం లేదు. దేశంలో లెడ్ క్రొమేట్ రసాయన మూలకం ఎంతవరకు వ్యాపించిందో స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ చేపట్టిన అధ్యయనం లో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. దేశంలోని 17 నగరాల నుంచి నమూనాలు సేకరించి పరిశీలించగా దాదాపు అన్ని నమూనాల్లో 14 శాతం వరకు లెడ్ క్రొమేట్ లోహం అత్యధిక స్థాయిల్లో ఉన్నట్టు తేలింది. పాట్నా, గువాహటి, చెన్నై నగరాల్లో లెడ్ అవశేషాలు బాగా కనిపించాయి. ఎక్కడైనా, ఏదైనా కల్తీ జరుగుతున్నట్టు తెలిస్తేనే దాడులు చేస్తుంటారు. ఆ ఆహారాన్ని సీజ్ చేస్తుంటారు. ఇటీవల మాగ్గీ మసాలా కేసు, ఈథలిన్ ఆక్సైడ్ కుంభకోణం వెలుగులోకి వచ్చాయి. అయితే ఏం జరిగిందో దాడులు ఎందుకు చేశారో ఎవరికీ తెలీదు. దీనితో విస్తృతమైన తనిఖీలు, శాస్త్రీయ పరిశోధనలు వల్ల దేశంలో కల్తీ కాటుకు అకస్మాత్తుగా బ్రేకులు పడిపోతాయని కూడా నమ్మలేం. ప్రజల్లో అవగాహనతోపాటు సరైన తనిఖీ వ్యవస్థ ఉన్నప్పుడే కొంతవరకు దీన్ని నివారించగలం. నెయ్యి కల్తీ గురించి కొన్ని క్షేత్రస్థాయి వాస్తవాలు ప్రస్తావించవలసి ఉంది. డైరీ పరిశ్రమలో ఒక కిలో నెయ్యి తయారీకి ఉత్పత్తి వ్యయం రూ. 550 వరకు అవుతుండగా, ఎవరో ఒకరు కల్తీ చేసిన నెయ్యిని కిలో రూ. 345 కే విక్రయిస్తున్నారు. దీనివల్ల వాస్తవంగా నాణ్యమైన నెయ్యిని తయారు చేసే రైతు, కల్తీ వ్యాపారస్తునితో పోటీ పడలేకపోతున్నాడని ఇండియన్ డైరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రూపీందర్ సింగ్ శోధీ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. ఇప్పుడు తిరుపతి సంక్షోభం డైరీ ఉత్పత్తులపై వ్యతిరేక ప్రభావం చూపించినా మరోవైపు దీనివల్ల నాణ్యతను పాటించే ప్రముఖ వ్యాపార సంస్థలకు డిమాండ్ కూడా పెరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆలయాలు, గురుద్వారాలు వంటి ఆరాధనా వ్యవస్థలు తక్కువ ధరకు సరఫరా చేయడానికి సిద్ధపడే బిడ్డర్లను విడిచిపెట్టి, నాణ్యత కోసం ధర ఎక్కువైనా ప్రామాణికాలు పాటించే ప్రముఖ కంపెనీల వైపు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడుతుందని, ఫలితంగా నాణ్యత పాటించే అసలైన ఉత్పత్తిదారులకు మేలు జరుగుతుందని రూపీందర్ సింగ్ వంటివారు ఆశాభావంతో అభిప్రాయంపడడం తప్పులేదు. కానీ ఆ విధంగా కల్తీ జరగకుండా కేంద్రం నుంచి రాష్ట్రస్థాయి వరకు కట్టుదిట్టమైన వ్యవస్థలు ఉన్నప్పుడే ప్రజల ఆరోగ్యానికి భద్రత లభిస్తుంది.  కె. యాదగిరి రెడ్డి 98667 89511

మన తెలంగాణ 25 Feb 2026 10:55 am

ఇంటింటికి తిరిగి వినూత్న విజ్ఞప్తి..

ఇంటింటికి తిరిగి వినూత్న విజ్ఞప్తి.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్

ప్రభ న్యూస్ 25 Feb 2026 10:52 am

విద్యార్థులు భయాందోళన చెందకుండా..

విద్యార్థులు భయాందోళన చెందకుండా.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ విద్యార్థులు భయాందోళన చెందకుండా

ప్రభ న్యూస్ 25 Feb 2026 10:45 am

ప్రేమ విఫలం... యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

రాయదుర్గం: ప్రేమ విఫలం కావడంతో యూట్యూబర్ కోమలి(21) ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన కోమలి రంగారెడ్డి జిల్లా మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తోంది. బిఎస్‌సి చదువుతూనే యూట్యూబర్‌గా వీడియోలు చేస్తున్నారు. వైజాగ్‌కు చెందిన మరో యూట్యూబర్ నిఖిల్ రెడ్డి పరిచయం కావడంతో అతడితో ఆమె ప్రేమలో పడింది. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో కోమలికి నిఖిల్ దూరంగా ఉండడంతో ఆమె ఆరు నెలల క్రితం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బంధువుల సర్ధి చెప్పి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఇటీవల మళ్లీ పెళ్లి విషయంలో నిఖిల్ రెడ్డితో కోమలి గొడవ పెట్టుకుంది. దీంతో మనస్థాపంతో కోమలి ఇంట్లో చీరతో ఉరేసుకొని చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 25 Feb 2026 10:32 am

ఆ విషయంలో.. తల్లిదండ్రులు కృషి చేయాలి..

ఆ విషయంలో.. తల్లిదండ్రులు కృషి చేయాలి.. భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : ఈ

ప్రభ న్యూస్ 25 Feb 2026 10:28 am

Bhogi First Look: Sharwa Arrives As Pure Carnage

Charming Star Sharwa sheds his familiar image and steps into uncharted territory with Bhogi, revealing an intimidating persona. Teaming up with director Sampath Nandi, the film is mounted as a pan-India period action spectacle set in the volatile late 1960s. The makers unveiled the first-look poster today, and it speaks volumes even without words. Sharwa […] The post Bhogi First Look: Sharwa Arrives As Pure Carnage appeared first on Telugu360 .

తెలుగు 360 25 Feb 2026 10:22 am

ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో..

ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో.. మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : ఇంటర్ విద్యార్థి సూసైడ్

ప్రభ న్యూస్ 25 Feb 2026 10:15 am

ముహుర్తం బాగా లేదని..

ముహుర్తం బాగా లేదని.. ఆలేరు, ఆంధ్రప్రభ: ఆలేరు మున్సిపల్ పరిధిలో గెలుపొంది ఈనెల

ప్రభ న్యూస్ 25 Feb 2026 10:08 am

ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. పరీక్షా కేంద్రాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన మేడిపల్లి సిఐ

మన తెలంగాణ/ బోడుప్పల్: తెలంగాణ వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని మేడిపల్లి మండలంలోని పలు పరీక్షా కేంద్రాలను మేడిపల్లి సిఐ ఆర్.గోవిందరెడ్డి సందర్శించి పర్యవేక్షించారు.​పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా ఉండటం నిషిద్ధమని పేర్కొన్నారు.​కాపీయింగ్‌ను నిరోధించేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్షా సమయం ముగిసే వరకు మూసివేయాలని ఆదేశించారు.​ విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు. అలాగే, ప్రభుత్వం ప్రకటించిన 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ (ఉదయం 9:05 వరకు) నిబంధనను దృష్టిలో ఉంచుకుని, సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.  

మన తెలంగాణ 25 Feb 2026 10:07 am

Telangana : వచ్చే నెల రెండున తెలంగాణకు రాహుల్

మార్చి నెల 2వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు.

తెలుగు పోస్ట్ 25 Feb 2026 10:04 am

క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు..

క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు.. చిట్యాల, ఆంధ్రప్రభ : క్రీడలతో యువత మానసిక

ప్రభ న్యూస్ 25 Feb 2026 9:59 am

కూతురు నిశ్చితార్థం జరిగిన వెంటనే తండ్రి మృతి

ఆదిలాబాద్: కుమార్తె నిశ్చితార్థం రోజునే తండ్రి మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.... బోథ్‌లో పందిరి శంకర్(45) అనే వ్యక్తి తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. కుమార్తెకు ఉట్నూరుకు చెందిన యువకుడి పెళ్లి నిశ్చయం చేశారు. సోమవారం యువకుడితో తన కుమార్తెకు నిశ్చితార్థం ఘనంగా జరిపాడు. బంధువులు, కుటుంబ సభ్యులతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. మంగళవారం ఉదయం నిద్రలో నుంచి లేవకపోవడంతో కుటుంబ సభ్యులు తట్టిలేపడానికి ప్రయత్నించాడు. ఉలుకుపలుకు లేకపోవడంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. హార్ట్ ఎటాక్‌తోనే చనిపోయి ఉంటాడని వైద్యులు తెలిపారు. ఒక్కసారిగా ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

మన తెలంగాణ 25 Feb 2026 9:59 am

Nani’s stuns and shakes Social Media with his steps!

Natural Star Nani is renowned for his great performances and cult classic story choices. He never showcased his dancing skills as he did in The Paradise first single, Aaya Sher, released last night, till date. He shocked and shook the Internet to a pleasant surprise to see him pull off floor moves with ease. He […] The post Nani’s stuns and shakes Social Media with his steps! appeared first on Telugu360 .

తెలుగు 360 25 Feb 2026 9:59 am

Team India : సెమీస్ చేరాలంటే టీం ఇండియాకు ఆ సెంటిమెంట్ పనిచేస్తుందా?

టీం ఇండియా సౌతాఫ్రికాపై ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు.

తెలుగు పోస్ట్ 25 Feb 2026 9:58 am

Srisailam : శ్రీశైలంలో ఆలయం మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న శ్రీశైలం ఆలయాన్ని మూసివేయనున్నారు.

తెలుగు పోస్ట్ 25 Feb 2026 9:54 am

కళ పై మక్కువ ఎక్కువైతే..

కళ పై మక్కువ ఎక్కువైతే.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా

ప్రభ న్యూస్ 25 Feb 2026 9:52 am

శ్రీకాకుళం లో డయేరియా పై మంత్రి నారాయణ సమీక్ష

శ్రీకాకుళం లో డయేరియా పరిస్థితి పై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు

తెలుగు పోస్ట్ 25 Feb 2026 9:48 am

Pradeep Ranganathan turning Producer

Young and successful Tamil actor Pradeep Ranganathan has a heap of films lined up. The actor hiked his fee considering his demand and he is in a mad rush. The actor is now all set to launch his production house very soon and his first production will be a women-centric attempt. The film will feature […] The post Pradeep Ranganathan turning Producer appeared first on Telugu360 .

తెలుగు 360 25 Feb 2026 9:48 am

పరీక్ష కేంద్రాలకు అలా రాకూడదు..

పరీక్ష కేంద్రాలకు అలా రాకూడదు.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రభుత్వ

ప్రభ న్యూస్ 25 Feb 2026 9:43 am

Ys Jagan : నేడు నందిపల్లెలో జగన్ పర్యటన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 25 Feb 2026 9:42 am

విద్యార్థులు ఒత్తిడిని జయించాలంటే..

విద్యార్థులు ఒత్తిడిని జయించాలంటే.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి

ప్రభ న్యూస్ 25 Feb 2026 9:35 am

Weather Report : నేడు ఏపీ, తెలంగాణలో వాతావరణ శాఖ కీలక అప్ డేట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలుగు పోస్ట్ 25 Feb 2026 9:32 am

Narendra Modi : నేడు ఇజ్రాయెల్‌ పర్యటనకు ప్రధాని మోదీ

నేడు ఇజ్రాయెల్‌ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు

తెలుగు పోస్ట్ 25 Feb 2026 9:27 am

పర్యవేక్షణ కరవైన ప్రైవేట్ హాస్టళ్లు

ప్రైవేటు విద్యాసంస్థలకు అనుబంధంగా వేలాది హాస్టళ్లు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. వసతి పేరుతో విద్యార్థుల నుంచి అడ్డగోలు వసూళ్లు చేస్తున్నారు. హాస్టళ్ల నిర్వహణ నేటి రోజుల్లో లాభసాటి వ్యాపారంగా మారింది. విద్యాసంస్థలకు అనుగుణంగానే గాక వర్కింగ్ మెన్, ఉమెన్ హాస్టళ్ల పేరుతో కుప్పలు తెప్పలుగా వసతి గృహాలు పుట్టుకొస్తున్నాయి. అసలు హాస్టళ్ల ఏర్పాటు, నిర్వహణపై పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వపరంగా ఓ శాఖ అంటూ లేకపోవడంతో నిర్వాహకులకు ఆడిందే ఆటగా తయారైంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహిస్తున్న హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యత పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ అధికారులపై ఉంటుంది. ఆయా హాస్టళ్లపై అవసరమైతే కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల అజమాయిషీ కూడా ఉంటుంది. దీంతో మెనూ, ఇతర సౌకర్యాల కల్పనపై అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. అదే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటవుతున్న హాస్టళ్లలో పర్యవేక్షణ బాధ్యతలు అటు విద్యాశాఖకుగానీ, ఇంటర్మీడియట్ అధికారులకుగాని లేవు. దీంతో అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న హాస్టళ్లలో నిర్వాహకులు కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. హాస్టళ్ల పేరిట వేలకు వేలు ఫీజులు దోచుకుంటున్నా అడిగేవారు లేరు. అడ్మిషన్ల సమయంలో చెప్పిన విధంగా ఎక్కడా కూడా మెనూ, ఇతర సౌకర్యాలు కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎక్కడ చూసినా దాదాపుగా అనుబంధ హాస్టళ్లు ఏర్పాటు అవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాస్టల్ ఉంటేనే ఆయా విద్యాలయాల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇంటిపట్టున ఉంటే చదువుపై ఆసక్తి ఉండదనే ఉద్దేశంతో హాస్టళ్లు ఉన్న స్కూళ్లు, కాలేజీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఫీజుల విషయం ఆలోచించకుండా తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తున్నా రు. అయితే పోషకుల అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటున్న హాస్టళ్ల నిర్వాహకులు వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. అకాడమిక్ ఫీజులతో పోలిస్తే స్కూళ్లు, కాలేజీల్లో ఉన్న హాస్టళ్ల నిర్వహణ ద్వారానే యజమానులకు భారీ సంపాదన ఉంటుందన్న ప్రచారమూ ఉంది. ప్రైవేటు హాస్టల్ ప్రారంభించేవారు విధిగా సంబంధిత స్థానిక సంస్థల నుంచి ముందస్తు అనుమతులు పొందాలనే నిబంధన ఉంది. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న హాస్టళ్లకు మున్సిపల్ అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు అనుమతి పత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలు జారీ చేసే అనుమతులు ఉంటేనే హాస్టళ్లు నిర్వహించాలనే నిబంధన ఉంది. హాస్టళ్లలో శానిటేషన్, వెంటిలేషన్, తాగునీరు, టాయ్‌లెట్ల పరిశుభ్రతపై తనిఖీలు నిర్వహించే అధికారం కూడా స్థానికసంస్థల అధికారులకు ఉంటుంది. విద్యాసంస్థలు ప్రారంభించే ముందు ఆయా స్థానిక సంస్థల.. అధికారుల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (సౌండ్‌నెస్ సర్టిఫికేట్) పొందాల్సి ఉంటుంది. దాంతోపాటు అగ్నిమాపకశాఖ అనుమతులు కూడా తీసుకోవాలి. అవే నిబంధనలు హాస్టళ్లకు కూడా వర్తిస్తాయి. అయితే ఆ ఎన్‌ఒసిలు కేవలం విద్యాసంస్థల పర్మిషన్ సమయంలో తయారు చేస్తున్న ఫైళ్లకు మాత్రమే పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఒసిలు జారీ చేస్తున్న సంబంధిత అధికారులు ఆ తరువాత పర్యవేక్షణ జరపకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ ఇష్టారీతిన సాగుతోంది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాల్లో ఉన్న హాస్టళ్లలో తనిఖీలు చేసేవారు లేకపోవడంతో అక్కడ ఎన్నెన్ని సంఘటనలు జరుగుతాయో ఊహకందని విషయం. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న హాస్టళ్లలో కనీస రక్షణ చర్యలు పాటించడంలేదు. ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కుతున్నా పట్టించుకునేవారు లేరు. ఒక్కో గదిలో కనీసం పదిమంది వరకు విద్యార్థులకు వసతి కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. బాత్రూంల వద్ద తెల్లవారుజాము నుంచే విద్యార్థులు క్యూలు కట్టాల్సిన పరిస్థితి. ఇక మెనూ అమలు దేవుడెరుగు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల గోడు వినే ఓపికా, సమయం తల్లిదండ్రులకు లేకపోగా, ధనార్జనే ధ్యేయంగా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్న యాజమాన్యాలకు వారి బాగోగులే అవసరం లేకుండాపోయాయి. మూడు నాలుగు అంతస్థుల్లో హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు కనీసం లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అగ్నిప్రమాదాలు సంభవించిన పక్షంలో భవనం చుట్టూ ఫైరింజన్ తిరిగేలా ఏర్పాట్లు ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లు ఉండగా, ఎక్కడా ఆ వెసులుబాటు లేదు. దీంతో అనుకోని ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. చిన్నపిల్లల హాస్టళ్లల్లో కిటికీలకు గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. గతంలో వివిధ జిల్లాల్లో ఇంటర్ విద్యార్థులు హాస్టల్ నుంచి పడిపోయిన సంఘటనలో కిటికీకి గ్రిల్స్ లేకపోవడం గమనార్హం. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ప్రారంభ సమయంలో ఎన్‌ఒసిలు జారీచేస్తున్న మున్సిపల్, పంచాయతీ అధికారులే పర్యవేక్షణ జరపాలి. కేవలం సర్టిఫికేట్ జారీతోనే సరిపెట్టకుండా నిర్వహణపై కూడా వారు దృష్టి సారిస్తే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తారు. కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు ప్రైవేటు హాస్టళ్లను పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. అనుమతులు లేని హాస్టళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మన తెలంగాణ 25 Feb 2026 9:21 am

అదే.. కూటమి ప్రభుత్వ పతనానికి నాంది..

అదే.. కూటమి ప్రభుత్వ పతనానికి నాంది.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : దాడులు, విధ్వంసాలు

ప్రభ న్యూస్ 25 Feb 2026 9:16 am