SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

BJP : రెడ్డికి అడ్డం పడుతున్న కూటమి నేతలు ఎవరో తెలుసా? అందుకే రాజీనామా హెచ్చరిక

బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నట్లుంది

తెలుగు పోస్ట్ 7 Apr 2026 1:29 pm

ఆధ్యాత్మిక పర్యటనలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలేరు

ప్రభ న్యూస్ 7 Apr 2026 1:23 pm

Tragic incident |అన్నదానం వద్ద విషాదం

Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లాలో విషాద

ప్రభ న్యూస్ 7 Apr 2026 1:09 pm

Breaking : ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభం కోణం కేసులో ధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

తెలుగు పోస్ట్ 7 Apr 2026 1:07 pm

Leopard |నీటి కోసం గ్రామంలోకి వచ్చిన వన్యప్రాణి

Leopard | నీటి కోసం గ్రామంలోకి వచ్చిన వన్యప్రాణి Leopard | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 7 Apr 2026 1:06 pm

రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను తనిఖీ…

రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను తనిఖీ… బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : అమృత్

ప్రభ న్యూస్ 7 Apr 2026 1:00 pm

రాష్ట్ర మంత్రి బీసీ.జనార్ధన రెడ్డిని కలిసిన మాజేరు పెద్దలు…

రాష్ట్ర మంత్రి బీసీ.జనార్ధన రెడ్డిని కలిసిన మాజేరు పెద్దలు… చల్లపల్లి – ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 7 Apr 2026 12:45 pm

దిమ్మదుర్తి వద్ద రోడ్డు ప్రమాదం

దిమ్మదుర్తి వద్ద రోడ్డు ప్రమాదం మామడ, ఆంధ్రప్రభ : మండలంలోని దిమ్మదుర్తి క్రషర్

ప్రభ న్యూస్ 7 Apr 2026 12:41 pm

Mulugu |డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం..

Mulugu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి కాన్వాయ్

ప్రభ న్యూస్ 7 Apr 2026 12:34 pm

TDP : వరస వివాదాల్లో వాసంశెట్టి.. ఏంది సామీ ఇది?

మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రిపై సర్పంచ్ శ్రీనివాస్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది

తెలుగు పోస్ట్ 7 Apr 2026 12:28 pm

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ సత్యం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర మహాత్మాజ్యోతిబా పూలే బిసి గురుకులాల విద్యాసంస్థల

ప్రభ న్యూస్ 7 Apr 2026 12:25 pm

Dharmana : రాజధాని అమరావతిపై ధర్మాన హాట్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు

తెలుగు పోస్ట్ 7 Apr 2026 12:22 pm

పోలీసులు వేధిస్తున్నారని మానవ హక్కుల కమిషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

నాంపల్లి: హైదరాబాద్ లోని నాంపల్లిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు. కవాడిగూడలో శ్రావణి అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. గాంధీ నగర్ పోలీసులు తనని వేధిస్తున్నారని కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని సదరు మహిళ ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకొని పెట్రోల్ బాటిల్ ను లాక్కున్నారు.సదరు మహిళను కమిషన్ చైర్మన్ వద్దకు హెచ్ ఆర్ సి సిబ్బంది తీసుకెళ్లారు.  

మన తెలంగాణ 7 Apr 2026 12:20 pm

bumrah vs vaibhav|ఈ రోజు నువ్వా.. నేనా..?

bumrah vs vaibhav| ఈ రోజు నువ్వా.. నేనా..? యార్క‌ర్ కింగ్ వ‌ర్సెస్

ప్రభ న్యూస్ 7 Apr 2026 12:19 pm

పొగాకుకు రాని గిట్టుబాటు ధర.. ఆందోళనలో రైతులు

ఆంధ్రప్రదేశ్‌లో వర్జీనియా పొగాకు రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

తెలుగు పోస్ట్ 7 Apr 2026 12:13 pm

కులం పేరుతో దూషిస్తున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు... ధర్నాకు దిగిన విద్యార్థులు

మెదక్: కులం పేరుతో తమను ‌దూషించడంతో పాటు తీవ్రంగా ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడు కొడుతున్నారని గురుకుల విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలోని కౌడిపల్లిలో జరిగింది. కౌడిపల్లిలో గురుకుల విద్యార్థులు జాతీయ రహదారిపైకి చేరుకొని ధర్నాకు దిగారు.  పదే పదే కులం పేరుతో ప్రిన్సిపల్ ప్ర‌ణయ్ కుమార్, ఉపాధ్యాయుడు ఉద‌య్ తమను వేధిస్తున్నార‌ని విద్యార్థులు నిర‌స‌న‌కు దిగారు. ప్రిన్సిపాల్, సదురు ఉప్యాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోక‌ల‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులక సర్ది చెప్పడంతో ఎంఇఒకు సమాచారం ఇచ్చారు. 

మన తెలంగాణ 7 Apr 2026 12:08 pm

పదవి ప్రధానం కాదు: ఎమ్యెల్యే ఆదినారాయణ రెడ్డి

అవసరమైతే రాజీనామా చేస్తాను జమ్మలమడుగు: పనులు జరగవంటే కుదరదు. పదవి తనకు ప్రధానం కాదని, ‘నేను అనుకున్నట్లు వ్యవస్థ సరిగా లేకపోతే పార్టీలోనే ఉండి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని ప్రభుత్వ విప్, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. నూరు రోజుల కిందటే నిర్ణయించుకున్నానని చెప్పారు. స్థానిక రిపబ్లిక్ క్లబ్‌లో సోమవారం జరిగిన ‘మన ఊరు – మన జెండా’ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, మంత్రిగాను పనిచేశానని అన్నారు. […] The post పదవి ప్రధానం కాదు: ఎమ్యెల్యే ఆదినారాయణ రెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Apr 2026 12:03 pm

IPL 2026 : నేడు ఐపీఎల్ లో టఫ్ ఫైట్

నేడు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది

తెలుగు పోస్ట్ 7 Apr 2026 11:56 am

Five people |ఐదుగురికి గాయాలు..

Five people| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సింగరాయకొండ జాతీయ రహదారిపై ఘోర

ప్రభ న్యూస్ 7 Apr 2026 11:50 am

ipl bigfight|నేడు రాజ‌స్థాన్‌తో ముంబై ఢీ

ipl bigfight| నేడు రాజ‌స్థాన్‌తో ముంబై ఢీ గువాహటి వేదికగా మ్యాచ్రాత్రి 7:30

ప్రభ న్యూస్ 7 Apr 2026 11:44 am

మాజీ ‘మిస్ ఇండియా ఎర్త’ అదృశ్యం

పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు పూణె: మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సర్వే, ఆమె నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. పుణెలోని పింప్రి-చించ్వాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఆమె ఇస్తాంలోకి మారారు. ఇటీవలే తిరిగి హిందూమతంలోకి మారారు. హిందూమతంలోకి మారిన కొన్ని రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. భర్త, అత్తింటివారే సయాలీని కిడ్నాప్ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి […] The post మాజీ ‘మిస్ ఇండియా ఎర్త’ అదృశ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Apr 2026 11:37 am

KTR |ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే..

KTR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై పార్టీ

ప్రభ న్యూస్ 7 Apr 2026 11:37 am

Road Accident |కొడుకు పరిస్థితి విషమం

Road Accident | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : కృత్తివెన్ను మండలం గరిసిపూడి వద్ద

ప్రభ న్యూస్ 7 Apr 2026 11:29 am

విచిత్రమైన వైద్యం

పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడినిని పోచమ్మ కొట్టింది అని సామెత, ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి. సరిగ్గా ఇలాంటి ఆలోచన 1927లో జాన్ వాగ్నర్ కు వచ్చింది. అతను ఆస్ట్రియా వైద్యుడు. ఆ కాలంలో సిఫిలిస్ జబ్బు చాలా ఎక్కువగా ఉండేదని, అందులో మూడు స్టేజీలు ఉంటాయి. మూడవ స్టేజిలో బ్రెయిన్ కు వస్తుంది. ఇది ట్రిపోనిమా పాలిడియం అనే క్రిమి వలన సిఫిలిస్ సెక్సువల్లి ట్రాన్స్మిటెడ్ డిసీజ్ గా వస్తుంది. మెదడుకు వచ్చినప్పుడు సైకోసిస్ డెవలప్ అయ్యి ఫిట్స్ వచ్చి జనాలు చనిపోయేవారు. డాక్టర్లు ఏమి చేయాలో వాళ్లకు అర్థం అయ్యేది కాదు. వాళ్లకు దానిని ఎలా ట్రీట్మెంట్ చేయాలో తెలియక తల పట్టుకునేవారు. అప్పుడు ఆస్ట్రియా వైద్యుడు ఒక వింత సలహా ఇచ్చాడు. మలేరియా పారసైట్ ద్వారా వచ్చే మలేరియా జ్వరం సైకిల్స్ లో అతి తీవ్రమైన జనాన్ని పుట్టిస్తుంది. ఆ జ్వరం తీవ్రత వలన ఆ వేడికి శరీరంలోని ఆ సిఫిలిస్ కలుగచేసే క్రిమి చనిపోతుంది. ప్రజలు ఆ జ్వరాన్ని ఓర్చుకుంటే తరువాత ఆ క్రిమి చనిపోయి పేషెంట్ సేఫ్ అవుతారు. పేషెంట్ కు మరల ఆ మలేరియా నుంచి బాగు చేయడానికి అప్పటికే క్వినైన్ ద్వారా బాగు చేసే పధ్ధతి ప్రాచుర్యం లో ఉంది. మొదట దీనిని అందరూ వ్యతిరేకించినా కానీ గత్యంతరం లేక దాననే పాటించారు. అనూహ్యంగా పేషెంట్లు బాగు కావడం మొదలైంది. ఇది ఒక స్టాండర్డ్ ధిరపిగా 50 సంవత్సరాలు కొనసాగింది ఆయనకు నోబుల్ ప్రైజ్ కూడా వచ్చింది. 1940 లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుక్కోవడంతో ఈ మలేరియా థెరపీ మూలన పడిపోయింది. ఇప్పుడు ఒక మలేరియా ప్రాణాంతక రోగంతో చేసే ఈ మలేరియా ధిరపి చికిత్స సిఫిలిస్ కు అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ పెన్సిలిన్ అనేది యాంటీబయోటిక్స్ లో మొట్టమొదటిది, ఇది సిఫిలిస్ క్రిమిని ఈజీగా చంపేస్తుంది. అలా ఏమీ చేయలేని పరిస్థితులలో వైద్యులు ఒక విచిత్రమైన వైద్య విధానం కనిపెట్టినప్పటికీ అది తర్వాత ఆశ్చర్యాన్ని కలిగించిన కానీ అప్పటికి ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. వైద్యం అంతా అలాగే ఉంటుంది. ఈరోజు తప్పైనది రేపు ఒప్పు అవుతాది. ఈరోజు ఒప్పు అయినది రేపు తప్పు కూడా కావచ్చు.  ఎల్లప్పుడూ నిత్య నూతనంగా సరికొత్త వైద్య విధానాలు ఆవిష్కరించడం వలన పాత విధానాలను మార్పు చేస్తూ ఉంటారు. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎసిహెచ్  గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

మన తెలంగాణ 7 Apr 2026 11:25 am

యుద్ధంతో ఆకలి మంటలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ బీభత్సం ప్రపంచం మొత్తం మీద కొన్ని కోట్ల మందికి కావలసిన ఆహారం, ఔషధాలు అందకుండా చేస్తోంది. ఈ యుద్ధం జూన్ వరకు కొనసాగితే ప్రపంచం మొత్తం మీద 320 మిలియన్ మంది ఆకలి జ్వాలలతో దహించుకు పోవలసి వస్తుందని ఐక్యరాజ్యసమితికి చెందిన సహాయక సంస్థ ‘వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్’ (డబ్లుఎఫ్‌పి) ఆందోళన వెలిబుచ్చడం గమనార్హం. యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా మార్గాలకు తీవ్ర ఆటంకం ఎదురుకావడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం రానురాను పెరుగుతోంది. దుబాయ్, దోహా, అబుధాబి వంటి వ్యూహాత్మక కేంద్రాలనుంచి నౌకా రవాణా మార్గాలు పూర్తిగా మూసుకు పోయాయి. ఇంధనం, బీమా రేట్లు విపరీతంగా పెరగడంతో దానికి తగ్గట్టు రవాణా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇదే ఖర్చులతో అతి తక్కువగా సరఫరా చేయవలసి వస్తోంది. వేలాది టన్నుల ఆహార పదార్ధాలు చాలా ఆలస్యంగా రవాణా అవుతున్నాయి. యుద్ధ బాధిత సూడాన్‌కు 130,000 డాలర్ల విలువైన ఔషధాలు పంపవలసి ఉండగా దుబాయ్‌లో స్తంభించిపోయాయని, అలాగే సోమాలియాలో పోషకాహార లేమితో బాధపడుతున్న పిల్లలకు అందవలసిన పౌష్టికాహార 670 బాక్సులు భారత్‌లో చిక్కుకుపోయినట్టు ఇంటర్నేషనల్ రిస్కు కమిటీ వెల్లడించింది. 16 దేశాలకు కావలసినవి సమకూర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి వివరించింది. విదేశీ సహాయ నిధుల్లో అమెరికా విధించిన భారీ కోతలు ఇప్పటికే అనేక సహాయక బృందాలను బలహీనపర్చగా, యుద్ధంవల్ల ఈ సమస్య మరింత తీవ్రమైందని ఆందోళన వెలిబుచ్చింది. కొవిడ్ మహమ్మారి తరువాత సరఫరాలో తీవ్ర ఆటంకాలు ఎదురుకావడం ఇదేనని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. నౌకా రవాణా వ్యయం పెరిగిపోవడమే కాదు, వేరే మార్గాల ద్వారా సరఫరా చేయవలసి వస్తోందని పేర్కొంది. యుద్ధంవల్ల కొన్నిలక్షల మంది నిర్వాసితులైన ఇరాన్, లెబనాన్‌ల్లో కొత్తగా అత్యవసర పరిస్థితులు తలెత్తుతున్నాయి. మానవతా సహాయం అందలేని పరిస్థితి ఏర్పడుతోంది. యుద్ధం ఆగినా సరే ప్రపంచ వ్యాప్తంగా సరఫరాపై యుద్ధ ప్రకంపనలు ప్రభావం చూపిస్తాయి. హర్మూజ్, సూయెజ్ కెనాల్ మార్గాలకు ప్రత్యామ్నాయంగా వేరే రవాణా మార్గాలను వెతుక్కోవలసి వస్తోంది. ఆఫ్రికా చుట్టూ నౌకలద్వారా సహాయాలను పంపిస్తున్నారు. దాంతో గమ్యం చేరడానికి కొన్ని వారాలు పడుతున్నాయి. ఇరాన్, నైజీరియాలకు సకాలంలో వ్యాక్సిన్లు పంపించడానికి వివిధ రవాణా మార్గాలు అనుసరించడంతో రవాణా ఖర్చుల భారం పెరుగుతోంది. యుద్ధానికి ముందు యునిసెఫ్ వ్యాక్సిన్లను నేరుగా విమానం ద్వారా ఇరాన్‌కు పంపేది. ఇప్పుడు అలా కాకుండా విమానాల ద్వారా టర్కీకి పంపి, అక్కడ నుంచి ఇరాన్‌కు చేర్చడమవుతోంది. దీంతో అదనంగా 20 శాతం రవాణా ఛార్జీలు భరించక తప్పడమేకాక, ఆలస్యంగా చేరుతున్నాయి. సేవ్ ది చిల్డ్రన్ ఇంటర్నేషనల్ అనే సేవాసంస్థ దుబాయ్ నుంచి సూడాన్ రేవుకు నౌకల ద్వారా సరఫరాలు పంపించేది. ఇప్పుడు దుబాయ్‌నుంచి సౌదీ అరేబియా మీదుగా అక్కడ నుంచి ఎర్రసముద్రం ద్వారా అత్యవసర సరకులు పంపిస్తోంది. దీంతో 25 శాతం రవాణా ఖర్చులు అదనంగా పెరగడంతోపాటు పది రోజులు దాటితేనే కానీ చేరడం లేదు. ఈలోగా సూడాన్ ప్రజలు 19 మిలియన్ మంది తీవ్ర ఆహార సంక్షోభానికి గురి కావలసి వస్తోంది. ఈ ఆలస్యం సూడాన్ లోని 90 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై పడుతోంది. అత్యవసర మందులు లేక అల్లాడుతున్నాయి. చివరికి సరఫరాలో ప్రాధాన్యతలు ఏమిటో తేల్చుకోలేకపోతున్నారు. సహాయం కావలసిన పిల్లల సంఖ్యనైనా తగ్గించుకోవాలి. లేదా అందించగలిగే వస్తువుల సంఖ్యనైనా తగ్గించుకోవాలన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇంధనం ధరలు పెరగడంతో ఆహారం ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో సరఫరా కాక సోమాలియాలో 6.5 మిలియన్ మంది తీవ్ర ఆహార కొరతతో అల్లాడుతున్నారు. వీరి భద్రత గాలిలో దీపంలా తయారైంది. నైజీరియాలో ఇంధనం ధరలు సగానికి సగం పెరగడంతో ఆస్పత్రులకు విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడి జనరేటర్లపై ఆధారపడక తప్పడం లేదు. మొబైల్ హెల్త్ టీమ్‌లు తమ సేవలను తగ్గించుకుంటున్నాయి. మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఆకలి బతుకులపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే ఎరువుల్లో 30 శాతం హర్మూజ్ జలసంధి మీదుగానే రవాణా అవుతుండడం పరిపాటిగా వస్తోంది. ఈ ఎరువులు తూర్పు ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో వ్యవసాయ పనులకే ఆధారం. కానీ పేదదేశాల్లోని సన్నకారు రైతులు ఇప్పుడు ఎరువుల కోసం నిరీక్షిస్తున్నారు. సూడాన్ తనకు కావలసిన ఎరువుల్లో దాదాపు సగానికి ఎక్కువగానే గల్ఫ్, కెన్యా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. దీన్ని గమనించి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఎరువుల సరఫరా పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. గతంలో అవలంబించిన ‘బ్లాక్‌సీ గ్రెయిన్ ఇనిషీయేటివ్’ అనే ఒప్పందం ద్వారా నల్లసముద్రం మీదుగా ఎరువులు, ఇతర నిత్యావసరాలు రవాణా అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి యుద్ధం ఎంత బీభత్సంగా ఉన్నా అంతర్జాతీయ సమాజం నిత్యావసరాలు, ఔషధాలు వంటివి సరఫరా చేయడానికి, పేద దేశాలకు మానవతా సాయం అందించడానికి అంతగా స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 

మన తెలంగాణ 7 Apr 2026 11:20 am

Three people |ముగ్గురు అరెస్ట్..

Three people | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఫిల్మ్ నగర్ ప్రాంతంలో

ప్రభ న్యూస్ 7 Apr 2026 11:19 am

మా నుంచే గూఢచర్యం జరుగుతోంది

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌లో అసహనం పెరుగుతోంది. ఇరాన్ ప్రతిఘటనను చూసి మతిపోతోంది. అంచనాలు తారుమారవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదోనన్న అయోమయ స్థితిలో ఉన్నట్లుంది. తాజాగా ఆయన… మాలోనే ఒక గూఢచారి ఉన్నారు, ఇక్కడ నుంచి గూఢచర్యం జరుగుతోందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఒక గూఢచారి ఉన్నారని పేర్కొన్నారు. ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ పైలట్‌ను కాపాడేందుకు అమెరికా సైన్యం […] The post మా నుంచే గూఢచర్యం జరుగుతోంది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Apr 2026 11:11 am

నేడు రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సమావేశం

రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది

తెలుగు పోస్ట్ 7 Apr 2026 11:10 am

Terrible incident |పాత కక్షలతో కుటుంబంపై దాడి

Terrible incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లాలో జూనియర్

ప్రభ న్యూస్ 7 Apr 2026 11:05 am

Telangana : తెలంగాణలో గడ్డిమందుపై నిషేధం.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందుపై నిషేధం విధించింది

తెలుగు పోస్ట్ 7 Apr 2026 11:03 am

గజసింగవరంలో శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

హాజరైన, మాజీ ఎంపీ వినోద్, నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, తోట ఆగయ్య, నర్సింగరావు. గంభీరావుపేట ఏప్రిల్ 07 (జనం …

జనం సాక్షి 7 Apr 2026 11:02 am

సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు... రేవంత్ రెడ్డి భూముల చుట్టూ తిరుగుతున్నారు: హరీష్ రావు

హైదరాబాద్: ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటే సూర్యడి చుట్టూ భూమి తిరిగినట్టు, రేవంత్ రెడ్డి ఆలోచనలు భూముల చుట్టు తిరుగుతున్నాయని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు విమర్శించారు. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. మమ్మలి అరెస్టు చేసి అడ్డుకున్న కూడా పరిగికి వెళ్లి భూములు కోల్పోతున్న ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. హెచ్ సియు యూనివర్సిటీ భూములు, నాదర్ గుల్ భూములు, కోహెడ మార్కెట్, లగచర్ల భూముల కథలను చూశామని దుయ్యబట్టారు. ఇప్పుడు పరిగిలో భూములను లాక్కుంటున్నారని, ప్రజలు పాలన చేయమని గద్దెనెక్కిస్తే ఎందుకు భూములను లాక్కుంటున్నారని ప్రశ్నించారు. ఎస్‌టి, ఎస్‌సిలకు భూములకు సమానమైన నష్ట పరిహారం ఇస్తామన్నారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట మాట్లాడారని, అధికారం వచ్చిన తరువాత మరో మాట మాట్లాడుతున్నారని, భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని మండపడ్డారు. 

మన తెలంగాణ 7 Apr 2026 11:00 am

పోచంపాడ్‌లో కత్తిపోట్ల కలకలం

మెండోరా, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలం పోచంపాడ్

ప్రభ న్యూస్ 7 Apr 2026 10:58 am

తిరుగు ప్రయాణంలో ఆర్టెమిస్‌-2 మిషన్‌

నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-2 మిషన్‌ తిరుగు ప్రయాణం మొదలైంది

తెలుగు పోస్ట్ 7 Apr 2026 10:57 am

ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో..

ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో.. మధిర, ఆంధ్రప్రభ : మధిర మున్సిపాలిటీ పరిధిలోని

ప్రభ న్యూస్ 7 Apr 2026 10:55 am

అసోంలో హామీల జడివాన

భారతదేశ సమకాలీన రాజకీయాల్లో ఎన్నికల వాగ్దానాల ఆశయానికి, మోసానికి మధ్య ఉన్న గీతను క్రమంగా మసకబారుస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ నాయకులకుఓటర్లకు మధ్య పవిత్ర ఒప్పందంగా భావించిన ఎన్నికల హామీలు, ఇప్పుడు అతిశయోక్తి వ్యాఖ్యలు, చిహ్నాత్మక ప్రకటనల నాటక రంగంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి తీసుకువస్తామన్న హామీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘జుమ్లా’గా అభివర్ణించడం ఈ ధోరణికి ప్రతీకగా నిలిచింది. ఈ వ్యాఖ్య కేవలం ఒక ప్రధాన ఎన్నికల హామీని తేలికపరచడమే కాకుండా, రాజకీయ అసత్యాన్ని సాధారణీకరించే ప్రమాదకర ధోరణికి దారితీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ రాజకీయ చర్చల్లో ‘జుమ్లాలు’ ఒక్కటే సంఘటనలుగా మిగిలిపోకుండా, ఎన్నికల వ్యూహాల్లో భాగమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా అసోం వంటి సున్నిత రాష్ట్రాల్లో, గోల్పారా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అసాధ్య హామీలు, విభజనాత్మక వ్యాఖ్యలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అసోంలో ప్రచార సభల్లో గిరిజన కుటుంబాలకు ఆవులు, ఎద్దులు పంపిణీ చేయడం, గోల్పారాలో కేంద్ర డెయిరీ ఏర్పాటు చేయాలన్న హామీ ఇవ్వబడినట్లు సమాచారం. ఇది గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా కనిపించినప్పటికీ, వాస్తవాలను పరిశీలిస్తే ఈ హామీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసోంలోని అనేక గిరిజన సమాజాల్లో పాల వినియోగం సంప్రదాయ ఆర్థిక కార్యకలాపం కాదు. ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే, అక్కడి గిరిజన సమూహాల ఆహారపు అలవాట్లు, ఆర్థిక వ్యవస్థలు భిన్నంగా ఉంటాయి. కొన్ని గిరిజన వర్గాలు గేదె మాంసాన్ని ఆహారంగా ఉపయోగించడం కూడా సాధారణమే. అరుణాచల్ ప్రదేశ్‌లోని గిరిజన నేపథ్యం నుండి వచ్చిన కిరణ్ రిజిజు వంటి నాయకులు బహిరంగంగా అంగీకరించిన వాస్తవం ఇది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ హామీలు నిజంగా అభివృద్ధి లక్ష్యంగా ఉన్నాయా లేక స్థానిక సాంసృ్కతిక వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఒకే విధమైన గ్రామీణ అభివృద్ధి దృక్కోణం ప్రతిఫలమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాంప్రదాయకంగా పాలను వినియోగించని, ఉత్పత్తి చేయని వర్గాలపై పాడి ఆధారిత ఆర్థిక నమూనాను రుద్దడం అనేది స్థానిక పరిస్థితులపై సూక్ష్మమైన అవగాహన లోపాన్ని సూచిస్తుంది. అయితే ఆచరణ సాధ్యం కాని వాగ్దానాల కంటే, గుర్తింపు, పౌరసత్వం చుట్టూ అల్లుకున్న వాక్చాతుర్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. అమిత్ షా, అసోంలోని బెంగాలీ మాట్లాడే ముస్లింలను పదే పదే ‘చొరబాటుదారులు’గా పేర్కొంటూ, వారి చారిత్రక నేపథ్యాన్ని పక్కనబెట్టి బహిష్కరణకు పిలుపునివ్వడం అసోం ఒప్పందానికి వ్యతిరేకమని నిపుణులు అంటున్నారు. ఈ వాదన, అసోం ఒప్పందం ద్వారా స్థాపించిన చట్టపరమైన, చారిత్రక చట్రానికి తీవ్ర విరుద్ధంగా ఉంది. అసోం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 25కు ముందు రాష్ట్రంలోకి వచ్చిన వారందరినీ భారత పౌరులుగా గుర్తించాలి. ఈ చట్టపరమైన గడువు తేదీని విస్మరించడం గతంలో తీవ్ర ఆందోళనలకు ముగింపు పలికిన ఒప్పందాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది. ఇటువంటి వ్యాఖ్యలు చట్టపరమైన అనిశ్చితిని పెంచడమే కాకుండా, తరతరాలుగా అసోంలో నివసిస్తున్న సమాజాల్లో అసురక్షిత భావాన్ని పెంచుతున్నాయి. ఈ పరిమితిని విస్మరించి, బహిష్కరణ అనే ఒకే రకమైన వాదనను ప్రచారం చేయడం ద్వారా రాజకీయ నాయకులు సంవత్సరాల తరబడి సాగిన ఆందోళన, అశాంతికి ముగింపు పలికి, ఎంతో కష్టపడి సాధించిన ఏకాభిప్రాయాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇటువంటి వాక్చాతుర్యం చట్టపరమైన అస్పష్టతను సృష్టించడమే కాకుండా, తరతరాలుగా అసోంలో నివసిస్తూ, దాని వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు, సాంసృ్కతిక స్వరూపానికి దోహదపడిన వర్గాల్లో అభద్రతను పెంచుతుంది. 2011 జనగణన ప్రకారం గోల్పారాలో ముస్లిం జనాభా 57 శాతానికి పైగా ఉంది. వీరిలో చాలా మంది దశాబ్దాలుగా, బహుశా శతాబ్దాల క్రితం అసోంలో స్థిరపడిన వారు వ్యవసాయం, పశుపోషణలో నిమగ్నమై ఉన్నారు. విచిత్రంగా, డెయిరీ రంగంలో వీరి భాగస్వామ్యం గిరిజన వర్గాల కంటే ఎక్కువగా ఉంది. అయినప్పటికీ అభివృద్ధి దృక్కోణంలో ఈ వర్గాలను విస్మరించడం పాలనలో సమగ్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గిరిజన సంక్షేమంపై దృష్టి పెట్టడం ముఖ్యమైనదే అయినప్పటికీ, అదే సమయంలో అదే ప్రాంతంలోని మెజారిటీ జనాభాను అణచివేస్తున్నప్పుడు అది పక్షపాతంగా కనిపిస్తుంది. ఈ పక్షపాత వైఖరి, పరిపాలనలో సమ్మిళితత్వం పైనా, సంక్షేమ పథకాలు పౌరులందరికీ సేవ చేసేలా రూపొందించారా లేక కేవలం రాజకీయంగా అనుకూలమైన వర్గాలకు మాత్రమేనా అనే దానిపైనా ప్రశ్నలను లేవనెత్తుతోంది. బిజెపి గిరిజన హక్కులు, సాంసృ్కతిక పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించినప్పటికీ, ఈశాన్య రాష్ట్రాల్లో ఆచరణలో విరుద్ధతలు కనిపిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా క్రైస్తవులు లేదా స్థానిక మతాలను అనుసరిస్తారు. అక్కడ గేదె మాంస వినియోగం సాధారణం. ఈ నేపథ్యంలో పశువుల ఆధారిత ఆర్థిక పథకాలను ప్రవేశపెట్టడం వెనుక అభివృద్ధి లక్ష్యాలున్నాయా లేక సిద్ధాంతాత్మక ప్రతీకలున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసోం రాష్ట్రం సాంసృ్కతిక సమన్వయానికి, మత సామరస్యానికి ప్రసిద్ధి. శ్రీమంత శంకరదేవ్ బోధనలు సమానత్వం, ఏకత్వాన్ని ప్రతిపాదించాయి. ఆయన నవ వైష్ణవ ఉద్యమం, కుల, మత, జాతి భేదాల అడ్డంకులను అధిగమించి, అస్సామీ గుర్తింపును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించింది. ఈ చారిత్రక నేపథ్యానికి విరుద్ధంగా ఎన్నికల ప్రచారాల్లో మత, భాష ఆధారిత విభజన వ్యాఖ్యలు పెరుగుతున్నాయి. మత లేదా భాషా ప్రాతిపదికన వర్గాలను విభజించే ప్రకటనలు, శతాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని నిలబెట్టిన సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ వారసత్వం, మైనారిటీ సంక్షేమం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీపై మైనారిటీ అనుకూల విధానాల ఆరోపణలు ఉన్నప్పటికీ, సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలు విద్య, ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో తీసుకున్న సంక్షేమ చర్యలు రాజకీయ ప్రలోభాల కంటే సామాజిక అసమానతలను తగ్గించడానికే ఉద్దేశించబడ్డాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్షిత సంక్షేమ చర్యలు, శాంతింపజేసే చర్యలు కావు, అవి వ్యవస్థాగత అసమానతలను పూడ్చే ప్రయత్నాలు. ఈ ప్రయత్నాలు సరిపోతాయా లేదా ప్రభావవంతంగా ఉన్నాయా అనేది చర్చనీయాంశం. కానీ అవి ఎన్నికల ప్రసంగాలమీద కాకుండా అనుభవపూర్వక గణాంకాలపై ఆధారపడి ఉన్నాయి. ఇటీవలి కాలంలో యువతలో రాజకీయ అవగాహన పెరుగుతోంది. జెన్-జెడ్ తరానికి చెందిన ఓటర్లు ఉద్యోగాలు, విద్య, పరిపాలన వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అతిశయోక్తి హామీలు, విభజనాత్మక వ్యాఖ్యలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ మీడియా పెరుగుదలతో నాయకుల ప్రకటనలను సులభంగా పరిశీలించే అవకాశం లభిస్తోంది. అసోంలో యువ ఓటర్ల అభిప్రాయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వారిలో చాలామంది గొప్ప వాగ్దానాలు, విభజనవాద కథనాలపట్ల సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ మీడియా ఆవిర్భావంతో, వాదనలను వాస్తవ నిర్ధారణ చేయడం, నాయకులను జవాబుదారీగా ఉంచడం సులభమైంది. దీనివల్ల, రాజకీయ సాధనంగా ‘జుమ్లాల’ ప్రభావం తగ్గింది. ఎన్నికల సమయంలో అతిశయోక్తి హామీలు, విభజనాత్మక వ్యాఖ్యలు ప్రజాస్వామ్య నైతికతకు సవాలుగా మారుతున్నాయి. అసోం వంటి సున్నిత రాష్ట్రంలో ఈ ధోరణి మరింత ప్రమాదకరం. స్థానిక వాస్తవాలకు అనుగుణంగా విధానాలు రూపకల్పన చేయడం, చట్టపరమైన ఒప్పందాలను గౌరవించడం అత్యవసరం. వలసలు, గుర్తింపు, సాంసృ్కతిక వైవిధ్యం వంటి సంక్లిష్ట చరిత్ర కలిగిన అసోం రాష్ట్రంలో, ఇటువంటి విధానాలు ప్రత్యేకంగా ప్రమాదకరమైనవి. విధానాలు స్థానిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలి. రాజకీయ చర్చలు అసోం ఒప్పందం వంటి స్థిరపడిన చట్టపరమైన చట్రాలను గౌరవించాలి. చివరకు బాధ్యత కేవలం రాజకీయ నాయకులదే కాకుండా ఓటర్లది కూడా. ఓటర్లు మరింత అవగాహనతో, వివేచనతో వ్యవహరిస్తేనే బాధ్యతాయుత పాలనకు మార్గం సుగమమవుతుంది. ‘జుమ్లాలు’ ఎన్నికల రాజకీయాలను నిర్ణయిస్తాయా లేక బాధ్యతాయుత పరిపాలనకు రాజకీయ పార్టీలు మార్గం సుగమం చేస్తాయా అన్న ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. -  గీతార్థ పాఠక్ ( ఈశాన్యోసనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు

మన తెలంగాణ 7 Apr 2026 10:55 am

తెలుగు మహిళల ఆనందోత్సవాలు..

తెలుగు మహిళల ఆనందోత్సవాలు.. పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : తూర్పు బజారు గాంధీ సెంటర్

ప్రభ న్యూస్ 7 Apr 2026 10:49 am

Polycet-2026 | 9 వరకు అప్లై చేసే అవకాశం..

Polycet-2026 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పాలిసెట్-2026 దరఖాస్తు గడువును రాష్ట్ర

ప్రభ న్యూస్ 7 Apr 2026 10:48 am

పేదరికమే పెద్ద జబ్బు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) 1948లో స్థాపించిన సందర్భంగా మొదటి ప్రపంచ ఆరోగ్య సభలు నిర్వహించి, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 ను ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా 1950 నుండి జరుపుకుంటున్నారు. నిజానికి ప్రపంచం మొదటి ఆరోగ్య దినోత్సవాన్ని 22 జులై, 1949 జరుపుకున్నారు. కానీ విద్యార్థుల భాగస్వామ్యం కోసం ఏప్రిల్ 7కు మార్చారు. ప్రపంచంలోని 51 దేశాలు స్థాపకులుగా, 10 దేశాలు ఒప్పందంపై సంతకాలు చేసి మొత్తం 61 దేశాలు పాలుపంచుకొని 1946 జులై నుండి ఆరోగ్య సంస్థ రాజ్యాంగం ఆమోదించబడి, 1948 ఏప్రిల్ 7 నుండి అమలు చేయబడి, 1950 నుండి డబ్ల్యుహెచ్‌ఒ సిబ్బంది, దేశాల సంబంధిత సమర్పణల మేరకు డబ్ల్యుహెచ్‌ఒ డైరెక్టర్ జనరల్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కోసం ప్రతి సంవత్సరం ఒక కొత్త అంశం (థీమ్) ఎంచుకోవడం జరుగుతుంది. 2024- 25 అంచనాల ప్రకారం ప్రపంచం లో 2.15 డాలర్లు (180- 190 రూపాయలు) కూడా ఖర్చు పెట్టలేని జనాభా 8.5-10% (690- 800 మిలియన్ల ప్రజలు) తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల లాంటివి పరిగణనలోకి తీసుకుంటే 18% (1.1 బిలియన్లకు పైగా ప్రజలు) తీవ్రమైన పేదరికంలో ఉన్నట్లు తెలుస్తున్నది. కొవిడ్-19 మహమ్మారి తర్వాత సంఘర్షణలు, ఆర్థిక మందగమనం, యుద్ధాలు లాంటి పరిస్థితుల వల్ల పేదరిక నిర్మూలన నెమ్మదించింది. పేదలపరంగా సబ్ సహారన్, ఆఫ్రికా దారుణంగా ఉన్నది. ప్రపంచంలో ఇప్పటికీ 30 శాతం మంది ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య వసతులు లేవు. ప్రపంచంలో 1800 సంవత్సరంలో తీవ్ర పేదరికం 80 శాతం ఉంటే, 2025 నాటికి 10% తగ్గిపోయినప్పటికీ చాలామంది ప్రజల జీవితాలు దుర్భరంగానే ఉన్నాయి. కానీ ఐక్యరాజ్య సమితి సవాళ్లు ఉన్నప్పటికీ 2030 నాటికి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. నిజానికి ప్రపంచ దేశాలలో నిద్ర లేచినప్పటి నుండి ఈ రోజు పూట గడవడం ఎలా అని పుట్టెడు ఆలోచనలు చేసే ప్రజలు పొద్దున్నే నిద్ర లేచి, వ్యాయామం చేసి, సంతులిత ఆహారాన్ని తీసుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే స్పృహ ఎక్కడున్నది? రోజుకు ఒక ఆపిల్ తిను ఆరోగ్యంగా ఉండు అంటున్నాం, కాని ప్రజలందరూ కొని తినగలిగే స్థితిలో ఉన్నారా? వ్యాయామం చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటున్నాం, కానీ పేదలు వ్యాయామం చేసే స్థితిలో ఉన్నారా? వ్యాయామం చేసే స్థితిలో ఉన్న ప్రజలు కూడా అవగాహన రాహిత్యంతో ఆచరించలేకపోతున్నారు. మన దేశంలో 2026-27 బడ్జెట్ ప్రకారం కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు రూ.1,06,530.42 ఇది గత సంవత్సరం కంటే 10% అదనం. ప్రజారోగ్యంపై జిడిపిలో1.8%-, 1.9% మాత్రమే. నిజానికి జిడిపిలో కనీసం 2.5% ఆరోగ్యానికి ఖర్చు చేయాలనుకొని గత 12 సంవత్సరాలుగా నిధుల పెరుగుదలలో 194% పెరిగినప్పటికీ అనుకున్న లక్ష్యానికి చేరుకోలేదు. 2024-25 నివేదికల ప్రకారం జాతీయ ఆరోగ్య మిషన్ నిధులలో కేవలం 62% మాత్రమే ఉపయోగించబడ్డాయి. ఇండియా స్పెండ్ నివేదిక ప్రకారం దేశంలోని 50 శాతం మంది ప్రజలు ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సేవలను ఉపయోగించుకోక నిరీక్షణవల్ల మందులు, యంత్రాలు నాణ్యత కోల్పోతున్నాయి. దేశంలో 2025 -26 నాటికి రాష్ట్రాలు తమ బడ్జెట్లో 6.2% ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు పెట్టాయి. నిజానికి 2020 నాటికే రాష్ట్రాలు తమ బడ్జెట్లో కనీసం 8% ఆరోగ్య సంరక్షణకు ఖర్చు చేయాలని జాతీయ ఆరోగ్య విధానం 2017 సిఫార్సు చేసింది. కానీ 2025- 26 నాటికి కేవలం 3 రాష్ట్రాలు మాత్రమే ఆరోగ్యానికి తమ బడ్జెట్లో 8 శాతం కంటే ఎక్కువ నిధులు కేటాయించాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ ఖర్చులను ఎదుర్కొంటున్నారు ఇందుకు కారణం బలమైన ఆర్థిక అసమానతలు. సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్థికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ఆరోగ్యం మాత్రమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈ నేల మీద విద్య, ఆరోగ్యం అనే రెండు అంశాలు ఎంతో ప్రాశస్తం గలవి. అందుకే ప్రభుత్వాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉచిత వైద్యం, ఉచిత విద్య అందరికీ అందేటట్లు చూసినప్పుడు ఆరోగ్య ప్రపంచాన్ని చూడవచ్చు. అలా కానీ ఎడల ప్రపంచ ఆరోగ్య దినాలను రోజూ జరుపుకున్నా ఫలితం నామ మాత్రమే. ప్రభుత్వం ఆరోగ్యంపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పిస్తూ తుల పట్ల జాగరుకుతతో ఉండేటట్లు చూడాలి. ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతులను చేయనంతవరకు ఎన్ని ప్రయోజనాలు చేకూర్చిన నిష్ప్రయోజనమే. - డా. కావలి చెన్నయ్య 9000481768

మన తెలంగాణ 7 Apr 2026 10:44 am

చొరబాటుదారుల పేరుతో బీజేపీ రాజకీయాలు

ఇంత వరకు వారిని ఎందుకు పంపలేకపోయారు: ఖడ్గే సిల్చర్ (అసోం): రాష్ట్రంలో చొరబాటుదారుల పేరు చెప్పి బీజేపీ కాలయాపన చేసి రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విమర్శించారు. పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం నుంచి చొరబాటుదారులను బీజేపీ చొరబాటుదారులను ఎందుకు వెనక్కి పంపలేకపోయిందని ప్రశ్నించారు. బీజేపీ, కేంద్రమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కచార్ జిల్లాలోని బోర్ఖోలాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘అసోంకు […] The post చొరబాటుదారుల పేరుతో బీజేపీ రాజకీయాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Apr 2026 10:43 am

Former Minister |రైతులను కలవకుండా…

Former Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్

ప్రభ న్యూస్ 7 Apr 2026 10:41 am

జర్నలిస్ట్ లకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్

తిరుపతి పట్టణ పరిధిలోని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోగలరు తిరుపతి, ఏప్రిల్ 06: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో తిరుపతి పట్టణ పరిధిలో అక్రెడిటేషన్ కలిగిన పాత్రికేయులకు ఈ నెల 07 నుండి 10 వరకు అమరా ఆసుపత్రి, కరకంబాడి వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నందు నిర్వహించు పరీక్షలు: The post జర్నలిస్ట్ లకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Apr 2026 10:37 am

ఇందిరాదేవి పై చర్యలు నిలుపుదల..

ఇందిరాదేవి పై చర్యలు నిలుపుదల.. గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ ఏరియా ప్రభుత్వ

ప్రభ న్యూస్ 7 Apr 2026 10:36 am

పాడి రైతుకు కష్టకాలం

*పతనమవుతున్న ధరలు*పెరుగుతున్న పెట్టుబడి*పశువులకు మేత కొరత చిత్తూరు జిల్లా అంటేనే పాడి పరిశ్రమకు పట్టుగొమ్మ. రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్న ఈ జిల్లాలో లక్షలాది కుటుంబాలకు పశువులే జీవనాధారం. వ్యవసాయం కలిసిరాక, వర్షాభావ పరిస్థితులతో విసిగిపోయిన సామాన్య రైతుకు ‘పాడి’ ఒక ఆశాకిరణంగా నిలిచింది. కానీ, నేడు అదే పాడి పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, పాలకుల ఉదాసీనత మరోవైపు వెరసి.. పాడి రైతు బతుకు భారంగా మారింది. మేత కొరత […] The post పాడి రైతుకు కష్టకాలం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Apr 2026 10:28 am

పిడుగుపాటుకు ఇద్దరు మృతి..

పిడుగుపాటుకు ఇద్దరు మృతి.. దర్శి, ఆంధ్రప్రభ : దర్శి నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం

ప్రభ న్యూస్ 7 Apr 2026 10:26 am

మీరు చదివిన బడి ఇక మాయం!

ప్రతి ఊరికి ఒక గుడి ఉంటుందో లేదో కానీ బడి మాత్రం ఉంటుంది. బడి ప్రాధాన్యత అలాంటిది. ఒకవేళ ప్రభుత్వ పాఠశాల కానీ ప్రైవేటు పాఠశాల కానీ లేకపోయినా కనీసం ఆ ఊర్లో ఎవరో చదువుకున్న వ్యక్తి అయినా నలుగురిని కూర్చోబెట్టుకుని ఏదో నేర్పుతుంటాడు. చదువుకు అనాది నుండి అదే ప్రాముఖ్యత. ఎవరైనా తాము చదివిన బడిని, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను అంత తొందరగా మరువలేరు. బడి పట్ల అభిమానం, గురువుల పట్ల గౌరవం ఏనాడు తరగవు. బడితో ఉండే అనుబంధం చిరకాలం నిలుస్తుంది. చిన్ననాటి బడి గురువులు కనపడగానే సహజంగానే మనసు గతం లోతుల్లోకి వెళ్లిపోతుంది. మన తెలంగాణ విద్యా కమిషన్ ఊళ్ళలోని పాఠశాలలను విలీనం చేసి ప్రతి మండలంలో విద్యార్థుల సంఖ్యను బట్టి మూడు లేదా నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయమని సిఫార్సు చేయగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించి నిధులు కేటాయించి రంగంలోనికి దిగుతున్నది. మనం చిన్నతనంలో చదువుకున్న ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత, సెకండరీ పాఠశాలలన్నీ కలిసిపోయి ఒకే పాఠశాలగా ఇంటర్మీడియట్‌వరకు నడుస్తాయట. వివిధ యాజమాన్యాలతో నేడు నడుస్తున్న 28 రకాల పాఠశాలలన్నీ మాయమై మూడు లేదా నాలుగు రకాలు మాత్రమే మనకు కనబడతాయి. అంతేకాదు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా క్రమంగా తగ్గిపోయి కాలక్రమంలో కాంట్రాక్టు టీచర్లే ఈ పబ్లిక్ స్కూల్స్‌లో పాఠాలు చెప్తారు. జూనియర్ కళాశాలలు, ఇంటర్మీడియట్ బోర్డు కూడా రద్దు కాబోతున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరానికి వార్షిక పరీక్షలు కూడా ఉండవు. ఈ పెను మార్పులన్నీ విద్యా విధానాన్ని ఏం చేస్తాయో కానీ మొత్తం మీద ఒక గందరగోళ పరిస్థితి మాత్రం ప్రస్తుతం నెలకొని ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్ బిఎస్‌సి, ఫార్మసీ లాంటి కోర్సులు చదవడానికి కూడా ప్రవేశ పరీక్షలు ఉండవు. కేవలం ఇంటర్‌లో మార్కుల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇక భవిష్యత్తులో గురుకులాల సంఖ్య పెరగబోదు. అవి అలాగే కొనసాగితే సంతోషించాల్సిన పరిస్థితి. తెలంగాణ విద్యా కమిషన్ ఆకునూరి మురళి అనే ఒక ఐఎఎస్ అధికారి నేతృత్వంలోని టీం రాష్ట్రంలోని 35 పాఠశాలలు తిరిగి తల్లిదండ్రులతో, విద్యార్థులతో సమావేశాలు జరిపి 54 సెమినార్లు నిర్వహించి ఐదు రాష్ట్రాలు, మూడు విదేశాలు పర్యటించి దాదాపు 18 నెలల కాలంలో ఇచ్చిన నివేదికలో 434 సిఫార్సులు చేసి విద్యావేత్తలను, ఉపాధ్యాయ సంఘాలను, ముఖ్యంగా విద్యాభిమానులను ఆశ్చర్యములోనేకాక ఆగ్రహానికి గురిచేసింది. ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు మంగళం పాడుతామని ప్రభుత్వం పదేపదే చెప్పడమే కానీ గత రెండున్నర ఏళ్లలో అందుకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు లక్షల్లో తగ్గుతుండగా, ప్రైవేటు రంగంలోని బడులలో అవి అదే సంఖ్యలో పెరగడం గమనార్హం. గత పదిహేళ్లుగా ఎన్నో విజయాలు సాధించి ఉచిత, నాణ్యమైన విద్యను అందిస్తూ పివి నరసింహారావు ఆలోచనలకు, ఎన్‌టి రామారావు ఆశయాలకు అనుగుణంగా నడిచి ఐఐటి, మెడిసిన్ సీట్లు గణనీయంగా సాధిస్తూ ఇటు క్రీడారంగంలో కూడా దేశానికి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన గురుకులాలకు నేడు ఆదరణ కరువై కునారిల్లుతున్నాయి. ఆకునూరి కమిటీ నివేదిక విద్యారంగంలో కలకలాన్ని సృష్టించింది. ప్రభుత్వ రంగంలో నేటి వరకు పూర్వ ప్రాథమిక పాఠశాలలు లేవు. పల్లెల్లో అంగన్వాడీలు ఉన్నాయి. అన్ని పాఠశాలలనూ విలీనం చేస్తే పూర్వ ప్రాథమిక నుండి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో నిర్వహించడం అనేక వయసుల వారు అంటే మూడేళ్ల నుండి 17 ఏళ్ల వరకు విద్యార్థులు ఒకే చోట విద్యాభ్యాసం చేయడం సబబేనా? ఆరోగ్యకర వాతావరణం సాధ్యమేనా? కేవలం భవనాలతో రంగులతో, హంగులతో నాణ్యమైన విద్య ఇవ్వగలరా? కార్పొరేట్ వ్యవస్థలో ఇరుకు గదులలో గాలి వెలుతురు లేకుండా క్రీడా మైదానం ఇతర కృత్యాలు లేకుండా ఫలితాలు రావడం లేదా? వాటిని మనం సమర్థించడం లేదు. కానీ నాణ్యత కోసం వేల కోట్ల రూపాయల ఖర్చు కంటే ఒక 1000 కోట్లు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ బాగు చేయవచ్చు. బలోపేతం చేయడం అంటే విలీనం చేసి ఒకేచోట విద్యాభ్యాసం ఏర్పాటు చేయడమేనా? గురువులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని, వారికి పదోన్నతులు వద్దని చెప్పడం ఒకరకంగా గురువులకు పంగనామాలు పెట్టడమే. సమాజానికి మార్గదర్శి అయిన గురువు ప్రాధాన్యతను తగ్గించి అవమానించడమే. కాంట్రాక్టు టీచర్లు ఎంత సామర్థ్యం కలిగి ఉన్నా తక్కువ జీతానికి అభద్రతాభావంతో వారు పనిచేయడం కూడా అనుమానాస్పదమే. జాతీయస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తున్న ఇంటర్మీడియట్ బోర్డును రద్దుచేసి పాఠశాల విద్యలో విలీనం చేయవలసిన అవసరం లేదు కదా! అంటే నూతన విద్యా విధానాన్ని మన ప్రభుత్వం అనుసరించబోతున్నదా? చిన్ననాటి నుండి ఆంగ్ల మాధ్యమం కూడా అర్థంలేని సిఫారసు. భావ నిర్మాణం మాతృభాషలోనే సాధ్యమని అనేక కమిటీలు విధానాలు ఘోషిస్తున్నాయి. పాఠశాలలో తప్ప మిగిలిన జీవితంలో మనం మాట్లాడేది మాతృభాష మాత్రమే. అంతేకాదు గిరిజన భాషలకు కూడా ముప్పు ఏర్పడవచ్చు. ఆంగ్ల మాధ్యమాన్ని 5 నుండి లేదా 8వ తరగతి నుండి ఐచ్ఛికం చేయవచ్చు. అసలు ఆంగ్ల మాధ్యమంలో బోధించే నైపుణ్యం గల ఉపాధ్యాయులు చాలినంత మంది ఉన్నారా? శిక్షణ ఇచ్చినంత మాత్రాన రోజుల్లోనే నైపుణ్యం వస్తుందా? ప్రతిరోజు విద్యార్థులు ప్రయాణం చేయడం రిస్క్‌తో కూడిన పని. 24 గంటలు క్యాంపస్‌లో ఉంటేనే ఊహించని ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు వేల పాఠశాలల నిర్మాణం ఎన్ని సంవత్సరాలకు జరిగేను? ఒకవేళ ప్రభుత్వాలు మారితే ఈ విధానం ఈ బడులు నిలిచేనా? రూ. 20 వేల కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎవరికోసం? ఈ విలీనం విద్యా వికాసానికా లేక విధ్వంసానికా అనేది విద్యావేత్తలు ముఖ్యంగా ఉపాధ్యాయుల సందేహం. గిరిజన బిడ్డల భవితవ్యం ఏమిటి? ఏం కాబోతున్నది? గ్రామీణ నిరుపేదలు చదువుకు మరింత దూరం అవుతారా అనే ఆందోళన ప్రజల్లో ఉంది. విద్యకు 18 శాతం బడ్జెట్ కేటాయింపు చేయాలన్న సిఫార్సు అందరికీ ఆమోదయోగ్యమే కానీ ప్రభుత్వానికి అది ఆచరణ సాధ్యం కాదు. అందుకే 2026- 27 బడ్జెట్లో 8.2% కేటాయించి తన ఉద్దేశాన్ని చాటిచెప్పింది.కమిషన్ ఆలోచనలు ఆకాశంలో ఉండగా ప్రభుత్వ చేతలు పాతాళంలో ఉన్నాయి. విద్యార్థుల ఆశలు, తల్లిదండ్రుల ఆకాంక్షలు ఉపాధ్యాయుల భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల కంటే బోధనేతర సిబ్బందికే ఎక్కువ జీతాలు సిఫార్సు చేయడం ద్వారా ఈ కమిషన్ ఉపాధ్యాయుల శ్రమ దోపిడీకి ఎర్రతివాచీ పరిచినట్లుగానే భావించాలి. మానవ వనరుల అభివృద్ధి జరగాలంటే ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన వేతనాలు ఉండాలి. అనేక దేశాల్లో ఉపాధ్యాయుల వేతనాలు అత్యధికంగా ఉన్నాయి. కానీ కమిషన్ వాటిని పరిశీలనలోనికి తీసుకోలేదు. తన పరిధి దాటి కమిషన్ వేతనాల గురించి వ్యాఖ్యానించడం అభ్యంతరకరం. ఉపాధ్యాయ శిక్షణలను మరింత పక్కాగా నడిపించాలి అనేది ఒప్పుకోదగిన అంశం. ఇంటర్ తర్వాత వృత్తి విద్యా కోర్సులకు ప్రవేశ పరీక్ష వద్దు అని చెప్పడం ప్రైవేటు రంగానికి మార్గం మరింత సుగమం చేస్తున్నది. ఇంతకాలంగా వృత్తి విద్యా కోర్సులు చదవడానికి పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఆ పథకాన్ని తీసివేయాలని చెప్పడం పేద విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు దూరం చేయడమే. డిగ్రీ గురుకులాలను రద్దు చేయాలనడం సంక్షేమ విద్యార్థుల ఉన్నత విద్య ఆశయాలకు అడ్డుకట్ట వేయడమే. ప్రజలకు, వారి నివాసాలకు విద్యాలయాలు అందుబాటులో ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని కమిషన్ ఉల్లంఘించినట్లు స్పష్టం అవుతున్నది. అంటే కమిషన్ సభ్యులు యుజిసి నిబంధనలు అధిగమించి ప్రామాణికంగా ఉన్న కొఠారి కమిషన్ సూత్రాలను పక్కనపెట్టి విద్యా హక్కు చట్టాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా నివేదిక తయారు చేశారా అనే ప్రశ్న ఉదయిస్తున్నది. 350 పేజీల నివేదిక ఇన్ని ప్రశ్నలకు అనుమానాలకు తావు ఇచ్చే రీతిలో తయారు చేశారు. దీనివల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయి. ఆలోచనల స్థాయిలోనే ఇన్ని సమస్యలు ఉండగా, అమలులో ఇంకెన్ని సమస్యలు రాబోతున్నాయో? ఉపాధ్యాయ సంఘాలను వారి సలహాలను పరిగణనలోనికి తీసుకోకుండా ఈ నివేదిక తయారైందని సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా అనేక అనుమానాలకు ఆలవాలమైన ఈ నివేదిక ఉపాధ్యాయులను సంతృప్తి పరచగలదా? తల్లిదండ్రుల ఆకాంక్షలకు, విద్యార్థుల ఆశలకు రూపు ఇవ్వగలదా? కాలమే సమాధానం చెప్పాలి. - శ్రీ శ్రీ కుమార్

మన తెలంగాణ 7 Apr 2026 10:25 am

ఘనంగా ఎమ్మెల్యే బూచేపల్లి జన్మదిన వేడుకలు..

ఘనంగా ఎమ్మెల్యే బూచేపల్లి జన్మదిన వేడుకలు.. దర్శి, ఆంధ్రప్రభ : ప్రకాశం జిల్లా

ప్రభ న్యూస్ 7 Apr 2026 10:16 am

అగ్నిమాపక దళానికి ఆధునిక శక్తి..

అగ్నిమాపక దళానికి ఆధునిక శక్తి.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అగ్నిమాపక

ప్రభ న్యూస్ 7 Apr 2026 10:10 am

After returning to Hinduism, Miss India Earth Vanishes

Miss India Earth 2019 winner Sayli Surve is missing from Pune. She recently was seen in ghar wapsi ceremony during which she returned to Hinduism after accusing her husband of abusing and love jihad. Her parents have lodged a complaint claiming that the in-laws of Sayli Surve have kidnapped her along with her four kids. […] The post After returning to Hinduism, Miss India Earth Vanishes appeared first on Telugu360 .

తెలుగు 360 7 Apr 2026 10:07 am

Jailer 2: Four Superstars in a Single Frame

Superstar Rajinikanth’s upcoming movie Jailer 2 shoot is happening currently in Hyderabad. The shoot reached the final stages and the makers announced that the film will release in August. A crucial schedule is happening in Hyderabad and four Superstars of Indian cinema will be seen sharing screen in a sequence that is currently shot in […] The post Jailer 2: Four Superstars in a Single Frame appeared first on Telugu360 .

తెలుగు 360 7 Apr 2026 10:01 am

Mango: ఈ మామిడి పండు తింటున్నారా? అయితే మీరు ట్రబుల్ లో పడినట్లే

మామిడి పండు పండ్లలో రారాజు

తెలుగు పోస్ట్ 7 Apr 2026 9:57 am

శివనగర్‌లో తాగునీటి ఘోష..

శివనగర్‌లో తాగునీటి ఘోష.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలోని 34,

ప్రభ న్యూస్ 7 Apr 2026 9:55 am

Andhra Pradesh : ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది

తెలుగు పోస్ట్ 7 Apr 2026 9:51 am

అమ్మవారికి వెండి బహుకరించిన భక్తులు..

అమ్మవారికి వెండి బహుకరించిన భక్తులు.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ శివనగర్లోని

ప్రభ న్యూస్ 7 Apr 2026 9:44 am

Ys Jagan : నేడు వైసీపీ ముఖ్య నేతలతో జగన్‌ భేటీ

నేడు వైసీపీ ముఖ్య నేతలతో జగన్‌ సమావేశం నిర్వహించనున్నారు

తెలుగు పోస్ట్ 7 Apr 2026 9:43 am

బ్రూటల్ ధర్మగా జేడీ

తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మోడరన్ ఎంటర్‌టైనర్ గాయపడ్డ సింహం. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ పతాకాలపై పవన్ సాదినేని సమర్పణలో కళ్యా ణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజ య్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, మాన స చౌదరి హీరోయిన్లు. మేకర్స్ ఇప్పుడు మరొక కీలక పాత్ర.. జేడి చక్రవర్తిని బ్రూటల్ ధర్మగా పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ’గాయపడ్డ సింహం’ మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. గ్లిం ప్స్ లాంచ్ ప్రెస్ మీట్‌లో జేడి చక్రవర్తి మాట్లాడుతూ “ధర్మ క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. క్యారెక్టర్ పరంగా కమల్ హాసన్ కూడా ఇలాంటి పాత్ర చేసి ఉం డరు. అంత గొప్ప పాత్ర ఇందులో చేశాను”అని అన్నారు. డైరెక్టర్ కశ్యప్ మాట్లాడుతూ “గాయపడ్డ సింహం అంటే తరుణ్ భాస్కర్ ఒక్కరే కాదు, ఇంకా ఉన్నారని ముందే చెప్పాను. అది జెడి. అలాగే జెడి బెస్ట్ సినిమాల్లో మనకు నచ్చిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో కనిపిస్తాయి”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ సాదినేని, భాను కిరణ్ ప్రతాప్ పాల్గొన్నారు.   

మన తెలంగాణ 7 Apr 2026 9:38 am

Amaravathi : అమరావతికి ఊపొచ్చిందా... డెడ్ లైన్ ముగుస్తుండటంతో?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయి

తెలుగు పోస్ట్ 7 Apr 2026 9:37 am

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం..

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం.. మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : రైతుల అభివృద్ధి

ప్రభ న్యూస్ 7 Apr 2026 9:28 am

మాస్ యాక్షన్, రొమాన్స్, కామెడీతో ట్రైలర్

హీరో నాగ శౌర్య... రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ’బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంలో మాస్ అవతార్‌తో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ పాటలు, పవర్-ప్యాక్డ్ టీజర్‌తో భారీ అంచనాలను సృష్టించింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. సినిమా మాస్ యాక్షన్, డ్రామా, రొమా న్స్, కామెడీ అన్నీ కలిపిన పూర్తి ఎంటర్‌టైనర్‌గా రానుందని ట్రైలర్ తెలియజేసింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ “ఆరెంజ్ సినిమా పాటలు విన్నప్పటి నుంచి హారిస్ జయరాజ్‌తో వర్క్ చేయాలని అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ అవకాశం వచ్చింది. ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రభాస్ ‘ఈశ్వర్‘ సినిమాలో శ్రీదేవిని చూశాను. అలాంటి అదృష్టం నాకు కూడా ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. శ్రీదేవి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఈ సినిమా నచ్చాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. శ్రీదేవి విజయ్‌కుమార్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. శౌర్య చాలా టాలెంటెడ్. అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను”అని అన్నారు. కెమెరామెన్ రసూల్ మాట్లాడుతూ “చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది”అని తెలియజేశారు. ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ “శౌర్యతో కలిసి ఒక మంచి సినిమా తీశాం. జీ వారికి ఈ సినిమా చూపించగానే, ఓటిటి రైట్స్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా వారే చేస్తామని చెప్పారు. శౌర్యతో మరోసారి కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు.

మన తెలంగాణ 7 Apr 2026 9:26 am

ఉత్తర సిక్కింలో భారీగా మంచు

ఉత్తర సిక్కింలో భారీగా మంచు కురుస్తుంది

తెలుగు పోస్ట్ 7 Apr 2026 9:25 am

Sharwa’s Biker passes the Monday Test

Charming Star Sharwanand has a very good name and market among Telugu audiences as he offers something fresh with each of his films. His recent release, Biker, offers a very unique father-son bonding story in the backdrop of motor racing, a first-of-its-kind for Indian Cinema. Abhilash Reddy directed the film with great production values by […] The post Sharwa’s Biker passes the Monday Test appeared first on Telugu360 .

తెలుగు 360 7 Apr 2026 9:23 am

రాజేంద్రనగర్ లో బట్టల షాప్ లో భారీ అగ్ని ప్రమాదం

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బండ్లగూడలోని బట్టల షాప్ లో మంటలు చెలరేగడంతో షాపు పూర్తిగా దగ్ధమైంది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. సిద్ధి వినాయక టెక్స్టైల్స్ షాప్ రెండు ఫ్లోర్ లలో ఉంది.  పెరిగిన ఉష్ణోగ్రతలతోనే షాక్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. 

మన తెలంగాణ 7 Apr 2026 9:21 am

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.. కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం

ప్రభ న్యూస్ 7 Apr 2026 9:21 am

Summer Effect : సుర్రుమంటున్న ఎండలు.. పంటలను కాజేస్తున్నవానలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రెండు రోజుల పాటు విభిన్న పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది

తెలుగు పోస్ట్ 7 Apr 2026 9:18 am

Hyderabad : హరీశ్ రావు హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు

తెలుగు పోస్ట్ 7 Apr 2026 9:14 am

నేడు హుజురాబాద్‌లో కౌశిక్‌రెడ్డి దీక్ష

నేడు హుజురాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దీక్ష చేయనున్నారు

తెలుగు పోస్ట్ 7 Apr 2026 9:06 am

మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్

హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డగించారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా బిఆర్ఎస్ నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు. హరీశ్ రావు నివాసం వద్ద పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి.  మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతల గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్తుండగా మహేష్ అరెస్టు చేసి కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

మన తెలంగాణ 7 Apr 2026 9:06 am

Bahrain High Alert : బహ్రెయిన్​ గజగజ Andhra Prabha News

Bahrain High Alert : బహ్రెయిన్​ గజగజ Andhra Prabha News (

ప్రభ న్యూస్ 7 Apr 2026 9:06 am

సైబర్ నేరాల పై అప్రమత్తతే రక్షణ..

సైబర్ నేరాల పై అప్రమత్తతే రక్షణ.. -అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి-సైబర్ మోసాలపై

ప్రభ న్యూస్ 7 Apr 2026 9:04 am

ఇన్చార్జి వైద్యులుగా బాధ్యతలు చేపట్టిన తరుణ్..

ఇన్చార్జి వైద్యులుగా బాధ్యతలు చేపట్టిన తరుణ్.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని ప్రభుత్వ

ప్రభ న్యూస్ 7 Apr 2026 8:54 am

Gold Price Today : పసిడిప్రియులకు గుడ్ న్యూస్.. ధరలు మరింత తగ్గాయ్ గా

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు పెరిగాయి.

తెలుగు పోస్ట్ 7 Apr 2026 8:54 am

Tirumala : తిరుమలకు నేడు వచ్చే వారికి గుడ్ న్యూస్

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది

తెలుగు పోస్ట్ 7 Apr 2026 8:38 am

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.. మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : రబీ సీజన్‌లో

ప్రభ న్యూస్ 7 Apr 2026 8:38 am

బెంగళూరు దూకుడు..

బెంగళూరు: ఐపిఎల్19లో డిఫెండింగ్ ఛాం పియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) అసాధారణ ఆటతో అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఘన విజయాలు సాధించి ప్రత్యర్థి జట్లకు గట్టి సవాల్ విసురుతోంది. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. తాజాగా మరో బలమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారీ విజయాన్ని అందుకొంది. రెండు మ్యాచుల్లో గెలిచిన బెంగళూరు టైటిల్ ఫేవరెట్‌లలో ఒకటిగా కనిపిస్తోంది. ఒకప్పుడూ బెంగళూరు టీమ్ అంటే అనిశ్చితి ఆటకు మరో పేరుగా చెప్పుకునే వారు. కానీ కిందటి సీజన్ చివరి నుంచి జట్టు ఆటలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. 2025లో ప్రతికూల పరిస్థితులను సయితం తట్టుకుంటూ ట్రోఫీ సాధించి ఐపిఎల్‌లో నయా చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బెంగళూరు ఏకంగా ఐపిఎల్ విజేతగా నిలిచి ఔరా అనిపించింది. ఈ సీజన్‌లో జట్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఆర్‌సిబి కూడా దానికి తగినట్టుగానే తన ఆట తీరును మార్చుకుంది. తొలి మ్యాచ్‌లో 200కి పైగా భారీ స్కోరును అలవోకగా ఛేదించింది. తాజాగా చెన్నైతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ 250 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. జట్టులోని ప్రతి ఆటగాడు తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంతో బెంగళూరుకు ఎదురు లేకుండా పోతోంది. రానున్న రోజుల్లోనూ కూడా ఇలాంటి ఆటనే కనబరచాలనే పట్టుదలతో ఆర్‌సిబి ఉంది.

మన తెలంగాణ 7 Apr 2026 8:36 am

కోపరేటివ్ శాఖ అవగాహన సదస్సు..

కోపరేటివ్ శాఖ అవగాహన సదస్సు.. వికారాబాద్, ఆంధ్రప్రభ : సహకార శాఖ ఆధ్వర్యంలో

ప్రభ న్యూస్ 7 Apr 2026 8:29 am

రాజస్థాన్‌కు ఎదురుందా?

నేడు ముంబైతో పోరు గౌహతి: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న రాజస్థాన్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇందులోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ అద్భుత విజయం సాధించింది. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. దీంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ముంబైలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. రెండు విభాగాల్లోనూ సమతూకంగా కనిపిస్తున్న ముంబై కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధహైంది.

మన తెలంగాణ 7 Apr 2026 8:28 am

మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు..

మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు.. వికారాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 7 Apr 2026 8:23 am

విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

నేడు విజయవాడలో మంత్రి నారాయణ పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 7 Apr 2026 8:20 am

తేలిపోతున్న సూపర్ కింగ్స్

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్ సీజన్ 2026లో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) టీమ్ వరుస ఓటములతో నిరాశ పరుస్తోంది. చెన్నై ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసింది.బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలు కావడంతో అభిమానులు నిరాకు గురవుతున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతని కెప్టెన్సీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆర్‌సిబి బ్యాటర్లు చెలరేగిపోతున్నా రుతురాజ్ పెద్దగా స్పందించలేదు. ఫీల్డింగ్, బౌలింగ్‌లో మార్పులు చేయడంలో విఫలం కావడంతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ముఖ్యంగా టిమ్ డేవిడ్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెన్నై బౌలింగ్‌ను చిన్నాభిన్నం చేశాడు. అతన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక బౌలర్లు పూర్తిగా చతికిల పడిపోయారు. అంతకుముందు జరిగిన తొలి రెండు మ్యాచుల్లో కూడా చెన్నైకి పరాజయాలు తప్పలేదు. వరుస ఓటములు ఎదురవుతున్నా లోపాలను సరిదిద్దు కోవడంలో కెప్టెన్‌తో పాటు ఇతర ఆటగాళ్లు ఘోర వైఫల్యం చవిచూస్తున్నారు. ఇప్పటికే మూడు మ్యాచుల్లో ఓటమి పాలు కావడంతో కెప్టెన్‌తో పాటు, జట్టు సభ్యులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుతురాజ్ బ్యాట్‌తోనే కాకుండా కెప్టెన్సీలోనూ తేలిపోతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఇక భారీ ఆశలు పెట్టుకున్న స్టార్ ఆటగాడు సంజు శాంసన్ కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. మూడు మ్యాచుల్లోనూ శాంసన్ విఫలమయ్యాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. అయూష్ మాత్రె, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబె, ఓవర్టన్, మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్ వంటి స్టార్‌లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. రానున్న మ్యాచుల్లోనైనా చెన్నై తన ఆట తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారడం ఖాయం.

మన తెలంగాణ 7 Apr 2026 8:16 am

మండు వేసవిలో మంచు వాసనలు..

మండు వేసవిలో మంచు వాసనలు.. నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : నల్లగొండ మండలంలో

ప్రభ న్యూస్ 7 Apr 2026 8:15 am

Andhra Pradesh : నేడు ఏపీ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నేడు జరగనుంది

తెలుగు పోస్ట్ 7 Apr 2026 8:14 am

Revanth Reddy : నేడు కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం

నేడు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు

తెలుగు పోస్ట్ 7 Apr 2026 8:03 am

అడవిలో రాత్రంతా తండ్రి మృతదేహంతో గడిపిన బాలుడు... ప్రియుడితో పారిపోయిన తల్లి

అమరావతి: ఓ బాలుడు ఏడుస్తూ గ్రామానికి వచ్చి తన తండ్రిని రాళ్లతో కొట్టి చంపేశారని చెప్పడంతో గ్రామస్థులు అక్కడికి వెళ్లి చూడగా ఓ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తమిళనాడు రాష్ట్రానికి చెందిన గాంధీ(45), రాసాతి అనే దంపతులు చౌడేపల్లి మండలంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు సందీప్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రాసాతికి నరిసింహులు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె భర్త, కుమారుడిని వదిలేసి ప్రియుడితో పారిపోయింది. వారు బోయకొండ యానాదిపాళ్యంలో ఉన్నట్లు తెలియడంతో గాంధీ తన కుమారుడితో కలిసి వారు వద్దకు వెళ్లాడు. భార్య నీ వెంట పంపిస్తామని గాంధీకి కొందరు నమ్మబలికారు. గాంధీ, అతడి కుమారుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అతడిని రాళ్లతో కొట్టి చంపారు. చీకటి కావడంతో తండ్రి మృతదేహం వద్దే కుమారుడు ఉండిపోయాడు. తెల్లవారుజామున మృతదేహం నుంచి రెండు కిలో మీటర్లు నడిచి గ్రామానికి చేరుకొని తన తండ్రిని చంపేశారని చెప్పాడు. గ్రామస్థులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

మన తెలంగాణ 7 Apr 2026 7:48 am