SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

యువతరం చేతిలో నేపాల్ భవిత

ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన, అవినీతి పంకిలంలో నిండామునిగిన రాజకీయ వృద్ధ జంబూకాలకు గుణపాఠం చెబుతూ, భవిష్యత్తుపై కొండంత ఆశతో నవ యువతరానికి పట్టంగట్టింది పొరుగున ఉన్న హిమాలయ దేశం నేపాల్. అల్లర్లకు, ఆందోళనలకు, రాజకీయ అనిశ్చితికి పెట్టింది పేరైన నేపాల్‌లో మూడేళ్ల క్రితం కళ్లు తెరిచిన ఒక కొత్త పార్టీకి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టడం ప్రపంచ దేశాలను నివ్వెరపరిచిందంటే అతిశయోక్తి లేదు. దేశంలో పెచ్చరిల్లిపోతున్న అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యలను పట్టించుకోకుండా విలాసాలలో మునిగితేలే రాజకీయ నేతల తీరుపట్ల విసిగివేసారిపోయిన ప్రజలు నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, నేపాలీ కమ్యూనిస్టు పార్టీ వంటి పేరొందిన పార్టీలను కట్టగట్టి ఓ మూలకు విసిరిపారేసి, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్ పి)కి అందలం అప్పగించారు. గత సెప్టెంబర్ నెలలో ఉవ్వెత్తున ఎగసిన జన్‌జడ్ ఉద్యమం ప్రధాని కెపి శర్మ ఓలి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడంతోనే యువతరం శక్తి ఏమిటో అర్థమైంది. యువతరం నాడి తెలుసుకుని, సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగిన ఆర్‌ఎస్‌పి.. అవినీతిని రూపుమాపి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీలు ఇచ్చి అధికారానికి దగ్గరైంది. 275 స్థానాల పార్లమెంటులో ప్రత్యక్ష ఓటింగ్ జరిగిన 165 సీట్లలో ఇప్పటికే మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన ఆర్‌ఎస్‌పి, మిగిలిన 110 సీట్లకు దామాషా పద్ధతిలో జరిగే ఎన్నికలోనూ తిరుగులేని విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు. ర్యాపర్‌గా వృత్తి జీవితం మొదలు పెట్టి, రాజకీయాల్లోకి అడుగిడిన ముప్ఫయ్ అయిదేళ్ల బాలేంద్ర షా ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే దేశ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించడం ఖాయం. తాజా ఎన్నికల్లో ఆయన మాజీ ప్రధాని కెపి శర్మ ఓలిని 50 వేల ఓట్ల తేడాతో ఓడించారు. దశాబ్దాల తరబడి రాచరిక పాలనలో మగ్గుతూ, ప్రపంచానికి దూరంగా ఉన్న నేపాల్, పద్ధెనిమిదేళ్ల క్రితం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అయినా, తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి పార్టీల పుణ్యమాని, రాజకీయ అనిశ్చితితో అభివృద్ధికి ఆమడదూరంలోనే ఆగిపోయింది. ఏళ్ల తరబడి నేపాల్‌కు భారత్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటోంది. మౌలిక సదుపాయాలు, ఇంధనం, రక్షణ, వాణిజ్య రంగాలలో తలలో నాలుకలా వ్యవహరించే భారత్‌తో నేపాల్‌కు ఇటీవలి కాలంలో స్నేహ సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దు వివాదాలు ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగమైన కాలాపాని, లిపులేక్, లింపియాధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ పేచీపెట్టడమే కాకుండా ఆరేళ్ల క్రితం విడుదల చేసిన చిత్రపటంలోనూ అవి తమ భూభాగాలుగా చూపించడం వివాదాలకు ఆజ్యం పోసింది. లిపులేఖ్ పాస్ మీదుగా భారత్ -చైనా వాణిజ్యానికి అడ్డు చెప్పడం ద్వారా నేపాల్ తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పట్ల బాలేంద్ర షా వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాలి. బెంగళూరులో ఎంటెక్ పూర్తి చేసి, ర్యాపర్ గా వృత్తి జీవితానికి శ్రీకారం చుట్టిన బాలేంద్ర నేపాల్ ప్రజలకు చిరపరిచితుడే. అవినీతి, సామాజిక అసమానతలపై పాటలు రచించి, పాడుతూ యువతరానికి ఆయన దగ్గరయ్యారు. తదనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి, ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఖాట్మండూ మేయర్ పదవిని అధిష్ఠించారు. అయితే, ఆయనది కూడా భారత్ వ్యతిరేక వైఖరేనన్నది గతంలో జరిగిన సంఘటనలను గమనిస్తే అర్థమవుతుంది. ఆ మధ్య బాలేంద్ర విడుదల చేసిన ఒక రాజకీయ చిత్రపటంలో భారత్ లోని కొన్ని భూభాగాలను తమ దేశానికి చెందినవే అన్నట్లుగా చూపించడం వివాదాస్పదమైంది. అంతేకాదు, బాలీవుడ్ సినిమాలను నేపాల్‌లో నిషేధించాలని కూడా ఆయన ఒక సందర్భంగా డిమాండ్ లేవనెత్తారు. నేపాల్ ప్రయోజనాలే తనకు ప్రధానమంటూ ఎన్నికల ప్రచారంలో పదేపదే వల్లెవేసిన ఆయన తన ఎన్నికల నినాదాన్ని అనుసరించి, పటుతరమైన విదేశాంగ విధానానికి రూపకల్పన చేస్తారా లేక బంగ్లాదేశ్ మాదిరిగా చైనా తాయిలాలకు ఆశపడి అటువైపు మొగ్గు చూపుతారా అనేది ప్రశ్న. అంతకుమించి, ప్రజాభీష్టం మేరకు అవినీతికి అడ్డుకట్టవేసి, పారదర్శక పాలనను అందించడం, నిరుద్యోగాన్ని అంతమొందించడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు.

మన తెలంగాణ 11 Mar 2026 11:28 am

Switzerland |ఆరుగురు స‌జీవ‌ద‌హ‌నం

Switzerland | ఆరుగురు స‌జీవ‌ద‌హ‌నం Switzerland | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 11 Mar 2026 11:27 am

కారు, కమలం కలిసేనా?

తెలంగాణలో సంస్థాగత వృద్ధి రాజకీయ పట్టు కోసం భారతీయ జనతా పార్టీ వివిధ స్థాయిల్లో ఆలోచనలు సాగుతున్నాయి. అవకాశం ఉండి, ఆశించిన స్థాయిలో తెలంగాణలో పార్టీ ఎదగలేకపోతోందనే అసంతృప్తి బిజెపి ఢిల్లీ నాయకత్వానికి ఉంది. ఆ భావనను పార్టీ అగ్రనేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు సమీక్షా సమావేశాల్లో రాష్ట్ర నాయకులతో వ్యక్తం చేసినట్టు లోగడ వార్తా కథనాలు వచ్చాయి. పార్టీ జాతీయ ఇతర ముఖ్య నేతల్లోనూ ఒక అసంతృప్తి ఉంది. రాష్ట్ర పార్టీ లో ‘ఐక్యత’ కొరవడటమే ప్రధాన సమస్యగా ఉందని, పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న బడానేతలు, కొత్తగా ఎదుగుతున్నవారు, ఇతర పార్టీల నుంచి వచ్చి స్థిరపడ్డవారూ ఉన్నప్పటికీ, వారి మధ్య సయోధ్య లేకపోవడం, ఉమ్మడిగా కార్యాచరణ లేకపోవడాన్ని ఎత్తిచూపుతున్నారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకున్న అన్ని అవకాశాలను గరిష్టంగా ఉపయోగించుకోవాలనే అధినాయకత్వం ఎప్పటికప్పుడు ఉద్బోధిస్తోంది. దేశంలో త్వరలో జరుగనున్న కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, పశ్చిమబెంగాల్, అసోం అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టాలని బిజెపి అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. పాలకపక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ నుంచి బలమైన గ్రూప్‌లను పార్టీలోకి లాగి బిజెపిని బలోపేతం చేస్తే ఎలా ఉంటుందనే యోచన కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆశించిన మేర ఫలితాలు దక్కలేదనే అసంతృప్తి ఉంది. కరీంనగర్ కార్పొరేషన్‌పై పార్టీ జెండా ఎగిరినా, నిజామాబాద్‌లో మెజారిటీ స్థానాలు దక్కినా.. అక్కడి స్థానిక పరిస్థితులు, ముఖ్యంగా ‘హిందుత్వ’ అంశం వంటివే తప్ప పూర్తి ఘనతను నాయకత్వానికే ఇచ్చే పరిస్థితి లేదు. 8 మంది చొప్పున పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలున్నా పార్టీకి ఎన్నిదగిన రీతిలో ఫలితాలు రాలేదు. నగర- పట్టణ పార్టీగా బిజెపికి పేరుండి, మున్సిపల్ ఎన్నికల్లోనే తగు ఫలితాలు రాబట్టకుంటే ఇక పల్లె ప్రాంతాల్లో చొచ్చుకుపోయి ముద్రవేయడం కష్టమౌతుంది కదా? అన్నది వారి ఆందోళనగా ఉంది. కొట్టిపారేయలేని వాదన! రాష్ట్రంలో పాలక కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామంటే తామని బిఆర్‌ఎస్, బిజెపి ఇద్దరూ అనుకుంటున్నారు. బిజెపితో కలిసి సాగే ప్రసక్తే రాదని బిఆర్‌ఎస్, అసలు బిఆర్‌ఎస్‌తో పొత్తుకు ఆస్కారమే లేదని బిజెపి బల్లగుద్ది చెబుతున్నాయి. రెండు పార్టీల నాయకత్వం కూడా ‘మేం కలువబోం’ అని బహిరంగంగా ప్రకటిస్తోంది. కలుస్తారనే స్పష్టమైన సంకేతాలు కూడా లేవు. కానీ, లోపల ఏదో ఇరువురి మధ్య సఖ్యతకు ఆస్కారం ఉందనే అభిప్రాయం ఉభయ పార్టీ కార్యర్తల శ్రేణుల్లోనే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంత పౌరుల్లోనూ వినిపిస్తోంది. ‘చూస్తూ ఉండండి, 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతాయి, కాంగ్రెస్‌ను గద్దె దింపుతాయి’ అంటూ రాజకీయాల్లో తలపండిన రిటైర్డ్ టీచరొకరు చేసిన వ్యాఖ్య క్షేత్రంలో ప్రచారాలకు అద్దం పడుతోంది. ‘బిఆర్‌ఎస్‌తో పొత్తుండదు’ అని రామచందర్ రావు పదే పదే చెబుతున్నా, ఇటువంటి విషయాల్లో రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా కేంద్ర నాయకత్వం నిర్ణయాలు రుద్దడమే బిజెపిలో ఎప్పుడూ జరిగేది. తెలంగాణలో మేం సంపూర్ణ ఆధిక్యతకే యత్నిస్తాం, నేరుగా మేం ఆధిపత్యం చూపలేని చోట కాంగ్రెస్ స్పేస్ తగ్గించడానికి కమ్యూనిస్టేతర, కాంగ్రేసేతర శక్తులతో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి?’ అనే చర్చ ఒకటి పార్టీలో ఉందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన ఎపి, తమిళనాడు, కేరళ, కర్నాటకలో ఇటువంటివి జరుగుతున్నపుడు, ఇక్కడ జరిగితే మాత్రం తప్పేంటి? అన్న వాదనలో లాజిక్ ఉందనిపిస్తుంది. ఆంతరంగిక చర్చల్లోనయినా ఇంతమేరకు బిజెపి నాయకులు మాట్లాడుతున్నారు తప్ప బిఆర్‌ఎస్‌లో మాత్రం ఒక మాట కూడా వినిపించడం లేదు. ఆ పార్టీలోని ముఖ్యులు కొందరిని బిజెపిలోకి చేర్చుకునే ప్రయత్నమేదో లోలోపల జరుగుతోందనే ప్రచారం చాలా కాలంగా తెంగాణ రాజకీయ వర్గాల్లో ఉంది. ఫార్ములాల చర్చా సాగుతోంది తెలంగాణలో బిజెపి -బిఆర్‌ఎస్ మధ్య పొత్తంటూ ఉంటే ఏం ఫార్ములా అనుసరిస్తారు? అన్నది అందరికీ ఆసక్తి కలిగించేదే! ఇది కూడా అక్కడక్కడ ప్రస్తావనకు వస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పక్షంలో 75ః25 , అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పక్షంలో 75ః- 25 శాతం స్థానాల నిష్పత్తిలో ఉభయ పార్టీలు అంగీకారానికి రావచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటువంటి నమూనా ఒకటి గతంలోనే జాతీయ పార్టీలకు తమిళనాడులోని ద్రవిడ పార్టీలకు కుదిరేది. సాగినంత కాలం ఏ ఇబ్బందీ లేకుండా ఇటువంటి సఖ్యత వారిమధ్య నడిచింది. కానీ, జాతీయ పార్టీల ప్రాబవం తమిళనాట తగ్గిన దరిమిళా పరిస్థితులు, సమీకరణాలు అక్కడ కూడా మార్పునకు గురయ్యాయి. లోక్‌సభకు తాను ఎక్కువ స్థానాలు తీసుకొని, అసెంబ్లీ విషయంలో చెరి సమాన స్థానాల్లో పోటీ చేసి, మెజారిటీని బట్టి ముఖ్యమంత్రి పదవి తీసుకుందామనే ఫార్ములాకు బిజెపి పట్టుబట్టవచ్చన్న వాదన కూడా ఒకటుంది. ఇటువంటి నమూనాను ఇదివరకే బిజెపి మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో అనుసరించి, సుస్థిర ఫలితాలు సాధించిన అనుభవం ఉంది. అందుకు బిఆర్‌ఎస్ ఏ మేరకు అంగీకరిస్తుందన్నది వేచిచూడాల్సిందే! ‘ఎట్టి పరిస్థితిలోనూ, ఏ పక్షానికీ అనుకూలంగా వ్యవహరించకూడదు, మనకు వస్తే వచ్చింది, లేదంటే విపక్షంలోనే కూర్చుందాం’ అని మొన్నటి మున్సిపల్ ఎన్నికల ముందు బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి రామారావు పార్టీ నాయకుల సమావేశంలో స్పష్టత ఇచ్చినట్టు బిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. కానీ, ఎన్నికల తర్వాత స్థానిక పరిస్థితులు, సందర్భాన్ని బట్టి మూడు పార్టీల వాళ్లూ గీతదాటిన సందర్భాలు కళ్లకు కట్టాయి. బలం-బలహీనతలే నిర్ణయిస్తాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ బిఆర్‌ఎస్, బిజెపిలు కలవకూడదనే కాంగ్రెస్ కోరుకుంటుంది. వారిద్దరు విడివిడిగా పోటీ చేస్తేనే ఎన్నికల రాజకీయాల్లో తమ పరిస్థితి మెరుగ్గా ఉంటుందనేది వారి లెక్క! వేరెవరు పెద్దగా ప్రస్తావించకపోయినా, తరచూ కెసిఆర్ పేరు తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడం వెనుక వ్యూహం ఉందని అంటారు. కెసిఆర్ తనకు తాను బలహీనపడ్డట్టు తలపోసిన రోజున, బిజెపితో పొత్తుకు ఆయన సిద్ధపడవచ్చని, అదే జరిగితే రాజకీయంగా తమకు నష్టమని రేవంత్‌రెడ్డి భావిస్తుండవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. కవిత పార్టీ నుంచి రాజకీయంగా, కుటుంబం నుంచి మనోభావాల పరంగా దూరమవటం కెసిఆర్‌ను కలతకు గురిచేస్తున్నట్టు ఆయనను సన్నిహితంగా ఎరిగిన వారు చెబుతారు. ఇటువంటి పరిస్థితుల్లో కెసిఆర్ ఒక గౌరవప్రదమైన రాజకీయ మార్గాంతరం ఎంచుకోవడంలో భాగంగా బిజెపితో సఖ్యత పొత్తుకు మొగ్గుతారా? అందుకు ససేమిరా అంటారా? అన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బిజెపి లోనూ ఓ అంతర్మథనం జరుగుతోంది. పార్టీ సిద్ధాంత నిబద్ధతపరంగా, సైద్ధాంతిక భూమిక అయిన సంఘ్ మద్దతుపరంగా రాష్ట్ర అధినేత రాంచందర్ రావు బలమైన నాయకుడే అయినా పార్టీని దూకుడుగా నడుపలేకపోతున్నారనే విమర్శ ఉంది. పార్టీ రాష్ట్ర విభాగంలో కొందరికి బిఆర్‌ఎస్ పట్ల సుహృద్భావం ఉంటే, మరికొందరికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల సానుకూల ధోరణి ఉంది. ఆధారాలు లేకపోయినా, ఈ రకంగా కొన్ని ‘మ్యాచ్ ఫిక్సింగ్’లూ జరుగుతాయని పార్టీలోనే గుసగుసలున్నాయి. పార్టీలోని కొందరికి బిజెపి కేంద్ర నాయకత్వంపైన కూడా కినుక ఉంది. బిజెపి పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులకన్నా విరివిగా తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని వద్ద అపాయింట్‌మెంట్, ప్రాపకం లభించడాన్ని వారు అభ్యంతరపెడుతున్నారు. ఇలా ఇరుపక్షాల నుంచి చాలా అంశాలున్నాయి. రాజకీయ అవసరాల కోసం కారు, కమలం కలిసేనా? అన్నది రాగల కాలమే నిర్ణయించాలి. దిలీప్‌రెడ్డి సమకాలీనం (రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

మన తెలంగాణ 11 Mar 2026 11:24 am

మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ఉత్సవాలు..

మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ఉత్సవాలు.. కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు ప్రధాన

ప్రభ న్యూస్ 11 Mar 2026 11:16 am

మీ కారుకు బుల్ బార్ ఉందా? అయితే మీరు చిక్కుల్లో పడినట్లే

మీ కార్లకు అదనపు హంగులు సమకూర్చుకుంటే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు

తెలుగు పోస్ట్ 11 Mar 2026 11:14 am

Telangana |క్లీన్ చిట్ ఇచ్చిన స్పీక‌ర్

Telangana | క్లీన్ చిట్ ఇచ్చిన స్పీక‌ర్ Telangana | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 11 Mar 2026 11:11 am

ఎంత పని చేశావ్ తల్లి... పిఎస్ లో పెళ్లి... చెట్టుకు యువతి ఉరేసుకొని

అమరావతి: ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు... పెద్దలు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రియుడి తల్లి, బంధువులు ఒప్పుకోకపోవడంతో యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోగా యువతి చెట్టుకు ఉరేసుకొని చనిపోయింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మహానందిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈశ్వర్‌నగర్‌లో శివప్రసాద్, స్వప్న అనే యువతి యువకుడు గత మూడు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు ప్రేమపెళ్లి చేసుకుంటామంటే పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇరువైపుల కుటుంబ సభ్యులను ఎదురించి ప్రేమజంట పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. పోలీసులు ఇరువైపుల పెద్ద మనుషులను పిలిపించి పిఎస్ లో పెళ్లి జరిపించారు. కానీ శివ తల్లి ఒప్పుకోకపోవడంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన వెంటనే యువతి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందింది. ప్రస్తుతం శివ నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమార్తెను హత్య చేసి ఉరేశారని, శివ ఆత్మహత్యాయత్నం నాటకం ఆడుతున్నాడని స్వప్న తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.  శివ కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

మన తెలంగాణ 11 Mar 2026 11:05 am

Manchu Manoj’s “No Excuses” Training Push Builds Momentum for David Reddy

Actor Manchu Manoj has once again drawn attention after sharing a powerful glimpse into his ongoing transformation journey. Known for his intense screen presence and commitment to physically demanding roles, the actor recently posted workout images along with a candid note about the discipline he has embraced in recent weeks. The update quickly resonated with […] The post Manchu Manoj’s “No Excuses” Training Push Builds Momentum for David Reddy appeared first on Telugu360 .

తెలుగు 360 11 Mar 2026 10:59 am

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా.. బీబీనగర్/ ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన

ప్రభ న్యూస్ 11 Mar 2026 10:46 am

యుద్ధం నేర్పుతున్న ఆర్థిక పాఠాలు

ప్రపంచీకరణ యుగంలో ఒక మూలలో పేలే తుపాకీ శబ్దం, మరో మూలలోని సాధారణ మనిషి జీవితాన్ని కుంగిపోయేలా చేస్తుంది. పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇలాంటి పరిస్థితినే సృష్టిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని ప్రతి ఇంటి వంటగదిలో ఈ యుద్ధ గర్జన వినిపిస్తున్నట్టుగానే, చమురు ధరలు పెరిగి, కూరగాయలు, ధాన్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ ఖరీదవుతున్నాయి. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ గొలుసులా అనుసంధానమై ఉన్నందున, దాని తీవ్ర ప్రభావం భారతీయ సామాన్య ప్రజల జీవన వ్యయంపై పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రమాదాలు తీసుకురావచ్చు? ప్రభుత్వం, ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇవి చర్చించాల్సిన అత్యవసర అంశాలు. పశ్చిమాసియా ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. హోర్ముజ్ జలసంధి వంటి మార్గాల ద్వారా ప్రతి రోజూ లక్షల కోట్ల డాలర్ల విలువైన క్రూడ్ ఆయిల్ ప్రపంచ మార్కెట్‌కు సరఫరా అవుతుంది. ఇక్కడ యుద్ధం లేదా ఉద్రిక్తతలు పెరిగితే, ఈ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడటం సహజం. ఫలితంగా అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. భారతదేశం తన ఇంధన అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. కాబట్టి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు తప్పకుండా పెరుగుతాయి. ఇటీవలి రోజుల్లోనే ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్‌లు పెరిగిన తర్వాత, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 10 డాలర్లు పైబడి పెరిగాయి. ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) అంచనాల ప్రకారం, దేశ ద్రవ్యోల్బణాన్ని 0.5-1 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. ఇంధన ధరల పెరుగుదల అంటే కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు; అది మొత్తం ఆర్థిక వ్యవస్థను కదిలిస్తుంది. రవాణా ఖర్చులు పెరిగితే, రైతు పొలంలో పండిన కూరగాయలు, పప్పులు, ధాన్యాలు నగర మార్కెట్లకు చేరే దాకా ప్రతి దశలో వ్యయం పెరుగుతుంది. ఉదాహరణకు, రవాణా ఖర్చు పెరగడంతో కిలో టమాటా 20 -30 రూపాయలు ఎక్కువగా పలికే అవకాశం ఉంది. ఇది మధ్య, దిగువ తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరోవైపు, ఎర్రసముద్రం మార్గంలోని ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. భారతదేశం నుంచి యూరప్‌కు వెళ్లే 40% సరుకులు ఈమార్గం ద్వారానే ప్రయాణిస్తాయి. హౌతీ తిరుగుబాటుదారుల దాడులు పెరిగితే, నౌకలు ఆఫ్రికా చుట్టూ పొడవైన మార్గాలు ఎంచుకోవాల్సి వస్తుంది. ఫలితంగా, రవాణా సమయం 10-15 రోజులు పెరిగి, ఖర్చులు 20-30 శాతం పెరుగుతాయి. బీమా ప్రీమియంలు కూడా డబుల్ అవుతాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యయనం ప్రకారం, ఈ మార్గం పూర్తిగా మూసివేయబడితే, దిగుమతి వస్తువుల ధరలు 5-10 శాతం పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, యంత్రాలు, మొబైల్ ఫోన్లు అన్నీ చైనా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ ధరల పెరుగుదల పరిశ్రమలు, వినియోగదారులపై భారం పడుతుంది. ఇటీవలి నెలల్లో ఎర్ర సముద్రంలో దాడులు పెరిగిన తర్వాత, ఓడ ఖర్చులు 40% పెరిగాయి, ఇది భారత ఎగుమతులపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరం. చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయ దేశాలైన రష్యా, అమెరికా, ఆస్ట్రేలియాతో ఒప్పందాలు పెంచడం, వ్యూహాత్మక చమురు నిల్వలు (90 రోజుల అవసరం) సమర్థంగా వాడడం వంటివి ధరలను కొంత నియంత్రించగలవు. తాత్కాలికంగా పెట్రోల్, డీజిల్‌పై పన్ను సడలింపులు ఇవ్వడం, రవాణా రంగానికి సబ్సిడీలు ప్రకటించడం ఉపయోగకరం. దీర్ఘకాలికంగా, పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెంచడం - సోలార్, విండ్ ఎనర్జీలో 50 జిడబ్లు లక్ష్యం వేసుకోవడం - దిగుమతి ఆధారాలను తగ్గిస్తుంది. ఈ సంక్షోభం మనకు ఒక పాఠం. యుద్ధం ఎక్కడ జరిగినా, దాని బాధను భరించేది సామాన్య ప్రజలే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గాలంటే అంతర్జాతీయ సంభాషణలు, దౌత్య పరిష్కారాలు అవసరం. భారతదేశం వంటి దేశాలు యుఎన్, జి20 వేదికలపై శాంతి ప్రయత్నాల్లో ముందుండాలి. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే, భారతీయ వంటగదుల్లో నిశ్చింతం తిరిగి వస్తుంది. ఇది కేవలం ఆర్థిక అంశం కాదు, మానవతా విలువల సమస్య. ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి, 9032042014

మన తెలంగాణ 11 Mar 2026 10:46 am

Breaking : దానం, కడియంలకు ఊరట

బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇద్దరిపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పారు

తెలుగు పోస్ట్ 11 Mar 2026 10:43 am

బెంగాల్‌పై బిజెపి సరికొత్త అస్త్రం

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించేందుకు భారత ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్న సమయంలో గత వారం అకస్మాత్తుగా తొమ్మిది రాష్ట్రాల్లో జరిగిన గవర్నర్ల మార్పు రాజకీయ వర్గాలలో విస్మయం కలిగించింది. ముఖ్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ గవర్నర్‌లను మార్చడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు రాజ్‌భవన్‌లను ‘రాజకీయ పునరావాస కేంద్రాలు’గా మార్చారని విమర్శలు చెలరేగగా, ప్రస్తుతం అవి బిజెపి ‘వార్‌రూమ్’లుగా మారినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకు అడుగడుగునా అడ్డుపడుతూ, అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను ఆమోదింపకుండా, మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాలను అసెంబ్లీలలో చదవకుండా ‘రాజకీయ పాత్రలు’ వహిస్తూ ఉండటంతో ఈ వివాదాలు సుప్రీంకోర్టు ముందుకు కూడా వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ అర్ధాంతరంగా రాజీనామా చేయడం, ఆయన స్థానంలో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిని నియమించడం రాజకీయ వర్గాలలో కలకలం రేకెక్తిస్తున్నది. ఈ మార్పులు ‘పరిపాలన సామర్థ్యం’ కోసం కాకుండా, లోతయిన రాజకీయ ఎత్తుగడలతో భాగంగానే జరిగిన్నట్లు సర్వత్రా విశ్వసిస్తున్నారు. ఐపిఎస్ అధికారిగా పనిచేసి, నాగాలాండ్‌లో తిరుగుబాటు వర్గాలతో శాంతి ఒప్పందం కుదర్చడంలో విజయవంతమై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని రవి ఆకర్షించారు. నిఘా, జాతీయ భద్రతా విభాగాలలో పనిచేసిన అనుభవం ఉండడంతో సున్నితమైన నాగాలాండ్ గవర్నర్‌గా నియమించారు. అయితే, అక్కడ బిజెపి భాగస్వామిగాగల సంకీర్ణ ప్రభుత్వం ఆయన తీరు నచ్చక ఆయనను బదిలీ చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో ఆయనను తమిళనాడు గవర్నర్‌గా నియమించి ‘పదవోన్నతి’ కల్పించారు. తమిళనాడులో అసెంబ్లీ ఆమోదించిన సుమారు 20 బిల్లులను ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడంతో అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. గవర్నర్ చర్యను ‘చట్టవ్యతిరేకం’ అంటూ అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టింది. ముఖ్యమంత్రి ఎంకెస్టాలిన్ ప్రతిపాదించిన ఓ మంత్రితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునే అధికారం గవర్నర్‌లకు లేదని ధర్మాసనం స్పష్టం చేయడంతో ఆయన చివరకు ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉన్న అసోంలో మరోసారి గెలుస్తామని ధీమాతో ఉండగా, కేవలం పశ్చిమబెంగాల్‌లో మాత్రమే ఎట్లాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. ఉత్తరాదిన, ఈశాన్య రాష్ట్రాలలో దాదాపు అన్ని రాష్ట్రాలలో బిజెపి ప్రభంజనం వీస్తున్నా ఈ రాష్ట్రంలో మాత్రం అధికారంలోకి రాలేకపోతున్నది. గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగించినా కాంగ్రెస్, సిపిఎంలను పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా మాత్రమే చోటు సంపాదింపగలిగింది. అందుకనే, ఈ పర్యాయం లోక్‌భవన్ కేంద్రంగా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహంలో భాగంగా అందుకు సమర్థుడని భావించి ఆర్‌ఎన్ రవిని ఇక్కడకు బదిలీ చేసినట్లు పలువురు భావిస్తున్నారు. గవర్నర్‌ల మార్పును ప్రకటించేందుకు కొన్ని గంటల ముందే బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ తన రాజీనామాను ప్రకటించారు. ఢిల్లీలో పెద్దలను కలిసేందుకు వెళ్లిన ఆయన అకస్మాత్తుగా ఈ నిర్ణయం ప్రకటించారు. అందుకు ఎటువంటి కారణాలు ప్రకటించలేదు. కేవలం ‘వ్యక్తిగత, ఆరోగ్య’ కారణాలు అంటూ పొడిపొడిగా చెప్పుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా మమతా ప్రభుత్వాన్ని ఎన్నికల సమయంలో ఇరకాటంలో పడవేయలేరనే ఆయనను అర్ధాంతరంగా బదిలీ చేసినట్లు పలువురు భావిస్తున్నారు. మే, 2025లో రాజ్‌భవన్‌లో ఓ తాత్కాలిక మహిళా ఉద్యోగిని తనను గవర్నర్ లైంగికంగా వేధించారని చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలంరేపాయి. ఆ ఆరోపణలకు సంబంధించిన కేసు ఇంకా పోలీసులవద్దే ఉంది. అందుకనే మమతా ప్రభుత్వం పట్ల కఠినంగా వ్యవహరింపలేదని బిజెపి అధిష్టానం భావించి, ఆయనకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తున్నది. అయితే, లోక్‌భవన్‌ను ‘బిజెపి వార్‌రూమ్’గా మార్చితే తమిళనాడులో ఎంకె స్టాలిన్ సహనంతో, మర్యాదగా వ్యవహరించారు. న్యాయస్థానాలకు వెళ్లారు గాని గవర్నర్‌ను వీధులలో నిలదీసే ప్రయత్నం చేయలేదు. కానీ, మమతా రాజకీయ ప్రస్థానం వీధి పోరాటాల నుండి వచ్చింది. ఆమె ఇడీ, సిబిఐ కార్యాలయాలపై దాడులకు సైతం వెనకాడటం లేదు. చివరకు ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టులో దోషిగా నిలబెట్టి, తానే స్వయంగా వాదించారు. స్టాలిన్‌తో వ్యవహరించినట్లు ఆమెతో వ్యవహరిస్తే ఆమె గాండ్రిస్తారు. ఇప్పటికే బిజెపి నేతలను ‘బైటవారు’, తాను ‘బెంగాల్ కుమార్తె’ అంటూ రాజకీయ ప్రజలలో గుర్తింపు పొందుతున్న ఆమెను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకే రవి దోహదపడే ప్రమాదం కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఎన్నికల ప్రకటన వెలువడగానే రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేదు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో ఉంటుంది. పరోక్షంగా గవర్నర్ అజమాయిషీలో ఉంటుంది. ఆ విధంగా మమతను ఓడించేందుకు లోక్‌భవన్ నుండి రవి ద్వారా పావులు కదిపేందుకు బిజెపి ఎత్తుగడగా కనిపిస్తున్నది. ఇప్పుడు బిజెపి ఎన్నికలలో విజయం కోసం ఓటర్లపై, బాలట్ బాక్స్ లపై కాకుండా ఎన్నికల కమిషన్, గవర్నర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ను సైతం ఈ దృష్టాంతంతోనే చాలామంది చూస్తున్నారు. అయితే, బిజెపికి క్షేత్రస్థాయిలో ప్రజలలో పట్టగలిగిన నాయకత్వం, ప్రజాకర్షణ కలిగిన నాయకత్వం లేకపోవడంతో కేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా అవి వికటించి, ప్రతికూలంగా మారుతున్నాయని విషయాన్ని మరచిపోతున్నారు.ఎస్‌ఐఆర్ పక్రియ ద్వారా లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించగా, బెంగాల్‌లో గత ఎన్నికలలో గెలిచినా అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఓట్లకు మించి ఎక్కువ ఓట్లను 35 నియోజకవర్గాలలో తొలగించారని చెబుతున్నారు. ఆ విధంగా ఆయా నియోజక వర్గాలలో ఫలితాలను తారుమారు చేయాలనే వ్యూహం కనిపిస్తుంది. అయితే, ఆ విధంగా ఓట్లు తొలగించిన 35 నియోజకవర్గాలలో 22 బిజెపి అభ్యర్థులు గెలుపొందిన నియోజక వర్గాలు కావడం గమనార్హం. అంటే ఎస్‌ఐఆర్ ప్రక్రియ బిజెపి అభ్యర్థులకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. పైగా, గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగాల్‌లో బిజెపి అంతర్గత కుమ్ములాటలతో బలహీనం అవుతూ వస్తున్నది. పలువురు కీలక నాయకులు పార్టీని విడిచిపెట్టారు లేదా క్రియాశీలకంగా పనిచేయడం లేదు. ఆ ఫలితంగానే 2024 లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీ ఎంపిల సంఖ్య 18 నుండి 12కు తగ్గింది. దశాబ్దాలుగా పార్టీకోసం పనిచేస్తున్న నాయకులకు, ఇటీవల పార్టీలో చేరిన నాయకులకు మధ్య సయోధ్య కనిపించడం లేదు. కేంద్ర నాయకత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నా ఐకమత్యంగా వారితో పనిచేయించడం కనిపించడం లేదు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పలు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు మమతా ప్రజలకు దగ్గరవుతున్నారు. ముఖ్యంగా మహిళలో ఆమె తిరుగులేని నాయకురాలు. మమత ‘స్థానిక- బయటివారు’ ప్రచారంతో ఇతర రాష్ట్రాలలో మాదిరిగా ప్రధాని మోడీ, అమిత్ షా వంటి నేతల ప్రచారం ఈ రాష్ట్రంలో బిజెపికి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. చలసాని నరేంద్ర 98495 69050

మన తెలంగాణ 11 Mar 2026 10:42 am

విశాఖ ఉక్కుపై యుద్ధ ప్రభావం

తగ్గుతున్న ఎల్‌పీజీ నిల్వలు విశాఖపట్నం: విశాఖ ఉక్కుపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. ఎల్‌పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) నిల్వలు తగ్గిపోవడంతో ఆ ప్రభావం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు ఉత్పత్తిపై పడుతోంది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్ట్‌షాప్ (ఎసఎంఎస్) వద్ద బ్లూమ్స్‌ను కట్ చేయడానికి ఎల్‌పీజీ వాడతారు. ఎసఎంఎస్-2 వద్ద డీగ్యాసింగ్ ప్రక్రియలో, ఇంజినీరింగ్ షాప్‌లో వివిధ పనులకు ఎల్‌పీజీని వినియోగిస్తారు. రోజూ 4 వేల బ్లూమ్స్ కట్ చేయాల్సి ఉంటుంది. వాటిని కట్ చేస్తేనే బెడ్ […] The post విశాఖ ఉక్కుపై యుద్ధ ప్రభావం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 11 Mar 2026 10:41 am

ఆ విషయంలో.. ప్రభుత్వాలు విఫలం..

ఆ విషయంలో.. ప్రభుత్వాలు విఫలం.. మునుగోడు, ఆంధ్రప్రభ : చేనేత కార్మికులను ఆదుకోవడంలో

ప్రభ న్యూస్ 11 Mar 2026 10:36 am

సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి..

సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి.. 160 క్వింటాళ్ల చౌక బియ్యం స్వాధీనం

ప్రభ న్యూస్ 11 Mar 2026 10:18 am

భారత్ అదరహో..... టీమిండియాకు రూ.131 కోట్ల నజరానా

ముంబై: టి20 ప్రపంచకప్ ట్రోఫీ సాధించిన టీమిండియాపై కనక వర్షం కురువనుంది. విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు బారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) రూ.131 కోట్ల నగదు బహుమతిని ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా అధికారికంగా వెల్లడించారు. గతంలో విజేతగా నిలిచిన టీమిండియాకు బిసిసిఐ రూ.125 కోట్లు అందించింది. ఈసారి దాన్ని రూ.131 కోట్లకు పెంచింది.   టి20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. భారత్‌కు ఇది మూడో టి20 ప్రపంచకప్ ట్రోఫీ కావడం విశేషం. మరే జట్టు కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా అసాధారణ ఆటతో ఛాంపియన్‌గా అవతరించింది. లీగ్ దశలో భారత్ తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేదు. పసికూన అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అతి కష్టం మీద విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు సర్వం ఒడ్డాల్సి వచ్చింది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చెమటోడ్చక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు అష్టకష్టాలు పడింది. అయితే నమీబియాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం అలవోక విజయం సాధించి లీగ్ దశను అజేయంగా ముగించింది. కానీ సూపర్8 ఆరంభ మ్యాచ్‌లోనే ఎవరూ ఊహించని ఫలితం ఎదురైంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. సొంత గడ్డపై భారత్‌కు ఇలాంటి పరాజయం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేక పోయారు. అసాధారణ ఆటతో చెలరేగి పోయిన సఫారీ టీమ్‌ను భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఇలాంటి స్థితిలో భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. లీగ్‌లో అదరగొట్టిన జింబాబ్వే, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లతో జరిగిన మ్యాచ్‌లు భారత్‌కు సవాల్‌గా మారాయి. ఈ జట్లను ఓడించి సెమీస్‌కు చేరడం టీమిండియాకు అంత తేలిక కాదని విశ్లేషకులు సయితం అంచనా వేశారు. సంజు మార్క్ విజయం.. సఫారీ జట్టు చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్‌కు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఊరట లభించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అలవోక విజయం సాధించింది. తర్వాత వెస్టిండీస్ జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. అసాధారణ బ్యాటింగ్‌తో అదరగొట్టిన శాంసన్ 50 బంతుల్లోనే అజేయంగా 97 పరుగులుచేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ సంజు చెలరేగి పోయాడు. ఇంగ్లీష్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సంజు 42 బంతుల్లోనే 89 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లోనూ సంజు అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురు దాడికి దిగిన సంజు 46 బంతుల్లోనే 89 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. బుమ్రా ముద్ర మరోవైపు ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా కూడా భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలువడంలో కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచుల్లో 12.43 సగటుతో 14 వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో 6.21 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఫైనల్లో అసాధారణ బౌలింగ్‌తో అదరగొట్టాడు. కీలక సమయంలో నాలుగు వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లోనూ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక హార్దిక్, దూబె, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తదితరులు కూడా భారత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తోవిఫలమైనా అద్భుత కెప్టెన్సీతో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.

మన తెలంగాణ 11 Mar 2026 10:17 am

విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం..

విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం.. మహమ్మదాబాద్, ఆంధ్రప్రభ : క్లాస్ రూమ్ పైకప్పుఊడి

ప్రభ న్యూస్ 11 Mar 2026 10:14 am

Gas Cylinder : గ్యాస్ కే ఇంత కొరత ఎందుకు? కేంద్రం తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలిస్తాయా?

మధ్య ప్రాచ్యంలో యుద్ధ ప్రభావం కారణంగా కేంద్ర పెట్రోలియం శాఖ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది

తెలుగు పోస్ట్ 11 Mar 2026 10:13 am

Telangana : నేడు తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

నేడు తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం చేయనున్నారు

తెలుగు పోస్ట్ 11 Mar 2026 10:08 am

Telangana : నేడు భూదాన్ బాధితులకు ఇళ్లపట్టాల పంపిణీ

నేడు వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇళ్లపట్టాల పంపిణీ జరగనుంది

తెలుగు పోస్ట్ 11 Mar 2026 10:01 am

రాజమండ్రి కల్తీ పాల ఘటన... మరో చిన్నారి మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి కల్తీ పాల ఘటనలో రెయిన్ బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మృతి చెందాడు. మూడేళ్ల జయకృష్ణ 23 రోజులుగా మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. జయకృష్ణ మృతితో తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు మునిగిపోయారు. గడచిన 25 రోజులుగా చిన్నారికి నయమవుతుందని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. బాలుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడు చనిపోవడంతో ప్రభుత్వం న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీపాల ఘటనలో మృతి చెందిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా డిమాండ్ చేశారు. ఇంకా ఎనిమిది మంది చికిత్స పొందుతున్నట్టు సమాచారం. 11 ఏళ్లుగా లైసెన్స్ లేకుండా వరలక్ష్మి డైరీ నడుస్తుంటే  ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని షర్మిలా ప్రశ్నించారు. ఎపిలో పాలు కల్తీ, నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, వాగ్ధానాలు కల్తీ, చంద్రబాబు పాలన కల్తీలాగా తయారయ్యిందని షర్మిల విమర్శించారు. ఎఐ మీద కాదు దృష్టి పెట్టాల్సింది, ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని సూచించారు. 

మన తెలంగాణ 11 Mar 2026 9:51 am

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 11 Mar 2026 9:40 am

Summer Effect : ఇళ్లను వదలి బయటకు రావద్దండి.. దూర ప్రయాణాలను రద్దు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

తెలుగు పోస్ట్ 11 Mar 2026 9:34 am

Prabhas C/O Mythri Movie Makers

Pan-Indian star Prabhas has some of the biggest films lined up and he is currently shooting for Fauzi, Spirit and Kalki 2898 AD. Fauzi is a periodic film produced by Mythri Movie Makers. Prabhas is closely associated with the top production house and he promised to do more films for Mythri in the future. The […] The post Prabhas C/O Mythri Movie Makers appeared first on Telugu360 .

తెలుగు 360 11 Mar 2026 9:33 am

Peddi Shooting Deadlines: Packed with Headaches

Ram Charan’s Peddi is in the final stages of shoot and the expectations are big on the film. The makers announced that the film will head for a grand release on April 30th and this is the best summer date for any film this year. The team is yet to complete the shoot and different […] The post Peddi Shooting Deadlines: Packed with Headaches appeared first on Telugu360 .

తెలుగు 360 11 Mar 2026 9:27 am

Andhra Pradesh : నేడు ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్

ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది

తెలుగు పోస్ట్ 11 Mar 2026 9:26 am

ഫാക്ട് ചെക്ക്: ബഹ്റൈനിലെ താമസകെട്ടിടങ്ങൾക്ക് നേരെ ഇറാൻ ആക്രമണം? വസ്തുതയെന്ത്

യുക്രൈനിലെ കീവിൽ റഷ്യൻ ഡ്രോണാക്രമണത്തിൻ്റെ ദൃശ്യമാണ് പ്രചരിക്കുന്നത്

తెలుగు పోస్ట్ 11 Mar 2026 9:19 am

Telangana : అనర్హత పిటిషన్లపై నేడు స్పీకర్ తీర్పు

బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇద్దరిపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పనున్నా

తెలుగు పోస్ట్ 11 Mar 2026 9:16 am

టేకుమట్ల నూతన ఎస్ఐగా అమూల్య..

టేకుమట్ల నూతన ఎస్ఐగా అమూల్య.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల

ప్రభ న్యూస్ 11 Mar 2026 9:06 am

ఇరాన్ ఎముకలు విరగ్గొడుతున్నాం: నేతన్యాహు

జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు. ఇజ్రాయెల్ లో ఎయిర్ పోర్టులు, సీపోర్టులకు ఆటంకం కలగలేదన్నారు. ఇజ్రాయెల్  ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, పోరాడే దేశం అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తామని హెచ్చిరించారు. యుద్ధంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌లో నిరంకుళ పాలన నుంచి ఆ దేశ ప్రజలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇప్పటికే ఇరాన్ ఎముకలు విరగ్గొడుతున్నామని తెలియజేశారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ కాలిబాఫ్ స్పందించారు. తాము కాల్పుల విరమణకు సిద్దంగా లేమని, పోరాటమే తమ ద్వేయమని తెలిపారు. ఇరాన్‌పై యుద్ధం స్వల్పకాలిక చర్య అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఒకవేళ  హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయాలని చూస్తే దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

మన తెలంగాణ 11 Mar 2026 9:01 am

కాలుష్యం నుండి కాపాడండి..

కాలుష్యం నుండి కాపాడండి.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్

ప్రభ న్యూస్ 11 Mar 2026 8:55 am

మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ప్రమాణస్వీకారం..

మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ప్రమాణస్వీకారం.. చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్

ప్రభ న్యూస్ 11 Mar 2026 8:42 am

Tirumala : తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్.. నేడు దర్శనం సమయం ?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది

తెలుగు పోస్ట్ 11 Mar 2026 8:41 am

మెదక్‌లో చెరువులో దూకి యువతి ఆత్మహత్య

మెదక్: నిశ్చితార్థం జరిగిన వారం రోజులకే ఓ యువతి చెరువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో జరిగింది. అప్పాజీపల్లి గ్రామంలో రూప(22) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది. రూపకు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు. వారం రోజుల క్రితం నిశ్చితార్థం కూడా జరిపించారు. గత నాలుగు రోజుల నుంచి ఆమె దిగాలుగా ఉంది. సోమవారం గ్రామశివారులో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 11 Mar 2026 8:41 am

చిట్యాల ఎస్ఐగా పోచంపల్లి సతీష్ బాధ్యతల స్వీకరణ..

చిట్యాల ఎస్ఐగా పోచంపల్లి సతీష్ బాధ్యతల స్వీకరణ.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండల

ప్రభ న్యూస్ 11 Mar 2026 8:31 am

యుద్ధం ఎఫెక్ట్... మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్

మధ్య ప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాల్లో వర్క్ ఫ్రం హోం చేయాలని నిర్ణయించారు

తెలుగు పోస్ట్ 11 Mar 2026 8:29 am

మాజీ ముఖ్యమంత్రిపై రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు... మండిపడుతున్న అభిమానులు

హైదరాబాద్: నటుడు రాజేంద్ర ప్రసాద్ మళ్లీ నోరు జారారు. తమిళనాడు ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ పై రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు కాంతారావు గొప్పతనం గురించి చెప్పడంతో పాటు ఎంజిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు 2025 ప్రదానోత్సవంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. కాంతారావు నటన చూసి ఎంజిఆర్‌ షాక్‌ అయ్యారంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. జానపదాల్లో కాంతారావు క్రేజ్‌ చూసి ఎంజిఆర్‌ భయపడ్డారని తెలిపారు. ఎవడ్రా వీడు ఇండియన్ సినిమాలను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడని ఎంజిఆర్ అనడంతో పాటు భయంతో వణికిపోయాడని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేశారు. ఎంజిఆర్ అభిమానులు రాజేంద్ర ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది ఆరాధించే దిగ్గజ నటుడిని, ప్రజానాయకుడిని ఇంతలా కించపరచడం సరికాదని ఎంజిఆర్ అభిమానులు, తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు మండిపడతున్నారు. తెలుగు నటుడిని ప్రశంసిస్తూ ఎంజిఆర్ ను కించపరిచడం సరికాదని దుయ్యబట్టారు.  గతంలోనూ బ్రహ్మానందం, అలీ వంటి తోటి నటులపై రాజేంద్ర ప్రసాద్ ఇలాగే వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శపాలైన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 11 Mar 2026 8:24 am

Nara Lokesh : ఢిల్లీలో నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీకి చేరుకున్నారు.

తెలుగు పోస్ట్ 11 Mar 2026 8:23 am

ఆ.. నలుగురు కౌన్సిలర్లను సన్మానించిన ఎంవి చారి..

ఆ.. నలుగురు కౌన్సిలర్లను సన్మానించిన ఎంవి చారి.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి

ప్రభ న్యూస్ 11 Mar 2026 8:22 am

Chandrababu : ఇరాన్ యుద్ధ ప్రభావంపై చంద్రబాబు సమీక్ష

ఇరాన్ యుద్ధ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు

తెలుగు పోస్ట్ 11 Mar 2026 8:17 am

కవయిత్రి మొల్లమాంబ జయంతి ఉత్సవాలు..

కవయిత్రి మొల్లమాంబ జయంతి ఉత్సవాలు.. భువనగిరి/ ఆంధ్రప్రభ : ఈ నెల 13న

ప్రభ న్యూస్ 11 Mar 2026 8:13 am

బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ..

బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్

ప్రభ న్యూస్ 11 Mar 2026 8:05 am

జడ్చర్లలో లిఫ్ట్ పేరుతో మహిళపై గ్యాంగ్ రేప్

జడ్చర్ల:  ఇద్దరు యువకులు ఓ మహిళకు బైక్ పై లిఫ్ట్ ఇచ్చి అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జడ్చర్లలో ఓ మహిళ తన ఇంటికి వెళ్లటానికి ఆటో కోసం ఎదురుచూస్తుంది. ఇద్దరు యువకులు అటుగా వెళ్తుండగా లిఫ్ట్ అడిగింది. వాళ్లు ఆమెను బైక్ పై ఎక్కించుకొని జడ్చర్ల శివారులోనికి వెళ్లిన తరువాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై ఇద్దరు అత్యాచారం చేశారు. వారి నుంచి ఆమె తప్పించుకొని జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా బైక్ ను గుర్తించారు. వారిని అతి త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. 

మన తెలంగాణ 11 Mar 2026 7:57 am

Israel - Iran War : మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావం ఆందోళనలో ఆసియా దేశాలు

మధ్యప్రాచ్యంలో యుద్ధం విస్తరించడంతో ఆసియా దేశాలు దాని ప్రభావంతో అప్రమత్తమవుతున్నాయి

తెలుగు పోస్ట్ 11 Mar 2026 7:52 am

ఆ భక్తులకు నిర్దేశిత సమయంలోనే అనుమతి

తిరుమల: స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టిటిడి స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనను సోమవారం నుండి టిటిడి కఠినంగా అమలు చేస్తోంది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దు. అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టిటిడి తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

మన తెలంగాణ 11 Mar 2026 7:47 am

గుది‘బండ’

` దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు కొరత ` హోటల్,పరిశ్రమలకు గ్యాస్ సరఫరా నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు ` ఇప్పటికే మూతపడ్డ 20శాతం హోటళ్లు ` గ్యాస్ దొరకకపోతే …

జనం సాక్షి 11 Mar 2026 6:46 am

రాహుల్‌ని మాట్లాడనివ్వడం లేదు

` రేయింబవళ్లు నెహ్రూను విమర్శించేవారు నేడు ఆయనను ప్రశంసిస్తున్నారు ` రాహుల్ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు! ` అమెరికా ముందు భారత ప్రభుత్వం తలవంచింది …

జనం సాక్షి 11 Mar 2026 6:45 am

యుద్ధం ఉగ్రరూపం

` ఊహించని దాడులు చేస్తాం: అమెరికా ` దేఖ్‌లేంగే అంటున్న ఇరాన్ ` ఇజ్రాయెల్, సౌదీ, కువైట్‌లపై ప్రతిదాడి ` దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమని ప్రకటన ` …

జనం సాక్షి 11 Mar 2026 6:44 am

ఆగని దాడులు

టెహ్రాన్/దుబాయి: పశ్చిమాసియాలో రెండు వర్గాలు మంగళవారంనాడు పరస్పరం దాడులను మరింత ఉధృతం చేశాయి. గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ లక్షంగా ఇరాన్ దాడులకు పాల్పడగా.. టెహ్రాన్‌లో ఇజ్రాయెల్‌ అమెరికా సంయుక్తంగా విధ్వంసం సృష్టించా యి. బహ్రెయిన్ రాజధాని మనామాపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో 29 ఏళ్ల మహిళ మరణించింది. ఓ భవంతి పాక్షికం గా దెబ్బతింది. బహ్రెయిన్ కూడా దాడిని ధ్రువీకరించింది. సౌదీ అరేబియాలోని తూ ర్పు ప్రాంతంలో చమురు క్షేత్రాలే లక్షంగా ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది. రువాయిస్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్ని మాపక దళాలను రంగంలోకి దించారు. అయితే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లలో రెండింటిని కూల్చివేసినట్లు సౌదీ ప్రకటించింది. ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని కూడా తె లిపింది. కువైట్‌పై కూడా ఇరాన్ డ్రోన్ దా డులకు పాల్పడిందని, అయితే వాటిల్లో ఆరు డ్రోన్లను కూల్చివేసినట్లు కువైట్ ఒక ప్రకటనలో తెలిపింది. జెరూసలెం, టెహ్రాన్‌లలోనూ వరుస పేలుళ్లు, సైరన్ల శబ్ధాలు వినపడ్డాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ సమర్థవంతంగా అడ్డుకుందని ప్రకటించారు. ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతం లో ఉన్న అమెరికా కాన్సులేట్‌పై కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇక్కడి అమెరికా ఎయిర్‌బేస్ లక్షంగా కూడా దాడులు చేసినట్లు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. ఇరాన్ దాడులను యుఎఇ తీవ్రంగా ఖండించింది. దౌత్య కార్యాలయాలను ల క్షంగా చేసుకోవడం సరైంది కాదని మండిపడింది. అదే విధంగా ఈ యుద్ధంలో తమ దేశాన్ని లక్షంగా ఎంచుకోవడాన్ని కూడా ఖండించింది. ఖతార్ రాజధాని దోహాలోకూడా భారీ శబ్దాలు వినపడ్డాయి. ఇది ఇరాన్ పనేనని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని దోహా యంత్రాంగం సూచించింది. యుఎఇలో జరిపిన దాడుల్లో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఓ అమెరికా సైనికుడు కూడా మృత్యువాత పడ్డట్లు ప్రకటించారు. ఇరాన్ కెర్మన్ విమానాశ్రయంపై దాడులు.. ఇరాన్‌లోని కెర్మన్ విమానాశ్రయంపై మంగళవారంనాడు అమెరికాఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరిపాయి. విమానాశ్రయంతో పాటు కొన్ని విమానాలు కూడా ధ్వంసమైనట్లు స్థానికి మీడియా తెలిపింది. కెర్మన్ ప్రావిన్స్ గవర్నర్ కార్యాలయం కూడా దీన్ని ధ్రువీకరించింది. ఇప్పటికే మెహ్రాబాద్ విమానాశ్రయాన్ని కూడా ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించి దెబ్బతీసింది. మరోవైపు హెజ్బొల్లాలు లక్షంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐదుగురు మృతి చెందారు. మిలిటెంట్లకు ఆర్థిక కేంద్రంగా ఉన్న అల్ ఖర్ద్ అల్ హసన్‌ను నేలమట్లం చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. టెహ్రాన్‌లోని కీలక ప్రాంతాలపై సంయుక్త బలగాలు దాడులు చేసినట్లు సమాచారం.

మన తెలంగాణ 11 Mar 2026 6:00 am

11th March 2026 |బుధవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

11th March 2026 | బుధవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు

ప్రభ న్యూస్ 11 Mar 2026 6:00 am

కూల్చిన చోటే ఇండ్లు

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమం గా నిర్మించిన 750 ఇళ్ళను కూల్చిన స్ధలంలోనే బుధవారం భూదాన్ నిర్వాసితుతలకు ఇళ్ళ ప ట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈమేరకు ఖ మ్మం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. డి ప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క రెవెన్యూశా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేతుల మీ దుగా ఈ పట్టాలను బాధితులకు అందచేస్తారు. గత నెల 24న 750 ఇళ్ళను కూల్చివేసిన విషయం లో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నష్టనివారణ చర్యల్లో భాగంగా ఎక్కడయితే ఇళ్ళను కూ ల్చారో అక్కడే ఇంటి స్ధలాలను పంపిణీ చేయాల ని నిర్ణయించారు. గడిచిన పక్షం రోజుల్లో కూల్చి న ఇళ్ళపై 24మంది రెవెన్యూ అధికారులు ఊరూ ర తిరిగి విచారణచేసి అర్హుల లేక్క తేల్చారు. మొ త్తం 730 ఇళ్ళను కూల్చివేయగా ఆరోజు బా ధితులు ఇచ్చిన వివరాల మేరకు వారి స్వగ్రామాని కి వెళ్ళి విచారణ చేశారు. ఈవిచారణలో చాలా మంది అనర్హులు ఉన్నట్లుతేల్చారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు,కానిస్టేబుళ్ళు, అంగన్ వాడీ టీచర్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 730 కు టుంబాల్లో 412 మంది అర్హులుగా నిర్ధారించారు. మిగిలిన వారు అనర్హులు(బోగస్ )గా ప్రకటించనున్నారు. అర్హులుగా గుర్తించిన వారిలో సొంత ఇంటి స్ధలం లేని 311 మందికి ఇంటి ప్లాట్ పట్టాతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు (రూ.5లక్షల ఆర్దిక సాయం) ప్రొసిడింగ్ పత్రాలను అందజేయనున్నారు.సొంతంగా ఇంటి స్ధలం ఉన్న మరో 101 కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం అందజేస్తారు. మొత్తంగా 412 కుటుంబాలకు శాశ్వత గృహ యోగం కల్పించనున్నారు. కూల్చిన చోటే అర్హులైన పేదలకు ఇంటి స్థలం పట్టాలను అందించేందుకు అఘమేఘాలమీద ఏర్పాట్లు చేస్తున్నారు. భూదాన భూముల్లో ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 311 మందికి వెలుగుమట్ల భూదాన్ భూముల్లోనే ఇంటి స్థలం పట్టా కాగితాలను ప్రదానం చేయనున్నారు. తమకు కూల్చిన చోటనే ఇళ్ళ పట్టాలను మంజూరు చేసి ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని భూదాన నిర్వాసితులు గత పక్షం రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ముందుగా జిల్లా యంత్రాగం రఘునాధపాలెం,ఏదులాపురం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిలో ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయాలని భావించారు. కానీ ప్రజల నుంచి రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతున్నందున కూల్చిన చోట నీడ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈనెల 15లోగా బాధితులందరికీ ఇంటి పట్టాలను పంపిణి చేస్తామని, ఈ పక్రియ ఈనెల 10 కల్లా పూర్తి చేస్తామని ఇటివల ఖమ్మం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ్ల సమావేశంలో వెల్లడించిన విధంగానే నాలుగు రోజుల ముందే వెలుగుమట్ల భూనిర్వాసితుల కళ్ళలో అనందం వెలుగులు నింపేలా పట్టాలను పంపిణీ చేయనున్నారు. 

మన తెలంగాణ 11 Mar 2026 5:00 am

ఆరు గ్యారెంటీల చట్టబద్ధతకు ప్రైవేట్ బిల్లు

మనతెలంగాణ/హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుకు చట్టబద్ధత క ల్పించాలని అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆ ర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఈ బడ్జెట్ ద్వారా ఎంత కేటాయించారో బహిర్గతమవుతుందని అన్నారు. అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ... ఆ హామీని, ఆ మాటను మరిచిపోయిందని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఈ బిల్లు ద్వారా ఎండగడతామని అన్నారు. 6 గ్యారంటీలలో పేర్కొన్న మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, రైతన్నలు వంటి తెలంగా ణ సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మో సం నేపథ్యంలో... ఆయా వర్గాల తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తె లిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మొదట క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత కలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భం గా కెటిఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ స భ్యులు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి 60శాతం సమయం అయిపోతుందని తెలిపారు. గండిపేటలోని గోల్కొండ రిస్టార్ట్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల ఉమ్మడి ఓరియెంటేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి, పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలో తాము విశ్లేషణ చేసుకున్నామన్నారు. అలాగే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే అంకెల గారడీలపై కూడా విశ్లేషించామని తెలిపారు. తమ పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, బండ ప్రకాష్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి తదితరులు మాట్లాడారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీ కమిటీలు ఏమీ లేవని విమర్శించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని తమ పార్టీ నుంచి ద్రోహం చేసి పోయిన వ్యక్తికి ఇచ్చారని పేర్కొన్నారు. ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, పిటిషన్స్ కమిటీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీ నడపాలని లేదని, అందుకే తూతూ మంత్రంగా ఈ అసెంబ్లీ సమావేశాలను నడుపుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిందని...కానీ, ఇచ్చిన హామీలకు చట్టబద్ధత ఏమైందంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. అసెంబ్లీలోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్‌ని ప్రయోగిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పెడుతున్న ఈసారి మూడవ బడ్జెట్ ప్రవేశపెడుతుందని, ఈ బడ్జెట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే సగం ప్రభుత్వ పదవీ కాలం అయిపోయిందని, హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపోయిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్‌ని ప్రయోగిస్తున్నదని మండిపడ్డారు. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో పచ్చిగా అబద్ధాలను, అసత్యాలను మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ తూతూమంత్రంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నదని ఆరోపించారు. రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టారని ఆరోపించారు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకం వల్ల ఇళ్లు కోల్పోయిన ఖమ్మం వెలుగుమట్ల తరపున, మూసీ బాధితుల తరపున, పేద దళిత గిరిజన ప్రజల కోసం ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళిత, గిరిజన, బిసి, మైనారిటీ వర్గాలకు ఇస్తామన్న నిధులు ఎందుకు కేటాయించలేదో నిలదీస్తామని పేర్కొన్నారు. దీంతోపాటు ఆయా వర్గాలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. శాసనమండలి, శాసనసభ మధ్య తమ పార్టీ సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. మూసీ పేరుతో మూటల వేటకు వ్యతిరేకం మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని.. కానీ, ఆ పేరుతో జరిగే మూటల వేటకే తాము వ్యతిరేకమని కెటిఆర్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు, 420 హామీల అమలుకు, రైతన్నలకు, మహిళలకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలకు డబ్బులు లేవని ప్రభుత్వం చెబుతున్నదని... కానీ, వీటన్నింటినీ పక్కన పెట్టి మూసీ పేరుతో అవినీతి కార్యక్రమానికి తెరలేపిందని అన్నారు. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తాము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు... కానీ, ఒకవైపు డబ్బులు లేవు, అప్పులయ్యాయని చెబుతూనే మూసీలో లక్షన్నర కోట్ల రూపాయల అవినీతితో లక్షలాది మంది ఇళ్లను కూలగొట్టడాన్ని మాత్రమే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేయడం లేదు అని, కేవలం ఢిల్లీకి డబ్బులు పంపించడం కోసమే మూసీ ప్రాజెక్టును చేపడుతున్నారని ఆరోపించారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసీలో జరిగే లక్షల కోట్ల రూపాయల అవినీతికి వ్యతిరేకం అని స్పష్టం చేశారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను జీరో వ్యాల్యూ చేయడం కాదు, అసలు జీరో వ్యాల్యూ ఎవరికైనా ఉన్నది అంటే అది రేవంత్ రెడ్డికే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాటలకు ముమ్మాటికీ జీరో విలువ ఉన్నదని అన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు అని, తాను తీసుకున్న నిర్ణయాలు కూడా తనకే తెలియదని చెబుతున్నారని విమర్శించారు. డే ఎకానమీని నాశనం చేసిన వ్యక్తి నైట్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రాహుల్ బంధు పథకాన్ని పక్కన పెట్టి రైతు బంధు కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. రెండున్నర సంవత్సరాలలో ఒక్క ఇల్లు అయినా కాంగ్రెస్ పార్టీ కట్టిందంటే తాను రాజీనామా చేస్తానని చెప్పానని, దానికి తాను ఇంకా కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాము కట్టిన ఫ్లైఓవర్లు, ఇళ్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి మావి అని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని కెటిఆర్ విమర్శించారు. 

మన తెలంగాణ 11 Mar 2026 4:30 am

కుంభమేళా తరహాలో పుష్కరాలు

మనతెలంగాణ/హైదరాబాద్: కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చే స్తోందని ‘గోదావరి పుష్కరాలు 2027’ కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ కు మరింత పేరు తెచ్చేలా మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. మంగళవారం డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన కమిటీ తొలి స మావేశంలో సభ్యులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిలు పాల్గొన్నారు. పుష్కర నిర్వహణ తేదీలు, సంబంధిత శాఖల సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణను సమీక్షించి అధికారులకు సబ్ కమిటీ దిశా నిర్దేశం చేసింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సరస్వతీ పుష్కరాలు, సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిందన్నారు. అదే స్ఫూర్తితో మరింత రెట్టించిన ఉత్సాహంతో రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు.... 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహించాలని వేద పండితులు నిర్ణయించారన్నారు. సుమారు 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు తరలివచ్చే అవకాశముందని, అందుకు అనుగుణంగానే గోదావరి ప్రవహించే జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశామన్నారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆయా చోట్ల క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర, జిల్లా ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వేగంగా పనుల్ని ప్రారంభించేలా ముమ్మర కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ నెల చివరి నాటికి డిపిఆర్‌లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. తొలి దశలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రద్దీ అధికంగా ఉండే తొమ్మిది ప్రాంతాలను ‘టైర్ -1’ కింద ఎంపిక చేశామన్నారు. సమన్వయలోపం తలెత్తకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. ప్రతి ఘాట్ దగ్గర ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ఎమర్జెన్సీ రూట్, ఆధునిక వైద్య సౌకర్యాలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. పుష్కర ఏర్పాట్లలో రాజీపడే ప్రసక్తే లేదని, పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అత్యంత పకడ్బందీగా వ్యవహారించాలని అధికారులను కేబినెట్ సబ్‌కమిటీ ఆదేశించింది.

మన తెలంగాణ 11 Mar 2026 4:00 am

నిలోఫర్‌లో వికటించిన ఫ్లూయిడ్స్

మన తెలంగాణ/ నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఒకే సారి 15 మంది పిల్లలు అస్వస్థులయ్యారు. వెనకా ముం దు చూసుకోకుండానే హడావుడిగా నీళ్లు, ఫ్లూ యిడ్‌ను ఎక్కించడంతో అది కాస్త వికటించి బాధిత చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆస్పత్రి వర్గా ల్లో తీవ్ర కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన వైద్యులు వైద్య సిబ్బంది నిర్లక్షాన్ని బయటికి పొక్కకుండా శతవిధాలా ప్రయత్నించారు. తమ తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు ఆఘ మేఘాలమీద చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించారు. ఫ్లూయిడ్ ఎక్కించన తర్వాతే పిల్లలు అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే వైద్యులు అనారోగ్యపాలైన రోగులకి ఎలాంటి సమస్యలు రాకుండా దగ్గరుండి మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఏలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీనికి కారకులను గుర్తించే పనిలో అధికారులు రంగంలోకి దిగారు. వివిధ జిల్లాల నుంచి ఇన్ఫెక్షన్లు సోకి ఆస్పత్రిలో ఆడ్మిట్ అయ్యారు. వారిని కొత్త బ్లాక్‌లో వివిధ వార్డుల్లో చికిత్సలు అందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరి నిర్లక్షం వల్లనే పిల్లలు అస్వస్థలకు కారణమని పలువురు చెబుతున్నారు. పిల్లలకి ఫ్లూయిడ్ ఎక్కించడంలోను ఆజాగ్రత్తల వల్లనే వికటించి పిల్లల ఆరోగ్యం దెబ్బతిన్నది. వారికి ఒక్కసారిగా వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలు రావడం పిల్లల తల్లిదండ్రులు, సహాయకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి నర్సుల వల్లనే తమ పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆగ్రహం వెళ్లగక్కారు. ఫ్లూయిడ్ వికటించడం, పిల్లలు అస్వస్థులు కావడాన్ని ఆస్పత్రి ఉన్నత వర్గాలు తీవ్రంగా పరిగణించారు. సిబ్బంది నిర్లక్షం, తప్పిదాల వంటివి నిగ్గు తేల్చేందుకు విచారణకి ఆదేశించాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల పరిస్థితి నిలకడగా ఉంది : ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆచార్య విజయకుమార్ ఆస్పత్రిలో పిల్లల పరిస్థితి మెరుగ్గా ఉందని, వారు త్వరంగా కోలుకుంటున్నారని నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య విజయకుమార్ తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇప్పటికే నలుగురిని డిశ్చార్జి చేశామని, మిగతా వారి పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. వారిని కూడా ఆస్పత్రి నుంచి ఇళ్లకు పంపిస్తామని విజయకుమార్ వివరించారు. చిన్న సమస్యను పెద్దదిగా చేయడం, వదంతులు, పుకార్లు వ్యాపింపచేయడం శ్రేయస్కరం కాదన్నారు.

మన తెలంగాణ 11 Mar 2026 3:30 am

బుధవారం రాశి ఫలాలు (11-03-2026)

మేషం ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృషభం కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి. ధనపరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదుపు చేయడం మంచిది. పనులు నిదానంగా పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. మిధునం అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, సమాజంలో ఆదరణ పెరుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. కర్కాటకం కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన ఋణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అధికారుల నుండి అనుకూలత ఉండదు. ప్రయాణాలలో ప్రమాద సూచనలు. సింహం చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కన్య తండ్రి తరుపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. తుల ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనారోగ్య సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమ కలుగుతుంది. వృశ్చికం వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. చేపట్టిన పనులలో ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. నూతన ఋణాలు చేయవలసి రావచ్చు. కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ధనస్సు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆలోచనలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. మకరం దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభం ఋణ భారం పెరిగి నూతన ఋణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి. మీనం ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. దూరపు బంధువుల నుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.  

మన తెలంగాణ 11 Mar 2026 12:10 am

బంగ్లాదేశ్‌కు పైపులైన్ ద్వారా భారత్ 5000 టన్నుల డీజిల్

 బంగ్లాదేశ్‌కు పైపులైన్ ద్వారా 5000 టన్నుల డీజిల్‌ను పైపులైన్ ద్వారా బుధవారం సరఫరా చేయడానికి భారత్ సన్నద్ధమైందని మంగళవారం అధికారి ఒకరు తెలిపారు. అస్సాం లోని ప్రబాతిపూర్ డిపో నుంచి సోమవారం నుంచే డీజిల్‌ను పైపులైన్ ద్వారా తీసుకోవడం ప్రారంభమైందని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారప్రతినిధి ఒకరు తెలిపారు. మొత్తం 5000 టన్నులు పంపింగ్ చేయడానికి 45 గంటలు పడుతుందన్నారు.ప్రతిగంటకు 113 టన్నుల డీజిల్‌ను పంప్ చేస్తున్నట్టు చెప్పారు. 15 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా ఏటా 180000 టన్నుల డీజిల్ భారత్ నుంచి సరఫరా చేయడానికి అంగీకారమైనట్టు తెలిపారు. 

మన తెలంగాణ 10 Mar 2026 11:21 pm

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర మంత్రివర్గం మంగళవారంనాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.8 లక్షల కోట్లు కేటాయించింది. జల్ జీవన్ మిషన్‌ను 2028 డిసెంబర్ వరకు పొడిగించింది. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ పథకం గ్రామీణ భారతంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా సురక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించింది. ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్రం సాయంగా మరో రూ.3.59 లక్షల కోట్లను అందించాలని నిర్ణయించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడుకు సంబంధించి కూడా కేబినెట్ కీలక నిర్ణయం వెలువరించింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ముధురై ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ప్రపంచంతో ఆ పట్టణాన్ని అనుసంధానిస్తామని అన్నారు. తద్వారా విద్యా, ఆరోగ్య హబ్‌గా మధురై త్వరలో మారబోతోందని అన్నారు. సంత్రాగచ్చి-ఖరగ్‌పూర్ మద్య రూ.2,905 కోట్లతో నాలుగు లైన్ల రహదారి, రూ.3,839 కోట్లతో బద్నావర్-థాండియా-తిమర్వానీ మధ్య 5 లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోదించినట్లు అశ్విని వివరించారు. రూ.3,631 కోట్లతో జెవార్ విమానాశ్రయం-, ఫరీదాబాద్ సెక్షన్‌ను కలిపే 6 లైన్ల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపామన్నారు. అదే విధంగా భారత్‌తో సరిహద్దు పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డిఐలపై కూడా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో అన్ని దేశాలకు నిబంధనలు సరళతరం చేశామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్న అనుమతి తీసుకోవాలన్న నిబంధనను తొలగిస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు ప్రెస్‌నోట్3ని సవరించామని తెలిపారు.

మన తెలంగాణ 10 Mar 2026 11:18 pm

పబ్లిసిటీ కోసమే కవిత పాట్లు: ఎమ్మెల్సీ బల్మూరి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత పబ్లిసిటీ కోసమే పాట్లు పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెలుగుమట్లలోనూ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని ఆయన తెలిపారు. దీనిని కవిత తన క్రెడిట్ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. గతంలో బీసీ బిల్లు విషయంలోనూ కవిత ఇలాగే పబ్లిసిటీ చేసుకున్నారని ఆయన విమర్శించారు.ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 10 Mar 2026 11:04 pm

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉగాది ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉగాది ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 10 Mar 2026 10:00 pm

ఎసిబి వలలో చిక్కిన యూసిడి విభాగం సీఈఓ మురళి

కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్‌లో యూసీడీ విభాగంలో సీఈఓగా పని చేస్తున్న మురళిని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మూసాపేట సర్కిల్ పరిధిలో కమ్యూనిటీ ఆర్గనైజర్ (ఔట్సోర్సింగ్) ఏవో కే మురళి మూసాపేట సర్కిల్ పరిధిలో మహిళా పొదుపు సంఘానికి చెందిన మహిళల నుండి 20 లక్షల మంజూరు చేసిన రుణాన్ని ప్రాసెస్ చేసేందుకు గాను రూపాయలు 18,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు ముందుగా ఎసిబి అధికారులను సంప్రదించగా వారి పథకం ప్రకారం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చెల్లించడానికి వెళ్లింది. దీంతో ముందుగా వేసుకున్న ప్రకారం ఫిర్యాదు ఆధారంగా ఎసిబి అధికారులు ఉచ్చుపన్నడంతో మురళి లంచం స్వీకరిస్తున్న సమయంలోనే పట్టుకున్నారు. అనంతరం అధికారులు ఆయన వద్ద నుండి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో మూసాపేట్ సర్కిల్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. సంబంధిత కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం

మన తెలంగాణ 10 Mar 2026 9:57 pm

రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:57 pm

భవిష్యత్తు ఆరోగ్యానికి భద్రత –గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలు..

భవిష్యత్తు ఆరోగ్యానికి భద్రత – గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలు.. నంద్యాల బ్యూరో,

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:51 pm

దుర్గగుడిలో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో పురోగతి..

దుర్గగుడిలో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో పురోగతి.. భవానిపురం, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రిపై

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:43 pm

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి.!

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి.! అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్జిల్లా

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:39 pm

దొంగతనం కేసులో ఇద్దరికి జైలు శిక్ష

దొంగతనం కేసులో ఇద్దరికి జైలు శిక్ష రూ.25 లక్షల చోరీ.. రెండు సంవత్సరాల

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:35 pm

అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహావిష్కరణ..

అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహావిష్కరణ.. మంత్రి నారా లోకేష్‌కు నిర్వాహకుల

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:32 pm

టాక్టికల్ అర్బనిజంతో అక్రమణల తొలగింపు..

టాక్టికల్ అర్బనిజంతో అక్రమణల తొలగింపు.. భవానిపురం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా పోలీస్

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:28 pm

ప్రపంచ ఆరోగ్య రాజకీయాల్లో కొత్త మలుపు .. భారత్ వైఖరి ఎటువైపు ?

ప్రపంచ ఆరోగ్య రాజకీయాల్లో కొత్త మలుపు .. భారత్ వైఖరి ఎటువైపు ?

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:22 pm

హామీల అమలులో కేంద్రం నిర్లక్షం: మంత్రి పొన్నం

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహారిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డికి, బండి సంజయ్‌కి లేఖ రాశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం దయ కాదని, అది తెలంగాణ ప్రజల హక్కు. అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు పనులు చెల్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చ లో తెలంగాణ కి సంబంధించిన రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు చర్చించాలని ఆయన సూచించారు. పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రతి ఏడాది బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నదని ఆయన తెలిపారు. ఆ రాష్ట్రానికి కేటాయిస్తున్న బడ్జెట్‌లో సగం నిధులైన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఎన్నికలు, రాజకీయాలు వేరు రాష్ట్ర అభివృద్ధిపై వివక్ష వద్దు అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ,బండి సంజయ్‌లు కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు వాగ్దానం చేసిన కోచ్ ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 10 Mar 2026 9:20 pm

రేపు తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న శివప్రతాప్ శుక్లా

రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లాకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్‌కు స్వాగతం పలికిన వారిలో సిఎం రేవంత్‌తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ కె. రామకృష్ణా రావు, డిజిపి శివధర్ రెడ్డిలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన శుక్లా 2014 ఎన్డీఏ కేబినెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ చేతుల మీదుగా కొత్త గవర్నర్‌గా ఆయన ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించి లోక్‌భవనోన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మరోవైపు, బదిలీపై మహారాష్ట్రకు వెళ్తున్న జిష్ణుదేవ్ వర్మ సోమవారం రిలీవ్ అయ్యారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు సిఎస్ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన వీడ్కోలు పలికారు.

మన తెలంగాణ 10 Mar 2026 9:06 pm

చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవద్దు..

చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవద్దు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రమాదాల

ప్రభ న్యూస్ 10 Mar 2026 9:03 pm

Vijay, BJP and the NDA Confusion in Tamil Nadu Politics

The recent expulsion of BJP Tamil Nadu spokesperson A. N. S. Prasad has raised questions about what the party actually wants when it comes to actor Vijay and his party, Tamilaga Vetri Kazhagam. The controversy began when Prasad publicly suggested that Vijay should join the NDA if he truly wants to stop the DMK from […] The post Vijay, BJP and the NDA Confusion in Tamil Nadu Politics appeared first on Telugu360 .

తెలుగు 360 10 Mar 2026 8:59 pm

Music Labels’ pay puts Anirudh on Top Slot

There are a number of top music composers from the South who are delivering exceptional work. One music composer who dominated everyone is Anirudh Ravichander. He is considered for all the films of top stars and the producers are ready to pay him big money. Devi Sri Prasad and Thaman are on the top in […] The post Music Labels’ pay puts Anirudh on Top Slot appeared first on Telugu360 .

తెలుగు 360 10 Mar 2026 8:57 pm

మనిషి పరిపూర్ణత సాధించాలంటే అహాన్ని త్యజించాలి..

మనిషి పరిపూర్ణత సాధించాలంటే అహాన్ని త్యజించాలి.. సూర్యప్రభ వాహనంపై శ్రీవారునేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు నిజామాబాద్,

ప్రభ న్యూస్ 10 Mar 2026 8:56 pm

నగరంలో కల్తీ అల్లంవెల్లుల్లి స్వాధీనం

కల్తీ అల్లంవెల్లుల్లి తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, హబీబ్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.20లక్షల విలువైన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... మల్లేపల్లి, అఫ్జల్‌సాగర్, గటాల మసీదు సమీపానికి చెందిన మహ్మద్ షారూఖ్ ‘షెహజాదా ఫుడ్ మాస్టర్ పేరు సంస్థను నిర్వహిస్తున్నాడు. నిందితుడు కల్తీ అల్లంవెల్లుల్లి తయారు చేసి హోల్‌సేల్ కిరాణా షాపులు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీస్‌లకు సరఫరా చేసేవాడు. నాసిరకం అల్లంవెల్లుల్లి కొనుగోలు చేసి వాటిలో అసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్స్, గమ్ పౌడర్, ఉప్పు వంటి రసాయనాలను కలిపి ప్లాస్టిక్ కంటైనర్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి ప్టాస్టిక్ డ్రమ్ముల్లో మూత పెట్టకుండా ఉంచాడు, దీంతో దుమ్ము, ఈగలు, ఇతర కలుషితాలకు గురై, వినియోగానికి పనికిరాని కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తీసుకుని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ 2018లోనే ముగిసింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. రాఘవేందర్, ఎస్సై జి. శ్రీకాంత్, హబీబ్ నగర్ ఎస్సై కె. శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

మన తెలంగాణ 10 Mar 2026 8:52 pm

దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధం: ఇరాన్

 త్వరలో యుద్ధానికి ముగింపు లభించే అవకాశం ఉందని ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేస్తుంటే దానికి భిన్నంగా ఇరాన్ యుద్ధానికి మరింత కాలు దువ్వుతోంది. రెండు దశాబ్దాలుగా అమెరికా వివిధ దేశాలపై చేస్తున్న యుద్ధాలు, ఆ దేశ సైన్యం ఏ రకంగా ఓటమి పాలవుతున్నది అధ్యయనం చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అలీ అరాగ్చి అన్నారు. మా రాజధాని టెహ్రాన్‌పై బాంబు దాడులు చేసినా మా సామర్థంపై అది ఏమాత్రం ప్రభావం చూపదు. మేం యుద్ధం కొనసాగించేందుకే సిద్ధంగా ఉన్నాం. అది ఎప్పుడు, ఎలా ముగుస్తుందన్నది తెలియదు కానీ, ముగింపు మాత్రం మేమేం చేస్తాం అని అరాగ్చీ అన్నారు. ఇక ఇరాన్ సెక్యూరిటీ అధికారి అలీ లారిజాని ట్రంప్‌కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. మీ గాలి హెచ్చరికలకు ఇరాన్ భయపడబోదని అన్నారు. 20 రెట్లు కాదు.. అంతకన్నా ఎక్కువ చేసినా ఇరాన్‌ను తుడిచిపెట్టలేరని అన్నారు. మీ అధ్యాయం ముగిసిపోకుండా చూసుకోండి అని ట్రంప్‌ను లారిజాని హెచ్చరించారు.

మన తెలంగాణ 10 Mar 2026 8:47 pm

‘గోపీచంద్ 33’లో సత్యవతిగా రీతు..

మ్యాచో స్టార్ టి.గోపీచంద్... విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ ‘గోపీచంద్33’తో రాబోతున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా రూపొందుతోంది. ఈ చిత్రంలో రీతు వర్మ... టి.గోపిచంద్ సరసన కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె పాత్ర సత్యవతిని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. పోస్టర్‌లో రీతూ వర్మ కమాండింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. విల్లు ఎక్కుపెట్టి ఏకాగ్రతతో కనిపిస్తూ, ఒక యోధురాలిలా ధైర్యం, సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నారు. పీరియడ్ స్టైల్ దుస్తులు, సంప్రదాయ ఆభరణాలు, యుద్ధానికి సిద్ధంగా ఉన్న లుక్ ఆమె పాత్రలోని పవర్ ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ సినిమాలో రీతూ వర్మ పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారు. 7వ శతాబ్దంలో పర్వత ప్రాంతాల్లో నివసించే ఒక గిరిజన తెగకు చెందిన మహిళగా ఆమె పాత్ర ఉంటుంది. ఆ తెగ సంస్కృతి, ధైర్యం, సహనాన్ని ప్రతిబింబించేలా సత్యవతి పాత్ర రూపుదిద్దుకుంది. తన నటన ద్వారా రీతూ వర్మ ఆ పాత్రకు సహజత్వం, భావోద్వేగాలను తీసుకురానున్నారు. ఈ చిత్రంలో హీరో గోపీచంద్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయి ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. సృజనాత్మక కథనాలకు పేరుగాంచిన సంకల్ప్ రెడ్డి, భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతోంది. ఈ సినిమాకు సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తుండగా, అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి.

మన తెలంగాణ 10 Mar 2026 8:42 pm

సాగునీటి కోసం రైతుల తండ్లాట

 ప్రభుత్వం కాళేశ్వరం 11వ ప్యాకేజీ ద్వారా అంసపూర్తిగా ఉన్న పనులను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ మానేరు బ్రిడ్జిపై మండల రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. బిజెపి జిల్లా అద్యక్షులు రెడ్డబోయిన గోపి రైతులకు మద్దతు తెలిపారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు నిరసన ఆపేది లేదంటూ రైతులు భీష్మించుకు కూర్చున్నారు. దాదాపు ఆరగంట సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సిరిసిల్ల, సిద్దిపేట రహదారుల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ సిఐ నాగేశ్వర్‌రావు జిల్లా ఎస్‌పి మహేష్ బి గీతేకు పరిస్థితి వివరించారు. జిల్లా అద్యక్షులు గోపితో ఫోన్‌లో మాట్లాడిన ఎస్పీ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ధర్నాలు చేయవద్దని సూచించారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించవద్దని చెప్పారు. తమ సమస్య పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదంటూ బిజెపి నాయకులు, రైతులు ఆందోళన తీవ్రం చేశారు. పోలీసులు బిజెపి నాయకులను, రైతులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ తంగళ్లపల్లి మండలంలో 11వ ప్యాకేజి రంగనాయక సాగర్ కెనాల్ నిర్మాణ పనులకు రూ.3కోట్లు కేటాయించి పనులు చేపట్టకపోవడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. మండలంలోని 15 గ్రామాలకు నీరందించే కెనాల్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కానీ,స్థానిక ఎమ్మెల్యే కెటిఆర్ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కెనాల్ నిర్మాణం జరిగితే 10వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. నిధులు మంజూరైనా భూసేకరణ పనులు చేపట్టలేదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం హేయమైన చర్య అన్నారు. బిజెపి రైతు పోరాటాలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా అద్యక్షులు రాగుల రాజిరెడ్డి,మండల బిజెపి అద్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు,సిరిసిల్ల వంశీ, కాళీచరణ్, రైతులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 10 Mar 2026 8:35 pm

Aussie Entry గ‌ల్ఫ్ లో పెద్ద‌న్న మాయం Andhra prabha Analysis

Aussie Entry గ‌ల్ఫ్ లో పెద్ద‌న్న మాయం Andhra prabha Analysis (

ప్రభ న్యూస్ 10 Mar 2026 8:09 pm

ഫാക്ട് ചെക്ക്: യുഎസ് തകർത്ത ഇറാൻ കപ്പലിൻ്റെ വിവരം കൈമാറിയെന്ന് ഇന്ത്യൻ സൈനിക മേധാവി? പ്രചാരണം വ്യാജം

ഐആർഐഎസ് ദേനയുടെ വിവരം ഇസ്രായേലിന് നൽകിയെന്ന് പറയുന്ന വീഡിയോ എഐ നിർമിതമാണ്

తెలుగు పోస్ట్ 10 Mar 2026 8:07 pm

KVN Productions: Big Advances paid in Telugu Cinema

KVN Productions is backed by top real estate firm named Prestige Group. They have ventured into Tamil and Kannada languages. They are now in plans to do big films in Telugu and they have paid big advances for several top actors and directors. KVN Productions will make their debut in Telugu with Megastar Chiranjeevi’s film […] The post KVN Productions: Big Advances paid in Telugu Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 10 Mar 2026 8:04 pm

రూ.8 కోట్లు ఎగ్గొట్టిన ఇద్దరు రైస్ మిల్ యజమానుల అరెస్టు…

రూ.8 కోట్లు ఎగ్గొట్టిన ఇద్దరు రైస్ మిల్ యజమానుల అరెస్టు… జన్నారం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 10 Mar 2026 7:55 pm

శ్రీశైలం వెళ్లే భక్తులు ఓవర్‌లోడ్ ప్రయాణాలు చేయవద్దు..

శ్రీశైలం వెళ్లే భక్తులు ఓవర్‌లోడ్ ప్రయాణాలు చేయవద్దు.. ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ

ప్రభ న్యూస్ 10 Mar 2026 7:50 pm

52 school |ఘనంగా సావిత్రిబాయి ఫూలే వర్ధంతి

52 school | ఘనంగా సావిత్రిబాయి ఫూలే వర్ధంతి తిరువూరులో నివాళులు అర్పించిన

ప్రభ న్యూస్ 10 Mar 2026 7:47 pm

అవమానాలు ఇంకెంతకాలం భరించాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీకి ప్రాధాన్యత లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై పునరాలోచనలో ఉన్నానని, అవమానాలు ఇంకెంత కాలం భరించాలని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమయం, సందర్భం వచ్చినపుడు నిర్ణయం తీసుకుంటానని, మంగళవారం జగిత్యాల కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ఇటీవల పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఏ అంశమైనా మీకు తెలియకుండా జరగదు, మున్సిపల్ ఎన్నికల ఫలితాల రోజే ఇక్కడ పరిస్థితి గురించి చెప్పాను, భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? వద్దా అన్న నిర్ణయం త్వరలో చెబుతా అన్నారు. పార్టీ మార్పుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా, కార్యకర్తలకు సంప్రదించి మీడియా ద్వారానే వెల్లడిస్తానని అన్నారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (బీఆర్‌ఎస్ నుంచి వచ్చినవారు)కు ప్రాధాన్యత ఇవ్వడం, మున్సిపల్ ఎన్నికల పరిణామాలపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజీపీ, బీఆర్‌ఎస్ నాయకులు తనను సంప్రదించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడంతో జగిత్యాలలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

మన తెలంగాణ 10 Mar 2026 7:42 pm

ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన విదేశీ బృందం……

ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన విదేశీ బృందం…… పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రకృతి

ప్రభ న్యూస్ 10 Mar 2026 7:32 pm