చిట్యాల, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశమును
నవోదయ సీట్లు సాధించిన కోచింగ్ సెంటర్…
నవోదయ సీట్లు సాధించిన కోచింగ్ సెంటర్… దర్శి, ఆంధ్రప్రభ : దర్శి లోనీ
మోజ్తాబా బతికే ఉన్నాడని వీడియోను విడుదల చేసిన ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ వీడియోను విడుదల చేశారు. తాము బాంబు దాడులు చేయడంతో మొజ్తాబా తీవ్రంగా గాయపడి మృతి చెందాడని అమెరికా, ఇజ్రాయెల్ అరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్ఐబిలో మొజ్తాబా వీడియోను ప్రసారం చేశారు. కొంతమందికి మతపరమైన బోధనలు చేస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఈ వీడియో ఎప్పటిదనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులు అలీ ఖమేనీ మృతి చెందిన తరువాత తొలి వీడియోను విడుదల చేశారు. సుప్రీం నేతగా ఎన్నికైన తరువాత మోజ్తాబా కనిపించకపోవడంతో అందరూ చనిపోయి ఉంటారని భావించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా మోజ్తాబా మృతి చెందాడని ఆరోపణలు చేయడంతో బలంచేకూరినట్లైంది. ఇరాన్ మీడియాలో ఈ వీడియోను విడుదల చేయడంతో ఆయన బతికే ఉన్నాడని తెలుస్తోంది. కానీ అది పాత వీడియో లేదా ప్రస్తుత పరిస్థితులపై ఎందుకు మాట్లాడలేదని నెటజన్లు అడుగుతున్నారు. ప్రస్తుతం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు..
నర్సంపేట, ఆంధ్రప్రభ : రైతులు మక్కజొన్నలు దళారులకు అమ్మి మోసపోవద్దని వరంగల్ జిల్లా
Trump Seeks 200 Bn : తప్పని ఖర్చు Andhra Prabha Detail Report
Trump Seeks 200 Bn : తప్పని ఖర్చు Andhra Prabha Detail
శ్రీ ధన మైసమ్మకు వెండి పాదాలు సమర్పించిన భక్తులు
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; శ్రీ ధన మైసమ్మ దేవాలయం మెట్లబావి అమ్మవారికి 500
ప్లాస్టిక్ వ్యర్థాలతో తారు రోడ్డు
చత్తీశ్గఢ్లో విజయవంతమైన ప్రాజెక్టు చత్తీశ్గఢ్: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించి తారును తయారు చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లా మైన్పాట్ ప్రాంతంలో చేపట్టిన ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులు నిర్మించే పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. ఒక కిలోమీటరు మేర ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపిన తారు, కంకరలతో రోడ్డు వేశారు. దీంతో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రహదారి నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను విస్తృతంగా ఉపయోగించేందుకు మార్గం సుగమం అయింది. మైన్పాట్ […] The post ప్లాస్టిక్ వ్యర్థాలతో తారు రోడ్డు appeared first on Visalaandhra .
పదవ ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పు
పదవ ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పు నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; రాష్ట్రంలోని
ipl 2026| ఆల్రౌండర్కు గాయం ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : సీజన్ ప్రారంభానికి ముందే
Bhatti Vikramarka |ప్రజలే మాకు పరమావధి
Bhatti Vikramarka | ప్రజలే మాకు పరమావధి Bhatti Vikramarka | ఆంధ్రప్రభ,
తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మల్లు భట్టితెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే 2026-27 వార్షిక బడ్జెట్ ను కాసేపట్లో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయంలో మండలిలో మంత్రి ఉత్తమ్ […] The post తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. appeared first on Visalaandhra .
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లోని పలు గ్రామాల
Hyderabad : నిలిచిన మెట్రో రైళ్లు.. సాంకేతిక లోపం
జూబ్లీహిల్స్ లో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి.
ఏపీలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మార్చి 21న జరగాల్సిన పదో తరగతి (ఎస్ఎస్సీ) ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 2, 2026న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.వివరాల్లోకి వెళితే.. రంజాన్ పండుగ సందర్భంగా మార్చి 21వ తేదీని (శనివారం) ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. వాస్తవానికి ముందుగా మార్చి 20న సెలవుగా భావించినప్పటికీ, చంద్రుని దర్శనంపై ఏపీ వక్ఫ్ బోర్డు […] The post ఏపీలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన ప్రభుత్వం appeared first on Visalaandhra .
93 దాటి ఆల్ టైమ్ కనిష్ఠానికి! అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల నేపథ్యంలో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా ఇవాళ్టి ట్రేడింగ్లో రూపాయి భారీగా బలహీనపడింది. ఒకే రోజు 0.55 శాతం క్షీణించి, డాలర్కు 93.12 వద్ద కొనసాగుతోంది. బుధవారం నమోదైన 92.63 కనిష్ఠ స్థాయిని కూడా ఇది అధిగమించింది. పశ్చిమాసియాలో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి […] The post కుప్పకూలిన రూపాయి.. appeared first on Visalaandhra .
Ys Viveka : వివేకా హత్య కేసు వచ్చే ఎన్నికల వరకూ కొనసాగేటట్లుందిగా?
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కేసులో తర్వాత ఎవరినీ విచారించే అవసరం లేదని చెప్పింది
చేవేళ్ల: రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో భూకంపం సంభవించింది. చేవేళ్ల పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధంతో కూడిన ప్రకంపనల రావడంతో ప్రజలు బయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో అకస్మాత్తుగా భారీగా శబ్దం వినిపించింది. వెంటనే కొన్ని క్షణాల పాటు భూమి స్వల్పంగా కంపించిందని స్థానికులు చెబుతున్నారు. భూప్రకంపనల ధాటికి ఇంట్లో వస్తువులు కదిలాయని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది భూకంపమా లేక సమీపంలోని క్వారీల్లో జరిగిన పేలుళ్ల వల్ల వచ్చిన ప్రకంపనలా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
లోపాల కారణంగానే…అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం
ఎఫఏఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పియర్సన్ న్యూదిల్లీ: విమానంలో పలు లోపాల కారణంగానే అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం సంభవించిందని అమెరికాకు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఏవియేషన్ సేఫ్టీ(ఖీAS) తెలిపింది. గతేడాది జూన్ 12న ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విమాన ప్రమాద దర్యాప్తు విభాగం (AAIదీ) దర్యాప్తు చేస్తోంది. కాగా ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఏఏఐబీ, జాతీయ రవాణా […] The post లోపాల కారణంగానే…అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం appeared first on Visalaandhra .
గ్లోబల్ ఇంటర్నెట్కు గండం #GlobalInternet #UnderseaCables #MiddleEast #Iran #Houthis #TechNews
తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం #snake #telanganaassembly #viralvideos #telugupost
జిల్లాస్థాయికి ఎంపికైన విద్యార్థికి సన్మానం
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావు పల్లి గ్రామ
Chevella | భయంతో బయటకు పరుగులు Chevella | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
16 యుద్ధ విమానాలు కోల్పోయిన యూఎస్
వాషింగ్టన్: ఇరాన్ తో యుద్ధం ఆరంభం అయినప్పటి నుంచి అమెరికాకు చెందిన 16 యుద్ధ విమానాలు కుప్పకూలాయి. వీటిల్లో 10 MQ-9 ను రీపర్ డ్రోన్ లను శత్రు దళాలు కూల్చాయి. మరికొన్ని యుద్ధంలో కూలిపోయాయి. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ తన కథనంలో పేర్కొంది. కువైట్ లో జరిగిన ఫ్రెండ్లీ ఫైర్ లో అమెరికాకు చెందిన మూడు ఎఫ్ – 15 యుద్ధ విమానాలు నాశనమయ్యాయి. ఇరాక్ లో అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం […] The post 16 యుద్ధ విమానాలు కోల్పోయిన యూఎస్ appeared first on Visalaandhra .
Court |కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా..
Court | కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా.. Court | ఆంధ్రప్రభ, వెబ్
కుమారుడిని కొట్టిందని తల్లి ప్రాణం తీసిన భర్త, అత్తింటివారు
పాట్నా: కుమారుడిని కొట్టిందని తల్లిని తండ్రి, అత్తింటివారు చంపేసిన సంఘటన బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బిరోపూర్ గ్రామంలో రాకేశ్ కుమార్, అను కుమారీ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు ఉన్నాడు. కుమారుడిని తల్లి అను చెంప కొట్టింది. కోపంతో రగిలిపోయిన భర్త అనును చితక బాదాడు. అనంతరం అత్తింటి వారు ఆమెను చితకబాదడంతో స్పృహతప్పికుప్పలిపోయింది. ఆమె చనిపోయిందని అత్తింటి వారు అక్కడి నుంచి పారిపోయారు. అను తండ్రి సుబోధ్ కుమార్ మిశ్రా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించారు.
16 మంది కోడి పందాల రాయుళ్ళు అరెస్ట్..
16 మంది కోడి పందాల రాయుళ్ళు అరెస్ట్.. పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు
Vaishnavi |మరో ముగ్గురు అరెస్ట్
Vaishnavi | మరో ముగ్గురు అరెస్ట్ Vaishnavi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఆ ఊళ్లోకి ఐస్క్రీం బండ్లు వెళితే జరిమానా...#Polavaram #Chintoor #Guduru #IceCreamBan
Peddi Release: Ram Charan has Big Plans
Ram Charan’s Peddi is in the final stages of shoot. Two units are working round the clock to complete the shoot deadlines. The final shoot is expected to be completed by the end of this month and Peddi releases on April 30th in theatres. The songs have generated the initial buzz and the film is […] The post Peddi Release: Ram Charan has Big Plans appeared first on Telugu360 .
ప్రజా ఆర్థిక నిర్వహణ (పబ్లిక్ ఫైనాన్స్)లో దేశంలో మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడం చెప్పుకోదగిన విశేషం. సామాజిక, ఆర్థిక నివేదికలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచిక నివేదికలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని కనబరిచింది. 202324 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటా ఆధారంగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026’ నివేదికలో దేశంలోనే అత్యుత్తమ ఆర్థిక నిర్వహణ గల రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తూ తెలంగాణ 8వ స్థానం నుండి 7వ స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో ‘ఫ్రంట్ రన్నర్’ హోదాను కూడా నిలబెట్టుకుంది. స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రతిబింబిస్తూ జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ నివేదిక ప్రకారం ఒడిశా, గోవా, జార్ఖండ్ రాష్ట్రాలు ‘టాప్ అచీవర్స్’ (అగ్ర స్థాయి సాధకులు) వర్గంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ రాష్ట్రాలు బలమైన ఆర్థిక క్రమశిక్షణ, సొంత పన్ను ఆదాయం, తక్కువ ద్రవ్యలోటు, అప్పుల నిర్వహణలో మెరుగైన పద్ధతిని ప్రదర్శించాయి. ‘అత్యల్ప ఆకాంక్షిత’ (లోయెస్ట్ ఆస్పిరేషనల్) వర్గంలో కేరళ, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పనితీరును అంచనా వేయడానికి నీతి ఆయోగ్ నాలుగు విస్తృత విభాగాలుగా వర్గీకరించింది. అచీవర్స్ (సాధకులు టాప్ టైర్), ఫ్రంట్ రన్నర్స్, పెర్ఫార్మెర్స్, ఆస్పిరేషనల్ (ఆకాంక్షిత) అనే నాలుగు కేటగిరీలుగా సమీక్షించింది. ఫ్రంట్ రన్నర్ వర్గం అంటే సాధారణంగా మంచి ఆర్థిక స్థితిని కలిగి ఉన్న రాష్ట్రాలు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఫ్రంట్ రన్నర్ వర్గంలో నిలిచాయి. ‘కాలక్రమేణా తెలంగాణ ఆర్థిక నిర్వహణ మెరుగుపడింది. జాతీయ సగటు కంటే అధిక వృద్ధి రేటు, సొంత పన్నుల రాబడి పెంపుదల, సంక్షేమ, అభివృద్ధి పథకాల సమతుల్యత, ఇవన్నీ తెలంగాణ ఆర్థిక సూచిక ఎదగడానికి కారణాలు. ఈ రాష్ట్రం తన స్వంత ఆదాయ వనరులను మెరుగుపర్చుకోవడంలో, సబ్సిడీ చెల్లింపును సమతుల్యం చేయడంలో నిలకడైన ప్రగతిని కనబర్చింది. అయితే రెవెన్యూ లోటును నియంత్రించాల్సి ఉందని, అప్పుల ద్వారా కాకుండా స్వంత ఆదాయ వనరుల ద్వారానే ఖర్చులను భరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫిస్కల్ హెల్త్ ఇండెక్సులో 44.3 పాయింట్లు స్కోరు చేసి 8వ స్థానం నుంచి 7వ స్థానానికి తెలంగాణ ఎదగ్గా, దీనికి విరుద్ధంగా 23.1 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాలు ప్రజాధనాన్ని ఎంత సమర్థవంతంగా ఖర్చు చేస్తున్నాయో కూడా ఈ సూచిక పరిశీలించింది. అభివృద్ధి పనులు, మూలధన వ్యయంపై సమర్థవంతంగా ఖర్చు చేస్తున్నట్టు తేలడంతో 57.1 పాయింట్ల స్కోరుతో ‘అచీవర్ కేటగిరీ’ ని తెలంగాణ సాధించింది. అప్పుల నిర్వహణలో కూడా 53.5 పాయింట్ల స్కోరుతో తెలంగాణ ఫ్రంట్ రన్నర్గా నిలిచింది. తక్కువ వడ్డీ, ఇవిఎంల ఒత్తిడి విషయంలో ఆదాయానికి, అప్పులకు మధ్య సరైన సమతుల్యత పాటించింది. రుణస్థిరత్వం అన్నది అనేక రాష్ట్రాలకు ఆందోళనకరమైన అంశంగా ఉంటున్న నేపథ్యంలో ఈ సూచికలో తెలంగాణ 20.0 పాయింట్లు సాధించగా, ఆంధ్రప్రదేశ్ కేవలం 4.2 పాయింట్లు మాత్రమే సాధించగలగడం గమనార్హం. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థల దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మెరుగుపర్చుకోవడానికి ఆస్కారం ఉందని ఈ నివేదిక సూచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తోంది. 2019 20 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,860 కోట్లుగా ఉన్న మూలధన వ్యయం 2023 నాటికి రూ. 43,918 కోట్లకు పెరిగి, ఐదేళ్లలో 160 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. ఈ గణనీయమైన పెరుగుదల రాష్ట్రంలో ఆస్తుల సృష్టిని, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూనే హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ విస్తరణ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ఇంత భారీ వ్యయం ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం తన ఆర్థిక క్రమశిక్షణను కాపాడుకుంటూ ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం రుణపరిమితులను నియంత్రణలో ఉంచిందని చెబుతున్నారు. రుణజిఎస్డిపి నిష్పత్తిని 30% కంటే తక్కువగా అంటే సుమారు 2728 శాతం కొనసాగిస్తోంది. ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మౌలిక సదుపాయాల కల్పన, హైదరాబాద్లో ప్రపంచ స్థాయిలో రూ. 60,799 కోట్లతో రోడ్ల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఇవన్నీ రాష్ట్రంలో ఆస్తుల సృష్టిని, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ చొరవను బలపరుస్తున్నాయి. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి కోసం పరిశ్రమలు, ఐటి రంగం విస్తరణ, మున్సిపల్ శాఖల్లో పెట్టుబడులు ప్రధానంగా ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఆర్థికాభివృద్ధిలో స్థిరమైన ప్రగతి కనిపిస్తోంది. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగి రూ. 3.87 లక్షలకు చేరుకుంది. ఇది దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికం. పర్యాటకం, పరిశ్రమలు, క్రీడలు, సామాజిక సమ్మిళిత్వంతో సమగ్ర విధానాలను అమలు చేస్తోంది. ఆర్థిక నిర్వహణ సమర్థ్ధవంతంగా ఉండడం, పన్నుల వసూలులో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించడం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు సరైన ప్రాధాన్యత కల్పించడం ఇవన్నీ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే లక్షానికి ఊతం ఇస్తున్నాయి.
Telangana |నల్లపోచమ్మ ఆలయంలో భట్టి ప్రత్యేక పూజలు
Telangana | నల్లపోచమ్మ ఆలయంలో భట్టి ప్రత్యేక పూజలు Telangana | ఆంధ్రప్రభ,
Andhra Pradesh : పదో తరగతి పరీక్ష వాయిదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసింది
బిజెపికి సవాల్గా బెంగాల్ ఎన్నికలు
పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో బిజెపి తక్షణ ప్రాధాన్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసోంను నిలుపుకోవడం, బెంగాల్ను గెలవడం లేదా కనీసం రాష్ట్రంలో తన స్థానాన్ని మెరుగుపరచుకోవడం, కేరళ, తమిళనాడులలో తన పరిధిని విస్తరింప చేసుకోవడం. ఐదు రాష్ట్రాలలో అసోం మాత్రమే బిజెపి ప్రస్తుత ఎన్నికల కంఫర్ట్ జోన్లో దృఢంగా కనిపిస్తున్నది. ఇతర రాష్ట్రాలలో ముఖ్యంగా కేరళ, తమిళనాడులలో పార్టీ చరిత్రాత్మకంగా ఉనికి కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటం చేయాల్సి వస్తున్నది. 2016 నుండి అధికారంలో ఉన్న అసోంను వరుసగా మూడోసారి గెలుపొందగలమని ధీమాతో బిజెపి ఉంది. తమిళనాడులో ఎఐఎడి ఎంకె నేతృత్వంలో చీలిక గ్రూపులను ఎన్డిఎలోకి తీసుకొచ్చి డిఎంకెను ఓడించాలనే ఎత్తుగడ బెడిసికొట్టిందని గ్రహించే అక్కడి గవర్నర్ ఆర్ఎన్ రవిని బెంగాల్కు పంపి ఆ రాష్ట్రంపై కసరత్తు చేస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రధాన కార్యదర్శి, హోం కార్యదర్శి, డిజిపి, సిటీ పోలీస్ కమిషనర్ వంటి కీలక అధికారులను మార్చడం ద్వారా ఏదో విధంగా అక్కడ మమతా బెనర్జీని గద్దె దింపాలని అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతున్న బిజెపి, ఈసారి బెంగాల్ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) తన 15 ఏళ్ళ అధికారాన్ని కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బెంగాల్ సంస్కృతి, అస్తిత్వాన్ని ప్రధాన అజెండాగా మార్చి బెంగాల్ కూతురుగా ప్రచారం సాగిస్తున్నారు. బిజెపిని బయటి పార్టీగా అభివర్ణిస్తూ, స్థానిక ఓటర్లలో సెంటిమెంట్ రగిలిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా తృణమూల్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొద్దిసేపు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఎక్స్పోస్ట్లో నిన్న కోల్కతాలో జరిగిన ఆనందోత్సాహాల ర్యాలీ నుండి ముఖ్యాంశాలు! పశ్చిమ బెంగాల్ బిజెపికి మద్దతు ఇస్తోందని స్పష్టంగా తెలుస్తుంది.. అంటూ పేర్కొనడం గమనార్హం. గత నెలలో రాష్ట్రంలో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి, దాని ఎన్డిఎ మిత్రపక్షాలు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అధికారంలో ఉన్నప్పటికీ అది సరిపోదు అని స్పష్టం చేశారు. బెంగాల్లో బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ కార్యకర్తల ముఖాల్లో చిరునవ్వు ఉంటుంది అని ఆయన ప్రకటించారు. అయినప్పటికీ బెంగాల్ ఎన్నికలు అత్యంత జటిలమైన ఎన్నికల పోరాటం కాగలదని బిజెపి నాయకులు ప్రైవేట్గా అంగీకరిస్తున్నారు. మమతా ప్రజాకర్షణ, పథకాల అమలులో ఆమె పాలనా నైపుణ్యం ముందు తట్టుకోవడం సాధ్యం కావడం లేదని చేతులెత్తేస్తున్నారు. పశ్చిమబెంగాల్లో, గత దశాబ్దంలో సాధించిన పురోగతి ఆధారంగా విజయం వైపుకు దూసుకుపోయే ప్రయత్నం బిజెపి చేస్తున్నది. అయితే, పార్టీ తన పెరుగుదలను అసెంబ్లీ విజయంగా మార్చుకోలేకపోయింది. 2019 లోక్సభ ఎన్నికలలో దాని అద్భుతమైన ప్రదర్శన నుండి క్రమంగా ఆ పార్టీ ప్రాబల్యం తగ్గుతూ వస్తుంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), కోల్కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రి అత్యాచార కేసు, షేక్ షాజహాన్ ఉదంతం వంటి వివాదాలను ఎదుర్కొంది. అయినప్పటికీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అనుకూలంగా గ్రామీణ మహిళలకు నగదు బదిలీని అందించే లక్ష్మీర్ భండార్ వంటి సంక్షేమ పథకాల ప్రజాదరణ నెలకొంది. పశ్చిమబెంగాల్ జనాభాలో ముస్లింలు 27% మంది ఉండటంతో జనాభా కూడా బిజెపికి సవాలుగా ఉంది. టిఎంసి ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అవినీతి, అధికార వ్యతిరేకత, బెంగాల్ అంతటా హిందూ ఏకీకరణ అవకాశం వంటి అంశాల చుట్టూ ఎన్నికలను రూపొందించాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అసోం లో పార్టీ దీర్ఘకాల రాజకీయ ప్రణాళిక - బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలకు వ్యతిరేకత, వలసలతో ముడిపడి ఉన్న ఆర్థిక, సాంస్కృతిక ఒత్తిళ్ల గురించి ఆందోళన చెందుతున్న అస్సామీ హిందువులలోని వర్గాలతో ప్రతిధ్వనించింది. బెంగాలీ మాట్లాడే ముస్లింల ఓటింగ్ సరళి మరో కీలక అంశం కాగలదు. వారి ఓట్లు కాంగ్రెస్, బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ ఎఐయుడిఎఫ్ల మధ్య చీలిపోతే, అది బిజెపి వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బిజెపికి ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే, లోక్సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్ వెనుక ఏకీకృతం కావడంతో బిజెపికి ఇబ్బందికరంగా మారింది. రకీబుల్ హుస్సేన్ 10 లక్షలకుపైగా ఓట్ల తేడాతో గెలవడానికి ఇది సహాయపడింది. ఇపుడు కాంగ్రెస్ ఆయా వర్గాలను సమీకరించుకోవడం ద్వారా బిజెపిని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతుంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన పదవీకాలంలో దూకుడుగా హిందూత్వ వైఖరిని అవలంబిస్తున్నారు. ఇటీవల, ముస్లింలను శర్మ తుపాకీతో లక్ష్యంగా చేసుకుని ఎఐ -సృష్టించిన వీడియో తీవ్ర విమర్శలకు దారితీయడంతో బిజెపి తన అధికార వెబ్సైట్నుంచి తొలగించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం అసోం జనాభాలో ముస్లింలు దాదాపు 34% ఉన్నారు. ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వెనుక ఏకీకృతమైతే, పోటీ గణనీయంగా కఠినతరం కావచ్చు. శర్మ పాలన రికార్డు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, బలమైన శాంతి భద్రతల కథనాన్ని బిజెపి నాయకులు ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. కేరళ బిజెపికి కష్టతరమైన ప్రాంతంగా మిగిలింది. అయినప్పటికీ 2024 లోక్సభ ఎన్నికల్లో, నటుడు సురేష్ గోపి త్రిస్సూర్ స్థానాన్ని బిజెపి తరపున గెలుచుకున్నారు. ఇది రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా విస్తృతంగా పరిగణించబడుతుంది. తదనంతరం, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ బలమైన ప్రదర్శన ఇచ్చింది.రాష్ట్ర రాజధానిలో మేయర్ పదవిని కూడా దక్కించుకుంది. అయినా, కేరళలో బిజెపి నిర్మాణాత్మక సవాళ్లను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో ముస్లిం, క్రైస్తవ జనాభా కలిపి దాదాపు 45% ఉంది, దీనివల్ల పార్టీ తన ఎన్నికల స్థావరాన్ని గణనీయంగా విస్తరించుకోవడానికి హిందూ ఏకీకరణ సరిపోదు. పాలక సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) కూడా హిందూ ఓటర్లను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాలు బిజెపి ఎదుగుదలను అడ్డుకొంటున్నది. గత సంవత్సరం గ్లోబల్ అయ్యప్ప సంగమం వద్ద, ఒక మంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుండి ఒక సందేశాన్ని చదివారు. ఇది అసాధారణమైన సంజ్ఞ. తాజాగా, అయ్యప్ప మందిరంలో మహిళల ప్రవేశంపై లెఫ్ట్ ప్రభుత్వం ఆంక్షలకు ఆమోదం తెలిపింది. మరోవంక, ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ చెప్పుకోదగిన ఫలితాలు పొందడంతో ఆ పార్టీ చేతిలోకి మరో రాష్ట్రం వెళ్లకుండా పరోక్షంగా ఎల్డిఎఫ్కు సానుకూలంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎప్పటి నుండి పెండింగ్లో ఉన్న రాష్ట్రం పేరు మార్పుకు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇదే విషయమై బెంగాల్ అభ్యర్థనను పక్కన పడవేయడం అందుకు నిదర్శనం. తమిళనాడులో ద్రవిడ ఉద్యమ వారసత్వం రాష్ట్ర రాజకీయాలను నిర్దేశిస్తున్నది. బిజెపిని, దాని ప్రత్యర్థులు తరచుగా ఉత్తరాది పార్టీగా చిత్రీకరిస్తున్నారు. దానితో ‘తమిళ వ్యతిరేక’ ముద్రను చెరిపివేసుకోవడం కోసం బిజెపి ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. మాజీముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత బలహీనపడిన తన మిత్రపక్షమైన అన్నాడిఎంకెపై బిజెపి ఎక్కువగా ఆధారపడుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లు గెలుచుకున్న పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరుగుతాయి. అయితే, శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా, ఈ ఫలితంవల్ల కలిగే రాజకీయ పరిణామాలు ఆ పార్టీకి చాలా పరిమితం. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో, బిజెపి నాయకత్వం అసోం పట్ల అత్యంత నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయా రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక రాజకీయ, పరిపాలన సంబంధ అంశాలతో పాటు ఇరాన్ యుద్ధంతో తలెత్తుతున్న ఆర్థిక ఆందోళనలు, పెరుగుతున్న ఎల్పిజి ధరలు, పరిష్కారం కాని అమెరికాతో వాణిజ్య చర్చలు కూడా ఓటర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ఎల్పిజి, చమురు సరఫరాలో కొరత లేదని నిత్యం ప్రభుత్వం చెబుతున్నా దేశవ్యాప్తంగా ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. వారాలు గడిస్తే పరిస్థితులు సర్దుబాటు అవుతాయనే ఉద్దేశంతోనే బెంగాల్ ఎన్నికలను ఏప్రిల్ చివరిలో జరుపుతున్నారని స్పష్టం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా బిజెపికి జాతీయ స్థాయిలో సవాలుతో కూడిన సమయంలో వస్తున్నాయి. మోడీ ప్రభుత్వం మే నెలలో తన మూడవ పదవీకాలంలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఓ బలమైన నాయకుడిగా జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో ఆయన నిలదొక్కుకోలేకపోవడంతో ఈ ఎన్నికలలో ఆయన ప్రచార ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. - చలసాని నరేంద్ర 98495 69050
ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఊరేగింపు..
ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఊరేగింపు.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ :
తప్పనిసరిగా టీకాలు వేయించాలి..
తప్పనిసరిగా టీకాలు వేయించాలి.. కడెం, ఆంధ్రప్రభ : పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి
బడ్జెట్లో బిసిలకు ప్రాధాన్యమిస్తారా?
బడ్జెట్లో బిసిలకు న్యాయం చేయాలి, కేటాయించిన నిధులు పూర్తిగా విడుదల చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. ఈ డిమాండ్లతో ధర్నాలు, నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. బిసి సమాజంలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబం. బడ్జెట్ అంటే కేవలం లెక్కల సమాహారం కాదు.. ప్రజల ఆశయాలకు అద్దంపట్టే రాజకీయ పత్రం. నిజానికి బడ్జెట్ అనేది ఆదాయ- వ్యయాల పట్టిక మాత్రమే కాదు. ఒక రాష్ట్రం ఏ దిశగా పయనిస్తుందో, ఎవరి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటుందో చెప్పే సామాజిక- ఆర్థిక దిశానిర్దేశం. అందుకే బడ్జెట్ను అంకెల గణితం కాదు -న్యాయం, ప్రాధాన్యత, పాలనా సంకల్పానికి ప్రతిబింబంగా చూడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం ప్రజల్లో ఆశలు రేపింది. దాని అంతరార్థం, వనరుల సమాన పంపిణీ, అవకాశాల్లో సమానత్వం, బహుజనులకు న్యాయం. కానీ దశాబ్దం గడిచినా నిధులు అనే అంశం బిసిలకు అందని ద్రాక్షగానే మిగిలింది. 2014-15లో రూ. 1 లక్ష కోట్ల బడ్జెట్. 2025- 26 నాటికి రూ. 3 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే అదే నిష్పత్తిలో బిసిల అభివృద్ధిపై ఖర్చు పెరగలేదు. ఇది సాధారణ లోపం కాదు, నిర్మాణాత్మక అన్యాయం. సంఖ్యలు పెరిగినా.. న్యాయం పెరగకపోతే ఆ అభివృద్ధికి అర్థం ఏమిటి? 2014 నుంచి 2023 వరకు బిఆర్ఎస్ పాలనలో కేటాయింపు రూ.44,940 కోట్లు, ఖర్చు రూ.26,645 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ పాలనలో గత రెండు సంవత్సరాల్లో కేటాయింపు రూ. 21,600 కోట్లు, ఖర్చు సుమారు రూ. 5,000 కోట్లు. కార్పొరేషన్ల పతనం- స్వయం ఉపాధికి దెబ్బ. బిసి కార్పొరేషన్లు 2014-23 లో రూ. 2,642 కోట్లు కేటాయించారు. గత రెండు సంవత్సరాల్లో రూ. 1,363 కోట్లు ఖర్చు చేశారు. విడుదల సున్నా. ఎంబిసి కార్పొరేషన్లు 2017- 23లో రూ. 4,100 కోట్లు కేటాయించారు. రూ. 21 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. గత రెండు సంవత్సరాల్లో రూ. 810 కోట్లు. బిసి కాస్ట్ ఫెడరేషన్లు 2014- 23లో రూ. 1,994 కోట్లు కేటాయించారు. రూ. 315.84 కోట్లు ఖర్చు చేశారు. గత రెండు సంవత్సరాల్లో రూ. 2,245 కోట్లు. ఈ పరిస్థితి వల్ల స్వయం ఉపాధి అవకాశాలు క్షీణించాయి. ఇది కేవలం ఆర్థిక లోటు కాదు, సామాజిక న్యాయానికి ఎదురు దెబ్బ. సమస్య డబ్బుల కొరత కాదు.. ప్రాధాన్యతలలో పక్షపాతం ప్రభుత్వం చెబుతోంది -రెవెన్యూ సరిపోవడం లేదు అని. కానీ వాస్తవం ఏమిటి? భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు డబ్బు ఉంది. ప్రచార ఆర్భాటాలకు డబ్బు ఉంది. ఆడంబరాల ఈవెంట్లకు డబ్బు ఉంది. కానీ బిసి స్వయం ఉపాధికి డబ్బు లేదు. కార్పొరేషన్లకు విడుదలకు డబ్బులు లేవు. అంటే సమస్య వనరుల కొరత కాదు, బిసి లంటే చిన్న చూపు. వారు ఏమీ చేయలేరనే అహంకార భావన. రైతు పథకాలలో అసమానత, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలలో బిసిల కంటే ఒసిలకే ఎక్కువ లబ్ధి అందుతోంది. తెలంగాణలో సుమారు 50 లక్షల మంది భూమిలేని బిసి కుటుంబాలు ఉన్నాయి. వారికి ఈ పథకాల ద్వారా ఒక్క రూపాయి కూడా అందడం లేదు. అయితే వారు ఎలా ఎదగాలి? ఇదే అసలు ప్రశ్న. పారదర్శకత లేకుండా సంక్షేమం అర్థరహితం. మా ప్రధాన డిమాండ్లు: సంక్షేమ పథకాలలో కులవారీ డేటా విడుదల చేయాలి. ఎవరికెంత లబ్ధి అందిందో వెల్లడించాలి. ఆ లెక్కలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సమానత్వం అంటే భూమి ఎక్కువ ఉంటే ఎక్కువ భూమి లేని నిరుపేద చేతివృత్తుల వారికి సున్న అనేది సామాజిక న్యాయం కాదు. కామారెడ్డి హామీ -అమలులో వైఫల్యం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రతి సంవత్సరం రూ. 20,000 కోట్లు, ఐదు సంవత్సరాల్లో రూ. 1 లక్ష కోట్లు. వాస్తవంగా గత రెండు సంవత్సరాల్లో చేసిన ఖర్చు కేవలం రూ. 5,000 కోట్లు. ఇంకా రూ. 20,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తోంది. ముందున్న బడ్జెట్- మళ్లీ అదే గారడీనా? మళ్లీ భారీ కేటాయింపులు ప్రకటించే అవకాశం ఉంది.కానీ ప్రజల ప్రశ్న ఒకటే. ఈసారి నిధులు నిజంగా విడుదల అవుతాయా? లేక మళ్లీ అంకెల గారడీగానే మిగిలిపోతాయా? ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు: ఆడంబరాల ఖర్చులు తగ్గించాలి. ప్రచార వ్యయాలను నియంత్రించాలి. ఆ నిధులను బిసి సంక్షేమానికి మళ్లించాలి. రైతు పథకాల కోసం అప్పులు తెచ్చినట్లే- బిసిల సంక్షేమానికి కూడా నిధులు సమకూర్చాలి. మా డిమాండ్లు: బిసిలకు కేటాయించిన నిధులు 100% విడుదల చేయాలి. జ్యోతిబా ఫూలే సబ్ ప్లాన్ అమలు చేయాలి. బిసి కార్పొరేషన్లకు కనీసం రూ. 50,000 కోట్లు కేటాయించాలి. స్వయం ఉపాధి పథకాలను పునరుద్ధరించాలి. కులవారీ లబ్ధిదారుల డేటా విడుదల చేయాలి. జనాభా నిష్పత్తిలో బిసిలకు బడ్జెట్ వాటా ఇవ్వాలి. బిసిలను కేవలం ఓటుబ్యాంక్గా ఉపయోగించడం ఇక ఆగాలి. బడ్జెట్లో న్యాయం జరగకపోతే- తెలంగాణ రైజింగ్ 2047, 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వంటి లక్ష్యాలు బిసిలకు అర్థరహితంగా మారిపోతాయి. ఇప్పటికే ఆర్థిక అసమానతలు పెరిగాయి. బిసిలు ప్రభుత్వ తాయిలాల మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్లో అంకెలు కాదు, నిజంగా నిధుల విడుదలే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. బడ్జెట్లో బిసిలకు వాటా ఇవ్వడం ఉపకారం కాదు, -అది వారి హక్కు. కేటాయింపులు చేసి విడుదల చేయకపోవడం, ప్రకటనలు చేసి అమలు చేయకపోవడం, ఇది పరిపాలనా వైఫల్యం కాదు, ప్రజలను మోసం చేసే రాజకీయ ధోరణి. ఇక ప్రశ్న ఒక్కటే, బిసిలు మళ్లీ మోసపోతారా? లేక తమ హక్కుల కోసం సంఘటితంగా నిలబడి చరిత్రను మార్చుతారా? నిధులు అడుగుతున్నది కాదు.- తమ హక్కు, తమ వాటా, తమ గౌరవం కోరుతున్నారు. - టి. చిరంజీవులు విశ్రాంత ఐఎఎస్, (బిసి మేధావుల ఫోరం చైర్మన్)
Telangana : భట్టి బడ్జెట్ లో ఈ సారి వీటికే పెద్దపీట.. పద్దుల్లో అగ్రస్థానం వీటిదే
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థికి సన్మానం..
జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థికి సన్మానం.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా ఉచితాలు ప్రకటించడంపట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల రాష్ట్రాలను తీవ్రంగా హెచ్చరించింది. అటువంటి నిర్ణయాలు ప్రకటించే సమయాన్ని, ఆర్థిక తర్కాన్ని ప్రశ్నించింది. అవసరమైనవన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే ప్రజలు ఎందుకు పనిచేయాలి? అన్ని ఉచితంగా వస్తుంటే వాళ్ళు పనిచేయడం ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ఎన్నాళ్లీ ఉచితాల అమలు? ఇదేనా మనం చేసే జాతి నిర్మాణం? రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దాదాపుగా రెవెన్యూ లోటు లోనే ఉన్నా, ఈ పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాయంటూ సుప్రీం ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం కొత్తగా ప్రతిపాదించిన విద్యుత్ సవరణ నిబంధనలు 2024 లోని రూల్ 23ను సవాలు చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఈ కేసులో సుప్రీం కోర్టు దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలను హెచ్చరించినట్లేనని స్పష్టం అవుతుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ కేసును ఉద్ఘాటిస్తూ.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం మంచిదే. కానీ దానికి మూల్యం ఎవరు చెల్లించాలి? ఈ పథకాల అమలు కోసం ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది. అదంతా పన్ను చెల్లింపుదారులదే కదా? అంటూ అన్ని రాష్ట్రాలకు చురకలంటిచ్చినట్లు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీల మేనిఫెస్టోపై చర్చ అనవసరం. సంక్షేమం, ఉచితాలు రెండు విభిన్న దృక్పథాలు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వాల బాధ్యత. కానీ, రాజకీయ పార్టీలు సంక్షేమం ముసుగులో ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఉచితాలు ప్రకటిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా అందలం ఎక్కేందుకు తొలుత తమ తలతాకట్టు పెట్టైనా హామీలను మీ గడపలకు చేరుస్తామని ప్రగల్భాలు పలికి అనంతరం ఆశతో అధికారమిచ్చిన ప్రజల తలపైనే చేతులు పెడుతున్న తీరును నేటి ప్రభుత్వాల్లో గమనిస్తున్నాం. ఒక నిర్దిష్టమైన ఆర్థిక విధానం అంటూ లేకుండా, అయితే అప్పులు చేస్తూ, లేకపోతే ధరలు పెంచుతూ ప్రజలను నయవంచనకు గురి చేస్తున్నాయి. ఉచితాల అంశాన్ని తెర మీదికి రావడానికి కారణమైన తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల 100 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ నిబంధనలు- 2024 లోని నిబంధన 23 మేరకు ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో తమిళనాడు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రస్తావిస్తూ.. నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని, ఈ భారం ప్రభుత్వం స్వీకరించడం ఎంత వరకు ప్రజా ప్రయోజనం, విద్యుత్ బిల్లు చెల్లించే శక్తి ఉన్నవారికి, లేనివారికి మధ్య ప్రామాణికం ఏంటి? సంక్షేమ రాజ్యంగా అణగారిన వర్గాలు, అవసరమైన వారికి సాయం చేయడాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. దాన్ని సమాజం కూడా అదే రీతిలో స్వాగతించాలి. కానీ కొందరు వ్యక్తులు అన్ని ఉండి కూడా తమ పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వం అమలుచేసే పథకాలు, ఉచితాలు తమ జేబుకే చేరాలనుకునేవారు సమాజంలో అనేక మంది ఉండడమే ఆందోళన కలిగించే విషయం. తెలంగాణ రాష్ట్రంలో కూడా 200 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నరు. రాష్ట్రంలోని కొన్ని లక్షల కుటుంబాలకు ఉపశమనం కలిగించే విషయమే. ప్రభుత్వం బాధ్యతగా భరోసాను కల్పించే పథకమే ప్రవేశపెట్టింది. కానీ ఏ స్థాయిలో ఈ పథకం ఉపయోగపడుతుందో అదే స్థాయిలో బిల్లు కట్టే స్థోమత ఉన్నవారికి కూడా అందించడం అసలు పథకం సార్థకతను ప్రశ్నించే విధంగా ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పునఃసమీక్షించాల్సిన అవసరాన్ని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తోంది. వాస్తవానికి ఉచిత పథకాలు సమాజానికి ప్రమాదమే. ఎప్పడు ప్రమాదం అంటే అన్నీ ఉన్నవారికి కూడా ఇచ్చినప్పుడు, కడుపునిండా తినే స్థోమత ఉన్నవాడికి ఇచ్చినప్పుడు, ఈ ఉచితాలు తప్పక నిరుపయోగమే. కానీ బొక్కలుతేలి ఆకలిని అలవాటుగా మార్చుకుని తన దైనందిన జీవితాన్ని తప్పక కొనసాగిస్తున్న పేదవానికి ఉచితం అందితే అది తప్పక అమృతం అవుతుందే కానీ విషం కాదు. మన తెలంగాణ రైతాంగం అంటేనే రాష్ట్రం ఏర్పడే నాటికి ఒక రకమైన అభిప్రాయం అప్పుల ఊబిలు, ఉరికొయ్యలు, పురుగుల మందు డబ్బాలు, - బీడు భూములు, కరెంటు కోతలు, అడుగంటిన బోరుబావులు ఇది ఒక్క మాటలో చెప్పాలంటే మన రైతుల సమగ్ర స్వరూపం. ఏదిఏమైనా రాష్ట్రం ఏర్పడ్డాక పెట్టుబడికి రైతుబంధు డబ్బులు మాత్రం ఒక గొప్ప ధీమాను కల్పించాయని చెప్పడానికి ఒక్కటా రెండా అనేక జీవితాలు నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉన్నాయి. ఈ పథకం సైతం అమలు విషయంలో దుర్వినియోగం అయింది. ఇప్పటివరకు రైతులకు నష్టం కంటే లాభం ఎక్కువగా చేసిన పథకం ఏదైనా ఉంది అంటే అది ఇదే. రాష్ట్రంలో లక్షలాది మంది వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆసరా పింఛన్ల పథకంతో ప్రతి నెల ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చకపోయినా ఆయా వర్గాలను ఆత్మవిశ్వాసంతో బతకడానికి అవసరమైన ధీమాను ఈ పథకం కల్పించింది. రాజ్యం ఇదొక మానవీయ పథకంగా భావించాలే తప్ప ఉచితంగా పరిగణించవద్దు. పెద్దపెద్ద పారిశ్రామిక కుటుంబాలకు వేలకోట్ల రూపాయల రుణాలను రైట్ ఆఫ్ చేసిన దేశ పాలకులు సైతం ఉచిత పథకాలను విమర్శిస్తున్నారు. తమకు అందని ఉచిత పథకం ఏదైనా వృథానే అనిపించడం మామూలే. అతి ఎప్పుడైనా కొంపకు చేటే అన్నట్లు అనవసరమైన ఉచితం వ్యవస్థ ఉనికికే ముప్పు. ఈ సందర్భంగా మనందరం గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే ఉచిత హామీల అమలు కోసం ఎంత మొత్తంలో ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. అందుకు నిధుల సమీకరణ ఎలా జరుగుతుంది అన్న ప్రశ్నలు సంధించుకుని మనకు మనమే సమాధానం చెప్పుకుంటే తప్ప మనకు మనం తెలుసుకోలేం. అర్థం కాదు కూడా ఈ ఉచితాల ముసుగు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, ఉచితాలతో ప్రజలను భ్రమల్లోకి నెట్టకుండా, వారి జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చే దిశగా ప్రణాళికలు రూపొందించాలి. - పిన్నింటి విజయ్ కుమార్ 90520 39109
చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్ #TrafficRules #Challan #DrivingLicense #RC
రంజాన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు సెలవు దినం ప్రకటించింది
Rain Alert : రెండు రాష్ట్రాల్లో నేడు కూడా వానలు.. చల్లటి వాతావరణం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది
దుబాయ్ మహా నగరాన్ని ఇరాన్ యుద్ధం కళా విహీనమయింది.
సిరిసిల్లలో డీజిల్తో మండే పొయ్యి #Sircilla #DieselStove #Innovation #HotelBusiness #Telangana
మున్సిపాలిటీ అయినా మారని తిప్పలు..!
మున్సిపాలిటీ అయినా మారని తిప్పలు..! -డ్రైనేజీ దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నకాలనీ-ఫిర్యాదులు చేసినా స్పందన
ఫోన్ చూడొద్దన్నందుకు ట్యాంక్ ఎక్కి... ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఇంటర్ విద్యార్థిని
కామారెడ్డి: ఫోన్ ఎక్కువగా చూడొద్దని తల్లిదండ్రులు చెప్పినందుకు ఓ బాలిక ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అనంతరం పోలీసులు, సబ్ కలెక్టర్ అక్కడికి చేరుకొనని బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి కిందకు తీసుకొచ్చారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతం మహ్మద్నగర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బూర్గుల్ గ్రామంలో స్రవంతి అనే విద్యార్థి ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో ఇంటి దగ్గరే ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చూస్తుండడంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. కోపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి నీటి ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు, సబ్ కలెక్టర్ కిరణ్మయి అక్కడికి చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు ఏమీ అనకుండా తాను చూసుకుంటానని సబ్ కలెక్టర్ చెప్పడంతో ఆమె కిందకు దిగింది. తల్లిదండ్రులు, బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలకు ఫోన్లు అలవాటు చేయొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026కు త్వరలోనే తెరలేవనున్న సంగతి తెలిసిందే. ఈసారి బరిలో ఉన్న పది జట్లు కూడా ట్రోఫీ సాధించడమే లక్షంగా పోరుకు సిద్ధమవుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ విజేతలు ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు ఫేవరెట్గా కనిపిస్తున్నాయి. అన్ని జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. అయితే ఇతర జట్లతో పోల్చితే సన్రైజర్స్ టీమ్లో అత్యంత విధ్వంసక బ్యాటర్లు ఉన్నారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు తమ విధ్వంసక బ్యాటింగ్తో ఐపిఎల్లో ఎన్నో రికార్డులను తిరగ రాశారు. కొన్ని సీజన్లుగా వీరు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు.తొలి బంతి నుంచే ప్రత్యర్థి జట్ల బౌలర్లపై విరుచుకు పడడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ సీజన్లో కూడా హెడ్, అభిషేక్లు ఐపిఎల్కు ప్రత్యేక ఆకర్షణగా మారారు. రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోవడంతో సన్రైజర్స్ బౌలింగ్ బలహీనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్నే నమ్ముకుంది. అభిషేక్, హెడ్లు ఎలా ఆడతారనే దానిపైనే జట్టు గెలుపోటములు ఆధారపడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అసాధారణ బ్యాటింగ్తో చెలరేగి పోవడం ఇద్దరి ప్రత్యేకత. ఎంతటి పెద్ద బౌలర్కైనా చుక్కలు చూపించే సత్తా వీరికుంది. ఐపిఎల్లో వీరిని మించిన విధ్వంసక ఓపెనర్లు ఎవరూ లేరంటే అతిశయోక్తి లేదు. ఈసారి కూడా ఇద్దరు తమ మార్క్ బ్యాటింగ్తో చెలరేగేందుకు సిద్ధమయ్యారు. హెడ్, అభిషేక్లు చెలరేగితే ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్కప్లో అభిషేక్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. ఇది కాస్త కలవరానికి గురి చేస్తోంది. అయితే ఐపిఎల్కు వచ్చే సరికి చెలరేగి పోవడం అభిషేక్కు అలవాటు. ఈసారి కూడా అదే సంప్రదయాన్ని కొనసాగించాలనే పటక్టుదలతో ఉన్నాడు. హెడ్ కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు.
Vishwambara Release Puzzle Continues
Megastar Chiranjeevi has completed the shoot of Vishwambara long ago and the film’s release is almost delayed by a year. Sankranthi 2025 release was pushed to avoid clash with Ram Charan’s Game Changer and the film was planned for a summer 2025 release. Soon, Megastar announced that the film’s release was delayed due to the […] The post Vishwambara Release Puzzle Continues appeared first on Telugu360 .
రంజాన్ కానుకలు.. -ముస్లిం సోదరులకు ఈద్ కానుకలు అందజేత-పాల్గొన్న సర్పంచ్ మంతెన హరిత
ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ ఊచకోత మొదలైంది. ’గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా.. భారీ అంచనాల నడుమ ఉగాది కానుకగా గురువారం థియేటర్లలో అడుగుపెట్టింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఇలా అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడం కాకుండా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ “ఇదొక మాస్ ఎంటర్టైనర్ కాబట్టి, ఓవర్సీస్ నుంచి పాజిటివ్ టాక్ రావడానికి కొంచెం సమయం పడుతుంది అనుకున్నాను. కానీ, మొదటి షో నుంచే అన్ని ప్రాం తాలలో పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉంది. సినిమా చూసిన వారిలో చాలామంది.. సినిమాలో ఇంత కం టెంట్ ఉందని మాకు ముందు తెలియదు అంటూ ఆశ్చర్యపోతున్నా రు. కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందు లో కొన్ని మంచి అంశాలు చూపించాము. ముఖ్యంగా మన తెలుగు సినిమాలో ఇంతవరకు చూపించని అక్రమ వలసదారులు అంశం గురించి సినిమాలో చర్చించాము. పాత్రలు బాగా పండాయి. ప్రతి పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు”అని అన్నారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ “ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఈ స్థాయి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ఇంకా చూడనివాళ్ళు థియేటర్ కి వెళ్ళి చూడండి. ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకు లు మెచ్చేలా ఈ సినిమా ఉంది. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చూపించారు. హరీష్ శంకర్ ఎంతో బాధ్యతగా గబ్బర్ సింగ్ ని మించేలా సినిమాని రూపొందించారు. ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ యలమంచిలి, ఆనంద్ సాయి, చంద్రబోస్ పాల్గొన్నారు.
రైతు ఉత్సవాలకు రేవంత్ కు ఆహ్వానం
ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు
ఆత్మయోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. కోడూరు, ఆంధ్రప్రభ : ఆత్మ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
Chandrababu : నేడు తిరుమలకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు వెళ్లనున్నారు
వినూత్న రీతిలో ఉగాది వేడుకలు... ముత్యాలమ్మకు బోనాలు.. ఎడ్ల బండ్ల ప్రదర్శన
బోనాలతో మహిళలు మన తెలంగాణ/మోత్కూర్ : రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో వినూత్న రీతిలో ఉగాది వేడుకలు జరిగాయి. ఉగాది పండగంటే షడ్రుచులతో ఉగాది పచ్చడి, భక్షాలు , మోత్కూర్ లో మాత్రం అందుకు భిన్నంగా ఉగాది పచ్చడి తో పాటు ముక్క, చుక్క తో ఉగాది వేడుకలు జరుగుతాయి. చెరువు కట్ట మీది ముత్యాలమ్మ కు, పడమటి ముత్యాలమ్మ లకు ఆడపడుచులు బోనాలతో ప్రదర్శనగా వెళ్లి అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. తమ కుటుంబాలు పాడి పంటలు చల్లంగా చూడాలని పూజలు చేశారు. మున్సిపల్ కేంద్రం లోని ఉన్నత పాఠశాల ఆవరణలో అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కార్లు,ఆటోలు ప్రదక్షిణలు చేశారు. సిఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న లు ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మున్సిపల్ అధికారులు, పాలక వర్గం ఉగాది వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఘనంగా ఉగాది వేడుకలు... మోత్కూర్ మున్సిపాలిటి పరిధిలోని బుజిలాపురం, కొండగడప , ధర్మాపురం లతో పాటు మండలంలోని అనాజీపురం,పాటిమట్ల, దత్తప్పగూడెం, పాలడుగు, ముషిపట్ల, రాగి బావి, పనకబండ,సదర్శాపురం,దాచారం, పొడిచేడు గ్రామాల్లో ప్రజలు భక్తులు ప్రత్యేక పూజలు జరిపి ఉగాది పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. బుజిలాపురం లో కంఠ మహేశ్వర స్వామికి బోనాలు సమర్పించారు..కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, గ్రామాల సర్పంచ్ లు ,ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు ఆలయ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tirumala : తిరుమలకు వచ్చేభక్తులు నేడు రెండు కిలోమీటర్లకు అవతలే
తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది
సీనియర్ జర్నలిస్ట్ పూర్ణకు నివాళి..
సీనియర్ జర్నలిస్ట్ పూర్ణకు నివాళి.. విజయవాడ, పటమట. ఆంధ్రప్రభ : అనారోగ్యంతో మృతి
Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది.
Uttar Pradesh : భయపడిన భర్త...ప్రియుడితో భార్యను పంపించిన వైనం
ఉత్తర ప్రదేశ్లో విచిత్రమైన ఘటన జరిగింది
ప్రధాన కార్యదర్శిగా పి సతీష్ రెడ్డి నియామకం..
ప్రధాన కార్యదర్శిగా పి సతీష్ రెడ్డి నియామకం.. కడెం ( నిర్మల్ జిల్లా),
క్షణికావేశంలో ఆత్మహత్య... ఇద్దరికి వెలుగునిచ్చిన వర్షితా
మరణించి జీవిస్తున్న వర్షిత ఇద్దరు అందులకు చూపినిచ్చిన జనహిత సేవా సమితి మన తెలంగాణ / బెల్లంపల్లి టౌన్ : తాను మరణించినా ఇద్దరు అందులకు వెలుగునిచ్చిన వర్షిత కుటుంబాన్ని జనహిత సేవా సమితి అభినందించారు. బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్ బస్తీకి చెందిన లింగంపెల్లి వర్షిత (12) ఆత్మహత్య చేసుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్లు వారి కుటుంబ సభ్యులను కలిసి వర్షిత నేత్రాలను నేత్రదానం చేయడానికి సభ్యులను ఒప్పించారు. కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండి ఇద్దరు అంధులకు జీవితంలో వెలుగులు నింపిన వర్షిత కుటుంబాన్ని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షులు ఆడెపు సతీష్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి రమేష్లు మాట్లాడుతూ... సమాజహితం కోరి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు వారి కూతురు నేత్రాలను దారం చేయడం సంతోషకరమన్నారు. జనహిత సేవా సమితి తరుపున ఇప్పటి వరకు 12 నేత్ర దానాల కార్యక్రమాలు నిర్వహించారు. వారి కుటుంబ స్ఫూర్తితో ప్రజలందరు మరణించిన తర్వాత అవయవాలను దానం చేసి సమాజానిక ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని వారు కోరారు. సదాశయ ఫౌండేషన్ వారి సహకారంతో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకు సిబ్బంది నేత్రాలను స్వీకరించి వారి కుటుంబాన్ని అభినందించారు. జనహిత సేవా సమితి ఆద్వర్యంలో 8 మంది ప్రాణాలను కాపాడే అవకాశం, రక్తదానంతో ఎంతో స్పూర్తిదాయకంగా వైద్యశాలకు వారి మృతదేహాన్ని అందిస్తే వైద్య విద్యార్ధులకు బోధనకు ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ప్రజలందరు అపోహలు వీడి నేత్ర, అవయవ, శరీర దానాలకు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి సభ్యులు అంధుల రాజన్న, ఎల్ వి ప్రసాద్ బ్యాంకు సిబ్బంది, జనహిత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. వర్షిత తన స్నేహితురాలుకు ఆర్థిక సాయం చేసింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు కానీ డబ్బులు ఎలా ఇస్తావని తండ్రి ఆమెను ప్రశ్నించడంతో వర్షిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
20thMarchCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
20thMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 20thMarchCartoon | గ్యాస్ సంక్షోభం తీవ్రత
America - Israel - Iran War : యుద్ధంతో నిలిచిన చమురు రవాణా.. ప్రపంచంలో ఇంధన కొరత
అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతుంది
Israel - Iran War : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్రం.. ఇంకా ఎన్నాళ్లు?
ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఇరవై రోజులయింది
అందుకే.. టెన్త్ ఇంగ్లీష్ పరీక్ష వాయిదా..
అందుకే.. టెన్త్ ఇంగ్లీష్ పరీక్ష వాయిదా.. విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రంజాన్
యోగా గురువుకు ఉగాది పురస్కారం..
యోగా గురువుకు ఉగాది పురస్కారం.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : యోగా – సేవా
పూజల పేరుతో మహిళపై పలుమార్లు అత్యాచారం.... 58 అశ్లీల వీడియోలు వెలుగులోకి
ముంబయి: పూజల పేరుతో ఓ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అశోక్ ఖరాత్(67) అనే వ్యక్తి పూజలు చేయడంతో పాటు జ్యోతిష్యం చెప్పేవాడు. తన వద్దకు బాధలతో వచ్చిన వారికి పూజాలతో సమస్యలను పరిష్కరించేవాడు. నాసిక్ లో ఆధ్యాత్మిక వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది. అతడి నుంచి రాజకీయాలు ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఓ మహిళకు ఇంట్లో సమస్యలు ఉండడంతో అతడిని కలిసి తన బాధాలను చెప్పుకుంది. పూజల పేరుతో మహిళకు మత్తు మందు ఇచ్చారు. అనంతరం ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. మత్తు మందు ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అశోక్ ఇంట్లో ఉన్న పెన్ డ్రైవ్ తో పాటు లాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు. పెన్ డ్రైవ్ లో 58 అసభ్యకరమైన వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అశోక్ కుమార్ బెడ్ రూమ్ లో రహస్య కెమెరాలు ఉన్నట్టు గుర్తించారు. గతంలో తాను నేవీ లో పని చేశానని అందరికి చెప్పుకునేవాడు.
చిట్యాల సుజన థియేటర్లో ఉద్రిక్తత..
చిట్యాల సుజన థియేటర్లో ఉద్రిక్తత.. చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల
దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది బాధ్యతల మార్పులు..
దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది బాధ్యతల మార్పులు.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి
రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు..
రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు.. చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల
రూ.3.26 లక్షల కోట్లతో నేడు బడ్జెట్
మన తెలంగాణ/హైదరాబాద్: నేడు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం రూ.3.26 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపె ట్టే అవకాశం ఉందని తెలిసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే, ఈ బడ్జెట్లో ప్రధానంగా ప్రభుత్వం మూడు రంగాలు, ఆరు పథకాలపై దృష్టి పెట్టినట్లుగా సమాచారం. దీంతోపాటు తెలంగాణ విజన్- 2047 డాక్యుమెంట్లో ని పలు అంశాలకు సంబంధించి ప్రత్యేక నిధు లు కేటాయించనున్నట్టుగా తెలిసింది. నేడు ఉ.9:30 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ అయి బ డ్జెట్కు ఆమోదం తెలిపిన తర్వాత మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్కు సంబంధించి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే అధికారులతో సమావేశమై రం గాల వారీ కేటాయింపులు, కొత్త పథకాల ప్రకట న, అంచనాలను ఖరారు చేశారు. అయితే, కేటాయింపులు, పథకాలకు సంబంధించి సిఎం రేవంత్రెడ్డి కీలక మార్పులు సూచించడంతో ఈ ప్రతిపాదనలను డిప్యూటీ సిఎం భట్టి ఖరారు చేసినట్టుగా తెలిసింది. సంక్షేమం, అభివృద్ధి, దీర్ఘకాలిక వృద్ధి అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వం రూపొందించినట్లుగా తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడో బడ్జెట్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడో బడ్జెట్. ఈ నేపథ్యంలోనే ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా అ మల్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే, రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త పథకాలను కూడా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలిసింది. కొత్త పథకాల్లో భా గంగా విద్యార్థుల కోసం యంగ్ ఇండియా కి ట్స్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లతో సహా ఆ రు కొత్త పథకాలను ప్రభుత్వం ప్రకటించనున్నట్టుగా సమాచారం. అయితే, రాష్టంలో కీలకమై న సంక్షేమం, వ్యవసాయం, నీటి పారుదల రం గాలకు సైతం బడ్జెట్లో ప్రభుత్వ పెద్దపీట వేయనున్నట్లుగా తెలిసింది. ఈ రంగాలకు భారీగా కేటాయింపులు చేయనున్నట్లుగా సమాచారం. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించినట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థినీలకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లు యంగ్ ఇండియా కిట్స్ కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో సంక్షేమ హాస్టళ్ల నుంచి సమీకృత గురుకుల సంస్థల వరకు ఉన్న విద్యార్థినీలకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను అందించడమే ప్రభుత్వ ఉద్ధేశ్యంగా తెలుస్తోంది. ఎన్నికల హామీలకు అనుగుణంగా, ప్రభుత్వం బాలికా విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ, పాడి రైతులకు రాయితీపై పశువుల సరఫరాను కూడా ఈ బడ్జెట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆర్థిక సాధికారతపై దృష్టి సారించడంతో పాటు, మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమానికి ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్టుగా సమాచారం. కాలేజీ యువతులకు ఈవీ స్కూటీలను.. గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది. వచ్చే ఏడాది ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాదితో పోలిస్తే ఈసారి కాస్త అధికంగానే సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఈసారి బడ్జెట్ రూ.3.26 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ బడ్జెట్లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళా సంక్షేమం, సన్న బియ్యం కోసం భారీగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం అయినట్లుగా సమాచారం. ఇక, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కోసం ఈ బడ్జెట్లో నిధులను కేటాయించనున్నట్టు తెలిసింది. వీటితో పాటు తుమ్మిడిహెట్టి, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, కొడంగల్ నారాయణ్పేట్ ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్బిసిలకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాలేజీ యువతులకు ఈవీ స్కూటీలను ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో దీనికోసం నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమ యుద్ధం అత్యంత భీకర రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఆయా దేశాల్లోని సైనిక, వైమానిక, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యక్తులనే లక్షంగా చేసుకున్న ఇరు పక్షాలు తాజాగా ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇజ్రాయె ల్ తన కీలక సహజ వాయు క్షేత్రంపై దాడి చేసిన నేపథ్యంలో, ఇరాన్ ప్రతీకార చర్యల ను మరింత ముమ్మరం చేసింది. గురువా రం గల్ఫ్ ప్రాంతంలోని పలు ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జ రిపింది. సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్ర తీరంలోని రిఫైనరీపై దాడి చేయగా ఖతార్లోని ఎల్ఎన్జీ కేంద్రాల్లో, కువైట్లోని రెం డు చమురు శుద్ధి కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ పరిణామాలు మ ధ్యప్రాచ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చే శాయి. గురువారం నాడు ఖతార్ రాజధాని దోహాకు దగ్గర్లోని రస్ లఫాన్లో ఉన్న అత్యంత భారీ గ్యాస్ చమురు క్షేత్రంపై దాడి చేసింది. ఇక్కడి నుంచే ఆసియా, ఐరోపా ఖండాలకు భారీ మొత్తంలో ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయు క్షేత్రంగా భావించే సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇరాన్ దాడులకు దారి తీసింది. ఇరాన్ విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 80 శాతం దీనిపైనే ఆధారపడటం వల్ల, ఈ దాడి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కువైట్లోని మీనా అల్- అహ్మది రిఫైనరీపై డ్రోన్ దాడితో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా, సమీపంలోని మీనా అబ్దుల్లా రిఫైనరీ కూడా మంటల్లో చిక్కుకుంది. సౌదీలోని అరామ్ కో రిఫైనరీపై కూడా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరానికి సమీపంలో ఒక నౌక అగ్నికి ఆహుతి అయ్యింది. ఖతార్ సమీపంలో మరో నౌక దెబ్బతింది. హార్ముజ్ మార్గాన్ని తప్పించేందుకు సౌదీ అరేబియా ఎర్ర సముద్ర మార్గం ద్వారా చమురు సరఫరాను పెంచుతుండగా యన్బూ నగరంలోని సమ్రెఫ్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో ఆ రహదారి భద్రత ప్రశ్నార్ధకమైంది. అబూదాబిలోని హబ్షాన్ గ్యాస్ సదుపాయం, బాబ్ ఆయిల్ ఫీల్డ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇరాన్ దాడులను అధికారులు ప్రమాదకర ఉద్రిక్తత పెరుగుదలగా అభివర్ణించారు. ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి. సౌదీ విదేశాంగ మంత్రి ఇప్పుడు ఉన్న కొద్దిపాటి నమ్మకమూ పోయింది అని వ్యాఖ్యానించారు. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్లో పలు ప్రాంతాల్లో ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగడంతో లక్షలాది ప్రజలు బంకర్లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. వెస్ట్బ్యాంక్లో జరిగిన దాడిలో నలుగురు పౌరులు మృత్యువాతపడ్డారు. కొన్ని భవనాలకు నష్టం కలిగినప్పటికీ, పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగలేదు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 20కిపైగా నౌకలపై దాడులు జరిగినట్లు సమాచారం. హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా తీవ్రంగా తగ్గిపోయింది. ఇరాన్లో ముగ్గురికి మరణశిక్ష జనవరిలో జరిగిన నిరసనల సమయంలో అరెస్టైన ముగ్గురికి ఇరాన్ మరణదండన విధించి అమలు చేసింది. మానవ హక్కుల సంఘాలు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్లో 1,300 మందికి పైగా మరణించగా, లెబనాన్లో సుమారు 968 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్లో 15 మంది మృతి చెందారు. అమెరికా సైనికుల్లో కనీసం 13 మంది మరణించినట్లు సమాచారం. చమురు ధరలపై ప్రభావం ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్కు 114 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి చమురు ధరలు దాదాపు 57 శాతం పెరిగాయి. మరోవైపు హర్మూజ్ నుంచి తమ అనుమతితో వెళ్తున్న పలు దేశాల నౌకలపై టోల్ విధించాలని ఇరాన్ భావిస్తోంది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్న ఇరాన్ చట్ట సభ్యుడొకరు వెల్లడించారు. తదునుగుంణగా బిల్లులు తీసుకురానున్నట్టు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఇజ్రాయెల్, అమెరికా నౌకలపై హర్మూజ్ను జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
బొగ్గు పొయ్యిలకు సిద్ధంగా ఉండండి
న్యూఢిల్లీ: గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో చి న్న, మధ్యతరహా, ఇతర వినియోగదారుల కు రాష్ట్రాలకు బొగ్గు కేటాయింపు విషయం లో కేంద్ర ఆదేశాలిచ్చింది. రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ వంటి సంస్థలకు బొగ్గు మంత్రిత్వశాఖ ఇప్పటికే ఆ దేశాలు ఇచ్చిందని అధికారులు తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్ కట్టడి చేయాలని, 31 రా ష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర సూచనలు చేసింది. గ్లోబల్ సంక్షోభం కారణంగా గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న తరుణంలో భారత ప్రభుత్వం వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. గ్యాస్ వినియోగదారులు ఎల్పిజి నుంచి పిఎన్జి గ్యాస్కు మారాలని ప్రభుత్వం ప్రకటించింది. 15కోట్లకు పైగా పిఎన్జి వినియోగదారులు, లక్షల మంది అర్హులుగా ఉన్నందున ప్రభుత్వం కనెక్షన్లను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. అదే సమయంలో బొగ్గు, కిరోసిన్ ఇంధనాలను కూడా అం దించడం ద్వారా ఎల్పిజి డిమాండ్ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ భవిష్యత్తు కార్యచరణను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో కాంగ్రె స్ పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ శరవేగంగా చర్య లు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) నియామక ప్రక్రియల కు శ్రీకారం చుట్టింది. మొదటి విడతగా రాష్ట్రంలోని 14 జిల్లా లకు సంబంధించి పూర్తి స్థాయి కార్యవర్గ కమిటిలను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గురువారం ప్రకటిం చారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచే ఈ కమిటీల నియామకంపై పార్టీలో అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. నియామకాల్లో ఎలాంటి అసమ్మతి తలెత్తకుండా ఉండేందుకు బుధవా రం రాత్రి వరకు సుదీర్ఘ కసరత్తు చేసి, అన్ని జి ల్లాలకు సంబంధించి స్థానిక ఎంఎల్ఎలు, ని యోజకవర్గ ఇంచార్జీలతో చర్చించి, వారిని స మన్వయ పరుస్తూ ఈ జాబితాను రూపొందించారు. గతంలో వేసిన స్క్రీనింగ్ కమిటీ సూచనలను పాటిస్తూ , పార్టీ కోసం కష్ట డిన వారికి ఈ కమిటీల్లో పెద్దపీట వేశారు. ఈ ప్రకటనలో కేవలం అధ్యక్షులను మాత్రమే కాకుండా, జిల్లా స్థాయిలో పార్టీని నడిపించే పూర్తిస్థాయి యంత్రాంగాన్ని నియమించారు. ప్రతి జిల్లా కమిటీలో వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలతో పాటు ఎగ్జి ్యటివ్ మెంబర్లను నియమించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కమిటీలను ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని అధిష్టానం భావిస్తోంది. తొలి విడతలో 14 జిల్లాలను ప్రకటించగా, మిగిలిన జిల్లాల కమిటీలను కూడా త్వరలోనే వెల్లడిం నున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నిర్మా ణంపై ఎక్కువగా దృష్టి సారిం లని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కమిటీలు పనిచేయాలని హైకమాండ్ ఆదేశాల మేరకే ఈ నియామకాల్లో వేగం పుంజుకున్నట్లు సమాచారం.
మన తెలంగాణ/నంగునూరు: సిద్దిపేట జి ల్లా నంగునూరు మండలం నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వేదికగా గురువారం నిర్వహించిన రైతు మేళా రాజకీయ రణరంగం గా మారింది. ప్రభుత్వ కార్యక్రమం కాస్తా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీయడంతో సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రై తు మేళా ప్రారంభోత్సవ కార్యక్రమానికి శా సన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీ హరి, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీ శ్రావు హాజరయ్యారు. అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. సభా ప్రాంగణం వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి, వారికి నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సభ జరుగుతున్న సమయంలోనూ నినాదాల పర్వం కొనసాగడంతో వేదికపై ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే హరీష్ రావు స్వయంగా జోక్యం చేసుకున్నారు. రైతు సంక్షేమం కోసం జరుగుతున్న ఈ ఉత్సవాల్లో రాజకీయ గొడవలు తగవని, సంయమనం పాటించాలని తమ తమ పార్టీ శ్రేణులకు సూచించారు. నేతల విజ్ఞప్తితో కార్యకర్తలు శాంతించడంతో సభ యధావిధిగా కొనసాగింది. ముఖ్య నేతలు సమన్వయం పాటించడంతో చివరకు రైతు మేళా ప్రశాంతంగా ముగిసింది. అయినప్పటికీ నర్మెట్ట పరిసరాల్లో ఈ రాజకీయ రగడ స్థానికంగా చర్చనీయాంశమైంది. సిద్దిపేట జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది.
కుప్పకూలుతున్న అమెరికా సామ్రాజ్యవాదం
అగ్రరాజ్య ఏకఛత్రాధిపత్యానికి క్రమంగా గండి మొహం చాటేస్తున్న యూఎస్ మిత్రదేశాలు.. డాలర్కు బదులుగా యువాన్లో చమురు వ్యాపారం చేసే యోచన ట్రంప్ యుద్ధ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న …
శుక్రవారం రాశి ఫలాలు (20-03-2025)
మేషం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున చికాకులు తప్పవు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృషభం ఆకస్మిక ధన లాభసూచనలున్నవి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరులతో స్థిరస్థి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు. మిధునం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. అవసరానికి ఇతరులకు ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందికి గురి అవుతారు. దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. సింహం ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది ఋణగ్రస్థుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు .ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కన్య సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి. తుల చిన్న నాటి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంబించి లాభాలు అందుకుంటారు. వృశ్చికం గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఇంటాబయటా పరిస్థితుల్లు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ధనస్సు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పెరిగి నూతన రుణాలు చేస్తారు. బందు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. మకరం నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. కుంభం వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ భారం పెరుగుతుంది. ఇంటా బయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. సంతాన అనారోగ్యం విషయంలో జాగ్రతః వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. మీనం ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు స్వల్ప లాభలు అందుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది.
కనిపించని నెలవంక.. ఎల్లుండి రంజాన్ పండుగ
సోదరులు అత్యంత పవిత్రంగా భక్తిశ్రధ్దలతో జరుపుకునే రంజాన్ పండుగ తేదీ ఖరారైంది. గురువారం ఆ కాశంలో శవ్వాల్ మాసపు నెలవంక ఎక్కడా కనిపించలేదు. దీంతో ముస్లిం లు శుక్రవారం కూడా ఉపవాస దీక్షలను కొనసాగించనున్నారు. శనివారం రంజాన్ పండుగ (ఈద్ఉల్ఫితర్) దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నట్లు రుహిత్-ఎ-హిలాల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, లక్నో వంటి ప్రధాన నగరాల్లో నెలవంక కనిపించలేదు. దీంతో రంజాన్ మాసం 30 రోజులు పూర్తి కానుంది. పండుగను పురస్కరించుకుని శనివారం ఉదయం 10 గంటలకు వివిధ ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యే క ఈద్ ప్రార్థనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని చారిత్రాత్మక మ క్కా మసీదు, పబ్లిక్ గార్డెన్స్ మసీదు, మీర్ ఆలం ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు, భద్ర తా చర్యలపై పోలీసులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సౌదీ అ రేబియా సహా పలు గల్ఫ్ దేశాల్లో శుక్రవారం రంజాన్ పండుగ జరుపుకుంటుండగా, భారత్లో మాత్రం నెలవంక కనిపించని కారణంగా శనివారం వే డుకలు జరగనున్నాయి. ఈ పండుగతో నెల రోజుల కఠిన ఉపవాస దీక్షలు ముగిసి, శవ్వాల్ మాసం ప్రారంభం కానుంది.
తెలంగాణ చట్టసభల్లో విప్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ సమన్వయం కోసం ప్రభుత్వ విప్లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున గొంతుక వినిపించేందుకు, ఎమ్మెల్యే లను ఏకం చేసేందుకు ముగ్గురు సీనియర్ నాయకులను విప్లుగా రేవంత్రెడ్డి సర్కార్ నియమించింది. వీరిలో వేముల వీరేశం (నకిరేకల్), విజయ రమణారావు (పెద్దపల్లి), యెన్నం శ్రీనివాస్రెడ్డి (మహబూబ్ […] The post తెలంగాణ చట్టసభల్లో విప్ల నియామకం appeared first on Visalaandhra .
దిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా
న్యూదిల్లీ: దిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారించింది. ఈడీ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ ఏఎస్జీ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు తన అధికార పరిధిని మించి కొన్ని వ్యాఖ్యలు చేసిందని, వాటిని […] The post దిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా appeared first on Visalaandhra .
న్యూదిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు కేవలం దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి పరీక్షగా మారాయని పేర్కొంది. దేశ ఇంధన అవసరాలు తీరేలా చూసుకోవడానికి సంబంధిత దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని వెల్లడిం చింది. ఈ మేరకు విదేశాంగశాఖ సహా వివిధ విభాగాల ప్రతినిధులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘కువైట్ యువరా జుతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయా దేశాలు, భాగస్వామ్య పక్షాలతో దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నాం. […] The post ప్రపంచానికి పరీక్షా సమయం appeared first on Visalaandhra .
స్వల్ప, మధ్య,దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి
. పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మేలు. తెలుగుజాతిని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. టీటీడీ, వ్యవసాయ శాఖ పంచాంగాల ఆవిష్కరణ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివ ద్ధికి కషి చేస్తున్నామని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2047 నాటికి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ […] The post స్వల్ప, మధ్య,దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి appeared first on Visalaandhra .
నాలుగు రోజుల క్రితమే నిశ్చితార్థం..అంతలోనే అనంత లోకాలకు
ఉగాది పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ దర్శనానికి వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కోనేరులో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఎపిలోని కాకినాడ జిల్లా సామర్లకోటలోని ప్రసిద్ధ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో గురువారం చోటు చేసుకుంది. మృతుడిని ప్రశాంత్ అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలీవిధం గా వున్నాయి. తన కాబోయే భార్య, బంధువులతో కలిసి భీమేశ్వర స్వామి దర్శనం కోసం సామర్లకోటకు వచ్చిన ప్రశాంత్ స్వామివారిని దర్శించుకునే ముందు స్నానం చేద్దామని ఆలయ కోనేరులో దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగాడు. ఇది గమనించిన స్థానికులు ప్రశాంత్ను కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. నీటి లోతును సరిగా అంచనా వేయకపోవడం, ఈత రాకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తు న్నారు. కేవలం నాలుగు రోజుల క్రితమే ప్రశాంత్ నిశ్చితార్థం జరిగినట్లు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తెలిపారు. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
. అనేక జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు. చేతికొచ్చిన మొక్కజొన్న, మునగ, అరటి నేలమట్టం. సత్వరం ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ వాతావరణంలో సంభవించిన ఆకస్మిక మార్పుల వల్ల కురిసిన అకాల వర్షాలు, వీచిన ఈదురు గాలులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. కడప, ఎన్టీఆర్, కష్ణా తదితర జిల్లాల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు […] The post అకాల వర్షం… అపార నష్టం appeared first on Visalaandhra .
భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సంప్రదాయబద్దంగా గురువారం శ్రీకారం చుట్టారు. ఉత్సవాంగ స్నవనంతో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, ఉగాది వేపపూత ప్రసాదం స్వామి వారికి నివేదన చేశారు. అలాగే బ్రహ్మో త్సవాలను పురస్కరించుకుని పాల్గొనే రుత్వికులకు, సిబ్బందికి భద్రాద్రి దేవస్థానం ఏఈవో శ్రావణ్ కుమార్ దీక్ష వస్త్రాలను అందజేశారు. మూలవరులకు అభిషేకం, బేడా మండపంలో ఉత్సవమూర్తులకు ఉత్సవాంగ స్నపనంతో వసంతపక్ష బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా సాయంత్రం గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను మృత్సంగ్రహణంను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సమయంలో భూ వరాహాస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మట్టిని సేకరించి కల్యాణ అంకురార్పణకు వినియోగించారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో గురువారం నుంచి నిత్యక ల్యాణాలు ఏప్రిల్ రెండు వరకు నిలిపివేశారు. అలాగే నేటి నుంచి రెండు వరకు పవళింపు సేవలు నిలిపివేశారు. ఉగాదిని పురస్కరించుకొని రాత్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వైదిక సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉగాది పర్వదినంను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వరుస సెలవుదినాలు కావడంతో రామయ్య దర్శనంకు భక్తులు పోటెత్తారు.
. ఇంధన క్షేత్రాలపై దాడులు ముమ్మరం. ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రతరం. ఇరుగు`పొరుగు ఆగ్రహం తెహ్రాన్: ఇజ్రాయిల్అమెరికా కలిసి ఇరాన్లో విధ్వంసం సష్టిస్తుండగా, ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్ సైతం తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ యుద్ధం ఇప్ప్పుడు చమురు యుద్ధంగా మారిపోయింది. తమ దేశంలో చమురుగ్యాస్ క్షేత్రాలపై దాడులు జరపడంతో గల్ఫ్దేశాల చమురు నిల్వలపై ఇరాన్ గురి పెట్టింది. వైమానిక దాడులు చేసింది. యూఏఈ, ఖతార్లోని చమురు కేంద్రాలపై క్షిపణులు ప్రయోగించింది. సౌదీ అరాంకో సంస్థకు చెందిన […] The post ఇక చమురు యుద్ధమే! appeared first on Visalaandhra .
పుష్కరాల నాటికి ‘పోలవరం’ పూర్తి
. ముగింపు దశకు ‘మహా స్వప్నం’!. డయాఫ్రమ్ వాల్ 98 శాతం పూర్తి. మే 31 నాటికి 21,769 నిర్వాసిత కుటుంబాల తరలింపు లక్ష్యం. ప్రాజెక్ట్ డీఈఈ, ఏఈఈ వెల్లడి. ప్రాజెక్టును సందర్శించిన విశాలాంధ్ర పాత్రికేయ బృందం గోదావరి ప్రవాహం సాక్షిగా ఆంధ్రుల దశాబ్దాల కల ‘పోలవరం’ ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. ప్రకృతి విసిరిన సవాళ్లు, సాంకేతిక చిక్కుముడులు, వరద పోట్లను తట్టుకొని నదీ గర్భంలో నిర్మిస్తున్న అద్భుత ఇంజనీరింగ్ నిర్మాణం, నిధుల లభ్యత, సాంకేతిక […] The post పుష్కరాల నాటికి ‘పోలవరం’ పూర్తి appeared first on Visalaandhra .
శంషాబాద్ విమానాశ్రయానికి స్కైట్రాక్స్ అవార్డు
జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2026 సంవత్సరానికి గాను ’బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏసియా 2026’ అవార్డును గెలుచుకుంది. స్కైట్రాక్స్ ద్వారా ఈ గౌరవం దక్కడం ఇది 5వ సారి, లండన్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించారు. హైదరాబాద్ ప్రాంతీయ విమానాశ్రయాల విభాగంలో 2వ స్థానం, భారత్-, దక్షిణాసియాలో 3వ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. 20-30 ఎంపిపిఎ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 8వ ర్యాంకు సాధించింది. మా సిబ్బంది అంకితభావం వల్లే ఈ గుర్తింపు లభించిందని జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిఇఒ ప్రదీప్ పనిక్కర్ తెలిపారు. ప్రయాణికుల సేవల్లో అత్యుత్తమ ప్రమాణాలను పాటించినందుకు ఈ అవార్డు దక్కింది.
కృష్ణా డెల్టాలో ఉప్ప్పునీటి బెడదకు చెక్
కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఏటేటా వణికిస్తున్న ఉప్పునీటి బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రకాశం బ్యారేజీ దిగువన సముద్రపు పోటు వల్ల సాగు భూములు చవిటి నేలలుగా మారుతున్న తరుణంలో, రూ. 2,665 కోట్ల అంచనా వ్యయంతో రెండు మినీ బ్యారేజీల నిర్మాణానికి సమగ్ర నివేదికలు సిద్ధమయ్యాయి. సముద్రంలో కలుస్తున్న 7.40 టీఎంసీల వరద జలాలను నిల్వ చేయడం ద్వారా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వేలాది ఎకరాలకు అదనపు […] The post కృష్ణా డెల్టాలో ఉప్ప్పునీటి బెడదకు చెక్ appeared first on Visalaandhra .
. సామాజిక బహిష్కరణలు… మూకుమ్మడి దాడులు… పంటకు నిప్ప్పు. కళ్లప్పగించి చూస్తున్న పోలీసు, రెవెన్యూ యంత్రాంగం. రాష్ట్రపతి భవన్, ఎస్టీ కమిషన్ నోటీసులు పట్టించుకోని వైనం. రంపచోడవరంలో పనిచేయని గిరిజన చట్టాలు, ప్రత్యేక రక్షణ వ్యవస్థ. నిందితులను అరెస్ట్ చేయాలి: గిరిజన సంఘాల డిమాండ్ విశాలాంధ్ర బ్యూరో -రంపచోడవరం: గిరిజన చట్టాలు, ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో చట్టం చుట్టపుచూపుగా మారింది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలో కొన్ని కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న […] The post మన్యంలో అరాచకం appeared first on Visalaandhra .

29 C