SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

తెలంగాణ స్పీకర్‌ ట్రైబ్యునల్‌కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత విషయంలో బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హై కోర్టు విచారణ చేపట్టింది. స్పీకర్ ట్రైబ్యునల్‌కు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్‌కూ నోటీసులు జారీ చేసింది. పార్టీ మారిన ఇద్దరిపై స్పీకర్ ట్రైబ్యునల్ చర్యలు తీసుకోలేదని బిఆర్ఎస్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. బిఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మారినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వాదించారు. స్పీకర్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని రద్దు చేయాలని వాదించారు. కడియం, సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది.

మన తెలంగాణ 26 Mar 2026 8:30 pm

షార్ట్ సర్క్యూట్ తో ట్రాక్టర్ దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో ట్రాక్టర్ దగ్ధం రూ.10లక్షల విలువైన ట్రాక్టర్ బుగ్గిపాలుతనను ఆదుకోవాలని

ప్రభ న్యూస్ 26 Mar 2026 8:28 pm

సర్పంచులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం…

సర్పంచులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం… పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Mar 2026 8:24 pm

ధర్నా చేస్తున్న విద్యుత్ కార్మికులు

ధర్నా చేస్తున్న విద్యుత్ కార్మికులు విద్యుత్ కార్మికులను కన్వర్షన్ చేయాలి తొర్రూరు,ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 8:09 pm

మెడికల్ అసోసియేషన్ సేవలు విస్తృతం చేయాలి

మెడికల్ అసోసియేషన్ సేవలు విస్తృతం చేయాలి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యవిద్యార్థుల కు మెడికల్

ప్రభ న్యూస్ 26 Mar 2026 8:08 pm

విద్యుత్‌ఛార్జీలను తగ్గింపుతో పాటుగా నాణ్యమైన విద్యుత్‌….

విద్యుత్‌ఛార్జీలను తగ్గింపుతో పాటుగా నాణ్యమైన విద్యుత్‌…. పటమట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని విద్యుత్‌

ప్రభ న్యూస్ 26 Mar 2026 8:03 pm

Chandrababu : అమరావతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాజధాని అమరావతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 7:59 pm

ఏసీబీ వలలో మామడ ఎస్సై

ఏసీబీ వలలో మామడ ఎస్సై రూ. 20,వేల లంచం తీసుకుంటుండగా పట్టుబడిన మామడ

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:58 pm

దీర్ఘకాలిక రోగులకు మినహాయింపు ఇవ్వాలి…

దీర్ఘకాలిక రోగులకు మినహాయింపు ఇవ్వాలి… నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : పదవ తరగతి

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:58 pm

in2states |బదిలీల కోసం ఎదురు చూపులు

in2states | బదిలీల కోసం ఎదురు చూపులు in2states | డ్యూటీ- ఒక

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:57 pm

దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గొంది మురళి మోహన్

దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గొంది మురళి మోహన్ దమ్మపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:54 pm

శ్రీరామ నవమి స్పెషల్.. ‘ఇరుముడి’ ప్రత్యేక పోస్టర్

ఈ ఏడాది ఆరంభంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు మాస్ మహారాజ రవితేజ. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప దీక్షలో కనిపించనున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భక్తితో పాటు తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని కూడా చూపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేసింది. చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో రవితేజ తన కూతురితో కలిసి.. నడుచుకుంటూ వెళ్లడం మనం చూడొచ్చు. దీన్ని పట్టి ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషనల్ సీన్స్ చాలానే ఉంటాయని అర్థమవుతోంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. జివి ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. Tale of a Doting father & Lovely daughter knotted with love - #IRUMUDI శ్రీరామనవమి శుభాకాంక్షలు ✨ Starring MASS MAHARAJA @RaviTeja_offl A @gvprakash musical @priya_Bshankar @ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh … pic.twitter.com/CNZuTYRLKB — Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2026

మన తెలంగాణ 26 Mar 2026 7:32 pm

వరకట్నం చావులు అమానుషం: సుప్రీంకోర్టు

వరకట్నం చావుల పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలు అత్యంత దారుణాలు. సభ్య సమాజానికి చెరగని మచ్చలు అని న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం గురువారం పేర్కొంది. ఓ వైపు వరకట్నం పద్థతిపై చట్టపరమైన నిషేధం అమలులో ఉంది. అయితే తెరవెనుక ఈ దురాచారం సాగుతూనే ఉంది. దీనితో వరకట్నం వేధింపులతో వేలాది మంది మహిళలు అకాలమరణం చెందుతున్నారు. ఇది అమానుషం అని తెలిపారు. ఓ వరకట్నం చావు కేసులో వ్యక్తి బెయిల్‌ను రద్దు చేస్తూ బెంచ్ ఈ సామాజిక సమస్య గురించి ప్రస్తావించింది. నిందితుడికి పాట్నా హైకోర్టు బెయిల్ ఎందుకు మంజూరీ చేసిందో అర్థం కావడం లేదు. ఈ బెయిల్ పూర్తి స్థాయిలో కొట్టివేయదగినది. నిలువజాలనిది అని స్పష్టం చేశారు. వరకట్నం చావు వంటి ఉదంతాలలో నిందితులను క్రూర నేరాలకు పాల్పడిన వారిగా పరిగణించాల్సి ఉంటుంది. అటువంటి వారికి బెయిల్ మంజూరీల దశలో హైకోర్టు ఇతర కోర్టులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. విచక్షణారహిత స్పందన అనుచితం అవుతుందని పేర్కొన్నారు. వరకట్నం చావుల విషయంలో తీవ్రస్థాయి మానవ హక్కుల ఉల్లంఘనలు, జీవన మర్యాదల విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వరకట్నం వేధింపులతో హత్యలు, ఆత్మహత్యలకు పురికొల్పడం వేలాది మంది అబలల విషాదాంతానికి దారితీస్తోంది. సమాజం నగుబాటుకు దారితీస్తుందని ధర్మాసనం తెలిపింది. ఇప్పుడు తమ ముందుకు వచ్చిన కేసులో హైకోర్టు తీరు దారుణంగా ఉంది. అన్ని విషయాలను పూర్తిగా సమీక్షించుకోకుండానే బెయిల్ ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇది ఏం సంకేతాలకు దారితీస్తుంది? అని నిలదీశారు. 2024లో వరకట్న బాధితురాలు అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండగా గుర్తించారు. శరీరం అంతటా బలీయమైన గాయాలు ఉన్నాయి. తలకు గాయం అయ్యి, రక్తస్రావం కావడంతో చనిపోయినట్లు నిర్థారించారు. దారుణ ఘటనపై న్యాయస్థానం స్పందన సరిగ్గాలేదని మందలించారు. 

మన తెలంగాణ 26 Mar 2026 7:25 pm

బెల్లంపల్లిలో ఘనంగా 2కే రన్..

బెల్లంపల్లిలో ఘనంగా 2కే రన్.. అవయవ దానానికి చైర్ పర్సన్ దంపతుల అంగీకారంనేత్ర,

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:23 pm

విస్తృత అవ‌గాహ‌న‌తోనే విప‌త్తుల నుంచి ర‌క్ష‌ణ‌…

విస్తృత అవ‌గాహ‌న‌తోనే విప‌త్తుల నుంచి ర‌క్ష‌ణ‌… జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న ఫామెక్స్‌)-2026ఈ నెల

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:19 pm

పోలీస్ ప్రమోషన్స్ లో పరేషాన్

పోలీస్ ప్రమోషన్స్ లో పరేషాన్ మల్టీజోన్-1,జోన్-2 వారికి నష్టంహైదరాబాద్, సైబరాబాద్ రేంజ్లో వేకన్సీ

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:18 pm

సాగునీరు, ట్రాఫిక్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన

సాగునీరు, ట్రాఫిక్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన పంటల రక్షణకు వెంటనే నీరు విడుదల

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:15 pm

OG 2: Pressure Mounting on Sujeeth

Pawan Kalyan’s recent offering Ustaad Bhagat Singh has turned out to be a big embarrassment for the actor. Soon after the debacle, Pawan Kalyan announced that he is not taking any new film except OG 2. Sujeeth is the only director who lived up to the expectations in presenting Pawan Kalyan that thrilled his fans. […] The post OG 2: Pressure Mounting on Sujeeth appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 7:13 pm

రామ్ లీలా మైదానంలో కళ్యాణోత్సవానికి భారీగా ఏర్పాట్లు

రామ్ లీలా మైదానంలో కళ్యాణోత్సవానికి భారీగా ఏర్పాట్లు మక్తల్, ఆంధ్రప్రభ : శ్రీరామనవమి

ప్రభ న్యూస్ 26 Mar 2026 7:13 pm

యుద్ధంలో ఇరాన్ కీలక నేతల వరుస హత్యలు

ఇరాన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ ఎలైట్ నౌకాదళ విభాగానికి అధిపతిగా ఉన్న అలీరెజా టాంగ్సిరిని మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన నిజమైతే, ఇరాన్ సైనిక నాయకత్వానికి, ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన పర్షియన్ గల్ఫ్‌లోని నౌకా కార్యకలాపాలకు గట్టి దెబ్బే. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో టాంగ్సిరి మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపాడు. ప్రస్తుతం నాలుగో వారంలోకి ప్రవేశించిన యుద్ధంలో ఇది మరో కీలక మరణంగా భావిస్తున్నారు.ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నౌకాదళ విభాగానికి నాయకత్వం వహించిన టాంగ్సిరి, బందర్ అబ్బాస్ పోర్టు నగరంలో జరిగిన దాడిలో హతమైనట్లు సమాచారం. హార్మూజ్ జలసంధి మూసివేతకు సంబంధించిన చర్యలను పర్యవేక్షించే బాధ్యత టాంగ్సిరిదేనని ఇజ్రాయెల్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కీలక సముద్ర మార్గంపై ఇరాన్ నియంత్రణ వల్ల మధ్యప్రాచ్యం నుంచి చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే ఈ ఘటనపై ఇరాన్ నుంచి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) కూడా ఈ దాడిపై స్పందించలేదు. అలీరెజా టాంగ్సిరి ఇరాన్ దక్షిణంలోని బుషెహర్ ప్రావిన్స్‌లో జన్మించిన అలీరెజా టాంగ్సిరి, ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో సేవలందిస్తూ ఐఆర్‌జీసీ నౌకాదళంలో తన కెరీర్‌ను ప్రారంభించారు. 1980లలో జరిగిన ట్యాంకర్ వార్స్‌లో కూడా పాల్గొన్నారు. తర్వాత బందర్ అబ్బాస్‌లోని ఐఆర్‌జీసీ మొదటి నౌకాదళ జిల్లాకు కమాండర్‌గా పనిచేసిన ఆయన, 2010 నుంచి 2018 వరకు ఉప కమాండర్‌గా సేవలందించారు. అనంతరం నౌకాదళ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. యుద్ధంలో కీలక నేతల వరుస హత్యలు ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇరాన్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు హత్యకు గురవుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యంత ప్రభావం చూపిన ఘటనగా సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం నిలిచింది. అనంతరం ఇస్లామిక్ రిపబ్లిక్ రాజకీయ, సైనిక ఉన్నత స్థాయి నాయకత్వంపై లక్ష్యిత దాడులు కొనసాగుతున్నాయి. మార్చి 17న ఇరాన్ భద్రతా వ్యవస్థ అధిపతి అలీ లరిజానీ, టెహ్రాన్ పరిసరాల్లో జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మరణించినట్లు సమాచారం. ఈ దాడిలో ఆయన కుటుంబ సభ్యులు కూడా మృతి చెందినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇక కొద్ది రోజులకే రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ, అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో హతమయ్యారు. యుద్ధ పరిస్థితుల్లోనూ ఇరాన్ క్షిపణి ఉత్పత్తి సామర్థ్యం తగ్గలేదని జాతీయ టెలివిజన్‌లో వెల్లడించిన కొన్ని గంటలకే ఆయన మృతి చెందడం గమనార్హం.

మన తెలంగాణ 26 Mar 2026 7:10 pm

అసెంబ్లీలో మా గళాన్ని వినిపించేందుకు మైక్ ఇవ్వడం లేదు: హరీష్ రావు

రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపించేందుకు ప్రయత్నించినప్పటికీ, మైక్ ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైకులు కట్‌చేసి తాము చెప్పాలనుకున్న వాస్తవాలను సభ దృష్టికి తీసుకురాకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని అన్నారు. ఆరోగ్యశ్రీ ఖర్చుల పెంపుపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, 2014 జూన్ 2 నాటికి ఆరోగ్యశ్రీ కోసం నెలకు రూ.32 కోట్లు ఖర్చయ్యేవి అని, 2023 నాటికి రూ.68 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. కానీ.. ప్రభుత్వం రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతోందని అన్నారు. జనాభా పెరుగుదల, వైద్య ఖర్చుల పెరుగుదల దృష్ట్యా ఈ పెంపు సహజం అని, ఇందులో కాంగ్రెస్ కొత్తగా సాధించిన ఘనతేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతే ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు బాగా పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి, పనులు చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ ఆస్పత్రులన్నీ పూర్తయి ప్రజలకు మెరుగైన సేవలు అందేవి అని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్సైజ్ అదాయంలో వాటాను పెంచి నిధులను సమకూర్చిందని తెలిపారు. ఈ అంశాలు అన్నీ చెప్పాలని అనుకుంటే సభలో తమకు మైక్ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 26 Mar 2026 7:01 pm

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ పేరిట మోసాలు చేస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ పేరిట మోసాలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేశ్ వెంకట రామన్, అభిషేక్, విలియమ్స్, మన్మీత్ శర్మ ముఠాగా ఏర్పడి రూ.26 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. క్లోజ్‌ ఎక్స్ పే, ట్రస్ట్లీ పే, అకల్ట్ పే పేర్లతో నకిలీ పేమెంట్ గేట్‌వేలను నిందితులు తయారు చేసినట్లు విచారణలో తేలింది. యుపిఐ, ఐఎంపిఎస్ కార్డ్ ట్రాన్సాక్షన్‌ల ద్వారా డబ్బులు మళ్లించినట్లు వెల్లడైంది. ప్రతి లావాదేవిపై 2 శాతం నుంచి 5 శాతం వరకు కమిషన్ వసూలు చేసినట్లు గుర్తించారు. ఫేక్ కంపెనీల పేర్లతో మ్యూల్ ఖాతాలు సృష్టించి, నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. సూర్యోదయ బ్యాంక్ ద్వారా పేమెంట్ గేట్‌వే సేవలు వినియోగించినట్లు ఆధారాలు సేకరించారు. నిందుతుల నుంచి 4 ల్యాప్‌టాప్‌లు, 6 మొబైల్స్, 9 చెక్‌బుక్‌లు, రూ.6.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మన తెలంగాణ 26 Mar 2026 7:00 pm

పనుల్లో వేగం పెంచి రైతులకు సాగునీరు అందించాలి..

పనుల్లో వేగం పెంచి రైతులకు సాగునీరు అందించాలి.. ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:58 pm

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదు

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదని, బుధవారం కంటే గురువారం పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గిందని ఐపిఎస్,సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 484 ట్రక్కుల గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేశామని, బుధవారం 2,19,980 సిలిండర్లను సరఫరా చేశామని కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలో గృహ వినియోగానికి సంబంధించి 1,28,24,087 ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని, ప్రతి రోజు 2,20,000 గ్యాస్ బుకింగ్స్ జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే, 1,03,275 పైప్ న్యాచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లు ఉన్నాయని, 2,78,418 క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకు పిఎన్జీ, సిఎన్జీని విస్తరించాల్సి ఉందని ఆయన చెప్పారు. 24 గంటల్లో ప్లాంట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు పలు రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.

మన తెలంగాణ 26 Mar 2026 6:57 pm

సంక్షోభంలో చిత్తూరు గ్రానైట్ పరిశ్రమ

సంక్షోభంలో చిత్తూరు గ్రానైట్ పరిశ్రమ ఆగిన గ్రానైట్ ఎగుమతులు తగ్గిన అమ్మకాలుపెరిగిన ఖర్చులతో

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:57 pm

మొట్టమొదటి సైంటిఫిక్ సాహిత్యాన్ని అభివృద్ధి…

మొట్టమొదటి సైంటిఫిక్ సాహిత్యాన్ని అభివృద్ధి… హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : సైన్సులో బలంగా వేళ్లూనుకున్న

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:52 pm

ఐపిఎల్-2026.. రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల చేసిన బిసిసిఐ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌.. రెండో ఫేజ్ షెడ్యూల్‌ని బిసిసిఐ విడుదల చేసింది. ఈ దశలో మొత్తం 50 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు దేశంలోని 12 వేదికల్లో ఈ మ్యాచ్‌‌లు జరుగుతాయి. కొద్ది రోజుల కిందటే తొలి ఫేజ్ షెడ్యూల్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 28 నుంచి ఐపిఎల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. తొలి దశలో 20 మ్యాచ్‌లు, రెండో దశలో 50 మ్యాచ్‌లు జరుగతాయి. మొత్తం కలిపి 70 మ్యాచులు జరుగుతాయి. ప్లేఆఫ్స్ వేదికలను తర్వాత ప్రకటించనున్నారు. రెండో దశలో బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఏప్రిల్ 13న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. రెండో దశలో 8 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి. 

మన తెలంగాణ 26 Mar 2026 6:40 pm

శ్రీరాముని జన్మనోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

శ్రీరాముని జన్మనోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జుక్కల్,ఆంధ్రప్రభ : జుక్కల్ మండల

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:22 pm

24 Hrs Png Connection : ఇక ఏపీలో పీఎన్జీ శకం Andhra Prabha SPL Story

24 Hrs Png Connection : ఇక ఏపీలో పీఎన్జీ శకం Andhra

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:22 pm

నాణ్యమైన భోజనం అందించాలి…

నాణ్యమైన భోజనం అందించాలి… విద్యార్థినిల భద్రత ముఖ్యంఅదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:16 pm

కల్తీ కారం తయారీ కేంద్రంపై దాడులు..

కల్తీ కారం తయారీ కేంద్రంపై దాడులు.. తొడిమేలతో కారం పొడి తయారీఫుడ్ సేఫ్టీ,పోలీసుల

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:14 pm

శ్రీరామ నవమి.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్: శుక్రవారం జరిగే శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. సీతారాంబాగ్ దేవాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్రం జరగనుంది. ఈ మార్గంలో వాహనాలకు అనుమతి లేదు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్ నుంచి మారేడుపల్లి ఎక్స్ రోడ్స్‌ వైపు ట్రాఫిక్ మళ్లించనున్నారు. మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పూరానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడీ జక్షన్ వైపు డైవర్ట్ చేయనున్నారు. ఎంజె బ్రిడ్జ్, బేగం బజార్, అఫ్జల్‌గంజ్, సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలను జుమేరాత్ బజార్ మీదుగా మళ్లించనున్నారు. అబిడ్స్ జిపిఒ, సుల్తాన్ బజార్, కోఠి, అబిడ్స్ ప్రధఆన రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఎంజె మార్కెట్, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొనేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు.

మన తెలంగాణ 26 Mar 2026 6:09 pm

మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు..

మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:07 pm

కన్నతల్లి వృద్ధాశ్రమంలో అన్నదానం

కన్నతల్లి వృద్ధాశ్రమంలో అన్నదానం కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రజా పాదన. ప్రగతి ప్రణాళిక

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:07 pm

Azharuddin : మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం

మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం పొంచి ఉంది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 6:01 pm

4simptoms |మొటిమలు చర్మ సమస్యేనా? శరీరం చెబుతున్న ‘అంతర్గత’ హెచ్చరికలు ఇవే!

4simptoms |మొటిమలు చర్మ సమస్యేనా? శరీరం చెబుతున్న ‘అంతర్గత’ హెచ్చరికలు ఇవే! ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:58 pm

మక్కకు దళారులే దిక్కా..?

మక్కకు దళారులే దిక్కా..? ముందుకు కదలని మార్కెటింగ్ మార్క్ ఫెడ్ అధికారులుసాగు విస్తీర్ణం

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:57 pm

ఆర్డీటీ ప్రతినిధులతో పరిటాల కుటుంబం ఆత్మీయ భేటీ

విశాలాంధ్ర-రాప్తాడు : జిల్లాలో దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్‌కు అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో, అనంతపురంలోని వారి నివాసంలో అన్నే ఫెర్రర్, విశాల ఫెర్రర్‌లను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వారితో ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. గత ఐదున్నర దశాబ్దాలుగా జిల్లా అభివృద్ధిలో ఆర్డీటీ పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ ఆలస్యం కావడంతో సేవా కార్యక్రమాలకు […] The post ఆర్డీటీ ప్రతినిధులతో పరిటాల కుటుంబం ఆత్మీయ భేటీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:48 pm

ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-​రాప్తాడు : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకల్లో కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను రెపరెపలాడించాలన్నారు .అలాగే పెండింగ్‌లో ఉన్న గ్రామ, మండల కమిటీల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని, పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత […] The post ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే పరిటాల సునీత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:43 pm

గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యం: ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పారద్రోలి, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 మరియు పీ4( ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) – జీరో పావర్టీ కార్యక్రమాలు అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఆమె గురువారం అనంతపురం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ.రామమోహన్, రాప్తాడు ఎంపీడీవో బి.విజయలక్ష్మితో కలిసి ప్రత్యేక […] The post గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యం: ఎమ్మెల్యే పరిటాల సునీత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:39 pm

ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ పీఎంజేజేబీవై

-మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల బీమా పరిహారం అందజేత విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) l ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ లభిస్తుందని హంపాపురం కెనరా బ్యాంక్ మేనేజర్ రాజ్ కిరణ్ అన్నారు. గత జనవరి నెలలో గుండెపోటుతో అకాల మరణం చెందిన మరూరు గ్రామానికి చెందిన కోనయ్య, ఈ పథకంలో సభ్యునిగా చేరి ఉండటంతో ఆయన భార్య రాములమ్మకు రూ. 2 లక్షల బీమా […] The post ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ పీఎంజేజేబీవై appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:36 pm

క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ శ్రేయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల అవగాహన కొరకు పట్టణములో పలుచోట్ల ర్యాలీనిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా క్షయ వ్యాధి అనుమానితులను ప్రభుత్వ ఆసుపత్రికి మందుల కొరకు పంపాలని, […] The post క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:29 pm

పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి….

పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి…. కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్… కర్నూల్,

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:29 pm

YSRCP : అమరావతి అవినీతిపైనే మా పోరాటం

అమరావతి విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 5:29 pm

రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.. సిపిఎం పార్టీ నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం ; ఇటీవల వడగండ్ల వాన నువ్వు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం రైతు సంగం ఆధ్వర్యంలో అరటి తోటను సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మల్కాపురం గ్రామంలో నాగిరెడ్డి రైతు మూడు ఎకరాల అరటి తోటను సాగు చేయడం జరిగినదని ఈ […] The post రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.. సిపిఎం పార్టీ నాయకులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:26 pm

ముగ్గురి పై జిల్లా బహిష్కరణ …

ముగ్గురి పై జిల్లా బహిష్కరణ … ఇప్పటివరకు 8 మంది జిల్లా బహిష్కరణ

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:23 pm

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

సబ్ రిజిస్టర్ తాయన్నవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని సబ్ రిజిస్టార్ అధికారి తాయన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి ఎంతోమంది ప్రజలు తమ పనుల నిమిత్తం వస్తారని, అటువంటి వారికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చుతుందని తెలిపారు. ఇటువంటి చలివేంద్రం ఏర్పాటు పట్ల నిర్వాహకుల్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు. The post సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:22 pm

Andhra Pradesh : ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలివే

రాష్ట్ర మంత్రివర్గం మూడు గంటలపాటు వివిధ కీలక అంశాలపై చర్చించారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 5:22 pm

మూడవ మద్యం బార్ ను కైవసం చేసుకున్న రుద్ర రవికుమార్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరంలో మూడవ మద్యం బార్ రుద్ర రవికుమార్ లక్కీ డ్రా లో విజేతగా నిలవడం జరిగిందని ఎక్సైజ్ సిఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం పుట్టపర్తి లోని కలెక్టరేట్ ఆఫీసులో పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. అనంతరం సీఐ చంద్రమణి మాట్లాడుతూ బార్ లైసెన్స్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి […] The post మూడవ మద్యం బార్ ను కైవసం చేసుకున్న రుద్ర రవికుమార్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:19 pm

ఉత్తరాంధ్రకు ఉక్కు బలం…

ఉత్తరాంధ్రకు ఉక్కు బలం… ఆర్సెలర్ మిట్టల్ మెగా ప్లాంట్‌తో అభివృద్ధి దిశగా భారీ

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:16 pm

వాడ వాడలా పార్టీ జెండా ఎగరాలి… ఎమ్మెల్యే సునీత

వాడ వాడలా పార్టీ జెండా ఎగరాలి… ఎమ్మెల్యే సునీత రాప్తాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:11 pm

2ndcadre |కొందరు నేతల ప్రవర్తనతో కూటమికి ఇమేజ్ క్రైసిస్..?

2ndcadre | కొందరు నేతల ప్రవర్తనతో కూటమికి ఇమేజ్ క్రైసిస్..? 2ndcadre |

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:09 pm

పీ4 అమలు పై అధికారులతో సమీక్ష

పీ4 అమలు పై అధికారులతో సమీక్ష రాప్తాడు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:09 pm

Andhra Pradesh : ఏపీ సర్కార్ కు గుడ్ న్యూస్... ఇక ఆ భూముల రిజిస్ట్రేషన్ తేలిక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 26 Mar 2026 5:07 pm

ఫెర్రర్ కుటుంబంతో పరిటాల కుటుంబం ఆత్మీయ కలయిక…

ఫెర్రర్ కుటుంబంతో పరిటాల కుటుంబం ఆత్మీయ కలయిక… రాప్తాడు, ఆంధ్రప్రభ : సంతోషం

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:06 pm

Road accident |యువతి మృతి, ఇద్దరికి గాయాలు

Road accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:04 pm

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు…

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు… ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మండలంలోని రేపూడి తండా

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:01 pm

జగన్ అబద్ధాలకు అడ్డూ అదుపు లేదు…

జగన్ అబద్ధాలకు అడ్డూ అదుపు లేదు… రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్న మిట్టల్ స్టీల్

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:57 pm

‘ధురంధర్2’ సినిమాపై.. ఆమిర్ ఖాన్ రియాక్షన్ ఇదే..

రణ్‌వీర్ సింగ్ హీరోగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ధురంధర్2’. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. మొదటి భాగం ఎలా సూపర్ హిట్ అయిందో.. రెండో భాగం అంతకంటే ఎక్కువ సక్సెస్‌ని అందుకుంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. దక్షిణాది నటులు, దర్శకులు సినిమా బాగుందంటూ కితాబిచ్చారు. అయితే బాలీవుడ్ నుంచి వచ్చిన రియాక్షన్ మాత్రం చాలా తక్కువ. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ స్పందించారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ ఈవెంట్‌లో పాల్పొన్న ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. ఈ సందర్భంగా ధురంధర్2 గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ, ఆ సినిమాకు వస్తున్న ప్రశంసలు విన్నాను. మొన్న ‘ధురంధర్1’.. ఇప్పుడు ‘ధురంధర్2’ అద్భుత విజయాన్ని అందుకున్నాయి. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని అన్నారు. దీంతో బాలీవుడ్ అగ్ర తారాగణంలో ధురంధర్ గురించి మాట్లాడిన ఏకైక నటుడిగా ఆమిర్ నిలిచారు.

మన తెలంగాణ 26 Mar 2026 4:53 pm

అమరావతి కోసం తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?: సజ్జల

అమరావతి: అమరావతిలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అవినీతి యజ్ఞం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అమరావతి పేరుతో రైతుల సమస్యల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామా అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందుకే 2019 లో అధికారంలోకి రాకముందే మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని తెలియజేశారు. అమరావతి కోసం తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. అసెంబ్లీతో పాటు, మండలిని కూడా సమావేశపరచాలని కదా? అని అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న దోపిడీపైనే వైసిపి అభ్యంతరం చెప్పింది అని అన్నారు. ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ఎత్తుగడ అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 

మన తెలంగాణ 26 Mar 2026 4:46 pm

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సన్మానం

రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నీలకంఠాపురం తిప్పేస్వామివిశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా నీల కాంటాపురం తిప్పేస్వామి ఎన్నికైన సందర్భంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కలిసి ఘనంగా సత్కరించారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నీలకంఠాపురం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం స్టేట్ ఎస్సీ సెల్ కార్యదర్శి ఎమ్.చౌడప్ప, స్టేట్ ఎస్టీ సెల్ జాయింట్ సెక్రెటరీ దేవరకొండ రమేష్,ధర్మవరం పట్టణ ఎస్.ఎస్సి సెల్ అధ్యక్షులు నరసింహులు, సాకే రాంగోపాల్ రామాంజనేయులు,మడకశిర తాలూకా క్రిస్టియన్ […] The post మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సన్మానం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 4:40 pm

నేషనల్ హాకీ చాంపియన్ షిప్ కి వెళ్ళిన హాకీ క్రీడాకారులు

విశాలాంధ్ర ధర్మవరం; ఫస్ట్ కే లో ఇండియా ట్రైబల్స్ హాకీ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ కు శ్రీ సత్యసాయి జిల్లా క్రీడాకారుడు వెంకటేష్ నాయక్, ఏపీ టీం కెప్టెన్ లవన్ కుమార్ నాయక్ ఇద్దరు పాల్గొని టోర్నమెంట్కు ఎంపిక కావడం జరిగిందన్నారు.ఈ టోర్నమెంట్ రాయపూర్ లో జరగనున్నది అని, గురువారం రోజు కర్ణాటక వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ టీములు తలపడతాయి అని తెలిపారు.హాకీ సత్యసాయి డిస్టిక్ సెక్రెటరీ బి సూర్యప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. The post నేషనల్ హాకీ చాంపియన్ షిప్ కి వెళ్ళిన హాకీ క్రీడాకారులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 4:30 pm

కల్వర్టు నిర్మాణానికి నిధుల కేటాయింపు…

కల్వర్టు నిర్మాణానికి నిధుల కేటాయింపు… ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జానకంపేట

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:25 pm

బడ్జెట్ అవుట్‌రీచ్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించాలి

బడ్జెట్ అవుట్‌రీచ్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించాలి కర్నూలు బ్యూరో ఆంధ్రప్రభ : జిల్లాలో

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:23 pm

Andhra Prabha Smart Edition |TS|అగ్ని కీలల్లో/హాస్పిటళ్లలో కష్టాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 26-03-2026, 4.00PM ts బస్సుకు మంటలు.. అగ్ని

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:21 pm

కసాయి తల్లి ఘాతుకం.. పాల కోసం ఏడుస్తుందని కన్న కూతుర్నే..

తిరుపతి: క్షణికావేశంలో ఓ కసాయి తల్లి మాతృత్వానికే కలంకం తెచ్చే పని చేసింది. పాల కోసం ఏడుస్తున్న కూతుర్నే గొంతు నులిమి చంపేసింది. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని నరసరాజు అగ్రహారంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని వెంగలచేరికి చెందిన హైమవతి, వెంకటేశ్‌ దంపతులు సత్యవేడు పరిసరాల్లోని ఓ సిమెంట్ ఇటుకల తయారీ పనులకు వెళ్తు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు రుత్విక్, ఆరు నెలల చిన్నారి ఉన్నారు. గురువారం చిన్నారి పాల కోసం ఏడుస్తుందని క్షణికావేశంలో తల్లి పసిపాప గొంతు నులిమేసింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిఐ మురళి, ఎస్సై సాయినాథ్ ఘటనస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

మన తెలంగాణ 26 Mar 2026 4:18 pm

Andhra Prabha Smart Edition |AP| బస్సుకు మంటలు|రాజధానిగా అమరావతి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 26-03-2026, 4.00PM ap బస్సుకు మంటలు.. అగ్ని

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:17 pm

చెన్నూరులో పోలీసుల ఉచిత వైద్య సేవలు

చెన్నూరులో పోలీసుల ఉచిత వైద్య సేవలు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:17 pm

Telangana Secures Major Investments as Andhra Pradesh Pushes Culinary Tourism Vision

Telangana and Andhra Pradesh are advancing on two different but equally strategic fronts. One is focused on large scale industrial investment while the other is building a strong identity in tourism through culture and cuisine. Telangana has reported significant progress from its recent global outreach efforts. IT and Industries Minister D. Sridhar Babu informed the […] The post Telangana Secures Major Investments as Andhra Pradesh Pushes Culinary Tourism Vision appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 4:16 pm

Prime Minister |పశ్చిమాసియా పరిస్థితులపై చర్చకు సిద్ధం

Prime Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:16 pm

మోదుమూడి రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

మోదుమూడి రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అవనిగడ్డ ఆంధ్రప్రభ : అవనిగడ్డ

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:16 pm

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ….

మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హనుమంత రెడ్డి… బిక్కనూరు, ఆంధ్రప్రభ : ఇటీవల

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:14 pm

రహదారుల దుస్థితిపై పరిటాల శ్రీరామ్ స్పందన

ధర్మవరం మండల వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్దించండివిశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం మండలం ఏలుకుంట్ల–మారాల మరియు ఏలుకుంట్ల–సిద్ధరాంపురం మామిడి తోటల ప్రాంతంలో రహదారి దుస్థితిపై ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ స్పందించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ ఫోన్ లో పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి ఈ పాండు రంగారెడ్డితో మాట్లాడీ రహదారి గురించి చర్చించారు. అనేక సార్లు టిడిపి నేతలు మీ దగ్గరికి వచ్చారని ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా […] The post రహదారుల దుస్థితిపై పరిటాల శ్రీరామ్ స్పందన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 4:12 pm

అది కచ్చితంగా సరిపోదు.. మా లక్ష్యం అదే: సంజీవ్ గోయెంకా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రోఫీని సొంతం చేసుకొనేందుకు ప్రతీ జట్టు వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ సారి ట్రోఫీని గెలుచుకోవడమే తమ లక్ష్యమని లక్నో సూపర్‌జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) యజమాని సంజీవ్ గోయెంకా అన్నారు. ‘‘మా నిజమైన గుర్తింపు ఇంకా రూపుదిద్దుకుంటోందని నేను భావిస్తున్నా. ఏ క్రీడా జట్టుకైనా ట్రోఫీ గెలిస్తేనే గౌరవం. మేము ఇప్పటి వరకూ రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాం. కచ్చితంగా అది సరిపోదు. కొన్నిసార్లు గెలుస్తాం. మరికొన్నిసార్లు ఓడిపోతాం. కానీ మేం మా మొదటి ట్రోఫీని గెలవాలి’’ అని సంజీవ్ పేర్కొన్నారు. 

మన తెలంగాణ 26 Mar 2026 4:07 pm

గ్రామ పంచాయితీల పరిశుభ్రత మా లక్ష్యం.. ఎన్డీఏ నాయకులు

విశాలాంధ్ర -ధర్మవరం;; మండల పరిధిలోని 20 గ్రామపంచాయతీలలో పరిశుభ్రతగా ఉండుటే మా లక్ష్యము అని ఎన్డీఏ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు, శాంతిరెడ్డి శ్రీనివాసులు, మహేష్ చేతుల మీదుగా 20 గ్రామ పంచాయతీలకు తోపుడుబండ్లను, తడి చెత్త, పొడి చెత్త వేరుగా వేసేందుకు ప్లాస్టిక్ డ్రమ్ములను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ […] The post గ్రామ పంచాయితీల పరిశుభ్రత మా లక్ష్యం.. ఎన్డీఏ నాయకులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 4:03 pm

ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ పరిసరాలను వారు పరిశీలించారు. అనంతరం భద్రత, గోడానికి వేసిన తాళాల సీజ్ విధానం తదితర వాటిని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల నడుమ పరిశీలించారు. అనంతరం గోడౌన్ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. తిరిగి రాజకీయ ప్రతినిధుల […] The post ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 3:58 pm

చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకు కృషి చేస్తాం

జేఏసీ పట్టణ కన్వీనర్ తాడెం వెంకటస్వామి చేర్యాల (జనంసాక్షి) మార్చి 26 : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం …

జనం సాక్షి 26 Mar 2026 3:54 pm

వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

ధురంధర్ దర్శకుడి వార్నింగ్ రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా మార్చి 19న విడుదలైన ‘ధురంధర్ 2్ణ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే రూ. 1,006 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమాలోని ఒక పాత్రను కించపరిచేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలపై దర్శకుడు ఆదిత్య ధర్ తీవ్రంగా స్పందించారు. సినిమాలో జస్కీరత్ అనే సిక్కు పాత్ర తలపాగా ధరించి సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఫొటో పూర్తిగా […] The post వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 3:51 pm

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో బిఎల్ఓల బాధ్యతలు కీలకం

భూదాన్ పోచంపల్లి, మార్చి 26 (జనం సాక్షి): ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారుల (బిఎల్ఓ) పాత్ర అత్యంత …

జనం సాక్షి 26 Mar 2026 3:48 pm

ప్రజలకు ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో అందట్లేదు : హరీష్ రావు

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పరిధిని పెంచామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పుడు ప్రజలకు ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో అందట్లేదని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ బిల్లులపై హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని, బిఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆస్పత్రులను కాంగ్రెస్ పూర్తి చేయట్లేదు అని విమర్శించారు. సిఎంఆర్ కోసం తాము ఎక్సైజ్ ఆదాయంలో వాటా పెంచామని, ఈ అంశాల గురించి చర్చించడానికి సభలో తమకు మైకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మేజర్ సర్జరీలకు కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం చేయట్లేదని, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక చిన్న ఆస్పత్రులు మూసివేసే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. ఎప్పటిలోగా ఆరోగ్యశ్రీ బిల్లులు క్లియర్ చేస్తారో ప్రభుత్వం చెప్పాలని.. ఆరోగ్యశ్రీ బిల్లులు గ్రీన్ ఛానల్ లో పెట్టి విడుదల చెయ్యాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 26 Mar 2026 3:47 pm

మాడుగులపల్లి రోడ్లపై నరక దర్శనం గ్రామాలకు వెళ్లాలంటేనే వణుకు

మండల కేంద్రం నుండి గ్రామాలకు వెళ్లే దారిలో అగాధాల్లాంటి గుంతలు 200 మీటర్ల రోడ్డును పట్టించుకోని పాలకులు ప్రమాదాలకు నిలయం …

జనం సాక్షి 26 Mar 2026 3:43 pm

రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

అయ్యన్నపాత్రుడు ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా, దీనికి కేంద్ర చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు మార్చి 28న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఏపీ సచివాలయంలో స్పీకర్ మాట్లాడుతూ… రాజధాని విషయంలో ఇప్పటివరకు ఉన్న ఃలీగల్ గ్యాప్ఃను భర్తీ చేయడమే ఈ స్పెషల్ సెషన్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని సభలో ఏకగ్రీవ […] The post రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 3:40 pm

స్వదేశంలో టీమిండియా షెడ్యూల్ ను ప్రకటించిన బిసిసిఐ..

ఐపిఎల్ 2026 సీజన్ తర్వాత స్వదేశంలో టీమిండియా ఆడబోయే మ్యాచ్ ల షెడ్యూల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఈ సీజన్‌లో భారత్, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. వెస్టిండీస్‌తో మూడు వన్డేలు(ODI), ఐదు T20I మ్యాచ్‌ల సిరీస్..  శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు T20I మ్యాచ్‌ల సిరీస్.. చివరగా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ దేశీయ సీజన్ లో మొదట ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత ఇరుజట్ల మూడు వన్డేల సిరీస్ ఉంటుంది. ఈ ఏడాది చివర్లో సెప్టెంబర్ 27 నుండి వెస్టిండీస్ జట్టుతో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడనుంది. అనంతరం ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ అక్టోబర్ 6న ప్రారంభం కానుంది. ఇక, డిసెంబర్ నెలలో శ్రీలంక, భారత పర్యటనకు రానుంది. డిసెంబర్ 13న న్యూఢిల్లీలో జరిగే మొదటి మ్యాచ్ తో వన్డే సిరీస్ మొదలవుతుంది. డిసెంబర్ 22న T20I సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 3 నుండి 9 వరకు, భారత్ జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ జనవరి 21న ప్రారంభమవుతుంది. మొదటి టెస్టు మ్యాచ్‌కు నాగ్‌పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. మిగిలిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు చెన్నై, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్ లో జరుగుతాయి. ఈ టెస్టు సిరీస్ మార్చి 3 వరకు కొనసాగుతుంది.

మన తెలంగాణ 26 Mar 2026 3:36 pm