SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

Tirumala : తిరుమలకు శనివారం వెళ్లేవారికి తీపికబురు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 28 Mar 2026 8:29 am

'Gen Z' నిరసనల్లో హింస.. నేపాల్ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి అరెస్టు

నేపాల్ మాజీ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి అరెస్టు అయ్యారు. గత ఏడాది జరిగిన 'Gen Z' నిరసనల్లో ఓలి పాత్ర ఉందన్న ఆరోపణలపై నేపాల్ పోలీసులు ఆయనను శనివారం అరెస్టు చేశారు.  భక్తపూర్ జిల్లాలోని గుండులో ఉన్న ఓలి నివాసం నుండి నేపాల్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఓలితో పాటు, ఆయన హయాంలో హోం మంత్రిగా పనిచేసిన రమేష్ లేఖక్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గత సెప్టెంబర్‌లో జరిగిన 'Gen Z' నిరసనలను అణచివేసే క్రమంలో హత్య జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఓలిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఇవాళ ఉదయం వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు, తదుపరి ప్రక్రియ చట్టం ప్రకారం ముందుకు సాగుతుందని కాఠ్మండు లోయ పోలీసుల ప్రతినిధి ఓం అధికారి తెలిపారు. 'Gen Z' నిరసనల సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో విద్యార్థులు మరణించడంపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన ఒక కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. కమిషన్ సమర్పించిన నివేదికలో ఈ ఇద్దరు నాయకులను బాధ్యులుగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి బలేన్ షా అధ్యక్షతన జరిగిన మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలోనే, విచారణ కమిషన్ నివేదికను అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయి. విచారణ కమిషన్ నివేదికలో నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు దళం (Armed Police Force) మరియు సైన్యంలోని కొంతమంది అధికారుల ప్రవర్తనపై కూడా ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ, ప్రస్తుతానికి ఆ భద్రతా దళాలపై ఎటువంటి ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదు.

మన తెలంగాణ 28 Mar 2026 8:21 am

గుజరాత్ తీరానికిమరో ఎల్.పి.జి గ్యాస్ నౌక

భారత్‌కు మరో ఎల్‌పీజీ ట్యాంకర్ సురక్షితంగా చేరుకుంది

తెలుగు పోస్ట్ 28 Mar 2026 8:18 am

Andhra Prdesh :నేడు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

నేడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగనుంది

తెలుగు పోస్ట్ 28 Mar 2026 8:14 am

ఢిల్లీకి సమీపంలో నేడు మరో అంతర్జాతీయ విమానాశ్రయం

ఢిల్లీకి సమీపంలో నేడు మరో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుం

తెలుగు పోస్ట్ 28 Mar 2026 8:08 am

AP |హృదయ విదారక ఘటన..

AP | హృదయ విదారక ఘటన.. తల్లి మరణించిన ఐదు రోజులైనా బయటికి

ప్రభ న్యూస్ 28 Mar 2026 8:06 am

ఇరాన్ నిర్ణయంతో భారత్ కు ఊరట

భారత్‌కు ఊరటనిచ్చేలా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 28 Mar 2026 8:01 am

వినియోగదారులకు షాక్ .. పెట్రోలు ధరలు తగ్గవు

వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఎలాంటి ఊరట లభించలేదు

తెలుగు పోస్ట్ 28 Mar 2026 7:54 am

ఆదాయపు పన్ను శాఖ కంట్లో బంగారు బాబు

ఆదాయపు పన్ను శాఖ కంట్లో బంగారు బాబు

తెలుగు పోస్ట్ 28 Mar 2026 7:49 am

ఇరాన్ భీకర దాడి..10 మంది అమెరికా సైనికులకు గాయాలు, విమానాలు ధ్వంసం

రియాద్: పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రమవుతోంది. ఇరాన్, గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది.సౌదీ అరేబియాలోని అమెరికాకు చెందిన సైనిక స్థావరంపై శుక్రవారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో దాదాపు 10 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ జరిపిన దాడిలో తమ సైనికులు గాయపడ్డారని.. పలు అమెరికా ఇంధన సరఫరా విమానాలు దెబ్బతిన్నాయని అమెరికా అధికారులు తెలిపారు. గాయపడిన సైనికులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.  కాగా, ఇరాన్‌ను తుడిచిపెట్టేశామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే ఇరాన్ దాడులు చేసింది. క్షిపణితో పాటు మానవరహిత డ్రోన్‌లను ఉపయోగించి ఇరాన్ ఈ దాడి జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మరోసారి భీకర దాడులు జరిగే అవకాశం ఉంది. 

మన తెలంగాణ 28 Mar 2026 7:40 am

Israel - Iran War : క్షిపణి దాడులను కొనసాగిస్తున్న ఇరాన్...సౌదీ సైనిక స్థావరంపై అటాక్

ఇరాన్ శుక్రవారం కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలపై క్షిపణి దాడులు కొనసాగించింది

తెలుగు పోస్ట్ 28 Mar 2026 7:28 am

Israel - Iran War : నెల రోజులు దాటినా.. ఆగని యుద్ధం.. ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు

ఇజ్రాయెల్ ఇరాన్ అణు సదుపాయాలపై దాడులు చేసింది.

తెలుగు పోస్ట్ 28 Mar 2026 7:15 am

యుద్ధం వేళ అప్రమత్తం

న్యూఢిల్లీ: ప్రస్తుత ఎడతెగని పశ్చిమాసియా యుద్ధం, సంబంధిత సంక్షోభం దశలో భారతదేశం టీమిండియాగా వ్యవహరిస్తుందని , అ త్యంత ప్రాధాన్యత క్రమంలో ముందుగా సరఫరాల గొలుసుకట్టు వ్యవస్థల సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకుంటారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సంక్షోభ దశలో పరిస్థితి సమీక్షకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నతస్థాయిలో కీలకమైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర మంత్రిమండలిలోని కీలక మంత్రిత్వశాఖల మంత్రులు , కేబినెట్ సెక్రెటరీలు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యత వహిస్తూ ఖరారు చేసుకున్న ప్రాధాన్యతాక్రమాలను ముఖ్యమంత్రులకు వివరించారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత నిర్వహణ కుంటుపడరాదు..ఇంధన భద్రతకు తిరుగులేకుండా చేయాలి. దేశ పౌరుల ప్రయోజనాలను పరిరక్షించాలి. అన్నింటికి మించి నిత్యావసరాలు, చమురు ఇంధన సరఫరా వ్యవస్థలను పటిష్టపర్చుకోవాలి. పారిశ్రామిక వ్యవస్థకు ప్రతికూలత ఏర్పడరాదనేవి కలిసికట్టు బృందంగా ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాలు కావల్సి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చత ఎటు నుంచి ఎటు దారితీస్తుందో తెలియని స్థితికి తీసుకువెళ్లుతోంది. ఈ దశలో మనమంతా మరింత జాగరూకత, అంతకుమించిన సమన్వయంతో , సవాళ్లపై తక్షణ స్పందనతో ముందుకు వెళ్లాల్సి ఉందని పిలుపు నిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినహాయించి ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని అధ్యక్షతన జరిగిన భేటీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠత , ఆసక్తి నెలకొంది. కఠిన నిర్ణయాలు ఉంటాయనే ఊహాగానాలు వెలువడ్డాయి. లాక్‌డౌన్ వార్తలను కేంద్రం ఖండించింది. టీం ఇండియా స్ఫూర్తితో ఏదైనా ఎదుర్కొవచ్చు ః ప్రధాని పిలుపు సంక్షోభ సమయంలో మనం కలిసికట్టుగా పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుంటుందని ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ తెలిపారు. టీం ఇండియా స్ఫూర్తి ఇంతకు ముందు కోవిడ్ దశలో ప్రదర్శించామని, ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం నుంచి తలెత్తిన సవాళ్ల దశలో కూడా ఇదే విధానం అవలంభించాలని కోరారు. ఈ విధంగా మనం విజయం సాధించగలమనే నమ్మకం తనకు ఉందన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉంది. పరిణామాలు గణనీయంగా ఉంటున్నాయి. నిరంతర పర్యవేక్షణ అవసరం అన్నారు. ఈ దిశలో తమ ప్రభుత్వం ఇప్పుడు అంతర్గత మంత్రుల బృందం ఏర్పాటు చేసిందని వివరించారు. పరిస్థితిని ఈ నెల 3వ తేదీ నుంచి సమీక్షిస్తున్నారని, చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. బ్లాక్‌మార్కెటీర్లపై ఉక్కుపాదం తప్పనిసరి ఇప్పుడు నిత్యావసర సరుకుల సరఫరా అత్యంత కీలక విషయం అని ప్రధాని మోడీ చెప్పారు. ఈ క్రమంలో సరఫరాల వ్యవస్థ క్రమపద్థతిలో ఉండాలి. నిర్వహణ గతి తప్పరాదని హితవు పలికారు. ప్రత్యేకించి బ్లాక్ మార్కెట్, సరుకుల నిల్వలకు దిగే వారిపై రాష్ట్రాలలో పూర్తి స్థాయి కఠిన చర్యలు అవసరం అని ప్రధాని తెలిపారు. రాష్ట్రాల ప్రధాన కేంద్రాలలోనే కాకుండా, జిల్లా పంచాయతీ స్థాయిల్లో కూడా అధికార నిర్వహణ యంత్రాంగం సరిగ్గా పనిచేయాల్సి ఉంటుందని, పనిచేసేలా చేసే బాధ్యత రాష్ట్రాలపై ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ తమ సమీక్షలో వ్యవసాయ రంగంలో ముందస్తు ఏర్పాట్లు అవసరం అని , ఎప్పటికప్పుడు ఎరువుల కొరత , విత్తనాల పంపిణీలపై చర్యలు అవసరం అని ప్రధాని సూచించారు. ఖరీఫ్ పంటకాలం ముందున్నందున రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని , సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికననే మేల్కొల్పాపాల్సి ఉంటుందని ప్రధాని ముఖ్యమంత్రులకు తెలిపారు. వదంతులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ మోసాలు, మోసాల రాయుళ్ల పనిపట్టేందుకు క్షేత్రస్థాయిలో నిఘా పెంచాల్సి ఉందని సిఎంలకు తెలిపాఈ రు. సరిహద్దులు, తీర ప్రాంతాల రాష్ట్రాలకు ప్రత్యేకమైన రీతిలో జాగ్రత్త చర్యలు అవసరం అని ప్రధాని సూచించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు తమతమ శాఖలకు సంబంధించి ఇప్పటి సవాలును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. దేశంలో పలు ప్రాంతాలలో వంటగ్యాసు, పెట్రోలు డీజిల్ కొరత రాకుండా చేయడంలో కేంద్రం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ఇప్పుడు ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గింపును అభినందించారని అధికారులు వెల్లడించారు. పశ్చిమాసియా సంక్షోభ తీవ్రత దశలో కేంద్ర ప్రభుత్వం అనధికారిక అంతర్గత మంత్రుల బృందం (ఐగామ్) ఏర్పాటు చేసింది. దీనికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వం వహిస్తారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరీ సభ్యులుగా ఉంటూ సహకరిస్తారు. గల్ఫ్ సంక్షోభంపై బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. తీసుకోవల్సిన చర్యలను నివేదిస్తుంది. ఇప్పటి యుద్ధం చమురు సంక్షోభాన్ని తద్వారా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం ఆగిపోయే సూచనలు కూడా వెలువడటం లేదు. నాలుగు వారాలు దాటిన ఈ యుద్ద ప్రభావంపై ఈ మంత్రుల బృందం స్పందించాల్సి ఉంటుంది. 

మన తెలంగాణ 28 Mar 2026 6:00 am

28thMarch2026 |శనివారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

28thMarch2026 | శనివారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 28thMarch2026 |

ప్రభ న్యూస్ 28 Mar 2026 6:00 am

కల్యాణం కమనీయం

మన తెలంగాణ/ భద్రాచలం: భద్రాచలంలో శుక్రవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం వైభవోపేతంగా సాగింది. ఉదయం 9:45 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ మొదలైన ఊరేగింపు మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపా నికి స్వామి వారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను 10.42 కి మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, ఎదురుగా అమ్మవారిని ఆసీనులను చేశారు. అలాగే కళ్యాణం సందర్భంగా భక్తరామ దాసు చేయించిన నగలను వధూవరులకు ధరింపజే శారు. తొలుత వంశ గోత్రాలకు సంబందించి ప్రవరలు చదివారు. ఈ సమయంలో ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పష్పోదక స్నానం జరిపి వరపూజ నిర్వహించారు. కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్తరామ దాసు చేయించిన నగలను వధూవరులకు ధరింపజే శారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున చైర్మన్ బీఆర్ నాయుడు, శృంగేరి శారదా పీఠం, చినజీయర్ స్వామి తరపున, భక్తరామదాసు వారసులు కంచర్ల శ్రీనివాసరావులు, తూము నరసింహదాసు వంశీ కులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిం చారు. భద్రాద్రి రాముని కల్యాణ వైభవ ప్రాశస్త్యంతో పాటు భక్తరామదాసు చేయించిన ఆభరణాల విశిష్టతను దేవస్థా నం స్థానాచార్యులు కేఈ స్థలశాయి వివరించారు. అర్చక స్వా ములు మధుపర్కం ప్రాశసన ఆనం తరం తేనె, పెరుగు కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించి నూతన వస్త్రాలంకరణ చేశా రు. లోక పర్యంతాన్ని, విశ్వసృష్టిని దానిలో ఉన్న కాలాన్ని, దేశా న్ని తెలుపుతూ సంకల్పం చెప్పి కన్యాదాన కరిష్యే అంటూ ముగించారు. ఈ సమయంలో కన్యావరణలు. కొబ్బరిబొండం, తాంబూ లం, దక్షిణ స్వామి వారికి సమర్పించారు. కన్యాదానంతో పాటు గోదానం, భూదాన కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వ హించారు. రామ భద్రుడికి, సీతామాతకు వేర్వేరుగా మంగళాష్టకం చదివారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని వివరిస్తూ ఉత్సవమూర్తుల శిరస్సుపై ఉంచారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎం రేవంత్‌రెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రా లు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం దశరధు డు, జనకమహారాజు తరపున, భక్తుల తరపున భక్తరామదాసు చే యించిన మూడు మంగ శసూత్రాలతో కూడినసూత్రధారణను క న్నుల పండువగా నిర్వహించారు. ఆ తరువాత తలంబ్రాల ప్రాశ స్త్యం వివరిస్తూ తలంబాల కార్యక్రమం సంప్రదాయబ ద్ధంగా అర్చకస్వాములు నిర్వహించారు. చివరగా భాగవోత్తముల ఆశీర్వచనంతో కళ్యాణం ముగిసింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , కొండా సురేఖ , వాకాటి శ్రీహరి కుటుంబ సమేతంగా తిలకించారు. అలాగే ఎంపీ పోరిక బరాంనాయక్, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకట్రావు, కో రం కనకయ్య, దుబ్బాక కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్, రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీవో రాల్, దేవస్థానం ఈవో కె.దామోదరావులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 28 Mar 2026 5:00 am

‘అనర్హత’పై ఉత్కంఠ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఉత్కంఠ వీడలేదు. ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చి న తీర్పును హైకోర్టులో బిఆర్‌ఎస్ సవాల్ చేయడంతో కేసు ఎటు దారి తీస్తుందోనన్న అనుమానా లు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. పశ్చిమ బెంగాల్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యే ముకుల్ రాయ్ సభ్యత్వాన్ని కోల్‌కత్తా హైకోర్టు రద్దు చేసిన ఉదంతంతో ఇక్కడా పునరావృత్తమవుతుందా? అనే చ ర్చ ఆరంభమైంది. అనర్హత పిటిషన్లపై మీరు ఇ చ్చిన తీర్పుపై తమకు వివరణ ఇవ్వాలని హైకోర్టు స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు నోటీసు జారీ చేస్తూ కేసును ఈ నెల 16న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్‌ను మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకూ కోర్టు నో టీసులు జారీ చేసింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చడంతో ఊపిరి పిల్చుకున్న ఎమ్మెల్యేలు టి.ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రా వు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రె డ్డి, అరికెపూడి గాంధీ, కె.సంజయ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్ గుం డెల్లో గుబులు ఆరంభమైంది. అందుకు కారణం లేకపోలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి టిక్కెట్‌పై గెలుపొందిన ముకుల్ రాయ్ కొంత కా లానికి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బిజెపి నేతలు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరాయించిన ట్లు అన్ని సాక్షాధారాలు ఉన్నాయంటూ హైకోర్టు ధర్మాసనం సదరు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెం గాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున తమకు న్యాయం జరగదని బిజెపి తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు వాదన వినిపించారు. కానీ కోర్టు తీసుకున్న నిర్ణయం సంచలనం కలిగించింది. రాష్ట్రంలోని పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలోనూ అనేక మలుపులు తిరిగి చివరకు ఈ నెల 11న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించినట్లు సరైన సాక్షాధారాలు లేవంటూ స్పీకర్ పేర్కొంటూ ఆ పది మందిపై దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చారు. దీంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి.కేసు పూర్వాపరాల్లోకి వెళితే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు క్రమేణా వేర్వేరుగా కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాకుండా 2024లో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (ఖైరతాబాద్) పోటీ చేశారని, ఆయన పోటీ చేసినట్లు ‘బి-ఫాం’ జిరాక్స్ ప్రతినీ స్పీకర్‌కు అందజేశామని, ఏఐసిసి విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో దానం పేరు ఉండడాన్నీ సాక్షాధారంగా చూపించామని బిఆర్‌ఎస్ అప్పటి పిటిషన్‌లో పేర్కొంది. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్) తన కుమార్తె కడియం కావ్య లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు బాజప్తా ప్రచారం చేశారని బిఆర్‌ఎస్ మరో పిటిషన్‌లో పేర్కొంది. మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రకటించుకోవడం, ముఖ్యమంత్రితో ఫొటోలు దిగడం, కండువాలు కప్పించుకోవడం వంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వార్తల క్లిప్పింగ్స్‌నూ స్పీకర్‌కు సమర్పించామని బిఆర్‌ఎస్ వాదన. చివరకు స్పీకర్ వారెవ్వరూ పార్టీ మారినట్లు తమకు సరైన సాక్షాధారాలు చూపించనందున కేసును కొట్టి వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దానంపై తొలుత ఏలేటి ఇదిలాఉండగా స్పీకర్ తీర్పు వెలువరించిన తర్వాత బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తొలుత ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ తర్వాత ఏడు మంది ఎమ్మెల్యేలపై బిఆర్‌ఎస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. అనంతరం రెండో రోజున మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కె. సంజయ్, కడియం శ్రీహరిపై పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరపున గండ్ర మోహన్ రావు పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహీయుద్దీన్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 16న విచారణ చేపట్టనున్నది.

మన తెలంగాణ 28 Mar 2026 4:30 am

పెట్రో ఉత్పత్తులపై సుంకంలో కోత

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పెట్రోలు, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు రూ.10 చొప్పున తగ్గించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ గురువారం అర్థరాత్రి నోటిఫికేషన్ వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్ సంక్షోభం, హర్మూజ్ జలసంధి మారంగంలో రవాణాకు అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగకుండా ఉండేందుకు, క్రమేపీ గణనీయంగా తగ్గేందుకు ఈ సుంకం తగ్గింపు నిర్ణయం దారితీస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో పెట్రోలుపై ఇంతకు ముందు ఉన్న లీటర్‌కు రూ.13 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ ఇకపై రూ.3గా కుదించారు. డీజిల్‌పై ఇది ఇంతకు ముందు రూ 10 ఉండగా దీనిని ఇప్పుడు పూర్తిగా ఎతివేశారు. ఈ చర్యతో ప్రభుత్వ ఖజానాకు దాదాపుగా రూ 1.75 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఈ సుంకం భారీ స్థాయి తగ్గింపు వల్ల ముందుగా చమురు పంపిణీ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. క్రమేపీ దీని పరిణామాలలో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు భారీ స్థాయిలోనే తగ్గుతాయి. పైగా చమురు సంక్షోభం దశలో వెనువెంటనే దేశంలో ఇందన ధరలు పెరగకుండా ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పటి నిర్ణయాలలో భాగంగా ప్రభుత్వం డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్)పై సుంకాలను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో డీజిల్‌పై ఇది లీటర్‌కు రూ 21.5గా ఉంటుంది. ఎటిఎఫ్‌పై ఇది రూ 29.5గా పడుతుంది. ధరల్లో మార్పు ఉండదు: ఆర్థిక మంత్రి కేంద్రం పెట్రోల్‌పై సుంకాలను తగ్గించినా డీజిల్‌పై లేకుండా చేసినా వెనువెంటనే ఈ సవరణలతో పెట్రోల్ పంపులలో ధరలలో మార్పు ఉండదు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో వినియోగదారులపై ఇంధన ధరల పెంపు ప్రభావం పడకుండా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. సరఫరాల హెచ్చుతగ్గులు, సంక్షోభ ప్రభావం వినియోగదారులపై పడకుండా చేయడానికే ఈ నిర్ణయం ఉపకరిస్తుందన్నారు. ఈ దిశలోనే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ముడిచమురు ధరల ప్రభావంతో అంతర్జాతీయంగా పలు దేశాలలో గడిచిన నెలరోజుల్లో విపరీత ప్రభావం పడిందన్నారు. అంతకు ముందు బ్యారెల్‌కు 70 డాలర్లు ఉండగా ఇది ఇప్పుడు 100 డాలర్లు దాటుతోందని అన్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులపై పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావం అన్ని దేశాలలో పడుతోందన్ని, ఆగ్నేయాసియా దేశాలలో ఈ ధరలు దాదాపుగా 30 నుంచి 50 శాతం పెరిగాయన్నారు. ఆఫ్రికా దేశాలలో ఇది 20 నుంచి 50 శాతంగా పెరిగాయని, ఈ దశలో భారత్‌లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, దానిని నివారించేందుకు ప్రభుత్వం వద్ద రెండే మార్గాలు ఉన్నాయన్నారు. ఒకటి ధరలు గణనీయంగా పెంచడం లేదా ప్రభుత్వ సంస్థలుఈ భారం భరించడం అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయం వెలువడిందని మంత్రి తెలిపారు. ఇప్పటికిప్పుడు ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల మధ్య ఇంధన ధరలు వెంటనే మార్కెట్‌లో దిగకపోవచ్చు. అయితే ఇప్పుడు సుంకం కుదింపుతో వెనువెంటనే అనివార్యంగా జరగాల్సిన రీతిలో ఇంధనల ధరలు పెరిగే అవకాశం ఉండదు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ విషమ పరిస్థితికి కళ్లెం పడిందని విశ్లేషిస్తున్నారు. ఎన్నికలపై దృష్టితోనే : కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాల కోతకు దిగింది కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లాభం పొందేందుకే అని కాంగ్రెస్ విమర్శించింది. గతంలో పలుసార్లు అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు ఏడుసార్లు పడిపోయినా దేశంలో వినియోగదారులకు ధరల వెసులుబాటు కల్పించలేదని , ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం ఈ నాటకమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. ఎప్రిల్ 30 వరకూ చూడండీ ఈ ప్రభుత్వమే తిరిగి ఏ విధంగా దెబ్బ తీస్తుందో అన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారం: బిజెపి ఇంధన ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే ప్రతిపక్షాలు దుష్ప్రచారానికి దిగుతున్నాయని బిజెపి ఎదురుదాడికి దిగింది. కేం ద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇకపై వినియోగదారులకు ఇంధనం తక్కువ ధరలకు దొరుకుతుందని, కాంగ్రెస్ ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలపై బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. 

మన తెలంగాణ 28 Mar 2026 3:00 am

‘బంగారుబాబు’కు ఝులక్

మనతెలంగాణ/మాదాపూర్ : ఒంటిపై కిలోల కొద్దీ బంగారు ఆభరణాలతో తిరిగే బంగారుబాబుకు ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఝలక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లగా ఢిల్లీ ఎ యిర్‌పోర్టులో అనుమానం వచ్చి ఆదాయం పన్ను శాఖ అధికారులు అడ్డుకున్నారు. సుమారు నాలుగున్నర కిలోలకు పైగా ఉన్న ఈ ఆభరణాల విలు వ రూ.7 కోట్లకుపైగా ఉండటంతో ఐటి అధికారు లు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించా రు. ఇందుకు సంబంధించిన బిల్లులు చూపించాలని అధికారులు కోరగా బిల్లులు హైదరాబాద్‌లో ఉన్నాయని, ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వ చ్చానని, తర్వాత బిల్లులు ఇస్తానని చెప్పడంతో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని వదిలినట్లు సమాచారం. శేరిలింగంపల్లి చందానగర్‌కి చెందిన హోప్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మన్ కొండా విజయ్ కుమార్ న్యూఢిల్లీలో జరుగుతున్న హకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లారు. వంటినిండా బంగారంతో కనిపించిన ఆయనను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆదాయపుపన్ను అధికారులు గురువారం నాడు అడ్డుకున్నారు. బంగారం గు రించి ఆరా తీశారు. ఈ మేరకు రెండు గొలుసుల ను తీసుకుని వాటికి సంబంధించిన బిల్లులు చూ పించాలని నోటీసులు ఇచ్చారు. అనంతరం న్యూ ఢిల్లీలో జరిగిన హకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న అనంతరం శుక్రవారం సా యంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

మన తెలంగాణ 28 Mar 2026 12:20 am

లాక్‌డౌన్ ప్రసక్తే లేదు

న్యూఢిల్లీ: పశ్చిమాసి యా సంక్షోభం నేపథ్యం లో లాక్‌డౌన్ విధిస్తారన్న ఊహాగానాలపై కేంద్ర ఆ ర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర పెట్రోలి యం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి అలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభు త్వం వద్ద లేదని స్పష్టం చేశారు.మంత్రి సీతారామన్ రాజ్యసభలో ఆర్థిక బిల్లు 2026పై చర్చకు సమాధానం ఇస్తూ మాట్లాడుతూ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ ఆ భారం సామాన్య ప్రజలపై పడకుండా ప్రభు త్వం ఆర్థిక లోటును నియంత్రిస్తోందని చెప్పారు. అనేక దేశాలు మోటా ర్ ఇంధనం ధరలు 2ం నుంచి 50 శాతం వరకు పెంచాయని, కానీ భారత్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా అదుపులో ఉంచగలిగినట్టు వివరించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బంకుల వద్ద పెట్రోలు, డీజిల్ ధరలు పెంచకుండా ఉండేలా ప్రభుత్వం వాటిపై ఎక్సయిజ్ డ్యూటీని రూ. 10 వంతున తగ్గించింది. గతంలో ఎలా ఆర్థిక క్రమశిక్షణ పాటించడమైందో అదే విధంగా పాటిస్తున్నట్టు మంత్రి వివరించారు. పన్నుయేతర ఆదాయాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. తరువాత మూజువాణీ ఓటు ద్వారా రాజ్యసభ ఆర్థిక బిల్లును లోక్‌సభకు తిప్పి పంపించింది. కేంద్ర మంత్రి పురి స్పందన సామాజిక మాధ్యమ వేదిక ద్వారా కేంద్రమంత్రి పురి ఇంధనం సరఫ రా, నిత్యావసరాలు సరైన సమయంలో అందుబాటులోకి రావడంపై అత్యంత సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇంధ నం, ఇతర అవసరాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రధాని మోడీ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 

మన తెలంగాణ 28 Mar 2026 12:14 am

శనివారం రాశి ఫలాలు (28-03-2026)

మేషం ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వృషభం ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మిధునం ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కర్కాటకం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. సింహం ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తుల అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కన్య ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య పరంగా కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. తుల సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృశ్చికం ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. ధనస్సు ముఖ్యమైన వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మకరం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. కుంభం ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. మీనం బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.  

మన తెలంగాణ 28 Mar 2026 12:10 am

ఆరని యుద్ధ జ్వాలలు

దుబాయ్: ఓ వైపు ట్రంప్ ఇరాన్‌తో చర్చలు పురోగతిలో ఉన్నాయని చెపుతున్నా , క్షేత్రస్థాయి పరిస్థితి భిన్నంగా ఉంది. వాస్తవికంగా శాంతిప్రతిపాదనల ఫార్మూలాపై ఇటు అమెరికా, అటు ఇరాన్ తమ పట్టువీడని ధోరణినే కనబరుస్తున్నాయి. మరో వైపు ఇరాన్‌కు మరింత సవాలు విసురుతూ అమెరికా గల్ఫ్ ఇతర ప్రాంతాలలోకి వేలాదిగా అ దనపు సైనిక బలగాలను తరలిస్తోంది. పలు యు ద్ధ నౌకలు హర్మూజ్ జలసంధి వద్దకు చేరాయి. ఇజ్రాయెల్ ఇప్పటి చర్చల విషయంతో తమకు ని మిత్తం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. సదర్న్ లెబనాన్‌లోని ఇరాన్ మద్దతు గల హెజ్బోల్లా మిలిటెంట్ల బృందాల నిర్మూలనకు మరిన్ని బలగాలను తరలించింది. హర్మూజ్ మార్గానికి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో ఇరాన్ ఈ మార్గంలో తన పట్టు బిగించింది. కేవలం మిత్రదేశాలనే ఈ మార్గం ద్వారా అనుమతిస్తోంది. ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో ఇరాన్ క్షిపణి దాడులు సాగుతూనే ఉన్నాయి. ఇరాన్ రాజధాని టెహరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను చేస్తూనే ఇరాన్ క్షిపణులను , డ్రోన్లను దెబ్బతీసేందుకు తమ గగనతల వలయాన్ని పటిష్టపర్చుకుంది. ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు, చమురు నష్టం నివారణకు గల్ప్‌దేశాలు అన్ని కూడా అనుక్షణ నిఘాతో వ్యవహరిస్తున్నాయి. శుక్రవారం టెహరాన్ ఇతర నగరాలలో ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఇరాన్‌పై తమ దాడులు నిర్విరామంగా సాగుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌లో ప్రజల నివాస ప్రాంతాలపై దాడులు నిలిపివేయాలని , లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని తాము, ప్రధాని నెతన్యాహూ ఇరాన్‌కు హెచ్చరికలు వెలువరిస్తున్నామని గుర్తు చేశారు. ఇకనైనా ఇరాన్ ఉగ్రవాద పాలకపక్షం విధ్వంస చర్యలకు దిగకుండా ఉంటే మంచిదని కట్జ్ స్పష్టం చేశారు. తాము హెచ్చరిస్తూ వస్తున్నా, ఇరాన్ వైఖరిలో మార్పు రావడం లేదని, దీనితో ఇక తమ పోరు మరింత విస్తరించుకుంటామని, ఇరాన్‌లోని పలు కొత్త ప్రాంతాలను లక్షం చేసుకుని తీరుతామని వెల్లడించారు. ఇజ్రాయెల్ శుక్రవారం టెహ్రాన్ నడిబొడ్డున నిర్ణీత ప్రాంతాలను ఎంచుకుని దాడులకు దిగింది. ఆయా ప్రాంతాలలో ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ తయారీ కేంద్రాలు , అధునాతన ఆయుధాల కర్మాగారాలు ఉన్నాయని నిర్థారించుకుని ఈ దాడులు జరిపారు. ఇరాన్ పశ్చిమ ప్రాంతంలో తమ సేనలు అక్కడి ఇరాన్ మిస్సైల్ లాంఛర్లు, గిడ్డంగులను ఎంచుకుని దాడులకు దిగాయి. ఇక లెబనాన్‌లోని బీరూట్‌పై దాడులు జరిగాయి. ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున మంటలు దట్టమైన పొగ కమ్ముకుంది. గల్ఫ్‌పై ఆగని ఇరాన్ దాడులు.. సైరన్ల మోత గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. బహరైన్, ఖతార్, యుఎఇలలో సైరన్ల మోతతో జనం వణికిపోయారు. రియాద్ వైపు దూసుకువచ్చిన ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్‌రు తాము కూల్చివేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. సౌదీ రాజధాని రియాద్‌ను గురిచేసుకుని ఇరాన్ శుక్రవారం దాడులు విస్తృతం చేసింది. కువైత్‌లోని కువైత్ సిటి అనుబంధ షువైక్ పోర్టు, ఉత్తరాన ఉన్న ముబారక్ అల్ కబీర్ పోర్టు ఇరాన్ దాడులలో దెబ్బతిన్నాయి. ఇందులో కబీర్ పోర్టును చైనా నిర్మాణపు బెల్ట్ అండ్ రోడ్ ఏర్పాటు క్రమంలో నిర్మిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణ సామాగ్రి దెబ్బతింది. టెహరాన్‌లో పాక్ ఎంబసీ వద్ద దాడులు శుక్రవారం టెహరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల క్రమంలో అక్కడి పాకిస్థాన్ దౌత్యకార్యాలయం వద్ద వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో పాక్ ఎంబసీకి ఎటువంటి నష్టం జరగలేదు. అధికారులు ,సిబ్బందికి కూడా ఎటువంటి హానీ జరగలేదు. అయితే ఈ ఘటనపై వెంటనే పాకిస్థాన్ తీవ్రస్థాయిలో ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు వెలువరించింది. తమ దేశాన్ని ఖతార్ అనుకోరాదని, ప్రపంచంలో ఎక్కడైనా తమ దౌత్యసిబ్బందికి,ఆస్తులకు నష్టం జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడులలో దౌత్యకార్యాలయం సమీపంలోని పలుభవనాలు దెబ్బతిన్నాయి. ఇరాన్, అమెరికా మధ్య శాంతికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందనే వార్తలు నేపథ్యంలో ఇక్కడ ఈ దాడి జరిగింది. అయితే ఈ ఘటనపై అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ స్పందించలేదు. 

మన తెలంగాణ 27 Mar 2026 11:55 pm

సైబర్ క్రైమ్‌పై సర్జికల్ స్ట్రైక్

మన తెలంగాణ/కరీంనగర్ క్రైం: సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌పై కరీంనగర్ పోలీసులు సర్జికల్ స్ట్రైక్ చేశారు. ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0’ పేరుతో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో రూ.138కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర సైబర్ ముఠాను పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం 24మంది నిందితులను గుర్తించగా, అందులో మేనేజర్‌తో సహా 13మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనరేట్ హా ల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. సిపి తెలిపిన వివరాల ప్రకారం నిందితులు రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ కొన్ని వర్చువల్  ఖాతాల ద్వారా భారీ ఎత్తున నిధులను మళ్లించినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆర్‌బిఎల్ మ్యూల్ ఖాతాల ద్వారా: రూ.125.80 కోట్లు, వర్చువల్ ఖాతాల ద్వారా రూ.12.25 కోట్లు. సుమారు రూ.138 కోట్లు నేరగాళ్ల చేతులు మారినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. నేరగాళ్ల పద్ధతి సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, కొద్దిపాటి కమిషన్ ఆశచూపి వారి పేరుతో ’మ్యూల్ బ్యాంక్ ఖాతాల’ను ఈ ముఠా తెరిపిస్తోంది. ఈ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు, నెట్ బ్యాంకింగ్ వివరాలను నేరగాళ్లు తమ ఆధీనంలో ఉంచుకుని, సైబర్ మోసాల ద్వారా వచ్చిన సొమ్మును విదేశాలకు మళ్లిస్తున్నారు. ఈ ప్రక్రియలో సమన్వయకర్తలు, మధ్యవర్తులు,ఖాతాదారులు ఒక గొలుసుకట్టుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.అరెస్టయిన వారిలో కీలక సూత్రధారులతో పాటు బ్యాంక్ అధికారులు అయినా భువనగిరి కళ్యాణ్ (ఆర్‌బిఎల్ బ్యాంక్ మేనేజర్, హన్మకొండ), అయేషా బేగం (కరీంనగర్)ఉండటం గమనార్హం.ముఖ్య నిందితులు అయినా బండారి సాయిరాం, అనుమాండ్ల రంజిత్, అలిగేటి మల్లేశం, బోగ రాకేష్, బండి ప్రణయ్ లను అరెస్ట్ చేశారు. ఖాతాదారులు విభూది రాంకుమార్, నతర్ల శ్రీనివాస్, కర్రే రాజు, కల్లెడ మహేందర్, కొండ్ర నరహరి, కల్లెడ రాజేష్ వీరిపై భారత న్యాయ సంహిత సెక్షన్లు 112, 318(4) ఐటీ యాక్ట్ సెక్షన్ 66- డి కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ హెచ్చరిక ‘డబ్బుల ఆశతో మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలను, ఏటీఎం కార్డులను ఇతరులకు అప్పగించకండి. అలా చేస్తే మీరు కూడా నేరస్థులుగా పరిగణించబడతారని పోలీస్ కమిషనర్ ప్రజలను హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన 11 మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, త్వరలోనే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 27 Mar 2026 11:51 pm

فیکٹ چیک: بیلجیم کی ٹرین پر 'اسرائیلی فورسس کی موت' کی تحریر کی جانئے پوری حقیقت

وائرل پوسٹس میں دعویٰ کیا گیا کہ بیلجیم ریل محکمے نے ایران جنگ کے تناظر میں ٹرین پر 'آئی ڈی ایف کی موت' کی گریافیٹی تحریر کی۔ تحقیق سے واضح ہوا کہ یہ ویڈیو اکتوبر 2025 کا ہے جسے من گھڑت دعوے کے ساتھ شیئر کیا گیا۔

తెలుగు పోస్ట్ 27 Mar 2026 11:26 pm

రేపు హైదరాబాద్‌తో బెంగళూరు తొలి పోరు

 ఐపిఎల్ సీజన్ 2026కి సర్వం సిద్ధమైంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ టోర్రమెంట్‌కు తెరలేస్తోంది. ఇక ఇటు హైదరాబాద్ అటు బెంగళూరు జట్లు విజయమే లక్షంగా పెట్టుకున్నాయి. రజత్ పటిదార్ సారథ్యంలోని బెంగళూరు భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2025లో బెంగళూరు తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లి, జితేశ్ శర్మ, పడిక్కల్, టిమ్ డేవిడ్, ఫిలిప్ సాల్ట్, బెథెల్, భువనేశ్వర్ కుమార్, జోర్డాన్, డఫీ, కృనాల్ పాండ్య,షెఫర్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు బెంగళూరులో ఉన్నారు. ఇక ఈ టోర్నీకి కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా మారాడు. మరోవైపు హైదరాబాద్‌లోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. దీంతో సన్‌రైజర్స్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. రాత్రి 7.30 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్..జియో హాట్‌స్టార్‌లో..

మన తెలంగాణ 27 Mar 2026 11:20 pm

మంచు చరియలు విరిగిపడి ఏడుగురు మృతి

 శ్రీనగర్‌లేహ్ జాతీయ రహదారిపై శుక్రవారం మంచు చరియలు విరిగి పడటంతో ఏడుగురు మృతి చెందగా, మరో ఐదు మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. జీరో పాయింట్ నుంచి మినిమార్గ్ మధ్య మధ్యాహ్న సమయంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. భారీగా కురిసిన మంచు కారణంగా పలు వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ (బీఆర్‌వో), పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. మంచును తొలగించడంతో పాటు ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంపై లద్దాఖ్ గవర్నర్ వీకే సక్సేనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

మన తెలంగాణ 27 Mar 2026 11:09 pm

IrIrgc Warning : వాళ్లని వదలం Andhra Prabha Detail Report

Irgc Warning : వాళ్లని వదలం Andhra Prabha Detail Report (

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:30 pm

ఈనెల 31న మహిళా రైతు రాష్ట్ర సదస్సు

ఈ నెల 31న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో జరిగే మహిళా రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్ రావు, టి సాగర్, కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఆర్‌టిసి క్రాస్ రోడ్ లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మహిళా రైతుల రాష్ట్ర సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు వివిధ జిల్లాల నుండి మహిళా రైతులు హాజరవుతున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతున్న కొద్ది పురుషుల సంఖ్య తగ్గి మహిళల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. వ్యవసాయాన్ని మహిళలే కొనసాగిస్తున్న పరిస్థితి ఉందని, వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రభుత్వాలు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే విత్తనబిల్లు, మార్కెట్ ముసాయిదా బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులు తీసుకొచ్చారు. గతంలో రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉన్న అవకాశాలను కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు భూమిపై ఎలాంటి హక్కులు లేవు, జాయింట్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికి ఎన్నికలకు ముందు పాలకులు వాగ్ధానాలు చేస్తున్నారే తప్ప ఆచరణలో అమలు కావడంలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి సందర్భంగానైనా ఈ అంశం ఉండే విధంగా చూసుకుంటే ఉపయోగకరంగా ఉండేదని సూచించారు. కౌలు రైతులలో కూడా మహిళలు గణనీయంగా ఉన్నారని, వీరికి పెట్టుబడి కోసం జాయింట్ లయబుల్ గ్రూపులను ఏర్పాటు చేసి వీటి ద్వారా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ అరిబండి ప్రసాద రావు, పెసరగాయల జంగారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితలులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 27 Mar 2026 10:30 pm

కేరళ స్టార్ క్యాంపెయినర్‌గా సిఎం రేవంత్ రెడ్డి

ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు కాంగ్రెస్ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. కేరళ రాష్ట్రంపై ప్రధానంగా దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం ఆ రాష్ట్రానికి స్టార్ క్యాంపెయినర్‌గా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భాషపై పట్టు ఉండడం, హావభావాల పట్ల ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ముగ్దుడైనందున ప్రత్యేకించి ఆ రాష్ట్రానికి ఎంపిక చేసి ఉంటారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. పైగా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం కూడా ఆ రాష్ట్రంలోనే ఉండడం గమనార్హం. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ కూటమిని అధికారంలోకి తీసుకుని రావాలన్న పట్టుదలతో అధిష్టానం ఉంది.ఇదిలాఉండగా అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలకు జరిగనున్న ఎన్నికలకు రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌నూ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించారు. అయితే ప్రధాన స్టార్ క్యాంపెయినర్లుగా ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రభృతులు ఉన్నారు.

మన తెలంగాణ 27 Mar 2026 10:20 pm

రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు

వారం రోజులుగా వేసవి తాపంతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరట్వాడ నుంచి కర్ణాటక తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమయిన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో శనివారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

మన తెలంగాణ 27 Mar 2026 10:10 pm

కొండగట్టుకు హనుమాన్ భక్తుల పాదయాత్ర

కొండగట్టుకు హనుమాన్ భక్తుల పాదయాత్ర కొండగట్టుకు పాదయాత్రకు బయలుదేరుతున్న హనుమాన్ భక్తులు కుంటాల,ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:08 pm

చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య

చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య గీసుగొండ, ఆంధ్రప్రభ : మద్యానికి బానిసైన వ్యక్తి

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:02 pm

కర్నూల్లో ఎండల తీవ్రత

కర్నూల్లో ఎండల తీవ్రత . 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు… .. రాబోయే

ప్రభ న్యూస్ 27 Mar 2026 9:45 pm

ఎన్‌హెచ్-44 పై ఘోర రోడ్డు ప్రమాదం

ఎన్‌హెచ్-44 పై ఘోర రోడ్డు ప్రమాదం ఎల్ఐసీ ఏజెంట్ మృతి కర్నూలు బ్యూరో,ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Mar 2026 9:40 pm

శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో కారు దగ్ధం

శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో కారు దగ్ధం శంషాబాద్, ఆంధ్రప్రభ : శంషాబాద్ ఎయిర్పోర్ట్

ప్రభ న్యూస్ 27 Mar 2026 9:37 pm

నాపై హత్యాయత్నం జరిగింది : రఘు రామకృష్ణరాజు

ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో శ్రీరామనవమి వేడుకలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పెదపేట లోని పురాతన రామాలయ దర్శనానికి వెళ్లిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కాన్వాయ్‌పై జరిగిన దాడి రాజకీయంగా సంచలనం రేపింది. మేకుల కర్రలు, చాకులతో జరిగిన ఈ భయానక దాడిలో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడటంతో ఆకివీడు ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిపై రఘురామ స్పందిస్తూ తనపై జరిగిన దాడి కేవలం ఆకస్మికం కాదని, అది ముందస్తుగా ప్లాన్ చేసిన హత్యాయత్నం అని ఆరోపించారు. నిన్న సాయంత్రమే బయటి ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు ఆకివీడుకు చేరుకున్నారని, రాళ్లు, కత్తులు, మేకులతో తనపై దాడి చేసేందు కు వాళ్లు వచ్చారని ఆయన పేర్కొన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ రామాలయాన్ని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, వారు హిందువులే అయి నప్పటికీ వేరే మతం ముసుగులో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాన్ని శుభ్రం చేయడానికి కూడా వారు అభ్యంతరం చెబుతున్నా రని తెలిపారు. దాడి చేసిన వారు రామ భక్తుల వేషంలో ఉండి ఒక్కసారిగా విరుచుకుపడ్డారని, తృటిలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించు కున్నానని వెల్లడించారు. లేనిపక్షంలో పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. ఇలాంటి వికృత చేష్టలను ఆదిలోనే అరికట్టకపోతే అవి సమాజానికి పెద్ద ముప్పుగా మారతాయని రఘురామ హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించానని, వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 27 Mar 2026 9:30 pm

2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే వేముల

2 లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే వేముల మోర్తాడ్/భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Mar 2026 9:30 pm

చౌటుప్పల్‌లో వైభవంగా శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవం

చౌటుప్పల్‌లో వైభవంగా శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవం స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు

ప్రభ న్యూస్ 27 Mar 2026 9:27 pm

చెన్నూరులో మారుమోగిన రామనామం!

చెన్నూరులో మారుమోగిన రామనామం! చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు లో

ప్రభ న్యూస్ 27 Mar 2026 9:23 pm

‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ వచ్చేస్తున్నాడు

హీరో నాగ శౌర్య అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. వేసవిలో విడుదలయ్యే భారీ చిత్రాలలో ఒకటిగా ’బ్యాడ్ బాయ్ కార్తిక్’ ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో ఫైర్ బ్యాక్ డ్రాప్, ఒక చేతిలో ఆయుధం పట్టుకుని, మరో చేతి పిడికిలి బిగించి నాగ శౌర్య కనిపించడం, ఆయన వెనుక, పండుగ ఊరేగింపులలో కనిపించే భారీ అమ్మవారి విగ్రహం దర్శనమివ్వడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక ’బ్యాడ్ బాయ్ కార్తిక్’ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులను జీ స్టూడియోస్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాగ శౌర్య సరసన విధి కథానాయికగా నటిస్తుండగా, శ్రీదేవి విజయకుమార్ ఆయన సోదరి పాత్రలో కనిపించనున్నారు. సముద్రఖని, నరేష్ వి.కె. కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మన తెలంగాణ 27 Mar 2026 9:10 pm

నేపాల్ 47వ ప్రధానిగా ‘బలేన్’ ప్రమాణ స్వీకారం

 ర్యాపర్‌గా పేరు పొందిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన బలేంద్ర షా ‘బలేన్’ నేపాల్ 47వ ప్రజాస్వామ్య ప్రధానిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశాన్ని కుదిపేసిన జెన్-జెడ్ ఉద్యమం తర్వాత కె.పీ. శర్మ ఓలి ప్రభుత్వం కూలిన దాదాపు ఆరు నెలల తరువాత ఆయన పదవిలోకి వచ్చారు. 35 ఏళ్ల రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) నేత అయిన బలేన్‌కు అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, శీతల్ నివాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలా 34 నిముషాలకు ప్రమాణం చేయించారు. కాఠ్మండు మాజీ మేయర్ అయిన బలేన్, నేపాల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్సులో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధానిగా నిలిచారు. మధేశ్ ప్రాంతం నుంచి ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి కూడా ఆయనే.ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హిందూ, బౌద్ధ సంప్రదాయాల సమ్మేళనం కనిపించింది. ఏడు మంది బ్రాహ్మణులు శంఖనాదం చేయడం, 108 మంది హిందూ బటుకులు స్వస్తి వచనాలు చదవడం, 107 మంది లామాలు బౌద్ధ మంగళ వచనాలు పఠించడం వంటి విశేషాలు చోటుచేసుకున్నాయి.ఇదే రోజు రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం అధ్యక్షుడు బలేన్‌ను అధికారికంగా ప్రధానిగా నియమించారు. బలేన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్-నేపాల్ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ‘రోటి- బేటీ’ బంధం ఉన్నదని ఆయన గుర్తుచేశారు. నేపాల్ సముద్రతీరంలేని దేశం కావడంతో రవాణా, వాణిజ్య అవసరాల కోసం భారత్‌పై అధికంగా ఆధారపడుతోంది. దేశానికి సముద్ర మార్గం కూడా భారత్ ద్వారానే అందుతోంది.గత ఏడాది సెప్టెంబర్‌లో అవినీతి, బంధుప్రీతి, సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన జెన్- జెడ్ ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఓలి ప్రభుత్వం పడిపోయింది. అనంతరం మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలన్న ఆహ్వానాన్ని బలేన్ తిరస్కరించి, పూర్తి కాలం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. మార్చి 5న జరిగిన ఎన్నికల్లో జ్హాపా-5 నియోజకవర్గంలో నాలుగు సార్లు ప్రధానిగా ఉన్న ఓలిని భారీ మెజారిటీతో ఓడించారు. మొత్తం 275 స్థానాల్లో 182 సీట్లు గెలుచుకున్న ఆర్‌ఎస్‌పీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.బలేన్‌తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. స్వర్ణిమ్ వాగ్లే ఆర్థిక మంత్రిగా, శిశిర్ ఖనాల్ విదేశాంగ మంత్రిగా, సుదన్ గురుంగ్ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బలేన్ రక్షణ, పరిశ్రమ-వాణిజ్య శాఖలను కూడా తన వద్ద ఉంచుకున్నారు. ఇతర మంత్రిత్వ శాఖలకు కూడా నియామకాలు చేపట్టారు.

మన తెలంగాణ 27 Mar 2026 9:00 pm

బెల్లంపల్లి లో కన్నుల పండువగా శ్రీరామ నవమి వేడుకలు

బెల్లంపల్లి లో కన్నుల పండువగా శ్రీరామ నవమి వేడుకలు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:52 pm

కుళ్లిన చికెన్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

 కుళ్లిన చికెన్ సరఫరా చేస్తున్న వ్యక్తిని హెచ్‌ఫాస్ట్, సనత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 352కిలోల కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...కూకట్‌పల్లి, రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన సూరజ్‌పాల్ ఎస్‌పిఆర్ పేరుతో చికెన్ వ్యాపారం చేస్తున్నాడు. కుళ్లిన చికెన్‌ను కొనుగోలు చేసి స్థానికంగా ఉంటున్న చికెన్‌షాపులు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన హెచ్-ఫాస్ట్ బృందం, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కె. నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్ నగర్, జింకలవాడ వద్ద ఉన్న మెసర్స్ ఎస్.పి.ఆర్ చికెన్ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్‌ను గుర్తించారు. దీనిని స్థానిక హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఎస్‌పిఆర్ సంస్థకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ ముగిసినట్లు అధికారులు గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. చ్-ఫాస్ట్ ఇన్స్‌స్పెక్టర్, సిబ్బంది, సనత్ నగర్ పోలీసులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 27 Mar 2026 8:44 pm

శివాలయంలో గోపురాని ప్రారంభించిన ఎమ్మెల్యే, చైర్మన్ గీత

శివాలయంలో గోపురాని ప్రారంభించిన ఎమ్మెల్యే, చైర్మన్ గీత చిట్యాల,ఆంధ్రప్రభ : శ్రీరామనవమి పర్వదినాన్ని

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:42 pm

2-Ai-Dogs : వావ్.. ఇ స్మార్ట్​ డాగ్స్ ఎంట్రీ! Andhra Prabha SPL News

2-Ai-Dogs : వావ్.. ఇ స్మార్ట్​ డాగ్స్ ఎంట్రీ! Andhra Prabha SPL

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:40 pm

ఆలయాల అభివృద్ధికి వెదిరె బ్రదర్స్ లక్ష విరాళం

ఆలయాల అభివృద్ధికి వెదిరె బ్రదర్స్ లక్ష విరాళం మునుగోడు, ఆంధ్రప్రభ : శ్రీరామ

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:36 pm

హత్య కేసులో నిందితుడిపై పోలీసుల కాల్పులు

ఎపిలోని తాడిపత్రి నియోజకవర్గం యాడికి పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసుల కాల్పులు జరిపారు. ఘట నకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్తి కోసం అత్తమామల మీద కోపంతో ఐదేళ్ల బావమరిదిని హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. అనంత పురం జిల్లాలో బాలుడి హత్య కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. యాడికి మండలం కోనఉప్పలపాడులో ఐదేళ్ల బావ మరిది హేమచంద్రను బావ సర్వేశ్‌కుమార్ కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేశాడు. అయితే సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనాస్థలికి వెళ్లిన సమయంలో పోలీసులపై నిందితుడు తిరగబడి బీర్ బాటిల్‌తో దాడి చేయడంతో పోలీసులు నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపారు. అతడికి గాయాలు కాగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో సిఐ రామసుబ్బయ్య, కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ చేతికి గాయాలవడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స అందించారు. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా అనంతపురం జిల్లా ఉలిక్కిపడింది.

మన తెలంగాణ 27 Mar 2026 8:33 pm

కల్తీ కారంపై అధికారుల దాడులు

కల్తీ కారంపై అధికారుల దాడులు వరుస దాడులతో వ్యాపారాల్లో గుబులుప్రజల ప్రాణాలతో చేలాగాటమాడితే

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:27 pm

వైభవ్ పుట్టినరోజు.. తొలగిన ఐసిసి నిబంధన అడ్డంకి

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శుక్రవారం తన 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 13 ఏళ్ల వయస్సులోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టి.. అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు వైభవ్. ఆ తర్వాత అండర్-19 జట్టులో చేరి అద్భుతాలు సృష్టించాడు. అయితే ఈ 15వ పుట్టిన రోజుతో వైభవ్‌కి ఉన్న ఏకైక అడ్డంకి తొలగిపోయింది. అండర్‌-19లో రాణించిన వైభవ్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలని ఎన్నో డిమాండ్లు వచ్చాయి. అయితే వైభవ్ వయస్సు కారణంగా ఆ అవకాశం దక్కలేదు. ఎందుకుంటే జాతీయ జట్టులో అవకాశం రావాలంటే 15 ఏళ్ల వయో పరిమితి ఉంది. ఇప్పుడు వైభవ్ ఆ వయస్సుకు రావడంతో అతడికి ఉన్న అడ్డంకి తొలగిపోయినట్లైంది. దీంతో త్వరలోనే అతడు జాతీయ జట్టుకు ఎంపిక అయ్యే అవకాశం ఉంది. 

మన తెలంగాణ 27 Mar 2026 8:25 pm

సైబర్ మోసగాళ్ల ఆటకట్టు..

సైబర్ మోసగాళ్ల ఆటకట్టు.. కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : ఆపరేషన్ క్రాక్ డౌన్

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:24 pm

స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు –కన్నులపండువగా సీతారాముల కల్యాణం-గ్రామాల్లో భక్తులతో

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:17 pm

కనకదుర్గమ్మ దర్శనానికి యువ బైకర్ తాప్సీ

కనకదుర్గమ్మ దర్శనానికి యువ బైకర్ తాప్సీ మిషన్ హెల్తీ భారత్’ యాత్రకు ఆధ్యాత్మిక

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:11 pm

సీతారాముల కల్యాణంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ దంపతులు

సీతారాముల కల్యాణంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ దంపతులు విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:08 pm

ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంతోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంతోత్సవాలు నేటి పూర్ణాహుతితో పరిసమాప్తంపుష్పార్చనతో భక్తులను అలరించిన అమ్మవారి సేవలు

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:04 pm

అమ్మ సన్నిధిలోవైభవంగా శ్రీరామనవమి వేడుకలు..

అమ్మ సన్నిధిలోవైభవంగా శ్రీరామనవమి వేడుకలు.. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణంభక్తజన సందోహంతో కళకళలాడిన

ప్రభ న్యూస్ 27 Mar 2026 7:59 pm

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ: కల్వకుంట్ల కవిత

 తెలంగాణ రాజకీయ యువనికపై మరోకొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. రాష్ట్రంలో నీళ్లు, నియామకాలు ఆశించిన రీతిలో సాకారం కాలేదని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాము కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు మేడ్చల్ నియోజక వర్గంలోని మునీరాబాద్‌లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్‌లో పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నేను నిజామాబాద్ కోడలిని.. ఇక్కడ పుట్టిన ఏ ఆలోచనైనా విజయవంతం అవుతుంది” అని కవిత ధీమా వ్యక్తం చేశారు. రాముడు తన ప్రజలను గుండెకు హత్తుకుని పాలించినట్లుగా, తాము కూడా అన్ని వర్గాల వెలుగుల కోసం పని చేస్తామన్నారు. శ్రీరామ నవమి పర్వదినం రోజున పార్టీపై అధికారిక ప్రకటన ఉంటుందని, అంతకంటే ముందే కాశీకి వెళ్లి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసి వస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం బలమైన ప్రాంతీయ పార్టీ లేని లోటు కనిపిస్తోందని, తమ పార్టీ ప్రతి ఇంటి పార్టీగా మారుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను పక్కనపెట్టి రీల్స్ చూస్తున్నారని కవిత విమర్శించారు. ప్రశంసిస్తే పనులు జరగవు. ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయి. అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడాన్ని ఆమెతప్పు బట్టారు. తెలంగాణ జాగృతి ద్వారా తాము చేసిన పోరాటాలను గుర్తు చేస్తూ, ఖమ్మం వెలుగు మట్లలో నిర్వాసితుల కోసం చేసిన పోరాటం వల్లే ప్రభుత్వం దిగివచ్చి పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అర్వింద్‌పై నిప్పులు : స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు మతిమరుపు రాజకీయాలు చేస్తున్నారని, అర్వింద్ కూడా అందులో ఒకరిని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆర్వీబీ రాలేదని అంటున్నాడు. తాను అధికారం కోల్పోయి ఏడేళ్లవుతున్నా ఆ బ్రిడ్జి పనులు ఎందుకు పూర్తి కాలేదు? ఎక్కడ మర్చిపోయారు? అని నిలదీశారు. 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి రైల్వేలైన్‌ను తాను పట్టుబట్టి మూడేళ్లలో సాధించానని ఈసందర్భంగా వివరించారు. కార్యకర్తలకు పిలుపు : వచ్చే నెల 25న జరిగే పార్టీ ప్రకటన కార్యక్రమానికి జాగృతి నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటలకే మేడ్చల్‌కు చేరుకోవాలని సూచించారు. తాము ఎవరికీ ‘బీ’ పార్టీగా ఉండబోమని, నంబర్ వన్ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది పార్టీ ఆవిర్భావం తర్వాతే ప్రకటిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా తెలంగాణ జాగృతి నేతలు పాల్గొన్నారు.

మన తెలంగాణ 27 Mar 2026 7:40 pm

వ్యవసాయ బావి వద్ద విద్యార్థులకు కౌన్సిలింగ్

వ్యవసాయ బావి వద్ద విద్యార్థులకు కౌన్సిలింగ్ వ్యవసాయ బావి వద్ద విద్యార్థులకు కౌన్సిలింగ్

ప్రభ న్యూస్ 27 Mar 2026 7:36 pm

సీతారాముల కళ్యాణం…పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

సీతారాముల కళ్యాణం…పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ స్పీకర్,

ప్రభ న్యూస్ 27 Mar 2026 7:33 pm

ప్రపంచశాంతికి బౌద్ధమే శరణ్యం: మంత్రి జూపల్లి

యుద్ధ వాతావరణంలో పలు దేశాలు తలడిల్లుతున్న నేపథ్యంలో ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యమని, శ్రీలంక బుద్ధ శాసన, సాంస్కృతిక వ్యవహారాల శాఖా మంత్రి ఆచార్య హినీదుమే సునీల్ సెనేవి అన్నారు. ఋద్ధవనం, వియత్నాం బౌద్ధ సంఘం సంయుక్తంగా బేగంపేట్ లో ది ప్లాజా హోటల్లో నిర్వహిస్తున్న ప్రపంచ శాంతి పై అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో శుక్రవారం ఆయన, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావులు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక వలయాన్ని అభివృద్ధి చేసి, బుద్ధవనాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం చొరవ చూపిస్తుందన్నారు. బుద్ధుని బోధనలు ఆచరిస్తే శాంతి దానంతట అదే చేకూరుతుందని మంత్రి తెలిపారు. వియత్నాం బౌద్ధ సంఘ అధ్యక్షులు పూజ్యనీయ తిచ్ నాత్ తు ప్రసంగిస్తూ, శాంతి ముందుగా వ్యక్తుల మనసులో ప్రారంభమవుతుందని, సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుందన్నారు. నవనలంద మహా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్ ఆచార్య సిద్ధార్థ సింగ్ కీలకోపన్యాసం చేస్తూ, కుశల ఆలోచనలు, చర్యలు, మనిషిని సర్వతోన్నతునిగా తీర్చిదిద్ది, సమాజ హితానికి తోడ్పడుతుందని, ఆ ఉద్దేశంతో ప్రపంచ ఐక్యరాజ్యసమితి ఏర్పడిందని, బౌద్ధాన్ని ఆచరిస్తే యుద్ధాలకు తావుండదని పేర్కొన్నారు. సదస్సులో శ్రీలంక బౌద్ధ భిక్షు, ఆచార్య కసప్ప మహా ధేరో, రష్యా బౌద్ధ సంఘ, అధ్యక్షులు, అండ్రే దొందుకుబెవ్, లావోస్ కేంద్ర బౌద్ధ సంఘ, అధ్యక్షులు, వంఖరి వాంగ్ ససులిన్, మహాబోధి సొసైటీ, జనరల్ సెక్రెటరీ, ఆనందబిక్కు ప్రసంగించారు. బౌద్ధ సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా, శ్రీలంక మంత్రి ఆచార్య హనీ దుమీ, రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, తీచ్ నాత్ తులకు అంతర్జాతీయ అవార్డులు అందజేసి మూన్ యాంగ్ జో సత్కరించారు. బుద్దవనం ప్రత్యేక అధికారి లక్ష్మయ్య మాట్లాడుతూ 22 దేశాల నుంచి 80 మంది ప్రతినిధులు సదస్సులో ప్రసంగించారని చెప్పారు.

మన తెలంగాణ 27 Mar 2026 7:30 pm

శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం.

శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం. ఆకట్టుకున్న అడుగులభజన చెక్కభజన పోటీలు.. ఊట్కూర్,ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Mar 2026 7:29 pm

ఘనంగా రాములోరి కళ్యాణ మహోత్సవం….

ఘనంగా రాములోరి కళ్యాణ మహోత్సవం…. స్వామివారిని దర్శించుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

ప్రభ న్యూస్ 27 Mar 2026 7:26 pm

శ్రీరామలింగేశ్వర స్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ

శ్రీరామలింగేశ్వర స్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 27 Mar 2026 7:22 pm

గంజాయి విక్రయిస్తున్న ఐదుగురి అరెస్టు

వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 12.26కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లికి చెందిన హేమా చంద్రకాంత్ హట్‌వాలే, సాకేత్ శంకర్, కసాబ్ రాజు ముగ్గురు గంజాయి విక్రయిస్తుండగా వారికి శివరాజ్ హట్ గడ, అక్షయ్, జావెద్ సహకరిస్తున్నారు. నిందితులు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లిన ఎక్సైజ్ సిబ్బంది హేమా చంద్రకాంత్ హట్‌వాలే, సాకేత్ శంకర్, కసాబ్ రాజును అరెస్టు చేయగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 10.16కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం ముగ్గురు నిందితులను నాంపల్లి పోలీసులకు అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 2.1కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని శివసాయి నగర్‌లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ సిబ్బంది నిఘా పెట్టారు. మహ్మద్ అర్బాజ్, సయ్యద్ ఇస్రా ఉద్దిన్‌ను అరెస్టు చేశారు. గంజాయి విక్రయాలతో సంబంధం ఉన్న మరో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు.

మన తెలంగాణ 27 Mar 2026 7:20 pm

అనిల్-వెంకీ-కళ్యాణ్‌రామ్ చిత్రం.. శ్రీ రామ నవమి అప్‌డేట్

ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో గ్రాండ్ సక్సెస్‌ని అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తదుపరి చిత్రం వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీ రామ నవమి సందర్భంగా సినిమా నుంచి ఓ అప్‌డేట్‌ని విడుదల చేశారు. అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి సినిమాలు తీసిన సాహు గారపాటి ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. అలానే సురేశ్ బాబు, జీ స్టూడియోస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోనున్నారు. శ్రీ రామ నవమి సందర్భంగా పోస్టర్‌ని రిలీజ్ చేసి.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో వెంకీ, కళ్యాణ్ రామ్‌కు జోడీగా.. కీర్తి సురేశ్, కృతి శెట్టిలు నటిస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema)

మన తెలంగాణ 27 Mar 2026 7:15 pm

పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం

పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం నివారణకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల

ప్రభ న్యూస్ 27 Mar 2026 7:15 pm

అమెరికా కరెన్సీపై ట్రంప్ సంతకం.

అమెరికా కాగిత కరెన్సీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉండనుంది. 250 ఏళ్ల స్వాతంత్య్రం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ శాఖ గురువారం ప్రకటించింది. ప్రస్తుత పదవిలో ఉన్న అధ్యక్షుడి సంతకం కరెన్సీపై ముద్రించబడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నిర్ణయంతో 165 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి కూడా తెరపడింది. 1861లో ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ట్రెజరర్ సంతకం కరెన్సీపై తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు మొదటిసారి ఆ సంతకాన్ని తొలగిస్తున్నారు.ట్రెజరీ వివరాల ప్రకారం, ట్రంప్ సంతకం, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సంతకాలతో కూడిన తొలి 100 డాలర్ల నోట్ల ముద్రణ జూన్‌లో ప్రారంభం కానుంది. తరువాతి నెలల్లో ఇతర నోట్లపై కూడా ఈ మార్పులు అమలవుతాయి. ఈ నిర్ణయం దేశ ఆర్థిక ప్రగతిని ప్రతిబింబిస్తుందని ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ పేర్కొన్నారు. దేశ విజయాలు, 250వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసే విధంగా ట్రంప్ పేరును కరెన్సీపై ముద్రించడం సముచితమని ఆయన అన్నారు.ఇదే సమయంలో అమెరికా ట్రెజరర్ బ్రాండన్ బీచ్ కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఇది సరైనదే కాకుండా సముచిత గౌరవమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మాత్రం మాజీ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్, ట్రెజరర్ లిన్ మలెర్బా సంతకాలతో ఉన్న నోట్ల ముద్రణ కొనసాగుతోంది. 1861 నుంచి కొనసాగుతున్న ట్రెజరర్ సంతకాల సంప్రదాయానికి మలెర్బా సంతకం చివరిది కానుంది. ఇక 250వ వార్షికోత్సవ వేడుకల భాగంగా ట్రంప్ గౌరవార్థం మరిన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇప్పటికే ఆయన చిత్రంతో 24 క్యారెట్ బంగారు స్మారక నాణెం రూపకల్పనకు అనుమతి లభించింది. ఈ నాణెం జూలై 4 స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా విడుదల కానుంది.

మన తెలంగాణ 27 Mar 2026 7:10 pm

More Delays for Vijay’s Jana Nayagan

Ilayathalapathy Vijay’s last film Jana Nayagan is stuck with censor hurdles and the film’s release is pushed from January. The censor hurdles are expected to be cleared very soon and the film will obtain the censor certificate. With Assembly Elections scheduled in Tamil Nadu, there are reports that Jana Nayagan will have its release in […] The post More Delays for Vijay’s Jana Nayagan appeared first on Telugu360 .

తెలుగు 360 27 Mar 2026 7:10 pm

రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టుల ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టుల ఏర్పాటు 1730 పోస్టుల మంజూరునంద్యాల జిల్లాలో.. 21

ప్రభ న్యూస్ 27 Mar 2026 7:10 pm

Sai Pallavi about Getting Married

Sai Pallavi is one of the most disciplined actresses and she is focused on doing character-driven roles. She is against glamorous roles and she followed the same despite not getting big offers. The actress has big projects lined up and she is busy with the mythological epic Ramayana. During a public event, Sai Pallavi responded […] The post Sai Pallavi about Getting Married appeared first on Telugu360 .

తెలుగు 360 27 Mar 2026 7:08 pm

వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవం

వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవం ఉరవకొండ రూరల్,ఆంధ్రప్రభ : మండలం లోని బూదగవి

ప్రభ న్యూస్ 27 Mar 2026 7:01 pm

పెళ్లి వేడుకలో విషాదం.

పెళ్లి వేడుకలో విషాదం. . తుంగభద్రలో ఈతకు వెళ్లి నలుగురు మృతి.. ఆనందం

ప్రభ న్యూస్ 27 Mar 2026 6:56 pm

సహజీవనం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు

వివాహితుడు ఒక మహిళతో పరస్పర సమ్మతితో సహజీవన సంబంధంలో ఉంటే అది నేరం కాదని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో నైతికత (మొరాలిటీ) కంటే చట్టమే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. ఒక వివాహితుడు, ఒక మహిళతో పరస్పర అంగీకారంతో సహజీవన బంధంలో ఉంటే, దాన్ని ఏ విధంగానూ నేరంగా పరిగణించలేం. చట్టం, నైతికత రెండూ వేరువేరు. చట్టపరంగా నేరం లేనప్పుడు, సామాజిక అభిప్రాయాలు లేదా నైతిక విలువలు కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయవు అని ధర్మాసనం పేర్కొంది.ఈ కేసులో సంబంధిత మహిళ స్వచ్ఛందంగానే ఆ వ్యక్తితో కలిసి జీవిస్తున్నానని పోలీసులకు తెలిపినప్పటికీ, కుటుంబ సభ్యుల నుంచి గౌరవ హత్య (ఆనర్ కిల్లింగ్) బెదిరింపులు ఉన్నప్పటికీ పోలీసులు స్పందించలేదని కోర్టు గమనించింది. పెద్దవారైన ఇద్దరు కలిసి జీవిస్తే వారి రక్షణ బాధ్యత పోలీసులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనా ధర్మాసనం మాట్లాడుతూ, ఈ ఫిర్యాదుపై పోలీసు సూపరింటెండెంట్ చర్యలు తీసుకోకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు పెద్దవారు కలిసి జీవించే హక్కును కాపాడటం పోలీసుల కర్తవ్యం అని పేర్కొంది.ఈ కేసుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన కోర్టు, ఏప్రిల్ 8కి విచారణను వాయిదా వేసింది. అంతవరకు ఆ జంటకు తక్షణ రక్షణ కల్పించాలని ఆదేశించింది. వారి భద్రతకు షాజహాన్పూర్ ఎస్పీ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉపశమనం కల్పించిన కోర్టు, అనామిక, నేత్రపాల్‌లను అరెస్ట్ చేయరాదని ఆదేశించింది. అలాగే మహిళ కుటుంబ సభ్యులు ఆ జంటకు హాని చేయకుండా, వారి నివాసానికి రావడం లేదా ప్రత్యక్షంగా, పరోక్షంగా సంప్రదించడం కూడా నిషేధించింది.

మన తెలంగాణ 27 Mar 2026 6:53 pm

Sri Rama Navami |భద్రచాలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం..

Sri Rama Navami | భద్రచాలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. Sri Rama

ప్రభ న్యూస్ 27 Mar 2026 6:49 pm

మెగాస్టార్ గొప్ప మనసు.. కొడుకు పుట్టినరోజున భారీ విరాళం

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన కుమారుడు రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ విరాళం ఇచ్చారు. చిరంజీవి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డుల్లో ఎన్టిఆర్ జాతీయ బహుమతిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు వచ్చిన రూ.10 లక్షలను స్వచ్ఛంద సంస్థలకు విరాళమిచ్చారు. పలువురు అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న సర్వ్ ఫౌండేషన్, అంధుల కోసం పని చేస్తున్న దేవనార్ ఫౌండేషన్, చిన్నారులను సంరక్షిస్తున్న వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కూడా మెగాస్టార్ విరాళం ఇచ్చారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్‌ని కలిసిన వృద్ధులను మెగాస్టార్ తన బ్లడ్ బ్యాంక్‌కు ఆహ్వానించారు. వారందరికీ బర్త్‌డే గిఫ్ట్‌గా కొత్త దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం తానే స్వయంగా వారందరికీ భోజనాలు పెట్టించారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మన తెలంగాణ 27 Mar 2026 6:47 pm

డిండి చింతపల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

డిండి చింతపల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 27 Mar 2026 6:36 pm

ట్రావెల్స్ బస్సు యజమాని అరెస్ట్?

మార్కాపురం బస్సు దగ్దం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 6:32 pm

అపోహలు సృష్టిస్తే నమ్మొద్దు : సీఐ సత్యనారాయణ

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సరఫరా

ప్రభ న్యూస్ 27 Mar 2026 6:28 pm

BRS : కారు పార్టీకి ఎన్ని ఇబ్బందులో.. తట్టుకుని నిలబడగలదా?

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 6:21 pm

Helium |ఇరాన్ దాడుల ప్రభావం: ఎంఆర్‌ఐ ఖర్చులు పెరుగుదల?

Helium | ఇరాన్ దాడుల ప్రభావం: ఎంఆర్‌ఐ ఖర్చులు పెరుగుదల? Helium |

ప్రభ న్యూస్ 27 Mar 2026 6:06 pm

సీతారాముల కల్యాణంలో పాల్గొన్న డీసీపీ షిరిన్ బేగం

సీతారాముల కల్యాణంలో పాల్గొన్న డీసీపీ షిరిన్ బేగం శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న డీసీపీ

ప్రభ న్యూస్ 27 Mar 2026 5:56 pm

ట్రాన్స్‌జెండర్లకు షాక్…

ట్రాన్స్‌జెండర్లకు షాక్… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఒలింపిక్ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

ప్రభ న్యూస్ 27 Mar 2026 5:55 pm

Chadndrababu :ప్రధాని నిర్ణయంతో చంద్రబాబు హర్షం

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 27 Mar 2026 5:55 pm

శోభాయమానంగా శ్రీరామనవమి…

శోభాయమానంగా శ్రీరామనవమి… జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన నవమి పందిళ్లు.స్వామికి పట్టు వస్త్రాలు

ప్రభ న్యూస్ 27 Mar 2026 5:52 pm

Telangana : రేపటి నుంచి ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు

ఈ నెల 28, 29 తేదీల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్, నాటక ప్రదర్శనలు జరగనున్నాయి

తెలుగు పోస్ట్ 27 Mar 2026 5:48 pm

దారుణం: పెళ్లి వేడుకకు వచ్చి.. నదిలో మునిగి నలుగురు మృతి

కోసిగి: కర్నూలు జిల్లా కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద దారుణం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి నలుగరు మృత్యువాత పడ్డారు. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు కర్ణాటకలోని మాన్వికి చెందిన 15 మంది రెండు రోజుల క్రితం కందుకూరు గ్రామానికి వచ్చారు. వివాహం ముగిసిన తర్వాత ఇవాళ ఉదయం వారంతా సరదాగా తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో దిగిన నలుగురు ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

మన తెలంగాణ 27 Mar 2026 5:38 pm

Kavitha : కవిత కొత్త పార్టీ ఏప్రిల్ 25న

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు.

తెలుగు పోస్ట్ 27 Mar 2026 5:33 pm

Chaitanya – Raviteja |తెర వెనుక ఏం జరిగింది..?

Chaitanya – Raviteja | తెర వెనుక ఏం జరిగింది..? Chaitanya –

ప్రభ న్యూస్ 27 Mar 2026 5:30 pm

Sahu Garapati Boards Anil Ravipudi’s Next With Venky, NKR

Anil Ravipudi’s next big entertainer brings together a powerhouse combination- Victory Venkatesh and Nandamuri Kalyan Ram. Successful producer Sahu Garapati has come on board to bankroll the project under the Shine Screens banner, with Suresh Productions and Smt Archana presenting it and Zee Studios joining as co-producer. Planned as a vibrant festival entertainer for Sankranthi […] The post Sahu Garapati Boards Anil Ravipudi’s Next With Venky, NKR appeared first on Telugu360 .

తెలుగు 360 27 Mar 2026 5:30 pm

50 lakhs |కేబీసీ విజేత అరెస్ట్

50 lakhs | కేబీసీ విజేత అరెస్ట్ 50 lakhs | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 27 Mar 2026 5:15 pm