Jagan |అందరి లెక్కలు తేలుద్దాం…
Jagan | అందరి లెక్కలు తేలుద్దాం… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ
Andhra Pradesh : పెమ్మసానికి సవాల్ విసిరిన అంబటి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవ రాయుడు పాలెం సర్పంచ్ అన్నదేవుల చంటి, జేగురుపాడు దళితుల స్వాధీనంలో ఉన్న 5.58 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని జేగురుపాడు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ సాకా కిరణ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు చికిలే కిషోర్ కుమార్, మండల టీడీపీ ఎస్సి సెల్ కన్వీనర్ కొంబాబత్తుల సూర్యకుమార్, ప్రత్తిపాటి నాగరాజు, జనసేన నాయకులు మద్దుకూరి సూరిబాబు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ బళ్ళ అన్నవరం, దళిత నాయకులు […] The post దళితులకు న్యాయం జరిగేనా ? appeared first on Visalaandhra .
అతడు చాలా శ్రద్ధగా కొడుతున్నాడు: అశ్విన్
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్లో గ్రూప్ లేవల్లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో మంచి ప్రదర్శన చేసి ఎనిమిది పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. 2.5 నెట్ రన్రేటుతో అన్ని గ్రూపులలో టీమిండియా తొలి స్థానంలో ఉంది. కానీ ఒక సమస్య వేధిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆడడంలో టీమిండియా బ్యాట్స్మెన్లు తడబడుతున్నారు. అభిషేక్ శర్మ మూడు సార్ల డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. స్పిన్ బౌలింగ్లో క్యాచులు ఇచ్చి మైదానం వీడుతున్నాడు. ఇషాన్ కిషన్ కూడా స్పిన్ బౌలింగ్లో ఇబ్బందిపడుతున్నాడు. సూపర్8లో బలమైన జట్లు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్తో టీమిండియా తలపడనుంది. ఈ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానల్లో మాట్లాడాడు. తిలక్ వర్మ పవర్ హిట్టర్ కాదు అని, గ్యాప్స్లలో ఆడడంతో పాటు టైమింగ్ను అతడు నమ్ముకుంటాడని వివరించారు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన తరువాత వేగంగా పరుగులు రాబట్టలేకపోతున్నాడని, వైభవ్ సూర్యవంశీలా పెద్ద పెద్ద షాట్లు కొట్టాలని తిలక్కు సూచనలు చేశాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ శ్రద్ధగా బ్యాటింగ్ చేస్తున్నాడని, శివమ్ దూబే, హార్థిక్ పాండ్యా, రింకు సింగ్ వేగంగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు తీయిస్తున్నారని ప్రశంసించారు. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా సంపూర్ణంగా బ్యాటింగ్ విభాగంలో ఆదిపత్యం చలాయించలేదని చురకలంటించాడు. వరుణ్ చక్రవర్తి చక్కగా బౌలింగ్ చేయడంతో సరైన సమయంలో వికెట్లు తీస్తూ టీమిండియాను విజయపంథాలో నడిపిస్తున్నాడని కొనియాడారు. జస్ప్రీత్ బుమ్రా కూడా పవర్ ప్లేలో స్వింగ్ రాబట్టడంతో పాటు చక్కటి యార్కర్లు సంధిస్తున్నారని మెచ్చుకున్నాడు.
–ఐఎఫ్ఆర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖపట్నం: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) కు భారత బాహుబలిగా పేరుగాంచిన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖ తీరానికి వచ్చింది. దీని విశిష్టతను నౌకాదళ అధికారులు మీడియాకు వివరించారు. లోపల విమానాలు భద్రపరిచే డెక్లు, ఆయుధ సంపత్తి, యుద్ధసమయంలో ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది, మిసైల్స్తో శత్రువులపై ఎలా దాడికి దిగుతుందో విశదీకరించారు. ‘మూడేళ్ల క్రితం నౌకాదళంలో చేరిన ఈ నౌకను సాగర జలాల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరిస్తారు. […] The post భారత బాహుబలి… appeared first on Visalaandhra .
వాషింగ్టన్ డీసీ మేయర్ పదవి రేసులో తమిళ మహిళ
చెన్నై: తమిళ మూలాలున్న మహిళ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మేయర్ పదవికి పోటీపడుతున్నారు. తమిళనాడులోని తేని నగరానికి చెందిన రినీ సంపత్(31) తనకు ఏడేళ్లు ఉన్నప్పుడే తల్లిదండ్రులతో కలిసి యూఎస్ వెళ్లారు. చదువంతా అక్కడే పూర్తిచేశారు. విద్యార్థి సంఘ నాయకురాలిగా గుర్తింపు పొందారు. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఏజెన్సీ నిర్వాహకురాలిగానూ సేవలందించారు. ఈ సమయంలోనే ఆమె వాషింగ్టన్ నగర సమస్యలపై గళమెత్తి. ప్రజలకు ఎంతో చేరువయ్యారు. ఆ అనుభవంతోనే నగర ఎన్నికల బరిలోకి దిగినట్లు […] The post వాషింగ్టన్ డీసీ మేయర్ పదవి రేసులో తమిళ మహిళ appeared first on Visalaandhra .
Threats |రూ.10 కోట్లు ఇవ్వండి..
Threats | రూ.10 కోట్లు ఇవ్వండి.. Threats |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Congress |మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..
Congress | మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.. Congress, కడెం (నిర్మల్ జిల్లా),
ఒకనాడు వలసవాదం సైనికశక్తి ద్వారా దేశాలను దోచుకుంది. తరువాత పుట్టుకొచ్చిన ‘నయా వలసవాదం’ తన సైనిక శక్తిని, ఆర్థిక దర్పాన్ని ఉపయోగించి దేశాలను తమ కాలికింది చెప్పులా ఉంచడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వైరవిహారం చూస్తుంటే అతని సుంకాల సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏ విధంగా అలజడిలోకి నెడుతోందో తెలుస్తుంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని తొందరపడి తప్పు పట్టడం కన్నా దాని ప్రభావం మన దేశంపై ఎలా ఉంటుందో విశ్లేషించడం అవసరం. ఈ వాణిజ్య ఒప్పందంలో సహజంగానే ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. దీనికి మద్దతుగా లేదా విరుద్ధంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే ఒక అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అది రష్యా నుండి భారతదేశం ఇంధన కొనుగోలుపై అమెరికా వీటో పెడుతోందా? అన్న ప్రశ్న ఎదురుకాక తప్పదు. రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేయకుండా పర్యవేక్షించడానికి మోనిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం తీవ్ర ఆందోళనకర అంశం. ఇది భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేయడమే. మనం ఏం చేసినా బయటినుంచి వేరే దేశం పర్యవేక్షించడం అంటే వారికి మనం దాసోహమైనట్టా? వివిధ ప్రపంచ దేశాలతో బలమైన సంబంధాలను కొనసాగిస్తూనే ఏ ఒక్క దేశానికి బానిసగా మారకుండా తన స్వతంత్రతను కాపాడుకోవడంలో భారత్ నిరంతరం విజయమవుతూనే ఉందని అనేక సంఘటనలు చారిత్రకంగా నిరూపించాయి. ఈ విధానాన్ని ‘వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి’ అని పిలుస్తారు. ఇదే విధానాన్ని భారత్ పాటిస్తూ రష్యాతో చారిత్రక రక్షణ సంబంధాలను, అమెరికాతో వ్యూహాత్మక, సాంకేతిక భాగస్వామ్యాన్ని, అలాగే ఐరోపా, ఇతర దేశాలతో మైత్రిని సమతుల్యంగా ఒకే సమయంలో కొనసాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకేం తక్కువని ఏదో ఒక దేశానికి లోకువ కావడంలో అర్థమే లేదు. అమెరికా మోనిటరింగ్ కమిటీని ప్రకటించిన తరువాత భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఇంధన భద్రతకోసం, జాతీయ ప్రయోజనాలకోసం ఎక్కడనుంచైనా చమురును దిగుమతి చేసుకునే హక్కు చెక్కుచెదరదని గట్టిగా ఉందని స్పష్టం చేయలేకపోవడం గమనార్హం. చమురును ఎక్కడ కొనుగోలు చేయాలో ఎంపిక చేసుకోవడంలో జాతీయ ప్రయోజనాలు ముడిపడి ఉంటాయని చెప్పుకొచ్చారేతప్ప ఎక్కడినుంచైనా కొనేహక్కు తమకు ఉందని స్పష్టంగా, కచ్చితంగా నొక్కి చెప్పలేకపోయారు. చమురు కొనుగోలు అనేది తగినంత లభ్యత, న్యాయమైన ధర, సరఫరా విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. ఇందులో మన దేశం స్పందన ఇంత సందిగ్ధంగా కాకుండా ఇంకా స్పష్టంగా ఉండాల్సిందేనని ఎవరైనా అనుకుంటారు. గతంలో భారత దేశం తన జాతీయ ప్రయోజనాలను విదేశాంగ విధానాన్ని ఎల్లప్పుడూ ‘వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి’ అనే భావనతోనే నిర్వచించుకుంటూ వచ్చింది. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ నేటి వరకు భారతదేశ విదేశాంగ విధానంలో ఒక ప్రధాన అంశంగా ఉంటోంది. ఇలాంటి సార్వభౌమత్వ దేశం ఎక్కడ నుంచి, ఎవరి నుంచి, ఏయే ధరలకు ఎంత పరిమాణంలో తన అవసరాలను కొనుగోలు చేస్తోందో పర్యవేక్షించి మూడో దేశం శాసించగలదా? ఎక్కడైనా తక్కువ ధరకు లేదా రాయితీపై నాణ్యమైన ఇంధనం లభ్యమవుతున్నప్పుడు ఎంచుకునే అవకాశం తప్పనిసరిగా మనదే కావాలి తప్ప బయటి దేశం ఆదేశాలతో ముడిపడరాదు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షలకు మనం తలొగ్గితే రష్యా నుంచి ఆయుధాల కొనుగోలు, సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్యం వంటి కీలక అంశాల్లోనూ అమెరికా ఆంక్షలు విధిస్తే మన పరిస్థితి ఏమిటి? అలాగే ఇతర దేశాలతో దౌత్యసంబంధాల విషయంలో ఇలాంటి ఆంక్షలే ఎదురైతే ఎలా నివారించగలం? అంతర్గత నిర్ణయాధికారంపై బాహ్య నిషేధాధికారం అనే ఆదేశాలను పాటిస్తే మన పరిస్థితి అత్యంత అగమ్యగోచరంగా మారుతుంది. లేదా పతనానికి దారితీస్తుంది. భారత్ రష్యా సంబంధాలు కాలపరీక్షకు నిలిచినవి. భద్రత, రక్షణ విషయాల్లో మనకు రష్యాతో విస్తృతమైన, వ్యూహాత్మక సంబంధాలు ముడిపడి ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం పరోక్షంగా ఉక్రెయిన్పై యుద్ధం సాగించడానికి దోహదం చేస్తోందన్న వాదనకు అంతర్జాతీయంగా ఆమోదం లభించకపోవచ్చు. అంతర్జాతీయ సంబంధాల్లో నైతికత అనేది ఒక ద్వంద్వ ప్రమాణంగా మారుతుంది. ఇది పూర్తిగా లేదని చెప్పలేం. కానీ జాతీయ భద్రత, ఆర్థిక ప్రయోజనాలన్నవి అగ్రస్థానంలో ఉంటాయి. నైతికత వాటి వెనుక నడుస్తుంది. భారతీయ జాతీయ ప్రయోజనాలు న్యూఢిల్లీలో నిర్ణయించబడాలే తప్ప ఇతర దేశాల్లో కాదు. భారత్ తన భౌగోళిక, ఆర్థిక, భద్రత అవసరాలకు అనుగుణం గా స్వంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. వాణిజ్య ఒప్పందాలు పురోభివృద్ధిని ప్రోత్సహించాలే తప్ప స్వయం ప్రతిపత్తిని అణగదొక్కరాదు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు అవకాశాలను విస్తరింప చేయాలి తప్ప వాటిని కుదించరాదు. భారత్తో ఎలాంటి సంబంధాలను వాస్తవంగా అపేక్షిస్తోందో అమెరికా తన వంతు నిర్ణయించుకోవాలి. రెండు దేశాల మధ్య సమాన భాగస్వామ్యంలో అమెరికా ఒకటిగా ఉంటుందా? లేదా ఒత్తిడి ద్వారా భారత్ను లొంగదీసుకునే నియంతృత్వశక్తిగా చెలాయిస్తుందా? అన్నది తేలాలి. ఎక్కడ తాను ఇంధనం కొనుగోలు చేయాలనుకుంటోందో ఇంకో దేశం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం భారత్కు రాకూడదు. అటువంటి పరిస్థితి ఏర్పడితే కేవలం చరిత్ర నేర్పిన పాఠాలను మాత్రమే కాకుండా, స్వాతంత్య్రం తాలూకు అర్థాన్ని మర్చిపోవడమే అవుతుంది.
ఇరాన్పై దాడులకు… మమ్మల్ని లాగొద్దు
–అమెరికాకు తేల్చి చెప్పిన యూకే లండన్: అణు ఒప్పందంపై చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఇరాన్పై దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్పై దాడులకు తమ దేశంలోని రెండు కీలక స్థావరాలను వాడొద్దని యూకే అగ్రరాజ్యానికి తేల్చి చెప్పింది. దీంతో స్విండన్ సమీపంలోని ఫెయిర్ ఫోర్డ్ బేస్ నుంచి లాంగ్రేంజ్ బాంబింగ్ ఆపరేషన్లు నిర్వహించడానికి అగ్రరాజ్యానికి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఇప్పటికే డియాగో గార్సియా బేస్ను మారిషస్కు తిరిగి అప్పజెప్పాలన్న యూకే నిర్ణయంపై ట్రంప్ […] The post ఇరాన్పై దాడులకు… మమ్మల్ని లాగొద్దు appeared first on Visalaandhra .
సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ధోనీ#News #TeluguNews #MSDhoni #OrganicFarming #Ranchi
విరోధం పెట్టుకొని బతకలేవు... పట్టుదల వదిలేయ్... టాక్సిక్ టీజర్ విడుదల
హైదరాబాద్: 'టాక్సిక్' అనే చిత్రంలో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తుండగా కెవిఎన్ ప్రొడక్షన్లో నిర్మిస్తున్నారు. యశ్ పక్కన ఐదు హీరోయిన్లు నటిస్తున్నారు. గంగా పాత్రలో నయనా తారా, నదియా పాత్రలో కియారా అద్వానీ, ఎలిజెబెత్గా హ్యుమా ఖురేషీ, రెబెకాగా తారా సుతారియా, మెలిసాగా రుక్మిణి వసంత్, రాయ్ పాత్రలో యశ్ నటిస్తున్నారు. టాక్సిక్ అనే సినిమా' ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్' అనే ఉప శీర్షికను యాడ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. 'ఈ సారి యుద్ధం వేరు... వాళ్ల కుతాంత్రాలు వేరు... అందరితో విరోధం పెట్టుకొని బతకలేవు, పట్టుదల వదిలేయ్' అనే డైలాగ్ మోస్ట్ వైలెంట్గా అనిపించింది. మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫ్రాన్స్ ప్రెసిడెంట్ రాఫెల్ డీల్ విషయంలో భారత్ ను విమర్శించారంటూ
Vikas Nagar |దేవాలయ నిర్మాణానికి కానిస్టేబుల్ దంపతుల చేయూత..
Vikas Nagar | దేవాలయ నిర్మాణానికి కానిస్టేబుల్ దంపతుల చేయూత.. Vikas Nagar,
ఎప్స్టీన్ ఫైల్స్లో ఏమున్నది?
కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ నేడు వార్తలలోని వ్యక్తి. అమెరికాలో ఒక నేరసామ్రాజ్య అధినేత. ఏకంగా 33 వేల చదరపు అడుగుల దీవి ఆయన సొంతం. న్యూయార్క్ నగరంలో అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనం నిర్మించుకున్నాడు. ఆ దేశంలో పేరున్న ఆర్థిక వ్యాపారవేత్త. ఎంతోమంది దేశాధ్యక్షులతో, ప్రధానమంత్రులతో ఎంతో సాన్నిహిత్యం, సత్సంబంధాలు నెరపిన చరిత్ర ఆయనకే సొంతం. ఒక ఆర్థిక వ్యాపారస్థుడికి ఆ స్థాయి అంతర్జాతీయ సంబంధాలు నెలకొల్పుకోవడం, నిలబెట్టుకోవడం ఆశ్చర్యమే. కానీ అది ఎప్స్టీన్కే సాధ్యం. ఆయన కార్యకలాపాలు ఆ విధంగా ఉండేవి. అతడి జీవితం మొత్తం అధికారం, సెక్స్, నేరం, రాజకీయాల చుట్టే తిరిగేది. అందుకే ఆయన మరణించి ఏడేళ్లు అవుతున్నా ఇంకా వార్తల్లో నిలిచి ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైనాడు. దేశాధినేతల వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేశాడు. వారు విమర్శలపాలై, వారి పదవికి ఎసరుపెట్టే విధంగా ఉన్న చరిత్ర ఆయనది. చివరికి ఆయనతో సంబంధాలు ఉన్నవారు, వారి కుటుంబ సభ్యుల చేతనే విమర్శలకు గురవుతున్న పరిస్థితి. ఇంతగా ప్రపంచం మొత్తాన్ని కదిలించి వేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ నిజంగా తెలుసుకోదగినవే. జెఫ్రీ ఎప్స్టీన్ మీద మొదట 1996లో మరియ ఫార్మర్ అనే మహిళ తన అక్కాచెల్లెళ్ల నగ్న ఫోటోలను దొంగిలించాడని కేసు నమోదైనా విచారణ జరగలేదు. కానీ 2005లో మరొక మహిళ తన 14 ఏళ్ల సవతి కూతురిని ఎప్స్టీన్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో రేప్ చేసినట్లు ఆరోపించింది. అమెరికన్ విచారణ సంస్థ ఎఫ్బిఐ మరో 35 మంది ఆడపిల్లల కథలు కూడా గుర్తించి 2008లో ఎప్స్టీన్ను శిక్షార్హుడిగా గుర్తించింది. కానీ విచిత్రంగా ఎక్కడా జరగని నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ జరిగింది. కేవలం 18నెలలు మాత్రమే ఆయన జైలులో ఉన్నాడు. అంతేకాదు ఆ రకమైన శిక్ష తగ్గించబడింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం పగటిపూట అతడు బయట తిరగవచ్చు. రాత్రిపూట మాత్రమే జైలు శిక్ష అనుభవిస్తాడు. మళ్లీ తన వ్యాపారాన్ని నేర సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. అనేక దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, శాస్త్రజ్ఞులు, హాలీవుడ్ నటులు ఆయన ఆహ్వానం మేరకు కలవగా వారికి అమ్మాయిలను ఎర చూపి వారితో సంబంధాలు నెలకొల్పుకున్నాడు. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు అందులో భాగమయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, లండన్ యువరాజు వంటి ప్రముఖులు సైతం ఆయనచే ప్రభావితం అయ్యారు. భారతదేశం నుండి ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి హరీదీప్ సింగ్ పూరి, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేర్లు కూడా ఈ ఫైల్స్లో ఉండడం గమనార్హం. 2014లో భారతీయ జనతా పార్టీలో చేరిన హరిదీప్ సింగ్ 2017లో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చేరాడు. అంతకు ముందు ఒక ఐఎఫ్ఎస్ అధికారి అయిన పూరి రాయబారిగా పనిచేశాడు. కానీ పెట్రోలు సహజవాయువుల శాఖ మంత్రి అయిన తర్వాత అనేక మెయిల్స్, చాట్ చేసినట్లుగా ఈ ఫైల్స్లో బయటపడినాయి. తాను కేవలం సాంకేతిక విషయాలపైనే ఈ విధంగా ఆయనతో మెయిల్స్, చాట్ చేసినట్లు పూరి బుకాయిస్తున్నాడు. అంతకుముందు 2013 వరకు పూరి భద్రతామండలి సభ్యుడు కూడా. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కూడా మార్చి 2017లో ఎప్స్టీన్తో లావాదేవీలు జరిపినట్లు ఫైల్స్ పేర్కొంటున్నాయి. అందుకు ప్రతిగా భారతీయ మార్కెట్కు కట్టబెట్టడానికే ప్రయత్నాలు జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ విధానంలో మార్పు కూడా కేవలం అతడి వల్లనే కలిగినట్లు విమర్శలు ఉన్నాయి. ఆ ఫైల్స్లో ఆ రకమైన ఆధారాలు ఉన్నాయి. అప్పటివరకు పాలస్తీనా, ఇజ్రాయెల్ విషయంలో పాలస్తీనాను సమర్థిస్తూ వచ్చిన మోడీ అమెరికా అధ్యక్షుడితో చర్చల అనంతరం తన విధానాన్ని మార్చుకొనడం జరిగింది. ఇజ్రాయెల్ను సమర్థించడంలో ఎప్స్టీన్, డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకే ఆ విధంగా జరిగినట్లు ఈ ఫైల్స్ ద్వారా తెలుస్తున్నది. ఈ విధంగా ఎప్స్టీన్ అనేక విధాలుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తారంగా వాడుకుంటూ అనేక దేశాలను ప్రభావితం చేశాడు. ఇంతటి మహా సామ్రాజ్య నిర్మాత ఎప్స్టీన్ 2019లో మాన్హట్టన్ జైలులో మరణించాడు. ప్రపంచంలోని పెద్దల బండారం బయటపడకుండా ఉండటానికి అతడిని చంపారని కూడా ఒక విమర్శ లేకపోలేదు. అతడి సహచరి, నిందితురాలు మాక్స్వెల్ కూడా 2021లో జైలు శిక్షకు గురైంది. జనవరి 30, 2026 నాడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ మూడు లక్షల పేజీల డాక్యుమెంట్. 1,80,000 ఫోటోలు 2000 వీడియోలతో కూడినది. 300 గిగా బైట్ల సమాచారం ఈ ఫైల్స్లో నిక్షిప్తమై ఉంది. నవంబర్ 18, 2025లో ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్ఫరెన్సీ చట్టాన్ని ఆమోదించి దశలవారీగా ఈ ఫైల్స్ ను విడుదల చేయడంతో అనేక వాస్తవాలు వెలుగులోకి రావడంతో ప్రపంచం నివ్వెరపోయింది. డొనాల్డ్ ట్రంప్, ఎప్స్టీన్ల మధ్య సంబంధం 1980 చివర నుండి నడుస్తూ వస్తున్నది. ఎప్పుడు కూడా మంచి అందమైన అమ్మాయిలను తనలాగే ఎప్స్టీన్ ఇష్టపడేవాడని ట్రంప్ అభివర్ణించాడు. ఈ ఫైల్స్లో ఎవరి పేరు ఉటంకించబడిన వారికి అది అవమానమే. ట్రంప్ నుండి ప్రయోజనాల కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కలిసినట్లు అర్థమవుతున్నది. కానీ జాతీయ స్థాయి ప్రధానస్రవంతి మీడియా మాత్రం నోరు మెదపడం లేదు. ఈ ఫైల్స్లో మోడీ పేరు అనేక సార్లు చెప్పబడింది. ఇజ్రాయెల్ను మొట్టమొదటగా సందర్శించిన భారత ప్రధానిగా మోడీ చరిత్రలోకి ఎక్కారు. అమెరికా మెడలు వంచాం అని బయటకు బీరాలు పలికే మన ప్రధాని ఈ విధంగా ట్రంప్ నుండి ఏవో ప్రయోజనాలు ఆశించి ఈ విధంగా ఈ ఫైల్స్లో దొరికిపోవడం జరిగింది. 2016లో రాఫెల్ డీల్ జరిగింది. అప్పటివరకు యుద్ధ విమానాల తయారీలో ఏమాత్రం అనుభవం లేని కొత్తగా పుట్టుకొచ్చిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్కు ఇజ్రాయెల్కు 51:49 నిష్పత్తిలో ఈ డీల్ కుదిరింది, టెండర్ దక్కింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ధ్రువీకరించడం జరిగింది. ఫిబ్రవరి 2017 నుండి ఎప్స్టీన్, అనిల్ అంబానీ మధ్య సత్సంబంధాలు పెరిగాయి. ఈ విధంగా ఎప్స్టీన్ ఫైల్స్ దేశవిదేశాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఒక నేరచరిత్ర కలిగిన వ్యక్తి అందమైన టీనేజ్ అమ్మాయిలను ప్రముఖులకు చేరవేస్తూ అట్టి వ్యక్తులతో సంబంధాలు నెలకొల్పుకొని రాజకీయంగాను, ఆర్థికంగానూ బలపడ్డాడు. దురదృష్టవశాత్తు మన దేశ ప్రధాని, ఒక మంత్రి, ఒక బడా పారిశ్రామికవేత్త ఈ ఫైల్స్లో అనేక మార్లు పేర్కొనబడటం మనకు కూడా తలవంపులు కలిగించే విషయం. దేశ రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన రాఫెల్ డీల్లో కూడా ఎప్స్టీన్ పాత్ర చాలా గణనీయమని ఈ డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తున్నది. ఇంతకాలంగా అణచివేతకు గురవుతున్న పాలస్తీనాకు నైతిక మద్దతునిచ్చిన మన దేశం అకస్మాత్తుగా తన విధానాన్ని మార్చుకొని ఇజ్రాయెల్కు మద్దతు పలకడం కేవలం అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించడానికి అనేది సుస్పష్టం. ప్రముఖులకు, దేశాధినేతలకు అమ్మాయిలను ఎరవేసి తన వ్యాపార విస్తరణ చేసుకుంటూ దేశాధినేతలతో ఇతడు పరిచయాలు పెంచుకున్న విధానం కచ్చితంగా అనుమానించదగినదే. ఒక మామూలు టీచర్గా తన జీవితాన్ని ప్రారంభించి ప్రపంచ నేతలకు యువతులను ఉపయోగించి లోబరుచుకున్న నీచ వ్యక్తి నేడు భౌతికంగా లేకపోయినా అతని ఫైల్స్ దేశదేశాల్లో భూకంపం పుట్టిస్తున్నాయి. తన దీవికి ఆహ్వానించి విందులు ఏర్పాటు చేసి దేశాధినేతల మధ్య పరిచయం కలిగించిన ఒక బ్రోకర్ గా మనం ఎప్స్టీన్ను వర్ణించవచ్చు. రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా తమ పదవుల నుండి వైదొలగుతున్న పరిస్థితి నేడు ప్రపంచంలో కనబడుతున్నది కేవలం ఈ ఫైల్స్ లో వారి పేర్లు బయటపడిన కారణంగా మాత్రమే. ఈ ఫైల్స్లో 300 మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. 1200 నుండి 1500 పేర్లు ఏదో ఒక నేరంతో ముడిపడి ఉన్న పరిస్థితి. మొత్తంగా 23,000 మంది పేర్లు ఈ ఫైల్స్ నిండా ఉటకించబడి ఉన్నట్లుగా చెబుతున్నారు. పేర్లు ఉన్న వారందరూ నేరస్థులుగా మనం పరిగణించలేం. కానీ ఫైల్స్లో వారి ప్రస్తావన ఉండడం అనుమానాస్పదం, అవమానకరం. బ్రిటన్లో ఇద్దరుముగ్గురు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకుడు, ఇంకా ప్రిన్స్ ఆండ్రు తమ పదవుల నుండి తప్పుకున్నారు. కొందరు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. విచారణలు మొదలైనాయి. దర్యాప్తులు కూడా ప్రారంభమైనాయి. అనేక దేశాలలో దేశాధినేతల పీఠాలు కదులుతున్నాయి. అమెరికా, భారత దేశాధినేతలలో మాత్రం చలనం లేదు. సమయం, తేదీలతో సహా ఈ ఫైల్స్లో ఆధారాలు ఉండగా, వాటిని మన నేతలు కొట్టి పారవేస్తున్నారు. పవర్ బ్రోకర్ల ద్వారా దళారీల ద్వారా మధ్యవర్తిత్వం నెరపడం దేశానికి సిగ్గుచేటు. అది ముఖ్యంగా దేశ రక్షణ వ్యవహారాలలో కావడం మరింత అనుమానాస్పదం. ఎందుకింత రాజీతత్వం, రాజీ ధోరణి? నేర సంబంధాలు దేశానికి, దేశ రక్షణకు చేటు కలిగించబోతున్నాయి. ఈ దేశంలో ప్రభుత్వాలకు, రాజకీయ నేతలకు ఇంకా విలువలు ఉన్నాయని నిరూపించుకోవలసిన బాధ్యత నేటి పాలకులపై ఎంతైనా ఉంది. - శ్రీ శ్రీ కుమార్
Grameena bank |ఆ.. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
Grameena bank | ఆ.. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.. Grameena bank, చౌటుప్పల్,
Toxic Teaser: Yash surprises with his Makeover
Toxic Teaser Talk The post Toxic Teaser: Yash surprises with his Makeover appeared first on Telugu360 .
Choutuppal |బోర్ ను ప్రారంభిస్తున్న ఈఎల్వి భాస్కర్..
Choutuppal | బోర్ ను ప్రారంభిస్తున్న ఈఎల్వి భాస్కర్.. Choutuppal, ఆంధ్రప్రభ :
ఆత్మను ఉత్తేజితం చేసే రంజాన్ క్రతువు
చాలా మందికి తొమ్మిదవ ఇస్లామీయ మాసపు సంధ్యా సమయంలో ఆకాశంలో కనిపించే అతి సన్నని నెలవంక కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే. కానీ కోట్లాది మందికి, అది ముప్పై రోజుల సుదీర్ఘ ఆధ్యాత్మిక మారథాన్కు లభించిన ప్రారంభ సంకేతం.రంజాన్ అనేది కేవలం క్యాలెండర్లో మారే తేదీ కాదు; అది ఒక ‘ఆధ్యాత్మిక వసంతం’. ఆధునిక ప్రపంచపు హోరును తొలగించి, మానవ ఆత్మలోని నిశ్శబ్ద శక్తిని వెలికితీసే ఒక కాలానుగుణ పునరుద్ధరణ ఇది. ‘తక్షణ తృప్తి’ (Instant Gratification) కోరుకునే ఈకాలంలో, పవిత్ర మాసం పట్ల ఇస్లాం అనుసరించే విధానం ‘ఉద్దేశపూర్వక మితవాదం’ (Deliberate Moderation)కు ఒక నిదర్శనం. చంద్రుడిని చూసిన తర్వాతే ఉపవాసాన్ని ప్రారంభించాలని, ముగించాలని ప్రవక్త ముహమ్మద్ (సఅసం) ఇచ్చిన ఆదేశంలో ఒక అద్భుతమైన వైశిష్ట్యం ఉంది. ఇది విశ్వాసిని ప్రకృతితో మమేకం చేస్తూ ఒక ‘చాంద్రమాన లయ’ను (Lunar Metronome) సృష్టిస్తుంది.ఇది అతి ఉత్సాహంతో ముందే మొదలుపెట్టడం గురించి కాదు; సరైన సమయం కోసం వేచిఉండటంలోని నిగ్రహం గురించి. మనకు నచ్చిన పనిని చేయడం కంటే, సరైన సమయంలో సరైన పనిని చేయడమే నిజమైన శక్తి అని ఇది మనకు నేర్పుతుంది. ఉపవాస ప్రక్రియ ‘సహర్’, ‘ఇఫ్తార్’ అనే రెండు ప్రధాన ఘట్టాల మధ్య సాగుతుంది. సహర్: ఇది అహంపై చేసే ఒక నిశ్శబ్ద విజయం. ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న వేళ, తెల్లవారుజామున విశ్వాసి మేల్కొని అటు శరీరానికి, ఇటు ఆత్మకు అవసరమైన పోషణను పొందుతాడు. ఇది దైవంతో ఏర్పడే అత్యంత సన్నిహిత సమయం; రోజంతా ఆరాధనలో గడపడానికి అవసరమైన ఒక ‘పవిత్ర ఇంధనం’. ఇఫ్తార్: దీనికి విరుద్ధంగా, ఇఫ్తార్ అనేది ‘సరళత’ నేర్పే పాఠం. రోజంతా కఠినమైన నియమాలతో ఉండి, ఉపవాస విరమణ సమయంలో విందు వినోదాల కంటే, కేవలం ఒక ఖర్జూరం లేదా నీటి చుక్కతో విరమించడం ఒక అద్భుతమైన అనుభూతి. ఇది సంపన్నులకు ఒక చుక్క నీటి విలువను, ఆకలితో ఉండేవారి పట్ల గౌరవాన్ని గుర్తు చేస్తుంది. ప్రాథమికంగా ‘రోజా’ (ఉపవాసం) అనేది ఒక మానసిక విప్లవం. రోజూ సుమారు 16 గంటల పాటు, ఒక విశ్వాసి తన ప్రాథమిక సహజాతాలైన ఆకలి దప్పులను కూడా ఒక ఉన్నత శక్తి (దైవం) అధికారానికి లోబడి ఉంచుతాడు. ఇది ‘అంతర్గత సార్వభౌమాధికారానికి’ గొప్ప నిదర్శనం. ఒక వ్యక్తి చుట్టూ ఎంతటి ఆహార పదార్థాలు ఉన్నా, ‘దైవ అనుమతి’ లేనిదే అతను దేనినీ ముట్టుకోడు. ఆత్మఅనేది కేవలం శరీరానికి లేదా కోరికలకు బానిస కాదు అని నిరూపించే అత్యున్నత విశ్వాసం ఇది. ఏ ప్రాపంచిక సంస్థ లేదా సామాజిక ఒత్తిడి కూడా ఉపవాసం ఉన్న వ్యక్తి సంకల్పాన్ని దెబ్బతీయలేదు; ఇది సృష్టికర్తతో ఆ వ్యక్తి కుదుర్చుకున్న ఒక విడదీయరాని బంధం. వ్యక్తిగత చర్యలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో రంజాన్ ఒక గొప్ప ఉదాహరణ. ఇది ఆచరణాత్మకమైన ‘సామాజిక సానుభూతి’ (Social Empathy). ఆకలి బాధను స్వయంగా అనుభవించడం ద్వారా, ఒక వ్యక్తిలో ‘అంతరాత్మ’ మేల్కొంటుంది. ఎదుటివారి కష్టాల్లో మనం పాలుపంచుకున్నప్పుడే వారి బాధను నిజంగా అర్థం చేసుకోగలమనే సందేశం ఇక్కడ కనిపిస్తుంది. ముప్పై రోజుల తర్వాత, పాత అలవాట్లకు తిరిగి వెళ్లడం లక్ష్యం కాదు; మరింత క్రమశిక్షణతో, సానుభూతితో కూడిన ఒక నూతన వెర్షన్గా బయటకు రావడం అసలైన ఉద్దేశం. ఉన్నతమైన నైతిక లక్ష్యం కోసం మన భౌతిక అవసరాలను త్యాగం చేసినప్పుడు, మనం మనల్ని కోల్పోము-బదులుగా మనల్ని మనం కొత్తగా కనుగొంటాం అని రంజాన్ నిరూపిస్తుంది. ప్రపంచం రోజురోజుకూ రొదతో, గందరగోళంతో నిండిపోతున్న వేళ.. ఉపవాసం ఇచ్చే ఈ నిశ్శబ్దమే అన్నిటికంటే శక్తివంతమైన సందేశం. - ముజాహిద్ ఎం.డి.
Suhas’ Hey Balwanth Movie Review
Hey Balwanth Movie Review Telugu360 Rating: 2.25/5 After impressing the audience with his comic timing, Suhas shifted to lead actor roles. He delivered impressive films and at the same time, several recent offerings of the actor ended up as disappointments. He sounded extremely confident on Hey Balwanth, a comic entertainer. Gopi Atchara is the director […] The post Suhas’ Hey Balwanth Movie Review appeared first on Telugu360 .
Andhra Pradesh : రాజధానిలో భూ కేటాయింపులపై నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేడు మంత్రి వర్గ ఉప సంఘం భేటీ కానుంది.
Kadem |గంగాపూర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఖానాపూర్ ఎమ్మెల్యే
Kadem | గంగాపూర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఖానాపూర్ ఎమ్మెల్యే Kadem (నిర్మల్
అతడే.. ఒక సైన్యం. ఇది ఒక సినిమా టైటిల్. సిఎం రేవంత్రెడ్డికి సరిగ్గా ఇది సరిపోతుంది. ఎందుకంటే.. రేవంత్రెడ్డి రాజకీయ అడుగులు వేసిన తొలినాళ్ల నుంచి అన్నీ తానై ఎదిగిన తీరును చూసిన వాళ్లు ఇలా చెబుతారు. అతడే ఒక సైన్యంగా మారి రేవంత్రెడ్డి పనిచేస్తారని పేర్కొంటారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే ఫార్ములాతో ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడిస్తారని చెబుతుంటారు. ఎన్నిక ఏదైనా.. వ్యూహ రచన చేయడంలో దిట్ట. తనకు తానే సాటి అంటుంటారు. అంతేకాదు.. మగధీర సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ ఒక్కొక్కడిని కాదు షేర్ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపు”.. అన్నట్లుగా రేవంత్రెడ్డి ప్రతిపక్షపార్టీ అధినేత కెసిఆర్ను ఉద్దేశించి చాలా సందర్భాల్లో సవాల్ విసిరారు. సత్తాచాటారు. ప్రస్తుతం రాజకీయాల్లో సక్సెస్కు రేవంత్రెడ్డి కేరాఫ్గా మారారు. తన రాజకీయ జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థులు, సొంత పార్టీ వాళ్లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఛేదించడంలో తనకుతానే నేర్పరి. సొంత వాళ్లు సపోర్ట్ చేసినా, చేయకపోయినా తనకు తానే వ్యూహకర్త. గెలుపు రచన చేసుకొని ముందుకు సాగే కథనాయకుడు రేవంత్రెడ్డి. తన రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు.. ఏ హోదాలోనైనా రేవంత్రెడ్డి ఒక్కడే.. అతడే ఒక సైన్యంగా రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి విజయకేతం ఎగరవేయడం కామన్ అయింది. 2006లో మిడ్జిల్ జెడ్పిటిసిగా, 2007లో మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎంఎల్సిగా.. ఈ రెండు ఎన్నికలూ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినవే. 2009లో టిడిపిలో చేరి.. అదే ఏడాది, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎంఎల్ఎగా రెండుసార్లు విజయం సాధించారు. 2017 అక్టోబర్ 31న కాంగ్రెస్లో చేరారు. 2018లో కొడంగల్ ఎంఎల్ఎగా పోటీ చేసి తొలిసారి ఓటమి చవిచూశారు. అప్పటి అధికార బిఆర్ఎస్ కుట్రలకు రేవంత్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని అందరికీ తెలిసిందే. ఆ ఓటమి రేవంత్ రెడ్డిలో మరింత కసిపెంచిందనే చెప్పాలి. మరుసటి ఏడాది 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపిగా పోటీచేసి రేవంత్రెడ్డి ఘన విజయం అందుకున్నారు. అప్పటినుంచి రేవంత్ దశాదిశ పూర్తిగా మారింది. మల్కాజ్గిరి ఎంపిగా రేవంత్రెడ్డి గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలం గాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథిని చేసింది. పిసిసి చీఫ్గా 2021 జులై 6న రేవంత్రెడ్డి పార్టీ బాధ్యతలు చేపట్టారు. తనకున్న ఇమేజ్, యూత్ ఫాలోయినింగ్తో పార్టీలో జోష్ నింపారు. హస్తం పార్టీలో సీనియర్, జూనియర్ నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీని గాడిలో పెట్టడంలో రేవంత్.. సైనికుడిలా పనిచేశారు. ఇంద్రవెల్లిలో చేపట్టిన దళిత గిరిజన దండోరా సభ పెద్ద సక్సెస్.. ఆ తర్వాత జంగ్ సైరన్, రైతు పోరుబాట, కల్లాల్లో కాంగ్రెస్ లాంటి పోరాటాలు అతడే.. ఒక సైన్యంలా చేసినవే. రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకొని, ఉదయం వాటిని అమలు చేసినవి చాలా ఉన్నాయి. ప్రజల్లో బిఆర్ఎస్ ప్రభుత్వంపై అసహనం, వ్యతిరేకత బలంగా ఉండడం, దానికి రేవంత్ స్ట్రాటజీ వర్కవుట్ అయింది. రేవంత్ పాదయాత్రతో ప్రజల్లో పూర్తి విశ్వాసం పెరిగింది. కాంగ్రెస్కు సరైన సారథి, కెసిఆర్కు ప్రత్యామ్నాయం రేవంత్రెడ్డే అని తెలంగాణ జనం ఫిక్స్అయ్యారు. ఫలితంగా 2023 డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిసిసి చీఫ్గా రేవంత్ మినిట్ టు మినిట్ అతడే ఒకసైన్యంగా మారి పని చేశారని చెప్పక తప్పదు. 2023 డిసెంబర్ 7న ఎల్బిస్టేడియం వేదికగా రేవంత్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ప్రజలే కాదు.. దేశ ప్రజలు, ప్రపంచ నలుమూలల్లో ఉండే తెలుగు వారంతా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారాన్ని టివిల ముందు, లైవ్లు పెట్టుకొని మరి చూశారు. కెసిఆర్ లాంటి నేతను గద్దెదించి అధికారం చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. రేవంత్రెడ్డి కంటే.. రాష్ట్ర రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. కానీ, వారెవరూ కెసిఆర్ను టచ్ చేయలేకపోయారు. నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల పల్లె కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన రైతుబిడ్డ రేవంత్రెడ్డి చేసిన సాహసం, ధైర్యం.. ఒక్క ముక్కలో చెప్పాలంటే కసి సిఎం కుర్చీలో కూర్చునేలా చేశాయి. ప్రతి మూమెంట్లో రేవంత్ వేసిన అడుగులు సిఎం కుర్చీ వైపు నడిపించాయి. తనకు తానే వ్యూహాలు రచించుకొని ముందుకు సాగారు. విజయాన్ని అందుకున్నారు.సిఎం రేవంత్ రెడ్డికి వరుసగా విజయాలు వచ్చి తన ఖాతాలో పడ్తున్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సిఎం రేవంత్రెడ్డి ఇమేజ్ను మరింత పెంచేశాయి. అధిష్టానం వద్ద కూడా రేవంత్రెడ్డి అంటే ఏమిటో మరోసారి రుజువైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 64 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతానికి పైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. దానికి రేవంత్ రెడ్డి.. వ్యూహరచన, తన రాజకీయ చతురత నిదర్శనమని చెప్పకతప్పదు. అంతకు ముందు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ అంటే.. బిఆర్ఎస్కు కంచుకోట అని, కాంగ్రెస్పై గ్రేటర్ ప్రజల్లో నమ్మకంలేదని, బుల్డోజర్ సర్కార్ అని గులాబీ నేతలు రెచ్చగొట్టినా.. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మాత్రం సిఎం రేవంత్పై నమ్మకంతో హస్తానికి జైకొట్టారు. అంతేకాదు.. రెండేళ్ల కాలంలోనే అధికార పార్టీ కాంగ్రెస్పై, రేవంత్రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రతి రోజు రేవంత్ను టార్గెట్ చేసుకొని బిఆర్ఎస్ నేతలు చేసే విమర్శలు తారస్థాయికి చేరాయి. కానీ సిఎం రేవంత్ ప్రతిపక్షాల విమర్శలకు స్థానిక, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతోనే చెక్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతి ఎన్నికను అతడే ఒక సైన్యంగా మారి గెలుపు తీరాలకు చేర్చారు. - కంచ రాజు 99638 01882
ఢిల్లీలో బీజేపీ పాలనకు ఏడాది పూర్తి
ఢిల్లీలో బీజేపీ పాలనకు ఏడాది పూర్తి అయింది.
భర్త చూస్తుండగానే భార్య గొంతు కోసి చంపి... బంగారం ఎత్తుకెళ్లిన దుండగుడు
బెంగళూరు: భర్త పక్కన పడుకున్న 70 ఏళ్ల భార్యను ఓ వ్యక్తి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని నీలమంగళ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హీరాపూర్లోని కోట బీడీ కాలనీలో శోభా, రంగానాథ్ అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. రంగనాథ్ గత పదిహేను సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. సదరు మహిళ వద్ద నుంచి శివ కుమార్ అనే వ్యక్తి ఎనిమిది లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అర్థరాత్రి సమయంలో ఆమె ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు కోశాడు. భర్తకు పక్షవాతం ఉండడంతో అటుఇటు కదలలేడు, మాట్లాడలేడు. శివకుమార్ 65 లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఫిజియోథెరఫీ అనే వైద్యుడు ఇంట్లోకి వచ్చేసరికి శోభా రక్తపు మడుగులో కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి ముందు ఉన్న సిసి కెమెరాలను పరిశీలించగా శివ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగినట్టు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో అప్పు కోసమే తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
TGRERA: బాచుపల్లి 'నెబ్యులా ఆవాస్' కు టీజీరేరా ఆదేశాలు....
పాత కేటాయింపుదారుల జరిమానాలను తొలగించాలని, ఖాతాలను సవరించాలని, బకాయిలు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించింది.
Munugode |గొలుసు దొంగల అరెస్ట్.. రిమాండ్..
Munugode | గొలుసు దొంగల అరెస్ట్.. రిమాండ్.. Munugode, ఆంధ్రప్రభ : ఈ
నేడు అసోంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు
శ్రీ విజయ వారాహి చిత్రం ప్రారంభం
ఆర్యా హీరోగా పోలూ రు కృష్ణ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. శ్రీ విజయ వారాహి మూవీస్ బ్యానర్ పై మురుకుంట్ల అరవింద్, విజయ భారతి నిర్మిస్తున్న ఈ కొత్త చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ఘనం గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దశరథ్ క్లాప్ కొట్టారు. నిర్మాత విజయ భారతి కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాతలు టీంకు స్క్రిప్ట్ అందజేశారు. మూవీ యూనిట్ అందరూ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో దశరథ్, వాసుకి, ఆడుకలం నరేన్, సమ్మిట గాంధీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మూవీ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత మురుకుంట్ల అరవింద్ మాట్లాడుతూ “మా అబ్బాయి ఆర్యా మొదటి సినిమాకి కృష్ణ చెప్పిన కథ బావుంటుందని అనిపించింది. చాలా అద్భుతమైన కథ ఇది. మార్చి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తాం. మే నాటికి షూటింగ్ ని పూర్తి చేసుకొని జూలైలో సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నాం”అని అన్నారు. దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ “ఒక కొత్త హీరోని పరిచయం చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలతో ఈ కథని సిద్ధం చేశాం. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. టౌన్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది”అని తెలిపారు. హీరో ఆర్యా మాట్లాడుతూ “నాకు ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చిన డైరెక్టర్ కృష్ణకి ధన్యవాదాలు. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను”అని తెలియజేశారు.
AP |శభాష్.. కృష్ణా జిల్లా పోలీస్..
AP | శభాష్.. కృష్ణా జిల్లా పోలీస్.. AP, ఉయ్యూరు, ఆంధ్రప్రభ :
Bhuvaneswari Speaks Out: Heritage Legacy Is Built on Quality, Not Politics
Heritage Foods Vice Chairperson and Managing Director Nara Bhuvaneswari has stepped forward to address the allegations being circulated against the company. In a direct and composed video message, she defended the integrity of a brand that has operated for over three decades and positioned it firmly against what she described as politically motivated narratives. Bhuvaneswari […] The post Bhuvaneswari Speaks Out: Heritage Legacy Is Built on Quality, Not Politics appeared first on Telugu360 .
Weather Report : అప్పుడే ఇన్ని డిగ్రీలు నమోదయితే మున్ముందు ఎంతో?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
ఏపీ, తెలంగాణలో SIR ప్రక్రియ ఎప్పటి నుంచి అంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Rajgopal reddy |సమయపాలన ఖచ్చితంగా అమలు చేయాలి..
Rajgopal reddy | సమయపాలన ఖచ్చితంగా అమలు చేయాలి.. Rajgopal reddy, మునుగోడు,
అందాల తార రుక్మిణీ వసంత్ ‘కాంతార చాప్టర్ 1’లో కనకవతి పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ భామ ప్రస్తుతం రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న మరో పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ చిత్రంలోనూ ఛాన్స్ అందుకుంది. ఇదే ఊపులో రుక్మిణీ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా కిల్ మూవీ ఫేం నిఖిల్ నగేష్ ఓ చిత్రం తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో కార్తీక్ కి జోడీగా రుక్మిణీ వసంత్ ను తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇదొక ఇంటెన్స్ యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతుంది. టి సిరీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీంతో పాటు ప్రళయ్ అనే ఓ జోంబీ చిత్రంలోనూ రుక్మిణీ ఛాన్స్ అందుకుందనే. వార్త వైరల్ గా మారింది. రణ వీర్ సింగ్ కథానాయకుడిగా జై మెహతా దర్శకత్వంలో ఈ చిత్రానికి సంబంధించి ప్రణాళిక సిద్దమవుతోంది. ఇందులోనూ హీరోయిన్గా రుక్మిణీ వసంత్ అయితే బాగుంటుందని భావిస్తున్నారుట. ఈ అవకాశాన్ని గనుక రుక్మిణీ అందుకోగలిగితే అమ్మడి కెరీర్ కు మరో టర్నింగ్ పాయింట్గా నిలుస్తుంది.
విశాఖ తీరంలో ఆకట్టుకున్న డ్రోన్, లేజర్ షో #Visakhapatnam #RKBeach #IndianNavy #DroneShow #LaserShow
Sreeleela shifts Focus on Tamil
Telugu beauty Sreeleela emerged as the leading actress and she worked with all the top stars. A series of debacles brought a lot of criticism but Sreeleela is in demand. She has completed her part for Ustaad Bhagat Singh featuring Pawan Kalyan in the lead role and the film releases on March 26th across the […] The post Sreeleela shifts Focus on Tamil appeared first on Telugu360 .
Choutuppal |స్వామి గౌడ్ అంతిమ యాత్రలో రాజగోపాల్ రెడ్డి..
Choutuppal | స్వామి గౌడ్ అంతిమ యాత్రలో రాజగోపాల్ రెడ్డి.. Choutuppal, ఆంధ్రప్రభ
Forest department |పర్యాటకుల కోసం సఫారీ..
Forest department | పర్యాటకుల కోసం సఫారీ.. Forest department, వికారాబాద్, ఆంధ్రప్రభ
Congress |ఇచ్చిన హామీలన్నీ అమలుకు సిద్ధం..
Congress | ఇచ్చిన హామీలన్నీ అమలుకు సిద్ధం.. Congress, ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ :
Tirumala : కిటకిటలాడుతున్న తిరుమల కొండ.. దర్శనానికి ఎంత సేపు వెయిట్ చేయాలంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
Vijay and Rashmika to make an Announcement
Tollywood actors Vijay Deverakonda and Rashmika Mandanna are all set to get married on February 26th in a grand wedding in Udaipur. There is a huge noise on social media and the star couple is going ahead with the wedding arrangements. There is no official statement made by them till date. They decided to stay […] The post Vijay and Rashmika to make an Announcement appeared first on Telugu360 .
టీవీ సౌండ్ తగ్గించమంటే.. భర్తను హత్య చేసిన భార్య
సీరియల్ చూస్తున్న భార్యను సౌండ్ తగ్గించమన్నందుకు ఏకంగా భర్తను భార్య హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది
తిరుమలలో పాద రక్షల ట్రాకింగ్ వ్యవస్థకు విశేష స్పందన
ఆరు నెలల్లో 8.45 లక్షలకు పైగా పాద రక్షల సమర్థ నిర్వహణ ఈ నూతన విధానంపై భక్తుల్లో హర్షాతిరేకాలు త్వరలో మరిన్ని ప్రాంతాలకు సేవలు విస్తరణ తిరుమల: తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టిటిడి అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ ఆధారిత పాద రక్షల ట్రాకింగ్ & మేనేజ్మెంట్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ విశేష ఫలితాలను అందిస్తోంది. ఆధునిక సాంకేతికతతో అమలులోకి వచ్చిన ఈ విధానం ద్వారా భక్తులు తమ పాద రక్షలను సులభంగా డిపాజిట్ చేసి, తిరిగి వేగంగా పొందగలుగుతున్నారు. 2025 సెప్టెంబర్ నుండి 2026 ఫిబ్రవరి 15 వరకు మొత్తం 8,45,816 పాద రక్షల డిపాజిట్–డెలివరీ లావాదేవీలు ఈ విధానం ద్వారా విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కాలంలో భక్తుల నుంచి స్వీకరించిన 4,24,047 పాద రక్షల్లో, 4,21,769 పాద రక్షలను సురక్షితంగా తిరిగి అందజేయడం జరిగింది. దాదాపు అన్ని కేంద్రాల్లో పాద రక్షల తిరిగి పొందే శాతం అత్యంత అధికంగా నమోదు కావడం ఈ వ్యవస్థ సమర్థతను ప్రతిబింబిస్తోంది. వీటిలో ఎటిజిహెచ్ కేంద్రంలో మొత్తం 44,714 పాద రక్షలు సేకరించగా, వాటిలో 44,340 పాద రక్షలు భక్తులకు పంపిణీ చేయబడ్డాయి. కృష్ణ తేజ సర్కిల్ కేంద్రంలో 56,019 పాద రక్షలు సేకరించగా, 55,428 పాద రక్షలు పంపిణీ అయ్యాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో 55,238 పాద రక్షలు సేకరించబడగా, 54,928 పాద రక్షలు భక్తులకు అందించబడ్డాయి. పీఏసీ-5 కేంద్రంలో అత్యధికంగా 1,38,270 పాద రక్షలు సేకరించగా, వాటిలో 1,37,904 పాద రక్షలు పంపిణీ చేయబడ్డాయి. అదే విధంగా రామ్ భగీచ విశ్రాంతి గృహం కేంద్రంలో 76,556 పాద రక్షలు సేకరించగా, 76,071 పాద రక్షలు పంపిణీ అయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కేంద్రంలో 53,250 పాద రక్షలు సేకరించబడగా, 53,098 పాద రక్షలు పంపిణీ చేయబడ్డాయి. ప్రత్యేకించి రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ విధానం భక్తులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఫిబ్రవరి 1 నుండి 15వ తేదీ వరకు కేవలం 15 రోజుల్లోనే 1,35,314 పాద రక్షల లావాదేవీలు జరగడం ద్వారా రద్దీ సమయాల్లోనూ ఈ వ్యవస్థ ఎంత వేగంగా, క్రమబద్ధంగా పనిచేస్తోందో స్పష్టమవుతోంది. గతంలో తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో పాద రక్షలు అస్తవ్యస్థంగా పడి ఉండటం, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆ సమస్యలకు పరిష్కారంగా ప్రత్యేక చోరవ తీసుకుని ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహకారంతో డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ ఆధ్వర్యంలో పాద రక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమబద్ధత పెరగడంతో భక్తులకు కలిగే ఇబ్బందులు గణనీయంగా తగ్గాయి. ఈ నూతన విధానంపై భక్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పాద రక్షలు తప్పిపోవడం, గందరగోళం ఏర్పడడం వంటి సమస్యలు తరచుగా ఎదురయ్యేవనీ, నూతన ట్రాకింగ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు దాదాపుగా పూర్తిగా తొలగిపోయాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడం, సిబ్బంది సంఖ్యను పెంచడం వంటి చర్యలతో ఈ వ్యవస్థను మరింత విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో కల్యాణకట్ట, బేడి ఆంజనేయస్వామి ఆలయం, ఏటీసీ సర్కిల్ వద్ద మరో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. తిరుమల నాలుగు మాడ వీధుల్లో పాదరక్షల వాడకం నిషిద్దo తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉండే నాలుగు మాడ వీధుల్లో దాదాపు ప్రతి రోజూ స్వామి వారు విహరిస్తారు. కనుక పాద రక్షలు ధరించడం నిషిద్ధం. కావున భక్తులు తప్పనిసరిగా పాద రక్షల కొరకు టిటిడి ఏర్పాటు చేసిన ఈ నూతన విధానాన్ని వినియోగించుకోగలరు. ఈ ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థ వల్ల తిరుమలలో పరిశుభ్రత మరింత మెరుగుపడటమే కాకుండా, భక్తులకు సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన దర్శన అనుభవం అందించడమే ప్రధాన లక్ష్యంగా టిటిడి ఈ స్మార్ట్ షూ కీపింగ్ విధానాన్ని అమలు చేస్తోంది.
Ranveer Singh Shelves Four Films
Bollywood Superstar Ranveer Singh is extra cautious about his career. Dhurandhar emerged as a major blockbuster for the actor at a crucial time in his career. He is in news after Ranveer Singh shelved four films in a row and all these are before and after the release of Dhurandhar. He announced the remake of […] The post Ranveer Singh Shelves Four Films appeared first on Telugu360 .
సర్పంచ్ లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
పంచాయతీ సర్పంచులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది
Abhishek Sharma : శర్మా ఏందయ్యా.. ఇది.. నీ బ్యాట్ కు ఏమయింది బాసూ?
టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ వరల్డ్ కప్ కు ముందు చెలరేగి ఆడాడు
రెండో పెళ్లి చేసుకుంటున్న టీమిండియా మాజీ ఓపెనర్
హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ను రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ధావన్ గత కొన్ని రోజుల నుంచి సోఫీ షైన్ అనే యువతితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. ఇద్దరు మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి దాకా వచ్చింది. అతడు మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. సోఫి షైన్, ధావన్కు సంబంధించిన సంగీత్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సంగీత్ కార్యక్రమానికి స్నేహితులు, బంధువులు హాజరైనట్టు సమాచారం. రెండో రోజుల్లో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. 2012లో ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను ధావన్ వివాహం చేసుకున్నాడు. 2023లో ఆమెకు అతడు విడాకులు ఇచ్చాడు. భారత జట్టులో రోహిత్ శర్మతో కలిసి శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేసేవాడు. ఫామ్ ఇబ్బంది పడడంతో అదే సమయంలో గిల్ ఓపెనర్గా పాతుకుపోవడంతో దావన్ ప్లేస్ టీమిండియాలో గల్లంతైంది. దీంతో మూడు ఫార్మాట్లకు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధావన్ వన్డేలలో 167 ఇన్నింగ్స్లలో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో కలిసి 6793 పరుగులు చేశాడు. టి20ల్లో 68 మ్యాచ్లలో 11 హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు 1759 పరుగులు చేశాడు. 34 టెస్టుల్లో ఏడు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 2315 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 10867 పరుగులు చేశాడు. ఐపిఎల్లో కూడా 222 మ్యాచ్లలో రెండు సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలతో 6769 పరుగులు చేశాడు.
ಹೈದರಾಬಾದ್ ದೇವಾಲಯ ಘಟನೆ ವಿಡಿಯೋವನ್ನು ಮುಂಬೈನಲ್ಲಿ ಧಾರ್ಮಿಕ ಘೋಷಣೆ ಕೂಗಿಲ್ಲ ಎಂದು ಥಳಿಸಿದ್ದಾರೆ ಎಂದು ತಪ್ಪಾಗಿ ಹಂಚಿಕೆ
Delhi : నేడు ఢిల్లీలో రేవంత్, చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న టెన్షన్.. ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు మళ్లీ ఉధృతి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి.
ప్రేమపెళ్లి... టివి సౌండ్ కోసం భర్తను పొడిచి చంపిన భార్య
అమరావతి: టివి సౌండ్ తగ్గించామని అడిగినందుకు భర్తను భార్య కత్తితో పొడిచి చంపింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... షేక్ అహ్మద్ అనే యువకుడు(27) ఎసి మెకానిక్గా పని చేస్తున్నాడు. క్రాంతి అనే యువతితో ప్రేమలో పెట్టాడు. ఈ జంట ప్రేమ పెళ్లి చేసుకొని మంగళగిరిలోని టిడ్కో ఇళ్లలో నివసిస్తున్నారు. క్రాంతి టివి సౌండ్ ఎక్కువగా పెట్టుకొని వీక్షిస్తోంది. సౌండ్ ఎక్కువగా కొంచెం తగ్గించాలని భార్యకు భర్త సూచించాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్తాయికి చేరుకుంది. భార్య చెంపపై భర్త కొట్టాడు. కోపంతో రగిలిపోయిన భార్య కత్తి తీసుకొని భర్తను పొడిచింది. స్థానికుల వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి భార్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న ఎన్నికల ఉ చితాల సంస్కృతిపై సుప్రీంకోర్టు గురువారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక ప్రగతికి ముప్పుగా వాటిల్లే ఈ పద్ధతిని మానాలని పిలుపు నిచ్చింది. ఉచితాల విధానాలను ఇప్పటికైనా సమీక్షించుకుని తీరాలి. పద్ధతి మార్చుకోవాలని సంబంధిత పక్షాలకు హితవు పలికింది. ఉద్యోగావకాశాలపై దృష్టి సారించాలని ప్రభుత్వాలకు, విధాన నిర్ణేతలకు చురకలు పెట్టింది. తమిళనాడు విద్యుత్ పంపి ణీ సంస్థ తాము అందరికీ ఉచితంగా కరెంటు ఇస్తామని, ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుం డా ఈ సౌకర్యం కల్పిస్తామని ఇందుకు అనుమతించాలని ప్రతిపాదించింది. ఈ విషయం పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యా యమూర్తులు జాయ్మాల్యా బాగ్చీ, విపుల్ ఎం పంచోలీ ధర్మాసనం పలు రీతిలో ఈ సా మాజిక దుష్ప్రభావ అంశంపై స్పందించింది. పేదలకు చేయూత నిచ్చే సంకల్పాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆర్బాటాలకు దిగుతూ సాగే ఉచితాలకు పోవడం అర్థం కాని విష యం అని ధర్మాసనం తెలిపింది. ఇటీవలి కా లంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార ద శల్లో ఓట్ల వేటకు ఉచితాలకు దిగుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలలో రెవెన్యూ లోటు భా రీగా ఉంది. అయితే ఇప్పటికీ దీనిని పట్టించుకోకుండా ఉచితాలకు దిగుతున్నారని విమర్శించారు. ఇటువంటి ఉచితాల దయార్థ్రత తో కూడిన ఉచిత విద్యుత్ పంపిణీతో చివరికి ఆర్థిక వ్యవస్థకు షాక్ కొట్టిస్తారా? అని ప్రశ్నించింది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్ కాదు , ఉద్యోగ కల్పన సంబంధిత రంగాల విస్తృతికి పాటుపడితే ప్రజలకు ఎప్పటికైనా మేలు చేసినట్లు అవుతుందని తెలిపారు.తమిళనాడు విద్యుత్ సంస్థ ప్రతిపాదిత ఉచిత విద్యుత్ స్కీం గురించి వైఖరి తెలియచేయాలని కేంద్రానికి, ఇతర పక్షాలకు సుప్రీంకోర్టు నోటీసు వెలువరించింది. తమిళనాడు విద్యుత్ సంస్థ విద్యుచ్ఛక్తి సవరణల నిబంధన 2024ను సవాలు చేసింది. దీనిపై ధర్మాసనం స్పందించింది. దే శంలో ఎటువంటి సంస్కృతి నెలకొంటున్నదో తెలియడం లేదు. ప్రజల సంక్షేమం కోణంలో ఉచిత విద్యుత్ ఇస్తామంటున్నారు. అయితే బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్న వారికి దీనిని కల్పిస్తే బాగుంటుంది కానీ, మొదటికే మోసం గా మారకూడదు కదా? అని నిలదీశారు. ఎవరు బిల్లులు కట్టగలరు? ఎవరు కట్టలేరు? అనేది విశ్లేషించుకోకుండా, అందరికీ ఫ్రీ అంటే ఇది కేవలం తాయిలాల కిందికి రాదా? అని అడిగారు. ఎలక్ట్రిసిటీ టారీఫ్ వెలువడిన తరువాత ఈ ఉచిత స్కీం తీసుకువస్తామంటే దీని అర్థం ఏమిటని నిలదీశారు. రాష్ట్రాలు కానీ, సంస్థలు కానీ ముందుగా యువతరానికి అవసరం అయిన ఉద్యోగ ఉపాధి పథకాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఉచిత తిండి, ఉచిత రవాణా, ఉచిత సైకిళ్లు , ఉచిత కరెంటు ఇస్తూ పోతే ఇక అంతా ఇంట్లో హాయిగా నిద్రపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో పని సంస్కృతి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు ఒక్క పనిచేస్తే సరిపోతుంది కదా? అభివృద్ధి పనులు ఆపివేసి, ఈ డబ్బుతో అందరికీ జీతాలు ఇస్తూ, వారి పట్ల ఔదార్యతను ప్రదర్శించండి. దీని వల్ల వారికి అప్పటికప్పుడు మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో దేశానికి ఏం అవుతుందనేది వదిలేస్తే మంచిదని వ్యంగ్యంగా తిట్టిపోసింది.
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్
` ఐదురుగు మావోయిస్టులు మతి రాయపూర్(జనంసాక్షి): ఛత్తీస్గఢ్లో మళ్లీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మతిచెందారు. మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ …
` మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రశంసించిన ఖర్గే, రాహుల్ ` ప్రజల తెలంగాణ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ` సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి …
` సిద్ధిపేటలో పోటీచేస్తా ` ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతాం ` అధికారంలోకి రావడం ఖాయం ` తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల …
ఏఐకి తెలంగాణే వేదిక: శ్రీధర్ బాబు
` ఏఐ యూనివర్సిటీ, ఏఐ హబ్ల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయింపులు ` ఇంపాక్ట్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రీధర్ బాబు న్యూఢిల్లీ(జనంసాక్షి):కత్రిమ మేథకు సంబంధించిన నూతన …
ఏఐ ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను వద్ధిలో నడిపిస్తాయి
` భారత్లో మార్పులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ` విశాఖ మీదుగా ఐఐటి ఖరగ్పూర్కు వెళ్లేవాడిని ` అదే విశాఖలో ఇప్ప్పుడు గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం ` …
` ఏఐని మనమే శాసించాలి ` మన ఆలోచనలకు అందనంతగా ఎఐ ` మానవ అభివద్దిలో ఎఐది కీలక భూమిక ` భారత్లో ఎఐ పురోభివద్ది చరిత్రగా …
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటి చేసిన దానం నాగేందర్పై పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హత వేటు పడక తప్పదని భావిస్తోన్న తరుణంలో ఈ ఉదంతం కొత్త మలుపు తిరిగిం ది. బీఆర్ఎస్ పార్టీ దానం నాగేందర్ను సస్పెండ్ చేయడంతో ఆయనకు పార్టీ మారే వెసులుబాటు లభించిందని, ఆ మేరకే ఆయ న కాంగ్రెస్ నుంచి ఎంపిగా పోటీ చే యడంతో అనర్హత వేటుకు అవకాశం లేదనే వాదన తెరపైకి వచ్చింది. ఈ అంశం స్పీకర్ ప్రసాద్కుమార్ బుధవారం దానంపై అనర్హ త పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సభ్యుడిపై అనర్హత వేటు వేయమని కోరే అవకాశాన్ని బీఆర్ఎస్ చేజాతులారా కోల్పోయిందనే విషయాన్ని విచారణ సందర్భంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రస్తావించినట్టు సమాచా రం. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పక్షంలో సదరు సభ్యుడికి ఏ పార్టీలో అయినా చేరే వెసులుబాటు ఉంటుందని, ఆ మేరకే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ఎంపిగా పోటి చేసినట్టు ఆయన తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించినట్టు సమాచారం. వారి వాదన మేరకు దానం నాగేందర్పై అనార్హత వేటు పడే అవకాశం లేదని కూడా ఈ వర్గాలు చెబుతున్నాయి. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం రాగానే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సాక్షాధారాలను పిటిషనర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇప్పటికే స్పీకర్కు అందజేయడం వల్ల వారి వాదనకు బలం చేకూర్చిందని ఈ వర్గాల సమాచారం. ఇలా ఉండగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సభ్యుడిపై సస్పెన్షన్ను ఎప్పుడైనా ఎత్తివేసే అవకాశం ఉంటుందని, దానం నాగేందర్ సస్పెన్షన్ ఎత్తివేసినట్టు సాక్షాధారం ఏది స్పీకర్ దృష్టికి పిటిషనర్లు తీసుకరాకపోవడంతో ఆయనపై అనార్హత వేటు పడుతుందా? లేదా?, దీనిపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది? పెద్ద సస్పెన్స్గా మారింది.
20thfeb2026 |శుక్రవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
20thfeb2026 | శుక్రవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 20thfeb2026 |
ഫാക്ട് ചെക്ക്: മൂന്നാമതും പിണറായി സർക്കാർ വരണമെന്ന് അൻവർ? വസ്തുതയെന്ത്?
2023ൽ അൻവർ നടത്തിയ പ്രസ്താവനയുടെ ഭാഗമാണ് ഇപ്പോൾ പ്രചരിക്കുന്നത്
రూ.70వేల కోట్ల స్కామ్ను పట్టిచ్చిన హైదరాబాద్ బిర్యానీ
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లోని బిర్యానీ బిల్లుతో మొదలై ఏకంగా రూ.70 వేల కోట్ల పన్ను ఎగవేత స్కామ్ బట్టబయలైం ది. ఐటి అధికారులు బిల్లింగ్ వ్యవస్థను అధ్యయనం చేయడం ద్వారా హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా భారీ స్కామ్ వెలుగు చూసింది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్లు ఈ బి ల్లింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నాయి. కం ప్యూటర్ సాధనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అధి కారులు సుమారు 1.77 లక్షల రెస్టారెంట్ల నుండి బిల్లింగ్ రికార్డులను తనిఖీ చేశారు. దాదాపు 60 టెరాబైట్ల డే టాను పరిశీలించారు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. కస్టమర్లు చెల్లించిన తర్వాత అ నేక బిల్లులు కంప్యూటర్లోనే తొలగిపోతా యి, లేదంటే మార్పులు జరుగుతాయి. అంటే మెు త్తానికి బిల్లు ఉండదు, లేదంటే ఎక్కువ బిల్లు అ యిన తక్కువగా చూపిస్తుంది. ఇదంతా కస్టమర్ బిల్లు చెల్లించి వెళ్లిపోయాక జరుగు తున్న తంతుగా గుర్తించారు. దేశమంతటా ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించే రెస్టారెంట్లు రూ.13,000 కోట్లకు పైగా విలువైన బిల్లులను తొలగించా యి. తెలంగాణ, ఎపిలలో మాత్రమే ఇలా కనిపిం చకుండా చేసిన బిల్లులు రూ.5,100 కోట్లకు పైగా జరిగాయి. రెండుసార్లు తనిఖీ చేయడానికి అధికారులు 40 రెస్టారెంట్లను స్వయంగా సందర్శించారు. నిజమైన అమ్మకాలను కంప్యూటర్ రికార్డులతో పోల్చారు. ఈ చిన్న తనిఖీ కూడా దాదాపు రూ.400 కోట్ల అమ్మకాలను మిస్ అయ్యా యని గుర్తించింది. మెుత్తానికి రూ.70 వేల కోట్ల వరకు స్కామ్ జరిగింది. ఈ లిస్టులో కర్ణా టక ముందు వరుసలో ఉంది. అత్యధిక పన్ను ఎగవేత కనిపిం చింది. తరువాత తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా కొన్ని రెస్టా రెంట్లు బిల్లులను తొలగించడానికి కూడా ప్రయత్నించలేదు. వాస్తవానికి సంపాదించిన దానికంటే తక్కువ డబ్బు సంపాదించామని పన్ను శాఖకు తెలిపారు. ఇప్పటివరకు అధ్యయనం చేసిన డేటా ప్రకారం.. అన్ని రెస్టారెంట్ అమ్మకాలలో నాలుగో వంతు దాచిపెట్టారని అధికారులు విశ్వసిం చారు. రెస్టారెంట్లు సాధారణంగా అన్ని చెల్లింపులు, నగదు, కార్డులు, యూపిఐలను బిల్లింగ్ సాఫ్ట్వేర్లో నమోదు చేస్తాయి. తద్వారా సిబ్బంది డబ్బును దొంగిలించలేరు. కానీ యజమానులు స్వయంగా ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని అధికారులు కనుగొన్నారు. నగదును ట్రాక్ చేయడం కష్టం కాబట్టి నగదు బిల్లులను మాత్రమే తొలగిం చడం కొన్ని రెస్టారెంట్లు చేస్తున్నాయి. మరికొందరు కొన్ని రోజులు లేదా ఒక నెల మొత్తం బిల్లులన్నింటినీ తీసేస్తున్నారు. ఆ తర్వాత చాలా తక్కువ ఆదాయాన్ని చూపిస్తూ తక్కువ పన్ను కడుతున్నారు. కాగా, ఈ డేటా ఆరు సంవత్సరాలలో దాదాపు రూ.2.43 లక్షల కోట్ల రెస్టారెంట్ అమ్మకాలను కవర్ చేసింది. ప్రతిదీ విశ్లేషించడానికి, అధికారులు డిజిటల్ ల్యాబ్ల నుండి ఎఐ సాధనాలను ఉపయోగించి పనిచేశారు. ఇవి రెస్టారెంట్ రికార్డులను జిఎస్టి నంబర్లు, పబ్లిక్ లిస్టింగ్ల వంటి ఆన్లైన్ సమాచారంతో సరిపోల్చాయి. మొదట హైదరాబాద్, విశాఖపట్నం, సమీప పట్టణాలలో దర్యాప్తు ప్రారంభమైంది. ఈ కుంభకోణం ఎంత పెద్దదో అధికారులు గ్రహించిన తర్వాత, దర్యాప్తును దేశవ్యాప్తంగా విస్తరించారు. అనేక ఇతర బిల్లింగ్ సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఉన్నాయి. అవి కూడా ఇలాంటి సీక్రెట్స్ను దాచిపెడుతూ ఉండవచ్చంటున్నారు. తనిఖీలు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు.
న్యూఢిల్లీ: మానవ కేంద్రీకృత దిశలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత సాగాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలోని భారతీయ మండపంలో ఏఐ సమ్మిట్లో గురువారం ఆయన ఈ దిశలో ఏఐ సంబంధిత మా.న.వ్ విజన్ను ఆవిష్కరించారు. భారతదేశం తరఫున ఏఐ ప్రక్రియలో ఈ వినూత్న, నిర్మాణాత్మక రూపాన్ని ప్రపంచం ముందుంచుతున్నామని ప్రధాని తెలిపారు. మానవ్ (MANAV)ఏఐ విజన్ను పరిచయం చేశారు. ఇందులో ఏం మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్..దీని మేరకు ఏఐ నైతికతను, బాధ్యతను పరిగణనలోకి తీసుకుని పనిచేయాలి. ఇక ఎ అకౌంటబులిటి. సమాజం పట్ల పారదర్శకతతో జవాబుదారితో ఉండాలి. ఎన్ ...నేషనల్ సావర్నిటి, ఒక దేశం సృష్టించిన డేటా ఆ దేశ పరిధిలోనే ఉండాలి. ఆ దేశానికి చెందాలి. ఎ ..యాక్సెసబులిటి అండ్ ఇంక్లూజివ్ ....అనుసంధానం, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండటం. వి ...వాలిడ్ అండ్ లెజిట్మేట్ అంటే చట్టబద్ధం, నిబంధనలకు అనుగుణంగా ఏఐ ఉండాలని ఈ నూతన ఆవిష్కరణను ప్రధాని మోడీ వివరించారు. ఎవరూ ఊహించనంతగా ఏఐ పరిజ్ఞానం విస్తరించుకుంటోంది. ఈ క్రమంలో ఈ ప్రక్రియను ప్రజాస్వామికరించాల్సి ఉంటుంది. మానవ కేంద్రీకృతంగా ఏఐ అందరికీ అందుబాటులోకి రావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో దేశీయత, సార్వత్రికత కీలకం అని పిలుపు నిచ్చారు. భయంలేదు ..జయం వైపు చూపు దూసుకువచ్చిన ఈ సాంకేతికత పరిణామాల పట్ల భారతదేశం భయపడటం లేదు. పైగా దీనిని ఓ సదవకాశంగా మల్చుకుని రేపటి మంచికి అవసరం అయిన బ్లూప్రింట్గా మలుచుకుంటుందని తెలిపారు. మన ఆలోచనలకు కూడా అతీతంగా ఉండేలా ఏఐ ఉంటుంది. ఈ క్రమంలో దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకునే విధంగా నిబంధనలు అవసరం అన్నారు. చట్టబద్ధతతోనే ఇది సాధ్యం అవుతుందని చెప్పారు. పలువురు ప్రపంచ నేతల సమక్షంలో ప్రధాని మోడీ ప్రసంగం సాగింది. అపార పరివర్తన శక్తిని సంతరించుకున్న కృత్రిమ మేధను సద్వినియోగం చేసుకుంటే క్షేమదాయకం అవుతుంది లేకపోతే అది విధ్వంసానికి దారితీస్తుందని మోడీ హెచ్చరించారు. అసంఖ్యాక జనాభా గల భారతదేశం అందుబాటులోకి వచ్చే ఏఐను సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే అది మనకు ఎనలేని మేలు చేస్తుందని చెప్పారు.] ప్రజా సంక్షేమం..సంతోషమే సూచిక దేశ ప్రజల సంక్షేమం, అందరి సంతోషమే గీటురాయిగా కృత్రిమ మేధ ప్రస్థానం సాగాల్సి ఉంటుంది. ఈ వినూత్నత ద్వారా మనకు అందే డాటా ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి. అంతేకాని మనుష్యులు చివరికి డాటా పాయింట్ లేదా ముడిసరుకులు కారాదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఏఐ మనను శాసించరాదు. మనం ఈ వ్యవస్థను నిర్ధేశించగలగాలని ప్రధాని పిలుపు నిచ్చారు. ఇప్పుడు మనం ఆవిష్కరించుకుంటున్న కృత్రిమ మేధ సంక్షిప్తంగా చెప్పాలంటే నైతికత జవాబుదారి సార్వత్రికత, దేశీయతతో కూడిన చట్టబద్ద వ్యవస్థ అని ప్రధాని తెలిపారు. ఇప్పుడు భారతదేశ ఆవిష్కృత మానవ విజన్ 21వ శతాబ్ధంలో మానవీయ విలువలు, సంక్షేమ అనుసంధాన దిశలో అత్యంత కీలకమైన బంధం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకాశమే హద్దు..పగ్గాలు చేతిలో ఈ నూతన సాంకేతికత ఆకాశం హద్దుగా సాగాల్సిందే అయితే అదుపు చేసే మీట మన చేతిలో ఉండాల్సిందే అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ జిపిఎస్ ఉదాహరణ ఉటంకించారు. ఈ మార్గ సూచిక సాధనంతో మనం వెళ్లాల్సిన చోటికి సూచనలు వెలువడుతాయి. అయితే తుది నిర్ణయం తీసుకునేది కేవలం దీనిని వాడుకునే వారే అవుతారని చెప్పారు. ఏఐకి కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. ఏఐని మనం ఏ విధంగా తీసుకువెళ్లుతామనే విషయంపైనే మన భవిత ఆధారపడి ఉంటుందని అన్నారు. గురువారం నాటి సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్, బ్రెజిల్ నేత లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, స్విస్ ప్రెసిడెంట్ గై పర్మీలిన్ , పలు టెక్ కంపెనీల సిఇఒలు హాజరయ్యారు. ఏఐ విప్లవంలో భారతదేశం కేవలం పాత్రవహించడమే కాకుండా నాయకత్వ స్థాయికి కూడా వెళ్లుతుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఐ పట్ల భయాలను వీడి జయాల వైపు సాగేందుకే భారత్ సంకల్పించిందని వివరించారు. ఇందుకు మన యువత ప్రతిభ సద్వినియోగం అవుతుందని తెలిపారు.
మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మండల విద్యుత్ సంస్థలో (టిజిఎస్పిడిసిఎల్) వస్తున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో మొత్తం 8 మందిని (4 ఇంజనీర్లు, ముగ్గురు లైన్మెన్లు, ఒక ఆర్టిజన్ను) సస్పెం డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ శాఖల్లో అవినీతి సహించమని ప్రభుత్వం ఈ సంఘటనతో రుజువు చే సింది. అవినీతికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. విద్యుత్ శాఖలో పా రదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే టిజిఎస్పిడిసిఎల్ సంస్థలో పలువురు అధికారుల అవినీతి నిజమని విజిలెన్స్ విచారణలో తేలడం తో ప్రభుత్వం వారిపై కొరడా ఝళిపించింది. ఈ ఘటన విద్యుత్ శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రజలకు సేవలందించే కీలక విభాగం లో అవినీతి చోటుచేసుకోవడం ఆందోళనకరం గా మారింది. ఈ మధ్య టిజిఎస్పిడిసిఎల్ సం స్థ పరిధిలో (ఏసిబి)ని మేనేజ్మెంట్ యాంటీ బ్రైబరీ సెల్ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యం లో ఆ సంస్థలో జరుగుతున్న అవినీతిపై 150 కు పైగా ఫిర్యాదులు ఆ సంస్థకు అందాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా అధికారులు పలు ఆధారాలను సేకరించారు. ఫి ర్యాదుల్లో పేర్కొన్న అంశాలను పరిశీలించి సం బంధిత అధికారుల పాత్రను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికను అందించారు. చార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటు, కొత్త కనెక్షన్లు, ప్యానెల్ బో ర్డుల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల మంజూరు వంటి వాటికి విద్యుత్ ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్టు రుజువయ్యింది. సస్పెండ్ అయిన వారిలో యాదాద్రి జిల్లాలో పనిచేసే ఒక ఏడిఈ, లైన్మెన్లు, గద్వాల్లో ఏఈగా పనిచేస్తున్న అధికారితో పాటు లైన్మెన్, మేడ్చల్లో ఏఈగా విధులు నిర్వహిస్తున్న అధికారి, సంగారెడ్డిలో సబ్ ఇంజనీర్గా పనిచేసే మరో అధికారి, సైబర్సిటీలో పనిచేసే లైన్మెన్, హైదరాబాద్ సౌత్లో పనిచేసే గ్రేడ్ 3 ఉద్యోగి ఉన్నారు. శాఖాపరమైన విచారణ ఈ విచారణలో అవినీతి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంజ నీర్లు ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపు మార్గాల ద్వారా లంచాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా నగదు రూపంలో జరిగే లంచాల స్థానంలో డిజిటల్ చెల్లింపులను ఉపయోగించారు. సేవలు అందించేందుకు, ఫైళ్లను త్వరగా పరిష్కరించేందుకు, కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు 8 మంది అధికారులు లంచాలు తీసుకున్నట్లు తేలింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా జరిగిన లావాదేవీలను అధికారులు సాంకేతికంగా పరిశీలించి ఆధారాలను సేకరించారు. సస్పెండ్ అయిన వారిలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు (ఏడిఈ), అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ), సబ్ ఇంజనీర్లు ఉన్నారు. మొత్తం 8 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. వారిపై శాఖాపరమైన విచారణ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ కేసులో మరికొందరి పాత్ర ఉందని అధికారులు భావిస్తున్నారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే 040 23454884, 7680901912 నెంబర్లలో వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: క్యాతన్పల్లిలో దొడ్డిదారిన అధికారం లాక్కునేందుకు మంత్రి వివేక్, పోలీసుల ముందే తమ దళిత, గిరిజన మహిళ కౌ న్సిలర్లపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం ఆక్షేపణీయమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజ్యాంగం చేతిలో పె ట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో రేవంత్ రెడ్డి పట్టపగలే ప్రజా తీర్పు ను కాలరాస్తుంటే ఎందుకు మాట్లాడర ని, కాంగ్రెస్ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అని, రేపు మళ్ళీ బీఆర్ఎస్ రాగానే తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పని, ఎవరూ కాపాడలేరని, ఉద్యమకారుడు బాల్క సుమన్పై ప్రభుత్వ కక్ష సాధింపు అక్రమంగా అరెస్ట్ చేసి 200 కిలోమీటర్ల దూరంలో ని ఆదిలాబాద్ జైలుకు తరలించడం దు ర్మార్గమన్నారు. బీజేపీ నాయకులు పోలీసులను బూతులు తిట్టిన అరెస్టులు ఉం డవు కానీ ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుల పైనే అక్రమ కేసులా అని హరీష్ రావు అన్నారు. ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి పరామర్శించిన మాజీ మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు బాల్క సుమన్తో పాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్లను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజ సమని ప్రశ్నించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లితో పాటు ఆసిఫాబాద్లో జైళ్లు ఉన్నప్పటికీ వాళ్లను అ క్కడ పెట్టకుండా కక్షపూరితంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తీసుకువచ్చి పెట్టడం దుర్మార్గమన్నారు. క్యాతన్పల్లిలోని 22 స్థానాల కు గానూ 14 స్థానాలను బీఆర్ఎస్ గె లుచుకుందని, బీఆర్ఎస్, సీపీఐ కూటమిని ప్రజలు గెలిపించారన్నారు. ప్రజ లు ఇచ్చిన తీర్పును మంత్రి వివేక్ శిరసావహించాల్సింది పోయి, ఇలా ప్రజా తీర్పును కాలరాయడం సరికాదన్నారు. కోరం ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి, చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా పడేలా చేశారన్నారు. అధికారులు, పోలీసుల సమక్షంలో, మంత్రి వివేక్ చూస్తుండగానే దళిత, గిరిజన, మహిళ కౌన్సిలర్లపై దౌర్జన్యంగా, నోటితో చెప్పలేని విధంగా అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడి జరుగుతున్నప్పుడు వివేక్ మంత్రి హోదాలో అక్కడే ఉండి కూడా కనీసం పట్టించుకోకపోవడం, కోరం ఉన్న ఎన్నిక వాయిదా వేసి వెళ్లిపోవడం శోచనీయమన్నారు. క్యాతన్పల్లి మహిళ కౌన్సిలర్ల తరపున రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం ఫిర్యాదు తీసుకోలేదన్నారు. కౌన్సిల్కు మద్యం తాగి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాజిరెడ్డి కారు ధ్వంసం చేసిన వారిపై కేసులు ఉండవు కానీ, మా కౌన్సిలర్లపై మాత్రం అక్రమ కేసులు పెట్టారు. బాల్క సుమన్, కోవా లక్ష్మీలను ఎమ్మెల్యేలుగా ఉండి కూడా లోపలికి పంపించకుండా కేవలం మంత్రిని ఎలా పంపిస్తారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమపై దాడి చేశారన్నారు. పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులతో అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ గూండాలు స్టేషన్కు వచ్చి మరీ కొడుతున్నారన్నారు. ఈ రకమైన దాడులు మంచివి కావని హితావు పలికారు. పోలీస్ కవాతు ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రజల్లో విశ్వాసం నింపాలి కానీ జనగామ, ఇబ్రహీంపట్నం, ఆమనగల్, క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ నాయకులను, కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే పోలీసులు కవాతు చేశారన్నారు. ఇబ్రహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. ఎన్నికను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. జనగామలో ఓటింగ్ కోసం తమ కౌన్సిలర్ చేతి పైకెత్తితే వెనుక నుండి కాంగ్రెస్ కౌన్సిలర్లు చేతులు పట్టి లాగి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. అందులో దళిత మహిళ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. ఒక ఎంపీ అన్యాయంగా రెండోసారి తొర్రూరులో ఓటు నమోదు చేసుకుని ఓటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం నాలుగే మున్సిపాలిటీలు గెలిచిందని, తాము ఇప్పుడు దాదాపు 800 మంది కౌన్సిలర్లను గెలుచుకున్నామని, అప్పుడు తాము ఇలా చేయలేదన్నారు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారన్నారు. దొడ్డిదారిన పదవులు దక్కించుకునే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారని, కాంగ్రెస్, బీజేపీల మైత్రి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకుడు బీజేపీ ఎంపీ పోలీసులను పట్టుకుని అడ్డగోలుగా బూతులు తిట్టిన ఇప్పటివరకు వారిని అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో తెలంగాణ క్యాబినెట్తో రివ్యూ చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడికి పోయిన చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఏం చెప్తారని ప్రశ్నించారు. ఇదేనా రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే అని అడిగారు. తెలంగాణలో పట్టపగలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించరని, రాష్ట్ర ఇంచార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఎందుకు నోరు విప్పరన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడలాని రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై, క్యాతన్పల్లి ఇన్సిడెంట్ పైన గవర్నర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయని, పోలీసు అధికారులకు మేము చెప్పేదొకటే.. అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒకే తీరుగా ఉండవు. కాలం మారుతుంది, రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. పోస్టింగ్ల కోసం నాయకుల చెప్పుచేతల్లో పనిచేయకూడదన్నారు. చట్టాన్ని అతిక్రమించి, పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు తీవ్ర మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హరీష్రావు హెచ్చరించారు.
కాబూల్: అఫ్గానిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వం మ హిళలపై విపరీతమైన ఆంక్షలు విధిస్తోంది. ఇది అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం తాలిబన్లు కొత్త నేర నియమావళిని ప్రవేశ పెట్టారు. ఇది మహిళలు, పిల్లలపై తీవ్ర వివక్ష చూపిస్తోంది. ఇది ఎంత అరాచకమంటే భార్యలను భర్తలు శారీరకంగా హింసిం చవచ్చు. ఎముకలు విరగకుండా ఉంటే నేరం కా దంటూ గృహహింస చట్టాన్ని తీసుకొచ్చారు. రక్తస్రావం కానంతవరకూ ఇంట్లో మగవారు వారిని శారీరకంగా శిక్షించినా, అది శిక్ష కిందకు రాదు. తీవ్ర మైన దాడి జరిగినట్టు నిరూపితమైనాభర్తకు గరిష్టంగా కేవలం 15 రోజుల జైలు శిక్ష మాత్రమే విధిస్తారు. బాధిత మహిళ అలా కోర్టుకు వెళ్లినప్పు డు కూడా వెంట ఆమె బాధ్యత చూసుకునే పురుషుడు ఉండాలి. అలాగే న్యాయమూర్తికి ఆమె తన గాయాలను చూపించినప్పుడు కూడా పూర్తిగా క వర్ చేసుకునే ఉండాలి. భర్త లేదా పురుష బంధు వు (మహ్రామ్) అనుమతి లేకుండా మహిళలు పు ట్టింటికి లేదా బయటకు వెళ్తే మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. మహిళలు బయట మాట్లాడితే వినపడకూడదు. ముఖం కనబడకుండా పూర్తిగా క ప్పుకోవాలి. ఈ కొత్త నిబంధనలపై అఫ్గాన్ సుప్రీం లీడర్ హిబుతుల్లా అఖుంద్జాదా సంతకాలు చేశా రు. ఈ కొత్త శిక్షాస్మృతి లో ఆర్టికల్ 9 ప్రకారం అఫ్గాన్ సమాజాన్ని మత పెద్దలు (ఉల్మా), ఉన్నతవర్గం(అష్రాఫ్), మధ్యతరగతి, దిగువ తరగతి అ నే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. నేర తీవ్రతను బట్టి కాకుండా ఈ వర్గాల ప్రకారం శిక్షలు ఉంటాయి. 2009లో అధికారంలో ఉన్న అఫ్గాన్ ప్రభుత్వం మహిళలపై హింసకు వ్యతిరేకంగా తీ సుకొచ్చిన చట్టాన్ని కొత్త పీనల్ కోడ్ రద్దు చేసింది.
శుక్రవారం రాశి ఫలాలు (20-02-2026)
మేషం ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు చేస్తారు. ఇంటాబయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. వృషభం ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులను మరింత మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి. మిధునం ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు. కర్కాటకం రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగమున మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సింహం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. సోదరుల నుండి ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కన్య ముఖ్యమైన వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. తుల గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు. వృశ్చికం చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ధనస్సు దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. మకరం ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. నిరాశ కలుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. కుంభం కీలక వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి మీ మాటకు విలువ పెంచుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. మీనం దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అధిక శ్రమతో స్వల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
దుండిగల్ మున్సిపల్లో అక్రమాలు.. లంచంపై ఆధారాలు లభ్యం
లంచంపై ఆధారాలు లభ్యం ప్రకటనలో పేర్కొన్న ఎసిబి అధికారులు మనతెలంగాణ, సిటిబ్యూరోః దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎసిబి దాడులపై అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. గండిమైసమ్మ వద్ద ఉన్న దుండిగల్ మున్సిపల్ కార్యాలయంపై ఎసిబి అధికారులు బుధవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. కార్యాలయంలోని అడ్మినిస్ట్రేటివ్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, కార్యాలయ పనితీరును తనిఖీ చేశారు. కింద అక్రమాలు జరిగినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వాట్సాప్ చాట్లలో లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి. సూపర్వైజర్ భర్తకు చెందిన సంస్థకు అనధికారికంగా నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించి, వారి ఖాతాల్లోకి వచ్చిన నిధుల మూలాలను, అక్రమాలతో ఉన్న సంబంధాలపై విచారిస్తున్నట్లు ఎసిబి అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న కార్యాలయ రికార్డులు, డిజిటల్ డేటా, ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ సమగ్ర నివేదిక పంపనునట్లు పేర్కొన్నారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ఐదుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. శానిటరీ ఫీల్ అసిస్టెంట్ల ద్వారా పారిశుధ్య కార్మికుల హాజరు రికార్డులను తారుమారు చేసినట్లు తేలింది. 49 భవన నిర్మాణ అనుమతి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 12 దరఖాస్తులు నిబంధనల ప్రకారం ఉన్నా, 21 రోజుల గడువు దాటిపోయినా పెండింగ్లోనే ఉంచారు. 32 అనధికారిక నిర్మాణ కేసులలో, 28 కేసులకు సంబంధించి రెండో నోటీసు జారీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. జి+3 (మూడు అంతస్తులు) అనుమతి ఉన్న చోట, అక్రమంగా నిర్మించిన జి+5 (ఐదు అంతస్తులు) భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసినట్లు గుర్తించారు.
రూ.70వేల లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ విద్యాశాఖ సూపరింటెండెంట్
నగరంలోని సైఫాబాద్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసులో పనిచేస్తున్న సూపరింటెండెట్ ఫణిరాజ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్లు రూ.70వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఎసిబి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన స్కూల్ కు సంబంధించి సిబిఎస్ఇ ఎన్ఒసి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఫైల్ ను ప్రాసెస్ చేయడానికి సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ రూ.70 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను సూపరింటెండెంట్తో మాట్లాడి ఎన్ఒసీ ఇప్పిస్తానన్నాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. గురువారం డిమాండ్ చేసిన రూ.70 వేలు సూపరింటెండెంట్ సమక్షంలో సీనియర్ అసిస్టెంట్ తీసుకున్న సమయంలో ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసి వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు ఎసిబి అధికారులు వెల్లడించారు.
. ముందుకు రాని ప్రభుత్వం. పోడియం చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు. ఈలలు, నినాదాలతో గందరగోళం. టీడీపీ సభ్యుల నిరసనలు. ఇందాపూర్ నెయ్యిపై ఆగని రగడ. వాయిదాలతో నడిచిన మండలి. అచ్చెన్నాయుడు వర్సెస్ బొత్స విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: తిరుపతి లడ్డూ తయారీకి ఇందాపూర్ నెయ్యి సరఫరాపై శాసనమండలిలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. చర్చకు ప్రతిపక్ష వైసీపీ పట్టుబడుతుండగా… అధికార పక్షం మాత్రం ససేమిరా అంటున్నది. ఈ వివాదంపై మాటలయుద్ధం జరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలతో శాసనమండలి దద్దరిల్లింది. శాసనమండలి సమావేశాలు గురువారం […] The post పట్టువీడని వైసీపీ appeared first on Visalaandhra .
సుప్రీంకోర్టు ఆగ్రహం న్యూదిల్లీ: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందే రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ప్రశ్నించింది. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ తరహా విధానాలపై పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వినియోగదారుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఉచిత విద్యుత్ అందించేలా తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ […] The post అన్నీ ఉచితాలంటే ఎలా? appeared first on Visalaandhra .
విజన్ లక్ష్యాలతోవీబీ జీ రామ్జీ
ఉపాధి హామీలో పెండింగ్ పనులు పూర్తి చేయండిపథకంపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి :స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీ రామ్ జీ పథకం కింద పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని సూచించారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబరులో వీబీ జీ రామ్ జీ పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే సంవత్సరం […] The post విజన్ లక్ష్యాలతోవీబీ జీ రామ్జీ appeared first on Visalaandhra .
ఇస్కఫ్ జాతీయ మహాసభలో వక్తలు (విశాలాంధ్ర ప్రత్యేక ప్రతినిధి)ప్రజల ఐక్యతతోనే సామ్రాజ్యవాదాన్ని, మతతత్త్వాన్ని ఓడించగలమని ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడు పల్లబ్ సేన్ గుప్తా అన్నారు. శాంతి, స్నేహం, సాంస్కృతిక ఐక్యతకు అంకితమైన 85 ఏళ్ల చరిత్ర గల భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం (ఇస్కఫ్) 24 వ జాతీయ మహాసభలు గురువారం చెన్నై నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, శాంతి ఉద్యమ నాయకులు, సాంస్కృతిక కార్యకర్తలు పెద్ద […] The post ఐక్యతతోనే సామ్రాజ్యవాద ఓటమి appeared first on Visalaandhra .
ప్రేమించి దూరం పెడుతోందని యువతిపై సుత్తితో దాడి
సూర్యాపేట జిల్లాలో ఓ ప్రేమ ఉన్మాది దారుణానికి తెగబడ్డాడు.గత కొంతకాలంగా ప్రేమించి దూరం పెడుతుందని యువతిపై తన ప్రియుడు సుత్తితో దాడి చేసిన సంఘటన గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్నేహనగర్ లో చోటు చేసుకుంది. తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరిస్తోందని ప్రియురాలిపై సుత్తితో దాడి చేశాడు.యువతిపై దాడి చేయడంతో యువతి కేకలు విని స్థానికులు వచ్చి నిందితుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేశ్ హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. చదువుకునే సమయంలో నుతనకల్ మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇటీవల పెళ్లి ప్రస్తావన రావడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. నెల రోజుల క్రితం పెద్దల సమక్షంలో కూర్చిపెట్టి మాట్లాడారు. అప్పటి నుంచి యువతి సూర్యాపేటలోని బంధువులు ఇంట్లో ఉంటుంది. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్నేహనగర్ లో ఉన్న యువతిపై ప్రియుడు దాడి చేశాడు. సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన పట్టేటి స్పందన పై లింగంపల్లి గ్రామానికి చెందిన బోయిన్ల మహేష్ దాడికి పాల్పడినట్లు తెలిపారు. స్పందన స్నేహ నగర్ లో నివాసం ఉంటున్న తన అక్క బావ ఇంటికి గత రెండు రోజుల క్రితం వచ్చింది. గురువారం ఉదయం 09.15 గంటల సమయములో స్పందన ఒక్కతే ఇంటిలో ఉండడం చూసి పథకం ప్రకారం దాడి చేసినట్లు తెలిపారు. మహేష్ స్పందన పై పథకం ప్రకారం షాపు యందు ఇనుప సుత్తె కనుగోలు చేసి ఆమె దగ్గరికి వెళ్ళి వారి ప్రేమ విషయమై అమెతో గొడవ పడి తన వద్ద యున్న సుత్తె తో తలపై కొట్టి గాయపర్చనట్లు పోలీసులు పేర్కొన్నారు. స్పందన కేకలు విని చుట్టు పక్కల వారు వచ్చి ఆమెను కాపాడారని, స్పందనను చికిత్స నిమిత్తం సూర్యపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ యందు చేర్పించి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకొని హాస్పిటల్ కు వెళ్ళి స్పందన బావ పూల బాబురావు నుండి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్లు డి.ఎస్.పి ప్రసన్న కుమార్ తెలిపారు. సంఘటన వద్ద సూర్యాపేట రూరల్ జి. రాజశేఖర్ , చివ్వెంల యస్.ఐ వి. మహేశ్వర్, క్లూస్ టీం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గంజాయి తాగించి బాలికపై గ్యాంగ్ రేప్
బాలికకు గంజాయి తాగించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం బాలిక తన అమ్మమ్మతో కలిసి స్థానికంగా నివసిస్తోంది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం పాఠశాలకు వెళ్తున్నట్లు ఆ బాలిక ఇంట్లో చెప్పి బయటికి వెళ్లింది. సాయంత్రం అయినా బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక అమ్మమ్మ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాఠశాలలోని విద్యార్థులను ఆరా తీశారు. వారు చెప్పిన ఆధారాలతో సీసీ కెమెరాలను పరిశీలించారు. స్థానికంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఆ బాలికకు గంజాయి, మద్యం తాగించి ముగ్గురు నిందితులు అత్యాచారం చేసినట్లు గుర్తించారు. నిందితులు కూడా మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను వెంటనే పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు, రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురిలో ఒక యువకుడు స్థానిక భవానీ నగర్లో రౌడీ షీటర్ పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు రిమాండ్కు తరలించారు.
ఇరాన్పై సైనిక దాడికి అమెరికా సిద్ధం
ఇరాన్పై ఏ క్షణంలో అయినా భీకర దాడికి అమెరికా సర్వంసమాయత్తం అయింది. ఇరాన్ అణు చర్చలు విఫలం అయితే తాము దాడికి దిగడమే తరువాయి అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తరచూ చెపుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మిడిలిస్టు ప్రాంతానికి అమెరికాకు చెందిన అత్యంత అధునాతన ఎఫ్ 35, ఎఫ్ 22 జెట్ యుద్ధ విమానాలు, అనుబందంగా పలు ఫైటర్ విమానాలను రంగంలోకి దింపారని, ట్రంప్ అనుమతిని ఇస్తే వెంటనే దాడులు తప్పవని వాల్స్ట్రీట్ జర్నల్ తెలిపింది. వచ్చే శనివారం లేదా ఆదివారం అమెరికా దాడులు జరగవచ్చునని , దీనిపై ట్రంప్ వైట్హౌజ్లో తన సలహదారులతో కీలక చర్చలకు దిగారని వెల్లడైంది. మెరికా సైనిక కదలికలను ఇరాన్ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఎలక్ట్రానిక్ ఆయుధ వ్యవస్థతో కూడిన పలు యుద్ధ విమానాలను రెండో దఫాగా ఇరాన్ సమీపంలోకి తీసుకువచ్చి ఉంచారు. భారీ స్థాయి దాడులకు ఈ విమానాలు అత్యవసరంగా అమెరికా భావిస్తోంది. ఇరాన్పై పూర్తి స్థాయి దాడులకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నరీ లేనిది వెల్లడికాలేదు. అయితే దాడి జరిపితే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసే విధంగా నిర్ణీత లక్షం ఎంచుకుంటారని వెల్లడైంది. ముందుగా ఇరాన్ క్షిపణి వ్యవస్థను దెబ్బతీయడం ,ఈ లోగా తమ మాట వినకుండా వ్యవహరిస్తోన్న ఖమేనీ పాలనను అంతమొందించడం కోసం ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అణు చర్చలు ఫలవంతం అయ్యేలా చూడాలనే షరతుతో జెనీవాలో ట్రంప్ ఆదేశిత చర్చలు జరిగాయి.ఈ రెండో దఫా చర్చల్లోనూ ఎటువంటి ఫలితం వెలువడలేదు ఈ దశలో ఇక ఇరాన్ నేత ఖమేనీని టార్గెట్ చేసుకుని ట్రంప్ సైనిక దాడులకు వ్యూహాత్మక ప్లానింగ్కు దిగారని వెల్లడైంది. ఇరాన్పై దాడులకు ఎఫ్ 22 రాప్టోర్స్, ఎఫ్ 35 లైట్నింగ్స్ సిద్ధం చేశారు. ఎక్కువగా గగనతల దాడులతోనే ఇరాన్ పాలకులను దెబ్బతీయాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు. 2003 తరువాత ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు అమెరికా సైనిక పాటవం మొహరించుకుని ఉంది. పరిస్థితిని ఇరాన్ సమీక్షించుకొంటోంది. తనకున్న క్షిపణి బలగాలను మరింత అప్రమత్తం చేసుకుంది. ముందుగా అమెరికా స్థావరాలలను దెబ్బతీయడం ద్వారా వ్యూహాత్మకంగా ట్రంప్ ఆధిపత్యానికి సవాలు విసిరేందుకు రంగం సిద్ధం చేసుకంది. చమురు ట్యాంకర్ల రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేసేందుకు కూడా ఇరాన్ బలగాలు యత్నించే అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయ పరిణామాల్లో తీవ్రతకు దారితీస్తుంది. ఇక అమెరికాను అనూహ్య రీతిలో దెబ్బతీసే పాటవం తమకు ఉందని, ఇది అత్యంత కీలకమైన పరిణామం అవుతుందని ఇరాన్ ఉన్నత స్థాయి వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ చూపిన దివిసీమ విద్యార్థి డొక్కా జ్ఞానేశ్వర్
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ చూపిన దివిసీమ విద్యార్థి డొక్కా జ్ఞానేశ్వర్ డొక్కా జ్ఞానేశ్వర్
విశాఖలో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
ఎపిలోని విశాఖపట్నంలో రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నగరం లోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు యోగి క్యాటరింగ్ పని చేస్తుంటాడు. బాధితురాలి కుటుంబంతో అతనికి కొంతకాలంగా పరి చయం ఉంది. ఈ పరిచయాన్ని అడ్డుగా చేసుకుని, నిన్న సమీపంలోని దుకాణానికి వెళ్తున్న రెండేళ్ల చిన్నారిని మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్ప డినట్లు తెలుస్తోంది.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆలేరు విద్యార్థులు..
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆలేరు విద్యార్థులు.. ఆలేరు,ఆంధ్రప్రభ: ఆలేరు పట్టణంలోని బాలుర, బాలికల
స్కూటీని ఢీ కొట్టిన డీసీఎం తండ్రి మృతి, కొడుకుకు తీవ్ర గాయాలు
స్కూటీని ఢీ కొట్టిన డీసీఎం తండ్రి మృతి, కొడుకుకు తీవ్ర గాయాలు చౌటుప్పల్,
మైనర్ బాలికను వంచించిన యువకుడిపై కేసు నమోదు
మైనర్ బాలికను వంచించిన యువకుడిపై కేసు నమోదు చిట్టినగర్,ఆంధ్రప్రభః విజయవాడ సాయిరాం థియేటర్
Ram to take up Multiple Tasks in his Next
Energetic Star Ram is shattered with the debacle of Andhra King Taluka. The actor was super confident in the film but it failed to generate decent revenues despite receiving positive word of mouth. Ram is on a break and he has shelved his next film that was to be produced by Arka Media Works, the […] The post Ram to take up Multiple Tasks in his Next appeared first on Telugu360 .
Minister |స్థానిక పాలనలో… బీసీ లకు పెద్ద పీట
Minister | స్థానిక పాలనలో… బీసీ లకు పెద్ద పీట 34 శాతం
Big Runtime for Dhurandhar: The Revenge
Several analysts and filmmakers were left surprised with the runtime of Dhurandhar. The final runtime of the film was 3 hours and 35 minutes with the first half of the film lasting for over two hours. The film was watched multiple times by the audience and they enjoyed the film despite a lengthy runtime. The […] The post Big Runtime for Dhurandhar: The Revenge appeared first on Telugu360 .
Nawab Cafe USA Premieres TODAY
Harshika Productions’ upcoming Telugu film Nawab Cafe is all set for its USA theatrical release. Nawab Cafe is a heartfelt Telugu drama that blends emotion, relationships, and a story rooted in warmth and legacy. The film is scheduled for a worldwide theatrical release on February 20. Earlier announced under the title ChaiWala, […] The post Nawab Cafe USA Premieres TODAY appeared first on Telugu360 .
తాడిగడప శ్రీ కృష్ణవేణి కళాశాలలో జాబ్ మేళా
తాడిగడప శ్రీ కృష్ణవేణి కళాశాలలో జాబ్ మేళా ఈనెల 21న తాడిగడప లోని
గుండెపోటుతో సర్మిడి దేవురావు మృతి
గుండెపోటుతో సర్మిడి దేవురావు మృతి జైనూర్,ఆంధ్రప్రభః కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జై
జూబ్లీహిల్స్ లో చైన్స్నాచింగ్ జంట అరెస్టు
బైక్పై తిరుగుతూ చైన్స్నాచింగ్ చేస్తున్న జంటను జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి బంగారు గొలుసు, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లిహిల్స్ ఇన్స్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి కథనం ప్రకారం...ఎపిలోని కాకినాడకు చెందిన చెశెట్టి రేవతి (33), గుంటూరు జిల్లాకు చెందిన గిద్దల నరేంద్ర అలియాస్ నాని (23) సనత్ నగర్లోని హిందూ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఉంటున్నారు. నరేంద్ర రాపిడో బైక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి చైన్స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీ ఉదయం 9.30 నిమిషాల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 39లో కడపాల మానస అనే యువతి తన కార్యాలయానికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. యువతిని బైక్పై వెంబడించిన నిందితులు రోడ్ నంబర్ 44 వద్దకు చేరుకోగానే బైక్ వెనుక కూర్చున్న రేవతి బాధితురాలి మెడలోని 10 గ్రాముల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్పాయ్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. జుబ్లీహిల్స్ ఇన్స్స్పెక్టర్ యు. శ్రీనివాసులు రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎం. సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ జె. సతీష్ కేసు దర్యాప్తు చేశారు.
సాఫ్ట్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కి విద్యార్థిని ఎంపిక
సాఫ్ట్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కి విద్యార్థిని ఎంపిక కమ్మర్ పల్లి,ఆంధ్ర ప్రభ

26 C