SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

Iran Backed Militia : కూలిన US KC-135 Andhra Prabha News

Iran Backed Militia : కూలిన US KC-135 Andhra Prabha News

ప్రభ న్యూస్ 13 Mar 2026 9:29 am

ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా

యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్‌లో ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. ‘డెకాయిట్’ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ సెట్ లో షూట్ ర్యాప్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో అడివి శేష్ మాట్లాడుతూ “డెకాయిట్ ఒక కొత్త జోనర్ లో చేసిన సినిమా. ఇది థ్రిల్లింగ్ యాక్షన్ లో చెప్పిన లవ్ స్టోరీ. సినిమా చివరకు వచ్చేసరికి అందరూ ఎమోషన్ అవుతారు. ఈ సినిమాలో ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమా ఫ్యామిలీస్‌తో కలిసి చూడొచ్చు”అని అన్నారు. ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ “డైరెక్టర్‌కి ఇది ఫస్ట్ ఫిలిం, అనురాగ్ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా. శేష్ చేస్తున్న ఫస్ట్ లవ్ స్టోరీ ఇది”అని తెలిపారు. డైరెక్టర్ షానియల్ డియో మాట్లాడుతూ “భీమ్స్ తన మ్యూజిక్‌తో సినిమాను నేను నెక్స్ లెవెల్ తీసుకెళ్లారు. అనురాగ్‌తో వర్క్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. సుప్రియకి, శేష్‌కి ధన్యవాదాలు. ఈ సినిమా అందరికీ ఒక మంచి అనుభూతినిస్తుంది”అని తెలియజేశారు. ఈ సమావేశంలో అనురాగ్ కశ్యప్, భీమ్స్, విజయ్, నాగేంద్ర పాల్గొన్నారు.

మన తెలంగాణ 13 Mar 2026 9:28 am

స్మశాన వాటిక పనులకు స్వచ్చందంగా సహకారం..

స్మశాన వాటిక పనులకు స్వచ్చందంగా సహకారం.. హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ

ప్రభ న్యూస్ 13 Mar 2026 9:26 am

రెండో శనివారం విద్యా సంస్థలు పని చేయాలి..

రెండో శనివారం విద్యా సంస్థలు పని చేయాలి.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లాలోని

ప్రభ న్యూస్ 13 Mar 2026 9:19 am

Tirumala : తిరుమలకు వెళ్లే వారికి హై అలెర్ట్

తిరుమలలో భక్తుల నేడు రద్దీ పెరిగింది

తెలుగు పోస్ట్ 13 Mar 2026 9:18 am

పారిశుద్య పనుల పై డిపిఓ పర్యవేక్షణ..

పారిశుద్య పనుల పై డిపిఓ పర్యవేక్షణ.. గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:53 am

ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ కొండిగారి రాములు కన్నుమూత

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎంఎల్ఎ కొండిగారి రాములు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో రాములు తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన రెండు సార్లు(1989, 1994) సిపిఎం పార్టీ నుంచి గెలిచి ఇబ్రహీంపట్నం ఎంఎల్ఎగా ప్రజలకు సేవలందించారు. కొద్దిసేపటి క్రితం ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పరమపదించడంతో ఇబ్రహీంపట్నం ప్రజలు, సిపిఎం కార్యకర్తలు శోకసంద్రంలోే మునిగిపోయారు. ఇబ్రహాంపట్నంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

మన తెలంగాణ 13 Mar 2026 8:53 am

పెన్షన్ పంపిణీ చేయడానికి వెళుతుంటే..

పెన్షన్ పంపిణీ చేయడానికి వెళుతుంటే.. సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:48 am

దామగుండం ఆలయంలో..

దామగుండం ఆలయంలో.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన దామగుండం

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:39 am

Hyderabad : గ్రేటర్ వాసులకు గుడ్ న్యూస్

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 13 Mar 2026 8:38 am

ఇష్టంతో చదివితే..

ఇష్టంతో చదివితే.. చిట్యాల, ఆంధ్రప్రభ : ఇష్టంతో చదివితే రాణిస్తారని.. పదో తరగతి

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:30 am

Annadatha Sukhibhava : నేడు అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదల

ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం రైతన్నలకు ‘అన్నదాత సుఖీభవ’ నిధులు జమ చేయనుంది

తెలుగు పోస్ట్ 13 Mar 2026 8:29 am

9 ఏళ్ల క్రితం కేసు.. 10 ఏళ్లు జైలు శిక్ష..

9 ఏళ్ల క్రితం కేసు.. 10 ఏళ్లు జైలు శిక్ష.. పెద్దవంగర, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:21 am

ఎల్పీజీ కొరతపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన

దేశంలో ఎల్పీజీ కొరతపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది

తెలుగు పోస్ట్ 13 Mar 2026 8:14 am

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో..

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో.. భువనగిరి/ ఆంధ్రప్రభ : ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో

ప్రభ న్యూస్ 13 Mar 2026 8:13 am

ముగ్గురు బాలికలపై అత్యాచారం... నిందితుడికి మరణశిక్ష

చెన్నై: ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసిన వ్యక్తి కోర్టు మరణశిక్ష విధించిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలో జరిగింది. మేళపాళయం ప్రాంతం అళగిరిపురానికి చెందిన ఆనంద్ శేఖర్(41) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2023లో ముగ్గురు బాలికలను గదిలో బంధించి అత్యాచారం చేశాడు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడికి తిరునెల్వేలి కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. బాదితురాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 లక్షల పరిహ్వారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 

మన తెలంగాణ 13 Mar 2026 8:12 am

Ethiopia landslide : దక్షిణ ఇథియోపియోలో వర్ష బీభత్సం.. యాభై మంది మృతి...125 మంది గల్లంతు

దక్షిణ ఇథియోపియాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదం మిగిల్చాయి

తెలుగు పోస్ట్ 13 Mar 2026 7:59 am

నిజామాబాద్‌లో ట్రావెల్స్ బస్సు బోల్తా: నలుగురు మృతి

ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో గన్నారం వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. 22 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

మన తెలంగాణ 13 Mar 2026 7:54 am

చేపలు పడుతుండగా మత్య్సకారుడి గొంతులో ఇరుక్కున్న చేప

అమరావతి: చేపలు పడుతుండగా బతికున్న గొంతులో ఇరుక్కోవడంతో మత్సకారుడు ఊపిరాడక విలవిలలాడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సముద్రంలో చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. వలలో చేపలు పట్టి బయటకు తీసుకొచ్చాడు. వల నుంచి చేపలను వేరు మరో మత్సకారుడితో మాట్లాడుతున్నాడు. చేప ఒక్కసారిగా ఎగిరి అతడి నోట్లో పడింది. వెంటనే గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక విలవిలలాడాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. గొంతు వద్ద ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశాడు. జిజిహెచ్ ఇఎన్‌టి విభాగం వైద్యులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఒకరి ప్రాణం కాపాడారని కొనియాడాతున్నారు. 

మన తెలంగాణ 13 Mar 2026 7:43 am

Iran - Israel War : ఇరాన్, లెబనాన్ లపై బాంబులతో దాడులు..ఖమేనీ వార్నింగ్

ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధం పదమూడో రోజుకు చేరుకుంది.

తెలుగు పోస్ట్ 13 Mar 2026 7:38 am

డ్రైవర్ తప్ప తాగి వాహనం నడపడంతో..

డ్రైవర్ తప్ప తాగి వాహనం నడపడంతో.. ఆంధ్రప్రభ : 16వ నంబరు జాతీయ

ప్రభ న్యూస్ 13 Mar 2026 6:09 am

ప్రతీకారం.. పరిహారం

టెహ్రాన్: హతుడైన ఖమేనీ వారసుడిగా ఇరాన్ సుప్రీం నేతగా వచ్చిన మొజ్తబా ఖమేనీ గురువారం తొలిసారిగా అధికారిక ప్రకటన వెలువరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌లపై తమ దేశ ప్రతీకార దాడులు సాగుతాయని ఆయన హెచ్చరించారు. ఆయన వెలువరించిన ప్రకటనను ఇరాన్ అధికారిక మీడియా సంస్థల ద్వారా ప్రసారం చేశారు. త మ దేశాన్ని గాయపర్చిన శత్రువుపై మరిన్ని భీకర దాడు లు ఉంటాయని తెలిపారు. ప్రత్యేకించి శత్రువుపై పలు విధాలుగా ఒత్తిడి తీసుకురావల్సి ఉంది. ఇందుకు తమ దేశం నుంచి హర్మూజ్  జలసంధి మార్గంలో నౌకల రవాణా నిలిపివేత సాగుతుందని, ఈ మార్గంలో ఏ నౌక రవాణా జరిగినా తమ దాడులకు గురి కావల్సిందే అన్నారు. ఇక గల్ఫ్‌లోని తమ మిత్రదేశాలు ఇకనైనా అక్కడి అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలి. అమెరికాతో మిత్రత్వం వదులుకోవాలి. ఆయా దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు ఇకపై కూడా ఆగకుండా సాగుతాయని తెలిపారు. గల్ఫ్ దేశాలతో తమ స్నేహాన్ని గౌరవిస్తామని ,అయితే అక్కడి యుఎస్ స్థావరాలు తమ దాడులకు దెబ్బతినాల్సిందే అని హెచ్చరించారు. ట్రంప్ యుద్ధ విరమణ సంకేతాల ప్రకటన జోలికి వెళ్లకుండా ఇరాన్ కొత్త నేత , ఖమేనీ వారసుడు తీవ్రపదజాలంతో హెచ్చరికలు వెలువరించడం అంతర్జాతీయ యుద్ధ స్థితిని మరింతగా రగిలించినట్లు అయింది. మినాబ్ పాఠశాలపై దాడులు, అక్కడి చిన్నారుల వధ వంటి పలు అమానుష ఘటనలపై తమ ప్రతీకారం తప్పదని మొజ్తబా హెచ్చరించారు. ఏదో విధంగా తమ ఇరుగుపొరుగుదేశాలతో స్నేహ సంబందాలు పునరుద్ధరించుకోవాలని యత్నిస్తామని, అయితే ఈలోగా తమ సైనిక చర్యలు సాగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభంలోనే మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారని , ఆయన నాయకత్వం కుదరకపోవచ్చునని ఇజ్రాయెల్ సంస్థలు అంచనావేశాయి. ఇప్పుడు ఆయన నుంచి తీవ్రస్థాయి ప్రకటన వెలువడింది. 56 సంవత్సరాల మొజ్తాబా టీవీలలో ప్రత్యక్షంగా కనబడలేదు. అయితే ఆయన ప్రకటనను అధికారికంగా చదివి విన్పించారు. మూడు షరతులు అంగీకరిస్తే యుద్ధం ఆపేస్తాం: ఇరాన్ పశ్చిమాసియాలో యుద్ధం పరిసమాప్తం కావడానికి ఇరాన్ మూడు షరతులు విధించింది. ఈ షరతులు నెరవేరితేనా యుద్ధానికి ముగింపు పలుకుతామని ఎక్స్ వేదికగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ట్వీట్ చేశారు. ఈ షరతులపై అమెరికాఇజ్రాయెల్‌తో సంప్రదింపులు జరిపేందుకు రష్యాపాకిస్థాన్‌లు మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. మొదటి షరతుగా ఇరాన్ హక్కులను అంతర్జాతీయంగా గుర్తించాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది. తమ సార్వభౌమాధికారాన్ని అంగీకరించకపోతే శాంతి సాధ్యం కాదని స్పష్టం చేసింది. రెండవ షరతుగా ఇప్పటివరకు జరిగిన యుద్ధ దాడుల వల్ల కలిగిన నష్టాలకు అమెరికా, ఇజ్రాయెల్ పరిహారం చెల్లించాలని కోరింది. మూడవ షరతుగా భవిష్యత్తులో ఇరాన్‌పై దాడులు జరగబోవని హామీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మూడు షరతులకు అంగీకరించకుంటే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించింది. యుద్ధానికి ముందు అణు ఒప్పందంపై చర్చల సమయంలో ఇరాన్ అణుశక్తిని పెంపొందించుకోవడం తమ హక్కుగా వాదించింది. తమ దేశం అణుబాంబుల కోసం కాకుండా శాంతియుత ఇంధన అవసరాల కోసం యూరేనియం శుద్ధి చేసే హక్కును సమర్ధించుకుంది. ఈనెల 10న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌తో తక్షణం యుద్ధాన్ని ఆపాలని సూచించారు. చర్చల ద్వారానే రాజకీయ పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పెజెష్కియన్ ఇరాన్‌కు మానవతాసాయం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరాన్ హెచ్చరిక.. ఒక బ్యారెల్‌కు 200 డాలర్ల వంతున చెల్లించడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని గురువారం ఇరాన్ హెచ్చరించింది. చమురు సంక్షోభాన్ని ఎదుర్కోడానికి వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ సిఫారసు చేసిన నేపథ్యంలో తాజా హెచ్చరిక వచ్చింది. హర్మూజ్ జలసంధిలో అమెరికా మిత్రదేశాల నౌకలు ప్రవేశిస్తే పేలిపోయేలా ఇరాన్ సముద్రపు మందుపాతరలు అమర్చడం ఆందోళన కలిగిస్తోంది. 

మన తెలంగాణ 13 Mar 2026 5:30 am

కళ్లు గప్పి.. రేవుకు చేర్చి

న్యూఢిల్లీ: ఏ దశలో అయినా ప్రపంచం ఇప్పుడు ఇంధన అవసరాల వలయంలో చిక్కుకుంది. అ యితే మధ్యప్రాచ్య యుద్ధం తీవ్రతరం, హర్మూజ్ జలసంధిపై చమురు నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలతో పలు దేశాలకు చిక్కులు ఏర్పడుతున్నా యి. ఈ అత్యంత క్లిష్టమైన దశలోనే భారతదేశాని కి భారీ క్రూడాయిల్ లోడ్‌తో లైబిరియా దేశపు జెండాతో బయలుదేరిన నౌక స్యూజ్‌మాక్స్ ట్యాం కర్ షెన్లాంగ్ ఈ అత్యంత ప్రమాదకరమైన సము ద్ర మార్గం ద్వారానే నిర్ణీత గమ్యం అయిన ముం బై పోర్టులోని జవహర్ ద్వీప్ టర్మినల్‌కు చెక్కుచెదరని రీతిలో క్షేమంగా  చేరింది. ఇంతకూ ఈ చమురు ట్యాంకర్ నౌకకు భారతీయుడే క్యాప్టెన్‌గా ఉన్నాడు. ఇరాన్ దాడులకు గురి కాకుండా చేసుకునేందుకు ఈ నౌక ఈ జలసంధి దాటేంత వరకూ డార్క్‌లోకి వెళ్లింది. సాధారణంగా ప్రతి నౌక ప్రయాణం , కదలికలను తెలియచేసేందుకు తనంతతానే పనిచేసే ఆటోమోటిక్ ఐడెంటిఫికేషన్ సిస్థమ్ (ఎఐఎస్) అమర్చి ఉంటుంది. ప్రత్యేకించి చమురు రవాణా నౌకలకు దీనిని ఖచ్చితంగా అమరుస్తారు. దీని వల్ల నౌక గుర్తింపు, ఇది ఏ ప్రాంతంలో ఉన్నది ? వేగం ఇతర వివరాలు ఇతర నౌకలకు , పర్యవేక్షక సాంకేతిక అధికారుల బృందానికి తెలుస్తాయి. అయితే ప్రస్తుత ఉద్రిక్తతలు, చమురు నౌకలు జలసంధిలో కనబడితే చాలు , పేల్చేస్తాం, కూల్చేస్తాం అనే ఇరాన్ బెదిరింపుల మధ్య ఇప్పుడు ఈ షెన్లాంగ్ డార్క్‌లోకి వెళ్లింది. అంటే గమనం తెలిపే ఎఐఎస్ స్విచ్ఛాఫ్ చేసేసి , కొద్ది దూరం ఈ విధంగా ప్రయాణించి చివరికి ముంబై రేవుకు చేరుకుంది. సౌదీలోని రాస్ టనూరా పోర్టు నుంచి బయలుదేరి క్షేమంగా భారత్‌కు చేరడం రికార్డు అయింది. నౌక జాడతెలియకుండా చేసుకుని, సముద్రంలో ప్రయాణించడం ద్వారా గమ్యం చేరుకుంది. మార్చి 1వ తేదీన సౌదీ నుంచి బయలుదేరిన తరువాత మధ్యలో రెండు మూడురోజుల వరకూ అదీ కూడా హర్మూజ్ జలసంధి మార్గం వద్దనే సిగ్నల్ లేకుండా పోయింది. దీనితో నౌకాయాన నియంత్రణ వ్యవస్థలు నివ్వెరపోయాయి. అయితే ఎంతో రిస్క్‌తో కూడిన గోయింగ్ డార్క్ ప్రక్రియతో భారతీయ కెప్టెన్ దీనిని ముంబై రేవుకు చేర్చడం కీలక పరిణామం అయింది. ఆషామాషీ నౌక కాదు.. 1,35,335 టన్నుల క్రూడాయిల్ సరుకు సౌదీలో లోడ్ అయిన ఈ నౌకలో మొత్తం 1,35,335 టన్నుల ముడిచమురు ఉంది. హర్మూజ్ జలసంధి మార్గంలో జాడ తెలియకుండా వచ్చిన నౌక తిరిగి మారిటైం డాటా సంస్థ లాయడ్ లిస్ ఇంటలిజెన్స్‌కు, ట్యాంకర్ ట్రాకర్ల దృష్టికి ఈ నెల 9న చిక్కింది. అప్పటికీ ఈ నౌక సరుకుతో ముంబై తీరంలో ఉంది. ఈస్టర్న్ ముంబైలోని మహులూలోని రిఫైనరీలకు ఈ చమురు అందుతోంది. ప్రతి నౌకా ఎఎస్‌ఐ వాడాల్సిందే ..అత్యవసరమైతే తప్పితే నౌకల గుర్తింపు, కదలికల వివరాలను తెలిపే ఎఐఎస్ అంతర్జాతీయ సముద్రయాన సంస్థ నిబందనల మేరకు ఖచ్చితంగా ప్రతి సరుకు రవాణా నౌకకు ఉండాల్సిందే. దీని ద్వారా అంతర్జాతీయ సముద్ర జలాల్లో నౌకల కదలికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. కానీ ఘర్సణలు, సముద్ర జలాల్లో పోరు ఇతర పరిస్థితుల మధ్య ఈ పరికరాన్ని పనిచేయకుండా చేసుకునే అసాధారణ అవకాశం ఉంటుంది. దీనిని గో డార్క్ అని వ్యవహరిస్తారు. ఏ దేశపు నౌక అయినా ఇరాన్ ముందస్తు అనుమతి తీసుకున్న తరువాతనే హర్మూజ్ జలమార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అది కూడా అత్యంత జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. బుధదారం మయూరి నారీ నౌక గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు థాయ్ జెండాతో బయలుదేరినప్పుడు హర్మూజ్‌లో దాడికి గురైంది. ఇరాన్ జరిపిన ఈ దాడిలో భారతీయ నావికులు ఇద్దరు మృతి చెందారు. అప్పటి నుంచి మరో భారతీయుడు జాడ తెలియకుండా పోయ్యాడు. తమ ముందస్తు అనుమతి లేకుండానే నౌక కదలిందని, దాడికి గురైందని ఇరాన్ తెలిపింది. ఇక పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారతీయ జెండాలతో కూడిన చమురు నౌకలు సిద్ధంగా రవాణాకు ఉన్నాయి.వీటిలో 24 హర్మూజ్‌కు పశ్చిమాన ఉన్నాయి. వీటిలో మొత్తం 677 మంది భారతీయ నావికులు విధుల్లో ఉన్నారు. మరో వైపు ఈ జలసంధి తూర్పున నాలుగు నౌకలు ఉన్నాయి. వీటిలో 101 మంది భారతీయ నావికులు ఉన్నారు. హర్మూజ్ రవాణా సాఫీకి దౌత్యం ఇరాన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ చర్చలు గల్ఫ్ యుద్ధం, హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రవాణాకు ఆటంకాల దశలో బారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇరాన్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. గడిచిన కొద్దిరోజుల్లో ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో మూడుసార్లు మాట్లాడారు ఈ విషయాన్ని విదేశాంగ కార్యాలయ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. గల్ఫ్ యుద్ధ ప్రభావం క్రమేపీ దేశంలో చమురు నిల్వలపై పడుతోంది. సముద్ర మార్గాలలో నౌకారవాణాకు ఆటంకాలు చిక్కులకు దారితీస్తున్నాయి. ముంబై తీరానికి భారీ లోడ్‌తో సౌదీ నుంచి చమురు నౌక చేరుకున్న తరువాత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించింది. కాగా భారతీయ నౌకలకు, ప్రత్యేకించి భారతీయ జెండాతో ఉన్న రవాణా నౌకలకు ఇరాన్ హర్మూజ్ జలసంధి ద్వారా కదిలేందుకు అనుమతి ఇస్తుందని ఇరాన్ ప్రకటించింది. అయితే వాస్తవికంగా కొన్ని నౌకలు విదేశీ సంస్థలకు చెందినవి కావడం, భారతదేశానికి చేరుకోవల్సి ఉండటం, నౌకలపై ఎగిరే జండాలు వంటి విషయాలలో పలు క్లిష్టతలు తలెత్తుతున్నాయి. ఈ దశలో సంక్లిష్టతల తొలిగింపు దశలో జైశంకర్ ఇరాన్ మంత్రితో మాట్లాడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే అత్యంత కీలకమైన ఈ విషయంపై వివరాలు కొన్ని పూర్తిగా వెల్లడించలేమని కూడా స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 13 Mar 2026 5:00 am

పెద్దాసుపత్రులకు మందుల సరఫరా నిలిపివేస్తాం!

మన తెలంగాణ/గోషామహల్/హైదరాబాద్: గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని ట్విన్‌సిటీస్ మెడిసిన్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేని పక్షంలో నగరంలోని ఆసుపత్రులకు మం దుల సరఫరాను నిలిపి వేస్తామని హెచ్చరించింది. ఈ విషయమై ఇప్పటికే గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులు ఇచ్చిన అసోసియేషన్ నా యకులు, గురువారం ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెం డెం ట్‌కూ నోటీసులు అందించినట్లు తెలిసింది. బకాయిలు చెల్లించక పోవడంతో గత్యంతరంలేక మందుల సరఫరాను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ట్విన్ సిటీస్ మెడిసిన్ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందాల రామచందర్ పేర్కొన్నారు. 2022 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల మెడిసిన్ సరఫరాకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం చెల్లించడంలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, ఆప్తాల్మాలజీ, న్యూరో సర్జరీ, ఆర్ధో ఫెడిక్ విభాగాలకు సంబంధించిన స్టంట్స్, సర్జిక ల్స్, డిస్పోజబుల్స్, ఇంప్లాంట్స్, కిట్స్‌లతో పాటు లివర్, కిడ్నీ ట్రాన్స్‌ఫ్లాంటేషన్‌కు సంబంధించిన డిస్పోజబుల్స్, ఇంప్లాంట్స్ సరఫరా చేస్తు న్నా, సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు. 2024 లో సిఎంని కలిసి వినతిపత్రం సమర్పించినా బకాయిపడిన మం దుల బిల్లులకు మోక్షం లభించలేదని, యేడాదిగా ఆరోగ్యశ్రీకి సం బంధించిన బిల్లులు సైతం చెల్లించక పోవడంతో మెడిసిన్ సప్లయర్స్‌కు మందుల సరఫరా చేయడం తలకుమించిన భారంగా మా రిందన్నారు. 2025లో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సం బంధించి సుమారు రూ.60 కోట్ల బకాయిలు ఉండగా, టీజీఎస్ ఎంఎస్‌ఐడీసీ నుండి రూ.60కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో 70 శాతం మందుల సరఫరాను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మిగతా 30 శాతం ఎమర్జెన్సీ మెడిసిన్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 

మన తెలంగాణ 13 Mar 2026 4:40 am

6 పరీక్షలు 34 రోజులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి వార్షి క పరీక్షలు శనివారం(మార్చి 14) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మ ధ్యాహ్నం 12.30 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభ సమయానికి మరో 5 నిమిషాలు అదనంగా అంటే ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేం ద్రాల్లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,17,727 మంది పరీక్షలకు హాజరుకానుండగా, వారిలో 2,60,916 బాలురు, 2,56,811 బాలికలు ఉన్నారు. పదవ తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యం లో విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల ప్రారంభానికి ఒకటి రెండు రోజుల ముందు పరీక్షా కేం ద్రాలను సందర్శించాలని సూచించించింది. పరీక్షలు జరిగే రోజుల్లో కేంద్రాల వద్ద 144 సెక్షన్ (బిఎన్‌ఎస్‌ఎస్ 163) అ మలులో ఉంటుంది. పది పరీక్షలు సజావుగా నిర్వహించేందు కు 144 ఫ్లైయింగ్ స్కాడ్‌లను నియమించారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరికి పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ అనుమతి ఉండదు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ సబంధించిన ఎటువంటి పరికరాలు పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురాకూడదు. హాల్‌టికెట్, ఎగ్జామ్ ప్యాడ్, పెన్ పె న్సిల్, షార్ప్‌నర్, ఎరాయిజర్, జామెట్రిక్ పరికరాలతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చు. అయితే, విద్యార్థులు పెన్ను లు, ఎరాయిజర్, జామెట్రీ బాక్స్‌లు ఒకరి నుంచి ఒకరు తీసుకునేందుకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈసారి వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు వాట్సాప్ నంబర్ (8096958096) ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానిని ప్రింట్ తీసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. అలాగే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ bsc.telangana.gov.in ద్వారా పొందవచ్చు. ఈసారి కొత్తగా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాంతో విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది.. ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రానికి వెళ్లవచ్చు. పరీక్షల టైం టేబుల్ ఇలా.. పదో తరగతి పరీక్షలు ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. సైన్స్ పరీక్షలు రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, 7న బయాలజీ, ఏప్రిల్ 13 సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్ 1 భాషా పరీక్ష, 16న ఒకేషనల్ కోర్సు పేపర్ 2 భాషా పరీక్ష జరుగనుంది. మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రం(ఆబ్జెక్టివ్ పేపర్) పార్ట్ బి పరీక్ష చివరి అర గంట ముందు ఇస్తారు. విద్యార్థులు ఆ 30 నిమిషాల్లోనే అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్‌కు మాత్రం పార్ట్ బి కూడా పార్ట్ ఎ కూడా ఇస్తారు. విద్యార్థులకు సూచనలు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 8.30 గంటల సమయానికి పరీక్షా కేంద్రాలకు వెళ్లేలా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఆలస్యంగా కేంద్రాలకు వెళితే హడావుడిగా ఉండి పరీక్షలు సరిగ్గా రాయలేకపోవచ్చు. - విద్యార్థులు హాల్ టికెట్, రైటింగ్‌ప్యాడ్, అవసరమైన పెన్నులు, ఎరాయిజర్,పెన్సిల్ తీసుకెళ్లాలి. -- విద్యార్థులు తమకు కేటాయించిన స్థానంలోనే కూర్చుకోవాలి ---- ప్రశ్నపత్రంపై విద్యార్థి తన హాల్‌టికెట్ నెంబర్ రాయాలి. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరికి పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ అనుమతి ఉండదు. ---- -www.dse.telangana.gov.in వెబ్‌సైట్ డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చు.

మన తెలంగాణ 13 Mar 2026 4:30 am

20 ఇసుక రీచ్‌లపై ఖద్దరు పెత్తనం

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించినా పలు జిల్లాలో ఇసుక జీరో దందా ఆగడం లేదు. ప్రస్తుతం 20 ఇసుకరీచ్‌లు నడవకుండా కొందరు ప్రజా ప్రతినిధుల బెదిరింపులకు పాల్పడుతుండడంతో టిజిఎండిసి పరిధిలోని ఆ యా రీచ్‌ల్లో ఇసుక డిడిల విక్రయాలను ఆ సంస్థ నిలిపివేసినట్టుగా తెలిసింది. అయితే, ఇదే అదునుగా స్థానికంగా ఉండే కొందరు ప్రజాప్రతినిధు లు ఆయా రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుకను లా రీల్లో తరలిస్తూ జీరో దందా నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. 10 రోజుల క్రితం మైనింగ్‌కు సంబంధించి జరిగిన సమీలో కొన్ని జిల్లాలో స్థానిక ప్రజా ప్రతినిధులు రీచ్‌లను నడవకుండా అడ్డుకుంటున్న విషయాన్ని టిజిఎండిసి ఉన్నతాధికారులు సిఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల టిజిఎండిసి ఆదాయానికి గండిపడుతుందని వారు సిఎంకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్‌రెడ్డి రీచ్‌ల నుంచి ఇసుకను తరలింపును అడ్డుకునే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే వాళ్లమీద కేసులు పెట్టాలని పోలీసు ఉన్నతాధికారులను, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 26 రీచ్‌ల్లో మాత్రమే ఇసుకను విక్రయిస్తుండగా మరో 20 రీచ్‌లు మాత్రం మూసివేసినట్టుగా తెలిసింది. మూసివేసిన రీచ్‌ల్లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని రీచ్‌లు ఉన్నట్టుగా సమాచారం. మూతపడిన రీచ్‌లతో ఆ సంస్థ ఆదాయాన్ని కోల్పోతుండడం విశేషం. వే బిల్లులు లేకుండా తిరుగుతున్న లారీలపై విజిలెన్స్ కొరడా అయినా, కొందరు ప్రజాప్రతినిధులు సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలను ఖాతరు చేయడం లేదని, జీరో దందా కింద ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతుండడంతో ప్రస్తుతం కొన్ని జిల్లాలో వే బిల్లులు లేకుండా అక్రమంగా తిరుగుతున్న ఇసుక లారీలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక లారీలపై కేసులను నమోదు చేస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం మూసివేసిన ఆ 20 ఇసుకరీచ్‌ల్లో టిజిఎండిసి ఇసుకను విక్రయించడానికి కసరత్తు చేస్తున్నా కొందరు ప్రజా ప్రతినిధులు టిజిఎండిసి అధికారులకు సహకరించడం లేదని తెలుస్తోంది. ఒకవేళ తమను కాదని ఇసుకరీచ్‌లను తెరిస్తే లారీలను అడ్డుకుంటామని, స్థానికంగా రీచ్‌ల్లో అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించకుండా చూస్తామని ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మూసివేసిన ఇసుకరీచ్‌లను టిజిఎండిసి అధికారులు ఓపెన్ చేయకుండా అలాగే వదిలేసినట్టుగా సమాచారం. రీచ్‌ల టెండర్‌లలో లోపాలతో.. ప్రస్తుతం ఇసుకరీచ్‌లను కొన్నేళ్లుగా కొందరు కాంట్రాక్టర్‌లే దక్కించుకోవడం, రీచ్‌ల టెండర్‌లలో పారదర్శకత లేకపోవడం, కొందరు కాంట్రాక్టర్‌లే రింగ్‌గా మారి ఎక్కువగా రీచ్‌లను దక్కించుకోవడం వల్లే ఆ సంస్థ ఆదాయం కోల్పోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ప్రస్తుతం టిజిఎండిసి ఎండి భవేశ్‌మిశ్రా వేరే శాఖల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించడం ఈ శాఖపై పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించకపోవడంతో ఇసుకరీచ్‌ల వద్ద జరుగుతున్న అక్రమాలపై ఆయన దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఇసుకరీచ్‌ల వద్ద పిఓలుగా పనిచేయడానికి రెవెన్యూ శాఖ నుండి డిప్యూటేషన్‌పై రావడానికి చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. దీంతో వారు డిప్యూటేషన్ వచ్చినప్పటి రోజుకు లక్షల రూపాయలను దండుకుంటూ సంస్థకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆ శాఖ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం టిజిఎండిసి సంస్థకు చెందిన వారిలో 9 మంది మాత్రమే ఆ శాఖ ఉద్యోగులు ఉండగా మిగతా వారంతా వేరే శాఖ నుంచి డిప్యూటేషన్ వచ్చి ఈ సంస్థ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తుండడం విశేషం. ఈనెలాఖరు నాటికి రూ.1,000 కోట్లు టిజిఎండిసి సంస్థ ఫిబ్రవరి నాటికి రూ.910 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా ఈనెలాఖరు నాటికి అది రూ.1,000 కోట్లకు చేరుకుంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, రానున్న ఆర్థిక సంవత్సరం 202627గాను రూ.1,300 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం నిర్ధేశించినట్టుగా తెలిసింది. ఈ సంస్థను 2014లో ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయగా అప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధికంగా రూ.880 కోట్ల ఆదాయాన్ని మాత్రమే ఈ సంస్థ ఆర్జించింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో (202526) లో రూ.1,000 కోట్లు వస్తే అది రికార్డు అని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

మన తెలంగాణ 13 Mar 2026 4:00 am

కవితకు సిబిఐ నోటీసు

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో కీలక ప రిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎ దుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి గురువారం మధ్యాహ్నం వె ళ్లిన సిబిఐ అధికారులు ఈ నెల 16న విచారణకు హాజరు కావాల ని కోరుతూ ఆమెకు సమన్లు అందజేశా రు. ఫిబ్రవరి 27న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా 23 మందిని డిశ్చార్జ్ చేస్తూ సంచలన తీర్పునిచ్చిన సంగతి విదితమే. సిబిఐ మోపిన అభియోగాలు నిరాధా రమని కోర్టు అప్పట్లో పేర్కొంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ట్రయల్ కోర్టులో ఇడి కేసు విచారణను వాయిదా వేయాలని ఆదేశించడంతో పాటు, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సిబిఐ అధికారు లు కవితకు సమన్లు అందించారు. కవితతో పాటు వ్యాపార వేత్తలు అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయిన్‌పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపి మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సమన్లు అందాయి. సిబిఐ సమన్లపై కవిత ఏమన్నారంటే.. ఈ విషయంపై కవిత స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆమె ప్రకటన చేశారు. ఢిల్లీ మద్యం కేసులో చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టేసిన విషయం మీ అందరికీ తెలిసిందేనని, కేసు కొట్టేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను సైతం ఎంక్వయిరీ చేయాలని సైతం రౌస్ అవెన్యూ కోర్టు కామెంట్ చేసిన విషయమూ మీ అవగాహనలో ఉందని కవిత ఎక్స్ లో పేర్కొన్నారు. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు పై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిందని, ఈ కేసు విచారణ ఈనెల 16న ఉన్నదన్న విషయాన్ని సిబిఐ అధికారులు స్వయంగా తెలియచేశారని కవిత తెలిపారు. ఈ విషయంపై తమ లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తున్నామని, సత్యం నా తోడుగా సంపూర్ణంగా అధికారులకు సహకరిస్తానని కల్వకుంట్ల కవిత ఎక్స్‌లో పోస్టు ద్వారా తన స్పందనను తెలియజేశారు.

మన తెలంగాణ 13 Mar 2026 3:30 am

బ్లాక్ దందా!

మన తెలంగాణ/శేరిలింగంపల్లి: అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ పరిణామాలు దేశంలో ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నా యి. ఈ ప్రభావం ఇప్పుడు నగరాల్లోని హోటల్స్, హాస్టల్స్, కంపెనీలపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దక్షణాది, దక్కన్, ఇరానీ వంటకాలకు కేరాఫ్ అ డ్రస్‌గా ఉన్న హైదరాబాద్ మహానగరంపై ఈ ప్రభావం పెద్ద ఎత్తున పడుతుంది. విద్యార్థి, ఉద్యోగులతో పాటు బయటి ఆహారాన్ని ఇష్టంగా తినే నగర వాసులకు ఇపుడు కష్టంగా మారుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తీవ్రంగా తగ్గిపోవడంతో మార్కెట్లో కొరత ఏర్పడింది. దీం తో సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయా యి. అధికారికంగా లభించని పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్‌లో ఒక్క సిలిండర్ ధర ఆరు వేల రూపాయలు దాటిందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ కొరతను కొందరు ఏజెన్సీలు అవకాశంగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా రో జులుగా బుకింగ్ చేయని పేర్లపై సిలిండర్లు తీసుకుని వాటిని బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అ మ్ముతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డోమేస్టిక్ కాస్తా కమర్షియల్‌గా మారుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు ఈ విధమైన వ్యాపారానికి తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూతపడే పరిస్థితిలో హోటల్స్, హాస్టల్స్, కంపెనీలు? నగరంలో వేల సంఖ్యలో ఉన్న హాస్టల్స్, చిన్న హోటల్స్ ప్రస్తుతం గ్యాస్ కొరతతో సంక్షోభంలో ఉన్నాయి. అదేవిదంగా పలు కంపెనీలు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి.హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఎల్‌బీ నగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఈసీఐఎల్, తార్నాక, మెహిదీపట్నం, దర్గా, కోకాపేట అమీర్ పేట్, పంజాగుట్ట, మియాపూర్,అదిభట్ల, వనస్థలిపురం, తుక్కుగూడ, పఠాన్ చెరువు, చందానగర్, కూకట్ పల్లి, జేఎన్టీయూ, కేపీ హెచ్ బీ, జెడిమెట్ల, షాపూర్, బాలానగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో హాస్టల్స్, హోటల్స్, జాతీయ, అంతర్జాతీయ కంపెనీ లు ఉన్నాయి. రోజూ లక్షలాది మందికి వంట చేయాల్సి ఉండటంతో గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు సిలిండర్లు దొరకకపోవడం, దొరికినా భారీ ధర ఉండటంతో నిర్వాహకులు నష్టాల్లో నడుపుతున్నారు. కొన్ని హోటల్స్ ఇప్పటికే పని గంటలు తగ్గించగా, మరికొన్ని పూర్తిగా మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. మెనూలలో మార్పులు గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండే వంటకాలను అనేక హోటల్స్ తమ మెనూ నుండి తొలగిస్తున్నాయి. ఎక్కువ సమయం పట్టే వంటలు చేయకుండా తక్కువ గ్యాస్‌తో అయ్యే వంటకాలకే పరిమితమవుతున్నాయి. దీంతో వినియోగదారులకు అందే ఆహారంలో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.టీ, కాఫీ, దోశ, చపాతీ, పూరి లాంటి వంటకాలు అందుబాటులో ఉంచటం లేదు.అదేవిదంగా వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉండే హాస్టల్స్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్యాస్ ఖర్చు తగ్గించేందుకు నిర్వాహకులు మెనూలలో మార్పులు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు వంటకాలను తగ్గించడం, సులభంగా అయ్యే ఆహారాన్ని మాత్రమే అందించడం వంటి మార్పులు చేస్తున్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్థిని, విద్యార్థులకు ఉద్దేశించిన వందలాది హాస్టల్స్ లలో కూడా ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 18 వరకు ఇంటర్ పరీక్షలు ముగుస్తుండగా ఎంసెట్ ఇతర కోచింగ్ ల కోసం విద్యార్థులు అక్కడే ఉండే అవకాశం ఉంది. అదే విదంగా ఈ నెల 14 నుండి 10వ తరగతి పరీక్షలు సైతం ప్రారంభం కానుండటంతో ఆయా హాస్టల్స్ పరిస్థితులు ఎలా ఉంటాయోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.రోజుకు రెండు మూడు సిలిండర్లు అవసరం అవుతుంది. ఇప్పుడు సిలిండర్ దొరకడం లేదు. దొరికినా ఆరు వేల రూపాయలు అడుగుతున్నారు. ఇలా అయితే హోటల్ నడపడం కష్టమే అని హోటల్ నిర్వాహకులు చెబుతుండగా,వందల మంది విద్యార్థులకు వంట చేయాలి, గ్యాస్ ఖర్చు ఎక్కువ కావడంతో మెనూలను మార్చాల్సి వస్తోందని హాస్టల్ ల యజమానులు చెబుతున్నారు. గ్యాస్ లేకపోతే మళ్లీ కట్టెలతో వంట చేయాల్సిన పరిస్థితి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టెల పొయ్యిల వైపు నిర్వాహకుల చూపు గ్యాస్ కొరత మరింత పెరగడంతో కొంతమంది హోటల్, హాస్టల్ నిర్వాహకులు మళ్లీ కట్టెల పొయ్యిల వైపు చూస్తున్నారు. గతంలో పూర్తిగా మానేసిన కట్టెల వంటలను తిరిగి ప్రారంభించాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే కట్టెలతో వంటలు ప్రారంభించినట్లు సమాచారం.గ్యాస్ దొరకకపోవడంతో కట్టెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. నగర పరిసర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కట్టెల ధరలు కూడా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

మన తెలంగాణ 13 Mar 2026 3:00 am

శుక్రవారం రాశి ఫలాలు (13-03-2026)

మేషం స్వల్ప అనారోగ్యం సమస్యలుంటాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తికావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృషభం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిధునం దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. కర్కాటకం ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. సింహం అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కన్య ఇంటాబయట ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. తుల ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. వృశ్చికం వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ధనస్సు గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. మకరం గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. కుంభం వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగమున విధులలో ఆటంకాలు తొలగుతాయి. మీనం ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారమున చిక్కులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.  

మన తెలంగాణ 13 Mar 2026 12:20 am

హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్

మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రేవంత్ దేశంలోనే ప్రముఖ హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆసుపత్రుల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించ డంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని గురువారం సీఎం ప్రారంభించారు. దీంతో భారత్‌లో మెడికవర్ ఆసుపత్రుల సంఖ్య 25కి చేరింది. అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక వైద్య సాంకేతికతతో రూపొందిం చిన […] The post హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 11:39 pm

బలహీన ప్రధాని మోదీ

. దేశ గౌరవం ట్రంప్‌కు తాకట్టు. యుద్ధ ప్రభావంతో ధరల పెరుగుదల. ముర్ము వైఖరి సమర్థనీయం కాదు. కమ్యూనిస్టు సిద్ధాంతం శాశ్వతం నారాయణ విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న భారతదేశానికి మోదీ అత్యంత బలహీన ప్రధాని అని, యుద్ధాన్ని ఆపే కనీస ప్రయత్నం చేయడం లేదని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సాగిలపడటం తప్ప మోదీ మరేపని చేయలేక పోతున్నారని అన్నారు. ఇందిరాగాంధీకి ఉన్న […] The post బలహీన ప్రధాని మోదీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 11:31 pm

జాబ్ కన్సల్టెన్సీ యజమాని హత్య..

జాబ్ కన్సల్టెన్సీ యజమాని హత్య చేసిన నిందితుడిని మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. కత్తితో పాటు ఐఫోన్-15, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్‌స్పెక్టర్ ప్రభాకర్ వివరాలు వెల్లడించారు. తేదీ 10-03-2026 సాయంత్రం సుమారు 17:30 గంటలకు, హైదరాబాద్‌లోని ఇంజనీర్స్ కాలనీలోని బెస్ట్ గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ జాబ్ కన్సల్టెన్సీ జగ్గవరపు శశికిరణ్ రెడ్డి నిర్వహిస్తున్నాడు. ఇందులో హెచ్.ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న దులిపాడు అక్షయ అలియాస్ సాయి శృతి పనిచేస్తోంది. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ఎపిలోని విశాఖపట్నం జిల్లా, మునగపాక మండలం, గణపర్తి గ్రామానికి చెందిన సుమారుపొల్లమారి శెట్టి ప్రభు కుమార్ అలియాస్ షాను(19) ప్రైవేట్ ఉద్యోగి. ఉద్యోగం కోసం కొంత కాలం క్రితం కన్సల్టెన్సీలో ఉద్యోగం కావాలని సంప్రదించాడు, రూ.2,500 చెల్లించాడు. ఓ హోటల్‌లో ఉద్యోగంలో చేరిన ప్రభు కుమార్ ఉద్యోగం నచ్చకపోవడంతో రెండు రోజులకే మానివేశాడు. తర్వాత కన్సల్టెన్సీ కార్యాలయానికి వచ్చిన నిందితుడు కన్సల్టెన్సీ ద్వారా ఇప్పించిన ఉద్యోగం నచ్చలేదని, తాను చెల్లించిన డబ్బును , పని చేసిన రోజుల జీతాన్ని తిరిగి ఇవ్వాలని గొడవపడ్డాడు. అక్షయ నిందితుడిని కౌన్సెలింగ్ గదిలో కూర్చోబెట్టి, యజమాని జగ్గవరపు శశి కిరణ్ రెడ్డి కి సమాచారం ఇచ్చింది. తర్వాత శశికిరణ్ గదిలోకి వెళ్లిన ప్రభు కుమార్ ఆయనతో గొడవపడ్డాడు. గది నుండి పెద్దగా అరుపులు రావడంతో అక్షయ శశికిరణ్ గదిలోకి వెళ్లగా కత్తితో బయటికి వచ్చిన నిందితుడు అక్షయ ఎడమ భుజంపై పొడిచి అక్కడి నుండి పారిపోయాడు. నిందితుడు వెళ్లిన తర్వాత సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా, జగ్గవరపు శశి కిరణ్ రెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నారు. అతడి శరీరంపై సుమారు 23 కత్తిపోట్లు ఉన్నాయి. వెంటనే అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై 103(1), 109, 329(4), 127(2), 351(2), 305 బిఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ హెచ్. ప్రభాకర్, డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్ , సిబ్బంది దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు.

మన తెలంగాణ 12 Mar 2026 11:30 pm

మోడల్ కాలనీగా వెలుగుమట్ల

. మంత్రి తుమ్మల హామీ. భూదాన్ భూముల్లో 38 ఇళ్లకు భూమి పూజ. ఉగాదిలోపు విద్యుత్ సరఫరా పనుల పూర్తికి ఆదేశం విశాలాంధ్రబ్యూరో – ఖమ్మం: వెలుగుమట్లను మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితుల 38 ఇళ్లకు గురువారం మంత్రి తుమ్మల… ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. నిర్వాసితులకు […] The post మోడల్ కాలనీగా వెలుగుమట్ల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 11:28 pm

సీఈసీపై అభిశంసన

నేడు పార్లమెంటు ముందుకు200 మంది ఎంపీల సంతకాలు న్యూదిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం నోటీసు సమర్పించనున్నాయి. 130 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. గురువారం కూడా కొందరు సభ్యులు ముందుకొచ్చి సంతకాలు చేశారని ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు. నిబంధనల ప్రకారం 100 మంది ఎంపీలు సంతకాలు చేస్తే లోక్‌సభలో, 50 మంది మద్దతిస్తే […] The post సీఈసీపై అభిశంసన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 11:23 pm

స్పీకర్ నిర్ణయమే అంతిమం: సుప్రీం

న్యూదిల్లీ: తెలంగాణలో బీఆరఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను గురువారం సుప్రీంకోర్టు ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా… స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆరఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాగా… సర్వోన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. […] The post స్పీకర్ నిర్ణయమే అంతిమం: సుప్రీం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 11:20 pm

మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు రావటంతో తీవ్ర కలకలం చెలరేగింది. ముంబైలోని విధాన్ భవన్‌లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. దీంతో అధికారులు అప్రమత్తమ య్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. అసెంబ్లీలోని వారందరినీ దూరంగా పంపించేశారు. బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎలాంటి బాంబు లేదని తేలింది. దర్యాప్తు అధికారులు బెదిరింపులకు పాల్పడ్డ వారికోసం గాలిస్తున్నారు. బాంబు బెదిరింపులతో అసెంబ్లీలో […] The post మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 11:18 pm

సరకు రవాణాలోవిశాఖ పోర్టు రికార్డు

విశాలాంధ్ర – విశాఖపట్నం: సరకు రవాణాలో విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) రికార్డు సృష్టించిం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 345 రోజుల్లోనే 85.07 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసింది. తద్వారా చరిత్రాత్మక మైలు రాయిని చేరుకుంది. 92 ఏళ్ల విశాఖ పోర్టు చరిత్రలో ఈ స్థాయి సరకు రవాణా ఎప్ప్పుడు జరగలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 90 ఎంఎంటీ సరకు నిర్వహణ లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉన్నట్లు పోర్టు అథారిటీ చైర్మన్ డాక్టర్ […] The post సరకు రవాణాలోవిశాఖ పోర్టు రికార్డు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 11:11 pm

అమెరికా సామ్రాజ్యవాద దుశ్చర్యల్ని ఖండించండి

. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రజలు కలిసి రావాలి. వామపక్ష నేతల పిలుపు. ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయిల్ దాడులను వ్యతిరేకిస్తూ నిరసన విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదంతో అనేక దేశాలపై దాడులకు పాల్పడుతున్న అమెరికా దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, ప్రపంచ శాంతి కోసం వామపక్షాలు చేస్తున్న ఉద్యమాలకు ప్రజలు కలిసి రావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు ఎగుమతులు చేస్తున్నాయని, అణుబాంబులు ఉన్నాయనే కుంటిసాకులతో స్వప్రయోజనాల కోసం అమెరికా విచక్షణారహితంగా చిన్న చిన్న దేశాలపై దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. ఇరాన్‌పై అమెరికా, […] The post అమెరికా సామ్రాజ్యవాద దుశ్చర్యల్ని ఖండించండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:52 pm

దిగిరావాల్సిందే

. అమెరికా, ఇజ్రాయిల్‌కు ఇరాన్ స్పష్టీకరణ. యుద్ధం ఆగాలంటే… మూడు షరతులు. అప్ప్పుడే శాంతి స్థాపన: పెజెష్కియాన్ తెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధం గురువారం 13వ రోజుకు చేరుకుంది. అమెరికాఇజ్రాయిల్ సంయుక్త దాడులతో భీకర పోరులో కొనసాగుతోంది. ఇరాన్ రాజధాని తెహ్రాన్‌తో పాటు అనేక నగరాలు వరుస దాడులతో దద్దరిల్లాయి. రెండు విదేశీ ట్యాంకర్లపై దాడులతో చమురు పోర్ట్ కార్యకలాపాలను ఇరాక్ నిలిపివేసింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను గల్ఫ్ దేశాలు ఎదుర్కొన్నాయి. తాను ఎప్ప్పుడంటే అప్ప్పుడే యుద్ధానికి తెర […] The post దిగిరావాల్సిందే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:46 pm

పని ఇక్కడ, పన్ను అక్కడ?

. కాంట్రాక్టర్ల నుంచి పన్నుల వసూళ్లు పెరగాలి. రాష్ట్రంలోనే పన్నులు చెల్లించాలి. లబ్ధిదారులకు సంక్షేమ లేఖలు. విద్యార్థులకు గుర్తుండేలా స్నాతకోత్సవాలు జరగాలి. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో పని చేస్తూ, వేరే రాష్ట్రాల్లో కార్యాలయాలు పెట్టుకున్న కాంట్రాక్టర్ల విషయంలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చందబ్రాబు ఆదేశించారు. ‘కొందరు కాంట్రాక్టర్లు తమ కార్యాలయాలు వేరే రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. పనులు మాత్రం మన రాష్ట్రంలో చేస్తున్నారు. టెండర్లు, వర్క్ ఆర్డర్లలోని […] The post పని ఇక్కడ, పన్ను అక్కడ? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:43 pm

గ్యాస్ కొరతపై విపక్షాల ఆగ్రహం

. పార్లమెంటు మకర ద్వారం వద్ద ధర్నా. మార్మోగిని ‘మోదీజీ`ఎల్‌పీజీ’ నినాదం. పేరు నరేంద్రుడు… పని లొంగిపోవడమని ఎంపీల చురకలు. విదేశాంగ విధానంతో రాజీ: రాహుల్ విమర్శ పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతూ, చమురు క్షేత్రాలపైనా దాడులు జరుగుతూ, కీలక హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడం ఇంధన కొరతకు దారితీసింది. ఈ పరిణామాల క్రమంలో ప్రతిపక్ష సభ్యులు గురువారం పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఎల్‌పీజీ సిలిండర్ల కొరతపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం నుంచి […] The post గ్యాస్ కొరతపై విపక్షాల ఆగ్రహం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:39 pm

గల్ఫ్‌పై ఇరాన్ దాడులు ఆపాలి: ఐరాస

తీర్మానానికి భారత్ సహా 130 దేశాల ఆమోదం: ఓటింగ్‌కు చైనా, రష్యా దూరం న్యూయార్క్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ తక్షణమే దాడులు ఆపాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానించింది. బహ్రెయిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ఆమోదం తెలిపింది. భారత్ సహా 130 దేశాలు ఇందుకు కో`స్పాన్సర్లుగా వ్యవహరించాయి. ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని తీర్మానం పేర్కొంది. అంతర్జాతీయ శాంతిభద్రతలకు ముప్ప్పు కలిగిస్తున్నట్లు వెల్లడించింది. ‘బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, […] The post గల్ఫ్‌పై ఇరాన్ దాడులు ఆపాలి: ఐరాస appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:26 pm

అమెరికా వాణిజ్య భాగస్వాములపై ‘సెక్షన్ 301’

వాషింగ్టన్: భారత్, చైనా, బంగ్లాదేశ్ సహా 16 కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా వాణిజ్య చట్టం1974లోని ‘సెక్షన్ 301’ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. టారిఫ్‌లు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి క్రమంలో ఆయా దేశాలపై సుంకాలతో ఒత్తిడి పెంచేలా వాణిజ్య విధానాల దర్యాప్తులు ప్రారంభించింది. సెక్షన్ 301... వాణిజ్య భాగస్వాములపై సుంకాలు లేదా ఇతర ప్రతీకార చర్యలను చేపట్టే అధికారాన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధికి ఇస్తుంది. ఇతర దేశాలు అనుసరిస్తున్న చట్టవిరుద్ధమైన వాణిజ్య విధానాలను సవాలు చేయడమే ఈ […] The post అమెరికా వాణిజ్య భాగస్వాములపై ‘సెక్షన్ 301’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:22 pm

యుద్ధానికి బాధ్యులను నిలదీయాలి

పాక్ ప్రధానితో ఇరాన్ అధ్యక్షుడుతెహ్రాన్/ ఇస్లామాబాద్: ఇరుగు`పొరుగు దేశాలపై దాడులు చేయడం, సరిహద్దుల్లో ఘర్షణ పడటం తమ ఉద్దేశం కాదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో యుద్ధంతో నెలకొన్న పరిస్థితుల్లో ఇద్దరు నాయకులు ఫోన్ చర్చలు జరిపారు. తాజా పరిణామాలపై చర్చించారు. యుద్ధానికి బాధ్యులైన వారి నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడంలో అంతర్జాతీయ సమాజం విఫలమైతే ప్రపంచ క్రమం, భద్రతకు ముప్ప్పు ఏర్పడుతుందని పెజష్కియాన్ హెచ్చరించారు. యుద్ధానికి కారకులను […] The post యుద్ధానికి బాధ్యులను నిలదీయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:21 pm

ఇరాన్ ప్రభుత్వానికి ఢోకా లేదు

అమెరికా ఇంటెలిజెన్స్వాషింగ్టన్: పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారినప్పటికీ ఇరాన్ పాలనకు ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేదని అమెరికా ఇంటెలిజెన్స్ తేల్చింది. ఇరాన్‌లో పాలన మార్పు కోసమే తాము యుద్ధం చేస్తున్నట్లు అమెరికా, ఇజ్రాయిల్ ప్రకటించాయి. ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక సంచలనంగా మారింది. ఇరాన్ నాయకత్వం పదిలమని తేల్చిచెప్పింది. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితిలేదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ నివేదిక ఇచ్చింది. ఇరాన్ ప్రజలపై ప్రభుత్వానికి పట్టు ఉన్నట్లు పేర్కొంది. చమురు […] The post ఇరాన్ ప్రభుత్వానికి ఢోకా లేదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:20 pm

హోర్ముజ్ మార్గంలో భారత్‌కు అనుమతి

తెహ్రాన్: అమెరికా`ఇజ్రాయిల్ భీకర పోరు క్రమంలో కీలకమైన హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. అటుగా వచ్చే వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తామని హెచ్చరించడమే కాకుండా కొన్ని నౌకలపై దాడులు సైతం చేసింది. అనేక దేశాల ఓడలను నిలిపివేసింది. దీంతో అంతర్జాతీయ చమురు సంక్షోభం నెలకొంది. ఇలాంటి పరిణామాల క్రమంలో హర్మూజ్ మార్గంలో భారతీయ నౌకల రవాణాకు ఇరాన్ అనుమతిచ్చింది. దౌత్య చర్చలు ఫలించడంతో పుష్పక్, పరిమల్ అనే రెండు నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించినట్లు […] The post హోర్ముజ్ మార్గంలో భారత్‌కు అనుమతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:18 pm

Iran Supreme Ready హార్ముజ్ లో నో ఎంట్రీ Andhra Prabha News

Iran Supreme Ready హార్ముజ్ లో నో ఎంట్రీ Andhra Prabha News

ప్రభ న్యూస్ 12 Mar 2026 10:16 pm

ఇరాక్ జలాల్లో నౌకపై దాడి: భారతీయుడి మృతి

బాగ్దాద్: ఇరాక్ సముద్ర జలాల సమీపంలో అమెరికా ఆయిల్ ట్యాంకర్‌ను సూసైడ్ బోట్‌తో ఇరాన్ దాడి చేసింది. అండర్ వాటర్ డ్రోన్ దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. ఇరాన్ జలాల్లో ఉన్న ఖోర్ అల్ జుబైర్ పోర్టు వద్ద ఈ దాడి జరిగింది. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి ఇంధన ట్యాంకర్‌ను పేల్చివేస్తామని ఇరాన్ ముందే హెచ్చరించింది. ఆ నౌకలో ఉన్న 15 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా తరలించారు. బాగ్దాద్‌లోని భారతీయ ఎంబసీ ఈ […] The post ఇరాక్ జలాల్లో నౌకపై దాడి: భారతీయుడి మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:14 pm

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ‘కాలరే ఎత్తరా’ పాట విడుదల

హైదరాబాద్: ‘గబ్బర్ సింగ’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం మూడో గీతం ‘కాలరే ఎత్తరా’ను విడుదల చేసింది. గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ […] The post ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ‘కాలరే ఎత్తరా’ పాట విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:10 pm

6 ప్యాక్ లుక్‌తో నాగ చైతన్య

హైదరాబాద్: యువ హీరో నాగ చైతన్య హీరోగా కార్తీక్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వృషకర్మపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. కాగా, ఇటీవల విడుదలైన ‘వృష కర్మ’ గ్లింప్స్ ఆకట్టుకోగా… థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని మేకర్స్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాగ చైతన్య పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతుండటం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తాజాగా […] The post 6 ప్యాక్ లుక్‌తో నాగ చైతన్య appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:08 pm

‘బైకర’ కోసం పూర్తిగా మారిపోయిన శర్వానంద్

హైదరాబాద్: ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో చాలాకాలం తర్వాత హీరో శర్వానంద్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు శర్వానంద్ నటించిన మరో తాజా చిత్రం ‘బైకర’ విడుదలకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు ‘అఖండ’ దెబ్బకు వాయిదా పడిన ఈ సినిమా… ఏప్రిల్ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇండియాలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి […] The post ‘బైకర’ కోసం పూర్తిగా మారిపోయిన శర్వానంద్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:06 pm

సవాళ్లకు ఎదురెళ్లడమే నాకిష్టం: బుమ్రా

న్యూదిల్లీ: భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా టీ20 ప్రపంచకప్ విజయం గురించి మాట్లాడుతూ… తనకు ఆటలో కఠిన సవాళ్లు ఎదుర్కోవడమంటే ఇష్టమని స్పష్టం చేశాడు. సంబంధిత వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. ‘నాకు కఠిన సవాళ్లు ఎదుర్కోవడం అంటేనే ఇష్టం. మంచి ప్రదర్శన చేసి, సత్తా చాటినప్పుడు.. అది నాలో చాలా ఆనందాన్ని నింపుతుంది. దానికి మించిన సంతోషం మరోటి లేదు. నేను గుజరాత్‌లోనే క్రికెట్ ఆడటం ప్రారంభించా. వరల్డ్ కప్ కూడా ఇక్కడే గెలిచాం. ఫైనల్‌లో […] The post సవాళ్లకు ఎదురెళ్లడమే నాకిష్టం: బుమ్రా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 10:04 pm

పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి…

పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి… భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ: అడవి పాత్రలు

ప్రభ న్యూస్ 12 Mar 2026 10:00 pm

వాట్సాప్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు…

వాట్సాప్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు… గుంటూరు జీజీహెచ్‌లో కొత్త విధానం.. గుంటూరు,

ప్రభ న్యూస్ 12 Mar 2026 9:56 pm

గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత

గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత ​దమ్మపేట, ఆంధ్రప్రభ : ​దమ్మపేట మండల

ప్రభ న్యూస్ 12 Mar 2026 9:53 pm

Iran-Israel War: One More Worry for the Common Man After LPG Crisis

The ongoing Iran-Israel conflict is beginning to affect India’s economy in multiple ways. Shortages of key commodities and rising fuel costs are already creating pressure in the market. After concerns over LPG supply and possible petrol price hikes, another major worry is emerging. Medicine prices in India may soon increase if the global situation continues. […] The post Iran-Israel War: One More Worry for the Common Man After LPG Crisis appeared first on Telugu360 .

తెలుగు 360 12 Mar 2026 9:50 pm

మల్యాల గిరిజనులకు అండగా ఉంటా..

మల్యాల గిరిజనులకు అండగా ఉంటా.. అసెంబ్లీలో సమస్యను ప్రస్తావిస్తా..ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ప్రభ న్యూస్ 12 Mar 2026 9:48 pm

మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 12 Mar 2026 9:44 pm

ఎస్ టీ ఓ సీనియర్ అకౌంటెంట్ ఖదీర్ అవినీతిపై ఏసీబీ సోదాలు

ఎస్ టీ ఓ సీనియర్ అకౌంటెంట్ ఖదీర్ అవినీతిపై ఏసీబీ సోదాలు భువనగిరి

ప్రభ న్యూస్ 12 Mar 2026 9:36 pm

గ్యాస్ కొరతకు మోడీ ప్రభుత్వమే కారణం: రాహుల్ గాంధీ

ఇరాన్, అమెరికా - ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో భారతదేశం అల్లాడుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి మోడీ పభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. గురువారం లోక్‌సభలో దేశంలో వంట గ్యాస్ కొరతపై రాహుల్ గాంధీ ప్రసంగించారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుందన్నారు. అమెరికా ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు 20 శాతం చమురు హార్ముజ్ జల సంధి నుంచి వస్తుందని వివరించారు. ప్రస్తుతం ఆ జల సంధిని మూసివేశారని పేర్కొన్నారు. గ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు మూతపడ్డాయని చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. దేశానికి పునాది ఇంధన భద్రత అని అభివర్ణించారు. భారత్ వ్యవహారాలను అమెరికా శాసిస్తోందని మండిపడ్డారు. రష్యా ఆయిల్‌ను కొనడానికి ఎవరి అనుమతి కావాలి? అంటూ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. యూఎస్ అనుమతి లేకుంటే ముడి చమురు కొనుగోలు చేయ్యారా? అంటూ వ్యంగ్యంగా కేంద్రాన్ని నిలదీశారు. భారత్ వంటి పెద్ద దేశానికి మరో దేశం అనుమతి అవసరమా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. తన ప్రశ్నకు సమాధానం ఎప్‌స్టీన్ ఫైల్స్ రూపంలో దొరికిందన్నారు. ఎప్‌స్టీన్‌తో పరిచయం ఉందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ చెప్పారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేశారు. పెట్రోలియం మంత్రికి ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే రాహుల్ మైక్‌ను స్పీకర్ ఓం బిర్లా కట్ చేశారు. అంతలో సభలోని హర్దీప్ సింగ్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హర్దీప్‌సింగ్ ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. అంతే కాకుండా ఎప్‌స్టీన్ అంటూ సభలో విపక్ష పార్టీల సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

మన తెలంగాణ 12 Mar 2026 9:30 pm

మర్యాదలకన్నా ఎన్నికలే ఎక్కువ !

ప్రధానమంత్రి మోదీ తన ముఖం తాను అద్దంలో చూసుకున్నా ఎన్నికలే కనిపిస్తాయేమో! లేకపోతే ఇటీవల బెంగాల్‌లో జరిగిన సంథాల్ తెగవారి తొమ్మిదవ అంతర్జాతీయ మహాసభకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి మమత స్వాగతం చెప్పకపోవడం వివాదానికి దారి తీసేదే కాదు. నిజానికి ఈ మహాసభ ప్రభుత్వ అధ్వర్యంలో జరిగింది కాదు. అదొక ప్రైవేటు వ్యవహారం. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతిని విమానాశ్రయంలో ఆహ్వానించలేదని, ఇది అధికార మర్యాదలను ఉల్లంఘించడమేనని రచ్చ జరుగుతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, […] The post మర్యాదలకన్నా ఎన్నికలే ఎక్కువ ! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 9:21 pm

ముల్కనూర్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

 హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కేంద్రంగా అక్రమంగా తరలిస్తున్న భారీ పేలుడు పదార్థాలను టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ముల్కనూర్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా, అందులో భారీ మొత్తంలో పేలుడు సామాగ్రి బయటపడింది. పోలీసుల తనిఖీల్లో సుమారు 180 పెట్టెల జిలేటిన్ స్టిక్స్, 1950 డిటోనేటర్లు, రెండు తూటాల వైర్ బండిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రవాణాకు ఉపయోగించిన ఆటోను కూడా పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన ఈ పేలుడు పదార్థాల మొత్తం విలువ సుమారు రూ.7,07,500లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.ఆటోలో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులలో ఒకరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకోగా, మరొకరు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న సామాగ్రిని, నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. పరారైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.

మన తెలంగాణ 12 Mar 2026 9:20 pm

పేరు, ప్రతిష్టలకు ప్రతిమలు ప్రతీకలా ?

సంగిరెడ్డి హనుమంతరెడ్డి మన దేశంలో వైదికవాద మూర్తి పూజ విగ్రహ నిర్మాణాలకు మూలం. విగ్రహారాధన మౌర్య శకం అనగా ప్రస్తుత శకం 300లలో జైన, బౌద్ధ మతాల ప్రభావంతో మొదలయ్యింది. రాజుల విజయ చిహ్నాల స్థాపనగా మారింది. విగ్రహ స్థాపన ఆచారం వలస పాలనలో ఎక్కువయింది. ఐరోపా రాచరిక ఆరాధనకు సంకేతమయింది. అంబేద్కర్ భారత విగ్రహ భూమిని విమర్శించారు. అయితే ఓట్ల కోసం, దళితులను దువ్వడం కోసం ఆయన విగ్రహ స్థాపన విస్తృతంగా జరుగుతోంది. విప్లవాలకు నాయకత్వం […] The post పేరు, ప్రతిష్టలకు ప్రతిమలు ప్రతీకలా ? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 9:20 pm

గిరిజన మహిళల వారసత్వహక్కులపై పునరాలోచించాలి

బి.రామారావు గిరిజన సమాజాల్లో మహిళల వారసత్వ హక్కుల అంశం ఇప్పటికీ స్పష్టమైన పరిష్కారానికి నోచుకోలేదు. ఎక్కువ గిరిజన సమాజాల్లో అమలులో ఉన్న సంప్రదాయ చట్టాలు మహిళలకు సంపూర్ణ ఆస్తి హక్కులు కల్పించడం లేదు. హిందూ వారసత్వ చట్టం 1956 కుమార్తెలకు పూర్వీకుల ఆస్తిపై హక్కులు ఇస్తున్నప్పటికీ, గిరిజన మహిళలను ఆ చట్ట పరిధి నుంచి మినహాయిస్తోంది. ఇటీవలి కాలంలో హిందూ సంప్రదాయాలను స్వీకరించిన గిరిజన మహిళలకు మాత్రమే కొన్నిసార్లు వారసత్వ హక్కులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే […] The post గిరిజన మహిళల వారసత్వహక్కులపై పునరాలోచించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 9:19 pm

ఐక్యూ జెడ11ఎక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల

విశాలాంధ్ర/గుంటూరు: అధిక పనితీరు గల స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ గురువారం భారతదేశంలో ఐక్యూ జెడ11ఎక్స్ ప్రారంభించింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందిన ఐక్యూ జెడ11ఎక్స్, సెగ్మెంట్-లీడింగ్ బ్యాటరీ, అతుకులు లేని మల్టీ టాస్కింగ్ కోసం శక్తివంతమైన ప్రాసెసింగ్ సామర్థ్యాలను, మెరుగైన మన్నికను కలిపిస్తుంది. నేటి విద్యార్థుల వేగవంతమైన జీవనశైలికి అనుగుణంగా రూపొందినన ఈ పరికరం, వారు రోజంతా ఉత్పాదకంగా, వినోదాత్మకంగా, కనెక్ట్ అయి ఉండటానికి వీలు కల్పిస్తుంది. ఐక్యూ జెడ్-సిరీస్ లైనప్‌ను బలోపేతం చేస్తూ, ఐక్యూ జెడ11ఎక్స్, […] The post ఐక్యూ జెడ11ఎక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 9:14 pm

ప్రాణం తీసిన బోరు పంచాయితీ

పాత కక్షలు పడగ విప్పాయి. బోరు వివాదం చివరకు ప్రాణం తీసింది. రాజకీయంగా ఎదిగిన మామపై పెంచుకున్న కక్ష, నీటి బోరు సీజ్ చేసిన వ్యవహారం వెరసి ఓ మాజీ ఎంపిపి, వరుసగా మూడోసారి సర్పంచ్‌గా గెలిచిన ప్రజాప్రతినిధిని బలి తీసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం లింగపూర్ గ్రామ సర్పంచ్ ఇమ్మడి గోపి బుధవారం రాత్రి తన మేనల్లుడు సతీష్ చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. లింగపూర్‌గ్రామ పంచాయతీకి చెందిన నీటి బోరును అదే గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి అక్రమంగా వాడుతున్నాడన్న ఫిర్యాదుతో వివాదం మొదలైంది. దీనిపై సర్పంచ్ ఇమ్మడి గోపి వెంటనే స్పందించి, బుధవారం ఉదయం ఆ బోరును సీజ్ చేయించారు. ఇదే తరుణంలో గత పంచాయతీ ఎన్నికల నాటి నుంచి మామ, మేనల్లుళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ శత్రుత్వం ఉంది. అప్పట్లో గోపి తన భార్యను సర్పంచ్ బరిలో నిలపగా, మేనల్లుడు సతీష్ మామకు ఎదురు తిరిగి పోటీ చేశాడు. అప్పటి నుంచి సతీష్ ప్రతి విషయంలోనూ మామకు అడ్డుతగులుతూ కక్ష పెంచుకున్నట్లు సమాచారం. బోరు సీజ్ చేసిన వ్యవహారంతో రగిలిపోయిన సతీష్, మామ గోపిని అంతమొందించాలని స్కెచ్ వేశాడు. బుధవారం రాత్రి గోపి పనుల నిమిత్తం గౌరారం వెళ్లి కారులో తిరిగి వస్తుండగా, సతీష్ తన అనుచరులతో కలిసి కాపుకాశాడు. గోపి కారును తమ వాహనంతో బలంగా ఢీకొట్టారు. ప్రమాదం జరిగిందని భావించి గోపి కారు దిగగానే, సతీష్ బృందం ఒక్కసారిగా వేట కొడవళ్లతో విరుచుకుపడింది. గోపిని కిరాతకంగా నరికి చంపడంతో ఆయన అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచారు. హతుడు ఇమ్మడి గోపికి రాజకీయంగా గట్టి పట్టుంది. గతంలో ఆయన నక్సలైట్ ఉద్యమంలో ఉండి, ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిశారు. గతంలో ధర్పల్లి ఎంపిపిగా పని చేసిన ఆయన, ప్రస్తుతం వరుసగా మూడోసారి సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండటంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితుడు సతీష్, అతని ఆరుగురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాజకీయ వైరం కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి, చివరకు హత్యకు దారి తీయడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.

మన తెలంగాణ 12 Mar 2026 9:10 pm

సరికొత్త ‘క్లాసిక్స్ మోనెటా మూన్‌ఫేజ’ వాచీ విడుదల

ముంబయిః ఫ్రెడెరిక్ కాన్స్టాంట్ తన ‘క్లాసిక్స్ మోనెటా మూన్‌ఫేజ’ వాచీని ఆవిష్కరించింది. ఈ వాచీలో సాంప్రదాయ ఫ్లూటెడ్ బెజెల్ డిజైన్‌ను వాచీ ఫ్లాంజ్ కు మార్చారు. దీనివల్ల వాచీ కేసు అచ్చం ఒక నాణెం లాగా కనిపిస్తుంది, అందుకే దీనికి ‘మోనెటా’ అనే పేరు వచ్చింది. ఇప్పుడు జెనీవాకు చెందిన ఈ తయారీ సంస్థ దీనికి మరింత స్టైల్‌ను జోడించి, బ్లూ లేదా సిల్వర్ డయల్స్‌తో ఉన్న రెండు ఒరిజినల్ మోడళ్లకు సరికొత్త రూపాన్ని ఇచ్చి, వాటిని […] The post సరికొత్త ‘క్లాసిక్స్ మోనెటా మూన్‌ఫేజ’ వాచీ విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 9:08 pm

2025లో అమెజాన్ బిజినెస్ భారతీయ వ్యాపారం రూ.2,000 కోట్లు

బెంగళూరు: భారతదేశం అంతటా వ్యాపారాలు 2025లో రూ.2,000 కోట్లకు పైగా ఆర్థిక విలువను సాధించడానికి వీలు కల్పించినట్లు అమెజాన్ బిజినెస్ వెల్లడించింది. సూక్ష్మ సంస్థలు, చిన్న, మధ్య తరహా సంస్థల నుండి పెద్ద కార్పొరేషన్ల వరకు, అన్ని పరిమాణాల సంస్థలు అమెజాన్ బిజినెస్‌లో క్యాష్‌బ్యాక్ రివార్డులు, బల్క్ డిస్కౌంట్లు మరియు ప్రత్యేక డీల్‌ల ద్వారా ప్రయోజనం పొందాయి. ఈ విలువలో గణనీయమైన భాగం అమెజాన్ బిజినెస్‌లో సజావుగా జీఎస్‌టీ-కంప్లైంట్ ఇన్‌వాయిస్‌ల ద్వారా కూడా నడపబడింది, ఇది వ్యాపార […] The post 2025లో అమెజాన్ బిజినెస్ భారతీయ వ్యాపారం రూ.2,000 కోట్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 9:03 pm

ఎర్రగా పండిన ఆశలు… మట్టిలో కలిసిన కష్టం

ఎర్రగా పండిన ఆశలు… మట్టిలో కలిసిన కష్టం కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 12 Mar 2026 8:54 pm

హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యానికి చేరుకోండి

హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యానికి చేరుకోండి మైలవరం, ఆంధ్రప్రభ: ద్విచక్ర వాహనదారులు ప్రయాణం

ప్రభ న్యూస్ 12 Mar 2026 8:49 pm

Nagabandham’s Namo Re Promo: Spiritual Grandeur

The musical odyssey of Nagabandham takes a divine leap with the release of the promo for its first single, Namo Re. Opening with a mesmerizing view of the Lord Padmanabha Swamy idol through the three doors of the world’s richest temple in Thiruvananthapuram, the promo immediately transports viewers into a realm of spiritual grandeur. The […] The post Nagabandham’s Namo Re Promo: Spiritual Grandeur appeared first on Telugu360 .

తెలుగు 360 12 Mar 2026 8:48 pm

ప్రభుత్వం చెప్తున్నవన్నీ అబద్ధాలే: హరీశ్‌రావు

 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అంతా అబద్ధమని, క్షేత్రస్థాయిలో రైతులకు కేవలం 12 గంటల విద్యుత్ మాత్రమే అందుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కోహిర్ సబ్‌స్టేషన్‌ను ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింత ప్రభాకర్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లోని లాంగ్ బుక్కులను స్వయంగా పరిశీలించిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ సబ్‌స్టేషన్ రికార్డులు మరోలా ఉన్నాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సాయంత్రం 4 గంటలకు త్రీ ఫేజ్ కరెంటు తీసేసి, తిరిగి తెల్లవారుజామున 3 గంటలకు ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇచ్చిన కొద్దిపాటి సమయంలోనూ లైన్ బ్రేకింగ్, ఎల్ ల పేరుతో గంటల తరబడి కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై అదనపు భారం బీఆర్‌ఎస్ హయాంలో కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం డిడి ధర రూ. 4,900 ఉంటే, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ. 9,700కు పెంచిందని హరీష్ రావు విమర్శించారు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు. కాలిన ట్రాన్స్‌ఫార్మర్ల భారాన్ని రైతులపైనే వేస్తున్నారు. వేలాది కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.‘ ఉన్న రెండు డిస్కమ్‌లను రూ. 55 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టి, ఇప్పుడు బ్యాంకులను, ఆర్థిక సంస్థలను మోసం చేయడానికే కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఆర్టిజాన్ల సమ్మెకు మద్దతు సమ్మె చేస్తున్న 19,647 మంది ఆర్టిజాన్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టిజాన్ల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, విధి నిర్వహణలో మృతి చెందిన ఆర్టిజాన్ల పిల్లలకు వారి విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విద్యుత్ సమస్యలను హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు.

మన తెలంగాణ 12 Mar 2026 8:48 pm

Revanth Reddy Inaugurates Allu Cinemas

Allu family’s prestigious multiplex Allu Cinemas has been in construction from the past one and a half years. The new multiplex was inaugurated by Telangana Chief Minister A Revanth Reddy this evening at 6 PM in Kokapet. Located in the costliest location, Allu Cinemas will serve the patrons of Kokapet, Financial District, Gandipet, Narsingi and […] The post Revanth Reddy Inaugurates Allu Cinemas appeared first on Telugu360 .

తెలుగు 360 12 Mar 2026 8:45 pm

నిర్ధిష్ట గడువులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

నిర్ధిష్ట గడువులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఖమ్మం, ఆంధ్రప్రభ : నిర్ధిష్ట

ప్రభ న్యూస్ 12 Mar 2026 8:43 pm

రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నేతలు

రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే కూర్చుని కాంగ్రెస్‌ నాయకుల నిరసన… ఎయిర్‌-టె-ల్‌

ప్రభ న్యూస్ 12 Mar 2026 8:37 pm

ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు (హాఫ్‌డే స్కూల్స్) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట విధానంలోనే నడుస్తాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. తరగతులు ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. అయితే, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ కేంద్రాలు కూడా 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి. అయితే, మార్చి 15 ఆదివారం కావడంతో సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పనిదినం కాగా, ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.

మన తెలంగాణ 12 Mar 2026 8:36 pm

ఈ నెల 25న దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సిఎస్‌ఆర్ సమ్మిట్

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్ ) సమ్మిట్ 2026కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సమ్మిట్ జూలై 25న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది సమ్మిట్ థీమ్ చేంజ్ టు లెగసి గా నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమాజంపై సానుకూల ప్రభావం చూపే కార్యక్రమాలను నిర్వహిస్తున్న సమ్మిట్ నిర్వాహకులను అభినందించారు. ఈ సమ్మిట్ ద్వారా కార్పొరేట్ సంస్థలు, ఎన్‌జీఓలు, సోషల్ ఇన్నోవేటర్లు, స్టార్టప్‌లు ఒకే వేదికపైకి వచ్చి సామాజిక అభివృద్ధికి కలిసి పనిచేసే అవకాశం కల్పించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వినిల్ రెడ్డి ఎదుడొడ్ల (లైసెన్సీ), వంశీ ముత్యపు (మేనేజింగ్ డైరెక్టర్), ఆదిత్య వేదాంతం (డైరెక్టర్), సుమంత్ వల్లాల (డైరెక్టర్)పాల్గొన్నారు. సమ్మిట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

మన తెలంగాణ 12 Mar 2026 8:31 pm

చిరుత పిల్లను ఢీకొన్న వాహనం

చిరుత పిల్లను ఢీకొన్న వాహనం కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా

ప్రభ న్యూస్ 12 Mar 2026 8:31 pm

వంట గ్యాస్ సిలండర్లు బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు

. గృహ ఎల్పీజీ సిలండర్లకు ఎటువంటి కొరతా లేదు. జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ The post వంట గ్యాస్ సిలండర్లు బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 8:31 pm

జిల్లాలో పరిశ్రమలు, ఎం ఎస్ ఎం ఈ యూనిట్లు

జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి విశాలాంధ్ర – ఏలూరు : ఏలూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దఎత్తున ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ . చంద్రబాబునాయుడుకు తెలియజేసారు. రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు రెండవ రోజు గురువారం ఏలూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు. ఈ సందర్భంగా […] The post జిల్లాలో పరిశ్రమలు, ఎం ఎస్ ఎం ఈ యూనిట్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 8:28 pm

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత 5.1 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేతచౌక డిపో

ప్రభ న్యూస్ 12 Mar 2026 8:26 pm

మా జట్టులో బుమ్రా ఉంటే మేమే వరల్డ్‌కప్ గెలిచేవాళ్లం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

ఐసిసి టి-20 ప్రపంచకప్‌-2026ని భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంలో టీం ఇండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సెమీస్‌లో ఇంగ్లండ్‌పై, ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో బుమ్రా తమ జట్టులో ఉంటే.. తమ జట్టే ట్రోఫీని సొంతం చేసుకొనేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. తాను చూసి బౌలర్లలో బుమ్రానే ది బెస్ట్ అని కితాబిచ్చాడు. బుమ్రా ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ప్రపంచకప్ గెలిచేదని పేర్కొన్నాడు. ‘‘ఇంగ్లండ్ జట్టులో బుమ్రా ఉండుంటే.. తప్పకుండా వరల్డ్‌కప్ నెగ్గేదే. ప్రపంచ క్రీడాకారుల్లో బుమ్రాను లియోనిల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డోతో పోలుస్తా. ఏ టీమ్‌లో బుమ్రాను పెడితే ఆ జట్టుదే విజయం’’ అని వాన్ అభిప్రాయపడ్డాడు. దీనికి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లూయిడ్ స్పందిస్తూ.. ‘‘అంటే, మీరు చూసిన బౌలర్లలో అతడే అత్యుత్తమం అని చెబుతారా?’’ అని ప్రశ్నించాడు. ‘‘అవును. అతడే బెస్ట్ నేను 1985 నుంచి క్రికెట్ చూడటం, నేర్చుకోవడం మొదలైంది. ఇప్పటివరకూ నేను చూసిన బౌలర్లలో అతడే అత్యుత్తమం’’ అని వాన్ స్పష్టం చేశాడు. 

మన తెలంగాణ 12 Mar 2026 8:25 pm

ఎపీకి త్వరలో ఆరు వరుసల జాతీయ రహదారి

ఎపీకి త్వరలో ఆరు వరుసల జాతీయ రహదారి నితిన్ గడ్కారితో రామ్మోహన్ నాయుడు

ప్రభ న్యూస్ 12 Mar 2026 8:20 pm

Iran Action Attribution : చిక్కొద్దు.. దొర‌కొద్దు Andhra Prabha Analysis

Iran Action Attribution : చిక్కొద్దు.. దొర‌కొద్దు Andhra Prabha Analysis (

ప్రభ న్యూస్ 12 Mar 2026 8:17 pm

ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో..

ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో.. విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడలో నిర్వహించనున్న ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో–2026ను

ప్రభ న్యూస్ 12 Mar 2026 8:11 pm

18న ఇఫ్తార్ విందు ఏర్పాటు…

18న ఇఫ్తార్ విందు ఏర్పాటు… హాజరు కానున్న మాజీ ముఖ్య మంత్రి వై

ప్రభ న్యూస్ 12 Mar 2026 8:05 pm

కేంద్రమంత్రి మనసుఖ్ మాండవ్యను కలిసిన ఎంపీ కేశినేని

కేంద్రమంత్రి మనసుఖ్ మాండవ్యను కలిసిన ఎంపీ కేశినేని ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధి

ప్రభ న్యూస్ 12 Mar 2026 8:04 pm

నేడు రైతులఖాతాలో పీయం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు జమ

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : పీయం కిసాన్ మరియు మరియు అన్నదాత సుఖీభవ నిధులు 2025-2026సంవత్సరానికి గాను మూడవ విడత నిధులు పంపిణీ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ( 13 వ తేదీన ) 4 గంటలకు నిధులు రైతుల ఖాతా లో జమ చేయునున్నట్లు మండలవ్యవసాయశాఖ అధికారి కె వి శేషారెడ్డి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పీ యం. కిసాన్ నిది పధకంలో భాగంగా భారత ప్రధానమంత్రి […] The post నేడు రైతులఖాతాలో పీయం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు జమ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Mar 2026 7:58 pm