తిరుపతి లడ్డూ కల్తీ మంటలు ఇందాపూర్ సంగతేంటి? • ఎందాకైనా పోరాడతాం •
Exclusive: Three Production Houses coming for Naga Chaitanya
Akkineni actor Naga Chaitanya has reached the milestone of his landmark 25th film and the shoot commences very soon. He is shooting for Vrushakarma and the film releases soon. Naga Chaitanya is in plans to start the shoot of his 25th in summer this year. Bedurlanka fame Clax is the director and the pre-production work […] The post Exclusive: Three Production Houses coming for Naga Chaitanya appeared first on Telugu360 .
భారత్-విస్తార్ డిజిటల్ ప్లాట్ ఫారమ్ హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా కో ట్లాది
ఈవీ ఇ-విటారా న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ తన మొదటి ఎలక్ట్రిక్ కారు
Weather Report : వేడి గాలులు మొదలయ్యాయి.. ఇక దబిడి దిబిడే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత పెరిగింది
మోహన్ బాబుకు ఎపి హైకోర్టులో ఎదురుదెబ్బ... అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం
అమరావతి: నటుడు మోహన్ బాబుకు ఎపి హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో తనకు అరెస్ట్ నుండి రక్షణ కల్పించాలని మోహన్ బాబు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేయడానికి ముందు, తర్వాత వర్సిటీ పిఆర్ఒ సతీష్తో మోహన్ బాబు మాట్లాడడంతో పాటు మెసేజ్లు పంపాడని పోలీసులు తెలిపిన విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుర్తు చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేయడంతో పాటు విచారణను మార్చి 3కు కోర్టు వాయిదా వేసింది. ఈనెల 3న తిరుపతిలోని మోహన్బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు బయలుదేరిన ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు వినోద్లను, తిరుచానూరు వద్ద కొందరు దుండగులు వాహనాల్లో వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. తిరుపతి విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు సంబంధించిన 13 మంది గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కిడ్నాప్ చేసిన వారిలో మోహన్ బాబు యూనివర్సిటీ విద్యానికేతన్ పిఆర్ఒ సతీష్ తో పాటు మరో 12 మంది ఉన్నారు. పట్టుబడిన వారిలో బౌన్సర్లు, సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. విద్యానికేతన్ నిర్వాహకులు బౌన్సర్లతో నేరాలు చేయించారు. మూడు ఇన్నోవా కార్లు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ కేసులో బాధితుల ఫిర్యాదు మేరకు మోహన్బాబును ఎ -2గా, మంచు విష్ణును ఎ-3గా, యూనివర్సిటీ పిఆర్ఒ సతీష్ను ఎ-1గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
దిగి వస్తున్నబంగారం, వెండి ధరలు
దిగి వస్తున్నబంగారం, వెండి ధరలు ముంబై : కొద్ది రోజులుగా బంగారం, వెండి
అనంతమైన సత్యం “ రాజకీయ రంగులు ఎన్ని మారినా, సిద్ధాంతా లు ఎన్ని
T20 World Cup : నేడు భారత్ - నెదర్లాండ్ మ్యాచ్
టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్ - నెదర్లాండ్స్ మధ్య అహ్మదాబాద్ లో మ్యాచ్ జరగనుంది.
పొరుగుదేశంలో కొత్త అధ్యాయం బంగ్లాదేశ్ ప్రధానిగా బీఎస్పీ నాయకుడు తారీఖ్ రెహమాన్ మంగ
నామమాత్రంగా కేంద్ర గ్రాంట్లు పన్నులపైనే ఆధారం • ఆర్థిక లోటురూ.69 వేల కోట్లు
బాలికపై అత్యాచారం... నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసిన ఎదురింటోడు
అమరావతి: ఎదురింట్లో ఉండే ఓ వ్యక్తి బాలికపై అత్యాచారం చేసి అనంతరం చిన్నారిని డ్రమ్ములో ముంచి హత్య చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మదనపల్లెలో ఓ బాలిక(7) రెండో తరగతి చదువుతోంది. సోమవారం స్కూల్కు సెలవు కావడంతో ఇంటి దగ్గర ఉంది. సాయంత్రం ఇంటికి వచ్చి కూతురు కోసం తండ్రికి తల్లి పోన్ చేసి కూతురుని అడిగింది. స్నేహితుల వద్ద ఆడుకుంటుందో ఏమో అని తల్లిదండ్రులు భావించారు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఎదురింటి డోర్ను పలుమార్లు కొట్టిన కూడా అతడు తెరవకపోవడంతో వెనుదిరిగారు. బాలిక కనిపించడం లేదని స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. రాత్రి 1.30 పోలీసులు ఎదురింటి యువకుడి కులవర్ధన్ (30) కిటికీలో నుంచి చూడగా కులవర్ధన్(30) నిద్రపోయి కనిపించాడు. మంగళవారం ఉదయం 7 గంటలకు మళ్లీ అతడి ఇంటికి తలుపులు బద్దలు కొట్టారు. బాలిక కోసం వెతికగా డ్రమ్ములో చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికకు శవ పరీక్షలు నిర్వహించగా అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా తేలింది. పోలీసులు సరైన సమయంలో స్పందించలేదని స్థానికులు, వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కులవర్ధన్ నేర చరిత్ర ఉందని స్థానిక పోలీసుల వెల్లడించారు. గతంలో ఒకరిపై కొడవలి దాడి చేయడంతో అతడిపై కేసు నమోదైంది. ఇద్దరు, ముగ్గురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై వారు ఫిర్యాదు చేశారు. కానీ అతడి వారిని బెదిరించడంతో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారని తెలిపాడు.
Telangana : నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ విచారణ
నేటి నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ విచారణ ప్రారంభించనున్నారు
Telangana : నేడు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు.. అగ్రనేతల అత్యవసర సమావేశం
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
Delhi : ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యకు కొత్త ప్రయోగం.. ఏఐ ఆధారిత వ్యవస్థకు అనుసంధానం
దేశ రాజధాని ఢిల్లీలో వాహనం కదలాలంటే కుదరని పని.
బంగ్లా కొత్త ప్రభుత్వానికి పెను సవాళ్లు
పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో తారిఖ్ రహమాన్ నాయకత్వాన 49 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఒక పురుష ప్రధాని అధికార పగ్గాలు చేపట్టడం ఆ దేశంలో ఇదే తొలిసారి. తల్లి ఖలీదా జియా మరణం తాలూకు సానుభూతి, మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని ప్రధాన రాజకీయ పార్టీ అవామీ లీగ్ను తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలలో పోటీ చేయకుండా బహిష్కరించడం, జమాత్ ఎ ఇస్లామీ కూటమి పెద్దగా పోటీ ఇవ్వలేకపోవడంతో బిఎన్పికి మూడింట రెండొంతుల మెజారిటీతో అసాధారణ విజయం లభించింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా రహమాన్కు అందలం సునాయాసంగా అందివచ్చింది. బంగ్లా ప్రజలు తారిఖ్ జియాగా పిలుచుకునే రహమాన్ మొదటినుంచీ వివాదాస్పద రాజకీయ నేతగా పేరుపడ్డారు. అవామీలీగ్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై అవినీతి, ఆశ్రిత పక్షపాతం, మనీలాండరింగ్, బాంబు దాడులకు పాల్పడటం వంటి 84 కేసులు నమోదయ్యాయి. తన తల్లి ప్రధానిగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్పి) కార్యాలయమైన హవా భవన్ నుంచి ఆయన సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. 2008లో అవామీలీగ్ అధికారంలోకి రావడంతో స్వదేశంలో తనకు నూకలు చెల్లినట్లేనని భావించి, లండన్కు పారిపోయి తలదాచుకున్నారు. తన మాతృమూర్తి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి ఖలీదా జియా మరణశయ్యపై ఉండటంతో పదిహేడేళ్ల ప్రవాస జీవితానికి స్వస్తిపలికి గత డిసెంబర్లో తిరిగి స్వదేశం చేరుకున్న తారిఖ్ రహమాన్కు ముందున్నది ముళ్లబాటేనని చెప్పవచ్చు. అవామీలీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ఆశ్రిత పక్షపాతం కారణంగా ప్రజలలో అశాంతి, అభద్రతాభావం చోటుచేసుకున్నాయి. ఆమె పదవీచ్యుతురాలైన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా పగ్గాలు అందుకున్న మహ్మద్ యూనస్ నాయకత్వంలో దేశ పరిస్థితి పెనంమీదనుంచి పొయ్యిలో పడినట్లుగా మారింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పట్టాలు తప్పింది. శాంతిభద్రతలు మృగ్యమయ్యాయి. మైనారిటీల భద్రత ప్రమాదంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన రహమాన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. రాజకీయ అస్థిరతతో దేశం అతలాకుతలమవుతోంది. అప్పులు పెరిగిపోయి, ప్రజల తలసరి ఆదాయం క్షీణించి, ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరింది. ఉపాధి అవకాశాలు మృగ్యమై, యువతరం ఉద్యమాల బాట పడుతోంది. తాత్కాలిక ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయి. హిందువులు లక్ష్యంగా దాడులు పెచ్చుమీరాయి. దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడిదారులు ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉంది. వీటన్నింటికీ పరిష్కారాలు కనుగొనవలసిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. ఇదిలా ఉంటే, రహమాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానం ఎలా ఉండబోతోందన్నది అందరిలోనూ ఉత్సుకత రేకెత్తిస్తోంది. తమ దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే విదేశాంగ విధానం ఉంటుందని ఆయన చెప్పినా, భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఇప్పటికే స్పష్టం చేసినా ఆచరణలో ఆయన తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ బాటలోనే నడుస్తారన్న అనుమానాలు లేకపోలేదు. యూనస్కు దేశ అధ్యక్ష పదవిని కట్టబెడతారనీ లేదా ప్రభుత్వంలో ప్రధాన సలహాదారు పదవిలో కూర్చోబెడతారని వస్తున్న వార్తలు ఇలాంటి అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. పైగా తమ చిరకాల ప్రత్యర్థి షేక్ హసీనాకు భారత్ రాజకీయ ఆశ్రయం కల్పించడం కూడా భారత్తో సత్సంబంధాలు నెరిపేందుకు ప్రధాన అడ్డంకిగా మారవచ్చు. హసీనాను తమకు అప్పగించే విషయంలో న్యాయపోరాటం సాగిస్తామని ఇప్పటికే ప్రకటించిన రహమాన్, భారత్తో దౌత్య సంబంధాల విషయంలో తన తల్లి తరహాలోనే అంటీముట్టని వైఖరినే కొనసాగించవచ్చు.ఈ నేపథ్యంలో హసీనాకు దీర్ఘకాలం రాజకీయ ఆశ్రయం కల్పించే విషయంలో భారత్ పునరాలోచన చేయడం శ్రేయస్కరం. బంగ్లాదేశ్కు దగ్గర కావడం ద్వారా దక్షిణాసియాలో చైనా ప్రాబల్యాన్ని కట్టడిచేసే దిశగా భారత్ అడుగులు వేయాల్సిన సమయమిది. సార్వత్రిక ఎన్నికలలో సాధించిన ఘన విజయం ద్వారా స్వతంత్రంగా, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు రహమాన్ ప్రభుత్వానికి లభించింది. స్వప్రయోజనాలే పరమావధిగా భావించే చైనా, విభజన రాజకీయాలతో కల్లోలం సృష్టించే పాకిస్తాన్ ఒకవైపు, ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ, వాటికి తలలో నాలుకలా వ్యవహరించే భారత్ మరొకవైపు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎటువైపు మొగ్గాలో నిర్ణయించుకోవలసిన బాధ్యత రహమాన్ ప్రభుత్వానిదే.
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా హైదరాబాద్ నిలిచిందని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో బయో ఏషియా ప్రారంభమైనప్పుడు, హైదరాబాద్ అం టే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ ,సాఫ్ట్వేర్ నగరం అన్న గుర్తింపు ఉండేదని, కానీ, ఇప్పుడు గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మా రిందన్నారు. మంగళవారం హైదరాబాద్ హైటె క్స్ వేదికగా జరుగుతున్న బయో ఆసియా సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో మాన వ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల కారణంగానే హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు, పరిశోధన, డిజైన్లో విశిష్టతకు ప్రపంచ కేంద్రం గా ఎదిగిందన్నారు. రెండు సంవత్సరాల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పె ట్టుబడులు వచ్చాయన్నారు. కొద్ది వారాల క్రితం దావోస్లో మా కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించామని సిఎం చెప్పారు. జీనోమ్ వ్యాలీని విస్తరించామన్నారు. ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు వన్-బయోను ప్రారంభించామన్నారు. గ్రీన్ఫార్మా సిటీని వేగవంతం చేశామని, అనేక గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను ఆహ్వానించామన్నారు. ఇది సాధారణ అభివృద్ధి కాదని ఇది దృఢమైన విజన్ ఫలితమని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. మా సక్సెస్కు బయోఏషియా -2026 ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. బయోఏషియా తన పేరును దాటి బయో-వరల్డ్గా మారుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4,000 మందికి పైగా ప్రతినిధులు ఇక్కడ హాజరయ్యారని ఆయన తెలిపారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ మనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సైన్స్, ఏఐ, బయోటెక్ వంటి రంగాల్లో ప్రముఖులను కలిసినప్పుడు అసాధారణమైన ఫలితాలు వస్తాయన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న బయోఏషియా సదస్సు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఇటీవల తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ప్రకటించామని 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడం మా లక్ష్యమని చెప్పారు. బల్క్ డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు ప్రస్తుత జీవ విజ్ఞాన ధోరణులను చూస్తే పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్లు చిన్న మధ్య తరహా సంస్థలు , ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం అన్నారు. మీరు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్ కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారని ఈ సౌకర్యాలు తెలంగాణ అందిస్తోందన్నారు. బల్క్ డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు, తయారీ నుంచి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. తాము కేవలం భారతదేశంలోనే పోటీ పడటం లేదని, ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నామని సిఎం అన్నారు. హైదరా బాద్ ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారిందని, ఇప్పుడు మనం కలిసి దీనిని సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని మీ జీసిసిలను స్థాపించి, ఆవిష్కరణ కేంద్రాలను నిర్మించాలని సిఎం పిలుపునిచ్చారు. మాలిక్యుల్స్, ఔషధాలను డిజైన్ చేయాలని, క్లినికల్ అనలిటిక్స్ను నడపాలన్నారు. ఏఐ ప్లాట్ఫాంలను అభివృద్ధి చేసి, డిజిటల్ తయారీని ముందుకు తీసుకెళ్లాలని సిఎం రేవంత్రెడ్డి పిలుపు నిచ్చారు. తమ ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు, నైపుణ్యంతో కూడిన యువత మీ విజయానికి భాగస్వాములుగా ఉంటారని సిఎం చెప్పారు. మనమంతా కలిసి పనిచేస్తే హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుంచి ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా ఎదిగేలా చేద్దామన్నారు. ప్రపంచ అవసరాలకు తెలంగాణ సిద్ధంగా ఉందని, తెలంగాణ అంటే బిజినెస్ అని ఆయన చెప్పారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో మీరంతా భాగస్వాములు కావాలని సిఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టే వారికి సహకారం అందిస్తాం ఈ సదస్సులో మాట్లాడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులు, కంపెనీలు పెట్టాలని యోచించే గ్లోబల్ ఇన్వెస్టర్లకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే ఎన్నో లైఫ్ సైన్సెస్ కంపెనీలు హైదరాబాద్లో జీసీసీ (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్)లను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. ఇదే విషయమై మరింత లోతుగా దృష్టి సారించడానికి, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఇన్నోవేషన్ సెంటర్లను సులభతరం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఫ్యూచర్ సిటీలో జిసిసిల కోసం ఒక ప్రత్యేక జోన్ను నిర్మించాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ప్రకటించిన పెట్టుబడుల వివరాలు ఇలా.... ఫ్రాన్స్లోని తన ప్రపంచ ప్రధాన కార్యాలయంతో సనోఫీ నుంచి విడిపోయిన గ్లోబల్ కన్స్యూమర్ హెల్త్కేర్ కంపెనీ ఒపెల్లా హెల్త్కేర్, దాని జిసిసి కార్యకలాపాలను 42,000 చదరపు అడుగుల సౌకర్యంతో విస్తరిస్తోంది. వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగాలను ఈ కంపెనీలను సృష్టించనుంది. జీఏపిఎఫ్ఏ ఇండోనేషియా విభాగమైన వాక్సిండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, జీనోమ్ వ్యాలీలో ఆధునిక బిఎస్ఎల్-3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం కోళ్లు, పశువులు, స్త్వ్రన్, ఆక్వాకల్చర్ కోసం వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించనుంది. ఏఐ, డేటా సైన్స్ కంపెనీగా పేరొందిన ట్రెడెన్స్ ఐఎన్సీ, ఏఐ- ఆధారిత హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ పై కీలక సేవలు అందించిన సంస్థ హైదరాబాద్లో కార్యకలాపాలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ కేంద్రం సుమారు 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, దీనిలో ప్రపంచ స్థాయి కార్యకలాపాలను నిర్వహించ తలపెడుతోంది. దీంతో ఏఐ ఆధారిత హెల్త్ కేర్ రంగంలో మరింత ఆధునికత రానుంది. భారతదేశ లైఫ్ సైన్సెస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ హైదరా బాద్లోని జీనోమ్ వ్యాలీలో భారీ స్థాయిలో ఫార్మాట్ లైఫ్ సైన్సెస్ క్యాంపస్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి 1 మిలియన్ చదరపు అడుగుల అడ్వాస్డ్ ల్యాబ్, మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. ఇది రాబోయే ఆరు సంవత్సరాల్లో మరింత విస్తృతం కానుందని ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.
బంగ్లాదేశ్లో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్పి) ఘన విజయం సాధించడం, అల్లకల్లోలంగా ఉన్న ఆ దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచింది. ప్రధాని పదవిని చేపట్టేందుకు తారిక్ రెహ్మాన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఢాకా మాత్రం ఒక ముఖ్యమైన రాజకీయ పునర్నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దివంగత అధ్యక్షుడు జియౌర్ రెహ్మాన్ స్థాపించిన బిఎన్పి పార్టీ బంగ్లాదేశీ జాతీయవాదాన్ని ఆధారంగా చేసుకుని ఎదిగింది. బిఎన్పి తిరిగి అధికారంలోకి రావడం ఒకవైపు కొనసాగింపుని, మరోవైపు మార్పుని సూచిస్తోంది. దేశ సార్వభౌమాధికారానికి, జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం కొనసాగింపుగా ఉంటే, ఎన్నోసంవత్సరాలుగా కొనసాగుతున్న ధ్రువీకృత (విభజిత) రాజకీయాల తర్వాత సమగ్ర పాలన, సయోధ్యకు అవకాశం కల్పిస్తామన్న హామీ మార్పుగా నిలుస్తోంది. దక్షిణాసియాలో కీలక వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న బంగ్లాదేశ్కు అత్యంత సమీప పొరుగుదేశమైన భారత్ దృష్టిలో ఈ ఎన్నికల ఫలితం సవాళ్లను, అవకాశాలను రెండింటినీ తీసుకొచ్చింది. బిఎన్పి నాయకత్వం ఇప్పటికే లౌకిక, సమగ్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, మైనారిటీలకు భద్రతతోపాటు సమాన హక్కులను కల్పిస్తామని ప్రకటించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల పరిస్థితిపై భారత్కు ఉన్న సున్నితత్వం దృష్ట్యా, ఈ హామీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ హామీలు కార్యరూపంలో ఎంతవరకు నిలబడతాయన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. ముఖ్యంగా దేశీయ రాజకీయ ఒత్తిళ్లు, బిఎన్పి -భారత్ సంబంధాల గత చరిత్ర నేపథ్యంలో ఈ అంశం మరింత సంక్లిష్టంగా మారవచ్చు. బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయ గమనాన్ని పూర్తిగా మార్చిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో బిఎన్పి ఘన విజయం సాధించింది. ఈ పరిణామాలు దేశ అంతర్గత రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. జాతీయ ప్రయోజనాలే మా మార్గదర్శకం అంటూ ముందుకు వచ్చిన బిఎన్పి, భారతదేశంతో సహా గతంలో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలన్నింటినీ జాతీయ ప్రయోజనాల దృష్టితో తిరిగి పరిశీలిస్తామని స్పష్టం చేసింది. దీంతో విదేశాంగ విధానాల్లో మరింత కఠిన, లావాదేవీ ధోరణి కనిపించే అవకాశముంది. అయితే మరోవైపు తారిక్ రెహ్మాన్ మితవాద స్వరాన్ని వినిపిస్తున్నారు. లౌకిక పరిపాలనే మా దిశ అంటూ ఆయన ఇచ్చిన హామీలు దేశీయ మైనారిటీలకే కాకుండా అంతర్జాతీయ వర్గాలకు కూడా భరోసా కల్పించేందుకు ఉద్దేశించినవిగా భావించవచ్చు. బిఎన్పి తిరిగి అధికారంలోకి రావడం వల్ల మతాధారిత రాజకీయాల పునరాగమనం కాదన్న భరోసా కల్పించే ప్రయత్నం ఇది. గత అనుభవాల దృష్ట్యా బిఎన్పిపై అప్రమత్తంగా ఉన్న భారతదేశానికి ఈ మార్పు కొత్త అవకాశంగా కనిపిస్తోంది. సంబంధాలను రీసెట్ చేసుకునే దిశగా ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. షేక్ హసీనాకు భారతదేశంలో ఆశ్రయం కల్పించినట్లుగా నివేదించిన అంశాన్ని తారిక్ రెహ్మాన్ ఎలా నిర్వహిస్తారనేది, ఆయన ప్రభుత్వ విదేశాంగ విధాన వైఖరికి కీలకమైన ప్రారంభ సూచికగా మారనుంది. చరిత్రపరంగా బిఎన్పి నాయకత్వం, భారత్ అవామీ లీగ్కు మద్దతు ఇచ్చిందని ఆరోపిస్తూ వచ్చింది. కొత్త ప్రభుత్వం హసీనాను అప్పగించాలంటూ డిమాండ్ చేస్తే లేదా ఈ అంశాన్ని భారత జోక్యానికి ప్రతీకగా ప్రస్తావిస్తే, ద్వైపాక్షిక సంబంధాలు వేగంగా చల్లబడే ప్రమాదం ఉంది. అయితే మరోవైపు, వాస్తవిక దృక్పథం కూడా సాధ్యమే. విదేశాల్లో గడిపిన అనుభవంతో అంతర్జాతీయ రాజకీయ సంక్లిష్టతలను అర్థం చేసుకున్న రెహ్మాన్కు రాజకీయ ఆశ్రయం- నిరాశ్రయ సమస్యల సంక్లిష్టత బాగా తెలుసు. కాబట్టి ఈ అంశాన్ని వివాదంగా మలచకుండా, గతాన్ని పక్కనపెట్టి భవిష్యత్ సహకారంపై దృష్టి సారించే మార్గాన్ని ఆయన ఎంచుకునే అవకాశం ఉంది. ఇక భారత్ కూడా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి. బహిరంగ రాజకీయ సంకేతాలను నివారిస్తూ, బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల తన గౌరవాన్ని పునరుద్ఘాటించాల్సి ఉంటుంది. భారత్ -బంగ్లాదేశ్ సంబంధాల్లో తరచూ ఉద్రిక్తతలకు కారణమైన మరో అంశం సరిహద్దు నిర్వహణ. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ఎఫ్)కు సంబంధించిన ఘటనలు, పౌరుల మృతుల ఆరోపణలు బంగ్లాదేశ్లో ప్రజాభిప్రాయాన్ని వేడెక్కించాయి. సరిహద్దు ప్రాంతాల్లో అధిక బలప్రయోగం జరుగుతోందని బిఎన్పి నాయకత్వం గతంలో తీవ్రంగా విమర్శించింది. కొత్త ప్రభుత్వం ఈ అంశంపై మరింత స్పష్టమైన, గట్టి పట్టుతోకూడిన వైఖరిని అవలంబించే అవకాశం ఉంది. భారతదేశం మరింత సంయమనంతో వ్యవహరించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థాగత వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఢాకా డిమాండ్ చేయవచ్చు. అయితే స్మగ్లింగ్, అక్రమ రవాణా, సరిహద్దు ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో రెండు దేశాలకూ సమాన ప్రయోజనం ఉంది. మానవతా ఆందోళనలు- భద్రతా అవసరాల మధ్య సమతుల్యత సాధించడం ఇరువైపులకూ సవాల్గా మారనుంది.అవామీ లీగ్ హయాంలో బలపడిన ఉగ్రవాద వ్యతిరేక సహకారంలో వెనకడుగు ఉంటుందా అన్నదాన్ని భారత భద్రతా వ్యవస్థ జాగ్రత్తగా గమనిస్తోంది. బిఎన్పి ప్రకటించిన లౌకిక పరిపాలన, మైనారిటీల రక్షణ హామీలు తీవ్రవాద పునరుత్థానం భయాలను కొంతవరకు తగ్గించవచ్చు. కానీ మాటల కంటే దీర్ఘకాలిక సహకారమే పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. జాతీయ ప్రయోజనాపై దృష్టిపెట్టే బిఎన్పి ప్రభుత్వం, పరస్పర లాభదాయకమైన ఆర్థిక ఒప్పందాలను పూర్తిగా భంగం కలిగించే అవకాశం తక్కువ. అయితే వాణిజ్య లోటును సమతుల్యం చేయడం లేదా కొన్ని ప్రత్యేక నిబంధనలను పునఃసమీక్షించడం వంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఈ ఆందోళనలపై భారత్ ఎలా స్పందిస్తుందన్నదే భవిష్యత్ సంబంధాలను నిర్ణయించనుంది. భూభాగ పరిమితులు, ఆర్థిక సున్నితత్వం కలిగిన భారత్లోని ఈశాన్య ప్రాంతానికి ఢాకాతో స్థిర సంబంధాలు అనివార్యం. రవాణా మార్గాలు, ఇంధన సహకారం, నదీ మార్గ అనుసంధాన ప్రాజెక్టులు అన్నీ ఉన్నత స్థాయి రాజకీయ సత్సంకల్పంపై ఆధారపడి ఉన్నాయి. సంబంధాల్లో ఏదైనా ప్రతికూల మార్పు చోటుచేసుకుంటే అది ప్రాంతీయ స్థాయిలో ప్రభావమయ్యే ప్రమాదం ఉంది. బిఎన్పి విజయంతో బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యంలో ఉన్న చక్రాకార స్వభావం మరోసారి స్పష్టమైంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అధికారం తరచూ మారుతూ వస్తోంది. ఈ మార్పులు తరచూ కఠిన వ్యాఖ్యలు, వీధి నిరసలతో కూడి ఉంటాయి. అయితే పాలన బాధ్యతలు చేపట్టిన తర్వాత సిద్ధాంత భేదాలు కొంత మృదువవుతాయి. లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తూ, మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉంటానన్న తారిక్ రెహ్మాన్ హామీ సానుకూల ఆరంభంగా భావించవచ్చు. ఈ హామీలను విశ్వసనీయ విధానాలుగా అమలుచేస్తే, బంగ్లాదేశ్ అంతర్జాతీయ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. అలాగే పొరుగు దేశాలకు భరోసా కలుగుతుంది. భారత్తో సంబంధాల విషయంలో, ముఖ్యంగా షేక్ హసీనా ఆశ్రయం అంశం, అలాగే గంగా జల ఒప్పందం పునరుద్ధరణ వంటి సున్నితమైన విషయాల్లో రెహ్మాన్ తీసుకునే నిర్ణయాలు, సమీప భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాల దిశను నిర్ధారించనున్నాయి. ఢాకా -న్యూఢిల్లీ అనుబంధం కొత్త దశలోకి అడుగుపెడుతుండగా, మాటలకన్నా చర్యలే అసలు ప్రమాణంగా నిలవనున్నాయి. ఈ పరిణామాల మధ్య భారత్కు అవసరమైనది గతానుబంధాలపై ఆధారపడే చురుకైన దౌత్య చాతుర్యం. ఢాకాలో ఒక్క రాజకీయ పార్టీతోనే ప్రత్యేక అనుసంధానం కలిగిన యుగం ముగిసినట్లే కనిపిస్తోంది. బంగ్లాదేశ్ రాజకీయ వ్యవస్థలో ద్విపాక్షిక నమ్మకాన్ని పెంపొందించడం అత్యంత అవసరం. నిశ్శబ్ద దౌత్యం, విస్తృత ఆర్థిక సహకారం, ప్రజల మధ్య పరస్పర సంబంధాల బలోపేతం రాజకీయ విభేదాలను సమతుల్యం చేయగలవు. మొత్తానికి భారత్ -బంగ్లాదేశ్ సంబంధాలు తాత్కాలిక రాజకీయ మార్పులకు బందీగా ఉండలేనంత ప్రభావవంతంగా ఉంది. సరిహద్దులను దాటి ప్రవహించే నదులు ఎవరు అధికారంలో ఉన్నారన్నది చూడవు, వాణిజ్యం, వలసలు సమాజాలను దీర్ఘకాలికంగా బంధాలతో కట్టిపడేస్తాయి. పరస్పర గౌరవం, వాస్తవిక సమస్య, పరిష్కార దృక్పథం ఆధారంగా రెండు ప్రభుత్వాలు ముందుకు సాగితే, ఈ రాజకీయ మార్పు అనుమానాలతో కాకుండా వ్యూహాత్మక పరిపక్వతకు నాంది పలికే కొత్త అధ్యాయంగా మారవచ్చు. కాబట్టి బిఎన్పి విజయం కేవలం బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయ మార్పు మాత్రమే కాదు, అది మొత్తం ఉపఖండానికి ఒక పునఃసమీక్ష క్షణం. ఇది లోతైన సహకారానికి మార్గం వేస్తుందా, లేక మళ్లీ ఉద్రిక్తతలకు దారితీస్తుందా అన్నది రాబోయే నెలల్లో ఢాకా -న్యూఢిల్లీ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. గీతార్థ పాఠక్
18thfeb2026 |బుధవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
18thfeb2026 | బుధవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 18thfeb2026 |
సామాన్యులే కాకుండా ప్రభుత్వాలు సైతం అప్పులు లేనిదే ముందుకు వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అప్పులు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల గమనాన్ని నిర్దేశిస్తున్నాయి. సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక స్థిరత్వం కోసం దేశాలు చేస్తున్న అప్పులు అతి భారీ స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం 2025 -26 నాటికి ప్రపంచ దేశాల మొత్తం అప్పు 110.9 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ అప్పులో ఎక్కువ భాగం ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లోనే ఉండటం గమనార్హం. భారత దేశంలోని 147 కోట్ల మంది జనాభాలో ప్రతి ఒక్కరిపై ఈ ఏడాది మార్చి నాటికి రూ. 1.34 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇది వ్యక్తులు చేసిన అప్పు కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రుణం. అయినప్పటికీ ఈ సంవత్సరం (2026- 27) కూడా భారీ స్థాయిలో అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 14.61 లక్షల కోట్ల అప్పులు చేసిన కేంద్రం రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.17.2 లక్షల కోట్ల రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణం కంటే 17 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ. 53.47 లక్షల కోట్లకు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో మార్కెట్ నుంచి మొత్తం రూ. 17.2 లక్షల కోట్లు సేకరించాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2025 -26 సవరించిన అంచనాల ప్రకారం కేంద్రం మొత్తం అప్పులు రూ. 1,97,18,016 కోట్లు కాగా, మార్చి 2027 నాటికి ఇది 2,14,82,050 కోట్లకు చేరనుంది. ఇక జిడిపిలో రుణ నిష్పత్తిని 55.6 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవానికి ఈ నిష్పత్తి 2019లో 50 శాతంలోపే ఉంది. ఇక తాజా బడ్జెట్లో జిడిపిలో ద్రవ్యలోటును 4.3 శాతంగా అంచనా వేశారు. 2026 మార్చి 31 నాటికి భారత కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పులు రూ. 197.18 లక్షల కోట్లకు (సుమారు ట్రిలియన్ డాలర్లు) చేరుకుంటాయని అంచనా వేశారు. ఇది 2026 -27 ఆర్థిక సంవత్సరంలో మరింత పెరిగి రూ. 214.82 లక్షల కోట్లకు చేరవచ్చని బడ్జెట్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. 2024లో దేశం మొత్తం అప్పు సుమారు 85 శాతంగా ఉంది. 2026 వరకు దేశవ్యాప్త అప్పుల వివరాలు: కేంద్ర అప్పులు: 2025 -26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ. 197.18 లక్షల కోట్ల నుండి 2026 -27 నాటికి రూ. 214.82 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా. వ్యక్తిగత భారం: 2026 ప్రారంభానికి, దేశంలోని ప్రతి పౌరుడిపై సుమారు రూ. 1.34 లక్షల అప్పు (కేంద్రం చేసిన రుణాల ప్రకారం) ఉంది. ద్రవ్యలోటు : 2025- 26లో 4.4 శాతం , 2026 -27 నాటికి 4.3 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025- 26 నాటికి 56.1 శాతంగా ఉన్న అప్పు- జిడిపి నిష్పత్తిని, 2026- 27 నాటికి 55.6 శాతంకి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026 మార్చి నాటికి అప్పులు రూ. 7.46 లక్షల కోట్లకు చేరవచ్చనిఅంచనా వేశారు. 2026 -27 బడ్జెట్లో గ్రాస్ మార్కెట్ బోరోయింగ్ (మొత్తం అప్పులు) సుమారు రూ. 17.2 లక్షల కోట్లుగా అంచనా వేశారు.అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజా గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాల మొత్తం అప్పు 2025 నాటికి 110.9 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అత్యధిక అప్పులు ఉన్న దేశాల జాబితాలో అమెరికా తొలి స్థానంలో ఉండగా, భారతదేశం 3.36 ట్రిలియన్ డాలర్లతో ఏడవ స్థానంలో ఉంది. ప్రభుత్వం తన రుణ నిష్పత్తిని 56.1 శాతం నుండి 55.6 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ అప్పులు ఉన్న దేశంగా అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానంలో నిలిచింది. అమెరికా మొత్తం అప్పు 38.27 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ప్రపంచ మొత్తం అప్పులో మూడో వంతు కంటే ఎక్కువ కావడం గమనార్హం. నిరంతర బడ్జెట్ లోటు, పెరుగుతున్న వడ్డీ చెల్లింపులే ఇందుకు ప్రధాన కారణమని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా ఈ విషయంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ డ్రాగన్ దేశం 18.68 ట్రిలియన్ డాలర్ల అప్పుల ఊబిలో ఉంది. చైనా అప్పులు 2025లో 13.6% వృద్ధితో అత్యంత వేగంగా పెరుగుతున్నట్లు ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. రుణాల ఊబి జాబితాలో జపాన్ కూడా ఉంది. ఈ దేశం 9.83 ట్రిలియన్ డాలర్ల అప్పుతో 3వ స్థానంలో నిలిచింది. జపాన్ అప్పు దాని జిడిపిలో దాదాపు 230 శాతంగా ఉండటం ఆ దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక యూరప్ దేశాల్లోని యునైటెడ్ కింగ్డమ్ 4.09 ట్రిలియన్ డాలర్లతో 4వ స్థానం, ఫ్రాన్స్ 3.92 ట్రిలియన్ డాలర్లతో 5వ స్థానం, ఇటలీ 3.48 ట్రిలియన్ డాలర్లతో 6వ స్థానంలో నిలిచాయి. ఆయా దేశాల్లో సామాజిక సంక్షేమం, పింఛన్ల కోసం కోసం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఐఎంఎఫ్ నివేదికలో పేర్కొంది. అన్ని దేశాల మాదిరిగానే భారత్ కూడా అప్పులు ఇబ్బడిముబ్బడిగా తీసుకుంటోంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. దీంతో అభివృద్ధి పనుల కోసం చేసే ఈ అప్పు సాధారణమేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ఒక సానుకూల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దేశ అప్పుల నిష్పత్తిని జిడిపిలో 56.1 శాతం నుండి 55.6 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియా తర్వాత స్థానాల్లో జర్మనీ 3.23 ట్రిలియన్ డాలర్లు, కెనడా 2.60 ట్రిలియన్ డాలర్లు, బ్రెజిల్ 2.06 ట్రిలియన్ డాలర్ల అప్పులతో టాప్ 10 జాబితాలో నిలిచాయి. జర్మనీ ఆర్థిక క్రమశిక్షణ మారుపేరు. అయినప్పటికీ ఇంధన ఖర్చులు తదితర కారణాలతో అప్పుల పాలైంది. కెనడా, బ్రెజిల్ బడ్జెట్ లోటు, ప్రాంతీయ రుణాల కారణంగా అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. ఇస్కా రాజేష్ బాబు 93973 99298
ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) నేపథ్యంలో ఆంగ్ల వ్యామోహం పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాష పట్ల జిజ్ఞాస పెంపొందించవలసిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. 17 ఫిబ్రవరి 2026 మంగళవారం నాడు నిర్వహించిన పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలలో (ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్ -ఫిబ్రవరి 2026) ప్రథమ భాష తెలుగు పరీక్ష విద్యార్థుల స్థాయికి మించి ఉన్నది. పార్ట్ బి లో 10వ ప్రశ్న నగరం పదానికి వ్యుత్పత్తి అర్థం, 13వ ప్రశ్న కమలం వంటి ఆననం కలది, 16వ ప్రశ్న కింది వాటిలో శ్లేషాలంకారానికి ఉదాహరణ 20వ ప్రశ్న సాంబుడు తెలుగు చదివాడు. సాంబుడు పరీక్ష రాశాడు లాంటి అనేక ప్రశ్నలు గ్రాంథికంలో ఇవ్వడం వలన విద్యార్థులకు అర్థం కాకుండా అయోమయంలోపడ్డారు. తెలుగు వ్యావహారిక భాషలో ఉండాలని అనేక విశ్వవిద్యాలయాలు వ్యావహారిక భాషలో పరిశోధనలకే అవకాశం కల్పిస్తుంటే కొంతమంది ఛాందస భావాలతో తెలుగు అంటే గ్రాంథికమే అన్నట్లు మాట్లాడటం, రాయడం, ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. ద్వితీయ భాష తెలుగు పుస్తకాలలో కూడా గ్రాంథిక భాష ఉపయోగించడం విచారకరం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో) తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేశారు. పదవ తరగతి వరకు ప్రతి విద్యార్థి ప్రభుత్వ, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రయివేట్, మైనారిటీ, కేంద్రీయ విద్యాలయాలు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూల్లు, స్పోర్ట్ స్కూల్లు, పబ్లిక్ స్కూల్లు, త్రివిధ దళాల ఆధ్వర్యంలో నడిచే మిలిటరీ, నేవీ, ఆర్మీ అన్ని పాఠశాలల్లో మాతృ భాష తెలుగు కలిగిన విద్యార్థులు ప్రథమ భాష తెలుగును, మాతృ భాష తెలుగు కానివారు ద్వితీయ భాష తెలుగును తప్పనిసరిగా చదవాలనే ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. తెలుగు పాఠాలను సులభ శైలిలో రాసి తెలుగు భాష, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, తెలుగు సాహిత్యం పట్ల జిజ్ఞాస పెంపొందించేటట్లు రూపొందించాలి. అనేకమంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో) అనేక మంది 25, 30 సంవత్సరాల బోధన అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. అనుభవం కలిగిన, ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుల చేత తెలుగు పాఠ్యపుస్తకాలు రూపొందించడం, తెలుగు పరీక్ష పేపర్లను తయారు చేయించకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ, విశ్వవిద్యాలయాలలో బోధించే ఉపన్యాసకుల చేత, పదవీ విరమణ చేసిన ఆచార్యుల చేత పదవ తరగతి పరీక్ష పేపర్లు, తెలుగు పాఠ్యపుస్తకాలు రూపొందించడం ఎంతవరకు సమంజసమో అర్థంకావడం లేదని అనేక మంది సీనియర్ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రంగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎఐ) విస్తృతంగా దూసుకు వస్తున్న నేపథ్యంలో ఎఐ ఉపాధ్యాయులకు ఆల్టర్నేట్ (వారి స్థానాన్ని ఆక్రమిస్తుందా?) అనే చర్చ జరుగుతున్న నేటి తరుణంలో తెలుగు భాషను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో) అనేక తెలుగు మాధ్యమ పాఠశాలలు మూతపడ్డాయి. ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు పెరుగుతున్నాయి. ఇంటర్మీడియట్లో ద్వితీయ భాషగా తెలుగు తీసుకోకుండా సంస్కృతం, చైనీస్, రష్యన్ మిగితా భాషలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. తెలుగు ద్వితీయ భాషగా తీసుకుంటే మార్కులు రావని, సంస్కృతం, చైనీస్ ఇతర భాషలు తీసుకొని ఏది రాసినా మార్కులు వస్తాయని విద్యార్థులలో బాగా నాటుకుపోయింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో స్నాతకోన్నత స్థాయిలో ఐదు, ఆరు మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉండడం లేదు. విద్యార్థులు తెలుగు భాషను నేర్చుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఉండవని ఆంగ్ల భాషను అభ్యసిస్తున్నారు. తెలుగు భాషను సులభంగా బోధించడానికి అవకాశం మెండుగా ఉంది. తెలుగు సాహిత్యంలో వేమన, సుమతి, భాస్కర, కుమార, కుమారి, వీరబ్రహ్మం, దాశరథి అనేక శతకాలు సులభ శైలిలో ఉన్నాయి. గతంలో చదువుకున్న వారికే కాకుండా చదువురాని వారు అనర్గళంగా అనేక పద్యాలు కంఠతా వచ్చేవి. ప్రస్తుతం సాంకేతిక యుగంలో కంప్యూటర్, ఇంటర్నెట్, సెల్ ఫోన్ అభివృద్ధి చెందిన తరుణంలో గ్రాంథిక భాష కాకుండా వ్యావహారిక భాషలో ఉన్న పద్యాలు నిత్యజీవితంలో ఉపయోగపడే పద్యాలు, తెలుగు భాషపట్ల ఆసక్తి అభిరుచి కలిగే విధంగా తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు విద్యార్థులకు మాతృభాషలో సులభంగా బోధిస్తూ తెలుగు భాష పట్ల జిజ్ఞాస పెంపొందించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సిఇ ఆర్టిఇ) తెలుగు భాషను సులభంగా అర్థం చేసుకోవడానికి అనుకూలంగా అనేక ప్రయత్నాలు చేస్తుంది. విద్యార్థులకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కవుల, రచయితల పాఠాలను పాఠ్యపుస్తకాలలో పొందుపరిచింది. 2026 లో ఎప్పుడూ లేని విధంగా పదవ తరగతి విద్యార్థులకు అభ్యాస దీపికలు తయారు చేసి తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపిణీ చేసింది. ఒకటి నుండి ఐదో తరగతి వరకు వర్క్ బుక్స్ తయారు చేయించింది. ఆరు నుండి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు తెలుగును మరింత చేరువ చేయడానికి 2026 -27 విద్యా సంవత్సరంలో వర్క్ బుక్స్ పంపిణీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మార్చి నెలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు విషయ నిపుణుల చేత సందేహ నివృత్తి చేశారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు టి.షాట్లో విషయ నిపుణుల చేత లైవ్ ప్రోగ్రాం ప్రసారం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ తెలుగు భాషపట్ల ఆసక్తి అభిరుచి పెంపొందించడానికి ఎంతో కృషి చేస్తుంది. పరీక్షా పేపర్లను తయారు చేసే వారు విద్యార్థుల స్థాయికి స్థోమత కు తగినట్లుగా ఉండే విధంగా చూడాలని అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు భాష అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. డాక్టర్. శ్రీవాటి శ్రీనాథ్, 92908 26988
దానం అనర్హతపై నేడు స్పీకర్ విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులను విచారిస్తున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ బుధవారం నాడు దానం నాగేందర్ అనర్హత పిటీషన్పై విచారణ చేపట్టనున్నారు. అదేవిధంగా కడియం శ్రీహరి పిటీషన్పై కూడా ఈ నెల 19 గురువారం విచారణ జరుపునున్నారు. బిఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన దానం, కడియంల శాసనసభ్యత్వాలు రద్దు చేయాలని ఇదివరకే బిఆర్ఎస్ పార్టీ స్పీకర్ వద్ద పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ కొంతకాలానికే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన పార్టీ ఫిరాయించారనడానికి ఇంతకంటే పెద్ద సాక్షం ఏమి కావాలంటూ బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొంది. తాము పార్టీ ఫిరాయించలేదని దానం, కడియం అఫిడవిట్ను స్పీకర్కు దాఖలు చేశారు.
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధి లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి వచ్చే మార్చి చివరినాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాల సేకరణ ,అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఇన్చార్జీ మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్లతో కలిసి ఆయన సమీక్షించారు. పట్టణాల్లోని మురికివాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని ముఖ్యంగా హైదరాబాద్కు దూరంగా ఇళ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇళ్లు తీసుకోవడానికి పేదలు ఆసక్తి చూపడం లేదని హైదరాబాద్కు దూరంగా గతంలో 42వేల ఇళ్లను నిర్మించగా అందులో సగం మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో తేలిందని సమావేశంలో అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. 10 అంతస్థుల్లో ఇందిరమ్మ ఇళ్లు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా, వారి నివాస ప్రాంతాలకు దగ్గరగా స్థానిక పరిస్థితులను బట్టి ఐదు నుంచి 10 అంతస్థుల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ఆలోచన చేస్తున్నామని ,వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో వారి వారి ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి ఎన్ని ఇళ్లు నిర్మించవచ్చు, ఎంతమంది లబ్దిదారులు ఉన్నారన్న తదితర వివరాలతో పదిరోజుల్లో నివేదిక అందజేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. మురికివాడల్లో స్థలం ఉన్నవారు అంగీకరిస్తే ఆ ప్రాంతంలో జీప్లస్ 5 వరకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అభివృద్ది చేయాలన్న ఆలోచన చేస్తున్నామని జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరాయని వాటి స్థానంలో కూడా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే ఆలోచన చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. నెలాఖరులోగా 28వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇళ్ల స్థలాలు ఉన్న 28వేల మంది లబ్ధిదారులకు ఈనెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న, ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి మార్చి చివరినాటికి లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు లబ్దిదారులను గుర్తించి ఆ లబ్ధిదారులే ఆ ఇళ్లను పూర్తి చేసుకోవడానికి అంతకుముందు ఖర్చుచేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని మిగిలిన నిధులను హౌసింగ్ కార్పొరేషన్ నిధులను మంజూరు చేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు.
మాది ఫైటర్ల జాతి.. మీది ద్రోహుల జాతి
మన తెలంగాణ/హైదరాబాద్/ఎర్రవెల్లి : తెలంగాణ సాధించిన కెసిఆర్ను పట్టుకుని కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఏ జాతికి జాతిపిత అని ఎద్దేవా చేస్తున్నారని మండిపడ్డారు. తమది రాణీ రుద్రమ, సమ్మక్క సారక్క, దొడ్డి కొమురయ్య వంటి తెలంగాణ మహాపురుషుల జాతి అని పేర్కొన్నారు. తెలంగాణ మట్టితో మమేకమైన వారికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వారికి మాత్రమే జాతి అంటే ఏమిటో తెలుస్తుందని అన్నారు. కానీ, సమైక్యాంధ్ర సంచులు మోసిన వారికి జాతి గురించి ఏం తెలుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మాది కెసిఆర్ లాంటి ఫైటర్ల జాతి, వారిది ద్రోహుల జాతి. నా తండ్రి తెలంగాణ జాతికి హీరో అన్న విషయం వాస్తవం. కొంతమంది కెసిఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని అంటున్నారు. తెలంగాణనే కెసిఆర్ ఆనవాళ్లు అయినప్పుడు ఎలా చెరిపేస్తారు..? ఐకమత్యంగా కలిసికట్టుగా కదం తొక్కి మళ్లీ గులాబీ జెండా ఎగరేసి కెసిఆర్ను సిఎం చేయడమే జన్మదినం సందర్భంగా ఇచ్చే చిరుకానుక” అని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో మంగళవారం బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు హరీష్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 72 కిలోల కేక్ కట్ చేసి కెటిఆర్, హరీష్రావు ఒకరికొకరు తినిపించుకున్నారు. కెసిఆర్ ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పాలనపై తయారు చేసిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ వేడుకలలో పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఇటీవల ఓ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కెసిఆర్ది ఏ జాతి, ఎవరికి జాతిపిత అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. “ఏ జాతి అనే అల్పుడికి నేను చెబుతున్నా.. రాజ్యతంత్రం నడిపిన రుద్రమ జాతి మాది.. జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురంభీం, అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క, సారక్క, కోటల మీద జెండా ఎగురవేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయిపాపన్న, భూస్వాముల దోపిడి మీద కొట్లాడిన దొడ్డి కొమురయ్య, బరిలో బందూకు పట్టి దేశ్ముఖ్లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ, సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ, సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తుర్రెబాజ్ ఖాన్, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పుపాతర వేస్తామన్న కాళేజీ, నా తెలంగాణ కోటి రతనాల అన్న దాశరథి, విద్యార్థి అమరవీరుల జాతి మాది” అని కెటిఆర్ ఉద్ఘాటించారు. కెసిఆర్కు ప్రముఖుల శుభాకాంక్షలు బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ఎపి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎపి మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, కేంద్రమంత్రి బండి సంజయ్, పిసిసి అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మెగాస్టార్ చిరంజీవి, తదితరులు ఉన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఆస్ట్రేలియాలో ఘనంగా కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్,గోల్ కోస్ట్, బెండీగో, బల్లారాట్ నగరాలలో బిఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అధ్వర్యంలో కెసిఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు,అన్న దాన కార్యక్రమాలు చేశారు. బిఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో వినయ్ గౌడ్ సన్నీ ఆధ్వర్యంలో రక్త దాన కార్యక్రమం నిర్వహించారు. బ్రిస్బేన్లో విన్నీ తుముకుంట ఆధ్వర్యంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలలో రవీందర్ చింతామణి, రాహుల్ రాంపల్లి, రవి శంకర్ దుపాటి, పరశురాం మూతుకుల్లా, సాయి గుప్తా, యుగేందర్ అల్లం, సంతోష్ రెడ్డి మాడు, శ్రీ వేకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సినీ నటి ప్రత్యూష మృతి కేసు..నాలుగు వారాల్లో లొంగిపోండి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ టాలీవుడ్ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళ వారం తుది తీర్పును వెలువరించింది. రెండు ద శాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మ నోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మా సనం కీలక తీర్పును వెలువరించింది. సిద్ధార్థరెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఈ కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదని అభిప్రాయపడింది. సినీ నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23న మృతి చెందారు. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సిద్ధార్థరెడ్డి హైకోర్టులో సవాల్ చేయడంతో జైలు శిక్షను రెండేళ్లకు కుదించింది. హైకోర్టు తీర్పును ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇరువైపుల వాదనలు విన్నది. గత ఏడాది నవంబర్లో విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు, తీర్పును రిజర్వ్ చేసిం ది. ఈ కేసుకు సంబంధించి 24 ఏళ్ల తర్వాత మంగళవారం తీర్పును వెలువరిస్తూ, సిద్ధార్థరెడ్డిని లొంగిపోవాలని ఆదేశించింది. 2002లో తాను, ప్రత్యూష పురుగుల మందు తాగి ఆత్మహత్య కు ప్రయత్నించామని, తాను ఆసుపత్రిలో చికిత్స పొందడంతో ప్రాణాలతో బయటపడ్డానని సిద్ధార్థ రెడ్డి చెబుతున్నారు. తన కూతురు ఆత్మహత్యకు సిద్ధార్థరెడ్డి కారణమని సరోజిని ఆరోపించారు. ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7.308 గంటల మధ్య ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయా రు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. వారు కూల్డ్రింక్లో పురుగులమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫా స్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభు త్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై 306, 309 సెక్షన్ల కింద చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానా ను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పును ఇచ్చింది. దీనిపై సిద్ధార్థరెడ్డి తల్లి సరోజినిదేవీ 2012లో సుప్రీం కోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజిని స్పందన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె తల్లి సరోజిని స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, కానీ ప్రత్యూ ష మృతికి న్యాయం జరగలేదని అవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో నిందితుడికి యావజ్జీవ శిక్షపడుతుందని ఆశించినట్లు తెలిపారు. అప్పట్లో మునుస్వామి ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టును పరిగణలోకి తీసుకుని ఉంటే ఖచ్చితంగా శిక్షపడి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో తాను సంతృప్తి చెందలేదన్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, తనని అత్యాచారం చేసి చంపారని ఆమె ఆరోపించా రు. అన్యాయంగా ఒక నిండు ప్రాణాలను తీసి, తమ కుటుంబాన్ని ఇటువంటి పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. నిందితుడికి యావజీవ శిక్ష పడి ఉంటే ప్రత్యూష ఆత్మకు శాంతి కలిగేదని, తమ పోరాటానికి ఒక అర్థం ఉండేదన్నారు. అయిన్నప్పటికీ సుప్రీం కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్న ట్లు వెల్లడించారు.
భారత్ ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
న్యూఢిల్లీ/ముంబయి: ద్వైపాక్షిక సంబంధాల ను ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి తీసుకెళ్లాలని భారత్, ఫ్రాన్స్ నిర్ణయించుకున్నాయి. కీలక రంగాలైన రక్షణ, వాణిజ్యం, క్లి ష్టతర ఖనిజాలు సహా తదితర రంగాల్లో మరిం త సహకారం అందజేసుకోవాలని అవగాహన కు వచ్చాయి. మంగళవారంనాడు భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ముంబయిలో ని లోక్భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రోజురోజుకు పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ఫ్రాన్స్ సంబంధాలను ‘ప్రపంచ స్థిరత్వానికి శక్తి’ గా మోడీ, మేక్రాన్ అభివర్ణించారు. ఇరువురు నాయకులు ద్వైపాక్షిక చర్చల అనంతరం కర్నాటకలోని వేమాగల్లో ఎయిర్బస్ హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు. కీలకమైన ఖనిజాలు, రక్షణ, విస్తృత సాంకేతిక పరిజ్ఞానం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్యం వంటి రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు మొత్తం 21 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలలో ఒకటి రక్షణ సహకారంపై, మరొకటి భారతదేశంలో హామర్ క్షిపణులను ఉత్పత్తి చేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఫ్రెంచ్ రక్షణ దిగ్గజం సఫ్రాన్ మధ్య జాయింట్ వెంచర్గా ఉన్నాయి. భారత సైన్యం మరియు ఫ్రెంచ్ ల్యాండ్ ఫోర్సెస్ సంస్థలలో అధికారులను పరస్పరం మోహరించడానికి ప్రత్యేక ఒప్పందం కుదిరింది. అనిశ్చితిలో ఈ బంధం ప్రపంచానికి శక్తినిస్తుంది : మోడీ ‘ప్రపంచం అనిశ్చితిని ఎదుర్కొంటోంది. అటువంటి వాతావరణంలో భారతదేశం- ఫ్రాన్స్ భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి ఒక శక్తినిస్తుంది. మేము ఫ్రాన్స్ యొక్క నైపుణ్యం మరియు భారతదేశం యొక్క స్థాయిని మిళితం చేస్తున్నాము’ అని మోడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు దేశాలు ‘చాలా ప్రత్యేకమైన సంబంధాన్ని‘ పంచుకుంటున్నాయని, భారతదేశానికి అత్యంత పురాతన వ్యూహాత్మక భాగస్వాములలో ఫ్రాన్స్ ఒకటి అని ప్రధాని కితాబునిచ్చారు. హెచ్-125 హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ గురించి కూడా మోడీ ప్రస్తావించారు. ఇది ఇరుదేశాల నడము పరస్పర విశ్వాసానికి ఇది మరో అద్భుతమైన ఉదాహరణ అన్నారు. ఎవరెస్ట్ పర్వతం యొక్క ఎత్తులకు ఎగరగలిగే సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని ఏకైక హెలికాప్టర్ను భారతదేశం మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా తయారు చేస్తాయని చెప్పడానికి గర్విస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. వాటిని ఇక్కడి నుంచే ప్రపంచం మొత్తానికి కూడా ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. తద్వారా భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి సరిహద్దులు లేవని, అది లోతైన మహాసముద్రాల నుండి అత్యంత ఎత్తయిన పర్వత పంక్తుల వరకు చేరుకోగలదని మోడీ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి పరిణామాలు, ఉగ్రవాదంపై ప్రతిన... రష్యా-ఉక్రెయిన్ వివాదం, పశ్చిమ ఆసియా, ఇండో-పసిఫిక్ పరిస్థితులను ప్రస్తావిస్తూ... భారత్, ఫ్రాన్స్ రెండూ ప్రజాస్వామ్య విలువలను, చట్ట పాలనను, బహుళ ధ్రువ ప్రపంచాన్ని విశ్వసిస్తాయని ప్రధాని అన్నారు. ప్రపంచ స్థాయి సంస్థల్లో సంస్కరణలతోనే సవాళ్లకు పరిష్కారాలను కనుగొనగలమని తాము భావిస్తున్నట్లు పరోక్షంగా ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి మోడీ చెప్పారు. ఉక్రెయిన్, పశ్చిమ ఆసియా సహా అన్ని ప్రాంతంలో శాంతి కోసం చేసే ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తూనే ఉంటామన్నారు. భారతదేశం-ఇయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఒక ‘మలుపు’గా అభివర్ణించారు. పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఇరు దేశాల ప్రజలు. కంపెనీలు రెట్టింపు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉండటానికి ఒప్పందంపై సంతకం చేశామని, ఈ కార్యక్రమాలన్నీ పరస్పర వాణిజ్యం, పెట్టుబడులు మరియు చలనశీలతకు కొత్త ప్రేరణను ఇస్తాయని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది భారత్, ఫ్రాన్స్ దేశాల సంక్షేమానికి రోడ్ మ్యాప్ అని అన్నారు. ఈ సందర్భంగా ‘ఇండియాఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’ను కూడా ప్రారంభించారు. భారత్ మా విశ్వసనీయ భాగస్వామి : మేక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ భారత్ తమ అత్యంత విశ్వసనీయ భాగస్వాములలో ఒకటి అని అన్నారు. ‘రాఫెల్ జెట్ల నుండి జలాంతర్గాముల వరకు రక్షణ సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాలు చట్టబద్ధమైన పాలనను గట్టిగా విశ్వసిస్తాయని, ఇది గత కొన్ని సంవత్సరాలుగా నిరూపించబడిందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, ఫ్రాన్స్ సహకారాన్ని కొనసాగిస్తాయని మేక్రాన్ అన్నారు. విమానం దిగగానే జాగింగ్.. 26/11 మృతులకు నివాళి.. మంగళవారంనాడు ఉదయాన్నే ముంబై విమానాశ్రయంలో దిగిన మేక్రాన్ దంపతులు ఇక్కడి ప్రఖ్యాత మెరైన్ డ్రైవ్లోని తీరప్రాంత రోడ్డు జాగింగ్ చేశారు. అంనతరం అక్కడి నుంచి తాజ్ ప్యాలెస్ హోటల్కు చేరుకున్నారు. అక్కడ ముంబై ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముంబై పోసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు విమానాశ్రయంలో మేక్రాన్కు మహారాష్ట్ర గవర్నర్ దేవవ్రత్, సిఎం ఫడ్నవీస్ ఆహ్వానం పలికారు.
బుధవారం రాశి ఫలాలు (18-02-2026)
మేషం ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి. వృషభం ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతాయి. మిధునం ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కర్కాటకం వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. సింహం స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తుల నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. వృశ్చికం గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధన సంబంధ వ్యవహారాలు కలిసివస్తాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు రెట్టించిన ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమౌతాయి. అన్ని వైపుల నుండి అదాయం అందుతుంది. మకరం పాత రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. కుంభం చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వ్యాపారములు మందకొడిగా సాగుతాయి. మీనం ఆప్తులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. గృహమున శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలలో ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.
మెదక్ కలెక్టర్కు ఆరునెలల జైలు
కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్కు జైలుశిక్ష పడింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంటూ హైకోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అనంతరం తీర్పు అమలుకు నాలుగు వారాల పాటు నిలిపివేసింది. అప్పీలు చేసుకునేందుకు కలెక్టర్కు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
ఎన్టీఆర్, రుక్మిణి వసంత్ రొమాంటిక్ సాంగ్..
కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, స్టార్ హీరో ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్) పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే వచ్చే వారం హీరో హీరోయిన్లు ఎన్టీఆర్, రుక్మిణి వసంత్ కాంబినేషన్లో ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణకు మూవీ యూనిట్ ప్లాన్ చేసిందట. జోర్డాన్ లో ఈ సాంగ్ ఘాట్ చేయనున్నారు. భారీ స్థాయిలో, భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోర్డాన్లో చేస్తున్నారు మేకర్స్. అక్కడ మూడు షెడ్యూల్స్ చిత్రీకరిస్తారట. ఇందులోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ జోర్డాన్ షూటింగ్తో ఈ చిత్రానికి సంబంధించిన ఔట్ డోర్ షూటింగ్ పూర్తవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అవుట్డోర్లో చిత్రీకరించే ఈ జోర్డాన్ షెడ్యూల్ ఆఖరిదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మిగిలిన షూటింగ్ను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్లో చిత్రీకరించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది.
నూతన ఆవిష్కరణలకు ఎఐ నిబంధనలు చాలు: కేంద్ర మంత్రి జితిన్
న్యూఢిల్లీ: దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ ముఖ్య ఉద్దేశం అతిగా నియంత్రించడం కాదని, బాధ్యతాయుతమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడమేనని, ప్రస్తుతానికి ఉన్న నియంత్రణలు దేశంలో ఆవిష్కరణల మద్దతుకు సరిపోతాయని కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద మంగళవారం వెల్లడించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ న్యూఢిల్లీ సింపోజియం 2026 వద్ద ఆయన ప్రసంగిస్తూ సాంకేతిక రూపాంతర ప్రయోజనాలను ప్రతివారూ పొందాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్అని వివిధ సాంకేతిక ఆవిష్కషరణల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోసహా అనేక అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. జితిన్ ప్రసాద ఎలెక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక , వాణిజ్య, పారిశ్రామిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఎఐకి సంబంధించి విధానపరమైన నిబంధనలను అతిగా నియంత్రించడం కాదని,బాధ్యతాయుతంగా ఆవిష్కరణలకు ప్రోత్సహించడానికి ప్రస్తుత నియంత్రణలు సరిపోతాయన్నారు. 2027 నాటికి ఎఐ, అండ్ క్లౌడ్లో 2,50,000 మందికి నైపుణ్యం కల్పించాలన్న లక్షంతో వ్యూహాత్మక సమన్వయంలో ప్రవేశిస్తున్నట్టు ఎడబ్లుఎస్ అండ్ ఇండస్ట్రీ బాడీ నాసాకామ్ వెల్లడించింది.
. రూపాయితోపాటు మోదీ గ్రాఫ్ పతనం. ఈయూ, అమెరికాతో ఒప్పందాలు భారత్కే నష్టం. ఎన్డీఏ పాలనలో అప్ప్పులపాలైన దేశం. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో రామకృష్ణ. ఎలాంటి పోరాటానికైనా రైతులు సిద్ధం: వెంకయ్య. సమస్యను గాలికొదిలేసి లడ్డూ రాజకీయం. మత విభజన రాజకీయాలపై పోరాడతాం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – కాకినాడ : ఆరఎసఎస్, బీజేపీ, ప్రాని మోదీకి వ్యతిరేకంగా పోరాడటానికి సరైన తరుణమిదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. దేశంలో […] The post మోదీపై పోరుకు తరుణమిదే! appeared first on Visalaandhra .
ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు
పొరపాటుగా ఇచ్చిన స్టేతో ఎంజాయ్ చేశారు… సరిచేస్తున్నాం . ట్రయల్ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందే. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. డిశ్చార్జి పిటిషన్ తిరస్కరించిన సుప్రీం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలైన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని (డిశ్చార్జ్) ఆమె పెట్టుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. గతంలో […] The post ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు appeared first on Visalaandhra .
మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం . చైర్మన్ తిరస్కరణ… పోడియం ఎక్కి నినాదాలు. అడుగడుగునా వాయిదాలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నెయ్యి సరఫరా అంశంపై శాసనమండలి మంగళవారం దద్దరిల్లింది. దీనిపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కల్తీ నెయ్యిపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం […] The post ఇందాపూర్ నెయ్యిపై రగడ appeared first on Visalaandhra .
శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు విశాలాంధ్ర-సచివాలయం: వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఆఫీసుకు వెళ్లకుండా జీతం అడిగితే ఎలా ఉంటుందో, ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడం కూడా అలాగే ఉంటుందని, ఇలాంటి వారిని వెనక్కి పిలిపించే ‘రైట్ టు రీకాల’ విధానం మన దేశంలో రావాలని అభిప్రా యం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో మీడియా చిట్ చాట్లో […] The post పని చేయని వారికిజీతాలెందుకు? appeared first on Visalaandhra .
నటి ప్రత్యూష మృతి కేసుపై సుప్రీం తీర్పు న్యూదిల్లీ : రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం… నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది. […] The post సిద్ధార్థరెడ్డి… లొంగిపో appeared first on Visalaandhra .
. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ప్రధాని మోదీ చర్చలు. రఫేల్ డీల్ సహా 20 ఒప్పందాలపై సంతకాలు. రక్షణరంగం , ఏఐ టెక్నాలజీ , స్పేస్ టెక్నాలజీ రంగంలో కలిసి పనిచేయాలని నిర్ణయం. కర్నాటకలో హెచ్-125 హెలికాప్టర్ల తయారీ ప్రారంభం ముంబై: భారత్-ఫ్రాన్స్ల మధ్య బలమైన స్నేహబంధం ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఎంతో అనిశ్చితి ఉందని, భారత్-ఫ్రాన్స్లు దీనికి పరిష్కారం చూపిస్తున్నాయన్నారు. ప్రపంచ శాంతికి కృషి చేస్తామని ప్రధాని మోదీ […] The post కీలక రంగాల్లో భాగస్వామ్యం appeared first on Visalaandhra .
ట్రంప్ వాషింగ్టన్: గజాలో మానవతావాద, పునర్నిర్మాణ యత్నాల కోసం ఐదు బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయం అందించేందుకు ‘శాంతి బోర్డు’లోని సభ్యదేశాలు హామీ ఇచ్చాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. బోర్డు సభ్యులు మొట్టమొదటిసారి గురువారం వాషింగ్టన్లో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రకటన చేశారు. ఆ సమావేశంలో సాయంపై ప్రకటన ఉంటుందని ‘ట్రూత’లో పోస్ట్ చేశారు. గజాలో భద్రత, శాంతి కోసం ఏర్పాటు చేసే అంతర్జాతీయ స్థిరీకరణ దళం, స్థానిక పోలీసింగ్ వ్యవస్థ […] The post గజాకు ఐదు బిలియన్ డాలర్ల సాయం appeared first on Visalaandhra .
ప్రపంచ దేశాల అభ్యున్నతికిభారత్ అందిస్తున్న సాయం మాకు కీలకం
ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరెస్న్యూయార్క్: ప్రపంచ శాంతిభద్రతలు, వికాసం సహా అన్ని ఐక్యరాజ్యసమితి విభాగాల్లో భారత్ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తోందని… అంతర్జాతీయ సమాజం అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సహాయం తమకెంతో ముఖ్యమైందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్రను పోషించే అత్యంత సానుకూల ట్రెండ్ నడుస్తోందని ఆయన చెప్పారు. భారత్ నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ – 2026 […] The post ప్రపంచ దేశాల అభ్యున్నతికిభారత్ అందిస్తున్న సాయం మాకు కీలకం appeared first on Visalaandhra .
ప్రపంచ తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
న్యూదిల్లీ: టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న ఆయన, అతి త్వరలోనే ‘తొలి ట్రిలియనీర’ హోదాను దక్కించుకోను న్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ముగిసేలోపే మస్క్ ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మస్క్ నికర ఆస్తుల విలువ 850 బిలియన్ డాలర్లకు చేరింది. ఫిబ్రవరి నాటికి 800 బిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి వ్యక్తిగా […] The post ప్రపంచ తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్ appeared first on Visalaandhra .
టీ20 ప్రపంచ కప్ లో చరిత్ర సృష్టించిన కెనడా ఓపెనర్..
చెన్నై: టి20 ప్రపంచకప్లో కెనడా బ్యాటర్ చరిత్ర సృష్టించాడు. మంగళవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కెనడా ఓపెనర్ యువరాజ్ సమ్రా కళ్లు చెదిరే శతకం సాధించాడు. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న యువరాజ్ 65 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 110 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టి20 ప్రపంచకప్లో అతి చిన్న వయసులో సెంచరీ సాధించిన క్రికెటర్గా నయా రికార్డు సృష్టించాడు. మరో ఓపెనర్గా దిల్ప్రిత్ బజ్వా (36) అతనికి అండగా నిలిచాడు. దీంతో కెనడా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 15.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. రచిన్ రవీంద్ర 39 బంతుల్లో 59, గ్లెన్ ఫిలిప్స్ 36 బంతుల్లోనే అజేయంగా 76 పరుగులు చేసి జట్టును గెలిపించారు. ఈ గెలుపుతో కివీస్ సూపర్8కు చేరుకుంది.
జోర్డాన్లో ఎన్టీఆర్`రుక్మిణిపైపాట చిత్రీకరణ
హైదరాబాద్: ప్రశాంత్ నీల్`ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్) పై తాజా కబురు వినిపిస్తోంది. వచ్చే వారం ఎన్టీఆర్, రుక్మిణి వసంత్ మధ్య ఓ పాట చిత్రీకరణకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. జోర్డాన్లో ఈ పాట ఘాట్ చేయనున్నారు. భారీ స్థాయిలో, భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా ఉంటాయంటున్నారు. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం […] The post జోర్డాన్లో ఎన్టీఆర్`రుక్మిణిపైపాట చిత్రీకరణ appeared first on Visalaandhra .
నాని పుట్టినరోజు కానుకగా... 'ఆయా షేర్' వచ్చేస్తోంది
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన పాన్ వరల్డ్ సినిమా ‘ది ప్యారడైజ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి భారీ కాన్వాస్ పై నిర్మిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి. తాజాగా మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వేడుకలకు టీమ్ సిద్ధమవుతోంది. అదే రోజున చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గూస్బంప్స్ తెప్పించే ఈ ఇంట్రడక్షన్ ట్రాక్తో సినిమా ప్రమోషన్స్కు ఘనమైన ఆరంభం ఇవ్వబోతున్నారు మేకర్స్. ఈ పాటను వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో చిత్రీకరించారు. నాని మాసీ అవతార్లో కనిపించే ఈ సాంగ్ కోసం రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ పవర్ఫుల్ మాస్ ట్యూన్ అందించారు. సుధన్ మాస్టర్ డైనమిక్ కొరియోగ్రఫీలో ఈ ట్రాక్ విజువల్ వండర్గా అలరించబోతోంది. అభిమానులకు ఇది బర్త్డే ట్రీట్గా మారనుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ది ప్యారడైజ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాల్, స్పానిష్, ఇంగ్లీష్ భాషలలో పాన్-వరల్డ్ మూవీగా గ్రాండ్గా రిలీజ్ కానుంది.
134 సినిమాల పాటలపై ఇళయరాజాకు హక్కులేదు
స్పష్టం చేసిన దిల్లీ హైకోర్టున్యూదిల్లీ: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా `సరిగవ ఆడియో సంస్థతో కొనసాగుతున్న హక్కుల వివాదంపై కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతో ఈ అంశం సినీ, సంగీత వర్గాల్లో చర్చకు దారి తీసింది. తుది తీర్పు వెలువడే వరకు 134 సినిమాలకు చెందిన పాటలను ఇళయరాజా వినియోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. గత సంవత్సరం ‘అగత్యా’ సినిమాలోని ఓ పాట విషయంలో ఇళయరాజా-సరిగమ మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి ఈ వివాదం […] The post 134 సినిమాల పాటలపై ఇళయరాజాకు హక్కులేదు appeared first on Visalaandhra .
కివీస్కు ‘సూపర్-8’ బెర్త్ ఖరారు
కెనడాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం చెన్నై: టీ20 ప్రపంచకప్లో గ్రూప్డి నుంచి న్యూజిలాండ్ సూపర్-8 దశలోకి ప్రవేశించింది. మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్లో కివీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సూపర్8 బెర్త్ను ఖాయం చేసుకుంది. గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కివీస్ సునాయాసంగా గెలుపొందింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెనడా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యువరాజ్ […] The post కివీస్కు ‘సూపర్-8’ బెర్త్ ఖరారు appeared first on Visalaandhra .
ప్రజాభవన్ ఎదుట జాగృతి నాయకుల ధర్నా
మహిళలు, వృద్ధులు, వికలాంగులు సహా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు మంగళవారం ప్రజా భవన్ ముట్టడించారు. బేగంపేటలోని ప్రజాభవన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్రజాభవన్లో ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్కు వినితి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ మహిళలకు రూ.2,500, తులం బంగారం, పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవి ఇచ్చే విధంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చొరవ తీసుకోవాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు ఈ ఎన్నికల్లో సహకారమే తొలిమెట్టని అన్నారు. మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్లో హామీలకు నిధులు కేటాయించాలని, లేకుండా సెక్రటేరియేట్, అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో మేము చెప్పినట్లుగానే బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని తెలిపారు. నారాయణ్ పేట్ లో తమకు వైస్ ఛైర్మన్ పదవి రావాల్సి ఉండేదని, కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు దిగి వైస్ చైర్మన్ పదవి రాకుండా చేశారని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, వాటిని అడిగేందుకే ప్రజావాణికి వచ్చామని తెలిపారు. తమ కార్యకర్తలు, విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నెల 26వ తేదీ వరకు వేచి చూస్తామని, తర్వాత అన్ని జిల్లాల్లో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మహిళలను కోటిశ్వరులను చేస్తామని చెప్పి కనీసం వారికి రూ. 2,500 కూడా ఇవ్వడం లేదని అన్నారు.
తొలిబంతికే భారీషాట్ అవసరమా?… ఓ సింగిల్ తీసిచూడు
అభిషేక్శర్మకు గవాస్కర్ సలహాన్యూదిల్లీ : టీమిండియా టీ20 ఓపెన్ అభిషేక్ శర్మ బ్యాటింగ్లో తడబడుతుండటంపై భారత క్రికెట్ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. అతడికి ఓ విలువైన సూచన చేశాడు. తాను ఎదుర్కొంటున్న తొలి బంతినే బౌండరీ దాటించాలని భారీ షాట్కు ప్రయత్నిం చకుండా సింపుల్ షాట్తో ఓ సింగిల్ తీయాలని సూచించాడు. అప్పుడు అతడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుం దన్నాడు. ‘అభిషేక్ శర్మకు నేనిచ్చే సలహా ఏంటంటే.. అతడు మొదట సింగిల్ తీయాలి అంతే. అప్పుడు […] The post తొలిబంతికే భారీషాట్ అవసరమా?… ఓ సింగిల్ తీసిచూడు appeared first on Visalaandhra .
బాన్సువాడ లో కారు అద్దాలు పగలగొట్టి..రూ.8 లక్షలు చోరీ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం ఒక వ్యక్తి కారులో ఉంచిన రూ. 8 లక్షల నగదు చోరీకి గురైంది.మాధవరావు అనే వ్యక్తి నగదును కారులో ఉంచి బాన్సువాడలోని రిలయన్స్ మార్కెట్ వద్ద కారును పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. బాధితుడు షాపింగ్కు వెళ్లిన తక్కువ సమయంలోనే దొంగలు సినీ ఫక్కీలో కారు అద్దాలు పగులగొట్టి లోపల ఉన్న నగదు సంచిని ఎత్తుకెళ్లారు. షాపింగ్ ముగించుకుని తిరిగి వచ్చిన మాధవరావు కారు అద్దం పగిలి ఉండటం చూసి షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా..పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సిసిటివి పుటేజిలో ఓ వ్యక్తి కారు అద్దాలు పగలగొట్టి నగదు బ్యాగ్ ను ఎత్తుకెళ్లడం రికార్డు అయ్యింది. మాధవరావు ఎస్బిఐ (SBI) బ్యాంకు నుండి రూ. 8 లక్షలు విత్ డ్రా చేశాడు. దొంగలు బ్యాంకు నుండి బాధితుడిని వెంబడించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతకటం ప్రారంభించారు.
Vishal gets a Setback from Madras High Court
Tamil actor Vishal has been struggling to deliver a decent hit. At the same time, he is involved in several legal tussles because of the financial commitments. The Madras High Court has refused to grant more time for Vishal in a loan case that is filed by Lyca Productions. To deposit Rs 10 crores, Vishal […] The post Vishal gets a Setback from Madras High Court appeared first on Telugu360 .
నేటి నుంచి ఏపీ లో శనగల కొనుగోళ్లు షురూ
15 రోజుల లోపు రైతులకు నగదు చెల్లింపులు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు
ଫ୍ୟାକ ଚେକ୍: ପାକିସ୍ତାନ କ୍ରିକେଟ ବୋର୍ଡ କୁ ପ୍ରଶଂସା କରୁଥିବା ଶଶୀ ଥରୁରଙ୍କ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ଅଟେ
ଟି-୨୦ ବିଶ୍ବକପରେ ପାକିସ୍ତାନକୁ ହରାଇ ଟିମ୍ ଇଣ୍ଡିଆର ବଡ଼ ବିଜୟ । ୬୧ ରନରେ ମ୍ୟାଚ୍ ଜିତିଲା ଟିମ୍ ଇଣ୍ଡିଆ, ୧୭୬ ରନକୁ ପିଛା କରି ୧୧୪ ରନରେ ପାକିସ୍ତାନ ଅଲଆଉଟ୍ । ସବୁ ଆଡ଼େ ଛୁଟିଛି ଟିମ ଇଣ୍ଡିଆକୁ ଶୁଭେଚ୍ଛାର ସୁଅ । କ୍ରିକେଟିୟର ହୁଅନ୍ତୁ କି ରାଜନେତା ସମସ୍ତଙ୍କ ମୁହଁରେ ଟିମ ଇଣ୍ଡିଆର ପ୍ରଶଂସା । ତେବେ ଇତିମଧ୍ୟରେ କଂଗ୍ରେସ ନେତା ତଥା ଏବଂ ତିରୁବନ୍ତପୁରମର ସାଂସଦ ଶଶି ଥରୁରଙ୍କ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଶଶି, ପାକିସ୍ତାନ କ୍ରିକେଟ୍ ବୋର୍ଡର ପ୍ରଶଂସା କରୁଥିବାର ଶୁଣିବାକୁ ମିଳିଛି । । ମୁଁ ଭାବୁଛି ଯେ, ପାକିସ୍ତାନ କିପରି ଖେଳିଲା ତାହା ପ୍ରକୃତରେ ଚମତ୍କାର । ମୁଁ ଜାଣିନାହିଁ ଯେ ସେମାନେ ପଡ଼ିଆରେ କ'ଣ କରିବେ । କିନ୍ତୁ ସେମାନେ କୂଟନୈତିକ ଭାବରେ ଯାହା କଲେ ତାହା ସମ୍ପୂର୍ଣ୍ଣ ଚମତ୍କାର । ଭାରତୀୟ କ୍ରିକେଟ୍ ବୋର୍ଡ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ହାତ ମୁଠାଏ ହୋଇଯାଇଥିଲା । ପାକିସ୍ତାନ ଯାହା କରିଛି, ମୁଁ ଏଥିପାଇଁ ସେମାନଙ୍କୁ ପ୍ରଶଂସା କରିବାକୁ ଚାହୁଁଛି, ଏହା କଳ୍ପନା କରାଯାଇ ପାରିବ ନାହିଁ। ବୋଲି ଶଶି କହୁଥିବାର ଶୁଣିବାକୁ ମିଳୁଛି । ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇ ନାହାଁନ୍ତି ଶଶି ଥରୁର । ଭାଇରାଲ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ହୋଇଥାଇ ପାରେ । ଶଶି ଥରୁରଙ୍କ ମୁହଁରୁ ପାକିସ୍ତାନ କ୍ରିକେଟ ବୋର୍ଡ ପାଇଁ ପ୍ରଶଂସା ଲେଖି ଆମେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ହେଲେ କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମରେ ଏନେଇ କୌଣସି ଖବର ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଶଶି ଦେଖିଥାନ୍ତେ ନିଶ୍ଚିତଭାବେ ଏହା କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଭାଇରାଲ ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ସୋସିଆଲ ମିଡିଆ ଏକ୍ସରେ ପୋଷ୍ଟ ହୋଇଥିବାର ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୧୦ ଫେବୃଆରୀ ୨୦୨୫ରେ ନ୍ୟୁଜ ଏଜେନ୍ସି ଏଏନଆଇ ଉକ୍ତ ଭିଡିଓକୁ ପୋଷ୍ଟ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଭିଡିଓରେ ଶଶି କହିଛନ୍ତି, ମୁଁ ଜଣେ ରାଜନେତା, କିନ୍ତୁ ମୁଁ କ୍ରିକେଟ ଏବଂ କ୍ରୀଡାରେ ରାଜନୀତି ପସନ୍ଦ କରେ ନାହିଁ । ମୁଁ ଭାବୁଛି କ୍ରୀଡା ଏକ ଭିନ୍ନ କ୍ଷେତ୍ର, ଏକ ଭିନ୍ନ ଖେଳ। ରାଜନେତା ମାନେ ତାଙ୍କ ସ୍ଥାନରେ ରହି ରାଜନୀତି କରନ୍ତୁ, କୂଟନୀତିଜ୍ଞମାନେ ତାଙ୍କ ସ୍ଥାନରେ ରହି ତାଙ୍କ କାମ କରନ୍ତୁ ଏବଂ କ୍ରିକେଟ ଖେଳାଳିମାନେ ସେମାନଙ୍କର ଖେଳ ଖେଳନ୍ତୁ। ମୁଁ ଖୁସି ଯେ ଏହି ମ୍ୟାଚ୍ ସହିତ ଅତି କମରେ କ୍ରିକେଟ୍ ଆଗକୁ ବଢ଼ିବ। କିଏ ଜିତିବ, କିଏ ହାରିବ, ତାହା ଅନ୍ୟ କଥା... ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ପରି ପରିଲକ୍ଷିତ ହେଉଥିବାରୁ ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ବ୍ୟକ୍ତିର ଗୋଟିଏ ସମୟର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ହେଲେ ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ଉକ୍ତ ଭିଡିଓର ଅଡିଓ ସମାନ ନଥିଲାକି ଶଶିଙ୍କ ବାର୍ତ୍ତା ଶୈଳୀ ସହ ତାଙ୍କ ଅଡିଓ ମଧ୍ୟ କୌଣସି ତାଳମେଳ ରହୁନଥିଲା । ପରେପରେ ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ଓ ମିଟରରେ ପରୀକ୍ଷା କରିଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓଟି ବହୁମାତ୍ରାରେ ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ରିପୋର୍ଟ ପ୍ରକାଶ ପାଇଥିଲା । ଭାଇରାଲ ଭିଡିଓ ନେଇ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ଶଶି ଥରୁର ଲେଖିଛନ୍ତି, ଏହା ଏକ ଫେକ୍ ଭିଡିଓ ଯାହାକି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ । ଏହା ମୋ ସ୍ୱର ନୁହେଁ କି ମୋ ଭାଷା ମଧ୍ୟ ନୁହେଁ । ସେହିପରି ରେଡ଼ଲିଫ ନାମକ ଏକ ଡିଜିଟାଲ ଗଣମାଧ୍ୟମ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ଭିଡିଓକୁ ସେୟାର କରି ଏହା ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ସୂଚନା ରଖିଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ହୋଇଥାଇପାରେ । ପ୍ରକୃତ ଭିଡିଓରେ ପାକିସ୍ତାନ କ୍ରିକେଟ ବୋର୍ଡକୁ ପ୍ରଶଂସା କରି ନାହାଁନ୍ତି କଂଗ୍ରେସ ନେତା ଶଶି ଥରୁର ।
అల్లు అర్జున్పై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పిన కావేరి బరూవా #AlluArjun #Tollywood #SocialMedia
‘మరకతమణి 2’ వచ్చేస్తోంది.. ఈసారి డబుల్ కామోడీ, థ్రిల్లర్ గా..
2017లో విడుదలై తన మ్యాజికల్ కాన్సెప్ట్, కామెడీతో ఫాంటసీ కామెడీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం మరకతమణి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ ‘మరకతమణి 2’ అధికారికంగా ప్రారంభమైంది. శివరాత్రి శుభ సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. హీరో కార్తీ క్లాప్ కొట్టగా, హీరో ఆర్య, దర్శకుడు వెంకట్ ప్రభు కెమెరా రోలింగ్, యాక్షన్ అంటూ షూటింగ్ ప్రారంభించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో అనుబంధం వున్న అనేక మంది ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్యాషన్ స్టూడియోస్, దంగల్ టీవీ, ఆర్డిసి మీడియా, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, గుడ్ షో బ్యానర్లపై సుధన్ సుందరం, మనీష్ సింఘాల్, దుర్గారం చౌదరి, దేవ్, కెవి దురై నిర్మిస్తున్న ఈ చిత్రానికి గత బ్లాక్ బస్టర్ ‘మరకతమణి’కి దర్శకత్వం వహించిన ఎఆర్కె శరవణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరకతమణి 2లో ఆది పినిశెట్టి, సత్యరాజ్, ప్రియా భవాని శంకర్, నిక్కీ గల్రానీ పినిశెట్టి, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ, అరుణ్రాజా కామరాజ్, మురుగానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరకతమణి 2 మరింత వినోదం, మ్యాజిక్, థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.
మున్సిపల్ వైస్ చైర్మెన్ వెంకన్న గుప్తా కు ఆత్మీయ సన్మానం
మున్సిపల్ వైస్ చైర్మెన్ వెంకన్న గుప్తా కు ఆత్మీయ సన్మానం మోత్కూరు, ఆంధ్రప్రభ:
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మోత్కూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ తొలి
భారత్-ఫ్రాన్స్ బంధానికి సరిహద్దుల్లేవు: ప్రధాని మోడీ
ఇరుదేశాల స్నేహం ప్రపంచ స్థిరత్వానికి శక్తి ఇయుతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలక మలుపు ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు భారత్ మా విశ్వసనీయ భాగస్వామి రాఫెల్ టు జలాంతర్గాముల వరకు బంధాన్ని విస్తరిస్తున్నాం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వెల్లడి వివిధ రంగాల్లో 21 ఒప్పందాలపై సంతకాలు కర్నాటకలో ఎయిర్బస్ హెచ్125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైన్కు వర్చువల్గా ప్రారంభం న్యూఢిల్లీ/ముంబయి : ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి తీసుకెళ్లాలని భారత్, ఫ్రాన్స్ నిర్ణయించుకున్నాయి. కీలక రంగాలైన రక్షణ, వాణిజ్యం, క్లిష్టతర ఖనిజాలు సహా తదితర రంగాల్లో మరింత సహకారం అందజేసుకోవాలని అవగాహనకు వచ్చాయి. మంగళవారంనాడు భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ముంబయిలోని లోక్భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రోజురోజుకు పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ఫ్రాన్స్ సంబంధాలను ‘ప్రపంచ స్థిరత్వానికి శక్తి’ గా మోడీ, మేక్రాన్ అభివర్ణించారు. ఇరువురు నాయకులు ద్వైపాక్షిక చర్చల అనంతరం కర్నాటకలోని వేమాగల్లో ఎయిర్బస్ హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు. కీలకమైన ఖనిజాలు, రక్షణ, విస్తృత సాంకేతిక పరిజ్ఞానం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్యం వంటి రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు మొత్తం 21 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలలో ఒకటి రక్షణ సహకారంపై, మరొకటి భారతదేశంలో హామర్ క్షిపణులను ఉత్పత్తి చేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఫ్రెంచ్ రక్షణ దిగ్గజం సఫ్రాన్ మధ్య జాయింట్ వెంచర్గా ఉన్నాయి. భారత సైన్యం మరియు ఫ్రెంచ్ ల్యాండ్ ఫోర్సెస్ సంస్థలలో అధికారులను పరస్పరం మోహరించడానికి ప్రత్యేక ఒప్పందం కుదిరింది. అనిశ్చితిలో ఈ బంధం ప్రపంచానికి శక్తినిస్తుంది: మోడీ ‘ప్రపంచం అనిశ్చితిని ఎదుర్కొంటోంది. అటువంటి వాతావరణంలో భారతదేశం- ఫ్రాన్స్ భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి ఒక శక్తినిస్తుంది. మేము ఫ్రాన్స్ యొక్క నైపుణ్యం మరియు భారతదేశం యొక్క స్థాయిని మిళితం చేస్తున్నాము’ అని మోడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు దేశాలు ‘చాలా ప్రత్యేకమైన సంబంధాన్ని‘ పంచుకుంటున్నాయని, భారతదేశానికి అత్యంత పురాతన వ్యూహాత్మక భాగస్వాములలో ఫ్రాన్స్ ఒకటి అని ప్రధాని కితాబునిచ్చారు. హెచ్-125 హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ గురించి కూడా మోడీ ప్రస్తావించారు. ఇది ఇరుదేశాల నడము పరస్పర విశ్వాసానికి ఇది మరో అద్భుతమైన ఉదాహరణ అన్నారు. ఎవరెస్ట్ పర్వతం యొక్క ఎత్తులకు ఎగరగలిగే సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని ఏకైక హెలికాప్టర్ను భారతదేశం మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా తయారు చేస్తాయని చెప్పడానికి గర్విస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. వాటిని ఇక్కడి నుంచే ప్రపంచం మొత్తానికి కూడా ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. తద్వారా భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి సరిహద్దులు లేవని, అది లోతైన మహాసముద్రాల నుండి అత్యంత ఎత్తయిన పర్వత పంక్తుల వరకు చేరుకోగలదని మోడీ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి పరిణామాలు, ఉగ్రవాదంపై ప్రతిన... రష్యా-ఉక్రెయిన్ వివాదం, పశ్చిమ ఆసియా, ఇండో-పసిఫిక్ పరిస్థితులను ప్రస్తావిస్తూ... భారత్, ఫ్రాన్స్ రెండూ ప్రజాస్వామ్య విలువలను, చట్ట పాలనను, బహుళ ధ్రువ ప్రపంచాన్ని విశ్వసిస్తాయని ప్రధాని అన్నారు. ప్రపంచ స్థాయి సంస్థల్లో సంస్కరణలతోనే సవాళ్లకు పరిష్కారాలను కనుగొనగలమని తాము భావిస్తున్నట్లు పరోక్షంగా ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి మోడీ చెప్పారు. ఉక్రెయిన్, పశ్చిమ ఆసియా సహా అన్ని ప్రాంతంలో శాంతి కోసం చేసే ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తూనే ఉంటామన్నారు. భారతదేశం-ఇయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఒక ‘మలుపు’గా అభివర్ణించారు. పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఇరు దేశాల ప్రజలు. కంపెనీలు రెట్టింపు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉండటానికి ఒప్పందంపై సంతకం చేశామని, ఈ కార్యక్రమాలన్నీ పరస్పర వాణిజ్యం, పెట్టుబడులు మరియు చలనశీలతకు కొత్త ప్రేరణను ఇస్తాయని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది భారత్, ఫ్రాన్స్ దేశాల సంక్షేమానికి రోడ్ మ్యాప్ అని అన్నారు. ఈ సందర్భంగా ‘ఇండియాఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’ను కూడా ప్రారంభించారు. భారత్ మా విశ్వసనీయ భాగస్వామి: మేక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ.. భారత్ తమ అత్యంత విశ్వసనీయ భాగస్వాములలో ఒకటి అని అన్నారు. ‘రాఫెల్ జెట్ల నుండి జలాంతర్గాముల వరకు రక్షణ సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాలు చట్టబద్ధమైన పాలనను గట్టిగా విశ్వసిస్తాయని, ఇది గత కొన్ని సంవత్సరాలుగా నిరూపించబడిందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, ఫ్రాన్స్ సహకారాన్ని కొనసాగిస్తాయని మేక్రాన్ అన్నారు. విమానం దిగగానే జాగింగ్.. 26/11 మృతులకు నివాళి.. మంగళవారం ఉదయాన్నే ముంబై విమానాశ్రయంలో దిగిన మేక్రాన్ దంపతులు ఇక్కడి ప్రఖ్యాత మెరైన్ డ్రైవ్లోని తీరప్రాంత రోడ్డు జాగింగ్ చేశారు. అంనతరం అక్కడి నుంచి తాజ్ ప్యాలెస్ హోటల్కు చేరుకున్నారు. అక్కడ ముంబై ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముంబై పోసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు విమానాశ్రయంలో మేక్రాన్కు మహారాష్ట్ర గవర్నర్ దేవవ్రత్, సిఎం ఫడ్నవీస్ ఆహ్వానం పలికారు.
congress |సింహం సింగల్ గానే వస్తది…
congress | సింహం సింగల్ గానే వస్తది… మళ్లీ చెబుతున్నా చైర్మన్ పీఠం
Councillor |కడియం శ్రీహరి ఆశీస్సులతో ముందుకు..
Councillor | కడియం శ్రీహరి ఆశీస్సులతో ముందుకు.. ఎమ్మెల్యేను కలిసిన 18వ వార్డు
ఎప్స్టీన్తో హర్దీప్ పూరికి 62 ఈమెయిళ్లు, 14 సమావేశాలు
న్యూఢిల్లీ: అమెరికా లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్తో కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి మధ్య 2014-2017 మధ్య కాలంలో 62 ఈమెయిళ్లుతో సంప్రదింపులు, అలాగే 14 సమావేశాలు జరిగాయని, కాంగ్రెస్ ఆరోపించింది. దీని నుంచి బీజేపీ నేత స్వచ్ఛతతో బయట పడాలని కాంగ్రెస్ మంగళవారం డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంలో ఇరుక్కున్న హర్దీప్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే ఇప్పటికే పూరీ విపక్షం లేవదీసిన ఆరోపణలను కొట్టి పారేసిన సంగతి తెలిసిందే .20142017 మధ్యకాలంలో పూరీకి, ఎప్స్టీన్కు మధ్య 62 ఈమెయిళ్లు సాగాయని, ఇదిలా ఉండగా, 2014లో జూన్ 5,6,8,9 , సెప్టెంబర్ 19, 23, 24 , అక్టోబర్ 9,10 తేదీల్లో జరిగిన సమావేశాల్లో ఏం చర్చించారని కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ విభాగం అధినేత పవన్ ఖేరా ప్రశ్నించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు 2014లో స్వీకరించాక 2017 వరకు ఉన్న కాలంలో ఎప్స్టీన్ పూరికి 30 ఈమెయిళ్లు పంపగా,పూరీ ఎప్స్టీన్కు 32 ఈమెయిళ్లు పంపారని ఆరోపించారు. 2014 జూన్లో హర్దీప్ పూరి ఏ హోదాలో ఉన్నారు ? ఏ సామర్థంతో ఎప్స్టీన్ను పూరీ కలుసుకున్నారని ప్రశ్నించారు. ఇటీవల ఒక ఇంటర్వూలో పూరీ అనేక అబద్దాలు చెప్పారని ఉదహరించారు. సామాన్య పౌరునిగా హర్దీప్ పూరీ ఎందుకు ప్రభుత్వ విధానాలను ఎప్స్టీన్తో ఎందుకు పంచుకున్నారని పవన్ఖేరా ప్రశ్నించారు. ఏఐ సమ్మిట్లో బిల్గేట్స్ పాల్గొనే విషయం సందిగ్ధంలో ఉండడంపై కూడా పవన్ ఖేరా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
Brs |మళ్ళీ కారే రావాలి.. కెసిఆర్ సారే రావాలి..
Brs | మళ్ళీ కారే రావాలి.. కెసిఆర్ సారే రావాలి.. ఘనంగా బిఆర్
Celebrations |సాయి అనాధాశ్రమంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు..
Celebrations |సాయి అనాధాశ్రమంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు.. Celebrations | భీమారం, ఆంధ్ర
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై స్టే
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడమే ఈ ఎన్నిక వాయిదా కు కారణంగా తెలుస్తోంది. తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేశారని యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటి షన్ దాఖలు చేశారు. యాదగిరిని గురువారం తమ ముందు హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే ఇబ్రహీంపట్నం కౌన్సిల్లో ఆసక్తిక ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. బిఆర్ఎస్కి చెందిన టేకుల సుదర్శన్ రెడ్డిని 15 మంది కౌన్సిలర్లు చైర్మన్గా ఎన్నుకున్నా రు. వైస్ చైర్మన్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. ఈ క్రమంలో కిడ్నాప్ అయ్యారని భావించిన కౌన్సిలర్ యాదగిరి ఎన్నిక ప్రక్రియ ముగిసిన వెంటనే అనూహ్యం గా కౌన్సిల్ హాల్లో ప్రత్యక్షమయ్యారు. సరిగ్గా చైర్మన్ పేరును అధికారికంగా ప్రకటించాల్సిన సమయంలో హైకోర్టు స్టే ఉత్తర్వులు అందడంతో అధి కారులు ఇబ్రహీంపట్నం ఎన్నికను నిలిపివేశారు. స్టే కారణంగా బిఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు.
Distribution |లార్డ్ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ
Distribution | లార్డ్ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ Distribution | భీమారం, ,ఆంధ్ర
donor |అల్పాహారం కొరకు నగదు అందజేత
donor | అల్పాహారం కొరకు నగదు అందజేత donor | వేంసూరు,ఆంధ్రప్రభ: పది
సహజ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్కు దేశంలో మొదటి స్థానం #NaturalFarming #AndhraPradesh #Parliament
Birthday |ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
Birthday | ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీపేదల
150 హాట్స్పాట్ ప్రాంతాలపై నిరంతర నిఘా నిరంతరం అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్ 1972 The post డ్రగ్స్పై దండయాత్ర appeared first on Visalaandhra .
సిఎం రేవంత్ కుట్ర పన్ని బీఆర్ఎస్ని అవమానపరిచారు: ఎంపి వద్దిరాజు రవిచంద్ర
సిఎం రేవంత్ కుట్ర పన్ని ఒక దుర్బుద్ధితో బీఆర్ఎస్ పార్టీని అవమానపరిచారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మంగళవారం దేవరుప్పుల మండలకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితతో కలిసి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తొర్రురు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడుగురు అభ్యర్థులు గెలిస్తే బీఆర్ఎస్ తొమ్మిది మంది అభ్యర్థులు గెలిచారని, ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని దుర్మార్గమైన ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు బయటపడ్డాయని, ఎక్స్ఆఫీషియో ఓటు ఎమ్మెల్యేకు ఉన్నా ఎంపీ కడియం కావ్యకు లేదని, వరంగల్ లో ఓటు నమోదు చేసుకుందని, కానీ సిఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా తొర్రురు మున్సిపాలిటీ ఎలాగైనా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని కడియం కావ్యను ఇక్కడికి రప్పించారన్నారు. ఒక దుర్బుద్ధితో బీఆర్ఎస్ పార్టీని అవమాన పరచిందని, కానీ వాస్తవంగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీనేనని, ఎందుకంటే ఒక్కరూ కూడా దయాకర్ రావు మాటకు కట్టుబడి ఉండి బీఆర్ఎస్ పార్టీని వీడకుండా కార్యకర్తలందరూ పోరాడారన్నారు. కడియం కావ్య వరంగల్ లో ఆమెకు ఉన్న ఓటు తొర్రూలో ఎలా చెల్లుతుందో కోర్టు ద్వారానే తెలుసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకుని డ్రా చేసి గెలుచుకున్నారు. కడియం కావ్య గెలిచిన తరువాత జీడబ్లూఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరయ్యారని, ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరులో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం అన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నిక్కచ్చిగా ఉండడం మన మొదటి విజయం అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితం బుద్ధి చెప్తామన్నారు. తొర్రూరులో నిజంగా పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచిందని, తొర్రూరులో గెలవాలని రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి కుట్రలు జరిపారాన్నరు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బీఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, మాజీ జీసీసీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయక్, పాలకుర్తి మాజీ జెడ్పిటిసి శ్రీనివాసరావు, మండల బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు తీగల దయాకర్, చింత రవి, మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాంసింగ్, యూత్ అధ్యక్షుడు నవీన్, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Collector |ఆర్గాన్ మిర్చి ఆరోగ్యానికి మంచిది…
Collector | ఆర్గాన్ మిర్చి ఆరోగ్యానికి మంచిది… Collector | బూర్గంపాడు,ఆంధ్రప్రభ: ఆరోగ్యానికి
NTR Varsity : త్వరలో పబ్లిక్ హైల్త్ కోర్స్ Andhra Prabha News
NTR Varsity : త్వరలో పబ్లిక్ హైల్త్ కోర్స్ Andhra Prabha News
Anger |విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం
Anger | విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం ప్రధానోపాధ్యాయుడికి
టోలిచౌకిలో 23 విదేశీయుల అరెస్టు
హైదరాబాద్: టోలిచౌకి గోల్కొండ డివిజన్ పోలీసులు సోమవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పారమౌంట్ కాలనీ, హకీంపేట కుంట ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేశారు. గోల్కొండ డిసిపి చంద్రమోహన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వీసా గడువు ముగిసినా నగరంలో ఉంటున్న 23మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 250 మంది పోలీసు సిబ్బందితో కాలనీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో 10 సెర్చ్ పార్టీలు, 7 కట్ ఆఫ్ పార్టీలు, 5 లిఫ్టింగ్ పార్టీలు , రెండు హోల్డింగ్ పాయింట్లు పాల్గొన్నాయి. ఎఫ్ఆర్ఆర్ఓ హైదరాబాద్ సహాయంతో నిర్వహించిన ఈ తనిఖీల్లో, వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న వివిధ దేశాలకు చెందిన 23 మంది విదేశీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న 9 గ్యాస్ సిలిండర్లు, 53 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నగర శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని డిసిపి చంద్రమోహన్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
cI |ఉత్తమ గుణాలతో, ఉన్నత లక్ష్యాలతో విద్యార్థులు విజేతలు కావాలి..
cI | ఉత్తమ గుణాలతో, ఉన్నత లక్ష్యాలతో విద్యార్థులు విజేతలు కావాలి.. cI
Clofast |బయో ఏషియా 2026లో క్వాడ్రిక్ సంస్థ సంచలనం
Clofast | బయో ఏషియా 2026లో క్వాడ్రిక్ సంస్థ సంచలనం Clofast |
ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలను నిర్వహించి, ఎన్నికల ఫలితాలను ప్రకటించగా గెలుపును స్వీకరించాల్సిన నేతలు అధికారం కొరకు అప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహారించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగబద్దంగా ప్రజాస్వామ్య విలువలతో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోగా, అధికారం కోసం ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా నేతలు వ్యవహారించడం పట్ల ఆగ్రహాం వ్యక్తమవుతోంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికల నిర్వహాణలో మంగళవారం క్యాతనపల్లి మున్సిపాలిటి అధికారం చేజిక్కుంచుకునే ప్రయత్నంలో క్యాతన్పల్లి ప్రాంతంలో మంగళవారం యుద్దభూమిని తలపించింది. క్యాతన్పల్లి మున్సిపాలిటిలో 22 వార్డులు ఉండగా బిఆర్ఎస్ 10, సిపిఐ 4, కాంగ్రెస్ 7 వార్డులు, ఒక్కరు స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. ఇక్కడ చైర్మన్ కావాలంటే 12 వార్డు సభ్యులు ఉన్న చైర్మెన్ పదవి దక్కుతుంది. కాగా ఇక్కడ బిఆర్ఎస్, సిపిఐ పొత్తు ఉండడంతో ఇరువురికి కలిపి 14 వార్డులు ఉన్నాయి. దీంతో బిఆర్ఎస్ కు చైర్మెన్ పదవి అనివార్యం అనుకున్న నేపధ్య ంలో ఇక్కడ రెండు రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ చైర్మెన్ పదవి కొరకు అనేక ప్రయత్నాలు చేపట్టినట్లు తెలుస్తుండగా బిఆర్ఎస్, సిపిఐ మాత్రం ఒక్కతాటిపై ఉండడంతో ఇక్కడ సామ, దాన, దండోపాయ విధానాలకు తెరతీశారనే వాదనలు వినవస్తున్నాయి. సోమవారం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక ఉన్నప్పటికీ కోరం లేక పోవడంతో వాయిదా వేసి మంగళవారం నిర్వహించారు. వందలాది మంది పోలీసుల బందోబస్తు మద్య ఎవరికి అనుమతులు ఇవ్వకుండా పకడ్బందీగా అధికారులు ప్రణాళిక చేపట్టారు. ఈ నేపద్యంలో బిఆర్ఎస్, సిపిఐ లకు చెందిన వార్డు సభ్యులను కార్యాలయం వరకు తీసుకుని వెళ్లేందుకు ఇతరులకు అనుమతులు ఇవ్వక పోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు సిపి ఆదేశాల మేరకు వాహనాల డ్రైవర్ల తో వార్డు సభ్యులను కార్యాలయానికి పంపించారు. ఎన్నికల నిబంధనల మేరకు రెండు వందల మీటర్ల దూరంలోను అందరిని ఆపి వేయడంతో అక్కడే కాంగ్రేస్, బిఆర్ఎస్, సిపిఐ శ్రేణులు ఉండి పోయారు. ఈ నేపద్యంలో ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా అక్కడ యుద్దభూమిని తలపించింది. పోలీసులు లాఠీచార్జీ చేయడంతో బిఆర్ఎస్ శ్రేణులు సైతం ఎదురు దాడికి దిగారు. దీంతో పోలీసుల లాఠీ చార్జిలో పలువురు గాయపడ్డారు. అలాగే కానిస్టేబుల్ రాకేష్, కాంగ్రేస్ నాయకులు జావేద్ కూడా ఘర్షణ వాతావరణంలో తీవ్రంగా గాయపడ్డారు, కానిస్టేబుల్ రాకేష్, జావేద్ లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి వివేకానంద, పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ కార్యాలయానికి ఓటు వేసేందుకు చేరుకున్నారు. అధికారులు, 22 మంది వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక విషయమై లోపల ఇరు వర్గాల మధ్య జరిగిన వాదోపవాదాలతో ఘర్షణ వాతావరణం తలెత్తడంతో చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు మందమర్రి తహాసిల్దార్ సతీష్ ప్రకటించడంతో కాంగ్రెస్ సభ్యులు, మంత్రి వెళ్తున్న సమయంలో మంత్రి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో కారు స్వల్పంగా ధ్వసంమైంది. మెజారీటీ ఉన్నప్పటికీ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికలను నిర్వహించకుండా అధికారులు కాంగ్రెస్ పార్టీకి వత్తసు పలుకుతున్నారని బిఆర్ఎస్, సిపిఐ వార్డు సభ్యులు కార్యాలయం బయటకు రాకుండా ఆందోళనకు దిగారు. సిపిఐ కి చెందిన వార్డు సభ్యులు తమను కావాలని రెచ్చగొట్టి బయటకు వస్తే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, దానిని వదిలి వేసి కోరం ఉండి మెజారిటీ ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికలను వాయిదా వేయడం ఎంత వరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎఐ సమ్మిట్కు బిల్గేట్స్ హాజరుపై సందిగ్ధత..
న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్గేట్స్ ఢిల్లీలో జరుగుతున్న ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్కు హాజరవుతారో లేదో సందిగ్ధత నెలకొంది. ఆయన సదస్సుకు హాజరు కారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా,ఆయన ఫౌండేషన్ అధికార ప్రతినిధి మాత్రం దీనిని ఖండిస్తున్నారు. ఆయన సదస్సులో ప్రసంగిస్తారని చెబుతున్నారు. ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రసంగించే టెక్ దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు, విధాన రూపకర్తలు, సంస్థాపకులు,సాంకేతిక నిపుణులు జాబితాలోంచి బిల్గేట్స్ పేరు మొదట్లో కనిపించగా, మంగళవారం సమ్మిట్ వెబ్సైట్ లో ఆయన పేరు కనిపించలేదు. బిల్గేట్స్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి మాత్రం షెడ్యూల్ ప్రకారం సమ్మిట్లో ఫిబ్రవరి 19న 11.50 గంటలకు బిల్గేట్స్ ప్రసంగిస్తారని వెల్లడించారు. ఈ సందిగ్ధానికి ప్రధాన కారణం ఒకటి తెలుస్తోంది. అమెరికా కోర్టు ఇటీవల విడుదల చేసిన జెఫ్రీ ఎప్సీన్ పత్రాలల్లో బిల్గేట్స్ పేరు ఉండటం అంతర్జాతీయంగా దుమారం రేపింది. లైంగిక నేరగాడైన ఎప్సీన్తో గేట్స్కు ఉన్న పాత సంబంధాల నేపథ్యంలలో భారత్ ఆయనకు అధికారిక వేదికను కల్పించడంపై విమర్శలు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలు అసంగతమని గేట్స్ అధికార ప్రతినిధి చెబుతున్నారు.
suicide |సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగిన వెంకన్న..
suicide | సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగిన వెంకన్న.. suicide
మావోయిస్టు కమిటీ సభ్యుడు లొంగుబాటు
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు జిల్లా ఎస్పీ ఎదుట మంగళవారం లొంగిపోయాడు. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన తాటి ముఖ అలియాస్ చూట్తే లొంగిపోయినట్లు ఎస్పీ రోహిత్రాజ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలుసుకుని జనజీవన స్రవంతిలో తాను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని లొంగిపోయాడని తెలిపారు. జనవరి నుండి ఇప్పటివరకు 359 మంది మావోయిస్టు సభ్యులు వివిధ హోదాలలో జనజీవన స్రవంతిలో కలిసి తమ జీవితాలను పున ప్రారంభించి పునరావాస సౌకర్యాలను పొందారని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసు శాఖ ప్రకటించిన సరెండర్ పాలసీ అనుకూలంగా ఆపరేషన్ చేయూత ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, దీనిలో భాగంగా ఇతను జిల్లా పోలీసుల ముందు లొంగిపోయాడని తెలిపారు. మిగిలిన మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోవాలని, శాంతియుత జీవనం గడపాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.మంగళవారం లొంగిపోయిన తాటి ముఖకు ప్రస్తుత సాయంగా 25 వేల రూ ఇవ్వడం జరిగిందని, మిగతా నగదు ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతాలో చెక్కు రూపంలో జమ చేస్తామని ఎస్పీ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీ… వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా
Festivals |ఘనంగా శ్రీభవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
Festivals | ఘనంగా శ్రీభవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు Festivals | మర్రిగూడ,ఆంధ్రప్రభ:
ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో స్థానిక
బంగ్లాదేశ్ ప్రధానిగా రెహమాన్ ప్రమాణ స్వీకారం
బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా తారిఖ్ రెహమాన్(60) ప్రమాణ స్వీకారం చేశారు. 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇక్కడ తాత్కాలిక ప్రభుత్వ పాలనకు తెరపడినట్లయింది. సాంప్రదాయానికి భిన్నంగా బంగభవన్కు బదులు జతియా సంసద్ సౌత్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెహమాన్ చేత అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ప్రమాణం చేయించారు. రెహమాన్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా, దివంగత అధ్యక్షుడు జియాఉర్ రెహమాన్ల కుమారుడు. ప్రమాణ స్వీకారానికి ముందు రెహమాన్ను బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బిఎన్పి) ఎంపిలు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత కూడా అధ్యక్షుడు షాబుద్దీన్ ప్రమాణం చేయించారు. రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పొరుగు దేశాలైన శ్రీలంక, భారత్తో పాటు పాక్ నుంచి పలువురు అతిథులుగా హాజరయ్యారు. భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరయ్యారు. మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 2024లో కుప్పకూలిన తర్వాత ఈ నెల 12న తిరిగి ఎన్నికలు నిర్వహించారు. 297 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిఎన్పి 209 స్థానాలు గెలుచుకుని తిరుగులేని మెజారిటీ సాధించింది. ఒకప్పటి దాని మిత్రపక్షంమైన జమాతే ఇస్లామీ 68 సీట్లు దక్కించుకుని తర్వాత స్థానంలో నిలిచింది. హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీని దేశం నుంచి బహిష్కరించారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రెహమాన్కు వివిధ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు వెల్లడించారు. ఇదిలావుండగా 35 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్కు పురుషుడు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కాలం మొత్తం ఖలీదా జియా, హసీనాలే ప్రధాని పదవిలో ఉన్నారు. యూనస్ నోట మళ్లీ అదే మాట... బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడిగా పదవి నుంచి దిగిపోయే క్రమంలో మహ్మద్ యూనస్ మరోసారి భారత్పై తన అక్కసును వెళ్లగక్కారు. సోమవారంనాడు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో భారత ఈశాన్య రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్ను గురించి మరోసారి ప్రస్తావించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం అయ్యేందుకు బంగ్లాదేశ్కు విశాల సముద్రంతో భౌగోళిక సరిహద్దుగా ఉండడమే కాకుండా నేపాల్, భూటాన్ సహా సెవెనె సిస్టర్స్తో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామార్థాన్ని కలిగి ఉందని వ్యాఖ్యానించారు.
వాష్రూమ్లో సీక్రెట్ వీడియో తీసి బ్లాక్మెయిల్.. నటి ఫిర్యాదు
బెంగళూరు: మహిళా క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా కోరమంగళ ఇండోర్ స్టేడియంలో ఈవెంట్కు వెళ్లిన తనకు వాష్రూమ్లో కొందరు సీక్రెట్ వీడియో తీసి బెదిరిస్తున్నారని కన్నడ టీవీ నటి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు డిమాండ్ చేసిన డబ్బు చెల్లించకపోతే ఆన్లైన్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది. కోరమంగళ ఇండోర్స్టేడియంలో మూడు రోజుల ఈవెంట్కు ఆమె వెళ్లింది. ఫిబ్రవరి 7న ఈవెంట్ రెండోరోజు స్టేడియం లోని మహిళల రెస్ట్రూమ్ను తాను వినియోగించుకోగా, తనకు తెలియకుండా ఎవరో సీక్రెట్గా అశ్లీల , అసభ్యకర వీడియో చిత్రీకరించారనని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన స్నేహితుని ఇన్స్టాగ్రామ్కు పంపించి డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోల ఆధారాలతో పెన్డ్రైవ్లో ఫిర్యాదు పంపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 13న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ఉపయోగించి వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పేట చైర్ పర్సన్ దంపతులను సన్మానించిన సర్పంచ్…
పేట చైర్ పర్సన్ దంపతులను సన్మానించిన సర్పంచ్… ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట
గ్రామ పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదల
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు పంచాయతీలకు రూ.256 కోట్ల నిధులు విడుదల చేశారు. పంచాయతీలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు విడతలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం
రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నాం 3 గంటలకు మంత్రిమండలి సమావేశమై కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రులు చర్చించనున్నట్టుగా తెలిసింది. అలాగే, జీహెచ్ఎంసి, ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
'వర్క్మాస్టర్ 105' ట్రాక్టర్ను ఆవిష్కరించిన న్యూ హాలండ్ హెచ్విఎసి
హైదరాబాద్: సిఎన్హెచ్ (CNH) బ్రాండ్ అయిన న్యూ హాలండ్, ఈరోజు తెలంగాణలో హెచ్విఎసి (HVAC) క్యాబిన్తో కూడిన 'వర్క్మాస్టర్ 105' (Workmaster 105) ట్రాక్టర్ను విడుదల చేసింది. ఇది వారి హై హార్స్పవర్ ట్రాక్టర్ల పోర్ట్ఫోలియోలో సరికొత్త జోడింపు. న్యూ హాలండ్ యొక్క 106 హెచ్పి ట్రాక్టర్ శ్రేణిలో వచ్చిన ఈ కొత్త వేరియంట్... అన్ని వాతావరణాలకు అనుకూలమైన ఆపరేటర్ సౌకర్యాన్ని మరియు అధునాతన పనితీరు ఫీచర్లను అందిస్తుంది. కఠినమైన వ్యవసాయ పరిస్థితుల్లో సౌలభ్యం, మన్నిక మరియు ఉత్పాదకతకు ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది. శక్తివంతమైన ఇంజిన్, ఫీచర్లు: 106 హెచ్పి (106 HP) శక్తి, 3.4-లీటర్ ఎఫ్పిటి (FPT - ఫియట్ పవర్ట్రెయిన్ టెక్నాలజీస్) TREM-IV ఇంజిన్తో పనిచేసే వర్క్మాస్టర్ 105... తక్కువ ఆర్పిఎమ్ (RPM) వద్ద కూడా అద్భుతమైన పనితీరును మరియు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. హెచ్విఎసి (HVAC) క్యాబిన్తో వచ్చే ఈ కొత్త వేరియంట్... ఆరు రూఫ్ వెంట్లతో కూడిన హీటింగ్ మరియు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ద్వారా అన్ని కాలాలలోనూ రైతులకు సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది శబ్దం లేని వాతావరణాన్ని మరియు అలసట లేకుండా పనిచేయడానికి గాలి నింపిన సస్పెన్షన్ సీటును కలిగి ఉంటుంది. అలాగే, ఇందులోని 'న్యూమాటిక్ రివర్సిబుల్ ఫ్యాన్'... దుమ్ము ఎక్కువగా ఉండే పంట కోత తర్వాత పరిస్థితుల్లో అంతరాయం లేకుండా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా వరి కోత తర్వాత గడ్డిని కట్టలుగా కట్టే పనుల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆవిష్కరణపై సిఎన్హెచ్ (CNH) ఇండియా ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ నరీందర్ మిట్టల్ మాట్లాడుతూ, విభిన్న పంటలు మరియు అనువర్తనాల్లో అధునాతన యంత్రీకరణను ఎక్కువగా స్వీకరిస్తూ... భారతదేశంలో అత్యంత చైతన్యవంతమైన మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా తెలంగాణ నిలిచింది. మా భారత వృద్ధి వ్యూహంలో కూడా ఇదొక కీలక మార్కెట్. హెచ్విఎసి క్యాబిన్తో కూడిన వర్క్మాస్టర్ 105... అధిక శక్తిని, అన్ని వాతావరణాల్లో పనిచేయగలిగే క్లైమేట్-కంట్రోల్డ్ వర్క్స్పేస్తో మిళితం చేసేలా రూపొందించబడింది. ఇది రైతులు ఎక్కువ గంటలు, మరింత ఉత్పాదకతతో పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. తెలంగాణలోని వైవిధ్యభరితమైన మరియు అధిక ఉష్ణోగ్రత ఉండే వ్యవసాయ పరిస్థితులకు ఇది సరిగ్గా సరిపోతుంది. కార్యకలాపాలను మరింత సౌకర్యవంతంగా, నమ్మదగినదిగా మారుస్తూనే... ఉత్పాదకతకు మద్దతు ఇచ్చే సాంకేతికతను అందించాలనే మా నిబద్ధతను ఈ ఆవిష్కరణ నొక్కి చెబుతుంది, అని అన్నారు. గత ఏడాది భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన వర్క్మాస్టర్ 105, గ్లోబల్ మార్కెట్లలో 'మేక్-ఇన్-ఇండియా' మోడల్గా విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు హెచ్విఎసి (HVAC) క్యాబిన్తో అందుబాటులో ఉంది. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 15,000 యూనిట్ల అమ్మకాలను అధిగమించిన వర్క్మాస్టర్ సిరీస్ యొక్క బలమైన పనితీరు మరియు విస్తృత ఆదరణపై ఈ కొత్త వేరియంట్ రూపొందించబడింది. ఇది 20 ఫార్వర్డ్ + 20 రివర్స్ పవర్ షటిల్ ట్రాన్స్మిషన్ మరియు 3,500 కిలోల బలమైన లిఫ్ట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనివల్ల భారీ పరికరాలను సులభంగా నిర్వహించవచ్చు. ఆల్-వెదర్ క్యాబిన్ తీవ్రమైన ఉష్ణోగ్రతల నుండి రక్షణ కల్పిస్తుంది. మెయిన్ డ్రైవ్ మరియు పవర్ టేక్-ఆఫ్ (PTO) కోసం ఉన్న వెట్ క్లచ్... నిరంతర లోడ్లో కూడా మన్నిక మరియు విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ముఖ్యంగా బేలింగ్, బంగాళాదుంప నాటడం మరియు ట్రెంచింగ్ వంటి కఠినమైన పనులకు ఇది చాలా అనుకూలం. అలాగే ఫోరేజ్ హార్వెస్టింగ్ మరియు రిగ్ అప్లికేషన్లకు కూడా వర్క్మాస్టర్ 105 సరిపోతుంది. అమెరికా మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే బలమైన ఉనికిని చాటుకున్న వర్క్మాస్టర్ 105... ఇప్పుడు హెచ్విఎసి క్యాబిన్ పరిచయంతో భారతదేశంలో కూడా డిమాండ్ పెంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విడుదలతో, న్యూ హాలండ్ ప్రీమియం ట్రాక్టర్ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. భారతీయ రైతులకు హై-హెచ్పి ట్రాక్టర్ అనుభవాన్ని పునర్నిర్వచించే శక్తి, పనితీరు మరియు అన్ని కాలాలకు తగిన సౌకర్యాన్ని ఇది అందిస్తుంది.
బంగారం కొనుగోలుదారులకు ఊరట మళ్లీ తగ్గిన బంగారం ధర #GoldRates #Hyderabad #BullionMarket #SilverRate
సహజ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్కు దేశంలో మొదటి స్థానం
ఎన్ఎంఎన్ఎఫ్లో అత్యధిక నమోదు4.07 లక్షల రైతులు నమోదు… 2.72 లక్షల హెక్టార్లలో సాగు
ఉత్తరాంధ్ర ఇలవేల్పు జాతరకు ఘన ఏర్పాట్లు
అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ విశాలాంధ్ర – రాజాం : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో జరుగనున్న 100వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను రాజాం ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ శ్రద్ధగా పరిశీలించారు.జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాలు, రహదారులు, తాగునీటి సదుపాయం, పారిశుధ్య ఏర్పాట్లు, విద్యుత్ వెలుగులు తదితర అంశాలను ఆయన సమీక్షించారు. అదేవిధంగా వినోద కార్యక్రమాల […] The post ఉత్తరాంధ్ర ఇలవేల్పు జాతరకు ఘన ఏర్పాట్లు appeared first on Visalaandhra .
యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది
యువతిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన మహబూబాబాద్ పట్టణంలోని ప్రగతి నగర్ లో చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై యువకుడు పెట్రోల్ పోసి యువతితో పాటు తాను నిప్పింటించుకున్నాడు. అది గమనించిన స్థానికులు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం ఇద్దరిని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

22 C