SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

Andhra Pradesh : అసెంబ్లీ సమావేశాలకు జగన్ రానున్నారా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు

తెలుగు పోస్ట్ 10 Feb 2026 12:28 pm

New Phase of Community Politics in Tamil Nadu

Tamil Nadu politics is entering a sensitive and strategic phase as the state moves closer to Assembly elections. Political parties are recalibrating their outreach. Voter blocs that were once treated as peripheral are now gaining attention. Among them, Telugu-speaking communities are emerging as a decisive force. Within this space, the Kamma community has begun asserting […] The post New Phase of Community Politics in Tamil Nadu appeared first on Telugu360 .

తెలుగు 360 10 Feb 2026 12:25 pm

ఇదంతా బంగ్లాదేశ్ కోసమే చేశాము: పాక్... పరువు పొగొట్టుకున్న పోజులు మాత్రం తగ్గడం లేదు

ఇస్లామాబాద్: భద్రతపరమైన కారణాలతో భారత్‌తో ఆడలేమని బంగ్లాదేశ్ చెప్పడంతో ఆ దేశాన్ని వరల్డ్ కప్ నుంచి ఐసిసి తొలగించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో ఆడబోమని పాకిస్థాన్ ప్రకటించిన విషయం విధితమే. దీంతో బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులతో ఐసిసి చర్చలు జరిపింది. దీంతో భారత్‌తో తాము ఆడుతున్నామని పాక్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పిసిబి చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాటాలను సమర్ధించుకున్నారు. పాక్ కు  సొంత లాభం ఏమీ లేదని, బంగ్లాదేశ్ కోసమే స్టాండ్ తీసుకున్నామని వివరించారు. పాక్ నిర్ణయంతోనే బంగ్లాదేశ్‌కు న్యాయం జరిగిందని గొప్పగా నీతులు చెప్పుకున్నారు. భారత్‌తో మ్యాచ్ ఆడాలని బంగ్లాదేశ్ కూడా తమను కోరడంతో తాము ఆడుతున్నామని నఖ్వీ తెలియజేశారు. టీమిండియాతో ఆడేందుకు పాక్ మూడు డిమాండ్లు పెట్టిన విషయం తెలిసిందే. మూడు డిమాండ్లను ఐసిసి తిరస్కరించింది. ఈ క్రమంలో నఖ్వీ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. చింత చచ్చిన పులుపు చావదని సైటెర్లు విసురుతున్నారు. ప్రపంచం ముందు పరువు పొగొటుకున్న పోజులు తగ్గడం లేదని, పాక్ వేషాలు తగలెయ్యా అని నెటిజన్లు చురకలంటిస్తున్నారు. 

మన తెలంగాణ 10 Feb 2026 12:22 pm

బీజేపీ అభ్యర్థి బలవన్మరణం.. డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది

తెలుగు పోస్ట్ 10 Feb 2026 12:22 pm

జగన్ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైసీపీ లేఖ

మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది

తెలుగు పోస్ట్ 10 Feb 2026 12:15 pm

నా చావుకు భార్య, అత్త మామలే కారణం.. హుస్సేన్ సాగర్ లో దూకి

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ భార్య, అత్తింటి వేధింపులు భరించలేక ఒక యువకుడు మరణించాడు

తెలుగు పోస్ట్ 10 Feb 2026 12:07 pm

డీకే కు సీఎం గా అవకాశం ఇవ్వండి

– హై కమాండ్ ను కోరిన 80 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు ఊహించినట్లుగానే మలుపులు తిరుగుతున్నాయి. సీఎం పోస్టుపై అనేక ఊహగానాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎం గా చేయమని 80 మంది ఎమ్మెల్యేలు హై కమాండ్ ను అభ్యర్థించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించడంతో మరొకసారి చర్చనీయాసంగా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సీఎం పదవి విషయంలో డీకే కు […] The post డీకే కు సీఎం గా అవకాశం ఇవ్వండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 11:55 am

Chandrababu : గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు

తెలుగు పోస్ట్ 10 Feb 2026 11:54 am

Ys Jagan |కేంద్ర హోంశాఖకు లేఖ..

Ys Jagan | కేంద్ర హోంశాఖకు లేఖ.. Ys Jagan | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 10 Feb 2026 11:48 am

నేడు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు బచ్చన్నపేట ఫిబ్రవరి 9( జనం సాక్షి): బచ్చన్నపేట మండల కేంద్రంలో …

జనం సాక్షి 10 Feb 2026 11:39 am

Avanigadda |తక్షణ చర్యలు తీసుకోవాలి..

Avanigadda | తక్షణ చర్యలు తీసుకోవాలి.. దోవా గోవర్ధన్ డిమాండ్.. Avanigadda |

ప్రభ న్యూస్ 10 Feb 2026 11:37 am

AP |మేకల భిక్షం ను అభినందిస్తున్న గొట్టిపాటి లక్ష్మి

AP | మేకల భిక్షం ను అభినందిస్తున్న గొట్టిపాటి లక్ష్మి ఎస్సీ కమిషన్

ప్రభ న్యూస్ 10 Feb 2026 11:32 am

లోక్‌సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో విపక్షాలు ఉన్నాయి. ఇప్పటికే 103 మంది ఎంపిల సంతకాలను సేకరించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. 100 మంది ఎంపిల సంతకాలతో 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13తో ముగియనున్నాయి. రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు, కాంగ్రెస్ మహిళా ఎంపిపై నిరాధార ఆరోపణలు చేసిన బిజెపి ఎంపి నిశికాంత్ దుబెపై చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలు ఉండడంతో తెరపైకి అవిశ్వాస తీర్మానం విపక్షాలు తీసుకొచ్చాయి. రాజ్యసభ విపక్షనేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో తృణమూల్, డిఎంకె, వామపక్షాలు, సమాద్‌వాదీ పార్టీ, ఆర్‌జెడి, శివసేన యుబిటి, ఎన్‌సిపి ఎస్‌పి, తదితర పార్టీలు పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నాయి. 

మన తెలంగాణ 10 Feb 2026 11:24 am

వివాదాస్పద అంశాలపై చర్చకు భయమా?

వివాదాస్పద అంశాలు తలెత్తినప్పుడు కూలంకషంగా చర్చించడానికి పార్లమెంట్ సరైన వేదిక కావాలని రాజనీతిజ్ఞులు అభిప్రాయపడుతుంటారు. కానీ ప్రస్తుతం అలాంటి వాతావరణం పార్లమెంట్ సమావేశాల్లో కనిపించడం లేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే ఫిబ్రవరి 5న ఆమోదం పొందడం పార్లమెంట్ చరిత్రలో అనూహ్య ఘట్టం. దాదాపు 22 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ ప్రసంగించకుండానే సభ వాయిదా పడడానికి సంబంధించి ప్రధాని మోడీ కొద్ది క్షణాల్లో ప్రసంగిస్తారనగా, కాంగ్రెస్ ఎంపిలు కొందరు ప్రధాని కుర్చీని చుట్టుముట్టి “అనూహ్యమైన చర్యలు” లేదా భౌతికదాడి చేసే అవకాశం ఉందనే కచ్చితమైన సమాచారం తనకు ఉందని స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో గందరగోళం మధ్య ప్రధాని గౌరవానికి, భద్రతకు భంగం కలిగించే అవకాశం ఉందని, సభా మర్యాదలు దెబ్బతినకుండా ఉండేందుకు స్పీకర్ బిర్లానే ప్రధాని మోడీని సభకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అంతేకాక సభలో ప్రధానికి హాని తలపెట్టే సూచనలు పరోక్షంగా కనిపించడంతో తానే ప్రధానిని రావద్దని ముందుగా హెచ్చరించానని స్పీకర్ బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఆర్మీచీఫ్ నరవణె పుస్తకంలోని దేశ భద్రతకు సంబంధించిన అంశాలు విపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ ప్రస్తావించడం సభలో గందరగోళం సృష్టించింది. స్పీకర్ బిర్లా రాహుల్ గాంధీని తరువాత మాట్లాడ్డానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మరునాడు సభలో ప్రధాని మోడీ ఉంటే తాము రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాలపై ప్రశ్నలు అడిగి ఉండేవారమని, దీనికి భయపడే ప్రధాని మోడీ సభకు రాలేదని విపక్షాలు ఆరోపించాయి. ప్రధానిని సభకు రావద్దని కోరడం ద్వారా సభా గౌరవాన్ని, నాయకుడి భద్రతను స్పీకర్ కాపాడారని బిజెపి నేతలు సమర్ధించుకున్నారు. లోక్‌సభ విపక్ష నాయకుడ్ని సభలో మాట్లాడనీయకపోవడం, మరోవైపు ప్రధాని మోడీ ప్రసంగించడానికి సభకు రానీయకపోవడం ఈ రెండూ పార్లమెంటరీ ప్రమాణాలకు వ్యతిరేకమైనవే. అంతేకాకుండా ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి తిలోదకాలిచ్చినట్టే అవుతుంది. చర్చసమాధానం పార్లమెంట్ వ్యవస్థలో తప్పనిసరి. దీని ద్వారా కార్యనిర్వాహకవర్గం పార్లమెంట్‌కు జవాబుదారీ అవుతుంది. ప్రధాని కుర్చీ వద్ద అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయని విశ్వసనీయమైన సమాచారం అందిందని అందుకే ప్రధానిని రావద్దని తాను విజ్ఞప్తి చేసినని చెప్పడం ఆక్షేపణీయమవుతోంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ఎంపి కెసి వేణుగోపాల్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలపై ప్రధాని సమాధానంతోనే తీర్మానం కావలసి ఉందని పార్లమెంటరీ నిబంధనలు చెబుతున్నాయని, ఒకవేళ ప్రధాని ప్రసంగం లేకుండా చర్చలు ముగించాలని సభ నిర్ణయిస్తే ఆమేరకు ప్రత్యేక తీర్మానం సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందవలసి ఉంటుందని నిబంధనలను ఆయన గుర్తు చేశారు. నరవణె పుస్తకం ముద్రణ అయిందా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఆ పుస్తకంలోని వివాదాస్పద అంశాలపై స్పీకర్ ముందు ప్రామాణీకరించాలని రాహుల్ సిద్ధపడ్డారు. అలాంటప్పుడు తప్పనిసరిగా రాహుల్‌ను సభలో చర్చకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఆ పుస్తకంలో దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశాలు ప్రస్తావించి ఉన్నాయి. దీనిపై సభ్యులను చర్చించడానికి ఒప్పుకోకపోవడం జవాబుదారీ నుండి బాధ్యతను తప్పించుకోవడమే అవుతుంది. పార్లమెంట్ బయట రాహుల్ నరవణె పుస్తకం లోని వివాదాస్పద అంశాలను బయటపెట్టారు. అవి వాస్తవాలైతే కీలకమైన చర్చలకు అవకాశం ఇవ్వకుండా జవాబుదారీ కాకుండా రాజకీయ పెత్తనం ద్వారా తప్పించుకుందని స్పష్టమవుతుంది.దీనిపై సమగ్రంగా చర్చలు చేపట్టిన తరువాత ప్రధాని సమాధానంతో ముగింపు పలికితే రాహుల్ కానీ, విపక్షాలు కానీ నరవణె పుస్తకం లోని అంశాలుపై లేవదీసిన వాదనలు తప్పని నిరూపించడానికి ఒక సువర్ణావకాశం అయ్యేది. దీనికి భిన్నంగా మోడీ సమాధానం దాటవేయడం ద్వారా తన విమర్శకుల ఆరోపణలు నిజమేనన్న అపోహలు నిరూపించుకున్నట్టు అభిప్రాయం కలుగుతుంది. కీలకమైన ఇలాంటి అంశాలపై చర్చలు లేకుండా తప్పించుకోవడం పాలక వర్గాల్లో ప్రజాదరణ తగ్గుతుందనే భయం ఒక కారణం కాగా, పార్లమెంట్‌కు జవాబుదారీతనం లేని ధోరణిని సూచిస్తుంది. దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఈ నమ్మకం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలతో ఉభయ సభల కార్యకలాపాలకు తరచుగా అంతరాయం కలుగుతుండడం పరిపాటిగా వస్తోంది. సభలో తమను మాట్లాడనీయడం లేదని లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు విపక్షాలు నోటీసులు ఇచ్చినట్టు త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీని స్పీకర్ ప్రసంగించడానికి అనుమతించలేదని, కాంగ్రెస్ ఎంపిలు, మహిళా నేతలను కించపరిచేలా విమర్శించిన బిజెపి ఎంపి నిషికాంత్ దూబేపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అందుకే ఈ అవిశ్వాస తీర్మానం తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ తీర్మానం తీసుకు రావాలంటే కనీసం వందమంది ఎంపిల సంతకాలు అవసరం. విపక్షాలు ఆ సంతకాల సేకరణలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సమావేశం కూడా అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. 

మన తెలంగాణ 10 Feb 2026 11:24 am

Revanth Reddy Signals Election Shift and Draws Clear Lines on Telangana’s Political Future

Telangana Chief Minister Revanth Reddy has made a series of bold statements that could reshape the state’s political timeline and redefine its relationship with the Centre. His remarks have triggered intense discussion across political circles and among the public. Assembly Elections Likely in 2029, Not 2028 The Chief Minister made it clear that Telangana Assembly […] The post Revanth Reddy Signals Election Shift and Draws Clear Lines on Telangana’s Political Future appeared first on Telugu360 .

తెలుగు 360 10 Feb 2026 11:18 am

TG |మట్టిలో మాణిక్యం పూనెం కావేరి

TG | మట్టిలో మాణిక్యం పూనెం కావేరి TG | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 10 Feb 2026 11:14 am

25 lakhs |హెచ్​సీయూలో చోరీ…

25 lakhs | హెచ్​సీయూలో చోరీ… 25 lakhs | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 10 Feb 2026 11:11 am

అసోంలో ఎన్నికల హోరు

అసోం మరోసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరుకు సంసిద్ధమవుతోంది. ఇది రాజకీయ పార్టీల బలాబలాలకు మాత్రమే కాక, రాష్ట్ర సామాజిక నిర్మాణ స్థితిని పరీక్షించే సమయం. కొన్ని సంవత్సరాలుగా అసోం రాజకీయాలు పదునైన సైద్ధాంతిక విధానాలు, సంక్షేమం ఆధారిత ఎన్నికల వ్యూహాలు, వివాదాస్పద పరిపాలనా నిర్ణయాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారం ఊపు అందుకుంది. రాజకీయాలు దూకుడుగా మారాయి, సంక్షేమ పథకాలకు ప్రజాదరణ, మరో పక్క ప్రతిపక్షాలు ఏకమయ్యే ప్రయత్నాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారకాలన్నీ కలిసి అస్సోమీ రాజకీయ చరిత్రలో కీలకంగా మారే ఎన్నికలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం రాజకీయ పోటీకి కేంద్రంగా ఉంది. ఆయన తన పదవీకాలంలో బలమైన రాజకీయ ముద్రవేశారు. పాలకవర్గం గుర్తింపు సాధించింది. వలసలు, పౌరసత్వం వంటి సమస్యలు పదేపదే ముందుకు రాగా, వాటిని భద్రతా, సాంసృ్కతిక పరిరక్షణ సంబంధమైన అంశాలుగా రూపొందించింది. ప్రభుత్వ విధానాలు సామాజిక విభజనలను తీవ్రతరం చేయడానికి దోహదపడ్డాయని, ముఖ్యంగా ముస్లిం సమాజాలు, ప్రతిపక్ష పార్టీల పట్ల సానుభూతిపరులుగా భావించే సమూహాలను ప్రభావితం చేసిందని విమర్శకులు వాదిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్ల తొలగింపు, పౌరసత్వ పత్రాల పరిశీలనను తీవ్రతరం చేయడం వివాదాన్ని సృష్టించాయి. ఇవి ఎన్నికల సమగ్రత నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన చర్యలుగా ప్రభుత్వం పేర్కొంటే, ప్రతిపక్షాలు వీటిని ఓటర్లను తగ్గించేందుకు రాజకీయ ప్రేరేపిత చర్యలుగా భావిస్తున్నాయి. అసోంలో ఇటీవలి నియోజకవర్గాల పునర్విభజన అనేక జిల్లాలలో జనాభా కూర్పును మార్చివేసింది. జనాభా లెక్కల్లో నమోదు చేసిన జనాభా మార్పులను ప్రతిబింబించేలా రూపొందించిన డీలిమిటేషన్ చాలా కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న రాజకీయ ప్రక్రియగా ఈ కసరత్తును సమర్థిస్తున్నవారు వాదిస్తున్నారు. కాగా, నియోజకవర్గాల పునర్నిర్మాణం ప్రతిపక్ష ఓటు బ్యాంకులను దెబ్బతీసి, పాలక పక్షానికి మద్దతుగల ప్రాంతాలను ఏకంచేసే ప్రక్రియగా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మైనారిటీలు పెద్దసంఖ్యలో ఉన్న జిల్లాల్లో, నియోజకవర్గాల పునర్నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ప్రాతినిధ్య సమానత్వంపైన, అసోం సామాజిక నిర్మాణంపై దీర్ఘకాలిక చిక్కుల గురించి ఆందోళనలను లేవనెత్తుతోంది. బిజెపి ప్రభుత్వం తన సైద్ధాంతిక సందేశంతో పాటు, విస్తృతమైన సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. మహిళలు, రైతులు, ఆర్థికంగా బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన కార్యక్రమాలు, ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం, సబ్సిడీ ఆహార పంపిణీ, గృహకల్పన పథకాలు అధికార పార్టీ ఎన్నికల వ్యూహంలో కీలకంగా మారాయి. మహిళా సంఘాలకు నగదు బదిలీ, విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ కవరేజ్ వంటి పథకాలు తరచు, అధికారిక ప్రచారంలో హైలైట్ అవుతున్నాయి. ఇవి పరిపాలన సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించిందని రుజువు చేస్తున్నాయి. ఈ పథకాలు అనేక కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. అయినా ప్రతిపక్షాలు మాత్రం ఇవి స్థిరమైన ఆర్థిక వృద్ధిని పెంచడానికి బదులు, స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనం కోసం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఉచితాలుగా అభివర్ణిస్తున్నాయి. అసోం ఎదుర్కొంటున్న కీలక సమస్యలలో నిరుద్యోగం, పారిశ్రామిక స్తబ్దత, జీవనోపాధిని దెబ్బతీసే ఆకస్మిక వరదలు వంటివి పెనుసవాళ్లుగా నిలుస్తున్నాయి. సంక్షేమ పంపిణీ అవసరమైనా, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు తగిన స్థాయిలో లేవని విమర్శకులు వాదిస్తున్నారు. అందువల్ల సంక్షేమమా.. దీర్ఘకాలిక అభివృద్ధి ముఖ్యమా.. అన్న చర్చ ఈసారి ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని ఓ అవకాశంగా తీసుకుంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, దూకుడుగా ప్రచారం ప్రారంభించింది. ముఖ్యమంత్రిపై అవినీతి, భూఅక్రమాలు, అధికార దుర్వినియోగం తోపాటు ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపిస్తున్నది. ఎన్నికలను నైతిక పాలనపై ప్రజాభిప్రాయ సేకరణగా మార్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. భూకబ్జాలు, సందేహాస్పద ఆర్థిక లావాదీవీలపై బహిరంగ ర్యాలీలు, మీడియా సమావేశాలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు దృష్టి సారించాయి. ఈ ఆరోపణలు బిజెపికి అధికారానికి దూరం చేస్తాయా అన్నది అనుమానమే. అధికార పక్షం ఈ ఆరోపణలను రాజకీయ ఉద్దేశంతో చేసినవిగా కొట్టి పారేస్తున్నది. తమ పాలనా కాలంలో సాధించిన రికార్డులు, సంస్థాగత క్రమశిక్షణ నొక్కిచెబుతూ ప్రతిపక్షాల ఆరోపణలను ప్రతిఘటిస్తున్నది. కాంగ్రెస్ తోపాటు అసోంలోని ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలలో రైజోర్ దళ్ అస్సాం జాతీయ పరిషత్, అంచలిక్ గణ మోర్చా (పౌరసత్వ వ్యతిరేక సవరణ చట్టం ఉద్యమాలనుంచి పుట్టిన పార్టీలు) వామపక్షాలు ఎన్నికలలో కొంత మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ఈ గ్రూప్‌లు ఏమేరకు ఎన్నికలలో ప్రభావం చూపగలవన్నది ప్రశ్న. అసోంలో బహుళ మూలాలు ఉన్న పార్టీలు అధికార వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బిజెపికి ప్రయోజనం చేకూర్చాయి. చీలికలు, పీలికలైన ప్రతిపక్షం ఆ మోడల్‌నే పునరావృతం చేసే ప్రమాదం ఉంది. సమన్వయ కూటమి గా నిలిస్తే, ఎన్నికల్లో లెక్కలు మార్చే అవకాశం లేకపోలేదు. అస్సోమీ సమాజంలో కొన్నివర్గాలలో అసంతృప్తి బలంగా ఉన్నట్లు కన్పిస్తున్నది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, యువతలో ఉపాధిపరమైన ఆందోళనలు రాజకీయ చర్చలలో కీలకంగా మారాయి. ఆర్థిక పాలన, సామాజిక ఐక్యతపై కేంద్రీకృతమైన ప్రత్యామ్నాయ కథనాలకు వీలు కల్పించాయి. ఈ భావనను ఓట్లుగా మరల్చే సంస్థాగత కృషి, బలమైన నాయకత్వం, ఇతర ప్రతిపక్ష పార్టీలను ఒప్పించే ఉమ్మడి కార్యక్రమం అవసరం. ఎన్నికల చరిత్ర ప్రకారం ప్రజలలో అసంతృప్తి ఆటోమాటిక్‌గా ప్రభుత్వ వ్యతిరేక ప్రభంజనంగా మారదు. దానిని సమర్థంగా రాజకీయ పరమైన సమీకరణ ద్వారా నాయకత్వం నడిపించగలగాలి. బిజెపి బలమైన నిర్మాణాత్మక శక్తిగా తన ప్రయోజనాలను కాపాడుకుంటున్నది. అసోం గణ పరిషత్ (ఎజిపి) వంటి బలమైన ప్రాంతీయ భాగస్వాములతో దాని పొత్తు పటిష్టంగా ఉంది. అదే దాని సామాజిక పునాదిని, సంస్థాగత పరిధిని విస్తృతం చేస్తున్నది. క్రమశిక్షణగల పార్టీ కేడర్ నెట్‌వర్క్, అత్యాధునిక ప్రచార యంత్రాంగం, బలమైన కేంద్ర నాయకత్వం కలిసి దానిని బలీయమైన ఎన్నికల శక్తిగా నిలబెడుతున్నాయి. అంతే కాక, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రయోగాత్మక రాజకీయ మార్పు కంటే, ప్రస్తుత వ్యవస్థ కొనసాగింపునకు, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం మరో కీలక అంశం. అందువల్ల రానున్న ఎన్నికలు పరస్పర సంబంధం ఉన్న అంశాలపై ఆధారపడే అవకాశం ఉంది. మొదటిది, గుర్తింపుతో కూడిన జనసమీకరణ, పరిపాలన, జవాబుదారీతనం వంటి అంశాలపై చర్చను మార్చేందుకు ప్రతిపక్షం చేస్తున్న ప్రయత్నం చూపే ప్రభావం. రెండవది, సంక్షేమ పథకాలు పాలక పార్టీకి ఎంతవరకూ శాశ్వత ఓటు బ్యాంకును నిలుపుతాయన్నది. మూడవది, ఓటర్ల ప్రవర్తన, ప్రాతినిధ్యంపై నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం. చివరిగా, ఎన్నికలలో అధికార పార్టీ వ్యతిరేకతను ఏకం చేయగలవో లేదో అన్నఅంశం. సీట్ల పంపకాల పై చర్చించేందుకు ఐక్యఫ్రంట్ ప్రదర్శించడానికి ప్రతిపక్షపార్టీలు చేసే కృషి కూడా కీలకం కాగలదు. అసోం రాజకీయ భవిష్యత్ కేవలం ప్రచార ఆర్భాటంపైకాక, రాష్ట్ర సామాజిక ఒప్పందంపై లోతైన ప్రశ్నల ద్వారా రూపుదిద్దుకుంటుంది. గుర్తింపు రాజకీయాలు, అభివృద్ధి ప్రాధాన్యతల మధ్య, సంక్షేమం, ప్రజాదరణ, నిర్మాణాత్మక సంస్కరణల మధ్య, కేంద్రీకృత నాయకత్వం, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య భారత ప్రజాస్వామ్యంలో విస్తృత పరిణామాలను ప్రతిబింబిస్తుంది. ఓటర్లు తాము ఏ పార్టీని ఎన్నుకోవాలో నిర్ణయించుకోడానికి సిద్ధపడుతుండగా, తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న అధికార పార్టీకి, చెల్లాచెదురుగా ఉన్న పార్టీలను స్థిరమైన ప్రత్యామ్నాయంగా మార్చేందుకు యత్నిస్తున్న ప్రతిపక్షానికి మధ్య హోరాహోరీ పోటీకి రంగం సిద్ధమైంది. తుది ఫలితం ఎలా ఉన్నా, ఎన్నికకలో పోటీ తీవ్రత అసోం ప్రజాస్వామ్య ప్రక్రియ శక్తిని తేటతెల్లం చేస్తుంది. ఈ ఎన్నికలు పాలన, ప్రాతినిధ్యం, సామాజిక సామరస్యంపై ప్రజల సెంటిమెంట్‌లకు కీలకమైన బేరో మీటర్‌గా ఉపయోగపడతాయి. గొప్ప వైవిధ్యం, చారిత్రక వారసత్వాలతో గుర్తింపు పొందిన రాష్ట్రంలో సామాజిక అంతరాలను తీవ్రతరం చేయడం కంటే, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేసే విధంగా ప్రచారాన్ని నిర్వహించడం అన్ని రాజకీయ పార్టీలకు సవాల్‌గా నిలువగలదు. అసోం ప్రజలు ఇచ్చే తీర్పు తదుపరి ప్రభుత్వం కూర్పునే కాక, రాబోయే సంవత్సరాల్లో అసోం రాజకీయాలు ఏ దిశలో పరిణామం చెందుతాయో స్పష్టంగా సూచిస్తుంది. - గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) ( రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)

మన తెలంగాణ 10 Feb 2026 11:10 am

TG |బావిలో పడి ఇంటర్ విద్యార్థిని మృతి..

TG | బావిలో పడి ఇంటర్ విద్యార్థిని మృతి.. TG | ఉట్నూర్,

ప్రభ న్యూస్ 10 Feb 2026 10:58 am

మరుగునపడిన మహానగరం

అనుకోకుండా ఇటీవల నేను నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం -వీరప్పగూడెం గ్రామాల దక్షిణ సరిహద్దుల వెంట ప్రవహిస్తున్న కృష్ణా నది ఎడమ ఒడ్డున ఒక మహత్తర పురాతన నగర శిథిలాలను గుర్తించాను. పురావస్తు ఆధారాల ప్రకారం ఈ నివాసం సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి క్రీ.శ. 15వ శతాబ్దం వరకు నిరంతరంగా మనుగడ సాగించింది. ఈ ప్రదేశంలో ఇనుపయుగానికి చెందిన వందలాది బృహత్శిలా సమాధులు (కెయిరన్లు) ఉన్నాయి. ఇవి వీరుల సమాధులని స్థానికులు నమ్మడం వల్లే ఈ ప్రాంతానికి వీరులపాడు, వీరప్పగూడెం అనే పేర్లు వచ్చాయి. జీవనదైన కృష్ణా నది సమృద్ధిగా నీరు, చేపలు, ఇతర సహజ వనరులను అందించడంతో ఇక్కడ ఒక గొప్ప నగరం వికసించింది. భారీ రాళ్లపై పనిచేయగల స్థాయి ఇనుము ఇక్కడే తయారయ్యేదని సూచించే ఇనుప చిట్టాలు పలు చోట్ల లభిస్తున్నాయి. ఈ సమాధులు నాలుగు పెద్ద నిలువు రాళ్లతో నిర్మించి, పైభాగంలో ఒక చదునైన కప్పురాయిని ఉంచి నిర్మించారు. కృష్ణా తీరంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి సమాధులపై గత దశాబ్దాల్లో జరిగిన తవ్వకాలు మూడు వేల సంవత్సరాల నాటి తెలంగాణ సాంస్కృతిక జీవనాన్ని వెలుగులోకి తీసుకువచ్చాయి.అయితే ఈ వీరులపాడు స్థలం ఇప్పటివరకు పురావస్తు శాఖ దృష్టికి రాలేదు. ఇక్కడి సమాధుల నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు స్థానికంగా బంజరు రాళ్లుగా పిలవబడే, శాస్త్రీయంగా పల్నాడు రాళ్లుగా తెలిసినవి. వీటి లభ్యత కారణంగానే సుమారు యాభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఒక సిమెంట్ కంపెనీ స్థాపించబడింది. ఆ కంపెనీతోపాటు స్థానికులు కూడా విస్తృతంగా సమాధి రాళ్లను వినియోగించడంతో, గుప్తనిధుల కోసం జరిగిన ధ్వంసంతో కలిసి, ఇప్పుడు అతి కొద్ది బృహత్శిలా సమాధులే మిగిలాయి. మిగిలినవీ త్వరలో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. బృహత్శిలా దశ తరువాత సుమారు వెయ్యేళ్ల పాటు మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు స్వల్పంగా మాత్రమే లభిస్తున్నాయి. అయితే మధ్యయుగ కాలంలో (క్రీ.శ. 10-15 శతాబ్దాలు) నిర్మితమైన కోటగోడలు, బురుజులు, ధాన్యాగారాలు, ఆలయాలు, బావులు, ఇళ్లు, శిల్పాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కృష్ణా నది వైపు దక్షిణ దిశగా ప్రధాన ద్వారం కలిగిన సుమారు 70 స 70 మీటర్ల చదరపు కోట నిర్మాణం ఉంది. కోటలోపల ముఖ్యమైన ఒక నిర్మాణానికి చెందిన పునాదులు ఉన్నాయి. కోటకు ఆగ్నేయంగా ఉన్న ఎత్తైన బురుజు శత్రువుల కదలికలను గమనించడానికి ఉపయోగించి ఉండవచ్చు. కోటగోడల ఈశాన్యంలో వనదుర్గ, పోషమ్మ, పోతరాజు, వీరభద్రుడు /భైరవుడు, వీర దంపతుల వీరగల్లు, ఒక పురుష యోధుని వీరగల్లు వంటి శిల్పాలు ధ్వంసావస్థలో ఉన్నాయి; వాటి ఆలయాలు నాశనం చేయబడ్డాయి. వాస్తు-శిల్ప లక్షణాల ఆధారంగా ఈ నిర్మాణాలు స్థానిక కందూరి చోళుల కాలం నుంచి రేచర్ల పద్మనాయకుల కాలం వరకు (క్రీ.శ. 10-15 శతాబ్దాలు) చెందినవిగా భావించవచ్చు. స్థానిక కథనాల ప్రకారం కాకతీయ రాణి రుద్రమదేవి (క్రీ.శ. 13వ శతాబ్దం) ఈ కోటను ధాన్య నిల్వ కేంద్రంగా ఉపయోగించిందని చెబుతారు. ఆరు గజాల వ్యాసంతో ఉన్న గుండ్రటి ధాన్యాగారాలు, లోపల సున్నంతో పూత వేసిన విధానం ఈ మాటకు ఆధారంగా నిలుస్తున్నాయి. గృహ వినియోగానికి సంబంధించిన మట్టిపాత్రలు తక్కువగా లభించడంవల్ల, ఇది సాధారణ నివాస ప్రాంతం కాకుండా శత్రువుల నుంచి రక్షితంగా ఉన్న రహస్య ధాన్యాగారంగా పనిచేసిందని భావించవచ్చు. కోటకు దక్షిణంగా సుమారు ఒక ఫర్లాంగ్ దూరంలో, కృష్ణా నది ఒడ్డున రేచర్ల పద్మనాయకుల కాలానికి చెందిన (క్రీ.శ. 14-15 శతాబ్దాలు) లక్ష్మీనరసింహాలయం శిథిలావస్థలో ఉంది. ముఖ మండపం పూర్తిగా ధ్వంసమై ఉండగా, అంతరాళం పూర్తిగా, గర్భగుడి పాక్షికంగా మాత్రమే మిగిలి ఉన్నాయి. లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి విగ్రహాలు దుండగుల చేతుల్లో విరిగిపోయాయి. వాటి ముక్కలను నేను పరిసర ప్రాంతాల్లో సేకరించి తిరిగి అమర్చగా, విగ్రహాల రూపరేఖలు స్పష్టంగా గోచరించాయి. ప్రధాన విగ్రహ పీఠంపై గరుడ శిల్పం ఉండడం, ఆలయ సమీపంలో దాసాంజనేయుడి శిల్పం ఉండడం వలన ఈ ఆలయ నిర్మాణానికి పద్మనాయకులే కారకులని నిర్ధారణ అవుతుంది. సిమెంట్ కంపెనీ కార్యకలాపాలు, స్థానికుల రాళ్ల వినియోగం, విధ్వంస చర్యల వల్ల బృహత్శిలా సమాధులు వేగంగా నశిస్తున్న నేపథ్యంలో, ఈ అపూర్వమైన చారిత్రక వారసత్వం పూర్తిగా అంతరించిపోకముందే కనీసం డాక్యుమెంషన్ అయినా చేయాలని పురావస్తు శాఖను నేను అత్యవసరంగా కోరుతున్నాను. - డా. ధ్యావనపల్లి సత్యనారాయణ ( చరిత్ర కారుడు) -9490557078

మన తెలంగాణ 10 Feb 2026 10:57 am

Hydra |చెరువుల ఆక్రమణల కూల్చివేత..

Hydra | చెరువుల ఆక్రమణల కూల్చివేత.. ఆంధ్రప్రభ వరుస కథనాలకు స్పందన..స్థానికుల హర్షం..

ప్రభ న్యూస్ 10 Feb 2026 10:54 am

Telangana |కుటుంబ కలహాలతోనే ఆ ప‌నిచేశాడా…!

Telangana | కుటుంబ కలహాలతోనే ఆ ప‌నిచేశాడా…! Telangana| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 10 Feb 2026 10:40 am

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు వేతనాలు పెంచాలి

ఫిబ్రవరి 10 జనం సాక్షిజాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు జీవో నంబర్‌ 60 ప్రకారం రూ.15వేల జీతాన్ని పెంచి వెంటనే …

జనం సాక్షి 10 Feb 2026 10:37 am

పాలకపక్షానికి తొలి పరీక్ష

తెలంగాణ ఉద్యమంలో ప్రజల మస్తిష్కాలను ప్రజ్వరిల్లింపజేసి ఈప్రాంత భావజాలాన్ని అట్టడుగుస్థాయికి తీసుకుపోయి ప్రజలను ఏకతాటిపై నిలబడంలో ప్రధాన భూమిక పోషించిన తెలంగాణ యాస భాషకే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. భాష పదును రాజకీయ పరిస్థితులనే మార్చి వేసిందని చెప్పడంలో చర్చకు తావే లేదు. తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ముందు ఎలాంటి భాషను వినియోగించారో చెప్పడానికి ఇప్పుడు ఉన్నటువంటి మాధ్యమాలు అప్పుడు అంతగా లేవు. ఈ ప్రాంత ఉద్యమ నేతలు వాడిన భాషకే దక్కుతుంది. పదేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు మున్సిపల్ ఎన్నికలు తొలి పరీక్ష మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలకు తొలిటెస్ట్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు సాధారణ స్థానిక సంస్థల పోటీ కాదు. ఇవి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తొలి ప్రజా పరీక్ష, ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌కు తిరిగి పుంజుకునే అవకాశం, బిజెపికి పట్టణ రాజకీయాల్లో తన స్థానం వెతుక్కునే ప్రయోగం. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి స్థానిక అంశాలే ఓటింగ్‌ను ప్రభావితం చేస్తున్నప్పటికీ, ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికార బలం అనే నినాదంతో ప్రచారం కొనసాగుతున్నది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా అవకాశాలను అదునుగా అధికార పార్టీగా కాంగ్రెస్ ఈ మున్సిపల్ ఎన్నికలను రక్షణాత్మకంగా ఎదుర్కొంటోంది. ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలే తమ ప్రధాన ఆయుధమని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెబుతోంది. ఉచిత బస్సు, పెన్షన్లు వంటి పథకాలతో లబ్ధిదారుల మద్దతు దక్కుతుందనే లెక్కలేస్తుంది. కానీ పట్టణ ఓటరుముందు కాంగ్రెస్‌కు కఠిన ప్రశ్నలను ఎదుర్కోవల్సివస్తుంది. ధరలు, ట్రాఫిక్, మౌలిక వసతులు ఉద్యోగాల అంశాల్లో స్పష్టమైన మార్పు కనిపించలేదన్న భావన బలంగా ఉంది. మున్సిపల్ సమస్యలపై ఇప్పటివరకు ప్రభుత్వ స్థాయి చర్యలు స్పష్టంగా కనిపించకపోవడం కూడా కాంగ్రెస్‌కు మైనస్‌గ్గా మారుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అది తమ పాలనపై ప్రజల విశ్వాసంగా భావించవచ్చు. ఓడితే మాత్రం- పాలనపై తొలి హెచ్చరికగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువే. మున్సిపల్ ఎన్నికలలో ఆశించినంత ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి రాకుంటే గ్రూప్ రాజకీయాలు బహిర్గతం అవుతావేమో అనే సందేహం ఏర్పడక తప్పదని విశ్లేషకుల అభిప్రాయం. ప్రతిపక్షంలో ఉన్న బిఆర్‌ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికలను అనుకూల వేదికగా భావిస్తోంది. గత రెండు పర్యాయాల పాలనలో పట్టణాల్లో చేసిన రోడ్లు, డ్రైనేజీలు, మిషన్ భగీరథ, మౌలిక వసతుల అభివృద్ధినే ప్రధాన ప్రచార అంశంగా మలుస్తోంది. పట్టణాలను కట్టింది మేమే అన్న నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై పనులు నిలిచిపోయాయన్న విమర్శను గట్టిగా వినిపిస్తోంది. ఆరు గ్యారంటీలు, హామీలు నోటి మాటలే తప్పా అభివృద్ధి శూన్యం అనే ప్రచార సాధనలతో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ బిఆర్‌ఎస్‌కు బలమైన కేడర్ ఉండటం పార్టీకి అదనపు బలం. అయితే అధికారంలో లేని పార్టీగా హామీలు ఇవ్వడంలో పరిమితులు ఉన్నాయి. గత పాలనపై ఉన్న అసంతృప్తి కూడా కొన్నిచోట్ల బిఆర్‌ఎస్‌కు అడ్డంకిగా మారుతోంది. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు లాభం కలిగితే అది రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి ఊపు వచ్చినట్టే. కాని ఇప్పటిదాకా బిఆర్‌ఎస్ మీద ఇంకా ఆశించినంత ప్రజలలో సానుభూతి రాలేదు. బిజెపికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు పూర్తిస్థాయి గెలుపు కోసం కాదు. పట్టణాల్లో తన ఓటు శాతాన్ని పెంచుకోవడమే ప్రధాన వ్యూహం. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండింటినీ ఒకే తాటిపై పెట్టే విమర్శలతో పట్టణ మధ్యతరగతి యువతపై దృష్టి పెట్టింది. కానీ బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం, మున్సిపల్ సమస్యలపై స్పష్టమైన ప్రత్యామ్నాయ ప్రణాళిక లేకపోవడం బిజెపికి పెద్ద బలహీనత. ఈ ఎన్నికల్లో బిజెపి నిర్ణయాత్మకశక్తిగా కాకపోయినా, ఓటు చీలికకు కారణమయ్యే అవకాశముంది. ప్రజల తీర్పు పనితనానికే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మూడ్ స్పష్టం. రాష్ట్ర రాజకీయాల ప్రభావం ఉన్నా, చివరికి ఓటరు చూస్తున్నది స్థానిక పనితనమే. రోడ్డు బాగుందా, డ్రైనేజీ పనిచేస్తుందా, తాగునీరు సమయానికి వస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగల అభ్యర్థికే ప్రజల మద్దతు దక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్‌కు హెచ్చరిక కావచ్చు.బిఆర్‌ఎస్‌కు పునరాగమన సంకేతం కావచ్చు. బిజెపికి భవిష్యత్తు ప్రయోగంగా మారవచ్చు. ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వచ్చినా ఒక విషయం మాత్రం ఖాయం. తెలంగాణ పట్టణ ఓటరు ఇక మాటలు కాదు, పనులనే ఓటుగా మారుస్తున్నాడు. అనేది ఈ ఎన్నికల అసలు సందేశం. మాటల రాజకీయానికి మున్సిపల్ హెచ్చరికగా, పాలన కంటే దూషణలు పెద్దవైతే, ప్రజల తీర్పు మౌనంగా కానీ కఠినంగా ఉంటుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఎల్లుండి జరుగే తీర్పులో రాజకీయ వాతావరణం ప్రజల దైనందిన సమస్యల చుట్టూ కాకుండా మాటల దిగజారుడు చుట్టూ తిరుగుతోంది. సిఎం నుంచి ప్రతిపక్ష నేతల వరకూ వినిపిస్తున్న సంస్కారం లేని వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, అహంకార ప్రదర్శనలు ఇవి ప్రజాస్వామ్య రాజకీయాలకు ప్రమాదకర సంకేతాలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చూస్తే పాలనపై చర్చ కనపడటం లేదు. పదజాలపు పోటీ మాత్రమే కనిపిస్తోంది. ఇది ప్రజల సహనాన్ని పరీక్షించే దశకు రాజకీయాలను తీసుకెళ్లింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు మాటల విషయంలో అదుపు కోల్పోతే, అది కేవలం వ్యక్తిగత వైఖరి కాదు పాలనా శైలికి అద్దం. అధికారంలో ఉన్నవారు మాటల్లోనే సంస్కారం కోల్పోతే, అధికార వినియోగంలో బాధ్యతపై సందేహం తలెత్తడం సహజం. కానీ ప్రతిపక్షం కూడా అదేస్థాయిలో దూషణల రాజకీయానికి దిగితే, ప్రజల్లో ఏర్పడే భావన ఒక్కటే ఇద్దరూ ఒకటే. ఈ భావన అధికారానికి లాభం కాదు, ప్రతిపక్షానికి గెలుపు కాదు; ఇది ప్రజాస్వామ్యానికి నష్టం. తెలంగాణ పట్టణ ఓటరు ఇక మౌనంగా ఉండే అమాయకులు కారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు సంపూర్ణ తిరస్కారంగా కాకపోయినా, స్పష్టమైన హెచ్చరిక తీర్పుగా మారే అవకాశాలు ఎక్కువ. మాటల రాజకీయానికి ఓటు తగ్గింపు పనితీరు లేని నాయకులకు మౌన శిక్ష స్థానికంగా పనిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం. ఇవే ఫలితాల్లో కనిపించే సంకేతాలు కావచ్చు. ఈ ఎన్నికలు సిఎం వర్సెస్ ప్రతిపక్షం కాదు. సంస్కారం వర్సెస్ అహంకారం. ప్రజలు కోరుకుంటున్నది గట్టిగా అరచే నాయకత్వం కాదు. గౌరవంగా మాట్లాడే పాలన. దూషించే మాటలు కాదు. పనిచేసే చేతులు. మాటలు మారకపోతే తీర్పు మారుతుంది. ఆ మార్పు మున్సిపల్ ఎన్నికలతోనే మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. - మధు గౌడ్ జి, (సీనియర్ జర్నలిస్టు)

మన తెలంగాణ 10 Feb 2026 10:33 am

అత్తింటి వేధింపులు.. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

సికింద్రాబాద్: అత్తింటి వారు వేధించడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని రెజిమెంటల్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన సీతారామ్(36) అనే వ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. సీతారామ్‌కు నంద్యాల చెందిన యువతి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. జనవరి 24న భర్త వది పిల్లలను వదిలి భార్య వెళ్లి పోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. అల్లుడు వద్ద అత్తమామలు ఉంటున్నారు. అతడి వద్ద ఉన్న పిల్లలను అత్తమామలు తీసుకెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ద్విచక్రవాహనం బయలుదేరి హుస్సేన్ సాగర్ కు చేరుకున్నాడు. ఒక్కసారిగా హుస్సేన్ సాగర్‌లో దూకడంతో పక్కనున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని గాలించారు. డిఆర్‌ఎప్, హైడ్రా బృందాలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. ప్లాస్టిక్ కవర్‌లో ఉన్న సెల్‌ఫోన్ లభ్యమైందని, తన చావుకు భార్య, అత్తమామలే కారణమని సెల్‌ఫోన్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు.  

మన తెలంగాణ 10 Feb 2026 10:30 am

Montha Cyclone : మొంథా తుపాను పరిహారం కథ ముగిసినట్లేగా?

ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుపాను గత ఏడాది అక్టోబరు నెలలో వచ్చింది

తెలుగు పోస్ట్ 10 Feb 2026 10:08 am

Srisailam : శ్రీశైలంలో మూడో రోజు బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో మూడో రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

తెలుగు పోస్ట్ 10 Feb 2026 10:03 am

మంచి వినోదాన్ని అందించే చిత్రం

ఎల్‌ఎ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హేమంత్ కుమార్, అయానా, గోపీక సురేష్ ప్రధాన పాత్రల్లో విజయ్.ఎన్ తెరకెక్కించిన చిత్రం ‘ఆల్ఫా’. ఈ సినిమాని హేమంత్ కుమార్, ఆనంద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మూవీని తెలుగులో రవిశంకర్, మంజునాథ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సముద్ర మాట్లాడుతూ “ఆల్ఫా’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ‘కేజీయఫ్’, ‘కాంతార’ స్థాయిలో ‘ఆల్ఫా’ని ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో హేమంత్ కుమార్ మాట్లాడుతూ “సినిమాలోని కంటెంట్ మీదున్న నమ్మకంతోనే రవిశంకర్ ఈ మూవీని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. మంచి వినోదాన్ని అందించే చిత్రమిది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయానా, గోపికా సురేష్, రవిశంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 10 Feb 2026 9:55 am

ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

–రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ విశాలాంధ్ర ధర్మవరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధా విధంగా కొనసాగించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ తెలిపారుఈ సందర్భంగా వారుధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి లో ఏపీవో కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కష్టజీవులకు మేలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి […] The post ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 9:49 am

Andhra Pradesh : ఏపీలో పేద ప్రజలకు భారీ ఊరట.. 1.40 కోట్ల మందికి గ్రేట్ రిలీఫ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 10 Feb 2026 9:45 am

Andhra Pradesh : మైనారిటీ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

మైనారిటీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 10 Feb 2026 9:40 am

తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి :ఎఐవైఎఫ్

విశాలాంధ్ర ధర్మవరం:రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని వివిధ ప్రభుత్వశాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు అలాగే జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వలని పిలుపులో భాగంగా ఎఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్మవరం ఆర్డీవో ఇన్చార్జి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భముగా సత్యసాయి జిల్లాఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా మాట్లాడుతూరానున్న అసెంబ్లీ సమావేశాలలో నిరుద్యోగ […] The post తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి :ఎఐవైఎఫ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 9:40 am

డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో చేసిన సినిమా

హిట్ మేకర్ అనిల్ రావిపూడి అసోసియేట్, అతని అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సహ రచయితగా పని చేసిన ఎస్.కృష్ణ ’హై’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నటుడు , సహ నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య శర్మ, ఎస్.కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ చిత్ర టీజర్‌ను విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు. ఎస్.కృష్ణ ఒక బోల్డ్ కథని ఎమోషన్స్‌తో కూడిన డ్రామాగా చూపించారు. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను సృష్టించింది. ఈ సినిమా టాకీ భాగం పూర్తయింది, పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ఒక కొత్త జానర్‌లో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తీసిన సినిమా ఇది. ఆడియన్స్ చూసిన తర్వాత తన ప్రయత్నాన్ని కచ్చితంగా ఆదరిస్తారు. హైదరాబాద్ లైవ్ లొకేషన్స్‌లో ఈ సినిమా తీశారు”అని అన్నారు. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎస్.కృష్ణ మాట్లాడుతూ “ఈ సినిమా తీయడానికి నాకు రెండేళ్లు పట్టింది. వికాస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. టీజర్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా ఉండే మూవీ ఇది”అని తెలియజేశారు. నిర్మాత హరీష్ పెద్ది మాట్లాడుతూ “ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్. ఆడియన్స్ థియేటర్స్‌లో చూస్తున్నప్పుడు కచ్చితంగా ఒక విభిన్నమైన అనుభూతిని పొందుతారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, డి.సురేష్ బాబుతో పాటు చిత్ర బృందం తదితరులు పాల్గొంది.

మన తెలంగాణ 10 Feb 2026 9:38 am

నేడు లోక్‌సభ స్పీకర్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం

నేడు లోక్‌సభ స్పీకర్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది

తెలుగు పోస్ట్ 10 Feb 2026 9:33 am

ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా కేశవానంద

విశాలాంధ్ర- ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా ఉరవకొండ పట్టణానికి చెందిన టిడిపి పార్టీ సీనియర్ నాయకులు ప్యారం కేశవానంద నియమితులయ్యారు. ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ప్రభుత్వం త్రీ మెన్ కమిటీని నియమించింది. చైర్మన్ తో పాటు డైరెక్టర్లుగా నిమ్మగల్లు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శివకుమార్ (పుట్టప్ప) భార్య నాగ ప్రమీల, ఉరవకొండ పట్టణానికి చెందిన నాగేంద్రప్ప ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ […] The post ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా కేశవానంద appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 9:25 am

మున్సిపల్ ఎన్నికలవేళ తీవ్ర విషాదం..

మున్సిపల్ ఎన్నికలవేళ తీవ్ర విషాదం.. ఆత్మహత్యకు పాల్పడ్డ బీజేపీ అభ్యర్థి కరుకలి మహాదేవ్ఉమ్మడి

ప్రభ న్యూస్ 10 Feb 2026 9:23 am

‘ఆయా షేర్...’ పాట ప్రారంభం

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఫ్లోర్ నుంచి తాజా అప్‌డేట్‌తో భారీ అంచనాలను సృష్టిస్తోంది. వందలాది మంది డ్యాన్సర్స్‌తో కూడిన భారీ సెట్‌లో నాని బ్లాస్టింగ్ ఇంట్రో సాంగ్ ఆయా షేర్ షూటింగ్‌ని టీం ప్రారంభించింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఎలక్ట్రిఫైయింగ్ మాస్ బ్యాంగర్‌ను అందించారు. రా ఎనర్జీతో నాని డ్యాన్స్ స్టైల్‌కు ఇది పర్ఫెక్ట్ సాంగ్. విజయ్ ’జన నాయగన్’ కు పని చేసిన కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ అద్భుతమైన స్టెప్స్‌తో ఈ పాటను తెరకెక్కిస్తున్నారు. నాని ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఈ పాట అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఎనిమిది భాషలలో పాన్-వరల్డ్ మూవీగా విడుదలకు సిద్ధంగా ఉంది.

మన తెలంగాణ 10 Feb 2026 9:20 am

Weather Report : భానుడి భగభగలు.. ఉక్కిరిబిక్కిరవుతున్న జనం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కింది.

తెలుగు పోస్ట్ 10 Feb 2026 9:18 am

ఘనంగా పి ఆర్ టి యు ఆవిర్భావ దినోత్సవం

విశాలాంధ్ర- డుంబ్రిగుడ : మండల కేంద్రం డుంబ్రిగూడ మండల పరిషత్ పాఠశాల ఆవరణలో పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అప్పలరాజు ఆధ్వర్యంలో ఘనంగా పిఆర్టియు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిఆర్టియు జెండాను ఆవిష్కరించారు. అనంతరం పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అప్పలరాజు మాట్లాడుతూ ప్రధానంగా అప్రెంటిస్ విధానం రద్దు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు 010 ద్వారా వేతనాలు కొరకు కృషిచేసి సాధించడం […] The post ఘనంగా పి ఆర్ టి యు ఆవిర్భావ దినోత్సవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 9:15 am

Telangana : రేపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు

రేపు తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్ జరగనుది

తెలుగు పోస్ట్ 10 Feb 2026 9:14 am

after akhanda2 |బన్నీ–బోయపాటి సినిమా ఫిక్సా?

after akhanda2 | బన్నీ–బోయపాటి సినిమా ఫిక్సా? after akhanda2 | అఖండ

ప్రభ న్యూస్ 10 Feb 2026 9:12 am

ఘట్‌కేసర్ లో విద్యార్థినికి తాళి కట్టిన పంతులు... అరెస్టు

మేడ్చల్ మల్కాజ్‌గిరి: విద్యార్థులకు బుద్ధిగా పాఠాలు నేర్పాల్సిన టీచర్, విద్యార్థినిలకు ప్రేమ పాఠాలు నేర్పించాడు. సదరు విద్యార్థిని లొంగదీసుకొని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని చివరికి అరెస్టు అయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జల్లా ఘట్‌కేసర్ మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పోచారం ఐటి కారిడార్ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాలలో పర్రే మైటీన్ అనే ఉపాధ్యాయుడు భౌతిక శాస్త్రం బోధిస్తున్నాడు. పదో తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి చనువు పెంచుకున్నాడు. తెలిసి తెలియని బాల్యంలో ఆమెకు ప్రేమ పాఠాలు నేర్పించి ప్రేమాయణం నడిపించాడు. ఇద్దరు రహస్యంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. విద్యార్థిని మెడలో పసుపు తాడు కనిపించడంతో కూతురును తల్లి మందలించింది. జరిగిన విషయం చెప్పడంతో స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు ప్రశ్నించారు. వాళ్లు పట్టించుకోకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పర్రే మైటీన్‌పై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మన తెలంగాణ 10 Feb 2026 9:08 am

నిరుద్యోగ యువతకు జాబ్ మేళా

– మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం: నిరుద్యోగ యువతకు మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫిబ్రవరి 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళా కార్యక్రమం ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. యువతకు నైపుణ్యాధారిత ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైన […] The post నిరుద్యోగ యువతకు జాబ్ మేళా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 10 Feb 2026 9:05 am

Gold Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి సూచనలివే

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది.

తెలుగు పోస్ట్ 10 Feb 2026 8:56 am

కారు గుర్తుకు ఓటేయండి.. కౌన్సిలర్ గా గెలిపించండి –బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే భీమయ్య..

కారు గుర్తుకు ఓటేయండి.. కౌన్సిలర్ గా గెలిపించండి – బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే

ప్రభ న్యూస్ 10 Feb 2026 8:53 am

Prabhas pushes Salaar 2 Again

Pan-Indian Star Prabhas has several films lined up for shoot. His last best film was Salaar and Prashanth Neel had plans for the sequel and it was announced. The project was even shelved but the makers re-confirmed that the film is happening soon. But due to the big lineup of Prabhas, the sequel of Salaar […] The post Prabhas pushes Salaar 2 Again appeared first on Telugu360 .

తెలుగు 360 10 Feb 2026 8:51 am

కుర్చీ గుర్తుకు ఓటెయ్యండి.. కౌన్సిలర్ గా గెలిపించండి –మొగుళ్ళ అనురాధ..

కుర్చీ గుర్తుకు ఓటెయ్యండి.. కౌన్సిలర్ గా గెలిపించండి – మొగుళ్ళ అనురాధ.. మోత్కూర్,

ప్రభ న్యూస్ 10 Feb 2026 8:49 am

పవన్ కు కొత్త ప్రొడ్యూసర్ దొరికారు... అందుకే తెలంగాణలో పోటీ చేస్తున్నారు: అనిరుధ్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ వాళ్లది నరదిష్టి అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇక్కడికి ఎలా వస్తారని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో జనసేన పార్టీ ఎలా పోటీ చేస్తుందని నిలదీశారు. 2019 ఎన్నికలలో ప్రొడ్యూసర్ లేకపోవడంతో ఒక్క సీటు కూడా జనసేన గెలవలేదన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ప్రొడ్యూసర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ దొరకడంతో జనసేన పార్టీ గెలిచిందని ఎద్దేవా చేశారు. మంత్లీ ప్యాకేజీ తీసుకుంటూ పవర్ స్టార్... ప్యాకేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు అది సరిపోక తెలంగాణలో కొత్త ప్రొడ్యూసర్ ప్రధాని నరేంద్ర మోడీని తెచ్చుకున్నారని చురకలంటించారు. పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తానని, వాళ్లకు తాను అభిమానినని చెప్పారు. తెలంగాణలో భూముల రేట్లు ఎక్కువగా ఉండడంతో ఆంధ్రోళ్ల కన్ను తెలంగాణపై పడిందని, బెంగళూరు, కర్నాటకకు వెళ్తే బతకలేరని, తెలంగాణ ప్రజలు అమాయకులు కావడంతో నర దిష్టి అన్న కూడా పట్టించుకోరని, పవన్‌కు జేజేలు కొడుతున్నామని దుయ్యబట్టారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి కూడా గోదావరి జిల్లాల పచ్చదనం శాసం తగలడంతోనే విడిపోయిందన్నారు. తెలంగాణ వాళ్ల దిష్టి తగలడంతో కొబ్బరి చెట్లు ఎండిపోయానని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 10 Feb 2026 8:46 am

Revanth Reddy : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

తెలుగు పోస్ట్ 10 Feb 2026 8:34 am

Tirumala : తిరుమలకు ఇంత రద్దీ పెరగడానికి రీజన్ అదేనా?

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తెలుగు పోస్ట్ 10 Feb 2026 8:19 am

సిద్దిపేటలో చెట్టుకు ఉరేసుకున్న ప్రేమజంట

నారాయణరావుపేట: సిద్దిపేట జిల్లా కేంద్రం పెద్దలింగారెడ్డిపల్లి శివారులో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిన్నకోడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(17), నారాయణరావు పేట మండల కేంద్రానికి చెందిన శ్రావణ్(24)తో ప్రేమలో పడింది. ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రావణ్, యువతితో కలిసి బయటకు బయలుదేరారు. సాయంత్రం వరకు వారు రాకపోవడంతో ఇరు కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఫోన్లు చేసి స్విచ్ఛాఫ్ అని రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్ ఇరు కుటుంబాల సభ్యులు ఫిర్యాదు చేశారు. రాఘవాపురం,  పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ శివారులో ఓ జంట చెట్టుకు వెలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఆధార్ కార్డు ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యువతి బ్యాగ్‌లో కొత్త చీర కూడా ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు ప్రేమ వివాహానికి అంగీకరించరనే భావనతో పాటు యువతి అక్క పెళ్లి జరిగిన తరువాతే తన పెళ్లి జరుగుతుందనే భావన ఇద్దరిలో ఉండిపోయింది. దీంతో ఇద్దరు కలిసి చనిపోదామనే నిర్ణయానికి వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు ఫోన్లను స్వాధీనం కాల్ హిస్టరీ ద్వారా విచారణ చేస్తున్నారు. ప్రేమించుకుంటే ప్రాణం తీసుకోవడమేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకోవలని సలహా ఇస్తున్నారు. 

మన తెలంగాణ 10 Feb 2026 8:16 am

నేడు అంబటి క్వాష్ పిటీషన్ పై విచారణ

మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటీషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది.

తెలుగు పోస్ట్ 10 Feb 2026 7:59 am

‘సర్’కొనసాగాల్సిందే..

` ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు కల్పించవద్దు ` సుప్రీంకోర్టు న్యూఢిల్లీ(జనంసాక్షి):బెంగాల్‌లో నిర్వహిస్తోన్న ‘సర్’ కసరత్తును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం …

జనం సాక్షి 10 Feb 2026 7:50 am

కాంగ్రెస్‌తోనే అభివద్ధి

` అందరికీ సంక్షేమ ఫలాలు చేరాలంటే ప్రజాప్రభుత్వాన్నే ఆశీర్వదించాలి ` మధిర మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మధిర, ఫిబ్రవరి 09 (జనంసాక్షి) …

జనం సాక్షి 10 Feb 2026 7:47 am

Chandrababu : నేడు అమిత్ షాతో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు

తెలుగు పోస్ట్ 10 Feb 2026 7:45 am

దందాలకు కాలం చెల్లింది

` ఏప్రిల్‌లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ` రాజకీయాల ముసుగులో అరాచకాలు చేస్తే సహించేదిలేదు ` అధికారం లేని విరు అభివద్ధి ఎలా చేస్తారు? ` బెదిరింపులకు …

జనం సాక్షి 10 Feb 2026 7:44 am

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..?

` సభలో తమను మాట్లాడనివ్వడం లేదని విపక్షాల ఆరోపణ న్యూఢిల్లీ(జనంసాక్షి):పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో ఉభయ సభల కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలుగుతోంది. …

జనం సాక్షి 10 Feb 2026 7:42 am

తెలంగాణకేమిచ్చారు?

` 12 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్నారు ` భాజపాకు సీఎం రేవంత్ సూటి ప్రశ్న ` రెండేళ్ల అభివద్దిని చూసి ఓటేయండి ` పట్టణాల అభివద్ది కేవలం …

జనం సాక్షి 10 Feb 2026 7:39 am

India vs Pakistan : క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 15న భారత్ - పాక్ మ్యాచ్

భారత్ - పాక్ మధ్య మ్యాచ్ వచ్చే ఆదివారం జరగనుంది

తెలుగు పోస్ట్ 10 Feb 2026 7:34 am

కల్వకుర్తిలో అత్తపై అల్లుడు అత్యాచారం... చంపేసి

కల్వకుర్తి: మద్యం మత్తులో అత్తపై అల్లుడు అత్యాచారం చేసి అనంతరం ఆమెను చంపేసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కల్వకుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన తన కూతురును తిమ్మాజీ పేట మండలంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేసింది. కానీ అల్లుడు మద్యానికి బానిసగా మారి కూతురును వేధించడం మొదలు పెట్టాడు. రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువ కావడంతో అల్లుడిని ఇల్లరికం తెచ్చుకొని ఇద్దరిని పోషిస్తోంది. దంపతులు గొడవలు తగ్గకపోగా తారాస్థాయికి చేరుకోవడంతో భర్తను వదిలి తన బంధువుల ఇంటికి భార్య వెళ్లిపోయింది. ఇంట్లో అత్త ఒంటరిగా ఉండడంతో ఆమెపై అల్లుడు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండో కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 10 Feb 2026 7:32 am

బిఆర్‌ఎస్, బిజెపి మధ్య క్విడ్ ప్రోకో

పరస్పరం సహకరించుకుంటున్న ఇరు పార్టీలు కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగిస్తే కేంద్రం ఏం చేసింది? ఇ-కార్ రేస్‌లో విచారణకు అనుమతి కోరితే ఇంతవరకూ అతీగతీ లేదు పెద్దనోట్లను రద్దు చేస్తే అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీని అభినందించింది బిఆర్‌ఎస్ కాదా? కేంద్రంలోని బిజెపి తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇవ్వలేదా? మోడీ ప్రేమ ఉంటే చాలని కెసిఆర్ బహిరంగంగా ప్రకటించలేదా? ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్‌రావును 20 నెలలు అమెరికాలో దాచిపెట్టడం వల్లనే అరెస్టులో జాప్యం బిఆర్‌ఎస్‌ను యాసిడ్‌తో కడగాలి రాష్ట్రంలో మళ్లీ మొలకెత్తకుండా చూడాలి మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిఆర్‌ఎ స్, బిజెపి మధ్య క్విడ్ ప్రోకో బంధం బలపడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. “మీ క ళ్ళ ముందు ఉన్న కేంద్రంలోని పన్నెండేళ్ళ బిజెపి పాలన, గత పదేళ్ళ బిఆర్‌ఎస్ పాలన, మా రెండే ళ్ళ పాలనను చూసి ఆలోచించి ఓట్లు వేయం.. మ మ్మల్ని ఆశీర్వదించండి” అని రేవంత్‌రెడ్డి పట్టణ ఓటర్లకు పిలుపునిచ్చారు. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో రా ష్ట్రంలోని పట్టణ ప్రాంత ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని ఆయన తెలిపారు. పన్నెండేళ్ళుగా కేంద్రం లో మోడీ ప్రధానిగా ఉండి మన రాష్ట్రానికి చేసిందేమిటో చెప్పాలని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. 2014లో మాలమూరు సభలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాగా ప్రకటిస్తామని ప్రధాని ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఇటీవల బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తే జాతీయ హోదా ప్రకటిస్తారేమోనని తాను ఆశించానని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం నిర్వహిస్తే ఆ జిల్లాకు రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగు నీరు అందించే ప్రాణహిత-చేవెళ్ళ పూర్తి చేసేందుకు సహకరిస్తామని ప్రకటిస్తారని అనుకున్నానని, అయితే ఫడ్నవీస్ ప్రజలను అవమానించి, ఓట్లు వేయాలని కోరారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు నష్టపోయిన వారికి కారుకు కారు, బైకుకు బైకు ఇస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రచారం చేస్తే, మరో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆమోదం చెప్పారని ఆయన తెలిపారు. ఇది నిజమేనని ప్రజలు విశ్వసించి యాభై డివిజన్లలో బిజెపి కార్పొరేటర్లను గెలిపించారని ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ మాటే ఎత్తడం లేదని ఆయన దుయ్యబట్టారు. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి సత్రంలో ఉచిత భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి సిఫార్సు లేఖ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరు ఉందని ముఖ్యమంత్రి విమర్శించారు. వాహనాలు ఇప్పిస్తామన్నారు కదా? అని ప్రజలు ప్రశ్నిస్తే, మీకు వాహనాల ఇన్సూరెన్స్ ఉంది కదా, క్లెయిమ్ చేసుకోండి అని సంజయ్ చెప్పడం ప్రజలను అవమానించడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడేమో మున్సిపాలిటీల్లో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని బిజెపి నాయకులు అంటున్నారని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రులు ప్రచారంలో లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెబుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి చెల్లించే పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటానే ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఉదాహరణకు రాష్ట్రం నుంచి కేంద్రానికి ఒక్క రూపాయి చెల్లిస్తే, నలభై రెండు పైసలే తిరిగి రాష్ట్రానికి ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటకకు పదహారు పైసలు, తమిళనాడుకు ఇరవై ఆరు పైసలు ఇస్తున్నారని, కేరళకు నలభై తొమ్మిది పైసలు మాత్రమే చెల్లిస్తున్నారని, దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తున్నదని ఆయన విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్ రూపాయి చెల్లిస్తే, తిరిగి ఆరు రూపాయల ఆరు పైసలు చెల్లిస్తున్నదని, మధ్య ప్రదేశ్‌లో రూపాయికి కేంద్రం రెండు రూపాయల తొమ్మిది పైసలు చెల్లిస్తున్నదని, ఉత్తర్ ప్రదేశ్‌కి రెండు రూపాయల తొంబై పైసులు చెల్లిస్తున్నదని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రులు ప్రశ్నించరా? ఈ వివక్షపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోడీనిగాని, నీతి ఆయోగ్‌ను ఏనాడైనా అడిగారా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్లు మాట్లాడడం భావ్యమా? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ బద్దంగా ఆటోమోడ్‌లో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధులు వస్తున్నాయే తప్ప కేంద్ర మంత్రులు చేసిందేమిటీ? అని ఆయన ప్రశ్నించారు. ఏ ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తెచ్చారా? అని ఆయన నిలదీశారు. మూసీకి నిధులు తెచ్చారా? మూసీ నదికి అదనంగా నిధులు తెచ్చారా? సమ్మక్క-సారక్క జాతరకు ప్రత్యేక నిధులు తెచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. పైగా రాష్ట్రానికి రావాల్సిన ఐటఐఆర్, సెమీ కండక్టర్ ప్రాజెక్టులు రాకుండా చేశారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కనీసం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకైనా నిధులు తెచ్చుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఖమ్మం వరదల౮ సమయంలోనూ అదనంగా నిధులు తేలేదని ఆయన విమర్శించారు. వరంగల్ విమానాశ్రయం కోసం భూసేకరణకు తామే నిధులు కేటాయించామన్నారు. మోడీకి ఎన్నికలకు ఏమిటీ సంబంధం? పైగా ప్రధాని నరేంద్ర మోడీని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ్ల బిజెపిని గెలిపించాలని కేంద్ర మంత్రులు, ఆ పార్టీ నేతలు ఓటర్లను కోరుతున్నారని ఆయన తెలిపారు. ప్రధాని మోడీకి, ఎన్నికలకు ఏమిటీ సంబంధం అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ వచ్చి మోరీ తీస్తారా? అని ఆయన ప్రశ్నించారు. గల్లీ ఎన్నికలకు మోడీకి ఏమిటీ సంబంధం అని అన్నారు. ఓట్లు వేయించుకోవడం, సీట్లు గెలుపొందడం తప్ప రాష్ట్రానికి అదనంగా ఏమి చేశారో బిజెపి నాయకులు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మత రాజకీయాలు ఎంత కాలం? మత రాజకీయాలు ఎంత కాలం చేస్తారని ఆయన బిజెపి నేతలను ప్రశ్నించారు. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని భూతంలా చూపించి ఓట్లు దండకుంటున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ మనుగడ కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం వారి భావదారిత్య్రానికి నిదర్శనమని విమర్శించారు. బిఆర్‌ఎస్ ఏ ముఖం పెట్టుకుని.. రాష్ట్రంలో పదేళ్ళూ అధికారంలో ఉండి ఇప్పుడు సమస్యల పరిష్కారానికి తమకు ఓట్లు వేయాలని బిఆర్‌ఎస్ నాయకులు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి పదవి వరకూ అన్ని పదవుల్లో బిఆర్‌ఎస్సే ఉండి ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. అహంకారం, విద్వేష ప్రసంగాలతో గంజాయి, కొకైన్ తీసుకున్న వారిలా మాట్లాడుతున్నారని, దోపిడికి పాల్పడిన వారికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఉన్మాదంతో, మానసిక రోగంతో ఫోన్ ట్యాపింగ్‌తో వందల కోట్లు వసూలు చేశారని ఆయన విమర్శించారు. ముసుగు తొడుక్కోకుండా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే ముఖానికి ముసుగు తొడుక్కుని వెళ్ళకుండా బరితెగించి ఏదో యుద్ధానికి వెళ్ళినట్లు చేతులు ఊపుకుంటూ, సైగలు చేసుకుంటూ వెళుతున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. బిజెపి-బిఆర్‌ఎస్‌లది విడదీయలేని బంధం కొనసాగుతున్నదని ఆయన విమర్శించారు. గతంలో నోట్ల రద్దు, రైతు వ్యతిరేక నల్లచట్టలు, త్రిపుల్ తలాక్‌కు బిఆర్‌ఎస్ మద్దతునిచ్చిందని ఆయన దుయ్యబట్టారు. మీ ప్రేమ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదని ప్రధాని మోడీని కెసిఆర్ బహిరంగంగా అన్నారని ఆయన తెలిపారు. ఈ అనుబంధాన్ని రాష్ట్రంలో నిధులు తెచ్చేందుకు ఉపయోగించి ఉంటే బాగుండేదన్నారు. బిఆర్‌ఎస్ మొక్కను మొలవనీయవద్దు.. అందుకే ఇప్పుడు కెసిఆర్, కెటిఆర్, టి. హరీష్ రావు అరెస్టు కాకుండా బిజెపి కాపాడుతున్నదని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్‌ను యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోదన్నారు. మళ్లీ బిఆర్‌ఎస్ మొక్కను మొలవనీయవద్దని ఆయన ప్రజలను కోరారు. తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ప్రతి నెలా మొదటి తేదీనే ఇస్తున్నామని, ఆరోగ్య శ్రీ పరిమితిని ఐదు నుంచి పది లక్షల రూపాయలకు పెంచామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు రుణ మాఫీకి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ, స్పోర్ట్ వర్సిటీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా తనదేనని ముఖ్యమంత్రి అన్నారు.

మన తెలంగాణ 10 Feb 2026 7:00 am

అభివృద్ధి మా మా వంతు.. గెలుపు మీ వంతు –బీఆర్ఎస్ అభ్యర్థి కూరేళ్ల పద్మ పరమేష్‌..

అభివృద్ధి మా మా వంతు.. గెలుపు మీ వంతు – బీఆర్ఎస్ అభ్యర్థి

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:51 am

సిఎం ఎవరైనా.. మా దగ్గరకు రావాల్సిందే

 రెడ్డి అయినా.. రావు అయినా.. మా దగ్గరకు రావాల్సిందే సిఎం వద్దకు మేం వెళ్లం మజ్లిస్ లేకపోతే జూబ్లీహిల్స్‌ను కాంగ్రెస్ గెలుచుకునేదా? ప్రజలను మోసం చేయడంలో మోడీ బడే భాయ్.. రేవంత్ చోటే భాయ్ మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చాటుతాం కరీంనగర్‌లో అక్బరుద్ధీన్ సంచలన వ్యాఖ్యలు మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో సిఎం ఎవరైనా ఎంఐఎం దగ్గరికి రావాల్సిందేనని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అందరి పార్టీ అని పేర్కొన్నారు. రెడ్డిలు, రావులు చేసినంత డ బ్బు ఖర్చు ఎంఐంఎం చేయలేదేమో.. కానీ, ప్రజలకు ప్రత్య క్షంగా, పరోక్షంగా అండగా ఉంటుందని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా సోమవారం కరీంనగర్‌లోని వెలమ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రులుగా ఎవరు వచ్చినా ఒవైసి సోదరుల వద్దకు ఎందుకు వస్తారో ఒక్కసారి ఆలోచించాలని ప్రజలను కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శిస్తూ, ముఖ్యంగా జూబ్లీహిల్స్  నియోజకవర్గ ఫలితాలను ప్రస్తావిస్తూ రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌తో తాము కలవకపోయి ఉంటే అక్కడ గెలుపు సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. అధికారంలో ఎవరు ఉన్నా, వారు ఏ పార్టీ వారైనా సరే మా వద్దకు రావాల్సిందేనని, అది కేవలం ప్రజల బలమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏ కులం లేదా ఏ వర్గం వారు తమ సొంతం కాదని, కేవలం తమ సిద్ధాంతాన్ని నమ్మే వారే తమ బలమని పేర్కొన్నారు. ఇమామ్, మౌజన్ గౌరవ వేతనాలతో పాటు అర్చకులకు గౌరవ వేతనాల గురించి ఎంఐఎం గొంతెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంఐఎం అందరి పార్టీ అని చెప్పడానికి ఇంత కంటే ఏ ఉదాహరణ ఉండదని పేర్కొన్నారు. అసెంబ్లీలో తమ ఉనికి ఉంటేనే పనులు జరుగుతాయని, రాజకీయాలు చేయడం తమకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన తన ప్రసంగంలో ఉద్ఘాటించారు. బిజెపికి మతరాజకీయాలు తప్ప, వేరేది చేతగాదు అని అన్నారు. నెహ్రూ నుంచి మోడీ వరకు ముస్లింలు, దళితులను మోసం చేశారన్నారు. ప్రజలను మోసం చేయడంలో మోడీ బడే భాయ్.. రేవంత్ ఛోటే భాయ్ అని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎవరి అడ్డానో కాదని, దానిని అభివృద్ధికి అడ్డాగా మారుస్తామని పేర్కొన్నారు. 420 హామీలతో కాంగ్రెస్ మోసం చేసిందని, ఏ ఒక్క హామీనైనా అమలు చేసిందా? అని ప్రవ్నించారు. మైనార్టీ సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.3500 కోట్లు ప్రకటించి, కేవలం అందులో 38 శాతం మాత్రమే కేటాయించడం వారికి మైనార్టీలపై ఉన్న ప్రేమ ఎంతటిదో చాటి చెబుతున్నదని చెప్పారు. బిజెపి నేతలు నిత్యం ఒవైసి బ్రదర్స్ పేరును వాడుకుంటూ, రాజకీయం చేస్తున్నదన్నారు. ఎంఐఎం పార్టీ లేకపోతే, బిజెపికి మనుగడనే లేదని పేర్కొన్నారు. ఎంఐఎం దయాదాక్షిణ్యాలతో గెలిచిన గంగుల కమలాకర్.. నేడు అదే ఎంఐఎంపై విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకు నిదర్శమన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై ఎంఐఎం జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత కరీంనగర్‌కు వస్తానని, అప్పుడు విజ యోత్సవ ర్యాలీలు ఘనంగా నిర్వహిద్దామని ఆకాంక్షించారు. ఎంఐఎం పార్టీకి బీజేపీ భయపడుతున్నదని అక్బరుద్దీన్ విమర్శించారు. ఎంఐఎం భయానికి బీజేపీ గతంలో లేనటువంటి సంస్కృతి తెరలేపిందని, ఏకంగా ముస్లిం అభ్యర్థులకు టికెట్లు కేటాయించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఉమ్మడి జిల్లా పరిశీలకుడు యాసర్ అరఫాత్, కరీంనగర్‌అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, నగర కమిటీ నాయకులు బర్కత్ అలీ, సయ్యద్ మొయిజుద్దీన్ ఖాదిరి యూ సుఫ్,ఆతిన ఆతిఫ్, ఇబ్రహీం,ఖమారుద్దీన్, అజర్ దబీర్,ఆరిఫ్ అహ్మద్,బాబుజానీ, ఫసియు ద్దీన్ ఖాలీద్, సురేష్, సుధాకర్, రాజు, ఆసిమ్, అంజద్ ఖాన్, మజారొద్దీన్, అక్బర్, మొహసీ న్ మొహియుద్దీన్, వాజిద్ ఖాన్,అనెమల్ల సురేష్,కొమ్ముల రామేశ్వరి, మాజీ కోఆప్షన్ సభ్యు రాలు రాఫియా సుల్తానా, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మన తెలంగాణ 10 Feb 2026 6:50 am

దండం పెట్టి అడుగుతున్న.. చేయి గుర్తుకు ఓటేయండి –గనగాని శైలజ నర్సయ్య గౌడ..

దండం పెట్టి అడుగుతున్న.. చేయి గుర్తుకు ఓటేయండి – గనగాని శైలజ నర్సయ్య

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:45 am

బ్యాంకుల నిర్లక్ష్యంతోనే డిజిటల్ మోసాలు

 కొందరు అధికారుల కుట్రపూరిత సహకారం కారణం కావొచ్చు డిజిటల్ అరెస్ట్ ముసుగులో రూ.54వేల కోట్ల మేర దోపిడీ ఆర్‌బిఐ, టెలీ కమ్యూనికేషన్స్ కలిసి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: దేశంలో భారీ స్థాయి డిజిటల్ మోసాల తీవ్రత పట్ల సుప్రీంకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ ఏ కంగా రూ.54,000 కోట్ల మేర సైబర్ నేరగాళ్లు పలువురి సొత్తు కాజేశారు. ఈ విధంగా పౌరుల సొమ్ము నయా చోరుల పాలు అయిందని, ఇది మోసం కాదు భారీ స్థాయి దోపిడీ అని వ్యాఖ్యానించారు. ఓ చిన్న రాష్ట్రం వార్షిక బడ్జెట్‌ను మించి దోపిడీ జరిగిందని ప్రధాన న్యాయమూ ర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్‌మా ల్యా బాగ్చీ, ఎన్‌వి అంజారియాతో కూడిన ధ ర్మాసనం తెలిపింది. కేంద్రం వెంటనే స్పందించాల్సి ఉంది. ఆర్థిక అక్రమ వ్యవహారం అయినందున వెంటనే దీని నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. సంబందిత భాగస్వామ్యపక్షా లు అయిన ఆర్‌బిఐ, పలు బ్యాంకులు, టెలికమ్యూనికేషన్ విభాగంతో సంప్రదిపులకు దిగా లి. డిజిటల్ ఆన్‌లైన్ నేరాల ఆటకట్టుకు సరైన ప్రామాణిక మార్గదర్శకాలను(సాప్) రూపొందించాలని ధర్మాసనం సూచించింది. ఇందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ అరెస్టు మోసాలు జరుగుతున్నాయి. పలువురి బ్యాంకుల ఖాతాలు లూఠీకి గురవుతున్నాయి. ఈ దశలో బ్యాంకుల నుంచి నివారణ చర్యలు అత్యవసరమని బెంచ్ స్పష్టం చేసింది. 

మన తెలంగాణ 10 Feb 2026 6:40 am

వార్ వన్ సైడ్.. శ్రీవిద్య గెలుపు డిసైడ్..

వార్ వన్ సైడ్.. శ్రీవిద్య గెలుపు డిసైడ్.. మోత్కుర్, ఆంధ్రప్రభ : మోత్కూర్

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:38 am

'సర్' కొనసాగాల్సిందే

అడ్డంకులు కల్పించొద్దని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక గడువు మరో వారం రోజులు పొడిగింపు  మమత ప్రస్తావించిన అడ్డంకులు తొలగిస్తామని అభయం అన్ని రాష్ట్రాలు దీన్ని గమనించాలని సూచన అవసరమైతేనే జోక్యం చేసుకుంటామని వివరణ న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను పూర్తి చేయడంలో ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని సుప్రీంకోర్టు సోమవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే, ఈ ప్రక్రియలో నిజమైన ఇబ్బందులను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కోర్టు హామీ ఇచ్చింది. బెంగాల్ సర్ లో పరిశీలన లేదా దరఖాస్తులను పూర్తి చేయడానికి, డేటాను ఖరారు చేయడానికి కోర్టు గడువును ఒక వారం పాటు పొడిగించింది. ఫశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాయర్ గా హాజరై, కమ్యునికేషన్ కోసం వాట్సాప్ వినియోగానికి స్వస్తిచెప్పి, మైక్రో అబ్జర్వర్ లను తొలగించడం వంటి మార్పులు సర్ ప్రక్రియలో చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్య వచ్చింది. మైక్రో అబ్జర్వర్లకు బదులుగా 8,505 గ్రూప్ బి అధికారులను నియమించాలని కూడా మమతా బెనర్జీ కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు వైఖరిని స్పష్టం చేస్తూ, పశ్చిమ బెంగాల్ కోరిన అడ్డంకులను తాము తొలగిస్తామని, కానీ సర్ పూర్తి చేయడంలో ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని, ఈ విషయం సుస్పష్టం అని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తో పాటు జస్టిస్ జోయ్ మల్య బాగ్చి, ఎన్ వి అంజరియాలతో కూడిన ధర్మాసనం సర్ తలపెట్టిన కసరత్తు షెడ్యూల్ ప్రకారం కొనసాగాలని నొక్కి చెప్పింది. ఎన్నికల కమిషన్ తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది డిఎస్ నాయుడు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ఇఆర్ ఓ) నియామకం పై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.  ఇఆర్ ఓ లు క్వాసీ - జుడీషియల్ విధులను నిర్వహిస్తారని, అందువల్ల తగినంత న్యాయనిర్ణయ అనుభవం ఉండాలని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల కమిషన్ 300 మంది గ్రూప్ బి అధికారులను కోరినప్పటికీ, అలాంటి అనుభవం ఉన్న 64 మంది అధికారులనే కేటాయించారని న్యాయవాది పేర్కొన్నారు. మిగిలిన వారిని వేతన సమానత్వం ప్రాతిపదికన నియమించినట్లు తెలిపారు. మైక్రో అబ్జర్వర్ల ద్వారా పెద్దఎత్తున ఓటర్ల పేర్లు తలగింపు సాధ్యం కాదని సీనియర్ న్యాయవాది స్యామ్ దివాన్ వాదించారు. కాగా, ఈ ఆందోళనలకు సమాధానమిస్తూ ఇఆర్ ఓలు, అసిస్టెంట్ ఇఆర్ ఓలకు సహాయం చేసేందుకే మైక్రో అబ్డర్వర్లను ఏర్పాటు చేశారని, తుదినిర్ణయం మాత్రం ఇఆర్ ఓలదే నని, ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. వెరిఫికేషన్ కసరత్తు ఫలితాన్ని కోర్టు పరిశీలిస్తుందని సిజేఐ వెల్లడించారు. వెరిఫికేషన్ తర్వాత, ఈ నోటీసులలో ఎన్ని కొట్టివేశారో చూసి, 80 శాతం కేసులు కొట్టవేయబడితే, మీ వాదన సబబే, చిన్న తేడాలు ఉంటే తప్పు అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తాత్కాలిక ఆదేశాలు జారీ చేసిన సిజెఐ బెంగాల్ లో సర్ ప్రక్రియను క్రమబద్దీకరించడానికి, పారదర్శకంగా ఉండేలా చూసేందుకు సిజేఐ కొన్ని మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. 8,555 మంది గ్రూప్ బి అధికారుల జాబితాను సాయంత్రం 5 గంటలలోపు జిల్లా ఎన్నికల అధికారులకు సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఉన్న ఇఆర్‌ఓలు, ఏఇఆర్‌ఓలను భర్తి చేయడానికి, అధికారుల సేవలను ఉపయోగించుకోవడానికి ఎన్నికల సంఘానికి కోర్టు అధికారం ఇచ్చింది. 

మన తెలంగాణ 10 Feb 2026 6:30 am

సబ్‌రిజిస్ట్రార్‌ల రియల్ దందా!

బినామీల పేర్లతో బెంగళూరు, దుబాయ్‌లో పెట్టుబడులు..! మరికొందరు నగర శివార్లలో ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ల కొనుగోళ్లు ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్ నివేదిక  నిఘా పెట్టిన ప్రభుత్వం మన తెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తిమింగలాలపై అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. కొందరు స బ్ రిజిస్ట్రార్‌లు, డిఆర్‌లు కలిసి ఈ రియల్ వ్యాపారం చేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది. కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు బెంగళూరులో, మరికొందరు సబ్ రిజిస్ట్రార్‌లు దుబాయ్‌లో రియల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారని సబ్ రిజిస్ట్రార్‌లు, డిఆర్‌లు ఇందులో భాగస్వాములు అయినట్టుగా తెలిసింది. ఈ రియల్ వ్యాపారం గురించి కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలిసింది. తెలంగాణలో రియల్ వ్యాపారం చేస్తే దొరికిపోతామన్న భయంతోనే వేరే రాష్ట్రాలు, దేశాల్లో సబ్ రిజిస్ట్రార్ లు, డిఆర్‌లు పెట్టుబడులు పెడుతున్నట్టగా సమాచారం. ఇప్పటికే పలువురు సబ్ రిజిస్ట్రార్‌లపై ని ఘా పెట్టిన ప్రభుత్వం వారి ఆస్తుల వివరాల గురించి సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా తెలిసింది. రెండేళ్ల క్రితం రెవెన్యూ మంత్రికి అందరి అవినీతి చిట్టాను అందచేసిన ఓడిఆర్ ప్రస్తుతం ప్రభుత్వ భూ ములకు బై నెంబర్‌లు వేసి, నిషేధిత జాబితాలో ఉన్న ప్లాట్లు, భూములను రిజిస్ట్రేషన్ చేయించి భారీ స్థాయి లో అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుతం మంత్రి పొంగులేటికి ఫిర్యాదు చేసినట్టు గా సమాచారం. దీంతోపాటు ఆ డిస్ట్రిక్ రిజిస్ట్రార్ చేసే రియల్‌వ్యాపారం గురించి కూడా మంత్రికి కొందరు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ప్రస్తు తం ఈ డిఆర్ రంగారెడ్డి జిల్లాకు ఇన్‌చార్జీగా రావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని, తన కు మంత్రి చాలా దగ్గరని కచ్చితంగా రంగారెడ్డి డిఆర్ పోస్టుకు బదిలీ అవుతానని ఆ శాఖ ఉద్యోగుల వద్ద ఆయన పేర్కొంటున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఏసిబి నిఘా ఉన్న ముగ్గురు సబ్ రిజిస్ట్రార్‌లు త మ బంధువు ల పేర్లతో హైదరాబా ద్ శివార్లలో ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు, వ్యవసాయ భూము లు కొనుగోలు చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందా యి. ఇప్పటికే వారిపై ఏసిబి నిఘా ఉండడం తో బినామీల పేర్లపై అలాగే ఉంచాలని వారు నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇలా, ప్రభుత్వానికి దొ రకకుండా సబ్ రిజిస్ట్రార్‌లు కొత్త ఎత్తుగడలు వేసి నా కొందరు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వారి ఆస్తుల వివరాలను ప్రభుత్వం గుర్తించినట్టుగా సమాచారం. దీంతోపాటు కొందరు సబ్ రిజిస్ట్రార్‌లకు ఏసిబి అధికారులతో బంధుత్వం ఉండడంతో దానిని తమకు అనుకూలంగా మలుచుకొని అక్ర మ ఆస్తుల కేసుల్లో సబ్ రిజిస్ట్రార్‌లు దొరకకుండా తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్‌ఎండిఎ పరిధిలోని ఓ డిఆర్‌పై ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చినా ఆయనకు డిఐజి పదోన్నతి ఎందుకు కట్టబెడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మూసాపేట జాయింట్ 1 సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసిన సమయంలోనే ఈ డిఆర్‌ను సస్పెండ్ చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆదేశించినా ఆ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ డిఆర్‌పై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ఏసిబి కూడా ఆయనపై దృష్టి సారించిందని తెలుస్తోంది. ఈయన మంత్రి బంధువని చెప్పుకొని గతంలో అవినీతికి పాల్పడ్డారని, అయినా ఈయన విషయంలో ఎందుకు చర్యలు తీసుకోకుండా వెనుకడుగు వేస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు చర్చించుకోవడం గమనార్హం. ఈ అధికారి ఖర్చుల బాధ్యత సబ్ రిజిస్ట్రార్‌లదే.. ఓ మంత్రి పేషీలో పనిచేసే ఓ అధికారి ఇచ్చే లీకులతో సబ్ రిజిస్ట్రార్‌లు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారని తెలిసింది. ఈ అధికారి తాను చేసే షాపింగ్, కారు సర్వీసింగ్, ఇతర ఖర్చులు సబ్ రిజిస్ట్రార్‌లే భరిస్తున్నారని సమాచారం. ఇలా ఆ అధికారి ఏ పర్యటనకు వెళ్లినా సబ్ రిజిస్ట్రార్‌లే ఖర్చులను సమకూర్చాల్సి వస్తుందని ఆ శాఖ ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ అధికారి అవినీతి ఆగడాలు ఎక్కువ కావడంతో కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు మంత్రికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఇలా ఈ అధికారి ఇచ్చే లీకులతో సబ్ రిజిస్ట్రార్‌లు అందినకాడికి దోచుకుంటున్నారని, ఆరోపణలు వచ్చిన సబ్ రిజిస్ట్రార్‌లకు ఈ అధికారి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు. ముందుకు సాగని పదోన్నతులు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతుల ఫైలు ముందుకు కదలడం లేదు. గ్రేడ్1 సబ్ రిజిస్ట్రార్, గ్రేడ్2 సబ్ రిజిస్ట్రార్, డిఆర్, డిఐజీల పదోన్నతులు మరింత ఆలస్యం అవుతున్నాయి. పలువురు రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉండడంతో తమకు పదోన్నతులు లభిస్తాయో లేదోనన్న ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు ఉద్యోగుల బదిలీలపై సందిగ్థత వీడడం లేదు. అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని బదిలీలు చేయకపోవడంతో ఆ శాఖలో ఏం జరుగుతుంతో అర్ధం కావడం లేదని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. 

మన తెలంగాణ 10 Feb 2026 6:30 am

రేవంత్ జైలుకెళ్లడం ఖాయం

మన తెలంగాణ/మెదక్ జిల్లా ప్రతినిధి: హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరిరోజులో భాగంగా జిల్లాలో ని రామాయంపేట, నర్సాపూర్, మెదక్ మున్సిపాలిటీలలో భారీ ర్యాలీలతో స్ట్రీట్ కార్నర్ స మావేశంలో హాజరయ్యారు. మెదక్ జిల్లా కేం ద్రంలో స్థానిక ఐబీ నుంచి శివాజీ చౌక్ వరకు భారీ ర్యాలీగా వచ్చి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర యేళ్లు అయినప్పటికీ ఒక్క అభివృద్ధి పనికూడా చేపట్టలేదని ఆరోపించారు. ప్రజలను, రైతులను, మహిళలను మభ్యపెట్టేందుకు కళ్లబొల్లి మాటలు చెప్పి అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్‌కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టుకావాలన్నారు. జిల్లాకు వచ్చి ఎంతో పవిత్రమైన వనదుర్గమాత మీద ఒట్టేసి అభివృద్ధి చేస్తానని చెప్పి మొహం చాటేసిన రేవంత్‌ను అమ్మవారు క్షమించదన్నారు. అభివృద్ధ్ది అంటే కేవలం తమ పాలనలోనే జరిగిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వర్గానికి చెందినవారు కూడా సంతృప్తిగా లేరన్నారు. మహిళలను మహాలక్ష్మి పేరుతో, రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసి తెలంగాణ ప్రజల బ్రతుకులు ఆగం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనన్నారు. మాట్లాడితే బూతులు తప్ప రాష్ట్రానికి చేసిన మేలేమి లేదన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి జైలుకు పోవడం ఖాయమని అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్దం చేసి సాక్షాలను కాల్చారని ఆరోపించారు. ఈ కుట్ర పోలీసుల సహకారంతోనే చేసిందని ఆయన అన్నారు. అన్నదాతలకు సకాలంలో ఎరువులు అందించక కరువు చూపించిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా ఎగ్గొట్టడంతోపాటు కళ్యాణలక్ష్మి, తులం బంగారం ఎగవేశాడన్నారు. రైతులకు ఇవ్వాల్సిన కరెంట్ కనీసం 12 గంటలు కూడా అందించలేక ఆటో డ్రైవర్లకు యేడాదికి 12వేలు ఇస్తానని మొండిచేయి చూపించారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని చెప్పి మున్సిపల్ పోరులో అగ్రవర్ణాలకు చోటిచ్చి అన్యాయం చేశారన్నారు. కానీ తాము మాత్రం మెదక్ మున్సిపాలిటీలో వందశాతం బీసీలకు టికెట్‌లు కేటాయించి వారి మనోభావాలకు గౌరవం కల్పించారన్నారు. ముఖ్యంగా మెదక్‌లో కాంగ్రెసొల్ల బెదిరింపులు ఎక్కువయ్యాయని, బెదిరిస్తే భయపడే కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో లేరని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోకపోతే బిల్లులు రావని బెదిరిస్తున్నారని మెదక్‌లో చిల్లర బెదిరింపులకు భయపడేది లేదని బిల్లులు మీ జేబునుంచి ఇస్తున్నారా? మీ జాగిరా అంటూ కొట్లాడి సాధించుకుంటామని అభ్యర్థుల్లో భరోసా నింపారు. అనుక్షణం కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అండగా నేనుంటానని ఎవ్వరికి భయపడేది లేదని ధీమానిచ్చారు. బీజేపీ మతం రంగుతో ఓట్లు అడుగుతుందని కానీ తమది సెక్యూలర్ పార్టీ అని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో దోస్తీ చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పలు జిల్లాల్లో పర్యటించి మెదక్‌లో ఓటమి భయంతోనే మొహం చాటేశాడని అన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల ఆత్మభిమానానికి నిరంకుశ పాలనకు జరుగుతున్నవని ప్రజలు ఆలోచించి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని కోరారు. రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని కార్యకర్తలు ఎవ్వరు అదైర్యపడవద్దని మున్ముందు బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో మరింత అభివృద్ధి సాధించుకుందామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అద్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, చంద్రాగౌడ్, మల్లిఖార్జున్‌గౌడ్, సురేందర్‌గౌడ్, బట్టి జగపతి, మామిళ్ల అంజనేయులు, సోహెల్, జుబేర్‌లతోపాటు అన్ని వార్డుల అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

మన తెలంగాణ 10 Feb 2026 6:20 am

క్లాస్‌రూమ్‌లోనే సహవిద్యార్థినిపై కాల్పులు

చండీగఢ్: పంజాబ్‌లో తార్న్ తరణ్ జిల్లాలో సోమవారం ఓ విద్యార్థి క్లాస్ రూమ్ లో తనతోటి విద్యార్థినిపై తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. ఆమెను చంపి, తను కూడా అదే తుపాకీతో కాల్చుకున్నాడు. అక్కడి విద్యార్థులంతా ఈ సంఘటనకు భయభ్రాంతులయ్యారు. తర్న్ తరన్ జిల్లాకు చెందిన ప్రిన్స్‌రాజ్, సందీప్ కౌర్‌లు ఉస్మా గ్రామంలోని లా కాలేజీతో ఫస్ట్ ఇయర్ లా చదువుతున్నారు. కౌర్‌పై రాజ్ ఎందుకో పగ పెంచుకున్నాడు. సోమవారం ఉదయం కాలేజీకి రాగానే తనవెంట తెచ్చుకున్న తుపాకీతో క్లాస్ రూమ్‌లోనే కౌర్‌పై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో కౌర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కౌర్ చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత రాజ్ తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలైన రాజ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. కౌర్‌ను రాజ్ ఎందుకు హత్య చేశాడో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 10 Feb 2026 6:20 am

మా పాలనను చూసి గెలిపించారు.. అక్బరుద్ధీన్ కు శ్రీధర్‌బాబు కౌంటర్

 కార్యకర్తలు రేయింబవళ్లు కష్టపడితేనే జూబ్లీహిల్స్‌లో విజయం దక్కింది తామే గెలిపించామని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమే  అక్బరుద్ధీన్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో తమ మద్దతుతో కాంగ్రెస్ గెలిచిందన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి జనం ఓట్లు వేశారని, తమ వల్లే గెలిచిందని ఎవరైనా చెప్పుకుంటే.. అది వారి భ్రమేనని అన్నారు. మా పాలనను చూసి జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేశారని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో మేం ఎవరి వల్లనో గెలవలేదు.. కాంగ్రెస్ బలంతోనే గెలిచాం.. మా పార్టీ నేతలు రేయింబవళ్లు కష్టపడితేనే విజయం దక్కిందని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.

మన తెలంగాణ 10 Feb 2026 6:10 am

10thFeb2026 |మంగళవారం, నేటి పంచాంగం: రాశి ఫలితాలు &దైవారాధన విశేషాలు

10thFeb2026 | మంగళవారం, నేటి పంచాంగం: రాశి ఫలితాలు & దైవారాధన విశేషాలు

ప్రభ న్యూస్ 10 Feb 2026 6:00 am

ప్రస్తుత ఎంపిల నిష్పత్తిలోనే.. పునర్విభజన

మన తెలంగాణ/హైదరాబాద్: మహిళా రిజర్వేషన్లను కల్పించి 2029 సంవత్సరంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంచనా. మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రం ముగిసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ తన నివాసంలో ప్రభుత్వ సలహాదా రు వేం నరేందర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అయితే విలేకరుల సమావేశం ముగిసిన అనంతరం ము ఖ్యమంత్రి కొంత సేపు విలేకరులుతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ ప్రభుత్వ గడువు 2028 డిసెంబర్‌లో ముగుస్తుందని, అయి తే 2029 సంవత్సరంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. వన్ నేషన్, వన్ ఓట్‌తో పాటు మహిళా రిజర్వేషన్లూ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జిల్లాల విభజన గురించి ప్రశ్నించగా, దేశ వ్యాప్తంగా జనగణన జరుగుతున్నందున 2027 వరకూ జిల్లాల మార్పులు, చేర్పులు చేయరాదని కేంద్రం సర్కులర్ జారీ చేసిందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగితే ఇప్పుడు ఉన్న నిష్పత్తి ప్రకారమే జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన కుటుంబ తగాదాలతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ తదితర ఐదు, ఆరు రాష్ట్రాల్లో రాజకీయంగా ముఖ్య నేతల కుటుంబాల్లో తగాదాలు ఉన్నాయని, వాటన్నింటికీ తనకు సంబంధమా? అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. కవిత మిమ్మల్ని కొంచం మెత్తగా, కెటిఆర్‌ను ఘాటుగా విమర్శిస్తున్నారు కదా? అని ప్రశ్నించగా, ‘మీకు ఏమైనా బాధ కలుగుతున్నదా?’ అని సిఎం ఎదురు ప్రశ్నించడంతో అందరూ నవ్వారు. కవిత చేసే వ్యాఖ్యలను రాజకీయంగా మీరు అనుకూలంగా వాడుకోవచ్చు కదా? అని ప్రశ్నించగా, కెసిఆర్ కుటుంబ సభ్యులంతా కలిసి ఉన్నప్పుడే తాను వారిని మట్టికరిపించానని, విడిపోయాక ఇక సమస్య ఏముందన్నారు. రేవంత్‌దుద్దీన్ అనే విమర్శ గురించి మరో విలేకరి ప్రస్తావించగా, రేవంత్ యాదవ్ అని, రేవంత్ మాదిగ అని ఇలా అన్ని కులాల వారు తనను కలుపుకున్నారని, అయితే ఆచార్యుల వారు ఒక్కరే మిగిలారని ఆయన నవ్వుతూ చెప్పారు. జిహెచ్‌ఎంసి పదవీ కాలం ఈ నెల 10న ముగియనున్నందున, తర్వాత మూడు కార్పొరేషన్లుగా చేయబోతున్నారా? అని ప్రశ్నించగా, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానీయండి అని అన్నారు. జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల గురించి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి ప్రశ్నించినప్పుడు కూడా ఆయన ఇదే సమాధానమిచ్చారు. మీరు హార్వర్డ్ వెళ్ళినా, హార్డ్-వర్డ్ మాట్లాడడం మానుకోలేదన్న విమర్శ ఉందని మరో విలేకరి ప్రస్తావించగా కొన్ని సందర్భాల్లో, రాజకీయ ప్రసంగాల్లో అలా మాట్లాడాల్సి వస్తుందని, విలేకరుల సమావేశంలో ఎక్కడైనా ఒక్క పదమైనా అనుచితంగా ఉందా? అని ఆయన ఆ విలేకరిని ఎదురు ప్రశ్నించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో తాను ముందుగానే జర్నలిస్టులకు చెప్పానని, ఎప్పుడైనా తన అంఛనా తప్పలేదని అన్నారు. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి కూడా చెప్పాలని అడగా, తాను ఇంకా అంచనా వేయలేదని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో కెసిఆర్‌పై సిబిఐ విచారణ జరగకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నందుకే జాప్యం జరుగుతున్నదని విమర్శించిన మీరు ఫోన్ ట్యాపింగ్ కేసులో జాప్యం చేయలేదా? అని ప్రశ్నించగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును అమెరికా నుంచి రాకుండా ఇరవై నెలలు అడ్డుపడింది ఎవరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు.

మన తెలంగాణ 10 Feb 2026 5:50 am

మున్సిపల్ ఎన్నికలు.. 13 మంది రెబెల్స్‌పై బిజెపి వేటు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః మున్సిపల్ ఎన్నికలకు పార్టీ నిర్ణయించిన అభ్యర్థులు కాకుండా బరిలో నిలిచిన తిరుగుబాటు అభ్యర్థులపై బిజెపి రాష్ట్ర నాయకత్వం కన్నెర్ర చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంతో పాటు పార్టీ నిర్ణయాన్ని కాదని జగిత్యాల మున్సిపాలిటీలో రెబెల్స్‌గా బరిలోకి దిగిన పదమూడు మంది అభ్యర్థులపై బిజెపి అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. కాగా ఈ పరిణామం పార్టీ ప్రతిష్టను కాపాడడం, పార్టీ అభ్యర్థుల్లో విశ్వాసాన్ని నింపేలా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

మన తెలంగాణ 9 Feb 2026 11:36 pm

కవిత ఇంటి గొడవతో నాకేమీ సంబంధం: సిఎం రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః మహిళా రిజర్వేషన్లను కల్పించి 2029 సంవత్సరంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అంఛనా. మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రం ముగిసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  విలేకరుల సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కొంత సేపు విలేకరులుతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ ప్రభుత్వ గడువు 2028 డిసెంబర్‌లో ముగిసినా, ఆ తర్వాత 2029 సంవత్సరంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. వన్ నేషన్, వన్ ఓట్‌తో పాటు మహిళా రిజర్వేషన్లూ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జిల్లాల విభజన గురించి ప్రశ్నించగా, దేశ వ్యాప్తంగా జనగణన జరుగుతున్నందున 2027 వరకూ జిల్లాల మార్పులు, చేర్పులు చేయరాదని కేంద్రం సర్కులర్ జారీ చేసిందని ఆయన తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత తన కుటుంబ తగాదాలతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ తదితర ఐదు, ఆరు రాష్ట్రాల్లో రాజకీయంగా ముఖ్య నేతల కుటుంబాల్లో తగాదాలు ఉన్నాయని, వాటన్నింటికీ తనకు సంబంధమా? అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. కవిత మిమ్మల్ని కొంచం మెత్తగా, కెటిఆర్‌ను ఘాటుగా విమర్శిస్తున్నారు కదా? అని ప్రశ్నించగా, ‘మీకు ఏమైనా బాధ కలుగుతున్నదా?’ అని సిఎం ఎదురు ప్రశ్నించడంతో అందరూ నవ్వారు. కవిత చేసే వ్యాఖ్యలను రాజకీయంగా మీరు అనుకూలంగా వాడుకోవచ్చు కదా? అని ప్రశ్నించగా, కెసిఆర్ కుటుంబ సభ్యులంతా కలిసి ఉన్నప్పుడే తాను వారిని మట్టికరిపించానని, విడిపోయాక ఇక సమస్య ఏముందన్నారు. రేవంత్‌దుద్దీన్ అనే విమర్శ గురించి మరో విలేకరి ప్రస్తావించగా, రేవంత్ యాదవ్ అని, రేవంత్ మాదిగ అని ఇలా అన్ని కులాల వారు తనను కలుపుకున్నారని, అయితే ఆచార్యుల వారు ఒక్కరే మిగిలారని ఆయన నవ్వుతూ చెప్పారు. జిహెచ్‌ఎంసి పదవీ కాలం ఈ నెల 10న ముగియనున్నందున, తర్వాత మూడు కార్పొరేషన్లుగా చేయబోఉన్నారా? అని ప్రశ్నించగా, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానీయండి అని అన్నారు. జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల గురించి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి ప్రశ్నించినప్పుడు కూడా ఆయన ఇదే సమాధానమిచ్చారు. మీరు హార్వర్డ్ వెళ్ళినా, హార్డ్-వర్డ్ మాట్లాడడం మానుకోలేదన్న విమర్శ ఉందని మరో విలేకరి చెప్పగా కొన్ని సందర్భాల్లో, రాజకీయ ప్రసంగాల్లో అలా మాట్లాడాల్సి వస్తుందని, విలేకరుల సమావేశంలో ఎక్కడైనా ఒక్క పదమైనా అనుచితంగా ఉందా? అని ఆయన ఆ విలేకరిని ఎదురు ప్రశ్నించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో తాను ముందుగానే జర్నలిస్టులకు చెప్పానని, ఎప్పుడైనా తన అంఛనా తప్పలేదని అన్నారు. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి కూడా చెప్పాలని అడగా, తాను ఇంకా అంచనా వేయలేదని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో కెసిఆర్‌పై సిబిఐ విచారణ జరగకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నందుకే జాప్యం జరుగుతున్నదని విమర్శించిన మీరు ఫోన్ ట్యాపింగ్ కేసులో జాప్యం చేయలేదా? అని ప్రశ్నించగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును అమెరికా నుంచి రాకుండా ఇరవై నెలలు అడ్డుపడింది ఎవరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు.

మన తెలంగాణ 9 Feb 2026 11:08 pm

فیکٹ چیک: یوگی آدتیہ ناتھ کی 2024 کی تقریر کا ترمیم شدہ ویڈیو پی او کے پر قبضہ کے گمراہ کن دعوے کے ساتھ وائرل

وائرل ویڈیو میں دعویٰ کیا گیا کہ یوگی آدتیہ ناتھ نے کہا کہ اگر وہ وزیراعظم بنیں گے تو پاکستان مقبوضہ کشمیر چھ ماہ میں بھارت کا حصہ بنے گا۔ تحقیق سے واضح ہوا کہ یہ 2024 کی ریلی کا پرانا کلپ ہے جو گمراہ کن دعوے کے ساتھ پھیلایا جارہا ہے

తెలుగు పోస్ట్ 9 Feb 2026 11:02 pm

అసోం సిఎంపై పోలీసు కమిషనర్‌కు అసదుద్దీన్ ఫిర్యాదు

మన తెలంగాణ / హైదరాబాద్ : ముస్లింలను కాల్చుతున్నట్లుగా ఉన్న హింసాత్మక వీడియో నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. హిమంతపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. ముస్లింలను రెచ్చగొట్టేలా దురుద్దేశపూర్వకంగా ఈ వీడియోను పోస్టు చేసినందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అసోం ముఖ్యమంత్రి రెండు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఒవైసీ విమర్శించారు. ఆయన తీరు జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించేలా ఉందని మండిపడ్డారు. ఈ మేరకు అసదుద్దీన్ సిపికి రాసిన లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు. హిమంత బిశ్వ శర్మ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, బహిరంగ ప్రసంగాలు, ఇతర వేదికల ద్వారా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా నిరంతరం ప్రకటనలు చేస్తున్నారని మీ దృష్టికి తీసుకురావడానికి ఈ లేఖ రాస్తున్నానన్నారు. అలాంటి అనేక ప్రసంగాలు ఇప్పటికీ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

మన తెలంగాణ 9 Feb 2026 10:45 pm

చర్చ జరగకపోతే విపక్షానికే నష్టం: కిరెణ్ రిజిజు

ఎన్ని ఆటంకాలు సృష్టించినా బిల్లులు ఆమోదింపజేసుకుంటాం స్పీకర్‌ను తొలగించే సంఖ్యాబలం వాళ్లకు లేదు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు వ్యాఖ్యలు న్యూఢిల్లీ : పార్లమెంట్ చర్చ జరగకపోతే పాలకపక్షం కన్నా విపక్ష కూటమికే నష్టదాయకమని పార్లమెంటరీ వ్యవహారా మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. వాళ్లు ఎన్ని ఆటంకాలు సృష్టించినా బడ్జెట్ సహా తాము అనుకున్న బిల్లులను ఆమోదింపజేసుకుంటామన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రతి అంశంపై చర్చ జరిగిన తరువాతనే బిల్లులకు సభ ఆమోదం తీసుకోవాలని భావిస్తోందని, దానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో రిజిజు మీడియాతో మాట్లాడారు. స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చి ఆయనను పదవి నుంచి తొలగించాలన్న విపక్షాల నిర్ణయం అయ్యే పనికాదని, అందుకు తగిన సంఖ్యాబలం వారికి లేదన్నారు. సభాపతిర, అధికారుల టేబుల్‌పైకి కూడా ఎక్కి నిరసన తెలపడం ద్వారా విపక్షం స్పీకర్ వ్యవస్థను అవమానించిందన్నారు. ఆ తర్వాతే ప్రభుత్వం సూచన మేరకు స్పీకర్ కఠిన చర్యకు ఉపక్రమించారని, సభ నుంచి 8మందిని సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. విపక్షం డిమాండ్ చేస్తున్నట్లుగా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రిజిజు అన్నారు. 

మన తెలంగాణ 9 Feb 2026 10:26 pm

ఫిబ్రవరి 24న 'ఛలో సెక్రటేరియట్‌'.. ఆర్‌టిసి జెఎసి పిలుపు

మన తెలంగాణ / హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆర్‌టిసి జెఎసి ప్రకటించింది. సోమవారం ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జెఎసి అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జెఎసి ఛైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి.మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి.యాదగిరి హాజరై ప్రసంగిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆర్‌టిసి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని గత రెండున్నర సంవత్సరాల నుండి జెఎసి ఆధ్వర్యంలో పలు ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రుల దృష్టికి, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా హామీలు అమలుకు నోచుకోలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ప్రధానంగా ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేస్తామని, 2021 వేతన సవరణ అమలు చేస్తామని, ఆర్‌టిసిని విస్తరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఏ ఒక్కటీ అమలు చేయకుండా వాటిని ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.ఆర్‌టిసి కార్మికులపై ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టి విపరీతమైన పనిభారాలు మోపిందని, రోజుకు 16 గంటలు బలవంతంగా డ్యూటీలు చేయిస్తూ కార్మికుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై కార్మికుల్లో రోజు రోజుకూ అసంతృప్తి, వ్యతిరేకత తీవ్రరూపం దాలుస్తోందని, అందులో భాగంగా ఈరోజు జెఎసి నాయకత్వం ఫిబ్రవరి 24న “ఛలో సెక్రటేరియట్‌” కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని తెలిపారు. కార్మికవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుండి పెద్దయెత్తున తరలివచ్చి “ఛలో సెక్రటేరియట్‌” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఎన్ కృష్ణ-ఎన్ ఎంయు, జె.రాఘవులు- ఈయు, ఎన్.బాల్ రెడి ్డ-ఈయు, ఎన్.బుద్ధ విశాల్- బికెయు, ఎం.ఎ.మజీద్ -ఈయు, డి. రాంచందర్-బిడబ్ల్యుయు, పాపయ్యగౌడ్, ము త్యాలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 9 Feb 2026 10:08 pm

కొత్త సినిమాల కోసం సైబర్ వలకు చిక్కొద్దు.. పోలీస్ శాఖ హెచ్చరిక

మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్త సినిమాల పేరుతో టెలిగ్రాం యాప్‌లో సైబర్ నేరగాళ్లు విసిరే వలకు చిక్కొద్దని రాష్ట్ర పోలీస్ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సందేశం పోస్ట్ చేసింది. లింక్ క్లిక్ చేస్తే కొత్త సినిమా చూడొచ్చని సైబర్ నేరగాళ్లు లింకులు పంపిస్తారని పోలీసులు చెపుతున్నారు. ఆశపడి సదరు లింక్‌ను క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయి వెంటనే ఫోన్ మొత్తం వారి కంట్రోల్‌లోకి వెళుతుందని చెప్పారు. పైరసీ సినిమా కోసం ఆశపడి ఖాతా ఖాళీ చేసుకోవద్దని సూచించారు. టెలిగ్రామ్‌తో సహా ఎక్కడా పైరసీ సినిమాలు చూడవద్దని కోరారు. దీంతో పాటు వాలెంటైన్స్ డే పేరుతో వచ్చే శుభాకాంక్షల నుండి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సర్‌ప్రైజ్ పేరుతో సోషల్ మీడియాలో వచ్చే వాలెంటైన్ పోస్టుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. స్పెషల్ గిఫ్ట్‌లు అనగానే నమ్మొద్దని, తెలియని నంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లను తెరవొద్ద్దని సూచించారు. అనవసర లింక్‌లు క్లిక్ చేసి వాలెంటైన్ వీక్‌లో సైబర్ నేరాళ్ల బారినపడోద్దని పోలీసులు కోరారు.

మన తెలంగాణ 9 Feb 2026 9:57 pm

bjp l మక్తల్ అభివృద్ధి కోసం బిజెపికి అవకాశం ఇవ్వండి ….

bjp l మక్తల్ అభివృద్ధి కోసం బిజెపికి అవకాశం ఇవ్వండి …. బిజెపి

ప్రభ న్యూస్ 9 Feb 2026 9:54 pm

Suresh l కాంగ్రెస్ ఓటు వేయండి అభివృద్ధికి అండగా నిలవండి..

Suresh l కాంగ్రెస్ ఓటు వేయండి అభివృద్ధికి అండగా నిలవండి.. 1వ వార్డు

ప్రభ న్యూస్ 9 Feb 2026 9:49 pm

ఎపి లిక్కర్ స్కామ్ కేసు.. రాజ్ కసిరెడ్డికి సుప్రీం షాక్

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్ కసిరెడ్డి బెయిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. ఈ కేసులో ఎపి హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజ్ కెసిరెడ్డి ‘సుప్రీం’ను ఆశ్రయించారు. ఈ కేసులో ఎపి హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజ్ కెసిరెడ్డి ‘సుప్రీం’ను ఆశ్రయించారు. దీనిపై సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్ కెసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు ప్రారంభించగానే ఈ పిటిషన్‌లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని ధర్మాసనం వెల్లడించింది.ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా రాజ్ కసిరెడ్డి ఉన్నారని, ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఎలా సాధ్యమని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు అన్నీ పరిశీలించాకే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిం చిందని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా నాగముత్తు వాదనలు కొనసాగించగా, ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన కుట్ర కు రాజ్ కసిరెడ్డి కేంద్ర బిందువుగా ఉన్నట్లు తమకు అనిపిస్తోందన్నారు. ఈ దశలో తాము జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదన్నారు. ఆయనకు బెయిల్ ఇస్తే దాని ప్రభావం కేసుపై తీవ్రంగా ఉంటుందన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు తేలిన లెక్కల ననుసరించి రూ.750 కోట్లు డిపాజిట్ చేసిన షెల్ కంపెనీలతో కసిరెడ్డికి నేరుగా సంబంధాలున్నట్లు కనిపిస్తోందని ధర్మాసనం వెల్లడించింది. అయితే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు కోర్టు ముందు ఉంచేందుకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

మన తెలంగాణ 9 Feb 2026 9:45 pm

brs l 6 వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించండి…. ప్రజలకు రుణపడి ఉంటా..

brs l 6 వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించండి…. ప్రజలకు రుణపడి

ప్రభ న్యూస్ 9 Feb 2026 9:44 pm

bjp l ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా..

bjp l ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా.. 1వ వార్డు బిజెపి అభ్యర్థిగా

ప్రభ న్యూస్ 9 Feb 2026 9:39 pm