SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

project |డ్రీమ్ ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించండి

project | డ్రీమ్ ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించండి జిల్లా పరిషత్ నుంచి తొలగించి

ప్రభ న్యూస్ 26 Feb 2026 2:29 pm

ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షం క్రెడిట్ చోరీ చేస్తోంది: చంద్రబాబు

అమరావతి: నదుల అనుసంధానం చేస్తే నీటి సమస్య తగ్గుతుందనిఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గంగా-కావేరి నదుల అనుసంధానం కావాలని అన్నారు. ఎపి అసెంబ్లీలో రాయలసీమ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ విషయంపై సిఎం ప్రసంగించారు. నదుల అనుసంధానం చేసి తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత తనదేనని, 2014-19 మధ్య రూ. 63 వేల కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారు. రాయలసీమ ప్రాజెక్టుకు దశ,దిశ చూపించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ అని..ఎపిలో కట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా టిడిపి కట్టిందేనని కొనియాడారు. ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షం క్రెడిట్ చోరీ చేస్తోందని, గతంలో నీళ్లు రాకుండా రిబ్బన్ కట్ చేశారని విమర్శించారు. తమ కుప్పంకు కూడా నీళ్లు ఇస్తున్నామన్నారని, పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు దేశంలో మరెక్కడా ఉండదని తెలియజేశారు. పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామని సిఎం పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర లో అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని, నాగావళి, చంపావతి, జంఝావతి ప్రాజెక్టు, చింతలపూడి ప్రాజెక్టును రెండేళ్లల్లో పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని, రాబోయే రోజుల్లో వర్షపాతం తగ్గొచ్చునని, మే 12న నారుమళ్లకు నీరు అందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 26 Feb 2026 2:25 pm

Chandrbabu : చంద్రబాబు బలం అదే.. ప్రతి ఎన్నికలో గెలుపుపై అదే నమ్మకం

చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి యాభై ఐళ్లు కావస్తుంది.

తెలుగు పోస్ట్ 26 Feb 2026 2:25 pm

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బి.పి.శ్రీదేవి

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బి.పి.శ్రీదేవి మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి

ప్రభ న్యూస్ 26 Feb 2026 2:22 pm

ఆత్మీయ విందు భోజనం.. పలకరింపులు…

ఆత్మీయ విందు భోజనం.. పలకరింపులు… స్నేహ బంధం బలోపేతమే మంత్రి నారా లోకేష్

ప్రభ న్యూస్ 26 Feb 2026 2:19 pm

కోడూరు గంగానమ్మకు జలాభిషేకం..

కోడూరు గంగానమ్మకు జలాభిషేకం.. కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు గ్రామంలో కొలువు

ప్రభ న్యూస్ 26 Feb 2026 2:14 pm

డొంక రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

డొంక రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : గ్రామీణ

ప్రభ న్యూస్ 26 Feb 2026 2:09 pm

పీఎం కుసుం పథకం కింద సోలార్ విద్యుత్

పీఎం కుసుం పథకం కింద సోలార్ విద్యుత్ ఫీడర్ లెవల్ సోలరైజేషన్‌తో సాగుకు

ప్రభ న్యూస్ 26 Feb 2026 2:06 pm

సింగినగర్ రెండో ఫ్లైఓవర్ ఇవ్వండి

సింగినగర్ రెండో ఫ్లైఓవర్ ఇవ్వండి సెంట్రల్‌లో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారంఅసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సెంట్రల్

ప్రభ న్యూస్ 26 Feb 2026 2:03 pm

సూపర్-8: సరికొత్త రికార్డు సృష్టించిన కివీస్ జోడి

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలకంతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో సెమీస్ ఆశలను సజీవం చేసుకుంది కివీస్ జట్టు.. మరోవైపు శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్‌లో 84 పరుగుల వద్దే 6 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టును కెప్టెన్ మిచెల్ శాంట్నర్(47), కోల్ మెక్‌కోంచి(31 నాటౌట్) వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కి 84 పరుగులు జత చేశారు. దీంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఈ క్రమంలో శాంట్నర్-మెక్‌కోంచిల జోడి ఓ ప్రపంచకప్ రికార్డును బద్దలు కొట్టింది. టి-20 ప్రపంచకప్‌లో ఏడో వికెట్‌కి అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆసీస్ జోడీ స్టీవ్ స్మిత్, మైక్ హస్సీలు కలిసి 2010 ఎడిషన్‌లో బంగ్లాదేశ్‌పై 74 పరుగులు జత చేశారు. ఇప్పుడు ఈ రికార్డును శాంట్నర్-మెక్‌కోంచిలు బద్దలుకొట్టారు.

మన తెలంగాణ 26 Feb 2026 2:00 pm

విజన్ యాక్షన్ ప్లాన్ @2047…

విజన్ యాక్షన్ ప్లాన్ @2047… కలెక్టర్ల వీసీలో ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్

ప్రభ న్యూస్ 26 Feb 2026 1:57 pm

న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది

: NCERT వివాదాస్పద బుక్‌ను నిషేధించిన సుప్రీం న్యాయవ్యవస్థపై ఎన్‌సీఈఆర్‌టీ ‘కుట్రే‘ సుప్రీంకోర్టు సంచలన తీర్పు! బేషరతుగా క్షమాపణలు చెప్పిన కేంద్రంఅవినీతి పాఠ్యాంశంపై కఠిన చర్యలు.. మార్చి 11న తదుపరి విచారణకు ఆదేశం జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడం వివాదం అవుతోంది. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించిన సుప్రీంకోర్టు.. గురువారం విచారణను ప్రారంభించింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను మంటగలిపేలా […] The post న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 1:44 pm

దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ మోత్కూర్, ఆంధ్రప్రభ : ఆస్తి కోసం వదిన

ప్రభ న్యూస్ 26 Feb 2026 1:39 pm

JanaSena : ఈసారి జనసేనలో కీలక మార్పులు...పవన్ గ్రీన్ సిగ్నల్

జనసేన పార్టీలో గత ఎన్నికల కంటే ఈసారి భిన్నంగా పార్టీ అధినేత వ్యవహరిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు

తెలుగు పోస్ట్ 26 Feb 2026 1:28 pm

YS Jagan |ఘ‌న స్వాగ‌తం ప‌లికిన అభిమానులు

YS Jagan | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌

ప్రభ న్యూస్ 26 Feb 2026 1:22 pm

Chilupur Bugulu Venkanna |అఖిలాండ కోటి చిలుపూర్ బుగులు వెంకన్న సేవలో పొట్లపల్లి శ్రీధర్ రావు

Chilupur Bugulu Venkanna | అఖిలాండ కోటి చిలుపూర్ బుగులు వెంకన్న సేవలో

ప్రభ న్యూస్ 26 Feb 2026 1:18 pm

Nani’s Aaya Sher trends top in 9 countries

Natural Star Nani and Srikanth Odela have cooked the Internet with their highly anticipated The Paradise, first announcement video. Further with regular updates, they have been keeping the buzz high and now, the first single, Aaya Sher, has blasted all the records and it is trending on top in nine nations. It is interesting to […] The post Nani’s Aaya Sher trends top in 9 countries appeared first on Telugu360 .

తెలుగు 360 26 Feb 2026 1:15 pm

VijaywedsRashmika |రౌడీబాయ్ పెళ్లి సంద‌డి..

VijaywedsRashmika | రౌడీబాయ్ పెళ్లి సంద‌డి.. VijaywedsRashmika | వివాహ బంధంలోకి అడుగు

ప్రభ న్యూస్ 26 Feb 2026 1:08 pm

అమరావతి క్రీడల్లో అపశ్రుతి.. ఉపసభాపతి సహా పలువురికి గాయాలు..

శాసనసభలో వాడివేడి చర్చలతో కనిపించే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు అమరావతి క్రీడా మైదానంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతూ ముగ్గురు కీలక ప్రజాప్రతినిధులు గాయపడ్డారు. ఈ ఘటనలతో క్రీడాపోటీల్లోనూ రాజకీయ వేడి కనిపిస్తోందని చర్చ జరుగుతోంది.బుధవారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డారు. పరుగు తీసే క్రమంలో రనౌట్ నుంచి తప్పించుకోవడానికి క్రీజులోకి డైవ్ చేయబోయి అదుపుతప్పారు. దీంతో శరీర బరువు మొత్తం ఎడమ భుజంపై పడటంతో మణికట్టు, […] The post అమరావతి క్రీడల్లో అపశ్రుతి.. ఉపసభాపతి సహా పలువురికి గాయాలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 1:07 pm

ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్..ఆస్తి పన్ను చెల్లింపుల కోసం సరికొత్త విధానం

ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపులు, ఇతర పురపాలక సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ, వాణిజ్య భవనానికీ ఒక ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం ద్వారా ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ […] The post ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్..ఆస్తి పన్ను చెల్లింపుల కోసం సరికొత్త విధానం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 12:51 pm

ఐపీఎస్ సునీల్ నాయక్ కు నాన్ బెయిలబుల్ వారెంట్

సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్‌ నాయక్ కు గుంటూరు మొబైల్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది

తెలుగు పోస్ట్ 26 Feb 2026 12:50 pm

Warangal |వరంగల్ జిల్లా కోర్టులో టెన్ష‌న్ టెన్ష‌న్‌

Warangal | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

ప్రభ న్యూస్ 26 Feb 2026 12:46 pm

శిక్షణ తరగతులలో ఉత్సాహంగా పాల్గొంటున్న సర్పంచ్ లు

జైనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా గెలుపొందిన సర్పంచులకు శిక్షణ తరగతులు

ప్రభ న్యూస్ 26 Feb 2026 12:41 pm

Gold Rates : గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్స్ తగ్గాయ్.. ఎంతో తెలుసా?

బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి

తెలుగు పోస్ట్ 26 Feb 2026 12:39 pm

జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 లో మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళగిరి షాపింగ్ మాల్ లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ముందుగా షాప్ ముందు ఏర్పాటు చేసిన డెకరేషన్ కు మంటలు అంటుకున్నాయి. షాపింగ్ మాల్ లో ఫర్నిచర్, వస్త్రాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. షాపులో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా హైడ్రా, ఫైర్ సిబ్బంది కాపాడారు. వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు లోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.  

మన తెలంగాణ 26 Feb 2026 12:38 pm

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్‌ను నియమించారు. ఫైనాన్స్‌ అండ్‌ ప్లానింగ్‌ విభాగం కార్యదర్శిగా […] The post తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 12:31 pm

నూతన దంపతులను ఆశీర్వదించిన డాక్టర్ మట్టా

వేంసూరు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలగారపు చెన్నారావు, యేసుమణి దంపతుల

ప్రభ న్యూస్ 26 Feb 2026 12:30 pm

సింగిల్ బ్రిడ్జి తో…సకల ఇబ్బందులు

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ని

ప్రభ న్యూస్ 26 Feb 2026 12:28 pm

YSRCP : ఆళ్ల మళ్లీ ఆట మొదలు పెట్టారా?

ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారు

తెలుగు పోస్ట్ 26 Feb 2026 12:24 pm

విద్యార్థుల నైపుణ్యతకు విజ్ఞాన యాత్ర దోహదం..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : విద్యార్థుల నైపుణ్యతకు విజ్ఞాన యాత్ర ఎంతో ఉపయోగపడుతుందని కామారెడ్డి

ప్రభ న్యూస్ 26 Feb 2026 12:24 pm

Narendra Modi : మోదీకి అరుదైన ఘనత

భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సాధించారు

తెలుగు పోస్ట్ 26 Feb 2026 12:20 pm

T20 World Cup |నేడు జింబాబ్వేతో భార‌త్ ఢీ

T20 World Cup | నేడు జింబాబ్వేతో భార‌త్ ఢీ T20 World

ప్రభ న్యూస్ 26 Feb 2026 12:16 pm

జనగామ జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్ బాషా షేక్ బదిలీ

జనగామ, ఆంధ్రప్రభ ; గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల

ప్రభ న్యూస్ 26 Feb 2026 12:12 pm

తెలుగు భాషకు పట్టం కట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు

సీబీఎస్ఈ సహా అన్ని స్కూళ్లలో ఇక తెలుగు తప్పనిసరి రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో మాతృభాష తెలుగుకు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాలకు తెలుగు భాషా సౌరభాన్ని అందించడమే లక్ష్యంగా, వచ్చే 2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును కచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం స్టేట్ బోర్డు పాఠశాలలకే పరిమితం కాకుండా, […] The post తెలుగు భాషకు పట్టం కట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 12:08 pm

రంజీ ట్రోఫీ ఫైనల్.. భారీ స్కోర్‌కి ఆలౌటైన జమ్ము కశ్మీర్

హుబ్లీ: రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో జమ్ము కశ్మీర్ జట్టు భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి జమ్ము కశ్మీర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. మూడో రోజు 527/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన జమ్ము జట్టు చివరకు 584 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జమ్ము కశ్మీర్ బ్యాటింగ్‌లో ఒక శతకం, ఐదు అర్థ శతకాలు నమోదు కావడం విశేషం. శుభమ్ పుందిర్(121) శతకం సాధించగా.. హసన్ (88), అబ్దుల్ సమాద్ (61), కన్హియా వాదవాన్ (70), సాహిలోత్రా(72), కెప్టెన్ పరాస్ డోగ్రా(70) పరుగులతో రాణించారు. కర్ణాటక బౌలింగ్‌లో ప్రశిద్ధ్ కృష్ణ 5, విద్యాధర్, విజయ్ కుమార్, శ్రేయస్, శిఖర్ తలో వికెట్ తీశారు. కర్ణాటక ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో మయాంక్ (16), దేవ్‌దత్(4) ఉన్నారు. కర్ణాటక ప్రస్తుతానికి 553 పరుగుల వెనుకంజలో ఉంది.

మన తెలంగాణ 26 Feb 2026 12:07 pm

యాదగిరిగుట్ట కలెక్టర్‌గా అనురాగ్ జయంతి

యాదగిరిగుట్ట ప్రతినిధి , ఆంధ్రప్రభ ; 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి

ప్రభ న్యూస్ 26 Feb 2026 12:07 pm

జగన్ రాయలసీమకు ద్రోహం చేశారు: నిమ్మల

అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసిపి అబద్ధాలు చెబుతోందని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే మాజీ మంత్రి వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారని..ఈ ఐదేళ్లు వైసిపి నాయకులు ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. ఎపి శాసనమండలిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై టిడిపి, వైసిపి సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. శాసనమండలిలో నిమ్మల ప్రసంగించారు. రాయలసీమకు జగన్ ద్రోహం చేశారని, 2020 లోనే రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పనులు నిలిపి వేశారని విమర్శించారు. అప్పుడు జగన్ సిఎంగా ఉన్న విషయం వైసిపి సభ్యులకు తెలియదా? అని నిమ్మల ప్రశ్నించారు. జగన్ పై బిఆర్ఎస్ నాయకులు చాలా చెప్పారని, తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుంటారని అన్నారు. ఇక్కడ మనం వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. 2020 సెప్టెంబర్ లో ఎన్ జిటి ఆర్డర్ ఇచ్చిందని, తాగునీరు కోసమే రాయలసీమ లిఫ్ట్ అని ఒజి ఇచ్చారని తెలియజేశారు. స్టే పక్కన పెట్టి పనులు చేస్తే రూ.2.65 కోట్లు ఎన్ జిటి ఫైన్ విధించిందని, డబ్బులు వచ్చే పనులు కూడా 2021 వరకే చేశారని మండిపడ్డారు. 2021 తర్వాత నాటి ప్రభుత్వం ఎందుకు పనులు చేపట్టలేదని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. 

మన తెలంగాణ 26 Feb 2026 12:04 pm

Hyderabad : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 26 Feb 2026 12:00 pm

ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ

అక్రమ వలసదారులను తరలించడాన్ని ఫెడరల్‌ కోర్టు తప్పుబట్టింది వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించడాన్ని అక్కడి ఫెడరల్‌ కోర్టు తప్పుబట్టింది. ట్రంప్‌ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తూ మసాచుసెట్స్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి బ్రియాన్‌ మర్ఫీ ఈ మేరకు తీర్పునిచ్చారు. అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ట్రంప్‌ కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వలసదారులను యూఎస్‌ నుంచి గ్వాటమాల, దక్షిణ […] The post ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 11:57 am

ఎన్‌సీఈఆర్‌టీ క్షమాపణలు

: పాఠ్యపుస్తకం నుంచి ఆ వివాదాస్పద చాప్టర్ తొలగింపు దేశంలో పాఠ్యపుస్తకాలను రూపొందించే జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) కీలక నిర్ణయం తీసుకుంది. 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థకు సంబంధించి వివాదాస్పద అంశాలు ఉండటంతో ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పొరపాటుపై బహిరంగంగా క్షమాపణలు కూడా కోరింది. 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలోని నాలుగో అధ్యాయంలో భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ఓ పాఠ్యాంశం ఉంది. న్యాయమూర్తుల కొరత, […] The post ఎన్‌సీఈఆర్‌టీ క్షమాపణలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 11:56 am

జూబ్లీహిల్స్‌లో అగ్నిప్ర‌మాదం..

ఆంధ్ర‌ప్ర‌భ , హైద‌రాబాద్ : న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌ర్ 36లో భారీ

ప్రభ న్యూస్ 26 Feb 2026 11:55 am

Vishnu Vinyasam: Loaded With Laughter & Twists

Hero Sree Vishnu is one of the few actors who consistently experiments with fresh storylines, even though comedy remains his strongest asset. After delivering three back-to-back blockbusters- Samajavaragamana, Om Bheem Bush, and Single, he now returns with yet another out-and-out entertainer, Vishnu Vinyasam. Vishnu Vinyasam has been awarded a U/A certificate and comes with a […] The post Vishnu Vinyasam: Loaded With Laughter & Twists appeared first on Telugu360 .

తెలుగు 360 26 Feb 2026 11:47 am

Revanth REddy నేడు నీటి ఎద్దడి పై రేవంత్ సమీక్ష

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వేసవి నీటిఎద్దడి, సవాళ్లపై నేడు సమీక్ష నిర్వహించనున్నారు

తెలుగు పోస్ట్ 26 Feb 2026 11:45 am

టీమిండియా నెగ్గాల్సిందే.!

నేడు జింబాబ్వే తో సూపర్ -8 మ్యాచ్చపాక్ స్టేడియం లో రాత్రి 7 నుంచి ప్రారంభం చెన్నై : టి 20 ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ లో టీం ఇండియాకు కఠిన సవాల్ ఎదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టి గ్రూప్ దశలో అగ్రస్థానం సాధించింది. కానీ సూపర్ హిట్ లో పో భారీ ఓటమి జట్టును ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలోకి నెట్టింది. ముఖ్యంగా బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ పేలవమైన పాము టీమిండియా […] The post టీమిండియా నెగ్గాల్సిందే.! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Feb 2026 11:39 am

నేటి నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ

నేటి నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లను దేశ వ్యాప్తంగా స్వీకరించనున్నారు

తెలుగు పోస్ట్ 26 Feb 2026 11:38 am

Super8|స‌మీక‌ర‌ణాలో టీమిండియా స‌మ‌రం

Super8| స‌మీక‌ర‌ణాలో టీమిండియా స‌మ‌రం Super8| నేటి మ్యాచులు తేల్చ‌నున్న భార‌త్ భ‌విత‌వ్యం

ప్రభ న్యూస్ 26 Feb 2026 11:35 am

Telangana :తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో భూ ప్రకంపనలు

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో భూ ప్రకంపనలు కనిపించాయి.

తెలుగు పోస్ట్ 26 Feb 2026 11:33 am

బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్..

బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్.. చర్ల,ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలో

ప్రభ న్యూస్ 26 Feb 2026 11:27 am

జగత్‌పల్లిలో మహిళా శక్తి భవనానికి శంకుస్థాపన

భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 26 (జనం సాక్షి): మండలం లోని జగత్‌పల్లి గ్రామంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి …

జనం సాక్షి 26 Feb 2026 11:22 am

నూతన అదనపు కలెక్టర్ గా హరిప్రియ..

పాలమూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా మహబూబ్నగర్

ప్రభ న్యూస్ 26 Feb 2026 11:22 am

హనుమాన్ దేవాలయంలో నమాజ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి

మన తెలంగాణ/ బోడుప్పల్ :  గుర్తు తెలియని వ్యక్తి హనుమాన్ దేవాలయంలో నమాజ్ చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజ్‌గిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాప సింగారంలో బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి స్థానికంగా అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలోని హనుమాన్ దేవాలయం పై నమాజ్ చదువుతున్నాడని గుర్తించిన భక్తుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. సదరు వ్యక్తి బెదిరించడంతో భయాందోళనకు గురై స్థానికులకు సమాచారం ఇవ్వడంతో బీజేవైఎం నాయకులు, స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వ్యక్తి నమాజ్ చేస్తున్నప్పుడు చూసిన బీజేవైఎం నేతలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 26 Feb 2026 11:20 am

అంగన్వాడి కేంద్రంలో సామూహిక అన్నప్రాసన

తలకొండపల్లి ఫిబ్రవరి 25(జనంసాక్షి):తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ లో బుధవారం 6 నెలలు నిండిన …

జనం సాక్షి 26 Feb 2026 11:20 am

వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా దీపక్ తివారి..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతికు జెన్ బదిలీపై నారాయణపేట

ప్రభ న్యూస్ 26 Feb 2026 11:19 am

గ్రామ ప్రజల శ్రేయస్సే అయన లక్ష్యం..

వేంసూరు, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజల శ్రేయస్సే ప్రధాన ఏజెండాగా మార్చుకొని పనులు

ప్రభ న్యూస్ 26 Feb 2026 11:16 am

Major IAS Reshuffle: 45officers including 9 Secretaries & 12 Collectors Moved in TG

In a sweeping administrative overhaul, the Telangana government has transferred 45 IAS officers, including the shifting of 9 senior Secretaries and 12 District Collectors. The massive reorganization, detailed in G.O.Rt.No.290, aims to recalibrate key departments including Industries, Irrigation, and Finance, while installing new leadership across nearly a dozen districts. – Arvind Kumar Transferred Amid Formula […] The post Major IAS Reshuffle: 45officers including 9 Secretaries & 12 Collectors Moved in TG appeared first on Telugu360 .

తెలుగు 360 26 Feb 2026 11:15 am

35వ వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తాం

మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి. తాండూరు ఫిబ్రవరి 26(జనంసాక్షి)35వ వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని మున్సిపల్ …

జనం సాక్షి 26 Feb 2026 11:14 am

అభివృద్ధి పథంలో 13వ వార్డును ముందుకు తీసుకెళ్తా

వార్డులో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి. 13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్. ఎన్నికల ముందు …

జనం సాక్షి 26 Feb 2026 11:09 am

Peddi |తెర వెనుక ఏం జరుగుతోంది..?

Peddi | తెర వెనుక ఏం జరుగుతోంది..? Peddi | పెద్ది రిలీజ్

ప్రభ న్యూస్ 26 Feb 2026 11:08 am

తెలంగాణలో భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలు

హైదరాబాద్: రాష్ట్రం వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. వాటిలో ప్రధానంగా సంజయ్ కుమార్‌ను పరిశ్రమలు, ఐటి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పిఆర్ & ఆర్డి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఇక సభ్యసాచి ఘోష్‌కు – ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ స్కిమ్స్ యూనిట్‌తో పాటు సిఎస్ఆర్‌గా బాధ్యతలు అందించారు. ఇక ఎం.దాన కిషోర్‌కి లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ & ఫ్యాక్టరీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ.. విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్. శ్రీధర్‌కు.. ఐటి & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. రాహుల్ బొజ్జాను జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అంతేకాక బిసి వెల్ఫేర్ శాఖకు అదనపు బాధ్యత అందించారు. ఇ. శ్రీధర్‌కు.. ఇరిగేషన్ మరియు సిఎడి శాఖ కార్యదర్శిగా నియమించారు. గౌరవ్ ఉప్పల్‌ను ఫైనాన్స్ మరియు ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియమించారు. టిజిఆర్‌ఎసి ఇవొ డిజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇతర కీలక పోస్టింగ్‌లు బి. విజయేంద్ర – మహబూబ్‌నగర్ కలెక్టర్ నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియామకం. డి. దివ్య – సర్ప్ సీఈఓగా కొనసాగుతూ ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యత. అద్వైత్ కుమార్ – మహబూబాబాద్ కలెక్టర్ నుంచి తెలంగాణ భవన్ (ఢిల్లీ)లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం. ఎం. హనుమంత రావు – యాదాద్రి భువనగిరి కలెక్టర్ నుంచి ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా బదిలీ. సిక్తా పట్నాయక్ – నారాయణపేట్ కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియామకం. సందీప్ కుమార్ ఝా – జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ నుంచి జనగాం కలెక్టర్‌గా నియామకం. ఎండి. ముషారఫ్ అలీ ఫరూఖీ – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి మూడో డిస్కమ్ సీఎండీగా బదిలీ. పామెల సంపత్ – కరీంనగర్ కలెక్టర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ. అనురాగ్ జయంతి – జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ నుంచి యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియామకం. రాహుల్ రాజ్ పి.ఎస్ – మెదక్ కలెక్టర్ నుంచి సహకార శాఖ స్పెషల్ కమిషనర్ & రిజిస్ట్రార్‌గా నియామకం. భవేశ్ మిశ్రా – ఐటీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేషన్. కొత్త జిల్లా కలెక్టర్లు జితేష్ వి పాటిల్ – టిజిఎస్పిడిసిఎల్ సిఎండిగా నియామకం. రిజ్వాన్ భాషా షేక్ – జనగాం కలెక్టర్ నుంచి జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా బదిలీ. సంతోష్ బి.ఎం– జోగులాంబ గద్వాల్ కలెక్టర్ నుంచి గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా బదిలీ. ప్రతీక్ జైన్ – వికారాబాద్ కలెక్టర్ నుంచి నారాయణపేట్ కలెక్టర్‌గా నియామకం. స్నేహ శబరీష్ – హనుమకొండ కలెక్టర్ నుంచి మహబూబాబాద్ కలెక్టర్‌గా బదిలీ. పి. కాత్యాయనీ దేవి – స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం. జి.ఫణీంద్ర రెడ్డి – టీజీఎంఎస్ఐడీసీ ఎండీ నుంచి నారాయణపేట్ అదనపు కలెక్టర్‌గా బదిలీ. చిత్ర మిశ్రా – ఎటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ నుంచి కరీంనగర్ కలెక్టర్‌గా నియామకం. గరీమా అగర్వాల్ – రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియామకం. దీపక్ తివారీ – వికారాబాద్ కలెక్టర్‌గా నియామకం. ప్రతీమా సింగ్ – మెదక్ కలెక్టర్‌గా నియామకం. అంకిత్ – భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియామకం. చాహత్ బాజ్‌పేయ్– హనుమకొండ కలెక్టర్‌గా నియామకం; జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యత. ఖుష్బు గుప్త– మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియామకం. ఇతర పోస్టింగ్‌లు మంద మకరందు – జిహెచ్ఎంసి రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్. ఫైజన్ అహ్మద్– మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్. శివేంద్ర ప్రతాప్ – హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్. పర్మర్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్ – జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్. ఉమా శంకర్ ప్రసాద్ – వికారాబాద్ అదనపు కలెక్టర్. రాష్ట్ర సర్వీస్ (ఎస్‌సిఎస్) అధికారుల పోస్టింగ్‌లు జి.వి శ్యాంప్రసాద్ లాల్– నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్. పి.చంద్రయ్య – మంచిర్యాల అదనపు కలెక్టర్. వై.వి గణేశ్– వరంగల్ అదనపు కలెక్టర్. అబ్దుల్ హమీద్ – సిద్ధిపేట అదనపు కలెక్టర్. బి. వెంకటేశ్వరు– నిర్మల్ అదనపు కలెక్టర్. ఎన్.ఖీమ్య నాయక్ – వనపర్తి అదనపు కలెక్టర్. ఇతరులు కె.విద్యాసాగర్ – ఇండస్ట్రీ & ఇన్వెస్ట్‌మెంట్ సెల్ అదనపు సీఈఓగా నియామకం. ఎం.సురేందర్ – ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా నియామకం.  మొత్తం 45 మంది అధికారులకు బదిలీలు/కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మన తెలంగాణ 26 Feb 2026 11:07 am

నిర్భయంగా.. ముక్కుసూటి గా ధర్మ శాస్త్రాలను మంచి ప్రవచనాలు చెప్పే వ్యక్తి డాక్టర్ గరికిపాటి

మంథనిలో గరికిపాటి ప్రవచనాలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రపురి …

జనం సాక్షి 26 Feb 2026 11:05 am

Raghu Rama Krishna Raju Injured During AP Lawmakers’ Sports Meet

The ongoing sports meet between Andhra Pradesh Assembly and Council members took an unexpected turn after Deputy Speaker Raghu Rama Krishna Raju suffered an injury on the cricket field. During a crucial moment in the match, Raghu Rama Krishna Raju attempted a quick run and dived toward the crease to avoid getting run out. The […] The post Raghu Rama Krishna Raju Injured During AP Lawmakers’ Sports Meet appeared first on Telugu360 .

తెలుగు 360 26 Feb 2026 11:04 am

No Akhil in NTR’s Dragon

Young Tiger NTR and Prashanth Neel are working on a action-packed mass entertainer titled Dragon. A massive schedule of the film was wrapped up in Jordan and the next schedule commences soon in Hyderabad. Rumors are going on that Akhil Akkineni has been roped in for a crucial role in the film and he will […] The post No Akhil in NTR’s Dragon appeared first on Telugu360 .

తెలుగు 360 26 Feb 2026 11:03 am

శివాలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్టా హోమ పూజా క్రతువులు

బూర్గంపహాడ్ ఫిబ్రవరి 26 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో బ్రహ్మసూత్రం కలిగిన …

జనం సాక్షి 26 Feb 2026 10:59 am

జర్నలిస్టుల భద్రతకు హెల్మెట్ రక్ష జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్

మాడుగులపల్లిలో వర్కింగ్ జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ మాడుగులపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 25 జనం సాక్షి:సమాజ హితం కోసం నిరంతరం …

జనం సాక్షి 26 Feb 2026 10:56 am

Media Watch: KCR’s Tomorrow’s Headline vs Revanth’s Today’s Narrative Control

Hyderabad: The shift in political communication between the previous BRS government and the current Congress regime in Telangana is becoming increasingly visible — not just in policy, but in timing. During the tenure of former Chief Minister K. Chandrashekar Rao (KCR), information flow was carefully aligned with the newspaper cycle. The priority was clear: dominate […] The post Media Watch: KCR’s Tomorrow’s Headline vs Revanth’s Today’s Narrative Control appeared first on Telugu360 .

తెలుగు 360 26 Feb 2026 10:36 am

26 Feb2026 |తిరుమల సమాచారం..

26 Feb2026 | తిరుమల సమాచారం.. 26-02-2026 తిరుమలలో టోకెన్లులేని

ప్రభ న్యూస్ 26 Feb 2026 10:17 am

ఇది కులాధిపత్య వైపరీత్యం

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కులాల ద్వేషం, పెత్తందార్ల పెత్తనం అవశేషాలు ఇంకా బుసకొడుతున్నాయనడానికి ఈ నెల 19న నాగర్‌కర్నూల్ మండలం లోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దారుణ సంఘటనే ప్రత్యక్ష సాక్షం. జాతరలో జరిగిన చిన్న గొడవ చిలికిచిలికి గాలివానగా మారి ఓ పసికందు మృతికి కారణమైంది. జాతరలో నెలకొన్న రద్దీలో భక్తులకు, నిర్వాహకులకు మధ్య జరిగిన తోపులాటలో నిరుపేద రజకుడు చిల్కేశ్వరం గణేశ్, ఆయన భార్య మౌనికలను పక్కకు నెట్టేయడమే కాకుండా వారి రెండు నెలల కూతురును నిర్వాహకులు కాలితో తన్ని విసిరేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన వివిధ వర్గాల ఆందోళనలకు దారి తీసింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు నిరసన చేపట్టాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కుమ్మెర గ్రామం పెత్తందార్ల దాష్టీకానికి కంచుకోటగా గత ముప్ఫయ్యేళ్లుగా సాగుతోంది. పెత్తందార్లు ఎలాంటి అరాచకాలు సాగించినా వారిని ఎదిరించే సాహసం ఎవరికీ లేకుండా పోతోంది. ఒకవేళ ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెడుతుంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ ఫిర్యాదు సరిగ్గా లేదని పోలీసులు తిప్పికొట్టారని, పైగా నిందితులకు ఫోన్ చేసి మీరు కూడా కేసు పెట్టాలని సూచించారని అనధికారికంగా తెలుస్తోంది. ఈ సంఘటనతో గత ముఫ్పయ్యేళ్లుగా పెత్తందార్లు సాగిస్తున్న దురాగతాలు ఇప్పుడిప్పుడే వెలుగు లోకి వస్తున్నాయి. కుమ్మెర గట్టు అనేది పూర్తిగా ప్రభుత్వ గైరాన్ భూమిలో ఉంది. ఆ గుట్టపై పెత్తందార్లకు ఎటువంటి సంబంధం లేదు. గట్టుపై పూజలందుకునే మల్లయ్య పూర్తిగా యాదవుల ఆరాధ్య దైవం. యాదవుల ఇంటిలో ఉన్న మల్లయ్య దేవుడిని జాతర ముందు గుడికి తీసుకొస్తారని, జాతర పూర్తికాగానే తిరిగి తమ ఇంట్లోకి తీసుకొస్తారని అక్కడి వారు చెప్పారు. అలాంటప్పుడు గుడికి, గట్టుకు, దేవుడికి ఎలాంటి సంబంధం లేని పెత్తందార్లు ఈ జాతర నిర్వాహకులుగా చెలామణి అవుతుండడం, వంద రూపాయల వంతున ప్రవేశ రుసుం వసూలు చేయడం అక్రమమని తెలుస్తోంది. ప్రవేశ రుసుం వంద రూపాయలు ఇవ్వకపోవడం వల్లనే రజకులైన గణేశ్ దంపతులను క్యూలోంచి నెట్టివేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఫ్ఫయ్యేళ్లుగా కుమ్మెర గ్రామంలోని బడుగు వర్గాలను పెత్తందార్లు ఏ విధంగా హింసిస్తున్నారో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే తెలుస్తుంది. కుర్వ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి గొర్రెలు మేత కోసం బీడు భూముల్లోకి అలా పెత్తందారి చెలకలోకి పోవడంతో గొర్రెల కాపరిపై పెత్తందార్లు దాడి చేసి గడీల ఇంట్లో తాళం వేసి బంధించే సంఘటన ముఫ్ఫైయేళ్ల క్రితం జరిగింది. గడీలో గొర్రెల కాపరి బందీయై తీవ్ర చిత్రహింసలకు గురయ్యాడు. ఇంత జరిగినా ఆ గ్రామంలో ఎవరూ పట్టించుకోలేదు. పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఇటువంటి దుర్ఘటన ఇటీవల ఒకటి జరిగింది. పెత్తందారి చేలో కుర్వసమాజానికి చెందిన పశువుల కాపరి పశువులు పడ్డాయన్న నెపంపై కర్రతో దాడి చేయడంతో పశువుల కాపరి చెయ్యి విరిగింది. ట్రాన్స్‌ఫారమ్‌కు అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న సాకు చూపి దాడికి పాల్పడినట్టు తెలిసింది. కుర్వ సామాజిక తరగతికి చెందిన అమ్మాయి పొలంలో ఉన్న తన అన్న, తండ్రి దగ్గరకు చద్ది తీసుకుని వెళ్తుండగా దారిలో కల్వర్టు వద్ద మద్యం సేవిస్తున్న పెత్తందారీ వ్యక్తులు అమ్మాయిని అటకాయించి లైంగిక దాడికి పాల్పడ్డారని గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటనలకు నిరసనగా ఆందోళన చేపట్టిన ప్రజా సంఘాల పైనే కేసులు పెట్టారంటే పెత్తందారులకు పోలీసులు ఎలా వత్తాసు పలుకుతున్నారో తెలుస్తుంది. కుల దురహంకార సంఘటనలు జరగకుండా చూడాలని సుప్రీం కోర్టు అనేక సార్లు తన తీర్పుల ద్వారా హెచ్చరించినా, సమాజం లోని కరడుకట్టిన సంప్రదాయ వర్గాలకు కనువిప్పు కావడం లేదు. కులద్వేష కాటుకు బలైపోతున్న వారు ప్రధానంగా దళితులు, మహిళలే. ఇక కులద్వేషంతో ముడిపడి ఉన్న పరువు హత్యల సంఘటనల గురించి చెప్పనక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 5000 మంది మహిళలు, బాలికలు పరువు కోరలకే బలైపోతున్నారు. వీరిలో దాదాపు మూడింట ఒకవంతు మంది భారత్, పాకిస్తాన్‌లకు చెందిన వారే కావడం గమనార్హం. అయితే వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా ఏటా పరువు హత్యల సంఖ్య దాదాపు 20,000 వరకు ఉంటోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తెలంగాణ లోని మిర్యాలగూడలో అగ్రవర్ణ కుటుంబానికి చెందిన అమ్మాయి, దళితుడిని ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి 2016లో పెళ్లి చేసుకున్నా ఆమె కుటుంబీకులు సహించలేక ఆమె భర్తను దారుణంగా చంపించిన సంఘటన సంచలనం కలిగించింది. ఇదే విధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు చెందిన 27 ఏళ్ల యువతి పరువు హత్యకు బలైపోయింది. కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటన కేవలం ఒక గ్రామంలో జరిగిన చిన్న సంఘర్షణ అనుకోరాదు. ఆధునిక సమాజంలో జడలు విప్పుతున్న కులద్వేషానికి ప్రతిబింబం. వంద రూపాయల కోసం పసిప్రాణం బలిగొనడం అమానుషం. దైవదర్శనం కోసం వచ్చిన భక్తుల్లో తక్కువ ఎక్కువ కులాలని తేడాలు చూపించి అడ్డుకోవడం, అవమానించడం, మన సామాజిక నిర్మాణం ఎంత పతనావస్థలో ఉందో స్పష్టం చేస్తుంది. సర్వమానవ సౌభ్రాతృత్వం, భక్తి, ఆధ్యాత్మికత, ఆరాధన విషయంలో కుల మతాలు అడ్డురావని ప్రబోధించే పెద్దలు ఇలాంటి దురాగతాలకు ఏం సమాధానం చెబుతారు? 

మన తెలంగాణ 26 Feb 2026 10:11 am

అందుకే.. కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందా.?

అందుకే.. కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందా.? ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రజలకు నాణ్యమైన

ప్రభ న్యూస్ 26 Feb 2026 10:10 am

Ap Free Bus : ఉచిత బస్సు ప్రయాణంలో కీలక నిర్ణయం.. ఇక వారికి కూడా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 26 Feb 2026 10:08 am

హైదరాబాద్ - విశాఖ హైవై ప్రారంభం ఎప్పటి నుంచి అంటే?

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారికి గుడ్‌న్యూస్

తెలుగు పోస్ట్ 26 Feb 2026 10:05 am

Big Breaking |తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ..

Big Breaking | తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ.. Big Breaking,

ప్రభ న్యూస్ 26 Feb 2026 10:01 am

నేడు హైకోర్టులో సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటీషన్

సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్‌ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది

తెలుగు పోస్ట్ 26 Feb 2026 9:58 am

వాణిజ్యం వైపే ప్రపంచ గమనం

ఎన్నో ఆటుపోట్లు, అవాంతరాల మధ్య న్యూఢిల్లీ వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం భారత దేశ ప్రయోజనాలకు భంగకరంగా ఉందని కొందరు, ట్రంప్ స్వదేశంలో ఎదురవుతున్న నిరసనలకు తలవొగ్గి భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారని మరికొందరు వాదించడం గమనార్హం. ఇది భారత్ సాధించిన విజయమని బిజెపి అనుకూల పక్షాలు భాష్యం చెబుతుంటే, మోడీ ట్రంప్ ఒత్తిళ్ళకు లొంగిపోయి రాజీపడ్డారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏది నిజం? ఏది అబద్ధం? అనే అంశం ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాతే నిర్ధారణ అవుతుంది. ఏదిఏమైనప్పటికీ ట్రంప్ కనీస మర్యాద, దౌత్య విలువలు పాటించకుండా ఏక పక్షంగా వాణిజ్య ఒప్పందం కుదిరిందని చెప్పడమే కాకుండా, ప్రతీ విషయాన్ని ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించడం సముచితం కాదు. భారత్ కూడా ట్రంప్ పోకడలపై తగిన వివరణ ఇవ్వకపోతే ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తే అవకాశముంది. ఇండో- యుఎస్ ‘ట్రేడ్ డీల్’లో కొన్ని సవరణలు చేస్తూ అమెరికా ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. 500 బిలియన్ డాలర్ల అమెరికా వస్తూత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందనే ప్రకటనలో కొంత సవరణ చేయడమే కాకుండా భారత్ నుండి దిగుమతి చేసుకునే పప్పుధాన్యాలపై సుంకాలు తగ్గుతాయనే పదజాలంలో కూడా సవరణలు చేస్తూ కొత్త ఫ్యాక్ట్‌షీట్‌లో అమెరికా పేర్కొనడం జరిగింది. భారత్‌తో ట్రేడ్‌డీల్‌పట్ల పాక్ సహజం గానే ఆత్మరక్షణలో పడింది. అమెరికా తమను టాయ్ లెట్ పేపర్‌లా వాడుకుని, వదిలేయడం పట్ల పాక్ రక్షణ మంత్రి ఆవేదన చెందడం సహజమే. ఉన్నట్టుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో ఎందుకింత మార్పు వచ్చింది? భారతీయ వస్తువులపై సుంకాలను 18 శాతం ఎందుకు తగ్గించారు? ఇప్పటి వరకు నాన్చిన అమెరికా- భారత్ ట్రేడ్ డీల్‌ను ట్రంప్ ఎందుకు ఆమోదించారు? ట్రంప్ ట్రేడ్ డీల్ లో నిజాయితీ ఉందా? అసలు తెరవెనుక ఏం జరిగిందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఇరుదేశాల మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ వలన ఎవరికి లాభం? ఎవరికి నష్టం అనే అంశాలను పరిశీలిస్తే ఇరు దేశాలకు ఈ ఒప్పందం వలన ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. ట్రంప్ ప్రకటనకు మోడీ అంగీకారం తెలియజేసిన నేపథ్యంలో ఈ ఒప్పందం భారతీయ రైతులకు శాపంగా ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల వస్తూత్పత్తులను కొనడం విశేషమేమీ కాదని భారత్ ప్రకటించింది. మోడీ అభ్యర్థనతోనే తాను ట్రేడ్ డీల్‌కు ఒప్పుకున్నానని, రష్యా నుండి చమురు కొనుగోలు నిలుపుదల చేయడానికి, వెనెజువెలా నుండి చమురు కొనుగోలుకు భారత్ అంగీకరించడం వలన ఈ ఒప్పందాన్ని అంగీకరించడం జరిగిందని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో వెల్లడించగా, సుంకాలను తగ్గించడం పట్ల, ట్రేడ్ డీల్ పట్ల మోడీ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ట్రంప్ చెప్పినట్లుగా రష్యా చమురు నిలిపి వేస్తామని గాని, వెనెజువెలా నుండి చమురు కొనుగోలు చేస్తామని గాని భారత ప్రధాని చెప్పలేదు. రష్యా కూడా భారత్ నుండి చమురు విషయంలో తమకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొనడం విశేషం. ట్రంప్ మాటల్లో వాస్తవమెంత? భారత్ నిజంగానే రష్యా నుండి చమురు కొనుగోలు నిలిపివేసి, ప్రస్తుతం అమెరికా అధీనంలో ఉన్న వెనెజువెలా నుండి ఆయిల్ దిగుమతి చేయనుందా? అనే విషయాలపై భారత ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతానికైతే ఇండో- యుఎస్ మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైనది. ఈ ఒప్పందం మార్చి నెల నుండి అమల్లోకి రాబోతున్నది. యూరోపియన్ యూనియన్‌తో భారత్ చేసుకున్న ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’ కూడా ఏ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కాని అమల్లోకి వస్తుంది. భారత్‌పై ఆగ్రహంతో రగిలి పోయిన ట్రంప్ స్వరం మార్చి మోడీని ప్రశంసించడమే కాకుండా అమెరికా- భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దంలోనే అతి పెద్ద చారిత్రక ఒప్పందంగా అభివర్ణించడం జరిగింది. భారత్‌తో తాము జరిపే 500 బిలియన్ డాలర్ల వాణిజ్యం జీరో సుంకాలతో జరగబోతుందని చెబుతున్న ట్రంప్, భారతీయ వస్తువులపై 18 శాతం సుంకాలు విధించడం ఇరుదేశాల వాణిజ్య వ్యవహారాల్లోని అసమతుల్యతను, భారత్ పట్ల అమెరికా చూపుతున్న వాణిజ్య వివక్షను చాటి చెబుతున్నది. భారత్- ఇయు దేశాల ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ పట్ల అప్రమత్తమైన ట్రంప్ ఒక మెట్టుదిగి, పట్టుదల వదలి భారత్‌తో ట్రేడ్ డీల్‌కు పచ్చజెండా ఊపినట్లు అవగతమవుతున్నది. అమెరికాలో ట్రంప్ పట్ల వ్యతిరేకత ఏర్పడడం, ద్రవ్యోల్బణం పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం, అమెరికా మిత్రదేశాలు ట్రంప్‌కు వ్యతిరేక గళం వినిపించడం, అమెరికా విధించిన రెసిఫ్రోకల్ టారిఫ్‌లను, అధిక సుంకాలను చైనా వంటి దేశాలు లెక్కచేయకపోవడం, రష్యా ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించడంతోపాటు అనేక అంశాలు, స్వీయ తప్పిదాలు ట్రంప్ పట్ల వ్యతిరేకతను పెంచాయి. ముఖ్యంగా భారత్‌పై 50% సుంకాలు విధించడం, ఇందులో రష్యా నుండి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకే ఏకంగా 25 శాతం అదనపు సుంకాలను విధించిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఈ సుంకాలను 18. శాతానికి పరిమితం చేయడం శుభసూచకం. మన పొరుగునున్న చైనా, బంగ్లాదేశ్, పాక్‌లపై 37, 20, 19 శాతం సుంకాలను విధించిన అమెరికా తన మిత్ర దేశాలపై కూడా భారత్ కంటే ఎక్కువ సుంకాలు విధించిన దేశాల జాబితాలో ఉన్నాయి. బ్రెజిల్‌పై 50%, మయన్మార్ పై 40% టారిఫ్‌లు విధించిన అమెరికా ఇప్పుడు భారత్ విషయంలో పన్నుల భారం తగ్గించడం క్షీణిస్తున్న ఇండో- యుఎస్ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకొనే చర్యల్లో ఒక భాగమే. అమెరికా మొండి పట్టుదల వలన ఇప్పటికే యూరోపియన్ యూనియన్ అమెరికాకు దూరం కావడం జరిగింది. అమెరికా శత్రుదేశాలను, మిత్రదేశాలనే కాకుండా భిన్న ధ్రువాలైన ఇరాన్, ఇజ్రాయెల్ పాలస్తీనా లతోపాటు, అరబ్ ఎమిరేట్స్‌తోను భారత్ తన ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నది. దీనిని భారత్ దౌత్యనీతిగా భావించాలా? లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా మోడీ అమెరికా హెచ్చరికలకు లొంగిపోయారా? అనే సంశయం తొలగిపోలేదు. ఆవేశకావేషాలు, ప్రతీకార చర్యలు, పంతాలు, పట్టింపులు భారత ఆర్థ్ధికాభివృద్ధికి గొడ్డలివేటు. ఈ విషయాన్ని గమనించే భారత్ ప్రపంచ దేశాలన్నింటితోను సఖ్యతను కొనసాగిస్తున్నది. అమెరికా వలన భారత్‌కు రష్యాతో గల రక్షణ, వాణిజ్య, సాంకేతిక సంబంధాలతో పాటు చారిత్రక, సన్నిహిత సంబంధాలకు విఘాతం కలగకుండా కాపాడుకోవాలి. ఈ ప్రపంచంలో భారత్‌కు నమ్మదగిన ఏకైక దేశం రష్యా మాత్రమే. ఎన్ని అడ్డంకులెదురైనా రష్యాతో భారత్‌కు గల చిరకాల బంధాన్ని కొనసాగించాలి. ఈ విషయంలో అమెరికా ఒత్తిడిని భారత్ పరిగణనలోకి తీసుకోకూడదు. ఇండో- అమెరికా ట్రేడ్ డీల్ వలన భారతీయ వస్తువులకు అమెరికా పెద్ద మార్కెట్‌గా అవతరించబోతుంది. భారతదేశంలో తగ్గబోయే వస్తువుల ధరలు, ఇంధన ధరల ప్రయోజనాలు నేరుగా వినియోగదారులకు దక్కాలి. భారతదేశంలో ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిల్వలున్న దేశంగా వెనెజువేలా పేరుగాంచింది. 800 సంవత్సరాలకు సరిపడా ఆయిల్ నిల్వలు గల వెనెజువెలాలో చమురు వెలికితీయడంలో హ్యూగోచావెజ్, మదురోలు విఫలమైనారు. ఇప్పుడు వెనెజువెలా అమెరికా కనుసన్నల్లో ఉండడం వలన ఆయిల్‌ను వెలికితీయడం సాధ్యం కావచ్చు. వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టాలని ఇప్పటికే ట్రంప్ భారత్, చైనాలను కోరడం జరిగింది. ఇది సాధ్యమా? ఏదిఏమైనప్పటికీ ట్రంప్ ధోరణిలో మార్పు వచ్చి ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం అభిలషణీయం. ఈ విషయంలో అమెరికా ఎలాంటి షరతులు విధించినా భారత్ అంగీకరించకూడదు. అలాగే భారతీయ ఉత్పత్తులపై విధించిన 18 శాతం సుంకాలను కూడా తొలగించి భారత్‌పై అమెరికా తనకున్న విశ్వసనీయతను ప్రపంచానికి చాటి చెప్పాలి. రష్యా విషయంలో భారత్‌ను హెచ్చరించిన అమెరికా ఇప్పుడు రష్యాతో కూడా రహస్య ఒప్పందం కుదుర్చుకోబోతుందని కొన్ని వార్తా కథనాలు వెలువడ్డాయి. పెట్రో డాలర్ వ్యవస్థను రష్యా అంగీకరించి, చమురును డాలర్లలోనే విక్రయించబోతున్నదనే వార్తల్లో నిజానిజాలు తేలాలి. ఏదిఏమైనప్పటికీ యుద్ధాల వలన ప్రయోజనం లేదని, ఆయుధాలు ప్రజల ఆకలిని తీర్చలేవనే సత్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలి. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం ఆయుధాలతో, ఉగ్రవాదంతో, అగ్ర దేశాల అవసరార్ధ ప్రయోజనాల కోసం తన ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసుకున్న పాక్‌కు ప్రస్తుత ప్రపంచ పరిణామాలు గుణపాఠం కావాలి. ఇప్పటివరకు పాక్ సాయంతో, సైనిక మద్దతుతో చిందులేసిన బంగ్లాదేశ్‌లోని బిఎన్‌పి నాయకుడు తారిఖ్ రెహమాన్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తన స్వరం మార్చుకున్నట్టు కనబడుతున్నది. భారత్‌తో స్నేహ సంబంధాలను నెలకొల్పుకుంటానని, బంగ్లాదేశ్ ఆర్ధిక వ్యవస్థ పటిష్టతకు కృషి చేస్తానని ప్రకటించడం ముదావహం. ఈ పరిణామాలను బట్టి ఇక నుండి ప్రపంచం వాణిజ్య సంబంధాల చుట్టే తిరుగుతుందనే వాస్తవం బోధపడుతున్నది. అశాంతి, అలజడులతో ఏమీ సాధించలేమని ప్రపంచ దేశాలు గమనించాలి. - సుంకవల్లి సత్తిరాజు 97049 03463

మన తెలంగాణ 26 Feb 2026 9:54 am

Andhra Pradesh : అన్ని రోగాలకూ చెక్.. ఏపీ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 26 Feb 2026 9:50 am

నేడు నెల్లూరు మేయర్ ఎన్నిక

నేడు నెల్లూరు మేయర్ ఎన్నిక జరగనుంది.

తెలుగు పోస్ట్ 26 Feb 2026 9:47 am

ఫ్యాక్ట్ చెక్: గుజరాత్ లోని ఓ పెళ్లి వేడుకకు హాజరైంది టేలర్ స్విఫ్ట్ కాదు. ఆమెను పోలి ఉన్న మహిళ

గుజరాత్ లోని ఓ పెళ్లి వేడుకకు హాజరైంది టేలర్ స్విఫ్ట్

తెలుగు పోస్ట్ 26 Feb 2026 9:46 am

సంక్షోభంలో ఉన్నత విద్య

భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ చారిత్రాత్మక మార్గమధ్యంలో నిలిచింది. ఒకప్పుడు దేశనిర్మాణం సామాజిక పురోగతికి మేధో శక్తిగా భావించబడిన ఈ వ్యవస్థ ఇప్పుడు నిర్మాణాత్మకంగా, నైతికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంస్థల సంఖ్య వేగంగా పెరిగింది, నాణ్యత, స్వయం ప్రతిపత్తి, విద్యా లక్ష్యం పెరగలేదు. ఫలితంగా ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది. డిగ్రీలు ఎక్కువ, కానీ నైపుణ్యాలు తక్కువ; క్యాంపస్‌లు ఎక్కువ, కానీ పరిశోధన బలహీనంగా; ప్రవేశాలు ఎక్కువ, కానీ నమ్మకం తగ్గుతూ ఉంది. విద్య ఎప్పుడూ అభివృద్ధికి పునాది, ముఖ్యంగా ఆలస్యంగా పారిశ్రామీకరణ చెందుతున్న సమాజాలకు. ప్రాథమిక విద్య అక్షరాస్యతను, పౌరచైతన్యాన్ని పెంపొందిస్తే, ఉన్నత విద్య ఆవిష్కరణ, పరిశోధన, నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుంది. గత అర్ధ శతాబ్దంలో తమ ఆర్థిక వ్యవస్థలను మార్చుకున్న దేశాలు మానవ వనరులపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. భారతదేశం, విశేష జనాభా ప్రయోజనం ఉన్నప్పటికీ, నిరంతరంగా అది చేయలేకపోయింది. దాని ప్రభావాలు ఇప్పుడు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల విద్యార్థుల సంక్షేమంపై న్యాయస్థానాల పరిశీలనలు క్యాంపస్‌లలో ఉన్న ఒత్తిడిని దేశవ్యాప్తంగా వెలుగులోకి తెచ్చాయి. ఆర్థిక ఒత్తిడి, సామాజిక ఒంటరితనం, విద్యా ఆందోళన, సంస్థాగత మద్దతు లేకపోవడం వంటి సమస్యలున్నాయి. పరిపాలన బోధనా పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరాన్ని కోర్టులు హైలైట్ చేశాయి. ఎందుకంటే పాలనలో ఉన్న ఖాళీలు నేరుగా విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభావితం చేస్తాయి. అనేక ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అనుమతించిన బోధన పోస్టులలో సగానికి సమీపం ఖాళీగా ఉంది. దీని వల్ల బోధన నాణ్యత, పరిశోధన సంస్కృతి బలహీనపడుతోంది. ఈ పతనం ముఖ్యంగా పాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు పేరుగాంచిన విద్యా కేంద్రాలు ఇప్పుడు తక్కువ సిబ్బందితో, నిలిచిపోయిన నియామకాలతో, తగ్గుతున్న పరిశోధనతో నడుస్తున్నాయి. ఒకప్పుడు మేధో చర్చలకు దారిచూపిన విభాగాలు ఇప్పుడు ప్రాథమిక విద్యా కార్యకలాపాలు నిర్వహించడానికి కష్టపడుతున్నారు. నియామకాలు, పాలనపై రాజకీయ విభేదాలు పరిపాలన స్తబ్దతను పెంచగా, అవినీతి, భావజాల అనుకూలత ప్రతిభాపరమైన నియామకాలను దెబ్బతీశాయి. దీంతో స్వయం ప్రతిపత్తి సంక్షోభం విశ్వసనీయత సంక్షోభంగా మారింది. జాతీయ స్థాయిలోకూడా ఉన్నత విద్యా వ్యవస్థలో అసమతుల్యత స్పష్టంగా కనిపిస్తోంది సిద్ధత లేకుండా విస్తరణ. గత రెండు దశాబ్దాల్లో ప్రైవేట్ సంస్థలు వేగంగా పెరిగి డిమాండ్- సప్లై అంతరాన్ని పూరించాయి. కానీ అనేక సంస్థలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా మాత్రమే పని చేస్తున్నాయి. ప్రవేశాలు పెరిగినా ప్రభుత్వ నిధులు పెరగలేదు, మౌలిక వసతులు వెనుకబడ్డాయి, అధ్యాపకుల కొరత తీవ్రమే. ప్రయోగశాలలు పాతబడిపోయాయి, గ్రంథాలయాలు సరిపడా లేవు, తరగతి గదులు కిక్కిరిసిపోయాయి. ఈ పరిమాణాత్మక పెరుగుదల ఉద్యోగ అవకాశాల్లో తీవ్రమైన అంతరాన్ని సృష్టించింది. విద్యార్థులు ప్రాయోగిక నైపుణ్యాలు, పరిశ్రమ అనుభవం, సమస్య పరిష్కార సామర్థ్యం లేకుండా పట్టభద్రులవుతున్నారు. అనేక కోర్సుల సిలబస్ దశాబ్దాలుగా మారలేదు, సిద్ధాంతానికి ప్రాధాన్యం, అన్వయానికి తక్కువ ప్రాధాన్యత. విద్యా సంస్థలు -పరిశ్రమల మధ్య బలహీన సంబంధం విద్యార్థులను వాస్తవ ప్రపంచం నుండి దూరం చేస్తుంది. ఫలితంగా చదువుకున్న యువతలో నిరుద్యోగం పెరుగుతుండగా, సంస్థలు నైపుణ్యాల కొరతను చెబుతున్నాయి. ఇది వ్యవస్థ వైఫల్యానికి సంకేతం. ఈ క్షీణత ప్రధాన కారణం అధ్యాపక సంక్షోభం. అధిక పని భారం, కాంట్రాక్టు ఉద్యోగాలు, తక్కువ పరిశోధన మద్దతు, పరిపాలన ఒత్తిడి వల్ల ఉపాధ్యాయుల్లో విసుగు పెరిగింది. ఆసక్తి లేని ఉపాధ్యాయులు ఆసక్తిగల విద్యార్థులు సృష్టించలేడు. మార్గదర్శకత తగ్గడంతో హాజరు తగ్గడం, విద్యా ఫలితాలు పడిపోవడం, నమ్మకం కోల్పోవడం జరుగుతుంది. ఇది దేశ ఉత్పాదకతను దెబ్బతీసే ప్రమాదం. ప్రతిభావంతులైన అధ్యాపకులు విదేశాలకు లేదా కార్పొరేట్ రంగాలకు వెళ్లడం సంస్థల సామర్థ్యాన్ని మరింత బలహీనపరుస్తోంది. అసమానత కూడా సమస్యను పెంచుతోంది. ఉన్నత నాణ్యత విద్యకు ప్రాప్యత ప్రాంతాలవారీగా, సామాజిక వర్గాల వారీగా, ఆర్థిక స్థాయిల వారీగా సమానంగా లేదు. ప్రముఖ సంస్థలు పెద్ద నగరాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. గ్రామీణ, చిన్న పట్టణాల విద్యార్థుల వలస వెళ్లాల్సి వస్తోంది లేదా తక్కువ వసతులతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్థిక అడ్డంకులు, మద్దతు వ్యవస్థల లేమి వల్ల అట్టడుగు వర్గాల అవకాశాలు తగ్గుతున్నాయి. సమాన అవకాశాలు ఇవ్వాల్సిన ఉన్నత విద్య అసమానతను పునరుత్పత్తి చేస్తుంది. పరిశోధన రంగం కూడా బలహీనంగా ఉంది. ప్రపంచ పోటీ దేశాలతో పోలిస్తే భారతదేశం ప్రభావవంతమైన పరిశోధన ప్రచురణలు తక్కువగా ఉత్పత్తి చేస్తోంది; పదోన్నతులు తరచుగా సీనియారిటీ ఆధారంగా జరుగుతున్నాయి. సృజనాత్మకతకు తక్కువ ప్రాధాన్యం. తక్కువ నిధులు, అధిక నియంత్రణ, పరిమిత సహకారం సృజనాత్మకతను నిరుత్సాహపరుస్తుంది. బలమైన పరిశోధన సంస్కృతి లేకుండా విశ్వవిద్యాలయాలు సాంకేతిక అభివృద్ధికి లేదా విధాన రూపకల్పనకు పెద్దగా తోడ్పడవు. పాలసీ మార్పులు, గ్రేడ్ చేసిన స్వయం ప్రతిపత్తి, పరిశోధన ఫెలోషిప్‌లు, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ ఫారమ్‌లు వంటి ప్రభుత్వ చర్యలు సమస్యను గుర్తించిన సంకేతాలే. అయితే స్థిరమైన పెట్టుబడి, పారదర్శక పాలన, సంస్థల స్వాతంత్య్రం లేకుండా సంస్కరణలు అసంపూర్తిగానే ఉంటాయి. స్వయం ప్రతిపత్తి అంటే కేవలం పరిపాలనా స్వేచ్ఛ కాదు; ఉన్నత విద్య దేశ కార్మిక శక్తి, ప్రజాస్వామ్య చైతన్యం, శాస్త్రీయ సామర్థ్యాన్ని నిర్మిస్తుంది. విశ్వవిద్యాలయాలు బలహీనపడితే ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. సామాజిక పురోగతి తగ్గుతుంది. మేధో జీవితం పేదరికంలో పడుతుంది. ప్రపంచ నాయకత్వం కోరుకునే దేశం బలహీన విద్యా పునాదులపై నిలవలేను. అందువల్ల భారతదేశానికి స్పష్టమైన మార్పు అవసరం. ప్రభుత్వ పెట్టుబడులు పెంపు, ప్రతిభాపరమైన నియామకాలు, సిలబస్ ఆధునీకరణ, పరిశ్రమ భాగస్వామ్యం, ముఖ్యంగా అకాడెమిక్ స్వేచ్ఛ రక్షణ. విశ్వవిద్యాలయాలను పరిపాలనా విభాగాలుగా లేదా రాజకీయ వేదికలుగా కాకుండా జ్ఞానం, సామాజిక పురోగతికి అంకితమైన ప్రజా నమ్మక సంస్థలుగా చూడాలి. ఉన్నత విద్య సంక్షోభం కేవలం విద్య సమస్య కాదు; అభివృద్ధి సవాలు. దీనిని అత్యవసరంగా, నిష్ఠతో పరిష్కరిస్తే భారత జనాభా ప్రయోజనం జ్ఞాన ప్రయోజనంగా మారింది. నిర్లక్ష్యం చేస్తే డిగ్రీలు ఉన్నా కానీ సామర్థ్యం లేని తరాలు తయారవుతాయి. ఈ ఎంపికే భారత భవిష్యత్తుకు ఉన్నత విద్య ఇంజిన్‌గా మారుతుందా లేక అడ్డంకిగా మిగిలిపోతుందా అనేది నిర్ణయిస్తుంది. - డా. ముచ్చకోట సురేష్ బాబు

మన తెలంగాణ 26 Feb 2026 9:42 am

అక్రమ తరలింపు.. చేసింది ఎవరు..?

అక్రమ తరలింపు.. చేసింది ఎవరు..? పెద్దవంగర, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర

ప్రభ న్యూస్ 26 Feb 2026 9:42 am

Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

తెలుగు పోస్ట్ 26 Feb 2026 9:40 am

India vs Zimbabwe T20 World Cup : నేడు భారత్ - జింబాబ్వే మ్యాచ్

భారత్ - జింబాబ్వే మధ్య మ్యాచ్ నేడు చెన్నై వేదికగా జరగనుంది

తెలుగు పోస్ట్ 26 Feb 2026 9:33 am

కాపీయింగ్ జరుగకుండా..

కాపీయింగ్ జరుగకుండా.. చెన్నూర్, ఆంధ్రప్రభ : ఇంటర్మిడియేట్ ద్వితీయ సంవత్సర విద్యార్థి, విద్యార్థులకు

ప్రభ న్యూస్ 26 Feb 2026 9:30 am

KTR : నేడు ఖమ్మం, సూర్యాపేటలో కేటీఆర్ పర్యటన

నేడు ఖమ్మం, సూర్యాపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 26 Feb 2026 9:29 am