మంగళవారం రాశి ఫలాలు (21-04-2026)
మేషం రావలసిన బకాయిలు సకాలంలో అందవు. ఖర్చు అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఋణ ప్రయత్నాలు కలసిరావు. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ఇతరులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. వృషభం స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఆర్థిక లాభం కలుగుతుంది. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన పనులలో స్వంత ఆలోచనలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. మిధునం బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటకం అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. శత్రుపరమైన సమస్యల నుండి బయటపడతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయంలో సహోద్యోగుల సహాయం లభిస్తుంది. సింహం ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడంలో లోపాలు కలుగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకులు తప్పవు. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. సంతాన విద్యా, ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కన్య విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారంలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్ధిక పరంగా ఇబ్బందులున్నా సౌకర్యాలకు లోటు ఉండదు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి సంభందిత వివాదాలు పరిష్కారమౌతాయి. తుల పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆర్ధిక పరమైన అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల లాభిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చికం ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఖర్చుకు తగిన ఆదాయం అందుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగమున అధికారుల సహాయంతో నూతన పదవులు పొందుతారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ధనస్సు ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. సన్నిహితుల నుండి ధన ఒత్తిడి పెరుగుతుంది. మకరం కొన్ని వ్యవహారములలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంతానానికి నూతన విద్యావకాశములు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. కుంభం చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధు మిత్రులతో స్వల్ప విరోధాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. మీనం పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభ వర్తమానాలు అందుతాయి. వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.
బసవేశ్వరుడి స్ఫూర్తితో పనిచేస్తాం
బసవేశ్వరుడి స్ఫూర్తితో తా ము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ సామాజిక న్యా యం కోసం పని చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తమ పార్టీ మహిళలకు 33 శాతం టికెట్లు, పార్టీ పదవులు ఇస్తుందని ప్రకటించారు. బసవేశ్వరుడి నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పొం దారని వ్యాఖ్యానించారు. బసవేశ్వరుడి 839వ జయంతి సం దర్భంగా సోమవారం తెలంగాణ జాగృతి నాయకులతో క లిసి ట్యాంక్బండ్పై ఆయన విగ్రహానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, 839 ఏళ్ల క్రితం బసవేశ్వరుడి రూపంలో కొత్త విప్లవం పుట్టిందని అన్నారు. ఆ రోజు బసవేశ్వరుడు పాటించిన ప్రజాస్వామిక విలువలు, తీసుకువచ్చిన మార్పులను మనం ఇప్పటికీ స్మరించుకుంటున్నామని చెప్పారు. కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా సమానత్వం ఉండాలని బసవేశ్వరుడు చెప్పారని పేర్కొన్నారు. ఆయన చెప్పిన సమానత్వం, సమాన అవకాశాల కోసం మనం ఈ రోజుకు పాటు పడుతున్నామంటే మ నం వెనుకబడి ఉన్నట్టు లెక్క అని పేర్కొన్నారు. పార్లమెంట్ లో మహిళా బిల్లును పాస్ కాకుండా అనేక శక్తులు కుట్రలు చేసి అడ్డుకున్నాయని మండిపడ్డారు. బిల్లు పాస్ అయితే బాగుండేదని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ మహిళలకు ఎనిమిది సీట్లు ఇస్తే మరో పార్టీ పది సీట్లు ఇచ్చిందని, మొత్తంగా అసెంబ్లీలో ఎనిమిది మంది మహిళా ఎంఎల్ఎలు ఉన్నారని అన్నారు.
భారత్ను వెంటాడుతున్న డోపింగ్ సమస్య
లండన్: భారత్ను డోపింగ్ సమస్య వెంటాడుతోంది. డోపింగ్ సమస్య ప్రమాదకరంగా మారిన దేశాల జాబితాలో భారత్ చేరింది. డోపింగ్లో ఇప్పటి వరకు కేటగిరీబిలో ఉన్న భారత్ తాజా పరిస్థితుల్లో కేటగిరిఎకు మారింది. ఈ విషయాన్ని అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఎఐయు) సోమవారం వెల్లడించింది. కేటగిరిఎలో చేరడంతో ఇక నుంచి భారత అథ్లెట్లు మరింత కఠినమైన డోపింగ్ నిరోధక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కేటగిరిఎలో కెన్యా, నైజీరియా, రష్యా, ఇథియోపియా, బెలారస్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ చేరడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. అథ్లెటిక్స్లో అత్యధిక డోపింగ్ ఉల్లంఘనల విషయంలో భారత్ గత మూడేళ్ల కాలంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిందని ఎఐయు వెల్లడించింది.
అహ్మదాబాద్: ఐపిఎల్లో ముంబై ఇండియన్స్ రెండో విజయం నమోదు చేసింది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్లో ముంబై 99 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. తిలక్ వర్మ హీరోచిత శతకంతో జట్టును ఆదుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన తిలక్ 45 బంతుల్లోనే ఏడు సిక్స్లు, 8 ఫోర్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ (26) ఒక్కడే కాస్త రాణించాడు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ నాలుగు వికెట్లు తీశాడు.
. భారీ టర్బైన్ల వినియోగం. 960 మెగావాట్ల సామర్థ్యంతో 12 ఉత్పత్తి యూనిట్లు. రోజుకు 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. దాదాపు 12 టీఎంసీల నీటి వినియోగం. గోదావరి పుష్కరాలకు పూర్తిచేసే లక్ష్యంతో పనులు ముమ్మరం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్న పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా, రాష్ట్రానికి శాశ్వత విద్యుత్ భద్రతను అందించే […] The post వడివడిగా పోలవరం జలవిద్యుత్ appeared first on Visalaandhra .
స్పష్టం చేసిన ఇరాన్ తెహ్రాన్: పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ వేదికగా నిర్వహించ తలపెట్టిన రెండో విడత శాంతి చర్చలకు తాము హాజరు కావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలకు ప్రతినిధులను పంపడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అమెరికా`ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనున్న వేళ ఇరాన్ ఈ ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటి నుంచి దాన్ని […] The post అమెరికాతో చర్చల్లేవ్ appeared first on Visalaandhra .
ప్రజా సమస్యలపై దశలవారీ పోరాటాలు
. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై చర్చావేదికలు. పేదల ఇళ్ల స్థలాలపై రౌండ్టేబుల్ సమావేశాలు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారం దిశగా దశల వారీ పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నిర్ణయించింది. సోమవారం విజయవాడ దాసరి భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.రామకష్ణ, పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ మహిళా బిల్లు […] The post ప్రజా సమస్యలపై దశలవారీ పోరాటాలు appeared first on Visalaandhra .
. అప్ప్పుడే నిజమైన ప్రజాస్వామ్య ఫలాలు: సీఎం చంద్రబాబు. పుట్టినరోజున అన్నక్యాంటిన్లో స్వయంగా వడ్డించిన సీఎం దంపతులు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఫలాలు దక్కినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నదానం అన్నిటికంటే పవిత్రమైందని, ఇందులో ఎవరికి తోచిన విధంగా వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజు సంద ర్భంగా ముఖ్యమంత్రి విజయవాడలోని పటమట అన్నక్యాంటీన్కు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లారు. క్యాంటీన్కు […] The post ఆర్థిక అసమానతలు తగ్గాలి appeared first on Visalaandhra .
వచ్చే 4, 5 రోజులుతీవ్ర వడగాడ్పులు
ఐఎండీ వెల్లడిన్యూదిల్లీ: దేశంలో ఇప్పటికే ఎండలు మండిపోతుండగా… రానున్న నాలుగైదు రోజుల పాటు దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25 మధ్య వివిధ తేదీల్లో హర్యానా, చండీగఢ్, దిల్లీ, పంజాబ్, తూర్పు రాజస్థాన్, విదర్భ, చత్తీస్గఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గంగానది పరివా హక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని […] The post వచ్చే 4, 5 రోజులుతీవ్ర వడగాడ్పులు appeared first on Visalaandhra .
కొల్లేరు అభయారణ్యం పరిధికుదించండి
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖవిశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)కి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం లేఖ రాసింది. అభయారణ్యం పరిధిని సుమారు 20వేల ఎకరాలు తగ్గించేలా 48వ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్బీడబ్ల్యూఎల్) సమావేశంలో చేసిన సిఫార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. సరిహద్దుల నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు పేర్కొంది. దీని వల్ల శాంతిభద్రతల సమస్యలు […] The post కొల్లేరు అభయారణ్యం పరిధికుదించండి appeared first on Visalaandhra .
బలమైన కథ, పాత్రలతో 'చిరంజీవి'.. గ్లింప్స్ విడుదల
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘చిరంజీవి‘.ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు.‘చిరంజీవి‘ సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ దీప్తి నడిమింటి మాట్లాడుతూ - బలమైన కథ, పాత్రలతో ఈ సినిమాను నిర్మించామని అన్నారు. డైరెక్టర్ శుభ సాయి వెంకట్ మాట్లాడుతూ డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి) అనే పాయింట్ చుట్టూ డ్రామా అల్లుకున్న కథతో ఈ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో కికు యనమల, ఛోటా కె ప్రసాద్, శేఖర్ చంద్ర, రాజీవ్, రామ్ జగన్ పాల్గొన్నారు.
సంస్కృత భాషా ప్రచారానికి ఆర్ఎస్ఎస్ భగవత్ పిలుపు
న్యూఢిల్లీ : దేశంలో సంస్కృత భాషా ప్రచారానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. సంస్కృతం భాషలిన్నిటినీ కలిపే వారధి అని భారతీయ సంస్కృతికి మూలమని ఆయన అభివర్ణించారు. ఇది ఇతర భాషలను దెబ్బతీయదని, దేశం లోని విభిన్న భాషల మధ్య సంబంధాన్ని బలపరుస్తుందని భగవత్ స్పష్టం చేశారు. సంస్కృత్ భారత్ నూతన కేంద్ర కార్యాలయ భవన ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “భారత దేశం కేవలం ఒక భౌగోళిక, లేదా రాజకీయ అస్తిత్వం కాదా. ఇది ఒక సజీవ సంప్రదాయం. ఈ దేశ ఆలోచనా విధానానికి, జీవన సంస్కృతికి సంస్కృతమే మూలం. అందుకే సంస్కృతం కేవలం భాషకాదు” అని వివరించారు. అన్ని భాషలకు సంస్కతం తల్లి వంటిదని, దేశం లోని భాషలన్నిటికీ అనుసంధానమైన వారధి అని, 30 నుంచి 40 శాతం పదాలు సంస్కృతం నుంచి లేదా తద్భావం నుంచి వెలువడ్డాయని పేర్కొన్నారు. సంస్కృత్ భారత్ రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్)కు అనుబంధ సంస్థ.
ఎయిర్టెల్ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు
దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను 4.6 శాతం పెంచింది. ఇప్పటివరకు రూ.859 గా ఉన్న ప్లాన్ ధరను ఇప్పుడు రూ. 899 లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 84 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5జిబి డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అంతేకాకుండా, రూ.799 ప్లాన్ను ఎయిర్టెల్ పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఇదే తరహా ప్లాన్ను రూ.859 లకే అందిస్తున్నాయి.
ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేస్తామని ప్రకటించే దమ్ము ఉందా?: మంత్రి సీతక్క
ఉచిత బస్ ప్రయాణ పథకంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు. ఉచిత బస్ పథకాన్ని పనికిమాలినదిగా అభివర్ణించడం దొరతనానికి నిదర్శనమని మంత్రి సీతక్క సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజంగా ఈ పథకం పనికిరాదని భావిస్తే, దాన్ని రద్దు చేస్తామని చెప్పే ధైర్యం మీకు ఉందా అని కెసిఆర్ను ప్రశ్నించారు. ఈ ఉచిత బస్ పథకం ద్వారా లక్షలాది మహిళలు ప్రతి రోజు ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకుంటూ, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సేవలు సులభంగా పొందుతున్నారని ఆమె వివరించారు. ఇప్పటివరకు సుమారు రూ.10 వేల కోట్ల మేర మహిళలకు ప్రయాణ వ్యయ భారం తగ్గిందని తెలిపారు. ఇది కేవలం పథకం మాత్రమే కాదు, మహిళల ఆర్థిక స్వావలంబనకు, సామాజిక స్వేచ్ఛకు దారితీసే కీలక అడుగు అని మంత్రి స్పష్టం చేశారు. సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న ఈ పథకాన్ని ఓర్వలేక, దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోందని మంత్రి విమర్శించారు. మహిళలు బయటకు రావడం, తమ పనులు స్వయంగా చేసుకోవడం ఇష్టపడని దొరతనపు ఆలోచనల వల్లే ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయని అన్నారు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ...............
చిప్స్ నుంచి షిప్ల వరకూ కొరియా-భారత్ బంధం
న్యూఢిల్లీ: ప్రపంచస్థాయి తీవ్ర ఉద్రిక్తతల నడుమ భారత్, దక్షిణ కొరియాలు శాంతి సందేశాన్ని బలీయంగా విన్పిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 2030 నాటికి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యం 50 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని సంకల్పించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షులు లీజే మ్యూంగ్తో విస్తృత స్థాయి చర్చల తరువాత ప్రధాని మోడీ సోమవారం లీజేతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. చిప్స్ నుంచి షిప్స్ వరకూ, ట్యాలెంట్ నుంచి టెక్నాలజీ వరకూ, ఎంటర్టైన్మెంట్ నుంచి ఎనర్జీ వరకూ ఇరుదేశాల మధ్య సహకారం విస్తరిస్తుందని ఈ సందర్భంగా ఇరువురు నతలు తెలిపారు. చర్చల ఫలితంగా ఇరుదేశాల మధ్య పలు కీలక రంగాల్లో సహకారానికి 15 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో ప్రధానంగా పారిశ్రామిక సహకార వ్యవస్థ సంవిధానం ఖరారు , స్టీల్ సప్లయి వ్యవస్థల పటిష్ట ఒప్పందాలు ఉన్నాయి. ఇంధన, కీలక ఖనిజాలు, నౌకానిర్మాణాలు, సెమికండక్లర్ రంగాలలో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం ఇనుమడించనుంది. ఇండియా సౌత్ కోరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం దిశలో ఉమ్యడి కార్యాచరణకు దిగాలని సంకల్పించారు. ఇరుదేశాల మధ్య సంయుక్త సమగ్ర చర్చల ప్రక్రియ ఇంతకు ముందు అమలులో ఉంది. దీనిని మరింతగా బలోపేతం చేయడానికి ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దక్షిణ కొరియా నేత ఆదివారం భారత్లో మూడురోజుల పర్యటనకు వచ్చారు. దక్షిణ కొరియా నేత భారత్ పర్యటన ఉభయదేశాల విజయయాత్రల మరో దశాబ్దానికి ప్రాతిపదిక అయిందని ప్రధాని తెలిపారు.
జమ్మూ-కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
జమ్మూ-కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 21 మంది మరణించగా, 51 మంది గాయపడ్డారు. అధిక సంఖ్యలో ప్రయాణికులతో నిండిన ఒక ప్రైవేట్ బస్సు సుమారు 100 మీటర్ల ఎత్తు నుంచి కొండ దిగువకు దూసుకెళ్లి, రోడ్డుపై తలకిందులుగా పడింది. పడేటప్పుడు ఒక ఆటో రిక్షాను కూడా ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. రామ్నగర్ ప్రాంతంలోని కాగోర్ట్ గ్రామం సమీపంలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బైై్లైండ్ కర్వ్ వద్ద బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్ వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టింది. బస్సులో 65 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని, వీరిలో మహిళలు, విద్యార్థులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో చాలామంది రామ్నగర్ నుంచి ఉదంపూర్కు ప్రతిరోజూ ప్రయాణించేవారు. ప్రమాదం తీవ్రత కారణంగా బస్సు పూర్తిగా ధ్వంసమైంది. పైభాగం దాదాపు పూర్తిగా చీలిపోవడంతో రక్షణ చర్యలు క్లిష్టంగా మారాయి. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. జమ్మూ-కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.1 లక్ష, స్వల్ప గాయాలు పొందిన వారికి రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించినట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు.రామ్నగర్ నుంచి ఉదంపూర్కు వెళ్తున్న బస్సు కొండ ప్రాంతంలో నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయి, కింద రోడ్డుపై తలకిందులుగా పడేటప్పుడు ఒక ఆటోను ఢీకొట్టింది అని అధికారులు వివరించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి పెరిగింది. ప్రమాద స్థలంలోనే 15 మంది మృతిచెందగా, మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు ఉదంపూర్- రియాసీ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివ్ కుమార్ శర్మ తెలిపారు. అనంతరం తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఉదంపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య 21కి చేరింది.మృతుల్లో రామ్నగర్కు చెందిన టిలో రామ్, ప్రేమ్ నాథ్, కర్తార్ చంద్, సోంరాజ్, రామ్ చంద్, గీతా దేవి, రోమల్ సింగ్, శార్దా దేవి, సన్నీ, విశాలి దేవి, పుష్ప్ రాజ్, రామలో రామ్, గులాబో దేవి, జలం సింగ్, కేసర్ సింగ్, కాంతా దేవి, అనితా దేవి ఉన్నారు.రక్షణ చర్యల్లో స్థానికులు విశేష సహకారం అందించినట్లు శర్మ తెలిపారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రామ్నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో బస్సును తీశారు. ఇది అత్యంత విషాదకర ఘటన. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మేము అండగా ఉంటాం అని ఆయన అన్నారు. పరిస్థితిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నలిన్ ప్రభాత్, జమ్మూ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ భీమ్ సేన్ టుటి ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారని శర్మ తెలిపారు. ఉదంపూర్ నుంచి రామ్నగర్ వైపు వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్కు నాయకత్వం వహించిన ఓ సైనికుడు మాట్లాడుతూ, వాహనం సుమారు 100 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయింది. వెంటనే ఆ ప్రాంతాన్ని చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాం. కష్టపడి అనేక ప్రాణాలను కాపాడగలిగాం అని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన 51 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 43 మంది ఉదంపూర్ జిల్లా ఆసుపత్రిలో, ఆరుగురు రామ్నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రత్యేక వైద్యం కోసం జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించినట్లు ప్రధాన కార్యదర్శి అతల్ దుల్లూ తెలిపారు.ఉదంపూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాన కార్యదర్శి అతల్ దుల్లూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన ప్రమాదం. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నాం అని ఆయన ఉదంపూర్ జిల్లా ఆసుపత్రిలో విలేకరులకు తెలిపారు. రక్షణ చర్యలు సమన్వయంతో, సమర్థవంతంగా జరిగాయని ప్రశంసించిన ఆయన, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం మన లక్ష్యం కావాలి అని అన్నారు. ట్రాఫిక్ నిబంధనల అమలు కఠినంగా ఉండాలని, వాహనాల్లో అధిక లోడ్ లేకుండా చూడాలని, వాహనాల పరిస్థితి సరిగా ఉండాలని, డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే లైసెన్సులు ఉండటంతో పాటు వారి ఫిట్నెస్ను కూడా నిర్ధారించాలని సూచించారు. జమ్మూ-కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఉదంపూర్లో జరిగిన ప్రమాదం హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా సంతాపం. వారికి దేవుడు ధైర్యం ఇవ్వాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ఎక్స్లో పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయాన్ని అందించాలంటూ జిల్లా పరిపాలన, పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ఆరోగ్య శాఖలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలతో అండగా ఉంటుంది. అవసరమైన సహాయం అందిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్మూ-కాశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా, జమ్మూ-కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు సత్ శర్మ కూడా ఈ ఘటనపై తమ సంతాపం తెలిపారు.
బిజెపికి ఎఐఎడిఎంకె దాసోహం: రాహుల్ ధ్వజం
కన్యాకుమారి (తమిళనాడు): అవినీతి కారణంగా బీజేపీకి ఎఐఎడిఎంకె నాయకత్వం దాసోహమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కన్యాకుమారి ప్రాంతంలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. తమిళభాషను, సంస్కృతిని, చరిత్రను డిఎంకె, కాంగ్రెస్, మిత్రపక్షాలు సంరక్షిస్తున్నాయని , తమిళులు వాటిని సవాలు చేస్తున్నారని వారికి (ఆర్ఎస్ఎస్) తెలుసునని పేర్కొన్నారు. ఫెడరల్ సిద్ధాంతాలను సమర్ధిస్తూ ప్రతిరాష్ట్రానికి తన స్వంత స్వరం, ప్రాతినిధ్యం ఉంటుందని, కానీ బీజేపీ ఈ విధంగా ఆలోచించడం లేదని, ఒకే సంప్రదాయం, ఒకేభాష, ఒకే చరిత్ర ఉండాలని బీజేపీ నమ్ముతోందని విమర్శించారు. తమిళనాడు తన ప్రజలచే పాలింపబడాలని, కానీ రాష్ట్రాలను బలహీనం చేసేందుకు బీజేపి ప్రయత్నిస్తోందని తీవ్రంగా విమర్శించారు. మణిపూర్ ఘర్షణలను ప్రస్తావిస్తూ “ శాంతియుత రాష్ట్రమైన మణిపూర్కు వాళ్లేం చేసారో చూడండి. దానికి వారు పెట్టిన చిచ్చువల్ల వందలాది మంది చనిపోయారు. సివిల్వార్ కొనసాగుతోంది ” అని ఆరోపించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్,డీ లిమిటేషన్ బిల్లులపై చర్చను గుర్తుకు తెస్తూ బీజేపీ అసలు ఉద్దేశం ఎన్నికల వ్యవస్థను మార్చడమేనని, వారు ఏం చేసినా జాతికి వ్యతిరేకమే అని అందుకని మిల్లును తాము ఓడించామని ఆరోపించారు. దేశంలో ఎవరి ప్రాతినిధ్యం తొలగించే ఏ బిల్లునైనా తాము వ్యతిరేకిస్తామని రాహుల్ స్పష్టం చేశారు.
Revanth Reddy released the second instalment of Rythu Bharosa funds, marking a major push for farmer welfare in Telangana. The funds were distributed during a public meeting in Bhupalpally district, where ₹5,563 crore was credited to benefit over 45 lakh farmers across the state. Addressing the gathering, Revanth Reddy highlighted the government’s commitment to agriculture […] The post Revanth Reddy Releases ₹5,563 Crore Under Rythu Bharosa, Launches Sharp Attack on Jeevan Reddy and KCR appeared first on Telugu360 .
సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఆ దాడిలో దివ్య బెహరా (3) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. అమ్మాయి తల్లిదండ్రులు పాప కనపడటం లేదంటూ చుట్టుపక్కల వెతుకుతుండగా బాలిక పొలాల సమీపంలో విగతజీవిగా కనిపించింది. బాలికను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వాళ్ల రోధనలు చూపరులను కంటతడి పెట్టించాయి. దివ్య బెహరా తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం ఒరిస్సా నుంచి వలసవచ్చారు. తండ్రి బూబుల్ బెహరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
హర్మూజ్ను దాటిన 10 భారతీయ నౌకలు
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధి గుండా సుమారు 10 భారతీయ నౌకలు సురక్షితంగా ప్రయాణించి భారత్ చేరుకున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ నేపథ్యంలో దౌత్య ప్రయత్నాల ద్వారా భారత జెండా కలిగిన ట్యాంకర్లకు , ముఖ్యంగా పుష్పక్,పరిమళ్ వంటి నౌకలకు ఇరాన్ మినహాయింపు ఇచ్చింది. ఈ నౌకల సురక్షిత ప్రయాణం వల్ల భారత్కు ఇంధన కొరత ఆందోళనలు తగ్గాయి. దేశ్గరిమ, శివాలిక్, నందాదేవి వంటి ఇతర ప్రధాన నౌకలు కూడా హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్తో జరిపిన చర్చలు ఈ సురక్షిత ప్రయాణానికి మార్గం సుగమం చేశాయి. గత శనివారం భారత నౌకలు రెండిటిపై ఇరాన్ కాల్పులు జరిపిన సంఘటనపై ఇరాన్ రాయబారిని పిలిపించి చర్చించామని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాకు వెల్లడించారు. ఈ నౌకలపై కాల్పులు జరిపింది తమ దళాలేనా అన్న అంశంపై దర్యాప్తు చేపటినట్టు ఇరాన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత పతాక నౌకలకు భారత నౌకాదళం అడ్వైజరీ జారీ చేసిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. లారక్ ఐలాండ్కు దూరంగా ఉండాలని, తమ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే హర్మూజ్లో ప్రయాణించాలని నేవీ పేర్కొంది. ఆ జలసంధిని దాటేందుకు వేచి ఉన్న నౌకల భద్రతను నిర్ధారించేందుకే ఈ సూచనలని తెలిపింది. లారక్ ద్వీపం హర్మూజ్కు సమీపంలో ఉంది.
జపాన్లో తీవ్ర భూకంపం.. సునామీ హెచ్చరికలు
7.7 పాయింట్లతో ప్రకంపనలు రికార్డు అణు కేంద్రాల్లో అత్యయిక స్థితిపై సమీక్ష టోక్యో ః జపాన్ ఉత్తర, ఈశాన్య తీర ప్రాంతంలో సోమవారం భారీ భూంకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత అత్యంత తీవ్రస్థాయి 7.7 సూచికగా నమోదైంది. పసిఫిక్ మహాసముద్రంలో పది కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తిచారని జపాన్ వాతావరణ పరిశోధనా కేంద్రం తెలిపింది. పరిస్థితి తీవ్రత దశలో వెంటనే సునామీ హెచ్చరికలు వెలువరించారు. ఇవాటే, అవమోరి వంటి ప్రాంతాలు, హోకాయిడోలోనూ మూడు నుంచి నాలుగు మీటర్ల మేర ఎతైన సముద్ర అలలు చెలరేగుతాయి. దీని ప్రభావం వల్ల తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తతో ఉండాలని హెచ్చరికలు వెలువరించారు. జపాన్ కాలమానం ప్రకారం సాయంత్రం 4.45 గంటలకు భూకంపం రికార్డు అయింది. భూకంప తాకిడి ఉన్న తీర ప్రాంతాల వెంబడి ఉన్న నౌకలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. పలు ప్రాంతాలలో సునామీ సంబంధిత తొలిగింపుల ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనితో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురి అయ్యారు. పల్లపు ప్రాంతాలకు భారీ వరదలు వచ్చే ముప్పు తలెత్తింది. భవనాలు కూడా సురక్షితం కాని పరిస్థితి ఏర్పడింది. వేగంగా వరదలు ఉంటాయని, మార్గమధ్యంలో ఉండే వారికి ప్రాణాపాయం తప్పదని అధికారులు హెచ్చరించారు. సునామీతో ఇవాటో వద్ద ఓ చోట దాదాపు 80 సెంటిమీటర్ల మేర అలలు సంభవించాయి. పలు ప్రాంతాలలో వీటి తీవ్రత దాదాపుగా 40 సెంటిమీటర్ల వరకూ ఉంది. జపాన్ అధికారిక వార్తా సంస్థలు వెలువరించిన వీడియోతో పలు రేవుల్లో ఇప్పటికే నౌకల తరలింపును అతి కష్టం మీద చేపట్టాల్సి వచ్చిందని వెల్లడైంది. పరిస్థితి తీవ్రతను సమీక్షించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు వెంటనే అత్యవసర కార్యాచరణ దళాలను ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రదాని సానే టకాయిచి ప్రకటించారు. నష్ట తీవ్రతను పరిశీలిస్తున్నట్లు, ముందుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై దృస్టి సారించినట్లు వెల్లడించారు. టోక్యో, అమోరీలలో వెంటనే బుల్లెట్ ట్రైన్ల రాకపోకలను నిలిపివేశారు. జపాన్ భూకంప తీవ్రత సూచికలో ఇప్పటి భూకంప స్థాయి అప్పర్ 5గా రికార్డు అయింది. భూకంప తాకిడి, సునామీ ప్రాంతాలలో ఎటువంటి అణు కేంద్రాలు పనిచేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే జపాన్ అత్యధిక స్థాయి భూకంపాల తాకిడి దేశంగా ఉంది.
తిలక్ వర్మ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
అహ్మదాబాద్: ఐపిఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్ జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. మొదట నెమ్మదిగా ఆడిన వర్మ.. చివర్లలో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తిలక్ 45 బంతుల్లో 7 సిక్సులు, 8 ఫోర్లు సాయంతో అజేయంగా 101 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబయికి మరోసారి మంచి ఆరంభం లభించలేదు. టాపార్డర్ బ్యాటర్లు విఫలమవ్వడంతో ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమవుతుందని అందరూ అనుకున్నారు. ఈక్రమంలో గేర్లు మార్చిన తిలక్.. బౌండరీలతో చెలరేగిపోయాడు.చివర్లో ధనాధన్ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. తిలక్ తోపాటు నమన్ ధీర్ కూడా 45 పరుగులతో రాణించాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
TG Vishwa Prasad, an NRI who returned back from USA floated People Media Factory and is producing a number of films. He introduced several talented actors, directors and technicians to Telugu cinema. Mirai was one of the biggest hits for the production house last year. The VFX work done by the home team of PMF […] The post PMF has Big Plans for 2027 appeared first on Telugu360 .
తెలంగాణ పదం పలకడానికే భయపడే రోజులు.. కరెంట్ అడిగితే కాల్చి చంపారు
పొద్దున లేస్తే కెసిఆర్ చావాలని మాట్లాడుతున్నారని.. వాళ్లు వెయ్యి జన్మలు ఎత్తినా తాను చావని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ దళపతి కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడే వరకు సేవ చేస్తానని చెప్పారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ అనే పదం పలకడానికే భయపడే రోజులు.. తెలంగాణ పదాన్నే నిషేధించే పరిస్థితులు ఉండేవి. మన నీళ్లు, వనరులను దోపిడీ చేశారు. పాలమూరు వంటి జిల్లాలో 90 శాతం వలసలే. కొన్ని పార్టీల తీరుతో ఆవేశం, బాధ కలిగేవి. మూలిగే నక్కపై తాటిపండులా చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచారు. కరెంట్ ఛార్జీలు తగ్గించాలని నిరసన తెలిపితే బషీర్బాగ్లో కాల్చి చంపారు. బషీర్బాగ్ ఘటనతోనే తెలంగాణ జెండా పట్టుకుని ఉద్యమానికి వచ్చా. కెసిఆర్ రాక ముందు రాష్ట్రంలో కరెంట్ సరిగా ఉండేదా?. మేం వచ్చాక 24 గంటల కరెంట్ ఇచ్చాం. మరి ఇప్పుడు ఏమైంది?. ఈ దుర్మార్గులు గెలిస్తే రైతు బంధుకు రాంరాం. దళితబంధుకు జైభీమ్ అంటారని చెప్పా. నేను చెప్పినట్టే జరిగిందా? లేదా?. ఒకేసారి వెయ్యాల్సిన రైతు బంధును ఎకరానికి ఒకసారి వేస్తున్నారు అని మండిపడ్డారు.
భానుడి భగ భగలతో నగరం నిప్పుల కొలమిలా మారుతోంది. దీంతో నగర వాసులు ఉదయం 11 గంటలకు ముందే తమ పనులు చక్క పెట్టు కుంటున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నాం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహనాల దారులు బయటకు రాక పోవడంతో పూర్తిగా మధ్యాహ్న సమయంలో కర్ఫూ వాతావరణం తలపిస్తొంది.. ఎల్నినో ప్రభావం కారణంగా ఇటువంటి ఇటువంటి పరిస్థితులు ఏర్పాడ్డాయని వాతావరణశాఖ అధికారులు ఇప్పటికె తెలిపారు. ఇవే పరిస్థితులో మే, జాన్ నెలల్లో కూడా కొనసాగుతాయన్నారు. వీటి నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులతో పాటు, వైద్యు కూడా సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇళ్ళల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఏవైనా పనులు ఉంటే వాటిని వాయిదా వేసుకోవాలని, అత్యవసరం అనుకుంటే మాత్రమే తగు జాగ్రత్తలో బయటకు వెళ్ళాలని సూచిస్తున్నారు.అంతే కాకుండా దీని ప్రభావంతో మే నెలాఖరులో వర్షాలు తీసుకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తద్వారా వర్షాలు కురవడంలో కూడా వర్షాలు పడటం కూడా జాప్యం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
హరీష్ రావు గురించి కవిత మొదటి నుంచి చెబుతూనే ఉంది: మంత్రి అడ్లూరి
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు జగిత్యాలకు రాకుండా ఢిల్లీ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. దీనిని బట్టి బిఆర్ఎస్ ముసలం మొదలైందని, వర్గ పోరు జరుగుతోందని స్పష్టమవుతున్నదన్నారు. హరీష్ రావు గురించి కవిత మొదటి నుంచి చెబుతూనే ఉన్నారని ఆయన తెలిపారు. హరీష్ రావు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావు ఢిల్లీలో ఏ పార్టీని సంప్రదిస్తున్నారన్న విషయాలు బయటకు రావాలన్నారు. బిఆర్ఎస్ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ డబ్బుతో జగిత్యాలతో జనసమీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.జీవన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని తిట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కుట్ర, అక్కసు, కుతంత్రం ఎందుకని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.
KCR : వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. మొదటి సంతకం హైడ్రాను రద్దు చేయడమే
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని కేసీఆర్ అన్నారు
బిఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఒక్కరోజే విఐపిః ఎంపి చామల
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికి బిఆర్ఎస్లో చేరిన ఒక్క రోజే విఐపిగా ఉంటారన్నారు. బిఆర్ఎస్లో ముసలం మొదలైందన్నారు. జీవన్ రెడ్డిని చేర్చుకోవడం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదన్నారు. జీవన్ రెడ్డిని హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించలేదన్నారు. కెటిఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు హరీష్ రావు వెళ్ళలేదని ఆయన తెలిపారు. రెండవ సారి జగిత్యాలకు వెళ్లినప్పుడు కెటిఆర్ హరీష్ రావును బ్రతిమిలాడి జీవన్రెడ్డి ఇంటికి తీసుకెళ్ళారని ఆయన చెప్పారు. కెసిఆర్ నివాసానికి జీవన్ రెడ్డి వచ్చినప్పుడు హరీష్ రావు వెళ్ళలేదన్నారు. కెసిఆర్ సంవత్సరం తర్వాత బయటకు వస్తుంటే హరీష్ రావు ఢిల్లీకి ఎందుకెళ్ళారని ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్ భవిష్యత్ అంధకారంలో ఉందన్నారు. హరీష్ రావు ఢిల్లీలో ఎవరెవరిని కలిసారన్నది త్వరలో బయటకు వస్తుందన్నారు. హరీష్ రావు భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనేది ప్రజలకు తెలుసునని అన్నారు. జీవన్ రెడ్డి బిఆర్ఎస్లో చేరడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని ఆయన తెలిపారు. జీవన్ రెడ్డిని చేర్చుకుని కాంగ్రెస్ బలహీన పడిందని చెప్పే ప్రయత్నం బిఆర్ఎస్ చేస్తోందని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్లో ముసలం మొదలైందని, అది మునిగిపోయే పడవ అని ఎంపీ చామల అన్నారు.
ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (టిఎఫ్డిఎ) ఆధ్వర్యంలో ముప్పై కోట్ల బడ్జెట్తో పది సినిమాల్ని నిర్మించనున్నారు.ఈ మేరకు టీఎఫ్డీఏ సోమవారం నాడు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చదలవాడ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య, కార్యదర్శి సాయి రాజేష్, ఉపాధ్యక్షులు సముద్ర, ప్రముఖ దర్శకులు నవీన్ మేడారం, అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ తదితరలు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ “చదలవాడ శ్రీనివాసరావు వారి బ్యానర్ మీద ముప్పై కోట్లతో పది సినిమాల్ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా పది మంది దర్శకుల కంటే.. వంద, నూట యాభై మంది అసిస్టెంట్ దర్శకులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ సినిమాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో సీనియర్ దర్శకులు అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ వంటి వారు కీలకంగా వ్యవహరిస్తారు” అని అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ “ఇప్పుడు సినిమా పరిశ్రమలో అన్నీ పెరిగాయి.. థియేటర్లు మాత్రం తగ్గుతున్నాయి. సత్తా ఉన్న నిర్మాతలు, దర్శకులకి కూడా తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను దర్శకులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మంచి విలువలు, మంచి కథలు, కమర్షియల్ అంశాలుండే గొప్ప సినిమాల్ని తీయాలని కోరుకుంటున్నాను. క్వాలిటీ సినిమాలు తీయాలి.. క్రమశిక్షణతో కచ్చితంగా ఉదయం ఏడు గంటలకు షాట్ తీయాలి. మంచి సినిమాలు తీసి.. వాటి ద్వారా హీరోలు, ఆర్టిస్టులు, దర్శకులు ఇండస్ట్రీలో నిలబడితే నాకు అదే చాలు’ అని తెలిపారు.
ఇస్లామాబాద్లో చర్చలు ముందుకు సాగలేదనే విషయం తెలియగానే అంతర్జాతీయ చమురు మార్కెట్ తిరిగి కుదుపులకు గురైంది. కొద్దిరోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన ధరలు ఇప్పుడు తిరిగి పెరిగాయి. సోమవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర అంతర్జాతీయ స్థాయిలో బ్యారెల్కు 95 డాలర్లకు ఎగబాకింది, యుద్ధం ఆరంభం నుంచి చూస్తే ఇది 30 శాతం పెరుగుదల అయింది, హర్మూజ్ మీదుగా నౌకా రవాణాను మరింత కట్టుదిట్టంగా అడ్డుకుంటామని ఇరాన్ సోమవారం తెలిపింది. దీనితో ఇప్పటికే ఇక్కడ రవాణాకు నిలిచిపోయి ఉన్న వందలాది చమురు నౌకలు మరింత ఆటుపోట్లకు గురయ్యాయి. హర్మూజ్పై ట్రంప్ ప్రకటనలతో ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ అనుమతి ఉన్న భారత్ వంటి కొన్ని దేశాలు కూడా ఈ మార్గం ద్వారా వెంటనే నౌకల రవాణా సురక్షితమేనా అనే సంశయంలో పడ్డాయి.
45 years |జీవన్ రెడ్డి పార్టీలో చేరడంపై కేసీఆర్
45 years | జీవన్ రెడ్డి పార్టీలో చేరడంపై కేసీఆర్ 45 years
చందానగర్లో వైభవ్ జ్యూయలర్స్ను ప్రారంభించిన సినీ నటి మానస వారణాసి
ప్రముఖ సినీ నటి మానస వారణాసి సోమవారం చందానగర్లోని ఇక్రిసాట్ కాలనీలో వైభవ్ జ్యూయలర్స్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైభవ్ జ్యూవెలర్స్ అద్భుత ప్రయాణంలో తాను భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.32 సంవత్సరాల నమ్మకం, 30 మిలియన్ల సంతోషకరమైన కస్టమర్లు, 20 స్టోర్లతో అద్భుతమైన డిజైన్ల ఆభరణాలతో చందానగర్ 21వ స్టోర్ను చందానగర్లో అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు.అనంతరం సంస్థ వైస్ ప్రసిడెంట్ జె.రఘునాథ్ మాట్లాడుతూ వినియోగదారులకు అద్భుత శ్రేణి షాపింగ్ అనుభవంతో పాటు ప్రారంభోత్సవఆఫర్గా విస్తృత శ్రేనిలో 916 హాల్ మార్క్డ్ బంగారు ఆభర ణాలపై ప్రతి గ్రాముకు రూ.777 వరకు తగ్గింపు ఇస్తున్నామని,డైమండ్ మేకింగ్ చార్జీలపై 100శాతం తగ్గింపు,సాధారణ వెండివస్తువులు, పట్టీలపై తయారీ చార్జీలు లేకుండా చందానగర్ షోరూమ్లో అందిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సేవలను వినియోగదారులు వినియోగించు కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షురాలు ప్రీతి రెడిఓ్డ,ఐపిఎస్ అధికారి అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Biggest Theatrical Deal for Shah Rukh Khan’s King
After a decent break, Shah Rukh Khan has delivered two back-to-back blockbusters: Jawan and Pathaan. The actor is not in a hurry and he started King directed by Siddharth Anand. King is one of the craziest films made in Bollywood cinema. The film is rumored to be made on a budget of Rs 400 crores […] The post Biggest Theatrical Deal for Shah Rukh Khan’s King appeared first on Telugu360 .
అనసూయపై అసభ్య కామెంట్లు... యువకుడి అరెస్టు
సినీనటి, యాంకర్ అనసూయపై ఇన్స్టాగ్రాంలో అసభ్య కామెంట్లు పెట్టిన యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. తనపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెట్టడంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేసిన పోలీసులు నల్గొండ జిల్లాకు చెందిన చంటిగా గుర్తించారు, అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు, నెటిజన్లకు పలు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో ఎవరిపై అయినా అసభ్యకరమైన కంటెంట్, దూషణలు లేదా వ్యక్తిగత దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలను వేధించే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. రూ 3650 నగదు స్వాధీనం.. నలుగురి అరెస్ట్
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పునర్ అభివృద్ధి నిర్మాణ పనులకు, రూ.3.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కాళేశ్వరం బస్టాండ్ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్,పార్లమెంట్ సభ్యులు వేం రెడ్డి నరేందర్ రెడ్డి, వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కాలేశ్వర ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకొని మహా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శుభానందదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులకు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో ఘనంగా సన్మానించారు. కాళేశ్వరం విచ్చేసిన ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.
Rs1.50 lakh cr |సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Rs1.50 lakh cr | సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు Rs1.50 lakh
Interesting: Dhanush to direct Mrunal Thakur?
The entire nation is speculating about the relationship between Dhanush and Mrunal Thakur. The speculations never died despite the duo condemning the rumors. The latest buzz making rounds across the Tamil media circles is that Dhanush will soon direct his next film and it is a women-centric attempt featuring Mrunal Thakur playing the lead role. […] The post Interesting: Dhanush to direct Mrunal Thakur? appeared first on Telugu360 .
మూడున్నర గంటలు ప్రయాణికుల ప్రాణాలు గాలిలో
హైదరాబాద్ నుంచి హుబ్లీకి ఆదివారం బయలుదేరిన ఫ్లై 91 విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఈ అత్యవసర చర్యకు దిగాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్పోర్టు అధికారులు సోమవారం ఉదయం ప్రకటించారు. ప్రయాణికులు అంతా భద్రంగా ఉన్నట్లు తెలిపారు. అయితే విమానం దాదాపు మూడున్నర గంటల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. దీనితో విమానంలోని ప్రయాణికులు భయాందోళనలకు గురి కావల్సి వచ్చింది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో ఇటువంటివి మామూలే అని అధికారులు తేలిగ్గా కొట్టిపారేశారు. పైగా సాంకేతిక లోపాలు కూడా తలెత్తాయని, ఎటువంటి ముప్పు తలెత్తలేదని వివరణ ఇచ్చుకున్నారు. ప్రయాణికులలో కొందరు బిగ్గరగా ఏడుస్తూ, తాము ప్రాణాలతో బయటపడేలా చూడాలని భగవంతుడిని వేడుకుంటూ గడిపారు.విమానం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరింది. 90 నిమిషాల ప్రయాణం తరువాత 4.30కు హుబ్లీ చేరాలి. అయితే బెంగళూరుకు దారి మళ్లించాల్సి వచ్చింది. ఇటువంటివి భద్రతా చర్యలలో తీసుకునే ప్రామాణిక విషయాలు అని కూడా అధికారులు తెలిపారు. 22 మందితో కూడిన ఈ విమానం సాయంత్రం ఆరుగంటల తరువాత బెంగళూరు నుంచి హుబ్లీకి రాత్రి 11 గంటల ప్రాంతంలో చేరింది. అంతా సుఖాంతం అయిందని ఎయిర్లైన్స్ నిర్వాహకులు తెలిపారు. అయితే తమకు హైదరాబాద్ నుంచి హుబ్లీ చేరేలోపు చుక్కలు కన్పించాయని , ప్రాణాలు బిగపట్టుకుని ప్రయాణించాల్సి వచ్చిందని హుబ్లీకి చేరిన తరువాత ప్రయాణికులు స్పందించారు. ఇక ఆదివారమే ముంబై నుంచి కొల్హాపూర్కు బయలుదేరిన విమానాన్ని గోవాకు దారి మళ్లించాల్సి వచ్చింది. విమానంలో ఎటువంటి సాంకేతిక సమస్య తలెత్తలేదు. ప్రతికూల పరిస్థితులతోనే విమానం దారి మళ్లించాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు.
కారు ఢీకొని జంక మృతి… సంఘటన స్థలంలో పోస్టుమార్టమ్ నిర్వహించి ఖననం పెనుగంచిప్రోలు,
ఇసుక, రబ్బిష్ కు అడ్డగా మారిన సి.వి.ఆర్ ఫ్లైఓవర్..
ఇసుక, రబ్బిష్ కు అడ్డగా మారిన సి.వి.ఆర్ ఫ్లైఓవర్.. ఇసుక, రబ్బిష్ లోడ్ల
ఈ నెల 23 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 23 వరకు పొడిగించారు.ఈ మేరకు ఇంటర్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ నెల 23వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి రోజుకు రెండు సెషన్లలో జరుగనున్నాయి. మే 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. రెగ్యులర్ విద్యార్థులతో తదుపరి చదువులకు వెళ్లేందుకు వీలుగా సప్లిమెంటరీ పరీక్షలు సైతం త్వరగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 23న రాష్ట్ర కేబినెట్ సమావేశం
రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈనెల 23వ తేదీన జరుగనుంది. సచివాలయంలో మధ్యాహ్నాం 3 గంటలకు సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో భాగంగా పలు అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు (99 రోజులు), రోహిత్ వేముల చట్టం, ఇద్దరు ఎమ్మెల్సీ (కోదండరాం, అజహరుద్దీన్) పేర్లను మరోసారి గవర్నర్కు పంపడం, తుమ్మిడిహెట్టి డిపిఆర్పై చర్చతో పాటు భూముల మార్కెట్ వాల్యూ పెంపు, మద్యం ధరల పెంపు గురించి మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
Shock |కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్…
Shock | కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్… Shock | ఆంధ్రప్రభ, వెబ్
బిసి గురుకుల జూనియర్ ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
బిసి గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 22 నుండి మే నెల 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంజెపి బిసి గురుకులాల సంస్థ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. విద్యార్థులు https://mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org/MJP-Inter వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఎంపిసి, బైపిసి, ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి రెగ్యులర్ గ్రూపులతో పాటు అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపిహెచ్డబ్లు), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ అనే 7 వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 146 బాలుర కాలేజీల్లో 12,640 సీట్లు, 144 బాలికల కాలేజీల్లో 12,080 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. బిసి గురుకులాల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయనవసరం లేదని, తమ స్కూల్ ప్రిన్సిపాల్కు దరఖాస్తు ఇస్తే సరిపోతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 040 -23328266 నెంబర్కు సంప్రదించాలని సూచించారు.
H-1B Visa Fraud in US: Two Telugu-Origin Men Plead Guilty in Fake Job Scam
A visa fraud case in the United States has brought two Telugu-origin individuals under the spotlight. Sampath Rajidi and Sridhar Mada pleaded guilty in connection with the H- 1B visa scam, which involved creating and submitting fabricated employment records to secure work visas for foreign applicants. The case was investigated by federal authorities in California. […] The post H-1B Visa Fraud in US: Two Telugu-Origin Men Plead Guilty in Fake Job Scam appeared first on Telugu360 .
Police | జంట హత్యల కలకలం Police | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
మూడు సార్లు మరమ్మ తులు స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించిన కెసిఆర్
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి.. బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు జీవన్రెడ్డి. ఈ సందర్భంగా గులాబి బాస్ కెసిఆర్.. జీవన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన అనుచరులతో పాటు జీవన్రెడ్డి బిఆర్ఎస్లో చేరారు. ఇటీవల జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఓటిటిలోకి ధురంధర్ 2.. రిలీజ్ ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన 'ధురంధర్: ది రివెంజ్' మూవీ విడుదలైన నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మార్చి19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా రెండు భాగాలు.. ప్రపంచవ్యాప్తంగా రూ.3000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. వెండితెరపై సంచలన విజయం సాధించిన ఈ మూవీని.. ఓటిటిలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, మొదటి భాగాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన మేకర్స్.. రెండో భాగాన్ని జియో హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.150 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మే 2026 చివరిలో లేదా జూన్ 2026 ప్రారంభంలో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
టూరిజం డెస్టినేషన్ గా ఏపీ.. సీఎం చంద్రబాబు దర్శినికతతో పూర్వవైభవం..ఏపీ టూరిజం కార్పొరేషన్
మంచి మనసుకు ప్రతిరూపం నారా భువనేశ్వరి
మంచి మనసుకు ప్రతిరూపం నారా భువనేశ్వరి రాప్తాడు, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పేదలు
Revanth Reddy : కాళేశ్వరంలో దోషులను శిక్షిస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు
హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్ మీదే..!
హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్ మీదే..! రాప్తాడు, ఆంధ్రప్రభ : హంద్రీనీవాను నాశనం
IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
అహ్మదాబాద్: ఐపిఎల్ 2026లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుని.. ముందుగా ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై.. కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. క్వింటన్ డికాక్ ఫామ్లో ఉండడం జట్టుకు ఊరటనిచ్చే అంశంగా మారింది. పంజాబ్తో జరిగిన కిందటి మ్యాచ్లో డికాక్ అజేయ శతకంతో కదంతొక్కిన సంగతి తెలిసిందే. అయితే కీలక ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, తిలక్ వర్మ తదితరుల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య తన పాత్రను సమర్థంగా నిర్వర్తించలేక పోతున్నాడు. మరోవైపు, గుజరాత్ ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో గెలిచి జోరు మీదుంది.
హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరు ఖాన్ బజార్ లో జంట హత్యలు కలకలం రేపింది..అదిల్ ఖాన్ అనే వ్యక్తి అతని సోదరుడు అఖ్వీల్ ఖాన్ ,అజ్మీరి బేగం అనే ఇద్దరిని ఇంట్లో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.సంఘటన స్థలానికి చేరుకున్న మీర్ చౌక్ పోలీసులు.క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు పై ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Cyber Crime |నల్గొండ యువకుడి అరెస్ట్
Cyber Crime | నల్గొండ యువకుడి అరెస్ట్ Cyber Crime | ఆంధ్రప్రభ,
వాహనం నుండి బయటకు దూకి ఖైదీ పరారీ
చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురిని మరో కేసులో పీటీ వారెంట్పై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు విచారణ కోసం తీసుకెళ్లి తిరిగి జైలుకు తీసుకెళ్తుండగా ఒక చోట ట్రాఫిక్ లో వాహనం ఆగిన సమయం చూసి రెప్పపాటులో వాహనం దిగి ఒక ఖైదీ పరారైనాడు. ఖైదీలను పోలీస్ వాహనంలో కాకుండా ప్రైవేట్ వాహనంలో తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది. చంచలగూడ జైలు సమీపంలోనే వాహనం నుంచి దూకి పరారైనట్లు సమాచారం. పరారైన నిందితుడు నరేష్గా గుర్తింపు. మిగతా ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ నెల 12న ముగ్గురు దొంగలను పోలీసులు రిమాండ్కు పంపారు.పరారైన నరేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా.. లేక ఎవరైనా పరారైన ఖైదీకి సహకరించారా..? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
5 ఏళ్ల వయస్సు తప్పిపోయి 25 ఏళ్ల వయసులో తల్లిని కలిసిన యువకుడు
అనుకోకుండా కుటుంబానికి దూరమై 25 ఏళ్ల తర్వాత తన తల్లిని కలిశాడు ఓ యువకుడు. ఆ యువకుడు పేరు సరూ అసలు పేరు షేరు మున్షీ ఖాన్. వివరాలలోకి వెళితే.. 1986లో సరూ కి కేవలం 5 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తన అన్నయ్యతో కలిసి రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. అలసట వల్ల ఒక ఖాళీ రైలులో నిద్రపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ రైలు ఎక్కడికో వెళ్ళిపోతోంది. అలా అతను తన ఊరు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా నుండి దాదాపు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్కతా చేరుకున్నాడు. కోల్కతా వీధుల్లో సరూ ఎన్నో కష్టాలు పడ్డాడు. తన ఊరు పేరు సరిగ్గా చెప్పలేకపోయాడు . చివరికి ఒక అనాథాశ్రమానికి చేరాడు. అక్కడ నుండి ఆస్ట్రేలియాకు చెందిన బ్రియర్లీ దంపతులు అతడిని దత్తత తీసుకున్నారు. షేరు మున్షీ ఖాన్ అలా సరూ బ్రియర్లీగా మారి టాస్మేనియాలో పెరిగాడు. సరూ ఆస్ట్రేలియాలో సుఖంగా ఉన్నప్పటికీ తన కన్నతల్లి జ్ఞాపకాలు అతడిని వెంటాడేవి. తన చిన్ననాటి అస్పష్టమైన గుర్తుల ఆధారంగా (స్టేషన్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్, వంతెన వంటివి) గూగుల్ ఎర్త్ ద్వారా భారతదేశంలోని రైల్వే లైన్లను గంటల తరబడి పరిశీలించేవాడు.2012లో తను చిన్నప్పుడు తప్పిపోయిన స్టేషన్ను గూగుల్ ఎర్త్లో గుర్తించాడు. వెంటనే భారతదేశానికి వచ్చి తన పాత ఊరు వెతికాడు. చివరికి తన తల్లిని కలుసుకున్నాడు. అప్పటి వరకు తన కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆ తల్లి ఎదురుచూస్తూనే ఉంది. ఈ కథ ఆధారంగా 2016లో 'Lion' అనే హాలీవుడ్ సినిమా వచ్చింది. ఇందులో సరూ పాత్రను దేవ పటేల్ పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
21Libragold|శిల్పా కాలనీలో భారీ చోరీ…
21Libragold| శిల్పా కాలనీలో భారీ చోరీ… 21Libragold | ఇంట్లో పెళ్లి సందడి
వెంకటరామిరెడ్డికి బిగ్ షాక్.. సర్వీస్ నుంచి డిస్మిస్ ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Video : Music Director Naga Vamshi Exclusive Interview
The post Video : Music Director Naga Vamshi Exclusive Interview appeared first on Telugu360 .
Telangana : ఇద్దరూ కాళేశ్వరాన్ని ఏరియల్ వ్యూలో చూసి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లు మేడిగడ్డ బ్యారేజీని ఏరియల్ వ్యూ ద్వారా సందర్శించారు
ముంబైలో మొదలు పెట్టిన దిల్ రాజు..
టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు హిందీలో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు గానీ, షూటింగ్ ఇప్పట్లో మొదలు పెట్టకపోవచ్చుననే మాట వినిపించింది. కానీ, సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చాడు దిల్ రాజు. ఆ వివరాల్లోకి వెల్దాం. నిర్మాత దిల్ రాజుకి అత్యంత సన్నిహితుడు దర్శకుడు వంశీ పైడిపల్లి. రెండేళ్ళకో, మూడేళ్ళకో ఓ సినిమాను […] The post ముంబైలో మొదలు పెట్టిన దిల్ రాజు.. appeared first on Telugu Bullet .
నిత్య కృషీవలుడు ముఖ్యమంత్రి చంద్రబాబు..
నిత్య కృషీవలుడు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ
మైనారిటీ విద్యార్థుల ప్రతిభ గర్వకారణం…
మైనారిటీ విద్యార్థుల ప్రతిభ గర్వకారణం… ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సిఎం రేవంత్..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. డ్రోన్ ఎగురవేసి.. ఏరియల్ వ్యూ ద్వారా మేడిగడ్డను సిఎం పరిశీలించారు. సిఎం రేవంత్ తోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎన్డిఎస్ఎ చైర్మన్ అనిల్ జైన్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సిఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, అంతకుముందు.. కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని సిఎం రేవంత్ దర్శించుకున్నారు. తర్వాత రూ.198 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు సిఎం భూమిపూజ చేశారు.
రాష్ట్ర అభివృద్ధిలో అలుపెరుగని ధీరుడు..
రాష్ట్ర అభివృద్ధిలో అలుపెరుగని ధీరుడు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర అభివృద్ధి పధంలో
చౌటుప్పల్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా
విద్యార్థుల ఉన్నత శిఖరాలకు అండగా…
విద్యార్థుల ఉన్నత శిఖరాలకు అండగా… ర్యాంకులు సాధించటం అభినందనీయంస్టేట్ ర్యాంకు సాధించిన అనూష
తొర్రూరు, ఆంధ్రప్రభ : ఈనెల 23న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగే శ్రీ
ఒకేసారి బరిలోకి రెండు జట్లు.. 30-35 మంది జాబితా సిద్ధం..
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత టీం ఇండియా పలు ద్వైపాక్షిక సిరీసులు ఆడనుంది. ఇందుకోసం ఆటగాళ్లను ఎంపిక చేయడం ఇప్పుడు బిసిసిఐ ముందు ఉన్న అతి పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడున్న టాప్ ప్లేయర్లతో పాటు ఐపిఎల్తో తమ్ ప్రతిభ కనబర్చిన యువ ప్లేయర్లు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తారు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలో ఎవరిని పక్కన పెట్టాలో పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో బిసిసిఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టులోకి రావడానికి ఉన్న డిమాండ్, అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సంఖ్య ఆధారంగా కనీసం 30-35 మందితో బిసిసిఐ ఓ జాబితాను సిద్ధం చేయనుంది. ఒకేసారి రెండు జట్లు బరిలోకి దిగేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న సిరీస్ల దృష్ట్యా దీనిని వర్కౌట్ చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు ఆసియా గేమ్స్, వెస్టిండీస్ సిరీస్లు వేదికలుగా కానున్నాయి. ఇందులో బరిలోకి దిగే జట్లలలో ఒక జట్టుకు శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ ఇవ్వగా.. మరో జట్టుకు సూర్య కానీ, మరెవరైనా కానీ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది.
ప్రజల వద్దకు పాలన.. తీసుకు వచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేఅభివృద్ధి సంక్షేమ పాలన
విషాదం: కొండను ఢీకొట్టిన విమానం.. పైలట్, కో పైలట్ మృతి
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో విమాన ప్రమాదం జరిగింది. ఓ చార్టర్డ్ విమానం, కొండచరియను ఢికొట్టడంతో.. పైలట్, కోపైలట్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జష్పూర్ జిల్లాలో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు.. వెంటనే సంఘటనాస్థలానికి రెస్క్యూ టీమ్ ను పంపించి సహాయక చర్యలు ప్రారంభించింది. అనంతరం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించినట్లు వెల్లడించారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో వీరితోపాటు విమానంలో ఇతర ప్రయాణికులు ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో విమానం కొండపై కూలిపోవడయంతో దట్టమైన పొగ, మంటలు చెలరేగినట్లు కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉపాధి కల్పన కోర్సుల అనుమతి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉపాధి కల్పన కోర్సుల అనుమతి పరకాల, ఆంధ్రప్రభ :
21 tolas |శిల్పా కాలనీలో భారీ చోరీ…
21 tolas | శిల్పా కాలనీలో భారీ చోరీ… 21 tolas |
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని సీఓఈలు,
Breaking : వెంకట్రామిరెడ్డి డిస్మిస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సచివాలయం ఉద్యోగి వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది
Ambati Rambabu : అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది?
చంద్రబాబుపై మరోసారి వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు
మొగుడిపై కోపం.. కోటిన్నర నోట్లు గాల్లో విసిరేసిన మహిళ
భర్తపై ఆగ్రహించిన ఒక మహిళ నోట్ల కట్టలను రోడ్డు మీదకు విసిరేసింది
గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం
జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో సోమవారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక పారిశ్రామిక వాడలోని ఎరిత్రో ఫార్మా పరిశ్రమలో బాయిలర్ వద్ద షార్ట్ సర్య్కూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు పరిశ్రమలో ఎలాంటి పరికరాలు లేవని స్థానికులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఇదే పరిశ్రమను ఆనుకొని మరో భారీ పరిశ్రమ ఉండటంతో అక్కడి నుంచి సేఫ్టీ విభాగం రసాయనాలు వెదజల్లారు. అగ్నిమాపక వాహనం అందుబాటులో లేకపోవడం వల్లనే సమస్య తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు.
Will Ram Pothineni turn Director?
Tollywood actor Ram Pothineni needs a solid box-office hit. His last film Andhra King Taluka received decent response but the film failed to register decent numbers. He is on a break and is working on two projects. From the past one year, there are speculations that Ram is working on a script and he will […] The post Will Ram Pothineni turn Director? appeared first on Telugu360 .
Revanth Reddy : మేడిగడ్డ బ్యారేజీ వద్దకు రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు
Peddi |స్పెషల్ వెనుక ఏం జరుగుతోంది…?
Peddi | స్పెషల్ వెనుక ఏం జరుగుతోంది…? Peddi | ఆంధ్రప్రభ వెబ్
సంగారెడ్డి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం
సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది
ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా రక్తంతో చిత్రం…
ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా రక్తంతో చిత్రం… నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు
కాళేశ్వరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మహాదేవపూర్, ఆంధ్రప్రభ : దక్షిణ కాశీగా
ఫిన్లాండ్ లో స్వదేశీ సాఫ్ట్వేర్ ఉద్యోగి స్వాగతం..
జన్నారం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం తరఫున విదేశీ విద్యా విధానంపై అధ్యయనం
19 years |టాలీవుడ్లో దూసుకుపోతున్న డింపుల్ హయాతి!
19 years | టాలీవుడ్లో దూసుకుపోతున్న డింపుల్ హయాతి! 19 years |
చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో మజ్జిగ పంపిణీ
చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో మజ్జిగ పంపిణీ భవానిపురం, ఆంధ్రప్రభ : విజనరీ

29 C