పారిశుద్ధ కార్మికురాలికి సూపర్ స్టార్ బహుమానం
చెన్నై: నిజాయితీకి నిలువుటద్దం అనిపించుకున్న పారిశుద్ధ కార్మికురాలు పద్మకు సూపర్స్టార్ రజనీకాంత్ బంగారు గొలుసును బహుమతిగా ఇవ్వడం అందరినీ ఆకట్టుకొంటోంది. పద్మ తన కుటుంబీకులతో కలిసి మంగళవారం పొయస్ గార్డెన్ లోని రజనీ కాంత్ నివాసానికి వెళ్లి ఈ బహుమతిని అందుకున్నారు. శాలువాతోపాటు, ఓం అనే డాలరుతో ఉన్న రెండు సవరల బంగారు హారాన్ని ఆమెకు బహూకరించి సత్కరించారు. ఇటీవల రోడ్డుపై తనకు లభించిన రూ.45 లక్షల విలువైన బంగారాన్ని పారిశుద్ధ కార్మికురాలు పద్మ అసలైన యజమానికి పోలీసుల ద్వారా అందజేసి తన నిజాయితీని చాటుకున్నారు. ఈ సందర్బంగా పద్మ మాట్లాడుతూ తాను సూపర్స్టార్ రజనీకాంత్ను కలుసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని భావోద్వేగంతో అన్నారు. పద్మతోపాటు ఇద్దరు కుమార్తెలు, భర్త వచ్చారు. సద్మ నిజాయితీని అభినందిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవలనే పద్మ నిజాయితీని ప్రశంసిస్తూ సత్కరించి రూ. లక్ష చెక్కును బహుమతిగా అందజేశారు. టి నగర్లో పారిశుద్ధ విధులు నిర్వహిస్తుండగా పద్మకు రోడ్డుపై ఒక సంచి కనిపించింది. అది విప్పి చూడగా అందులో 45 సవరల బంగారు ఆభరణాలు కనిపించాయి. పై అధికారులకు ఈ సంగతి తెలియజేసి ఆ ఆభరణాల సంచిని పాండీ బజార్పోలీసులకు అప్పగించింది. వారు దర్యాప్తు చేసి అసలు యజమానికి ఆ నగలు అప్పగించగలిగారు. పద్మకు రజనీకాంత్ సత్కరించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మోహన్బాబు యూనివర్సిటీలో కిడ్నాప్ కలకలం
తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ వ్యవహారంపై తిరుపతి పోలీసులు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం యూనివర్సిటీలో అధిక ఫీజులపై నిరసన తెలపడానికి విద్యార్థి సంఘం నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలైన అక్బర్, వినో ద్లను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు వాహనంలో బలవంతంగా ఎక్కించి, కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి సంఘం నేత బండి చలపతి తిరుచానూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి..కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసులు చేజ్ చేసిఅడ్డగించారు. ఈ సందర్భంగా కిడ్నాప్కు పాల్ప డినట్లు భావిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కిడ్నాప్కు గురైన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు సురక్షితంగా రక్షించారు. విద్యార్థి సంఘ నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదుతో... విద్యార్థి సంఘం నేత బండి చలపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు యూనివర్సిటీకి చెందిన వీఆర్వో సతీష్తో పా టు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్ల డిం చారు. నిందితులపై 191(2), 115(2), 140(1), 126(2), 351(2), r/w 190, 61(2) బిఎన్ఎస్ సెక్షన్ల కింద (క్రైం నెంబర్: 23/2026)కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఎ1గా సతీష్, ఎ2గా మోహన్ బాబు, ఎ3గా మంచు విష్ణుబాబుపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితు లతో పాటు మరో 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉన్నత విద్యామండలి ఆదేశాలను ధిక్కరిస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నేతల ఆరోపణ మోహన్ బాబు యూనివర్శిటీలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం సూచించిన ఫీజులనే అమలు చేయా లని విద్యార్థి సంఘాలు గత కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి ఆదేశాలను ధిక్కరిస్తూ విద్యార్థులను వేధిస్తు న్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ అంశంపై ఎంబీయూ నుంచి ఎవరూ ఇంకా స్పందించలేదు.
దేశానికి ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్: మంత్రి కిషన్ రెడ్డి
బీబీనగర్ మండల పరిధిలోని ఎయిమ్స్ ఆసుపత్రిని అన్ని హంగులతో తీర్చిదిద్ధి యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుపనున్నట్లు కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిని మంగళవారం డైరెక్టర్ అమిత అగర్వాల్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఆసుపత్రిలో కల్పిస్తున్న వైద్య సదుపాయాలు,భవన నిర్మాణ పనులు పురోగతిపై ఎయిమ్స్ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భవనాలను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో ఎయిమ్స్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయామని ఆయన అన్నారు.గతంలో భవన నిర్మాణాలను ఇష్టానుసారంగా నిర్మించారని వాటిని రీ మార్కింగ్ చేసి మరల నిర్మాణ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రి భవన నిర్మాణాలతోపాటు వైద్య విద్యార్థుల వసతి గృహాలు సరికొత్తగా నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 86% పనులు పూర్తయ్యాయని అత్యంత ప్రతిష్టాత్మకంగా 24 అంతస్థుల భవనాలను నిర్మించి వైద్య విద్యార్థుల వసతి గృహాలకు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఆసుపత్రిలో 15 లక్షల మంది వైద్యసేవలు పొందారని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రక్కన ఆసుపత్రి నిర్మాణం జరుగుతూనే మరోపక్క వైద్య సేవలు అందిస్తూ రోజుకు 1800 మంది ఓపికి చికిత్స పొందే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో వైద్యం కోసం వచ్చే పేషంట్లకు సౌకర్యాలను మరింత మెరుగుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతం సెమి రూరల్ కాకుండా సెమి అర్బన్ లా ఉంటుంది కాబట్టి పేషంట్లతో వచ్చే సహాయకులకు సరైన ఆకామినేషన్ అందుబాటులో లేదు కాబట్టి ప్రయివేట్ సంస్థలు ముందుకు వచ్చి భవనాలను నిర్మించి మెయింటైన్ చేస్తామంటే ప్రభుత్వం తరుపున ఆలోచిస్తామని ఆయన తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ లో ఇప్పటికే రెండు బ్యాచ్ లు ఎంబీబీఎస్ విద్యార్థులు పూర్తిస్థాయిలో ఎంబీబీఎస్ పూర్తిచేసుకొని పట్టాలు తీసుకొని బయటకు వెళ్లారని బిఎస్సి నర్సింగ్,ఎమెస్సి నర్సింగ్ విద్యార్థులు సుమారు 800 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని ఆయన తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి హైద్రాబాద్ సిటి ఔటర్ రింగ్ రోడ్డు కు బయట రీజనల్ రింగ్ రోడ్డుకు లోపల ఉండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికి ఎయిమ్స్ ఆసుపత్రి సౌకర్యంగా ఉపయోగకరంగ ఉంటుందని అయన అన్నారు.హైదరాబాద్ నగరంలో అనేక రకాల ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ రోజు గ్రామీణ ప్రాంతాల ప్రజానీకానికి హైదరాబాద్ నగరంతో సహా అందుబాటులో ఉండే విధంగా ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. త్వరలోనే బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్,రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి,బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి తరుణ్ రెడ్డి,బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, బీజేపీ బీబీనగర్ మండల అధ్యక్షులు భువనగిరి సదానంద్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి,కాసుల శ్రీకాంత్ గౌడ్, నాయకులు ఇంజమూరి ప్రభాకర్, బోయపల్లి గోపాల్ రెడ్డి,పశులాది రాంచందర్,కొలను లక్ష్మ రెడ్డి, పొట్ట నవీన్, దాసమోని వెంకటేష్, పంజాల ప్రవీణ్, నక్కీర్తి శ్రీకాంత్, జల్లి సాయి దత్త,బాను తదితరులు పాల్గొన్నారు.
యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్న ఆనంద్ దేవరకొండ.. 'తక్షకుడు' టీజర్ రిలీజ్
బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ మరోసారి డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంద్, డైరెక్టర్ వినోద్ అనంతోజు కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరూ కలిసి నటించిన మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీ కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తక్షకుడు అనే డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఫ్రెష్ గా, ఆసక్తికరంగా ఉంది. సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా టీజర్ ను రూపొందించారు. అయితే, థియేటర్లలో కాకుడా ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. లాపతా లేడీస్ మూవీ ఫేమ్ నీతాన్షీ గోయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.త్వరలోనే విడుదల తేదీని వెల్లడించనున్నారు. కాగా, ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. బేబి తర్వాత హీరోయిన్ వైష్ణవి చైతన్యతో కలిసి మరోసారి ఆనంద్ నటిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో ఎపిక్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
12th ward |ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తాను: కూరపాటి కవిత యాదగిరి
12th ward | ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తాను: కూరపాటి కవిత యాదగిరి
ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహం చోరీ..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మెల్బోర్న్ లోని భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే రోవ్ విల్లే ప్రాంతంలో గాంధీ మహాత్ముని కాంస్య విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడమే కాక, విగ్రహాన్ని కాజేశారు. విగ్రహం పాదాలు మాత్రమే ఉంచి, కాళ్ల వరకు కోసి వేసి ఎత్తు కెళ్లారు. ఈ సంఘటనపై భారతీయ సమాజం స్థానిక విక్టోరియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ విషయాన్ని అధికారికంగా చర్చించింది. విగ్రహాన్ని తక్షణం వెతికి పట్టుకోవాలని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. మీడియా ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ అపహరణకు గురైన విగ్రహాన్ని త్వరగా కనిపెట్టాలని ఆస్ట్రేలియా అధికారులను కోరినట్టు చెప్పారు. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) ఈ విగ్రహాన్ని ఆస్ట్రేలియా భారతీయ సమాజానికి బహుమతిగా అందజేసింది. ఆస్ట్రేలియా అప్పటి ప్రధాని స్కాట్ మోరిసన్ 2021నవంబర్ 12న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆస్ట్రేలియా భారత సమాజానికి ప్రముఖ సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం కలగిన చిహ్నంగా ఈ విగ్రహం గుర్తింపు పొందుతోంది. రోవ్విల్లే లోని కింగ్స్లే క్లోజ్ అనే ధార్మిక సంస్థ ఆవరణలోని ఆగంతకులు ముగ్గురు ఈ విగ్రహాన్ని చోరీ చేసారని పోలీసులు అనుమానిస్తున్నారు.
2students |మోహన్ బాబుపై కిడ్నాప్ కేసు నమోదు
2students | మోహన్ బాబుపై కిడ్నాప్ కేసు నమోదు 2students | మోహన్
రైతుల అంశంలో రాజీపడేది లేదు: కేంద్రం
ఆంక్షలు ఎత్తివేస్తే వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లు అమెరికాతో ట్రేడ్ డీల్పై విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టారని విపక్షం నుంచి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక ప్రకటన చేశాయి. అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ సందర్భంగా రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భగం వాటిల్లలేదని, పైగా మరింత పరిరక్షించబడ్డాయని మంగళవారం ఒక ప్రకటలో కేంద్రం వెల్లడించింది. సున్నితమైన రంగాలైన వ్యవసాయం, డెయిరీ తదితర అనుబంధ రంగాలకు ఎలాంటి ఢోకా ఉండబోదని, సంప్రదింపుల సమయంలోనూ ఎలాంటి రాజీ కుదుర్చుకోలేదని తెలిపాయి. వివిధ రంగాల్లో ప్రభుత్వ స్థిరత్వానికి చర్చలు అద్దం పట్టాయని, ఇంధన రంగంలో కూడా భారత్ ప్రయోజనాలే కీలకంగా సంప్రదింపులు జరిగాయని ఆ ప్రకటనలో వెలువరించారు. వెనెజువెలా సహా ఆంక్షలు ఉన్న ఏ దేశం నుంచి కూడా చమురు కొనుగోళ్లు ఉండబోవని కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఒకవేళ ఆంక్షలను ఎత్తివేసే తప్పకుండా చమురు దిగుమతి చేసుకుంటామని తెలిపింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో-హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ’దేవర’ పార్ట్-1 పాన్-ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధ ఆర్ట్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు ప్రేక్షకుల్లో పెరుగుతున్న వేళ ‘దేవర’ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని ఇటీవల ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. దీంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర పార్ట్-2 షూట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా క్లారిటీ లేదు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభించడానికి కొరటాల శివ కసరత్తులు చేస్తున్నాడట. దేవర సీక్వెల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ పార్ట్-2 కోసం మ్యూజిక్ పై వర్క్ చేస్తున్నాడట. అన్నట్టు కొరటాల శివ ‘దేవర పార్ట్-2’ కథలో చాలా మార్పులు చేసి షూట్ కోసం కసరత్తులు చేస్తున్నారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక ఈ దేవర 1 మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి దేవర సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సీక్వెల్ ఏ రేంజ్లో అందుకుంటుందో చూడాలి.
మణిపూర్లో దాదాపు ఏడాదిగా అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలనకు తెరపడింది. నూతన ముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన ఖేమ్చంద్ సింగ్ బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధం అయ్యింది. మంగళవారంనాడు సమావేశమైన బిజెపి శాసనసభాపక్షం ఆయనను నాయకుడిగా ఎన్నుకుంది. డిప్యూటీ సిఎంగా మహిళ నాయకురాలు నెమ్చా కిప్జెన్కు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఇదిలా ఉండగా మణిపూర్ అసెంబ్లీ కాలపరమితి 2027వరకు ఉంది. అంటే కొత్తగా కొలువుదీరబోయే ప్రభుత్వం ఏడాది పాటు పాలన సాగిస్తుంది. కొంత కాలంగా జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో గత ఏడాది బీరేన్ సింగ్ సిఎం పదవికి రాజీనామా చేయడంతో అప్పటి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. తాజాగా ఖేమ్చంద్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
అనారోగ్యంతో మంథని మాజీ ఎంఎల్ఎ రాంరెడ్డి మృతి
మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి (80) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి. గ్రామస్థాయి నుండి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగారు. 1994లో టిడిపి నుంచి రాంరెడ్డి మొదటిసారిగా మంథని నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యేగా ఎన్నికై 1999 వరకు పనిచేశారు. ప్రజా సమస్యలను తనవిగా భావించి పని చేశారు. రైతుల కష్టాలు, గ్రామీణ అభివృద్ధి అంశాలపై ఆయన చూపిన చిత్తశుద్ధి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. రామన్నగా పేరు తెచ్చుకున్న రాంరెడ్డి రైతు పక్షపాతిగా, ప్రజల మనిషిగా ఆయన సంపాదించిన గౌరవం అపారమైంది. రాంరెడ్డికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. రాంరెడ్డి మృతి పట్ల పలువరు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు సంతాపం తెలిపారు.
after6months |మణిపూర్ సీఎంగా యుమునాం కేంచంద్
after6months | మణిపూర్ సీఎంగా యుమునాం కేంచంద్ after6months | మణిపూర్లో ముగియనున్న
Video : Actress DIVI VADTHYA Interview PROMO
The post Video : Actress DIVI VADTHYA Interview PROMO appeared first on Telugu360 .
కాలనీలో ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి ఇంటింటి పర్యటన..
విశాలాంధ్ర–తాడిపత్రి: పట్టణంలోని టైలర్స్ కాలనీ పరిధిలోని 21, 23, 24వ వార్డుల్లో మంగళవారం ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమవుతూ మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక అవసరాలపై వివరాలు సేకరించారు. ఈ పర్యటన సందర్భంగా పలువురు కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తూ పెండింగ్ అంశాలను ప్రాధాన్యంగా […] The post కాలనీలో ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి ఇంటింటి పర్యటన.. appeared first on Visalaandhra .
Venky Doubles his Remuneration
Victory Venkatesh has delivered super hits in his career and he is one of the most successful actors. Venkatesh is not very strict on his remuneration and he keeps his producers comfortable. The actor has been charging close to Rs 10 crores as remuneration for years. His last film Sankranthiki Vastunnam is a blockbuster hit […] The post Venky Doubles his Remuneration appeared first on Telugu360 .
Nominations |మోత్కూర్ మున్సిపల్ బరిలో 49 మంది అభ్యర్థులు
Nominations | మోత్కూర్ మున్సిపల్ బరిలో 49 మంది అభ్యర్థులు Nominations |
రైతుల రక్తాన్ని, దేశాన్ని మోడీ అమ్మకానికి పెట్టారు: రాహుల్ గాంధీ
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అకస్మాత్తుగా జరగడంపై లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఒప్పందానికి సంబంధించిన సమగ్ర వివరాలు కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ఒత్తిడితోనే మోడీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారని, రైతుల రకాన్ని, వాళ్లు చిందించే చెమటను, దేశాన్ని అమ్మకానికి పెట్టారని ఆరోపణ చేశారు. తన ప్రాబల్యం ఎక్కడ దెబ్బతింటుందోనని మోడీ భయపడుతున్నారని మండిపడ్డారు. మంగళవారంనాడు పార్లమెంటు బయట రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీ వణికిపోతున్నారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నాలుగు నెలలుగా నిలిచిపోయింది. దానిపై సోమవారం రాత్రి నరేంద్ర మోడీ అనూహ్యంగా సంతకం చేశారు. ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ట్రేడ్ డీల్ విషయంలో రాజీపడ్డారు. ఇంతవరకూ కాపడుకుంటూ వస్తున్న తన ఇమేజ్ ఇప్పుడు దెబ్బతింటుందోనని మోడీ భయపడుతున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీపై అమెరికాలో కేసు ఉందని, నిజానికి ఒకరకంగా ఇది మోడీపై కేసు అన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో చాలా విషయాలున్నాయని, దానిని అమెరికా ఇప్పటికీ విడుదల చేయలేదని ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. ఆ ఒత్తిడి కూడా ఉందని, ఒత్తిడికి కారణమవుతున్న రెండు పాయింట్లు ఇవేనని అన్నారు. వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నవరణే అంశాన్ని సైడ్ చేయడానికి ఇదో కొత్త డ్రామా అని అన్నారు. రైతులు ఇలాంటి ఒప్పందాలపై ఓ కన్నేయాలని, వాటిని అర్థం చేసుకోవాలన్నారు.
Reserve |ఎఫ్డీపీటీ వాహనాన్ని అడ్డుకున్న ఇండ్ల లబ్ధిదారులు
Reserve | ఎఫ్డీపీటీ వాహనాన్ని అడ్డుకున్న ఇండ్ల లబ్ధిదారులు Reserve | జన్నారం,
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ఆచితూచి స్పందించింది. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మంగళవారంనాడు స్పందించారు. తమకైతే ఈ అంశంలో భారత్న నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. భారత్తో తమకు విలువైన సంబంధాలు ఉన్నాయని, ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగ్యస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తామని, అదే సమయంలో రష్యా-ఇండియా మధ్య కీలక రంగాల్లో అత్యంత లోతైన, విస్తృతమైన సహకారం కూడా ఏమాత్రం తక్కువ కాదన్నారు. భారత్ మాకు అత్యంత ముఖ్యమని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి భారీ డిస్కౌంట్తో ముడిచమురును కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ కీలకంగా ఉంది. ఇది పశ్చిమ దేశాలకు కంటగింపుగా మారింది.
supervisor |అంగన్వాడి కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి,
supervisor | అంగన్వాడి కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి, supervisor | చిట్యాల, ఆంధ్రప్రభ
అమెరికాతో చర్చలకు ఇరాన్ సుముఖత
దుబాయ్ : ఇన్నాళ్లూ అమెరికాతో ఎలాంటి చర్చలకు ఇష్టపడని ఇరాన్ ఇప్పుడు కాస్త వెనక్కు తగ్గింది. ఈ నేపథ్యంలో అమెరికాతో న్యాయమైన రీతిలో సమాన స్థాయిలో చర్చలు జరిగేలా చూడాలని ఇరాన్ విదేశాంగ మంత్రిని ఆదేశించానని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ మంగళవారం వెల్లడించారు. గతనెల ఇరాన్ దేశం అంతా ఆందోళనలతో అట్టుడికిన ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికాతో చర్చలకు ఇరాన్ సిద్ధం కావడం విశేషం. ఆందోళన సాగిస్తున్న ఇరాన్ ప్రజలను కొన్ని వారాల పాటు హెచ్చరిస్తూ వచ్చిన అధ్యక్షుడు ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో చర్చలకు సంకేతాలు అందించారు. అంతేకాదు ఇరాన్ సుప్రీం అయతుల్లా అలి ఖమేనీ కూడా ఈ విషయంలో తనకు మద్దతు ఇచ్చినట్టు మసూద్ వెల్లడించారు. ఇదివరకు ఖమేనీ చర్చలన్న ప్రసక్తి లేకుండా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా ఒప్పందానికి పెట్టిన డిమాండ్ల మేరకు ఎంతవరకు ఇరాన్ ఒక ఒప్పందానికి వస్తుందో వేచి చూడాల్సిందే. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణుఒప్పందంపై ఇరాన్ దిగిరావాలన్న పట్టుదలతో ఉన్నారు. గత జూన్లో ఇరాన్ కు వ్యతిరేకంగా 12 రోజుల పాటు ఇజ్రాయెల్ యుద్ధం సాగించగా, ఇరాన్ లోని మూడు అణుస్థావరాలపై బాంబు దాడులకు ట్రంప్ ఆదేశించిన సంగతి తెలిసిందే. మధ్యప్రాచ్య రీజియన్లో మిత్రదేశాలు అమెరికాతో ఇరాన్ చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి అభ్యర్థించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ వెల్లడించారు. అయితే ఇరాన్ చర్చలకు సుముఖత చూపిస్తున్న విషయం అమెరికా ఇంకా నిర్ధారించవలసి ఉంది.
District Collector |రెవెన్యూ అంశాలపై సీసీఎల్ఏ సమీక్ష
District Collector | రెవెన్యూ అంశాలపై సీసీఎల్ఏ సమీక్ష District Collector |
Bypass road |రూ.4.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Bypass road | రూ.4.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన… Bypass road
స్వచ్ఛత కార్మికురాలికి సూపర్ స్టార్ సత్కారం #Rajinikanth #Honesty #Chennai #GoldChainGift #Padma
హార్వర్డ్లో సిఎం కాస్ట్లీ చదువు..గురుకుల విద్యార్థులకు పాము కాట్లు
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతున్న వార్త కలచివేస్తోందని -మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు విద్యా నిలయాలా.. లేక విషసర్పాలకు ఆవాసాలా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా..? అని నిలదీశారు. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ రంగుల లోకం చూపిస్తున్న సిఎం గురుకులాలను గాలికి వదిలేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. గురుకులాల్లో పిచ్చి మొక్కలు తొలగించే దిక్కు లేదు...చిమ్మచీకట్లో లైట్లు వేసే నాథుడు లేడు అని ఆందోళన వ్యక్తం చేశారు. అపరిశుభ్రత కారణంగా నేడు గురుకులాల్లో కుక్క కాట్లు, పాము కాట్లు సర్వసాధారణంగా మారిపోవడం అత్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు. గురుకుల బిడ్డలకు కడుపు నిండా తిండి లేదు.. ప్రాణాలకు రక్షణ లేదని వాపోయారు. ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫోటోలకు పోజులిస్తే...ఇక్కడ పేద విద్యార్థులు ఆసుపత్రి పాలై కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. తమ పిల్లలు గురుకులాలకు చదువుకోవడానికి వెళ్తున్నారా.. లేక చావుతో పోరాడటానికి వెళ్తున్నారా..? అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పతనమవుతున్న గురుకులాలను కాపాడాలి... విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టాలని కోరారు. అశ్మితకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షసాధింపుల మీద ఉన్న శ్రద్ధలో కొంత అయినా పేద పిల్లల బతుకుపై పెట్టాలని సిఎం రేవంత్రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. పాము కాటుకు గురై ఆసుపత్రిలో చేరిన గురుకుల బిడ్డ ప్రాణానికి రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు.
Teacher |తల్లీ కొడుకు హత్యల ఘటనా స్థలాన్ని పరిశీలన…
Teacher | తల్లీ కొడుకు హత్యల ఘటనా స్థలాన్ని పరిశీలన… Teacher |
కాంగ్రెస్పై విషం చిమ్ముతున్న బిఆర్ఎస్: ఎంపి చామల
తమ పార్టీపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్కు నోటిసు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయించడం దేనికని ఆయన ప్రశ్నించారు. విచారణకు పిలిస్తేనే ఇంత రాద్ధాంతమా? అని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. కెసిఆర్ జాతిపిత అంటూ కెటిఆర్, హరీష్ రావు పిట్టకథలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏదో రకంగా ప్రజలను మాయ చేసి గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. తన కుటుంబంలో అందరూ సెటిల్ అయ్యారని, కుమారుడు కెటిఆర్ అమెరికాలో ఉన్నాడని, అమ్మాయి పెళ్ళి చేసానని, ఎవరికీ పదవుల మీద ఆశ లేదని ఉద్యమం సమయంలో కెసిఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. కానీ అధికారంలోకి రాగానే ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎంపీ చామల విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచాచమని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతూ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ఎంపీ చామల తెలిపారు.
market | తగ్గేదెలా…. market | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదోని
market | తగ్గేదేలా…. market | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదోని
అక్రమ ఇసుక రవాణాపై డిఎస్పి కి రైతుల ఫిర్యాదు..
విశాలాంధ్ర, గోరంట్ల: బూదిలి పంచాయతీ పరిధిలోని పాపిరెడ్డిపల్లి గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామ రైతులు డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. సమస్యపై స్పందించిన డీఎస్పీ తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు, స్థానికంగా కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు నిర్వహించి రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఇది భూగర్భ జలాల స్థాయిపై, వ్యవసాయ భూములపై ప్రతికూల ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్పీ […] The post అక్రమ ఇసుక రవాణాపై డిఎస్పి కి రైతుల ఫిర్యాదు.. appeared first on Visalaandhra .
Tickets |మెదక్ అభ్యర్థుల జాబితా విడుదల..
Tickets | మెదక్ అభ్యర్థుల జాబితా విడుదల.. Tickets | మెదక్ ప్రతినిధి,
30k Above |బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు పతనం అయ్యాయి? ఇప్పుడు కొనవచ్చా?
30k Above | బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు పతనం అయ్యాయి? ఇప్పుడు
Funding |కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తా
Funding | కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తా Funding | నిర్మల్
Electricity |విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేసిన కేసులో ట్రాక్టర్ సీజ్…
Electricity | విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేసిన కేసులో ట్రాక్టర్ సీజ్… Electricity
ఇండో-యూఎస్ వాణిజ్య ఒప్పందంపై చర్చకు విపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చకు విపక్షాలు మంగళవారం రాజ్యసభలో డిమాండ్ చేశాయి. తరువాత వాకౌట్ చేశాయి. జీరో అవర్ పూర్తి కాగానే కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఈ వాణిజ్య ఒప్పందం అంశాన్ని తీసుకు వచ్చారు. ప్రభుత్వం నుంచి రావలసిన ఈ సమాచారం వాషింగ్టన్ నుంచి రావడాన్ని ఆయన ఆక్షేపించారు. సభలో విపక్షాలు అసమ్మతి తెలియజేయగానే సభా నాయకుడు జెపి నడ్డా భారత ఎగుమతులపై సుంకాలు తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియజేశారని, తరువాత ప్రధాని నరేంద్రతో కూడా ఆయన మాట్లాడారని వివరించారు. మంచి విషయాల్లో కూడా చెడుగా చూడడం ప్రారంభం కావడంతో విపక్షం అసమ్మతి బయటపడిందని నడ్డా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై పూర్తి వివరాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,సుమోటో ప్రకటనతో ప్రభుత్వం ముందుకు వస్తుందని సభకు హామీ ఇచ్చారు. కానీ ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, ఇది భారత కాంగ్రెస్, ఇండియా కూటమి బాధ్యతారాహిత్యమని నడ్డా విమర్శించారు. దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తూ విపక్షం నినాదాలు కొనసాగిస్తుండడంపై చైర్మన్ సిపి రాధాక్రిష్ణన్ జోక్యం చేసుకుని ప్రభుత్వం ప్రకటన చేస్తామని చెప్పినప్పుడు వినాలని సూచించారు. అయినా సరే విపక్షాలు వెనక్కు తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు చొచ్చుకుని వెళ్లారు. నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం ఈరోజే దీనిపై సుమోటో స్టేట్మెంట్ ఇస్తుందని దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతీదీ రాజకీయం చేయడం వారికి ఆసక్తి అని, దానికి ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్నదేనని నడ్డా విపక్షాలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్చకు దూరంగా ఉంటుందని దేశంలో వాతావరణం సృష్టించడానికి వారు ప్రయత్నిస్తున్నారని నడ్డా వ్యాఖ్యానించారు. “చర్చించడానికి ఎలాంటి అంశాలు లేని పార్టీ మీది. ఇది బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన. ఒకవిధంగా దేశ వ్యతిరేక ప్రవర్తన ” అని నడ్డా విపక్షంపై ధ్వజమెత్తారు. టిఎంసి తప్ప మిగతా విపక్షాలన్నీ నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశాయి. టిఎంసి సభ్యుడు సాకేత్ గోఖలే కూడా సభలో కొంతసేపు కూర్చుని వాకౌట్ తరువాత బయటకు వెళ్లారు. “సర్” బాధిత కుటుంబాలపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా తాము వేరేగా వాకౌట్ చేశామని టిఎంసి వెల్లడించింది.
Lift irrigation |ధనార్జన కోసమే రాయలసీమ లిఫ్టు
Lift irrigation | ధనార్జన కోసమే రాయలసీమ లిఫ్టు Lift irrigation |జూపాడు
Tax |పన్ను ఎగవేతదారులకు రెడ్ నోటీసులు
Tax |పన్ను ఎగవేతదారులకు రెడ్ నోటీసులు Tax |కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :
Nutrition |భూసార పరీక్షలతో లోపాలను గుర్తించవచ్చు…
Nutrition | భూసార పరీక్షలతో లోపాలను గుర్తించవచ్చు… Nutrition | శావల్యాపురం, ఆంధ్రప్రభ
భారత్ చట్టాలను పాటించాల్సిందే.. లేదంటే దేశం విడిచి వెళ్లిపొండి
న్యూఢిల్లీ : ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేసింది. భారత్లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఈమేరకు వాట్సాప్ మాతృసంస్థ మెటాకు మంగళవారం సుప్రీం కోర్టు హెచ్చరిక జారీ చేసింది. “ మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరు. మా డేటాకు సంబంధించి ఒక్క అంకెను పంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించము’ అని అమెరికాకు చెందిన మెటాను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మందలించారు. దేశ చట్టాలను పాటించకపోతే భారతదేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాట్సాప్ 2021ప్రైవసీ పాలసీకి సంబంధించిన పిటిషన్ను సుప్రీం కోర్టు తాజాగా విచారించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడం దోపిడీ అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దేశం లోని లక్షలాది మంది పేదలు, చదువురాని ప్రజలు ప్రైవసీ పాలసీని అర్థం చేసుకోగలరా అని మెటా ప్రతినిధులను చీఫ్ జస్టిస్ సూటిగా ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో మెటా పాలసీలు అర్థం చేసుకోవడం తమకే ఇబ్బందిగా మారుతోందని, ఒకసారి తనకు ఓ వైద్యుడు వాట్సప్లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపితే దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్లో కనిపించాయన్నారు. ఇక దేశం లోని లక్షలాది మంది పేద, చదువురాని ప్రజలు ఈ విధానాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. కాగా, మెటా ఇంజినీరింగ్ బృందం ఇతరుల వాట్సాప్ మెసేజ్లను చదవగలదని వాట్సాప్ అంతర్జాతీయ వినియోగదారుల బృందం ఇటీవల అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీం కోర్టు హెచ్చరికలు మెటాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ప్రైవసీ పాలసీ 2021 జనవరిలో వాట్సప్ తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం యూజర్లు వాట్సప్ బిజినెస్ అకౌంట్లతో జరిపే సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్తో పంచుకునేందుకు అనుమతి లభిస్తుంది. కొత్త పాలసీకి అంగీకరించని వారి ఖాతాలను రద్దు చేస్తామని తొలుత హెచ్చరించింది. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని అభ్యంతరాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పాలసీ అమలును నిలిపివేయాలని ఆదేశించింది.ఐటీ చట్టం లోని నిబంధనలకు ఈ కొత్త పాలసీ పూర్తి విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. ఈ పాలసీపై దాఖలైన పిటిషన్పై తాజాగా విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
suspend |మోదీ ట్రంప్ కు ఎందుకు భయపడుతున్నారు?
suspend | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను
గ్యాస్ నింపుతుండగా మంటలు చెలరేగి వ్యాన్ దగ్ధం #Kadapa #Maidhukur #FireAccident #Police
Drugs |డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలి….
Drugs | డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలి…. Drugs |
రాహుల్ గాంధీ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారు: పీయూష్ గోయెల్
న్యూఢిల్లీ: భారత్పై గతంలో అమెరికా 50 శాతం సుంకాలు విధించిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలపై గోయెల్ కౌంటర్ ఇచ్చారు. మెరైన్, సీఫుడ్, వస్త్ర ఎగుమతిదారులు సుంకాలు తగ్గాలని ఆశించారని తెలిపారు. ఇటీవల వరకు అమెరికా ఒప్పందం ఎప్పుడని విపక్ష నేతలు ప్రశ్నించారని అన్నారు. రాహుల్ గాంధీ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారని మండిపడ్డారు. 2011లో చైనాతో ఎఫ్టిఎ కుదుర్చుకునే పాపం రాహుల్ చేశారని గోయెల్ ధ్వజమెత్తారు. చైనాతో ఎఫ్టిఎ నుంచి భారత్ను మోదీ కాపాడారని తెలిపారు. వ్యవసాయం, డెయిరీ రంగాల్లో భారత్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని గోయెల్ అన్నారు. వ్యవసాయం, డెయిరీ రంగాలను ప్రధాని మోదీ అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందని మండిపడ్డారు. భారత్ ఎదుగుదలను రాహుల్ గాంధీ ఎందుకు సహించట్లేదని ప్రశ్నించారు. ప్రతికూల ఆలోచనలతో దేశ ప్రజలను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీకి వాస్తవాలు రుచించట్లేదని పేర్కొన్నారు.
Jeevan Reddy | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నాపై కోపం ఉంటే
Development |కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
Development | కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు Development | కర్నూలు బ్యూరో,
Bellampally |మున్సిపాలిటీలో 34 స్థానాలూ గెలుచుకుంటాం
Bellampally | మున్సిపాలిటీలో 34 స్థానాలూ గెలుచుకుంటాం Bellampally | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ
Bhimgal Town |బీజేపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా…
Bhimgal Town | భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ చైర్మన్
Atmospheric |వాతావరణ పర్యవేక్షణకు ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు
Atmospheric | వాతావరణ పర్యవేక్షణకు ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు Atmospheric | కర్నూలు
TG |ఈ నెల 5 నుండి సీఎం కప్ క్రీడా పోటీలు
TG | ఈ నెల 5 నుండి సీఎం కప్ క్రీడా పోటీలు
ఇరోజు బంగారం ధరలు #GoldRateToday #GoldPriceIndia #GoldUpdates #latestnews #telugupost #viralvideo
MLA |ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం….
MLA | ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం…. MLA | తుగ్గలి, ఆంధ్రప్రభ
Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు టెన్షన్.. మున్సిపల్ ఎన్నికలు ముప్పు తెస్తాయా?
తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి
TG |గెలిచి వస్తేనే రాజకీయ భవిష్యత్ ఉంటుంది…
TG | గెలిచి వస్తేనే రాజకీయ భవిష్యత్ ఉంటుంది… TG | నర్సంపేట,
ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నోటీసులు
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు
Crime | అక్రమ బొగ్గు తవ్వకం.. Crime | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
భారత్, పాక్తో మ్యాచ్ జరగకపోయినా.. నష్టం లేదు: మాజీ క్రికెటర్
టి-20 ప్రపంచకప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో ఈ నెల 15న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అందుకు కారణాలు మాత్రం చెప్పలేదు. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగకపోయిన నష్టం లేదని ఆయన అన్నారు. టీం ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేంత బలంగా పాకిస్థాన్ జట్టు ఇప్పుడు లేదని ఆయన పేర్కొన్నారు. దానికి బదులుగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో తలపడుంటే మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగకున్నా ఏం కాదు. చాలా కాలంగా భారత్, పాక్ల మధ్య మ్యాచ్లు రసవత్తరంగా సాగడం లేదు. పూర్తి ఫలితాలు ఏకపక్షంగా ఉంటున్నాయి. కారణం.. పాక్ 90 దశకంలో ఉన్నట్లు ఇప్పుడు బలంగా లేదు. ఇప్పుడు టీం చాలా బలహీనంగా ఉంది. అసలు భారత్కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితే లేదు. భారత్ ఆ టీమ్తో తలపడుతుంటే.. ఏదో చిన్న జట్టుతో తలపడినట్లు ఉంటోంది’’ అని తెలిపారు.
DEAD |పురుగు మందు తాగి మహిళ మృతి
DEAD | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని నంబాల గ్రామ పంచాయితీ
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
విశాలాంధ్ర – తాళ్లపూడి : కాపులంతా ఐక్యతగా ఉండి, టీడీపీ ప్రభుత్వం కాపులపై చేస్తున్న దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని కాపు జెఏసి మెంబర్, పేద్దెవం ఉప సర్పంచ్ తోట రామకృష్ణ పిలుపు నిచ్చారు. ఆ నాటి రంగ హత్య, మొన్న ముద్రగడ కుటుంభం పై దాడి, నిన్నటి అంబటి పై దాడి వరుస గా రాష్ట్రం లో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య ఎప్పుడూ రాజకీయ వైరుధ్యం నడుస్తూనే, దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆయన గుర్తు […] The post కాపులంతా ఐక్యతగా వుండాలి appeared first on Visalaandhra .
Election Officer |బి- ఫామ్ల అందజేత…
Election Officer | పాల్వంచ, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ
రాయలచెరువు గట్టు భద్రతకు చర్యలు చేపట్టాలి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలోని రాయలచెరువు గట్టు భద్రతకు చర్యలు తీసుకోవాలని మంగళవారం ఇరిగేషన్ ఈఈకి వైసీపీ రైతు విభాగం తాలూకా అధ్యక్షులు కేపీ యల్లప్ప, నాయకులు బ్రహ్మయ్య ఆచారి, లింగన్న గౌడ్, బోయ కడబూరి ఆదోనిలో ఇరిగేషన్ ఈఈని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలచెరువు నుంచి దాదాపు 1000 ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. చెరువు గట్టుపై ముళ్లకంపలు, పిచ్చి […] The post రాయలచెరువు గట్టు భద్రతకు చర్యలు చేపట్టాలి appeared first on Visalaandhra .
Telangana |కాకతీయ జూలాజికల్ పార్క్ లో..
Telangana | కాకతీయ జూలాజికల్ పార్క్ లో.. Telangana | వెబ్ డెస్క్,
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు
విశాలాంధ్ర-రాప్తాడు : సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాప్తాడు సీఐ టీవీ శ్రీహర్ష హెచ్చరించారు. కొంతమంది మైనర్ బాలురు స్కూటర్లలో రాప్తాడు 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయంపై ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పూర్తి విచారణ చేసి మంగళవారం పిల్లల తల్లిదండ్రులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతపురం రాణినగర్ కు చెందిన 6 మంది విద్యార్థులు మూడు […] The post సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు appeared first on Visalaandhra .
Remunerations Correction Coming in Telugu Cinema
Gone are the days where producers used to recover their major investment through the non-theatrical deals. The OTT players have slashed down the deals and the Hindi market reached rock bottom for the Telugu actors. The satellite deals almost vanished and there is a huge decline in the non-theatrical rights. The situations have changed completely […] The post Remunerations Correction Coming in Telugu Cinema appeared first on Telugu360 .
Aler |సీనియర్ నేత విష్ణుమూర్తి చేరిక
Aler | సీనియర్ నేత విష్ణుమూర్తి చేరిక Aler | ఆలేరు, ఆంధ్రప్రభ
Kodad |బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ దుండగులు
Kodad | బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ దుండగులు పోలీస్ స్టేషన్లో
parakala |మొక్కలు నాటిన ప్రిన్సిపల్, అధ్యాపకులు
parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
రెవెన్యూ క్లినిక్లో సత్వర పరిష్కారాలతో రైతుల ఆనందం
విశాలాంధ్ర ధర్మవరం; రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ల ద్వారా రైతుల భూ సంబంధిత సమస్యలకు సత్వరంగా పరిష్కారం లభిస్తూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలం – పుల్లేటిపల్లి గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 369-బి,విస్తీర్ణం 4.60 ఎకరముల భూమి నలుగురు అన్నదమ్ముల మధ్య భాగ పరిష్కార వివాదం కారణంగా కొంతకాలంగా నోషనల్ ఖాతాగా కొనసాగుతూ ఉండేది అని తెలిపారు..ఈ నేపథ్యంలో […] The post రెవెన్యూ క్లినిక్లో సత్వర పరిష్కారాలతో రైతుల ఆనందం appeared first on Visalaandhra .
Mothkur |ప్రజా ప్రతినిధిగా కొనసాగా…ప్రజా సేవకే అంకితమౌతా..!
Mothkur | ప్రజా ప్రతినిధిగా కొనసాగా…ప్రజా సేవకే అంకితమౌతా..! 7వ వార్డు అభివృద్ధి
Chennuru |టికెట్ రాని వారికి పార్టీ అండగా ఉంటుంది..
Chennuru | టికెట్ రాని వారికి పార్టీ అండగా ఉంటుంది.. Chennuru |
ఇండియా–అమెరికా ట్రేడ్ డీల్ ఓకే#IndiaUS #TradeDeal #ModiTrump #TariffCut #ReciprocalTariffs
దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలి…
సిఐటియు.. విశాలాంధ్ర- డుంబ్రిగుడ : ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి ఎస్ బి పోతురాజు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వల్ల యజమానులకు కార్మికులు బానిసలుగా మార్చే కుట్ర అని, అనేక పోరాటాలు చేసి సాధించుకొన్న ఎనిమిది గంటల పని దినాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 గంటల వరకు పెంచడం ఎంతవరకు సమంజసం అని చెప్పారు. […] The post దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలి… appeared first on Visalaandhra .
రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్కు రిషి విద్యాలయ పాఠశాల ఆరుగురు విద్యార్థులు ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్కు రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్లో సబ్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలు నిర్వహించారు అని,ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు అని తెలిపారు.ఉత్కంఠభరితంగా సాగిన పోటీల అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర […] The post రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్కు రిషి విద్యాలయ పాఠశాల ఆరుగురు విద్యార్థులు ఎంపిక appeared first on Visalaandhra .
నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు
విశాలాంధ్ర ధర్మవరం:: నేత్రదానముతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్రదాత సవారు లక్ష్మణ్ రావు అని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరంచంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పాండురంగస్వామి గుడి వీధి కి చెందిన అంబాభవాని దేవాలయం మాజీ అధ్యక్షులు కీ,శే సఫారు లక్ష్మణ రావు ఉదయం మరణించగా విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులను నేత్రదానంపై అవగాహన కల్పించారు. అనంతపురం రెడ్ […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు appeared first on Visalaandhra .
ప్రభుత్వ ఉన్నత విద్యా విలువలు కాపాడండి
కే హెచ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఉన్నత విద్యా విలువలను కాపాడాలని కే హెచ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలకు వారు డిగ్రీ కళాశాలలో చేయవలసిన వాటిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అధ్యాపకులు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల లో చదవడం వలన తల్లి తండ్రులకు ఫీజుల బెడద ఉండదని, ప్రస్తుతం కార్పొరేట్ కాలేజీల కంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఉన్నత […] The post ప్రభుత్వ ఉన్నత విద్యా విలువలు కాపాడండి appeared first on Visalaandhra .
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అకస్మాత్తుగా బైక్లో మంటలు #telugupost #durgamcheruvubridge #news
Parakala | 17వ వార్డులో కొనసాగుతున్న ప్రచారం …
Parakala | 17వ వార్డులో కొనసాగుతున్న ప్రచారం … Parakala | పరకాల,
ఈనెల 4న ప్రత్యేక విద్యుత్ అదాలత్..
ఏడి లక్ష్మీనరసింహారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం పుట్టపర్తి లోని గణేష్ సర్కిల్ 33/11 కెవి సబ్ స్టేషన్ నందు ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ధర్మవరం విద్యుత్ ఏడి లక్ష్మీనరసింహ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ రిటైర్డ్ జడ్జ్ శ్రీనివాస ఆంజనేయ మూర్తి, ఆర్థిక సభ్యులు మధు కుమార్, సాంకేతిక సభ్యులు శ్రీనివాస్ బాబు, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి పాల్గొంటారని తెలిపారు. ధర్మవరం డివిజన్ పరిధిలోని […] The post ఈనెల 4న ప్రత్యేక విద్యుత్ అదాలత్.. appeared first on Visalaandhra .
మంచి మనసు చాటుకున్న శ్రుతీ హాసన్ #telugupost #latestnews #shruthihaasan #viralvideo
Wanaparthy | 33వ వార్డులో జోరుగా ప్రచారం…
Wanaparthy | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలలో
Utkoor |సల్లంగా చూడమ్మా ఊర లక్ష్మమ్మ తల్లి.
Utkoor | సల్లంగా చూడమ్మా ఊర లక్ష్మమ్మ తల్లి. అమ్మ బైలెల్లి నాదో…
కేంద్ర బడ్జెట్ లో చేనేతకు మొండిచేయి
ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణవిశాలాంధ్ర ధర్మవరం;;కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేతకు కేవలం 200 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందని చేనేత, జోలి శాఖ రెండిటికి కలిపి 5272 కోట్లు కేటాంచడం జరిగిందని ఈ బడ్జెట్ లో చేనేతకు మొండి చేయి కల్పించడం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, ఉపాధ్యక్షులు విజయభాస్కర్,చేనేత నాయకులు […] The post కేంద్ర బడ్జెట్ లో చేనేతకు మొండిచేయి appeared first on Visalaandhra .
TG |అభివృద్ది పథంలో భూపాలపల్లి …
TG | అభివృద్ది పథంలో భూపాలపల్లి … — మున్సిపల్ పై కాంగ్రెస్
Thiruvuru |రైతులు, ప్రజల హక్కులకు భరోసా కల్పించడమే…
Thiruvuru | రైతులు, ప్రజల హక్కులకు భరోసా కల్పించడమే… పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ..తిరువూరు
ప్రజల కష్టార్జితాన్ని మోదీ అమెరికాకు దోచిపెట్టారు: రాహుల్
న్యూఢిల్లీ: ఆమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీ.. దేశాన్ని అమెరికాకు అమ్మేశారని రాహుల్ మండిపడ్డారు. అమెరికా ఒత్తిడితో ప్రధాని మోదీ వణికిపోయారని అన్నారు. నాలుగు నెలలుగా నిలిచిన ఒప్పందంపై మోదీ సంతకం చేశారని.. మోదీపై వచ్చిన తీవ్ర ఒత్తిడి వల్లే సంతకం చేశారని పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడితో ఒప్పందంపై మోదీ రాజీ పడ్డారని అన్నారు. ప్రజల కష్టార్జితాన్ని మోదీ అమెరికాకు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. ఆమెరికా బయటపెట్టని ఎప్స్టీన్ ఫైల్స్లో చాలా విషయాలు ఉన్నాయని రాహుల్ అన్నారు. అమెరికాలో అదానీపై కేసు ఉందని.. వాస్తవానికి ఆ కేసు మోదీపై పెట్టాల్సిన కేసు అని పేర్కొన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో మోదీపై చాలా ఒత్తిడి ఉందన్నారు. ప్రధాని అమెరికాకు ఎందుకు లొంగిపోయారన్నది ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు.
Net-zero |ప్రాంగణాలుగా సంక్షేమ వసతి గృహాలు..
Net-zero | ప్రాంగణాలుగా సంక్షేమ వసతి గృహాలు.. Net-zero | చిత్తూరు, ఆంధ్రప్రభ
ప్రజల ఇబ్బందులు తట్టుకోలేక… స్వంత నిధులతో రోడ్డు మరమ్మతులు
విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : బొమ్మి నాయుడు వలస పంచాయితీ పరిధిలోని గొల్లపేట నుంచి బొమ్మి నాయుడు వలస తారు రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారి దారుణ స్థితిలో ఉండటాన్ని గుర్తించినమాజీ సర్పంచ్ మంగం రమేష్ ప్రజల ఇబ్బందులను తట్టుకోలేక స్వంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు.సోమవారం ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మరమ్మత్తుల వలనద్విచక్ర వాహనదారులు పాదచారులు, గ్రామ ప్రజలు ఎంతో ఊరట పొందారు. “అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటా” – మంగం రమేష్ ఈ […] The post ప్రజల ఇబ్బందులు తట్టుకోలేక… స్వంత నిధులతో రోడ్డు మరమ్మతులు appeared first on Visalaandhra .
Chittoor |నెట్–జీరో ప్రాంగణాలుగా సంక్షేమ వసతి గృహాలు…
Chittoor | నెట్–జీరో ప్రాంగణాలుగా సంక్షేమ వసతి గృహాలు… చిత్తూరు జిల్లా కలెక్టర్
AP |కూటమి నేతల దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలి..
AP | కూటమి నేతల దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలి.. తక్షణమే అరెస్టు చేయాలి..జగ్గయ్యపేట
Guntur |అంబటి వివాదంపై సీరియస్…
Guntur | అంబటి వివాదంపై సీరియస్… Guntur | గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో

23 C