SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

18    C
... ...View News by News Source

లాలాపేటలో కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి

 హైదరాబాద్: గౌతం నగర్ లాలాపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. యువకులు కీసర నుంచి అల్పాహారం కోసం తార్నాక వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 7 Dec 2025 1:27 pm

Dil Raju initiates talks with Anil Ravipudi

Successful director Anil Ravipudi has delivered Sankranthi Vastunnam, one of the biggest hits of 2025 and he is currently busy with Chiranjeevi’s Mana Shankara Prasad Garu. The film releases during Sankranthi 2026. Anil Ravipudi is one director who loves to work without breaks. Top producer Dil Raju shares a close bond with him and produced […] The post Dil Raju initiates talks with Anil Ravipudi appeared first on Telugu360 .

తెలుగు 360 7 Dec 2025 1:26 pm

Students |గురుకులంలో దారుణం..

Students | గురుకులంలో దారుణం.. Students, నాయుడుపేట, ఆంధ్రప్రభ : గురుకుల పాఠశాలలు..

ప్రభ న్యూస్ 7 Dec 2025 1:26 pm

Cyber Crime : సైబర్ నేరగాళ్లు ఎంచుకుంటుంది వాళ్లనే.. మీరు వారి జాబితాలో ఉన్నారా?

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు

తెలుగు పోస్ట్ 7 Dec 2025 1:25 pm

Dhurandhar trending in Telugu Multiplexes

With Akhanda 2 postponed, there is no proper release for the Telugu audience over this weekend. Ranveer Singh’s Hindi film Dhurandhar has witnessed a huge growth from the Saturday shows and the Sunday shows are packed with housefulls. All the top multiplexes in AP and Telangana have increased the number of shows and most of […] The post Dhurandhar trending in Telugu Multiplexes appeared first on Telugu360 .

తెలుగు 360 7 Dec 2025 1:24 pm

BRS flag |బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.

BRS flag | బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. BRS flag |

ప్రభ న్యూస్ 7 Dec 2025 1:22 pm

KAKANI |మళ్లీ నోరుజారారు

KAKANI | మళ్లీ నోరుజారారు KAKANI | ఆంధ్రప్రభ, నెల్లూరు : మాజీ

ప్రభ న్యూస్ 7 Dec 2025 1:14 pm

జైస్వాల్ అద్భుత సెంచరీ.. ఆరుగురు లెజెండ్స్ సరసన చోటు

వైజాగ్: సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖ స్టేడియం వేదికగా జరిగిన మూడో, కీలక వన్డేలో యువ క్రికెటర్ యశస్వి జైసాల్ అద్భుతంగా రాణించాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమైనా.. మూడో మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయాడు. సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలి వికెట్‌కి రోహిత్ శర్మతో కలిసి 155 పరుగులు జోడించిన యశస్వి.. జట్టు విజయాన్ని సులభతరం చేశాడు. ఈ క్రమంలో తన క్రికెట్ కెరీర్‌లో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో మూడు ఫార్మాట్‌లలో(టెస్టు, వన్డే, టి-20) సెంచరీలు సాధించిన ఆరో బ్యాటర్‌గా అతడు రికార్డు సాధించాడు. యశస్వి కెరీర్‌లో ఇది నాలుగో వన్డే మాత్రమే. అంతకు ముందు టెస్టు, టి-20 ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన ఈ యువ క్రికెటర్ తాజాగా వన్డేల్లోనూ సెంచరీ చేశాడు. దీంతో దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సురేశ్ రైనా, శుభ్‌మాన్ గిల్‌ల సరసన చోటు దక్కించుకున్నాడు. దీంతో భవిష్యత్‌లో భారత క్రికెట్‌కు తానేంటో నిరూపించుకున్నాడు. ఇక శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 270 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. జైస్వాల్ సెంచరీ, రోహిత్, విరాట్‌లు హాఫ్ సెంచరీలు చేయడంతో 39.5 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పాయి భారత్ సునాయాస విజయం సాధించింది.

మన తెలంగాణ 7 Dec 2025 1:13 pm

Minister |గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా…

Minister | గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా… Minister | మక్తల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 7 Dec 2025 1:11 pm

మహిళతో మీర్ చౌక్ ఎసిపి అసభ్య ప్రవర్తన?

హైదరాబాద్: పాత బస్తీలోని మీర్ చౌక్ ఎసిపిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఎసిపి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నడంటూ  ఓ మహిళ వీడియో విడుదల చేసింది. ఇంటి ముందు కారు పెట్టి ఓ వ్యక్తి వేధిస్తున్నాడని మిర్ చౌక్ పోలీసులకు దళిత మహిళ జూన్ లో ఫిర్యాదు చేసింది. అప్పుడు ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని మిర్ చౌక్ ఎసిపిని బాధితురాలు కలిసింది. కానీ తనకు ఎసిపి అసభ్య మెసేజీలు పెట్టడంతో పాటు ఫోన్ లో వేధిస్తున్నాడని బాధితురాలు వీడియో విడుదల చేసింది.  ఒంటరిగా రావాలని, తనతో గడపాలని, చెప్పినట్టు వింటేనే న్యాయం చేస్తానని మహిళాతో ఎసిపి ఫోన్ లో మాట్లాడినట్టు ఆరోపణలు చేసింది. మిర్ చౌక్ పోలీసులతో బాధితురాలికి ఫోన్ చేయించి ఒత్తిడి చేస్తున్నట్లు వీడియోలో మహిళా ప్రస్తావించింది. 

మన తెలంగాణ 7 Dec 2025 1:11 pm

Bigg Boss-9 | 13th week |ఎలిమినేష‌న్ ఒక‌రా? ఇద్ద‌రా?

Bigg Boss-9 | 13th week | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 7 Dec 2025 1:08 pm

Megastar |శశిరేఖ సాంగ్ వచ్చేసింది..

Megastar | శశిరేఖ సాంగ్ వచ్చేసింది.. Megastar, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 7 Dec 2025 1:06 pm

Andhra Pradesh : అదిగో.. అల్లదిగో మంత్రి వర్గ విస్తరణ.. జాబితా రెడీ అయిందా?

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు వచ్చే ఏడాది జరిగే అవకాశాలున్నాయి

తెలుగు పోస్ట్ 7 Dec 2025 1:00 pm

Virat Kohli |అప్పన్న సన్నిధిలో..

Virat Kohli | అప్పన్న సన్నిధిలో.. Virat Kohli | (ఆంధ్రప్రభ, సింహాచలం)

ప్రభ న్యూస్ 7 Dec 2025 12:56 pm

గోవాలో ప్రేమజంట... ఆ వీడియోలతో బెదిరింపులు.. సనత్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు

హైదరాబాద్: గోవాకు వెళ్ళి ఏకాంతంగా గడపాలనుకుంటున్న ప్రేమ జంటలు జాగ్రత్తగా ఉండాలని పోలీసుల సూచిస్తున్నారు. హోటల్ నిర్వహకులు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. గోవాలోని ఓ హోటల్ కు వెళ్లిన ప్రేమజంట వీడియోలు తీసి హోటల్ నిర్వహకులు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని వదిలేయాలని బాధితురాలు కోరినా కూడా వినకుండా డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఒక మహిళ(35), తన పెళ్లికిముందు 2023 సంవత్సరంలో ఒక వ్యక్తితో కలిసి గోవా వెళ్లింది. యశ్వంత్(40) అనే వ్యక్తి ఆ జంటకు బస, ఇతర ఏర్పాట్లు చేశాడు.  ఇటీవల సదరు మహిళకు ఫోన్ చేసి, గతంలో మీరు సన్నిహితంగా ఉండే వీడియోలు తీశానని, రూ.30 లక్షలు ఇవ్వాలని యశ్వంత్ డిమాండ్ చేశాడు.  తనకు ఇప్పుడు వేరే వ్యక్తితో పెళ్లయిందని తన వైవాహిక జీవితం చెడిపోతుందని వదిలేయాలని వేడుకుంది. యశ్వంత్ వినకపోవడంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మన తెలంగాణ 7 Dec 2025 12:48 pm

Guruvayigudem |హనుమద్ హోమం..

Guruvayigudem | జంగారెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం

ప్రభ న్యూస్ 7 Dec 2025 12:36 pm

గులాబీ జెండా పోయి చేయి గుర్తు వచ్చింది : కిషన్ రెడ్డి

హైదరాబాద్: పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని బిజెపి నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ నియంత పాలన, కుటుంబ పాలన చూశామని అన్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ విస్మరించిందంటూ, రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో బిజెపి మహాధర్నా చేసింది. ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో మహాధర్నా చేశారు. మహాధర్నాలో కిషన్ రెడ్డి, బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హామీల అమలుపై సిఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల బిఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ మాయ హామీలను నమ్మి ప్రజలు ఓటు వేశారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఉచిత బస్సు, సన్న బియ్యం తప్ప మరేవీ అమలు కాలేదని, రాష్ట్రంలో గులాబీ జెండా పోయి చేయి గుర్తు వచ్చిందంతే ఎద్దేవా చేశారు. దోపిడిలో, ఏ వర్గంలోనూ మార్పు రాలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, రెండేళ్లయినా 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని నిలదీశారు. భూములు అమ్మకపోతే పథకాలు అమలు చేయలేని పరిస్థితి అని కాంగ్రెస్, బిఆర్ఎస్ కుటుంబం పార్టీలే.. అక్రమాలకు పెద్దపీట అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

మన తెలంగాణ 7 Dec 2025 12:33 pm

Thaman Sparks Silent Storm With #NewGuyInTown

Music sensation Thaman S has set social media buzzing with a post that has instantly grabbed attention. Using the hashtag #NewGuyInTown, Thaman shared a cryptic line that reads, “He doesn’t say much. But his arrival will make all the noise,” sending film lovers into a frenzy of speculation. The post is believed to be linked […] The post Thaman Sparks Silent Storm With #NewGuyInTown appeared first on Telugu360 .

తెలుగు 360 7 Dec 2025 12:32 pm

Sarpanch |గెలిపించండి… అభివృద్ధి చేస్తా

Sarpanch | ఖానాపూర్ రూరల్‌, ఆంధ్రప్రభ : బ్యాట్ గుర్తుకి ఓటు వేసి

ప్రభ న్యూస్ 7 Dec 2025 12:29 pm

Problems |జంగంపల్లి అభివృద్ధి నా లక్ష్యం..

Problems | జంగంపల్లి అభివృద్ధి నా లక్ష్యం.. Problems | బిక్కనూర్, ఆంధ్ర

ప్రభ న్యూస్ 7 Dec 2025 12:28 pm

విద్యార్థినిపై లెక్చరర్ లైంగిక దాడి... వీడియో తీసి మరో లెక్చరర్ కు పంపించి... బ్లాక్ మెయిల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీలో దారుణం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిపై లెక్చరర్ లక్ష్మణ్‌కుమార్ లైంగికదాడికి పాల్పడ్డాడు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలు రికార్డు చేసి మరో లెక్చరర్ శేఖర్‌ కు పంపించాడు. ఆ వీడియోతో విద్యార్థినిని లెక్చరర్ శేఖర్ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ప్రొఫెసర్ల కీచకపర్వం భరించలేక సదరు విద్యార్థిని వైస్ ఛాన్సలర్‌ కు ఫిర్యాదు చేసింది. పోలీసులకు  విసి, రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు.  లెక్చరర్లు లక్ష్మణ్‌కుమార్, శేఖర్ సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సదరు విద్యార్థిని యూనివర్సిటీ నుంచి సొంతూరుకు వెళ్లిపోయింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన లెక్చరర్లు దారి తప్పి  కామకీచకులు మారడం సమాజానికి మంచిది కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యూనివర్సిటీల్లో ఇంత జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని నెటిజన్లు మండిపడుతున్నారు.   

మన తెలంగాణ 7 Dec 2025 12:22 pm

Khanapur |గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా

Khanapur | గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా Khanapur | ఖానాపూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 7 Dec 2025 12:06 pm

Chandrababu |సీఎంను కలిసిన సర్పంచ్..

Chandrababu | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి కుటుంబంలో సామాన్యురాలైన ఓ

ప్రభ న్యూస్ 7 Dec 2025 12:05 pm

పోలీస్ స్టేషన్ లో కాస్ట్ లీ ఫోన్ ను దొంగలించిన పోలీస్ డ్రైవర్

హైదరాబాద్: పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగిన సంఘటన హైదరాబాద్ లోని మెహదీపట్నంలో జరిగింది. లాకర్ లో పెట్టిన కాస్ట్ లీ ఫోన్ ను పోలీస్ డ్రైవర్ కొట్టేయడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద తన ఫోన్ పోయిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సిసి కెమెరాల ఆధారంగా దొంగను పోలీసులు పట్టుకుని ఫోన్ ను రికవరీ చేశారు. అనంతరం రూ.1.75 లక్షల విలువగల ఫోన్ ను లాకర్లో దాచి పెట్టారు. కాస్ట్ లీ ఫోన్ కావడంతో దానిని పోలీస్ డ్రైవర్ శ్రవణ్ కుమార్ ఎత్తుకెళ్లాడు. శ్రవణ్ కుమార్ దొంగతనం చేశాడని నిర్ధారించుకున్నారు. శ్రవణ్ కుమార్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని అతడిని ఉన్నతాధికారులు రిమాండ్ కు తరలించారు. 

మన తెలంగాణ 7 Dec 2025 11:55 am

Congress |గ్రామ అభివృధ్ధే నా లక్ష్యం..

Congress | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని పురాణిపేట్ గ్రామం

ప్రభ న్యూస్ 7 Dec 2025 11:51 am

Photos: NaraLokesh at Dallas NRI Meet

The post Photos: NaraLokesh at Dallas NRI Meet appeared first on Telugu360 .

తెలుగు 360 7 Dec 2025 11:47 am

Vote |సంతోష్ కుమార్‌కు పెరిగిన మద్దతు

Vote | బిక్కనూర్,ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా, బిక్క‌నూర్ మండలంలోని భగీరథ పల్లి

ప్రభ న్యూస్ 7 Dec 2025 11:34 am

Nightmare in Goa  : Palms క్లబ్​ విస్ఫోటనం

Nightmare in Goa : Palms క్లబ్​ విస్ఫోటనం ( ఆంధ్రప్రభ, న్యూస్​

ప్రభ న్యూస్ 7 Dec 2025 11:30 am

Airport |ఇండిగో విమానం రద్దు

Airport | ఇండిగో విమానం రద్దు Airport | గన్నవరం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 7 Dec 2025 11:26 am

Positive |స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు..

Positive | గుడివాడ, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ పరిధిలోని గుడ్లవల్లేరు

ప్రభ న్యూస్ 7 Dec 2025 11:25 am

Kamareddy |అభివృద్ధే నా లక్ష్యం…

Kamareddy | అభివృద్ధే నా లక్ష్యం… పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్ అభ్యర్థి

ప్రభ న్యూస్ 7 Dec 2025 11:23 am

MSG’s Sasirekha: The Latest Musical Sensation

The musical promotions of Megastar Chiranjeevi ’s much-anticipated Mana Shankara Vara Prasad Garu started on a bang with the first single Meesala Pilla turning out to be a blockbuster. The song is heading towards 100 Million mark. Meanwhile, the makers released second single- Sasirekha. Bheems Ceciroleo masterfully scores a track rich with different musical textures, […] The post MSG’s Sasirekha: The Latest Musical Sensation appeared first on Telugu360 .

తెలుగు 360 7 Dec 2025 11:19 am

Nomination |అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా..

Nomination | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి

ప్రభ న్యూస్ 7 Dec 2025 11:19 am

Door to Door |కాంగ్రెస్ శ్రేణుల ప్రచార జోరు

Door to Door | కాంగ్రెస్ శ్రేణుల ప్రచార జోరు ఇంటింటికి తిరుగుతూ….

ప్రభ న్యూస్ 7 Dec 2025 11:18 am

Koduru |శతజయంతి ఉత్సవాలు

Koduru | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలం మాచవరం వంతెన సెంటర్లో

ప్రభ న్యూస్ 7 Dec 2025 11:14 am

మ్యూచువల్ ఫండ్‌‌లలో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా: ఈ కాన్సెప్టులు తెలిస్తే మీరు ప్రో అయిపోతారు

మ్యూచువల్ ఫండ్‌లలో కొత్తగా పెట్టుబడి పెట్టేవారి కోసం అత్యంత ముఖ్యమైన పదాలను ఇక్కడ సులభంగా అర్థమయ్యేలా డియర్ అర్బన్ వివరిస్తోంది. భావన (కాన్సెప్టు)లను స్పష్టంగా, ఆచరణాత్మకంగా చేయడానికి, మేం రెండు ప్రసిద్ధ స్మాల్-క్యాప్ ఫండ్‌లైన నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్‌లను రియల్ వరల్డ్ ఉదాహరణలుగా తీసుకున్నాం. ఈ ఫండ్‌లను పోల్చడం ద్వారా, మీరు రెండు విభిన్న పెట్టుబడి వ్యూహాలను కూడా అర్థం చేసుకుంటారు. అవేంటంటే ఒకటి స్థిరమైన, దీర్ఘకాలిక వృద్ధిపై […] The post మ్యూచువల్ ఫండ్‌‌లలో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా: ఈ కాన్సెప్టులు తెలిస్తే మీరు ప్రో అయిపోతారు appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 7 Dec 2025 11:11 am

College |కోటి సంతకాల సేకరణ

College | కోటి సంతకాల సేకరణ College | పెదపారుపూడి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 7 Dec 2025 11:09 am

Festival |వైభవంగా స్వర్ణరథోత్సవం..

Festival | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్ర

ప్రభ న్యూస్ 7 Dec 2025 11:09 am

Dallas Turns Yellow: Nara Lokesh Gets a Heartfelt Welcome From Telugu Community

Dallas transformed into a vibrant celebration of Telugu pride as Minister Nara Lokesh attended a large diaspora gathering that felt more like a reunion than a political event. Supporters from across arrived early, filling the hall with energy. TDP, BJP and Jana Sena flags waved from every corner. When Lokesh stepped in, the hall erupted […] The post Dallas Turns Yellow: Nara Lokesh Gets a Heartfelt Welcome From Telugu Community appeared first on Telugu360 .

తెలుగు 360 7 Dec 2025 11:03 am

తల్లిని వదిలేసిన కుమారులు... చలికి వణుకుతూ

హైదరాబాద్: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల పేరుతో వృద్ధురాలు కుర్రె లక్ష్మి ని ఆమె కొడుకులు నమ్మించి జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ముందు వదిలేశారు. వృద్ధురాలు రోజంతా చలికి వణికిపోతూ ఎదురుచూసింది. ఇది గమనించి వృద్ధురాలి దయనీయ పరిస్థితిని చూసి స్థానికులు చలించి పోయారు. ఆమె తాలూఖ వివరాలు తెలుసుకుని..ఆర్డీవొ మధుకర్ స్పందించి, వెంటనే పెద్ద కొడుకు కృష్ణకు ఫోన్ చేసి, తల్లిని తీసుకెళ్లాలని, సోమవారం ఇద్దరు కొడుకులు కార్యాలయానికి హాజరు కావాలని ఆర్డీవొ మధుకర్ ఆదేశించారు. 

మన తెలంగాణ 7 Dec 2025 11:00 am

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామిని భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ దర్శించుకున్నారు. విరాట్‌కు అలయ అధికారులు, పూజారాలు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం కోహ్లీకి అర్చకులు వేదాశీర్వచనం అందజేసి స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అధికారులు ఇచ్చారు. విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికాపై భారత జట్టు ఘన విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. సపారీలపై టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. మూడో మ్యాచ్‌లో జైస్వాల్ సెంచరీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లా హాఫ్ సెంచరీలు చేయడంతో గెలుపొందింది. విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కగా యశస్వి జైస్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. 

మన తెలంగాణ 7 Dec 2025 10:47 am

ഫാക്ട് ചെക്ക്: നെതർസാൻഡ്സിൽ ഭഗവത് ഗീത പഠനം നിർബന്ധമാക്കിയെന്ന പ്രചാരണം വ്യാജം

അഞ്ചാം ക്ലാസ് മുതലുള്ള കുട്ടികൾക്ക് ഗീത നിർബന്ധിത വിഷയമാക്കിയെന്നാണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 7 Dec 2025 10:41 am

ഫാക്ട് ചെക്ക്: മമത ബാനർജിയെ പിന്തുണയ്ക്കുന്ന ബംഗ്ലാദേശ് പൌരൻ? പ്രചാരണം വ്യാജം

എസ്ഐആറിനെതിരെ തൃണമൂൽ കോൺഗ്രസ് രംഗത്തെത്തിയ പശ്ചാത്തലത്തിലാണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 7 Dec 2025 10:40 am

BRS |గ్రామాభివృద్ధికి సేవకుడిలా పని చేస్తా..

BRS | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నారక్కపేట గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు

ప్రభ న్యూస్ 7 Dec 2025 10:24 am

Hyderabad : చనిపోయినా మూడు రోజులు ఇంట్లోనే మృతదేహం

ఆరోగ్యం క్షీణించి కుటుంబ యజమాని మృతిచెందడం ఆ కుటుంబంపై తీవ్రమైన భారంగా మారింది.

తెలుగు పోస్ట్ 7 Dec 2025 10:23 am

చిల్లకూరులో బస్సు బోల్తా.. ఐదుగురికి గాయాలు

తిరుపతి: చిల్లకూరు జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రైటర్ సత్రం వద్ద శౌర్యన్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సులో 35 మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. గుంటూరు నుండి శబరిమలకు బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 7 Dec 2025 10:16 am

TG |విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా

TG | విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా TG, ఆంధ్రప్రభ వెబ్

ప్రభ న్యూస్ 7 Dec 2025 10:03 am

పాట్నాలో టిటిడి ఆలయం నిర్మాణానికి బీహార్ ప్రభుత్వం అంగీకారం

10.11 ఎకరాల భూమి కేటాయింపు అభినందించిన ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్యులు శ్రీ నారా లోకేశ్, టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు తిరుపతి: బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టిటిడి ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించడంపై టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్, ఐ.ఏ.ఎస్., ఈ మేరకు టిటిడి ఛైర్మెన్ బిఆర్ నాయుడుకు లేఖ రాశారు. సదరు స్థలంలో టిటిడి ఆలయాన్ని నిర్మించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాట్నాలో టిటిడి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించడంపై ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హెచ్ ఆర్డీ మంత్రి నారా లోకేష్ అభినందించిందినట్లు ఛైర్మన్ తెలిపారు. సదరు భూమిని 99 సంవత్సరాల పాటు రూ. 1 టోకెన్ లీజ్ రెంట్ తో ఇవ్వాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టిటిడి ఆలయాన్ని నిర్మిస్తామని టిటిడి ఛైర్మెన్ తెలిపారు. ఈ మహత్తరమైన నిర్ణయంతో బీహార్ రాష్ట్రంలో టిటిడి ధార్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఎంవోయూ చేసుకునేందుకు బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ ను అధికారికంగా నియమించిందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ తో టిటిడి ప్రతినిధులు త్వరలో సంప్రదింపులు చేసి, టిటిడి ఆలయ నిర్మాణానికి సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు చేపడుతామన్నారు. బీహార్ ప్రభుత్వ సహకారం, దూరదృష్టికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

మన తెలంగాణ 7 Dec 2025 10:01 am

Election campaign |కాంగ్రెస్ ను ఓడించలేరు..

Election campaign | కాంగ్రెస్ ను ఓడించలేరు.. Election campaign, నెల్లికుదురు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 7 Dec 2025 9:50 am

Revanth Reddy : నేడు కడప రేవంత్ రెడ్డి

నేడు కడపకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నారు

తెలుగు పోస్ట్ 7 Dec 2025 9:42 am

ఇట్స్ ఓకే గురు’ అనేది ఒక మంత్ర

సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ’ఇట్స్ ఓకే గురు’. మణికంఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రాంతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈ వెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ “ఇట్స్ ఓకే గురు టైటిల్ చాలా బాగుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. డైరెక్టర్ మణికంఠ మాట్లాడుతూ “ఇట్స్ ఓకే గురు అనేది ఒక మంత్ర. ఎన్ని సమస్యలు వచ్చినా ఇట్స్ ఓకే అని ముందుకెళ్ళిపోతే లైఫ్ చాలా ఆనందంగా ఉం టుంది. అదే ఈ సినిమాలో ఉంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మెహర్ రమేష్, హీరో సాయి చరణ్, హీరోయిన్ ఉషశ్రీ, రాజీవ్, క్రాంతి ప్రసాద్, మోహిత్ పాల్గొన్నారు. 

మన తెలంగాణ 7 Dec 2025 9:35 am

Congress |కాచాపూర్ అభివృద్ధి నా లక్ష్యం..

Congress | కాచాపూర్ అభివృద్ధి నా లక్ష్యం.. Congress, బిక్కనూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 7 Dec 2025 9:35 am

TG |ఆరు పంచాయతీలు ఏకగ్రీవం..

TG | ఆరు పంచాయతీలు ఏకగ్రీవం.. TG, పెద్దవంగర, ఆంధ్రప్రభ : పంచాయతీ

ప్రభ న్యూస్ 7 Dec 2025 9:31 am

Weather Report : చలి.. వాన.. కలసి నలిపేస్తున్నాయిగా?

దిత్వా తుపాను ప్రభావంతో నేడు కూడా కొన్ని ప్రాంతాల్లో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలుగు పోస్ట్ 7 Dec 2025 9:31 am

Earth Quake : అలాస్కాలో భూకంపం..రిక్టర్ స్కేల్ పై?

అలాస్కా–కెనడా యూకాన్ సరిహద్దు సమీ ప్రాంతంలో శనివారం ఉదయం భూప్రకంపనలు సృష్టించాయి

తెలుగు పోస్ట్ 7 Dec 2025 9:26 am

Nara Lokesh : డల్లాస్ లో లోకేశ్ కు ఘన స్వాగతం

డల్లాస్‍లో మంత్రి నారా లోకేష్ పర్యటన సాగుతుంది.

తెలుగు పోస్ట్ 7 Dec 2025 9:17 am

Raja Saab Producer Condemns Rumors

After the sudden postponement of Akhanda 2 due to financial hurdles, there are a lot of rumors going on about the upcoming film of Prabhas titled Raja Saab. The shoot of the film has been wrapped up and the makers are clearing the finances to close the non-theatrical deal. To keep an end to the […] The post Raja Saab Producer Condemns Rumors appeared first on Telugu360 .

తెలుగు 360 7 Dec 2025 9:10 am

Narendra Modi : గోవా ప్రమాదంపై ప్రధాని ఏమన్నారంటే?

గోవాలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

తెలుగు పోస్ట్ 7 Dec 2025 9:08 am

కామెడీ, యాక్షన్, రొమాన్స్‌తో..

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మూవీ ‘అన్నగారు వస్తారు‘ ఈ నెల 12న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా ‘అన్నగారు వస్తారు‘ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ థియేటర్స్‌లో సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించిందని హరీశ్ శంకర్ ప్రశంసిస్తూ.. ‘అన్నగారు వస్తారు‘ సినిమా టీమ్‌కు తన బెస్ట్ విషెస్ అందించారు. ఇక కార్తి నటన, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది.

మన తెలంగాణ 7 Dec 2025 9:00 am

Gold Price Today : ఈ ఏడాదిలోనే బంగారం కొనాలకుంటున్నారా? అయితే మీకొక న్యూస్

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి

తెలుగు పోస్ట్ 7 Dec 2025 8:59 am

Bikkanur |అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి..

Bikkanur | అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి.. Bikkanur, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 7 Dec 2025 8:57 am

మహాపాపం చేశాను... బాధపడని రోజంటూ లేదు: పరకామణి కేసు నిందితుడు

తిరుపతి: పరకామణి కేసులో నిందితుడు రవి కుమార్ సంచలన వీడియో విడుదల చేశారు. 29 ఏప్రిల్ 2023లో పరకామణిలో తప్పు చేశానని, మహా పాపానికి ప్రాయశ్చితంగా తన ఆస్తిలో 90% స్వామి వారికి ఇవ్వాలని భావించానని నిందితుడు రవికుమార్ తెలిపారు. తన కుటుంబం అనుకున్న విధంగానే తన ఆస్తిని స్వామివారి పేరిట రాశానని, ఈ వ్యవహారంపై అనేక కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. తనపై ఎవరో ఒత్తిడి తెచ్చారని, తన ఆస్తులు రాసుకున్నారని ప్రచారంలో వాస్తవం లేదని తెలియజేశారు. తనని కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, వారిపై కూడా కేసులు  పెట్టానని వివరించారు. తనపై చాలా అసభ్యకరమైన ఆరోపణలు చేశారని, ప్రైవేట్ పార్ట్ లో శస్త్ర చికిత్స చేసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధ నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నానని, న్యాయస్థానం ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించిన అందుకు తాను సహకరిస్తానని, తాను చేసింది మహా పాపం అని వెక్కి వెక్కి ఏడ్వడంతో పాటు బాధపడని రోజంటూ లేదన్నారు. 

మన తెలంగాణ 7 Dec 2025 8:43 am

Bigg Boss Telugu 9: Makers Push New Narrative & Nagarjuna Schools Contestants

Weekend episodes once again exposed shifting narratives, strategic editorial choices, emotional reconciliations, and sharp questioning from host Nagarjuna. With the finale approaching, every move by contestants and the makers is under intense scrutiny. A New Weekend Gimmick: Is Bigg Boss Steering Audience Perception This season, the makers introduced a new segment in which Nagarjuna interacts […] The post Bigg Boss Telugu 9: Makers Push New Narrative & Nagarjuna Schools Contestants appeared first on Telugu360 .

తెలుగు 360 7 Dec 2025 8:41 am

ఎంపీడీవోగా శ్యాంప్రసాద్

కడియం డిప్యూటీ ఎంపీడీవోగా శ్యాంప్రసాద్. విశాలాంధ్ర – కడియం : పంచాయతీరాజ్ శాఖలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలలో భాగంగా నూతనంగా ఏర్పటైన కడియం మండలం సచివాలయాల (జిఎస్‌డబ్ల్యూఎస్) డిప్యూటీ ఎంపీడీవో గా సూరంపూడి శ్యాంప్రసాద్ ను నియమించారు. ఈ మేరకు ఆయన ఎంపిడివొ కె రమేష్ కు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈయన సర్వీస్ అంతా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలో సాగింది. కొత్తపేట ఆర్‌డబ్ల్యూ‌ఎస్ డిఈ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. […] The post ఎంపీడీవోగా శ్యాంప్రసాద్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Dec 2025 8:41 am

క్రిస్మస్ వేడుకలు

ఘనంగా బెత్లెహేము స్త్రీల క్రిస్మస్ వేడుకలు. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, జేగురుపాడు గ్రామంలో బైబిల్ మిషన్ ( గుంటూరు హెచ్ఓ) ఆధ్వర్యంలో బెత్లెహేము స్త్రీల క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ పాల్గొన్నారు. బైబిల్ వాక్యోపదేశం కె ప్రసన్న కుమారి చేశారు. బైబిల్ మిషన్ సెక్రటరీ కె ఎస్తేరు దేవదాస్ క్రిస్మస్ గ్రీటింగ్స్ ఇచ్చారు. స్త్రీల క్రిస్మస్ కన్వీనర్ సాకా శాంతకుమారి, […] The post క్రిస్మస్ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Dec 2025 8:37 am

కోటి సేకరణ

కడియం లో కోటి సంతకాల సేకరణ. విశాలాంధ్ర – కడియం : ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం మండల కేంద్రమైన కడియం గ్రామంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నిడదవోలు కొవ్వూరు అబ్జర్వర్ గిరజాల బాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కడియం గ్రామంలో వంగపండు వారి వీధి, తామెళ్ళ వారి వీధి, మసీద్ వీధి లలో పార్టీ నాయకులు […] The post కోటి సేకరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Dec 2025 8:34 am

Ys Jagan : ఈ నెల 17న గవర్నర్ తో జగన్ భేటీ

ఈనెల 17న గవర్నర్‌తో వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు.

తెలుగు పోస్ట్ 7 Dec 2025 8:22 am

కొత్త సారథులు

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా దేవరపల్లి గ్రామానికి చెందిన తంగేళ్ల మునీశ్వర రావు ప్రధాన కార్యదర్శిగా దేవరపల్లి గ్రామానికి చెందిన ఉప్పులూరి రామారావులూ నియమితులయ్యారు ఈ మేరకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు ఇదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎర్రం శెట్టి ముత్యాలరావు (త్యాజం పూడి )బాదంపూడి ఇందిర( ఎర్నగూడెం) మండల కార్య నిర్వాహక కార్యదర్శులుగా ఎర్రగుల్ల వెంకటేశ్వరరావు […] The post కొత్త సారథులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Dec 2025 8:21 am

Scrub Typhus | 12 పాజిటీవ్ కేసులు..

Scrub Typhus | 12 పాజిటీవ్ కేసులు.. Scrub Typhus, మచిలీపట్నం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 7 Dec 2025 8:17 am

బాలూ విగ్రహం చుట్టూ.. భావోద్వేగాల చిటపటలు

కళలకు, కళాకారులకు కులం, మతం, ప్రాంతం ఉండవు. అయితే కళలు, కళాకారులు ఆయా సందర్భాలలో ఎందుకు వివాదాస్పదం అవుతుంటారు? శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం అనే ప్రఖ్యాత నేపథ్య సినీ గాయకుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రస్తుతం వివాదాంశం అయింది. డిసెంబర్ 15 బాలసుబ్రమణ్యం జయంతి. ఆ సందర్భంగా ఆయన అభిమానులు, బంధుమిత్రులు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించారు. తెలంగాణకు గొప్ప సాంస్కృతిక కేంద్రంగా భాసిల్లుతున్న రవీంద్రభారతిలో ఆ విగ్రహ ప్రతిష్ఠకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఇది తెలంగాణావాదులు కొందరికి అభ్యంతరకరం అయింది.. అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎస్‌పి బాలు విగ్రహం బదులు ఉత్తరాంధ్రకు చెందిన కళాకారుడు వంగపండు ప్రసాదరావు విగ్రహం పెడితే ఇప్పుడు అభ్యంతరం చెప్తున్న తెలంగాణ క్రాంతి దళ్ ఫౌండేషన్ నాయకుడు పృథ్వి ఆ పని చేసేవాడు కాదేమో. అంతెందుకు, బాలు విగ్రహం స్థానంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో సినీ నేపథ్య గాయకుడు రామకృష్ణ విగ్రహం పెడితే తాను రెండు తట్టల మట్టి కూడా ఆ విగ్రహ ప్రతిష్ఠకోసం మోసి సంఘీభావం తెలిపేవాడినన్నారు పృథ్వి. అంటే, ఇటువంటి భావోద్వేగాలు ఆయా సందర్భాలలో అప్పటి పరిస్థితులను బట్టి, ఆయా వ్యక్తుల వ్యవహార శైలిని బట్టి ఉంటాయి అన్నట్టే కదా. బాలసుబ్రమణ్యం విగ్రహం పెట్టబోతున్న ప్రాంగణంలోనే మరో ప్రముఖ గాయకుడు ఘంటసాల విగ్రహం కూడా ఉన్నది. దానిని తీసేయాలని ఉద్యమకారులు అడగడం లేదు. ఆ మాటకొస్తే ఒక్క రవీంద్రభారతి ఆవరణలోనే కాదు, హైదరాబాద్ నగరంలో చాలాచోట్ల అనేకమంది విగ్రహాలు ఉన్నవి. పలు ప్రాంతాలకు కూడా ఎందరో తెలంగాణకు చెందనివారి పేర్లు ఉన్నవి. అందులో చాలామంది ఆంధ్ర ప్రాంతంవారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకంటే కూడా ఆంధ్ర ప్రాంతంవారివి ఎక్కువ ఉండే అవకాశం ఎందుకు ఉందంటే పది పన్నెండేళ్ల క్రితంవరకు ఆ ప్రాంతానికి కూడా హైదరాబాదే రాజధానిగా ఉండింది కాబట్టి. భావోద్వేగాలు ఎల్లవేళలా అందరి విషయంలో ఒకేలాగా ఉండవు. నిజానికి ఘంటసాల విగ్రహం పెట్టింది 2012లో. అప్పుడు దాన్ని ఆవిష్కరించిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమం తారస్థాయికి చేరిన రోజులవి. కిరణ్ కుమార్ రెడ్డి ‘తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని శాసనసభ సాక్షిగా తన తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించుకుంటున్న రోజులు అవి. అయినా ఎవరూ అడ్డుకోలేదు. ఘంటసాల తెలంగాణ వాస్తవ్యుడు కాకపోయినా ఇక్కడి అత్యధిక సంఖ్యాకుల ఆకాంక్షలను వ్యతిరేకించిన వ్యక్తి కాదు, కనీసం బహిరంగంగా కాదు. ఈ విగ్రహాల తగాదా జరుగుతున్న రవీంద్రభారతికి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టారు. మరి ఆయన బెంగాలీ కదా అనే వితండవాదం చేసేవాళ్లకు చెప్పాల్సిందేమిటంటే విశ్వకవికి తెలంగాణ ఉద్యమ వ్యతిరేకత ఉండే అవకాశం లేదు. ఇది ఒక తొండివాదన తప్ప మరోటి కాదు. అంతెందుకు, తొలిదశ తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న రోజుల్లో ప్రఖ్యాత నటుడు ఎన్‌టి రామారావు తెలంగాణ ఉద్యమకారులు అందరినీ రెచ్చగొట్టే విధంగా ఒక సినిమాలో, తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే అని ఒక పాట పెట్టి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురై థియేటర్ల తెరలు తగలబెట్టించుకున్నారు. నిజానికి ఈ పాట రాసింది తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత సి నారాయణరెడ్డి కాగా, నటించింది మాత్రం ఎన్‌టిఆర్. అదే ఎన్‌టి రామారావు పార్టీ పెడితే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకంటే ఎక్కువ ప్రజాదరణ ఆయనకు తెలంగాణలో లభించింది. ఎక్కువ సంఖ్యలో స్థానాలు గెలుచుకున్నారు. తెలుగు సినిమా రంగం మద్రాసు నుండి హైదరాబాద్ తరలి రావడానికి ముఖ్యకారకుడు, వీర తెలంగాణవాది డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కదా. 1978లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే సినిమావారికి అవసరమైన అనేక సదుపాయాలు ప్రభుత్వం తరఫున కల్పించినప్పుడు రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్న సినీ ప్రముఖులు దాదాపు అందరూ ఆంధ్ర ప్రాంతం వారే. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం ఫిలింనగర్ లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు సినిమా రంగంవారు. 1969 తొలి దశ ఉద్యమంలో కేంద్ర బలగాలను కూడా రప్పించి దాదాపు 350మంది యువతీయువకులు ఆ బలగాల కాల్పుల్లో మరణించడానికి కారకుడయ్యాడని ఉద్యమకారులు ఆ రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని విపరీతంగా ద్వేషించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కాలంలో చిరాన్ పార్క్‌కు కెబిఆర్ పార్క్ అని నామకరణం చేసి, దాని ప్రవేశద్వారం వద్ద బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇన్ని దశాబ్దాలు గడిచినా మలిదశ ఉద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా ఎవరూ దాన్ని తొలగించాలని కోరలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొలి ముఖ్యమంత్రి కాగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్ది కాలం పార్క్ పేరు కెబిఆర్ అని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడకపోయినా తర్వాత రోజుల్లో తత్వం బోధపడి మిన్నకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్క్‌లో రోజు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే వాళ్లలో మెజారిటీ ఆంధ్ర ప్రాంతం వారే. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర విభజనకు బద్ధ వ్యతిరేకి. కానీ ఆయన చేసిన ప్రజాహిత కార్యక్రమాల కారణంగా ఇప్పటికీ తెలంగాణలో అసంఖ్యాకులు ఆయనను ప్రేమిస్తారు. తెలంగాణలో కూడా ఆయన విగ్రహాలు లెక్కకు మించినన్ని. సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయిందని ఆనాటి హోమ్ మంత్రి చిదంబరం ప్రకటించగానే ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబుతో రాత్రికి రాత్రి గుసగుసలాడి శాసనసభ్యులచేత మూకుమ్మడి రాజీనామాలు చేయించి విభజన ప్రక్రియను తాత్కాలికంగా వెనక్కు నెట్టిన ఆనాటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహం హైదరాబాద్ నగర వీధుల్లో నిక్షేపంగా నిలిచే ఉంది కదా. ఇన్ని ఉండగా, ఒక్క బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉదంతానికి వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వస్తున్నది, అందరిపట్ల, అన్ని సమయాలలో తెలంగాణ ప్రాంత ప్రజల భావోద్వేగాలు ఒకే రకంగా ఉండవు. జరిగిందేమిటంటే, ఇటీవలే మరణించిన ప్రముఖ తెలంగాణ గాయకుడు, కవి, రచయిత అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ప్రభుత్వం రాష్ట్రగీతంగా ప్రకటించింది. 2004లో అప్పటి ఉద్యమ సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ గీతాన్ని బాలసుబ్రమణ్యంతో పాడించి రికార్డు చేయడానికి నిర్ణయించుకుని అడ్వాన్స్ డబ్బు కూడా చెల్లించి ఒక బృందం చెన్నై వెళ్ళింది. గీతం అంతా చదివిన బాలసుబ్రహ్మణ్యం అందులో చివరగా వచ్చే స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఎదగాలి అన్న వాక్యం తొలగిస్తే తప్ప పాడనని అన్నారు. దానికి ఉద్యమకారులు అంగీకరించలేదు. బాల సుబ్రహ్మణ్యం తనకు చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేశారు. అదే పాటను ఆ ప్రాంతానికి చెందిన మరో నేపథ్య గాయకుడు రామకృష్ణ పాడారు. ఉద్యమ కాలంలో ఆ పాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ పాట పాడినందుకు గాయకుడు రామకృష్ణకు ఆంధ్ర ప్రాంతంలో అవమానం జరిగిందని తెలంగాణవాదుల ఫిర్యాదు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలనుకుంటున్న తరహాలోనే రామకృష్ణ శ్రేయోభిలాషులు, మిత్రులు, రాజమండ్రిలో ఆయన విగ్రహం సొంతంగా ఏర్పాటు చేయదలచుకున్నప్పుడు అక్కడి రాజకీయ పక్షాలు దాన్ని వ్యతిరేకించి ఆ పని జరగనివ్వలేదన్నది ఆ ఫిర్యాదు. తెలంగాణ ఉద్యమం మీద తీసిన ఒక సినిమాలో నటించినందుకు ప్రముఖ నటుడు జగపతిబాబు కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన వాటిని లెక్క చెయ్యలేదు. ఉద్యమ సమయంలో ఆ పాటను అంతగా ఉపయోగించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాటను, ఆ పాట రచయిత అందెశ్రీని అంతగా పట్టించుకోలేదు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించి అందెశ్రీని, ఆయన పాటను అక్కున చేర్చుకున్నారు. అంతేకాదు, దురదృష్టవశాత్తు ఇటీవల అందెశ్రీ మరణిస్తే అంత్యక్రియలకు స్వయంగా హాజరైన ముఖ్యమంత్రి ఆయన పాడెకు తన భుజాన్ని ఇచ్చారు. అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, రాష్ట్ర గీతంగా గుర్తించిన తర్వాత ఆ పాటకు సంగీతాన్ని సమకూర్చడానికి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణిని అందెశ్రీ స్వయంగా ఎంచుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో జరగబోయే ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్ లో కూడా కీరవాణి కచేరి ఉండబోతున్నది. కీరవాణిని ఎవరూ అడ్డుకోబోవడం లేదు. ఆయనను కళాకారునిగానే తెలంగాణవాళ్ళు గుర్తిస్తున్నారని అర్థం. ఇక్కడ ఇంకో విషయం తప్పకుండా చెప్పుకోవాలి. జూబిలీహిల్స్ ప్రాంతంలో 1984 ప్రాంతాల్లో ఏర్పాటయిన జర్నలిస్టుల కాలనీకి ఎం. చలపతిరావు నగర్ అని పేరు పెట్టుకున్నారు. 2007 డిసెంబరులో ఆ కాలనీ చౌరస్తాలో చలపతిరావు విగ్రహాన్ని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. గత 18 ఏళ్ళుగా ప్రతి యేటా ఆయన విగ్రహం నివాళులు అందుకుంటూనే ఉన్నది. నెహ్రూ సమకాలికుడు, సన్నిహితుడు, జాతీయస్థాయిలో ప్రఖ్యాతుడయిన చలపతిరావు శ్రీకాకుళంలో పుట్టాడు కాబట్టి హైదరాబాద్ లో విగ్రహం పెట్టొద్దని ఎవరయినా అన్నారా? కాబట్టి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ఏర్పడిన వివాదాన్ని అనవసరంగా ఆంధ్ర ప్రాంత వ్యతిరేకతగా చిత్రించకుండా ఉంటే మంచిది. ముందే చెప్పుకున్నట్టు, ఇటువంటి భావోద్వేగాలు ఆయా సందర్భాలలో అప్పటి పరిస్థితులు, ఆయా వ్యక్తుల వ్యవహార శైలినిబట్టి ఉంటాయి. నిజానికి ఎవరి విగ్రహాలు ఎక్కడ పెట్టాలనే విషయం ప్రస్తుతం ఆలోచించవలసిన అంశమే కాదు. ఈ విగ్రహాల విషయంలో ఇంకొక వాదన కూడా ఉంది. తెలంగాణవాదులు అంటున్నది ఏమిటంటే, ఆంధ్ర ప్రాంతాల్లో తెలంగాణనుంచి ప్రఖ్యాతి చెందిన వ్యక్తులెవరి విగ్రహాలు ఎందుకు లేవు అని. నిజమే, తెలంగాణ ప్రాంతంవాడైన పివి నరసింహారావు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత లోకసభకు పోటీ చేసింది కూడా రాయలసీమలోని నంద్యాల లోకసభ నియోజకవర్గం నుండి. కనీసం పివి నరసింహారావు విగ్రహమైన ఆంధ్రలో ఉండాలి కదా. అలాగే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మరికొందరు ప్రముఖులు కూడా తెలంగాణవారున్నారు. వారెవరి విగ్రహాలూ ఆంధ్రప్రాంతంలో లేవు కదా. మరి దానికి సమాధానం ఏముంటుంది? అయితే రాష్ట్రం విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక 11 సంవత్సరాలు గడిచినా ఇంకా అక్కడ ఇక్కడ కొన్ని అపశ్రుతులు వినిపిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటలు ఎండిపోతే తెలంగాణ వారి దిష్టి తగిలిందని ఒక బాధ్యతారహితమైన, పనికిమాలిన వ్యాఖ్య చేశారు. పొద్దున లేస్తే తన నివాసంతో సహా, తన సినిమా కార్యకలాపాలన్నీ హైదరాబాదులోనే కొనసాగిస్తూ, ఇక్కడి సౌకర్యాలు అన్నీ అనుభవిస్తూ కూడా తెలంగాణ మీద, తెలంగాణ ప్రాంత ప్రజల మీద పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు అక్కసు వెళ్ళగక్కడం ఇవాళ కొత్త కాదు. అక్కడ ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నప్పుడు దానికి జవాబు అన్నట్టుగా పృథ్వీలాంటివాళ్లు బాలసుబ్రహ్మణ్యంవంటి వారి విగ్రహాల ఆవిష్కరణను అడ్డుకుంటారు. ఇప్పుడు కావాల్సింది విగ్రహాల వివాదం కాదు. రాష్ట్రం ఏర్పడి దశాబ్దకాలం గడిచిపోయినా సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం, అందెశ్రీ పాటను రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించడం వంటి కొన్ని చర్యలు తప్ప తెలంగాణ కళలు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి, వికాసానికి, వాటికి శాశ్వత కీర్తి తేవడానికి అవసరమైన విధానమే ఇప్పటివరకు ప్రభుత్వాలు రూపొందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ఒక కమిటీ వేసినట్టు గుర్తు. ఆ కమిటీ నివేదిక పరిశీలించి,దాని అమలుకు తగిన చర్యలు తీసుకుంటే ఇటువంటి చిన్న చిన్న వివాదాలకు ఆస్కారం ఉండకుండా పోతుంది.  

మన తెలంగాణ 7 Dec 2025 8:17 am

కొవ్వూరు డివిజన్లో దూసుకెళ్తున్న మహిళా ఉన్నతాధికారి

సమస్యలను పరిష్కరించడంలో దిట్ట.. అక్రమార్కుల గుండెల్లో హడలు.. విశాలాంధ్ర – కొవ్వూరు: ఆమె డివిజన్ కు మహిళా ఉన్నతాధికారి.. నిత్యం తన కార్యాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండటమే కాక వారి సమస్యలను పరిష్కరించడంలో కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఇసుక మాఫియా, మట్టి మాఫియా కు పాల్పడుతున్న అక్రమాలను అరికడుతూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఆమె కొవ్వూరు డివిజనల్ అధికారి (ఆర్డీవో) రాణి సుస్మిత. ప్రతి సోమవారం తన కార్యాలయంలో జరిగే పీజీ ఆర్ఎస్ కార్యక్రమం […] The post కొవ్వూరు డివిజన్లో దూసుకెళ్తున్న మహిళా ఉన్నతాధికారి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Dec 2025 8:16 am

‘కామాఖ్య’ ఫస్ట్ లుక్ విడుదల

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లింగ్ మూవీ ’కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై. లి. బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీవాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంత్రి సీతక్క ’కామాఖ్య’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసి టీంకు అభినందనలు తెలియజేశారు. ఇంటెన్స్, థ్రిల్లింగ్‌గా కనిపించిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ యూనిక్ కథని సిద్ధం చేశారు.

మన తెలంగాణ 7 Dec 2025 8:10 am

India Vs South Africa : ఇది కదయ్యా.. మాక్కావాల్సింది.. ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్ళకు చూశాం.. సిరీస్ మనదే

విశాఖలో జరిగిన భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది

తెలుగు పోస్ట్ 7 Dec 2025 8:01 am

23 people killed in Goa nightclub fire

A tragic mishap at a nightclub in Goa has killed 23 people after a cylinder blast took place on Saturday midnight in Arpora of North Goa. The unfortunate incident happened at nightclub named Birch by Romeo Lane, which opened to its customers last year. Out of the 23 casualties, there are three tourists and all […] The post 23 people killed in Goa nightclub fire appeared first on Telugu360 .

తెలుగు 360 7 Dec 2025 7:48 am

విభిన్నమైన హారర్ థ్రిల్లర్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న ‘పోలీస్ కంప్లెయింట్’ మూవీ ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఎంఎస్‌కె ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్నారు. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందన్న భావనను హారర్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో ఈ సినిమాలో చూపించనున్నామని ఫిల్మ్‌మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుందని, సూపర్ స్టార్ కృష్ణపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.  

మన తెలంగాణ 7 Dec 2025 7:40 am

Avanigadda |నీటిపారుదల శాఖ ఏఈ మృతి..

Avanigadda | నీటిపారుదల శాఖ ఏఈ మృతి.. Avanigadda, ఆంధ్రప్రభ : చల్లపల్లిలో

ప్రభ న్యూస్ 7 Dec 2025 7:31 am

Goa Accidnet : గోవాలో ఘోర అగ్ని ప్రమాదం ..23 మంది మృతి

గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవై మూడు మంది మరణించారు

తెలుగు పోస్ట్ 7 Dec 2025 7:31 am

గోవాలో భారీ అగ్నిప్రమాదం: 23 మంది దుర్మరణం

పనాజి: గోవా రాష్ట్రం ఉత్తర గోవాలోని ఆర్పోరా గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. 'బర్చ్ బై రోమియో లేన్' నైట్ క్లబ్ లో శనివారం అర్థరాత్రి సిలిండర్ పేలడంతో 23 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో నలుగురు పర్యాటకులు ఉన్నట్టు సమాచారం. మృతుల్లో ముగ్గురు సజీవదహనంకాగా 20 మంది ఊపిరాడక చనిపోయారు. రాజధాని పనాజీకి 25 కిలో మీటర్ల దూరంలో నైట్ క్లబ్ ఉంది. 11 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానిక ిచేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షత్రగాత్రులకు యాబైవేల రూపాయల పరిహారం ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నైట్ క్లబ్ భద్రతా చర్యలు పాటించలేదని, నైట్ క్లబ్ కు అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సిఎం హెచ్చరించారు. 

మన తెలంగాణ 7 Dec 2025 7:15 am

Mahanati |సావిత్రికి మరణం లేదు..

Mahanati | సావిత్రికి మరణం లేదు.. Mahanati, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 7 Dec 2025 7:07 am

Goa fire accident |గోవాలో ఘోర ప్రమాదం..

Goa fire accident | గోవాలో ఘోర ప్రమాదం.. Goa fire accident,

ప్రభ న్యూస్ 7 Dec 2025 6:45 am

రియల్టీకి జోష్

 ఆర్‌బిఐ రెపో రేటు కోతతో హోమ్ లోన్లు చౌక  బ్యాంకులు మరింతగా రేట్లు తగ్గించే సూచనలు న్యూఢిల్లీ: ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఎంపిసి (ద్రవ్య విధాన కమిటీ) నిర్ణయం గృహ రుణగ్రహీతలకు పెద్ద ఊరటనిచ్చింది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తగ్గింపు వల్ల గృహ రుణాల వడ్డీ రేట్లు 2008 ఆర్థిక సంక్షోభానికి ముందున్న స్థాయిలకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. తాజాగా రిజర్వు బ్యాంక్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకువచ్చింది. ఆర్‌బిఐ నిర్ణయం అనంతరం బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి) రెపో ఆధారిత వడ్డీ రేట్లను 0.25 శాతం మేరకు తగ్గించింది. ఇతర బ్యాంకులు కూడా ఈ రేటు తగ్గింపును అనుసరించే అవకాశముంది. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు 7.35 శాతం వద్ద గృహ రుణాలను ఇస్తున్నాయి. రెపో రేటు తగ్గుదలతో ఈ రేటు 7.1 శాతం వరకు తగ్గే అవకాశముంది. 15 సంవత్సరాల గృహ రుణంపై వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపుతో ప్రతి నెల దాదాపు 1,440 రూపాయల ఇఎంఐ తగ్గింపు ఉండొచ్చని అంచనా. అయితే ఈ తగ్గింపును అమలు చేయాలంటే బ్యాంకులు డిపాజిట్ రేట్లను గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది లేదా బెంచ్‌మార్క్ రేటు మార్చాల్సి వస్తుంది. అలా జరిగితే కొత్త రుణగ్రహీతలు, ఇప్పటికే ఫ్లోటింగ్ రేటు రుణం ఉన్నవారితో పోలిస్తే కొంచెం ఎక్కువ రేటు చెల్లించే పరిస్థితి రావచ్చు. డిపాజిట్ రేట్లు తగ్గించకపోతే బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు తగ్గుతాయి. కానీ బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు తక్కువ నిధుల ఖర్చుల వల్ల త్వరగా లాభం పొందుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీరామ్ ఫైనాన్స్ వంటి ఫైనాన్షియర్లకు ఈ విధానం ఎక్కువ మేలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. 1 లక్ష కోట్ల విలువైన ఒఎంఒ కొనుగోళ్ల ప్రకటనతో కలిసి తటస్థ విధాన వైఖరి ద్రవ్యతను మరింత బలపరుస్తుందని అంటున్నారు. గోల్డెన్ గ్రోత్ ఫండ్ సిఇఒ అంకుర్ జలాన్ మాట్లాడుతూ, రెపో రేటు తగ్గింపుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రాబడి తగ్గుతుందని, సేవింగ్ చేసేవారికి మెరుగైన వడ్డీ రేట్లు కష్టమవుతాయని అన్నారు. తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహిస్తాయని, పెద్ద పెట్టుబడిదారులు అధిక రాబడిచ్చే రియల్ ఎస్టేట్ ఆధారిత ఫండ్లవైపు దృష్టి మళ్లించే అవకాశం అన్నారు. అగ్రశిల్ ఇన్‌ఫ్రాటెక్ సిఇఒ ప్రేక్ష సింగ్ మాట్లాడుతూ, భారత రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే ప్రపంచ పెట్టుబడిదారులు, ఎన్‌ఆర్‌ఐలకు ఆకర్షణీయంగా మారిందని, ఇప్పుడు వడ్డీ రేట్ల తగ్గుదల దానిని మరింత లాభదాయక పెట్టుబడి గమ్యస్థానంగా నిలిపుతుందని పేర్కొన్నారు. తక్కువ ఇఎంఐలు, పెరుగుతున్న డిమాండ్, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కలిసి రాబోయే త్రైమాసికాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊపు తెస్తాయని ఆమె అంచనా వేశారు.

మన తెలంగాణ 7 Dec 2025 6:40 am

ఫిఫా వరల్డ్ కప్ డ్రా విడుదల

వాషింగ్టన్: ఫిపా వరల్డ్ కప్ 2026 ఫైనల్ డ్రా విడుదల చేశారు. 48 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను వాషింగ్టన్ డిసిలోని ఎఫ్ కెన్నెడీ సెంటర్ ఫర్ ఫెర్మార్మింగ్ ఆర్ట్‌లో విడుదల చేశారు నిర్వహకులు. ఈ మెగా ఫుట్‌బాల్ సంగ్రామానికి అమెరికా, మెక్సికో, కెనెడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా, తొలి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా.. ఆర్జిరియాతో తలపడనుంది. 48 జట్లు బరిలోకి దిగడంతో ఫార్మాట్‌లో కొన్ని మార్పులు చేశారు. మొత్తం 48 జట్లను 12 గ్రూపులుగా విభజించారు. ప్రతీ గ్రూపులో 4 జట్లు ఉంటాయి. ప్రతి జట్టు తమ గ్రూపులోని ఇతర 3 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆ డాల్సి ఉంటుంది. ప్రతీ గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లతో పాటు అత్యుత్తమ ప్రదర్శన చేసినన 8 జట్లు తదుపరి రౌండ్‌లోకి చేరుకుంటాయి. టాప్-2లో నిలిచిన 24 జ ట్లు.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మరో 8 జట్లు నాకౌట్ దశకు చేరుతాయి. ఈ నాకౌట్ స్టేజిలో ఓడిన జట్టు టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతాయి. ఆ తర్వాత క్వార్టర్స్, సెమీస్ మ్యా చ్‌లలో జరుగుతాయి. ప్రపంచ కప్‌ను గెలిచే జట్టు (గ్రూపు దశలో 3 మ్యాచ్‌లు, నాకౌట్ దశలో 5 మ్యాచ్‌లు మొత్తంగా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అయితే, గతంలో విజేతగా నిలిచే జట్లు 7 మ్యాచ్‌లే ఆడేవి. 

మన తెలంగాణ 7 Dec 2025 6:30 am

Karthi |అన్నగారు వస్తారు ట్రైలర్ రివ్యూ..

Karthi | అన్నగారు వస్తారు ట్రైలర్ రివ్యూ.. Karthi, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 7 Dec 2025 6:28 am

టీమిండియాకు సిరీస్

 సెంచరీతో చెలరేగిన యశస్వి  రాణించిన కోహ్లీ, రోహిత్  చివరి వన్డేలో సౌతాఫ్రికా చిత్తు విశాఖ: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ భారత్ 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన చివరి వన్డేలో సమష్టిగా రాణించిన భారత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో ప్రసిధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్ చెరేగి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయగా.. అనంతరం లక్ష ఛేదనకు దిగిన టీమిండియా బ్యాటర్లు అద్భుతమైనర బ్యాటింగ్‌తో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డికాక్(106) సెంచరీతో రాణించగా.. మరో స్టార్ ఆటగాడు టెంబా బవుమా(48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ నాలుగేసి వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసి సఫారీ ఇన్నింగ్స్‌కు శుభం కార్డు వేశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ 44 ఓవర్లలో వికెట్ నష్టానికి 271 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్(107) సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(57), రోహిత్ శర్మ(75) అర్ధ శతకాలతో విజృంబించారు. ఇక, గత రెండు వన్డేల్లో చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు ఈ మ్యాచ్‌లో రాణించలేక పోయారు. కేశవ్ మహరాజ్ ఒక్కడే అద్భుత డెలివరీ వికెట్ దక్కించుకోగా.. మిగతా బౌలర్లు తేలిపోయారు. తీయగా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత్‌కు శుభారంభం.. లక్ష్య ఛేదనలో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్నా.. కుదురుకున్నాక సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇన్నాళ్లు ఫామ్‌లేమితో తిప్పలు పడ్డ జైశ్వాల్.. సెంచరీ సాధించి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. అనంతరం రోహిత్ దూకుడు కనబర్చగా.. జైస్వాల్ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. 54 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. యశస్వి జైస్వాల్ 75 బంతుల్లో అర్థ శతకం అందుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా ఆడేక్రమంలో రోహిత్ శర్మ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించాడు. విరాట్ అండతో జైస్వాల్ కూడా బ్యాట్‌తో చెలరేగాడు. దీంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లీ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత పోటాపోటీగా పరుగులు రాబట్టిన ఈ జోడీ.. 61 బంతులు మిగిలి ఉండగానే విజయలాంఛనాన్ని పూర్తిచేసింది. 

మన తెలంగాణ 7 Dec 2025 6:20 am

వెనుజువెలా వినాశనానికి అమెరికా కంకణం

వెనుకబడిన, బలహీమైన చిన్న దేశాలను, ఆ దేశాల ప్రభుత్వాలను ఆయుధ బలంతో తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడం, తన మాటవినని ప్రభుత్వాలు కూలిపోయేలా చేయడం, అది సాధ్యంకాకపోతే దురాక్రమణ, యుద్ధం ద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ఆ దేశాల సహజ వనరులను తరలించుకుపోవడం అమెరికా సామ్రాజ్యవాదం అవలంబిస్తున్న విధానంగా ఉంది. నేడు వెనిజువెలాపై దాని యుద్ధ సన్నాహాలు ఆ విధానంలో భాగమే. దక్షిణ అమెరికా దేశమైన వెనిజువెలాపై దాడి చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరేబియన్ దీవులకు 8 వార్ షిప్‌లతో పాటు అతిపెద్ద విమాన వాహక నౌకను, క్షిపణులు మొదలైన ఆయుధ సామాగ్రితోపాటు 10 వేలమంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి ట్రంప్ పంపాడు. వీరిలో 22వ మెరైన్ యూనిట్ కమాండోలు 2,200 మంది ఉన్నారు. ఇది ఇలా ఉండగా 2-9-20 25న వెనిజువెలా నుంచి పోతున్న పడవలపై అమెరికా దాడి చేసి 11మంది ప్రాణాలు తీసింది. ఈ దాడికి కారణం పడవల్లో వెనిజువెలా మారకద్రవ్యాల రవాణా చేస్తున్నదని సాకులు చెబుతున్నది. మారకద్రవ్యాలకు నిలయంగా ఉన్న వెనిజువెలా అమెరికా వినాశనానికి కంకణం కట్టుకున్నదని, అందుకే దానిపై దాడి చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రచారం చేస్తూ, దాని దోపిడీ విధానాలను, యుద్ధోన్మాదాన్ని మరుగుపరుస్తున్నది. వెనిజువెలా దేశంపై అమెరికా వ్యతిరేకత చాలా కాలంగా కొనసాగుతున్నది. ఆ దేశ భూగర్భంలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం మొదలైనవి అపారంగా ఉన్నాయి. తన బహుళజాతి సంస్థల ద్వారా వాటిని తరలించుకుపోతున్న అమెరికాకు 1999 లో తొలిసారి ఆటంకం ఎదురైంది. 1999లో హ్యూగో చావేజ్ వెనిజువెలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. ఒక సంవత్సరం తర్వాత తనను సోషలిస్టు గాను, సామ్రాజ్యవాద వ్యతిరేకిగా ఆయన ప్రకటించుకున్నాడు. అమెరికా దోపిడీకి అడ్డుకట్ట వేశాడు. ప్రభుత్వ సంస్థలను జాతీయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల ముఠా చావేజ్ పై తిరుగుబాటు ప్రయత్నాన్ని ఆనాటి జార్జిబుస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని వెనిజువెలా పేర్కొంది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. బొలీవియా దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక సమూహాలకు ఒక అమెరికా రాయబారి సహకరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ దేశానికి మద్దతుగా 2008లో వెనిజువెలా అమెరికా రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది. దీని ద్వారా అమెరికా చర్యలను వెనిజువెలా వ్యతిరేకించింది. చావేజ్ మరణం తర్వాత 2013 ఏఫ్రిల్ లో జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో నికోలస్ మదురో విజయం సాధించి వెనిజువెలా అధ్యక్షుడు అయ్యాడు. 2024లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి మూడవ సారి అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు.ఈయన పాలనలో ప్రభుత్వరంగ సంస్థలు, పెట్రోలియం పరిశ్రమల వంటివి ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్నాయి. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. 2014లో దేశంలో హింసను ప్రోత్సహించిన ముగ్గురు అమెరికా దౌత్యవేత్తలను దేశం నుంచి మదురో ప్రభుత్వం బహిష్కరించింది. 2019లో వెనిజువెలా సంక్షోభ సమయంలో మదురో ప్రభుత్వ వ్యతిరేకి అయిన జువాన్ గైడోనూ తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నికోలస్ మదురో ప్రభుత్వం అమెరికాతో సంబంధాలు తెచ్చుకున్నట్లు ప్రకటించింది. 2023లో ప్రతిపక్ష జాతీయ అసెంబ్లీ గైడ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించరాదని ఓటు వేయడంతో ఆ వాదన వెడల అమెరికా మౌనం వహించింది. అమెరికా తమ చమురు నిల్వలను లక్ష్యంగా చేసుకుంటున్నదని వెనిజువెలా వెల్లడించడంతో అమెరికాకు చెందిన డెలా వేర్ న్యాయమూర్తి అప్పులు తీర్చడానికి చమురు అమ్మకం గురించి వెనిజువెలాను ఆదేశించాడు. బిలియన్ల డాలర్ల అప్పు తీర్చడానికి మోసపూరితంగా చమురు కంపెనీ సిట్గోను విక్రయించడానికి అధికారం ఇస్తూ అమెరికా కోర్టు నిర్ణయాన్ని వెనిజువెలా ఉపాధ్యక్షుడు, ఆ దేశ పెట్రోలియం మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్ ఖండించి ఆ తీర్పును తిరస్కరించాడు. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ అయిన వెనిజువెలా పెట్రోలియోన్ డి వెనిజులా (పిడియుఎస్‌ఎ) హ్యూస్టన్‌కు చెందిన అనుబంధ సంస్థ అయిన సిట్గో, రుణదాతలకు 20 బిలియన్ల అమెరికా డాలర్లకు పైగా బాకీ ఉందనే ప్రచారం జరుగుతున్నది. ఇంతకు ముందు ఇది లాభదాయకంగా ఉన్న చమురు పరిశ్రమ. దీన్ని లక్ష్యంగా చేసుకున్న అమెరికా పెట్టిన అనేక ఆంక్షల వల్ల సంక్షోభంలో ఉండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. కంపెనీల రుణదారుల్లో కెనడియన్ సంస్థ క్రిస్టలిక్స్ కూడా ఉంది. బంగారం, వజ్రాలు, ఇనుము, ఇతర ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న క్రిస్టినాస్ గనిని 2008లో స్వాధీనం చేసుకుని జాతీయం చేసినందుకు 2019లో వెనిజువెలా ప్రభుత్వం క్రిస్టలెక్స్‌కు 1.2 బిలియన్లు బాకీ ఉందని మరొక అమెరికా కోర్టు పేర్కొంది. సార్వభౌమాధికారం గల ఒక స్వతంత్ర దేశం ఆ దేశానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు, ఆ దేశ ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంటుంది. వెనిజువెలా అలాంటి దేశం కాబట్టి పరిశ్రమలను, ఖనిజాల గనులను జాతీయం చేసింది. ఆ దేశ నిర్ణయాలపై అమెరికా కోర్టులు తీర్పులు ఎలా ఇస్తాయి. తీర్పు ఇచ్చే అధికారం కూడా వెనిజువెలా కోర్టులకే ఉంటుంది. అమెరికా ప్రపంచ పోలీసు పాత్ర పోషిస్తూ లేని అధికారాలను తీసుకుంటున్నది. 2023 నాటికి 303 బిలియన్ బ్యారెళ్ల్లగా అంచనాతో ప్రపంచం లోనే అత్యధిక చమురు నిల్వలను వెనిజువెలా కలిగి ఉంది. అయినా ఆ దేశం 2023లో కేవలం 4.05 బిలియన్ల ముడిచమురును మాత్రమే ఎగుమతి చేసింది. ఇది ఇతర చమురు ఉత్పత్తి దేశాల ఎగుమతి కన్నా చాలా తక్కువ. ఇంతకు ముందు ట్రంప్ ప్రభుత్వ పాలనలో ఇతర దేశాలు వెనిజువెలా నుంచి చమురు కొనవద్దని చేసిన హెచ్చరికలే అందుకు కారణంగా ఉంది. ఈ విధంగా వెనిజువెలా దేశాన్ని సైనికంగా బెదిరించడమే కాకుండా దాని ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే కుట్రలు అమెరికా చేసింది. వెనిజువెలాపై యుద్ధానికి సిద్ధమై ఆ దేశ గగన స్థలాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. అధ్యక్షుడు నికోలస్ మదురో దేశం విడిచిపెట్టిపోవాలని, అతని మంత్రి వర్గ ముఖ్య సహచరులను కాపాడుకోమని ట్రంప్ బెదిరించినట్లు హెరాల్ అనే అంతర్జాతీయ పత్రిక పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వం ప్రకటనను వెనిజువెలా తీవ్రంగా ఖండించింది. ఇది ఏకపక్ష చర్యను చూపిస్తోందని పేర్కొంది. డ్రగ్ మాఫియాపై పోరాటం పేరుతో అమెరికా హద్దులు దాటుతోందని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నంచేలా ఉందని మండిపడింది. వెనిజువెలా ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ట్రంప్ చర్యలు ఉన్నాయని పేర్కొంది. సార్వభౌమాధికారం గల ఒక దేశ గగన స్థలాన్ని మరొక దేశం మూసివేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ ఒడంబడికలకు విరుద్ధమైనది. అమెరికా ఎప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించకుండా ఉల్లంగిస్తూనే ఉంది. వాస్తవంలేని సాకులతో ఇరాక్ దాడి చేసింది. కొద్ది నెలల క్రితం ఇరాన్‌పై దాడి చేసింది. ఒక స్వతంత్ర దేశమైన వెనిజులా అధ్యక్షుణ్ణి పట్టి అప్పగించమని అమెరికా కోరడం, నికోలస్ మదురో సమాచారం ఇస్తే ఏకంగా 50 మిలియన్ల డాలర్లు (430 కోట్ల రూపాయలు) బహుమతి ప్రకటించడం దాని హంతక మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి బెదిరింపుల ద్వారా వెనుకబడిన దేశాలన్నీ తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలన్నదే అమెరికా విధానం. వెనిజువెలాపై సైనిక చర్యను 70% మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారని సిబిఎన్ సర్వే వెల్లడించింది. సైనిక జోక్యాలతో ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ గుల్ల అయ్యిందని, వెనిజువెలాపై సైనిక జోక్యం చేసుకోవద్దని అమెరికన్లు కోరుతున్నారు. వెనిజువెలాపై అమెరికా ఆంక్షలను, దాడి చేసే ప్రయత్నాలను తక్షణమే విడనాడాలని, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోరాదని, వెనుకబడిన దేశాలను బెదిరించే విధానాలను మానుకోవాలని ప్రపంచ ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. బొల్లిముంత సాంబశివరావు 98859 83526 

మన తెలంగాణ 7 Dec 2025 6:10 am