రాహుల్ రాజేసిన ఎప్స్టీన్ చిచ్చు
న్యూఢిల్లీ : ఎప్స్టీన్ ఫైళ్లలో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు ఉందని మరి ఆయనను జైలుకు ఎందుకు పంపించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ బుధవారం ఈ విషయాన్ని లోక్సభలో ప్రస్తావించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరును కూడా ప్రస్తావించారు. ఈ కేంద్ర మంత్రికి అన్ని తెలుసునని, అనిల్ అంబానీని ఎప్స్టీన్కు పరిచయం చేసిందెవ్వరనేది కూడా మం త్రికి తెలుసునని చెప్పారు. అనిల్ అంబానీ అనే పెద్ద బిజినెస్మెన్ ఇప్పుడు ఇంకా బయట ఎందుకు తిరుగుతున్నారు? ఆయనను జైలుకు ఎందుకు తరలించలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు కేంద్ర బడ్జెట్పై ప్రసంగించిన రాహుల్ తమ ప్రసంగంలో అంతర్జాతీయంగా సంచలనానికి దారితీసిన ఎప్స్టీన్ ఫైళ్ల విషయాన్ని ప్రస్తావించారు. అనిల్ అంబానీ జైలుకు వెళ్లకుండా చేశారని, ఈ విషయంలో ప్రధాని మోడీపై బాగా ఒత్తిడి తీసుకువచ్చారని రాహుల్ తెలిపారు. అనిల్కు, ఎప్స్టీన్కు దగ్గరి సంబందాలు ఉన్న విషయం తాను అధికారికంగా ధృవీకరించగలనని తెలిపారు. పైగా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఫైళ్లు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే ఈ ఫైళ్ల విషయంలో మరో పారిశ్రామికవేత్త అదానీకి సమన్లు వెలువడ్డాయని చెప్పారు. సాధారణంగా ఇటువంటి విషయాలలో ప్రధాని స్థాయి వ్యక్తి జోక్యం చేసుకోకూడదు. అయితే మన ప్రధాని ఈ విషయంలో కలుగచేసుకున్నాడని, వారిని రక్షిస్తున్నాడని ఆరోపించారు. గత నెల 31వ తేదీన విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ ఓ ప్రకటన వెలువరించారు. 2017లో ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు, ఇప్పటి ఎప్స్టీన్ ఫైళ్లకు సంబంధం ఉందనే వార్తలను ఖండించారు. ఎప్స్టీన్ వ్యవహారాలపై ఆసక్తి లేదు.. రాహుల్ ప్రకటనకు కేంద్ర మంత్రి ఖండన తనకు ఎప్స్టీన్తో సంబంధం ఉందనే వాదన ను కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ ఖండించారు. ఆయన వ్యవహారాలు ఏమిటనేవి తనకు తెలియవని చెప్పారు. తాను ఎప్స్టీన్ను రెండు సార్లు కలిసిన మాట వాస్తవమే అయితే ఇది అధికార ప్రతినిధిగా అమెరికాను కలిసినప్పటి మాట అని, ఇ మొయిల్ ద్వారా సంప్రదింపు లు జరిగాయని కూడా వివరించారు. రాహు ల్ గాందీ ఈ మొయిల్స్ చూస్తే విషయాలు తెలుస్తాయని అన్నారు. రెండు ముఖాల వ్యక్తి అని ఎప్స్టీన్ తనను తిట్టిపోసినట్లు గుర్తు చేశారు. తాను అధికార ప్రతినిధిగా మేకిన్ ఇండియా గురించి ప్రస్తావించినట్లు వివరించారు. కొందరు నేతలు దేశానికి అప్పుడప్పుడు వస్తుంటారు. ఏదో చెపుతుంటారు. తరువాత తగు సమాధానాలు పార్లమెంట్లో దొరికితే వాకౌట్కు దిగుతారు అని మంత్రి ఈ సందర్భంగా రాహుల్పై విరుచుకుపడ్డారు.
మూడు భాగాలుగా గ్రేటర్ హైదరాబాద్
కొత్తగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజన జిహెచ్ఎంసి కమిషనర్గా కర్ణన్, సైబరాబాద్ కమిషనర్గా సృజన, మలాజిగిరి కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డి మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా జయేశ్ రంజన్ మనతెలంగాణ/సిటీబ్యూరో : తెలంగాణ క్యూర్ (టి.సియుఆర్ఈ) పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసి)ని పునర్వ్యవస్థీకరణలో భాగంగా జీహెచ్ఎంసి, సైబరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(సిఎంసి), మల్కాజిగిరి మునిసిపల్ కార్పోరేషన్(ఎంఎంసి)లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. హైదరాబాద్ మహానగర పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, సంక్షేమంతో పాటు సమస్యలను వేగంగా పరిష్కరించే ఉద్దేశ్యంతో జీహెచ్ఎంసిని వికేంద్రీకృతం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.. జీహెచ్ఎంసి, సిఎంసి, ఎంఎంసి ఓఆర్ఆర్ వరకు విస్తరించిన జీహెచ్ఎంసీలో 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా ఉండగా పునర్వ్యవస్థీకరణలో భాగంగా 6 జోన్లు సికింద్రాబా ద్ జోన్(సర్కిళ్లు: , కవాడిగూడ, ముషీరాబాద్, అం బర్పేట్, మెట్టుగూడ, తార్నాక), ఖైరతాబాద్ జోన్ (సర్కిళ్ళు : ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్గూడ, అమీర్పేట్), గోల్కొండ జోన్ (సర్కిళ్ళు : గోషామహాల్, మెహిదీపట్నం, కార్వాన్, గోల్కొండ, మాసాబ్ట్యాంక్), రాజేంద్రనగర్ జోన్ (సర్కిళ్ళు : రాజేంద్రనగర్, అత్తాపూర్, బహదూర్పురా, చాంద్రాయణగుట్ట, ఫలక్నూమా, జంగమ్మెట్టు) శంషాబాద్ జోన్ (ఆదిభట్ల, బడంగ్పేట్, జల్పల్లి, శంషాబాద్ సర్కిళ్ళు), చార్మినార్ జోన్ (సర్కిళ్ళు: సంతోష్నగర్, మలక్పేట్, యాకుత్పురా, చార్మినార్, మూసారాంబాగ్)లలో 30 సర్కి ళ్ళు 150 వార్డులతో జీహెచ్ఎంసి ఏర్పాటు చేశా రు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్నే 16 స ర్కిళ్ళు, 76 వార్డులు 3 జోన్లు శేరిలింగంపల్లి జో న్(సర్కిళ్ళు: శేరిలింగంపల్లి, నార్సింగి, పటాన్చె రు, అమీన్పూర్, మియాపూర్), కూకట్పల్లి జోన్( సర్కిళ్ళు : కూకట్పల్లి, మాదాపూర్, ఆల్విన్ కాల నీ, మూసాపేట్), కుత్బుల్లాపూర్ జోన్( సర్కిళ్ళు : జీడిమెట్ల, చింతల్, గాజులరామారం, కొంపల్లి, ని జాంపేట్, దూండిగల్, మేడ్చెల్)లతో కలిపి ఏర్పా టు చేశారు. 74 వార్డులు, 14 సర్కిళ్ళు, 3 జోన్లు మల్కాజిగిరి జోన్లో (సర్కిళ్ళు : అల్వాల్, బో యిన్పల్లి, కీసర, మౌలాలీ, మల్కాజిగిరి), ఉప్పల్ జో న్(సర్కిళ్ళు: ఉప్పల్, ఘట్కేసర్, బోడుప్పల్, నా చా రం, కాప్రా), ఎల్బీనగర్ ( సర్కిళ్ళు : సరూర్నగ ర్, ఎల్బీనగర్, హయత్నగర్, నాగోల్) ఉన్నాయి. ప్రత్యేకాధికారిగా జయేష్ రంజన్ టిక్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసి, సిఎంసి, ఎంఎంసిలకు ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేర కు బుధవారం ఆయన జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో స్పెషలాఫీసర్గా బాధ్యతలను స్వీకరించారు. జీహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ ఆయనకు స్వాగతం పలికారు. కమిషనర్లుగా బాధ్యతల స్వీకరణ జీహెచ్ఎంసి కమిషనర్గా ఆర్వి కర్ణన్, సైబరాబా ద్ మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్గా సృజన, మల్కాజిగిరి మునిసిపల్ కమిషనర్గా వినయ్ క్రి ష్ణారెడ్డిలు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఓటమి భయంతో కాంగ్రెస్ దౌర్జన్యాలు
కాంగ్రెస్-కమలం మధ్యే హోరాహోరీ పోరు ‘గ్రేటర్’ విభజన ఇసి నిబంధనల ఉల్లంఘనే విలేఖరులతో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బిజెపి చీఫ్ రామచంద్రరావు మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్తోనే తమ పార్టీకికు మధ్య ముఖా-ముఖి పోటీ జరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాం చందర్ రావు తెలిపారు. పోలింగ్ సందర్భంగా వైరా, కొత్తగూడెం తదితర అనేక ప్రాం తాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నామనే భయం తో దౌర్జన్యాలకు దిగిందని వారు బుధవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తామూ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు. బిజెపికి మంచి ఫలితా లు రాబోతున్నాయని తెలుసుకున్న కాంగ్రెస్ బెదిరింపులతోనే మక్తల్లో తమ పార్టీ అభ్యర్థి ఆత్మహత్య వారు ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలకేమైనా జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత అని వారన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడరాదని, తాము మీ వెంటే ఉన్నామని, ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొట్టాలని అన్నారు. పోలీసుల సమక్షంలోనే అనేక పోలింగ్ కేంద్రాల లోపల, బయటా విచ్చల విడిగి డబ్బుల పంపిణీ చేయడాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసిన దౌర్జన్యాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు, సంబంధిత పోలీసులకూ ఫిర్యాదు చేసిన ఏ మాత్రం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. కాంగ్రెస్-బిఆర్ఎస్ పార్టీలు డబ్ము రాజకీయాలనే నమ్ముకున్నాయని వారు విమర్శించారు. బిఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోయిందని, కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని వారు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం కూడా ఎన్నికల కమిషన్ విధివిధానాలను ఉల్లంఘించిన చర్యేనని విమర్శించా రు. మున్సిపల్ హెడ్క్వార్టర్స్కు దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా కార్పొరేషన్లలలో కలిపారని, దీని వల్ల ఆ గ్రామాల పేద ప్రజలకు అ న్యాయం జరుగుతున్నదని, గ్రామీణ ప్రాం తాల్లో ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం పేదలకు ఉపయోగపడుతోందని తెలిపారు. అయితే ఈ విభజనతో వారు పలు సంక్షేమ పథకాల నుంచి దూరమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమగ్ర ప్రణాళిక, ఆర్థిక వనరుల సమీకరణ లేకుండా అనేక గ్రామాలను కొత్త కార్పొరేషన్లలో చేర్చడం జరిగిందని విమర్శించారు. మజ్లిస్ పార్టీ వత్తిడి మేరకు, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజేంద్ర నగర్, మహేశ్వరం వంటి ప్రాంతాల్లోని మజ్లిస్ అధిపత్యం ఉన్న ప్రాంతాలను కోర్ జిహెచ్ఎంసిలో చేర్చారని వారు విమర్శించారు. దేశ వ్యాప్తంగా జనగణన చేపట్టినందున గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నుంచి 2027 వరకు జిల్లాల, వారుడల విభజన చేయరాదని జనభా లెక్కల డైరెక్టర్ ఇదివరకే నోటిఫికేషన్ విడుదల చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, ఇతర నాయకులు తూళ్ళ వీరేందర్ గౌడ్, వెంకట్ రెడ్డి, సునీతా రెడ్డి, రవి నాయక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ గీతానికి ముందు వందేమాతరం తప్పనిసరి కొత్త ప్రొటోకాల్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరి వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి వందేమాతరం, జనగణమన ఆలపించేటప్పుడు అంతరాయం కలిగిస్తే మూడేళ్ల జైలుశిక్ష నాడు నెహ్రూ తొలగించిన భాగాలను కలిపి ఆరు చరణాల మాతృకను పాడాలని నిర్దేశం న్యూఢిల్లీ : జాతీయ గీతం వందేమాతరం ఆలాపనపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజాగా కీలక మార్గదర్శకాలు వెలువరించింది. వందేమాతరం ఆవిర్భావం జరిగి 150 సంవత్సరాలు అయిన నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి సారధ్య ఎన్డిఎ ప్రభుత్వం వందేమాతరానికి విశేష ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. ఏడాది పాటు ఈ 150 ఏండ్ల వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇకపై బెంగాలీ కవి బంకిం చంద్ర ఛటోపాధ్యాయ విరచిత వందేమాతరం తప్పనిసరిగా పూర్తి ఆరుచరణాలతో కూడిన మాతృకను ఆలాపించాల్సి ఉంటుంది. ఇక మరో జాతీయ ప్రార్థనా గీతం అయిన జనగణమన , వందేమాతరం రెండూ పాడినప్పుడు ముందుగా వందేమాతరం ఆలాపించాల్సిందే అని హోం మంత్రిత్వశాఖ బుధవారం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. జనవరి 28వ తేదీన రూపొందించిన ఉత్తర్వులను ఇప్పుడు వెలువరించారు. మొత్తం 3 నిమిషాల పది సెకండ్ల నిడివి ఉండే వందేమాతరం నిజ భాగాన్ని మొత్తం ఆరు చరణాలతో కూడుకుని ఉన్న గీతాన్నే పాడాల్సి ఉంటుంది. ఈ నిర్థిష్ట నిబందనను పాటించి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. వందేమాతరంలోని చివరి నాలుగు చరణాలను అప్పట్లో నెహ్రూ ప్రభుత్వం దేశ లౌకిక వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని తొలిగించింది. అయితే ఇప్పుడు మొత్తం ఆరు చరణాల వందేమాతరం గీతాన్ని అధికారిక మూల మాతృకగా నిర్థారించడం జరిగింది. ఈ పూర్తి స్థాయి జాతీయ గీతాన్ని ఎప్పుడూ వెలువరించినా విన్పించాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు , రాష్ట్రపతి ప్రవేశానికి ముందు, త్రివర్ణ పతాకం ఎగురవేత, గవర్నర్ల ప్రసంగాల నేపథ్యంలో ఈ మొత్తం ఆరు చరణాల జాతీయ గీతాన్ని ఆలాపించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. జాతీయ గీతాలాపన దశలో తప్పనిసరిగా అంతా లేచి నిలబడి ఉండాలనే నిబంధనను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే సినిమా హాళ్లలో జాతీయ గీతం విన్పిస్తే ప్రేక్షకులు లేచి నిలబడాల్సిన అవసరం లేదు. సినిమా ప్రదర్శనకు అంతరాయం ఏర్పడటం లేదా గందరగోళానికి దారితీయడం జరుగుతుంది. దీని వల్ల గౌరవం కన్నా ఇతర సమస్యలు వస్తాయని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. జనగణమన, వందేమాతరం ఆలపించే సమయంలో ఎవరైనా అంతరాయం కలిగిస్తే మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. విద్యాసంస్థలు ప్రత్యేకించి స్కూళ్లు వందేమాతరంతోనే ఆరంభం కావాల్సి ఉంటుంది. వందేమాతరం మాతృకను జాతీయ జెండా ఎగురవేసేప్పుడు, అధికారిక సాంస్కృతిక ప్రదర్శనలప్పుడు , లేదా ప్రభుత్వ ఉత్సవాలప్పుడు , కవాతులప్పుడు ఆలాపించాల్సి ఉంటుంది. బహిరంగంగా జాతీయ గీతం ఆలాపించినప్పుడు అది అందరికీ విన్పించేలా తగు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి జాతీయ గీతం ప్రతిని అవసరం అయిన వారికి కరపత్రాల ద్వారా అందించాల్సి ఉంటుంది. ప్రతిసారి జాతీయ గీతాన్ని సంగీత వాయిద్యాల సాయంతో విన్పించాల్సిన అవసరం లేదు. సామూహిక రీతిలో జాతీయ గీతాలాపన దశలో అంతా తప్పనిసరిగా సరైన పద్ధతులు పాటించాల్సిందే. జాతీయ గీతం వందేమాతరం, జాతీయ ప్రార్థనా గీతం జనగణమన ఆలాపన లేదా విన్పించడానికి సంబందించి విద్యాసంస్థలు తగు ఏర్పాట్లు చేసుకుని తీరాలి. అదే విధంగా జాతీయ జెండా పట్ల కూడా సరైన గౌరవం ఏర్పడేలా చర్యలు తప్పనిసరిగా ఉండాల్సిందే. 1950 జనవరి 24వ తేదీన అప్పటి రాజ్యాంగ అసెంబ్లీలో జనగణమన పదాల, సంగీత రూపకల్పన ప్రతిని జాతీయ ప్రార్థనా గీతంగా ఖరారు చేశారు. ఇక వందేమాతరం గీతం భారత స్వాతంత్య్రోద్యమంలో చారిత్రక పాత్ర పోషించినందున ఈ గీతానికి కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. వందేమాతరం, జనగనమణలకు సమాన గౌరవం కల్పించారు.
తొలి విడతగా 50 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం నోటిఫికేషన్ జారీ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవానికి ముందడుగు పడింది. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించా లని నిర్ణయించింది. అందులో భాగంగా మూసీరివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం నోటిఫికేషన్ను జారీ చేసింది. అందులో భాగంగా తొలి విడతగా 50 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని గోల్కొండ, గండిపేట మండలాల పరిధిలో సుమారు 50 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం సేకరించనుంది. సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితాను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఫేజ్ ఏ1 కింద హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్ ఏ1 కింద హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ ఏ2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో అధికారులు భూసేకరణను చేపట్టనున్నారు. భూములను కోల్పోతున్న యజమానులకు ప్రభుత్వం భరోసా ఇచ్చిం ది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా భూ యజమానులకు తగిన నష్టపరిహారం చెల్లించనున్న ట్లుగా స్పష్టం చేసింది. అయితే, ఈ భూసేకరణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, నిర్ణీత గడువులోగా సంబంధిత అధికా రులకు లిఖితపూర్వకంగా సమర్పించాలని ఈ నోటిఫికేషన్లో ప్రభుత్వం సూచించింది. ఆయా యజమానులు తమ హక్కుల పత్రాలు (పట్టాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు) నిర్దేశిత సమయంలో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వే నంబర్లు, గ్రామాల వారీ గా పూర్తి జాబితాను కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ 2013 ప్రకారం ఈ భూసేకరణ ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి. గండిపేట నుంచి గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 14 మండలాలు, 46 గ్రామాల పరిధిలో దశలవారీగా ప్రభుత్వం ఈ అభివృద్ధి పనులు చేపట్టనుంది. మూసీ నది శుద్ధీకరణతో పాటు, ఇరువైపులా పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలు, అంతర్జా తీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. భూసేక రణ ప్రక్రియ వేగవంతం కావడంతో త్వరలోనే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రాథమిక కీలో 17 ప్రశ్నల్లో తప్పులు ఎన్ని బోనస్ మార్కులు కలుస్తాయో అని విద్యార్థుల్లో ఉత్కంఠ మనతెలంగాణ/హైదరాబాద్ : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ ఫలితాలు 16న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) జెఇఇ మెయిన్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేసింది. ఉదయం తుది కీ, సాయంత్రం ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల జెఇఇ మెయిన్ పేపర్-1 ప్రాథమిక కీ, విద్యార్థుల రెస్పాన్స్ షీట్ను ఎన్టిఎ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కీపై అభ్యంతరాలు స్వీకరించగా, తుది కీ ని విడుదల చేయనున్నారు. కాగా, ఇటీవల విడుదలైన జెఇఇ మెయిన్ ప్రాథమిక కీలో దాదాపు 17 ప్రశ్నల్లో తప్పులు ఉన్నట్లు ప్రముఖ కోచింగ్ సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తుది కీపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. తుది కీలో ఎన్ని ప్రశ్నలు తొలగించి బోనస్ మార్కులు కలిసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జెఇఇ మెయిన్ తుది విడత పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మున్సిపోల్స్ లో కాంగ్రెస్ పార్టీదే హవా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు ఏడు కార్పొరేషన్లలో ఐదు కాంగ్రెస్, రెండింటిలో బీజేపీ 166 మున్సిపాల్టీలలో 70 శాతం కాంగ్రెస్కే కార్పొరేషన్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మున్సిపాల్టీలలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ 70 శాతం కైవసం చేసుకోనున్న కాంగ్రెస్ పోలైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటినట్టు ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తన అంచనాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన హవా చాటుకున్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే పేర్కొంది. మొత్తంగా చూస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన పట్టును మరింత బిగించగా, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ పార్టీకి బీజేపీ గట్టి పోటి ఇవ్వగా, మున్సిపాల్టీలలో మాత్రం ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటి ఇచ్చినట్టు పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఎన్నికలు నిర్వహించిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో నల్లగొండ, మహబుబ్ నగర్, మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం కార్పొరేషన్లను కాంగ్రెస్, కరీంనగర్, నిజమాబాద్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని పీపుల్స్ సర్వే అంచనా వేసింది. అయితే ఈ ఏడు కార్పొరేషన్లలో ఎక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎ స్ గెలిచే అవకాశం లేదని కూడా పీపుల్స్ పల్స్ సర్వే తేల్చి చెప్పింది. కాగా నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషించబోతుందని పేర్కొంది. రామగుండంలో కాంగ్రెస్ 30---34, బీఆర్ఎస్ 16---20, బీజేపీ 3---6, ఇతరులు 4--7 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాల ప్రకారం& మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ 26---30, బీఆర్ఎస్ 18--22, బీజేపీ 6-8, ఎంఐఎం 2--4, ఇతరులు 0-1 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. నల్లగొండలో కాంగ్రెస్ 21--26, బీఆర్ఎస్ 8--12, బీజేపీ 6--10, ఎంఐఎం 2--4, ఇతరులు 1--2 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. మంచిర్యాలలో కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8--12, బీజేపీ 6--9, ఇతరులు 1---2 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ 28--34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14--16, ఇతరులు 2--4 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. కాగా నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ 26--31, కాంగ్రెస్ 10--16, బీఆర్ఎస్ 2--4, ఎంఐఎం 8--12, ఇతరులు 1--2 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. అలాగే కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ 24--29, కాంగ్రెస్ 14--16, బీఆర్ఎస్ 10--12, ఎంఐఎం 6--9, ఇతరులు 1--3 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. మున్సిపాల్టీలలోనూ కాంగ్రెస్దే హవా రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికలలో అధికారం కాంగ్రెస్ పార్టీ 68--76 మున్సిపాల్టీలను, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 29----36 మున్సిపాలిటీలను, బీజేపీ 3-5,ఎంఐఎం 0-1 గెలుచుకునే అవకాశం ఉన్నట్టు పీపుల్స్ పల్స్ తన సర్వే లో పేర్కొంది.కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది.
ఎన్నికల్లో హస్తం హవా కొనసాగింది: టిపిసిసి చీఫ్
మన తెలంగాణ/హైదరాబాద్ః మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ (హస్తం గుర్తు) హవా కొనసాగిందని, పట్టణ ప్రాంత ఓటర్లు తమకు పట్టం కట్టారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తొంబై శాతం మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లనూ కైవసం చేసుకోబోతున్నామని మహేష్ కుమార్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాపాలన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టణ ఓటర్లు పట్టం కట్టారని ఆయన తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శక పరిపాలన, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండడడం వల్ల ప్రజలు తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేశారని ఆయన వివరించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, తాగు నీటి సదుపాయాలు, పారిశుద్ధ వ్యవస్థ మెరుగుదలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు తమ పార్టీపై ఉంచిన విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతగా పని చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలు ఇచ్చిన ఈ మద్దతు తమ బాధ్యతను మరింత పెంచిందని, ప్రతి మున్సిపాలిటి, ప్రతి కార్పొరేషన్లో పారదర్శకంగా ప్రజాల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ప్రజలు విశ్వసించలేదని ఆయన తెలిపారు.
ఏఐసిసి అగ్రనేతలతో భేటీ కానున్న సిఎం మల్లికార్జున ఖర్గేకు తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల సరళిపై ముఖ్యమంత్రి నివేదిక నేడు కేంద్రమంత్రులను కలిసే అవకాశం మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నాం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏఐసిసి అగ్రనేతలతో ఆయన భేటీ కానున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన పర్యటన హాట్ టాపిక్గా మారింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజే సిఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లడం అటు కాంగ్రెస్ పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. బుధవారం రాత్రి 7 గంటలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మల్లికార్జున ఖర్గేకు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల సరళిపై సిఎం రేవంత్రెడ్డి నివేదిక అందజేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా కేబినెట్ విస్తరణపై కూడా మరోసారి చర్చించినట్టుగా సమాచారం. దీంతోపాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులపై కూడా అగ్రనేతలతో సిఎం మాట్లాడినట్టుగా తెలిసింది. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో గురువారం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన పెం డింగ్ నిధులు, కృష్ణా, గోదావరి నీటి మళ్లీంపు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అందులో భాగంగా రైల్వే, ఎరువులు, రసాయనాలు, జలవనరుల శాఖ మంత్రులతో సిఎం భేటీ అయ్యే అవకా శం ఉన్నట్టుగా తెలిసింది. దీంతోపాటు మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం కేంద్రాన్ని నిధులు కోరే అవకాశం ఉందని సమాచారం. కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సిఎం బుధవారం ఉదయం సిఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆయన స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధ మని, పట్టణాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు సిఎం పర్యటన నేపథ్యంలో కొడంగల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీ పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.
ప్రశాంతంగా ముగిసిన మున్సి‘పోల్స్’ వెల్లివిరిసిన ఓటరు చైతన్యం 72.63 శాతం పొలింగ్ నమోదు 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం, 7 కార్పోరేషన్లలో 73.01 శాతం పోలింగ్ మున్సిపాలిటీల్లో చౌటుప్పల్లో అత్యధికంగా 91.91 శాతం, అత్యల్పంగా నందికొండూరులో 59.68 శాతం పోలింగ్ నమోదు నాలుగు మున్సిపాలిటీల్లో 90 శాతానికి పోలింగ్ కార్పోరేషన్లలో నల్గొండలో అత్యధికంగా 77.36 శాతం నిజామాబాద్లో అత్యల్పంగా 59.12 శాతం పోలింగ్ ఉదయం మండపొడిగా సాగి, మధ్యాహ్నం తర్వాత పుంజుకున్న ఓటింగ్ వెబ్ కాస్టింగ్ అమలు చేస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన సిఇఒ సమస్యాత్మక ప్రాంతాల్లో జరుగుతున్న నేరుగా వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ను సమీక్షించిన డిజిపి బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం..రేపు ఓట్ల లెక్కింపు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. 116 మున్సిపాల్టీలు, 7 కార్పోరేషన్లలోని 2,981 వార్డుల్లో బుధవారం పోలింగ్ నిర్వహించగా అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. నాయకులు, యువత, వృద్ధులు, మహిళలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 72.63 శాతం పొలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం పోలింగ్ నమోదు కాగా, 7 కార్పోరేషన్లలో 73.01 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో అత్యధికంగా చౌటుప్పల్లో 91.91 శాతం పోలింగ్ నమోదు కాగా, నందికొండూరులో అత్యల్పంగా 59.68 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు మున్సిపాటీలు చౌటుప్పల్, చండూరు, జిన్నారం, పోచంపల్లిలో 90 శాతానికి పోలింగ్ నమోదినట్లు ఎస్ఇసి వెల్లడించింది. అలాగే ఏడు కార్పోరేషన్లలో నల్గొండలో అత్యధికంగా 77.36 శాతం పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్లో అత్యల్పంగా 59.12 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం ఆ తర్వాత పుంజుకుంది. పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ నిర్ణయాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాల్టీలు 2,582 వార్డుల్లో కౌన్సిలర్ల ఎన్నిక కోసం ఓటింగ్ నిర్వహించారు. ఇప్పటికే తొమ్మిది మున్సిపాలిటీల్లో 12 వార్డుల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్ మున్సిపాల్టీలోని ఆరో వార్డులో బిజెపి అభ్యర్థి మహదేవప్ప బలవన్మరణానికి పాల్పడటంతో అక్కడ ఎన్నిక నిర్వహించలేదు. అన్ని మున్సిపాల్టీల్లో కలిపి 10,719 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 116 మున్సిపాలిటీలలో 6,017 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 7 కార్పోరేషన్లలో 21,174 పొలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు రాష్ట్రంలోని 7 కార్పోరేషన్లకు ఎన్నికలను నిర్వహించారు. మొత్తం 414 వార్డులకు గాను రెండుచోట్ల ఏకగ్రీవం కావడంతో 412 డివిజన్లలో ఎన్నికల కోసం 21,174 పొలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్నగర్, కొత్తగూడెం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లలో 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 410, బిఆర్ఎస్ 401, బిజెపి 382 అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆమ్ఆద్మీ పార్టీ 12, బిఎస్పి 44, సిపిఎం 10, ఎంఐఎం 62, ఫార్వర్డ్ బ్లాక్ 122, సిపిఐ 65, జనసేన 81, ఇతర పార్టీలు 55 స్థానాల్లో పోటీ చేయగా 578 మంది స్వతంత్ర బరిలో నిలిచారు. మహబూబ్నగర్, రామగుండం కార్పోరేషన్లలోని ఒక్కో వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. మున్సిపాల్టీలు, కార్పోరేషన్లలో కలిపి 52,17,413 మంది ఓటర్లు ఉండగా, 45 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఓటింగ్ పర్యవేక్షణ రాష్ట్రంలోని 8,191 పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోలింగ్ పూర్తి కావడంతో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు 137 స్ట్రాంగ్ రూంలు సిద్ధం చేశారు. ఎక్కడైనా రీ పోలింగ్ అవసరమైతే గురువారం నిర్వహించనున్నట్లుగా తెలిసింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఈనెల 16వ తేదీన మున్సిపాల్టీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఎస్ఇసి రాణి కుముదనితో సిఇఒ సుదర్శన్ రెడ్డి భేటీ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను అధికారులతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెబ్ కాసింగ్ ద్వారా పర్యవేక్షించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఇసి రాణి కుముదనితో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సిఇఒ) సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సాంకేతికత వినియోగంపై చర్చించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో 100 శాతం వెబ్ కాస్టింగ్ అమలు చేస్తున్న విధానాన్ని సిఇఒ ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి కదలికను జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారా... లేదా..? అని సిఇఒ సుదర్శన్ రెడ్డి, రాణి కుముదినిని అడిగి తెలుసుకున్నారు. వెబ్ కాస్టింగ్తో రిగ్గింగ్, దొంగ ఓట్లు వంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని సిఇఒ పేర్కొన్నారు. మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం: డిజిపి బి.శివధర్ రెడ్డి రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ బి.శివధర్ రెడ్డి తెలిపారు. డిజిపి తన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి శాంతిభద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా పర్యవేక్షించారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్ను వెబ్కాస్టింగ్ ద్వారా నేరుగా వీక్షిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు జారీ చేశారు. అనంతరం ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిజిపి మీడియతో మాట్లాడారు. వెబ్కాస్టింగ్ విధానం ద్వారా రాష్ట్రంలోని పోలింగ్ స్టేషన్ల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలిగిందని చెప్పారు. ఈ కెమెరాల నిఘా కారణంగాను, పోలీస్ సిబ్బంది బందోబస్తు వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అదుపులో ఉన్నాయని అన్నారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంలో పోలీసు సిబ్బంది అంకితభావంతో పాటు ఈ ఆధునిక వెబ్కాస్టింగ్ సాంకేతికత ఎంతగానో తోడ్పడిందని ప్రశంసించారు. ఈ ఎన్నికల కోసం అత్యంత పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్లను కవర్ చేస్తూ భారీ ఎత్తున భద్రతను కల్పించామన్నారు. వీటిలో 1,302 అత్యంత సమస్యాత్మక, 1,926 సమస్యాత్మక, 4,975 సాధారణ కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల తీవ్రతను బట్టి బలగాలను మోహరించినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖతో పాటు ఇతర విభాగాల నుంచి సుమారు 3,000 మంది అదనపు బలగాలను రప్పించామని, ఇందులో టిజిఎస్పి, ఫారెస్ట్, ఎక్సైజ్, సిఐడి,లీగల్ మెట్రాలజీ విభాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం లోపల, అత్యంత సమస్యాత్మక కేంద్రాల వెలుపల వంద శాతం వెబ్కాస్టింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత సాధ్యమైందని డిజిపి వెల్లడించారు. వృద్ధులు ఓట్లు వేసేలా పోలీసుల సహాయం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వృద్ధులు ఓట్లు వేసేందుకు పోలీస్ సిబ్బంది సహాయం చేశారు. నిజామాబాదులో సిపి పి.సాయి చైతన్య, నల్గొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్, వనపర్తి జిల్లా ఎస్పి సునీత రెడ్డి, పెద్దపెల్లి డిసిపి బి రామ్ రెడ్డి వృద్ధ ఓటర్లను, వికలాంగులను వీల్ చైర్లో పంపించారు. ములుగు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న నాలుగో బెటాలియన్ సిబ్బంది మూర్చ వచ్చి పడిపోయిన ఓటరుకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా అక్కడ ఉన్న వృద్ధ ఓటర్లను పోలింగ్ కేంద్రంకు తీసుకువెళ్లి ఓట్లు వేసేలా సహాయపడ్డారు.సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండల పరిధికి చెందిన రాలకత్వలో వృద్ధులను ఆటోలు తీసుకువెళ్లి ఓట్లు వేసేలా తోడ్పాటు అందించారు. మహబూబాబాద్ జిల్లాలో ఓటర్ల పసిపిల్లలను వారు ఓటేసి వచ్చే వరకు శ్రద్ధగా పోలీస్ సిబ్బంది చూశారు. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 13వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఆ రోజే నగర, పట్టణ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపిందనే ఉత్కంఠకు తెరపడనున్నది. ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా హోరాహోరీ ప్రచార పర్వం నిర్వహించాయి. ఆయా పార్టీల ముఖ్యనేతల విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారం హోరెత్తిపోయింది. పార్టీల వ్యూహాలు, హామీలు, ప్రచార సరళిని అంతా గమనించిన ఓటర్లు అభ్యర్థుల భవిష్యత్ను ఓటు రూపంలో బ్యాలెట్ బాక్కుల్లో నిక్షిప్తం చేశారు.
సింహాసనం కోసం సవాల్.. స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో
12thFeb2026 |గురువారం, నేటి పంచాంగం: రాశి ఫలితాలు &దైవారాధన విశేషాలు
12thFeb2026 | గురువారం, నేటి పంచాంగం: రాశి ఫలితాలు & దైవారాధన విశేషాలు
గురువారం రాశి ఫలాలు (12-02-2026)
మేషం చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద వహించాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు పనిచేయదు. వృషభం దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యవిషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. మిధునం నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కర్కాటకం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను అందుకుంటాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సింహం ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగాల విషయంలో శుభవార్తలు అందుతాయి. కన్య చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. తుల వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి. వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు. సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంతాల మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. వృశ్చికం భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది. ధనస్సు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు. విందు వినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. మకరం ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుంభం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీనం వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెడతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
శ్రీశైలం నడకదారిలో పెద్దపులి కలకలం..
మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రీశైలం నడకదారిలో పెద్దపులి కలకలం రేపింది. మల్లన్న భక్తులను భయకంపితులను చేసింది. నల్లమల అటవీ మార్గంలో వారికి ఏకంగా ఓ పెద్దపులి ఎదురుపడింది. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం పరిధిలోని పెద్దచెరువు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలానికి కాలినడకన వెళుతున్న భక్తుల బృందానికి దారి పక్కన పొదల్లో పెద్దపులి కనిపించింది. కొద్దిసేపు భక్తులను తీక్షణంగా చూస్తూ అక్కడే నిలబడింది. అటవీశాఖ అధికారుల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉన్న భక్తులు, భయంతో పరుగులు తీయకుండా నిల్చుండిపోయారు. ఇరువైపులా నిశ్శబ్దం నెలకొనగా, క్షణక్షణం ఉత్కంఠగా గడిచిం ది. కొంతసేపటికి ఆ పులి నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘శ్రీశైలం మల్లన్నే కాపాడాడు’, ‘ఓం నమశ్శి వాయ’ అంటూ భక్తితో నినాదాలు చేస్తూ తమ యాత్రను కొనసాగించారు. ఈ ఘటనను ఓ వాహనదారుడు తన సెల్ఫోన్లో వీడియో తీశారు. అన్నదాన శిబిరానికి సరుకులు తీసుకెళుతున్న ఆయన, ఈ వీడియోను ఇతర యాత్రికులకు చూపించి వారిని అప్రమత్తం చేశారు.నల్లమల అడవి గుండా వెళ్లే యాత్రికులు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా ప్రయాణించవద్దని అటవీ అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో పులుల సంచా రం సాధారణమే అయినప్పటికీ, ఇలా యాత్రికులకు ముఖాముఖి ఎదురుపడటం ఆందోళన కలిగించే పరిణామమే. అయితే, మల్లికార్జున స్వామి దయవల్లే తమకు ఎలాంటి హాని జరగలేదని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఊపిరి పీల్చుకున్నారు.
దేశవ్యాప్త నిరసనలకు కార్మికులు, కర్షకులు సిద్ధం . హక్కుల పరిరక్షణకు ఐక్యపోరు. వామపక్షాలు, బ్యాంకు ఉద్యోగులు, ప్రజా సంఘాల మద్దతు న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా సమ్మెకు సమాయత్తమయ్యారు. పోరాడి […] The post నేడు సార్వత్రిక సమ్మె appeared first on Visalaandhra .
గులాబీ సైనికుల పోరాట స్ఫూర్తి.. పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది
మనతెలంగాణ/హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు గురిచేసినా మొక్కవోని దీక్షతో వీరోచితంగా పోరాడిన బిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు పురపాలక సమరంలో గులాబీ సైనికులు కనబరిచిన పోరాట స్ఫూర్తి పార్టీకి కొండంత బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. గత రెండేళ్ల పాలనలో ఘోరమైన వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో దౌర్జన్యకాండకు దిగారని విమర్శించారు. ఈ మేరకు బుధవారం కెటిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే రేవంత్ రెడ్డి అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అక్రమంగా లూటీ చేసిన వేల కోట్ల ప్రజాధనంతో ప్రజాతీర్పునే మార్చాలని చూస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని బిఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపులకు, దాడులకు రేవంత్ రెడ్డి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలను, పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం ముఖ్యమంత్రిని ప్రతినిత్యం వెంటాడుతుందని అన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన బిఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కెటిఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కుట్రలు ప్రజల తీర్పును ప్రభావితం చేయలేవు : హరీష్రావు ముఖ్యమంత్రి మొదలుకొని..మంత్రులు, ఎంఎల్ఎలు, కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్ వరకూ కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించడమే గాక, వారిపై భౌతిక దాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని సైతం లెక్కచేయకుండా.. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయం అని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, దుష్ట పన్నాగాలు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవు అని తెలిపారు. అధికార పార్టీ ఆకృత్యాలకు అదరకుండా, బెదరకుండా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇన్చార్జ్లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్ఎస్పై విశ్వాసంతో తమ అమూల్యమైన ఓటు వేసిన ప్రతి ఓటరుకు హరీష్రావు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
. 2028 నాటికి దేశంలోనే అత్యుత్తమ అసెంబ్లీ భవనం. ఏప్రిల్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహప్రవేశం. శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు విశాలాంధ్ర`సచివాలయం : ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో సరికొత్త సాంకేతిక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. శాసన సభ గౌరవాన్ని పెంచుతూ, అత్యాధునిక సౌకర్యాలతో సభను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శాసన సభ చరిత్రలో తొలిసారిగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స’ సాంకేతికతతో సభ్యుల హాజరును నమోదు […] The post ఏపీ అసెంబ్లీలో‘ఏఐ’ హాజరు appeared first on Visalaandhra .
భారత మాతను మోదీ సర్కార్అమ్మేసింది
. గంపగుత్తగా అమెరికాకు అప్పగించారు. వాణిజ్య ఒప్పందం వల్ల వారికే మేలు. దేశ ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలకు తీవ్ర ముప్పు. లోక్సభలో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ. దేశాన్ని అమ్ముతున్నందుకు ‘సిగ్గుగా లేదా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు న్యూదిల్లీ: భారత్అ-మెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మోదీసర్కారుపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇది “భారత్ మాతను అమ్మడం” లాంటిదని, భారతదేశ ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలను దెబ్బతీయడానికి […] The post భారత మాతను మోదీ సర్కార్అమ్మేసింది appeared first on Visalaandhra .
సార్వత్రిక సమ్మె జయప్రదం చేద్దాం: డి.రాజా పిలుపు న్యూదిల్లీ: కార్మికులకు, రైతులకు, ఉద్యోగులకు వ్యతిరేకమైన విధానాలతో ముందుకెళుతున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ఐక్యంగా పోరాటాలు అవసరమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సూచించారు. చారిత్రక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కుల పరిరక్షణకు ఉక్కు సంకల్పంతో కదం తొక్కాలన్నారు. నాలుగు లేబర్ కోడ్లు, అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఈనెల 12న అనగా గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామంటూ డి.రాజా బుధవారం సామాజిక మాధ్యమం […] The post సర్కారు మెడలువంచుదాం appeared first on Visalaandhra .
మెడికల్, ఫార్మా మాఫియాపై 14న సీపీఐ ఆందోళనలు
. ఫార్మా నిరుద్యోగుల ఉపాధికి గండి. డ్రగ్స్ కంట్రోల్ విభాగంలో భారీ అవినీతి. నేటి సార్వత్రిక సమ్మెకు మద్దతు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్, ఫార్మా రంగాల్లో నెలకొన్న మాఫియా ధోరణులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 న సీపీఐ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రజలు, మెడికల్ […] The post మెడికల్, ఫార్మా మాఫియాపై 14న సీపీఐ ఆందోళనలు appeared first on Visalaandhra .
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరయింది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు… ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి… ఈ బెయిల్తో గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అంబటికి బెయిల్ రావడంతో గుంటూరులోని ఆయన నివాసం వద్ద […] The post అంబటికి బెయిల్ appeared first on Visalaandhra .
మావోయిస్టుల పేరుతో మంత్రులకు బెదిరింపులు
అవి నిజమైనవి కాకపోవచ్చన్న మంత్రి దుర్గేశ్ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. ఈ లేఖలు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులకు రావడం గమనార్హం. టీడీపీకి చెందిన అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, జనసేనకు చెందిన కందుల దుర్గేశ్, బీజేపీకి చెందిన సత్యకుమార్లకు ఈ లేఖలు అందినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ లేఖలు బయటకు […] The post మావోయిస్టుల పేరుతో మంత్రులకు బెదిరింపులు appeared first on Visalaandhra .
ట్రంప్ గుప్పిట్లో మోడీ విలవిల: రాహుల్ గాంధీ
సర్కారు దేశాన్ని హోల్సేల్గా అమ్మేసింది వాణిజ్య ఒప్పందంపై రాహుల్ భీకర దాడి వ్యవసాయ రంగానికి, ఇంధన రంగానికి ముప్పు బిజెపి ఆర్థిక వనరుల రక్షణకు మోడీ సరెండర్ ఈ డీల్ను ఏ ముఖంతో సమర్ధించుకుంటారు? న్యూఢిల్లీ : అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశాన్ని తాకట్టు పెట్టిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అత్యంత కీలకమైన ఒప్పందం , పైగా మధ్యంతర డీల్గా కుదుర్చుకున్నారని . ఇది పూర్తిగా దేశాన్ని హోల్సేల్గా అమెరికాకు సరెండర్ చేయడమే అని లోక్సభలో బడ్జెట్పై చర్చలొ పాల్గొంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ ఆయువుపట్టు వంటి ఇంధన భద్రతను తీసుకువెళ్లి అమెరికాకు ధారాదత్తం చేశారు. మన రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టారని మండిపడ్డారు. గొంతు నులిమినట్లుగా చేయడం తప్పితే మరో పరిస్థితుల్లో మోడీతో పాటు దేశ ఏ ప్రధాని కూడా ఇటువంటి ఒప్పందానికి తలొగ్గబోరని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ గొంతు అమెరికా గుప్పిట్లో ఉంది. అందుకే ఆయన భయానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని అర్థం అవుతోందని రాహుల్ తెలిపారు. బడ్జెట్పై తమ ప్రసంగాన్నిఆయన ఆద్యంతం మోడీ సర్కారుపై తీవ్ర స్థాయి ఆరోపణలతో కొనసాగించారు. మల్లయుద్ధం పట్టు టైప్లో ట్రంప్ ఇదంతా కూడా మల్లయుద్ధం స్థాయిలో జరిగింది. సాధారణంగా కుస్తీపోటీలో వస్తాదులు ముందుగా ప్రత్యర్థి పై పట్టు సాధిస్తారు. తరువాత వడిసిపట్టుకుని, జారిపోకుండా మెడ పట్టుకుంటారని , ఇప్పుడు ఇదే జరిగిందని వ్యాఖ్యానించారు. శక్తివంతుడు గుప్పిట్లో చిక్కి ప్రత్యర్థి విలవిలలాడుతాడని తెలిపారు. యుద్థాల శకం ముగిసిందని తరచూ ప్రధాని మోడీ, ఎన్ఎస్ఎ అధినేత అజిత్ దోవల్ చెపుతుంటారు. అయితే ఇప్పుడు యుద్థాల శకం లోకి మనం కూరుకుపొయ్యాం. ఉక్రెయిన్తో యుద్ధం సాగుతోంది. గాజాలో ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. మిడిలిస్టు చల్లారడం లేదు. ఇరాన్లో యుద్ధ వాతావరణం ఉంది. ఇక మన విషయానికి వస్తే ఆపరేషన్ సిందూర గురించి తెలిసిందే అని వ్యాఖ్యానించారు. ముందుగా ప్రభుత్వం మన ప్రజలను రక్షించుకోవాల్సి ఉంటుంది. మన డాటా, ఆహార సరఫరా వ్యవస్థ, ఇంధన వ్యవస్థల విషయంలో రాజీకి అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి వచ్చి ఉంటే ఈ హయాంలో ట్రేడ్ డీల్ మంతనాలు జరిగితే తాము తప్పనిసరిగా ప్రెసిడెంట్ ట్రంప్తో ఇండియా సమానపక్షం అని చెప్పి ఉండేదని అన్నారు. ఇండియన్ డాటా అనేది మనకు కీలకం, భారత్ను సమాన స్థాయిలో పరిగణించి చర్చలకు దిగాల్సి ఉంటుందని ట్రంప్తో చెప్పి ఉండేవారమని అన్నారు. నిఘా ఎప్పటికప్పుడు దగా వారు మనను ఎప్పుడూ పర్యవేక్షిస్తుంటారు. వారికి నచ్చని వారి నుంచి కొనుగోళ్లకు దిగితే అప్పుడు వారు మనపై ఏకంగా 50 శాతం సుంకాలను విధిస్తారని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ, మన ఇంధన రంగం మనకే ఎదురుతిరిగేలా చేసే విధంగా ఇప్పటి ఒప్పందం ఖరారు అయిందని రాహుల్ చెప్పారు. ఈ ఒప్పందాన్ని ఈ సభకు వచ్చి ఏ విధంగా సమర్థించుకుంటారు? మనం త్యాగం చేస్తున్నదానికి సిగ్గన్పించడం లేదా అని మోడీ సర్కారుపై రాహుల్ ఘాటుగా విరుచుకుపడ్డారు. భారత మాతను అమెరికా వీధుల్లో అమ్మినందుకు నామోషీగా లేదా అని ప్రశ్నించారు. రాహుల్ ప్రసంగిస్తున్నప్పుడు పలుసార్లు అధికార పక్ష ఎంపీలు లేచి ఆయనను అడ్డుకునేందుకు యత్నించారు. నిరాధార ఆరోపణలతో ప్రసంగం సాగదీస్తున్నారని విమర్శించారు. గాలి ఆరోపణలు కాదు, వాటిని నిరూపించుకోవల్సి ఉందన్నారు. మన చేజేతులా రోడ్డున పడుతున్నాం ఇప్పుడు మనం సంక్షుభిత కాలంలోకి వెళ్లుతున్నాం.మన కీలక డాటా అమ్ముడుపోయింది. రైతులను నడిబజార్లో నిలిపారు. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అమ్మేశారు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను బజారుకు ఈడ్డారు. మన బలగాలను, మన ఇంధన వనరులను గాలికి వదిలిపెట్టారని వ్యాఖ్యానించారు. డాటా స్థానికతను ఎత్తివేయడంతో ఇకపై తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆరోపించారు. అమెరికా డాటా విచ్చలవిడిగా ఇక్కడికి తరలివస్తుంది. పరిమిత డిజిటల్ టాక్స్, సోర్స్ కోడ్ వెల్లడిని తీసివేయడం వంటివి కీలక లోపాలు. పైగా పెద్ద సాంకేతిక పరిశ్రమల కంపెనీలకు 20 సంవత్సరాల టాక్స్ హాలీడే ఇవ్వడం జరిగిందని రాహుల్ తెలిపారు. ఇక టారీఫ్ల విషయానికి వస్తే తొలుత కేవలం 3 శాతం వరకూ ఉండేది. ఇప్పుడు ఇది అమెరికా నుంచి పలు సాకులతో 18 శాతానికి చేరింది. అమెరికా నుంచి దిగుమతులు ఏకంగా 46 బిలియన్ డాలర్ల నుంచి 146 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతాయి. ఇది చాలా దారుణం అని విమర్శించారు. అమెరికా సరుకులపై టారీఫ్లను ఒప్పందంతో ఇప్పుడు జీరో స్థాయికి తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడిందని రాహుల్ తెలిపారు.
ఆమె మాట తీరు నచ్చకే సుంకాలు పెంచా: ట్రంప్
వాషింగ్టన్: స్విట్జర్లాండ్పై టారిఫ్లు పెంచడం వెనుక విచిత్రమైన కారణాన్ని ట్రంప్ ఓ మీడియా సంస్థ ఇంటర్వూలో వెల్లడించారు. స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలైన కరిన్ కెల్లర్ సట్టర్ సుంకాల గురించి తనతో మాట్లాడిన తీరు నచ్చనందునే సుంకాలు తగ్గించడానికి బదులు 30 శాతం నుంచి 39 శాతానికి పెంచినట్టు అసలు కారణం బయటపెట్టారు. “ స్విట్జర్లాండ్ పై 30 శాతం టారిఫ్లు విధించాను. అసలు ఆ మొత్తం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఆ దేశ ప్రధాని కాల్ చేశారని అనుకున్నాను . కానీ కాల్ చేసింది వేరొకరు. “సర్.. మాది చాలా చిన్నదేశం. ఈ సుంకాలు మేం భరించలేం. ” అని అన్నారు. మీది చిన్నదేశమే అయినా అమెరికాతో జరుపుతున్న వాణిజ్యంలో 42 బిలియన్ డాలర్ల మిగులు ఉందని చెప్పాను. అయినా మాది చిన్నదేశం అంటూ ఆమె పదేపదే అదే మాట చెప్పారు. నాకు ఆమె మాట్లాడిన తీరు నచ్చలేదు. అందుకే 30 శాతం నుంచి 39 శాతానికి పెంచాను. ఎలాంటి సుంకాలు లేకుండా మా దేశానికి స్విస్ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది ” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆ కాల్ చేసింది స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలైన కరిన్కెల్లర్ సట్టర్ అని తెలిసిందని ట్రంప్ అన్నారు.
నరవణె పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్కు నోటీసులు
న్యూఢిల్లీ: భారత మాజీ ఆర్మీ జనరల్ నరవణె రచించిన ‘ ఫోర్స్టార్స్ ఆఫ్ డెస్టినీ ’ పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా (పీఆర్హెచ్ఐ) కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సంస్థ యాజమాన్యం విచారణలో భాగం కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు కొన్ని ప్రశ్నలకు వివరణ అడిగారు. ప్రభుత్వ అనుమతి పొందక ముందే ఈ పుస్తకం బయటకు రావడం వివాదమవుతోంది. ఈ పుస్తకం ప్రచురితం కాలేదని, మార్కెట్లో అందుబాటులో లేదని పీఆర్హెచ్ఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. అధికారికంగా విడుదల చేసి, రిటైల్ వేదికల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన పుస్తకాలనే ప్రచురితమైనవిగా పరిగణిస్తారని వెల్లడించింది. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం ఆ బుక్ను మార్కెట్లో విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?!
ప్రతి ఏడాది ఆరంభంలో పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పుడు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని ఆమోదించడం కూడా పార్లమెంటు సంప్రదాయాలలో ముఖ్యమైందే. కానీ ఈసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చే సవ్యంగా జరగలేదు. ఒక రకంగా చెప్తే అసలు చర్చ జరగనట్టే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ ఆ ప్రసంగ పాఠానికి పరిమితం ఉండాలి అన్న నియమం ఏమీ లేదు. ఏ అంశాన్ని […] The post ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?! appeared first on Visalaandhra .
పశుసంపద అభివృద్ధిలో మానవ వనరుల పాత్ర
డా॥ఓ.నరసింహారావు వ్యవసాయానికి వెన్నెముక రైతు అయితే రైతుకు వెన్నెముక పశు సంపద. అట్టి పశుసంపద మనందరి సంపద. పరిశ్రమలు అభివద్ధి జరగాలంటే విద్యుత్ ఎంత అవసరమో, గ్రామీణాభివద్ధి జరగాలంటే పశు సంపద అభివద్ధి అంతే అవసరం. ఈ సందర్భంగా రాష్ట్ర పశు గణాంకాలను పరిశీలిస్తే, అఖిల భారత 20వ పశుగణన (2019) ప్రకారం 46 లక్షల గోజాతి పశువులు, 62 లక్షల గేదె జాతి పశువులు, 175 లక్షల గొర్రెలు, 55 లక్షల మేకలు, 90 వేల […] The post పశుసంపద అభివృద్ధిలో మానవ వనరుల పాత్ర appeared first on Visalaandhra .
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి సైద్ధాంతిక మూలాల్లోంచి ఉద్భవించని రాజకీయాలు భౌతికవాద దృక్పధంతో, చారిత్రక దృష్టితో, హేతుబద్ధంగా ఆలోచించలేవు అనేది నేటి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనిస్తే ఇట్టే పసిగట్టవచ్చును. మాటల్లో మానవత్వాన్ని నిర్మిస్తామంటూ చేతల్లో ధ్వంసం చేస్తుంటారు. సమిష్టి అభివృద్ధికి శక్తియుక్తుల్ని వినియోగించడం విస్మరించి వ్యక్తి స్వార్థానికి ప్రాధాన్యత యిస్తుంటారు. నీచాతినీచమైన అపోహలకు, ఆగడాలకు, నిందాపూర్వక ప్రకటనలకు కారణభూతులై ఉంటారు. మానవ ఔన్నత్యాన్ని తీర్చిదిద్దడానికి బదులు బద్దలుకొడుతూ మనిషితనానికే మచ్చ తెస్తుంటారు. పాలకపక్షం ప్రతిపక్షం ఎవరికి ఎవరు తీసిపోని […] The post స్వార్థం గుప్పిట్లో రాజకీయం appeared first on Visalaandhra .
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతు సంక్షోభం
బొల్లిముంత సాంబశివరావు భారత-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం పై మోదీ-ట్రంప్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం చారిత్రక ప్రాధాన్యత కలిగిందని ఇద్దరు ప్రకటించారు. ఈ ఒప్పందం వల్ల భారత ఎగుమతులపై సుంకం 50 శాతం నుంచి 18శాతం తగ్గుతుందని, భారతదేశం పెద్దఎత్తున అమెరికాకు ఎగుమతులు చేసి ఆర్థిక ప్రయోజనం పొందుతుందని ప్రధాని ప్రకటించాడు. అమెరికా ఎగుమతుల పై గణనీయంగా సుంకం తగ్గటమే కాకుండా అనేక వస్తువుల పై జీరో సుంకం అమల్లో ఉంటుంది. ట్రంప్ను ఆప్తమిత్రునిగా […] The post భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతు సంక్షోభం appeared first on Visalaandhra .
Poling |భీంగల్ లో 69.78 శాతం పోలింగ్
Poling | భీంగల్ లో 69.78 శాతం పోలింగ్ Poling | భీంగల్
Sez |అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం సీజ్
Sez | అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం సీజ్ Sez | ఎడపల్లి,
Selfie|ఎన్నికల అధికారులతో కలెక్టర్ సెల్ఫీ…
Selfie|ఎన్నికల అధికారులతో కలెక్టర్ సెల్ఫీ… Selfie| ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా
ఏఐ ప్లాన్కు సిద్ధంగా లేకుంటే స్వచ్ఛందంగా నిష్క్రమించవచ్చు: గూగుల్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ)ను విస్తృతంగా వినియోగించుకుంటున్న నేపధ్యంలో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ తన ఉద్యోగులకు ఒక అవకాశం కల్పించింది. కంపెనీ ఏఐ ప్రణాళికలకు సిద్దంగా లేనివారు, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయొచ్చని వెల్లడించింది.ఈ మేరకు వారికి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని కల్పించింది. ఈ సందర్భంగా గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ను ప్రస్తావిస్తూ బిజినెస్ ఇన్సైడర్ కథనం పేర్కొంది. గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ లోని కొందరు ఉద్యోగులకు ఈ ప్యాకేజీ వర్తించనుంది. గూగుల్ లోని ఈ జీబీఓ యూనిట్... సంస్థ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన ప్రకటనలు, గ్లోబల్ రెవెన్యూ గ్రోత్ ( ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ ఆదాయం, అమ్మకాలు )ను పర్యవేక్షిస్తోంది. 2025 ఏడాదికి గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ ఆదాయం 400 బిలియన్ డాలర్లు. 2026 ను మెరుగ్గానే ఆరంభించినప్పటికీ, ఏఐ పరిధి విస్తృతం అవుతోందని, దానిని అందిపుచ్చుకున్న వారినే సంస్థ కోరుకుంటోందని షిండ్లర్ పేర్కొన్నారు. అమెరికాలోని కస్టమర్ సేల్స్ టీమ్స్, కస్టమర్ ఫేసింగ్ పొజిషన్స్ (నేరుగా కస్టమర్లతో సంప్రదింపులు జరిపే)కు ఈ ప్యాకేజీ వర్తించదని పేర్కొన్నారు.
Police |పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు
Police | పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు Police |బెల్లంపల్లి,
Raja Saab Result puts Three Heroines Puzzled
Malavika Mohanan, Niddhi Agerwal and Riddhi Kumar are the leading ladies in Prabhas’ recent release ‘The Raja Saab’. The actresses had to spend ample time on the film and they did not take up any new films waiting for the film’s release. All these three beauties were extremely confident in Raja Saab and they wanted […] The post Raja Saab Result puts Three Heroines Puzzled appeared first on Telugu360 .
generations |ఆదర్శంగా నిలిచిన మూడు తరాలు
generations |ఆదర్శంగా నిలిచిన మూడు తరాలు కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి…శివునిపల్లి 5వ
vote |ఓటేసి సెల్ఫీ దిగిన 8 వ వార్డు సిపిఎం అభ్యర్థి కూరపాటి జయమ్మ రాములు
vote | ఓటేసి సెల్ఫీ దిగిన 8 వ వార్డు సిపిఎం అభ్యర్థి
Poling |స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 84.17 శాతం పోలింగ్
Poling | స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 84.17 శాతం పోలింగ్ సాయంత్రం 5
Dharna | ఓపిఓల ధర్నా.. రెండు పూటల అన్నానికి ఐదువందలా8 వద్దు 13
Polling is over |జనగామలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
Polling is over |జనగామలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ 79.06 శాతం పోలింగ్ఓటు
Sreeleela Is Officially a Doctor Now
Very few are aware that Telugu beauty Sreeleela is pursuing her career in Medicine. The actress takes a break and focuses completely on studies before her examinations. The actress is now officially a Doctor and she graduated from DY Patil University in Mumbai. The pictures from her Convocation Ceremony are going viral all over. Sreeleela […] The post Sreeleela Is Officially a Doctor Now appeared first on Telugu360 .
Anil Ravipudi |నెక్ట్స్ ప్రాజెక్ట్ అసలు నిజం ఇదే..
Anil Ravipudi | నెక్ట్స్ ప్రాజెక్ట్ అసలు నిజం ఇదే.. ఆంధ్రప్రభ వెబ్
viral | ఒళ్ళు బలిసిందా…? యూజ్ లెస్ ఫెలో…కండ్లు నెత్తికెక్కినాయా?దిమాకిట్ల కరాబ్ అయిందా
ముంబై మేయర్గా రీతూ తావ్డే ఏకగ్రీవం..
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్గా బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 40 ఏళ్లలో ఈ ప్రతిష్టాత్మక పదవిని బీజేపీ దక్కించుకోవడం ఇదే మొదటిసారి. శివసేన (యుబిటి) అభ్యర్థిని రంగం లోకి దింపక పోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో బీఎంసీపై గత 25 ఏళ్లుగా సాగుతున్న థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. శివసేన నేత సంజయ్ ఘాడి డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. 53 ఏళ్ల రీతూ తావ్డే ఘాట్ కోపర్ వెస్ట్ నుండి మూడు సార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. గతంలో ఆమె ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ ఛైర్పర్శన్గా కూడా సేవలందించారు.
ideal |వయసుని జయించి.. ఓటు వేసి చైతన్యాన్ని చాటిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు
ideal |వయసుని జయించి.. ఓటు వేసి చైతన్యాన్ని చాటిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు
టాయిలెట్ పేపర్ కన్నా హీనంగా పాక్ను వాడుకున్న అమెరికా: పాక్ మంత్రి
ఇస్లామాబాద్: అమెరికా తమ వ్యూహాత్మక అవసరాల కోసం, తమను ఉపయోగించుకుని కుందని, లక్షాలు నెరవేరిన తరువాత టాయిలెట్ పేపర్ కన్నా హీనంగా వాడుకుని విస్మరించిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. పార్లమెంట్లో ఆయన ప్రసంగిస్తూ అమెరికాపాకిస్థాన్ సంబంధాలపై తీవ్ర విమర్శలు చేశారు. 1999 కార్గిల్ యుద్ధం, 9/11 దాడుల తరువాత పాకిస్థాన్ మళ్లీ అమెరికాతో కలవడం అనే నిర్ణయం తమకు దీర్ఘకాలిక నష్టం కలిగించిందని, అఫ్గానిస్థాన్ యుద్ధంలో జీహాద్ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించారని ఆయన విమర్శించారు. మతపరమైన అవసరాల కోసం అఫ్గాన్ యుద్ధాల్లో పాకిస్థాన్ కలిసినట్టు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. మాజీ మిలిటరీ నియంతలు, జియాఉల్ హక్,పర్వేజ్ ముషారఫ్లు అఫ్గాన్ యుద్ధంలో పాల్గొన్నారని, అగ్రరాజ్యం అమెరికాను సంతోషపెట్టడానికే తప్ప ఇస్లాం మతం కోసం కాదన్నారు. ఆ యుద్ధాలను సమర్ధించుకోవడానికి పాకిస్థాన్ విద్యావ్యవస్థను కూడా మార్చేశారని ఆరోపించారు. 1980లో అఫ్గానిస్థాన్లో జరిగిన సోవియట్ వ్యతిరేక యుద్ధం మతపరమైన ఆవశ్యత కంటే అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువగా ఉపయోగపడిందన్నారు. పాకిస్థాన్ తనది కాని సంఘర్షణల్లో పాల్గొనడం దీర్ఘకాలిక అస్థిరతను సామాజిక నష్టాన్ని కలిగించిందని ఆవేదన వెలిబుచ్చారు. పాకిస్థాన్ ప్రజలు ఎదుర్కొన్న నష్టాలను ఎప్పటికీ భర్తీ చేయలేమని వ్యాఖ్యానించారు.
ప్రొస్టేట్ వాపు ఉంటే సర్జరీ తప్పదా? అసలు నిజాలు ఇవే!
ప్రొస్టేట్ వాపు (BPH) అంటే ఏమిటి? దీని లక్షణాలు, చికిత్స విధానాలు, శాస్త్రీయ కారణాలను ఈ కథనంలో తెలుసుకోండి. 40 ఏళ్లు పైబడిన వారు తప్పక తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం. మగవారిలో వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అతి సాధారణ ఆరోగ్య సమస్యల్లో ప్రొస్టేట్ వాపు (Prostate Enlargement) ఒకటి. వైద్య భాషలో దీనిని Benign Prostatic Hyperplasia (BPH) అని పిలుస్తారు. చాలామంది దీనిని క్యాన్సర్ అని భావించి ఆందోళన చెందుతారు, కానీ ఇది క్యాన్సర్ […] The post ప్రొస్టేట్ వాపు ఉంటే సర్జరీ తప్పదా? అసలు నిజాలు ఇవే! appeared first on Dear Urban .
Mrithyunjay Teaser captivates SS Rajamouli with the intriguing visuals & questions
Sree Vishnu is enjoying a successful phase in his career with consecutive hits. Now, the actor is now coming with an investigative thriller “Mrithyunjay.” The film, directed by Hussain Sha Kiran and bankrolled by Sandeep Gunnam and Vinay Chilakapati of Lightbox Media and Picture Perfect Entertainment. Mrithyunjay is hitting the big screens on February 27, […] The post Mrithyunjay Teaser captivates SS Rajamouli with the intriguing visuals & questions appeared first on Telugu360 .
Brahmotsavams |శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ..
Brahmotsavams | శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు .. నాగర్
21 892 voters |ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు
21 892 voters | ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు 21 892 voters
రెండు డిఫెరెంట్ షేడ్స్లో శ్రీవిష్ణు.. ఆసక్తిగా ‘మృత్యుంజయ్’ టీజర్
ఎక్కువ శాతం కామెడీ సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు హీరో శ్రీవిష్ణు. అయితే తన ట్రాక్ మార్చి ఇప్పుడో విభిన్నమైన కథతో వస్తున్నాడు అతడు. శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ చిత్రం ‘మృత్యుంజయ్’. రెబా మోనికా జాన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళీ ఈ టీజర్ని విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు రెండు డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తాడని.. టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక రెబా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. మొత్తానికి ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకొనేలా ఉంది. ఇక ఈ సినిమా శ్రీ హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహించగా.. సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు.
మావోల బెదిరింపులు.. ఎపి మంత్రుల ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలో ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. అందునా అసెంబ్లీ సమావేశాల సమయంలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు లేఖలు కలకలం రేపాయి. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, కందుల దుర్గేష్లకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ బెదిరింపుల లేఖలపై మంత్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన నిఘా వర్గాలు విచారణ షురూ చేశాయి. మావోయిస్టుల పేరిట వచ్చిన ఈ బెదిరింపు లేఖల వార్త చూసి తన కుటుం బ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడిం చారు. మావోయిస్టుల లేఖ అంశంపై మంత్రి కందుల దుర్గేష్ అసెంబ్లీ మీడియా పాయింట్లో ‘చిట్చాట్’ సందర్భంగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నిర్వహిస్తున్నది పర్యాటక శాఖ వంటి చిన్న శాఖ అని, తనకు మావోయిస్టులు లేఖలు రాయాల్సినంత పెద్ద వివాదాలు ఏముంటాయని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగతంగా, శాఖాపరంగా గానీ తాము ఎక్కడా ఎలాంటి తప్పులు చేయలేదని కందుల స్పష్టం చేశారు. సాధారణంగా మావోయిస్టుల నుంచి వచ్చే లేఖల శైలి ఇలా ఉండదని, ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగానే తప్పుడు లేఖలు సృష్టించి ఉంటారని మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. అయితే మంత్రి కందుల దుర్గేశ్ వ్యక్తిగత సహాయకుడు ఈ బెదిరింపు లేఖపై అధికారికంగా పోలీసుల కు ఫిర్యాదు చేశారు. ఈ లేఖల వెనుక ఉన్న కుట్ర ను, అసలు కారకులను గుర్తించేందుకు పోలీసులు, ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగాయి. మరోవైపు మంత్రుల భద్రతను పర్యవేక్షించే అధికారులు కూడా ఈ లేఖల అసలు మూలాలను ఆరా తీస్తున్నారు. కేవలం భయాందోళనలు సృష్టించేందుకే గుర్తుతెలియని వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మావోయిస్టుల లేఖలు వచ్చి న కారణంగా ఆ నలుగురు మంత్రుల నివాసాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
YCP PATCHY : ప్చ్.. హోదా పేచీ Andhra Prabha Insight Story
YCP PATCHY : ప్చ్.. హోదా పేచీ Andhra Prabha Insight Story
14383 people |మోత్కూర్ లో 86.92% నమోదు…
14383 people | మోత్కూర్ లో 86.92% నమోదు… 14383 people |
10 Kendra |దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి…
10 Kendra | దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి… 10 Kendra |
Municpl మున్సిపల్ ఎన్నికల్లో 80.16 శాతం ఓట్ల పోలింగ్
Municpl మున్సిపల్ ఎన్నికల్లో 80.16 శాతం ఓట్ల పోలింగ్ పోలింగ్ కేంద్రాలలో వృద్ధుల
18 wards |ఉద్రిక్త వాతావరణంలో ప్రశాతంగా ముగిసిన ‘మున్సి’పోల్
18 wards | ఉద్రిక్త వాతావరణంలో ప్రశాతంగా ముగిసిన ‘మున్సి’ పోల్ 18
colse |ముగిసిన మున్సిపల్ ఎన్నికలు..
colse | ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.. 69.78 శాతం నమోదు చెదురు ముదురు
Current shock |చేనులో అగ్నిప్రమాదం…
Current shock | చేనులో అగ్నిప్రమాదం… Current shock | నందికొట్కూర్, ఆంధ్రప్రభ
Aler |ఓటు హక్కు వినియోగించుకున్న బొట్ల పరమేశ్వర్
Aler | ఓటు హక్కు వినియోగించుకున్న బొట్ల పరమేశ్వర్ Aler | ఆలేరు,ఆంధ్రప్రభ:
Brahmotsaval |బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన సిద్ధులగుట్ట …
Brahmotsaval | బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన సిద్ధులగుట్ట … ఈ నెల 13 నుంచి
ప్రజాపాలనకు పట్టణ ఓటర్లు పట్టంకట్టారు: పిసిసి అధ్యక్షుడు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే హవా అని పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటుతుందని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. 90 శాతం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్దే విజయమని అన్నారు. ప్రజా పాలన, అభివృద్ధికి పట్టణ ఓటర్లు పట్టంకట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పారదర్శక పరిపాలనపై ప్రజల్లో విశ్వాసం బలపడిందని అన్నారు. ఫలితాలు భవిష్యత్లో మరింత బాధ్యతగా పని చేయాలని సూచిస్తాయని పేర్కొన్నారు. విపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మలేదని అన్న మహేశ్ కుమార్ గౌడ్.. పార్టీ శ్రేణులకు, అభ్యర్థులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
Vote |ఓటు హక్కు వినియోగించుకున్న కౌన్సిలర్ అభ్యర్థులు
Vote | ఓటు హక్కు వినియోగించుకున్న కౌన్సిలర్ అభ్యర్థులు Vote | ఆలేరు,ఆంధ్రప్రభ:
పోలింగ్ రోజే హస్తినకు సిఎం రేవంత్.. హాట్ టాపిక్ గా ఢిల్లీ పర్యటన
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నాం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏఐసిసి అగ్రనేతలతో ఆయన భేటీ కానున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన పర్యటన హాట్ టాపిక్గా మారింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజే సిఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లడం అటు కాంగ్రెస్ పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. బుధవారం రాత్రి 7 గంటలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సిఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఖరారు అయినట్టుగా తెలిసింది. ఏఐసిసి అగ్ర నేతలను కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల సరళిపై సిఎం రేవంత్రెడ్డి నివేదిక అందజేయనున్నట్లుగా తెలు స్తోంది. అదేవిధంగా కేబినెట్ విస్తరణపై కూడా మరోసారి చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో గురువారం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, కృష్ణా, గోదావరి నీటి మళ్లీంపు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అందులో భాగంగా రైల్వే, ఎరువులు, రసాయనాలు, జలవనరుల శాఖ మంత్రులతో సిఎం భేటీ అయ్యే అవకా శం ఉన్నట్టుగా తెలిసింది. దీంతోపాటు మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం కేంద్రాన్ని నిధులు కోరే అవకాశం ఉందని సమాచారం. దీంతోపాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులపై కూడా అగ్రనేతలతో సిఎం మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Citu |సిఐటియు సమ్మె జయప్రదం చేయండి …
Citu | సిఐటియు సమ్మె జయప్రదం చేయండి … Citu | బచ్చన్నపేట,
మహా శివరాత్రికి 2 వేల ప్రత్యేక బస్సులు..
మహా శివరాత్రికి 2,243 ప్రత్యేక బస్సులు శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249 స్పెషల్ సర్వీసులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టిసి ఏర్పాట్లు మన తెలంగాణ / హైదరాబాద్ : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టిసి) అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా 14 నుంచి 16వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఆర్టిసి ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని ఎంజిబిఎస్, జెబిఎస్, సిబిఎస్, ఐఎస్ సదన్, కెపిహెచ్బి, బిహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ జిఓ ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 1.5 టైమ్స్ వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నెల 14నుంచి 16 వరకు (మూడు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయని సంస్థ తెలిపింది. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 15వ తేది నుంచి 17 వరకు(మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డ్ లను సంస్థ ఏర్పాటు చేస్తుంది. ‘శివరాత్రి ఆపరేషన్స్ పై ఉన్నతాధికారులతో సంస్థ ఎండి వై. నాగిరెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. శివరాత్రి పండుగకు శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో టిజిఎస్ఆర్టిసి పకడ్బందీ ఏర్పాట్లను చేస్తోంది. గత శివరాత్రి కన్నా ఈ సారి 208 బస్సులను అదనంగా సంస్థ నడపనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జిఓ ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రంలో ప్రయాణానికి ఉచిత బస్సు రవాణా సదుపాయం యధావిధిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని, టికెట్ల బుకింగ్ ను www.tgsrtcbus.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని, మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం టిజిఎస్ ఆర్టిసి కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-234500332లలో సంప్రదించవచ్చని తెలిపారు.
Mla |మోత్కూర్ లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మందుల సామెల్..
Mla | మోత్కూర్ లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మందుల సామెల్..
నెల రోజుల బిడ్డను చేతుల్లో పట్టుకుని… విధుల్లోకి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి #AndhraPradesh #IAS
Journalists |చలో విజయవాడ ను జయప్రదం చేయండి..
Journalists | చలో విజయవాడ ను జయప్రదం చేయండి.. ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల
కోల్కతాలో శిక్షణ.. తెలంగాణలో మోసాలు
హైదరాబాద్: ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు ప్రధాన నిందితులను నగర పోలీసులు అరెస్టుచేశారు. ఓ మహిళా ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి కీలక నిందితులను కటాకటాల్లోకి నెట్టారు. వరంగల్కు చెందిన బొచు అరుణ్,గడ్డం భరత్,సామర్ల తిరుపతి,వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్లు ఓ ముఠాగా ఏర్పడి నకిలీ ఆన్లైన్ లోన్ వెబ్సైట్లు,సోషల్ మీడియా ప్రకటనల ద్వారా లోన్ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకుని అమాయక ప్రజలకు రుణాలు ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. మహిళా ఫిర్యాదు మేరకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వరంగల్కు ఈ నిందితులు చదువు మధ్యలోనే ఆపేసి కూలీ పనులు చేసేవారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఫేస్బుక్ ప్రకటనల ద్వారా రాహుల్ అనే వ్యక్తిని సంప్రదించి ఈ అక్రమ కాల్ సెంటర్లలో చేరి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కృష్ణ అలియాస్ కిట్టు అనే మేనేజర్ వీరికి కోల్కతాలో వసతి కల్పించి, మోసం చేసే విధానంపై శిక్షణ ఇచ్చారని, ప్రతిరోజు 180200 కాల్స్ చేస్తూ బాధితులను దోచుకునేవారని, వసూలైన మొత్తంలో 30 శాతం కమీషన్ వీరికి లభించేదని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకున్న ఇన్స్పెక్టర్ పి.శివచంద్ర బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
సోమాజిగూడలో కాజల్ అగర్వాల్ సందడి..
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ నగరంలో సందడి చేసింది. బుధవారం సోమాజిగూడలోని వైశ్యరాజ్ జ్యూవెల్లరీ షోరూంను కాజల్ అగర్వాల్ ప్రారంభించింది. సిటికి వచ్చిన కాజల్ ను చూసేందుకు ఆమె అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక, షోరూం ప్రారంభం అనంతరం మొదటి కొనుగోలును జామి భోజరాజు చేశారు. ఈ సందర్భంగా జ్యూవెల్లరీ మేనేజింగ్ డైరక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజు మాట్లాడుతూ.. మా మొదటి జ్యూవెల్లరీ విశాఖపట్నంలో ప్రారంచామని ఇప్పుడు 16వ బ్రాంచ్ను హైదరాబాద్లో ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కొత్త కలక్షన్లతో ప్రారంభోత్సవ ఆఫర్గా అన్ని రకాల 22 క్యారెట్ బంగారు ఆభరణాలపై ప్లాట్ 6 శాతం తరుగుకే ఆభరణాలను పొందవచ్చని తెలిపారు. వివిఎస్ క్లారిటితో ఐజిఐ సర్టిఫైడ్ డైమండ్ ఈఎఫ్ కలర్తో క్యారెట్ ప్రారంభపు ధర రూ. 49,500 ఉంటుందన్నారు. ఆభరణాలపై తరుగు లేదు, మజూరి లేదు, జిఎస్టీని కూడా వినియోగదారుల తరపును తామె చెల్లిస్తామన్నారు. కేజి వెండి కోనుగోలపై రూ.15వేల తగ్గింపు ఆఫర్ను కూడా ఇస్తున్నట్లు తెలిపారు.
కొత్త రోల్లో వరలక్ష్మి.. వెరైటీ వీడియోతో ప్రకటన..
తమిళ నటి అయినప్పటికీ.. తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది వరలక్ష్మి శరత్కుమార్. ‘క్రాక్’, ‘నాంది’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మంచి చేరువైంది. అయితే ఇంతకాలం నటిగా ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు మరో కొత్త రోల్లో ముందుకు రానుంది. ఆమె త్వరలో మెగా ఫోన్ పట్టుకొని దర్శకురాలిగా మారనుంది. దర్శకురాలిగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సోషల్మీడియా ద్వారా ఫ్యాన్స్కి తెలియజేస్తూ.. ఆనందం వ్యక్తం చేసింది. తన చిత్రానికి ‘సరస్వతి’ అనే టైటిల్ ఖరారైందని.. త్వరలో థియేటర్లలో విడుదల కానుందని పేర్కొంది. ఈ మేరకు ఆమె ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది. స్వీయ దర్శకత్వంలో నటించాల్సి వస్తే ఎలా ఉంటుందో ఆ వీడియోలో వినోదాత్మకంగా చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. వరలక్ష్మికి శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఆమె దర్శకురాలిగా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. నటిగా ‘సరస్వతి’ సినిమాతో పాటు ‘ధీరమ్’ అనే మలయాళం సినిమా కూడా చేస్తోంది వరలక్ష్మి. ‘రిజానా - ఎ కేజ్డ్ బర్డ్’తో హాలీవుడ్కు పరిచయం కాబోతుంది.
Dharna |ధర్నా ను విజయవంతం చేయాలి..
Dharna |ధర్నా ను విజయవంతం చేయాలి.. Dharna | శావల్యాపురం, ఆంధ్రప్రభః జిల్లా
హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్టు
హైదరాబాద్: ఒడిశా నుంచి భారీ ఎత్తున గంజాయి తీసుకువచ్చి నగరంలో విక్రయాలు సాగిస్తున్న ఇద్దరిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్చేశారు. వీరి నుంచి రూ.35 లక్షల విలువజేసే 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన మనీల్ దలబెహరా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుండగా, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో తన వ్యవసాయ భూమిలో గంజాయి సాగుచేశాడు. తన బందువు రినితా రైతా సహాయంతో పండించిన గంజాయిని హైదరాబాద్లో విక్రయించాలని నిర్ణయించారు. ఈక్రమంలోనే మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్ రైతా ద్వారా నగరంలోని ధూల్పేట్ వంటి ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు,వెస్ట్జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులు మనీల్ దలబెహరా,ఇస్మాయిల్ రైతాలను అరెస్టు చేశారు. నగరంలో ఎక్కడైన మాదక ద్రవ్యాల విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించినా వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
Sp |ఆలయాల పేరిట వచ్చే నకిలీ వెబ్ సైట్ లు, యాప్ లు నమ్మవద్దు..
Sp | ఆలయాల పేరిట వచ్చే నకిలీ వెబ్ సైట్ లు, యాప్
Ambati Rambabu Gets Bail in One Case, Faces Fresh PT Warrant in Another
Former minister Ambati Rambabu has secured conditional bail in a case related to abusive remarks against Chief Minister N. Chandrababu Naidu. The Guntur court granted bail on a personal bond of ₹10,000 with two sureties. The court also dismissed the police custody petition. Rambabu, who was lodged in Rajahmundry Central Jail following his arrest by […] The post Ambati Rambabu Gets Bail in One Case, Faces Fresh PT Warrant in Another appeared first on Telugu360 .
Mla |కూటమి పాలన, స్వర్ణాంధ్ర సాధనకు బలమైన పునాదులు
Mla | కూటమి పాలన, స్వర్ణాంధ్ర సాధనకు బలమైన పునాదులు 20 నెలల్లో
Sarpanch |ఇందిరమ్మ ఇండ్లతో ఇంటి కళ సాకారం
Sarpanch | సిర్పూర్ (యు) ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన
Siri |ఈనెల 17 న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం
Siri | ఈనెల 17 న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం
Mothkur |ఓటు వేసిన మాజీ మార్కెట్ చైర్మన్…
Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం జరిగిన
8th ward |ఓటేసి సెల్ఫీ దిగిన 8వ వార్డు అభ్యర్థి…
8th ward | మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం
Collector |ప్రజలు సంతృప్తి చెందేలా ప్రభుత్వ శాఖలు సేవలను అందించాలి..
Collector | ప్రజలు సంతృప్తి చెందేలా ప్రభుత్వ శాఖలు సేవలను అందించాలి.. Collector
Farewell meeting |క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఉత్తమ ఫలిలు..
Farewell meeting | క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఉత్తమ ఫలిలు.. Farewell meeting |
TG |ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత
TG | ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత వజ్రం కన్నా
స్కూల్లో చొరబడి.. టీచర్లు, పిల్లల్ని బంధించిన సాయుధుడు
థాయ్లాండ్లో దారుణం చోటు చేసుకుంది. సోంగ్ఖా హ్యాట్ హెయ్ జిల్లాలోని ఓ పాఠశాలలోకి సాయుధ దుండగుడు చొరబడ్డాడు. కొంత మంది విద్యార్థులు, టీచర్లను నిర్భందించాడు. ఈ క్రమంలో ఓ టీచర్పై అతడు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఓ మాజీ పోలీసు అధికారి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాలను చుట్టుముట్టారు. లోపల ఉన్న విద్యార్థులు, టీచర్లను వారు సురక్షితంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది
అక్రమ కట్టడాల కూల్చివేతను పర్యవేక్షించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర, యాడికి: మండల కేంద్రంలోని శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ భూములపై నిర్మించబడిన అక్రమ కట్టడాల తొలగింపు పనులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవస్థాన భూములను ఆక్రమించి నిర్మించిన షాపులు, వాణిజ్య సముదాయాలు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.ఆలయం తూర్పు భాగంలో ఉన్న భోగా లింగేశ్వర స్వామి ఆలయం దర్శనానికి అడ్డుగా నిర్మించిన షాపులను అధికారులు ఇప్పటికే తొలగించడం ప్రారంభించారని […] The post అక్రమ కట్టడాల కూల్చివేతను పర్యవేక్షించిన జేసీ ప్రభాకర్ రెడ్డి appeared first on Visalaandhra .
Telangana : తెలంగాణలో ముగిసిన పోలింగ్.. అత్యధిక స్థానాలు ఎవరికంటే?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ విడులయ్యాయి
22న చలో మంగళగిరి-చేనేత గర్జన జయప్రదం చేయండి
చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర నాయకులు విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 22వ తేదీన చలో మంగళగిరి-చేనేత గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేనేత ఐక్య కార్యచరణ కమిటీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణం లో శమి నారాయణ స్వామి గుడి నందు ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్మిక సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్యర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర […] The post 22న చలో మంగళగిరి-చేనేత గర్జన జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
లేబర్ కోడ్స్ వద్దు..కార్మిక చట్టాలు ముద్దు..
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సిపిఐ జిల్లా కార్యదర్శి—- అరిగెల సాయి విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: కార్మికులు పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం దుర్మార్గమనిసిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి అన్నారు. బుధవారం నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూనెల12వ తేది పది […] The post లేబర్ కోడ్స్ వద్దు..కార్మిక చట్టాలు ముద్దు.. appeared first on Visalaandhra .

17 C