SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

19    C
... ...View News by News Source

చట్టవిరుద్ధ రోడ్డుబ్లాకు

ప్రధాన రహదారి పై చట్టవిరుద్ధ రోడ్డుబ్లాకుల పై చర్యలు తీసుకోవాలి అడ్వకేట్ సూరెడ్డి శివ కుమార్ విశాలాంధ్ర – సీతానగరం: సీతానగరం, రాజమహేంద్రవరం ప్రధాన రహదారి పై చట్టవిరుద్ధంగా రోడ్డుబ్లాకుల పై అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ లో వంగలపూడి గ్రామానికి చెందిన అడ్వకేట్ సూరెడ్డి శివ కుమార్ అర్జీ సమర్పించారు. అలాగే మండలంలో మండల ప్రజా పరిషత్, రెవెన్యూ కార్యాలయలలో కూడా అర్జీ సమర్పించారు. ఈ […] The post చట్టవిరుద్ధ రోడ్డుబ్లాకు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Dec 2025 7:30 am

India Vs South Africa : భారత్ అభిమానులూ బేఫికర్... వచ్చేస్తున్నాడోచ్

ఆల్ రౌండర్ లో జట్టులోకి వస్తున్నాడు. ఇన్నాళ్లూ టీం ఇండియాలో హార్ధిక్ పాండ్యా లేని లోటు కనిపిస్తుంది

తెలుగు పోస్ట్ 2 Dec 2025 7:28 am

Hyderabad : నేడు గాంధీభవన్ కు రేవంత్ రెడ్డి

నేడు గాంధీ భవన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు

తెలుగు పోస్ట్ 2 Dec 2025 7:23 am

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

విశాలాంధ్ర – కొవ్వూరు : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కొవ్వూరు పట్టణ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్స్ హెల్త్ ఆశ సిబ్బంది ఏఎన్ఎంలు పట్టణ ప్రజలు ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ముందుగా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టి అనంతరంప్రభుత్వ ఆసుపత్రి నుండి స్థానిక విజయ విహరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎయిడ్స్ సంక్రమ మార్గాలు నివారణ చర్యలు […] The post ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Dec 2025 7:18 am

Hyderabad : జీహెచ్ఎంసీ విస్తరణకు గవర్నర్ ఓకే

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ విస్తరణకు సంబంధించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు

తెలుగు పోస్ట్ 2 Dec 2025 7:17 am

Ustaad Bhagat Singh |ఉస్తాద్ స్టెప్ అదిరిందిగా..

Ustaad Bhagat Singh | ఉస్తాద్ స్టెప్ అదిరిందిగా.. Ustaad Bhagat Singh,

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:16 am

ఘనంగా గీత జయంతి వేడుకలు

విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు పట్టణంలో ఎబిఎన్ పిఆర్ ఆర్ కళాశాలలో సోమవారం ఘనంగా గీత జయంతి వేడుకలు జరిగాయి. కురుక్షేత్ర యుద్ధంలో నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు జీవిత తత్వశాస్త్రం, కర్మ, మోక్షం వంటి విషయాలను వివరించి, కర్తవ్య నిర్వహణకు మార్గనిర్దేశం చేసిన రోజు ఈ రోజు అని, ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకి, సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా […] The post ఘనంగా గీత జయంతి వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Dec 2025 7:11 am

పందులు బాబోయ్ పందులు

పందులు బాబోయ్ పందులు.. పట్టపగలే పాఠశాలలో దూరుతున్న వైనం..ఇలా ఉంటే పుష్కరాలు నిర్వహణ ఎలా.. విశాలాంధ్ర-కొవ్వూరు : పందుల బాబోయ్ పందులు.. కుక్కల స్వైర విహారం.. ఇటువంటి మాటలు జిల్లాలో చాలా పట్టణాల్లోనూ.. గ్రామాల్లోనూ తరచూ వినిపిస్తున్నాయి. అయితే రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కొవ్వూరులో మాత్రం పందులు ఏకంగా పాఠశాలలకు దూరి బెంచీల కింద నివాసాలు ఏర్పరచుకుంటున్నాయి. కొవ్వూరులో చాలా కార్పొరేట్ పాఠశాలలు బహుళ అంతస్తులు భవనాల్లో నడుస్తుండగా పెద్ద సమస్య రావడం లేదు కానీ నేల […] The post పందులు బాబోయ్ పందులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Dec 2025 7:07 am

Tirumala |నకిలీ సీఐ అరెస్ట్..

Tirumala | నకిలీ సీఐ అరెస్ట్.. Tirumala, తిరుపతి జిల్లా, భాకరాపేట :

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:56 am

రైతులు ఆందోళన

చెదురు మదుర జల్లులతో రైతులు ఆందోళన – అన్ని గ్రామాలలో కాలాల్లోనే ధాన్యం విశాలాంధ్ర – సీతానగరం: తుపాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం చెదురు మదుర జల్లుల పడ్డాయి. గత కొన్ని రోజులుగా వరిలో పి ఎల్ రకం కోతలు జోరుగా సాగుతున్నాయని. వీటిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయించేందుకు రైతులు ధాన్యాన్ని అందుబాటులో ఉన్న కాలీ ప్రదేశాల్లో ఎండబెడుతున్నారు. అయితే దిత్యా తుపాన్ ప్రభావంతో కొన్ని చోట్ల జల్లులు పడుతుండడంతో రైతులు కాలాల్లో […] The post రైతులు ఆందోళన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Dec 2025 6:47 am

AP Rains |ఏపీలో వర్షాలు..

AP Rains | ఏపీలో వర్షాలు.. AP Rains, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:41 am

Epic |డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న దేవరకొండ..

Epic | డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న దేవరకొండ.. Epic, ఆంధ్రప్రభ వెబ్

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:17 am

పాలమూరు ప్రాజెక్టులు పదేళ్లు పడావు

మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి : గత పాలకుల నిర్లక్ష్యంతోనే నారాయణపేట జిల్లాలోని మక్తల్ వెనుకబాటుకు గురైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మక్తల్‌లో సోమవారం పలు అభివృద్ధి పనులను మంత్రి వాకిటి శ్రీహరి, పలువురు సహచర మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. మక్తల్‌లో రూ.250 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్, నారాయణపేట నుంచి మక్త ల్, జూరాలపై వంతెన రోడ్డుతో పాటు మొ త్తం రూ.1,200కోట్ల అభివృద్ధి పనులకు శం కుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసి న బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తోందని, ఈ రెండేళ్ల విజయోత్సవ సభను మొదట మక్తల్‌లో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. పాలమూరు ప్రజలు అరిగోస పడుతున్నా ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకే ఈసారి పాలమూరు జిల్లా ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో ఈ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు సీఎం అయ్యారని, ఆ తర్వాత 75 ఏళ్లలో పాలమూరు జిల్లా నుంచి ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదని, మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రాష్ట్ర సీఎంగా మీ బిడ్డకు అవకాశం వచ్చిందని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు అన్ని పూర్తిచేసే బాధ్యత తనదని అన్నారు. ఇప్పటికే నారాయణపేటమక్తల్‌కొడంగల్ ప్రాజెక్టు, పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టులు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అందుకే ప్రజా పాలన వారోత్సవాలు ఇక్కడి నుంచి మొదలుపెట్టామని చెప్పారు. కొందరు కుట్రపూరితంగా నారాయణపేట, మక్తల్, కొడంగల్ ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏదీ ఆగదని చేశారు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన ఏ రైతుకు కూడా అన్యాయం చేయబోమని, ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. మాయగాళ్లు మాటలు విని ప్రాజెక్టులు, అభివృద్ధిని అడ్డుకోవద్దని రైతులను కోరారు. ఎంత ఖర్చయినా సరే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తిచేసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ ప్రధాన అంశాలుగా తీసుకున్నట్లు చెప్పారు. కేవలం వలసలే పాలమూరు బిడ్డలను విద్యకు దూరం చేశాయని, అందువల్ల జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు మంజూరు చేశామని తెలిపారు. ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలతో చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని త్వరలో అభివృద్ధి దశలో తీసుకెళ్తామని తెలిపారు. రైజింగ్ 2047 లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లను మీ గ్రామాలను అభివృద్ధి చేసే వ్యక్తులనే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఆ అప్పులు కడుతూనే సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. అభివృద్దికి అడ్డుపడేవాళ్లను స్థానిక ఎన్నికల్లో గెలిపించొద్దని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి జరగదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ, మేఘారెడ్డి, సీతా దయాకర్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 2 Dec 2025 6:00 am

రాష్ట్రానికి రిలయన్స్ వంతార

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి బడా పారిశ్రామికవేత్తలు ఆస్తకి చూపుతున్నా రు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ గ్రూప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఫుడ్లింక్ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్ కంపెనీలు ఈ నెల 8, 9 తేదీల్లో సదస్సుకు హాజరై ప్రభుత్వం తో ఎంఓయూ కుదుర్చుకుంటామని పే ర్కొన్నాయి. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఫ్యూచర్ సి టీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లో బల్ సమ్మిట్‌లో దేశ, విదేశాల నుంచి పె ట్టుబడుదారులు పాల్గొని రాష్ట్రంలో భారీ గా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించా రు. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ గ్రూప్ తె లంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండగా ఈ సంస్థకు చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ నైట్ సఫారీని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఫుడ్లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ కంపెనీ రూ.3వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో మూడు హోటళ్లు నిర్మించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుండగా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకోనున్నారు.  

మన తెలంగాణ 2 Dec 2025 5:30 am

‘హిల్ట్’ ఆపండి

మన తెలంగాణ/హైదరాబాద్: ‘హిల్ట్’ పాలసీ పే రిట రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ‘తెర’ లేపినందున, వెంటనే ‘హిల్ట్’ను నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా బిజెపి రాష్ట్ర నాయకులు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్వర్యంలో పార్టీ నా యకులు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. గతంలో హైదరాబాద్‌లో పరిశ్రమలకు కేటాయించిన విలువైన భూములను ‘హైదరాబా ద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ (హిల్ట్) పేరిట రియల్ ఎస్టేట్ భూములకు కేటాయించే ప్రయత్నం చేస్తున్నదని రాంచందర రావు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించారు. కాబట్టి దీనిని నిలి పి వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా ఆయన గవర్నర్‌ను కోరారు. అనంత రం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని సుమారు తొమ్మిది వేల ఎకరాల విలువైన పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ‘హిల్ట్’ పాలసీతో అవినీతికి దారి తీస్తుందని ఆరోపించారు. ఎస్‌ఆర్‌వో రేట్లలో ముప్పై శాతం మాత్రమే చెల్లించి భూములను మార్చుకునే విధానం వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాసంపదను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ విధానం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని, రైతులకూ తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిల్ట్ పాలసీ ద్వారా ప్రభుత్వం ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తున్నదని గవర్నర్‌కు వివరించామని ఆయన తెలిపారు. గతంలో పరిశ్రమలకు ప్రభుత్వం తక్కువ ధరలకు కేటాయించి, ప్రోత్సహించిందని ఆయన చెప్పారు. కాగా ఇప్పటి మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే, సబ్-రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌వో) రేట్లు అసలు మార్కెట్ విలువలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. ఇటీవల హైదరాబాద్ పరిసరాల్లో ఒక సంస్థ ఒక్క ఎకరాన్ని నూటా యభై కోట్ల రూపాయల వరకు కొనుగోలు చేసిందంటే ఇలా భూములు నిజమైన మార్కెట్ ధరల ఆకాశాన్ని తాకుతున్న సమయంలో హిల్ట్ పాలసీ ప్రకారం పరిశ్రమల భూములను కేవలం ఎస్‌ఆర్‌వో రేట్లలో ముప్పై శాతం మాత్రమే చెల్లించి కన్వర్ట్ చేసుకునే అనుమతి ఇవ్వడం అనుమానాలకు దారి తీస్తోందని రాంచందర్ రావు అన్నారు.

మన తెలంగాణ 2 Dec 2025 4:30 am

చల్లారిన పత్తి చిచ్చు

మన తెలంగాణ/హైదరాబాద్: పత్తి కొనుగోళ్ల లో సిసిఐ విధించిన నిబంధనలతో ఏర్పడిన ప్రతిష్టంభనలు ఎట్టకేలకు తొలగాయిని రా ష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. సిసిఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) విధించిన కొత్త నిబంధనల కారణంగా కొనుగోళ్లకు అనుమతులు లభించని జి న్నింగ్ మిల్లులలో కొనుగోళ్లు ప్రారంభించేందుకు సిసిఐతో జరిపిన చర్చలు ఫలించాయన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ నోటిఫై చేసిన మొత్తం 330 జిన్నింగ్ మిల్లుల్లో సోమవారం నుండి పత్తి కొనుగోళ్లు చురుగ్గా కొనసాగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. సిసిఐ కొత్త నిబంధనల కా రణంగా అనుమతులు లభించకపోవడంతో జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ గతంలో సమ్మెకు దిగింది. దీనివల్ల రైతులు తాము పండించిన పత్తిని అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి తుమ్మల స్వయంగా చొరవ చూపారు. ఆయన కేం ద్ర మంత్రులతో పాటు సిసిఐ సిఎండితో ప్రత్యేక చొరవ తీసుకుని వివరణాత్మక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సానుకూల స్పందన రావడంతో, 330 మిల్లుల్లో కొనుగోళ్లకు అనుమతులు లభించాయి. సమస్య పరిష్కారంలో మంత్రి తుమ్మల చూపిన వేగవంతమైన చర్యలకు, చొరవకు జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులకు, మిల్లుల కార్మికులకు ఉపశమనం లభించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సిసిఐ రాష్ట్రంలో రూ. 3,201 కోట్లతో మొత్తం 4.03 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించిందని మంత్రి తుమ్మల వెల్లడించారు.

మన తెలంగాణ 2 Dec 2025 4:00 am

‘మహా’నగరం ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపారు. జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీల వి లీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్, అర్బన్ డవలప్ మెంట్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. జీహెచ్‌ఎంసీలో 7 ము న్సిపల్ కార్పొరేషన్లు, 20మున్సిపాలిటీలను వి లీనం చేయాలని ఈ నెల 25న జరిగిన మం త్రివర్గ సమావేశంలో ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతోపాటు విలీనం అంశాన్ని ఈ నెల 25న జరిగిన జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించారు. కాగా దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభు త్వం నుంచి గవర్నర్‌కు ఆర్డినెన్స్‌ను పంపించడంతో ఆయన ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ ఫైల్ లోక్ భవన్ నుంచి న్యాయ శాఖకు వ చ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌కు సం బంధించిన గెజిట్ విడుదల చేయనుంది. విలీ న పక్రియలో భాగంగా 27 మున్సిపాలిటీల ఆ స్తులను హ్యాండ్ ఓవర్, వంటి అంశాలను గు ర్తించి గెజిట్‌లో ప్రభుత్వం వివరిస్తుందని అధికార వర్గాల సమాచారం. 

మన తెలంగాణ 2 Dec 2025 3:00 am

హాస్టల్‌ గదిలో విద్యార్థిని ఆత్మహత్య

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వర్ష (16) హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన మధుసూదన్ రెడ్డి కూతురైన వర్ష సోమవారం సాయంత్రం హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్ నిర్వాహకుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు .

మన తెలంగాణ 2 Dec 2025 12:11 am

మంగళవారం రాశి ఫలాలు (02-12-2025)

మేషం వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. రాజకీయ వర్గాల వారి నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృషభం స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. మిధునం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. కర్కాటకం భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సానుకూలమవుతాయి. సింహం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కన్య చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తుల ఆధ్యాత్మక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలను ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. వృశ్చికం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ధనస్సు చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్నిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలను లభిస్తాయి. మకరం ముఖ్యమైన పనులు మందగిస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. కుంభం ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఇంటా బయట కొందరు మాటలు మానసికంగా కలచి వేస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మీనం ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికమవుతాయి.  

మన తెలంగాణ 2 Dec 2025 12:10 am

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…

వెల్దండ, ఆంధ్రప్రభ : కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి

ప్రభ న్యూస్ 1 Dec 2025 11:10 pm

కొత్తగూడెంలో దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ వర్సిటీ

దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన జిల్లాల బాటలో మంగళవారం సిఎం కొత్తగూడెం జిల్లాకు రానున్నారు. ఖనిజాలకు పుట్టినిల్లు అయిన సింగరేణి ఇలాకాలో కొత్తగూడెంలోని మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేసి ప్రారంభించబోతున్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని మౌలిక సదుపాయాలు, విభాగాల ఏర్పాట్లు, ఆతిథ్య సదుపాయాలు, భద్రత, సభాస్థలి ఏర్పాట్లు, రవాణా నిర్వహణ వంటి అంశాలను శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. తెలంగాణలో తొలి భూవిజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని మంగళవారం ప్రజలకు అంకితం చేస్తారని చెప్పారు. సిఎం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం ఏరియాను విద్యారంగం అనుసంధానంతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణకే మణిహారంగా మారనుంది. సింగరేణి ఇలవేల్పు కొత్తగూడెం లో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ ఖ్యాతి మరింతగా పెరగనుంది .జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు యూనివర్సిటీ ఏర్పాటు ఆవశ్యకత సిఎంకి ప్రతిపాదన చేసి పట్టుబట్టి మంజూరు చేయించి అచరణలోకి తీసుకొచ్చారు. తుమ్మల ప్రతిపాదనకు రేవంత్ సానుకూలంగా స్పందించి వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీనికి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతూ తెలంగాణ క్యాబినెట్ చారిత్రక నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లయింది. పారిశ్రామిక అభివృద్ధితో విద్యను అనుసంధానం చేయాలనే ఆలోచనతోనే ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ ఆవిర్భవించింది. దేశంలోనే మైనింగ్ ఇంజినీరింగ్ లో రెండో కాలేజ్ గా ఉమ్మడి రాష్ట్రంలో మొదటి మైనింగ్ ఇంజినీరింగ్ కాలేజ్ గా 1957 లో స్థాపించారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో జియాలజీ, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ., .ఎన్విరాన్ మెంట్ సైన్స్, ఇండస్ట్రియల్ సైన్స్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రాక్టికల్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైన్స్...మినరల్స్ ...ఫారెస్ట్ గోదావరి నది ఉండటంతో పరిశోధన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో మైన్ ఇంజినీర్లు ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్లు దేశానికి అందించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని మంత్రి తుమ్మల విశ్వాసంతో ఉన్నారు.

మన తెలంగాణ 1 Dec 2025 11:10 pm

మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ11+

న్యూఢిల్లీ : సామ్‌సంగ్ ఇండియా తాజాగా గెలాక్సీ ట్యాబ్ ఎ11+ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ట్యాబ్ ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. 11 అంగుళాల డిస్‌ప్లే, మెటల్ డిజైన్, డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్లు, 8 ఎంపి బ్యాక్ కెమెరా, 5 ఎంపి ఫ్రంట్ కెమెరాతో పనితీరు, వినోదానికి అనువుగా దీనిని రూపొందించారు. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్, సామ్‌సంగ్ నోట్స్‌లో సాల్వ్ మ్యాథ్ వంటి ఎఐ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రతిరోజూ జీవనాన్ని మెరుగుపరచే ఆవిష్కరణలు సంస్థ లక్ష్యం అని సామ్‌సంగ్ ఇండియా ఎంఎక్స్ డైరెక్టర్ సాగ్నిక్ సేన్ అన్నారు. 

మన తెలంగాణ 1 Dec 2025 11:00 pm

ఆ గ్రామ పంచాయతీ ఆదర్శనీయం…

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందిన బాబాపూర్ గ్రామ

ప్రభ న్యూస్ 1 Dec 2025 10:54 pm

నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో బిఎస్‌సి నర్సింగ్ చదువుతున్న ఓ యువతిపై కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఎంజిఎం ఆస్పత్రిలో చేర్చగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిది జనగాం జిల్లా, జఫర్‌ఘడ్ మండలం అని తెలిసింది. కాజీపేట ఎసిపి, పోలీసులు బాధితురాలితో మాట్లాడి విచారణ చేపట్టారు.

మన తెలంగాణ 1 Dec 2025 10:50 pm

ఢిల్లీ కాలుష్య కేవలం రైతులదే అంటే ఎట్లా ?: సుప్రీంకోర్టు

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి రైతులనే నిందించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంట వ్యర్థాల దగ్ధం వల్లనే ఢిల్లీలో వాయు నాణ్యత దెబ్బ తిందనే వాదనను తోసిపుచ్చింది. వాయు కాలుష్యం అంశాన్ని కేవలం శీతాకాలంలోనే చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం సోమవారం తెలిపింది. వాయు కాలుష్యం అనేది తీవ్ర సంక్షోభం దీనిపై నిరంతర పర్యవేక్షణ , జాగ్రత్త చర్యలు అవసరం అని జస్టిస్ జాయ్‌మాలా బాగ్చీ సహ సభ్యులుగా ఉన్న ధర్మాసనం తెలిపింది. కాలుష్య సమస్యను రాజకీయం చేయరాదని స్పష్టం చేశారు. పంజాబ్ , హర్యానా సరిహద్దులలో పంట వ్యర్థాల దహనంతోనే దేశ రాజధానిలో కాలుష్య తీవ్రత పెరిగిందని ఢిల్లీ ప్రభుత్వం వాదిస్తోంది. వాయు కాలుష్య సమస్యపై చాలా కాలంగా సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. కాలాన్ని బట్టి ఏర్పడే సమస్యగా వాయు కాలుష్యాన్ని లెక్కలోకి తీసుకుంటే చిక్కులు తప్పవని హెచ్చరించారు. రైతులు పంట వ్యర్థాలను ఎందుకు పొలాల కళ్లాల తరువాత తగులబెట్టాల్సి వస్తోంది? వీటిని సకాలంలో సరైన రీతిలో నిర్మూలించేందుకు సరైన యంత్రాలు, ఏర్పాట్లు వారి వద్ద ఉన్నాయా? అనేది విశ్లేషించుకోవల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. వాయు కాలుష్య సమస్య గురించి కనీసం నెలకు రెండు సార్లు అయినా సమీక్ష జరగాలి. స్వల్పకాలిక దీర్ఘకాలిక పరిష్కారాలను ఈ క్రమంలో కనుగొనాల్సి ఉంటుందని బెంచ్ అభిప్రాయపడింది. ప్రభుత్వాలు పార్టీల రాజకీయాల కోణంలో, అహంకార ధోరణితో ఈ విషయాన్ని చూడటానికి వీల్లేదని తెలిపారు. కోవిడ్ దశలో ఢిల్లీలో వాయుకాలుష్యం తక్కువగా ఉంది. అప్పుడు కూడా ఈ సమయంలోనే పంట వ్యర్థాల దగ్థం జరిగింది. కానీ అప్పుడు ప్రజలు పొగచూరని , నిర్మలమైన ఆకాశం చూడగలిగారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదని, దీనిని బట్టి చూస్తే వాయుకాలుష్యానికి కారణం వేరే ఉందని తెలుస్తోందని చీప్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. పరోక్షంగా ఆయన ఇదంతా కూడా వాహన కాలుష్యంతో తలెత్తిన విషమ పరీక్ష అని విశ్లేషించారు. ఈ కోర్టులో రైతులను నిందించడం తరచూ జరుగుతోంది. అయితే వారి తరఫున వాదనలు విన్పించడానికి అరుదుగా హాజరీలు ఉంటాయని సిజెఐ వ్యాఖ్యానించారు. తాము కేసు విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నామని ఆ లోగా వాయు ప్రమాణాల నిర్వహణ కమిషన్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇతర సంబంధిత పక్షాలు కాలుష్య నివారణకు తీసుకుని తీరాల్సిన విషయాలను స్పష్టం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసుకు సంబంధించి ప్రభుత్వ సంస్థల తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్యర్య భటి హాజరయ్యారు. పంట వ్యర్థాల దగ్ధం, వాహన కాలుష్యం, భవన నిర్మాణ రంగ ధుమ్మూ ధూళి, రోడ్ల దుమ్ము , సేంద్రీయ వ్యర్థాల దహనం వంటి పలు కారణాలు ఉన్నాయని చెప్పారు. దీనితో ఏకీభవించని ధర్మాసనం ఇదంతా కాదు తమకు ఈ విషయంపై వారంలో తగు నివేదిక అందించాలని ఆదేశించి, విచారణను వాయిదా వేశారు. అశాస్త్రీయ పట్టణ నగర అభివృద్ధి , యాంత్రీకరణలు వంటివి వాయు నాణ్యత క్షీణతకు దారితీస్తున్నాయని ధర్మాసనం తెలిపింది. 

మన తెలంగాణ 1 Dec 2025 10:40 pm

బాపట్ల జేసీ పొలం బాట

ఆంధ్రప్రభ, బాపట్ల కలెక్టరేట్ : దిత్వా తుఫాన్ ప్రభావ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా

ప్రభ న్యూస్ 1 Dec 2025 10:36 pm

లంచాల వీఆర్వో పట్టివేత

కర్నూలు బ్యూరో ఆంధ్రప్రభ : రూ.40,000 లంచం తీసుకుంటున్న దేవనకొండ మండలం నల్లచెలిమల

ప్రభ న్యూస్ 1 Dec 2025 10:34 pm

డిసెంబర్ 19న ఓటీటీలోకి ’నయనం’

వరుణ్ సందేశ్ నటించిన తొలి ఓటీటీ తెలుగు వెబ్ సీరిస్ ’నయనం’. డిసెంబర్ 19 నుండి ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్ వెబ్ సీరిస్ ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్త్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించబోతున్నారు. ’నయనం’ వెబ్ సీరిస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఒరిజినల్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ’‘నటుడిగా నాకు ఇది సరికొత్త ప్రయాణం. ఇప్పటి వరకూ చేయనటువంటి విభిన్నమైన పాత్రలో డాక్టర్ నయన్‌గా కనిపించబోతున్నాను”అని అన్నారు. 

మన తెలంగాణ 1 Dec 2025 10:30 pm

హానీ ట్రాప్‌లో చిక్కుకున్న యువకుడు

హానీ ట్రాప్ చేసి యువకుడి వద్ద నుంచి సైబర్ నేరస్థులు రూ.1.02లక్షలు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని యాకత్‌పురకు చెందిన యువకుడు(20) టెలీగ్రాంలో వచ్చిన మెసేజ్‌కు స్పందించాడు. మహిళ పేరుతో ఛాటింగ్ చేసిన సైబర్ నేరస్థులు సెక్స్‌వల్ సర్వీస్ అందిస్తామని చెప్పారు. యువతి ఫొటోతో సైబర్ నేరస్థులు ఛాటింగ్ చేయడంతో నిజమని నమ్మిన యువకుడు వారు చెప్పినట్లు చేశాడు. యువతిని హోటల్‌కు పంపిస్తామని చెప్పారు. దానికి ముందుగా అడ్వాన్స్ బుకింగ్, సర్వీస్ సెక్యూరిటీ, రూమ్ రిజర్వేషన్ కోసం ముందుగానే డబ్బులు చెల్లించాలని చెప్పారు. దానికి అంగీకరించిన యువకుడు యూపిఐ ద్వారా రూ.1,02,093 ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత బాధితుడు అబిడ్స్‌లోని హోటల్‌కు వెళ్లి ఎంక్వైరీ చేయగా ఎవరూ రాలేదు. వెంటనే టెలిగ్రాంలో సంప్రదించగా సైబర్ నేరస్థులు వెంటనే రూ.10వేలు పంపించాలని బ్లాక మెయిల్ చేశారు. దీంతో తాను సైబర్ నేరస్థుల చేతుల్లో మోసపోయానని గ్రహించాడు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 1 Dec 2025 10:20 pm

రేపు చెన్నైకి కెటిఆర్

 ఈ నెల 2న చెన్నైలో జరిగే శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక ఇగ్నిషన్ సదస్సులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. జర్నలిస్ట్ శోమా చౌదరి ఆధ్వర్యంలో ఐటీసీ గ్రాండ్ చోళా వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో ‘రిబూటింగ్ ది రిపబ్లిక్’ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై కేటీఆర్ తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ వేదికపై జాతీయ రాజకీయాలకు సంబంధించిన పలు కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది.

మన తెలంగాణ 1 Dec 2025 10:03 pm

అన్యమతస్త ఉద్యోగులపై నివేదిక….

తిరుపతి ప్రతినిధి , ఆంధ్రప్రభ : టీటీడీలో ఇంకా ఎవరైనా అన్య మతస్తులు

ప్రభ న్యూస్ 1 Dec 2025 9:55 pm

విరాట్ బ్యాటింగ్ అద్భుతం: కుల్దీప్ యాదవ్

సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో చిరస్మరణీయ సెంచరీ సాధించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై అతని సహచరుడు కుల్దీప్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్ చూసి తామంత ఎంతో ఆనందానికి గురయ్యమన్నాడు. కోహ్లి ఇన్నింగ్స్‌ను గమనిస్తే అతను గాడిలో పడినట్టేనని పేర్కొన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడన్నాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచేందుకు ఇది దోహదం చేస్తుందన్నాడు. తాను కెరీర్ ఆరంభించినప్పుడూ విరాట్ వరుస సెంచరీలతో చెలరేగి పోయేవాడన్నాడు. రాంచిలో అతను ఆడిన ఇన్నింగ్స్ ఒకప్పటి విరాట్‌ను తలపించిందని కుల్దీప్ అభిప్రాయపడ్డాడు. తనలాంటి ఎంతో మంది క్రికెటర్లకు కోహ్లినే స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు.

మన తెలంగాణ 1 Dec 2025 9:55 pm

శ్రీరంగనాథుడికి పట్టువస్త్రాల సమర్పణ

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని

ప్రభ న్యూస్ 1 Dec 2025 9:53 pm

ప్రతి స్టార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ యాప్

ప్మార్ట్ ఫోన్లలో సైబర్ నేరాల నియంత్రణ , ఫోన్ల చోరీల ఆటకట్టుకు సంబంధిత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు వెలువరించింది. ఫోన్ల తయారీదార్లు ఇకపై తయారు చేసే ప్రతి ఫోన్‌లోనూ సైబర్ సెఫ్టీ యాప్ ఏర్పాటు అత్యవసరంగా చేయాలని ఆదేశించారు. ఈ ఏర్పాటును సంచార్ సాథీ అని వ్యవహరిస్తారు. దీని ఏర్పాటుకు సంబంధించి ఫోన్ల తయారీ కంపెనీలకు ఉత్తర్వులు వెలువరించారు. ఫోన్ల వినియోగదార్లు తమ ఫోన్ల నుంచి ఈ యాప్‌ను ఏ విధంగా కూడా తొలగించడానికి వీల్లేకుండా సరైన అమరిక ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్న దశలో, విద్యావంతులు కూడా ఎంతో నష్టపోతున్న కాలంలో స్మార్ట్‌ఫోన్లలో ఇటువంటి సైబర్ నేరాల చెక్ ఏర్పాటు అవసరం అని ఆయా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం తరఫున అంతర్గత ఆదేశాలు వెలువడినట్లు ఆయా కంపెనీల ద్వారా వెల్లడైంది. సాధారణంగా ఎక్కువగా సైబర్ నేరాలు సెల్‌ఫోన్ల సాంకేతికను వాడుకుంటూ నేరగాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ దశలో సెల్‌ఫోన్లలోనే వీటిని నియంత్రించే ఏర్పాటు అవసరం అనే విషయం సాంకేతిక నిపుణుల ద్వారా గ్రహించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ చర్యకు దిగింది. తొలిగించడానికి వీల్లేని , ప్రభుత్వ పరిధిలోని సైబర్ సెక్యూరిటీ యాప్ ఏర్పాటు విషయంలో ప్రైవేటు కంపెనీలు స్పందన తెలియలేదు. యాపిల్ , శామ్‌సంగ్ ఇతర కంపెనీలు ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫోన్ల మార్కెట్‌గా భారతదేశం నిలిచింది. ఇప్పటికే 1.2 బిలియన్ ఫోన్లవాడకం దార్లు ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జనవరిలో విడుదల చేసిన ఈ యాప్‌తో వినియోగదార్లు పోగొట్టుకున్న ఏడు లక్షలకు పైగా ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌లోనే అరలక్ష వరకూ రికవరీ అయ్యాయి.

మన తెలంగాణ 1 Dec 2025 9:52 pm

ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు..

ఆంధ్రప్రభ, తిరుపతి : ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ విశిష్ట సేవలు

ప్రభ న్యూస్ 1 Dec 2025 9:47 pm

అలుగు అలజడి..

కంచికచర్ల, ఆంధ్రప్రభ : అటవీ ప్రాంతాల్లోని అలుగు కంచికచర్ల పట్టణంలో సంచరిస్తుండటంతో పలువురు

ప్రభ న్యూస్ 1 Dec 2025 9:46 pm

కృష్ణాలో పోలీసుల మీకోసం..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని వాటిని చట్టపరిధిలో పరిష్కరించి

ప్రభ న్యూస్ 1 Dec 2025 9:43 pm

Akhanda Haindavam: Spiritual Anthem

The countdown has begun for the theatrical release of Nata Simham Nandamuri Balakrishna’s highly anticipated flick Akhanda 2. Directed by Boyapati Sreenu, the movie will hit the screens in 4 more days on December 5th. The makers have intensified the promotional activities, and they have released lyrical video of Akhanda Haindavam song. Music director S […] The post Akhanda Haindavam: Spiritual Anthem appeared first on Telugu360 .

తెలుగు 360 1 Dec 2025 9:38 pm

Chandrababu |మనమే టాప్

Chandrababu | మనమే టాప్ ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : దేశంలో ఏ

ప్రభ న్యూస్ 1 Dec 2025 9:22 pm

అర్జీదారులు సంతృప్తి చెందాలి

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : అర్జీదారులు సంతృప్తి పొందేలా ప్రజా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో

ప్రభ న్యూస్ 1 Dec 2025 9:05 pm

అన్ని పూజలు నూతన మండపంలోనే..

ఆంధ్రప్రభ, విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి

ప్రభ న్యూస్ 1 Dec 2025 9:02 pm

Eluru |కిడ్నీ బాధితురాలి ఇంటికి ..

Eluru | కిడ్నీ బాధితురాలి ఇంటికి .. ఏలూరు/ఉంగుటూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:57 pm

ఘనంగా విశాఖ ప్రగతి బంధు…

ఆంధ్రప్రభ, ఆరిలోవ విశాఖపట్నం : విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ విశాఖపట్నం

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:44 pm

విజయవాడలో మెగా పాస్‌పోర్ట్ మేళా

ఆంధ్రప్రభ, విజయవాడ : త్వరలో నిర్వహిస్తున్న మెగా పాస్‌పోర్ట్ మేళను సద్వినియోగం చేసుకోవాలని

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:42 pm

బ్లైండ్ క్రికెటర్ కు అపూర్వ స్వాగతం..

ఆంధ్రప్రభ విజయవాడ : కొలంబోలో ఇటీవల జరిగిన తొలి మహిళా ప్రపంచ బ్లైండ్

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:39 pm

కనీస వేతనాలు చెల్లించని సంస్థలపై చర్యలు..

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రైవేట్ వ్యాపార సంస్థలు

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:36 pm

తీర్మానం ఉంది అందుకే చెల్లించాం..

శావల్యాపురం, ఆంధ్రప్రభ : పొట్లూరు గ్రామంలో అభివృద్ధి పనులకు పంచాయతీ తీర్మానం ప్రకారమే

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:34 pm

ఎయిడ్స్ ప‌ట్ల అప్రమత్తత అవసరం..

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : హెచ్ఐవి, ఎయిడ్స్ ప‌ట్ల విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:32 pm

మైల‌వ‌రంలో 2న పీజీఆర్ఎస్…

ఆంధ్రప్రభ, విజయవాడ : ఈ నెల 2వ తేదీ మంగ‌ళ‌వారం మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గస్థాయి

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:28 pm

కౌలు రైతు వీరన్నది ఆత్మహత్య కాదు..ప్రభుత్వం చేసిన హత్యే: హరీష్ రావు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. పురుగుల మందు తాగుతూ పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనమని అన్నారు. వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం, మీకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుందని అన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 1 Dec 2025 8:28 pm

Photos : Anand Deverakonda’s Epic Movie First Look launch

The post Photos : Anand Deverakonda’s Epic Movie First Look launch appeared first on Telugu360 .

తెలుగు 360 1 Dec 2025 8:27 pm

అలసత్వం సహించం..

ఆంధ్రప్రభ, విజయవాడ (కార్పొరేషన్) : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:25 pm

ఆ 5 ఊళ్లు ఆగ్రహం…

కర్నూలు, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఆదోని ప్రాంతంలో మండల విభజనపై రాజకీయ–పాలనాత్మక

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:22 pm

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నిరంజన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరులో తట్ట మన్ను తీయలే, చూసుకోని ముర్వ చెప్పుకుని ఏడ్వ అన్నట్లుంది పాలమూరు పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చేసింది ఏం లేదని అన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. శంకుస్థాపనలు తప్ప రెండేళ్లలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలకు ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించయారు. పదేళ్లలో కేసీఆర్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3.48 లక్షల కోట్లు తద్వారా చేసిన అభివృద్ధి, గణాంకాలు కండ్ల ముందు ఉన్నాయని చెప్పారు. కేవలం రెండేళ్లలో కార్పోరేషన్ రుణాలు కాకుండానే రూ.2.50 లక్షల కోట్లు అప్పుచేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంజన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారు, అభివృద్ధి పనులు పక్కనపెట్టారని, రైతులను గాలికి వదిలి పంటలను వాటి కర్మానికి వదిలేశారని మండిపడ్డారు. బోనస్ అని బోగస్ మాటలు చెప్పి బ్రోకర్ల అవతారం ఎత్తారని అన్నారు. తెలంగాణ రైజింగ్ అంటూ అప్పులు తెస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ రెవెన్యూ 25 శాతం వరకు పెరిగిందని, అయితే కాంగ్రెస్ పాలన పుణ్యాన ఈ ఏడాది - 0.76 శాతానికి పడిపోయిందని విమర్శించారు. అడ్డగోలు అప్పులు చేసి అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తూ రైజింగ్ అంటూ పొంకనాలు కొట్టడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.

మన తెలంగాణ 1 Dec 2025 8:21 pm

ఎన్నికల సంఘం సిఎంపై కేసు నమోదు చేయాలి: హరీశ్

హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఎం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుంటే ఎస్ఇసి ఏం చేస్తుందని ప్రశ్నించారు. శుంకుస్థాపన చేసే ప్రాజెక్టులు, రోడ్లు గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడవా? అని నిలదీశారు. ఎన్నికల సంఘం వెంటనే సమీక్షించి సిఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక విద్యుత్‌ శాఖ గురించి మాట్లాడుతూ.. ‘‘విద్యుత్‌శాఖను మొత్తం ఎపి అధికారులతో నింపుతున్నారు. కీలకమైన బాధ్యతల్లో ఆంధ్ర అధికారులను నియమిస్తున్నారు. ప్రభుత్వాన్ని తెలంగాణ వారు నడుపుతున్నారా? వెనకుండి ఎపి వాళ్లు నడుపుతున్నారా? ఎపి అధికారులు, అవినీతితో రాష్ట్ర విద్యుత్ రంగం అస్తవ్యస్థమవుతోంది. తక్కువ ధరకే ఎన్టిపిసి విద్యుత్ ఇస్తుంటే.. కొత్త ప్లాంట్లు ఎందుకు? కమీషన్ల కోసమే కొత్త పవర్‌ప్లాంట్లు చేపడుతున్నారు. ఈ విషయంలో చర్చ పెడితే ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. కొత్తగా చేపట్టే మూడు ప్లాంట్లకు రూ.45 వేల కోట్లు అవుతుంది. పైసా ఖర్ఛు లేకుండా ఎన్టిపిసి విద్యుత్‌ ఇస్తుంటే.. ఇన్ని వేల కోట్లు ఎందుకు?’’ అని హరీశ్ రావు ప్రశ్నించారు.

మన తెలంగాణ 1 Dec 2025 8:19 pm

సుజనా ఫౌండేషన్ కు కలెక్టర్ అభినందన

ఆంధ్రప్రభ భవానీపురం : విజయవాడ పశ్చిమ లోని జి.ఎన్.ఆర్.ఎంసి ప్రభుత్వ పాఠశాలలోనీ విద్యార్థులకు

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:18 pm

Bellampalli |‘ట్రాఫిక్’పోలీస్ స్టేషన్ ఏర్పాటయ్యేనా?

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణం నేడు మంచిర్యాల జిల్లాలో వేగంగా అభివృద్ధి

ప్రభ న్యూస్ 1 Dec 2025 8:13 pm

నకిలీ ఎసిబి ముఠా పట్టివేత

ఎసిబి డిఎస్‌పి అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్న ఘరానా నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా కలిసి సోమవారం అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో నకిలీ ఎసిబి ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి పుట్టపర్తి జిల్లా, వేలమద్ధి గ్రామానికి చెందిన రాచంపల్లి శ్రీనివాస్, అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు తో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముఠా సభ్యులు హరి జిల్లాకు చెందిన నవీన్ జేఆర్, బెంగళూరుకు చెందిన మంగళ రవీందర్, మురళి, ప్రసన్నలను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు సూర్యప్రకాశ్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ శాఖలలో ఉన్నతాధికారులతో పాటు పదవీవిరమణకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని వారికి ఏసిబి డి.ఎస్పీనంటూ ఫోన్ చేసి..‘మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి, కేసు నమోదు చేయడం జరిగింది, ఈ కేసు నుండి బయటపడాలంటే డబ్బులు ఇవాల్సి ఉంటుంది’ అని బెదింపులకు పాల్పడి సులభంగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు వరంగల్ జిల్లా రోడ్డు రవాణా శాఖలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి ఎసిబి డిఎస్పీ నంటూ బెదిరించి సుమారు 9 లక్షల 96 వేల రూపాయలను వివిధ మార్గాల్లో దోచుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్, అతనికి సహకరించిన మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడున శ్రీనివాసులును పోలీసులు విచారించగా, నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో 2002 సంవత్సరంలో మొదట ద్విచక్ర వాహనం చోరీతో దొంగతనాలకు శ్రీకారం చూట్టాడు. మరికొద్ది రోజులకు నిందితుడు నకిలీ పోలీస్ అధికారిగా అవతారమెత్తి రాయలసీమ ప్రాంతములో జరిగిన పలు దొంగతనాల్లో అరెస్టు అయిన నిందితుల కుటుంబ సభ్యులను టార్గెట్‌గా చేసుకొని వారి వద్ద దొంగ సొత్తు దాచి ఉంచారని బెదిరించి వారి నుండి బంగారం, డబ్బు దోపిడీకి పాల్పడ్డాడు. ఇతను సుమారు 50 కేసుల్లో నిందితుడుని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలులో నిందితుడు తన వ్యవహార శైలిని మార్చుకోకుండా జైలు నుండి విడుదలైన అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు, రాయలసీమ ప్రాంతాల్లో 41కి పైగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడటంతో పోలీసులు మరోమారు నిందితుడి అరెస్టు చేసి జైలుకు తరలించారు . నిందితుడు జైలు నుండి విడుదలైన అనంతరం మళ్ళీ సులభంగా డబ్బును సంపాదించాలనే లక్ష్యంగా నకిలీ ఎసిబి డిఎస్పీగా అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగులను ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు ఇతనిపై మొత్తం 19 కేసులు నమోదై ఉన్నాయి. సుమారు రూ.50 లక్షలు పైగా దోపిడీకి పాల్పడగా, ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 9 నేరాలు, ఆంధ్ర రాష్ట్రంలో 10 నేరాలకు పాల్పడ్డాడు. ఇందులో 8 కేసుల్లో అరెస్ట్ కాగా, మిగిలిన 11 కేసుల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో మిల్స్ కాలనీతో పాటు 2021 సంవత్సరంలో స్టేషన్ ఘన్పూర్, కరీంనగర్, హైదరాబాద్, రాచకొండ, రామగుండం, వికారాబాద్, జగిత్యాల, వనపర్తితో పాటు ఆంధ్రలోని కర్నూల్ జిల్లాలో జరిగిన నేరాలలో అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. బెదిరింపులకు పాల్పడుతూ దోచేసిన డబ్బును నిందితుడు ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసి విచారణలో వున్న మిగతా నిందితులతో పాటు, ప్రస్తుతం పరారీలో వున్న నిందితులతో కలసి ఆన్లైన్ బెట్టింగ్, గోవాలో కాసినోలలో జూదం ఆడటంతో పాటు గోవా, బెంగుళూరు ప్రాంతాల్లో వ్యభిచార గృహాల్లో ఖర్చు చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా, ఘరానా మోసగాడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి డి.కవిత, వరంగల్ ఎసిపి ఎన్. శుభం ప్రకాష్, టాస్క్‌ఫోర్స్ ఎసిపి ఏ. మధుసూదన్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు ఎల్. పవన్ కుమార్, కె. శ్రీధర్, ఎల్. మంగిలాల్, మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ బి. రమేష్, ఎస్.ఐ లు ఎస్. మహేష్, ఎం. సురేష్‌లను, టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పి.ఎస్. సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేశారు.

మన తెలంగాణ 1 Dec 2025 8:12 pm

కెసిఆర్ దీక్ష ఓ నాటకం: మహేశ్‌కుమార్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో నాడు కెసిఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జిల్లా నూతన అధ్యక్షుడుగా ఎంపికైన నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడుగా ఎంపికైన బొబ్బిలి రామకృష్ణ సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నగరంలోని ఓ కళ్యాణ మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనే పిసిసి చీఫ్ మాట్లాడుతూ.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పార్టీ జిల్లా, నగర అధ్యక్షులకు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి వరకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల సమస్యలు తీర్చడంలో పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కలిసికట్టుగా ఉండి విజయమే లక్ష్యంగా అడుగు వేయాలని సూచించారు. గత 10 సంవత్సరాల కష్టకాలంలో జిల్లా పార్టీకి అండగా ఉంటూ అధికారమే లక్ష్యంగా పెట్టుకొని సేవలందించిన మనాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణును అభినందించారు. బిఆర్‌ఎస్ ఉనికిని చాటుకునేందుకు కోట్లాది రూపాయల ఖర్చుతో దీక్షా దివస్ పేరుతో ఆ నాటకాన్ని రక్తి కట్టించేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. ఆ రోజున కెసిఆర్ చేసిన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, సోనియాగాంధీ వల్ల రాష్ట్రం వచ్చిందని అన్నారు. ఆనాడు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే కెసిఆర్ ముఖ్యమంత్రిగా, కెటిఆర్, హరీశ్‌రావు, కవితకు పదవులు వచ్చేవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయని జోస్యం చెప్పారు. దీక్షా దివస్ చేసిన మాజీ ఎమ్మెల్యే జిల్లాలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్లపై ఎంతో శ్రమించి తీసుకువస్తే బిజెపి నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. అందువల్లనే వారికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉండదని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ పాటికే పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి ప్రజలు ఆకర్షితులై పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పేర్కొన్న హామీలు, ఆరు గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. జిల్లాకు 35 ఏళ్ల కల అయిన ఇంజనీరింగ్ కళాశాల తీసుకువచ్చామని తెలిపారు. తన స్వగ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 11 ఎకరాలు దానం చేసినట్లు తెలిపారు.

మన తెలంగాణ 1 Dec 2025 8:07 pm

అయ్యప్పస్వాముల గిరిప్రదక్షిణతో మార్మోగిన యాదాద్రి

అయ్యప్పస్వాముల గిరిప్రదక్షిణతో యాదాద్రి కొండలు మార్మోగాయి. భక్తుల ఇలవేల్పు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ గిరిప్రదక్షిణను అయ్యప్ప స్వాములు శరణు.. శరణు..నారసింహ..స్వామియే శరణమయ్యప్పా అంటూ నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో కొండ కింద గల పాదాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామిని ఊరేగిస్తూ గిరిప్రదక్షిణ నిర్వహించారు. అయ్యప్ప స్వాముల శరణుఘోషతో యాదాద్రి పరిసర ప్రాంతాలు నారసింహుడి నామస్మరణతో మార్మోగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు గిరిప్రదక్షిణలో పాల్గొని సందడి చేశారు. గిరిప్రదక్షిణ అనంతరం అయ్యప్ప స్వాములందరూ కాలినడకన కొండపైకి చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములకు నేరుగా గర్భాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు కల్పించారు. అయ్యప్ప స్వాములకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు. గిరిప్రదక్షిణలో పాల్గొనడం సంతోషంగా ఉంది ః ఎమ్మెల్యే అయ్యప్ప స్వాములతో కలిసి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి గిరిప్రదక్షిణలో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. సోమవారం తెల్లవారుజామున అయ్యప్పస్వాములతో కలిసి ఆయన గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. అయ్యప్పలతో కలిసి కొండపైకి కాలినడకన వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండోసారి కూడా అయ్యప్ప స్వాముల గిరిప్రదక్షిణ నిర్వహించడం సంతోషంగా ఉందని, శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గిరిప్రదక్షిణలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈవో వెంకట్రావు, బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గురుస్వామి, బాసర పీఠాధిపతి, గో పాదయాత్ర నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి, అనిల్ గురుస్వామి, పెండెం శ్రీనివాస్‌తో పాటు అయ్యప్పస్వాములు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక చర్యలు.. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయ్యప్ప స్వాముల కోసం ట్రాఫిక్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయ్యప్ప స్వాములు ఏ రూట్లో వచ్చే వారి కోసం ఆ రూట్లోనే పార్కింగ్ సౌకర్యం కల్పించిట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూశారు. అటు స్థానికులకు, ఇటు అయ్యప్ప స్వాములకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

మన తెలంగాణ 1 Dec 2025 8:04 pm

కరిచే వాళ్లు లోపల ప్రభుత్వాన్ని నడుపుతున్నారు: రేణుకా చౌదరి

 పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కను కూడా వెంటబెట్టుకుని రావడంతో చర్చనీయాంశం కావడంతో పాటు విమర్శలకు దారి తీసింది. ఆమె కారులో కుక్క ఉన్నట్లు గుర్తించిన భద్రతా సిబ్బంది గేటు వద్దే నిలిపివేశారు. అక్కడి నుంచి కుక్కను తిరిగి ఆమె ఇంటికి పంపించారు. దీనిపై రేణుకా చౌదరి ఆగ్రహానికి గురయ్యారు. కుక్కను అనుమతించడానికి ప్రోటోకాల్ ఏంటని ప్రశ్నించారు. పెంపుడు జంతువు ప్రాణాన్ని రక్షించడాన్ని కూడా అభ్యంతరపెడతారా అని ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యులు పెంపుడు శునకాన్ని తీసుకురావద్దనడానికి ఏదైనా చట్టం ఉందా అని నిలదీశారు. తన కుక్క ఎవరినీ కరవదని, కరిచే వాళ్లు లోపల ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వ్యంగంగా వ్యాఖ్యానించారు. రేణుకా చౌదరి వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. ఆమె వైఖరి పార్లమెంట్‌ను అవమానించడమేనని దుయ్యబట్టింది. కాంగ్రెస్ ఎంపి తన తోటి సభ్యులను కుక్కతో పోల్చదల్చుకున్నారా అని బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. గతంలో ఆమె జవాన్లను కూడా అవమానించారని, ఆపరేషన్ సింధూర్‌ను ఆపరేషన్ మహదేవ్‌గా అభివర్ణించారని గుర్తు చేశారు. ఇదిలావుండగా రేణుకా చౌదరి కుక్కను వెంట బెట్టుకుని రావడంపై పార్లమెంట్ వర్గాలు సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు సమాచారం.

మన తెలంగాణ 1 Dec 2025 8:00 pm

తిరుపతిలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు

తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు హోటళ్లను లక్ష్యంగా చేసు కుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపారు. దీంతో హోటళ్ల యాజమాన్యాలు తీవ్ర ఆందోళనకు గురై వెంటనే పోలీ సులకు సమాచారం అందించాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలో ఉన్న రెండు హోటళ్లకు బాంబు పెట్టినట్లు బెదిరిం పు మెయిల్స్ అందాయి. ఈ సమాచారం అందుకున్న హోటళ్ల నిర్వాహకులు అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆయా హోటళ్లకు చేరుకున్నారు. అక్కడ తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. అయితే, అక్కడ ఎలాంటి బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజుల క్రితమే తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం, టిటిడి కార్యాలయం, రైల్వే స్టేషన్‌కు కూడా ఇలాగే ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం గమనా ర్హం. అప్పుడు కూడా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిచారు. ప్రస్తుతం మళ్లీ హోటళ్లను లక్ష్యంగా చేసుకోవడంతో ఇది ఆకతాయిల పనే అని పోలీసులు అనుమానిస్తు న్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోం ది. 

మన తెలంగాణ 1 Dec 2025 7:49 pm

ప్రియురాలితో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌

గ్రామానికి సర్పంచ్‌ అవ్వాలని అనుకున్నాడు ఆ యువకుడు. ఎన్నికలు వచ్చేసినా రిజర్వేషన్‌ అనుకూలించలేదు.

తెలుగు పోస్ట్ 1 Dec 2025 7:45 pm

చంద్రబాబు నమోదైన ఎక్సైజ్ కేసు మూసివేత

 ఎపి సిఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై గత జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఎక్సైజ్ కేసును ఎసిబి కోర్టు సోమవారం మూసివేసింది. ఫిర్యాదు చేసిన వారు నిరభ్యంతర పత్రం ఇప్పటికే న్యాయస్థానానికి అందజేశారు. సిఐడి అధికారు ల దర్యాప్తును అంగీకరించి కేసును ఎసిబి కోర్టు క్లోజ్ చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.... వైసిపి ప్రభుత్వ హయాంలో 2023 అక్టోబర్ 30న ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయని సిఐడి కేసు నమోదు చేసింది. గతంలో టీడీపీ హయాంలో 2014-19 లో ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయని, డిస్టిలరీలకు అర్హత లేకపోయినా లైసెన్సులు ఇవ్వడం, కొందరికి ప్రయోజనాలు కల్పించే విధంగా వ్యవహరించారని సిఐడి అభియోగాలు మోపింది.దీనిపై పిసి యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఎపి బేవరేజేస్ ఎండి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎ1 గా సుధాకర్, ఎ2 కొల్లు రవీంద్, ఎ3 చంద్రబాబు పేర్లను ఎపి సిఐడి నమోదు చేసింది. అయితే తాజాగా ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఇందుకు ఆధారాల్లేవని సిఐడి కోర్టుకు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తెలియజేయడంతో ఈ కేసును మూసివేసింది. అలాగే గతంలో చంద్రబాబుపై గత ప్రభుత్వం పెట్టిన ఫైబర్‌నెట్ కేసును కూడా కోర్టు మూసివేసింది. ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, సంస్థకు ఎటువంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని సిఐడి దర్యాప్తులో తేలినట్టు పేర్కొన్నారు.

మన తెలంగాణ 1 Dec 2025 7:44 pm

సామూహిక వివాహ వేడుకలో తాళి కట్టిన సీఎం కొడుకు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కుమారుడి వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా జరిపించారు.

తెలుగు పోస్ట్ 1 Dec 2025 7:37 pm

Title Glimpse: Anand Deverakonda’s Epic

Baby pair Anand Deverakonda and Vaishnavi Chaitanya are working together for the second time and the film is titled Epic. The title glimpse of Epic is out and it is quite impressive. 90s fame Aditya Hasan is the director of this romantic entertainer and the shooting portions of Epic are completed. Set in the backdrop […] The post Title Glimpse: Anand Deverakonda’s Epic appeared first on Telugu360 .

తెలుగు 360 1 Dec 2025 7:26 pm

టెస్టుల్లో ఆడడంపై విరాట్ కోహ్లీ క్లారిటీ

విరాట్ కోహ్లీ తన భవిష్యత్ ప్రణాళికలపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. తాను కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు.

తెలుగు పోస్ట్ 1 Dec 2025 7:24 pm

విలేజ్‌ కుకింగ్‌.. 3 కోట్లు దాటింది

‘విలేజ్‌ కుకింగ్‌ యూట్యూబ్‌ ఛానల్‌’.. పక్కా గ్రామీణ శైలిలో ఉంటాయి ఇందులోని వంటకాలు.

తెలుగు పోస్ట్ 1 Dec 2025 7:21 pm

చందానగర్‌లో అగ్ని ప్రమాదం.. గుడిసెలు దగ్ధం

హైదరాబాద్: చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవన నిర్మాణ సంస్థ వద్ద.. కార్మికులు వేసుకున్న గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. అక్కడ దాదాపు 50 గుడిసెలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి గల కారణంగా తెలియ రాలేదు.

మన తెలంగాణ 1 Dec 2025 7:10 pm

బోయింగ్ విమానాలు న‌డ‌పాలి..

కేంద్ర మంత్రి ఎంపీ కేశినేని వినతి . ఆంధ్రప్రభ, విజయవాడ : శ‌బ‌రిమ‌ల

ప్రభ న్యూస్ 1 Dec 2025 7:10 pm

NRI రియాలిటీ మీట్‌ను నిర్వహించిన ASBL..

హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్

ప్రభ న్యూస్ 1 Dec 2025 7:03 pm

కొత్తూరు లో ప్రేమ జంట ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం కొత్తూరు మండల కేంద్రంలో ఇద్దరు ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి ప్రేమ కథ ఆత్మహత్య రూపంలో విషాదాంతంగా ముగియడంతో కొత్తూరులో విషాదఛాయలు అలముకున్నాయి. పొట్ట చేత పట్టుకుని బీహార్ నుండి బ్రతుకుతెరువు కోసం కొత్తూరు వచ్చిన వలస కార్మికుడి కుటుంబంలో చెలరేగిన ఈ కల్లోలానికి ముక్కుపచలానని పసి హృదయాలు పాడే ఎక్కబోతున్నాయి. కొత్తూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న ట్రక్ డ్రైవర్ నవనీత్ దత్తకు ఇద్దరు కుమార్తెలు ఇందులో అనామిక (21) అనే యువతీ ధనుంజయ్ (25) అని యువకుడితో ప్రేమలో ఉంది. అయితే వీరందరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. గత మూడు రోజులుగా అనామిక కంపెనీకి వెళ్లడం లేదు. సుమారు అనామిక కోసం ధనుంజయ్ ఇంటికి వచ్చాడు. అప్పటికే అనామిక ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. ఈ దుష్యం చూసి తట్టుకోలేని ప్రేమికుడు అతను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు కొత్తూరు సిఐ నరసయ్య తెలిపారు. ట్రక్ డ్రైవర్ తండ్రి నవనీత్ దత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఇంట్లో కనిపిస్తున్న సిసి కెమెరాకు సంబంధించిన ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటికీ అది సరిగ్గా పని చేయడం లేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపబోతున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని శంషాబాద్ ఎసిపి శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు.

మన తెలంగాణ 1 Dec 2025 7:01 pm

చరిత్ర సృష్టించిన ఇషాన్.. అనితరసాధ్యమైన రికార్డు సొంతం

యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ టి-20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌లో తన సొంత జట్టు జార్ఖండ్‌కు అతడు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జార్ఖండ్, త్రిపుర జట్టుతో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో త్రిపుర జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం జార్ఖండ్ జట్టు 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 185 పరుగులు చేసి విజయం సాధించింది. జార్ఖండ్ బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 113 పరుగులు చేసి అద్భుత శతకాన్ని సాధించాడు. దీంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో టి-20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇషాన్ కెప్టెన్, కీపర్‌గా ఉంటూ సాధించిన సెంచరీలు మూడు. గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2018-19 సీజన్‌లో జార్ఖండ్ కెప్టెన్‌గా, కీపర్‌గా అతడు రెండు సెంచరీలు చేయగా.. ఈ సీజన్‌లో మరో సెంచరీ సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ పేరిట ఉండేది. గిల్‌క్రిస్ట్ మిడిల్‌స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరఫున కీపర్‌గా, కెప్టెన్‌గా ఉంటూ రెండు శతకాలు సాధించాడు.

మన తెలంగాణ 1 Dec 2025 6:51 pm

తుపాకీతో బెదిరించి ..వివస్త్రగా చేసి

ఓ మహిళా వ్యాపారవేత్త పట్ల ప్రైవేటు కంపెనీ ఎండీ అతి దారుణంగా వ్యవహరించిన సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. తుపాకీతో బెదిరించి ఆమెను వివస్త్రగా చేసి వేధింపులకు పాల్పడ్డాడు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రాంకో- ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ఎండి జాయ్ పాస్కల్ పోస్ట్ మీటింగ్ ఉందంటూ బాధితురాలిని ఆఫీసుకు పిలిచి తుపాకీతో ఆమెను బెదిరించి బట్టలు తీయించి నగ్నంగా ఉండగా ఫోటోలు, వీడియోలు సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు.ఈ విషయం బయట ఎవరికైనా చెప్పితే ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. అక్కడ నుండి బయటకు వచ్చిన బాధిత మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జాన్ తో పాటు మరో ఐదుగురిపై లైంగిక వేధింపుల కేసు పెట్టి విచారణ ప్రారంభించారు.

మన తెలంగాణ 1 Dec 2025 6:43 pm

Why Are Fans Still Holding On? The Painful Reaction to Samantha’s New Beginning

Today, Samantha married Raj Nidimoru. A simple, happy moment. A woman starting a new chapter in her life with someone she chose. But the peace didn’t last even a few hours. The moment her wedding photos appeared online, the trolling began. Social media is filled with comparisons, judgments and unwanted nostalgia. Many users rushed to […] The post Why Are Fans Still Holding On? The Painful Reaction to Samantha’s New Beginning appeared first on Telugu360 .

తెలుగు 360 1 Dec 2025 6:42 pm

ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన పెంపొందించుకోవాలి

నెల్లికుదురు, ఆంధ్రప్రభ : ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని

ప్రభ న్యూస్ 1 Dec 2025 6:34 pm

Telangana : తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు

తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలుగు పోస్ట్ 1 Dec 2025 6:22 pm

NTR bharosa|పొదుపు మంచిది

NTR bharosa| పొదుపు మంచిది NTR bharosa| భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Dec 2025 6:22 pm

కోహ్లీ సెంచరీ చూస్తే.. అలా అనిపించింది: కుల్దీప్ యాదవ్

రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుత శతకం బాదిన విషయం తెలిసిందే. 11 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 135 పరుగులు చేసి కోహ్లీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, కోహ్లీ చాలా కాలం తర్వాత సెంచరీ చేయడంతో అటు అభిమానులే కాదు.. సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ కూడా సంతోషంలో మునిగిపోయారు. తొలి వన్డేలో నాలుగు వికెట్ల తీసిన కుల్దీప్ కూడా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ‘‘కోహ్లీ భాయ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నా కెరీర్ ప్రారంభమైంది. అతడు బ్యాటంగ్ చేసిన విధానం చూస్తే నేను 8-9 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లు అనిపించింది. 2017, 2018, 2019లో ఆడినట్లు ఈ మ్యాచ్‌లో ఆడాడు. ఇది చాలా మంది ఇన్నింగ్స్, అతడు చాలా ఆత్మ విశ్వాసంతో కనిపించాడు. కోహ్లీతో కలిసి ఆడటం చాలా బాగుంది. అతడి నుంచి చాలా నేర్చుకుంటాం. బౌలర్లకు కూడా మద్దతిస్తూ ఇన్‌పుట్స్ ఇస్తుంటాడు. ఆటగాళ్లలో ఉత్సహాన్ని నింపుతాడు. అతను జట్టులో ఉండటం మా అదృష్టం’’ అని కుల్దీప్ అన్నాడు.

మన తెలంగాణ 1 Dec 2025 6:06 pm

ELECTIONS|పద్మశాలి సత్తా చాటాలి..

ELECTIONS| కమలాపూర్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో

ప్రభ న్యూస్ 1 Dec 2025 6:04 pm

Meenakshi Natarajan : మీనాక్షి.. దూరం.. దూరం.. రాహుల్ ను అదే కోరారా?

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నామమాత్రంగా మారిపోయారు

తెలుగు పోస్ట్ 1 Dec 2025 6:02 pm

STUDENTS |వ్యసనాలకు దూరంగా ఉండాలి

STUDENTS | వ్యసనాలకు దూరంగా ఉండాలి డీఐఈఓ అంజయ్య STUDENTS | జన్నారం

ప్రభ న్యూస్ 1 Dec 2025 6:00 pm

Market|కూరగాయల వ్యాపారుల ఆందోళన

Market| చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు పట్టణ, మార్కెట్ తదితర ప్రాంతాల్లో కూరగాయల

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:57 pm

Congress |సుగుణక్కకు సన్మానం

Congress | సుగుణక్కకు సన్మానం Congress | తిర్యాణి, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:55 pm

Checking |అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ

Checking | వాంకిడి, ఆంద్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో భద్రతా

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:52 pm

Srikakulam |అత్యవసర చికిత్స అందించాలి

Srikakulam | అత్యవసర చికిత్స అందించాలి తాళ్లవలస డయేరియా ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు

ప్రభ న్యూస్ 1 Dec 2025 5:51 pm