కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద కారును పార్కింగ్ చేయడంతో కలకలం సృష్టించింది. కాచిగూడ నింబోలి అడ్డ వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి కింద రోడ్డుకు అడ్డంగా ఓ వ్యక్తి కారును పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి 7.30 గంటలకు కారు పార్క్ చేసి వెళ్లడంతో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఎవరినీ అటువైపు రానివ్వలేదు. వెంటనే బాంబ్ స్కాడ్, డాగ్ స్క్వాడ్ను పలిపించి కారులో తనిఖీలు నిర్వహించారు. కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించిన తర్వాత కారును పక్కకి తప్పించారు. ఈస్ట్జోన్ డిసిపి బాలస్వామి అక్కడికి వచ్చి తనిఖీలను పర్యవేక్షించారు. కారు బాలాజీ అనే వ్యక్తి పేరుపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
శుక్రవారం రాశి ఫలాలు (14-11-2025)
మేషం వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృషభం విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. వివాదాలకు సంభందించి విలువైన సమాచారం అందుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. మిధునం ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణ మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు తప్పవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబసభ్యుల నుంచి ధనపరమైన ఒత్తిడి తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కర్కాటకం వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగతాయి. ఇంటాబయట బాధ్యతలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సింహం పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో కీలక వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కన్య వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు సానుకూలమౌతాయి.ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. తుల వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. వృశ్చికం చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమౌతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ధనస్సు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. పాతబాకీలు వసూలవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మకరం కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. సంతాన విద్యా, ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభం ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో సమస్యలు అదిగమిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు. బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మీనం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కొన్ని పనులలో శ్రమ పడినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
Cartoon 14th Nov ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
Andhra prabha effect |ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా…?
ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ) : ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా…? కూలింగ్ కెనాల్లోకి విద్యుత్ కేంద్ర
ఎమ్మెల్యే కొణతాల కుమార్తె వివాహానికి హాజరైన మంత్రి లోకేష్
భోగాపురం, ఆంధ్రప్రభ : అనకాపల్లి ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ కుమార్తె
32 కార్లతో పలు ప్రాంతాలలో విధ్వంసం ?
దేశవ్యాప్తంగా పలు నగరాలు, సునిశిత పట్టణాలు, ప్రాంతాలలో భారీ స్థాయిలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడులకు కుట్ర జరిగింది. ఎర్రకోట వద్ద కారులో భారీ స్థాయి పేలుడు, 13 మంది దుర్మరణం తరువాతి దర్యాప్తు క్రమంలో ఇంటలిజెన్స్ అధికారులు ఈ కీలక సమాచారం రాబట్టారు. మొత్తం 32 కార్లు , ఇతరత్రా వాహనాలలో భారీ పేలుడు పదార్థాలను తీసుకువెళ్లి , జనసమ్మర్థపు ప్రాంతాలలో అదును చూసుకుని పేల్చివేసేందుకు, తద్వారా కల్లోలం సృస్టించేందుకు పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఆయా ప్రాంతాల్లోని తమ ఏజెంట్ల సహకారంతో పూర్తి సమన్వయంతో కుట్రకు దిగినట్లు ఇప్పుడు దర్యాప్తు వేగవంతం క్రమంలో స్పష్టం అయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతి కారులోనూ శక్తివంతమైన పేలుడు పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా తీసుకువెళ్లేందుకు తగు విధమైన ఏర్పాట్లు జరిగినట్లు పసికట్టారు. ఇందుకు ఉగ్రశక్తులు హ్యుండాయ్ ఐ20 , ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వంటి ఆధునీకరించిన కార్లను వాడాలని వ్యూహరచనకు దిగారు. దేశంలో పలు చోట్ల వరుస పేలుళ్లకు ఇప్పటికే ఈ కార్లు సిద్ధం అయ్యాయా? ఉంటే అవి ఎక్కడున్నాయనేది ఇప్పుడు ఇంటలిజెన్స్ వర్గాల దర్యాప్తు క్రమంలో కీలక అంశం అయింది. పేలుడు పదార్థాలను అమర్చి ఉన్న వాహనాలను రంగంలోకి దింపాలని ఉగ్రశక్తులు ఫక్కా ప్రణాళికలు రూపొందించుకున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు ముందుగా కనుగొన్నాయి. ముందుగా దాదాపు ఎనిమిది మంది నాలుగు ప్రాంతాలలో సమన్వయరీతిలో పేలుళ్లకు దిగాలని సిద్ధం అయ్యారు. ఇందులో ఇద్దరేసి చొప్పున నాలుగు ప్రాంతాలలో దాడికి వ్యూహరచనకు దిగారు. వారు నిర్ణీతంగా ముందుగా కొన్ని నగరాలను ఎంచుకున్నారని వెల్లడైంది. బహుళ స్థాయి పేలుడు పరికరాలు (ఐఇడి)లతో ఒకేసారి ధ్వంసానికి దిగాలని చూశారు. ఎర్రకోట వద్ద పేలుడుతో సంబంధం ఉన్న డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ అదీల్, డాక్టర్ ఉమర్ , డాక్టర్ షహీన్లకు ఇంతకు ముందటి ఉగ్రవాద చర్యల కేసులతో కూడా లింక్లు ఉన్నట్లు వెల్లడైంది. వీరి ప్రధాన కార్యాచరణతోనే 32 కార్లలో పలు ప్రాంతాలలో పేలుళ్లకు కుట్ర జరిగిందని ఇప్పుడు పట్టుబడి, ఇంటరాగేషన్లో ఉన్న వారి వివరణలతో వెల్లడిఅయింది. అయితే ఉగ్రదాడుల భయం ఇప్పటికీ ఉందా? లేక దీనిని భద్రతా సిబ్బంది సకాలంలోనే అడ్డుకోగలిగారా? అనేది స్పష్టం కాలేదు. ఢిల్లీ, అయోధ్య ఇతర నగరాలలో బాబ్రీ మసీదు కూల్చివేత దినం డిసెంబర్ ఆరు బ్లాక్డే నాడే పేలుళ్లకు కార్యాచరణకు దిగినట్లు అనమానిస్తున్నారు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు..
కోల్ కతా : సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడుగా కలకత్తా హైకోర్టు ప్రకటించింది. 2021లో బీజేపీ టికెట్ పై ఎన్నికై, తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోకి మారిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ ను ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కలకత్తా హోకోర్టు గురువారం అనర్హులుగా ప్రకటించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రాయ్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్ పై స్పీకర్ తన తీర్పులో ఆయన బీజేపీ ఎమ్మెల్యే అని పేర్కొన్నందున కోర్టు ఆ నిర్ణయాన్ని వికృతమైనదిగా పేర్కొంది. 2021 జూన్ 11 నుంచి అసెంబ్లీలో ఆయన సభ్యత్వం అనర్హతకు గురైనందున, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఏసి) చైర్మన్ గా రాయ్ నామినేషన్ ను కూడా ఇది పక్కన పెట్టింది. ముకుల్ రాయ్ ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చుతూ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ 2022 జూన్ 8న ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టడానికి తమకు ఎలాంటి సందేహం లేదని జస్టిస్ దేబాంగ్సు బసక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ముకుల్ రాయ్ ను అనర్హుడిగా ప్రకటించాలని అధికారి దాఖలు చేసిన పిటిషన్ తో సమానంగా విచారణకు వచ్చిన బిజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్ దాఖలు చేసిన మరో పిటిషన్ ను కోర్టు అనుమతించింది. 2021 జూన్ 11నుంచి అమల్లోకి వచ్చేలా భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ , 1986 నిబంధనల ప్రకారం ముకుల్ రాయ్ అనర్హుడిగా ప్రకటించినట్లు జస్టిస్ ఎండీ షబ్బర్ రషీది తో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2021 జూన్ 11న ముకుల్ రాయ్ బిజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ కు ఫిరాయించారని బీజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్ నిరూపించగలిగారని ధర్మాసనం పేర్కొంది.
Tourist attractions |ఓరుగల్లుకు పర్యాటక సొబుగులు..
Tourist attractions | ఓరుగల్లుకు పర్యాటక సొబుగులు.. ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ :
పశ్చిమ బెంగాల్ లో పార్టీ ఫిరాయించిన ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వం రద్దు
సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడుగా కలకత్తా హైకోర్టు ప్రకటించింది. 2021లో బీజేపీ టికెట్ పై ఎన్నికై, తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోకి మారిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ ను ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కలకత్తా హోకోర్టు గురువారం అనర్హులుగా ప్రకటించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రాయ్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్ పై స్పీకర్ తన తీర్పులో ఆయన బీజేపీ ఎమ్మెల్యే అని పేర్కొన్నందున కోర్టు ఆ నిర్ణయాన్ని వికృతమైనదిగా పేర్కొంది. 2021 జూన్ 11 నుంచి అసెంబ్లీలో ఆయన సభ్యత్వం అనర్హతకు గురైనందున, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఏసి) చైర్మన్ గా రాయ్ నామినేషన్ ను కూడా ఇది పక్కన పెట్టింది. ముకుల్ రాయ్ ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చుతూ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ 2022 జూన్ 8న ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టడానికి తమకు ఎలాంటి సందేహం లేదని జస్టిస్ దేబాంగ్సు బసక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ముకుల్ రాయ్ ను అనర్హుడిగా ప్రకటించాలని అధికారి దాఖలు చేసిన పిటిషన్ తో సమానంగా విచారణకు వచ్చిన బిజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్ దాఖలు చేసిన మరో పిటిషన్ ను కోర్టు అనుమతించింది. 2021 జూన్ 11నుంచి అమల్లోకి వచ్చేలా భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ , 1986 నిబంధనల ప్రకారం ముకుల్ రాయ్ అనర్హుడిగా ప్రకటించినట్లు జస్టిస్ ఎండీ షబ్బర్ రషీది తో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2021 జూన్ 11న ముకుల్ రాయ్ బిజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ కు ఫిరాయించారని బీజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్ నిరూపించగలిగారని ధర్మాసనం పేర్కొంది.
సీఐఐ సదస్సుకు ముందే అనూహ్య స్పందనరూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులుఒక్కరోజులోనే ఐదు రంగాల్లో 35 ఎంవోయూలురూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షల ఉద్యోగాలుచంద్రబాబు, లోకేశ్ సమక్షంలో ఒప్పందాలు విశాలాంధ్ర బ్యూరో- విశాఖపట్నం: గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖలో శుక్ర, శనివారాల్లో జరిగే 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఒకరోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వంతో వివిధ పారిశ్రామిక సంస్థలు పెద్దసంఖ్యలో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఉదయం […] The post పెట్టుబడుల వరద appeared first on Visalaandhra .
రిజర్వేషన్లు బడుగుల హక్కు.. జనాభా ప్రాతిపదికన వాటా దక్కాల్సిందే!
కేంద్రంపై ఒత్తిడికి అందరూ కలిసిరావాలి బిసిల ధర్మ పోరాట దీక్షలో వక్తలు ఐక్యంగా పోరాడాలన్న బండారు దత్తాత్రేయ బిసిలకు అండగా ఉంటామన్న కోదండరాం మన తెలంగాణ/విద్యానగర్: జనాభా లెక్కల ప్రాతిపదికన బలహీన వర్గాలకు సరైన వాటా ఇవ్వాల్సిందేనని, ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని పలువురు వక్తలు స్పష్టం చేశారు. బిసిల రాజకీయ హక్కుల సాధన కోసం అందరూ కలిసిరావాలన్నారు. బలహీన వర్గాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ చేయాలన్న డిమాండుతో గురువారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష పేరిట బారీ నిరసన ప్రదర్శన జరిగింది. బీసీ జేఏసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ దీక్షలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బి ఆర్ ఎస్ శాసనసభ పక్ష నేత మధుసూదనా చారి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, ఎల్ రమణ, మాజీ ఎంపీ, మధు యాష్కీ గౌడ్ పాల్గొని బలహీన వర్గాల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ జనాభాకు అనుగుణంగా అందరికి సమాన అవకాశాలు దక్కాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అన్ని పార్టీలు సహకరించాలని సూచించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అందరికీ న్యాయమైన హక్కులు దక్కాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ జరిగితే మంచిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బీసీ కోటా కోసం కేంద్రంపై వత్తిడి తీసుకురావడానికి సహకారం అందిస్తామని చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు ఎవరి దయాదక్షిణ్యాలు అవసరం లేదని, జనాభా ప్రాతిపదికన వాటా ఇవ్వాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపితే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇందుకోసం డిల్లీకి అఖిల పక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పాలకులకు హితవు పలికారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బీసీల ఉద్యమానికి మాల మహానాడు అండగా ఉంటుందని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. దీక్ష ముగింపు సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం అందరూ కలిసికట్టుగా ఉంటేనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుందనీ, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కోసం తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లతోనే విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో సమన్యాయం జరుగుతుందనీ, హక్కుల కోసం కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలోను ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలనీ, ఎంపీలందరూ కలిసి పార్లమెంటు సమావేశాలను స్తంభింప చేయాలన్నారు. పార్టీల పరంగా కాకుండా చట్టబద్ధంగా కోటా అమలుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. బీసీ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తూ అగ్రవర్ణాలపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లను సాధించుకోవాలని జాజుల పిలుపు ఇచ్చారు. బీసీలంతా కలిసి ఉద్యమించినప్పుడే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయని, లేదంటే ఉద్యమం నీరుగారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీసీ జేఏసీ కో ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, కుల్కచర్ల శ్రీనివాస్, నంద గోపాల్, వేముల రామకృష్ణ, గణేష్చారి, కనకాల శ్యామ్, శేఖర్, సాగర్, మణి మంజరి సహ 130 కుల సంఘాల నాయకులు, విద్యార్థి, ఉద్యోగ, మహిళా సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో గురువారం స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర ఒక్కరోజే దాదాపు రూ.3 వేలకు పైగా పెరిగి 1,30,800 కు చేరుకుంది. అమెరికాలో షట్డౌన్ ముగిసిపోవడం ఈ ధరలకు ఊతం ఇచ్చినట్టు వ్యాపారులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. 99.5 శాతం స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములకు రూ.3000 వంతున పెరిగి రూ.1,30,000 కు చేరింది. బుధవారం మార్కెట్ ముగిసేనాటికి 10 గ్రాములు ధర రూ.3000 వంతున పెరిగి రూ.1,27,300 వరకు పలికింది . అంతకు ముందు స్థానిక బులియన్ మార్కెట్లో రూ.1,27,000 ధర పలికింది. ఇక వెండి ధరలు అన్ని పన్నులు కలుపుకుని రూ.7700 వంతున పెరిగి కిలో రూ. 1,69,000 వరకు చేరింది. బుధవారం వెండి ధరలు రూ.5540 వంతున పెరిగి కిలో వెండి రూ.1,61,300 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సు మళ్లీ 4200 స్థాయిని దాటి 4218 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు 54.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీన్నిఅనుసరించి దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి.
. 32 కార్లతో దిల్లీలో పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకార కుట్ర. అల్-ఫలాప్ా యూనివర్సిటీలోనే పథక రచన. దిల్లీ పేలుడు కేసులో దిగ్భ్రాంతి కొల్పే వాస్తవాలు న్యూదిల్లీ: దిల్లీ ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు కేసు, ఫరీదాబాద్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు కనుగొన్న కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటన ఉగ్రవాద దాడిగా కేంద్రం ప్రకటించగా… నిందితులందరికి జైషే […] The post టార్గెట్ డిసెంబర్`6 appeared first on Visalaandhra .
పేలుడు స్థలికి 300 మీటర్ల దూరంలో తెగిపడ్డ చేయి లభ్యం
ఎర్రకోట వద్ద పేలుడు ఘటనా స్థలికి 300 మీటర్ల దూరంలో ఓ దుకాణంపై తెగిపడి ఉన్న ఓ చేయిని గుర్తించారు. పూర్తిగా చితికి పోయి ఉన్న ఈ చేయి పేలుడు తీవ్రతను తెలియచేసింది. న్యూ లజపత్ రాయ్ మార్కెట్లో ఓ స్టోర్పై ఈ చేయి పడి ఉండగా గురువారం ఢిల్లీ పోలీసులు గుర్తించారు పేలుడులో పలువురి మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి. శరీర భాగాలు చెల్లాచెదరుగా పడిపోయ్యాయి. దీనితో మృతుల గుర్తింపు డిఎన్ఎ పరీక్షలతో సాధ్యం అవుతోంది. ఇప్పుడు ఇక్కడ దొరికిన చేయిని ల్యాబ్కు పంపించారు. ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా ఇది ఏ మృతజీవి శరీర భాగం అనేది కనుగొనేందుకు యత్నిస్తున్నారు.
నేడు బీహార్ ఓట్ల లెక్కింపుదేశవ్యాప్తంగా ఉత్కంఠ పట్నా: దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో ఏ కూటమిని విజయం వరించిందన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. గురువారం ఉదయం 8గంటల నుంచి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 38 జిల్లాల్లో 46 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడిరచింది. ప్రతి కేంద్రం వద్ద రెండంచెల భద్రత వ్యవస్థ ఉంటుందని పేర్కొంది. అలాగే లెక్కింపు కేంద్రం […] The post పీఠం ఎవరిదో? appeared first on Visalaandhra .
జిహెచ్ఎంసి ఆఫీస్ లో అగ్ని ప్రమాదం.. దగ్ధమైన ఫైల్స్
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: అనుమానాస్పద స్థితిలో కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి కార్యాలయంలో మంటలు చెలరేగాయి. రెవిన్యూ సెక్షన్లో మంటలు వ్యాపించి పలు ఫైల్స్ దగ్ధం అయ్యాయి. కూకట్పల్లి జోనల్ కమిషనర్ పరిధిలోని కత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి సర్కిల్ ఆఫీస్ మొదటి అంతస్తులో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో అనుమానాస్పద స్థితిలో సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లే సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మంటల ధాటికి పూర్తిగా మంటల్లో రెవిన్యూ విభాగం ఫైళ్లు కాలిపోయాయి. ఏళ్ల తరబడికి చెందిన డాక్యుమెంట్ల మూటలు నిల్వ చేసి ఉండటంతో మంటలు అధికమయ్యాయి. సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్ని మాపక సిబ్బంది, జీడిమెట్ల పోలీసులు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది దాదాపు గంట సేపు శ్రమించి కార్యాలయంలో అలుముకున్న దట్టమైన పొగ మధ్య మంటలను అదుపులోకి తెచ్చారు. జరిగిన అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి మంటలు చెలరేగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం నుండి సిబ్బంది ఉన్నప్పుడు రాని మంటలు విధులు ముగించుకుని బయటకు వెళ్ళగానే అగ్ని ప్రమాదం సంభవించడం పలు అనుమానాలకు తావు నిస్తుంది. రికార్డులు ఉన్న గదిలో అగ్నిప్రమాదం జరగడంపై అధికారులు కాస్త కలవరా పడుతున్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదం ప్రమాదవశత్తు జరిగిందా? లేక అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహాయంతో అధికారులు వెనకాల ఉండి అవకతవకలకు ఆధారాలు లేకుండా ఉండేందుకు ఈ దారుణానికి ఒడిగట్టరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా సిబ్బందికి అండగా నిలిచిన జీడిమెట్ల పోలీసులు కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంలో జీడిమెట్ల పోలీసులు సిబ్బందికి అండగా నిలిచారు.ప్రమాదం జరిగిన ఫ్లోర్తోపాటు పై ఫ్లోర్లో ఉన్న దాదాపు 8 మంది మహిళా సిబ్బంది చిక్కుకుని భయభ్రాంతులకు గురయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సిఐ గడ్డం మల్లేష్ సిబ్బందితో కలిసి నిచ్చెన ద్వారా మహిళా సిబ్బందిని రెస్కూ చేసి ప్రమాదం నుండి కాపాడారు. అధికారుల ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్నారు.
విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: ఇప్పటికే ఏపీలో చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా… వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నవంబరు 17, 18 తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ అధి కారుల అంచనా ప్రకారం నవంబరు 17న ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది వేగంగా బలపడి […] The post ఏపీకి మరోసారి భారీ వర్షాలు appeared first on Visalaandhra .
రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు పి.వి.శ్రీహరి తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 20 వరకు ఫీజు చెల్లించవచ్చని డైరెక్టర్ తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో ఈనెల 21 నుంచి 29 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2 నుంచి 11 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15 నుంచి 29 వరకు టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. గడువు లోగా పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
సంపద సృష్టి ఎక్కడచంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలపై ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరోకర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం రాక ముందు ఒక మాట వచ్చిన తరువాత మరోమాట మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. స్థానిక సీఆర్ భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్యతో కలసి గురువారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టించి… అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ […] The post రాష్ట్రం అప్పులమయం appeared first on Visalaandhra .
அமித்ஷா காலணியை பெண் துடைத்ததாக பரவும் வீடியோ - உண்மை என்ன தெரியுமா?
அமித்ஷாவின் காலணியை பெண் ஒருவர் துடைப்பதாக பரவும் வீடியோ போலியானது, ஏஐ மூலம் உருவாக்கப்பட்டது.
జీఎస్టి స్కాం.. రూ.11.79 కోట్ల ప్రభుత్వ సొమ్మును కొట్టేసిన కేటుగాళ్లు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి జీఎస్టి పేరుతో ప్రభుత్వాన్ని నిండాముంచిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు ష్త్రచేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు ప్రభుత్వం నుంచి రూ.11.79కోట్లు తీసుకుని మోసం చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఢిల్లీకి చెందిన అబ్దుల్లా (ప్రధాన నిందితుడు), సయ్యద్ ముజ్తబా హుస్సేని అలియాస్ అజామ్, అయితి రాజా శేఖర్, గుజరాత్ రాష్ట్రం, భావ్నగర్, మహువా, మెహందిబాద్కు చెందిన సోహిల్ మురాదాలీ లఖానీ అలియాస్ సోను (34)నగరంలోని అబిడ్స్లో ఉంటున్నాడు. హైదరాబాద్, అడిక్మెట్, రాం నగర్కు చెందిన మహ్మద్ అక్రమ్ హస్నుద్దీన్ను అరెస్టు చేశారు. సోహిల్, మహ్మద్ అక్రంను అరెస్టు చేయగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. నకిలీ సంస్థలను సృష్టించిన నిందితులు నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ టర్నోవర్, పత్రాలను ఫోర్జరీ చేసి చూపించారు. వీటి ద్వారా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటిసి)ను ప్రభుత్వం నుంచి క్లైయిమ్ చేశారు. నిందితులు ఎనిమిది రాష్ట్రాల్లో నెట్వర్క్ను ఎర్పాటు చేసి జిఎస్టిని క్లైమ్ చేస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డులు, పాన్కార్డులు, విద్యుత్ బిల్లులు, అద్దె ఒప్పందాలు, ఇతర ఫోర్జరీ పత్రాలను క్లైమ్ కోసం ఉపయోగించారు. తప్పుడు పేర్లతో సిమ్ కార్డులను తీసుకుని, జిఎస్టి పోర్టల్లో ఓటీపీ ఆధారిత ధృవీకరణను పూర్తి చేసి, నకిలీ సంస్థల కోసం జీఎస్టీ నంబర్ల కోసం నమోదు చేసుకున్నారు. జీఎస్టీ నంబర్లను పొందిన తర్వాత బోగస్ కొనుగోలు, అమ్మకపు ఇన్వాయిస్లను రూపొందించారు, నకిలీ టర్నోవర్ను సృష్టించారు, వస్తువుల భౌతిక కదలిక లేకుండానే ఐటిసిని క్లెయిమ్ చేశారు. అసలైన వాహన నంబర్ల ఛాసిస్ నంబర్లను ట్యాంపర్ చేసి నిజమైన వాహనాలుగా నమ్మించి నకిలీ వే బిల్లులను సృష్టించారు. నిందితులు 52 సంస్థలను పుట్టించి తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రల్లో క్లెయిమ్ చేశారు. రూ. 53.73 కోట్లు నకిలీ టర్నోవర్ చూపించి ఐటిసి కింద రూ. 11.79 కోట్లు క్లెయిమ్ చేశారు. నిందితులు 405 నకిలీ ఈవే బిల్లులు సృష్టించి రూ.11.79 కోట్లు క్లెయిమ్ చేశారు. ఏసీపీ ఎస్. రవీందర్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నిధుల బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదంట్రంప్ సంతకం వాషింగ్టన్: అమెరికా ఆర్థిక ‘షట్డౌన్’కు ఎట్టకేలకు తెర దించింది. షట్డౌన్ను ముగించే ప్రభుత్వ నిధుల బిల్లుపై ప్రతినిధుల సభలో ఓటింగ్ జరిగింది. 222-209 తేడాతో ఆమోదం లభించింది. సెనేట్ ఇంతకుముందే ఆమోద ముద్ర పడిరది. ఇక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ బిల్లుపై సంతకం చేశారు. దీంతో 43 రోజుల తర్వాత షట్డౌన్కు అధికారికంగా ముగింపు లభించింది. ఇన్ని రోజులు ఆర్థికపరంగా కార్యకలాపాలు స్తంభించడం అన్నది అమెరికా […] The post ముగిసిన షట్డౌన్ appeared first on Visalaandhra .
వారసత్వ సంపద జోలికి వస్తే సహించం
ట్రంప్ అల్లుడి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బెల్గ్రాడ్లో ప్రజాందోళన బెల్గ్రాడ్: మా చరిత్ర, సాంస్కృతిక వారసత్వం మాకు ఎంతో ముఖ్యం, వాటి జోలికి వస్తే సహించేది లేదంటూ సెర్బియా రాజధాని బెల్గ్రాడ్ ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాడు బాంబు దాడిలో ధ్వంసమైన యుగొస్లేవ్ ఆర్మీ హెడ్క్వార్టర్స్ను పడగొట్టి అక్కడ విలాసవంతమైన హోటల్ కాంపెక్స్ నిర్మించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక భర్త జరేడ్ కుష్నెర్ […] The post వారసత్వ సంపద జోలికి వస్తే సహించం appeared first on Visalaandhra .
రాష్ట్రంలో పుష్కలంగా విద్యుత్ ఉత్పత్తి
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో ఎంత విద్యుత్తు డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామని రాష్ట్ర డిప్యూటీ సి ఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో కాకతీయ నాటి శివాలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన వారు తాము లేకపోతే కరెంటే ఉండదు రాష్ట్రం అంధకారమవుతుందని అన్న విషయాన్ని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు.ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసింది రైతులకు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అని ఆయన అన్నారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంత త్వరితగతిన ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేసుకుంటూ పోతాం అన్నారు. ఎన్నికలకు ముందు తాను చేపట్టిన పీపుల్స్ పాదయాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మందిని కలిసి మాట్లాడినట్టు తెలిపారు. ఇల్లు లేని పేదలు 10 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ పాలనలో ఎదురుచూసి కళ్ళు కాయలు కాసి అలసిపోయామని ప్రజలు తన చేయి పట్టుకొని తెలిపిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఆనాడే పాదయాత్ర సందర్భంగా తన చేయి పట్టుకొని ముదిగొండ మండలంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రియాంక అనే ఆడబిడ్డకు తాను హామీ ఇచ్చాను, నీ ఒక్కదానికే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇల్లు లేని పేదలందరికీ ఐదు లక్షలతో ఇల్లు నిర్మిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు నిర్మిస్తున్నాం, ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు ముదిగొండ మండలానికి చెందిన ప్రియాంకకు ఇల్లు కేటాయించామని తెలిపారు. ఒకటి కాదు రెండు కాదు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో 3500 చొప్పున నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈరోజు తాను వచ్చే క్రమంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని కలిసి వారితో ఆనందాన్ని పంచుకున్న విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగులు కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, తెలంగాణ దేవాదాయ శాఖ స్థపతి ఎన్. వాళ్ళినాయగం, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వర్ రావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గప్రసాద్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ లు అంబటి వెంకటేశ్వర్లు, నరసింహా రావు,కాంగ్రెస్ నాయకులు బుల్లెట్ బాబు, సామినేని వెంకటయ్య, ఏడుకొండలు పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ముంబైలోకి విధ్వంసకర బ్యాటర్ #TeluguPost #telugu #post #news
ఎన్నికల ఫలితాలపై జనం ఉత్కంఠకు సమాచారం వెల్లడిరచడానికి ప్రీపోల్ (ఎన్నికలకు ముందు) సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ (పోలింగ్ తరవాత) ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఎన్నికలకు ముందు సర్వేలకు అవకాశం లేకుండా పోయింది. ఎగ్జిట్ పోల్స్ కొన్ని మీడియా సంస్థలూ, కొన్ని ఇతర సంస్థలు నిర్వహిస్తాయి. బీహార్ ఎన్నికల తరవాత పోలింగ్ ముగిసీ ముగియక ముందే కనీసం డజను ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో అధిక శాతం బీహార్లో మళ్లీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేనే గెలుస్తుందని చెప్పాయి. మొదటి […] The post ఎగ్జిట్ పోల్స్ చిలక జోస్యం appeared first on Visalaandhra .
పరిహారం భిక్ష కాదు… రైతుల హక్కు!
బొల్లిముంత సాంబశివరావు మొంథా తుపాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అపారంగా పంటలకు నష్టం జరిగింది. రోడ్లు, భవనాల శాఖకు, విద్యుత్ సంస్థకు అపార నష్టం జరిగింది. నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. వందలాది గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక ఇళ్లు నేల కూలాయి. వేల కోట్లలో నష్టం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, సూర్యారావుపేట, నల్గొండ, హనుమకొండ, నాగర్కర్నూల్, మహబూబాబాద్, జనగాం, కరీంనగర్ మొదలైన […] The post పరిహారం భిక్ష కాదు… రైతుల హక్కు! appeared first on Visalaandhra .
ఆసియా ఆర్చరీలో భారత్కు స్వర్ణాల పంట
ఢాకా: ఇక్కడ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ స్వర్ణాల పంట పండించింది. గురువారం భారత్ మూడు స్వర్ణాలు, మరో రెండు రజత పతకాలను గెలుచుకుంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో తెలుగుతేజం జ్యోతి సురేఖ వెనమ్ స్వర్ణం సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సురేఖ 147145 పాయింట్ల తేడాతో భారత్కే చెందిన ప్రితీక ప్రదీప్ను ఓడించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. అంతకుముందు మహిళల కంపౌండ్ టీమ్ విభాగంలో భారత జట్టు స్వర్ణం కైవసం చేసుకుంది. దీపిక్ష,జ్యోతి సురేఖ వెనమ్, ప్రితీక ప్రదీప్లతో కూడిన భారత టీమ్ ఫైనల్లో జయకేతనం ఎగుర వేసింది. ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత టీమ్ 236234 పాయింట్ల తేడాతో కొరియాను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. కాగా, పురుషుల కంపౌండ్ టీమ్ విభాగంలో భారత్కు రజతం లభించింది. అభిషేక్ వర్మ, సాహిల్ జాదవ్, ప్రథమేశ్లతో కూడిన భారత బృందం ఫైనల్లో ఓటమి పాలైంది. కంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత జోడీకి పసిడి పతకం లభించింది. అభిషేక్ వర్మ, దీప్షికలతో కూడిన భారత జంట ఫైనల్లో విజయం సాధించి స్వర్ణం దక్కించుకుంది. ఫైనల్లో ఈ జోడీ బంగ్లాదేశ్ జంటను ఓడించింది.
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆధునిక సమాజం అభ్యుదయ భావాలతో అభివృద్ధి కాముకంగా ముందుకు మూడడుగులు వేసేటప్పటికి, ఆధునికత, నీతి, నిజాయితీకి, నిబద్దతకు నిరాడంబర నైజానికి తిలోదకాలిస్తూ, విధ్వంసక చర్యలకు వంతపాడుతూ మున్ముందుకు ఆరడుగులు వేయడానికి యత్నిస్తోంది. ఆర్థిక దోపిడీకి అలవాటుపడ్డ మేధావి వర్గాలు, సమస్త అకృత్యాలకు ఆలంబనంగా నిలుస్తూ, అడ్డదారి అక్రమాలకు తెర లేపుతూ, వ్యవస్థ బలహీనతలను తమకు అనుకూలంగా మలచుకుంటూ, కుల మతాల్లో అనైక్యతా కుంపట్లు రాజేస్తూ మనుషుల్ని మూర్ఖపు ముఠాలుగా తయారుచేస్తున్నారు. మనిషిలోని ఆత్మీయతానురాగాల్ని ఆర్థిక […] The post ఉగ్రవాదం అరికట్టాలంటే… appeared first on Visalaandhra .
లింబాద్రి గుట్టపై గెస్ట్ హౌస్కు నిధులు మంజూరు…
భీమ్గల్ రూరల్, (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భీమ్గల్ మండలంలోని
ఎక్స్పోర్టు ప్రమోషన్ మిషన్కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ : ఎగుమతుల విషయంలో ప్రపంచ స్థాయిలో పోటీతత్వం పెరగడానికి, ఆత్మనిర్భర్ (స్వావలంబన) కలను సాకారం చేసుకోవడానికి సహాయపడే ఎక్స్పోర్టు ప్రమోషన్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను ప్రధాని నరేంద్రమోడీ గురువారం వెల్లడించారు. బుధవారం ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఎగుమతిదారులకు ప్రోత్సాహకంగా ఎక్స్పోర్టు ప్రమోషన్ మిషన్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ను ఆమోదించారు. ప్రపంచ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా (భారత్లో తయారీ) లక్షం ప్రతిధ్వనించేలా ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్కు నిర్ణయం తీసుకోవడమైందని , దీనివల్ల ఎగుమతుల్లో పోటీ తత్వం పెరుగుతుందని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, మొదటిసారి ఎగుమతులు చేపట్టేవారికి, కార్మిక శ్రమతో కూడిన రంగాలకు ఈ పథకం ప్రయోజనం కలిగిస్తుందన్నారు. గ్రీన్ ఎనర్జీకి కీలకమైన గ్రాఫైట్, సిసిఎం, రుబిడియం, జిర్కోనియం, తదితర ఖనిజాల రాయల్టీ రేట్ల విషయంలో హేతుబద్ధీకరణ జరుగుతుందన్నారు. వీటి సరఫరా చైను పటిష్టమై, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రధాని మోడీ ఆశాభావం వెలిబుచ్చారు.
ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం..
ఆంధ్రప్రభ, నందిగామ: ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న
Young Director turns Rude with his Producer
After scoring a huge blockbuster on his debut, a young director is working with the same producer and same hero in his second film. A massive budget is allocated for the project and the makers have spent a bomb on the pre-production work. The lead actor is already irritated for wasting his time on the […] The post Young Director turns Rude with his Producer appeared first on Telugu360 .
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక అత్యాచారినికి పాల్పడింది: ఎంఎల్సి దాసోజు శ్రవణ్
సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలో రూ. 3.48 లక్షల కోట్ల భారీ అప్పులు చేసి ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారని బిఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. ఇవి కాకుండా మరో లక్ష కోట్లు బడ్జెట్కు సంబంధం లేని అప్పులు తెచ్చారని అన్నారు. ఇన్ని కోట్ల అప్పు తెచ్చి చేసిందేమీ లేదని విమర్శించారు. కాగ్ రిపోర్ట్ సిఎం రేవంత్ రెడ్డి బట్టలు విప్పేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటే... ఇంతకంటే ఏం జరుగుతుందని అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం బిఆర్ఎస్ నేతలు సతీష్ రెడ్డి, హరి రమాదేవి, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కమీషన్లు, విచ్చలవిడి అవినీతికి అర్రులు చాస్తూ రేవంత్రెడ్డి రాష్ట్ర ఆర్ధిక రంగాన్ని కుదేలు చేశారని ధ్వజమెత్తారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ.. రేవంత్ రెండేండ్ల పాలనలో అధోగతి పాలైందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేశారని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ను రూ. 2 లక్షల 30 వేల కోట్లుగా ప్రతిపాదించారని, సెప్టెంబర్ నాటికి రూ. 76 వేల కోట్లు మాత్రమే విడుదలయ్యాయని తెలిపారు. నిర్ధేశించుకున్న లక్ష్యంలో 33 శాతం మాత్రమే చేరుకున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ వసూళ్లలో 40 శాతం మాత్రమే సాధించారని, జిఎస్టి వసూళ్లలో 42 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ను సర్వనాశనం చేశారని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా రూ. 19 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా రూ. 7 వేల కోట్లు మాత్రమే వసూలు అయ్యిందని చెప్పారు. ఎక్సైజ్ ఆదాయం కూడా 35 శాతంలోపే వచ్చిందని, అప్పులు మాత్రం 83 శాతానికి చేరుకున్నాయని పేర్కొన్నారు.హైడ్రా పేరుతో ఆర్ఆర్ టాక్స్తో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు.
ఎసిబి వలలో ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు
గృహ నిర్మాణానికి సంబందించిన పర్మిషన్ విషయంలో ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎసిబి వలలో చిక్కారు. ఎసిబి డిఎస్పీ శ్రీధర్ కథనం మేరకు వివరాలు.. బిల్డింగ్ పర్మిషన్ కోసం ఆదిభట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వర ప్రసాద్, అసిస్టెంట్ వంశీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఓ వ్యక్తి వద్ద లంచం డిమాండ్ చేశారు. నాలుగు వందల గజాల స్థలంలో నాలుగంతస్తుల భవన నిర్మాణం అనుమతి కోసం ఆ వ్యక్తి వద్ద లక్షన్నర డిమాండ్ చేసారు. ఎట్టకేలకు 80 వేల రూపాయలకు ఆంగీకారం తెలిపారు. ఈ మేరకు గురువారం బాదితుడి వద్ద నుండి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీ రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎసిబి డిఎస్పీ తెలిపారు. కాగా ఎవరైనా అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు.
ఎస్ఆర్బిసి కాలువలో విద్యార్థి గల్లంతు..
నంద్యాల, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణానగర్కు చెందిన వీరేష్
నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు
నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను మెహిదీపట్నం, సౌత్వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.4,75,000 నకిలీ రూ.500 నోట్లు, కారు, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. సౌత్వెస్ట్ ఎడిసిపి సిద్ధిఖీ గురువారం మెహిదీపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోస్గి, గుడిమల్ గ్రామానికి చెందిన కస్తూరీ రమేష్ బాబు తాండూరులో ఉంటూ కారు మెకానిక్గా పనిచేస్తున్నాడు. సైబరాబాద్, ఫిష్ బిల్డింగ్, సులేమాన్ నగర్కు చెందిన అబ్దుల్ వాహిద్, మహ్మద్ అబ్దుల్ ఖదీర్ అలియాస్ తాహా, మహ్మద్ సోహైల్, ఎండి ఫహద్, షేక్ ఇమ్రాన్, ఒమర్ ఖాన్, సయిద్ అల్తామాష్ అహ్మద్ డిగ్రీ చదువుతున్నాడు. తాండూరుకు చెందిన రమేష్ బాబు, అతడి సోదరి రామేశ్వరి కలిసి నకిలీ రూ.500 నోట్లను ముద్రిస్తున్నారు. ఇద్దరు కలిసి గతంలో కూడా నకిలీ నోట్లను ముద్రించడంతో గుజరాత్, చాంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. తాండూరులోని ఇంట్లోనే అన్నా, చెల్లి కలిసి నోట్లను ముద్రించి 1ః4 నిష్పత్తిలో పంపిణీ చేస్తున్నారు. నిందితులు జేకె బాండ్ పేపర్పై నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నారు. రమేష్ ఇన్స్టాగ్రాంలో వీడియో పోస్ట్ చేసి కింద తన మొబైల్ నంబర్ ఇచ్చాడు. వాటిని చూసిన నగరానికి చెందిన నిందితులు సంప్రదించారు. వారికి రమేష్ బాబు నకిలీ నోట్లు ఇవ్వడంతో నగరంలో చెలామణి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్స్పెక్టర్లు మల్లేషం, సంతోష్ కుమార్ తదితరులు దర్యాప్తు చేశారు.
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: ఇల్లు అద్దెకు కావాలని నటిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని
Pretty Baby From Sharwa’s Biker: Beats, Romance & Swagger
Charming Star Sharwa is coming up with a sports and family entertainer Biker directed by Abhilash Reddy Kankara on UV Creations banner. Ghibran scored the music, and the promo of the first single Pretty Baby got superb response. Meanwhile, they released the song. Pretty Baby is every bit the explosive, high-voltage number. It starts with […] The post Pretty Baby From Sharwa’s Biker: Beats, Romance & Swagger appeared first on Telugu360 .
ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు నేనే చెల్లిస్తా: కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు అందరికి పరీక్ష ఫీజులు తానే చెల్లిస్తానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ముందుకొచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని విద్యార్థుల వివరాలను తనకు అందజేయాలని కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ కలెక్టర్ హరిచందనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం లేఖ రాశారు. ఇదే తరహాలో మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఇటీవల నిరుపేద పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తనకు ఇచ్చే వ్యక్తిగత వేతనం నుంచే వీరికి పరీక్ష ఫీజులు చెల్లించాలని నిర్ణయించుకుని ఆ ప్రకటన చేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేసేందుకు వీలుగా ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆయన లేఖలు కూడా రాసి పంపించారు. పరీక్ష ఫీజు చెల్లించలేక ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకుండా చూసేందుకు కేంద్రమంత్రులు ఇద్దరూ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన అంత్యోదయ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి పిల్లలకు తన వంతుగా సహాయం చేయాలని అనుకుంటున్నానని, అందుకే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులందరికీ తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు పరీక్ష ఫీజు మొత్తాన్ని తన జీతం నుంచి చెల్లించాలని నిర్ణయించినట్లు ఆయన ఢిల్లీ నుంచి ఒక ప్రకటనలో వివరించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని మస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పలు సేవా కార్యక్రమాలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు అవసరమైన వస్తువుల పంపిణీ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పాఠశాలల్లో మరుగు దొడ్ల నిర్మాణం, మెకనైజ్డ్ టాయిలెట్ క్లీనింగ్ మెషీన్స్ అందజేస్తున్నారు. దీంతోపాటుగా డబుల్ డెస్క్ బెంచీలను కూడా కిషన్ రెడ్డి సమయానుగుణంగా అందజేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో నోట్ బుక్స్ పంపిణీ, పలు పాఠశాలల్లో డిజిటల్ తరగతులకు కూడా కేంద్రమంత్రి సహకారం అందించిన సంగతి తెలిసిందే.
Crime |భర్త చేతిలో భార్య దారుణ హత్య..
Crime | భర్త చేతిలో భార్య దారుణ హత్య.. విజయవాడ, క్రైమ్ ఆంధ్రప్రభ:
మంత్రి కొండాపై పరువు నష్టం కేసు ఉపసంహరణ
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. మంత్రిపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసును గురువారం ఆయన ఉపసంహరించుకున్నారు. మంత్రి కొండా సురేఖ బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్పై రాజకీయ విమర్శలు చేస్తున్న క్రమంలో సినీ నటుడు అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వాఖ్యలను తీవ్రంగా పరిగణించిన నటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మంత్రి కొండా సురేఖ ట్విటర్ వేదికగా నాగార్జున కుటుంబపై చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు చెప్పారు. నాగార్జున కుటుంబాన్ని బాధపెట్టాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, వారిని ఇబ్బంది పెట్టాలని, వారి పరువు ప్రతిష్టకు భంగం కలిగించాలని ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. నాగార్జున కుటుంభంపై చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నా, నా వాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అని మంత్రి పేర్కొన్నారు. ఈ క్షమాపణపై నాగార్జున స్పందించి మంత్రిపై దాఖలు చేసిన పరువు నష్టం దావాను ఉపసంహరించుకున్నారు. కాగా, మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ సాగింది. ఈ విచారణను అంతకు ముందు డిసెంబర్ 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో నాగార్జున కేసు ఉప సంహరించుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగినట్లుయింది.
భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేసిన కసాయి
విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే కట్టుకున్న భార్యను నడిరోడ్డుపైనే గొంతు కోసి హత్య చేశాడు ఓ కిరాతకుడు. సూర్యారావు పేట పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటన స్థానికులను సైతం భయాందోళనలకు గురి చేసింది. తెలిసిన వివరాల ప్రకారం హత్యకు గురైన మహిళ విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సరస్వతీగా గుర్తించారు. ఆమె భర్త విజయ్తో గత కొంతకా లంగా దాంపత్య జీవితం సజావుగా సాగడం లేదు. తరచూ చిన్నచిన్న విషయాలపై ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయని, ఇటీవల వీరిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విజయ్ కోపంతో భార్య ఉన్న చోటుకు వెళ్లి, కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో సరస్వతీ అక్కడికక్కడే మృతి చెందింది. హత్య అనంతరం కూడా విజయ్ కత్తితో వీరంగం సృష్టించాడని, స్థానికులు భయంతో దగ్గరికి రాలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘ఎవరైనా దగ్గరికి వస్తే చంపేస్తా’ అంటూ విజయ్ కేకలు వేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న సూర్యా రావుపేట పోలీసులు నిందితుడు విజయ్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య కొన సాగుతున్న వ్యక్తిగత విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారం భించారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ఇటువంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ సమ స్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ, ఇలా ప్రాణాలు తీయడం మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఇటు వంటి చర్యలతో సదరు వ్యక్తులు కూడా జైలు పాలై నిండు జీవితాన్ని కోల్పోతారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కోర్టుకు రాకుండా ఉంటే పదిలం.. లాయర్లకు సుప్రీం సలహా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర రీతిలో వాయు నాణ్యత పడిపోయింది. లాయర్లు ఎందుకైనా మంచిది వర్చువల్గా విచారణలో క్లయింట్ల తరఫున పాల్గొంటే మంచిదని సలహాలు వెలువడ్డాయి. గురువారం సుప్రీంకోర్టులో వ్యాజ్యాల ప్రస్తావన దశలో న్యాయమూర్తి పిఎస్ నరసింహ లాయర్లకు ఈ సూచన చేశారు. ఢిల్లీలో వాయుకాలుష్య తీవ్రత విపరీత స్థాయికి చేరుకుంది. ఈ గాలి పీలిస్తే చాలు జనం అనారోగ్యాల బారిన పడే ముప్పు ఏర్పడుతోంది. మాస్క్లతో కోర్టులకు వచ్చినా ఉపయోగం లేదని, పలువురం మాస్క్లతోనే కోర్టుకు వస్తున్నామనే విషయాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్తో కలిసి బెంచ్లో ఉన్న న్యాయమూర్తి నరసింహ దీనితో ఏకీభవించారు. ఇంతటి ఘాటు కాలుష్య గాలికి మాస్క్లు ఏం సరిపోతాయి? కాలుష్యానికి సోకితే ఎవరికైనా శాశ్వత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని జడ్జి చెప్పారు. లాయర్లకు వర్చువల్ వాదన అవకాశం ఉన్నందున, దీనిని వాడుకుంటే సరిపోతుందని మిత్రవాక్యం పలికారు. నవంబర్ నెల ఆరంభం నుంచే ఢిల్లీ పౌరులు వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వారం ఇది అత్యంత తీవ్రస్థాయికి చేరింది. మంగళ, బుధవారాలలో గాలిలో కాలుష్య రేణువుల సాంద్రత అత్యంత ఎక్కువగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తమ లెక్కల్లో తెలిపింది.
Sreeleela bags one more Crazy Project
Sreeleela has delivered a bunch of flops in Telugu but the actress is signing more number of films. She is all set to be seen beside Sivakarthikeyan in his upcoming movie Parasakthi and the film is due for Sankranthi 2026 release. Sudha Kongara is the director. As per the latest buzz, Sreeleela has signed one […] The post Sreeleela bags one more Crazy Project appeared first on Telugu360 .
Bollywood Director joins Jaat 2
Tollywood mass director Gopichand Malineni directed Jaat with Bollywood actor Sunny Deol after all the Tollywood actors were occupied. The film did not make any noise in Telugu but the film made decent money in North India. Two top Tollywood production houses Mythri Movie Makers and People Media Factory joined hands for this film. The […] The post Bollywood Director joins Jaat 2 appeared first on Telugu360 .
ఢిల్లీ పేలుడు ఘటన.. అంతుచిక్కకుండా ఉగ్రవాది నబీ చివరి ప్రయాణం
ఉమర్ టెర్రర్ కారు.. హర్యానా-ఢిల్లీ సిసిటీవీ కెమెరాలతో చిక్కిన వైనం డిఎన్ఎ పరీక్షతో పుల్వామా ఉగ్రవాది నిర్థారణ హైవేలు వీడలేదు... కారులోనే తుది దాకా బస కేసులో కాన్పూర్ ఎంబిబిఎస్ విద్యార్థి అరెస్టు పట్టుబడ్డ లేడీడాక్టర్ షహీన్కు అనుచరుడు 13కు చేరిన మృతుల సంఖ్య న్యూఢిల్లీ : ఢిల్లీ ఎర్రకోట వద్ద ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ తుది గంటల ప్రయాణం తెలిపే వివరాలను ఢిల్లీ పోలీసులు పసికట్టారు. ఢిల్లీ రోడ్లలో, హర్యానా ఫరీదాబాద్ నుంచి ఎర్రకోట వరకూ ఆయన ఉగ్ర జర్నీ ఏ విధంగా సాగిందనే విషయాన్ని స్థానిక పోలీసు బృందాలు సిసిటీవీ కెమెరాల ద్వారా సేకరించారు. ఎర్రకోట బాంబు పేలుడుకు భీకర పేలుడు పదార్థాలను తీసుకుని కారులో ఈ జిహాదీ ఉగ్రవాది ఎంతో నింపాదిగా, ఎవరికీ ఎటువంటి అనుమానాలు తలెత్తకుండా ఢిల్లీ దిక్కు ప్రయాణించిన వైనం పూర్తి వైనాన్ని సీన్ల వారిగా పోలీసులు 50 సిసిటీవీ కెమెరాల రికార్డుల ద్వారా సేకరించుకుని దీనిని వీడియోగా చేసుకుని పరిశీలిస్తున్నారు. పేలుడుకు ముందు రాత్రి ఈ ఖతర్నాక్ ముసాఫిర్ తెలుపు హ్యూండాయ్ ఐ20 కారులో బయలుదేరాడు. ఈ వ్యక్తి ఢిల్లీ ప్రయాణం తరువాతి కారు పేలుడు , ఇందులో అతను చనిపోవడాన్ని వీడియోగా మలిచారు. ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి అత్యంత నెమ్మదిగా బయలుదేరాడు. ఇందుకు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్వేను ఎంచుకున్నాడు. 2900 కిలోల పేలుడు పదార్థాల కారును మెట్రో స్టేషన్ వద్దకు చేర్చిన కొద్ది క్షణాల్లోనే బాంబు కారు పేలింది. ఈ స్టయిల్వాలా మార్గమధ్యంలో కొన్ని చోట్ల తిండికి , రెస్ట్కు కారు ఆపాడు. లోపల ఆర్డిఎక్స్ నిల్వలు ఉన్నా రాత్రి అంతా కారులోనే గడిపాడు. సిసిటీవీ కెమెరాల ద్వారా ముందుగా తన పై నిఘా సంస్థలకు అనుమానం తలెత్తకుండా ఈ వ్యక్తి అత్యంత చాకచక్యంగా సాగినట్లు తరువాతి క్రమంలో వెల్లడైంది. అంతా ఎక్స్ప్రెస్ వే మీదుగా.. దాబాల వద్ద పార్కింగ్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ నుంచి ఆరంభం అయిన ఆయన ప్రయాణం నెమ్మదిగా ఫిరోజ్పూర్ జిర్కా చేరడం తరువాత రాత్రి అక్కడనే దాబా వద్ద ఆపి రాత్రి కారులో గడపడం అంతా ఇప్పుడు సీన్ సీన్గా రూపొందింది. తప్పించుకునే పయనించాడు. కానీ ఎక్కడా భయపడలేదు. ప్రధాన నగరాల్లోకి పట్టణాల్లోకి వెళ్లలేదు. కేవలం హైవేల మీదుగా సాగుతూ నలుగురితో పాటు తాను అనుకునే విధంగా చేశాడు. చిన్న చిన్న రోడ్డు సైడ్ దాబాలు, టిఫిన్ సెంటర్లనే ఎంచుకున్నాడు. కొంత సమయం వరకూ ఆయన కెమెరాల దృష్టిలోకి రాలేదు. బద్రపూర్ సరిహద్దు మీదుగా ఢిల్లీలోకి చేరాడు. ఢిల్లీలో పలు చోట్ల కొద్ది సేపు కారు ఆపుతూ చివరికి ఎర్రకోట వద్ద మధ్యాహ్నం 3.18వద్ద పార్క్ చేశాడు. ఓ నిమిషం తరువాత 3.19కి కారును రెడ్ఫోర్టు కాంప్లెక్స్ సమీపంలో పార్కింగ్ ఏరియాలో ఉంచాడు. అక్కడ మూడు గంటలు దీనిని నిలిపి ఉంచాడు. తరువాత సాయంత్రం 6.22 గంటలకు పార్కింగ్ నుంచి బయలుదేరాడు. మెట్రోస్టేషన్ వైపు సాగాడు. అరగంట కాకముందే 6.52 ప్రాంతంలో కారులో భారీ పేలుడు జరిగింది. తీవ్రతకు చట్టుపక్కల ఉన్న వారి శరీరాలు తునాతునకలు అయ్యాయి. ఈ ప్రాంతం అంతా రక్తసిక్తం అయింది. పేలుడు ఘటన కూడా అక్కడి ట్రాఫిక్ పర్యవేక్షక సిసిటీవీ కెమెరాలలో రికార్డు అయింది. పేలుడులో 13 మంది మృతి చెందారు. పాతిక మందికి పైగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముక్కలైన దేహాల డిఎన్ఎల పరీక్ష తరువాత డాక్టర్ ఉమర్ నబీ కూడా ఆనవాళ్లు కూడా ఉన్నట్లు ఫోరెన్సిక్ శాంపుల్స్ ద్వారా వెల్లడైంది.ఈ వ్యక్తి తల్లి డిఎన్ఎ శాంపుల్స్ తీసుకుని పరీక్షించి ఇక్కడి ఆనవాళ్లతో సరిపోయినట్లు గుర్తించారు. పేలుడు పదార్థాల కారును నడిపింది ఈ టెర్రర్ డాక్టరే అనేది నిర్థారణ అయింది. ఇంతకూ ఈ వ్యక్తి టార్గెట్ ప్రయాణం వేరే దగ్గర ఉందా? మధ్యలోనే ఇది పేలిందా? అనేది ఇప్పుడు దర్యాప్తుల పై దర్యాప్తుల క్రమంలో వెలుగులోకి రావల్సి ఉంది. మరో టెర్రర్ కారు అల్ ఫలాహ్ లింక్ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వర్శిటీవద్దనే దొరికిన మరో కారు పూర్వాపరాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ కారుకు ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే పేలుడు లింక్ ఉన్న రెండు మూడు కార్ల లిస్టులో ఈ మారుతి బ్రీజా కారు కూడా చేరింది. దీనిని జమ్మూ కశ్మీర్ పోలీసులు వచ్చి పరిశీలిస్తున్నారని ఫరీదాబాద్ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ వర్శిటీ క్యాంపస్లోని పలు ఇతర కార్లు, వాహనాల గురించి కూడా పోలీసు వర్గాలు ఆరాతీస్తున్నాయి. అవి ఎవరివి? ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాయి? అనేది పరిశీలిస్తున్నారు. ఇప్పుడు దొరికిన కారు హర్యానా రిజిస్ట్రేషన్తోనే ఉంది. రూ 26 లక్షల వరకూ చందాలు డబ్బు అప్పగింత జగడంతోనే పేలుడు ? పేలుడుతో సంబంధం ఉన్న వైట్కాలర్ డాక్టర్ల గ్యాంగ్ భారీ పేలుడు పదార్థాల కొనుగోళ్లకు రూ 26 లక్షలకు పైగా సేకరించినట్లు దర్యాప్తు క్రమంలో తేలింది. నలుగురు అనుమానితులు డాక్టర్ ముజమ్మిల్ గనయి, డాక్టర్ అదీల్ అహ్మద్ రథెర్, డాక్టర్ షహీన్ సయీద్, డాక్టర్ ఉమర్ నబీలు ఇందులో కీలక పాత్ర వహించారు. ఇక ఈ సొమ్మును డాక్టర్ ఉమర్కు ఈ పేలుడు ఆపరేషన్ సాగించేందుకు ఉంచారు. ఈ ఉమర్ది జమ్మూ కశ్మీర్లోని పుల్వామా ప్రాంతం. అల్ ఫలాహ్ వర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాడు. భారీ స్థాయి ఉగ్రకుట్రలో భాగంగానే ఈ లక్షల రూపాయలు సేకరించినట్లు వెల్లడైంది. దీనితోనే ఉగ్రగ్యాంగ్ 26 క్వింటాళ్ల ఎన్పికె ఎరువు కొనుక్కుందని నిర్థారణ అయింది. గురుగ్రామ్, నుహు, ఇతర పట్టణాల నుంచి దీనిని అనుమానాలు రాకుండా కొన్నారు. ఇక డబ్బులు ఎవరి వద్ద ఉంచాలనే విషయంలో ఉమర్కు, ముజమ్మిల్కు తేడాలు వచ్చినట్లు, దీనితోనే టెర్రరిస్టుల ప్లాన్ ముందుగానే చెడి , ఎర్రకోట వద్ద పేలుడుకు దారితీసి ఉంటుందని అనుమానిస్తున్నారు. పేలుడులో గాయపడి చికిత్స పొందుతూ ఢిల్లీ ఎన్ఎన్జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి బిలాల్ గురువారం మృతి చెందాడు. దీనితో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పుడు 13కు చేరింది.పేలుడు కేసులో కాన్పూర్లో కార్డియాలజీలో ఎంబిబిఎస్ చేస్తున్న మెహమ్మద్ అరిఫ్ను ఎటిఎస్ అరెస్టు చేశారు. స్థానిక ప్రభుత్వ గణేష్ శంకర్ విద్యార్థి మోమోరియల్ మెడికల్ కాలేజీలో ఈ విద్యార్థి మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ చేస్తున్నాడు. అరెస్టు అయిన లేడీ డాక్టర్ , ప్రొఫెసర్ డాక్టర్ షహీన్ షహీద్కు అనుచరుడిగా ఈ విద్యార్థి పనిచేసినట్లు తేలింది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పాత బస్టాండ్ సమీపంలోని మొండి గేరిలో పాత భవనంకు మరమ్మత్తుల పనులు చేస్తుండగా ఒక్క సారిగా గోడ కూలింది.ఈ సంఘటనలో ఇద్దరు భవన నిర్మాణ కూలీలు దుర్మణం చెందారు. మరి కొందరు గాయపడ్డారు. శిథిలాల కింద మరి కొందరు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పి జానకి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది వెంటనే చేరుకొని శిథిలాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా శిథిలాల కింద ఎంత మంది ఉన్నారన్నది తెలియడం లేదు. పాత భవనం ఓనర్ లక్ష్మణ్ గురువారం తన పాత భవనానికి మరమ్మతులు చేసే క్రమంలో నల్గురు భవన నిర్మాణ కార్మికులను పని అప్పగించారు. భవనానికి పైన డ్రిల్లింగ్ చేపట్టడంతోపాటు పక్కన ఉన్న రాగి చెట్టును కూడా తొలగించే క్రమంలో ఒక్క సారిగా గోడ కూలింది. ఈ ఘటనలో గోడ కింద ఉన్న వారిపై గోడ కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరు శిథిలాల కింద ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మరమ్మతులు చేసే క్రమంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఈ సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ఇంటి ఓనర్ సేఫ్టీ పికాషన్స్ తీసుకోకపోవడం వలనే ఈ ఘటన జరిగిందన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.అటెండర్ చెబుతున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరు చనిపోయారని, ఇంకా ఇద్దరు శిథిలాల కిందనే ఉన్నట్లు చెబుతున్నారన్నారు. సహాయక చర్యలు చేపడుతున్నామని,అధికారులు సిబ్బంది అందరూ ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కలెక్టర్ విజయేంద్రీ బోయి మాట్లాడుతూ మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పారు. సంఘటనా స్థలంలో మున్సిపల్ కమిషనర్ కూడా పాల్గొన్నారు.
ఆర్టిసి బస్సులో అకస్మాత్తుగా పొగలు
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ నుండి కర్నూలుకు బయలుదేరిన బస్సు మానవపాడు మండలం మద్దూరు స్టేజ్ సమీపంలో అయిజ నుండి కర్నూలు వెళ్ళే బస్సులో టైర్లో పొగలు వ్యాపించాయి. దానిని గమనించిన ప్రయాణికులు అరుపులు, కేకలతో బస్సు కిటికిల నుంచి కిందికి దిగి ప్రయాణికులు పారిపోయారు. ఆర్టీసీ డ్రైవర్ చాక చక్యంతో బస్సును ఆపి, పొగలను నియంత్రించే ప్రయత్నాలు చేశారు. ఓవర్ లోడ్తోనే ఈ సంఘటన జరిగిందని డ్రైవర్ తెలిపారు. వద్దంటే కూడా ప్రయాణికులు ఎక్కుతున్నారని తెలిపారు. బస్సులు లేక పోవడంతోనే నిండుగా ఉన్న బస్సులను ఎక్కుతుండడంతో సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఎవరికి ఏలాంటి ప్రమాదం జరగక పోవడముతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు
AP |అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలి..
AP | అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలి.. కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :
Adilabad |దౌర్జన్యానికి పాల్పడ్డ పోలీసులను శిక్షించాలి
Adilabad | దౌర్జన్యానికి పాల్పడ్డ పోలీసులను శిక్షించాలి Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ
రాజేంద్రనగర్ లో గుజరాత్ ఏటీఎస్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోదాలు చేశారు.
Pune Accident |పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం….
Pune Accident | పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం…. మహారాష్ట్ర : పూణేలో
Mahabubnagar |ఐదుగురు నిందితుల రిమాండ్
Mahabubnagar | ఐదుగురు నిందితుల రిమాండ్ Mahabubnagar | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Warangal |నిబంధనల మేరకే విక్రయించాలి
Warangal | నిబంధనల మేరకే విక్రయించాలి Warangal | వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి
పొలాల్లో వేలాది కోళ్లు పోలీసులు విచారిస్తే!!
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారిపై వేలాది నాటుకోళ్లు కనిపించాయి.
Warangal | ఘన సన్మానం… తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి మండల ఎంపీడీవో
కోల్కతా వేదికగా నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరగబోయే తొలి టెస్ట్ నుండి ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని భారత జట్టు నుంచి విడుదల చేశారు.
Warangal |మీ భద్రతయే మా బాధ్యత
Warangal | మీ భద్రతయే మా బాధ్యత Warangal | గీసుగొండ, ఆంధ్రప్రభ
Nara Lokesh Leads the Next Tech Wave: Major IT and Infrastructure Projects Launched in Visakhapatnam
Andhra Pradesh Industries and IT Minister Nara Lokesh continues to drive the state’s digital and industrial transformation, this time from the scenic IT Hills of Visakhapatnam. In a grand ceremony, Lokesh laid the foundation stones for several major projects, including Sales Software Solutions, iSpace Software Solutions, Tech Thammin Software Solutions, Phenom People Ltd, Raheja IT […] The post Nara Lokesh Leads the Next Tech Wave: Major IT and Infrastructure Projects Launched in Visakhapatnam appeared first on Telugu360 .
అమెరికాలో ముగిసిన ఆర్థిక షట్డౌన్..
వాషింగ్టన్ : అమెరికా చరిత్రలో అత్యధిక కాలం 43 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఆర్థిక “ షట్డౌన్”ఎట్టకేలకు ముగిసింది. షట్డౌన్ను ఎత్తివేసే ప్రభుత్వ ఫండింగ్ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ బుధవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం ) సంతకం చేశారు. అంతకు ముందు అమెరికా ప్రతినిధుల సభలో 222-209 తేడాతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ తరువాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు సంతకం కోసం ఈ బిల్లు వచ్చింది. అక్టోబర్ 1నుంచి షట్డౌన్ వల్ల అమెరికాలో వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం కనిపించింది. ముఖ్యంగా ఆర్థిక వృద్ధి, ఫెడరల్ సర్వీసులు, ప్రజల జీవనాలపై , విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అఫర్డబుల్ కేర్ యాక్ట్ (ఎసీఏ)సబ్సిడీల విస్తరణ కోసం డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేసినప్పటికీ, రిపబ్లికన్ నేతలతో రాజీ కుదరడంతో ఈ సమస్య పరిష్కారమైంది. షట్డౌన్ వల్ల సుమారు 1.4 మిలియన్ ఫెడరల్ ఉద్యోగుల జీతాలు బాగా ఆలస్యమయ్యాయి. సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ( ఎస్ఎన్ఏపీ) వంటి ఆహార సహాయ పథకాలు 42 మిలియన్ అమెరికన్లకు సరిగ్గా అందకుండా పోయాయి. ఆర్థిక వృద్ధి రెండు శాతం తగ్గి, మూడు బిలియన్ డాలర్ల వరకు నష్టం కలిగించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి కీలక సర్వీసులు ఆగిపోవడంతో ప్రయాణికులు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు . ఈ పరిస్థితి ప్రజల్లో అసంతృప్తిని పెంచడంతో రెండు పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చింది.
Nagarjuna Withdraws Defamation Case Against Konda Surekha
Akkineni Nagarjuna has withdrawn the defamation case he filed against minister Konda Surekha, bringing an end to a long-standing dispute that once drew major public attention. The actor decided to drop the case after Konda Surekha formally apologised for her earlier remarks on X, which allegedly damaged his reputation. The controversy began when Konda Surekha […] The post Nagarjuna Withdraws Defamation Case Against Konda Surekha appeared first on Telugu360 .
Adilabad |తోడుగా లేకపోతే పరేషాన్…
Adilabad | తోడుగా లేకపోతే పరేషాన్… Adilabad | కుబీర్, ఆంధ్రప్రభ :
పెళ్లి మండపం నుండి నిందితుణ్ని వెంటాడిన డ్రోన్
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో పెళ్లికుమారుడిపై ఓ వ్యక్తి కత్తితో మూడు సార్లు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
Warangal |పొలం పనులకు వెళ్లి…
Warangal | పొలం పనులకు వెళ్లి… Warangal | ములుగు జిల్లా, మంగపేట,
ఈజిప్టు రాజధాని కైరోలో నిర్వహించిన ISSF వరల్డ్ చాంపియన్షిప్లో భారత షూటర్ సామ్రాట్ రాణా గోల్డ్ కొట్టాడు.
‘రాజు వెడ్స్ రాంబాయి‘ ట్రైలర్ రిలీజ్..
యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ప్రమోషన్ లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను గురువారం సాయంత్రం మేకర్స్ రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సిినిమా ట్రైలర్ అదిరిపోయింది. హృదయానికి హత్తుకునేలా ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ లో బిజిఎం అదిరిపోయింది. ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో లిటిల్ హార్ట్స్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్లుగా ట్రైలర్ ఉంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ’రాంబాయి నీ మీద నాకు..’ లిరికల్ సాంగ్ అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కాగా ,‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
కుట్రదారులలో ముగ్గురు యూనివర్సిటీ ఉద్యోగులే
యూనివర్సిటీ నిధులు, వైద్యుల ఆర్థిక లావాదేవీలపై ఇడి దర్యాప్తు తప్పుడు అక్రిడిటేషన్ క్లయిమ్ పై ఎన్ ఏఏసి నోటీసులు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ తొలగింపు వర్సిటీపై చర్యకు సిద్ధమైన నేషనల్ మెడికల్ కమిషన్ న్యూఢిల్లీ ఎర్రకోట పేలుడు తర్వాత టెర్రరిస్ట్ కుట్రకు సంబంధించి రోజురోజుకూ కొత్త వివరాలు వెలుగులోకి వస్తుండడంతో హర్యానాలోని అల్ -ఫలాహ్ యూనివర్సిటీకి కొత్త ఇబ్బందులకు అంతు లేకుండా పోయింది. ఆ యూనివర్సిటీకి నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయి. వర్సిటీ గుర్తింపు ఎన్నాళ్లవరకూ ఉంది అన్న విషయంతో సహా పలు విషయాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. ఎర్రకోట పేలుళ్ల నిందితులు యూనివర్సిటీలో పనిచేయడం తో వారికి జైష్ -ఎ- మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో గల సంబంధాలపై ఆరా మొదలైంది.గరువారం తప్పుడు అక్రిడిటేషన్ క్లెయిమ్ ను ప్రదర్శించినందుకు ఎన్ ఏఏసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫలితంగా విశ్వవిద్యాలయ వెబ్ సైట్ ను తొలగించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి, విశ్వవిద్యాలయ నిధులతోపాటు, దాని వైద్యుల ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేపట్టింది. ఎర్రకోట వద్ద పేలుడుతో ఫరీదాబాద్ లోని దౌజ్ గ్రామంలో ఉన్న ఈయూనివర్సిటీ దేశంలో అందరి దృష్టిలోనూ పడింది. కారు పేలుడుకు పాల్పడి 13 మంది మృతికి కారకుడైన డాక్టర్ ఉమర్ నబీ ఇక్కడే పని చేస్తున్నాడని తేలింది. ఉమర్ తోపాటు అతడి ఇద్దరు సహచరులు, వైట్ కాలర్ టెర్రరిస్ట్ నెట్ వర్క్ లో కీలక పాత్ర ధారులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ షాహిద్ కూడా ఈ విశ్వవిద్యాలయంలో పని చేసినవారే. టెర్రరిస్ట్ మాడ్యూల్ ను ఛేదించి ముజమ్మిల్, షాహీన్ అరెస్ట్ లతో యూనివర్సిటీ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అరబిక్ లో అల్ -ఫలాహ్ అంటే, విజయం లేదా శ్రేయస్సు అని అర్థం. కానీ ఈ వారం పరిణామాలతో విశ్వవిద్యాలయం స్థాయి పూర్తిగా దిగజారి పోయింది. అక్రిడిటేషన్ గడువు ముగియడంతో నోటీసు గురువారంనాడు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అయిన ఎన్ ఏఏసి యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ అక్రిడిటేషన్ గడువు ముగిసిందని, సంస్థపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకో కూడదో చెప్పాలని నిలదీసింది. యూనివర్సిటీ వెబ్ సైట్ లో ప్రదర్శించబడిన గ్రేడ్ ఏ అక్రిడి టేషన్ పూర్తిగా తప్పు అనీ, ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఎన్ఏఏసి పేర్కొంది. యూనివర్సిటీ ఏడు రోజులలో స్పందించాలని గడువు విధించింది.అల్- ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కి గల -గ్రేడ్ ఏ -గుర్తింపు 2018లోనే ముగిసింది. అల్ -ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గుర్తింపు 2011 నుంచి 2016 వరకు చెల్లుబాటులో ఉంది. మరో పక్క నేషనల్ మెడికల్ కమిషన్ కూడా యూనివర్సిటీపై తగిన చర్య తీసుకునేందుకు సిద్ధమైంది. అల్- ఫలాహ్ వర్సిటీపై ఈడీ ఆరా ఢిల్లీ పేలుడు కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడంతో యూనివర్సిటీ, అందులో పనిచేసే వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నిర్వహిస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఈడీ డైరెక్టర్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఈడీ యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ల కు బదిలీ అయిన నిధుల పై దర్యాప్తు తీస్తుంటే,ఢిల్లీ పేలుళ్లపై దర్యాప్తు చేపట్టిన ఎన్ ఐఏ ఫరీదాబాద్ మాడ్యూల్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల అంశాన్ని పరీశీలిస్తుంది. అల్- ఫలాహ్ వర్సిటీలో పోలీసులు మరో పక్క హర్యానా పోలీసులు రంగంలోకి దిగి యూనివర్సిటీలోని 50 మందికి పైగా ఉద్యోగులు, ఆస్పత్రికి సంబంధించిన వైద్యులను ప్రశ్నించారు. ముగ్గురు డాక్టర్లకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీలో డాక్టర్ల రిక్రూట్ మెంట్ కు అనుసరించిన విధానాన్ని ఆరా తీస్తున్నారు.పేలుడుకు కారకుడైన డాక్టర్ ఉమర్ నబీ గతంలో అనంతనాగ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసేవాడు. అతడి నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి చనిపోవడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించినా, ఆ విషయాన్ని పట్టించుకోకుండా 2023లో అల్- ఫలాహ్ లో డాక్టర్ గా నియమించడం పై దర్యాప్తు సాగుతోంది.
Adilabad | గాజుల సవ్వడి… Adilabad | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి
ఢిల్లీ పేలుడు ఘటన దేశ వ్యతిరేక శక్తుల కుతంత్రమే: రాంచందర్ రావు
ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద పేలుడు ఘటన దేశ వ్యతిరేక శక్తుల కుతంత్రమేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు.ఈ దాడి దేశంలో శాంతిని భగ్నం చేసేందుకు, దేశ ప్రగతిని అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా పాల్పడిన చర్యగా అభివర్ణించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దోషులను కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టదని అన్నారు. దేశం మొత్తం ఇలాంటి ఉగ్రవాద చర్యలను అరికట్టేందుకు కేంద్రానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
భారతదేశంలోనే నూతన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ:సిఎం రేవంత్ రెడ్డి
23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే నూతన నగరంగా మారుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీనదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సిఎం అన్నారు. డ్రైపోర్ట్, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్రోడ్డు, రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల మధ్య మాన్యు ఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతి గురించి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివరించారు. చైనా +1 మోడల్కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందన్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ఐవి లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో ఆఫ్షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు.
Adilabad | ఉద్యోగుల నిరసన.. Adilabad | జైనూర్, ఆంధ్రప్రభ : సమగ్ర
Nalgonda |ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలి
Nalgonda | ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలి Nalgonda | హుజూర్నగర్, ఆంధ్రప్రభ
Video : Exclusive Interview with Dushyanth & Ashika Ranganath
The post Video : Exclusive Interview with Dushyanth & Ashika Ranganath appeared first on Telugu360 .
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ మోసానికి వృద్ధుడి బలి, ₹87.9 లక్షలు కోల్పోయిన రిటైర్డ్ ఉద్యోగి
పోలీసులుగా, సీబీఐ అధికారులుగా నటించిన మోసగాళ్లు
Warangal |సంక్షేమ పథకాలు అందించాలి…
Warangal | సంక్షేమ పథకాలు అందించాలి… Warangal | కరీమాబాద్, ఆంధ్ర ప్రభ
Defamation case |మంత్రి సురేఖ కు ఊరట !!
Defamation case | మంత్రి సురేఖ కు ఊరట !! హైదరాబాద్, ఆంధ్రప్రభ
Kalvakuntla Kavitha : కవిత ఇక వారి ట్రాప్ లో పడరట.. రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసుకున్నట్లే
తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
Nizamabad | సోలార్ ఫెన్సింగ్…. Nizamabad | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల
కెబీఆర్ పార్క్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు..
హైదరాబాద్: గంజాయి, డ్రగ్క్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.50కిలోల గంజాయి, 2గ్రాముల ఎండిఎంఏ, రూ.5,500 నగదు, రెండు బైక్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ సమీపంలోని బంజారాహిల్స్లోని కెబీఆర్ పార్క్ వద్ద గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరుగు తున్నాయనే సమాచారం వచ్చింది. వెంటనే హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్న పి. వేమేష్, కె. దేవి చరణ్, వై. హేమంత్ను అరెస్టు చేశారు. ఈ దాడిలో సీఐతో పాటు కానిసేబుళ్లు కిరణ్, శ్రీకాంత్, సాయి కుమార్, ప్రసాద్ పాల్గొన్నారు. కేసు దర్యాప్తు కోసం గంజాయి, డ్రగ్స్తోపాటు ముగ్గురు నిందితులను అమీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. 48 మద్యం బాటిళ్ల స్వాధీనం... గోవా, ఢిల్లీ, హర్యానా నుంచి తీసుకుని వస్తున్న నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ను ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఎస్టీఎఫ్ సీ అండ్ డీ టీమ్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి హహాడ్ షరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. పలు వాహనాలను తనిఖీలు చేయగా 48 నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ పట్టుబడినట్లు ఎస్టీఎఫ్ సీ టీమ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మంజు తెలిపారు.
IPL 2026 | ఈసారి కూడా అంతే ! ఆంధ్రప్రభ : ఇండియన్
Adilabad |గంజాయి ముఠా అరెస్ట్..
Adilabad | గంజాయి ముఠా అరెస్ట్.. Adilabad | ఖానాపూర్, ఆంధ్రప్రభ :
Telangana |దొంగనోట్ల తయారీ కలకలం
Telangana | దొంగనోట్ల తయారీ కలకలం హైదరాబాద్ లో పట్టుబడిన ముఠాతో గుట్టు
Video : Hero Surya Sethupathi Exclusive Interview
The post Video : Hero Surya Sethupathi Exclusive Interview appeared first on Telugu360 .
Nizamabad |అనువైన స్థలం ఎంపిక…
Nizamabad | అనువైన స్థలం ఎంపిక… Nizamabad | బిక్కనూర్, ఆంధ్రప్రభ :
తప్ప తాగి.. అన్నంలో కాళ్లు పెట్టి పడుకున్న వాచ్మెన్#TeluguPost #telugu #post #news
Telangana |రైల్వేస్టేషన్ లో విస్తృత తనిఖీలు
Telangana | రైల్వేస్టేషన్ లో విస్తృత తనిఖీలు Telangana | కరీమాబాద్, ఆంధ్రప్రభ
Medaram | ఇది సరైనది కాదు… Medaram | తాడ్వాయి, ఆంధ్రప్రభ :
ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జనగామ, ఆంధ్రప్రభ : విద్యా
Telangana | ఏసీబీ వలలో…. ఆదిబట్ల మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు…ఏసీబీ వలలో చిక్కిన

15 C