Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలివే.. ఇప్పుడు హ్యాపీనా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు పూర్తయింది
జోరుగా, హుషారుగా ‘పెళ్లి షురూ..’
ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది హీరోయిన్గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఆదివారం చిత్రంలోని రెండో పాట ‘పెళ్లి షురూ’ని హీరోయిన్ శ్రీలీల లాంచ్ చేశారు. ఇది ఆనందోత్సాహాలతో నిండిన పెళ్లి సాంగ్. హీరో-హీరోయిన్ల వివాహ వేడుకల ఉత్సాహాన్ని, సంబరాన్ని మెలోడీ లియాన్ జేమ్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాట వినగానే మనసును కట్టిపడేస్తుంది. ప్రియదర్శి, ఆనంది ఇద్దరూ బ్యూటిఫుల్ డ్యాన్స్ మూవ్స్తో పాటకు జీవం పోశారు.
ఆయన చిరస్థాయిగా ఉంటారు.. కమలాపూర్, ఆంధ్రప్రభ – ప్రముఖ కవి అందెశ్రీ మరణం
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ఏర్పాట్లు షురూ
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది.
ఒకే ఘటనతో.. తీర్పు.. బీజేపీ దిగ్గజం ఎల్.కె. అద్వానీని ఒకే ఘటన ఆధారంగా
Summer 2026: Young Actors to Test their Luck
Summer is always the best season for films. The last two years of summer in Telugu cinema have been wasted because of the poor release plan. 2026 is expected to witness a bunch of releases and several young Tollywood actors will be testing their luck in the holiday season. Top actors like Ram Charan and […] The post Summer 2026: Young Actors to Test their Luck appeared first on Telugu360 .
SK, Jason, Lyca’s Sigma First Look: Ready For Action
Sundeep Kishan is presently starring in a Telugu-Tamil bilingual which marks the directorial debut of Jason Sanjay. The film, produced by Subaskaran under the prestigious Lyca Productions banner, is nearing completion with only a final song left to be shot. Billed to be an action-packed adventure comedy, the movie is titled Sigma. Sundeep Kishan has […] The post SK, Jason, Lyca’s Sigma First Look: Ready For Action appeared first on Telugu360 .
Fact Check: Visuals from a Bangladeshi Movie Shared as a ‘Love Jihad’ Incident
The viral visuals are from a Bangladeshi film.
స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన బాలుడు
గురుగ్రామ్ లో విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన 11వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది
హిందూపురంలో విలేఖరిపై కర్రలతో దాడి చేసిన టిడిపి నేత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో విలేఖరిపై టిడిపి నేత దాడికి పాల్పడ్డాడు. రోడ్డు నిర్మాణ అక్రమాలపై వార్త రాసినందుకు టిడిపి నేత దాడి చేశాడని ఓ పత్రిక విలేఖరి శంకర్ తెలిపాడు. టిడిపి నేత నాగరాజు యాదవ్ అనే వ్యక్తి తొలుత ఫోన్ లో బెదిరించి అనంతరం కర్రలు, బెల్టుతో దాడి చేశాడు. పద్ధతి మార్చుకోకపోతే అంతు చూస్తానని బెదిరింపులకు దిగారు. టిడిపి నేత నాగరాజు యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలోలో జరగడం గమనార్హం
ఇంజన్లో లోపం.. అత్యవసరంగా విమానం ల్యాండింగ్
ముంబయి నుంచి కోల్కతాకు వెళ్తున్న స్పైస్జెట్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది
Aandesree{ అందెశ్రీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో
ప్రముఖ రచయిత అందెశ్రీ పార్ధీవ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు
కల కని ఎన్నాళ్లు అయ్యింది పచ్చని పొలం వెంట పల్లె పాట పాడుకున్నట్లు గట్ల మీద బాల్యం అమ్మ వెంట నడిచిన గుర్తులు కల కని ఎన్నాళ్లు అయ్యింది బస్స్టాప్లో బాల్య మిత్రుడిని కలుసుకున్నట్లు కౌమారం ముచ్చట్ల మూట విప్పి మురిసినట్లు కల కని ఎన్నాళ్లు అయ్యింది యౌవనం వీధిలో ఆమె మళ్ళీ తారసపడ్డట్టు యునివర్సిటి వలపు చెట్లకింద వూసులు వికసించినట్లు కల కని ఎన్నాళ్లు అయ్యింది సంసారానికి సిక్ లీవ్ పెట్టినట్లు హిమాలయం చెంత చింత లేకుండా సేద తీరినట్లు కల కని ఎన్నాళ్లు అయ్యింది నాన్న భుజంపై వాలి గుండె అలుగు దుమికినట్లు మనిషి జన్మ వరమా, శాపమా అని అడిగినట్లు కల కని ఎన్నాళ్లు అయ్యింది కలల కునుకు కోసం తపస్సు తప్పనట్లు వుంది కళ్లకు ఎన్నిమార్లు అర్జీ పెట్టుకున్నా కలలు కనికరించవు కదా - దాసరి మోహన్
ఆ ఊరు వెళుతున్నారా.. పిక్కలు జాగ్రత్త..
ఆ ఊరు వెళుతున్నారా.. పిక్కలు జాగ్రత్త.. భయాందోళనలో ప్రజలు..స్కూల్ కి వెళ్లాలంటే.. విద్యార్థుల
నువు ఖడ్గాన్ని ధరిస్తున్నావు నేను మాటలు అందుకుంటున్నాను మాటలు వికసిస్తున్నప్పుడు నువ్వు ఖడ్గంతో ఛేదిస్తున్నావు వికసించిన పువ్వులివాళ నేలరాలవచ్చుగాక రేపు మళ్ళా వేలాదిగా పూలు వికసిస్తాయి నీ ఖడ్గంతో భవిష్యత్తును మార్చగలవా నీ కత్తి బండబారింది, ముందు దానికి పదునుపెట్టు నువ్వు ఖడ్గం చేదాలుస్తున్నావు నేను నా గళాన్ని సవరిస్తున్నాను నేను పాటలు పాడటం మొదలుపెట్టగానే నువ్వు కత్తితో కుత్తుకనుత్తరిస్తున్నావు ఈ రోజు ఒక పాట ఆగిపోవచ్చు కానీ, రేపు వేలాది గళాలు అందుకుంటాయి నీ ఖడ్గంతో భవిష్యత్తును మార్చగలవా నీ కత్తి బండబారింది, ముందు దానికి పదునుపెట్టు నువ్వు ఖడ్గం ఝుళిపిస్తున్నావు నేను నా చేయి పైకెత్తుతున్నాను నేను పిడికిలి బిగిస్తూనే నువ్వు దాన్ని నరికేస్తున్నావు ఈ రోజు ఆ చేతుల్ని తెగ్గోయవచ్చు రేపు వేలాది హస్తాలు పిడికిళ్ళు బిగిస్తాయి నీ ఖడ్గంతో భవిష్యత్తును మార్చగలవా నీ కత్తి బండబారింది, ముందు దానికి పదునుపెట్టు నీ కత్తులు సరిపోవు పదాల పదును వాటిని ప్రశ్నిస్తుంది పాటలతో ప్రపంచం మార్మోగబోతోంది ఉక్కు పిడికిళ్ళు నిరసన కుడ్యాల్ని నిర్మించబోతున్నాయి సహస్రాధికంగా పూలు వికసిస్తాయి సహస్రాధికంగా గళాలు గర్జిస్తాయి సహస్రాధికంగా పిడికిళ్ళు బిగుసుకుంటాయి సహస్రాధికంగా తరాలు శిరసెత్తి నడుస్తాయి మళయాళ మూలం, ఇంగ్లిషు అనువాదం: సామజకృష్ణ తెలుగు: వాడ్రేవు చినవీరభద్రుడు సామజకృష్ణ తిరువనంతపురంలో లాయరు. యువకవి. ఆమె మళయాళంలో రాసిన ఈ కవితకు తనే చేసుకున్న ఇంగ్లిషు అనువాదాని కి ఇది నా తెలుగు సేత. ఈ కవిత ఇటీవలే అస్సమీలోకి కూడా అనువాదమయ్యింది. - సామజకృష్ణ
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఎగరే యంత్రం.. ఎక్స్-బ్యాట్ రెడీ! #Technology #Defense #Aviation #ShieldAI #IndiaAirForce #XBAT
ప్రత్యామ్నాయ సామాజిక నిర్మితి ఇంకా జరగలేదు
తెలంగాణ అస్తిత్వం- సృజన రంగం 9 ఈ అంశంపై సృజన రంగానికి సంబంధించిన, కొందరు ప్రముఖ రచయితల, మేధావుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం మేము మొదలుపెట్టాం. అందులో భాగంగా ఈసారి సీనియర్ పాత్రికేయుడు, సామాజిక వ్యాఖ్యాత, కాలమిస్ట్, కవి, విమర్శకుడు, నమస్తే తెలంగాణ పూర్వ ఎడిటర్, తెలంగాణా ప్రెస్ అకాడమి తొలి ఛైర్మెన్ అల్లం నారాయణ, అభిప్రాయాలు ఈ వారం మెహఫిల్లో తెలంగాణ అస్తిత్వం అంటే మీరిచ్చే నిర్వచనం ఏమిటి? తెలంగాణ అస్తిత్వం అంటే నా దృష్టిలో ముందు ప్రాంతీయ గుర్తింపు, అంతర్గత వలసలన్నింటిలా తెలంగాణ కూడా కోస్తాంధ్ర వలసాధిపత్యంలో స్వంత అస్తిత్వాన్ని కోల్పోయింది. పరాధీన సంస్కృతి ప్రభావంలో ఆత్మను కోల్పోయింది. ఫలితంగా వలసాధిపత్యం మీద ఆగ్రహం, ప్రతిఘటన, సంక్షోభం ఏర్పడి వివక్షలకు వ్యతిరేకంగా ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం జరిగింది. సమున్నత చరిత్ర, ప్రత్యేక సంస్కృతి, సాహిత్యం, కళలు, జీవన విధానం, రీతులు ప్రత్యేకంగా రూపుదిద్దుకోవడానికి తెలంగాణ ‘అస్తిత్వమే’ మూలం. వెయ్యేండ్ల సామాజిక చలనాల చరిత్ర, తెలంగాణ అస్తిత్వంలో ఆత్మగౌరవం, ధిక్కారం ప్రధాన లక్షణాలుగా ఏర్పడ్డాయి. వ్యవహార విజయాలకన్నా (wardly success) తెలంగాణ అస్తిత్వంలో బతుకును ప్రేమించేతత్వం ముఖ్యమైనది. సుదీర్ఘకాలం ముస్లింల పరిపాలన, భాషావైవిధ్యాలు, జీవన విధానాల ఆదాన ప్రదానాలు. భిన్న సంస్కృతుల సమ్మేళనంగా ‘గంగా జము నా తెహజీబ్’గా తెలంగాణ అస్తిత్వం ప్రత్యేకమైనది. సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో ఆ అస్తి త్వ, ప్రతిఫలం, ప్రయోజనం, విస్తృతి ఎలా ఉంది? ఎలా ఉండాలని మీరనుకుంటారు? సాహిత్యం, సాంస్కృతిక కళారంగాల్లో ఆత్మగౌరవం, ధిక్కరణ స్వభావాల సారాంశంగా ఉం డాల్సిన స్థితి మారింది. ఉద్యమ సందర్భంలో వెల్లడైన ఆకాంక్షలు, సామాజిక, ప్రజాస్వామ్య భావనలుగా ప్రత్యామ్నాయ సామాజిక నిర్మితి జరగలేదు. అప్పటిదాకా ఉద్యమంలో ఉన్న రాజకీయ శక్తులు, ఫక్తు రాజకీయ సమీకరణలతో ఉద్యమానంతరం విస్మృతి జరగలేదు. నిజానికి తెలంగాణ ఉద్యమం సాంస్కృతికోద్యమం నడిపించిన రాజకీయ ఉద్యమం అనిపించేంత స్థాయిలో ప్రతిఫలనాలు కనిపించాయి. కానీ ఆ తర్వాత భంగపాటు. ఉద్యమ ఆకాంక్షల్లో సాం స్కృతిక, కళారంగాల్లో వెల్లడయిన అస్తిత్వ పతాక ఎత్తిపట్టి మరింత ప్రాంతీయ చిహ్నాలు, సమూనాలు, విధానాలు ఏర్పడాలనేది నా కోరిక. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సృజ న రంగంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్తరణకి చోటు దొరికిందా? ఎలాంటి నూత న మార్పులు జరిగాయి అనుకుంటున్నారు? సృజనరంగంలో జరిగిన మార్పులు పెద్దగా చెప్పుకోదగ్గవి కావు. అస్తిత్వ పరిరక్షణకు మౌలికంగా పరాధీనమై న మన సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలను లేదా వలసాధిపత్యంలో విస్తృతికి లోనై, గుర్తింపునకు నోచుకోకుండా ఉన్న వస్తుగత విషయాలను ఎవరూ పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఆయా రంగాలలో ఆంధ్రుల పెత్తనం ప్రస్పుటంగానే కనబడుతున్నది. దానికితోడు ప్రభుత్వాలకు సంస్కృతికి చుక్కెదురు అన్న మాటలను నిజం చేస్తూ ఈ రంగాలు పట్టించుకోకుండా అనాధలయ్యాయి. పైపై మార్పులే తప్ప ఉద్యమ సందర్భంలో ప్రకటించిన అస్తిత్వ ఆకాంక్షలేవీ పెద్దగా ఫలించలేదు. మరీ ముఖ్యంగా గ్లోబలీకరణ అనంతర పరిస్థితుల్లో ప్రపంచవ్యా ప్తంగా సృజరంగాల్లో ఎంతో వేగం గా వివిధ సంస్కృతుల కలగలుపు జరుగుతున్న స్థితి ఉంది. తెలంగాణ స్వీయ అస్తిత్వేతర సంస్కృతులు, సాహిత్యం, కళారంగాల నుంచి మంచిని తెలుసుకోవడం, నేర్చుకోవడం సృజనాత్మక రంగాల్లో సమ్మిళితం చేసుకోవడం అవసరమనుకుంటున్నారా? తెలంగాణ అస్తిత్వం ప్రత్యేకతే ‘సమ్మిళిత సంస్కృ తి’, ‘గంగా జమునా తెహజీబ్’.. నిజమే గ్లోబరీకరణ ప్రాంతీయతలను, ప్రత్యేక అస్తిత్వాల చారిత్ర క, సాంస్కృతిక, సామాజిక విభిన్నతలను ప్రత్యేకతలుగా గుర్తించదు. కానీ ‘స్థానికీయతే విశ్వజనీనత’.. తెలంగాణ లాంటి సాంస్కృతిక అస్తిత్వం భిన్నత ఆదాన ప్రదానాలు ప్రధాన లక్షణంగా పరిపుష్టం అవుతుంది. గ్లోబరీకరణ ప్రపంచాన్ని మన ముందర నిలిపింది. అనేక అస్తిత్వాలను, వాటి సంక్లిష్టతలను పరిచయం చేసింది. వాటిని స్వీకరించడం అనంటే అవి తెలంగాణా కన్న గొప్ప లక్షణాలుగా అయి ఉండాలి. తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి పరిరక్షణ కోసం నిర్దిష్టంగా మీరు చేసే సూచనలు ఏమిటి? తెలంగాణ అస్తిత్వంలోని ప్రధాన సంస్కృతీ చిహ్నా లు, నమూనాలను పరిరక్షించుకోవాలి. భాషకు సంబంధించి ఉద్యమ సందర్భంలో చాలా చర్చ జరిగింది. సంస్కృతికి మొదటి కిస్తీ భాష అంటా రు. తెలుగు భాషలో, తెలంగాణ భాషలో గందరగోళం అక్కరలేదు. మాండలికం కాదు, భాషే వాడుకగా పెరగాలి. పాఠ్య పుస్తకాలు, సినిమాలు, పండుగలు, పబ్బాలు అన్నీ ఏవైతే అస్తిత్వ పతాకాలుగా వెలుగొందాయో వాటిని కాపాడుకోవాలి. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పరిమళించాలి.
All Eyes on Raja Saab Music Now
The first singles from Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu and Ram Charan’s Peddi emerged as chartbusters. Both the songs are on the top of the music charts and they offered a treat for the music lovers. The first single from Prabhas’ upcoming movie Raja Saab has been delayed due to various reasons. It was […] The post All Eyes on Raja Saab Music Now appeared first on Telugu360 .
Gold Rates Today : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు దూసుకుపోతున్న వెండి ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
అందెశ్రీ మృతిపట్ల రేవంత్ రెడ్డి దిగ్భ్రాం తి
హైదరాబాద్: తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజల కవి అందెశ్రీ మృతిపట్ల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి ఆవేదనను కలిగించిందని, ఆయన మరణం సాహితీ లోకానికే కాదు వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపచేసిన గొప్ప యోధుడు అని అందెశ్రీ ప్రశంసించారు. నిత్యం పేదల పక్షాన గొంతుక వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి అని కొనియాడారు. అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” గేయంగా నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని మెచ్చుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. సోమవారం ఉదయం ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలో అందెశ్రీ ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయి తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీ కన్నుమూత #Telangana #Andesri #Poet #Hyderabad #Tribute #viralvideo
OTT Shock: Producer & Ex-VP Under Scanner for Inflated Digital-Rights Deals
A leading OTT platform is preparing to file criminal charges against a Tollywood producer and one of its former senior employees over allegedly inflated digital-rights deals spanning 2022–2024. The company’s internal audit was launched after a tip-off from members of the producer’s own camp, and the review reportedly found that three small-budget films by the […] The post OTT Shock: Producer & Ex-VP Under Scanner for Inflated Digital-Rights Deals appeared first on Telugu360 .
Tirumala : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు
Telangana : ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత
తెలంగాణ కు చెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి చెందారు
విశాలాంధ్ర – కొవ్వూరు : ఈతలో ఈ అబ్బాయి వేగానికి చేపలు కూడా అలసిపోయి వెనుకబడి పోయాయి.. 50మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ లో జిల్లా స్థాయి లో విజేతగా నిలిచాడు..బంగారు మెడల్ దక్కించుకున్నాడు..100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ లో తృటిలో తప్పిన మొదటి స్థానం, రెండవ స్థానంలో వెండి పతకం గెలుచుకునని ఇప్పుడు దక్షిణ భారత దేశ పోటీలకు సిద్ధమౌతున్నాడు.. మృదువైన గోదావరి అలల పై సాధన చేసు వేగవంతమైన ఈత గాడి గా నిలబడ్డాడు. కొవ్వూరు […] The post ఈత లో చిచ్చర పిడుగు appeared first on Visalaandhra .
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలో అందెశ్రీ ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి వచ్చేలోపే ఆయన కన్నుమూశారని వైద్యులు వెల్లడించారు. రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలక పాత్రపోషించారు. మాయమైపోతున్నడమ్మా అనే మనిషి గీతంతో ఆయన పేరు మార్మోగిపోయింది. పాఠశాలకు వెళ్లకుండానే ఆయన కవిగా రాణించారు. కాకతీయ యూనివర్సిటీ ఆయనను డాక్టరేట్ తో సత్కరించింది. 2014లో అకాడ మి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్ట రేట్ పొందారు. 2015లో దాశ రథి సాహితి పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితి పురస్కారం ఆయనను వరించిన విషయం తెలిసిందే. 2006లో గంగా సినిమాలో గీత రచయితగా ఆయనకు నంది అవార్డు కూడా వరించింది. జనగాం జిల్లా రేబర్తి గ్రామంలో దళిత కుటుంబంలో 1961లో ఆయన జన్మించారు. అందె శ్రీ చిన్నప్పుడు భూస్వాముల దగ్గర గొర్రెల కాపరిగా పనిచేశాడు. అక్షర ముక్క రాకుండానే అందె శ్రీ తన కళాఖండాలతో తెలుగు ప్రజల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన గీతాలు రాష్ట్రవ్యాప్తంగా పాడబడుతున్నాయి. వాటిలో చాలా వరకు తెలుగు సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాయి .పల్లె నీకు వందనములమ్మో, మాయమై పోతున్నదమ్మా.. మనిషన్నవాడు, గల గలా గజ్జలబండి, కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా అనే గేయాలను రచించారు.
Bigg Boss Telugu 9: Sai Eliminated
The latest episode of Bigg Boss Telugu Season 9 was packed with drama, emotions, and laughter. From debates over who deserves the trophy to Sai’s lighthearted farewell, the episode struck a balance between tension and entertainment. Suman Saved; Secret Task Fun Unveiled The episode opened on a cheerful note as Suman was declared safe from […] The post Bigg Boss Telugu 9: Sai Eliminated appeared first on Telugu360 .
ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్.... పోలీసులకు అనుపమ పరమేశ్వరన్ ఫిర్యాదు
తిరువనంతపురం: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన నెటిజన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా తన మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తున్న వారి పై కేరళలో సైబర్ క్రైమ్ పోలీసులకు అనుపమ ఫిర్యాదు చేశారు. తమిళనాడుకు చెందిన ఓ 20 ఏళ్ల అమ్మాయి దీని వెనుక ఉందని, తనకు తెలిసిన వ్యక్తులను కూడా ఆ పోస్ట్ లకు ట్యాగ్ చేశారని వివరించింది. ఈ విషయం పై ఇన్స్టాగ్రామ్లో ఆమె ఒక పోస్ట్ పెట్టింది. తనని ట్రోల్ చేసిన అమ్మాయి వయస్సు 20 ఏళ్ళు మాత్రమే కావటంతో ఆమె గుర్తింపును బహిర్గతం చెయ్యొద్దని పోలీసులను విన్నవించింది. తనకు సంబందించిన ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు తన గురించి నీచంగా రాసిందని ఫిర్యాదులో పేర్కొంది. వీటితో తనను ఆన్ లైన్ లో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడింది. ఫేక్ ఎకౌంట్ సృష్టించి మార్ఫింగ్ ఫొటోలు సోషల్ పోస్టు చేయడం మంచిది కాదని హెచ్చరించారు.
Andhra Pradesh : ఎలుకల దాడి ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్
ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులపై జరిగిన ఎలుకల దాడి ఘటన పైమంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు
బ్రేకింగ్ న్యూస్ –అందెశ్రీ కన్నుమూత..
బ్రేకింగ్ న్యూస్ – అందెశ్రీ కన్నుమూత.. ప్రముఖ రచయిత అందెశ్రీ ఇంట్లో కుప్పకూలి
Telangana : ప్రముఖ రచయిత అందెశ్రీకి తీవ్ర అస్వస్థత
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Weekend Box-office: The Girlfriend is on the Top
It is not a great weekend for the Telugu box-office during the first week of November. Rashmika Mandanna’s The Girlfriend, Sudheer Babu’s Jatadhara, Thiruveer’s The Great Pre-Wedding Show are the prominent Friday releases. Apart from these, films like Premistunnaa, Aaryan (Tamil dub film), Haq (Hindi film) also released on Friday. Except The Girlfriend and The […] The post Weekend Box-office: The Girlfriend is on the Top appeared first on Telugu360 .
Delhi : వాయు కాలుష్యంపై నేడు సుప్రీంలో విచారణ
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
దగ్ధమైన దుకాణం.. కారణం ఇదే.. నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట
అక్రమ బొండు మట్టి తోలకాలు పై అధికారులు చర్యలు
– విశాలాంధ్ర కథనానికి స్పందన విశాలాంధ్ర – సీతానగరం: అనధికారిక బొండు మట్టి తోలకాలు పై అధికారులు చర్యలు. నవంబర్ 5వ తేదీన అక్రమ ఇసుక రవాణా పై చర్యలు ఏవీ అని విశాలాంధ్ర పత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ ఆదివారం అక్రమ బొండు మట్టి తోలకాలు జరుపుతున్న మూడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మండలంలో సీతానగరం గ్రామంలో గల కైలాసగిరి ర్యాంపు నుంచి గత కొన్ని రోజులుగా […] The post అక్రమ బొండు మట్టి తోలకాలు పై అధికారులు చర్యలు appeared first on Visalaandhra .
Delhi : ఢిల్లీ వెళుతున్నారా.. అయితే అలెర్ట్ గా ఉండాల్సిందే
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. చలి తీవ్రత పెరగడంతో వాయు కాలుష్యం పెరిగింది.
తిరుమల నేటి సమాచారం.. తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి – తిరుమలలో టోకెన్లు లేని
అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పవన్ కాన్వాయ్ వెళ్తుండగా ఓ కారు హేమలత అనే మహిళ కాలు పైనుంచి వెళ్లిపోయింది. పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. వెంటనే సదరు మహిళను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తోపులాటలో పవన్ కారు టైర్ కిందపడి కాలు విరిగిందని బాధితురాలు హేమలత వాపోయారు. కాన్వాయ్ వెళ్లేదారిలో జనాల తాకిడి ఎక్కువగా ఉండడంతో మహిళ స్పృహ తప్పికిందపడిపోయిందని అధికారులు తెలిపారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. పలమనేరు మండలం ముసలిమడుగులో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభిం చారు. మదపుటేనుగుల దాడుల నుంచి పంట పొలాలను, మనుషులను రక్షించేందుకు ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చిన కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదివారం సందర్శించారు. ఆదివారం, చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, ముసలమడుగు వద్ద ఉన్న శిక్షణ కేంద్రానికి విచ్చేసిన ఆయన ఏనుగుల శిక్షణ, సంరక్షణ తదితర అంశాలను స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక నుంచి తెచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతోపాటు గతంలో ఇదే శిక్షణ కేంద్రంలో ఉన్న మూడు కుంకీలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాయి. శిక్షణలో కుంకీ ఏనుగులు చూపుతున్న మెలకువలు, ఇటీవల జరిగిన ఆపరేషన్ల తీరును అధికారులు వివరించారు. సందర్భంగా కుంకీ ఏనుగులు ప్రత్యేకంగా చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. క్రమబద్ధంగా కుంకీ ఏనుగులు వరుసగా వస్తూ ఘీంకారం చేస్తూ పవన్ కళ్యాణ్ కు సెల్యూట్ చేశాయి.
Telangana : మంత్రిగా నేడు మహమ్మద్ అజారుద్దీన్ బాధ్యతల స్వీకరణ
మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు
Andhra Pradesh : నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం
ఆంధ్రప్రదేశ్ లో నేడు కేంద్ర బృందం పర్యటించనుంది. ఇటీవల సంభవించిన మోంథా తుపాను కు సంభవించిన నష్టాలను పరిశీలించనుంది
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2026 కోసం ఈ ఏడాది డిసెంబర్లో వేలం పాటను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వచ్చే ఐపిఎల్ కోసం ఈ మెగా వేలం పాటను నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత రెండు సీజన్లలో ఐపిఎల్ వేలం పాటను విదేశాల్లో నిర్వహించారు. ఈసారి మాత్రం భారత్లోనే దీన్ని నిర్వహించేందుకు బిసిసిఐ సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఏ నగరంలో వేలంపాట నిర్వహిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. డిసెంబర్ 15న ఐపిఎల్ వేలం పాట జరిగే అవకాశాలున్నాయి. నవంబర్ 15లోపు అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చుసుకునే ఆటగాళ్ల జాబితాను బిసిసిఐకి ఇవ్వాల్సి ఉంది. కొన్ని రోజుల వరకు ఈసారి కూడా వేలం పాటను గల్ఫ్ దేశాల్లోనే నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. ఆయా ఫ్రాంచైజీలకు బిసిసిస ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు కథనాలు కూడా వినవచ్చాయి. కానీ ప్రస్తుతంఅవన్నీ ఊహాగానాలేనని తేలింది. ఈసారి వేలం పాటను భారత్లోనే నిర్వహించేందుకు బిసిసిఐ చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఆటగాళ్ల రిటైన్ జాబితా వచ్చిన తర్వాతే బిసిసిఐ వేలం పాట గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.
చలి పంజా.. రాష్ట్రంలో చలి తీవత్ర పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పుడిప్పుడే
Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు
ఆడబిడ్డ రాజకీయాలు చేయొద్దన్నారు: ఎమ్మెల్సీ కవిత
అవమానకరంగా బిఆర్ఎస్ నుంచి బయటకు పంపారు ప్రొటోకాల్ పేరుతో గత ప్రభుత్వం నన్ను కట్టడి చేసింది ఆ సంకెళ్లను తెంచుకొని ప్రజల మధ్యకు వచ్చా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మన తెలంగాణ/హన్మకొండ: ఆడబిడ్డ రాజకీయాలు చేయొద్దని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తనను కట్టడి చేసిందని, అవమానకరంగా తనను పార్టీ నుంచి బయటకు పంపారని, ఆ సంకెళ్లను తెంచుకొని ప్రజల మధ్యకు వచ్చానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఉదయం హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బిఆర్ఎస్లో తనను ప్రొటోకాల్ పేరుతో నిజామాబాద్కే కట్టడి చేశారన్నారు. టీచర్ను ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి లేకుండేనని అన్నారు. 20 ఏళ్లు బిఆర్ఎస్లో పనిచేస్తే తనను అవమానకరంగా బయటకు పంపించారని వ్యాఖ్యానించారు. కనీసం తనకు షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. నేను తెలంగాణ బిడ్డనే. ఆకలినైనా తట్టుకుంటానని, అవమానాన్ని మాత్రం తట్టుకోలేనని అన్నారు. పొలిటికల్గా బిఆర్ఎస్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. విప్లవాత్మక మార్పు జరిగినప్పుడు కొంతమందికి నష్టం జరగవచ్చునని అన్నారు. తనను బిఆర్ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఇకపై పక్కా రాజకీయాలు చేసి చూపిస్తానని చెప్పారు. ఆడబిడ్డ రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అన్నారు. రా ష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ రెండూ ప్రజలకు మంచి చేయడంలో విఫలమయ్యాయని అన్నారు. వరంగల్ గడ్డ పౌరుషాల గడ్డ అని, ఇక్కడ నడయాడిన కవులు, మేధావులు సమ్మక్క సారల పౌరుషాన్ని నింపుకున్న నేల అన్నారు. అయినా తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్లో అభివృద్ధిలో లేదన్నా రు. ప్రస్తుత పాలకులు ఇక్కడి అభివృద్ధి సంక్షేమాన్ని మర్చిపోయారని గుర్తు చేయాడానికే వరంగల్ గడ్డను ఎంచుకొని పర్యటన చేస్తున్నానని అన్నారు. యాక్షన్ రిపోర్ట్ తయారుచేసి దాని ప్రకారంగా సమస్యలపై ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తానని అన్నారు.
రాసి పెట్టుకోండి.. పదేళ్లు మేమే
2029లో జమిలి..2034వరకు అధికారంలో ఉంటాం గత 10 సంవత్సరాలను కెసిఆర్, మోడీ జల్సాలకు వాడుకున్నారు కాంగ్రెస్ సిఎంల నిర్ణయాల వల్లే హైదరాబాద్లో అభివృద్ధి బిఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలు అధోగతి ధృతరాష్ర్టుడిలా కెసిఆర్ పరిస్థితి సినిమాలో ఐటమ్ సాంగ్లా కెటిఆర్ వ్యవహారశైలి ఆయన జీవితంలో అధికారమనే రేఖ లేదు బావ బామ్మర్దులది పైశాచిక ఆనందం గత ప్రభుత్వంలోని మంచి పథకాలు కొనసాగిస్తున్నాం మాకు కేంద్రంతో కాదు కిషన్రెడ్డితోనే సమస్య ఏ లాభం కోసం కెటిఆర్తో ఆయనకు సోపతి కాళేశ్వరం, ఫార్ములా ఈపై చర్యలను అమిత్ షా, గవర్నర్ పెండింగ్లో పెట్టారు మహిళల ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్తో ఒప్పందం ‘మీట్ ది ప్రెస్’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మన తెలంగాణ/హైదరాబాద్ః “2034 జూన్ వరకూ అధికారం మాదే&రాసిపెట్టుకోండి&జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి..” అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి కొనసాగింపుగా గత బిఆర్ఎస్ పదేళ్ళ విధ్వంసాన్ని మరిపించే విధంగా రాబోయే వందేళ్ళ అభివృద్ధి లక్షంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్వర్యంలోని యుపిఎ-1, యూపిఎ-2 హయాంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆర్జించిన ఆదాయాన్ని గడచిన పదేళ్ళ కాలంలో కెసిఆర్, ప్రధాని నరేంద్ర మోడీ జల్సాలకు వాడుకున్నారని ధ్వజమెత్తారు. కుంటుపడిన పాలనను ఈ రెండేళ్ళ తమ పాలనలో చక్కదిద్దే ప్రయత్నం చేశామన్నారు. నాటి కాంగ్రెస్ అభివృద్ధితో నేడు దేశానికి వచ్చిన ఐదు వందల కంపెనీల్లో డ్బ్భై శాతం రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రపంచాన్ని శాసించే సంస్థలు హైదరాబాద్లో కొలువుదీరాయని, ఇది నాటి కాంగ్రెస్ పాలనకు నిదర్శమని అన్నారు. గత పదేళ్ళలో అమర వీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, కమాండ్ కంట్రోలు అంచనాల కంటే మించి ఖర్చు చేసి నిర్మించారని, వీటితో ఎవరికి ఉపయోగం కలిగిందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ఈ సీజన్లో కాళేశ్వరం నీటిని ఉపయోగించకపోయినా కోటి పది లక్షల ఎకరాల సాగుతో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించింది అని ఆయన తెలిపారు. ఒక్క పాఠశాల అయినా.. ఒక్క పాఠశాల అయినా నిర్మించారా?, ఐదు వేల పాఠశాలలు మూసి వేసి, మహిళా సంఘాల నిర్వీర్యం, రైతుల దగా, యువతను మోసం చేయడం ఇదీ కెసిఆర్ పదేళ్ళ పాలనలోని గొప్పతనం అని ఎద్దేవా చేశారు. ఉద్యమ ఆకాంక్షను, ఆత్మను చంపేసి అన్ని రంగాలనూ నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ రాజకీయ త్యాగం చేసిందని, పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ అరవై తొమ్మిది వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని బిఆర్ఎస్కు అప్పగిస్తే, లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల లెక్కల్లో లేని అప్పులు, ఆరు లక్షల డ్బ్బై ఒక్క వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని పదేళ్ళలో ఎనిమిది లక్షల పదకొండ వేల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని ఆయన విమర్శించారు. తాను బాధ్యత స్వీకరించే నాటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తెలిపారు. దృతరాష్ర్టుడిలా భరిస్తున్న కెసిఆర్ దృతరాష్ర్టుడిలా కెసిఆర్ పిల్లల దుర్మార్గాన్ని భరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దశ మారుతుందని సచివాలయం కడితే రాతలో దశ సక్కగా లేనోడి దిశ (వాస్తు) ఏ కట్టడాలు మారుస్తాయని ఆయన ప్రశ్నించారు. చెల్లికి బువ్వ పెట్టలేనోడు ప్రజలను ఏమి ఆదరిస్తారని ఆయన అన్నారు. కెసిఆర్ కళ్ళకు గంతలు కట్టుకుని కెటిఆర్ పాపాలు చూడలేక ఫాం హౌస్కు వెళ్ళి కుమిలిపోతున్నాడని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సినిమా ఐటం సాంగ్లా కెటిఆర్ వ్యవహార శైలి ఉందని, ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటూ, దుమ్మెత్తిపోసే వ్యక్తి రాష్ట్రానికి ఎలా నాయకునిగా ఉంటారని ఆయన నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్ను మందలించడం పట్ల కెసిఆర్కు మంచి బుద్ది వచ్చిందని అనుకుంటున్నానని ఆయన తెలిపారు. కెసిఆర్తోనే బిఆర్ఎస్ అంతమవుతుందని ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీలో బిఆర్ఎస్ ఓడిపోతుందన్న అవగాహన ఉన్నందుకే ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్రచారానికి రాలేదని, కనీసం బిఆర్ఎస్ను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేసిన దాఖలాలు కూడా లేవన్నారు. ఈ సంఘటనలతో ప్రస్తుతం కెసిఆర్ను సానుభూతితో చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గల్లీలో గంజాయి.. గత బిఆర్ఎస్ పాలనలో గల్లీ, గల్లీలో గంజాయి దొరికేదని, ఇప్పుడు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వాటిపై ఉక్కు పాదం మోపి భవిష్యత్తు తరాలకు వారధిగా ఉన్న యువత విలువైన జీవితాలను కాపాడుతున్నామని అన్నారు. వారిది డ్రగ్స్ కల్చర్ అయితే మాది అగ్రికల్చర్ ఆయన చెప్పారు. పైశాచిక ఆనందం పొందడంలో బావ-బావమరదులు పట్టభద్రులయ్యారని, అసెంబ్లీలో చూసే విషపు చూపులకు సిఎం కుర్చీ కాలిపోయే విధంగా ఉందని ఆయన ఎద్దెవా చేశారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా పైశాచిక ఆనందం పొందుతూ, ఇంట్లో తలుపులు పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్లో మూడు సార్లు ఎంఎల్ఎగా బిఆర్ఎస్ గెలుపొందిందని, నాడు అభివృద్ధి చేయకుండా ఇప్పుడేమో అక్కడ చెత్తాచెదారంతో నిండిందని కెటిఆర్ విమర్శించడం హస్యాస్పదంగా ఉందన్నారు. మున్సిపల్ మంత్రిగా ఉండి కెటిఆర్ పట్టించుకోలేదని, ఒక్క రోజు చెత్త కుండీకి కట్టేస్తే పేదల బాధలు తెలుస్తాయని అన్నారు. నాడు కె. రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి తెచ్చిన గోదావరి జలాలను నెత్తిన చల్లుకుని మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. కేంద్రంతో కాదు, కిషన్ రెడ్డితోనే సమస్య తమకు కేంద్ర ప్రభుత్వంతో సమస్యలేదని, జంట నగరాల అభివృద్ధిని పనిగట్టుకుని అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితోనే సమస్య అని ముఖ్యమంత్రి ఆరోపించారు. మూడు సార్లు బిఆర్ఎస్ ఎంఎల్ఎగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటే, లోక్సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమి చేశారని ఆయన నిలదీశారు. జూబ్లీలో బిజెపి పిట్ట వాలలేదు.. కెటిఆర్తో సోపతి వెనుక ఉన్న పరమార్థం ప్రజలకు చెప్పాలని సిఎం డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికలకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రచారం చేయించిన బిజెపి నేతలు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్గా బిఆర్ఎస్పై విరుచుకుపడుతున్న ఎంపి అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్, అదే నియోజకవర్గంలో ఉన్న ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ప్రచారానికి ఆఖరి నిమిషయంలో పిలవడంలోని అంతర్యాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. బిజెపి-బిఆర్ఎస్ విలీన ప్రక్రియ ఎప్పుడో మొదలైందని, పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బిజెపిని గెలిపించిందని అన్నారు. సాక్షాత్తు కెసిఆర్, హరీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ లోక్సభ నియోజకవర్గంలో బిజెపి గెలుపొందడం ఇందుకు నిదర్శనమని ఆయన ఉదహరించారు. జూబ్లీ ఎంఎల్ఎ నవీన్ యాదవ్ జూబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుస్తున్నారని, ఆ తర్వాత స్థానిక సమస్యలన్నీ ఆయనే పరిష్కరిస్తారని సిఎం పేర్కొన్నారు. విద్యావంతుడైన నవీన్ యాదవ్ను రౌడీ అని సంభోదించడం బిఆర్ఎస్, బిజెపి నేతలకు భావ్యం కాదన్నారు. జూబ్లీలో బిఆర్ఎస్ ఓడిపోతుందని, బిజెపికి డిపాజిట్ కూడా రాదని ఆయన పునరుద్ఘాటించారు. జూబ్లీలో హిందువులంతా బిజెపితో ఉన్నారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం డిపాజిట్ తెచ్చుకుంటే గొప్ప అని అన్నారు. అయితే డిపాజిట్ రాకపోతే హిందువులు బిజెపితో లేనట్లేనని ఒప్పకుంటారా? అని ఆయన అడిగారు. డిపాజిట్ వస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కూడా గెలిచినట్లేనని ఆయన వ్యంగాస్త్రం సంధించారు. లీడర్ మైండ్సెట్ కాదు&క్యాడర్ మైండ్ సెట్ తాను మొదటగా కాంగ్రెస్ కార్యకర్తనని, ఆ తర్వాతే ముఖ్యమంత్రినని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నిక ఏదైనా కష్టపడి పని చేసే మనస్థత్వం తనదని ఆయన చెప్పారు. సర్వశక్తులతో పని చేసే కార్యకర్త మైండ్ సెటే తప్ప లీడర్ మైండ్ సెట్ తనది కాదన్నారు. నాగార్జున సాగర్, హుజురాబాద్, హుజుర్నగర్, మునుగోడు తదితర నియోజకవర్గాల ఎన్నికల్లో పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సర్వేల గురించి అడిగిన ప్రశ్నకు సిఎం స్పందిస్తూ తాను నిరంతరం క్షేత్ర స్థాయిలో పని చేసే వ్యక్తినని, ఈ క్రమంలో పార్టీ గెలుపు అంశంపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. దీనికి అనుగుణంగా గత సార్వత్రిక ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, తాను ఆ రోజే చెప్పానని ముఖ్యమంత్రి సదరు విలేకరినుద్దేశించి అన్నారు. కేంద్రంలోనూ రెండు వందల నలభై స్థానాల వద్ద బిజెపి ఆగిపోతుందని తాను చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరో ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ తాను ఎనభై వేల పుస్తకాలు చదవలేదని, క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై వారి జీవితాలను చదవానని తెలిపారు. గుంటూరు చదువుకోలేదని, భీమవరంలో వ్యాపారం చేయలేదని ఆయన అన్నారు. జర్నలిస్టుల పిల్లల చదవులకు ఫీజులో రాయితీల విషయమై అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి స్పందిస్తూ పోలీసు యంగ్ ఇండియా పాఠశాలలో ఐదు శాతం అడ్మిషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్లో ఎటిసికి అనుమతి ఇస్తున్నానని అన్నారు. అమేజాన్తో ఒప్పందం.. రాష్ట్రంలో మహిళా సంఘాలు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు అమేజాన్తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ లక్షమని ఆయన తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో కొన్ని మంచి పథకాలను కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు. ఎవరిది పబ్ కల్చర్, ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్, ఎవరు సినీ కార్మికుల కోసం కష్టపడే కల్చర్, ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్ ఆలోచించాలని జూబ్లీ ఓటర్లను కోరారు. పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ప్రాధాన్యతవారీగా పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనపై ఉందని, జూబ్లీహిల్స్ గెలవాల్సిందే&అభివృద్ధి జరగాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఇంట్లోకి రానిస్తున్నారు.. ఢిల్లీకి వెళితే చెప్పులు కూడా ఎత్తుకు పోతారు అనే పరిస్థితులు గుణాత్మకంగా మారాయా? అని ప్రశ్నించగా, చాలా మారాయని, వీరు మంచి వారే అని అభిప్రాయం వారికి కలిగిందని, ఇంట్లోకి కూడా రానిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఇంకా వేగంగా పరుగెత్తాల్సిన అవసరం ఉందన్నారు. కిషన్ రెడ్డి అడ్డుపడని ప్రతి విషయం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరంపై సిబిఐకి ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో అరెస్టు చేయిస్తామన్న కిషన్ రెడ్డి విషయం మూడు నెలలుగా సిబిఐ వద్ద ఉంటే ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. సబర్మతి, గంగా, యమున నదులకు రివర్స్ఫ్రంట్ ఉండవచ్చు కానీ హైదరాబాద్లో మూసీకి రివర్స్ఫ్రంట్ ఉండొద్దా? అని ఆయన కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలను ఏ మార్చి బిజెపి పాలిత ప్రాంతాలకు కిషన్ రెడ్డి పంపిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిజెపి పాలిత రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి కానీ ఇతర రాష్ట్రాలు అభివృద్ధి చెందకూడదా? అని ఆయన నిలదీశారు. గుజరాత్కు గులాంగిరి చేస్తూ రాష్ట్రానికి కిషన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల కోసం తన వద్దకు రావడం లేదని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ వస్తే కాంగ్రెస్లో చేరుతారేమోనన్న ప్రచారం జరుగుతుందేమోనన్న భయమా? అని ప్రశ్నించగా, ఎంఎల్ఏలపై యజమానికే నమ్మకం లేదని ఆయన కెసిఆర్నుద్ధేశించి అన్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం బిఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు కూడా తన వద్దకు వచ్చారని ఆయన చెప్పారు. అక్కడ అమిత్ షా&ఇక్కడ గవర్నర్ వద్ద పెండింగ్ కాళేశ్వరంపై నియమించిన పిసి ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత చర్యలు తీసుకోకుండా కేంద్రం అధీనంలో ఉన్న సిబిఐకి ఎందుకు అప్పగించారని ప్రశ్నించగా, ముఖ్యమంత్రి స్పందిస్తూ కాళేశ్వరం అంశం విస్తృతి చాలా పెద్దదని ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థల నివేదిక కూడా అవసరం ఉంటుందని, వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తే బాగుంటుందని అసెంబ్లీ తీర్మానంతో సిబిఐకి అప్పగించామన్నారు. అంతేకాకుండా ఈ-ఫార్ములా కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ముందుకెళుతుందని ఆయన తెలిపారు. ఇక అరెస్టుల విషయంలో 2018 లో సవరించిన చట్టం ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్టు చేసే ముందు తప్పని సరిగా గవర్నర్ ఆమోదం తీసుకోవాలని తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లోగడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు సందర్భంలో ఈ నిబంధనను పాటించకుండా అరెస్టు చేయడం పట్ల కోర్టు తప్పు పట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, కేంద్ర హోం మంత్రి వద్ద (సిబిఐ) కాళేశ్వరం విచారణ, ఈ-ఫార్ములా కేసులో కెటిఆర్ అరెస్టుకు సంబంధించి గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. సాదర స్వాగతం.. మీట్-ది-ప్రెస్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయ్కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేష్ క్లబ్ ఇతర నాయకులు, జర్నలిస్టులు సాదర స్వాగతం పలికారు. ‘మన తెలంగాణ’ ఎడిటర్ దేవులపల్లి అమర్ను ఆయన అప్యాయంగా పలుకరించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కోసం ప్రతినిధులు ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు.
మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసినవారికి, తెలంగాణ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వారికి నవంబర్ 14న మంచి సౌండ్ వినిపిస్తుందని అన్నారు. కడుపు మండిన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్కు బుద్ది చెప్పబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ సర్వే చూసినా కచ్చితంగా బిఆర్ఎస్ గెలుస్తుందనే చెబుతున్నాయని పేర్కొన్నారు. 2023లో జూబ్లీహిల్స్లో 16 వేల ఓట్ల మెజార్టీతో గెలిచామని, ఈసారి అంత కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు మేలు చేయకపోగా, తీవ్ర నష్టం చేసిందని, అది ఈ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పారు. కడుపు మీద దెబ్బకొడితే కులం, మతం ప్రభావం ఏమీ ఉండదని అన్నారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన ప్రజల ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిందని, దాంతో సాధారణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిందని తెలిపారు. రెండేళ్ల తర్వాత ప్రజల్లో నైరాశ్యం, అసంతృప్తి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్రెడ్డి మాటలు నమ్మి చాలా రోజులు మోసపోయారు..మళ్లీ మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కెటిఆర్ ఆదివారం ‘మన తెలంగాణ’ ఇంటర్వూలో పలు అంశాలపై మాట్లాడారు.2023 సెప్టెంబర్లో కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిఎస్టి వసూళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా ఉంటే, 2025 సెప్టెంబర్లో జిఎస్టి వసూళ్లలో 28వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. --ప్రజల కొనుగోలు శక్తి, ఆదాయం తగ్గడంతో ప్రతికూల ఆర్థిక వృద్థి నమోదైందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, రెండేళ్లలో ఒక్కటీ అమలు చేయలేదని, దాంతో ప్రజల్లో నైరాశ్యం కనిపిస్తోందని అన్నారు. ముస్లింలకు రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ లేకుంటే.. ముస్లింలు లేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణం అని,ముస్లింలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది..? ముస్లింలు ఎప్పుడు నుంచి ఉన్నారు..? అని నిలదీశారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి 80 ఏండ్లు అండగా నిలిచారని, వాళ్లను అవమానించే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ఓటేస్తేనే ముస్లింలు మంచివాళ్లు, మిగతా వాళ్లకు ఓటేస్తే మంచివాళ్లు కాదా..? అని అడిగారు. కడుపు మండినప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా ఏమీ ఉండదని ఈ ఎన్నిక నిరూపింస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్రెడ్డి అన్ని వర్గాలను దెబ్బకొట్టారని, ఈ ఎన్నికతో అందరి కళ్లు తెరుచుకుంటాయని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నిక రాష్ట్రంలో రెండే టీమ్లు ఉన్నాయని ఒకటి ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టిన టీమ్ అయితే రెండోది ఆరు గ్యారంటీల అమలుపై గల్లా పట్టి అడిగే టీమ్ అని పేర్కొన్నారు. రెండేళ్లు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో సిఎం ఉన్నారు రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేకనే ఇతర విషయాలు మాట్లాడుతున్నారని కెటిఆర్ ఆరోపించారు. 16 నెలల కింద కంటోన్మెంట్లో వేల ఇండ్లు ఇస్తామని చెప్పి, ఆరు ఇండ్లు మంజూరు చేయలేదని, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచినా అభివృద్ధి ఏమీ జరగదని చెప్పారు.బిఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ.5,322 కోట్లతో చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా తాను చెప్పానని, దానిపై సిఎం అయినా, ఒక్క మంత్రి అయినా సమాధానం చెప్పారా..? అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో చేసిందేమీ లేక గత కాంగ్రెస్ పాలనలో చేసింది చూసి ఓటు వేయాలని అడిగారని పేర్కొనారు. 2004 -2014 కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూడాలని సిఎం అంటున్నారని, కానీ 1952 నుంచి కాంగ్రెస్ పార్టీనే పాలించి కదా..అప్పటి నుంచి జరిగిన అభివృద్ధి చూడాలని అన్నారు. తమకు 50 ఏళ్లు అవకాశం ఇస్తే అప్పుడు బిఆర్ఎస్ 50 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనను పోల్చుదామని చెప్పారు. రెండేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారో కూడా చెప్పుకోలేని అశక్తతో సిఎం ఉన్నారని విమర్శించారు. చేసిందేమీ లేకనే డైవర్ట్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేదని సిఎం అంటున్నారని, హైదరాబాద్ నగరానికి తాము ఏం చేయకపోతే రెండుసార్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు. పేమెంట్ ఒక్కటే రేవంత్రెడ్డికి తెలిసిన విద్య రేవంత్రెడ్డి ఢిల్లీకి డబ్బులు పంపుతూ పేమెంట్ కోటా ముఖ్యమంత్రి అయ్యారని కెటిఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. నెలనెలా డబ్బులు కడితే కానీ సిఎం సీటు నిలువదు అని పేర్కొన్నారు. రేవంత్రెడ్డికి పేమెంట్ ఒక్కటే తెలిసిన విద్య అని, అందుకే తమను అనుకూలంగా వచ్చిన సర్వేలను కూడా పేమెంట్ సర్వేలని అంటున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ గెలుస్తుందిన సర్వేలలో కనబడగానే సినీ కార్మికుల వరాలు, కుల సంఘాలకు వరాలు కురిపించారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లను ఎన్టిఆర్, పిజెఆర్ గుర్తుకువచ్చారని చెప్పారు. 8 రోజులు సిఎం, మంత్రులు ముమ్మర ప్రచారం చేస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిస్తే ఆరు గ్యారంటీలు అమలవుతాయని చెప్పారు. ఈ ఎన్నిక ప్రజల జీవితాలతో ముడిపడిన అంశం అని, ఆలోచించి ఓటేయాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రూ.250 కోట్లు డబ్బులు పంపించిందని, అయినే ప్రజలు బిఆర్ఎస్కే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ కంటే తెలివైన వారు అని, కడుపు మీద కొట్టిన కాంగ్రెస్కు ప్రజలు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్, ఐటి బాగుంటే ఎంతోమందికి ఉపాధి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, ఐటి రంగం పడిపోవడంతో ఎంతోమంది ఉపాధి కోల్పోయారని కెటిఆర్ తెలిపారు. ఈ రెండు రంగాలు దెబ్బతినడం వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయారని, ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా పేరు మీద రేవంత్రెడ్డి చేసిన అరాచకం వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని అన్నారు. హైడ్రా శనివారం, ఆదివారం ఇండ్లు కూలగొడుతూ స్వైర విహారం చేస్తుంటే..సామాన్యులను చిదిమేస్తుంటే రియల్ ఎస్టేట్ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్వయంగా 20 ప్రాజెక్టుల పేర్లు చెప్పారని, అందులో హైడ్రా ఒక్కటైనా కూలగొట్టిందా..? అని అడిగారు. అందులో ఒక్క ప్రాజెక్ట్కైనా నోటీసులు ఇచ్చారా..? అని నిలదీశారు. హైడ్రా పెద్దలకు చుట్టం ఎట్లయితది..పేదలకు శాపం ఎట్టయిదని చెప్పాలని అడిగారు. ఐటి రంగం, రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలమందికి ఉపాధి లభిస్తుందని, చిరు వ్యాపారులు బాగుంటారని తెలిపారు. ఈ ఎన్నికలో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాం జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో తాము వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టామని కెటిఆర్ తెలిపారు. దేశ చరిత్రలో మొదటిసారి స్క్రీన్లపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చూపిస్తూ వివరించామని, ఈ రకమైన ప్రచారానికి ప్రజలను మంచి స్పందన వస్తుందని అన్నారు. తాము విడుదల చేసిన బాకీ కార్డు సూపర్ హిట్ అయిందని, ప్రజలు తమ బాకీ కార్డులు తమ ఇళ్లలో పెట్టుకుని హామీలను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. నిరుద్యోగులతో సహా మిగతా వర్గాలు కూడా బాకీ కార్డులు విడుదల చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అంబాసిడర్ కారు ఫొటో ఎందుకు పెట్టారో తెలియదు చంద్రబాబు నాయుడు తన పాత అంబాసిడర్ కారు చూపిస్తూ చేసిన ట్వీట్ను తాను చూడలేదని కెటిఆర్ చెప్పారు. ఆయన ఎందుకు కారు చూపించారో, ఆ ఫొటో ఉద్దేశం ఏంటో తనకు తెలియదని అన్నారు. ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల ఆ ఫొటోపై దృష్టి సారించలేదని చెప్పారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఎవరికీ మద్దతు ప్రకటించలేదని చెప్పారు. మాగంటి గోపీనాథ్కు, ఎన్టిఆర్తో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని టిడిపి అభిమానులు ఆయన కుటుంబానికి ఓటేస్తారని తాము భావిస్తున్నామని తెలిపారు. గోపీనాథ్ ఎన్టిఆర్కు వీరాభిమాని అని, కాబట్టి గోపినాథ్ కుటుంబానికి ఎన్టిఆర్ అభిమానులు అండగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పోలింగ్ రోజు ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, లేదంటే వారి ఎవరైనా దొంగ ఓట్లు వేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పోలింగ్ రోజున మొదటి గంటలోనే ఓటర్లు తమ ఓటు వేయాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.
హోరెత్తిన ప్రచారపర్వానికి తెర ఓటరు తుది తీర్పుకు సమయం ఆసన్నం రేపు ఉ.7 నుంచి సా.6 వరకు పోలింగ్ 58 మంది అభ్యర్థులు.. 407 పోలింగ్ కేంద్రాలు మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వేడెక్కించిన ప్రచారపర్వం పరిసమాప్తమైంది. ఇప్పటివరకు మోగిన మైకులు మూగపోయాయి. పార్టీలు, నేతల వాగ్భాణాలు, విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిన ప్రచారపర్వానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తెర పడింది. ఇక అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. పార్టీలు, నేతలు చేసిన విన్యాసాలకు ముగింపు పలుకుతూ ఓటర్లు తమ తీర్పు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందరి దృష్టి ఆకర్షిస్తోన్న ఉపఎన్నిక పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు చేసింది. నవంబర్ 11(మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 407 కేంద్రాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. మొత్తం 4,01365 మంది ఓటర్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నోటా కలిపి ఒక్కో ఇవిఎంలో 59 గుర్తులు ఉంటాయి.ఈ ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్, డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. యాప్ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 4,01365 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2 లక్షల 85 వేల 61 మంది పురుషులు, లక్ష 92 వేల 779 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 25 మంది, సర్వీసు ఓటర్లు 18, ఎన్ఆర్ఐ ఓటర్లు 123, వికలాంగులు 1,908 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు 6,859 మంది ఉండగా 80 ఏళ్లు పైబడిన వారు 6,053 మంది 85 ఏళ్లు పైబడిన వారు 2,134 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే వృద్ధులకు సంబంధించిన హోమ్ ఓటింగ్లో దరఖాస్తు చేసుకున్న 103 మంది తమ హక్కు వినియోగించుకున్నారు. ఇంతమంది పోటీ చేయడం ఇదే తొలిసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లో 58 మంది పోటీ చేయడం ఇదే తొలిసారి. 2023లో జరిగిన ఎన్నికల్లో 19మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది. ఓటింగ్ శాతం పెంపునకు కృషి గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 3 లక్షల 85 వేల 265 మంది ఓటర్లు ఉండగా, ఉపఎన్నికకు సంబంధించి ఓటరు తుది జాబితా ప్రకారం ఈసారి 2,383 ఓట్లు పెరిగాయి. పెరిగిన ఓట్లలో యువత, మహిళా ఓట్లే అధికంగా ఉండటంతో ఓటింగ్ శాతం పెంపుకోసం ఎన్నికల సంఘం మొదటి నుంచే ప్రచారం చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 47.58 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా ఈసారి 50 శాతం దాటే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్కు చెందిన వైద్యుడు మొహియుద్దీన్ సహా ముగ్గురు అరెస్టు గుజరాత్ ఎటిఎస్ ఆపరేషన్ విజయవంతం మారణాయుధాలు, విషపూరిత రసాయనాలు స్వాధీనం పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ మీదుగా సరఫరా ప్రాణాంతక విషం తయారీలో డాక్టర్ కీలక పాత్ర? అహ్మదాబాద్: భారీ ఉగ్రవాద దాడికి కుట్ర పన్నిన ముగ్గురిని గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) అరెస్టు చేసింది. ఈ ముగ్గురిలో ఒక వ్యక్తి తెలంగాణ రాజధాని హైదరాబాద్కు చెందిన డాక్టర్ మొహియుద్దీన్ స య్యద్, ఉత్తర ప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. వీరిని అజాద్ సులేమాన్ షేక్, మెహమ్మద్ సుహైల్గా గుర్తించారు. ఈ ముగ్గురు భారీ స్థాయిలోనే టెర్రర్ దాడులతో సంచలనాలకు కుట్ర పన్నినట్లు సకాలంలో గుర్తించారు. గుజరాత్ ఎటిఎస్..సాగించిన ఆపరేషన్లో ఈ నెల 7వ తేదీన పట్టుబడ్డ వీరి నుంచి మారణాయుధాలు, కెమికల్స్ స్వాధీనపర్చుకున్నారు. ఈ వ్యక్తులు గుజరాత్కు ఆయుధాలు ఇచ్చిపుచ్చుకునేందుకు వచ్చారు. వీరి వద్ద నుంచి అత్యంత ప్రమాదకరం ప్రాణాంతకమైన రిసిన్ విషం, కొన్ని రసాయనికాలను కూడా పట్టుకున్నామని గుజరాత్ ఎటిఎస్ డిఐజి సునీల్ జోషి ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ ముగ్గురు అరెస్టుతో గుజరాత్లోనే కాకుండా తెలంగాణలోనూ ప్రకంపనలు చెలరేగాయి. పాకిస్థాన్ సరిహద్దుల నుంచి తమకు డ్రోన్ల ద్వారా మారణాయుధాలు అందుతాయని వీరు తెలియచేసినట్లు డిఐజి చెప్పారు. తమకు అందిన కీలక సమాచారం ఆధారంగా వీరిని పట్టకున్నామని వీరి వద్ద రెండు గ్లాక్ పిస్టల్స్, బెరెటా పిస్టల్, 30 వరకూ తూటాలు, పలు రకాల రసాయనాలను , ఆయుదాన్ని స్వాధీనపర్చుకున్నారు. గాంధీనగర్లోని అదాలజ్ వద్ద వీరిని వలేసి పట్టుకున్నట్లు ఆయన వివరించారు. కీలక విషయాలు తెలిపిన హైదరాబాదీ ఉగ్రదాడులకు తాము ప్లాన్ చేసుకున్నామని హైదరాబాద్ డాక్టర్ ఇంటరాగేషన్ దశలో పోలీసులకు తెలిపారు. గాంధీనగర్ జిల్లాలో నిర్మానుష్య కలోల్ ప్రాంతం నుంచి తమకు ఆయుధాలు అందాయని హైదరాబాద్ డాక్టర్ చెప్పారు. రసాయనిక విషపూరిత పదార్థాలతో ఉగ్రదాడులకు వ్యూహం పన్నినట్లు ఈ సయీద్ తెలిపారు. ఇక ఆయన వెనుక నడిపిస్తున్న వ్యక్తి అఫ్ఘనిస్థాన్కు చెందిన అబూ ఖదాజా. ఇతను అక్కడి ఐఎస్కెపి సంస్థతో సంబంధాలున్న వ్యక్తి. ఉగ్రవాద వినూత్న చర్యలకు తాను ప్లాన్ చేశానని హైదరాబాదీ అంగీకరించాడు. ఇందుకు తాను చైనాకు వెళ్లి ఎంబిబిఎస్ డిగ్రీ చేసి వచ్చానని చెప్పారు. అత్యంత ప్రమాదకర విషం తయారీకి ఏర్పాట్లు జరిగాయని వివరించాడు. బాగా చదువుకున్న సయీద్ మత తీవ్రవాది అయ్యాడని , బారీగా నిధులు సేకరించుకోవడం, కుట్రల అమలుకు వ్యక్తులను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడని ఎటిఎస్ డిజిపి తెలిపారు. ఈ డాక్టర్ సెల్ఫోన్ ద్వారా సేకరించిన సమాచారంతో ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరిని ఇక్కడనే పట్టుకున్నారు. వీరు ఆయుధాలు సరఫరాలో దిట్ట అని తేలింది. పాకిస్థాన్లో సూత్రధారులు ఈ ముగ్గురు వ్యక్తులు పలువురు ఇతరుల ద్వారా రాజస్థాన్ ఇతర ప్రాంతా ల నుంచి ఆయుదాలు తెప్పించుకున్నారు. ఈ గ్యాంగ్ దాడులు జరిపేందుకు లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి పలు అత్యంత సునిశిత ప్రాంతాలలో పర్యటించి రెకీ నిర్వహించి వచ్చారు. పూర్తి స్థాయిలో వరుస దాడులకు దిగేందుకు సిద్ధం అవుతున్న దశలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు డిఐజి తెలిపారు. యుపికి చెందిన ఇద్దరికి రాజస్థాన్లోని హనుమాన్గధ్ నుంచి ఆయుధాలు దక్కాయి. వీటిని వీరు హైదరాబాదీ డాక్టర్కు అందించారు. తమకు పాకిస్థాన్ సరిహద్దుల ఆవలి నుంచి తమ అజ్ఞాత శక్తుల నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు చేరుతాయని ఈ ఇద్దరూ తెలియచేశారు. ఈ ముగ్గురిని చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (యుఎపిఎ) , భారతీయ న్యాయ సంహిత , ఆయుధాల చట్టం పరిధిలో అరెస్టు చేశారు. వీరిలో సయీద్ను ఈ నెల 17 వరకూ ఎటిఎస్ కస్టడీకి తరలించారు. మిగిలిన ఇద్దరిని ఆదివారం కోర్టు ముందు హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది.
రోబో.. నిజంగా అలా చేస్తుందా..?
రోబో.. నిజంగా అలా చేస్తుందా..? టెక్నాలజీ రంగంలో చైనా దూసుకుపోతుంది. ఈ రంగంలో
సైబర్ సెక్యూరిటి భారీ ఆపరేషన్.. 81మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు టిజిసిఎస్బి(తెలంగాణ సైబర్ సెక్యూరిటి బ్యూరో) దృష్టి సారించింది. ఇందులో భాగంగా సుమారు 25 రోజుల పాటు నిర్వహించిన భారీ ప్రత్యేక ఆపరేషన్లో 81 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖా గోయెల్ శిఖా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరాల్లో గోలుసుకట్టు విధానంలో పాల్గొంటున్న బృందాన్ని విచ్చిన్నం చేసేందుకు టిజిసిఎస్బి గత నెలలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రధేశ్ రాష్ట్రాల సమన్వయంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 754 క్రైం లింకులు ఉన్నాయని, అందులో 128 రాష్ట్రంలో ఉండగా, సుమారు రూ. 95 కోట్ల మోసపూర్తి లావాదేవీలు జరిగినట్లు అంచనా వేశామన్నారు. ఈ ఆపరేషన్కు సంబంధించి టిజిసిఎస్బికి చెందిన ఏడు సైబర్క్రైం పోలీస్ స్టేషన్లలో నమోదయిన 41 కేసులకు అనుబంధంగా ఉన్నట్లు ఆమె వివరించారు. బ్యాంక్ ఖాతాలు, మొబైల్ నెంబర్లు, సిమ్ కార్డులు, ఆర్ధిక మార్గాలను అందించే వ్యక్తులు విదేశాల నుండి నడిచే ఫ్రాడ్ కాల్ సెంటర్ నెట్వర్క్లకు అవసరమయిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పనిచేసే వారిని లక్షంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రాల వారీగా అరెస్టయిన వారు ఈ ప్రత్యేక ఆపరేషన్లో టిజిసిఎస్బి 74 మంది పురుషులు, ఏడుగురు మహిళలను అరెస్ట్ చేసింది. వీరిలో కేరళ 21 మంది పురుషులు ఏడుగురు మహిళలు, 23 మంది మహారాష్ట్ర, పది మంది ఆంధ్రప్రధేశ్, ఏడుగురు తమిళనాడు, 13మంది కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి అరెస్ట్ చేసిన వారిలో ఉన్నట్లు తెలిపారు. వీరిలో 17 మంది ఏజెంట్లు, 11మంది నేరుగా నగదు ఉపసంహరణలో పాల్గొన్నవారు, 53 మంది మ్యూల్ ఖాతాదారులు (5 శాతం కమిషన్కు ఖాతాను ఇచ్చిన వారు) ఉన్నారన్నారు. దీంతో పాటు 84 సెల్ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంకు పాస్బుక్స్, చెక్కుబుక్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో వివిధ వృత్తులకు చెందిన వారు ఉన్నారని శిఖా గోయొల్ వెల్లడించారు. ఫెడరల్ బ్యాంకు ఉద్యోగి, ఐడిఎఫ్సి బ్యాంక్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్(106 కేసుల లింక్), బంధన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, కంప్యూటర్ ఆపరేషన్స్ డిప్లామా హోల్డర్(96 కేసులు), చెన్నై కిల్పోక్ ఆడిట్ కార్యాలయంలో అకౌంటెంట్ (31కేసులు), బిబి గ్రాడ్యూయేట్(45కేసులు), ఒక ఎంఎన్సి ఉద్యోగి(తన కార్పొరేట్ ఖాతాను మోసపూరిత లావాదేవీలకు ఉపయోగించిన వ్యక్తి) ఉన్నట్లు ఆమె వివరించారు. ఆపరేషన్ ప్రాథమిక దర్యాప్తులో కొంత మంది విదేశాలలో ఉన్న నెట్వర్క్లతో సంబంధమున్నట్లు తెలిసిందని, సంబంధిత వ్యక్తులపై లుక్ అవుట్ ఉత్తర్వుల ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి సైబర్ మోసాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖా గోయొల్ తెలిపారు. ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్ట్, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు పంచుకోవడం, అపరిచిత ఖాతాలకు డబ్బులు పంపడం లాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరం జరిగితే వెంటను 1930 కి కాల్ చేయాలని సూచించారు.
ఆ అవకాశం ఇస్తే.. 100 కోట్లతో అభివృద్ది..
ఆ అవకాశం ఇస్తే.. 100 కోట్లతో అభివృద్ది.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ది
హైదరాబాద్ను బిఆర్ఎస్ గాలికొదిలేసింది
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను గెలిపిస్తే వేలాది కోట్లతో అభివృద్ధి పనులు ఢిల్లీలోని నా నివాసంలో ఐటి సోదాలపై హరీశ్రావు బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క జూబ్లీహిల్స్లో మంత్రులతో కలిసి ప్రచారం మన తెలంగాణ/హైదరాబాద్ : పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సుమారు 100 కోట్లతో కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోనే అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన యూసుఫ్ గూడాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవీన్ యాదవ్ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను నమ్మి ఆచరించే వ్యక్తి అని తెలిపారు. నవీన్ యాదవ్ ను గెలిపించుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మంత్రులందరినీ సమన్వయం చేసుకుని వేలకోట్ల నిధులతో మురికి వాడలతో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న తపన, సత్తా, సంకల్పం ఉన్న యువ నాయకుడు నవీన్ యాదవ్ అని తెలిపారు. అటువంటి యువకుడిని గెలిపించుకోవడం ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతి, రేషన్ కార్డులు వంటి పనులు వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నందున నవీన్ యాదవ్ ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని డిప్యూటీ సీఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదు అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడు ఎకరాలు వంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడతామని భ్రమలు కల్పించిన బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్లు పరిపాలించి ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. అధికారం కోల్పోయి ఇప్పుడు మతిభ్రమించి అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. పేద మధ్యతరగతి వర్గాలకు మేలు జరగకుండా బిఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు సీనియర్ నాయకుడు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారని, ఆర్థిక శాఖ కూడా నిర్వహించినా ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఢిల్లీలో తనకు ఇల్లు ఉందో, లేదో అందరికీ తెలుసని, ఐటీ రైడ్స్ అధికారికంగా జరుగుతాయని, అందరికీ తెలిసే జరుగుతాయన్న విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో పెద్ద సంఖ్యలో ఉన్న పేద బిడ్డలు ఇంటర్నేషనల్ స్టాండరడ్స్ తో ఉచితంగా చదువుకునేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడి వారి కాళ్లపై వాళ్లు నిలదొక్కుకునేలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం తిరిగి ప్రారంభించిందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని 15 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని వివరించారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని, రాష్ట్రంలో మొదటి దశలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి శరవేగంగా నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్షలను నిర్వహించలేకపోయిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లోపే విజయవంతంగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఎన్ని అడ్డంకులు కల్పించినా నియామక పత్రాలు కూడా అందచేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. రెండేళ్ల కాలంలోనే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు కూడా అందించామని చెప్పారు. 70 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ప్రైవేట్ రంగంలో లక్షలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించిందని భట్టి విక్రమార్క తెలిపారు.
ఆర్ఎస్ఎస్లో ప్రవేశం హిందువులకే..
నాగ్పూర్: ఆర్ఎస్ఎస్ సార్వత్రిక సంస్థ. ఇందులోకి తీసుకునేది బ్రాహ్మణులు, ముస్లింలు, క్రిస్టియన్లను ఇతర వర్గాలను కాదని, హిందువులనే అని ప్రధాన సంచాలక్ మోహన్ భగవత్ తెలిపారు. హిందువు అంటే మతం కిందికి రాదు. భారతదేశంలో నివసించే వారంతా హిందువులే అవుతారని భగవత్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానం ముందున్న ఆవిష్కరణల ప్రసంగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్లోకి రావాలనుకునే వారు ముందు తమ తమ వేర్పాటువాద గుర్తింపులను వదులుకుని రావల్సిందే. కేవలం హిందువుగానే ఇందులో చేరాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భారత మాత ముద్దుబిడ్డలమనే ఏకైక ప్రకటనతో వచ్చేవారే ఆర్ఎస్ఎస్ అంతర్భాగం అవుతారని తేల్చిచెప్పారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రమాదకరం: రాజ్నాథ్ సింగ్
ఔరంగాబాద్/ససారాం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రమాదకరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓ సభలో బహిరంగంగా చెప్పిన మాటలు అంతా వినే ఉంటారు. కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అని రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ కాంగ్రెస్ సిఎం వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మతం ప్రాతిపదికన విభజిస్తోందనే విషయం స్పష్టం అయిందని రాజ్నాథ్ సింగ్ స్పందించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచార సభల్లో భాగంగా ఆదివారం రాజ్నాథ్ సింగ్ ఔరంగాబాద్, ససారాంలలో ఆదివారం మాట్లాడా రు. ప్రచారం చివరి రోజు ఆయన సుడిగాలి పర్యటనలు సాగాయి. ఓ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ విధంగా మా ట్లాడటం తగునా అని నిలదీశారు. హైదరాబాద్ జూబ్లీహి ల్స్ ఉప ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ అంటే ముస్లింలు అట, ముస్లింలు అంటే కాంగ్రెస్ అట. ఈ ప్రకటన అర్థం ఏమిటనేది రేవంత్ చెపుతారా? ఈపాటికి దేశ ప్రజలకు అర్థం అయి ఉంటుంది. బిజెపి సారధ్యపు ఎన్డిఎ ఎప్పుడూ విభజన రేఖలతో న్రజలకు నష్టం కల్గించే రకం కాదు. అయితే మతం పేరిట దేశంలో వివిధ వర్గాల మధ్య వైషమ్యాల చిచ్చు వైఖరి కాంగ్రెస్దే అనే విషయం రేవంత్ మాటలతో స్పష్టం అయిందని రాజ్నాథ్ విమర్శించారు. బీహార్లో కాంగ్రెస్ , ఆర్జేడీలు జట్టుకట్టాయి. ఓట్ల కోసం తమ రాజకీయ లబ్థికి అనేక విధాలుగా ఎన్డిఎను బద్నాం చేసేందు కు యత్నిస్తున్నారని ఆరోపించారు.ఇక్కడ జంగిల్రాజ్ను సుదీర్ఘకాలం సాగించిన ఆర్జేడీ ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు అనేక మార్గాలు ఎంచుకొంటోంది. మతాలు కులాలు వర్గాల పేరిట రాజకీయ లబ్ధికి పావులు కదుపుతున్న విషయాన్ని బీహారీలు గుర్తించాలని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఆలూ లాలూ సమోసాల రోజులు పొయాయి మాజీ సిఎం విశ్రాంత లాలూ ప్రసాద్యాదవ్ ఇప్పటికీ త న అధికారం సాగేందుకు కలలు కంటున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ విమర్శించారు. పాపం ఆయన చెప్పే ఆ లూ లాలూ సమోసా రోజులు పొయ్యాయి. సమోసాలకు కేవలం ఆలూ ఒక్కటే సరిపోదు, సరైన బలవర్థక పుసరుకులతోనే అవసరం అయిన సమోసాలు ముందుకు వస్తాయ ని బీహార్కు లాలూ, సమోసాలకు లాలూ అనే మాట చెల్లనేరదని ఆర్జేడీ నేత గుర్తుంచుకుంటే మంచిదని రాజ్నాథ్ వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మలి తుది దశ పోలింగ్ మంగళవారం జరుగుతుంది. ఆదివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది.
భారీ వర్షాల నుండి తేరుకుంటుండగానే….
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇప్పుడిప్పుడే భారీ వర్షాల బీభత్సం నుంచి తేరుకుంటున్న ప్రజలను ఇప్పుడు
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) కోసం నవంబర్ 27న మెగా వేలం పాట నిర్వహించేందకుకు బిసిసిఐ అన్ని చర్యలు తీసుకుంది. దేశ రాజధానిఢిల్లీలో ఈ వేలం పాట జరుగనుంది. ఇప్పటికే డబ్లూపిఎల్లోని ఐదు ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను బిసిసిఐకి సమర్పించాయి. ఢిల్లీ క్యాపిటల్స్లో 13, గుజరాత్ జెయింట్స్లో 16, యూపి వారియర్స్లో 17, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 14, ముంబై ఇండియన్స్లో 13 ఖాళీలు ఉన్నాయి. ఇక యూపి ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.14.5 కోట్లు ఉన్నాయి. కాగా, ఈసారి టీమిండియా మహిళల వన్డే వరల్డ్కప్ సాధించడంతో భారత క్రికెటర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. వేలం పాటలో పాల్గొనే క్రికెటర్లకు మంచి ధర లభించే అవకాశాలున్నాయి. అంతేగాక సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లకు కూడా మెగా వేలం పాటలో కళ్లు చెదిరే ధర లభించినా ఆశ్చర్యం లేదు.
సోమవారం రాశి ఫలాలు (10-11-2025)
మేషం : ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతానం పొటీపరీక్షలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృషభం : వృత్తి, వ్యాపారాలలో కొంత మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానిస్తాయి. మిధునం : విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి కొత్త విషయాలను తెలుసుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగులల్లో చిక్కులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. కర్కాటకం : ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగువుతాయి. సింహం : వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు ధన సహాయం అందుతుంది. కన్య : ఉద్యోగులకు అదననపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వాహన ప్రయాణ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. తుల : వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతన వివాహయత్నాలు అనుకులిస్తాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక బుణాలు తీరి ఊరట చెందుతారు. వృశ్చికం : వ్యాపారాల విస్తరణకు స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దైవ చింతన పెరుగుతుంది. భూ క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ధనస్సు : వృత్తి, వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సంతాన విద్య ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు నుండి ఉపశనం పొందుతారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. మకరం : వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. కుంభం : వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున చిన్న పాటి వివాదాలుంటాయి. నూతన కార్యమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్థి వివాదాలు పరిష్కారమవుతాయి. మీనం : క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకొంటారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు.
ଏସ୍ଆଇଆର୍ (ସ୍ବତନ୍ତ୍ର ଭୋଟର ତାଲିକା ସଂଶୋଧନ)କୁ ବିରୋଧ କରି ପଶ୍ଚିମବଙ୍ଗ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମମତା ବାନାର୍ଜୀ ରାସ୍ତାକୁ ଓହ୍ଲାଇଛନ୍ତି। ମମତାଙ୍କ ଦଳ ତୃଣମୂଳ କଂଗ୍ରେସ ଏସ୍ଆଇଆରକୁ ବିଜେପି ନେତୃତ୍ବାଧୀନ କେନ୍ଦ୍ର ସରକାର ଏବଂ ନିର୍ବାଚନ କମିସନ ଦ୍ବାରା ଏକ ନିରବ ଅଦୃଶ୍ୟ ରିଗିଂ ବୋଲି କହିଛି। ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ ଏସ୍ଆଇଆର୍କୁ ବିରୋଧ କରି ମମତା ରେଡ୍ ରୋଡ୍ର ଆମ୍ବେଦକର ପ୍ରତିମୂର୍ତ୍ତି ନିକଟରୁ ପ୍ରାୟ ୩.୮ କିମି ପଦଯାତ୍ରା କରିଛନ୍ତି । ଏହି ଯାତ୍ରା ରବିନ୍ଦ୍ରନାଥ ଟାଗୋରଙ୍କ ପୈତୃକ ଗୃହ ଯୋଡ଼ାସାଙ୍କୋ ଠାକୁର ବାଡ଼ି ନିକଟରେ ଶେଷ ହୋଇଛି । ବିଜେପି ଉପରେ ତୀବ୍ର ଆକ୍ରମଣ କରି ମମତା କହିଛନ୍ତି, ‘ଅନେକ ଅସଂଗଠିତ କ୍ଷେତ୍ରର କର୍ମଚାରୀ ସେମାନଙ୍କ ନାମ ତାଲିକାରୁ ବାଦ୍ ପଡ଼ିଯିବ ବୋଲି ଆଶଙ୍କା କରି ଭୟଭୀତ ହୋଇପଡ଼ିଛନ୍ତି। ଯିଏ ବଙ୍ଗଳାରେ କଥା ହେଉଛି ସେମାନଙ୍କୁ ବାଂଲାଦେଶୀ ବୋଲି ଚିହ୍ନିତ କରାଯାଉଛି ବୋଲି ମମତା ଅଭିଯୋଗ କରିଛନ୍ତି । ବିଜେପି ନେତାମାନେ ସ୍ବାଧୀନତାର ମହତ୍ବ ଜାଣିନାହାନ୍ତି ବୋଲି ଦର୍ଶାଇ ସେ କହିଛନ୍ତି, ସେମାନେ ଜାଣନ୍ତି ନାହିଁ ଯେ ସ୍ୱାଧୀନତା ପୂର୍ବରୁ ଭାରତ, ବାଂଲାଦେଶ ଏବଂ ପାକିସ୍ତାନ ଗୋଟିଏ ଭୂମିର ଅଂଶ ଥିଲା। ବିଜେପି ଏହି ବାସ୍ତବତାକୁ ବୁଝିବାକୁ ଚାହୁନାହିଁ ଏବେ ପଶ୍ଚିମବଙ୍ଗରେ ସେମାନେ କ୍ଷମତାକୁ ଆସିପାରିବେ ନାହିଁ । ଅନ୍ୟପକ୍ଷରେ ପଶ୍ଚିମବଙ୍ଗ ବିରୋଧୀ ଦଳ ନେତା ଶୁଭେନ୍ଦୁ ଅଧିକାରୀ ମମତାଙ୍କ ପଦଯାତ୍ରାକୁ ଏକ ସମ୍ବିଧାନ ବିରୋଧୀ କାର୍ଯ୍ୟକ୍ରମ ବୋଲି କହିଛନ୍ତି। ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ପଶ୍ଚିମବଙ୍ଗ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀଙ୍କ ସମେତ ବହୁ ମାନ୍ୟଗଣ୍ୟ ବ୍ୟକ୍ତି ମଞ୍ଚ ଉପରେ ଉପସ୍ଥିତ ଥିବାର ଦେଖାଯାଉଛି । କିଛି ସମୟ ପରେ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମଞ୍ଚରୁ ତଳକୁ ଓଲ୍ହାଇ ଆସୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଭିଡିଓରେ ଜାତୀୟ ସଙ୍ଗୀତ ଗାନ ହେଉଥିବାର ମଧ୍ୟ ଶୁଣିବାକୁ ମିଳିଛି । ଜାତୀୟ ସଙ୍ଗୀତ ଗାନ ସମୟରେ ସମସ୍ତ ଠିଆ ହୋଇଥିବା ବେଳେ ଅଧାରୁ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମଞ୍ଚଛାଡି ଆସୁଥିବାର ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଜାତୀୟ ସଙ୍ଗୀତକୁ ଅଵମାନ କଲେ ପଶ୍ଚିମବଙ୍ଗର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ବୋଲି ଲେଖିଛନ୍ତି ୟୁଜର୍ସ । ସେହିପରି ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀଙ୍କ ସମେତ ତାଙ୍କ ଦଳକୁମଧ୍ୟ ତୀବ୍ର ସମାଲୋଚନା କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । View this post on Instagram A post shared by moti bharti (@motibharti7) ଯାହାର ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଭିଡିଓ ଟିକୁ ଏଡିଟ କରି ଭାଇରାଲ କରାଯାଇଛି । ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରିବାରୁ ଏଭଳିକୌଣସି ଘଟଣା ଘଟିଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି କୌଣସି ଘଟଣା ନିକଟରେ ଘଟିଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ କରିଥାନ୍ତେ । ଭାଇରାଲ୍ ଭିଡିଓଟିକୁ ଭଲ ଭାବରେ ଦେଖିଲେ ମଞ୍ଚ ପଛରେ ଥିବା ଡିଜିଟାଲ୍ ସ୍କ୍ରିନରେ ବଙ୍ଗଳାରେ କିଛି ଲେଖା ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଯାହାକୁ ଓଡ଼ିଆରେ ଅନୁବାଦ କରିବାରୁ ପଢ଼ାଯାଏ ଯେ, ମାନ୍ୟବର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମମତା ବାନାର୍ଜୀ ନେତାଜୀ ଇଣ୍ଡୋର ଷ୍ଟାଡିୟମରୁ ନୂତନ ଆବେଦନକାରୀଙ୍କ ପାଇଁ ବିଧବା ଭତ୍ତା ସମ୍ପର୍କରେ ସୂଚନା ଘୋଷଣା କରିବେ । ତାରିଖ: ୨୩ ମାର୍ଚ୍ଚ, ୨୦୨୨, ସମୟ: ୨ଟା । ଏଥିରୁ ଜଣାଯାଏ ଯେ ଭାଇରାଲ ଭିଡିଓଟି ୨୦୨୨ ମସିହାର ଅଟେ । ସେହିପରି ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ଲାଇଭ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଉକ୍ତ କିୱାର୍ଡ ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ୟୁଟ୍ୟୁବ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୨୩ ମାର୍ଚ୍ଚ ୨୦୨୨ରେ ଏକ ଲାଇଭ ଭିଡିଓ ଅପଲୋଡ଼ କରିଛି ଇଟିଭି ଭାରତ ୱେଷ୍ଟ ବେଙ୍ଗଲ । ଯେଉଁଥିରେ ଉଲ୍ଲେଖ ରହିଛି ମମତା ବାନାର୍ଜୀଙ୍କ ଦ୍ଵାରା ବିଧବା ଭତ୍ତା କାର୍ଯ୍ୟକ୍ରମ ନେତାଜୀ ଇଣ୍ଡୋର ଷ୍ଟାଡିୟମରେ । ଉକ୍ତ ଲାଇଭ ଭିଡିଓର ୧୨ ମିନିଟ ସମୟରେ ଜାତୀୟ ସଙ୍ଗୀତ କୁ ପୋଲିସ ବ୍ୟାଣ୍ଡ ଦ୍ୱାରା ଗାନ କରାଯିବାର ସୂଚନା ପ୍ରଦାନ କରାଯାଇଛି । ମଧ୍ୟରେ ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶ ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ହେଲେ କିଛି ସମୟପରେ ଏଥିରେ ଅଡିଓ କିଛି ଶୁଭି ନଥିଲା । କିନ୍ତୁ ପଶ୍ଚିମବଙ୍ଗ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଷ୍ଟେଜ ଛାଡି ଯାଇନଥିଲେ । ସେଠାରେ ସେହିପରି ଠିଆହୋଇ ରହିଥିଲେ । ସେହିପରି ଉକ୍ତ କିୱାର୍ଡ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏହାର ଏକ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭିଡିଓ ଏକ ଫେସବୁକ ପେଜରେ ଅପଲୋଡ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଭିଡିଓର ୨୯ମିନିଟ ସମୟରେ ସମାନ ଘୋଷଣା ହେଉଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ପରେପରେ ପୋଲିସ ବ୍ୟାଣ୍ଡ ଦ୍ୱାରା ଜାତୀୟ ସଙ୍ଗୀତ ଗାନ କରାଯାଇଥିଲା । ଏହା ସରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀଙ୍କ ସମେତ ଅନ୍ୟ ସମସ୍ତେ ଠିଆହୋଇ ରହିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଏଥିରୁ ଜଣାଯାଏ ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ପ୍ରକୃତ ଭିଡିଓରେ ଜାତୀୟ ସଙ୍ଗୀତ ପୋଲିସ ବ୍ୟାଣ୍ଡ ଦ୍ୱାରା ପରିବେଶଣ କରାଯାଇଥିଲା । ତେଣୁ ମୂଳ ଭିଡିଓରୁ ଅଡିଓ ଏଡିଟ କରି ଭୁଲ୍ ଦାବି ସହ ଭାଇରାଲ କରାଯାଇଛି ।
రెండేళ్లు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో సిఎం: సిఎం రేవంత్
మనతెలంగాణ/హైదరాబాద్ : రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేకనే ఇతర విషయాలు మాట్లాడుతున్నారని కెటిఆర్ ఆరోపించారు. 16 నెలల కింద కంటోన్మెంట్లో వేల ఇండ్లు ఇస్తామని చెప్పి, ఆరు ఇండ్లు మంజూరు చేయలేదని, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచినా అభివృద్ధి ఏమీ జరగదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కెటిఆర్ ఆదివారం ‘మన తెలంగాణ’ ఇంటర్వూలో పలు అంశాలపై మాట్లాడారు. బిఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ.5,322 కోట్లతో చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా తాను చెప్పానని, దానిపై సిఎం అయినా, ఒక్క మంత్రి అయినా సమాధానం చెప్పారా..? అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో చేసిందేమీ లేక గత కాంగ్రెస్ పాలనలో చేసింది చూసి ఓటు వేయాలని అడిగారని పేర్కొనారు. 2004 -2014 కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూడాలని సిఎం అంటున్నారని, కానీ 1952 నుంచి కాంగ్రెస్ పార్టీనే పాలించి కదా..అప్పటి నుంచి జరిగిన అభివృద్ధి చూడాలని అన్నారు. తమకు 50 ఏళ్లు అవకాశం ఇస్తే అప్పుడు బిఆర్ఎస్ 50 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనను పోల్చుదామని చెప్పారు. రెండేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారో కూడా చెప్పుకోలేని అశక్తతో సిఎం ఉన్నారని విమర్శించారు. చేసిందేమీ లేకనే డైవర్ట్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేదని సిఎం అంటున్నారని, హైదరాబాద్ నగరానికి తాము ఏం చేయకపోతే రెండుసార్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు.
కేంద్రంతో కాదు.. కిషన్ రెడ్డితోనే సమస్య: సిఎ: రేవంత్
తమకు కేంద్ర ప్రభుత్వంతో సమస్యలేదని, జంట నగరాల అభివృద్ధిని పనిగట్టుకుని అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితోనే సమస్య అని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు సార్లు బిఆర్ఎస్ ఎంఎల్ఎగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటే, లోక్సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమి చేశారని ఆయన నిలదీశారు. ఢిల్లీకి వెళితే కూడా చెప్పులు కూడా ఎత్తుకు పోతారు అనే పరిస్థితులను మార్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కిషన్ రెడ్డి అడ్డుపడని ప్రతి విషయం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరంపై సిబిఐకి ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో అరెస్టు చేయిస్తామన్న కిషన్ రెడ్డి విషయం మూడు నెలలుగా సిబిఐ వద్ద ఉంటే ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. సబర్మతి, గంగా, యమున నదులకు రివర్స్ఫ్రంట్ ఉండవచ్చు కానీ హైదరాబాద్లో మూసీకి రివర్స్ఫ్రంట్ ఉండొద్దా? అని ఆయన కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలను ఏ మార్చి బిజెపి పాలిత ప్రాంతాలకు కిషన్ రెడ్డి పంపిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిజెపి పాలిత రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి కానీ ఇతర రాష్ట్రాలు అభివృద్ధి చెందకూడదా? అని ఆయన నిలదీశారు. గుజరాత్కు గులాంగిరి చేస్తూ రాష్ట్రానికి కిషన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పాతబస్తీలో డ్రగ్స్ రాకెట్ పై బండి సంచలన వ్యాఖ్యలు
పాతబస్తీలో మజ్లిస్ అండతో డ్రగ్స్ రాకెట్ హిందూ మైనర్ అమ్మాయిలను టార్గెట్ చేసి కిడ్నాప్, అత్యాచారాలు చేస్తూ వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్నా పాతబస్తీ పోలీసులు కనీసం విచారణ జరపడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా మజ్లిస్ కు ఒత్తిళ్లతో చూసీ చూడనట్లు వ్యవహిస్తోందని విమర్శించారు. పాతబస్తీలోని హిందు అమ్మాయిలు అత్యధికంగా చదువుకునే స్కూల్ టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ముఠా అరాచకాలు చేస్తున్నా ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని యుద్ద ప్రాతిపదికన డ్రగ్స్ ముఠా అంతు చూసి మైనర్ బాలికల జీవితాలను కాపాడకపోతే పాతబస్తీలో వేలాది మంది హిందు యువకులతో రక్షక దళాలలను రంగంలోకి దింపుతామని స్పష్టం చేశారు. అవసరమైతే చట్టానిక లోబడి కేంద్ర దళాలలను కూడా పాతబస్తీలో మోహరింపజేయాల్సి ఉంటుందన్నారు. ఇంకా అవసరమైతే తానే స్వయంగా పాతబస్తీలో పాగా వేసి డ్రగ్స్ ముఠా అంతు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెఎల్పి ఉపనాయకుడు పాయల శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, గోషామహల్ అధ్యక్షులు ఉమా మహేందర్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, రాష్ట్ర నాయకులు జి.మనోహర్ రెడ్డి తదితరులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ డ్రగ్స్ రాకెట్ అరాచకాలపై మాట్లాడారు.
అవినీతిపై వార్తలు రాస్తే వేధింపులా..
తిరుపతి, ఆంధ్రప్రభ : అవినీతికి వ్యతిరేకంగా, గ్రావెల్ మాఫియాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న
ఒకరికి కొడుకు… మరొకరికి తండ్రి…
తణుకు, (ఆంధ్రప్రభ): ఆ ఇంటికి ఉన్న ఏకైక వారసుడు… చేతికి అంది వచ్చాడు…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం: రాంచందర్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్-బిఆర్ఎస్ కుట్రలకు ప్రజలు సమాధానం చెబుతారని, బిజెపిని గెలిపించి ప్రజలు న్యాయబద్ధమైన తీర్పు ఇస్తారనే పూర్తి నమ్మకం తమకుంబదని రాష్ట్ర బిజెపి చీఫ్ రాంచందర్రావు దీమా వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు బిజెపిని మతోన్మాద పార్టీ అంటూ ముద్ర వేస్తూ, మరోవైపు తామే మతం పేరుతో ఓట్లు అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కిషన్ రెడ్డి-బిజెపి ఫోబియా పట్టుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధి కోసం రూ.12 లక్షల కోట్లు కేటాయించిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 2014-2025 మధ్యకాలంలో రవాణా, విద్య, ఆరోగ్యం, పరిశోధన, మహిళా సాధికా రత, క్రీడలు, పర్యాటకం వంటి రంగాల్లో వందలాది ప్రాజెక్టులకు వేల కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఇవి హైదరాబాద్ను జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత మౌలిక సదుపాయాల నగరంగా మార్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో ఎరువుల కొరత, ఉద్యోగులకు జీతాల ఆలస్యం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. అనేక వర్గాల ప్రజలకు అన్యాయం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కడుపు నిండా అన్నం పెట్టాలనే సంకల్పంతో సన్నబియ్యం పథకం అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్లోని ఫార్మా, ఏరోస్పేస్, ఐటీ రంగాలకు మోడీ ప్రభుత్వం ప్రత్యేక మద్దతు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల విషయానికొస్తే... ‘రైతు బంధు బంద్ పెట్టింది, రైతు భరోసా సరిగ్గా అమలు కాలేదు, రుణమాఫీ లేదు. పంట బోనస్ లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు. విద్యా భరోసా కార్డులు ఎక్కడ? తులం బంగారం ఎక్కడ? 18 ఏళ్లు పైబడిన అమ్మాయిలకు ఇచ్చామన్న స్కూటీలు ఎక్కడ? మహిళలకు నెలకు రూ.2,500 భరోసా ఎక్కడ? ఇందిరమ్మ ఇండ్లు లేవు. దళితులకు రూ. 12 లక్షలు ఇవ్వలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపిపై విమర్శలు చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమే’నన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో బీదల సొమ్ము దోచుకుంటూ వారి జీవితాలను ఆగం చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఎంఐఎం, ఎంఐఎం అంటే కాంగ్రెస్ గా మారిందన్నారు. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన అభ్యర్థిని ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయిస్తున్నారని వెల్లడించారు. బిజెపి నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. కానీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తూ, బిజెపి నాయకులు ప్రచారంలో పాల్గొనడం లేదంటూ తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తోందని,.ఇలాంటి అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
పిల్లల పాపాలను.. కెసిఆర్ దృతరాష్ర్టుడిలా భరిస్తున్నారు: సిఎం రేవంత్
దృతరాష్ర్టుడిలా కెసిఆర్ తన పిల్లల దుర్మార్గాన్ని భరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దశ మారుతుందని సచివాలయం కడితే రాతలో దశ సక్కగా లేనోడి దిశ (వాస్తు) ఏ కట్టడాలు మారుస్తాయని ఆయన ఎద్దేవా చేశారు.ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెల్లికి బువ్వ పెట్టలేనోడు ప్రజలను ఏమి ఆదరిస్తారని ఆయన విమర్శించారు. కెసిఆర్ కళ్ళకు గంతలు కట్టుకుని కెటిఆర్ పాపాలు చూడలేక ఫాం హౌస్కు వెళ్ళి కుమిలిపోతున్నాడని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సినిమా ఐటం సాంగ్లా కెటిఆర్ వ్యవహార శైలి ఉందని, ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటూ, దుమ్మెత్తిపోసే వ్యక్తి రాష్ట్రానికి ఎలా నాయకునిగా ఉంటారని ఆయన నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్ను మందలించడం పట్ల కెసిఆర్కు మంచి బుద్ది వచ్చిందని అనుకుంటున్నానని ఆయన తెలిపారు. కెసిఆర్తోనే బిఆర్ఎస్ అంతమవుతుందని ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీలో బిఆర్ఎస్ ఓడిపోతుందన్న అవగాహన ఉన్నందుకే ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్రచారానికి రాలేదని, కనీసం బిఆర్ఎస్ను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేసిన దాఖలాలు కూడా లేవన్నారు. ఈ సంఘటనలతో ప్రస్తుతం కెసిఆర్ను సానుభూతితో చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. ఎక్కడంటే !!
మెండోరా (ఆంధ్రప్రభ): నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామ శివారులో జాతీయ
జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతో గెలువబోతున్నాం: కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసినవారికి, తెలంగాణ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వారికి నవంబర్ 14న మంచి సౌండ్ వినిపిస్తుందని అన్నారు. కడుపు మండిన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్కు బుద్ది చెప్పబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ సర్వే చూసినా కచ్చితంగా బిఆర్ఎస్ గెలుస్తుందనే చెబుతున్నాయని పేర్కొన్నారు. 2023లో జూబ్లీహిల్స్లో 16 వేల ఓట్ల మెజార్టీతో గెలిచామని, ఈసారి అంత కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు మేలు చేయకపోగా, తీవ్ర నష్టం చేసిందని, అది ఈ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పారు. కడుపు మీద దెబ్బకొడితే కులం, మతం ప్రభావం ఏమీ ఉండదని అన్నారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన ప్రజల ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిందని, దాంతో సాధారణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిందని తెలిపారు. రెండేళ్ల తర్వాత ప్రజల్లో నైరాశ్యం, అసంతృప్తి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్రెడ్డి మాటలు నమ్మి చాలా రోజులు మోసపోయారు..మళ్లీ మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కెటిఆర్ ఆదివారం ‘మన తెలంగాణ’ ఇంటర్వూలో పలు అంశాలపై మాట్లాడారు.2023 సెప్టెంబర్లో కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిఎస్టి వసూళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా ఉంటే, 2025 సెప్టెంబర్లో జిఎస్టి వసూళ్లలో 28వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి, ఆదాయం తగ్గడంతో ప్రతికూల ఆర్థిక వృద్థి నమోదైందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, రెండేళ్లలో ఒక్కటీ అమలు చేయలేదని, దాంతో ప్రజల్లో నైరాశ్యం కనిపిస్తోందని అన్నారు.
వారికి కూడా త్వరలోనే అవార్డులు ఇస్తాం: మంత్రి కోమటిరెడ్డి
చిత్రపురి సమస్య పరిష్కరిస్తానని మీ కుటుంబ సభ్యునిగా మాటిస్తున్నా మీకు ఏమి కావాలో చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటా సినీ, టెలివిజన్ రంగం ప్రతినిధుల కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మన తెలంగాణ / హైదరాబాద్ : త్వరలో టెలివిజన్ రంగం వారికి కూడా అవార్డులు ప్రకటించబోతున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిత్రపురి సమస్యను కూడా తప్పక పరిష్కరిస్తామని, చిన్న నటులకు కూడా అందులో అవకాశం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్ సినీ కార్మికుల కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో మాజీ కేంద్రమంత్రి వేణు గోపాల చారి, సినీ పరిశ్రమకు చెందిన 38 సంఘాల ప్రతినిధులు, ప్రముఖ నటీనటులు, సినీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నవీన్ యాదవ్ గెలిస్తే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, మీరు ఓటు రూపంలో మాకు అండగా ఉండాలని కోరారు. హైదరాబాద్కు చిత్ర పరిశ్రమ రావడానికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీనే అని, ప్రోత్సహించింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని, సినీ కార్మికులు, టెలివిజన్ రంగం నటీనటులు, టెక్నికల్ నిపుణులు అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ది గర్ల్ఫ్రెండ్” కలెక్షన్ల జోరు #Cinema #RashmikaMandanna #TheGirlfriend #Tollywood #BoxOffice
పవన్ కళ్యాణ్ ప్రారంభించిన కుంకీ ఏనుగుల కేంద్రం #PawanKalyan #Chittoor #Elephants #Wildlife
Jubilee Hills Bypoll |జూబ్లీహిల్స్ లో ముగిసిన ప్రచారం..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు టేకుమట్ల, ఆంధ్రప్రభ
فیکٹ چیک: ویلوگو اخبار کے مبینہ تراشے میں نوین یادو کی 10 کروڑ روپئے کی دھمکی کی فرضی خبر وائرل
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ نوین یادو نے فلم پروڈیوسروں سے 10 کروڑ روپئے طلب کئے لیکن تحقیق سے معلوم ہوا کہ یہ دعویٰ من گھڑت ہے اور معروف تلگو اخبار کے نام سے منسوب وائرل تراشہ بھی فرضی پایا گیا۔
108 అంబులెన్స్లో ఆదివాసి మహిళ ప్రసవం
తల్లీ, బిడ్డ క్షేమం.. కృతజ్ఞతలు తెలిపిన బంధువులు.. జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం
రేవంత్ రెడ్డి, కెసిఆర్కు కిషన్ రెడ్డి సవాల్..
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు కిషన్రెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేసారు. కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందంటూ రాజకీయ కోణంలో ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా వక్రీకరిస్తున్నాయని విమర్శించారు. గత పదేళ్లుగా తెలంగాణకు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, దీనిపై జూన్ 7న 2023వ తేదిన ’తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర’ పై బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిమని కిషన్ రెడ్డి గుర్తు చేసారు. మరోసారి తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై బహిరంగ చర్చ సిద్ధమని దీనికి వేదిక ఏర్పాటు చేయాల్సిందిగా ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు లేఖ రాసినట్టు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయని కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సి అవసరం ఉందని, అందుకే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కెసిఆర్తో సిద్ధంగా ఉన్నానని చెప్పారు. హైదాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా బహిరంగ చర్చకు ఏర్పాటు చేయాలని ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్కు రాసిన లేఖలో కోరినట్టు వివరించారు. బహిరంగ చర్చా వేదికకు తేదీ, సమయం నిర్ణయించి సీఎం రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తే వస్తానని తాను కూడా వస్తానని పేర్కొన్నారు. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలిసే విధంగా మీడియా ముందు నిర్మాణాత్మకమైన చర్చకు ప్రెస్క్లబ్ చొరవ తీసుకోవాలని సూచించారు. అయితే, వారిద్దరూ మాట్లాడే భాష ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలకు అనుగుణంగా, పద్ధతిగా, పార్లమెంటరీ పద్ధతిలో ఉండాలన్నారు. సానుకూలంగా చర్చ జరిగేలా చూడాలని కిషన్రెడ్డి కోరారు.
జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో: జపాన్ దేశంలో భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. ఉత్తర జపాన్ను ఆదివారం సాయంత్రం భారీ భూకంపం వణికించింది. 6.7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో అనేకసార్లు ప్రకంపనలు సంభవించాయి. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో దాదాపు 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని ఏజెన్సీ తెలిపింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో రెండు అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. భూకంపం వచ్చిన వెంటనే ఉత్తర తీవ్ర ప్రాంతాలను 1 మీటర్ (3 అడుగుల) ఎత్తు వరకు సునామీ అలలు తాకవచ్చని ఏజెన్సీ హెచ్చరించింది. జపాన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ (ఎన్హెచ్కె) ప్రజలు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. ఎందుకంటే ఎప్పుడైనా సునామీ అలలు రావచ్చని తెలిపింది. ఎన్హెచ్కె కూడా ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు తాకవచ్చని హెచ్చరించింది.
2034 వరకూ అధికారం మాదే: సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్ః “2034 వరకూ అధికారం మాదే..రాసిపెట్టుకోండి.. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి..” అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి కొనసాగింపుగా గత బిఆర్ఎస్ పదేళ్ళ విధ్వంసాన్ని మరిపించే విధంగా రాబోయే వందేళ్ళ అభివృద్ధి లక్షంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్వర్యంలోని యుపిఎ-1, యూపిఎ-2 హయాంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆర్జించిన ఆదాయాన్ని గడచిన పదేళ్ళ కాలంలో కెసిఆర్, ప్రధాని నరేంద్ర మోడీ జల్సాలకు వాడుకున్నారని ధ్వజమెత్తారు. కుంటుపడిన పాలనను ఈ రెండేళ్ళ తమ పాలనలో చక్కదిద్దే ప్రయత్నం చేశామన్నారు. నాటి కాంగ్రెస్ అభివృద్ధితో నేడు దేశానికి వచ్చిన ఐదు వందల కంపెనీల్లో డ్బ్భై శాతం రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రపంచాన్ని శాసించే సంస్థలు హైదరాబాద్లో కొలువుదీరాయని, ఇది నాటి కాంగ్రెస్ పాలనకు నిదర్శమని అన్నారు. గత పదేళ్ళలో అమర వీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, కమాండ్ కంట్రోలు అంచనాల కంటే మించి ఖర్చు చేసి నిర్మించారని, వీటితో ఎవరికి ఉపయోగం కలిగిందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ఈ సీజన్లో కాళేశ్వరం నీటిని ఉపయోగించకపోయినా కోటి పది లక్షల ఎకరాల సాగుతో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించింది అని ఆయన తెలిపారు.
ఇది.. భవిష్యత్ ను నిర్దేశించే కీలకమైన ఉప ఎన్నిక: పిసిసి చీఫ్
వెంగళరావు నగర్ డివిజన్లో తుమ్మల పాదయాత్ర పాల్గొన్న పిసిసి చీఫ్ మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భవిష్యత్ను నిర్దేశించే కీలకమయిన ఉప ఎన్నిక అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం మంత్రి తుమ్మల పాదయాత్ర నిర్వహించారు. ఈ పాద యాత్రలో పిసిసి చీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్రలను చైతన్యవంతమైన జూబ్లీ హిల్స్ ఓటర్లు తిప్పి కొట్టాలని వారు కోరారు. హైదరాబాద్ సుస్థిర అభివృద్ధి కోసం సిఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా జూబ్లీ హిల్స్ ఓటర్లు చారిత్రక తీర్పు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మేథావులు అపార్ట్మెంట్ వాసులు పోలింగ్ కు తరలి రావాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్ ను గెలిపించాలన్నారు. ఎల్లారెడ్డి గూడ కృష్ణ అపార్ట్ మెంట్ వాసులు ఆత్మీయ సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. వెంగళరావు నగర్ డివిజన్ లో మంత్రి తుమ్మల పాదయాత్రకు పలు సంఘాలు కాలనీ వాసులు సంఘాబావం గా కదలి వచ్చారు. జూబ్లీ హిల్స్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలతో ముచ్చటిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా ఎంఎల్ఏ రాందాస్ నాయక్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. వన సమారాధనలో పాల్గొన్న మంత్రులు తుమ్మల, వాకిటి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ డివిజన్లో కార్తీక వనభోజన మహోత్సవంలో మంత్రులు వాకిటి శ్రీహరి,తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆలోచన విధానం జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమన్నారు. మీరు వేసే ఓటుతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం హయంలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, మూడు పర్యాయాలు బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినా స్థానికంగా సమస్యలకు పరిష్కారం దొరుకలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యం అవుతుందని, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. 00000
బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం
రామప్పలో సండే సందడి… వెంకటాపూర్,ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వెంకటాపూర్(Venkatapur) మండలంలోని పాలంపేట
జన్నారంరూరల్, ఆంధ్రప్రభ : గొర్రెలు, మేకల కాపర్లైన యాదవులను అటవీశాఖ అధికారులు వేధిస్తూ,
మూలమలుపులు.. యమలోకానికి పిలుపులు
టేకుమట్ల, ఆంధ్రప్రభ : వాహనదారులకు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం
ఎమ్మెల్యే చొరవతో త్రాగునీటి సమస్య పరిష్కారం…
విశాలాంధ్ర-తాడిపత్రి: గన్నేవారిపల్లి కాలనీ ప్రజలు ఏళ్ళ తరబడి ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి చొరవతో కాలనీలో రోజువారీగా త్రాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.కాలనీ ప్రజలు మాట్లాడుతూ , గతంలో రెండు నుండి నాలుగు రోజులకు ఒక్కసారి మాత్రమే త్రాగునీరు అందుబాటులో ఉండేదని, ముఖ్యంగా ఆర్ డబ్ల్యూఎస్ ఆఫీస్ వెనుక భాగంలో ఉన్న దాదా కోళ్ల ఫారం పరిసరాల్లో వారానికి ఒక్కసారి మాత్రమే నీరు […] The post ఎమ్మెల్యే చొరవతో త్రాగునీటి సమస్య పరిష్కారం… appeared first on Visalaandhra .
Cyber Simba |ప్రతి ఇంటికీ ‘సైబర్ సింబా’
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సైబర్ నేరగాళ్లు సృష్టించే ఉచ్చులో చిక్కుకుని అమాయక ప్రజలు
లక్ష్యం కాపాడుకోలేకపోయిన భారత్.. సౌతాఫ్రికా ఎ విజయం
బెంగళూరు: సౌతాఫ్రికాతో జరిగే అసలు పోరుకు ముందు భారత్ ఎ జట్టు సఫారీ ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా జరిగిన రెండో అనధికారిక టెస్ట్లో భారత్ ఎ జట్టు ఓటమిపాలైంది. 417 పరుగుల విజయలక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా ఎ జట్టు ఇవాళ ఒక్కరోజే 392 పరుగులు చేయడం గమనార్హం. 25/0 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సౌతాఫ్రికా బ్యాటింగ్లో బోర్డాన్ హెర్మాన్ 91, లెసెగో సెనోక్వానే 77, జుబైర్ హంజా 77, తెంబా బావుమా 59, కానర్(నాటౌట్) 52 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 సిరాజ్, ఆకాశ్ దీప్, హర్ష్ దూబె తలో వికెట్ తీశారు.
ప్రచారంలో డప్పు కొట్టిన మంత్రి
ప్రచారంలో డప్పు కొట్టిన మంత్రి హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో
Tamil Film Producers Council’s Shock for Top Stars
The Tamil Film Producers Council (TFPC) has announced that all the big-budget films that will be made in future should be produced on a profit-sharing model. The TFPC said that the top actors and technicians will have to share the profits and the losses along with the producers in the future. The Tamil Film Producers […] The post Tamil Film Producers Council’s Shock for Top Stars appeared first on Telugu360 .
ఇంటింటి ప్రచారంలో కొనసాగిన జోరు…
ఇంటింటి ప్రచారంలో కొనసాగిన జోరు… హైదరాబాద్, ఆంధ్రప్రభ : నవీన్ యాదవ్ గెలుపుతోటే
ఇళయరాజా దేశానికి సాంస్కృతిక ఆభరణం..
ఆంధ్రప్రభ, విజయవాడ : సినీ సంగీత సామ్రాజ్యానికి రారాజు ఇళయరాజా విజయవాడలో కాన్సర్ట్

25 C