Andhra Pradesh : నేడు సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం కానుంది.
పోలియో చుక్కలు వేసిన కాసేపటికే పసి బాలుడు మృతి
సంగారెడ్డి: పోలియో చుక్కలు వేసిన కాసేపటికే పసి బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రాలో జరిగింది. పల్స్ పోలియో చుక్కలు వేసిన కాసేపటికే 3 నెలల కుమారుడు మృతి చెందినట్లు తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. పోలియో చుక్కలు వేశాక ఇంటికి వచ్చామని, బాలుడు వాంతులు చేసుకున్నాడని వివరించారు. పాలు తాగకుండా ఏడుస్తూనే ఉండడంతో వైద్య సిబ్బందిని నిలదీశామని, అందరికి వేసిన చుక్కలే ఈ బాలుడికి వేశామని తెలిపారు. చిన్నారి ఇతర అనారోగ్య సమస్యలు ఉండి ఉంటాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మూడు నెలల బాబు శవ పరీక్ష నిర్వహిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని నెటిజన్లు సూచిస్తున్నారు. పోలీయో చుక్కలతో చనిపోవడం అనేది జరగదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Pradeep Ranganathan’s Dude is a Goldmine for Mythri
Pradeep Ranganathan is a sensation in Tamil cinema and his recent films Love Today and Dragon are big hits in Tamil Nadu. Both these films are dubbed into Telugu and made great money considering the dubbed market of a new hero. His upcoming movie Dude is releasing this weekend and it is produced by Mythri […] The post Pradeep Ranganathan’s Dude is a Goldmine for Mythri appeared first on Telugu360 .
India Vs Westindies t : కరేబియన్ ఆటగాళ్లు నిలదొక్కుకున్నారే.. మనోళ్ల చేయి తిరగలేదా?
తొలి టెస్ట్ లో విఫలమయిన వెస్టిండీస్ బ్యాటర్లు రెండో టెస్ట్ లో మాత్రం కాస్త నిలకడగా ఆడుతున్నారు.
Why did Bunny form Allu Arjun Fans Association?
In the social media era, when the fans associations are fading away, Icon Star Allu Arjun and his team have formed Allu Arjun Fans Association and announced team members for all the districts of AP and Telangana. Allu Arjun has personally met his fans on Sunday in a star hotel in Hyderabad and interacted with […] The post Why did Bunny form Allu Arjun Fans Association? appeared first on Telugu360 .
Chandrababu : నేడు బాబు, లోకేశ్ ఢిల్లీకి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు
ఏఐ షూలూ వచ్చాయోచ్! #Technology #Innovation #AI #Hyderabad #AjantaCompany #SmartShoes #telugupost
Six Wild Card Entries Shake Up Bigg Boss Telugu 9 — New Faces and Fresh Drama
The Bigg Boss Telugu 9 house just got a massive twist with not one but six wild card entries stepping into the game. Each contestant entered with their own backstory, controversies, and special powers, setting the stage for explosive drama and unpredictable strategies. Here’s a quick look at who entered and what they brought into […] The post Six Wild Card Entries Shake Up Bigg Boss Telugu 9 — New Faces and Fresh Drama appeared first on Telugu360 .
Telangana : నేడు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం నేడు బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
కడపలో రైలు కిందపడి కుటుంబం ఆత్మహత్య
అమరావతి: ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలో మూడో నంబర్ ట్రాక్ పై గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చొని ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డింది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గూడ్స్ పైలెట్ సమాచారం మేరకు ఆర్ పిఎఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Jubleehills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ నేడు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది
రుషికొండ భవనాల వినియోగం సూచనలు ఆహ్వానించిన ప్రభుత్వం #Visakhapatnam #Rushikonda #Tourism
నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్
షేక్పేట్ తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ నామినేషన్లకు 21వ తేదీ తుది గడువు నవంబర్ 11న ఉపఎన్నిక పోలింగ్.. నవంబర్ 14న కౌంటింగ్ మన తెలంగాణ/సిటీ బ్యూరో: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేయనున్నది. నేటి నుండి అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. ఈ నెల 21వ తేదీ సా.3 గం.ల వరకు నామినేషన్లకు తుది గడువుగా నిర్ణయించారు. 22న నామినేషన్ల పరిశీలన (స్కృటినీ), ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరుగనుంది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు. షేక్పేట్ తహసీల్దారు కార్యాలయాన్ని నామినేషన్లను స్వీకరించేందుకు ఎన్నికల కార్యాలయంగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 ఉన్నారు. వీరిలో పురుషులు 2,07,367. స్త్రీలు 1,91,590, ఇతరులు 25 మంది ఓటర్లున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు సమయంలో ఆర్ఓ లేదా ఏఆర్ఓ కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు కన్నా మించి వాహనాలను అనుమతించరు. నామినేషన్ సమర్పించే సమయంలో గరిష్టంగా 5 (అభ్యర్థి సహా)మంది వ్యక్తులనుమాత్రమే అనుమతిస్తారు. ఒకే ప్రవేశ మార్గం ద్వారానే వెళ్ళాల్సి ఉంది. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ మార్గదర్శకాలను జిల్లా ఎన్నికల అధికారులు జారీచేశారు. ఆన్లైన్ ద్వారా.. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులు ఇది నియోజకవర్గానికి చెందిన ఓటరైనఒక్కరిని ప్రతిపాదకుడిగా తీసుకోవచ్చునని తెలిపారు.- స్వతంత్ర/గుర్తింపులేని పార్టీ అభ్యర్థులు నామినేషన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పదిమంది ఓటర్లను ప్రతిపాదకులుగా తీసుకోవాలి.- ఇతర నియోజకవర్గ అభ్యర్థులు.. సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి ఓటర్ల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈఎన్సిఓఆర్ఈ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://encore.eci.gov.in ద్వారా నామినేషన్ ఫారం ఆన్లైన్లో నింపవచ్చునని అధికారులు తెలిపారు. క్యూఆర్ కోడ్తో కూడిన ప్రింటెడ్ హార్డ్ కాపీ తప్పనిసరిగా సమర్పించాలి. ఎన్నికల వ్యయ పర్యవేక్షకుడిగా సంజీవ్ కుమార్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసిఐ) ఐఆర్ఎస్ అధికారి సంజీవ్కుమార్ లా ల్ను ఎన్నికల వ్యయ పర్యవేక్షకుడిగా నియమించింది.ఎన్నికల వ్యయ పర్యవేక్షకులు ఎన్నికల ఖ ర్చుల పర్యవేక్షణలో భాగంగా అన్ని కార్యకలాపాలను సమీక్షించడంతో పాటు, ఎన్నికల వ్యయం పై కట్టుదిట్టమైన పర్యవేక్షణను కొనసాగిస్తారు.
ఎస్ఆర్ఎస్పి ఫేజ్2కు దామోదర్ పేరు
మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి/తుంగతుర్తి : శ్రీరామ్సాగర్ రెండో దశకు మాజీ మం త్రి దివంగత రాంరెడ్డి దామోదర్రెడ్డి పేరు పెడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం మా ట్లాడుతూ.. తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు దామోదర్రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని కొనియాడారు. పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ దాదా పు నాలుగు దశాబ్దాల పాటు పార్టీ జెండాను ఈ ప్రాంతంలో ఎగురవేసిన నాయకుడు దా మోదర్రెడ్డి అని అన్నారు. ప్రస్తుత రాజకీయా ల్లో ప్రతి ఒక్కరు ఆస్తులను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ, రామ్రెడ్డి దా మోదర్ రెడ్డి మాత్రం వారసత్వంగా వచ్చిన ఆస్తులను పేదలకు పంచడమే కాకుండా, తన అత్త గారి కుటుంబ ఆస్తులను కూడా వేలాది ఎకరాలను తుంగతుర్తి ప్రాంత ప్రజలకు దానం చేశారని కొనియాడారు. దామోదర్ రెడ్డికి ఎఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సంతాపం తెలియజేయాల్సిందిగా తెలిపారని, వారి తరపున సర్వోత్తమ్ రెడ్డికి, దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు. ఫ్లోరైడ్, కరువు ప్రాంతమైన తుంగతుర్తికి శ్రీరామ్సాగర్ జలాలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఎస్ఆర్ఎస్పి ఫేజ్2కు పెడుతున్నట్లు ప్రజల హర్షాధ్వానాల మధ్య ప్రకటించారు. కాగా, సంతాప సభకు డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపిలు, మాజీ హోంమం త్రి జానారెడ్డితోపాటు ఎంఎల్ఎలు, ఎంఎల్సి లు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరై దామన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అర్ధరాత్రి ఆడపిల్లకు ఆరుబయట ఏం పని?
దుర్గాపూర్లో మెడికో రేప్ కేసుపై సిఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు ఆడపిల్లలను అర్ధరాత్రి బయటకు పంపొద్దంటూ హితవు కోల్కతా: దుర్గాపూర్లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం నాడు తీవ్రంగా స్పందించారు. రాత్రిళ్లు విద్యార్థినులను వెలుపలకు వెళ్లేందుకు అనుమతించరాదని స్పష్టం చేశారు. రాత్రి 12-30 గంటల సమయంలో ఆమె ఎందుకు కాలేజీ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లారని ప్రశ్నించారు. ఆ విద్యార్థిని బాధ్యత పూర్తిగా ప్రైవేటు మెడికల్ కాలేజీదేనని స్పష్టం చేశారు. ప్రతివిషయానికీ తమ ప్రభుత్వాన్ని నిందించడం సబబు కాద ని మమత పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల మమతా బెనర్జీ దిగ్భ్రమ వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఎవ్వరినీ క్షమించబోమని హెచ్చరించారు. రాత్రి పూట ఆడపిల్లలు బయటకు వెళ్లనివ్వకూడదు. వారు కూడా తమ భద్ర త విషయంలో జాగ్రత్త తీసుకోవాలని హితవు చెప్పారు. అత్యాచారం జరిగిన ప్రతి సందర్భంలోనూ, రాష్ట్ర ప్రభుత్వా న్ని ఎందుకు బదనాం చేస్తున్నారని మ మత ప్రశ్నించారు. నెల్లాళ్ల క్రితం ఒడిశాలోని పూరీ బీచ్లో ఓ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, ఒడిశా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ఆమె ప్రశ్నించారు. శుక్రవారం నాడు కోల్ కతాకు 170 కిలోమీటర్ల దూరంలోని దుర్గాపూర్లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ రెండో సంవత్సరం చదువుతున్న 23 ఏళ్ల విద్యార్థినిపై ఆ స్పత్రి వెనుక ఏకాంత ప్రదేశంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఒడిశాకు చెందిన ఆ బాలిక తల్లిదండ్రులు దుర్గాపూర్ చేరుకుని న్యూ టౌన్ షిప్ పో లీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన బిడ్డకు బెంగాల్లో రక్షణ లేద ని, ఆ మెను తమ రాష్ట్రానికి తీసుకుపోతామని ఆమె తండ్రి పేర్కొన్నారు. ఆదివా రం తెల్లవారుజామున ఈ సామూహిక అత్యాచారానికి సంబంధించి షేక్ రి యాజ్ ఉద్దీన్, షేక్ ఫిర్దౌష్, అప్పు అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానంతో మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆపరేషన్ బ్లూస్టార్ అతిపెద్ద తప్పు
న్యూఢిల్లీ: 1984లో నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు నిర్ణయం అని కాంగ్రెస్, సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబ రం పేర్కొన్నారు. పంజాబ్లోని అమృత్సర్లో స్వర్ణదేవాలయాన్ని తీవ్రవాదుల కబ్జా నుంచి స్వా ధీనం చేసుకోవడానికి అప్పట్లో ఆపరేషన్ బ్లూ స్టా ర్ నిర్వహించారు. ఆ నిర్ణయానికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భారీ మూల్యం చెల్లించారని చిదంబరం వాపోయారు. ఆయితే ఆ నిర్ణయాన్ని ఇం దిర ఒక్కరే తీసుకోలేదని పేర్కొన్నారు. అది సై న్యం, పోలీసులు, నిఘావర్గాల సమిష్టి నిర్ణయం. దీనికి ఇందిరాగాంధీ ఒకరినే నిందించలేమని కేం ద్ర మాజీ మంత్రి అన్నారు. తాను ఏ సైనిక అధికారులను తాను అగౌరవపరచడం లేదని, కానీ స్వర్ణదేవాలయం నుం చి టెర్రరిస్ట్ లను నిర్మూలించేందుకు అది తప్పుడు మార్గం అని చిదంబరం పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత సైన్యాన్ని దూరంగా ఉంచడం ద్వారా దానిని తిరిగి పొందే సరైన మార్గాన్ని తాము చూపామన్నారు. బ్లూ స్టార్ విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయానికి ఇందిరాగాంధీ తన జీవితాన్నే బలి పెట్టవలసి వచ్చిందని తాను అంగీకరిస్తున్నానని చిదంబరం అన్నారు. కసౌలిలో ఒక సాహిత్య కార్యక్రమంలో ప్రసంగిస్తూ చిదంబరం ఈ ప్రకటన చేశారు. చిదంబరం ప్రకటనను ఖండించిన కాంగ్రెస్ చిదంబరం ప్రకటనను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన ఒత్తిడిలో ఉన్నట్లు కన్పిస్తోందని, చిదంబరం ప్రకటన బిజేపీ పంథాను ప్రతిధ్వనిస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రషీద్ అల్వి ఆరోపించారు. ఆపరేషన్ బ్లూస్టార్ సరైనదా, కాదా అనేది చ ర్చనీయాంశం. కానీ, 50ఏళ్ల తర్వాత చిదంబరం కాంగ్రెస్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి. ఇందిరాగాంధీ తప్పుడు అడుగు వేశారనడం ద్వారా ఆయన మోదీ మాటనే వల్లెవేస్తున్నట్లు కన్పిస్తోందని రషీద్ అల్వీ విమర్శించారు. చిదంబరంపై ఎన్నో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఆయన ఏదైనా ఒత్తిడిలో ఉన్నారా అని తాను అనుమానిస్తున్నానని రషీద్ అల్వి అన్నారు. చిదంబరం వ్యాఖ్యలను కాంగ్రెస్ వర్గాలు ఖండించాయి. పార్టీ ద్వారా ఎన్నో కీలక పదవులు అందుకున్న సీనియర్ నాయకుడు బాధ్యతతో మాట్లాడాలని, పార్టీని ఇరుకునపెట్టే ప్రకటనలు చేయడం సరికాదని పేర్కొన్నాయి. ప్రస్తుత పంజాబ్ గురించి మాట్లాడుతూ, ఖలిస్తాన్ నినాదాలు చాలా తగ్గిపోయాయి. ఆర్థిక ఇబ్బందులే రాష్ట్రానికి ప్రధాన సమస్య అని చిదంబరం అన్నారు. స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ పంజాబ్లో తీవ్రవాద నాయకుడు జర్నేల్ సింగ్ భింద్రన్ వాలే నాయకత్వంలో వేర్పాటు వాదులను అణచి వేసేందుకు ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆద్వర్యంలో 1984 జూన్ 1నుంచి జూన్ 8వరకూ ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించారు. స్వర్ణదేవాలయ సముదాయం, అకాల్ తఖ్త్లో తలదాల్చుకున్న భింద్రన్ వాలే ఆయన అనుచరులు కాల్పులకు తెగపడడంతో సైన్యం ఆపరేషన్ను నిర్వహించింది. ఆపరేషన్లో ట్యాంక్లు, భారీ ఫిరంగులను కూడా ఉపయోగించాల్సివచ్చింది. వందలాదిమంది టెర్రరిస్ట్లు, సైనికులు, పౌరులు కూడా చనిపోయారు. సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణదేవాలయం పై దాడి సిక్కు సమాజాన్ని తీవ్రంగా బాధించింది. ఆగ్రహజ్వాలలను రేకెత్తించింది. ఈ దాడికి ప్రతీకారంగా ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు 1984 అక్టోబర్ 31న హత్య చేశారు.
రెండో టెస్టు: వెస్టిండీస్ ఎదురీత.. పట్టుబిగించిన భారత్
న్యూఢిల్లీ: భారత్తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో, చివరి టెస్టులో వెస్టిండీస్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్లో విండీస్ 248 పరుగులకే కుప్పకూలింది. దీంతో 270 పరుగులు వెనుకబడి ఫాలో ఆన్ ఆడక తప్పలేదు. అయితే రెండో ఇన్నింగ్స్లో విండీస్ మెరుగైన బ్యాటింగ్ను కనబరుస్తోంది. ఒక దశలో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న విండీస్ను జాన్ కాంప్బెల్, షాయ్ హోప్లు ఆదుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ విండీస్ ఇన్నింగ్స్ను పటిష్ట పరిచారు. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హోప్ 103 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. జాన్ కాంప్బెల్ 145 బంతుల్లో 9 బౌండరీలు, రెండు సిక్స్లతో 87 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇద్దరు ఇప్పటికే మూడో వికెట్కు అజేయంగా 138 పరుగులు జోడించారు. కాగా, ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే విండీస్ మరో 97 పరుగులు చేయాలి. కుల్దీప్ మ్యాజిక్.. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 140/4తో తొలి ఇన్నింగ్స్ తిరిగి చేపట్టిన విండీస్కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ అసాధారణ బౌలింగ్తో చెలరేగి పోయాడు. షాయ్ హోప్ ఐదు ఫోర్లతో 36 పరుగులు చేసి కుల్దీప్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కొద్ది సేపటికే వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ (21) కూడా ఔటయ్యాడు. అతన్ని కూడా కుల్దీప్ ఔట్ చేశాడు. అంతేగాక జస్టిన్ గ్రీవ్స్ (17)ను కూడా కుల్దీప్ వెనక్కి పంపాడు. ఖారి పిరె (23)ను బుమ్రా బౌల్డ్ చేయగా, వారికన్ (1)ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన అండర్సన్ ఫిలిప్ 93 బంతుల్లో 24 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. జైడెన్ సీల్స్ (13)ను కుల్దీప్ ఔట్ చేయడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్ 81.5 ఓవర్లలో 248 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో కుల్దీప్ ఐదు, జడేజా మూడు, సిరాజ్, బుమ్రా ఒక్కొ వికెట్ను పడగొట్టారు. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే.
అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో ఘర్షణలు
58 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు అఫ్గాన్ ప్రకటన 19 అఫ్గాన్ చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు పాక్ వెల్లడి కాబూల్, ఇస్లామాబాద్, పెషావర్: ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో ఇటీవలి పాక్ వైమానిక దాఢులకు ప్రతిగా ఆఫ్ఘన్ సరిహద్దుల్లో జరిపిన దాడులలో 58 మంది పాక్ సైనికులు చనిపోయారని తాలిబన్ ప్రకటించింది. ఈ ఆపరేషన్ లో మరో 30 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ లకు ఆశ్రయం కల్పించవద్దని పాకిస్తాన్ ను ఆదివారం తాలిబన్ హెచ్చరించింది. కాగా, సరిహద్దుల్లోని 19 ఆఫ్ఘన్ భద్రతా పోస్ట్ లను, టెర్రరిస్ట్ స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఆఫ్ఘన్ దళాలు ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని అంగూర్ అడ్డా, బజౌర్, కుర్రం, దిర్, చిత్రాల్, బలుచిస్తాన్ లోని బరంగా వద్దఉన్న పాక్ ఫోస్ట్ లు లక్ష్యంగా దాడులు జరిపాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిపినట్లు తాలిబన్ ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రతీకారదాడులు విజయవంతంగా సాగాయని ప్రకటించింది. సరిహద్దుల్లో పాక్ గడ్డపై దాగిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ లను బహిష్కరించాలని, వీరి వల్ల ఆఫ్ఘనిస్తాన్ తో సహా ప్రపంచంలో అనేక దేశాలకు ముప్పు ఉందని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. తమ భూ, గగనతల సరిహద్ధులను రక్షించుకునే హక్కు తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘర్షణలో 20 మంది తాలిబన్ సైనికులు చనిపోవడమో, గాయపడడమో జరిగిందన్నారు. కవ్వింపు లేకుండానే ఆఫ్ఘన్ దాడులు సరిహద్దు పోస్ట్ లపై తాలిబన్లు జరిపిన దాడులను పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి మొహ్సిన్ నఖ్వీ ఖండించారు. ఎటువంటి కవ్వింపు లేకుండానే ఆఫ్ఘన్ సైనికులు పౌరులపై కాల్పులు జరిపారని ఆయన ఆరోపించారు. పాక్ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, ఆఫ్ఘన్ కు దీటుగా సమాధానం ఇస్తున్నామని ఆయన తెలిపారు. గతవారం ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తాహ్రీక్ -ఇ- పాకిస్తాన్ (టిటిపి) జరిపిన టెర్రరిస్ట్ దాడులలో ఒకమేజర్, ఓ కల్నల్ తో సహా 11 మంది పాక్ సైనికులు మరణించడంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు దిగజారాయి. గురువారం రాత్రి పాక్ వైమానిక దాడులతో కాబూల్ దద్దరిల్లిందని ఆఫ్గన్ పేర్కొంది. దీనిని పాక్ ఖండించనూ లేదు. తమ ప్రమేయం లేదని ప్రకటించనూ లేదు. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశంలో పర్యటిస్తున్న సమయంలోనే రెండు దేశాల మధ్య పోరాటం జరగడం గమనార్హం.
ట్రంప్ సుంకాల బెదిరింపులకు భయపడం
` వారి చర్యలను దీటుగా ఎదుర్కొంటాం ` అమెరికా టారీఫ్లపై చైనా స్పందన బీజింగ్(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా , డ్రాగన్ కంటీ చైనా మధ్య టారిఫ్ల విషయంలో …
` జపాన్లో వ్యాపిస్తున్న ఇన్ఫ్లుఎంజా ` పాఠశాలలు మూసివేత.. జనజీవనం అతలాకుతలం టోక్యో(జనంసాక్షి):టోక్యో: ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ) మహమ్మారితో జపాన్ అతలాకుతలమవుతోంది. సుమారు ఐదు వారాలుగా ఈ వ్యాధి …
` ఎన్డీయే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి.. ` భాజపా, జేడీయూకు చెరో 101 స్థానాలు.. ` నలుగురు సిట్టింగ్లకు ఉద్వాసన పాట్నా(జనంసాక్షి):బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార …
` సముద్రంలో ఐదుగురు గల్లంతు చీరాల(జనంసాక్షి):బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో …
సరిగ్గా వాదనలు వినిపించలేదనుకుంట!
` కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో నేను ఏం చేయగలను ` సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరు ` మహారాష్ట్రలో …
` కాంగ్రెస్ చేసిన చట్టాలకు ఎన్డీయే తూట్లు పొడిచింది ` ఆర్టీఐ చట్టానికి సవరణలు చేసి.. దాని స్వతంత్రతను బలహీన పరిచారు ` ఆర్టీఐను నీరు గార్చేందుకే …
హైదరాబాద్ శివారులో డ్రైపోర్టు
– రేపల్లె-మచిలీపట్నం రైల్వేలైనే కీలకం ` తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ` తుది దశలో ఉన్న సర్వే ప్రక్రియ హైదరాబాద్(జనంసాక్షి):రేపల్లె-మచిలీపట్నం రైలు మార్గం పూర్తయితే సరకు …
ఒకరిపై ఒకరు బాహాటంగా విమర్శలు క్రమశిక్షణారాహిత్యానికి పరాకాష్ట కార్యకర్తలు, నేతలు బుద్ధిగా.. మంత్రులు ఇష్టారాజ్యంగా మొదట సీతక్కా vs సురేఖ మొన్న పొన్నం vs అడ్లూరి నిన్న సురేఖ vs పొంగులేటి నేడు వివేక్ vs ఆడ్లూరి స్థానిక ఎన్నికల ముందు జనంలో పలుచన చేష్టలుడిగిన క్రమశిక్షణా కమిటీ మన తెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే విమర్శ నిజమేనని అనిపించేందుకు అమాత్యవర్యులు పోటి పడుతున్నారేమో? అంటే, అవునని అనిపించే విధంగా ఇటీవల మంత్రుల మధ్య జరుగుతున్న కుమ్ములాటలు , గిల్లికజ్జాలు నిరూపిస్తున్నాయి. దశాబ్దం పాటు అధికారానికి దూరంగా ఉండి వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునేలా మంత్రుల వ్యవహార శైలీ ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో కష్టనష్టాలకు నోచుకొని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలు, నాయకులేమో బుద్ధిగా ఉంటే, మంత్రులు ఎందుకిలా వ్యవహరిస్తున్నారని పార్టీ అధిష్టానం సైతం అనేక సందర్భాలలో అసహనం వ్యక్తం చేసిన ఉదంతాలు లేకపోలేదని తాజా ఉదంతాల నేపథ్యంలో గుర్తు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించాక, పార్టీని గాడిలో పెడుతుందని భావించారు. కానీ అలాంటి చర్యలేమి కనిపించడం లేదని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ముఖ్యంగా మంత్రుల మధ్య సమన్వయం లోపం వల్లనే పార్లమెంట్ ఎన్నికలలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయినట్టు ఆ ఎన్నికల ఫలితాల విశ్లేషణకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్టు అప్పట్లో పార్టీలో చర్చ జరిగింది. ప్రస్తుత జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలు, రేపో, మాపో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందు మంత్రుల మధ్య తలెత్తుతోన్న విభేదాలు, వివాదాలు, కుమ్ములాటల పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ అధినేత మహేశ్కుమార్గౌడ్ తీవ్రంగా పరిగణిస్తోన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల ముందు మంత్రుల మధ్య విభేదాల పట్ల అధిష్టాన పెద్దలు కూడా సీరియస్గా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మంత్రుల మధ్య గిల్లికజ్జాలు మంత్రుల మధ్య విభేదాలకు మొదటి నుంచి వరంగల్ జిల్లా కేంద్ర బింధువు కాగా, అందుకు మంత్రి కొండా సురేఖ కారణం అవుతున్నారు. ఈ జిల్లాకు చెందిన మరో మంత్రి సీతక్కతో కొండా సురేఖకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత వారిద్దరు తమ మధ్య ఎలాంటి విభేదాలు, మనస్పర్థలు లేవని ప్రెస్మీట్ పెట్టి చెప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి కొండా సురేఖకు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పీసీసీ క్రమశిక్షణా సంఘం జోక్యం చేసుకొని ఏ దో విధంగా రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించినా ఇప్పటికీ వారి మధ్య గొడవలు సద్దుమణగలేదు. మళ్లీ తాజాగా జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై అధిష్టానానికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేయడంతో మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కింది. వరంగల్ జిల్లా గాలి పొరుగున ఉన్న కరీంనగర్కు కూడా సోకిందేమో ఆ జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, ఆడ్లూరి లక్ష్మణ్కు మధ్య నిన్నగాక మొన్న తలెత్తిన విభేదాలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ జోక్యం చేసుకొని పరిష్కరించిన విషయం తెలిసిందే. ఈ వివాదం సమసిపోయిందని అనుకుంటున్న క్రమంలోనే తాజాగా మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఆడ్లూరి లక్ష్మణ్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. నిజామాబాద్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, తనపై ఎవరో మంత్రి ఆడ్లూరిని రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు తాను ఇంచార్జీగా ఉండటం వల్ల అక్కడ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే తనకు ఎక్కడ పేరు వస్తుందే మోనని పార్టీలో కొందరు కుట్రపూరితంగా తనపై మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్తో ఆరోపణలు చేయిస్తున్నారని కూడా వివేక్ ఆరోపించారు. వీరిద్దరి మధ్య కొనసాగుతోన్న వివాదంలోకి మరో మంత్రి శ్రీధర్బాబును కూడా వివేక్ వెంకటస్వామి లాగారు. దివంగత నేత జి వెంకటస్వామి జయంతి సందర్భంగా ఇటీవల నిర్వహించిన వేడుకల ఆహ్వన పత్రికలో ఆడ్లూరి లక్ష్మణ్ పేరు ముద్రించకపోవడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చెబుతూ, మరి మంత్రి శ్రీధర్బాబు తండ్రి దివంగత శ్రీపాదరావు జయంతి వేడుకల ఆహ్వాన పత్రికలో కూడా ఆడ్లూరి లక్ష్మణ్ పేరు లేదు మరి ఆ విషయాన్ని ఎందుకు ప్రశ్నించలేదంటూ ఈ వివాదంలోకి శ్రీధర్బాబును లాగారు. మంత్రుల మధ్య బాహాటంగా గిల్లికజ్జాలు జరుగుతోన్న ఇదేదో తమకు సంబంధం లేని అంశంగా పీసీసీ క్రమశిక్షణ కమిటీ చేష్టలు ఉడిగినట్టు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మంత్రి పదవి దక్కలేదన్న ఆగ్రహంతో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కొందరిని టార్గెట్ బాహాటంగా వ్యాఖ్యలు చేస్తోన్నా క్రమశిక్షణ కమిటీ ఎందుకు సంజాయిషి కోరడం లేదని కూడా విమర్శలు వస్తున్నాయి. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మంత్రుల వ్యవహారశైలీ మారడం, స్థానిక, ఉప ఎన్నికల ముందు వీరి గిల్లికజ్జాల పట్ల అధిష్టానం అహనంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ౦౦౦౦౦
ఎస్సారెస్పీ-2కి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు
` ఇందుకు సంబంధించి 24 గంటల్లో జీవో తెస్తామన్నారు. ` నల్గొండకు గోదావరి జలాలను తెచ్చిన ఘనత ఆయనదే.. ` తుంగతుర్తి ప్రజల కోసం దామన్న పనిచేశారు …
42% రిజర్వేషన్ సాధనకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు
` బీసీ రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతం ` బీసీ జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ` రిజర్వేషన్ల సాధన కోసం …
పైసలిస్తేనే ఫైలు ముందుకు .. అంతా అవినీతిమయం.. పంచాయతీ కార్యదర్శుల అవినీతి లీలలు..
అవమానాలపై చర్చకు సిద్ధం: అడ్లూరి లక్ష్మణ్
ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో తేల్చుకుందాం వివేక్ కొడుకును ఎవరు గెలిపించారో అందరికీ తెలుసు: అడ్లూరి లక్ష్మణ్ మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య నెల కొన్న వివాదం ఓ పట్టాన విడిచేటట్టు లేదు. వివాదం సమసిపోయిందని ప్రకటించినా మళ్లీ ఒకరిపై ఒక రు బహిరంగ వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉ న్నారు. తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివాదం సమసిపోయిందంటూనే వివేక్పై మండిపడ్డారు. ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్దమని ఫైర్ అయ్యా రు. కులం ఆధారంగా తనపై కుట్రలు, విమర్శలు చేస్తున్నారని, చేయిస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలు చేసిన విష యం తెలిసిందే. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేస్తున్నారని, మంత్రి లక్ష్మణ్ నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియట్లేదు, సభలు, సమావేశాలు జరిగే సమయంలో ఆయన వచ్చినప్పుడు నేను వెళ్లిపోతున్నాననేది తప్పని, లక్ష్మణ్ను రాజకీయంగా ప్రోత్సహించింది మా నాన్నే, ఆ విషయాన్ని అడ్లూరి మర్చిపోయారని వివేక్ చేసిన వ్యాఖ్యలు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే వ్యక్తిగతంగా నాకు మంచి పేరు వస్తుందనే ఈ కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడడంపై అడ్లూరి స్పందించారు. ఆదివారం సాయంత్రం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ముగిసిన వివాదాన్ని వివేక్ మళ్లీ తెరమీదకు తెస్తున్నారని, ఇక నేను ఏం మాట్లాడనని అన్నారు. వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని, వివేక్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అంటూనే వివేక్ కొడుకును ఎంపీగా గెలిపించింది ఎవరో ఆయనకు కూడా తెలుసని అన్నారు.
సోమవారం రాశి ఫలాలు (13-10-2025)
మేషం - పనులలో కొంత నిదానం ఉంటుంది. సన్నిహితులతో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించాలి. సభ్యుల ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోగలుగుతారు. వృషభం - వృత్తి ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో పనిచేస్తారు.కొంత ఒత్తిడికి గురైనప్పటికీ అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయం కొంత నిరాశకు గురిచేస్తుంది. మిథునం - వృత్తి- ఉద్యోగాలపరంగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు కొంత చికాకు కలిగిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు తగదు. కర్కాటకం - వృత్తి ఉద్యోగాలలో కొంత మార్పు కోరుకుంటారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ ఓర్పు సహనం వహించడం చెప్పదగినది. సింహం - సంతానం చేపట్టిన పనులలో విజయం సాధించడం మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. ప్రత్యర్థి వర్గం వారి చేష్టలు సూటిపోటి మాటలు మీకు విసుగు కలిగిస్తాయి. కన్య - ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అయినవారి అండదండలు మీకు లభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండటం మంచిది. తుల - ప్రధానమైన కార్యక్రమాలను నిర్వహించడానికి కావలసిన ధనమును వ్యయ ప్రయాలకోర్చి సమకూర్చుకోగలుగుతారు. పదే పదే పదుగురి సలహాలు తీసుకుంటారు కానీ మీకు తోచినదే చేస్తారు. వృశ్చికం - జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. సంతాన క్షేమం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వృత్తి ఉద్యోగములకు అవసరమైన ఆధునిక సామాగ్రిని ఏర్పరచుకుంటారు. ధనుస్సు - ఎంత శాంతంగా ఉన్నా ఓర్పు సహనాలకు అగ్నిపరీక్ష పెట్టే రీతిలో శత్రువర్గం మిమ్మల్ని రెచ్చగొడతారు. మీ నిర్లక్ష్యం వలన కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొనవలసి వస్తుంది. మకరం - ఒకే సమయంలో అనేక అంశాలను సానుకూల పరుచుకోవాల్సి రావడం వలన మానసికంగా శారీరకంగా ఒత్తిడికి లోనవుతారు. పరపతిని ఉపయోగించి అతి ముఖ్యమని భావించిన వ్యవహారాలను సానుకూల పరుచుకోగలుగుతారు. కుంభం - మీ పరిధిలో లేని అంశాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగములలో నైపుణ్యమును ఆసక్తిని చూపిస్తారు. సహచరులలో ఒకరు మీ సన్నిహితులు అవుతారు. మీనం - ఏ పని నైనా సరే పూర్తికానంతవరకు బహిర్గతం చేయకండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. లీజులు లైసెన్సులను తిరిగి పొందడానికి గాను చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి.
హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడం, వివాహ వేడుకల కారణంతో హైవేపై వాహనాల రద్దీ తీవ్రమైంది. సర్వీస్ రోడ్డు, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల చిట్యాల, పెద్దకాపర్తి, పంతంగి టోల్ ప్లాజా, చౌటుప్పల్ దగ్గర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాయి. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చౌటుప్పల్ ఏరియాలో వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసే పనిలో పడ్డారు. భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను త్వరగా పంపించేందుకు టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ గేట్ల నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను పంపిస్తున్నారు. ఇదిలా ఉండగా, ట్రాఫిక్లో అంబులెన్స్ సైతం చిక్కుకు పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు.
ప్రపంచకప్: భారత్ పై ఆస్ట్రేలియా రికార్డు విజయం
విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం వేదికగా ఆతిథ్య భారత్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది. తర్వాత క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా మహిళా టీమ్ మరో ఓవర్ మిగిలివుండగానే ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాకు ఇది మూడో విజయం కావడం విశేషం. ఇక టీమిండియా వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అలీసా హీలీ, లిఛ్పిల్డ్లు శుభారంభం అందించారు. లిచ్ఫిల్డ్ ఆరు ఫోర్లు, సిక్స్తో 40 పరుగులు చేసింది. అష్లే గార్డ్నర్ (45), ఎలిసె పేరి 47 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్ను కనబరిచారు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హీలీ 107 బంతుల్లోనే 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 142 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా అలవోక విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు ఓపెనర్లు ప్రతీక రావల్ (75), స్మృతి మంధాన (80) అండగా నిలిచారు.
ప్రపంచ వేదికపై సిరిసిల్ల సత్తా
తెలంగాణ ఇవి ఆవిష్కరణలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గ్రావ్టన్ మోటార్స్ ఫౌండర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశంస మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఆవిష్కరణలను అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన సిరిసిల్ల బిడ్డ, గ్రావ్టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు పర్శురామ్ పాకను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా అభినందించారు. ఒక ఆవిష్కర్తకు ప్రేరణ ఇచ్చే ఎకో సిస్టం లభించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు. పర్శురామ్ పాక వంటి ప్రతిభావంతులను పోషించడంలో తెలంగాణలోని ఆవిష్కరణల కేంద్రాలైన టీ- హబ్, టీ- వర్క్ పాత్ర కీలకమని కొనియాడారు. సిరిసిల్లకు చెందిన పర్శురామ్ పాక మన ఇంక్యుబేటర్ల (టి హబ్, టి వర్క్) వద్ద ఉన్న అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించుకుని గ్రావ్టన్ మోటార్స్ను స్థాపించారని తెలిపారు. నేడు ఈ సంస్థ తెలంగాణ నుంచే ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు. గ్రావ్టన్ మోటార్స్ తమ మోటార్లు, బ్యాటరీలు, కంట్రోల్ సిస్టమ్స్ను పూర్తిగా దేశీయంగా రూపొందించి, తయారు చేసిందని తెలిపారు. ఇది నిజమైన మేడ్- ఇన్ -ఇండియా, మేడ్ -ఫర్- ది -వరల్డ్ విజయగాథ అని కెటిఆర్ అభివర్ణించారు. కే2కే ప్రపంచ రికార్డ్, అంతర్జాతీయ విస్తరణ గతంలో గ్రావ్టన్ మోటార్స్ సంస్థ 4,000 కిలోమీటర్ల కశ్మీర్ -టు -కన్యాకుమారి(కె2కె) రైడ్ను పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పిందని కెటిఆర్ తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ కెన్యా, ఫిలిప్పీన్స్, పెరూ వంటి దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరిస్తోందని అన్నారు. శుక్రవారం కోయంబత్తూరులో పర్శురామ్ పాకను కలిశానని, ఆయన కంపెనీ ప్రయాణం, విజయాలు తనను ఎంతగానో ప్రేరేపించాయని తెలిపారు. ఇది తనకు నిజంగా అవసరమైన ఎనర్జీ బూస్టర్ అని వ్యాఖ్యానించారు. పర్శురామ్, గ్రావ్టన్ మోటార్స్ ఈవీ బృందానికి అభినందనలు తెలుపుతూ, ఆయన కథ మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిష్కరణల వ్యవస్థ స్థానిక మేధస్సును అంతర్జాతీయ ప్రభావిత శక్తిగా మారుస్తూ, భారతదేశ ఈవీ విప్లవాన్ని ఎలా ముందుకు నడిపిస్తోందో ఈ విజయాలు నిరూపిస్తున్నాయని కెటిఆర్ తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో 40 లక్షల ఎఐ ఉద్యోగాలు..!
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఎఐ, ఆటోమేషన్ జోరుతో నిన్న మొన్నటివరకూ సేఫ్ అనుకున్న ఐటి ఉద్యోగాలు కాస్తా ఆవిరవుతున్నాయి. భారత్లో ఎఐ ఉద్యోగాలపై నీతి ఆయోగ్ అంచనాలను వెల్లడించింది. 2030 నాటికి అంటే వచ్చే ఐదేళ్లలోనే భారత్లో 40 లక్షల ఎఐ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని నీతి ఆయోగ్ ఆదివారం వెల్లడించింది. ముఖ్యంగా టెక్, కస్టమర్ ఎక్స్ పీరియన్స్ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలను ఎఐ సృష్టించబోతున్నట్లు తెలిపింది. నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రమణ్యం ఈ వివరాలు వెల్లడించారు. నాస్కామ్ బిసిజితో కలిసి ఈ నివేదిక తయారు చేసింది. 2035 నాటికి భారత్ ఎఐ రంగంలో గ్లోబల్ హబ్ గా మారబోతోందని ఈ నివేదికలో తెలిపారు. ఎఐ దూకుడు కారణంగా క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్లు, లెవెల్ 1 సపోర్టింగ్ ఏజెంట్ల వంటి ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం వివిధ రంగాల్లో ఎఐ నైపుణ్యాల వృద్ధి, ఆవిష్కర ణలు జరగకపోతే ఉద్యోగాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది. ఇవి జరిగితే మాత్రం జాతీయ స్ధాయిలో ఆయా ఉద్యోగులు ఆస్తులుగా మార తారని తెలిపింది. ఎఐ దూకుడు కారణంగా టెక్నికల్, ఇంజనీరింగ్ విభాగాల్లో పెనుమార్పులు తథ్యమని చెబుతోంది. ఏఐ కారణంగా ఎఐ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, రోబోటిక్స్ ఇంజనీర్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాల రాక పెరగనుందని నీతి ఆయోగ్ నివేదిక చెబుతోంది. వీటితో పాటు కొత్త ఉద్యోగాలైన ఎఐ ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఎఐ ఎథిక్స్ స్పెషలిస్ట్, ఎఐ ట్రైనర్స్, ఎఐ ప్రొడక్ట్ మేనేజర్స్, ఎఐ కస్టమర్ ఎక్స్ పీరియన్స్ స్పెషలిస్ట్, ఎఐ లిటరసీ ట్రైనర్స్, స్పెషలిస్ట్, ఎఐ హెల్త్ కేర్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ వంటివి కూడా రాబోతున్నట్లు వెల్లడించింది.
చీరాల బీచ్ లో విషాదం.. ముగ్గురి మృతి, ఇద్దరు గల్లంతు
మన తెలంగాణ/హైదరాబాద్ : బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చీరాల మండలం వాడరేవు బీచ్లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్ర స్నానం కోసం వాడరేవు బీచ్కు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. నీటిలో మునిగి సముద్రంలోకి కొట్టుకుపోయారు. అనంతరం కొద్దిసేపటికి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయని తోటి విద్యార్థులు తెలిపారు. ఆ ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు. మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు సందర్శ కులు సూర్యలంక బీచ్తో పాటు వాడరేవు సముద్ర తీరానికి వస్తుంటారు. ఈ క్రమలో అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి 10 మంది విద్యార్థులు బృందంగా వాడరేవుకు వచ్చారు. వారిలో హైదరాబాద్కు చెందిన సాకేత్ సాయి, మణిద్వీప్, జీవన్ సాత్విక్లు అలల తాకిడికి కొట్టుకుపోయారు. దీంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపా డేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. గల్లంతైన కాసేపటికి సాకేత్, సాత్విక్, మణిదీప్ల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మృతదేహాలను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో విద్యార్థి సోమేష్తో పాటు చీరాలకు చెందిన గౌతమ్ సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం అగ్నిమాపక, మత్సశాఖ అధికారులు డ్రాగన్ లైట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిని బాపట్ల ఎస్పీ ఉమా మహేశ్వర్ పరిశీలించారు. మంగినపూడి బీచ్ వద్ద యువకులను కాపాడిన మెరైన్ సిబ్బంది.. ఇదిలా ఉండగా, బందరు రూరల్ మండలం మంగినపూడి బీచ్ వద్ద నీళ్లలో కొట్టుకుపోతున్న నలుగురు యువకుల్ని పోలీసులు, మెరైన్ సిబ్బంది రక్షించారు. ఆదివారం కావడంతో పలు ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులతో మంగినపూడి బీచ్ రద్దీతో కిటికీటలాడుతోంది. సముద్ర తీరా ప్రాంతంలో అలల తాకిడికి కృష్ణాజిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన నలుగురు ముస్లిం యువకులు కొట్టుకుపోయారు. ఇది గమనించిన సబ్ ఇన్స్పెక్టర్ బోస్, మెరైన్ సిబ్బంది సాయంతో నలుగురు యువకుల్ని కాపాడారు. అబ్దుల్ అసిఫ్, ఎస్.కె అర్ఫాద్, ఎస్.కె సికిందర్ షరీఫ్, ఎండి అన్వర్, అనే యువకులను మెరైన్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. మెరైన్ పోలీసులు సకాలంలో స్పందించి తమ ప్రాణాలను కాపాడి నందుకు యువకులు వారికి ధన్యవాదాలు తెలిపారు. యువకులను కాపాడడంలో మెరైన్ పోలీస్ సిబ్బంది చూపించిన ధైర్యసాహసాలను పర్యా టకులు ప్రశంసించారు.
From Villages to Africa: Inside AP’s Fake Liquor Scandal
In a bold move to dismantle a growing fake liquor network in Andhra Pradesh, the state government has formed a Special Investigation Team (SIT) led by Eluru Range IG, GVG Ashok Kumar. The SIT includes top-ranking officers such as Mallika Garg, Rahul Dev Sharma, and a senior official from the Excise Department. Their mission is […] The post From Villages to Africa: Inside AP’s Fake Liquor Scandal appeared first on Telugu360 .
A Laugh Riot Awaits! “Mithra Mandali” to Entertain Audiences with Premieres on October 15
“Mithra Mandali” to Premiere on October 15 — A Feel-Good Buddy Comedy Set to Entertain All Ages. The upcoming entertainer “Mithra Mandali” is gearing up to hit the big screens this festive season. Starring Priyadarshi and Niharika NM in lead roles, the film is directed by Vijayendra and produced by Kalyan Manthena, Bhanu Pratap, and […] The post A Laugh Riot Awaits! “Mithra Mandali” to Entertain Audiences with Premieres on October 15 appeared first on Telugu360 .
బిసి రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బిసి జెఎసి ఏర్పాటు
చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈనెల 18న బందు పర్ జస్టిస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర బంద్ 13న రహదారుల దిగ్బంధం, 14న రాష్ట్ర బంద్ వాయిదా తెలంగాణ బంధ్ తో బిసిల బలమేంటో చూపిస్తాం బిసిల నిరసనను గల్లి నుంచి ఢిల్లీ దాకా సెగ పుట్టిస్తాం ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసి, ఐక్యంగా ముందుకు తీసుకుపోవడానికి బిసి ఐక్య కార్యాచరణ కమిటీ (బిసి జెఎసి) ఏర్పాటయ్యింది. ఆదివారం హైదరాబాద్, లక్డీకాపూల్ లోని ఓ హోటల్లో బిసి సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ఉద్యోగులు సమావేశమయ్యారు. బిసి రిజర్వేషన్ల పై హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టుల ద్వారా అడ్డుకోవాలని ఇప్పటికే రెడ్డి జాగృతికి చెందిన నేతలు ప్రయత్నిస్తుండడంతో ఉద్యమించే బిసి సంఘాలు తమ తమ సంఘాల ద్వారా కాకుండా ఉమ్మడి ఎజెండాతో జెఎసి ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా బిసి జెఎసి చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా విజిఆర్ నారగోని, కో చైర్మన్ లు గా రాజారాం యాదవ్, దాసు సురేష్, సమన్వయకర్తగా గుజ్జ కృష్ణ ను ఎన్నుకున్నారు. బిసి రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వదాన్ని నిరసిస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈనెల 13న ఇచ్చిన జాతీయ రహదారుల దిగ్బంధం, ఆర్ కృష్ణయ్య ఈనెల 14న ఇచ్చిన రాష్ట్ర బందును వాయిదా వేసి ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ను చేపట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా జెఎసి చైర్మన్, పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించి రాష్ట్రంలోని బిసిలకు అన్యాయం చేసిందని, ఈ అన్యాయాన్ని నిరసిస్తూ బిసిలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాడితేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి బిసి రిజర్వేషన్లు అమలు చేస్తాయని అన్నారు. ప్రస్తుత బిసి రిజర్వేషన్ల ఉద్యమం భవిష్యత్తులో చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించే వరకు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈనెల 14న నిర్వహించాల్సిన తెలంగాణ రాష్ట్ర బందును 18కి వాయిదా వేశామని 18న జరిగే బందును పార్టీలకతంగా బిసిలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 60 శాతం ఉన్న బిసిలు ఐక్యంగా లేరని బిసిలకు రావలసిన నోటికాడ ముద్దను పిడికెడు శాతం లేని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ వ్యతిరేకులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సెగ పుట్టియడానికి బిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అందుకు రాష్ట్రంలో ఉన్న ప్రధాన బిసి సంఘాలను, వ్యక్తులను, శక్తులను కలుపుకొని బిసి జెఎసిగా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. ఈనెల 18న జరిగే బంద్ ద్వారా బిసిల బలమేందో, బిసిల శక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రుచి చూపిస్తామని ఆయన హెచ్చరించారు బిసిల ఐక్యత ద్వారా తెలంగాణలోని బిసి సమాజానికి విశ్వాసం కల్పించి పార్టీలుగా సంఘాలుగా విడిపోయిన బిసి శ్రేణులను ఒక్కటి చేసి తెలంగాణలో బిసిల రాజకీయ అధికారానికి పునాదులు వేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో 40 బిసి సంఘాలు, 110 బిసి కుల సంఘాలతో పాటు ముఖ్యంగా బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, కొండ దేవయ్య, శేఖర్ సగర, నీల వెంకటేష్, తాటికొండ విక్రం గౌడ్, కనకాల శ్యాం కుర్మా, కేపీ మురళీకృష్ణ, అనంతయ్య, రామకోటి, వేముల రామకృష్ణ, ఈడిగ శ్రీనివాస్, భూపేష్ సాగర్, గొడుగు మహేష్ యాదవ్, వరికుప్పల మధు, గుజ్జ సత్యం, రమాదేవి, లక్ష్మి, భూమన్న యాదవ్, రాజు నేత, దీటి మల్లయ్య, రాజేందర్, పగిల సతీష్, రామ్మూర్తి, బడే సాబ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 13 నుంచి వారం రోజుల పాటు
ఈ నెల 13 నుంచి వారం రోజుల పాటు ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో
సౌదీ నుంచి హైదరాబాద్ కు కోమా పెషేంట్..
మన తెలంగాణ / హైదరాబాద్: గత ఎనభై రోజులుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో చికిత్స పొందుతున్న కోమా పెషేంట్ లోకిని క్రిష్ణమూర్తిని హైదరాబాద్ కు తరలించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైద్య సిబ్బంది పర్యవేక్షణలో సౌదీ ఎయిర్ లైన్స్ విమానంలో స్ట్రెచర్ పై మెడికల్ ఎవాక్యుయేషన్ చేస్తున్న పెషేంట్ తో అతని భార్య తెనుగు అశ్విని ఉన్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ కు చేరిన వెంటనే పెషేంట్ ను దక్కన్ హాస్పిటల్ లో చేరుస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎల్కతుర్తి కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లోకిని క్రిష్ణమూర్తి (35) సౌదీలో జూలై 23న అపస్మారక స్థితికి చేరారు. అధిక బిపితో, మెదడులోని రక్తనాళాలు చిట్లి కోమాలోకి జారిపోయిన అతనికి, రియాద్ లోని ఎస్ఎంసీ ఆసుపత్రిలో కోమా స్థితిలో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రభుత్వం సౌదీలోని ఇండియన్ ఎంబసీతో సంప్రదించి పెషేంట్ ను తెప్పించడానికి కృషి చేశారు. సౌదీలోని గ్లోబల్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు మహ్మద్ జబ్బార్ సమన్వయం చేశారు. సహాయం కోసం పెషేంట్ తండ్రి సూరయ్య గతనెల 9న ’ సిఎం ప్రవాసీ ప్రజావాణి’ లో వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి మార్గదర్శనం చేశారు.
‘మా’ నుంచి తప్పించండి.. మంచు విష్ణుకు ఎమ్మెల్సీ బల్మూరి ఫిర్యాదు
మన తెలంగాణ/హైదరాబాద్ః జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ను మూవీ ఆర్ట్ అసోసియేషన్ (మా) నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ‘మా’ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారు. ఆదివారం బల్మూరి వెంకట్ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. రెండు రోజుల్లో అసోసియేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చిస్తామని మంచు విష్ణు తనకు హామీ ఇచ్చారని బల్మూరి వెంకట్ తెలిపారు. ఈ అంశంపై సినీ పరిశ్రమ పెద్దలు కూడా స్పందించాలని ఆయన కోరారు.
భారత్లో విద్యావ్యవస్థకు పెను ముప్పు: రాహుల్ గాంధీ
నిలదీస్తేనే నిజాలు, ప్రశ్నిస్తేనే వైవిధ్య భారత్ పదేండ్ల కాలంలో తిరోగమన విధానాలతో యువత అధోగతి చిలీ, పెరూ వర్శిటీలలో విద్యార్థులతో ఇష్టాగోష్టిలో రాహుల్ శాంటియాగో /న్యూఢిల్లీ : భారతదేశంలో స్వతంత్ర ఆలోచనా విధానాలపై , శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధతపై తీవ్రస్థాయి దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శింఒచారు. చిలీ పర్యటనకు వెళ్లిన రాహుల్ అక్కడి యూనివర్శిటీలో విద్యార్థులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పరోక్షంగా మోడీ ప్రభుత్వ తీరుతెన్నులపై విరుచుకుపడ్డారు. కుల వ్యవస్థ కుళ్లు, విద్యావ్యవస్థ లోపాలతో భారతదేశం ఏనాటికీ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. నది పంవత్సరాల కాలంలో భారతీయ విద్యావ్యవస్థపై , యువత ఆలోచనలపై అప్రకటిత దాడి జరుగుతోందని, అణచివేత పరాకాష్టకు చేరిందని కూడా రాహుల్ వ్యాఖ్యానించారు. భారతీయ విద్యా వ్యవస్థ రక్షణ అత్యవసరం, ఇక్కడ అమృత అనే అమ్మాయి లేవనెత్తిన ప్రశ్నకు తాను శాస్త్రీయంగానే సమాధానం ఇస్తానని రాహుల్ తెలిపారు. భారత్లో విద్యావ్యవస్థను పరిరక్షించాల్సి ఉంది. ఇది తనతో పాటు అందరి బాధ్యత అన్నారు. ఇక్కడి విద్యార్థినిలాగా భారత్లోని వారు కూడా ప్రశ్నించే స్వేచ్ఛతో ఉండాలి. వారికి ఈ స్వేచ్ఛ కల్పించేలా చేయాలనేదే తన ఆలోచన అని చెప్పారు. అమృత ఇక్కడ నిలదీసినట్లే భారత్లో కూడా ఏ అమ్మాయి అయినా పౌరుడు అయినా పలు అంశాలను ప్రస్తావించే పరిస్థితి ఉండాల్సిందే. ధైర్యంగా ఆలోచించగలగాలి, ఎటువంటి అవరోధాలకు వీలుండరాదని ఆయన చెప్పారు. పెరూ లోని పాంటిఫికల్ క్యాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ పెరూలో కూడా రాహుల్ ఇటువంటి స్పందన వెలువరించారు. భారత్లో విద్యావ్యవస్థ అక్కడ వైవిధ్యతను ప్రతిఫలించేదిగా ఉండాలి. విద్య అనేది కొందరికే చెందే హక్కు కారాదని తెలిపారు. అప్పుడే స్వేచ్ఛ బలోపేతం అవుతుందన్నారు. భారత్కు ఓ ప్రత్యామ్నాయ ఉత్పత్తి వ్యవస్థ అవసరం. ఈ దిశలో అమెరికా లేదా పెరూతో సరైన భాగస్వామ్యం దేశ పురోగతికి పనికి వస్తుందన్నారు. రాహుల్పై బిజెపి ఆగ్రహం పరాయి దేశానికి వెళ్లి భారత్ పరువు తీసేలా మాట్లాడటం తగునా అని రాహుల్ గాంధీపై బిజెపి విరుచుకుపడింది. ఏ ఇతర దేశం వెళ్లినా ఏదో సంచలనం కోసం భారత్పై విద్వేషం వ్యక్తం చేయడం ఈ వ్యక్తికి అలవాటు అయిందని బిజెపి అధికారిక ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. అమెరికాలోని కరోలినాలో ఆ మధ్య రాహుల్ భారత్లో కొందరు పెట్టుబడిదార్లకు మేలు చేసేలా మోడీ సర్కారు పనిచేస్తోందని, రాజ్యాంగానికి తూట్లుపొడుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చిలీ యూనివర్శిటీలో విద్యార్థుల ఇష్టాగోష్టిలో రాహుల్ భారత్లో కుల వ్యవస్థ, విద్యారంగం గురించి చేసిన వ్యాఖ్యానాలను కాంగ్రెస్ మాజీ నేత అయిన పూనావాలా తప్పుపట్టారు. వేరే దేశంలో మన దేశాన్ని కించపరుస్తున్నారని పూనావాలా స్పందించారు. రాహుల్ దేశ ప్రతిపక్ష నేతనా; విద్వేష ప్రచారాల దూతనా అని బిజెపి మండిపడింది.
నక్సల్స్పై సిఆర్పిఎఫ్ అటవీ అస్త్రం
న్యూఢిల్లీ : చత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని అత్యంత దుర్భేధ్యపు కర్రెగుట్ట పర్వత ప్రాంతంలో సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ఓ కమెండో ట్రైనింగ్ స్కూల్ ఆరంభం కానుంది. తమ దళాలకు ప్రత్యేక గెరిల్లా, కమెండో తరహా శిక్షణ కోసం ఈ శిక్షణ సంస్థను ఈ ప్రాంతపు భౌగోళిక పరిస్థితి నేపథ్యంలో ఎంచుకున్నారు. ఈ కర్రెగుట్ట హిల్స్ ప్రాంతం కంచుకోటగా ఉంటుంది. ఈ ప్రాంతంలో సిఆర్పిఎఫ్కు చెందిన అటవీ యుద్ధ తంత్ర కమెండో విభాగం కోబ్రా, స్థానిక పోలీసు బలగాలు కలిసి మూడు వారాల పాటు విస్తృత స్థాయిలో అనువైన ప్రదేశం కోసం గాలించాయి.ఈ క్రమంలోనే 60 కిలోమీటర్ల పొడవు, 520 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే ప్రాంతాన్ని తమ స్థావరంగా ఎంచుకున్నారని అధికార వర్గాలు పిటిఐ వార్తాసంస్థకు తెలిపాయి. కొండలు, కందకాలు, పైగా దట్టమైన అటవీప్రాంతం, గబ్బిలాలు, కందిరీగలు, ఎలుగుబంట్లు ఉండే ఈ ప్రాంతం తమ కదలికలకు అత్యంత రహస్యంగా గుట్టుచప్పుడు కాకుండా ఉంటుందని వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఇక్కడనే ఎప్రిల్ మే మధ్యలో కోబ్రా ఇతర దళాల తీవ్రస్థాయి గాలింపు చర్యల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇక్కడ 31 మంది వరకూ మావోయిస్టులు మృతి చెందారు.ఈ దశలోనే ఈ ప్రాంతంలో కమెండో సెంటర్ను పెట్టాలని సిఆర్పిఎఫ్ వర్గాలు ఆలోచించాయి. నక్సల్ ఏరివేత లక్షం వచ్చే ఏడాది మార్చి నాటికి నెరవేరుతుందని అమిత్ షా పదేపదే చెపుతూ వస్తున్న దశలో , మారుమూల అడవుల్లో నక్సల్స్పై పోరును మరింత తీవ్రతరం చేసే తగు శిక్షణ, పటిమను బలగాలకు కల్పించేందుకు నిర్ణయించారు. ఎప్రిల్ మే నెలల్లో జరిఇన కర్రెగుట హిల్స్ ఆపరేషన్ను భద్రతా బలగాలు తమ అత్యంత భారీవిజయంగా భావించుకుంటున్నాయి. సిఆర్పిఎఫ్కు చెందిన అనుభవజ్ఞులైన వారిని , అటవీ , కొండ ప్రాంతాలలో దాడులు, గెరిల్లా తరహా పోరాట పటిమ ఉండే వారిని ఎంచుకుని ఇక్కడ ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. కెజిహెచ్ ఆపరేషన్ తరువాత ఇది సిఆర్పిఎఫ్కు సంబంధించి అత్యంత కీలకమైన వ్యూహాత్మక కార్యాచరణ అని వెల్లడైంది. ఏ విధంగా దీనిని ఏర్పాటు చేయాలనేది ఇప్పటికే ఖరారు అయింది. ఇక సిఆర్పిఎఫ్ స్కూల్ ద్వారా కమెండో శిక్షణ అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. దీని వల్ల ఈ ప్రాంతం శత్రువుల కదలికలు, ఉనికికి దూరంగా ఉండేలా చేయడం జరుగుతుందని ఓ అధికారి చెప్పారు. ఈ గుట్టలలో వాతావరణం తీవ్రస్థాయిలో ఎండలు, చలితో ఉంటుంది. ఈ ప్రాంతం ఎక్కువగా ఇతర వ్యక్తులకు చేరుకునే లేదా ఉండేందుకు అవకాశం లేనిది. అందుకే దీనిని చాలా కాలం వరకూ నక్సల్స్ దళాలు తమ స్థావరంగా వాడుకున్నాయి. ఇప్పుడు నక్సల్స్పై అంతిమ విజయం కోసం ఈ ప్రాంతం నుంచే వారిపై సర్వశక్తులతో దెబ్బకొట్టేందుకే ఈ కమెండో స్కూల్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడైంది.
సముద్రంలో మునిగి ముగ్గురు హైదరాబాదీలు మృతి
బాపట్ల: సరదా కోసం సముద్ర స్నానానికి వెళ్లిన యువకుల కథ విషాదాంతం అయింది. చీరాల బీచ్లో హైదరాబాద్కు చెందిన ముగ్గురు మృతి చెందారు. చీరాల మండలం వాడరేవు తీరంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు నీట మునిగి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మృతులు హైదరాబాద్కు చెందిన శ్రీ సాకేత్, సాయి మణిదీప్, జీవన్ సాత్విక్లుగా గుర్తించారు. వీళ్లు అమరావతిలోని విట్లో చదువుకుంటున్నట్లుగా తెలిసింది. యువకుల మృతదేహాలను చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గల్లంతైన మరో ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
8 మంది పట్టివేత పెద్దపంజాణి, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం
పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : మంత్రి
పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : మంత్రి మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్
కానిస్టేబుల్స్ సాహసం.. సముద్రంలోకి వెళ్లి నలుగురు యువకులను కాపాడి! #Machilipatnam #PoliceHero
అతడి రాక కోసం రికార్డుల ఎదురుచూపులు..
భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు రంగం సిద్ధమైంది. మరో వారం రోజుల్లో (ఈ నెల
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం: శ్రీధర్ బాబు
మన తెలంగాణ/హైదరాబాద్/గచ్చిబౌలి : ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్‘ అనే థీమ్తో నిర్వహించిన ‘గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ ఎనిమిదో ఎడిషన్‘ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మందిని కబళిస్తున్న కాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించాల్సిన సామాజిక బాధ్యత మనందరి పై ఉందన్నారు. ‘ఆరోగ్య తెలంగాణ ను నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఆరోగ్యాన్ని మించిన సంపద ఏదీ లేదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. సమాజంలో క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ‘గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినంధించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని, ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. చినబాబు సుంకవల్లి తదితరులు పాల్గొన్నారు.
పుష్కరిణి పునరుద్ధరణ పనులు.. మక్తల్, (ఆంధ్రప్రభ) : మక్తల్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన
ఆందోళన పడకండి.. బిఆర్ఎస్ అండగా ఉంటుంది: హరీష్ రావు
జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులుకు హరీష్ రావు భరోసా మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు భరోసా ఇచ్చారు. వారి సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లామని.. వారిని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు. ఉపాధి కోసం తెలంగాణ నుంచి వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో హరీష్రావు ఫోన్లో మాట్లాడారు. మీరు ఇబ్బంది పడుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లామని జోర్దాన్లో చిక్కుకుపోయిన వారికి హరీష్ రావు వివరించారు. ఎలాగైనా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువచ్చే కృషి చేస్తున్నామని, అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఏడాది క్రితం ఉపాధి కోసం వెళ్లిన 12 మంది తెలంగాణ వలస కార్మికులు జోర్డాన్లో చిక్కుకున్నారు. దేశం కాని దేశంలో నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు హరీశ్ రావుకు గోడు వెళ్లబోసుకున్నారు. ఎలాగైనా తమను తెలంగాణలో ఉన్న కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని వేడుకున్నారు. ఈ క్రమంలో హరీశ్ రావు ఫోన్ చేసి వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.
గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన నటుడు
హైదరాబాద్: మహాత్మ గాంధీ గురించి నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీకాంత్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా శ్రీకాంత్ తన మాటలకు క్షమాపణలు చెప్పారు. కొన్ని రోజుల క్రితం తాను పెట్టిన పోస్టు చాలామంది మనోభావాలను దెబ్బ తీసిందని.. అందుకు వారందరికీ క్షమాపణలు చెప్తున్నానని పేర్కొన్నారు. శ్రీకాంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శనివారం సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు కూడా ఆ ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ ‘మా’ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. పబ్లిసిటీ కోసమే శ్రీకాంత్ చరిత్రను వక్రీకరించారని.. గాంధీ సిద్ధాంతాలను నమ్మే వారి మనోభావాలను దెబ్బ తీశారని పేర్కొన్నారు. నటుడిపై ‘మా’ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సినీ పెద్దలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ క్షమాపణలు చెప్పారు.
కేంద్ర మంత్రి అయితే.. రిజర్వేషన్లపై నేనేమి చేయలేను?: కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ః కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్లపై ఏమి చేయగలనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వమే ఉన్నా రిజర్వేషన్లపై ఏమీ చేయలేకపోయామని ఆయన చెప్పారు. గతంలో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని ఆయన ఉదహరించారు. రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండరాదని లోగడ సుప్రీం కోర్టు క్యాప్ విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ విషయంలో తాను కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన ఏమి చేయగలనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో, సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని బిజెపి ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయన చెప్పారు. అయితే బిసి రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రయత్నానికే తాము అభ్యంతరం వ్యక్తం చేశామని ఆయన వివరించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక విషయంలో జరుగుతున్న జాప్యం గురించి ప్రశ్నించగా, ముగ్గురు ఆశావాహుల పేర్లతో జాబితాను తమ పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు పరిశీలనలో ఉందన్నారు. దీనిపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయాన్ని వెల్లడించనున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి: కెటిఆర్
ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుంది రేవంత్రెడ్డి పేదల ఇండ్లపైకి బుల్డోజర్ పంపుతున్నారు కారు కావాలో.. బుల్డోజర్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి రెండేళ్లవుతున్నా ఇంకా కెసిఆర్నే నిందిస్తున్నారు బిజెపి తెలంగాణకు పనికిరాని పార్టీ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న ఆ పార్టీ నేతలు.. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుందని ఎద్దేవా చేశారు. రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్లో ఖర్చుపెడతారని, కాంగ్రెస్ నేతలు ఓటుకు రూ.10 వేలు ఇస్తారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆదివారం షేక్పేట్ డివిజన్కు చెందిన బిజెపి సీనియర్ నేత చెర్క మహేష్, ఇతర నేతలు కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్లో చేరారు. వారికి కెటిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సి దాసోజు శ్రవణ్, ఎంఎల్ఎ ముఠా గోపాల్ మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్రెడ్డి,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా సిఎం రేవంత్రెడ్డి ఇప్పటికీ ప్రతిదానికి కెసిఆర్నే నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై సిఎం రేవంత్రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లడుతున్నారని విమర్శించారు. పేదల ఇళ్లపై బుల్డోజర్ దాడి హైదరాబాద్లో గరీబోళ్ల ఇళ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి.. ఆ ఇళ్లని సిఎం రేవంత్రెడ్డి కూలగొట్టిస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఈ ఎన్నికలో జూబ్లీహిల్స్ ప్రజలకి కారు కావాలో.. బుల్డోజర్ కావాలో నిర్ణయించుకోవాలని చెప్పారు. కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదల ఇండ్లపైన కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లను నడిపిస్తున్నదని మండిపడ్డారు. అన్నీ తెలిసి కూడా బిసి రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి మోసం చేశాడని ఆరోపించారు. పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని సిఎంకు తెలుసు అని పేర్కొన్నారు. ఇచ్చిన జిఒను కోర్టు కొట్టేస్తుందని కూడా తెలిసి మరీ బిసి రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేశాడని విమర్శించారు. అజారుద్దీన్కు ఇస్తామని చెప్పిన ఎంఎల్సి కూడా ఆయనకు రాదని తెలుసు అని, కానీ ఆయనను కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. ముస్లింలకు ఇస్తామని చెప్పిన స్మశానం విషయంలో కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం హైదరాబాద్ నగరం అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కెసిఆర్ తిరిగి రావాలని, అందుకు జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు కెటిఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో చేసిన మోసం గురించి కాంగ్రెస్ పార్టీపైన ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు 4 వేల పెన్షన్లు వస్తాయి.. మిగతా హామీలు అమలవుతాయని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేస్తే, ప్రజలను తాము మోసం చేసినా తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా కాంగ్రెస్ పార్టీకి వస్తుందని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని విమర్శించారు. ఈ రెండేళ్లుగా ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిందని మండిపడ్డారు. ఒక్క ఇల్లు కట్టలేదు.. ఒక్క ఇటుక పెట్టలేదు.. కానీ 2.30 లక్షల కోట్ల అప్పు మాత్రం చేసిందని అన్నారు. తెలిసి మరీ ప్రజలను మోసం చేయడమే రేవంత్ రెడ్డి నైజం అని, ఆయన నిజాయితీగా చెబుతూ మరీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మోసం చేసే వాళ్లనే ప్రజలు నమ్ముతారని గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. బిజెపి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం పనికిరాని పార్టీ అని కెటిఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓటు వేయడం అంటే ఆ ఓటును మోరీలో వేసినట్లేనని కెటిఆర్ పేర్కొన్నారు.
కదులుతున్న రైలు దిగబోయి జారి పడిన వ్యక్తి.. కాపాడిన కానిస్టేబుల్!.. సీసీటీవీ ఫుటేజ్ #railwaysafety
కొండా X పొంగులేటి: అది పార్టీ అంతర్గత వ్యవహారం.. మేం చూసుకుంటాం
మన తెలంగాణ/హైదరాబాద్ః రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదంపై త్వరలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో పరిష్కరించుకుంటామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ అన్నారు. మంత్రుల మధ్య సమాచార లోపం వల్ల వివాదం తలెత్తిందని గాంధీభవన్లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరి మధ్య తలెత్తింది చాలా చిన్న సమస్య అన్నారు. ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం చెప్పారు. త్వరలో ఈ అంశంపై సీఎం రేవంత్రెడ్డి వద్ద కూర్చొని పరిష్కరించుకుంటామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై మంత్రి కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంపై ప్రస్తావించగా, తమ పార్టీలో స్వేచ్చ ఎక్కువ అన్నారు. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరైనా పార్టీ నాయకత్వానికి చెప్పుకునే స్వేచ్చ తమ పార్టీలో ఉంటుందన్నారు. అధిష్టానం దృష్టికి ఎవరైనా ఆర్జీ పెట్టుకోవచ్చని మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు.
నివారించిన రోడ్డు ప్రమాదాలు వెల్దండ, ఆంధ్రప్రభ : తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల(Road
టీం ఇండియా రికార్డు స్కోర్.. ఆసీస్కు భారీ లక్ష్యం..
విశాఖ: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇక్కడి ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత మహిళ జట్టుకు మంచి ఆరంభం అందింది. ఓపెనర్లు స్మృతి, ప్రతికాలు కలిసి తొలి వికెట్కి 155 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు అర్థ శతకాలు సాధించారు. స్మృతి మంధన 80 పరుగులు చేసి ఔట్ అయింది. ఆ తర్వాత 192 పరుగుల వద్ద ప్రతీక (75) పెవిలియన్ చేరింది. ఆ తర్వాత బ్యాటింగ్లో హర్లిన్ 38, జెమీమా 33, రిచ ఘోష్ 32, హర్మన్ప్రీత్ 22 పరుగులు చేశారు. వీళ్లు మినహా మిగితా వాళ్లు స్వల్ప స్కోర్కే పరిమితమయ్యారు. దీంతో భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఐసిసి వన్డే ప్రపంచకప్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఆసీస్ బౌలింగ్లో అన్నాబెల్ సదర్లాండ్ 5, సోఫీ మోలినెక్స్ 3, మేగాన్ స్కట్, ఆష్లీ గార్డెనర్ తలో వికెట్ తీశారు.
200 మిలియన్ ఏళ్ల నాటి వృక్షం #FossilDiscovery #Mancherial #SCCL #BirlaScienceCentre #Archaeology
భయాందోళనలో ప్రజలు ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్(Ootkur) మండల కేంద్రంలో
విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ముప్పు
విశాఖ స్టీల్ ప్లాంట్లో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. కోకోవెన్ బ్యాటరీ-5లో ఈ ప్రమాదం సంభవిచింది. లాడీల్ నుంచి ఉక్కు ద్రావకాన్ని తలరిస్తుండగా.. అకస్మాత్తుగా అది లీకై నేలపాలైంది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ సిబంబంది అక్కడకు వచ్చి మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో యంత్ర సామాగ్రికి గణనీయమైన నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
నల్లగొండకు గోదావరి నీళ్లు…
నల్లగొండకు గోదావరి నీళ్లు… తుంగతుర్తి, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్
అట్లూరి దంపతుల బహూకరణ గార్ల (మహబూబ బాద్ జిల్లా), ఆంధ్రప్రభ : కోరుకున్నోళ్లకు
క్రమశిక్షణ.. భద్రతే కీలకం ! ఆంధ్రప్రభ, కర్నూలు బ్యూరో : దేశ ప్రధాన
1.10 కోట్ల ఏండ్ల నాటి స్టెగోడాన్ ఏనుగు శిలాజాలతో ప్రత్యేక ప్రదర్శన #hyderabad #Stegodon #telangana
కాంగ్రెస్ను ఎండగట్టేందుకే! నిజాంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకే బాకీ కార్డుల(Outstanding
భారత్ –వెస్టిండీస్ రెండో టెస్ట్ మూడో రోజు ఇలా..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ – వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో
హుండీలో రూ.50 వేలు చోరీ జగిత్యాల, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ఎండపల్లి(Endapalli)
నల్లమల్లలో చెక్ పోస్టులు ఏర్పాటు..
నల్లమల్లలో చెక్ పోస్టులు ఏర్పాటు.. కర్నూలు / నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ :
ముగిసిన మూడో రోజు ఆట.. విండీస్ ఎంత వెనుకంజలో ఉందంటే..
న్యూఢిల్లీ: రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత భారత్ 518/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తొలి ఇన్నింగ్స్లో భారత స్పిన్నర్లు కుల్దీప్ (5 వికెట్లు), జడేజా (3 వికెట్లు) చెలరేగిపోవడంతో వెస్టిండీస్ 248 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వెస్టిండీస్ 270 పరుగులు వెనుకంజలో ఉండి ఫాలోఆన్ నుంచి తప్పించుకోలేకపోయింది. అయితే రెండో ఇన్నింగ్స్లోనూ వెస్టిండీస్ 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ చంద్రపాల్ (20) సిరాజ్ బౌలింగ్లో, అలిక్ అతాంజే (7) సుందర్ బౌలింగ్లో పెవిలియన్ చేరారు. దీంతో మూడో రోజే విండీస్ ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. కానీ, ఓపెనర్ జాన్ క్యాంప్బెల్, షాయ్ హోలు కలిసి వీరోచితంగా పోరాడారు. వికెట్ కాపాడుకుంటూ స్కోర్ని పెంచుతూ బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో ఇరువురు అర్థ శతకాలు సాధించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 49 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్లో క్యాంప్బెల్ (87), హోప్ (66) ఉన్నారు.
సరస్సులో అద్భుత దృశ్యం #odishanews #tornado #river #viralvideo #latestnews #telugupost
కిమ్ చేతిలో బ్రహ్మాస్త్రం! #KimJongUn #Hasang20 #MilitaryParade #DefenseNews #telugupost #viralvideo
ఆసీస్తో మ్యాచ్: అరుదైన రికార్డులు సాధించిన స్మృతి..
విశాఖ: ఐసిసి మహిళ వన్డే ప్రపంచకప్లో భాగంగా విశాఖలోని ఎసిఐ-విడిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో టీం ఇండియా తలపడుతోంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధన, ప్రతీక రావల్లు శుభారంభం అందించారు. తొలి వికెట్కి 155 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇరువురు ఓపెనర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. అంతేకాక.. స్మృతి ఈ మ్యాచ్లో వన్డేల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని కూడా చేరుకుంది. అంతేకాక.. ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి మహిళ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కింది. అయితే సోఫీ మోలినెక్స్ వేసిన 24వ ఓవర్ మూడో బంతికి స్మృతి (80) క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగింది. దీంతో 29 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 183 పరుగులు చేసింది. క్రీజ్లో ప్రతీక (73), హర్లిన్ (14) ఉన్నారు.
Panchumarthi Anuradha Hits Back at Roja Over Spurious Liquor Row
The spurious liquor scandal in Mulakalacheruvu, Annamayya district, continues to create tremors across Andhra Pradesh. With the government arresting even leaders from the ruling alliance, the YSR Congress Party (YSRCP) has seized the moment to demand a CBI inquiry. Former minister and YSRCP leader RK Roja held a press meet urging the Centre to intervene, […] The post Panchumarthi Anuradha Hits Back at Roja Over Spurious Liquor Row appeared first on Telugu360 .
హన్మకొండలో భారీ వరి కొనుగోలు మోసం – 12 మంది పేర్లపై ₹1.8 కోట్లు
పంట వేయకుండానే రైతుల ఖాతాల్లో ప్రభుత్వ సొమ్ము
Makers Confident, Can Dude Turn The Hype Into BO Hit?
Good promotional content is essential for any film to capture attention, and the makers of Dude, starring Pradeep Ranganathan, are doing just that. Bankrolled by the Pan-India production house Mythri Movie Makers, Dude marks the directorial debut of Keerthiswaran and has already generated buzz thanks to its chartbuster music. The theatrical trailer, released few days […] The post Makers Confident, Can Dude Turn The Hype Into BO Hit? appeared first on Telugu360 .
రహదారిని శాశ్వతంగా సరి చేయాలి
రహదారిని శాశ్వతంగా సరి చేయాలి ఎండపల్లి, ఆంధ్రప్రభ : మండలం కొత్తపేట(Kothapet) గ్రామ
ప్రతి దానికి ఇంకా కెసిఆర్ నే నిందిస్తున్నారు: కెటిఆర్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఓడిస్తే కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి వస్తుందని, ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లవుతున్నా ప్రతిదానికి ఇంకా మాజీ సిఎం కెసిఆర్ నే నిందిస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలుపై రేవంత్ రెడ్డిని అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక ఏం చేశారు అంటే.. గరీబ్ వాళ్ల ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడికి బుల్డోజర్ మాత్రం పంపించారని, హైడ్రా అని కొత్త దుకాణం పెట్టి ఉన్న ఇల్లు కూలగొడుతున్నారని ఎద్దేవా చేశారు. మీకు కారు కావాలి అంటే బిఆర్ఎస్ గెలవాలని, గోపీనాథ్ భార్య సునీత గెలవాలని కోరుకోండని అన్నారు. మీ ఇంటికి బుల్డోజర్ రావాలి అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని కెటిఆర్ దుయ్యబట్టారు.
రాజన్న ఆలయ అభివృద్ధి వేములవాడ, ఆంధ్రప్రభ : భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు అనుగుణంగా
గాల్లోనే అదుపు తప్పి కుప్పకూలిన హెలికాఫ్టర్
ఆమెరికా: దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ బీచ్ సమీపంలో హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. అందరూ చూస్తుండగానే హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. అప్పటివరకూ సాధారణంగా ప్రయాణించిన హెలికాఫ్టర్.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి అదుపు తప్పింది. కాసేపటికే అక్కడ ఉన్న చెట్లలో కూలిపోయింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్లో ఉన్న ఇద్దరికి, నేలపై ఉన్న మరో ముగ్గరికి గాయలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
విశాఖ తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కు శంకుస్థాపన..
ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో : విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలివచ్చింది.
Andhra Prabha Smart Edition |డేటింగ్ చీటింగ్/ డిజిటల్ గేట్వే/చేయూతలో భాస్కరుడు
*ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 12-10-2025, 4.00PM* *డేటింగ్ చీటింగ్.. మత్తు వలలో
Nara Lokesh Sets Ambitious Vision to Transform Visakhapatnam into India’s Next Tech Powerhouse
Andhra Pradesh IT Minister Nara Lokesh has set an ambitious goal to create five lakh IT jobs in Visakhapatnam, and his latest initiatives are paving the way for that vision. On Friday, Lokesh laid the foundation stone for the city’s first AI-powered Edge Data Centre and an Open Cable Landing Station, marking a major milestone […] The post Nara Lokesh Sets Ambitious Vision to Transform Visakhapatnam into India’s Next Tech Powerhouse appeared first on Telugu360 .
ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం #weatherupdate #andhrapradesh #rainalert #telugupost #chittoor
మాజీ సీఎం కుండకు.. కూటమి ఎసరు మూడు కంపెనీలకు సున్నంలీజుల రద్దుకు ప్లాన్
విధుల్లో నిర్లక్ష్యం.. చెట్ల అక్రమ నరికివేత
జన్నారం, ఆంధ్రప్రభ : విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగంపై ఇద్దరు అటవీ అధికారులను
మరణించిన వ్యక్తి కూతురి వివాహానికి..
మరణించిన వ్యక్తి కూతురి వివాహానికి.. నంద్యాల బ్యూరో అక్టోబర్ 12 ఆంధ్రప్రభ :
గూగుల్ మ్యాప్స్ కు పోటీగా స్వదేశీ యాప్..#ashwinivaishnav #googlemaps #telugupost #latestnews
శ్రీశైలంలో ఒక గేటు ఎత్తిన అధికారులు
శ్రీశైలంలో ఒక గేటు ఎత్తిన అధికారులు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద