Farmers |‘రైతన్నా మీ కోసం’కరపత్రాల పంపిణీ
Farmers | గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు మండలంలో గురువారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో
గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్: 2015 గ్రూప్ -2 ర్యాంకర్లకు ఊరట లభించింది. గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. 2019లో చేపట్టిన గ్రూప్-2 నియామకాలను సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. 2019 గ్రూప్-2 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను టిజిపిఎస్సి ఆశ్రయించింది. ఈ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేయడంతో పాటు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. వైటనర్ వినియోగం, దిద్దుబాట్ల ఉన్న పార్ట్ బి జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయడం చెల్లదని 2019లో హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారుసులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం టిజిపిఎస్సికి లేదని వెల్లడించింది. ఆన్సర్ సీట్లలో ట్యాంపరింగ్ జరిగిందనడం, వాటిని పక్కన పెట్టడం కమిషన్ వైఫల్యమేనని తప్పుబట్టింది. 2019 అక్టోబర్ 24న ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్టవిరుద్ధమని వాటిన రద్దు చేస్తామని హైకోర్టు తెలిపిన విషయం విధితమే. సాంకేతికమిటీ సిఫారసుల మేరకు హైకోర్టు గత తీర్పుకు తగ్గట్టుగా తిరిగి మూల్యాంకనం నిర్వహించడంతో పాటు అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని సూచనలు చేసింది. ఈ తీర్పుపై టిజిపిఎస్సి డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా కోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ ఇప్పుడు తీర్పునిచ్చింది.
Telangana : సర్పంచ్ పదవి పోటీకి పదమూడు కీలకమైన విషయాలివే
తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు వచ్చే నెల 11వ తేదీన జరగనున్నాయి
Telangana |డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
Telangana | డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ
Motorists |శిథిలావస్థలో వంతెన..
Motorists | శిథిలావస్థలో వంతెన.. భయాందోళనలో వాహనదారులు, ప్రజలు నాగాయలంక, ఆంధ్రప్రభ :
వాళ్లకి ఆధార్ కార్డు ఉంటే ఇక ఓటు హక్కు ఇచ్చినట్టేనా?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
చొరబాటుదారులకు ఆధార్ కార్డులు జారీ కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి కూడా ఆధార్ కార్డులు అందుతున్నాయని, అలాంటప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వారికి ఓటు హక్కు కూడా కల్పించాలా? అని సుప్రీంకోర్టు కీలక ప్రశ్న లేవనెత్తింది. ఆధార్ కార్డు కేవలం సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడానికి మాత్రమేనని, దానిని పౌరసత్వానికి లేదా ఓటు హక్కుకు రుజువుగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల […] The post వాళ్లకి ఆధార్ కార్డు ఉంటే ఇక ఓటు హక్కు ఇచ్చినట్టేనా?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు appeared first on Visalaandhra .
Bigg Boss 9 : చివరి వారం కెప్టెన్ ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు చివరి ఘట్టానికి చేరుకుంది
Congress |అవకాశమిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా !
Congress | అవకాశమిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా ! కాంగ్రెస్ పార్టీ లింబూర్
విద్యార్థినిలతో అసభ్యప్రవర్తన.... లెక్చరర్ను చితక బాదిన తల్లిదండ్రులు
అమరావతి: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన పంతులు, దారి తప్పాడు. విద్యార్థులు పక్కటి దారి పడితే సరైన దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడు. కామ బుద్ధిని బయటపెట్టాడు. విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని తల్లిదండ్రులు చితకబాదారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగులుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ కాలేజీలో బక్కవంతుల వినయ్ లెక్చరర్గా పని చేస్తున్నారు. పలుమార్లు అతడు విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినిలు తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో వారు కాలేజీలో వినయ్ను చితకబాదారు. అనంతరం డిఇఒకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అతడు బిసి సంఘాల నాయకుడిగా పని చేసినట్టు సమాచారం. వినయ్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Applications |దరఖాస్తులకు ఆహ్వానం..
Applications |ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో అంగన్వాడీ కార్యకర్త, మినీ
గుడివాడ, ఆంధ్రప్రభ : ఘంటసాల మండలం డాలిపర్రు గ్రామానికి చెందిన తెనాలి ఝాన్సీ
Ootkur |భక్తి మార్గంలో నడవాలి..
Ootkur | భక్తి మార్గంలో నడవాలి.. Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Machilipatnam |ప్రజల చిరకాల కోరిక
Machilipatnam | ప్రజల చిరకాల కోరిక ఆరు నెలల్లో గుడివాడ ఆర్ఓబి నిర్మాణం
AP |స్వచ్ఛ రథం ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ
AP | గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ : గుడ్లవల్లేరు మండలం ఉలవలపూడి గ్రామంలో స్వచ్ఛ
ఇండోనేషియాలో భూకంపం... వరదలతో విలవిల
సుమత్రా: ఇండోనేషియా దేశం సుమత్రా ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేటుపై 6.3 నమోదైందని భూపరిశోధన విభాగం ప్రకటించింది. అసెక్ ప్రావెన్స్ లో పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు పొటెత్తాయి. నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో 17 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
హసీనా అప్పగింతపై భారత్ కీలక ప్రకటన.. అభ్యర్థన పరిశీలనలో ఉందన్న ప్రభుత్వం
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్ను కోరిన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం చేసిన అభ్యర్థన అందిందని, దానిని పరిశీలిస్తున్నామని భారత్ బుధవారం అధికారికంగా వెల్లడించింది. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు, ఆ దేశంలో శాంతి, ప్రజాస్వామ్య స్థాపనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. గతేడాది విద్యార్థుల నేతృత్వంలో జరిగిన నిరసనలను అణచివేసినందుకు గానూ ామానవతా వ్యతిరేక నేరాల్ణ కింద ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ ఇటీవల […] The post హసీనా అప్పగింతపై భారత్ కీలక ప్రకటన.. అభ్యర్థన పరిశీలనలో ఉందన్న ప్రభుత్వం appeared first on Visalaandhra .
Breaking : ఏపీ మండలి ఛైర్మన్ కు నాలుగు వారాల గడువు
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది
డెంగీకి సింగిల్ డోస్ వ్యాక్సిన్.. !
బ్రెజిల్లో బుటాంటన్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ డెంగీ నివారణలో ప్రపంచం ఒక చారిత్రక ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలి సింగిల్ డోస్ డెంగీ వ్యాక్సిన్కు బ్రెజిల్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.సావో పాలోలోని ప్రఖ్యాత బుటాంటన్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఃబుటాంటన్-డీవీః అనే ఈ వ్యాక్సిన్ను 12 నుంచి 59 ఏళ్ల వయసు వారికి అందించనున్నారు. […] The post డెంగీకి సింగిల్ డోస్ వ్యాక్సిన్.. ! appeared first on Visalaandhra .
Breaking : గ్రూప్ 2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట
2019 గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది
గౌతమ్ గంభీర్ పై బిసిసిఐ కీలక ప్రకటన..
ముంబయి: సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో భారత జట్టు వైట్ వాష్కు గురికావడంతో కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ల్లో భారత జట్టు వైట్ వాష్కు గురికావడంతో హెడ్ కోచ్ను పదవి నుంచి గంభీర్ ను తొలగించాలని క్రికెట్ అభిమానులు, క్రికెట్ పండితులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రెండో టెస్టులో ఓటమి తరువాత బర్సపారా క్రికెట్ స్టేడియంలో గౌతమ్ గంభీర్ ను కోచ్ పదవి నుంచి తొలగించాలని క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గంభీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహమ్మద్ సిరాజ్తో పాటు సహాయ సిబ్బంది వారిస్తున్న అభిమానులు ఆగలేదు. గంభీర్ హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రెస్ మీట్లో కూడా బిసిసిఐదే తుది నిర్ణయమని గంభీర్ చెప్పిన విషయం తెలిసిందే. గంభీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని బిసిసిఐ సీనియర్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. జట్టులో పెద్ద ఎత్తున మార్పుల చేయాలని బోర్డు భావిస్తోందన్నారు. జుట్టు కూర్పు సరిగా లేదని, టి20ల ఆధారంగా జట్టులోకి ఆటగాళ్లను తీసుకోవద్దని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Vikarabad |పదోన్నతుల పరీక్షలను పరిశీలించిన ఎస్పీ
Vikarabad | పదోన్నతుల పరీక్షలను పరిశీలించిన ఎస్పీ Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ
పదవుల పోరులో రైతులకు దిక్కెవరు?
కర్ణాటకలో ప్రజా సమస్యల పరిష్కారం కన్నా పదవుల కోసం ఆరాటమే ప్రధానంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు ఆగడం లేదు. ఒకపక్క ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మరోవైపు డిప్యూటీ సిఎం డికె శివకుమార్ మధ్య అధికార పంపిణీ ఫార్ములాపై గందరగోళం నెలకొంటోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా డికె శివకుమార్ను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాజకీయ సంక్షోభం ఎలా ఉన్నా రాష్ట్రంలోని ఎన్నో సమస్యలు ఎక్కడవేసినగొంగళి అక్కడే అన్నట్టు ఉంటున్నాయి. ముఖ్యంగా మొక్కజొన్నకు కనీస మద్దతు ధర కల్పనలో రైతుల డిమాండ్ ఇప్పుడు తీవ్ర సమస్యగా ఉంటోంది. ఈ విషయంలో విపక్షం బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప కేంద్ర అధిష్ఠానంతో ఈ సమస్యల పరిష్కారానికి చర్చించేందుకు ధైర్యం వహించడం లేదు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ. 3000 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉత్తర కర్ణాటకలోని గడగ్ జిల్లా రైతులు గత పదిరోజులుగా నిరవధిక దీక్ష సాగిస్తున్నారు. పొరుగు జిల్లాల రైతులు కూడా వీరికి మద్దతుగా దీక్షలు ప్రారంభించారు. కర్ణాటకలో ఇదివరకు క్వింటాలు మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ. 1600 నుంచి రూ. 1800 వరకు ఉండగా కేంద్ర ప్రభుత్వం రూ. 2400 వరకు కనీస మద్దతు ధరను నిర్ణయించింది. సెప్టెంబరు నుంచి ఈ ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమై గత పదిహేను రోజుల్లో అకస్మాత్తుగా మరింత తగ్గిపోయాయి. వరదలవల్ల దెబ్బతిన్న పంటల నుండి ఇప్పుడిప్పుడే రాష్ట్రం తేరుకొంటున్న పరిస్థితుల్లో మొక్కజొన్న రైతుల నిరసన ప్రారంభం అయింది. చెరకు పంటకు టన్ను ఒక్కింటికి న్యాయమైన, లాభదాయకమైన ధర రూ. 3500 వంతున చెల్లించాలని చెరకు రైతులు దీక్షలు చేపట్టిన తరువాత మొక్కజొన్న రైతుల దీక్షలు ప్రారంభమయ్యాయి. చెరకు టన్నుకు రూ. 3300 వంతున చెల్లిస్తామని కర్ణాటక ప్రభుత్వం ఇటీవలనే చెరకు రైతులను ఒప్పించగలిగింది. త్వరలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో విపక్షం బిజెపి ఈ రైతుల నిరసనలను ఒక అవకాశంగా చేసుకుని అధికార పార్టీ ప్రధాన స్వభావం రైతులకు వ్యతిరేకం అని చిత్రించడానికి సిద్ధంగా ఉంది. మొక్కజొన్న, చెరకు రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వమే చొరవతీసుకోవాలని అధికార పార్టీ కాంగ్రెస్ వాదిస్తోంది. కేంద్రంలో తమ పార్టీ నాయకుల వద్ద ఈ అంశాన్ని లేవనెత్తడానికి విపక్ష బిజెపి ఎంపిలకు ధైర్యం లేదని కాంగ్రెస్ ఎగతాళి చేస్తోంది. మొక్కజొన్న, పెసలు ధరలు పతనమవుతున్నందున వీటి ప్రొక్యూర్మెంట్ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య గత వారం లేఖ రాశారు. ధర మద్దతు స్కీమ్ లేదా మరో అనువైన వ్యవస్ధ ద్వారా తక్షణం ప్రొక్యూర్మెంట్ను ప్రారంభించేలా నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(నాఫెడ్), నేషనల్ కో ఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సిసిఎఫ్) లను ప్రధాని మోడీ ఆదేశించాలని కోరారు. విదేశాల నుంచి ఈ పంటల దిగుమతులు పెంచడం కూడా ఈ సంక్షోభానికి కారణంగా ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య వాదిస్తున్నారు. దీనికి స్పందనగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహారప్రజా పంపిణీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన లాబీ బంతిని రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకే విసిరారు. కనీస మద్దతు ధర లేదా లాభదాయక, న్యాయమైన ధరల కల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. దిగుమతులే ఈ సంక్షోభానికి కారణమన్న సిద్ధరామయ్య వాదనను తోసిపుచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 0.5 లక్షల మెట్రిక్ టన్నులే దిగుమతులు అయ్యాయని సమాధానం ఇచ్చారు. కేంద్ర, రాష్ట్రాల రాజకీయ నిందారోపణల డ్రామా ఫలితంగా రైతుల ప్రధాన సమస్యలు పరిష్కారం కాకుండా మరుగున పడిపోతున్నాయి. కర్ణాటకలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది సరఫరా డిమాండ్ మధ్య వ్యత్యాసం, ప్రపంచ తృణధాన్యాల ధరల అస్థిరత, తదితర అనేక కారణాల వల్ల ధరలు బాగా దిగజారాయి. ఈథనాల్ బ్లెండింగ్ ఫలితాలు కూడా అనుకున్న విధంగా రాలేదు. ఫలితంగా మొక్కజొన్న మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. 2025 ఖరీఫ్ సీజన్లో కర్ణాటకలో 55 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి కాగా, 32 లక్షల టన్నుల వరకు మార్కెట్ చేయగల అత్యధిక మిగులు స్థాయిలో మొక్కజొన్న ఉంది. ఇది స్థానిక పరిశ్రమల శోషణ సామర్థాన్ని మించి పోయింది. అంటే స్థానిక పరిశ్రమల అవసరాలకు మించి ఉంది. ఇదివరకటి సంవత్సర ప్రొక్యూర్మెంట్తో డిస్టిలరీల్లో ప్రస్తుతం ఉన్న అదనపు నిల్వలతో ఇప్పుడు ఈ పంటను తీసుకోవడం చాలా సమస్యగా తయారైంది. ఈ సంక్షోభంలో కనీస మద్దతు ధర కింద రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట ప్రొక్యూర్మెంట్ చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సానుకూలంగా హామీ ఇచ్చినప్పటికీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ లేదు. ఇథనాల్ ఉత్పత్తికి మొక్కజొన్న వినియోగించేందుకు నాఫెడ్, ఎన్సిసిఎఫ్లతో ఒప్పందం కుదుర్చుకోవాలని రాష్ట్రం లోని డిస్టిలరీలకు ఆయన లిఖిత పూర్వకంగా సూచించినా, ఇంకా పనులు జరగడం లేదు. కర్ణాటకలో ముఖ్యంగా సెంట్రల్, ఉత్తరాది జిల్లాల్లో అత్యధికంగా మొక్కజొన్నను పండించిన రైతులు తమ సమస్యల పరిష్కారానికి సుదీర్ఘ ప్రణాళికతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ డిమాండ్ అధికార, విపక్ష నాయకుల నిర్వాకంతో నెరవేరే అవకాశం కనిపించడం లేదు.
Ajay Bhupathi’s SM Title Poster: Timeless Cult
Jaya Krishna, grandson of Superstar Krishna and son of the late Ramesh Babu, is venturing into films. Ajay Bhupathi, known for his intense storytelling in RX 100 and Mangalavaaram, is directing, while Aswini Dutt’s Vyjayanthi Movies present the movie and P Kiran’s Chandamama Kathalu produce it. Srinivasa Mangapuram is the title finalised, carrying a graceful […] The post Ajay Bhupathi’s SM Title Poster: Timeless Cult appeared first on Telugu360 .
AP | బాలుడు కిడ్నాప్.. హత్య? మేనమామే నిందితుడుతలుపులలో సంఘటన AP |
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు #TeluguPost #telugu #post #news
Aditya 999 |క్రిష్.. తప్పుకున్నాడా..?
Aditya 999 | క్రిష్.. తప్పుకున్నాడా..? Aditya 999, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
ఇబ్సా కూటమి ఏర్పాటు.. ఐక్యత దిశగా ముందడుగు
ప్రపంచ రాజకీయాల్లో దక్షిణాఫ్రికా జోహన్నెస్బర్గ్ సమ్మిట్ ఒక కొత్త మలుపని చెప్పాలి. ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధినేతలు కలిసి ఐబిఎస్ఎ ఇబ్సా (ఇండియా, -బ్రెజిల్-, సౌత్ ఆఫ్రికా) సదస్సు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా పాల్గొన్నారు. ఈ సమ్మిట్ గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతకు చిహ్నంగా మారింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలు అత్యవసరమని మోడీ స్పష్టం చేశారు. ఇది ఐచ్ఛికం కాదు. ఇది ఆవశ్యకత అని ఆయన ఒత్తిడి చేశారు. ప్రపంచంలో విభజనలు, అడ్డుగోడలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో ఐబిఎస్ఎ ఐక్యత మానవతా విలువలను ప్రదర్శిస్తుంది. ఈ మూడు దేశాల మధ్య సహకారం మరింత బలపడాలని మోడీ పిలుపునిచ్చారు. జాతీయ భద్రతా సలహాదారుల సమ్మిట్ను నిర్వహించాలని ప్రతిపాదించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ద్వంద్వ ప్రమాణాలు లేవని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ సమ్మిట్ గ్లోబల్ గవర్నెన్స్లో మార్పులకు మార్గం సుగమం చేస్తున్నది. ఈ సమ్మిట్లో టెక్నాలజీ పాత్రపై చర్చ ఆకర్షణీయంగా ఉంది. మానవ కేంద్రిత అభివృద్ధిలో టెక్నాలజీ కీలకమని మోడీ చెప్పారు. భారతదేశంలోని యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), కోవిన్ వంటి ఆరోగ్య ప్లాట్ఫారమ్లు ఉదాహరణలుగా పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ, మహిళల సాధికారతలో టెక్నాలజీ కార్యక్రమాలు పంచుకోవాలని ఆయన సూచించారు. ‘ఐబిఎస్ఎ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్’ ఏర్పాటుకు పిలుపునిచ్చారు. ఇది మూడు దేశాల్లోని 40కి పైగా దేశాలకు విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, సోలార్ ఎనర్జీ వంటి కార్యక్రమాలకు నిధులు అందిస్తుంది. ఐబిఎస్ఎ ఇప్పటికే ఈ రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. ఉదాహరణకు, ఐబిఎస్ఎ ఫండ్ ద్వారా 2023 నుండి 2025 వరకు 15 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. ఇవి వాతావరణ మార్పులు, పంటల దిగుబడి, తృణధాన్యాలు, ప్రకృతి వ్యవసాయం వంటి రంగాల్లో ఉపయోగపడ్డాయి. విపత్తు నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ, సంప్రదాయ ఔషధాలు, ఆరోగ్య భద్రతలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని మోడీ చెప్పారు. ప్రత్యేక నిధి ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ చర్చలు గ్లోబల్ సౌత్కు మార్గదర్శకాలుగా మారతాయి. జి-20 (గ్రూప్ ఆఫ్ ట్వంటీ) సందర్భంగా మోడీ, రమఫోసా సమావేశం మరింత ప్రాముఖ్యత పొందింది. వ్యాపారం, వాణిజ్యం, మైనింగ్, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, ఆహార భద్రతపై విస్తృత చర్చ జరిగింది. భారత్- దక్షిణాఫ్రికా సంబంధాల పురోగతిని సమీక్షించారు. జి-20 సారథ్యంలో దక్షిణాఫ్రికాకు మోడీ అభినందనలు తెలిపారు. రమఫోసా మాటల్లో భారత్ ఆతిథ్యాన్ని చూసి నేర్చుకున్నామని చెప్పారు. ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిగాయి. దక్షిణాఫ్రికా జి-20 సారథ్యానికి భారత మద్దతుకు రమఫోసా కృతజ్ఞతలు చెప్పారు. ఈ బైలాటరల్ డైలాగ్లు ఐబిఎస్ఎని మరింత బలపరుస్తాయి. మోడీ ఆదివారం కెనడా ప్రధాని, జపాన్ ప్రధాని, ఇటలీ ప్రధాని, జమైకా, నెదర్లాండ్స్ అధినేతలతో సమావేశాలు జరిగాయి. వ్యాపారం, పెట్టుబడులు, కీలక రంగాల్లో సహకారంపై చర్చించారు. ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్) ఎండి (మేనేజింగ్ డైరెక్టర్) క్రిస్టలీనా జార్జివాతో కూడా భేటీ అయ్యారు. ఈ సమావేశాలు ఐబిఎస్ఎని గ్లోబల్ ప్లాట్ఫారంగా మార్చాయి. భారత మీడియాలో ఈ సమ్మిట్ కు స్వాగతం పలికాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్లో మోడీ ప్రతిపాదనలు ప్రశంసలు అందుకున్నాయి. యుఎన్ఎస్సి (యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్) సంస్కరణలు అత్యవసరమని మోడీ చెప్పిన మాటలు హైలైట్ అయ్యాయి. టెక్నాలజీ అలయన్స్, ఉగ్రవాద వ్యతిరేక ఐక్యతపై ఫోకస్ చేశాయి. దక్షిణాఫ్రికా మీడియాలో మోడీకి ప్రశంసల వర్షం కురిసింది. ఐఒఎల్ న్యూస్, గల్లీ న్యూస్లో ఆయన ఆతిథ్యం, సహకార ఆలోచనలు పాజిటివ్గా చిత్రీకరించబడ్డాయి. సోషల్ మీడియాలో సౌత్ ఆఫ్రికన్లు మోడీని ‘ఇంప్రెస్’ అని పోస్ట్ చేశారు. బ్రెజిల్ మీడియా, జీ న్యూస్లో లూలా,- మోడీ సమావేశం ప్రశంసించబడింది. అంతర్జాతీయంగా, బ్లూంబర్గ్, చాతమ్ హౌస్లో ఐబిఎస్ఎని గ్లోబల్ సౌత్ ఐక్యతగా చూశారు. బిఆర్ఐసిఎస్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) విస్తరణతో పోల్చి, ఐబిఎస్ఎని మరింత డెమొక్రాటిక్గా అభివర్ణించారు. యూ ట్యూబ్ చానెళ్ళు, డబ్ల్యూఐఒఎన్, జీ న్యూస్లో మోడీ మాటలు వైరల్ అయ్యాయి. ఈ ప్రతిస్పందనలు సమ్మిట్ ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే, కొన్ని మీడియా సంస్థలు విమర్శలు కూడా చేశాయి. బెల్ఫర్ సెంటర్లో దక్షిణాఫ్రికా ప్రభావం పెరగడం పట్ల ఆందోళన వ్యక్తమైంది. జి20లో యుఎస్ (యునైటెడ్ స్టేట్స్) ఆపోజిషన్తో సమ్మిట్ బలహీనపడిందని చాతమ్ హౌస్ వ్యాఖ్యానించింది. ఈ విమర్శలు గ్లోబల్ కాంపిటీషన్ను హైలైట్ చేస్తాయి. ఈ సమ్మిట్కు అమెరికా నుండి మిశ్రమ స్పందన వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి రెండోసారి వచ్చిన తర్వాత, యుఎస్ టారిఫ్ పాలసీలు ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాను దగ్గర చేశాయి. బ్లూంబర్గ్ ప్రకారం ట్రంప్ ఆటాక్స్ ఐబిఎస్ఎని ఎకనామిక్ ఇంటిగ్రేషన్ వైపు మళ్ళించాయి. ట్రంప్ యుఎన్ఎస్సి సంస్కరణలపై స్పష్టమైన అభ్యంతరాలు చెప్పలేదు. కానీ, అతని పాలసీలు గ్లోబల్ సౌత్కు వ్యతిరేకంగా ఉన్నాయి. జీ-20 జోహన్నెస్బర్గ్ సమ్మిట్ను యుఎస్ బాయ్కాట్ చేసింది. ఈ చర్య ఆఫ్రికా ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. యూట్యూబ్ వీడియోల్లో బిఆర్ఐసిఎస్ మెంబర్ విజయ్ సర్దానా ట్రంప్ను విమర్శించారు. యుఎస్ బాయ్కాట్ను ‘అరొగెన్స్’ అని వ్యాఖ్యానించారు. అయితే, యుఎస్ యుఎన్ఎస్సి రిఫారమ్స్కు తన మద్దతు ఇస్తోంది. యుఎస్ మిషన్ ప్రకారం, ఆఫ్రికాకు రెండు పర్మనెంట్ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందుకు 54 ఆఫ్రికన్ దేశాలు మద్దతు ఇస్తున్నాయి. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో యుఎస్, చైనా, రష్యా గ్లోబల్ సౌత్కు పోటీ పడుతున్నాయని చెప్పారు. విల్సన్ సెంటర్లో యుఎస్ ప్రతిపాదనలు వీటో పవర్ లేకుండా ఉన్నాయని విమర్శించారు. ఇది అసమానత్వాన్ని కొనసాగిస్తుందనే అభిప్రాయం వెల్లడైంది. ట్రంప్ హయాంలో యుఎస్ మల్టీలాటరలిజ్ను వదులుకుంటోంది. ఐబిఎస్ఎ సమ్మిట్లో ఉగ్రవాద వ్యతిరేక ఐక్యతకు యుఎస్ మద్దతు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే, ట్రంప్ టెర్రర్ పాలసీలు ద్వంద్వ వైఖరిని కలిగి ఉన్నాయి. ఇండియా పై టారిఫ్లు, దక్షిణాఫ్రికా మైనింగ్పై రిబ్యూక్లు ఐబిఎస్ఎని మరింత బలపరుస్తున్నాయి. ఈ అభిప్రాయాలు సమ్మిట్ను విమర్శనాత్మకంగా చూస్తున్నాయి. యుఎస్ గ్లోబల్ ఆర్డర్ను మార్చాలంటే ఐబిఎస్ఎ వంటి ఫోరమ్లు అవసరమని అంగీకరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఐబిఎస్ఎ సమ్మిట్ గ్లోబల్ చాలెంజెస్కు సమాధానాలు సూచిస్తుంది. వాతావరణ మార్పులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మంచి అడుగు. సిఒపి 28 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28)లో ట్రిపుల్ అడాప్టేషన్ ఫైనాన్స్ కమిట్మెంట్లా ఇది ప్రభావవంతమవుతుంది. డిజిటల్ అలయన్స్ భారత యుపీఐ వంటి మోడల్స్ను బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు విస్తరిస్తుంది. 2025 నాటికి 40 దేశాల్లో 20 మిలియన్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఉగ్రవాదంపై ద్వంద్వాలు లేకుండా ఐక్యత అవసరం. మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో టెర్రర్ దాడులు 2024లో 30 శాతానికి పెరిగాయి. ఐబిఎస్ఎ ఈ విషయంలో లీడ్ చేయాలి. యుఎన్ఎస్సి సంస్కరణలు ఆలస్యమవుతుంటే, గ్లోబల్ పీస్ ప్రభావితమవుతుంది. 193 యుఎన్ (యునైటెడ్ నేషన్స్) మెంబర్ దేశాల్లో 54 ఆఫ్రికన్ దేశాలు రిఫారమ్స్కు తమ మద్దతును తెలిపాయి. ఇండియా, బ్రెజిల్ స్థిరపడిన సీట్లకు క్లెయిమ్ చేస్తున్నాయి. ఈ సమ్మిట్ జీ-20 ట్రెండ్ను కొనసాగిస్తుంది. భారత జీ20 సారథ్యంలో ఆఫ్రికా యూనియన్ను చేర్చడం ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికా జీ-20లో డెవలపింగ్ ఎకనామీస్ ప్రయారిటీలు ముందుకు తీసుకు వచ్చింది. డిసాస్టర్ రెసిలియెన్స్, డెబ్ట్ సస్టైనబిలిటీ, క్రిటికల్ మినరల్స్పై ఫోకస్ జరిగింది. విమర్శనాత్మకంగా చూస్తే, ఐబిఎస్ఎ ప్రభావం ఇంకా పరిమితమనే చెప్పాలి. బిఆర్ఐసిఎస్ విస్తరణతో (2023లో 6 కొత్త మెంబర్లు) ఐబిఎస్ఎ షాడోలో పడవచ్చు. ట్రిపార్టీట్ ఫండ్ 2004లో 1 మిలియన్ డాలర్లతో మొదలైంది. కానీ, 2025 నాటికి 50 మిలియన్కు తగ్గింది. ఇది ఫైనాన్సింగ్ లోపాలను ఎత్తి చూపిస్తుంది. ఇంకా టెక్నాలజీ అలయన్స్ రూల్స్ క్లియర్ కావాలి. డేటా ప్రైవసీ, సైబర్ థ్రెట్స్పై గ్లోబల్ స్టాండరడ్స్ అవసరం. యుఎస్ బాయ్కాట్తో జీ-20 ఫ్రాగ్మెంటేషన్ పెరిగింది. ట్రంప్ పాలసీలు డెవలపింగ్ వరల్డ్ ఒంటరిని (ఐసోలేట్) చేయాలని చూస్తున్నాయి. ఇది మల్టీలాటరలిజానికి గెలవడం కష్టతరం చేస్తుంది. ఐబిఎస్ఎ ఈ చాలెంజ్లను అధిగమించాలి. మూడు దేశాల్లో జిడిపి (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్) మొత్తం 2025లో 10 ట్రిలియన్ డాలర్లు. ఇది ఇయు (యూరోపియన్ యూనియన్) తో పోటీ పడుతుంది. కానీ, ట్రేడ్ వాల్యూమ్ ఇంకా తక్కువ. 2024లో ఐబిఎస్ఎ ట్రేడ్ 100 బిలియన్ డాలర్లకు చేరలేదు. ఈ లోపాలను వీలున్నంత వరకు భవిష్యత్తులో సరిదిద్దాలి. ట్రంప్ టారిఫ్లు (ఇండియా మీద 25 శాతం) ఐబిఎస్ఎ ని ఆటోమేటిక్గా దగ్గర చేస్తున్నాయి. ఇది పాజిటివ్ ట్విస్ట్ గా మనం చెప్పుకోవాలి. గ్లోబల్ సౌత్లో ఇలాంటి ఫోరమ్లు పెరగాల్సి ఉంది. ఐబిఎస్ఎ సమ్మిట్ ఆశయదాయకంగా జరిగింది. యుఎన్ఎస్సి రిఫార్మ్, టెక్నాలజీ, క్లైమేట్ సహకారాలు భవిష్యత్తుకు ఒక నూతన ఆకృతిని ఇస్తాయి. మొత్తానికి మీడియా ప్రతిస్పందనలు ఐక్యతను హైలైట్ చేశాయి. యుఎస్ అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ట్రంప్ పాలసీలు ఐబిఎస్ఎని మరింత బలపరుస్తున్నాయి. గ్లోబల్ గవర్నెన్స్ లో మరి కొన్ని మార్పుల అవసరం ఉంది. ఐబిఎస్ఎ ఈ మార్పువకు ముందడుగు పడినట్టే. ఈ ఐక్యత ముందు, ముందు ప్రపంచాన్ని మార్చ గలదు. - డా. కోలాహలం రామ్ కిశోర్ - 9849328496
Tippers |ఆరు టిప్పర్లను పట్టుకున్న తహశీల్దార్..
Tippers | ధర్మపురి, ఆంధ్రప్రభ : ధర్మపురి మండలంలోని ఆరేపల్లి గ్రామం నుంచి
Bigg Boss Telugu 9, Day 80: Tasks & Emotional Twists as Ex-Housemates Return
Day 80 in the Bigg Boss Telugu house brought a mix of intense competition, emotional moments and rising tensions. Former contestants Prerana, Harika and Maanas returned to conduct tasks that would decide the next set of captaincy contenders. Their presence lifted the energy of the house but also pushed contestants into pressure situations where one […] The post Bigg Boss Telugu 9, Day 80: Tasks & Emotional Twists as Ex-Housemates Return appeared first on Telugu360 .
అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ.. #telugupost #lorryaccident #latestnews #viralvideo #apnews
AP |సీఎం రమేష్ మాతృమూర్తికి అమిలినేని నివాళి
AP | సీఎం రమేష్ మాతృమూర్తికి అమిలినేని నివాళి AP | అనంతపురం,
ఓటరు అభివృద్ధికి దిక్సూచిగా ఉండాలి
తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు నవంబర్ 25, 2025 న గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి 12,728 గ్రామాలలో నూతన సర్పంచులను ఎన్నుకునేందుకు డిసెంబర్ 11, 13, 17న మూడు విడుతలలో ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ ఎన్నికలో భాగంగా వివిధ గ్రామాలలో జరగబోతున్న పరిణామాలు, వాటి తీరు సగటు మానవున్ని ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పవచ్చు. మిగతా ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికలు ప్రత్యేకం. ఎందుకంటే గ్రామాలలో 500 నుండి 25,000 జనాభాకు 5 నుండి 21 వార్డులుగా విభజింపబడి ఉంటుంది. పంచాయతీ రిజర్వేషన్ ప్రకారం ఇప్పటికే ఆశావహులు ఓటరు జాబితా ముందర పెట్టుకొని ప్రచారం చేసుకుంటూ, తమ ఓట్లను లెక్కబెట్టుకుంటూ తమ గెలుపు కోసం ఏమేమి చేయాలో, ఎలా చేయాలో విశ్లేషణతో ఒక అంచనా వేసుకుంటుంటారు. గ్రామాలలో కొంత మంది ఒక వర్గానికి బహిరంగంగా మద్దతునిస్తూ ప్రచారంలో సైతం పాలుపంచుకుంటారు. ఇలాంటి వాళ్ళతో అభ్యర్థులకు ఎలాంటి అనుమానం లేదు. అయినప్పటికీ అభ్యర్థులు వారికి వివిధ ప్రోత్సాహకాల ఆశజూపో, ఇంకేమైనా అవకాశాలు కల్పించో, రహస్యంగా మంతనాలు జరుపుతూ, తమవైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మరొక వర్గం బరిలోనున్న అందరితో మంచిగా నడుచుకుంటూ ఎవ్వరు వచ్చి ఓటు అడిగిన సరేనని తలఊపుతూ వుంటారు. వీరు ఎవ్వరికి ఓటు వేస్తారో తెలుసుకోలేక అభ్యర్థులు తలలు పట్టుకుంటారనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. వీరిని తమవైపు తిప్పుకోవడానికి బహుమతులను, వివిధ రకాల హామీలిస్తూ, విందు వినోదాలతో ఎక్కువ సమయం గడుపుతుంటారు. అలా గడిపి హమ్మయ్యా! వీరి ఓట్లను సాధించాను అనుకునేలోపే మరుసటి రోజు మరొక అభ్యర్థితో రహస్యంగా ఇలాంటి తంతే జరుగుతుంది. ఒకవేళ తెలిసి ఏం ఇలా జరిగిందని ప్రశ్నిస్తే? నా ఓటు నీకే కానీ! అతను పిలిస్తే వెళ్ళాను, ఏదో అలా వారు చెప్పింది విని వచ్చానని చెప్పడం, అభ్యర్థులు వీళ్ళలాంటి ఓటర్లవల్ల తలలు పట్టుకోని, ఎటూ తేల్చుకోలేక మదనపడుతుంటారనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. ప్రత్యేకంగా గ్రామాలలో ఒక వింత ఆచారం కొనసాగుతుంది. ఓట్లకోసం ప్రమాణాలు చేయించడం, వివిధ దేవుళ్లపై ఒట్లు పెట్టించడం, డబ్బులు పంచడం, మద్యం పంచడం లాంటివి చేస్తుంటారు. ఒక అభ్యర్థి గెలవడానికి పెట్టే మొత్తం ఖర్చులో సగానికిపైగా మద్యం కోసం పెడుతున్నారన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇలాంటి పరిస్థితి కేవలం గ్రామాలల్లో జరుగుతుందని తేలికగా తీసివేయడానికి వీలులేదు. గ్రామాలలో సైతం ఉన్నత చదువులు చదివిన యువత ఉండికూడా ప్రజలలో మార్పును తీసుకరాకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే, అన్నీ విషయాలలో సంపూర్ణ జ్ఞానమున్నవారే ఈ అలవాటుకు కారకులవుతున్నారన్నది ముమ్మాటికీ నిజం. స్వాతంత్య్రానికి ముందు ఎంతోమంది స్వాతంత్య్ర సమర యోధులు ఎన్నో అష్టకష్టాలు పడి, నిస్వార్థంతో, తమ ప్రాణాలను సైతం దేశానికి అంకితంచేసి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టి, అట్టడుగు వర్గాలు, బడుగు, బలహీన వర్గాల వారికీ లబ్ధి చేకూర్చాలని, రాజ్యాంగం రచించి, ప్రతి పౌరుడికీ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఎన్నిక కావడానికి వీలు కల్పిస్తే, ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? పేదవారు ఇంకా బలవంతుల కింద బలహీనులుగానే వుంటున్నారంటే కారణం వారిలో చైతన్యం లేకపోవడమేనా? మద్యానికి, డబ్బులకు ఆశపడితే అభివృద్ధికి మరో ఐదేళ్ళు వేచి చూడాల్సిందే. పాలకులను ధైర్యంగా అడగలేని పరిస్థితి ఏర్పడి, ఎలాంటి అభివృద్ధి ఫలితాన్ని పొందలేని పరిస్థితిని కొని తెచ్చుకున్నట్లు కాదా? నేను నా దేశ ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు. ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో.. అమ్ముకుని బానిసలవుతారో అది వారిచేతుల్లోనే ఉంది అని ఏనాడో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెలవిచ్చారు. అలాగే గుడ్లగూబ పగల చూడలేదు, కాకి రాత్రి చూడలేదు. ఓటును అమ్ముకునే ప్రజలు ప్రగతిని, ప్రజాస్వామ్యాన్ని చూడలేరని అబ్దుల్ కలాం చెప్పారు. ఓటరు అంటే అభివృద్ధికి దిక్సూచి. అది ఎప్పుడు జరుగుతుంది? ఓటరు ఎలాంటి ప్రోత్సాహకాలను ఆశించకుండా, నిష్పక్షపాతంగా ఉంటూ, ఓటు విలువను పలువురికి తెలియజేస్తూ, ప్రోత్సహిస్తూ, అభివృద్ధికి పాటుబడే అభ్యర్థి పక్షాననిలిచి, బలపరుస్తూ విజయంలో కీలకపాత్ర వహించి, గెలుపుకు పాటుబడుతూ ఆ తర్వాత కావల్సిన అభివృద్ధిని చేయించుకోవడానికి, ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరికీ ధైర్యంగా ఉంటుంది. కావున ప్రతిఒక్కరూ ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. - డా. పోలం సైదులు, 9441930361
Achampeta | కమ్మేసిన మంచు ఉదయం 6.26 గంటలకు పట్టణం ముసిగిపోయిన దృశ్యాలు
సిపిఐ (మావోయిస్ట్) తీవ్ర తాత్కాలిక ఎదురుదెబ్బను ఎదుర్కొంటోంది, అలాగే భారత ప్రజలు కూడా. ప్రజలు తమ దైనందిన వర్గ పోరాటంలో తీవ్ర తాత్కాలిక ఎదురు దెబ్బను ఎదుర్కొంటున్నారు. వారు ఆకలితో చనిపోతున్నారు. పాలక వర్గం వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులను సృష్టిస్తోంది. సాధారణ వైరల్ దాడిని కూడా తట్టుకోవడానికి వారికి తగిన ఆరోగ్య సంరక్షణ లేదు. వారు కులం, మతం, మతం, లింగం ఆధారంగా రోజువారీ అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. పెట్టుబడిదారులు, భూస్వాములచే వారికి కనీస వేతనాలు, జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. కశ్మీర్, మణిపూర్, పంజాబ్ వంటి దేశంలోని అణచివేసిన జాతీయతలు భారత రాజ్యం నిరంకుశ విస్తరణ స్వభావానికి వ్యతిరేకంగా నిరంతరం స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తిని కోరుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ దేశం, భారతదేశం కూడా సంక్షోభంలో ఉన్నందున ఆ సంక్షోభం సామ్రాజ్యవాదం, భారత రాజ్యం ప్రాథమిక లక్ష్యం కాబట్టి ఉంది. వాస్తవానికి, సామ్రాజ్యవాద శక్తుల ఏజెంట్లు అయిన భారత పాలక వర్గం ప్రాథమికంగా జాతి వ్యతిరేకమైంది. కొవిడ్ -19 సంక్షోభం నుండి యుఎస్ సామ్రాజ్యవాదం తనను తాను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తోంది. గుత్తాధిపత్య ఆర్థిక మూలధనం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక దోపిడీని లక్ష్యంగా చేసుకుని మైనింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాఫ్ట్వేర్ పరిశ్రమలో పెట్టుబడులు సామ్రాజ్యవాద దోపిడీకి ఉదాహరణలు. ఈ పెట్టుబడులు పరాన్నజీవులు, ప్రజల నీరు, అడవులు, భూమిని దోచుకుంటాయి. అదే సమయంలో స్థానిక తయారీ, వ్యాపారం వృద్ధి చెందకుండా నిరోధిస్తాయి. రాజకీయ, ఆర్థికస్థాయిలో ఎఐ మాయాజాలం, సైనిక స్థాయిలో మానసిక దాడుల పునరుజ్జీవనం (హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుఎస్ సామ్రాజ్యవాదం సులభతరం చేసిన శాంతి చర్చలు సహా) సామ్రాజ్యవాద ఆర్థిక మూలధనం పరాన్నజీవుల స్వభావాన్ని తీవ్రతరం చేయడానికి సహాయపడతాయి. దండకారణ్య లేదా బీహార్ -జార్ఖండ్లో పార్టీ గెరిల్లా స్థావర ప్రాంతాల్లో జరుగుతున్న పూర్తిస్థాయి యుద్ధం, యుఎస్ సామ్రాజ్యవాద శక్తుల పునరుజ్జీవింపబడిన విధానంలో భాగం. ఈ మానసిక దాడిలో భాగంగా సూరజ్ కుండ్ ప్రాజెక్టును యుఎస్, సిఐఎ భారతీయ నిఘా సంస్థలు మావోయిస్టు పార్టీ, విప్లవాత్మక ఉద్యమంలో ద్రోహులను పెంపొందించడానికి ఉపయోగిస్తున్నాయి. దళారీ రాజ్యం దానిని సిద్ధం చేసింది. కానీ అమెరికా సామ్రాజ్యవాదం కార్మికవర్గం నేతృత్వంలోని కమ్యూనిస్టు ఉద్యమం పాలక వర్గశక్తుల నేతృత్వంలోని జాతీయవాద ఉద్యమం నుండి భిన్నమైనదని పదేపదే మరచిపోతోంది. కార్మికవర్గ శక్తి శాస్త్రీయ సోషలిజం సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల దాని రాజకీయ నిబద్ధత నాయకత్వం వహిస్తుంది. దాని విజయం ఖచ్చితంగా ఉంటుంది.మావోయిస్టు పార్టీ సామ్రాజ్యవాదానికి, ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి, దళారీ బ్యూరోక్రాటిక్ బూర్జువా వర్గానికి, భూస్వామ్య వర్గానికి ప్రాతినిధ్యం వహించే నిరంకుశ భారత రాజ్యానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో పార్టీ అనేక ఒడిదుడుకులను చూసింది. దాని ప్రారంభం నుండి చరిత్ర వలయాకారంగా పురోగమించింది. మమ్మల్ని బూడిదగా పరిగణించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ బూడిద నుండి తాము మమ్మల్ని పునర్నిర్మించుకున్నాం.క్షితిజ సమాంతరంగా ఎర్రటి ఉదయపు సూర్యుడిలా ఉదయించాం. మేఘాలు సృష్టించిన అడ్డంకులు ఉన్నప్పటికీ మేము ముందుకు సాగుతున్న కొద్దీ మరింత ప్రకాశవంతంగా పెరుగుతున్నాం. యుద్ధభూమిలో మా గొప్ప సహచరులను కోల్పోయిన బాధను మేము అనుభవిస్తున్నాం. మా పార్టీ లేదా ఆ విషయం కోసం, ఏ దేశంలోనైనా ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా పాలక వర్గం చేతిలో మరణించదు. అది ఎంత నిరంకుశమైనా సరే. కమ్యూనిస్టు పార్టీ పతనానికి ఏకైక కారణం పార్టీలోని రెండు వర్గాల మధ్య పోరాటంలో శ్రామిక వర్గ పంథా బలహీనపడటమే. ఆధునిక రివిజనిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటంలో జన్మించిన పార్టీ బలరాజ్ అలియాస్ బచ్చా ప్రసాద్ సింగ్, దర్శన్ పాల్, అర్జున్ ప్రసాద్ సింగ్, అసిన్ అలియాస్ గగన్ అలియాస్ అనిల్, వేణుగోపాల్ అలియాస్ సోను, రూపేష్, దురహంకార రివిజనిస్ట్ హర్మాన్ గ్రూప్ వంటి దేశద్రోహి కుడి-పక్క అవకాశవాద- విభజన- రివిజనిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడటం ద్వారా సైద్ధాంతికంగా, రాజకీయంగా బలంగా ఉద్భవిస్తుంది. పార్టీలో ఉద్భవించిన ఈ ద్రోహులు మనకు సైద్ధాంతికంగా, రాజకీయంగా, తాత్వికంగా మాత్రమే విద్యను అందించారు. ద్రోహులు రూపొందించిన ప్రజా వ్యతిరేక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే, పార్టీ తన సహచరుల్లో సిపిఐ అవగాహనను బలోపేతం చేసింది. ఈ చర్చలపై మా పార్టీ ప్రచురించిన కథనాలు ప్రపంచ శ్రామిక వర్గ విప్లవానికి చారిత్రాత్మక సహకారం. ఈ సందర్భంలో వేణుగోపాల్ కొత్తగా కనుగొన్న ఆధునిక రివిజనిజాన్ని తిరస్కరించడం, బహిర్గతం చేయడం చాలా అవసరమని ఉత్తర సమన్వయ కమిటీ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా విప్లవకారుల ఊచకోతను నిరసిస్తూ భారత దళారీ పాలక వర్గం దుష్ట ఉద్దేశాలను బయటపెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వారి తదుపరి లక్ష్యం అర్బన్ నక్సల్స్ అని మనందరం గుర్తుంచుకోవాలి. వీరిలో బిజెపి-, ఆర్ఎస్ఎస్ ఆకృతులను నిరంతరం వ్యతిరేకిస్తున్న అన్ని ప్రగతిశీల, ఉదారవాద స్వరాలున్నాయి. ఇప్పుడు ప్రశ్న మావోయిస్టులతో నిలబడటం గురించి మాత్రమే కాదు. హిందూత్వ మనువాద రాజకీయాలను వ్యతిరేకించడం ద్వారా ప్రత్యామ్నాయాన్ని అందించడం గురించి.మావోయిస్టు పార్టీ మాత్రమే బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ ప్రభుత్వానికి బలమైన సైద్ధాంతిక, రాజకీయ, సైనిక వ్యతిరేకతను అందిస్తుంది. భారత రాష్ట్ర లక్షణం ప్రాథమికంగా నిరంకుశమైనదని, ప్రజాస్వామ్య ముఖచిత్రంలో కప్పబడి ఉందని మేము ఎల్లప్పుడూ వాదించాం. ఇప్పుడు పాలక వర్గంలోని ఒక వర్గం కూడా మా వైఖరిని అర్థం చేసుకోవడం ప్రారంభించింది. పాలక వర్గంలోని ఒక వర్గం కూడా ఎన్నికలు ఇకపై అర్థరహితంగా ఉన్నాయని చెబుతున్నాయి. పాలక వర్గంలోని ఒక వర్గంతో సహా మొత్తం దేశం, ప్రస్తుత నిరంకుశ భారత రాష్ట్రం నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించలేమని గ్రహిస్తోంది. మనం ప్రతిపక్షంగా ఒక శక్తిగా ఉన్నామో లేదో స్వయంగా అంచనా వేయమని అన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య వాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దండకారణ్యంలో మా సహచరులు అమరులైనప్పుడు పెద్ద ఎత్తున జనసముద్రం మాతో పాటు ఏడ్చింది. మావోయిస్టు పార్టీ వారి భాష, సంస్కృతిని కాపాడటానికి, అభివృద్ధి చేయడానికి కృషి చేసింది. అత్యంత అధునాతన భావజాలం, మార్క్సిజం-, లెనినిజం, -మావోయిజంతో ప్రజలను సన్నద్ధం చేసింది. అయితే మావోయిస్టు పార్టీలోని కార్యకర్తలు, గిరిజన నేపథ్యాల నుండి వచ్చినవారు డేవిడ్ హార్వే యూరో కేంద్రీకృత దృక్పథాన్ని తిరస్కరించి కామ్రేడ్ మార్క్ రాజధానిని అర్థం చేసుకుని, గిరిజన ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు. ఆర్థికంగా, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేశాం. దీనికి నిదర్శనం జనతా ప్రభుత్వంలో ఎవరూ ఆకలితో చనిపోలేదు. సామాజిక శాస్త్రం, రాజకీయ రంగాల్లో పనిచేస్తున్న చాలా మంది పండితులు మా విజయాలను అంగీకరించారు. గిరిజనులు వాస్తవానికి ఎలాంటి అభివృద్ధి నమూనాను కోరుకుంటున్నారో స్వయంగా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గిరిజన ప్రజలు సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను తిరస్కరించారని, వారి ఆదర్శ అమరవీరుడు కామ్రేడ్ హిడ్మా జనతా సర్కార్ అభివృద్ధి నమూనాకు కట్టుబడి ఉన్నారని తెలుసుకోవాలి. అయితే మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి అమెరికా సామ్రాజ్యవాదం మద్దతుతో భారత రాష్ట్రం అనుసరిస్తున్న హత్యా విధానాలు మారణహోమం అన్ని పరిమితులను దాటాయి. మారణహోమంపై మౌనం దానిని మద్దతు ఇవ్వడంతో సమానం కాదా? ప్రపంచం 1871 పారిస్ కమ్యూనిస్టులకు మద్దతు ఇచ్చింది.కానీ దండకారణ్యంలో మా జనతా సర్కార్ సాధించిన విజయాలకు మద్దతు ఇవ్వకుండా వారిని నిరోధించేది ఏమిటి? ఇది వాస్తవానికి ఆ సమయంలో పారిస్ కం విస్తీర్ణం, జనాభాలో పెద్దది? గిరిజన ఆధిపత్య మావోయిస్టు ఉద్యమం ప్రపంచ మీడియా నుండి పూర్తి మద్దతును ఎందుకు పొందలేకపోయింది? ఇది యూరో కేంద్రీకరణ వల్లనా? జాత్యహంకారం, బ్రాహ్మణవాదం కారణాలా? మావోయిస్టు పార్టీ నాయకత్వంలో, దండకారణ్యంలోని గిరిజన ప్రజలు పాలస్తీనా విముక్తి పోరాటంతో పాటు, యూరోపియన్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు నిరసన తెలిపే హక్కుతో నిలిచారు. వారు మాతో నిలబడాల్సిన సమయం ఇది కాదా? - ఉత్తర సమన్వయ కమిటీ సిపిఐ ( మావోయిస్టు)
Company | మెగా జాబ్ మేళా.. Company | మచిలీపట్నం, ఆంధ్రప్రభ :
ఇండోనేషియాలో భారీ వర్షాలు: 17 మంది మృతి
సుమత్రా: ఇండోనేషియాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుమత్రా ప్రాంతంలో ఆకస్మాత్తుగా వరదలు పొటెత్తడంతో 17 మంది మృతి చెందారు. పలు ప్రాంతాలలో కొండ చరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలలో నివిసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. సుమత్రా ప్రాంతంలోని ఆరు జిల్లాలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. నదులు ప్రమాద స్థాయిని దాటి పహిస్తుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టం భారీగా ఉండడంతో 2000 ఇళ్లు, భవనాలు నీటి మునిగినట్టు సమాచారం. వరదలలో కొట్టుకపోయిన వారి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Road Accident : ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
Mopidevi | ఒక్కరోజు ఆదాయం..? Mopidevi, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మోపిదేవిలోని
బెస్ట్ సిటీ.. హైదరాబాద్#TeluguPost #telugu #post #news
పెళ్లి బృందం కారుకు యాక్సిడెంట్ #telugupost #viralvideo #latestnews #caraccidentvideos
Cyclone Effect : హమ్మయ్య .. గండం తప్పినట్లే...మనకు ముప్పులేనట్లేనట
తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మాత్రం లేదని వాతావరణ శాఖ తెలిపింది
అమెరికాలో వైట్హౌస్ దగ్గర కాల్పులు..ఇద్దరు నేషనల్ గార్డ్స్ మృతి
వాషింగ్టన్ : అమెరికాలో వైట్హౌస్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించింది. నేషనల్ గార్డ్స్పై దుండగుడు కాల్పులు జరిపారు. ఇద్దరు నేషనల్ గార్డ్స్ మృతి చెందారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాల్పులు జరిపిన మృగాన్ని వదిలేది లేదని, మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. ట్రంప్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు సమాచారం ఇచ్చారు. భద్రతా బలగాలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
BC |బీసీ రిజర్వేషన్లలో అన్యాయం..
BC | బీసీ రిజర్వేషన్లలో అన్యాయం.. BC, కల్వకుర్తి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ
America : వైట్ హౌస్ పక్కన కాల్పులపై ట్రంప్ సీరియస్
వైట్హౌస్కి పక్కనే నేషనల్ గార్డ్ సిబ్బందిపై జరిగిన కాల్పులను ఉగ్రదాడిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు
Andhra King Taluka Review – A Nostalgic Trip Filled With Emotion
Andhra King Taluka Movie Review Andhra King Taluka Movie Review Telugu360 Rating: 3/5 Story: Set in the nostalgic 1990s, star hero Surya (Upendra)’s 100th film runs into financial trouble. The senior hero does not receive much support from the industry to bail out the project. Unexpectedly, an anonymous fan deposits ₹3 crores into his account. […] The post Andhra King Taluka Review – A Nostalgic Trip Filled With Emotion appeared first on Telugu360 .
AP | ధాన్యం కొనుగోలు కోసం.. AP, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లాలో
Hydra | ర్యాలీ.. Hydra, హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైడ్రా పని తీరును
Chandrababu : నేడు రాజధాని రైతులతో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది.
ఐస్ క్రీమ్ తినిపించి ముగ్గురు చిన్నారులపై పక్కింటి వ్యక్తి అత్యాచారం
భువనేశ్వర్: చిన్నారులకు ఐస్ క్రీమ్ తినిపించి వారిపై పక్కింటి వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కలిమెల సమితిలో ఓ గ్రామంలో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటుండగా పక్కింటి వారిని పిలిచి ఐస్ క్రీమ్ తినిపించాడు. అనంతరం వారిని ఇంట్లోకి తీసుకెళ్లి ముగ్గురుపై అత్యాచారం చేశాడు. అనంతరం బయటకు చెప్పొద్దని ముగ్గురిని బెదిరించాడు. పిల్లలు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.
Visakhapatnam : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విశాఖకు మరొక డేటా హబ్
విశాఖపట్నానికి మరొక అద్భుతమైన ప్రాజెక్టు రానుంది.
Vanavaasam From Mowgli: Packed With Adrenaline
Roshan Kanakala is gearing up for his second film Mowgli 2025, directed by Sandeep Raj and produced by TG Vishwa Prasad and Krithi Prasad under People Media Factory. After sparking curiosity with the glimpse, first single, and teaser, the makers have now dropped the second single, Vanavaasam. While the first song explored the romantic side […] The post Vanavaasam From Mowgli: Packed With Adrenaline appeared first on Telugu360 .
Mopidevi | శత జయంతి ఉత్సవాలు.. Mopidevi, ఆంధ్రప్రభ : స్వర్గీయ మండలి
Prabhas joins the sets of Spirit
Prabhas and Sandeep Reddy Vanga are teaming up for Spirit, a high voltage action drama and the film has been launched formally. The shoot commenced yesterday in Hyderabad and Prabhas joined the sets of the film today. He will shoot for his portions till December end. The movie team will take a New Year break […] The post Prabhas joins the sets of Spirit appeared first on Telugu360 .
Gold Rates Today : భారీగా షాకిచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలు అంతే
ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది
Warangal | ఆకస్మిక తనిఖీలు.. Warangal, వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : గ్రేటర్
ఎంబిబిఎస్ విద్యార్థి గడ్డాన్ని ట్రిమ్మర్తో కత్తిరించి... వేధింపులు
సిద్దిపేట: ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సీనియర్లు వేధించిన సంఘటన సిద్దిపేట జిల్లా సమీపంలో మిట్టపల్లిలోని సురభి వైద్య కాలేజీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాయి కృష్ణ అనే విద్యార్థి ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం సురభి మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. ఈ నెల 17న కాలేజీలో వైట్ కోట్ వేడుక జరిగింది. నలుగురు సీనియర్ విద్యార్థులు సాయికృష్ణ అడ్డగించి అతడి గడ్డాన్ని ట్రిమ్మర్తో కట్ చేశారు. కాళ్లను వి ఆకృతి ఉంచి నిలబెట్టి ర్యాగింగ్కు పాల్పడ్డారు. నీళ్లు తీసుకరావాలని ఆర్డర్లు వేశారు. ర్యాగింగ్ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కాలేజీ పిఆర్ఒ తెలిపారు.
హాంకాంగ్ లో తీవ్ర విషాదం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
హాంకాంగ్ లో జరిగిన భారీ అగ్నిప్రమాద మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
‘రివాల్వర్ రీటా’.. కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ “ఇది పర్ఫెక్ట్ డార్క్ కామెడీ ఫిల్మ్. ఇప్పటివరకు చాలా డార్క్ కామెడీ సినిమాలు చూసుంటారు. కానీ ఇది ఫిమేల్ లీడ్ చేస్తున్న డార్క్ కామెడీ ఫిల్మ్. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది ఒక్క రోజులో జరిగే కథ. చాలా అద్భుతమైన పాత్రలు ఉన్నాయి” అని అన్నారు. అజయ్ ఘోష్ మాట్లాడుతూ “డైరెక్టర్ చంద్రు చాలా అద్భుతంగా సినిమాను తీశారు. ఈ సినిమాలో కీర్తి యాక్షన్ను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఒక కొత్త సునీల్ని చూస్తారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్ కుమార్ పాల్గొన్నారు.
konda surekha |మెగాస్టార్ తో సెల్ఫీ..
konda surekha | మెగాస్టార్ తో సెల్ఫీ.. konda surekha, వరంగల్ సిటీబ్యూరో,
ఆ రోజు నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు..... పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి
మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ చివరి ఏడు రోజుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా సర్వదర్శనం మొదటి మూడు రోజుల్లో ఎస్ఇడి, శ్రీవాణి దర్శనాలు రద్దు స్థానికులకు ప్రత్యేక అప్లికేషన్ ద్వారా టికెట్ల బుకింగ్ కు అవకాశం వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో తిరుపతిలో ఎస్ఎస్ డి టోకెన్ల జారీ నిలిపివేత ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు ఆన్ లైన్ అప్లికేషన్ ద్వారా దాతలకు దర్శన బుకింగ్ కు అవకాశం తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల విధి, విధానాలు వివరాలు ఇలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27వ తేది ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/, మొబైల్ యాప్ https://apps.apple.com/in/app/ttdevasthanams/, వాట్సాప్ లో ఎపి గవర్నమెంట్ బాట్ లో టిటిడి ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు భక్తులకు అందించబడతాయి. వాట్సాప్ బాట్ లో నమోదు చేసుకునే విధానం వాట్సాప్ బాట్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నెంః 9552300009 కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం ఇంగ్లీష్, తెలుగు భాషలను సెలక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కోసం ఎఎన్, తెలుగు కోసం టిఇ అని రిప్లై ఇవ్వాలి. అనంతరం మీరు ఎంచుకున్న భాషలో సర్వీసెస్ విండో కనిపిస్తుంది. ఆ సర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ఓపెన్ చేయగానే వైకుంఠ ద్వార దర్శనం (డిప్) రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలను ఎంపిక చేసుకుని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత చిరునామా, పిన్ కోడ్ నమోదు చేయాలి. అనంతరం డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో మీకు దర్శనం కావాల్సిన రోజులను లేదా మూడు రోజులను ప్రయారిటీగా ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత భక్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వయస్సు, లింగం, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత వివరాలను సరి చూసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నమోదు చేసిన పేర్లను మార్చడానికి వీలు పడదు. ఆధార్ నంబర్, పిన్ కోడ్ ను తప్పుగా నమోదు చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తుల వివరాలు విజయవంతంగా సబ్మిట్ చేయగానే అక్నౌలోడ్జ్మెంట్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రిఫరెన్సు నెంబర్ గా పరిగణించడం జరుగుతుంది. మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంటుంది. మొదటి మూడు రోజులు ఎస్ ఇడి, శ్రీవాణి దర్శనాలు రద్దు వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులైన డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో ఎస్ఇడి, శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. ఈ పది రోజుల పాటు, తిరుమల మరియు తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయబడవు. పది రోజుల పాటు తిరుపతిలో సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయడం జరుగుతుంది. జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా సర్వ దర్శనం వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా భక్తులకు సర్వ దర్శనం కల్పించనున్నారు. భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈరోజుల్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయబడవని తెలియజేయడమైనది. జనవరి 2 నుండి 8వ తేది వరకు ఎస్ఇడి, శ్రీవాణి దర్శన టికెట్ల జారీ వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు. డిసెంబర్ 5వ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు దర్శనం జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 5వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు. ఇందులో తిరుపతి, చంద్రగిరి , రేణిగుంట స్థానికులకు రోజుకు 4500 టోకెన్లు కేటాయించగా, తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్లు కేటాయించారు. ఈ టోకెన్లు డిసెంబర్ 10 తేదిన ఆన్ లైన్ లో విడుదల చేయబడతాయి. ఒక్కో వ్యక్తి 1+3 విధానంలో టోకెన్లు బుకింగ్ చేసుకోవచ్చు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి దర్శనం వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. ఈ రోజులకు సంబంధించి తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ రోజుల్లో ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడమైనది. ఆన్ లైన్ ద్వారా దాతలకు దర్శన బుకింగ్ కు అవకాశం రూ.కోటి ఆపైగా విరాళం ఇచ్చిన దాతలు వారి కుటుంబ సభ్యులకు డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు రోజుకు 125 మందికి దర్శనం కల్పించనున్నారు. రూ.లక్ష నుండి రూ.99 లక్షల వరకు విరాళం ఇచ్చిన దాతలకు డిసెంబర్ 30, 31 వ తేదిల్లో రోజుకు 1000 మందికి, జనవరి 1వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు 2వేల మందికి దర్శనం కల్పించనున్నారు. వీరు కూడా ఆన్ లైన్ అప్లికేషన్ లో డిసెంబర్ 5వ తేదిన ఉదయం 10 గంటలకు విడుదల చేసే టికెట్లను ఇప్పుడున్న విధానంలోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకుని టిటిడి తీసుకున్న నిర్ణయాలను గమనించి సహకరించాల్సిందిగా భక్తులకు టిటిడి విజ్ఞప్తి చేయడమైనది.
Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. వెంటనే దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది
Ram’s Deal for Andhra King Taluka
Andhra King Taluka is an interesting attempt from Ram Pothineni and it is a different film after a series of mass attempts from Ram. Andhra King Taluka released today and the premiere reports are positive. Instead of taking huge remuneration, Ram has decided to share to hold his part from the theatrical rights. He has […] The post Ram’s Deal for Andhra King Taluka appeared first on Telugu360 .
యాంకర్ శివజ్యోతికి తిరుమలలో నో ఎంట్రీ
యాంకర్ శివ జ్యోతి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల సంచలన నిర్ణయం తీసుకున్నారు
శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి బుధవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది. వేడుకగా స్నపన తిరుమంజనం : ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. పుష్పయాగం సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల కుసుమాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో రెండు టన్నులు తమిళనాడు, ఒక టన్ను కర్ణాటక, ఒక టన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి దాతలు అందించారు. వైభవంగా పుష్పాల ఊరేగింపు : తొలుత మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు. అనంతరం సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ కృష్ణముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైదికులు వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, పగడపు పూలు వంటి 14 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ హరీంద్రనాథ్, గార్డెన్ డీప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఎఇఒ దేవరాజులు, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Cyber Crime : సైబర్ క్రైమ్ గ్యాంగ్ అరెస్ట్.. డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరించి దోచుకుని?
సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు కేరళలో అరెస్ట్ చేశారు
Shiva jyothi |కాస్ట్ లీ బిచ్చగాళ్ళు… ఇలా మాట్లాడితే ఊరుకుంటారా..?
Shiva jyothi | కాస్ట్ లీ బిచ్చగాళ్ళు… ఇలా మాట్లాడితే ఊరుకుంటారా..? Shiva
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అందరికీ కనెక్ట్ అవుతుంది
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్, మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పాటలు చార్ట్బస్టర్లుగా మారాయి. ఈ చిత్రం గురువారం థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా వివేక్, మెర్విన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “మేము తమిళంలో 20 సినిమాలు చేశాం. ఆంధ్ర కింగ్ తాలూకా తెలుగులో మా మొదటి సినిమా. ఇప్పటివరకు సినిమాలోని నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి. ఇంకా మూడు పాటలు సినిమాలో ఉన్నాయి. కథలో చాలా కీలకమైన పాటలు అవి. అందుకే ఇప్పుడే రిలీజ్ చేయలేదు. సినిమా రిలీజ్ తర్వాత విడుదల చేస్తాం. ఇందులో ప్రతి పాట విజువల్గా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి పాటకి అద్భుతమైన స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ మహేష్ ప్రతిక్షణం మా వెంట ఉన్నారు. మ్యూజిక్ని చాలా ఆర్గానిక్ గా చేశాము. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలోని ఒక పాటకు మేము మొదట ట్యూన్ కంపోజ్ చేశాం. దానికి రామ్ అద్భుతమైన సాహిత్యాన్ని రాశారు. ఇది చాలా యూనిక్ స్టోరీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా మేము చాలా కొత్త సౌండ్ని ప్రయత్నించాము. సినిమా చూస్తున్నప్పుడు చాలా కొత్త అనుభూతి కలుగుతుంది” అని అన్నారు.
ఇథనాల్ ట్యాంకర్ను ఢీకొట్టిన లారీ: ఒకరు సజీవదహనం
హన్వాడ: మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 167వ జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టింది. భారీగా మంటలు చెలరేగడంతో ట్యాంకర్ డ్రైవర్ సజీవదహనమయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.
నేడు మిధున్ రెడ్డి పిటీషన్ పై విచారణ
వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి పిటీషన్ పై నేడు విచారణ కొనసాగనుంది.
Andhra Pradesh : నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు
Cotton |ఆంధ్రాపత్తిపై అమెరికా కత్తి….
అమరావతి, ఆంధ్రప్రభ: మొంథా తుపాను ధాటికి తడిసిపోయిన పత్తిని అమ్ముకోలేక, సీసీఐ సహాయ
India Vs South Africa : ఘోరమైన ఓటమి.. వేళ్లన్నీ అతని వైపేనా?
గౌహతిలో దక్షిణాఫ్రికా భారత జట్టుపై అద్భుతమైన విజయం సాధించింది.
Daylight Murder of TDP Leader Gottipati Prasad Shocks Nellore District
A brutal daylight murder in SPSR Nellore district has left the region stunned and fearful. Gottipati Prasad, a 58-year-old Telugu Desam leader, was killed at his poultry farm in Chintalapalem village of Gattupalli panchayat on Wednesday. The attack took place between 11 a.m. and 12 noon, turning an ordinary workday into a scene of horror. […] The post Daylight Murder of TDP Leader Gottipati Prasad Shocks Nellore District appeared first on Telugu360 .
IBomma : నేటి నుంచి పోలీస్ కస్టడీకి ఐ బొమ్మ రవి
నేటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు విచారించనున్నారు.
Telangana : నేటి నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ
తెలంగాణలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది
Keerthy Suresh |చిరంజీవి గారంటే గౌరవం కానీ..?
Keerthy Suresh | చిరంజీవి గారంటే గౌరవం కానీ..? Keerthy Suresh, ఆంధ్రప్రభ
పొట్టిలంకలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం పొట్టిలంకలో 76 వ రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేడ్కర్ యువజన సంఘం, జై భీమ్ యూత్ ఆధ్వరయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ నక్కా వెంకట రత్న రాజు అంబేడ్కర్ విగ్రహానికి నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనుల పోరాటంతో మనదేశం1947 ఆగష్టు 15 న స్వతంత్ర్యం భారత గా అవతరించింది. స్వతంత్ర్య దేశానికి రాజ్యాంగం ఉండాలనే అవశ్యకత ను […] The post పొట్టిలంకలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం appeared first on Visalaandhra .
స్వర్ణ వేలాయుధం –కంబాల సంకల్పం
శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 25 లక్షలు రూపాయలతో స్వర్ణ వేలాయుధం.. భక్తులు కంబాల శ్రీనివాసరావు సంకల్పం తొలితగా 13 లక్షలు రూపాయలతో 100 గ్రాములు బంగారం కొనుగోలు… విశాలాంధ్ర – కోరుకొండ: కోరుకొండ గ్రామం ప్రధాన రహదారిలో కొలివై ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 25 లక్షలు రూపాయల వ్యయంతో స్వర్ణ వేలాయుధం చేయించడానికి భక్తులు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు సంకల్పించారు. […] The post స్వర్ణ వేలాయుధం – కంబాల సంకల్పం appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – దేవరపల్లి : భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి రాజ్యాంగ స్ఫూర్తిని పొందాలని దేవరపల్లి సొసైటీ చైర్పర్సన్ ఉప్పులూరి రామారావు సొసైటీ సీఈవో కల్లూరి శ్రీనివాస శర్మ పేర్కొన్నారు దేవరపల్లి లో సొసైటీ కార్యాలయం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్ పర్సన్ ఉప్పులూరి రామారావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారత దేశ రాజ్యాంగం ఎంతో గొప్పదని ముఖ్యంగా లిఖిత రాజ్యాంగం కావడం […] The post భారత రాజ్యాంగం పట్ల ఉప్పులూరి appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలంలో బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్టి పర్వదినం సందర్భంగా మండలంలో వివిధ గ్రామాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారి జాము నుండి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయాలలో భక్తులు సుబ్రహ్మణ్య స్వామి నామంతో నినాదాలు చేస్తూ దేవదర్శనం చేసుకున్నారు దేవరపల్లిలో కదా అతి పురాతనమైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున మూడు గంటల నుండి అభిషేకాలు పూజలు ప్రారంభమయ్యాయి ఆలయ ప్రధాన అర్చకులు అఖండం […] The post దేవరపల్లి లో షష్టి appeared first on Visalaandhra .
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం
విశాలాంధ్ర – దేవరపల్లి : కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామని పార్టీ అభ్యర్థులు ఎంపిక పదవులు కేటాయింపులో డిసిసి అధ్యక్షుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామని ఏఏసిసి కార్యదర్శి తూర్పుగోదావరి జిల్లా పరిశీలకులు అంబా ప్రసాద్ పేర్కొన్నారు దేవరపల్లి మండలం దుద్దుకూరులో రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కాకర్ల శ్రీహరిబాబు స్వగృహం వద్ద గోపాలపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన […] The post కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం appeared first on Visalaandhra .
Vijayawada | స్ట్రీట్ ఫైట్.. విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ అజిత్ సింగ్
ఇమ్రాన్ ప్రాణాలతో ఉన్నట్లా లేనట్లా పాక్ సైన్యంచేతిలో అంతం అయ్యాడా? సైనిక చీఫ్ మునీర్ సైగలతోనే లాకప్ డెత్? అఫ్ఘన్...ఖైబర్ ప్రాంత మీడియా అధికారుల వెల్లడి కట్టుదిట్టమైన అడియాలా జైలువద్దకు జనం రాక ఎటువంటి ప్రకటన వెలువరించని పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్ : క్రికెట్ బ్రాండ్, పాకిస్థాన్ రాజకీయాల్లో సంచలనమై, పాకిస్థాన్ తెహరీక్ ఏఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ పెట్టి ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? అనేది పాక్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా తీవ్రసంచలనం అయింది. అత్యంత అల్ప స్థాయి అవినీతి ఆరోపణలపైనే జైలుపాలయిన ఇమ్రాన్ ఖాన్ దాదాపుగా మూడు సంవత్సరాలుగా రావల్పిండిలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కంచుకోట వంటి జైలు అడియాలా కారాగాచంలో మగ్గిపోతున్నాడు. అయితే ్రఇమాన్ ఖాన్ను జైలులోనే తీవ్రంగా హింసించి పాక్ సైనిక వర్గాలు ఆయన ఏకాంత సెల్లోనే మట్టుపెట్టారనే వార్తలు పాక్ అంతటా వ్యాపించాయి. ఇప్పుడు ఈ జైలు వెలుపల అత్యధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు వచ్చి చేరుతున్నారు. మంగళవారం రాత్రి నుంచే జైలు ఆవరణ అంతటా జనం కోపోద్రిక్తులై నింది పోయి ఉన్నారు. జైలులోనే ఇమ్రాన్ను చంపివేయాలని పాకిస్థాన్ శక్తివంత సైనిక విభాగం అధినేత జనరల్ అసిమ్ మునీర్ ఇటీవల ఆదేశించారని, ఈ మేరకు తరువాతి క్రమంలో ఇమ్రాన్ను మట్టుపెట్టారని ప్రచారం జరుగుతోంది. తమ నేత ఎక్కడున్నాడు? తమకు చూపించాలని కోరుతూ జైలు పరిసరాలలో జనం చేరుకుని నినాదాలకు దిగుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరిలు కూడా ఆయన పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇక బెలూచిస్తాన్, అఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖల నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా ఇమ్రాన్ హత్య జరిగిందనే ప్రకటనలు వెలువడుతున్నాయి. వీటిని జనం ఎక్కువగా విశ్వసిస్తున్నారు. ఖాన్ను కస్టడీలో చంపేశారని వదంతులు రావడంతో పలు దేశాలలో ప్రత్యేకించి దుబాయ్ ఇతర ప్రాంతాలలో దీని నిర్థారణకు దౌత్యవర్గాలు యత్నిస్తున్నాయి. జైలులోనే ఆయనను చంపివేసి, తరువాత భౌతిక కాయాన్ని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లారని అఫ్ఘనిస్థాన్ మీడియా వార్తలు వెలువరించింది. అయితే ఇమ్రాన్ మృతి వార్తలను లేదా ఆయన లాకప్ డెత్ గురించి ఎక్కడ కూడా అధికారిక నిర్థారణ జరగలేదు. పాకిస్థాన్ అధికార వర్గాలు ఇప్పటివరకూ దీనిపై ఎటువంటి స్పందన వెలువరించలేదు. ఇమ్రాన్ సజీవంగా ఉంటే తరువాత రాజకీయంగా తమకు ఎదుర్కొనేందుకు వీలుందని పాక్ సైన్యం నిర్థారించుకుంది. దీనిని ఐఎస్ఐ బలపర్చింది, దీనితోనే జైలులోపలికి సైనిక వర్గాలు చేరుకుని వీలును చూసుకుని మట్టుబెట్టినట్లు తేలింది. ఖండనలేదు..నిర్థారణ లేదు...షరీఫ్లు మౌనం అయియితే పాకిస్థాన్ ప్రభుత్వం కానీ, సైనిక వర్గాలు కానీ ఇమ్రాన్ ఖాన్ విషయంపై ఎటువంటి ప్రకటన వెలువరించలేదు. గత రెండు మూడు రోజుల క్రితం అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి ఇమ్రాన్ ఆసుపత్రిలోలేదా జైలులో అత్యంత బలహీనమైన స్వరంతో మీడియాతో మాట్లాడుతూ ఉండటం, ఈ దశలో ఆయన పూర్తిగా శారీరక అంత్య లక్షణాలతో ఉండటం కన్పించింది. జైలులో చాలాకాలంగా ఉంటూ వస్తున్న ఇమ్రాన్ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అనేక నెలలుగా ఎటువంటి అధికారిక బులెటిన్ వెలువడలేదు. ప్రభుత్వ పరమైన రాజకీయ వ్యవస్థను క్రమేపీ శాసిస్తూ వస్తోన్న సైనిక ప్రధానాధికారి మునీర్ ప్రాబల్యం క్రమంలోనే ఈ విధంగా పాక్ అధికారిక ప్రకటనలను తొక్కిపెట్టారని వార్తలు వెలువడుతున్నాయి. తాను జైలు వద్దకు వెళ్లి ఇమ్రాన్ఖాన్ను కలిసేందుకు అనుమతి కోరానని, అయితే ఇందుకు నిరాకరించారని ఇటీవలే ఖైబర్ ఫక్తూన్క్వా ముఖ్యమంత్రి సొహైల్ అఫ్రిది ప్రకటన వెలువరించారు. తాను ఏడుసార్లు ఆయనను కలిసేందుకు యత్నించినా, వెనకకు పంపించారని తెలిపారు. జైలు వెలుపల ఉన్న సైనిక అధికారి ఒకరు తనను మర్యాదపూర్వకంగా బయటకు తరలించారని చెప్పారు. కాగా తాను సోదరుడి కోసం ఆందోళన చెంది తన అక్కాచెల్లెళ్లతో వెళ్లానని డాక్టర్ ఉజ్మా ఖాన్ తెలిపారు. అయితే తనతో పాటు ఇతరులను పోలీసు, సైనిక అధికారులు జుట్టుపట్టుకుని లాక్కెళ్లారని ఆమె రోదిస్తూ తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కనుక్కుందామని వెళ్లితే ఈ విధంగా వ్యవహరించడం ఏం న్యాయం అని ప్రశ్నించారు. ఆయన ఉన్నదీ లేనిది అయినా తమకు తెలియాల్సి ఉందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నికకు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నికకు అభిప్రాయ సేకరణ విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు కార్యకర్తల అభీష్టం మేరకే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం…తూర్పుగోదావరి జిల్లా అబ్జర్వర్ అధిత స్వప్న కార్యకర్తల మనోభీస్టాన్ని తెలుసుకుని పార్టీ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థాగత నిర్మాణం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా పరిశీలకులు, జార్ఖండ్ మాజీ ఎమ్మెల్యే అధిత స్వప్న, ఏఐసీసీ కార్యదర్శి అంబా ప్రసాద్ లు అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుల […] The post కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నికకు appeared first on Visalaandhra .
kurnool |ఘనంగా ధన్వంతరి జయంతి..
kurnool | ఘనంగా ధన్వంతరి జయంతి.. kurnool, కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం :1949 నవంబర్ 26 న రాజ్యంగ సభ ఆమోదం పొంది 1950 జనవరి 26 న అమలులోని కి వచ్చిన సందర్భంగా ది. 26-11-2025 తేదీన జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యలయములో జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి :డా. కె.వెంకటేశ్వర రావు వారి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ నిర్వ హించడం జరిగింది ప్రతి సంవత్సరం నవంబర్ 26 న భారత రాజ్యంగ దినోత్సవాన్ని జరుపుకుంటుందని దీన్నే సంవిధాన్ దివస్ అని అంటారని […] The post సంవిధాన్ దివస్ కార్యక్రము appeared first on Visalaandhra .
ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలు. విశాలాంధ్ర – అనపర్తి : తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని ప్రాచీన శ్రీ గోలింగేశ్వరస్వామివారి ఆలయంలో కొలువై ఉన్న శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి షష్టి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున తీర్థపు బిందె సేవతో షష్టి వేడుకలను ప్రారంభమైన వేడుకలు 7 రోజుల పాటు జరగనున్నాయి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు సుబ్రహ్మణ్య స్వామిని […] The post బిక్కవోలులో షష్టి వేడుకలు appeared first on Visalaandhra .
EDITORIAL |మన రాజ్యాంగం పరవెూత్కృష్టం
EDITORIAL | మన రాజ్యాంగం పరవెూత్కృష్టం రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం దేశ ప్రజలు
Amaravati |వెంకన్న ఆలయం విస్తరణ పనులకు శ్రీకారం..
Amaravati | వెంకన్న ఆలయం విస్తరణ పనులకు శ్రీకారం.. ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ
షష్ఠి” మహోత్సవం ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు
శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకున్న ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు. విశాలాంధ్ర – అనపర్తి: రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యం చెందిన అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో “షష్ఠి” మహోత్సవం సందర్బంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లను రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి,ఎమ్మెల్సీ సోము వీర్రాజు,అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,రాజానగరం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్,రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం,బిక్కవోలు […] The post షష్ఠి” మహోత్సవం ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు appeared first on Visalaandhra .

24 C