గోదావరిలో… జన్నారం, ఆంధ్రప్రభ : గోదావరిలో ఓ యువకుడు గల్లంతైన విషాదకర సంఘటన
ఈ ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి: పొన్నం
హైదరాబాద్: ఓటర్లు ఈ ఉప ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. పొన్నం ప్రభాకర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని తెలియజేశారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభివృద్దికి పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించారని, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు నవీన్ యాదవ్ కు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. నవంబర్ 11వ తేదీన జరిగే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కోసం ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు దినం ప్రకటించిందన్నారు. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పొన్నం పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నవంబర్ 11న సెలవు
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ హరిచందన10న పోలింగ్ కేంద్రాలకు మాత్రమే హాలిడే 14న ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సెలవుజూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ జరగనున్న నవంబర్ 11వ తేదీన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆమె అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.పోలింగ్కు ఒకరోజు ముందు, […] The post జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నవంబర్ 11న సెలవు appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్: కారు అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి
భీమవరంలో ఫిట్ ఇండియా సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్ పశ్చిమ కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఒకరి పరిస్థితి విషమం కొత్తగూడ, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని
బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయరా?
బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని
Vijayawada : నాగవైష్ణవి సోదరులు పోలీస్ కమిషనర్ ఎదుటకు? ప్రాణహాని ఉందంటూ?
విజయవాడ నాగవైష్ణవి హత్య కేసులో నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని పలగాని ప్రభాకర్ రావు కుమారుడు విజయవాడ పోలీస్ కమిషనర్ ను కోరారు.
నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ..
వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ రైళ్ల ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పచ్చజెండాప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. బనారస్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో బనారస్-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు మార్గాల్లో ఈ కొత్త సెమీ-హైస్పీడ్ రైలు సర్వీసులను ఆయన జాతికి అంకితం చేశారు.ఈ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ […] The post నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. appeared first on Visalaandhra .
యువ ప్రతిభకు నాలుగు బంగారు పతకాలు
ఎండపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన
36 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణం : కోమటిరెడ్డి
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్లు వేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హోమ్ ప్రాజెక్టుకు రూ.11,399 కోట్ల కేటాయించామని.. త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.60,799 కోట్లతో రోడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు అని కోమటిరెడ్డి కొనియాడారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు, రూ.10,400 కోట్లతో హైదరాబాద్- విజయవాడ రహదారి విస్తరణ చేయనున్నట్లు చెప్పారు. రూ.36 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్కకు కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇంజన్లో మంటలు పూర్తిగా దగ్ధమైన వాహనంవాహనంలో ఇరుక్కుపోయిన వారిని కాపాడిన లారీ డ్రైవర్లుసురక్షితంగా
తపాల్పూర్ అడవుల్లో చెట్ల నరికివేత..
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వులోని జన్నారం అటవీ
Bigg Boss 9 : ఇమ్మాన్యుయేల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్.. అయినా మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడా?
బిగబాస్ 9 తెలుగు సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. టాప్ 5లో ఇమ్మాన్యుయేల్ కు చోటు దక్కుతుంది
అన్నవస్త్రాల కన్నా అణ్వాయుధాలే మిన్న!
అమెరికాలో షట్డౌన్ ప్రభావం అనేక రంగాలను కల్లోల పరుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఆహార సంక్షోభానికి దారితీస్తోంది. వాణిజ్య రాజధాని న్యూయార్క్కు ప్రభుత్వం నుంచి ఆహార సాయం అందక ఆ రాష్ట్రం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ‘సప్లిమెంట్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ లేదా ‘ఫుడ్స్టాంప్స్’ ప్రయోజనాలు అందని ప్రమాదం ఏర్పడింది. మరోవైపు షట్డౌన్ ప్రభావం కారణం గానే విమాన సర్వీస్ల సిబ్బందికి జీతాలు చెల్లించలేక 10 శాతం సర్వీస్లను తగ్గిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు నుంచి పార్క్ వార్డెన్ల వరకు 1.4 మిలియన్ ఫెడరల్ వర్కర్లు శెలవుపై వెళ్లడమో లేదా వేతనం లేకుండా పని చేయవలసి రావడమో తేల్చుకోలేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు. ఇటువంటి తీవ్ర సంక్షోభం నేపథ్యంలో అన్నవస్త్రాలు ప్రజలకు ఎలా అందించాలన్న ప్రయత్నాలకు బదులు అణ్వస్త్రాల పోటీకి అమెరికా ప్రభుత్వం మొగ్గు చూపడం శాంతికాముక దేశాలను కలవరపరుస్తోంది. తాజాగా ఫ్లోరిడా లోని మయామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వైపు హితవచనాలు పలుకుతూ మరోవైపు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని బెదిరించడం ఫక్కా నియంతృత్వ ధోరణిని ప్రతిబింబిస్తోంది. దక్షిణ కొరియాలో అక్టోబర్ 29న చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ కావడానికి కొన్ని నిముషాల ముందు అమెరికా అణ్వాయుధాల పరీక్షను ఇతర దేశాలతో సమానంగా ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించడం సంచలనం రేపుతోంది. ‘రష్యా, చైనా దేశాలు అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కానీ అవి వాటి గురించి ఎక్కడా ఎప్పుడు ప్రస్తావించడం లేదు. ఉత్తర కొరియా కచ్చితంగా అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉంది. పాకిస్థాన్ కూడా ఇదే దారిలో ముందుకు వెళ్తోంది’ అని ట్రంప్ బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ చెప్పింది అక్షరాలా సత్యం. నవశతాబ్దంలో ఉత్తరకొరియా బహుళ అణ్వాయుధాలను పరీక్షించింది. కానీ అణ్వాయుధ నిల్వలు కలిగిన అమెరికా, చైనా, రష్యా తదితర అగ్రరాజ్యాలతో సహా ఇతర దేశాలు 1990 నుంచి అణ్వాయుధ పరీక్షలపై తాత్కాలిక నిషేధాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణులను అవి పరీక్షించగలవు. ఇప్పుడు అణుశక్తితో నడిచే అస్త్రాన్ని రష్యా సిద్ధం చేసింది. 15 గంటల పాటు గాల్లోనే ఉండి, 14 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ‘బురెవెస్ట్నిక్’ అణుక్షిపణిని పరీక్షించింది. అలాగే సముద్ర గర్భ టార్పెడోను ప్రయోగించి పరీక్షించింది. ఈ పరీక్షలు విజయవంతమయ్యాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించగానే ట్రంప్ స్పందించి తమ దేశం కూడా అణ్వాయుధ పరీక్షలను తిరిగి చేపడుతోందని ప్రకటించడం విశేషం. రష్యా ప్రయోగించిన ఆ రెండు అణుక్షిపణులు అమెరికా రక్షణ క్షిపణి వ్యవస్థలను అధిగమించేలా డిజైన్ చేశారు. అవి అణ్వాయుధాలను ఎక్కడికైనా తీసుకెళ్ల గలవు. కానీ అవి అణువిస్ఫోటన పరీక్షలు కావు. సోవియెట్ యూనియన్ ఉన్నప్పుడు 1990 లో రష్యా ఆఖరిసారి అణ్వాయుధ పరీక్ష నిర్వహించింది. అలాగే 1992 లో అమెరికా ఆఖరి అణుబాంబు పరీక్ష, 1996లో చైనా ఆఖరి అణుపరీక్ష నిర్వహించాయి. అన్ని అణుపరీక్షలను నిషేధిస్తూ 1996లో సమగ్ర నిషేధ ఒప్పందం (సిటిబిటి) కుదిరింది. కానీ అవసరమైన సంఖ్యలో దేశాలు దీనిని ఆమోదించకపోవడంతో ఆ ఒప్పందం అమలు లోకి రాలేదు. ఒప్పందంపై అమెరికా, చైనాలు సంతకాలు చేసినా దాన్ని ఆమోదించడం మాత్రం జరగడం లేదు. రష్యా ఒప్పందంపై సంతకం చేసి ఆమోదం తెలియజేసినా, 2023లో అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో ఒప్పందానికి కట్టుబడి ఉండకూడదని నిర్ణయించుకుంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టుల వివరాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద భారీ ఎత్తున అణ్వాయుధాలు కలిగిన రష్యాలో 4309 అణుక్షిపణులు ఉన్నాయి. తరువాత రెండోస్థానం అమెరికాలో 3700, చైనాలో 1000 అణుక్షిపణులు ఉన్నాయని అంచనా. చారిత్రకంగా అమెరికా అనేక సార్లు అణు పరీక్షలు నిర్వహించింది. 1030 అణు విస్ఫోటనాలను నిర్వహించింది. తరువాత సోవియెట్ యూనియన్ 715, ఫ్రాన్స్ 210, చైనా 45 అణువిస్ఫోటన పరీక్షలను చేపట్టాయి. ఒప్పందం తరువాత మొత్తం 2056 అణుపరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా మళ్లీ అణుపరీక్షలు కొనసాగించడానికి సిద్ధం కావడం చర్చకు దారి తీస్తోంది. దీన్ని సమర్థిస్తున్నవారు అణ్వాయుధాలు పనిచేస్తున్నాయో లేదో తిరిగి పరీక్షించుకోవడం అవసరమని చెబుతున్నారు. అయితే అమెరికా సెక్రటరీ ఆఫ్ ఎనర్జీ క్రిస్వ్రైట్ తమ దేశం అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించబోదని, ఎలాంటి అణు విస్ఫోటనం జరగకుండా కేవలం దేశవాళీ పేలుడు పదార్ధాలతోనే తక్కువ శక్తిగల ప్లుటోనియం 239పై ఒత్తిడి తీసుకొచ్చే పరీక్షలు చేస్తుందని నవంబర్ 2న చెప్పుకొచ్చారు. అంతరిక్షం, సముద్ర జలాలు మొదలుకొని ఎలాంటి పర్యావరణ వాతావరణంలో కూడా అణుపరీక్షలు చేయరాదని 1963లో పాక్షిక పరీక్ష నిషేధ ఒప్పందంపై సోవియట్ యూనియన్, అమెరికా, బ్రిటన్ దేశాలు సంతకం చేశాయి. ఇప్పుడు అమెరికా తిరిగి అణుపరీక్షలు ప్రారంభిస్తే ఇతర అణ్వాయుధ దేశాలపై కూడా ఆధిపత్య ప్రభావం పడుతుంది. ఇప్పటికే చైనా గతంలో 1964 లో మావో ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటన ప్రదేశం లాప్నూర్ వద్ద అణుపరీక్షలకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభావం మిగతా దేశాలపై చూపిస్తుంది.
సమంత–రాజ్ ఫొటో వైరల్ #Samantha #RajNidimoru #ViralPhoto #Tollywood #viralvideo #latestnews
కోపం కట్టలు తెంచుకుంది రైల్వే బ్రిడ్జి పూర్తి చేయాలని ఆందోళన మాక్లూర్, ఆంధ్రప్రభ
అమెరికానే కాదు, ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నిలబడి జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర్ మేయర్గా గెలిచాడు. ఇది ప్రపంచ దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. ఆధిపత్యం, అణచివేతలు ఎల్లకాలం సాగవనే సత్యాన్ని ఓటు శక్తి ద్వారా న్యూయార్క్ ప్రజలు నిరూపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహూల్ గాంధీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ హర్యానాలో జరిగిన గత ఎన్నికల్లో ఓట్ల గోల్ మాల్కు, ఓట్ల చోరికి పాల్పడి ఏ విధంగా గెలిచిందో అనేక ఉదాహరణలతో వివరించారు. అమెరికాలో జరిగిన జోహ్రాన్ మమ్దాని విజయంగానీ, ఓట్లను తొలగించి బిజెపి గెలిచిందనే వార్త గానీ ఈ రెండు ఓటు శక్తిని నిరూపిస్తున్నాయి. ప్రాచీన కాలంలో మధ్యయుగాల్లో కత్తులు, బాణాలు, తుపాకులు ఏ విధంగా రాజ్యాలను గెలుచుకోవడానకి ఉపకరించాయో ఆధునిక కాలంలో ఓటు హక్కు కూడా అటువంటి పాత్రను పోషిస్తుంది. జోహ్రాన్ మమ్దాని భారతీయ సంతతికి చెందినవాడు కావడం ఒక విశేషం. ఇదే విధంగా హైదరాబాద్కు చెందిన గజాలా హష్మి వర్జినియా గవర్నర్గా గెలిచింది. గజాలా హష్మి కూడా ట్రంప్ ప్రత్యర్థి పార్టీ డెమొక్రాట్ పార్టీకి చెందిన అభ్యర్థి. ఆధునిక ప్రజాస్వామ్య వ్వవస్థలో ఓటు హక్కు అనేది సాదాసీదా పరికరం కాదు, ఇది ఒక వ్యవస్థ రూపురేఖలు మార్చగలిగే అధునాతన ఆయుధం. ఓటు హక్కు కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయితే మొదట్లో మన దేశంతో సహా ఏ దేశంలోనైన కేవలం సంపన్న వర్గాలకే ఓటు హక్కు ఉండేది. అప్పుడు అది ఒక రకంగా పాక్షిక ప్రజాస్వామ్యమే. ఒక రకంగా అది సంపన్న స్వామ్యమే. అయితే భారత దేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు సార్వజనీన ఓటు హక్కు కోసం అంటే కులం, మతం, ధనిక, పేద, అక్షరాస్యత, నిరాక్షరాసత, ఆడ, మగ తేడా లేకుండా వయోజనులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని పట్టుబట్టి సాధించిపెట్టారు. నిరక్షరాస్యులు, పేదలు ఓటు హక్కును సరైన పద్ధతిలో ఉపయోగించలేరని వాదించిన వాళ్ళున్నారు. అయితే భారత దేశంలో అనుభవం దానిని తప్పని రుజువు చేసింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రజావ్యతిరేక చర్యలకు పూనుకున్న ప్రభుత్వాలు నడిపిన పార్టీలను ఓడించి, ఓటు హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోసమేనని ప్రజలు రుజువు చేశారు. అయితే గత పది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను చేర్చడం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. దీనికి రుజువులు కూడా చూపెడుతున్నారు. అయితే ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన అంశమని మనం భావిస్తున్నాం. అది రుజువైంది కూడా. రాజ్యాంగ రచనా సమయంలో కొంతమంది అప్పుడే పేదలు, చదవులేని వారికి ఓటు హక్కు వద్దని మాట్లాడారు. దానికి వాళ్ళు చూపెట్టిన కారణం, ఈ ఆధునిక పద్ధతులు వాళ్ళకు అర్థం కావని చెప్పారు. అయితే అప్పుడేమో కానీ ఇప్పుడు దీని అంతరార్థం అర్థమవుతున్నది. ఓటు ఒక హక్కు మాత్రమే కాదు, ఒక బలం. ఒక శక్తి. అది అందివస్తే పేదలు ముఖ్యంగా నిమ్నకులాలు తమ మాట వినవనే వాళ్ళుకు తెలుసు. అప్పుడేమో చట్టపరంగా, విధాన నిర్ణయంగా అడ్డుకోవాలని చూశారు. అయితే ఇప్పుడు ఓటు హక్కు శక్తి తెలిసి వచ్చింది. కాబట్టి, తమకు అనుకూలంగా లేని సమూహాల, కులాల, మతాల ఓట్లను తొలగిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది 75 ఏళ్ళ కింద ఆనాటి ఆధిపత్య కులాలు, సంపన్నవర్గాలు చేసిన కుట్రకు ఇది కొనసాగింపు మాత్రమే. అయితే 75 ఏళ్ళ తర్వాత ఈ ఓట్ల మీద దాడి ఎందుకు జరుగుతుంది? ఓటు హక్కు అనే దానిని ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? ఇది కేవలం ఓటు హక్కుతో మొదలై ఓటు హక్కుతో ముగిసిపోయేది కాదు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో రాజకీయ సమానత్వానికి ప్రాతిపదిక. ప్రజలందరూ ప్రజాస్వామ్యంలో తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం. ఇది ప్రజలను పాలనలో భాగస్వాములు కావడానికి ఉన్న అవకాశం. కానీ ఇది ఈ రోజు ముగింపుకు వచ్చినట్టు కనపడుతున్నది. ఎవరైతే ప్రభుత్వాలకు అనుకూలంగా లేరో, ఎవరైతే ఈ పాలన మారాలని అనుకుంటున్నారో వారికి ఓటు హక్కు లేకుండా చేయడమంటే, రాజకీయ ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడడమే. బీహార్, అసోం, హర్యానాలలో ఇదే జరిగినట్టు విమర్శలున్నాయి. ఇది నూటికి నూరు పాళ్ళు అవాంఛనీయం. ఇలా జరిగే ప్రమాదముందని, 75 ఏళ్ళ కిందట రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ హెచ్చరిక కూడా చేశారు. 1949, నవంబర్ 25వ తేదిన రాజ్యాంగ సభలో చివరి ఉపన్యాసం చేస్తూ ‘జనవరి, 26, 1950 నుంచి మనం వైరుధ్య జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ అనే విధానం ద్వారా రాజకీయ సమానత్వాని సాధించుకున్నాం. కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా అసమానతులు కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లోకి వెళ్లుతోంది’ బాబా సాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు ఈ రోజు అద్దంలో ప్రతిబింబం లాగా కనిపిస్తున్నాయి. దాని ఫలితమే ఓటు హక్కును దుర్వినియోగం చేస్తూ, ప్రజలను ఓటు హక్కుకు దూరం చేయడమే. గత 75 సంవత్సరాలుగా ఆర్థిక ప్రగతి ఎంతో సాధించిందని మన దేశం గురించి మనం చెప్పుకుంటున్నాం. కానీ ప్రజలు అభివృద్ధికి దూరంగా జరిగిపోయారు. ఆర్థిక రంగం రోజు రోజుకు గుత్తాధిపత్యం సంపాదించుకుంటున్నది. గతంలో వృత్తులు ఉన్న సమూహాలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కలిగి ఉండేవి. ఈ రోజు అన్ని పారిశ్రామికాధిపతులు, కార్పొరేట్లు ఆక్రమించుకున్నారు. దీనితో ఆర్థిక స్వాలంబనను కలిగి ఉన్న ప్రజలు పరాధీన బతుకులు అనుభవిస్తున్నారు. గ్రామీణ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. రెండోది ఆధునీకరణ, యాంత్రీకరణ, కంప్యూటరీకరణ ద్వారా శ్రమ చేసే శక్తి ఉన్న యువతి యువకులు నిరుద్యోగులుగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సాంప్రదాయకంగా తరతరాలుగా అనుభవిస్తున్న ఆర్థిక స్వాతంత్య్రం ఈ రోజు కార్పొరేట్లు చెప్పుచేతుల్లోకి వెళ్ళాయి. అంతేకాకుండా గతంలో కన్నా చాలా ఎక్కువ ఆర్థిక వ్యత్యాసాలు పెరిగాయి. ఇందులో ఆధిపత్య కులాలు ఆర్థికంగా లాభపడితే నిమ్న, వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసులు ఆర్థిక పరాన్నజీవులుగా తయారయ్యారు. గత పదేళ్ళలో అదానీ కంపెనీ ఆస్తుల పెరుగుదల చూస్తే మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో అర్థం కాగలదు. అంతేకాకుండా కేవలం 10 శాతం కుటుంబాలు దేశంలో సంతృప్తిగా ఉన్నాయి. మిగతా 90 శాతంలో పది శాతం పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న మధ్య తరగతి వర్గాలు, మిగిలిన 80 శాతం కుటుంబాలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నాయి. ఉచితాల పేరుతో చేతులు ఉన్న పని చేయని అవిటి వాళ్లులాగా తయారు చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువగా, బిసిలు, ఎస్సిలు, ఎస్టిలు, మైనారిటీలు ఉన్నారు. అదే విధంగా సామాజికంగా ఈ దేశం కులాలుగా విడిపోయి ఉన్నవి. కులాలు ఒకదానికొకటి విడివిడి ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువ, తక్కువ అనే సామాజిక సంబంధాలను కలిగి ఉన్నాయి. సనాతన పేరుతో నడుస్తున్న హిందూ వ్యవస్థ కులాలను పెంచి పోషిస్తుందే. కానీ వాటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదు. దానికి సాక్షాలుగా దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, కులాంతర వివాహాలు జరిగితే ఆ వ్యక్తులపై దాడుల, హత్యలు ఈ దేశంలో సామాజిక సమానత్వాన్ని ఒక అందుకోలేని ఆకాశంగా తయారు చేస్తున్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలలో వివక్షకు, అసమానతలకు, అణచివేతలకు గురవుతున్న ప్రజలు వ్యవస్థ మీద, ప్రభుత్వాలమీద తిరుగుబాటు చేస్తారేమోననే భయంతో ప్రభుత్వాల భవిష్యత్ను నిర్ణయించే ఓటు హక్కును దూరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. అందువల్ల సామాజిక, ఆర్థిక సమానత్వలు సాధించనంత వరకు రాజకీయ ప్రజాస్వామ్యం ఒక నిజమైన అబద్ధం. - మల్లేపల్లి లక్ష్మయ్య ( దర్పణం)
అభివృద్ధి కుంటుపడుతోంది గ్రామ సేవకులను నియమించాలిఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు మాజీ
భారతదేశంలో మతం, అందులో నుంచీ పుట్టిన వర్ణ వ్యవస్థ, కులం వ్యవస్థ మనుషుల మధ్య అంతరాలకు కారణమైనవి. సామాజిక వైషమ్యాలను సృష్టించాయి. ప్రపంచ దేశాలతో పోలుస్తే ఇది భిన్నమైన కుట్రపూరితమైన అణచివేత అని చెప్పవచ్చు. వీటికి వ్యతిరేకంగా సమానత్వం, స్వేచ్ఛ, మానవ విలువల పునాదిగా ఆవిర్భవించిన భారతీయ మతం బౌద్ధం. అనంతరం ఈ విలువలకు దగ్గరున్నది సిక్కు మతం. ఈ రెండు కూడా భారతదేశంలో పుట్టిన మతాలు. సిక్కు మతం సమానత్వం, సామాజిక ఐక్యత, పరస్పర గౌరవానికి కృషి చేసింది. సిక్కు మత స్థాపకులు గురునానక్ దేవ్. ఆయన 1469లో నన్కానా సాహెబ్ జన్మించారు. ఏట కార్తీకమాసంలో గురునానక్ జయంతి జరుపుకుంటారు. ఆయన హిందూ, ఇస్లాం మత గ్రంథాలు అధ్యయనం చేసి, అన్ని మతాల సామరస్యాన్ని, ఏక దేవతా సిద్ధాంతాన్ని బోధించారు. కుల వ్యవస్థను, మతపరమైన వివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఏక్ ఓంకార్’ సిద్ధాంతాన్ని ఉద్బోధించారు. చివరికి ‘గురు గ్రంథ్ సాహిబ్’ అనే మత గ్రంథానికి ప్రేరణ ఇచ్చారు. గురునానక్ ప్రత్యేకంగా అణచివేయబడిన వర్గాల విముక్తినీ కోరుకున్నారు. ఈ క్రమంలో గురునానక్ సిద్ధాంతాలను ప్రభావితమైన కొందరు దళితులు కూడా సిక్కు మతంలో చేరారు, వారు అక్కడ గౌరవం, సమానత్వం పొందగలిగారు. సిక్కు మత స్థాపకుడైన గురునానక్ సంత్ రవిదాస్ శిష్యుడే. సిక్కు మత గ్రంథమైన ఆదిగ్రంథ్లో చెప్పులు కుట్టే చమార్ సంత్ రవిదాస్ బోధనలే అధికంగా ఉన్నాయి. ఆయన బోధనలతో ఉత్తర భారతదేశంలో అట్టడుగు వర్గాలు ఆత్మగౌరవంగా జీవిస్తూ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. రవిదాస్ మాదిగలకు ప్రశాంతమైన జీవితం స్వరాజ్యంలో లేదంటే శ్మశానంలో లభిస్తుందనీ చారిత్రక వాస్తవాన్ని చెప్పాడు. గురునానక్, సంత్ రవిదాస్ వంటి మహనీయుల బోధనలతో ప్రభావితమై కాన్షిరాం విప్లవం సృష్టించాడు. బహుజన రాజ్యాధికారానికి పునాది వేశాడు. నేడు ఆయన చైతన్యంతోనే బిసి, ఎస్సి, ఎస్టిలు సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు. సిక్కు మతంలో పురుషుల పేరు చివర ‘సింగ్’ అనే పదం చేర్చి మానసిక పరివర్తనగావించారు. దీనర్థం ‘సింహ’ (lion). ఇది ఈ చారిత్రకంగా దేశమూలవాసులుగా సమానత్వం, ధర్మం, రాజసత్వం, బలహీనుల రక్షించడం, ధైర్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయవేత్త డాక్టర్ విశారదన్ మహరాజ్ ఊరి బయట జీవిస్తున్న మాదిగలకు ‘మహారాజులు’గా నామకరణం చేశాడు. మాదిగలు ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించిన మహారాజులనే చారిత్రక వాస్తవాన్ని గుర్తు చేశారు. ఆత్మనూన్యత వీడి మళ్ళీ మహారాజులుగా (పాలకులుగా) పునర్జీవింపజేయడానికి 5 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. గురునానక్ కుల, మతాలను తిరస్కరించడం, సమానత్వాన్ని ప్రచారం చేయడం వంటి గొప్ప ఆదర్శాలతో అంబేద్కర్ ప్రేరేపితుడయ్యారు. గురునానక్ దళితులకు అత్యధిక గౌరవం ఇచ్చిన మత నాయకుడని, ఆయన బోధనలు దళితుల విముక్తి మార్గంగా ఉన్నాయని గుర్తించారు. చారిత్రకంగా భారత మనువాద సమాజంలో అట్టడుగు కులంగా దళితలు కులంపేరుతో తీవ్రంగా పీడనకు గురైనారు. ఈ క్రమంలో అంబేద్కర్ ‘కుల నిర్మూలన’ పోరాటంలో గురునానక్ నాయకత్వంలోని మత, సామాజిక విప్లవాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముంబయిలో ఉన్న గురునానక్ ఖల్సా కళాశాల స్థాపన అంబేద్కర్ ఆలోచనతో ఏర్పడింది. అన్ని వర్గాల వారికీ ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో దీనికి ప్రోత్సాహించారు. భారతదేశంలో ఇప్పటికీ కుల, మత ఉన్మాదాలు హెచ్చరిల్లుతున్నాయి. వీటి పేరుతో చాపకింది నీరులా దుర్విచక్షణ కొనసాగుతుంది. దీంతో అట్టడుగు అణగారినవర్గాలు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అస్తిత్వం అణచివేయబడుతుంది. ఆధిపత్య సాంస్కృతిక భావజాలం, ప్రభుత్వ విధానాలే దీనికి ప్రధాన కారణం. ఇవీ ప్రజలను రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయి. అంతిమంగా సామాజిక సంఘర్షణలకు కారణమవుతున్నాయి. కావున దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, మానవ విలువలను కోసం ఉద్యమించాల్సిన అవశ్యకత ఉంది. దీనికి గురునానక్ సామాజిక ఐక్యత తత్వం అవసరం. మరోవైపు ఆయన సామాజిక చైతన్య స్ఫూర్తిని, అస్తిత్వ వాదాన్ని అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగం మెజారిటీ ప్రజల హక్కులకు ప్రాధాన్యమివ్వడం జరిగింది. దీనికి విరుద్ధంగా భారత పరిపాలన, విధానాలు కొనసాగుతున్నాయి. దీంతో పీడితవర్గాల హక్కులు, అవకాశాలకు నష్టం జరుగుతుంది. నేడు సామాజిక న్యాయ పోరాటానికి గురునానక్ విలువలు, భారత రాజ్యాంగ సూత్రాలతో ఉద్యమించాల్సిన అవసరం ఉంది. - సంపతి రమేష్ మహారాజ్ - 7989579428
గొల్లపాలెంలో విషాదం కరెంట్షాక్తో యువకుడు మృతి చిత్తూరు, నవంబర్(ఆంధ్రప్రభ) : మొన్ననే పుట్టినరోజు
పొలంలో కాల్పులు.. వ్యక్తి మృతి.... దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి
లక్నో: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండడంతో ప్రియురాలి భర్తను ప్రియుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అగ్వాన్పూర్ గ్రామంలో అంజలి, రాహుల్ అనే దంపతులు నివసిస్తున్నారు. అంజలి అదే గ్రామానికి చెందిన అజయ్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వివాహేతర సంబంధానికి రాహుల్ అడ్డగా ఉండడంతో అతడిని చంపాలని ప్రియుడు ప్లాన్ వేశాడు. అగ్వాన్పూర్ గ్రామ శివారులో పొలంలో రాహుల్ పని చేసుకుంటుండగా అజయ్ తుపాకీ తీసుకొని అతడిపై కాల్పులు జరిపాడు. గ్రామస్థులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహంపై మూడు బుల్లెట్ గాయాలు కనిపించాయి. దారిదోపిడీదారులు డబ్బుల కోసం హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు లోతుగా విచారణ ప్రారంభించారు. అజయ్తో అంజలి పారిపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే పోలీసులు అజయ్ను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ప్రతిభకు పట్టం అమరానందకు నాలుగు బంగారు పతకాలు ఎండపల్లి, ఆంధ్రప్రభ: ఎండపల్లి మండలం
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల భవితవ్యానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక గీటురాయిగా మారనుంది. ఇది కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికగా కొట్టిపారేయలేని పరిస్ధితి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ఇది రెఫరెండమ్. రెండు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన భారత రాష్ట్ర సమితి జవజీవాలను నిర్ధారించే ఎన్నిక. అటు కేంద్రంలో పాలనతోనూ, ఇటు రాష్ట్రంలో అధికారంపైనా దృష్టిసారించిన బిజెపి భవిష్యత్తును ఖరారుచేసే ప్రజాభిప్రాయ వేదిక. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికను ఈ మూడు ప్రధాన పార్టీలు ఒక సవాలుగా తీసుకున్నాయి. అందువల్లే గతంలో హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ఓట్ల సమరాంగణంలో కోట్ల రూపాయిలను ఖర్చు చేసే పరిస్ధితి స్పష్టంగా కనిపిస్తోంది.ఎంఎల్ఎ మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీచేసేందుకు నవంబర్ 11న ఉప ఎన్నిక జరుగనుంది. 4 లక్షలకు పైగా ఓటర్లను కలిగిన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 58 మంది పోటీపడుతున్నారు. వీరిలో బిఆర్ఎస్ తరపున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బిజెపి పక్షాన లంకల దీపక్రెడ్డి ప్రధాన అభ్యర్థులు కాగా, వీరి మధ్యే పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన 55 మందికి కనీసం డిపాజిట్ దక్కే అవకాశాలు లేవనే చెప్పాలి. ఈ ముగ్గురిలో సునీత, దీపక్ రెడ్డి ఒసిలు కాగా, నవీన్ యాదవ్ బిసి కులానికి చెందినవారు. హైదరాబాద్లోని 15 నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం (నెంబర్ 61) సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి. ఈ నియోజవర్గంలో ఆరు డివిజన్లు, సుమారు 146 కాలనీలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే అత్యంత సంపన్నమైనదన్న ప్రచారానికి భిన్నంగా ఇక్కడ దినసరి కూలీలు, సినీ కార్మికులు, పేద మధ్య తరగతి ప్రజలే అత్యధికులు.నియోజకవర్గంలో ముస్లింలు బిసి కులాల తర్వాత ఒసి. ఎస్సి కులస్ధుల సంఖ్యే ఎక్కువ. 2009లో ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున పి. విష్ణువర్ధన్రెడ్డి ఎన్నిక కాగా, మాగంటి గోపీనాథ్ 2014 లో టిడిపి తరపున, 2018, 2023లో టిఆర్ఎస్ తరపున పాతినిధ్యం వహించారు. 2023 ఎన్నికల్లో గోపీనాథ్ 80,549 (43.95%) ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ 64,212 (35.03%) బిజెపి అభ్యర్థి లంకల దీపక్రెడ్డి 25,866 (14.12%) ఓట్లు, ఎంఐఎం అభ్యర్ధి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 (4.28%) ఓట్లు పొందారు. గోపీనాథ్ 16,337(8.91%)ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై విజయం సాధించగా, పోటీలో ఉన్న 19 మందిలో 16 మంది డిపాజిట్లు కోల్పోయారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 55 శాతం కంటే తక్కువగానే ఓట్లు పోల్ అవుతున్నాయి. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే వారిలో పేద మధ్య తరగతి వారే ఎక్కువ. అయితే ఈసారి ఉప ఎన్నికల అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినందున ఈసారి 4 లక్షల ఓట్లలో 75 శాతం వరకు ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఎవరు లక్షన్నర ఓట్లు సాధిస్తారో వారిని విజయం వరించే అవకాశాలున్నాయి. ఇక అభ్యర్ధుల విషయానికి వస్తే.. బిజెపి అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ఈసారి కూడా అధిష్టానం ఆలోచించి చాలా ఆలస్యంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. బిజెపి తరపున కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందరరావు ముందుండి ప్రచారం సాగిస్తున్నారు. కిరాయికి జెండా పట్టుకునే వారు కాకుండా కేవలం కార్యకర్తలే ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా దీపక్ రెడ్డికి జనసేన పార్టీ కూడా మద్దతు తెలపడంతో త్రిముఖ పోటీలో ఒకరిగా ఈయన గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై అభిమానం ఉన్నప్పటికీ అసెంబ్లీ స్థాయిలో అంతగా ఆదరించకపోవచ్చునని పలువురి మాటలను బట్టి తెలుస్తోంది. అయితే గతంలో కంటే ఈసారి దీపక్రెడ్డి గణనీయంగా ఓట్లను సాధించగలరని అంచనా. వాస్తవానికి ఇక్కడ హిందూ ముస్లిం అనే పోటీ లేకుండా ఎంఐఎం ఏకంగా తమ అభ్యర్థిని నిలపకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో బిజెపి తన ట్రంప్ కార్డును వినియోగించే అవకాశం లేకుండాపోయింది. అయినప్పటికీ అజారుద్దీన్కు మంత్రి పదవిని ఇవ్వడం సరికాదంటూ కాంగ్రెస్ను, గత పదేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందంటూ బిఆర్ఎస్పైనా నిప్పులు కురిపించింది. ఇవన్నీ ఆశించిన స్థాయిలో బిజెపికి ఈ ఎన్నికల్లో అనుకూలంగా మారే అవకాశాలు లేకపోయినా రానున్న కాలంలో మాత్రం తప్పకుండా ప్లస్ పాయింట్లగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ముస్లింలు అత్యధికంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 33% ముస్లిం ఓటర్లు ఉన్నందున బిజెపికి ఇక్కడ గెలుపు అందని ద్రాక్షగా మిగిలే సూచనలే కనిపిస్తున్నాయి. బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఆమెకు కుటుంబపరంగా కూడా ఇటు నామినేషన్ సమయంలోనూ, అటు ప్రచారాలు పరాకాష్టకు చేరుకున్న సమయంలోనూ సవాళ్లు తప్పలేదు. దివంగత గోపీనాథ్ రెండవ భార్య అయిన సునీత విషయంలో బిఆర్ఎస్ మొదటినుంచి స్ధిరాభిప్రాయంతోనే ఉంది.ఆమె పేరును బిఆర్ఎస్ బాస్ కెసిఆర్ స్వయంగా ప్రకటించి మరీ ఖర్చులకు డబ్బులిచ్చి పంపారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ప్రచారానికి రాకపోవడం ఒక విధంగా లోటే అని చెప్పాలి. కానీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్టార్ క్యాంపెయినర్గా మారి ఇటు కాంగ్రెస్, అటు బిజెపికి బదులిస్తూ ముందుకు సాగుతున్నారు. మరో స్టార్ హరీశ్ రావు కూడా ప్రచారం పీక్కు తీసుకువెళ్లే సమయంలోనే తండ్రి మృతి కారణంగా దాదాపు 11 రోజుల పాటు ప్రచారానికి దూరమయ్యారు. బిఆర్ఎస్ తరపున మిగిలినవారి ప్రచారం పెద్దగా ప్రభావం చూపకపోయినా మంచివ్యక్తిగా గోపీనాథ్ కుటుంబంపై సానుభూతి, గతంలో కెసిఆర్ అమలు చేసిన పెన్షన్లు ఇప్పటికీ చాలా మంది మదిలో ఉండిపోయాయి. అంతేగాక గోపీనాథ్ పెద్దకర్మ నుంచి దాదాపు ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ చాపకిందనీరులా తమ ప్రచారానికి తెరతీసింది. ఈసారి బిసిల ప్రతినిధిగా పోటీలోఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు.. ఈసారి అత్యధిక శాతం ముస్లింల, బిసిల మద్దతుతోపాటు యువత క్రేజీగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు దాదాపు మంత్రి వర్గం, పిసిసి కార్యవర్గం కాళ్లకు బలపంకట్టుకొని తిరుగుతున్నందున సహజంగానే కాంగ్రెస్ వైపు కొంత ఆర్భాటం కనిపిస్తోంది. మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్లతో పాటు 70 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించారు. ఆరు డివిజన్లకు మంత్రులను కేటాయించగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. ఈ నియోజక వర్గానికి 4వేల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, అంతకుముందే సుమారు 400 కోట్ల రూపాయిలతో అభివృద్ధి పనులు, 14 వేల కొత్త రేషన్ కార్డుల ఇలా కొన్ని జనాకర్షక పథకాలను ప్రజల్లోకి జొప్పించారు. వామపక్షాల మద్దతు, కోదండరాం వంటి ప్రముఖుల సహకారం, సినీ కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నాలు, హీరో సుమన్ ఇంటింటి ప్రచారం, దివంగత పిజెఆర్ తనయ, కార్పొరేటర్ విజయారెడ్డి ప్రచారాలు, మాలమహానాడు, 132 బిసి కులాల మద్దతు ఇవన్నీ నవీన్ యాదవ్కు కలిసొచ్చే అంశాలే. నవీన్యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తదితరులను రౌడీలుగా పేర్కొంటూ బిఆర్ఎస్ చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. గతంలో జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిని పెంచాయి. దీంతో వివిధ సంస్ధలు పోటీపడి సర్వేలు ప్రారంభించాయి. ఈ నియోజకవర్గంలో ఒక్కో ఓటరుకు రోజుకు కనీసం 10కిపైగా సర్వే కోసం ఫోన్లు వస్తూ ఎవరికి ఓటు వేస్తారంటూ వేధించాయి. ఈ నియోజకవర్గంలో పరిస్థితిని గమనిస్తే వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజూ కనిపించే అడ్డాకూలీలకు అడ్డగోలు డిమాండ్ ఏర్పడింది. ఒక్కొక్కరికి 600 రూపాయిల నుంచి 800 వరకూ ఇస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తూ జెండాలు మోసేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్ భారీ ఖర్చుకు తెరతీశాయి. నియోజకవర్గంలో బిఆర్ఎస్ పలు ప్రాంతాల్లో హైడ్రా బూచిని చూపిస్తూ కాంగ్రెస్ను అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కెసిఆర్ హయాంలోనే పెన్షన్లు వచ్చాయన్న కృతజ్ఞత కొంతమేర పెన్షనర్లలో ఉన్నా కాంగ్రెస్ మాత్రం కొత్త రేషన్ కార్డులు, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తోంది. కాగా ఎవరెంత ప్రచారం చేసినా ఆఖరి మూడు రోజుల్లో పోల్ మేనేజిమెంట్ కీలకం కానుంది. ఈ ప్రయత్నంలో సఫలమైన వారికి ఆధిక్యత లభించనుంది. ప్రస్తుత పరిస్ధితులను గమనిస్తే కనీసం 5 వేల మెజార్టీతోనైనా కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న ఊహాగానాలే వినిపిస్తున్నాయి. అయినా ఈ ఎన్నికల్లో గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా ప్రకటనలు ఇవ్వడానికి మూడు పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి. - దిమిలి అచ్యుతరావు (సీనియర్ జర్నలిస్ట్)
Koushik Gold Campaign: Jaanvi Radiates Royal Elegance
The world of premium jewelry has found its newest muse—Jaanvi Swarup Ghattamaneni. In a striking campaign reveal, Jaanvi steps into the limelight for Koushik Gold & Diamonds, becoming the brand’s latest face and a symbol of evolving elegance. Far beyond a traditional brand endorsement, Jaanvi’s campaign embodies a story of legacy and fresh beginnings. Audiences […] The post Koushik Gold Campaign: Jaanvi Radiates Royal Elegance appeared first on Telugu360 .
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం రేణిగుంట, ఆంధ్రప్రభ :
Decline in Ravi Teja’s Remuneration Demands
After Ravi Teja emerged as a bankable actor, his remuneration demands were strong enough and he kept increasing his remuneration as per the market deals of his films. He demanded and took Rs 25 crores pay and most of his producers tasted losses. But Ravi Teja was never bothered about the film’s result or his […] The post Decline in Ravi Teja’s Remuneration Demands appeared first on Telugu360 .
Nara Loksh : బీహార్ ఎన్నికల ప్రచారానికి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు పాట్నా బయలుదేరి వెళ్లనున్నారు.
జిల్లా హోదాకు దక్కని ప్రతిపాదన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, ప్రజల నుంచి
ఎందుకు చేశారు? తపాల్ పూర్ అడవుల్లో 100 చెట్ల నరికివేత..ముకుమ్మడిగా నరికిన మల్యాల
తెరమీదకు రాజంపేట కార్యాలయాల భవనాల కోసం అన్వేషణ అన్నమయ్య బ్యూరో (ఆంధ్రప్రభ) :
హృదయాన్ని తాకే భావోద్వేగాలతో..
దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రమణి కళ్యాణం. శుక్రవారం చిత్రబృందం అధికారికంగా టైటిల్ లుక్ను లాంచ్ చేశారు. కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి వంటి ప్రముఖులు టైటిల్ ని లాంచ్ చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలోని సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్తో అందమైన ప్రయాణంగా ఈ సినిమా ఉండబోతోంది. వినోదం, భావోద్వేగం, విలువలతో కూడిన కథను నిజాయితీగా చెప్పబోతున్నారు. రమణి కళ్యాణం తన అందమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లాంటి ఆసక్తికర అప్డేట్స్ రానున్నాయి.
షమీపై కక్ష సాధింపు ఎందుకు? అగార్కర్
చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తీరుపై మాజీల ఆగ్రహం ముంబై: టీమిండియా స్టార్ ఫాస్ట్ మహ్మద్ షమీపై సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ షమీపై చేస్తున్న వ్యాఖ్యలను వారు తప్పుపడుతున్నారు. ఫిట్నెస్ లేమీతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రాను అన్ని ఫార్మాట్లకు ఎంపిక చేస్తున్న సెలెక్టర్లు అసాధారణ ఫిటెనెస్తో రంజీ ట్రోఫీతో సహా పలు దేశవాళీ క్రికెట్ టోర్నీలలో వికెట్ల పంట పండిస్తున్న షమీపై నిర్లక్షం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఆటగాళ్లు ఆకాశ్ చోప్రా, యువరాజ్ సింగ్, శ్రీకాంత్, వెంగ్సర్కార్, గవాస్కర్, కపిల్ దేవ్, మనోజ్ తివారీ తదితరులు అగార్కర్పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. అతను కావాలనే షమీని టీమిండియాకు దూరం పెడుతున్నాడనే విషయం స్పష్టమవుతుందన్నారు. క్రికెట్లోఇలాంటి కక్ష సాధింపు చర్యలకు తావులేదన్నారు. ఇప్పటికైనా అగార్కర్ తన తీరును మార్చుకోవాలని వారు హితవు పలుకుతున్నారు. కొంత కా లంగా షమీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో అద్భుత బౌలింగ్ను కనబరుస్తు న్న సంగతి తెలిసిందే. బెంగాల్ తరఫున రంజీ బరిలోకి దిగిన షమీ రెండు మ్యాచుల్లోనూ తన జట్టుకు ఒంటిచేత్తో విజయం సాధించి పెట్టాడు. ఇంత అద్భుత ఫామ్లో ఉన్న షమీని సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్కు సెలెక్టర్లు దూరంగా ఉంచారు. పూర్తి ఫిట్నెస్తో లేకపోవడం వల్లే అతన్ని సఫారీ సిరీస్కు ఎంపిక చేయలేదని ప్రధాన కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ పేర్కొన్నారు. దీనిపై షమీ అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గంభీర్, అగార్కర్ల వల్ల సీనియర్లు చాలా అవమానాలను భరీంచాల్సి వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వీరి అవమానాలు భరించలేక సీనియర్లు అశ్విన్, రోహిత్, కోహ్లి తదితరులు టెస్టు ఫార్మాట్కు రిటైర్మెం ట్ ప్రకటించిన విషయాన్ని మాజీ క్రికెటర్లు గుర్తు చేశారు. షమీ కూడా నేడో రేపో ఆటను గుడ్బై చెప్పినా ఆశ్చర్యం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా షమీలాంటి సీనియర్ బౌలర్లకు టీమిండియాలో చోటు కల్పించాలని ఇది జట్టుకు ఎంతో మేలు చేస్తుందని వారు సూచిస్తున్నారు. షమీకి సుప్రీం కోర్టు నోటీసులు ఇప్పటికే టీమిండియాకు దూరమై బాధలో ఉన్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ షమీకి మరో షాక్ తగిలింది. షమీ మాజీ భార్య హసీన్ జహాన్కు సంబంధించిన కేసులో షమీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నెలనెలా తనకు భరణం, కుమార్తె సంరక్షణ కోసం చెల్లిస్తున్న రూ.4 లక్షల భరణం సరిపోవడం లేదని హసీన్ జహాన్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశా రు. దీనిపై సమాధానం ఇవ్వాలని షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
India vs Australia T20 : ఆఖరిపోరుకు అంతా సిద్ధం.. సిరీస్ తేలేది నేడే
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య చివరి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదన్నది తేల్చనుంది
ఇంజన్ లో మంటలతో పూర్తిగా దగ్ధం
ఇంజన్ లో మంటలతో పూర్తిగా దగ్ధం చిట్యాల మండలం గుండ్రంపల్లి జాతీయ రహదారి
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతాదళాలు
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతాదళాలు ఆపరేషన్ ప్రారంభించాయి
“షుగర్ బాధితులకు అమెరికా వీసా కష్టం” #USVisa #HealthRules #Immigration #Obesity #Diabetes #America
Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనేక విమానాలు ఇంకా బయలుదేరలేదు
కాకినాడలో కారు బీభత్సం: ముగ్గురు విద్యార్థులు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో సోమవరం వద్ద కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి విద్యార్థులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సు షెల్టర్లో విద్యార్థులు ఉండగా వారిపైకి కారు దూసుకెళ్లింది. కారు ముందు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. స్థానిక ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రూ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Weather Report : క్యుములోనింబస్ మేఘాలు.. వానలు ఇక్కడే కురుస్తాయట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
రూ.లక్ష విలువ కలప పట్టివేత.. లోతుర్రెలో అటవీశాఖ అధికారుల సోదాలు జన్నారం,నవంబర్ 8
Raod Accident : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు
బ్రిస్బేన్, (ఆంధ్రప్రభ): టీమిండియా – ఆస్ట్రేలియా మధ్య నేడు కీలకమైన ఐదవ టీ20
12 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు పెద్దపల్లి ఆంధ్రప్రభ : మతిస్థిమితం లేక కన్నవారిని,
Pawan Kalyan : నేడు తిరుపతికి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు
అలరించలేకపోయిన ‘ది గర్ల్ ఫ్రెండ్’
ఇటు సౌత్, అటు బాలీవుడ్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకు పోతున్న రష్మిక మందన్న నటించిన సినిమా ’ది గర్ల్ ఫ్రెండ్’. ఇప్పటివరకు పలు కమర్షి యల్ సినిమాలతో మెప్పించిన ఈ భామ ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి ప్రయోగాత్మక సినిమా చేసింది. నటుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం శుక్రవారం మంచి అంచ నాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ అంచనాలను సినిమా ఏమేరకు అందుకుందో చూద్దాం. కథ: భూమా (రష్మిక) హైదరాబాదులోని ఓ కాలేజీలో ఎంఏ ఇంగ్లీ ష్ లిటరేచర్ కోర్సులో చేరుతు ంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చదువుతుంటాడు. అతడిని దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) ఇష్టపడుతుంది. కానీ దీక్షిత్.. భూమాతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె వెంట తిరిగి తనూ ప్రేమలో పడే లా చేస్తాడు. ఒక రకమైన అయోమ య స్థితిలో విక్రమ్ తో ప్రేమలోకి వె ళ్తుంది భూమా. కానీ ప్రేమలో పడ్డాక విక్రమ్ పెట్టే కండిషన్లు.. తన ప్రవర్తనతో భూమా ఇబ్బంది పడుతుంది. మరి విక్రమ్ తో భూమా బంధం ఏమేర నిలబడింది.. చివరికి వీళ్లిద్దరి జీవితాలు ఏ మలుపు తీసుకున్నాయి.. అన్నది మిగతా కథ. కథనం, విశ్లేషణ: ఈ లవ్ స్టోరీ ప్రేమికులు అందరికీ నచ్చదు. కేవలం తక్కువ మందికి మాత్రమే సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కథా, కథనాలు మిగతా వారికి అంతగా రుచించకపోవచ్చు. రెం డు విభిన్నమైన పాత్రలు భూమా, విక్రమ్ లవ్ ట్రాక్ కొన్నిసార్లు బోర్ కొట్టిస్తుంది. పలు సన్నివేశాల్లో అక్కడక్కడా సాగదీత ఫీలింగ్ కలుగుతుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ భూమా పాత్ర ఉంటుంది. ఏం చేస్తోందో, ఏం చేయాలో తెలియని సందిగ్థ స్థితి ఆమెది. ఇందు లో భూమా పాత్ర పట్ల ఎవరికీ కనీసం సానుభూతి కూడా కలగదు. ఏమిటీ ఇలా ప్రవర్తిస్తోందనే చికాకు కలుగుతుంది. కొన్ని సన్నివేశాలతో కొందరికి తీవ్రమైన అసహనం కలగొచ్చు. హీరో తల్లికి.. కథానాయికకు మధ్య వచ్చే సన్నివేశం కూడా ఈ కోవకు చెందిందే. ఇలాంటి హార్డ్ హిట్టింగ్ సీన్లు నచ్చడం.. నచ్చకపోవడాన్ని బట్టి సినిమా రుచిస్తుందా లేదా అన్నది చెప్పొచ్చు. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి తమ నటనతో ఆకట్టుకున్నారు. అను ఇమ్మాన్యూల్, ప్రొఫెసర్ పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్ ఓకే అనిపించారు. మొత్తానికి ‘ది గర్ల్ ఫ్రెండ్’ అందరినీ అలరించే సినిమా కాదు.
నేడు నర్సంపేటకు కల్వకుంట్ల కవిత నర్సంపేట నవంబర్ 8 (ఆంధ్రప్రభ): సామాజిక తెలంగాణ
Gold Rates Today : బంగారంపై వ్యామోహం ఉన్నవారికి గుడ్ న్యూస్.. నేటి ధరలు ఎంతో తెలుసా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
బ్రిస్బేన్: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా శనివారం ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగే ఐదో, చివరి టి20 పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక రెండుటి20 మ్యాచుల్లో వరుస ఓటములు చవిచూసిన ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఈ పోరు సవాల్గా మారింది. సిరీస్ను సమం చేయాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. దీంతో ఆసీస్ టీమ్పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే ఎటువంటి స్థితిని అయినా తట్టుకుని ముందుకు సాగే సత్తా ఉన్న కంగారూ టీమ్ను తక్కువ అంచనా వేయలేం. సమష్టిగా రాణిస్తే సిరీస్ను డ్రాగా ముగించడం ఆస్ట్రేలియాకు అసాధ్యమేమీ కాదు. ఓపెనర్లపైనే ఆశలు.. టీమిండియా ఆశలన్నీ ఓపెనర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మలపై నిలిచాయి. కిందటి మ్యాచ్లో ఇద్దరు జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించారు. అయితే శుభారంభం అందిస్తున్న ఇటు గిల్ అటు అభిషేక్లు ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోతున్నారు. దీంతో జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు కీలకమైన ఈ మ్యాచ్లో ఓపెనర్లు నిలకడైన బ్యాటింగ్ను కనబరచాల్సినఅవసరం ఎంతైనా ఉంది. కిందటి మ్యాచ్లో గిల్ మెరుగైన బ్యాటింగ్తో అలరించాడు. ఇది జట్టుకు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. అభిషేక్, గిల్లు తమ మార్క్ బ్యాటింగ్తో చెలరేగితే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మలు పేలవమైన బ్యాటింగ్తో నిరాశ పరుస్తున్నారు. జట్టును ముందుండి నడిపించడంలో సూర్య విఫలమవుతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న సూర్య తన మార్క్ బ్యాటింగ్ను కనబరచలేక పోతున్నాడు. కనీసం ఈసారైనా అతను బ్యాట్ను ఝులిపించాల్సి ఉంది. వికెట్ కీపర్ జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె తదిరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. సుందర్ ఫామ్లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశమే. అర్ష్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్లో భారత్ పేవరెట్గా బరిలోకి దిగుతోంది.
Telangana : నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం
తెలంగాణలో ప్రయివేటు విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి
గుడికి వస్తుంటే నా భార్యనే తీసుకెళ్లావా... దేవుడా
అమరావతి: దేవుని గుడికి దంపతులు వెళ్తుంటే బైక్ను ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో భార్య ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెరుమాలి గ్రామానికి చెందిన కొరగంజి సంఘంనాయుడు(49), శ్రీలత(43) అనే దంపతులు మానసాదేవి గుడిని దర్శించుకునేందుకు బైక్పై వెళ్లారు. గరివిడి మండలం చిన ఐతాంవలస గ్రామ శివారులోకి రాగానే ఆర్టిసి బస్సు వీరి బైక్ను ఢీకొట్టడంతో భార్య కిందపడిపోయింది. భార్య తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. భర్త కూడా తీవ్రంగా గాయపడ్డాడు. 'దేవత నీ దగ్గరికి వస్తుంటే నా భార్యనే తీసుకెళ్లావా?' అని భర్త కన్నీంటి పర్యంతమయ్యారు. 'ఇప్పుడు నా బాగోగులు ఎవరు చూసుకోవాలి' అని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య మృతదేహం పట్టుకొని భర్త రోదించిన తీరు చూసి వాహనాదారులు కన్నీంటిపర్యంతమయ్యారు.
Tirumala : శనివారం.. తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
Prabhas puts Legends in Waiting Mode
Prabhas is the biggest pan-Indian actor of the country and he has several biggies lined up. The delay in the shoot of Raja Saab has delayed the shoot of Fauji and this delayed Sandeep Reddy Vanga’s Spirit. Sandeep Reddy Vanga has been waiting for the arrival of Prabhas since summer and he wants Prabhas to […] The post Prabhas puts Legends in Waiting Mode appeared first on Telugu360 .
ఏలూరులో కలకలం ఏలూరు కార్పొరేషన్ : నవంబర్8 (ఆంధ్రప్రభ): ఏలూరు ఒకటో పట్టణ
Kerala : కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం
కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. శబరిమలలో ప్లాస్టిక్ , షాంపూ సబ్బులను హైకోర్టు నిషేధించింది.
పోచారం కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం3 వేల గన్నీ బ్యాగులు దగ్ధం నాగిరెడ్డిపేట
Karnataka : కర్నూలు బస్సు ప్రమాదంతో అలెర్ట్.. కర్ణాటక 604 బస్సులు సీజ్
కర్నూలు ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ బస్సు భద్రతపై కఠిన చర్యలు తీసుకుంది.
అది నిజమే అని క్లారిటీ ఇచ్చిన సమంత
హైదరాబాద్: హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు గత కొంతకాలంగా చెట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు. ఇద్దరు ప్రేమ మైకంలో మునిగిపోయారని సినీ వర్గాల్లో షికార్లు పుకార్లు చేశాయి. సమంత షేర్ చేసిన ఫొటో ఇప్పుడు నిజమని తెలుస్తోంది. రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తుందని తెలుస్తుంది. పెర్ప్యూమ్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్లో సమంత దిగిన ఫొటో వైరల్గా మారింది. ఈవెంట్లో పలువురితో ఫొటోలు దిగిన అనంతరం తన ప్రయాణాన్ని సమంత గుర్తు చేసుకున్నారు. గత సంవత్సరం నుంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నానని, కుటుంబసభ్యులు, స్నేహితుల మద్దతు ఇవన్నీ చేయగలిగానని వివరణ ఇచ్చింది. రిస్క్ తీసుకొని ముందుకు ఎలా వెళ్లాలో నిర్ణయం తీసుకున్నానని, చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నానని సమంత తెలియజేశారు. హార్డ్ వర్క్, ప్రతిభావంతులతో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సిటడెట్: హనీ బన్నీ, ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్2 సినిమాలలో సమంత నటించారు. ఈ సినిమాకుల రాజ్ డికె నిర్మాత వ్యవహరించారు. రెండు ప్రాజెక్టుల కోసం పని చేస్తున్న సమయంలో రాజ్కు, సమంతం స్నేహం ప్రేమగా మారింది. శుభం, మా ఇంటి బంగారం సినిమాలో సమంత నటిస్తుండగా రాజ్ తెరకెక్కిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబ్ పేల్చాడు. షుగర్, ఒబెసిటీ ఉన్నోళ్లకు అమెరికా వీసా ఇవ్వలేమని స్పష్టం చేశారు
Bigg boss Telugu 9: Was Sanjana intentionally sidelined by the Makers?
Sanjana, once hailed as the “Queen of Content” in Bigg Boss Telugu 9, now finds herself at the center of a heated debate among fans. Many are questioning whether the show’s management team intentionally sidelined her after initially using her for high engagement and drama in the early weeks. Queen of Content : In the […] The post Bigg boss Telugu 9: Was Sanjana intentionally sidelined by the Makers? appeared first on Telugu360 .
Telangana : ఢిల్లీ నుంచి బయలుదేరిన మయన్మార్ సైబర్ ఫ్రాడ్ బాధితులు
మయన్మార్ మయవాడీలోని సైబర్ నేరాల శిబిరాల్లో చిక్కుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన తెలంగాణ పౌరులకు ప్రభుత్వం అండగా నిలిచింది.
Bigg Boss Telugu 9: Emmanuel Becomes Captain for 3rd time Amid Chaos and Controversy
The race for the ninth captaincy in Bigg Boss Telugu 9 turned out to be one of the most dramatic tasks of the season. With six contenders — Divya, Suman Shetty, Tanuja, Ritu, Emmanuel, and Bharani — battling fiercely, alliances shifted rapidly, friendships broke, and emotions ran high throughout the episode. Strategy Before the Storm […] The post Bigg Boss Telugu 9: Emmanuel Becomes Captain for 3rd time Amid Chaos and Controversy appeared first on Telugu360 .
India vs Australia : నేడు భారత్ - ఆస్త్రేలియా టీ20 మ్యాచ్
భారత్ - ఆస్ట్రేలియాలో చివరి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కీలకం కానుంది
డిసెంబరు 30 నుండి జనవరి 8వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం
• ఆఫ్లైన్, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియజేస్తాం • అంగప్రదక్షిణం టోకెన్లు ఆన్లైన్ పద్ధతిలో ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన కేటాయింపు • డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల, 2025 నవంబరు 07: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని, ఇందుకోసం ఆఫ్లైన్, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియజేస్తామని టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో 17 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 1.శ్రీ రమేష్, మహారాష్ట్ర. ప్రశ్నః వైకుంఠ ఏకాదశి టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు? ఈవోః భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుని పారదర్శకంగా టోకెన్లు కేటాయించేందుకు చర్యలు చేపట్టాం. త్వరలో వివరాలు తెలియజేస్తాం. 2.కిరణ్, గుంటూరు. ప్రశ్నః దివ్యాంగుల దర్శనంలో సహాయకులను తీసుకొచ్చేందుకు అనుమతించండి? క్యూలైన్ లో వెయిటింగ్ లేకుండా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోండి? ఈవోః దివ్యాంగులకు శ్రీవారి సేవకుల సహాయంతో దర్శనానికి వెళ్లే ఏర్పాటు ఉంది. భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు క్యూలైన్ల నిర్వహణ తప్పనిసరి. 3. గోకుల్, బెంగుళూరు. ప్రశ్నః ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం సాధ్యపడటం లేదు? ఈవోః లక్షలాది మంది భక్తులు దర్శనం టికెట్ల బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తిరుపతిలో రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఆన్ లైన్ లో కోటా పెంచడం వీలు పడదు. 4.మణికంఠ, అనంతపురం. ప్రశ్నః ఆన్ లైన్ లో దర్శన టికెట్ల బుకింగ్ సమయంలో ఓటీపీ రావడానికి ఆలస్యమవుతోంది? దర్శన క్యూలైన్ లో సిబ్బంది తోసేస్తున్నారు. ఈవోః భక్తుల సలహాలు, సూచనల మేరకు ఓటీపీ విధానం తీసుకురావడం జరిగింది. మీ సమస్యను పరిష్కరిస్తాం. దర్శన క్యూలైన్ లో భక్తులతో మెలిగే విధానంపై శ్రీవారి సేవకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. 5.శంకర్ గౌడ్, హైదరాబాద్. ప్రశ్నః మూడు నెలలు అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకునే విధానం ఇబ్బందిగా ఉంది? ప్రతిరోజూ టికెట్లు బుక్ చేసుకునే విధానం ఉంటే బాగుంటుంది? ఈవోః భక్తులందరికీ ఇబ్బంది లేకుండా అడ్వాన్స్ బుకింగ్ విధానం తీసుకురావడం జరిగింది. 6.గణేష్, కడప. ప్రశ్నః 2023లో ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ నియామకాలు జరగలేదు? ఈవోః ఈ విషయం నా దృష్టికి వచ్చింది. 15 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాం. 7.జగన్, జగిత్యాల. ప్రశ్నః ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్ లైన్ కోట పెంచుతామన్నారు. ఎస్ఎస్ డి టోకెన్ తీసుకునేందుకు ప్రత్యేక లైను ఏర్పాటు చేయండి? ఈవో : ఆన్ లైన్, ఆఫ్ లైన్ దర్శనం టోకెన్ల జారీపై టీటీడీ బోర్డు కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా భక్తులు నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. 8. ఈశ్వర్, అనంతపురం ప్రశ్న తిరుమలలో కొంతమంది ప్రజాప్రతినిధుల పీఆర్వోలు అధిక రేట్లకు దర్శనం టికెట్లు అమ్ముతున్నారు కట్టడి చేయండి. ఈవో : గౌరవ ప్రజాప్రతినిధులకు టీటీడీ ఈ సౌకర్యం కల్పించింది. కొంతమంది దళారులు డబ్బు తీసుకొని భక్తులను మోసగిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దళారులను నమ్మవద్దు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పొంది స్వామివారిని దర్శించుకోండి. 9. రవికుమార్, కావలి ప్రశ్న : విద్య వైద్య రంగాలలో టిటిడి చేస్తున్న కృషి అభినందనీయం, టిటిడి ఆధ్వర్యంలో ఐ బ్యాంక్ స్థాపించండి, శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో నేత్రదానం చేస్తారు. ఈవో : తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఆరోగ్య సమస్యలు లేకుండా వైద్య సౌకర్యాలు అందిస్తుంది. శ్రీవారి భక్తులకు నేత్రదానంపై అవగాహన కల్పించేందుకు సాధ్యసాధ్యాలు పరిశీలిస్తాం. 10. ముని లక్ష్మి, తిరుపతి ప్రశ్న : తిరుపతిలో ఎస్ఎస్ డి టోకెన్లు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇస్తున్నారు. దర్శనం టోకెన్లు ఉదయం ఇవ్వడం వల్ల భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఆన్ లైన్ లో శ్రీనివాస దివ్యనుగ్రహ హోమం బుక్ చేసుకో నేందుకు తల్లిదండ్రులకు మాత్రమే అవకాశం ఉంది పిల్లలకు రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేయండి. విఐపిల దర్శనాల సంఖ్య తగ్గించండి. టిటిడి కాల్ సెంటర్లో ఉచితంగా సేవలు అందించే అవకాశం కల్పించండి. ఈవో : ఎస్ఎస్ డి టోకెన్ల జారీ సమయం మార్పుపై కమిటీ పరిశీలిస్తుంది. హోమం టికెట్లు మొత్తం కుటుంబానికి కేటాయించే విషయం పరిశీలిస్తాం. విఐపి లకు కేటాయించే దర్శన సమయం తక్కువ, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం. శ్రీవారి సేవకురాలిగా కాల్ సెంటర్ లో సేవలు అందించేందుకు త్వరలో విధివిధానాలు రూపొందిస్తున్నాం. 11. హరిణి, బెంగుళూరు ప్రశ్న : వయోవృద్ధులు దర్శనం టోకెన్లు పొందేందుకు ఆధార్ అప్ లోడ్ చేసేలోపు టికెట్లు అయిపోతున్నాయి. దీనిని పరిశీలించగలరు. ఈవో : భక్తులు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో వారి డేటా పొందుపరిచారు. టికెట్లు బుక్ చేసే సమయంలో మళ్ళీ ఆధార్ అప్ లోడ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. 12. రమేష్ బెంగళూరు ప్రశ్న : శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం నిర్వహించే మండపంలో ఒక చోట మాత్రమే తాగునీరు ఉంది. మరొకటి ఏర్పాటు చేయండి. ఈవో : చర్యలు తీసుకుంటాం. 13. సాయి చరణ్, ఖమ్మం ప్రశ్న : శ్రీవారి దర్శనం టికెట్లు పొందే సమయంలో క్రెడిట్, డెబిట్ కార్డులు బదులుగా ఆర్బిఐ సూచించిన యూపీఐ ద్వారా చెల్లించే సౌలభ్యం కల్పించండి. ఈవో : ఐటీ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటాం. 14. వాసు రావు హైదరాబాద్ ప్రశ్న : సప్తగిరి మాసపత్రిక నెల నెల రావడం లేదు. ఈవో : సప్తగిరి మాస పత్రిక చందాదారులందరికీ ప్రతి నెల అందేలా చర్యలు తీసుకుంటాం.
Tiruapathi : తిరుపతి ఎస్వీయూనివర్సిటీలో చిరుత సంచారం
తిరుపతిలోని ఎస్వీయూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపుతుంది.
Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది
కెటిఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు చీడ పురుగుల్లా అభివృద్ధి కి అడ్డుపడుతూ బ్యాడ్ బ్రదర్స్గా గుర్తింపు తెచ్చుకున్నారని సిఎం రేవంత్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ను ఓడించాలని, బిజెపికి డిపాజిట్ దక్కరాదని ఆయన ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రేవంత్రెడ్డి శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడు తూ బిఆర్ఎస్, బిజెపిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీ న్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004-2014 మధ్య కాలంలో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అ భివృద్ధి చెందిందని తెలిపారు. ఓఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్ర యం, మెట్రో రైలు ఇంకా ఎన్నెన్నో పథకాలను తీసుకుని వచ్చామని ఆయన వివరించారు. కాగా 2014 నుంచి కేంద్రంలో బిజెపి, రా ష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి చేసింది శూ న్యమని ఆయన విమర్శించారు. హైదరాబాద్లో ఎటువంటి అభివృ ద్ధి జరగలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు రూ. 16 వేల కో ట్ల మిగులు బడ్జెట్ ఉందన్నారు. 2023 సంవత్సరంలో కెసిఆర్ తెలంగాణను ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్కు ప్రభుత్వా న్ని అప్పగించారని ఆయన తెలిపారు. గతంలో ఐటిఐఆర్ను కూడా మంజూరు చేసి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదని ఆయన తెలిపారు. వరదలు వచ్చి హైదరాబాద్ నీట మునిగితే కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అణాపైసా కూడా లేదని ఆయన దుయ్యబట్టారు. అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా పేదల ఆస్తులు కోల్పోయి నష్టం జరిగితే వారికి ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. బిఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, కమాండ్ కంట్రోలు, సచివాలయం, ప్రగతి భవన్ నిర్మించారని, దీని వల్ల పేదలకు ఏమైనా ఉపయోగపడిందా? అని ఆయన ప్రశ్నించారు. కుమారున్ని సిఎం చేయడానికే, వాస్తు సరిగ్గా లేదన్న భావనతో మంచిగా ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్తగా నిర్మించారని ఆయన విమర్శించారు. దీంతో కొత్త ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. విపక్షాలపై, మీడియా వారిపై నిఘా పెట్టేందుకే బంజారాహిల్స్లో కమాండ్ కంట్రోలు పెట్టారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్ళలో కూలిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్, కెటిఆర్ మెట్రో రైలును పొడిగించలేదని, ఎల్అండ్టిని బెదిరించి, బ్లాక్మెయిల్ చేశారని ఆయన విమర్శించారు. మెట్రో విస్తరణకు రూ. 73 వేల కోట్లతో ప్రణాళికను కేంద్రానికి ఇచ్చామని ఆయన చెప్పారు. గతంలో కాంగ్రెస్ నేతలు పి. జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి కోసం పోరాడితే వారికి ‘హైదరాబాద్ బ్రదర్స్’ మంచి పేరు లభిస్తే, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కెటిఆర్ అభివృద్ధికి అడ్డుపడుతున్నందున బ్యాడ్ బ్రదర్స్గా గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన విమర్శించారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ప్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్కు ఇరవై టిఎంసిల జలాలు తేవాలనుకుంటే అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇంకా ఫైవోవర్ల నిర్మాణం, అండర్ పాస్లు, ఎలివేటెడ్ కారిడార్లకూ అడ్డుపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న కంటోన్మెంట్ నుంచి శామీర్పేట్, మేడ్చల్కు, ఎలివేటెడ్ కారిడార్లకు అనుమతి తెచ్చి ఐదు వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామని ఆయన వివరించారు. భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలన్న ఆలోచనతో 2047 విజన్ డాక్యుమెంట్తో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలు లోక్సభ ఎన్నికలతోనే సరిపోయిందన్నారు. మిగిలిన సంవత్సరంన్నర కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తేగలిగామని అన్నారు. లక్ష కోట్ల ఆదాయం లభించే ఓఆర్ఆర్ను ఏడు వేల కోట్ల రూపాయలకు గత ప్రభుత్వం అమ్ముకున్నదని ఆయన దుయ్యబట్టారు. దీపావళి రోజున డ్రగ్స్ పట్టుబడిన వారిని ఏమనాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పట్టుబడిన వ్యక్తి కెటిఆర్కు సన్నిహితుడని ఆయన తెలిపారు. స్కూల్ పిల్లలకు డ్రగ్స్ చాక్లెట్లు విక్రయించారని ఆయన చెప్పారు. మద్యం తాగితే పట్టుబడ్డ వారికి జరిమానా, జైలు శిక్ష ఉంది కానీ గంజాయి సేవించిన వారికి శిక్ష లేదన్నారు. ఈ విషయమై తాము వచ్చే అసెంబ్లీలో చర్చించి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. హైదరాబాద్లో నలభై నాలుగు చెరువులను కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. అంబర్పేటలో బతకమ్మ కుంటను కాపాడడమే కాకుండా అది ప్రజలకు ఉపయోగపడేలా చేశామని ఆయన తెలిపారు. ఈ కుంటను బిఆర్ఎస్కు చెందిన నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆక్రమించారని, దీనికి ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. నాగార్జునకు ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకపోతే ఎన్-కన్వెన్షన్ను కూల్చి వేసామని ఆయన తెలిపారు. అహ్మదాబాద్లో సబర్మతి ప్రక్షాళన, యూపీలో యమునా నది ప్రక్షాళన చేశారని, అయితే నగరంలో మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. అడుగడుగునా అవినీతి జరిగిందని, చివరకు యాదగిరి గుట్ట, కోవిడ్ను కూడా వదలలేదని ఆయన విమర్శించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూం నిర్మించుకున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తాను ప్రస్తుతం ఆ నివాసంలో ఉంటున్న డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్కను అడిగి తెలుసుకున్నానని అన్నారు. గతంలో సద్దాం హుస్సేన్కు ప్రాణ భయం ఉండేదని, దీంతో తనలాగే పోలిక ఉన్న ఆరుగురిని తయారు చేయించి, ముందుకు ఏదైనా కార్యక్రమానికి పంపించే వారని దీంతో దుండగులు దాడి చేసేందుకు అవకాశం ఉండేది కాదట అని చదివానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆగర్భ శ్రీమంతులు టివీలు, పేపర్లను స్థాపించారని ఆయన విమర్శించారు. ప్రజలను ఎంత కాలం మభ్య పెడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మాగంటి గోపి మరణంపై.. మాగంటి గోపినాథ్ మరణంపై రాజకీయాలు చేయవద్దని ఆయన కోరారు. అయితే మాగంటి గోపి తల్లి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా గోపి మరణంపై మాట్లాడడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, బండి సంజయ్ మాదాపూర్ పోలీసు స్టేషన్లో, లేదా డిజిపికి లేఖ రాసినా విచారణ జరిపిస్తామన్నారు. గద్దరన్న అవార్డులను ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : ఇప్పటికే భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు, ప్రజలకు
జూబ్లీహిల్స్లో నిశ్శబ్ద విప్లవం
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ని శ్శబ్ద విప్లవం రాబోతుందని బిఆర్ఎస్ పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి త న్నీరు హరీష్రావు అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతో రాష్ట్ర భవిష్యత్కు దశ దిశ ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. జూబ్లీహిల్స్ తీర్పు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రెండేళ్ల రేవంత్ పాలన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్ర జలు చరమగీతం పాడనున్నారని అన్నారు. కెసిఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో విధ్వంసం అని, జూబ్లీహిల్స్ ఎన్నిక వికాసానికి, వి ధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో ఎ న్నికలు నాలుగు లక్షల మంది భవిష్యత్తు కాదు అని, ఈ ఉప ఎన్నిక నా లుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తుందని స్పష్టం చే శారు. బిఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ. 5300 కోట్లతో పనులు చేశామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో ప్రజలు ఇచ్చే తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే మూడేళ్లపాటు నరకయాతన అనుభవించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఆలోచించి ఆత్మసాక్షిగా ఓటు వేయాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీష్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చెప్పుకోవడానికి ఏమీ లేకనే.. జూబ్లీహిల్స్లో రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ చేసి జూబ్లీహిల్స్లో ఓట్లు వేయించుకోవాలని రేవంత్ చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటు వేయకుంటే.. రేషన్ కార్డులు ఆగిపోతాయని, పెన్షన్లు రావని అంటున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు రేవంత్ ఇంట్లో నుంచి ఇస్తున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదని అన్నారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమాచార హక్కు చట్టం ఉపయోగించి రియల్ ఎస్టేట్ వర్గాలను, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ బెదిరింపులకు ఎవరూ భయపడద్దని, ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బిఆర్ఎస్ ప్రజల గొంతుగా పోరాడుతుందని తెలిపారు. జూబ్లీహిల్స్లో ప్రజలు ప్రశ్నించే గొంతును గెలిపించాలని కోకారు. రాష్ట్రంలో రెండే టీమ్లు ఉన్నాయని ఒకటి ఆరు గ్యారంటీఉల ఎగ్గొట్టిన టీమ్ అయితే రెండోది ఆరు గ్యారంటీల అమలుపై గల్లా పట్టి అడిగే టీమ్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో నలుగురు బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు రేవంత్రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదని హరీష్రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో నాలుగు కోట్ల ప్రజలు కాదు.. నలుగురు బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. హామీ ఇచ్చిన గ్యారంటీలు ఎగ్గొట్టిన ప్రభుత్వం రేవంత్రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ అడుగుతున్న కళాశాలను రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను కెసిఆర్ కొనసాగించారని గుర్తుచేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.19500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేశామని, కరోనా సమయంలో కూడా నిధులు ఆపలేదని చెప్పారు. రెండేళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు రూపాయలు కూడా ఇవ్వలేదని, దాంతో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కాలేజీ యాజమాన్యాలు నిరవధిక బంద్కు దిగాయని అన్నారు. ఆ కాలేజీల్లో చదువుతున్న పిల్లలు జూబ్లీహిల్స్లో కూడా ఉన్నారని చెప్పారు. ఆరోగ్య శ్రీ వైఎస్ఆర్ తెచ్చిన పథకం అని గొప్పలు చెప్పడం కాదు.. ఆ పథకం అమలు చేయడం లేదని విమర్శించారు.ఆరోగ్య శ్రీ బకాయిలు అడిగితే ఆసుపత్రులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కాలేజీలు, ఆసుపత్రులు బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు డిఎలు, పిఆర్సి అడిగితే ఉద్యోగులపై ఎసిబి దాడులు చేస్తున్నారని అన్నారు. దేశంలో అత్యధిక డి.ఎలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం మన తెలంగాణ అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇచ్చేందుకు డబ్బులు లేవు కానీ, కమీషన్లు వచ్చే మూసీ అభివృద్ధి పనులుకు, ఫ్యూచర్ సిటీ పనులకు డబ్బులు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. హైడ్రా విషయంలో డిప్యూటీ సిఎం భట్టి, సిఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. 13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చెరువులో ఉన్నాయని, ఆ ప్రాజెక్టులు ఎవరివి అయినా కూల్చివేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రెస్మీట్ చెప్పారని, తర్వాత వాటి గురించి మాట్లాడలేదని ఆరోపించారు. డిప్యూటీ సిఎం ప్రెస్మీట్ పెడితే, సిఎం సెటిల్మెంట్ చేసుకున్నారని ఆరోపించారు. హైడ్రా పేదల ఇళ్లను కూలగొడుతూ పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని అన్నారు. బిఆర్ఎస్ ఒత్తిడితోనే ముస్లింలకు మంత్రి పదవి కంటోన్మెంట్లో కడతామన్న ఆరు వేల డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎక్కడ..? అని హరీష్రావు సిఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి కంటోన్మెంట్లో గెలిచారని విమర్శించారు. బిఆర్ఎస్ ఒత్తిడితోనే ముస్లింలకు మంత్రి పదవి వచ్చిందని, తమ ఒత్తిడితోనే ఎన్టిఆర్, పిజెఆర్ విగ్రహాల హామీలు ఇస్తున్నారని పేర్కొన్నారు. రెండేళ్ళుగా అజహారుద్దీన్కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సినీ యాక్టర్స్ను జైల్లో పెట్టిన రేవంత్.. సినీ కార్మికులకు ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. 2023లో పిజెఆర్ కొడుకుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని అడిగారు. కాంగ్రెస్ అరాచకం, మంత్రి పదవి ఇవ్వకపోవటంతోనే పిజెఆర్ చనిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రభుత్వంపై సిఎంకు పట్టు లేదు బిఆర్ఎస్ నేతలు మర్రి జనార్థన్ రెడ్డి, రవీందర్ రావు ఇంటిపై దాడులను మాజీ మంత్రి హరీష్రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులను బెదిరిస్తోందదని మండిపడ్డారు. కాంగ్రెస్ అరాచకాలపై 20 ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి హోంమంత్రిగా, విద్యామంత్రిగా, మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ అయ్యారని, ముఖ్యమంత్రిగా అట్టర్ ఫెయిల్ అయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై రోజుకో కాంగ్రెస్ ఎంఎల్ఎ ఉత్తరాలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. సొంత ప్రభుత్వంపై ముఖ్యమంత్రికి పట్టు లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి హయాంలో క్రైం రేటు పెరిగిందని, రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చిందని అన్నారు. డిజిపికి నియామకపత్రం ఇచ్చిన ఏకైన సిఎం రేవంత్రెడ్డినే అని విమర్శించారు. రేవంత్రెడ్డి సచివాలయంలో సమీక్షలు చేయడం లేదని, కమీషన్ల కోసం కమాండ్ కంట్రోలు సెంటర్లో సిఎం సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. ముస్లింలకు రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ లేకుంటే.. ముస్లింలు లేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణం అని హరీష్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది..? ముస్లింలు ఎప్పుడు నుంచి ఉన్నారు..? అని నిలదీశారు. ముస్లింలను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బిజెపి నుంచి 8 మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అని హరీష్రావు విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. ప్రధాని చెప్పిన ఆర్ఆర్ టాక్స్పై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపిలు కలిసి బిసిలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదన్ తమ్ముడు వెంకట్ యాదవ్కు మూడు ఓట్లు ఉన్నాయని, ఈ విషయంపై, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్త ఓట్ల నమోదుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని, అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలని తమ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని హరీష్రావు తెలిపారు.
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ అభివృద్ధికి తలమానికమైన త్రిపుల్ ఆర్ను తానే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మాట్లాడి మంజూరు చేయించానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశను, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను తాను అడ్డుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగజారి అవాస్తవాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రానికి పట్టిన శని అని అన్నారు. తాను మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, అయితే తాను ఎక్కడ అడ్డుకున్నానో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్ అండ్ టీతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒప్పందమే చేసుకోలేదని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేయలేదని వెల్లడించారు. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను అడ్డుకున్నానని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదని హితవు పలికారు. హైడ్రా నిజంగానే న్యాయం వైపు ఉంటే, ఆక్రమణలనే కూల్చివేస్తే ఇప్పటివరకు ఎంఐఎం కాలేజీలను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. మూసీ బాధితులకు న్యాయం చేయాలనుకుంటున్నామని కిషన్రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ చెడ్డ కుటుంబాలేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కి ఓటేస్తే మజ్లిస్కి ఓటేసినట్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ, హైమావతి నగర్ చౌరస్తాలో శుక్రవారం జరిగిన బహిరంగ సభల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్కి ఓటు వేస్తే మజ్లిస్కి ఓటు వేసినట్లేనని అన్నారు. ఆ పార్టీ పూర్తిగా మజ్లిస్ చేతుల్లో బందీ అయిపోయిందని అన్నారు. వాసవి బృందావనంలో రాంచందర్రావు ప్రచారం జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా - వాసవి బ్రిందావనం రెసిడెన్సియల్ సొసైటీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. తన నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించి అక్కడ ఉన్న ఓటర్లను కలిసి ప్రజల సమస్యలపై చర్చించారు. అక్కడ ఉన్న నివాసితులతో పాటు ఉదయం వాకింగ్ చేసే వారితో ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల విషయంలో సంచలన ప్రకటన చేశారు. డయాబెటిస్, ఒబెసిటీ (ఊబకా యం) ఉన్నవారికి వీసా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈమేరకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ నిబంధనలు వెంటనే అ మలు చేయాలని ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాలకు ట్రం ప్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినట్టు అంతర్జాతీయ మీడి యా కథనాలు చెబుతున్నాయి. అమెరికా వీసా కోసం దరఖా స్తు చేసుకునే వారి ఆరోగ్య పరిస్థితిని ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలించేవారు. స్క్రీనింగ్ టెస్టుల ద్వారా క్షయవంటి అంటువ్యాధులు ఉన్నాయా లేదా అని తనిఖీ చేసేవారు. ఇప్పుడు తా జా నిబంధనల ప్రకారం డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే వారికి వీసా ఇచ్చే అవకాశం ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడేవారిని అమెరికాలోకి ఆహ్వానిస్తే భ విష్యత్తులో కొన్నిసమస్యలు తలెత్తుతాయని, ఆ సమస్యలు ప్ర భుత్వ ఖజానాపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. కాబ ట్టి కొన్ని వ్యాధులున్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకపోతే సమస్యలకు చెక్ పెట్టినట్టే అవుతుంది. ఇలాంటివన్నీ ఆలోచించే డయాబెటిస్, ఊబకాయం ఉండే వారికి అమెరికా వీసా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. హృద్రోగ సమస్యలు, శ్వాససంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు,మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేడారిని సంరక్షించాలంటే లక్షల డాలర్లను ఖ ర్చు చేయవలసి ఉంటుంది. ఇక ఒబెసిటీ కారణంగాఆస్తమా, స్లీ ప్ఆప్నియా, హైబీపీ వంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి రో గులకు సుదీర్ఘకాలం వైద్య చికిత్స అవసరం అవుతుంది. ఇది కు టుంబ సభ్యులపై ఆర్థిక భారం మోపుతుంది. దీనికి ప్రభుత్వం ఏదైనా సాయం అందించాలా? లేదా ప్రభుత్వ సాయం లేకుం డా కుటుంబ సభ్యులే ఆ ఖర్చును భరించగలరా? అనే విషయంపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఇక కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అయితే ఈ వార్తలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించలేదు. వలసదారుల వల్ల అమెరికాలోఇబ్బందులు తలెత్తకూడదని ట్రంప్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది. విదేశీ విద్యార్థులు, ఎక్సేంజీ విజిటర్ల డ్యురేషన్ ఆఫ్ స్టేపై పరిమితి విధించడం, హెచ్1బీ వీసాపై వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలు వలసదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈజ్ ఆఫ్ డూయింగ్లో తెలంగాణ రోల్మోడల్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బి జినెస్లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన ‘తెలంగాణ’లో అవకాశాలు పుష్కలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా - యూ టా పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. వరల్ ట్రేడ్ సెంటర్ - యూ టా ఎండీ, సీవోవో డేవిడ్ కార్లెబాగ్ నేతృత్వంలోని ‘యూ టా పారిశ్రామికవేత్తల బృందం’ శుక్రవారం సచివాలయం లో ఆయనను ప్రత్యేకంగా కలిసింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వానస్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, ఏఐ ఆధారిత హెల్త్ కేర్, క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, స్కిల్స్ తదితర రంగాల్లో ‘యూటా-తెలంగాణ’ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాల పై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాక, గ్లోబల్ ఎకానమీకి సపోర్ట్ ఇచ్చేలా, లాంగ్-టర్మ్ వాల్యూ క్రియేషన్ కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తీసుకొచ్చిన సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఏయే రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం, పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలు, పారిశ్రామికవేత్తలకిచ్చే ప్రోత్సాహాకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం టీ-హబ్, టీ- వర్క్, వీహబ్లను వరల్ ట్రేడ్ సెంటర్ - యూటా, సిలికాన్ స్లోప్స్ అండ్ యూటా టెక్ స్టార్టప్లతో అనుసంధానించేలా చొరవ చూపాలని ప్రతినిధి బృందాన్ని ఆయన కోరారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో యూనివర్సిటీ ఆఫ్ యూటా, బీవైయూ, న్యూమాంట్ యూనివర్సిటీలతో కలిసి రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఉమ్మడి అకడమిక్, రీసెర్చ్ ప్రోగ్రామ్ లను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘యూటా’ రాష్ట్రంతో పటిష్ఠమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ద్వైపాక్షిక సహకారం పెట్టుబడులకే పరిమితం కాకుండా ఇన్నోవేషన్, స్కిల్స్, టెక్నాలజీ రంగాల్లోఉమ్మడి ఆవిష్కరణలకు దిక్సూచీగా మారాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. తెలంగాణ లాంటి ఫాస్ట్-గ్రోయింగ్, డైనమిక్, ప్రో-యాక్టివ్ రాష్ట్రంతో కలిసి పని చేసేందుకు ‘యూటా’ సిద్ధంగా ఉందని డేవిడ్ కార్లెబాగ్ అన్నారు. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడి విషయంలో తెలంగాణతో కలిసి చురుగ్గా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో యూటా హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ జేసన్ థాంప్సన్, మాట్ మాక్ఫెర్సన్, నికోల్ మాక్ఫెర్సన్, లైఫ్ టైం ప్రెసిడెంట్ బీజే హాకే, జేకేడీ ప్రెసిడెంట్ మైక్ నెల్సన్, మోనెరె ఏఐ సీఈవో, కో-ఫౌండర్ మౌ నంది, భారత్ వ్యాలీ అడ్వైజర్లు స్టీవ్ వుడ్, సున్హాష్ లోడే, ఎక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ ఫౌండర్ లక్ష్మినారాయణ, ఐఐఆర్ఎఫ్ గురు సౌలే తదితరులు పాల్గొన్నారు.
శనివారం రాశి ఫలాలు (08-11-2025)
మేషం: చేపట్టిన పనులు ముందుకుసాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వృషభం: సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రులనుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు. మిధునం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతానం విద్యావిషయాల అనుకూలిస్తాయి. కర్కాటకం: చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతలనుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సింహం: ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘకాళిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యంగా ఉంటుంది. సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం ఉంటుంది. కన్య: నూతన మిత్రుల పరిచయాలు లాభంసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలిస్తాయి. తుల: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృశ్చికం: వ్యయ ప్రయాసలతో కొన్నిపనులు పూర్తిచేస్తారు. బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలలో మార్గఅవరోధాలు కలుగుతాయి. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ధనస్సు: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూరబంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవసేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. మకరం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల పోటీపరీక్షలలో విజయంసాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణసూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. మీనం: చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగవాతావరణంఅనుకూలంగాఉంటుంది.
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 08-11-2025
వెల్దుర్తి, (ఆంధ్రప్రభ) : వెల్దుర్తి సమీపంలోని జాతీయ రహదారి–44పై హనుమాన్ సర్కిల్ వద్ద
క్షణాల్లో స్పందించిన ఇన్స్పెక్టర్..
గోదావరిఖని టౌన్ (ఆంధ్రప్రభ) : పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖని
మాగంటి ఆస్తులపై సిఎం రేవంత్, కెటిఆర్ కన్ను
జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ కన్నేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కమార్ వ్యాఖ్యానించారు. గోపీనాథ్కు చెందిన ఆస్తి పంపకాల్లో రేవంత్, ట్విట్టర్ టిల్లు మధ్య ఇటీవల గొడవలు వచ్చాయని బండి సంజయ్ కమార్ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీ అని స్వయానా ఆయన తల్లే ఆరోపించిందని చెబుతూ దీనిపై ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలెవరూ స్పందించకపోవడానికి కారణం ఇదేనని చెప్పారు. నిజంగా చిత్తుశుద్ధి ఉంటే గోపీనాథ్ మరణంతోపాటు ఆస్తిపాస్తులపై ముఖ్యమంత్రి సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ (ఐఎంసీ) మధ్యే పోటీ ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. హిందువులంతా తమ సత్తా ఏమిటో కాంగ్రెస్కు రుచి చూపాలని కోరుతున్నానని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మజ్లిస్ గెలిచినట్లే అరాచకాలు, అక్రమాలకు తావిచ్చినట్లేనని అన్నారు. ఫీజు బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తారా? అసెంబ్లీ సాక్షిగా ప్రతినెల రూ.500 కోట్ల చొప్పున ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తామని టోకెన్లు ఇచ్చి మోసం చేసింది నిజం కాదా?, ఆనాటి నుండి నేటి వరకు ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను మోసం చేస్తోంది నిజం కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీ సాక్షిగా ఎందుకు హామీ ఇచ్చినట్లు? అని అడిగారు. చట్టసభలో ఇచ్చిన హామీకే విలువ లేకుంటే ఇక అసెంబ్లీకి విలువ ఏముందని అన్నారు. అసలు ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగిస్తారా? ఎత్తి వేస్తారా? ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
. రష్యా చమురు కొనడం ఆపేశారు. వచ్చే ఏడాది భారత్ వస్తా: ట్రంప్ వాషింగ్టన్: ‘రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చాలా వరకు ఆపేశారు. ఆ దేశంతో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయి. కాబట్టి వచ్చే ఏడాది భారత్కు వెళ్లాలని ఉంది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడిరచారు. ఓవల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భారత్తో వాణిజ్య చర్చలలో పురోగతి ఉన్నట్లు తెలిపారు. ‘అంతా గొప్పగా సాగుతోంది. ఆయన (మోదీ) రష్యా నుంచి […] The post మోదీ గొప్ప వ్యక్తి… మిత్రుడు appeared first on Visalaandhra .
స్వీడెన్ కమ్యూనిస్టు విప్లవానికి 30 ఏళ్లు
స్టాక్హోమ్: స్వీడెన్ కమ్యూనిస్టు విప్లవానికి 30 ఏళ్లు పూర్తి అయ్యాయి. మూడు దశాబ్దాల కిందట అంటే 1995 నవంబరు 4`5 తేదీల్లో స్వీడెన్ కమ్యూనిస్టులు నిర్ణయాత్మక ముందడుగు వేశారు. కమ్యూనిస్టు విప్లవాత్మకతను కొనసాగించాలని నిర్ణయించారు. ఆ తేదీల్లోనే స్వీడెన్ కమ్యూనిస్టు పార్టీ పేరును మరోమారు సొంతం చేసుకున్నారు. శ్రామికవర్గం ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ శక్తితో సోషలిజం కోసం పోరాటాలతో ఈ పేరు ముడిపడి ఉంది. ప్రస్తుతం జరుపుకునే 30వ వార్షికోత్సవం పార్టీ సంస్థాగత చరిత్రలో కీలక […] The post స్వీడెన్ కమ్యూనిస్టు విప్లవానికి 30 ఏళ్లు appeared first on Visalaandhra .
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం 60 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరి వెళతాయని పేర్కొంది. చర్లపల్లి, నర్సాపూర్, మచిలీపట్నం స్టేషన్ల నుండి రైళ్లు రాకపోకలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ రైళ్లు నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పలు తేదీల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. నవంబరు 17, 24 తేదీల్లో, డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో, జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లాంకు రైళ్లు నడుస్తాయి. నవంబరు 19, 26 తేదీల్లో, డిసెంబరు 3, 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 7, 14, 21 తేదీల్లో కొల్లాం నుంచి చర్లపల్లికి రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు పగిడిపల్లి, గుంటూరు, గూడురు, రేణిగుంట మీదుగా వెళతాయని తెలిపింది. నవంబరు 16, 23, 30 తేదీల్లో, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో, జనవరి 4, 11, 18 తేదీల్లో నర్సాపూర్ నుంచి కొల్లాంకు మరికొన్ని రైళ్లు తిరుగుతాయి. నవంబరు 18, 25, 30 తేదీల్లో, డిసెంబరు 9, 16, 23, 30 తేదీల్లో, జనవరి 6, 13, 20 తేదీల్లో కొల్లాం నుంచి నర్సాపూర్కు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు విజయవాడ, గూడూరు, రేణిగుంట మీదుగా వెళతాయి. నవంబరు 14, 21, 28 తేదీల్లో, డిసెంబరు 26, జనవరి 02 తేదీల్లో మచిలీపట్నం నుంచి కొల్లాంకు రైళ్లు నడుస్తాయి. నవంబరు 16, 23, 30 తేదీల్లో, డిసెంబరు 28, జనవరి 04 తేదీల్లో కొల్లాం నుంచి మచిలీపట్నంకు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. డిసెంబరు 05, 12, 19 తేదీల్లో, జనవరి 09, 16 తేదీల్లో మచిలీపట్నం నుంచి కొల్లాంకు, డిసెంబరు 7, 14, 21 తేదీల్లో, జనవరి 11, 18 తేదీల్లో కొల్లాం నుంచి మచిలీపట్నంకు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు గుంటూరు, నంద్యాల, కడప, రేణిగుంట మీదుగా వెళతాయి.
ప్రాజెక్ట్ డీపీఆర్ టెండర్ రద్దువెనక్కు తగ్గిన చంద్రబాబు సర్కార్ విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకన్న బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్పడిరది. భారీ బడ్జెట్ అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఈప్రాజెక్టును సీపీఐతో పాటు ఇతర రాజకీయపార్టీలు, ప్రజా, రైతు సంఘాలు మూకుమ్మడిగా వ్యతిరేకించాయి. మరోవైపు తెలంగాణ సర్కార్ కూడా వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాయడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లుగా కనబడుతోంది. దాదాపు రూ.80వేల కోట్లకు పైగా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో […] The post బనకచర్లకు బ్రేక్! appeared first on Visalaandhra .
తిరుమలలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం
శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వైకుంఠ ద్వార దర్శనం తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన ’డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. దర్శనానికి సంబంధించిన ఆన్లైన్, ఆఫ్లైన్ టోకెన్ల జారీ విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలోనూ కీలక మార్పు చేసినట్లు ఈవో ప్రకటించారు. ఇప్పటివరకు అమలులో ఉన్న డిప్ విధానాన్ని రద్దు చేసి, ’ముందు వచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన టోకెన్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ ద్వారా అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు శ్రీవాణి, ఇతర దర్శన టోకెన్ల జారీ విధానాన్ని సమీక్షించేందుకు టీటీడీ బోర్డు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇతర కీలక నిర్ణయాలు ఇవీ : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో ప్రకటించారు. మరోవైపు, శ్రీవాణి ట్రస్టుకు అందిన రూ.750 కోట్ల నిధులతో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో 5 వేల భజన మందిరాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, అమరావతి రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాకారం, కల్యాణ మండపం, రాజగోపురం వంటి అభివృద్ధి పనులను ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు తెలిపారు. తిరుమల అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కాపాడి, పచ్చదనాన్ని పెంచేందుకు పదేళ్ల ప్రణాళికను బోర్డు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదాలు అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.
క్రికెటర్ శ్రీచరణికిభారీ నజరానా
గ్రూపు-1 ఉద్యోగం, రూ.2.5 కోట్ల నగదు, ఇంటి స్థలంమహిళలు సత్తా చాటారు: చంద్రబాబు, లోకేశ్ ప్రశంస విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీచరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో పాటు ఇల్లు నిర్మించుకునేం దుకు కడపలో 1000 చ.గ. స్థలం కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 1 అధికారిగా […] The post క్రికెటర్ శ్రీచరణికిభారీ నజరానా appeared first on Visalaandhra .
రాష్ట్రమంతటా ఘనంగా 150 ఏళ్ల వేడుక విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన ‘వందేమాతరం’ గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందేమాతరం అంటూ విద్యార్థులు నినదించారు. జాతీయ జెండా చేబూని ప్రదర్శనలు చేపట్టారు. 150 ఆకృతిలో నిలబడి వందేమాతరం గీతాన్ని పాడారు. విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెం పాఠశాలలో 3,086 మంది విద్యార్థుల గీతాలాపన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు […] The post మార్మోగిన వందేమాతరం appeared first on Visalaandhra .
క్లస్టర్వారీ పారిశ్రామికాభివృద్ధి
. మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో సీఎం చంద్రబాబు. రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు ఆమోదం విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల కోసం అవసరమైన భూముల్లో విద్యుత్ లభ్యత కూడా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఎస్ఐపీబీ ఆమోదించింది. […] The post క్లస్టర్వారీ పారిశ్రామికాభివృద్ధి appeared first on Visalaandhra .
ప్రజాసంపద కార్పొరేట్లకు ధారాదత్తం . ప్రభుత్వరంగ పరిశ్రమలను దెబ్బతీస్తున్న ప్రభుత్వ చర్యలు. 33 ఎంజీడీల నీటి కేటాయింపు ఒప్పందం రద్దు చేయాలి. ‘కూటమి’ నిర్ణయాలపై వామపక్ష, ప్రజాసంఘాల మండిపాటు విశాలాంధ్ర బ్యూరో- విశాఖపట్నం : కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, ప్రజల అవసరాలను దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి, వామపక్షాలు, కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. కారు చౌకగా కార్పొరేట్లకు భూములిస్తూ, ప్రభుత్వ రంగ పరిశ్రమలను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సెలార్ మిత్తల్ […] The post మిత్తల్కు ఊడిగం appeared first on Visalaandhra .
రాత్రి బస్సులపై స్పెషల్ ఫోకస్
కర్నూలు, (ఆంధ్రప్రభ): ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో కర్నూలు జిల్లా
అమరావతి నిర్మాణానికిమరో రూ.7,500 కోట్లు
ఎన్ఏబీఎఫ్ఐడీ నుండి రుణం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాజధాని నిర్మాణానికి రూ.7,500 కోట్ల రుణం అందించేందుకు నేషనల్ బ్యాంకు ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్ఏబీఎఫ్ఐడీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో అమరావతి నిర్మాణపనులు మరింత ఊపందుకోనున్నాయి. ఇప్పటికే సుమారు 40వేల కోట్లకు పైగా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రుణాలు సేకరించింది. ప్రస్తుతం 64వేల కోట్ల అంచనాలతో కూడిన నిర్మాణపనులకు టెండర్లు పిలిచింది. ఎట్టిపరిస్థితుల్లో మూడేళ్లలో రాజధాని […] The post అమరావతి నిర్మాణానికిమరో రూ.7,500 కోట్లు appeared first on Visalaandhra .
ఎస్వీయూలో మరోసారి చిరుత కలకలం !!
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మరోసారి చిరుత సంచారం

27 C