సత్యసాయి జిల్లాలో అలర్ట్ వాహనాలు, రైల్వే స్టేషన్ల ముమ్మర తనిఖీలుజిల్లా ఎస్పీ ఎస్
బడికి వెళ్లి ఆయన అక్షరాలు చదవలేదు.. కానీ సమాజాన్ని ఆయన తన అంతర్హృదయంతో చూశారు. సమాజంలో జరుగుతున్న ప్రజల వ్యథలు, పోరాటాలను కళ్లతో చూసి.. ఆ బాధలే ఆయనను ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా నిలబడేలా చేసింది. చిన్నతనం నుంచే అనాథగా బతికిన ఆయన గుండెకు తాకిన గాయాలు ఎన్ని ఉంటాయో.. గొడ్లకాపరిగా పని చేస్తూ ప్రకృతి.. మూగజీవాలతోనూ మమేకం అయ్యారు. ప్రకృతి ఎదుర్కొనే ముప్పును సైతం పదాల అల్లికతో జత కట్టి పాటలు, పద్యాలు పాడుకున్నాడు. సమాజంలో భిన్నమైన సమస్యలతో సతమతమవుతున్న ప్రజల బతుకులను చూశాడు. కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా.. మానవ సంబంధాలకు కనీస విలువనివ్వని సమాజాన్ని కళ్లారా చూశారు. ఆయన కళ్లతో చూసిందే.. పదాల అల్లికతో గేయంగా మారి ఆ గాయాన్ని మాన్పింది. అణచివేతలమీద ఆయన పాట ఉక్కు పిడికిళ్లుగా మారాయి. అన్యాయంపై గళమెత్తే జనగర్జన అయింది. అందెశ్రీ ఉద్యమ జన జాతర. తెలంగాణ మలివిడత ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో అందెశ్రీ పాటలు ప్రజల్లో గొప్ప పోరాట పటిమను చూపాయి. జనజాతరలో మనగీతం జయకేతనమై ఎగరాలి.. జంజవారుతా జననినాదమై సాగాలి.. అంటూ మలివిడత ఉద్యమంలో ఆయన కవిత్వాలు లక్షలాది మందిని కదిలించాయి. చిన్నతనంలోనే కష్టాలు చూసిన అందె శ్రీ ప్రజల బతుకుల్లో గుణాత్మక మార్పు, సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో రచనలు చేశారు. చదువు లేకపోయినా ప్రజల అంతర్ హృదయాలను అందెశ్రీ చదివారు. రవి చేరనిచోటు ఉంటుంది కానీ కవి చేరనిచోటు ఉండదు అన్నట్లుగా ఆయన కవిత్వం, పాటల రూపంలో ప్రతీ గుండెను తాకారు. ఆవేదనల గుండెలకు బలయ్యారు. అణచివేతపై తిరుగుబాటు గళం అయ్యారు. పోరాట పిడికిళ్లకు పదునైన గీతంగా మారాడు అందెశ్రీ. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అనాథగా పెరిగిన అందెశ్రీ చిన్నతనంలోనే కష్టాలు వెంటాడాయి. తన కష్టాలను ప్రజల్లో, సమాజంలో చూసిన ఆయన తన పల్లెతో, ప్రకృతితో, మనుషుల హృదయాలతో మమేకం అయ్యారు. పల్లె జీవన బతుకులు తెలిసిన వ్యక్తిగా ‘పల్లె నీకు వందనాలమ్మో... తల్లీ నీకు వందనాలమ్మో.. అంటూ పల్లెను తల్లితో పోల్చి బతుకు విలువను నేర్పిన పల్లెలలపై మమకారాన్ని చాటారు. ‘కొమ్మ చెక్కితే బొమ్మరా... కొలిసి మొక్కితే అమ్మరా’ మాయమైపోతున్నాడమ్మా మనిషిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ సమాజంలో మంట కలుస్తున్న మానవ సంబందాలపై రాసిన పాటలన్నీ అయన గుండెల నుంచి సమాజం కోసం ఉప్పొంగిన గొప్ప అక్షరాలు.. తెలంగాణ మలివిడత ఉద్యమం ఉధృతంగా మారిన తరుణంలో ఆ గేయం ఓ పోరాట తిలకంగా నిలిచింది. జనజాతరలో మనగీతం జయకేతనమై ఎగరాలి.. ఒకటే జననం.. ఓహో ఒకటే జననం.. జీవితమంతా జనమే మననం.. కష్టానష్టాలు ఎన్ని ఎదురైనా కార్యదీక్షలో తెలంగాణ అంటూ ఉప్పొంగిన గేయం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారానికి ఎంతో భూమిక పోషించింది. అనేక రచనలు, కవిత్వాలతో ఆయన ఎంతోమంది సాహిత్యకారులకు, ప్రజాపోరాటాలకు ఓ చైతన్య గొంతుకగా నిలిచారు. ఆయన చేసిన అనేక రచనలకు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను సైతం ప్రదానం చేసింది. దాశరథీ పురస్కారం, వాషింగ్టన్ డిసి వారి గౌరవ డాక్టరేట్తోపాటు లోకకవి అన్న బిరుదు పొందారు. 2015లో డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్టు వారి ఆధ్వర్యంలో జ్ఞాన పీఠ్ పురస్కార గ్రహీత ఆధ్వర్యంలో భరద్వాజ సాహితీ పురస్కారం.. దాంతో నంది అవార్డుతో పాటు ఎంతో మంది ప్రజల గుండెలను గెలుచుకున్నారు. తెలంగాణ మలివిడత ఉద్యమంలో ధూంధాంకు ఉన్న సాంస్కృతిక ఉద్యమ పాత్ర గొప్పది. ఆ సమయంలో నాటి ఉమ్మడి పది జిల్లాలో తెలంగాణ ధూంధాం వేదికల మీద అందెశ్రీ పాటలు తెలంగాణ పల్లె బతుకులను కళ్లకుకట్టేలా చూపాయి. చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి.. నవ్వుల్లో నాగమల్లి నా ఊరు పాలవెల్లి.. మళ్లీ జనమా ఉంటే సూరమ్మో.. మళ్లీని కడుపున పుడతా మయమ్మో అంటూ తెలంగాణ పల్లె ఆత్మీయతను గొప్పగా ప్రదర్శించారు. సమాజం హితం కోసం అనేక రచనలు చేసి సాహితీ శిఖరంగా ఎదిగిన ఆయన నేడు తెలంగాణ గీతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవనున్నారు. అందె శ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాట నేడు రాష్ట్ర గీతంగా మారింది. సాహితీ లోకానికి, అటు గుణాత్మక సమాజం కోసం పరితపించిన అందెశ్రీ అకాల మృతి తీరని లోటు. అయినప్పటికీ ఆయన తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో తెలంగాణ ఉద్యమంలో జన జాతరను కదిలించిన సాహితీ శిఖరంగా కొలువై ఉంటాడు. - సంపత్ గడ్డం 78933 03516
ధర్మేంద్ర హెల్త్ పై కుమార్తె ఈషా ఏమన్నారంటే?
ధర్మేంద్ర మరణించారంటూ వచ్చిన వార్తలను కుమార్తె ఈషా దేవోల్ ఖండించారు.
Weather Report : మరో బాంబు పేల్చిన ఇస్రో.. ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరొక తుపాను ముప్పు పొంచి ఉందని ఇస్రో తెలిపింది
హైవేపై తప్పిన మరో పెను ప్రమాదం
నల్లొండ: హైవే- 65 పై ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు కాలిబూడిదైంది. మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు హుటాహుటిన కిందకు దూకేశారు. దీంతో భారీగా ప్రాణనష్టం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు నాగాలాండ్ రిజిస్ట్రేషన్కు చెందిన విహారి ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. బస్సుకు ఫిట్నెస్ కూడా లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
పొద్దు పొడుపు.. బొజ్జన్నఅడుగు..
పొద్దు పొడుపు.. బొజ్జన్నఅడుగు.. ఉట్నూర్, ఆంధ్రప్రభ – ఆదిలాబాద్ జిల్లా (Adhilabad) ఉట్నూర్
రైతుకు నష్టమే గిట్టుబాటు కొనుకేంద్రాల ఊసే లేదు ( నంద్యాల, ఆంధ్ర ప్రభ
Vijay Deverakonda and Rashmika to Celebrate The Girlfriend Success
Rashmika Mandanna attempted a content-driven film The Girlfriend and the film impressed the audience. The film has been doing decent all over and the team is all set to celebrate the success of the film tomorrow in Hyderabad. Rashmika returned back to Hyderabad today and she will watch the film along with the audience this […] The post Vijay Deverakonda and Rashmika to Celebrate The Girlfriend Success appeared first on Telugu360 .
కుటుంబ సమేతంగా ఓటు వేసిన కమిషనర్ రంగనాథ్ #Elections #Hyderabad #HydraPolice #JubileeHills #Vote
లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు..
లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు.. మాచారెడ్డి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి
క్రీడాకారులకు గ్రూప్-1 ఉద్యోగాలు కరెక్టేనా?#TeluguPost #telugu #post #news
ఓటువేసిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ (Jubilee Hills) శాసనసభ
నాన్న క్షేమంగా ఉన్నారు –ఈషా డియోల్
నాన్న క్షేమంగా ఉన్నారు – ఈషా డియోల్ ప్రముఖ బాలీవుడ్ హీరో ధర్మేంద్ర
గృహప్రవేశంలో హిజ్రాలా దాడి చిందిన రక్తం #Crime #Medchal #Hyderabad #Police #viralvideo #latestnews
జూబ్లీ ఉపఎన్నికలో కొనసాగుతున్న పోలింగ్.. క్యూకట్టిన ఓటర్లు..
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలో మంగళవారం పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికలో ఉదయం 9.30 గంటల వరకు 10 .2 శాతం పోలింగ్ నమోదు అయింది. తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు క్యూకట్టారు. ఎల్లారెడ్డిగూడ నవోదయనగర్లో బిఆర్ఎస్ అభ్యర్థి సునీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జున సాగ్లో అభ్యర్థి లంకల దీపక్రెడ్డి ఓటు వేశారు. షేక్పేటలో కుటుంబసభ్యులతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీల సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు్
Delhi Blast : ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగానే ఈ దాడులా? అనుమానాలివే
ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటువంటి ఉగ్రదాడులు జరుగుతాయని కేంద్ర హోంశాఖ అనుమానించింది
అతివేగమే కారణమా.. ఊయ్యురు, ఆంధ్రప్రభ – కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఊయ్యురు
గండిగుంట వద్ద కారు బోల్తాపడి నలుగురు మృతి
అమరావతి: కృష్ణాజిల్లాలో ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడి నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో ముగ్గురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ, కుందేరు గ్రామానికి చెందిన వారు అని.. కోణతమ చింతయ్య (17), చాట్రగడ్డ రాకేష్ బాబు (24), ప్రిన్స్ బాబు (23), గోరిపర్తి బాపనయ్య(24) గా పోలీసులు గుర్తించారు.
ఇదీ ఒంగోలు అర్బన్ అభివృద్ధి పంచాయతీకి కప్పం కట్టొద్దు క్యాష్ అండ్ క్యారీ
పాపం.. పసివాడు.. చండ్రుగొండ, ఆంధ్రప్రభ : స్కూల్ బస్సు టైర్ కిందపడి రెండేళ్ల
ప్రశాంతంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.
జూబ్లీ హిల్స్ పోలింగ్ అప్ డేట్..
జూబ్లీ హిల్స్ పోలింగ్ అప్ డేట్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଭାଇରାଲ ହେଉଥିବା ଫଟୋ ସହ ଦିଲ୍ଲୀ ବିସ୍ଫୋରଣର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ
ଦିଲ୍ଲୀ ବିସ୍ଫୋରଣ ପରେ ହାଇଆଲର୍ଟରେ ଓଡିଶା । ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ, ଭୁବନେଶ୍ବର, କଟକ, ପୁରୀ, କୋଣାର୍କ, ନୂଆପଡା, ବ୍ରହ୍ମପୁର, ସମ୍ବଲପୁର, ଜଗତସିଂହପୁର ସମେତ ବିଭିନ୍ନ ଜିଲ୍ଲାରେ ପୁଲିସ ହାଇଆର୍ଲଟରେ ରହିଛି । ରେଳ ଷ୍ଟେସନ, ବସଷ୍ଟାଣ୍ଡ, ବଡ଼ ବଡ଼ ହୋଟେଲ, ପର୍ଯ୍ୟଟନ ସ୍ଥଳୀ ଏବଂ ସର୍ବସାଧାରଣ ସ୍ଥାନରେ ହାଇ ଆର୍ଲଟ ଜାରି ହୋଇଛି । ରେଳ ଷ୍ଟେସନରେ ଯାତ୍ରୀଙ୍କୁ ଯାଂଚ କରି ଛଡାଯାଉଛି । ଏ ନେଇ ସୂଚନା ଦେଇଛନ୍ତି ଡିଜିପି ୱାବି ଖୁରାନିଆ । ବାଲିଯାତ୍ରାରେ ହଜାର ହଜାର ଲୋକେ ସାମିଲ ହୋଇଥିବାରୁ ସେଠାକୁ ଯାଇ ସ୍ଥିତିର ଅନୁଧ୍ୟାନ କରିଛନ୍ତି ଡିଜିପି । ପୁରୀରେ ବି ହାଇଆଲର୍ଟ ଜାରି ହୋଇଛି । ବେଳାଭୂମି, ସମୁଦ୍ରକୂଳ ଓ ବଡ଼ଦାଣ୍ଡରେ ହାଇଆଲର୍ଟ ଜାରି କରାଯାଇଛି । ଶ୍ରୀମନ୍ଦିର ଚତୁଃପାର୍ଶ୍ବ, ରେଲୱେ ଷ୍ଟେସନ, ବସ୍ଷ୍ଟାଣ୍ଡରେ ସୁରକ୍ଷାକୁ ବଢାଯାଇଛି । ପାଟ୍ରୋଲିଂ ବୃଦ୍ଧି ସହ ସମସ୍ତ ଆଇଆଇସିଙ୍କୁ ସତର୍କ ରହିବାକୁ ନିର୍ଦ୍ଦେଶ ଦିଆଯାଇଛି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଫଟୋ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଫଟୋରେ ଏକ ଭୟାବହ ଅଗ୍ନିକାଣ୍ଡର ଦୃଶ୍ୟ ଦେଖିବାକୁ ମିଳିଥିବା ବେଳେ । ଫଟୋ ସହ ଉଲ୍ଲେଖ ରହିଛି, ବ୍ରେକିଂ ନ୍ୟୁଜ୍ : ଭାରତର ନୂଆ ଦିଲ୍ଲୀରେ ଏକ ଶକ୍ତିଶାଳୀ ବିସ୍ଫୋରଣ ହୋଇଥିବାର ରିପୋର୍ଟ ଆସିଛି। ଲାଲ କିଲ୍ଲା ମେଟ୍ରୋ ଷ୍ଟେସନର ଗେଟ୍ ନମ୍ବର ୧ନିକଟରେ, ଜନଗହଳିପୂର୍ଣ୍ଣ ଏବଂ ଉଚ୍ଚ ସୁରକ୍ଷା ଚାନ୍ଦନୀ ଚୌକ ଅଞ୍ଚଳରେ ଏହି ବିସ୍ଫୋରଣ ଘଟିଛି । ତଦନ୍ତ ଚାଲିଛି। ପ୍ରାରମ୍ଭିକ ରିପୋର୍ଟ ଅନୁଯାୟୀ ଗ୍ୟାସ୍ ସିଲିଣ୍ଡର ଲିକ୍ କିମ୍ବା ଗାଡ଼ି ବ୍ୟାଟେରୀରେ ତ୍ରୁଟିପୂର୍ଣ୍ଣ କାର୍ଯ୍ୟ ହୋଇପାରେ, କିନ୍ତୁ କର୍ତ୍ତୃପକ୍ଷ ଆତଙ୍କବାଦ ଦୃଷ୍ଟିକୋଣକୁ ଏଡ଼ାଇ ଦେଉନାହାଁନ୍ତି - ବିଶେଷକରି କିଛି ଦିନ ପୂର୍ବରୁ ହରିୟାଣାରେ ୨୯୦୦ କିଲୋଗ୍ରାମ ବିସ୍ଫୋରକ ସହିତ ଏକ ଆନ୍ତଃରାଜ୍ୟ ଆତଙ୍କବାଦୀ ମଡ୍ୟୁଲ୍ ଧରାପଡ଼ିଥିଲା । ତେବେ ଏପର୍ଯ୍ୟନ୍ତ କୌଣସି ଗୋଷ୍ଠୀ ନିଜକୁ ଦାୟୀ କରିନାହାଁନ୍ତି । ଯାହାର ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଉକ୍ତ ଫଟୋ ସହ ଦିଲ୍ଲୀ ବିସ୍ଫୋରଣର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ । ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଦିଲ୍ଲୀ ବିସ୍ଫୋରଣର ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଶତାଧିକ ଭିନ୍ନଭିନ୍ନ ପ୍ରକାରର ଫଟୋ ବିଭିନ୍ନ ଗଣମାଧ୍ୟମରେ ପୋଷ୍ଟ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ହେଲେ, ଭାଇରାଲ ହେଉଥିବା ଫଟୋ କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମ ରେ ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଫଟୋରେ ବିସ୍ଫୋରଣର ଭୟାବହତା ସ୍ପଷ୍ଟ ବାରି ହୋଇ ପଡୁଛି ହେଲେ ଉକ୍ତ ଫଟୋଟି ଦିଲ୍ଲୀ ଘଟଣାର ହୋଇଥିଲେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ନିଶ୍ଚିତ ପ୍ରସାରିତ ହୋଇଥାନ୍ତା । ପୋଷ୍ଟର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଫଟୋକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ଡିଜିଟାଲ ମିଡିଆରେ ପ୍ରସାରିତ ଏକ ଖବର ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୨୯ ସେପ୍ଟେମ୍ବର ୨୦୨୪ରେ ଏମଟିଭି ନାମକ ଏକ ଡିଜିଟାଲ ମିଡିଆ ବେରୁଟ ଉପରକୁ ନୂଆ ଇସ୍ରାଏଲର ଆକ୍ରମଣ ଲେଖି ଏକ ଖବର ପୋଷ୍ଟ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ପୋଷ୍ଟରେ ଯେଉଁ ଫଟୋଟି ପ୍ରସାରିତ ହୋଇଥିଲା ତାହା ଭାଇରାଲ ଫଟୋ ସହ ବହୁମାତ୍ରାରେ ମେଳ ଖାଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉଭୟ ଫଟୋକୁ ତୁଳନା କରିବାରୁ ଏହା ଗୋଟିଏ ଘଟଣାର ଫଟୋ ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲାଯେ, ଭାଇରାଲ ହେଉଥିବା ଫଟୋଟି ୨୦୨୪ରୁ ଇଣ୍ଟରନେଟରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ଅଧିକ ଅନୁସନ୍ଧାନକରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ କିଛି ବିଭିନ୍ନ ଆନ୍ତର୍ଜାତିକ ଗଣମାଧ୍ୟମରେ ବିଭିନ୍ନ ଖବର ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ପାଇଥିଲୁ । କିଛି ଗଣମାଧ୍ୟମରେ ଭାଇରାଲ ଫଟୋ ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ପାଇଥିଲୁ । ଯାହାର ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ଅନ୍ୟପଟେ ଭାରତ ସରକାରଙ୍କ ଫ୍ୟାକ୍ଟଚେକ୍ ଅନୁଷ୍ଠାନ ପିଆଇବି ଫ୍ୟାକ୍ଟଚେକ୍ ମଧ୍ୟ ଏହାକୁ ତଦନ୍ତ କରି ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ଏକ ପୋଷ୍ଟ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । Some propaganda accounts are circulating an old image on social media, falsely claiming it to be linked with blast in Delhi #PIBFactCheck : ✅ The image is from a 2024 blast in Lebanon, not from #Delhi https://t.co/RuGArnfHYM Always verify such claims through credible… pic.twitter.com/g0IeypSy34 — PIB Fact Check (@PIBFactCheck) November 10, 2025 ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଏହା ଦିଲ୍ଲୀ ବିସ୍ଫୋରଣ ଘଟଣା ସହ ଉକ୍ତ ଫଟୋର କୌଣସି ସମ୍ପର୍କ ନଥିବାର ଉଲ୍ଲେଖ ରହିଛି । ତର୍ଜମା ନ କରି ସୋସିଆଲ ମିଡିଆରେ ଏଭଳି ବିଭ୍ରାନ୍ତିକର ଫଟୋ ନଛାଡିବାକୁ ମଧ୍ୟ ସୋସିଆଲ ମିଡିଆ ୟୁଜର୍ସଙ୍କୁ ସୂଚନା ଦିଆଯାଇଛି । ଯାହାକୁ ବିଭିନ୍ନ ଗଣମାଧ୍ୟମ ପ୍ରସାରିତ କରିଥିବାର ମଧ୍ୟ ଦେଖିବାକୁ ମିଳିଛି । ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଭାଇରାଲ ଫଟୋ ସହ ଦିଲ୍ଲୀ ବିସ୍ଫୋରଣର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ । ଉକ୍ତ ଫଟୋଟି ୨୦୨୪ ମସିହାର ହୋଇଥାଇ ପାରେ, ଯେତେବେଳେ ଇସ୍ରାଏଲ ଏବଂ ବେରୁଟ ମଧ୍ୟରେ ଆକ୍ରମଣ ଘଟଣା ଦେଖାଯାଇଥିଲା ।
డాక్టర్ రెడ్డీస్కి ₹2.16 కోట్లు సైబర్ మోసం #CyberCrime #Bengaluru #DrReddys #Gujarat #Pharma
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ధర్మేంధ్ర తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర సతీమణి హేమామాలినిని 1980 లో రెండో వివాహం చేసుకున్నారు. ధర్మేంద్రకు సన్నీ, బాబీ, ఈషా సహా ఆరుగురు సంతానం. షోలే,ఆయి మిలాన్ కి బేలా, ఫూల్ ఔర్ పత్తర్, ప్యార్ కియా తో డర్నా కియా, సీతా ఔర్ గీతా, జీవన్ మృత్య్, మేరా గావ్-మేరా దేశ్, రాజా జానీ, యాదో కీ బారత్, దోస్త్, చారస్, ధరమ్ వీర్ లో నటించారు. త్వరలో విడుదల కానున్న ‘ఇక్కీస్’ లో ధర్మేంద్ర చివరిగా నటించారు. ధర్మేంద్ర అసలు పేరు కెవల్ కిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8న ధర్మేంద్ర జన్మించారు. 1954లో ప్రకాశ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. 2012లో ధర్మేంద్ర పద్మభూషణ్ అందుకున్నారు. 2004లో బికనీర్ నుంచి బిజెపి ఎంపిగా గెలిచారు. 300 పైగా చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ హీమ్యాన్ గా ఖ్యాతి గడించారు. ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు.
Andhra Pradesh on High Alert After Delhi Blast: CM Chandrababu and Ministers Express Shock
The recent explosion near Delhi’s Red Fort has sent shockwaves across the country. In response, police in Andhra Pradesh have gone on high alert, tightening security across all districts. Home Minister Vangalapudi Anitha held an emergency review with DGP Harish Kumar Gupta and other top officials, instructing them to conduct intensive checks at public places […] The post Andhra Pradesh on High Alert After Delhi Blast: CM Chandrababu and Ministers Express Shock appeared first on Telugu360 .
Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా.. అయితే మీకొక అలెర్ట్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది
డ్రోన్ సహాయంతో పోలింగ్ కేంద్రాలను RV కర్ణన్ పరిశీలన #Elections #DroneSurveillance #GHMC #Telangana
హత్య.. చేసింది ఎవరు.. కొత్తూరు, ఆంధ్రప్రభ : వలస కార్మికుడు దారుణ హత్యకు
దేశంలో ఫస్ట్.. జూబ్లీహిల్స్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే..
ఓటుహక్కు వినియోగించుకున్న రాజమౌళి సినీ దర్శకుడు రాజమౌళి#TeluguPost #telugu #post #news
ఢిల్లీ పేలుళ్లపై హైదరాబాద్లో హైఅలర్ట్ #Hyderabad #HighAlert #DelhiBlast #Security #Police #Airport
Hyderabad : ఢిల్లీ పేలుడు ఘటనతో నేడు కూడా హైదరాబాద్ లో తనిఖీలు
ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ –బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర ఇక లేరు..
బ్రేకింగ్ న్యూస్ – బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర ఇక లేరు.. బాలీవుడ్ దిగ్గజ
విశాఖపట్నం: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ఎలో భాగంగా విశాఖపట్నం వేదికగా తమిళనాడుతో జరిగిన కీలక మ్యాచ్లో ఆంధ్రా టీమ్ నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆంధ్రా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 201 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్రా ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ రెడ్డి అద్భుత బ్యాటింగ్తో ఆంధ్రా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ 11 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ఇక కరణ్ షిండే 8 ఫోర్లతో 51 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. అశ్విన్ హెబ్బర్ 21 (నాటౌట్), సత్యనారాయణ రాజు 20 (నాటౌట్) మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు.
Puttaparthi : శతజయంతి వేడుకలకు ముస్తాబయిన పుట్టపర్తి
శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది
Kamal Haasan’s Biggest Bet on Rajinikanth
Veteran actor Kamal Haasan made a strong comeback with Vikram directed by Lokesh Kanagaraj. After he had a strong belief in the film, Kamal’s Raajkamal Films International bankrolled the film. They released the film on their own and made big profits. The super success of Vikram made Kamal Haasan quite busy as a producer. Then […] The post Kamal Haasan’s Biggest Bet on Rajinikanth appeared first on Telugu360 .
Is Bigg Boss Really Teaching Life Lessons?
The recent episode of Bigg Boss Telugu sparked an interesting debate when recently eliminated contestant Sai told host Nagarjuna that the show taught him “valuable life lessons.” While the Bigg Boss house certainly puts its contestants through extreme mental and emotional tests, the question remains — does it genuinely teach life lessons, or is it […] The post Is Bigg Boss Really Teaching Life Lessons? appeared first on Telugu360 .
Bigg Boss Telugu 9: Twist in the Nomination Process, Everyone in danger zone
This week’s Bigg Boss Telugu 9 nomination episode came with a twist, forcing housemates to rethink strategies and alliances. Unlike previous weeks, each contestant was allowed to nominate only one person within a strict five-minute limit, creating high tension and sharp exchanges inside the house. Strategic Nominations Begin The episode opened with Bharani, Divya, and […] The post Bigg Boss Telugu 9: Twist in the Nomination Process, Everyone in danger zone appeared first on Telugu360 .
మరింత మెరుగ్గా ఆడాల్సింది.. ఆస్ట్రేలియా సిరీస్లో నిరాశ పరిచిన భారత్
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో టీమిండియాకు మిశ్రమ ఫలితాలు ఎదురైన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్లో ఓటమి పాలైన భారత్ టి20లలో గెలిచి కాస్త ఊరట చెందింది. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ను భారత్ ౨-1తో సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్లు వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యాయి. తొలి టి20లో ఆస్ట్రేలియా గెలవగా టీమిండియా ఆ తర్వాత రెండు మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది. ఈ సిరీస్లో భారత్ను బ్యాటింగ్ సమస్య వెంటాడింది. వన్డేల్లో, టి20లలో భారత బ్యాటర్లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్ను కనబరచలేక పోయారు. బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయారని చెప్పాలి. టి20 వరల్డ్కప్నకు కొంత సమయం మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో భారత్ బ్యాటింగ్ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ ఆటగాడు సంజు శాంసన్లు టి20 సిరీస్లో పూర్తిగా నిరాశ పరిచారు. వీరు పేలవమైన బ్యాటింగ్తో తేలిపోయారు. ముఖ్యంగా సూర్యకుమార్, శాంసన్ వైఫల్యం జట్టును కలవర పరిచే అంశమే. వరల్డ్కప్ సమీపిస్తున్న నేపథ్యంలో కీలక ఆటగాళ్లు శాంసన్, గిల్, సూర్యకుమార్ల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా సిరీస్లో విఫలమయ్యాడు. అతను కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. రానున్న సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్లలోనైనా వీరు తమ ఆట తీరును మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్యకుమార్, శాంసన్లు వరుస వైఫల్యాలు చవిచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా వీరు తమ బ్యాటింగ్ను మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. వరల్డ్కప్ ఆరంభానికి ముందు భారత్ సొంత గడ్డపై 10 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడనుంది. ఈ మ్యాచ్లు టీమిండియాకు చాలా కీలకంగా మారాయి. స్టార్ ఆటగాళ్ల ఫామ్ను పరిశీలించేందుకు ఈ సిరీస్లో దోహదం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డేల్లో కూడా భారత్ను బ్యాటింగ్ సమస్య వెంటాడింది. రోహిత్ శర్మ తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. చివరి వన్డేలో విరాట్ కోహ్లి కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పాలి. రానున్న సిరీస్లలో టీమిండియా ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
Delhi Blast : ఢిల్లీ పేలుడులో సంచలన విషయాలు.. ఆ కారు ఎక్కడి నుంచి వచ్చిందంటే?
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు
కాపాడండి.. మహాప్రభో.. తాడ్వాయి, ఆంధ్రప్రభ – అరుగలం కష్టపడి పండించిన పంట చేతికి
Rajamouli’s Strategy for GlobeTrotter surprises the Nation
SS Rajamouli’s next aspirational project GlobeTrotter featuring Superstar Mahesh Babu is currently under shoot mode. Superstar fans and the audience made huge noise about the film as the makers even haven’t made any official announcement about the project. They trolled Rajamouli for maintaining a low profile about the film. Soon, the team announced that the […] The post Rajamouli’s Strategy for GlobeTrotter surprises the Nation appeared first on Telugu360 .
అందాల తార మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం సినిమాతో ప్రవేశించి మంచి హిట్ను అందుకుంది. ఆతర్వాత నానితో హాయ్ నాన్న చేసి మెప్పించింది. మృణాల్ తన మూడవ సినిమాను విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చేసింది కానీ అది నిరాశపరిచింది. ఇక మృణాల్ ఠాకూర్ చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా ఉంది. ఆమె చేస్తున్న డెకాయిట్ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదలవుతుంది. ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమాలో మృణాల్ ఒక రోల్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే తెలుగులో పరిస్థితి ఇలా ఉండగా బాలీవుడ్ లో మృణాల్ తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అక్కడ ఎలాంటి ఆఫర్ వచ్చినా కాదనకుండా చేస్తోంది ఈ భామ.
బీహార్ లో పోలింగ్ ప్రారంభం.. బీహార్ లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల
Telangana : విహారి ట్రావెల్స్ బస్సు మంటల్లో
తెలంగాణలో మరొక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దహనమయింది
ఇవేం రోడ్లు నాయనా.. తాడ్వాయి, ఆంధ్రప్రభ – జాతీయ రహదారి 163వ రోడ్డు
Jubilee Hills Bye Elections : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బారులు తీరిన ఓటర్లు
జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 6
Chandrababu : నేడు ప్రకాశం జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు
యాక్షన్, అడ్వెంచర్ కామెడీ మూవీ
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సుభాస్కర న్ లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్- అడ్వెంచర్ కామెడీ మూవీ ‘సిగ్మా’ చిత్రం 65 రోజుల షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. నాలు గు నెలల పాటు జరిగిన షూటింగ్తో ఇప్పుడు సినిమా 95 శాతం పూర్తయింది. ఈ చిత్రానికి సిగ్మా అనే టైటిల్ ఫిక్స్ చేశా రు. ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరో సందీప్ కిషన్ యాక్షన్ అవతార్ కనిపించారు. బంగారం, నోట్ల కట్టల మధ్య కూర్చొని, తన చేతికి బ్యాండేజ్ కడుతున్నట్లుగా కనిపించిన సందీప్ లుక్ అదిరిపోయింది. ఈ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా హీరో పాత్రలోని ఇన్టెన్స్ యాంగిల్తో పాటు సినిమా ట్రెజర్ హంట్ కథాంశాన్ని సూచిస్తోంది. సిగ్మా కథ ఒక ధైర్యశాలి, నియమాలకు అతీతమైన వ్యక్తి నేపధ్యంలో వుంటుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా అలరించనున్నారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మి, సుదర్శనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ “ట్రెజర్ హంట్, కామెడీ అంశాల మేళవింపుతో ఈ సినిమా ఒక థ్రిల్లింగ్ సినిమా అనుభూతిని అందిస్తుంది. తమన్ సంగీతం, సందీప్ కిషన్ యాక్షన్ ఎనర్జీ, లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు - ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. సినిమాలో ఒక పాట మిగిలి ఉండగా, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించి వేసవి ప్రారంభంలో సినిమాను విడుదల చేస్తాం”అని అన్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని చెన్నై, సేలం, తలకోన, థాయ్లాండ్ ప్రాంతాల్లో షూట్ చేశారు.
కానుకల గురించి పట్టించుకోవద్దు.. మహిళా క్రికెట్ టీమ్కు గవాస్కర్ సలహా
ముంబై: వన్డే ప్రపంచకప్ ట్రోఫీ సాధించి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ టీమ్కు పలు ప్రముఖ వాణిజ్య సంస్థలు భారీ మొత్తంలో నజరానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు భారత క్రికెట్ బోర్డుతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నగదు నజరానాలను ప్రకటించాయి. ఇక టీమిండియాలోని స్టార్ క్రికెటర్లతో పలు ప్రముఖ బ్రాండ్స్ స్పాన్సర్షిప్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో గవాస్కర్ మహిళా క్రికెట్ టీమ్ సభ్యులకు కీలక సూచనలు చేశాడు. ఆయా వాణిజ్య సంస్థలు, బ్రాండ్స్ వాగ్దానం చేసినట్టుగా నగదు బహుమతలు అందించకపోతే నిరుత్సాహానికి గురికావొద్దని సూచించాడు. వాగ్దానం చేసిన వాటిలో కొన్ని బహుమతులు మీక రాకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నాడు. భారత్లో కొంత మంది ప్రకటనదారుడుల, బ్రాండ్లు, వ్యక్తులు ఉచితంగా ప్రచారం పొందడానికి మిమ్మల్నివాడుకుంటారు. టీమ్ను అభినందిస్తూ పత్రికల్లోపూర్తీ పేజీ ప్రకటనలు ఇస్తారు. హోర్డింగ్లు పెడతారు. టీమ్, వ్యక్తిగత స్పాన్సర్లు మినహా మిగిలిన వారు తమ బ్రాండ్లను లేదా తమ గురించి ప్రచారం చేసుకోవడానికి ఇలా ప్రయత్నిస్తారని తప్ప మీకు ఎలాంటి బహుమతులు ఇవ్వరని గవాస్కర్ స్పష్టం చేశాడు. 1983లో తాము ప్రపంచకప్ ట్రోఫీని గెలిచి సమయంలో కూడా పలు ప్రముఖ బ్రాండ్స్ భారీ నజరానాలను ప్రకటించాయని, అయితే అవి ఎప్పుడూ కూడా జట్టు సభ్యులకు అందలేదని గవాస్కర్ వివరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాగ్గాదం చేసిన వారు బహుమతులు అందించక పోయినా పెద్దగా పట్టించుకోవద్దని గవాస్కర్ సూచించాడు.
నేరాల నియంత్రణ కోసం.. క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ
Bihar : నేడు బీహార్ లో మలిదశ ఎన్నికలు
బీహార్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది
Jubilee Hills Bye Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రారంభమయింది.
ఢిల్లీ పేలుడు.. ఎవరెవరు ఏమన్నారు..?
ఢిల్లీ పేలుడు.. ఎవరెవరు ఏమన్నారు..? ఢిల్లీలో పేలుడు ఘటనతో ఒక్కసారిగా దేశం హై
లవ్ స్టోరీతో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. నిర్మా త మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..“సంతాన ప్రాప్తిరస్తు స్క్రిప్ట్ను సంజీవ్ బాగా హ్యాండిల్ చేశారు. మొత్తం 56 రోజులలో ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా షూటింగ్ పూర్తి చేశాం. ఈ సినిమా కోసం కొత్త అబ్బాయితో వెళ్దామని, ఎలాంటి ఇమేజ్ ఇబ్బందులు ఉండవని విక్రాంత్ ను తీసుకున్నాం. మేల్ ఫెర్టిలిటీ సమస్య నేపథ్యంగా సినిమా ఉన్నా, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఎంటర్ టైనింగ్ గా సినిమా ఉంటుంది. కామెడీ ఎక్కడా కావాలని ఇరికించినట్లు ఉండదు. చాలా ఆర్గానిక్ గా ఉంటుంది. ఇప్పటి ట్రెండ్, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో అలాంటి వినోదాన్ని సృష్టిం చాం. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్..ఇలా నటులంతా అంతా బాగా ఎంటర్టైన్ చేస్తారు. సామజవరగమన తర్వాత మళ్లీ తెలుగులో వస్తున్న లవ్ స్టోరీతో సాగే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంతాన ప్రాప్తిరస్తు” అని అన్నారు. నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో దశాబ్దంన్నర అనుభవం ఉన్న మధు ర శ్రీధర్తో, హీరో విక్రాంత్తో కలిసి ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమాను చేశాం. మేల్ ఫెర్టిలిటీ సమస్యతో తెరకెక్కించిన ఈ సినిమాలో ఎక్క డా అసభ్యత లేకుండా, హద్దులు దాటకుం డా, బలమైన కథతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైన ర్ నిర్మించాం.- పిట్టకొంచెం కూత ఘనం అన్న ట్లు...మా సినిమా పేరుకే చిన్నది కానీ ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తుంది”అని తెలిపారు.
బీహార్లో నేడు రెండోదశ పోలింగ్
పాట్నా : బీహార్లో మంగళవారం (నవంబరు 11)జరగనున్న రెండోదశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో 121 స్థానాల్లో పోలింగ్ జరగ్గా, మిగతా 122 స్థానాలకు రెండవ, తుది దశ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాల్లో 40,173 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 1302 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.7 కోట్ల ఓటర్లు నిర్ణయించనున్నారు. తూర్పు, పశ్చిమ చంపారన్ జిల్లాలు, సీతామర్హి, మధుబని,సుపౌల్, అరేరియా, కిషన్గంజ్ ఈ జిల్లాల నియోజకవర్గాల్లో ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది. ఈ జిల్లాలన్నీ నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్నాయి. దాదాపు 4 లక్షల మంది పోలీసులు, పారా మిలిటరీ బలగాలు, ఇతర సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఈ జిల్లాల్లో ఎక్కువ జిల్లాలు ముస్లిం జనాభా అత్యథికంగా ఉన్న సీమాంచల్ రీజియన్లో ఉన్నాయి. ఇటు ఎన్డిఎకు, అటు ఇండియా కూటమికి సవాలుగా నిలిచే పోరుగా మారాయి. ఇండియా కూటమి మైనార్టీ సమాజాల మద్దతుపై ఆధారపడగా, చొరబాటుదార్లను విపక్షకూటమి ప్రోత్సహిస్తోందని ఎన్డిఎ ప్రచారంలో ఆరోపించింది. రాష్ట్ర కేబినెట్లో సీనియర్ మంత్రి, జెడి(యు) నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్ తన సుపౌల్ స్థానాన్ని తిరిగి ఎనిమితోసారి దక్కించుకుని రికార్డు సాధించే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన సహచర మంత్రి, బీజేపీ నేత ప్రేమ్కుమార్ , గయటౌన్ నుంచి 1990 నుంచి వరుసగా ఏడుసార్లు విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మిగతా మంత్రుల్లో బీజేపీ కి చెందిన రేణుదేవి (బెట్టియా), నీరజ్కుమార్ సింగ్ “బబ్లు”(ఛాటపూర్), జెడి(యు)కు చెందిన లెషి సింగ్ (ధండహా) , షీలా మండల్ (ఫుల్పరస్), జమఖాన్ (’చైన్పూర్ ) పోటీలో ఉన్నారు. బీజేపీకి చెందిన మరో ప్రముఖ నేత , మాజీ డిప్యూటీ సిఎం టర్కిషోర్ ప్రసాద్, కథియార్ నుంచి ఐదో సారి కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న ఆకాంక్షతో ఉన్నారు. కథియార్ జిల్లాల్లో బలరాంపూర్, కద్వా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ , కాంగ్రెస్ పార్టీలకు చెందిన మెహబూబ్ ఆలం, షకీల్ అహ్మద్ ఖాన్ క్రమంగా హాట్ట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ రెండవ , తుది దశ పోలింగ్ మైనర్ ఎన్డిఎ భాగస్వాములైన హిందుస్థాన్ అవాం మోర్చా ( హెచ్ఎఎం) అధినేత , కేంద్ర మంత్రి జితన్ రామ్ మంఝీ, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా కు చెందిన రాష్ట్రీయ లోక్మోర్చాలకు అగ్నిపరీక్ష కానుంది. ఈ రెండు పార్టీలకు చెరో ఆరు స్థానాలున్నాయి. హెచ్ఎఎంకు చెందిన ఆరుస్థానాలు ఈ రెండోదశలో పోలింగ్కు సిద్ధం అయ్యాయి. వీటిలో నాలుగు ఇమంగంజి, బారాఛట్టి, టికారి, సికంద్ర స్థానాలకు సిటింగ్ ఎమెఎల్ఎలే పోటీలో ఉన్నారు. గత ఏడాది గయ లోక్సభ స్థానం నుంచి ఎన్నికైన వరకు మాంఝీ ఇమాంగంజి స్థానం నుంచే ప్రాతినిథ్యం వహించేవారు. ఉప ఎన్నికలో ఈ స్థానం తిరిగి ఆయన కోడలు దీపాకు దక్కింది. బారాఛట్టి స్తానం నుంచి దీపా తల్లి జ్యోతిదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రీయ లోక్మార్చ్ అభ్యర్థులకు కుష్వాహా భార్యస్నేహలత, ఆయన విశ్వసనీయ సహచరుడు మాధవ్ ఆనంద్తోసహా ఎవరికీ రాష్ట్ర కేబినెట్లో రెండేళ్ల క్రితం వరకు ఎలాంటి చోటు దక్కలేదు. ససరాం, మధుబని నుంచి వారు అరంగేట్రం చేశారు. పార్టీ రంగం లోకి దింపిన ఆరుగురిలో నలుగురు రెండోదశలో పోటీలో ఉన్నారు. మరో ముఖ్యమైన అభ్యర్థి , రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్ , తన రిజర్వుడ్ కుటుంబ స్థానాన్ని వరుసగా రెండోసారి సాధించగలనన్న ఆశతో ఉన్నారు. ఫిరాయింపుదారులు కూడా... ఎన్నికల బరిలో పార్టీల ఫిరాయింపుదారులు కూడా ఉన్నారు. 2020లో ఆర్జెడి అభ్యర్థిగా గెలిచిన మొహనియా ఎంఎల్ఎ సంగీత కుమారి, ఇప్పుడు బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్నారు. నవడా ఎంఎల్ఎల విభాదేవి ఇటీవలనే విపక్షం నుంచి బయటపడి జెడి (యు) లో చేరారు. మహాఘఠ్ బంధన్ ప్రభుత్వంలో కాంగ్రెస్ తరఫున మంత్రిగా పనిచేసిన మురారి గౌతమ్ గత ఏడాది నితీశ్ కుమార్ నాయకత్వంలో ఎన్డిఎ లో చేరారు. ఇప్పుడు తిరుగుబాటు అభ్యర్థిగా లోక్జనశక్తి పార్టీ అభ్యర్థిగా తన స్థానం చెనారి నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ముందు ఆర్జేడిలో చేరిన చాణక్యప్రసాద్ ఇప్పుడు విపక్ష పార్టీ చిహ్నంతో బెల్హర్ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం ఓటర్లు 1.75 కోట్లలో సగానికి సగం మంది 30 నుంచి 60 ఏళ్ల లోపు వారు కాగా, 7.69 లక్షల మంది 18 నుంచి 19 ఏళ్ల గ్రూపు వారు. నవడా జిల్లా లోని హిసుయా స్థానంలో 3.67 లక్షల సంఖ్యలో భారీ ఎత్తున ఓటర్లు ఉన్నారు. లారియా, చనపాటియా,రక్సాయుల్,త్రివేణిగంజ్,సుగౌలి, బాణముఖి స్థానాల్లో ఒక్కొక్క స్తానం నుంచి 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండడం విశేషం. మొదటిదశలో 121 నియోజకవర్గాల నుంచి 65 శాతం వరకు పోలింగ్ రికార్డు స్థాయిలో జరిగింది.
దద్దరిల్లిన ఢిల్లీ.. ఢిల్లీలో భారీ పేలుళ్లతో దేశం ఒక్కసారిగా దద్దరిల్లింది. దేశ రాజధాని
బీహార్ రెండో దశ పోలింగ్కు సిద్ధమైంది. 1.30 మిలియన్ మంది జనాభా కలిగిన బీహార్లో ఓట్లను కొల్లగొట్టడానికి ఎన్డిఎ ప్రభుత్వం అపారమైన సంక్షేమ ప్యాకేజీని ప్రకటించింది. ఇది తీవ్రమైన ఆర్థిక పరిణామాలతో కూడుకుని ఉంటోంది. అత్యంత ప్రధానమైన ప్రస్తుత ప్రధాన రెండు పథకాలు ఇప్పటికే రాష్ట్ర ఆదాయంలో 10 శాతం వరకు హరించి వేస్తున్నాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేయడానికి వెళ్లక ముందే 1.5 కోట్ల మంది మహిళలు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన (ఎంఎంఆర్వై) పథకం కింద నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో నుంచి రూ. 10 వేలు వంతున నగదు అందుకోగలిగారు. ఎక్కువ మంది మహిళలు నమోదు కావడంతో అసలు వ్యయం ఇంకా పెరగవచ్చు. మరో 1.1 కోట్ల మంది ముఖ్యంగా వితంతువులు, వృద్ధమహిళలు, వికలాంగులు వీరందరికీ నెలవారీ పెన్షన్ రూ. 400 నుంచి రూ. 1100 వరకు మూడు రెట్లు పెరిగింది. ఫలితంగా ఏటా పెన్షన్ కింద ప్రతి పెన్షనర్కు రూ. 8400 వంతున పెరిగింది. ఈ మొత్తం అంతా రూ. 9420 కోట్ల వరకు అదనపు భారాన్ని పెంచింది. ఈ రెండు పథకాలకు కలిపి 2025 26 రాష్ట్ర బడ్జెట్ ఆదాయంలో పదో వంతు వ్యయాన్ని కేటాయించవలసి వస్తోంది. ఇవి కేవలం హామీలు మాత్రమే కాదని గుర్తించడం అవసరం. ఎంఎంఆర్వై పథకం నిధులు ఇప్పటికే పంపిణీ అయ్యాయి. పెన్షన్ నిధుల కేటాయింపు కూడా జులై నుంచి మొదలైంది. ఇంత భారీ మొత్తాన్ని ఎవరు భరిస్తారు? ఎంఎంఆర్వై పథకం నిధులు రుణం నుంచి లభిస్తాయా? లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా అందుతాయా? సామాజిక భద్రత కింద పెరిగిన ఈ మొత్తం అంతా రాష్ట్ర ఖజానా నుంచే భరిస్తారని నివేదించడమైంది. కానీ దీని ప్రభావం ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిధులపై ఎంతవరకు పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం తన మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందా? అంటే దీని అర్థం కొత్తగా రోడ్లు, స్కూళ్ల నిర్మాణానికి, విద్యుత్ ఉత్పత్తికి, ఇతర అభివృద్ధి పథకాలకు కావలసిన పెట్టుబడుల్లో కోత విధిస్తుందా? ఈ మేరకు పెరిగిన ద్రవ్యలోటు ఫలితంగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుందా? ఇవన్నీ తలెత్తుతున్నాయి. ముక్తసరిగా చెప్పాలంటే ఎన్డిఎ సంక్షేమ ప్యాకేజీ దేశంలోని అత్యంత నిరుపేద, కనీస అభివృద్ధి కూడా లేని బీహార్ రాష్ట్రంలో ఆర్థిక వినాశనానికి విత్తనాలు నాటిందా? గత ఏడాది బీహార్ ఆర్థికలోటు రాష్ట్ర జిడిపిలో 9.2 శాతంగా ఉంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు మూడు సార్లు ఆర్థిక లోటును భరించడానికి వీలుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ను గత మార్చిలో ప్రవేశ పెట్టినప్పుడు ఆర్థిక లోటును 3 శాతానికి తగ్గిస్తానని రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా హామీ ప్రకటించింది. అయితే అది ఇప్పుడు జరిగే అవకాశం లేకుండా సంక్షేమ ప్యాకేజీ ఆశలను చెల్లాచెదురు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ భారీ సంక్షేమ ప్యాకేజీ ప్రకటనకు ఓటర్లు సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఆర్థిక బాధ్యతారాహిత్యానికి విపక్షాలు ఏ విమర్శలు చేయకుండా దూరంగా ఉంటున్నాయి. దీనికి పోటీగా అవి కూడా భారీ హామీలతో తమ స్వంత సంక్షేమాన్ని ప్రకటించాయి. క్షేత్రస్థాయిలో ఈ రాజకీయ క్రీడ చాలా తేడాగా ఉంటోంది. ఎందుకంటే నితీశ్ ప్రభుత్వం ఇప్పటికే తమ హామీలను అమలు చేస్తుండడంతో విపక్షకూటమి కేవలం హామీలు ఇస్తుందనే భావనతో ఓటర్లు ఉన్నారు. దళారుల ప్రమేయం కానీ, అవినీతి కానీ చోటు చేసుకోకుండా ఓటర్ల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయడం నితీశ్కు ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. గతంలో ఇలాంటి నగదు పంపిణీ, తదితర పథకాల్లో కేవలం 15 శాతం వరకే ప్రయోజనాలు లబ్ధిదారులకు అందేవి. సాధారణంగా పాలనలోఉన్న ముఖ్యమంత్రులపై ఎంతో కొంత వ్యతిరేకత ఉండడం సహజం. రాష్ట్రాల్లో పాలన సరిగ్గా లేకుంటే ఎన్నికలు వచ్చినప్పుడు వ్యతిరేకంగా ఓట్లు వేసి తమ కోపం తీర్చుకుంటుంటారు. ఈ విషయంలో నితీశ్ ముందుగానే జాగ్రత్త పడ్డారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గమనించి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. మోడీ ప్రభుత్వంతో జతకట్టి అధికారంలో ఉండడంతో ఓటర్లలో ఉన్న కొద్దిపాటి వ్యతిరేకతను అధిగమించడానికి ప్రయత్నించారు. భారీ సంక్షేమ పథకాలతో ఓటర్లను ఊరించే పనిచేశారు. ఈ పరిస్థితుల్లో భారీ సంక్షేమ పథకాలు గేమ్ ఛేంజర్ అవుతాయా? మరోవైపు ప్రధాన విపక్షకూటమి ‘మహాఘట్బంధన్’ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోనే కుటుంబానికి ఓ ఉద్యోగం కల్పిస్తామని హామీ ప్రకటించింది. బీహార్లో 2.97 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. నెలకు రూ.15,000 నుంచి రూ. 20,000 వంతున ప్రతి కుటుంబానికి ఖర్చు పెట్టవలసి వస్తుందని లెక్క వేసినా మొత్తం వ్యయం రూ. 5.35 లక్షల కోట్లు నుంచి రూ.7.13 లక్షల కోట్ల వరకు వ్యయం కాక తప్పదు. ఇది ఉద్యోగ వాగ్దాన అసంబద్ధతను తెలియజేస్తుంది. ఈ సరళమైన గణాంకం మహాఘట్బంధన్ ఆలోచన లోని శూన్యతను తెలియజేస్తుంది. ఇది కాక ఐదేళ్ల పాటు వడ్డీ లేని నగదు రూ. 5 లక్షల వరకు అందజేస్తామని, పంటల సేకరణ గ్యారంటీ, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా ఇవన్నీ మహాఘట్బంధన్ మేనిఫెస్టోలో చేర్చిన ప్రధాన అంశాలు. అయితే ఆర్థిక నిపుణులు, రాజకీయ పరిశీలకులు ఈ ఉచిత హామీలు వచ్చే ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపించవని వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 10 వేలు అందుకుంటున్న మహిళలు కూడా చాలామంది ప్రభుత్వం మార్పును కోరుతుండడం గమనార్హం.
ఆ.. దొంగల ముఠా అరెస్ట్.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పలు రాబరీలు, దొంగతనాలు,
జూబ్లీహిల్స్ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నా ఆయన తెచ్చిన నిధులేమీ లేవని, కిషన్ రెడ్డి, కెసిఆర్ అభివృద్ధి నిరోధకులని రేవంత్ ధ్వజమెత్తారు. కేంద్రం 2014- 23 మధ్య తెలంగాణకు 9 లక్షల కోట్ల నిధులిచ్చిందని, సిఎం అసత్య ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక హైడ్రా పేరుతో ఇళ్లు కూలగొట్టడం మినహా పేదలకు చేసిందే లేదని కెటిఆర్ విమర్శించగా, చెరువుల ఆక్రమణలు తొలగించి నీటివనరులను అభివృద్ధి పరుస్తున్నా మని, మూసీ ఆక్రమణలు తొలగించి నగరాన్ని నందనవనం చేస్తుంటే కెటిఆర్, హరీశ్ సహించలేకపోతున్నారని సిఎం విమర్శించారు. సిఎం రేవంత్, కెసిఆర్ల ప్రతిష్ఠకు అగ్నిపరీక్ష. హైదరాబాద్ మహానగర పరిధిలోని జూబ్లీహిల్స్ శాసనసభా స్థానానికి 11న జరిగే ఉపఎన్నిక ప్రచారం పూర్తయి, పోలింగ్కు సర్వం సిద్ధంగా ఉంది. బిజెపితో సహా 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ విజయసాధనకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ అధినేత, మాజీముఖ్యమంత్రి కెసిఆర్ల ప్రతిష్ఠకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అగ్నిపరీక్షగా నిలిచింది. జూబ్లీహిల్స్ స్థానానికి 3 సార్లు ప్రాతినిధ్యం వహించిన నాయకుడు మాగంటి గోపీనాథ్ ఆకస్మికంగా మరణించడంతో జరుగుతున్న ఉపఎన్నికలో గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకిదింపి సానుభూతి ఓట్లతో మళ్ళీ గెలవాలని భారత రాష్ట్రసమితి గట్టి ప్రయత్నాలే చేస్తున్నది.ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుని తదుపరి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటి, కెసిఆర్ను మళ్లీ సిఎంగా తేవాలనే వ్యూహంతో బిఆర్ఎస్ శ్రమిస్తోంది. కెటిఆర్, హరీశ్రావు పలువురు మాజీమంత్రులు, శాసనసభ్యులు, స్థానిక నేతలను వీరేంటబెట్టుకుని ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం చేశారు. నియోజక వర్గంలోని శ్రీనాగరకాలనీ, బోరబండ, వెంగళరావునగర్, షేక్పేట, ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, 7 కార్పొరేట్ డివిజన్లలోని బస్తీలు, మురికివాడలు, ప్రధాన రహదారులలో బిఆర్ఎస్ మాజీమంత్రులు, శాసనసభ్యులు సిహెచ్ మల్లారెడ్డి, ఎస్. నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద గౌడ్ ప్రభృతులు గల్లీగల్లీలో ఇంటింటికీ తిరిగి కారుగుర్తుకు ఓటేసి కెసిఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాలని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ బిసి సాధికారత నినాదంతో యువకుడు, శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ను హస్తం అభ్యర్థిగా పోటీకి దింపి గెలుపుకోసం చెమటోడుస్తోంది. తెలంగాణ మంత్రు లు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సహా మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేశ్గౌడ్ వంటి నేతలే గాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకుని వివిధ డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. దాదాపు 4 లక్షల ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్లో లక్షా 1.4 లక్షల బిసి, లక్ష ముస్లిం, 20 వేలు క్రైస్తవ ఓటర్లున్నారు. నిజానికి ఈ స్థానం మినీ భారత్. ఉత్తరాది వారుతెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన సామాజిక వర్గాల వారూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సంఖ్యలో వున్నారు. ఈ ఎన్నిక మోడీ, కెసిఆర్ ద్వయానికి, రేవంత్, రాహుల్, ఒవైసిల మధ్య జరుగుతున్న పోరుగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న ముస్లింలను ఆకట్టుకోవడానికి కొద్దిరోజుల ముందే క్రికెట్ ఆటగాడు అజారుద్దీన్కు మంత్రిపదవి ఇచ్చి మైనారిటీ వ్యవహారాల శాఖను కట్టబెట్టారు. మజ్లిస్ పార్టీ పోటీ చేయకుండా ఈసారి హస్తం పార్టీకి మద్దతు ప్రకటించడం విశేషం. కెసిఆర్ ప్రభుత్వం మైనారిటీలను నిర్లక్ష్యం చేసిందని, ముస్లిం రిజర్వేషన్లను 4 నుండి 12 శాతానికి పెంచుతామని చెప్పి మోసం చేశారని మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం సరఫరా చిస్తోందని, పదేళ్ల తర్వాత కొత్తకార్డులను ఇచ్చిందని, ఇళ్లకు ఉచిత కరెంటు, రూ. 500 కే వంట గ్యాస్ సరఫరా చేస్తోందని చెబుతూ, జూబ్లీహిల్స్లో గెలిస్తే మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓటర్లకు హామీ ఇచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం వేలకోట్లు కొల్లగొట్టి యువతకు ఉద్యోగ, ఉపాధిని నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసి ఆదుకున్నామని, రానున్న కాలంలో మరిన్ని పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని సిఎం భరోసా ఇచ్చారు. పార్లమెంటులో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లులకు బిఆర్ఎస్ ఎంపిలు మద్దతు పలకడం చూస్తే కెసిర్ మోడీకి నమ్మకమైన మిత్రుడుగా ఉన్న సంగతి తెలుస్తోందని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్కు ఎటిఎంగా ఉందని గతంలో ఆరోపించిన మోడీకి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వం న్యాయవిచారణ జరిపి, సిబిఐ, ఇడిలతో విచారణ జరిపించాలని శాసనసభ తీర్మానించి కేంద్రానికి పంపినా, ఇకారురేస్లో అవినీతి జరిగినా మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, కారుగుర్తుకు ఓటేస్తే కమలానికి ఓటేసినట్లేనని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ముస్లింల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఇది ముస్లింలను బుజ్జగించడమేనని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరరావు స్పందించారు. బిజెపి నేతలు కమలం గుర్తుకు ఓటేయాలని వారు కోరారు. జూబ్లీహిల్స్ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నా ఆయన తెచ్చిన నిధులేమీ లేవని, కిషన్ రెడ్డి, కెసిఆర్ అభివృద్ధి నిరోధకులని రేవంత్ ధ్వజమెత్తారు. కేంద్రం 2014- 23 మధ్య తెలంగాణకు 9 లక్షల కోట్ల నిధులిచ్చిందని, సిఎం అసత్య ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక హైడ్రా పేరుతో ఇళ్లు కూలగొట్టడం మినహా పేదలకు చేసిందే లేదని కెటిఆర్ విమర్శించగా, చెరువుల ఆక్రమణలు తొలగించి నీటివనరులను అభివృద్ధి పరుస్తున్నామని, మూసీ ఆక్రమణలు తొలగించి నగరాన్ని నందనవనం చేస్తుంటే కెటిఆర్, హరీశ్ సహించలేకపోతున్నారని సిఎం విమర్శించారు. బోరబండ చౌరస్తాలో పిజెఆర్ విగ్రహం, అమీర్ పేట మైత్రీవనం కూడలిలో తెలుగుతేజం ఎన్టిఆర్ విగ్ర హం నెలకొల్పుతామని హామీ ఇచ్చి రేవంత్ వారి మన్ననలు పొందారు. జూబ్లీహిల్స్లో ఆధునిక ఐటిఐ, మహిళా కళాశాల నెలకొల్పుతామని, మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతామని చెబుతూ ఎలాగైనా హస్తం పార్టీ గెలుపుసాధించి తీరాలనే పట్టుదలతో సిఎం ప్రచారం సాగించారు. జూబ్లీహిల్స్లో సంపన్న వర్గాలు ఉన్నా పేద, మధ్య తరగతి వారే అధికం. బస్తీలు, మురికివాడలలో పారిశుద్ధ్య, మంచినీటి సరఫరా సరిగాలేకపోవడం, మురుగునీటి పారుదల సరిగాలేక నీరు రోడ్లపైకి రావడం, రోడ్లు గండ్లుపడి అధ్వానంగా, దుర్గంధం వేదజల్లడం ప్రజలను పీడిస్తున్న ప్రధాన సమస్యలు. రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తయితే సమస్యలు తీరుతాయని మంత్రులు, అధికార పార్టీల నేతలు అంటున్నారు. ఉప ఎన్నికలో హస్తం పార్టీ ఓడితే సిఎం రేవంత్ పదవికి వెంటనే ముప్పులేకపోయినా అసమ్మతి పెరిగి, నాయకత్వ మార్పు కోసం కాంగ్రెస్ నేతలు మళ్లీ అసమ్మతి కార్యక్రమాలు మొదలెడితే ఇబ్బందులు తప్పకపోవచ్చు. కెసిఆర్ ప్రచారానికి రాకపోగా, కనీసం కారుగుర్తుకు ఓటేయమని ప్రకటన చేయక పోవడం ఆ పార్టీ శ్రేణులకు కొంత నిరుత్సాహం కలిగించింది. ఈ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రతిష్ఠకు పోటీగా భావిస్తున్నారు. మాగంటి సునీతపై బిఆర్ఎస్ సానుభూతి, కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రభావం చూపితే హస్తం పార్టీ విజయం. పోటాపోటీగా ఉన్నందున ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో చూడాల్సిందే. పతకమూరు దామోదర్ ప్రసాద్ 94409 90381
ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు శాశ్వతంగా తనిఖీ బృందాలు నియమించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. సుమారు 24 వేలపైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి 299 కమిటీలువేసి వాటిలో పాఠశాలల్లో బోధించి కనీసంగా పదేళ్ళ బోధనానుభవం కలవారిని శాశ్వతంగా తనిఖీ బృందాలుగా నియమిస్తారు.16,474 ప్రాథమిక పాఠశాలల తనిఖీకి 504 మంది ఉపాధ్యాయులతో 168 తనిఖీ బృందాలు, 3,100 మాధ్యమిక పాఠశాలలకు 105 మంది ఉపాధ్యాయులను 35 బృందాలుగా, 4,672 ఉన్నత పాఠశాల పర్యవేక్షణకు 864 మంది ఉపాధ్యాయులతో 96 పర్యవేక్షణా బృందాలు వెరసి 1473 మంది ఉపాధ్యాయులు శాశ్వతంగా మానెటరింగ్ ప్రక్రియలో వినియోగం చేస్తారు. ఇక ఈ తనిఖీ బృందాలలో నియమితులైన వారెవరూ ఇంకా వారివారి పాఠశాలల కెళ్ళి పాఠాలు చెప్పవలసిన పనిలేదు. అంటే 1473 పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనా సేవలు ఇంకా అందవని అర్థం. ఇక గత ముప్పైఏళ్ళుగా పాఠశాలల తనిఖీ అధికారులు అయిన మండల విద్యాశాఖ్య అధికారులు, జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ పోస్టులు నింపకుండా విద్యాశాఖ చోద్యం చూస్తా ఉంది. అత్యంత కీలకమైన ఈ పాఠశాల తనిఖీ అధికారులు పోస్టులు నింపకపోగా తాత్కాలిక ప్రాతిపదికన ఇన్ఛార్జీలను వేసి చేతులు దులుపుకుంటున్నారు. నియమించిన ఈ తనిఖీ అధికారులు ఎప్పటిదాకా ఉంటారో, పోస్టు ఎప్పుడు ఊడుతుందో తెలియని స్థితిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 634 మండల విద్యాశాఖ అధికారులు, 70 మంది జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, 33 మంది జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీకి అధికారికంగా ఉండగా, తాజాగా ఈ నియామకాల వల్ల విద్యాశాఖ సాధించేది ఏమీ ఉండదు? ఇంతకు ముందు అనుభవాలు మనకు ఉండనే ఉన్నాయి. సర్వశిక్షా అభియాన్ నేతృత్వంలో ఓ 30 ఏళ్ళ క్రితం మండల విద్యా వనరుల కేంద్రంలో ముగ్గురు ఉపాధ్యాయులు బృందాలను మండల రీసోర్స్ పర్సన్ లుగా నియమించి ఓ దశాబ్దం పాటు ప్రయోగం చేశారు. ఈ రీసోర్స్ పర్షన్ల నియామకం వలన ఎలాంటి అదనపు ప్రయోజనం చేకూరే లేదని, పైగా ఆయా పాఠశాలల్లో బోధన కుంటుపడుతుందని తిరిగి వారందరినీ వారివారి పాఠశాలకు పంపించి వేశారు. తనిఖీ బృందాలలో నియమితులైన వీరు ఉద్యోగ ధర్మం కంటే సొంతపనులపై తిరిగారనే విమర్శలు ఉన్నాయి. కొందరైతే సొంత వ్యాపారాలు ప్రారంభించారు. మరికొందరు ఉద్యోగ ధర్మం నిర్వర్తించాల్సిన సమయంలో సొంత పనులు చక్కబెట్టుకున్నానే ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే విద్యాహక్కు చట్టం -2009 వచ్చిన తర్వాత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేతృత్వంలో ఒక సబ్జెక్టు నిపుణుల బృందంను వారంలో ఒకరోజు ఇతర పాఠశాలల తనిఖీకి వాడుకున్నారు. అయితే ఆయా పాఠశాలల్లో బోధన కుంటుపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ విధానానికి కూడా మంగళం పాడారు. గత అనుభవాలు ఉండికూడా ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం చేయడం వలన విఫల ప్రయోగం కాదా? తెలంగాణ విద్యా శాఖ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పైగా ఈ తనిఖీ బృందాలు నియామకం వలన మండల విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ ఉప అధికారులకు ప్రత్యామ్నాయంగా మరో అధికార కేంద్రం అనధికారికంగా పెట్టారనే భావన, పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు తమ తోటి ఉపాధ్యాయులే, సమాన హోదాలో తమను తనిఖీ చేయడం ఏమిటి? అనే ఒక రకమైన ఆత్మనూన్యతకు గురయ్యేఅవకాశం ఉంది. ఇక తనిఖీ బృందాలకు టిఎ, డిఎల కోసం లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతచేస్తే చివరకు 60 శాతం విద్యార్థులు చదువుతున్న ప్రైవేటు పాఠశాలలు తనిఖీకి వీరికి అధికారం కల్పిస్తారా? లేదా? కేవలం 40 శాతం పిల్లలున్న ప్రభుత్వ పాఠశాలకే ఈ తనిఖీలను పరిమితం చేస్తారా? ఇలా చేసినట్లైతే అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ నియంత్రణ కనీసంగా లేని ప్రైవేటు పాఠశాల మానెటరింగ్కు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రైవేటు పాఠశాలల ప్రక్షాళన, నియంత్రణ అవసరం లేదా? అర్హతలేని ఉపాధ్యాయులతో బోధన, కేవలం గణితం, సైన్స్ తప్ప మరో సబ్జెక్టుపై బోధన కేంద్రీకరించలేని ప్రైవేటు పాఠశాల తనిఖీ బాధ్యత ఎవరు చేపట్టాలి? ఇక విద్యాహక్కు చట్టం -2009 లోని నిబంధన 19 (1)హెచ్ ననుసరించి 2010 ఏప్రిల్ నుండి మన పరీక్షా విధానం సమూలమైన మార్పుకు గురైంది. సులభతరమైన, ఒత్తిడి లేని నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంలో తనిఖీ అధికారులు అవసరం లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తరగతి గది మధ్య ఎప్పటికప్పుడు అత్యంత సులభతరంగా ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈ పునచ్ఛరణ అనుభవం నుండే అటు ఉపాధ్యాయుడు తన బోధనా అనుభవాలు స్థిరీకరణ జరుగుతుంది. మరోవైపు విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకొంటారు. ఎందుకో మన తెలంగాణ విద్యాశాఖ ఇసిసిఇ విధానాన్ని జీర్ణించుకున్నట్లు కనిపించడంలేదు. అందుకు తాజా ఉదాహరణ గత దశాబ్ద కాలంగా నడుస్తున్న పదవ తరగతి పరీక్షలలో గ్రేడులకు బదులు తిరిగి మార్కులు ప్రవేశపెట్టడం. తరగతి గది మూల్యాంకనం ప్రక్రియ అయిన నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అవుతుంది. పరీక్షలను చట్టబద్ధ స్థితి నుంచి ప్రైవేటు విద్యా సంస్థలు మెప్పు కోసం గ్రేడుల నుండి మార్కుల వైపు మోగ్గు చూపిన వైనం స్పష్టంగా కనపడుతుంది. గతంలో మండల రీసోర్స్ పర్షన్ల నియామకాలు వలన తేలింది ఏమంటే చాలా చోట్ల ఎంఆర్పిలు తమ విధులు విస్మరించి సొంత పనుల వైపు మొగ్గారు. విద్యాశాఖ అధికారులకు దళారీ వ్యవస్థగా పని చేశారు. పాఠశాలలు తనిఖీలు చేయాల్సిన వీరు కాగితాలు స్వీకరించి, కాకి లెక్కలు, గణాంకాలు, నివేదికలు స్వీకరించే పరిస్థితి మాత్రమే ఉండేది. ఆ కాగితాలు కంప్యూటర్ కెక్కించడంపై సమీక్షలు తప్ప ఎలాంటి ప్రయోజనం ఒనగూడలేదు! కనుక తెలంగాణ విద్యాశాఖ పెద్ద సంఖ్యలో శాశ్వతంగా మానెటరింగ్ జట్టును నిర్మించేటప్పుడు గత అనుభవాలను తప్పనిసరిగా సమీక్షించుకోవాలసిన అవసరం ఉంది. తనిఖీ అధికారులు ఏర్పరిచే ముందు నమోదు క్షీణించిపోతున్న ప్రభుత్వ బడుల సంస్కరణ, పునర్వ్యవస్థీకరణ వైపు దృష్టి పెట్టడంతోపాటు, ప్రైవేటు పాఠశాలల వనరులలోపం, నిబంధనలు ఉల్లంఘన, ఫీజుల క్రమబద్ధీకరణ తదితర విషయాలు తనిఖీ చేసి చక్కదిద్దాల్సిన బాధ్యత విద్యాశాఖ పైన ఉంది. ఎన్. తిర్మల్ 94418 64514
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అస్తమయం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. అందెశ్రీ ఐదు సంవత్సరాలుగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి ఆయన బాత్రూంకు వెళ్లి కిందపడిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన అందెశ్రీ కుటుంబసభ్యు లు ఆయన్ను వెంటనే సోమవారం ఉదయం 7.25 గంటలకు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 15రోజులుగా అందెశ్రీ తీవ్రమైన రక్తపోటుతో ఇబ్బందులు పడుతున్నారని, నెలరోజులుగా బిపి మందులు వాడడం లేదని, రాత్రి భోజ నం చేశాక మాములుగానే వెళ్లి పడుకున్నారని, ఉదయం వెళ్లిచూసేసరికి కిందపడి ఉన్నారని అందెశ్రీ కుటుంబసభ్యులు తెలిపినట్లు గాంధీ వైద్యులు సునీల్ కుమార్ తెలిపారు. మా దగ్గరికి వచ్చేటపటికే ఆయన మృతిచెంది ఐదు నుంచి ఆరు గంట లు అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైద్యులు మృతదేహాన్ని అప్పగించిన తరువాత అం దెశ్రీ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు లాలాపేటలోని ఆయన నివాసానికి తరలించారు. కడసారి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు లాలాపేటలోని ఆయన నివాసానికి సోమవారం తండోపతండాలుగా వచ్చారు. అందెశ్రీ హఠాన్మరణంపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, సిఎం రేవంత్రెడ్డి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, ఆ పార్టీ నేతలు కెటిఆర్, హరీశ్రావు పలువురు రాష్ట్ర మంత్రులు, బిజెపి అధ్యక్షుడు రాంచందర్రావు, వామపక్ష నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకూలింది: సిఎం అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మృ తి తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రత్యేక తెలంగాణ సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని సిఎం రేవంత్ గుర్తు చేశారు. అందెశ్రీతో తరువాయి 8లో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్ర జా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రా ష్ట్ర గీతం కొత్త (మొదటి పేజీ తరువాయి) స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సిఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిపించాలని సిఎస్ రామకృష్ణా రావును ఆదేశించారు. అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లను సమీక్షించాలని అధికార యంత్రాంగానికి సిఎస్ సూచించారు. నేడు అందెశ్రీ అంత్యక్రియలకు సిఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. అంత్యక్రియలకు సిఎం హాజరై ఆయన పార్ధీవ దేహానికి నివాళ్లు అర్పించనున్నారు. నేడు ఉదయం 9 గంటలకు లాలాపేట్ నుంచి ఘట్కేసర్ వరకు అందెశ్రీ అంతిమయాత్ర నిర్వహించనుండగా ఆ అంతిమయాత్రలో సిఎం పాల్గొననున్నారు. ఈ అంతిమయాత్రలో ఆప్తులు, అభిమానులు సైతం పాల్గొననున్నారు. రాష్ట్రీయ గీతంగా ‘జయజయహే తెలంగాణ’.. ప్రకృతి, తెలంగాణ ఉద్యమం, జానపద శైలిలో అందెశ్రీ అనేక పాటలు రాశారు. వాటిలో అందెశ్రీ కలం నుంచి వచ్చిన ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్రీయగీతంగా గుర్తించబడింది. ఈ గీతం రూపంలో అందెశ్రీ శాశ్వతంగా తెలంగాణ సమాజం నోట నిలిచిపోయారు. ఎర్ర సముద్రం సినిమాలో మనిషి మనస్థత్వం గురించి రాసిన పాట ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు’ సైతం ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలోని ‘జన జాతరలో మన గీతం’ అనే పాట ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది. దీంతో పాటు అందెశ్రీ రాసిన ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ పాట సైతం ఉద్యమం సమయంలో రోమాలు నిక్కబొడిచేలా చేసిన పాటగా నిలిచింది. ప్రకృతిపై ప్రేమతో అందెశ్రీ రాసిన ‘పల్లెనీకు వందనాలమ్మా’ పాట పల్లెల గొప్పదనాన్ని చెప్పే విధంగా ఉంటుంది. ఈ పాటను రసమయి బాలకిషన్ పాడారు. ‘గల గల గజ్జలబండి ఘల్లు చూడు’ అంటూ ఓరుగల్లును గొప్పగా వర్ణిస్తూ అందెశ్రీ రాసిన పాట, వీటితో పాటు ‘కొమ్మ చెక్కితే బొమ్మరా, ఎల్లిపోతున్నావా తల్లి, చూడు తెలంగాణ, అల్లంత దూరం చూడు, ఆడ బ్రతుకు’ అనే పాటలు ఎంతోమందిని కదిలించాయి. గొర్రెల కాపరిగా, కూలీగా పనిచేసి.... అందెశ్రీ 1994లోనే బ్రతకలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలోనే యలమంచి శేఖర్ సినిమాల్లో పాటలు రాసే అవకాశం కల్పించారని ఆయన ఇంటర్వ్యూలో తెలిపారు. తరువాత అందెశ్రీకి సినిమాల్లో విప్లవ పాటలు రాసే అవకాశం వచ్చింది. నారాయణమూర్తి నటించిన చాలా సినిమాలకు అందెశ్రీనే పాటలు రాశారు. ఆయన రాసిన బతుకమ్మ సినిమా పాటలు తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉవ్వెత్తున పైకి లేచేలా చేశాయి. అందెశ్రీ ప్రపంచంలోని మిస్సిస్సిప్పి, మిస్సోరీ, అమెజాన్, నైలునది లాంటి నదుల వెంట ప్రయాణిస్తూ నదులపై కవిత్వం రాసేందుకు ప్రపంచం అంతా తిరిగారు. తన పాటలకు, రచనలకు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. అనాథగా ఎన్నో కష్టాలను అనుభవించి గొర్రెల కాపరిగా, కూలీగా పనిచేసి కవిత్వంతో డాక్టరేట్ అందుకునే స్థాయికి ఎదిగారు. పాఠశాల చదువు లేకుండానే మేటి రచయితగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రకృతి, తెలంగాణ ఉద్యమం, జానపద శైలిలో అందెశ్రీ అనేక పాటలు రాశారు. బడికి వెళ్లకుండా బలపం దిద్దకుండానే అందెశ్రీ సాహితీప్రపంచంలో అడుగుపెట్టి గొప్పస్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా ఆయన మరణం తెలంగాణ కవితాలోకానికి తీరనిలోటుగా మిగిలింది. అసలు పేరు అందె ఎల్లయ్య 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని రేబర్తి గ్రామంలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయనకు చదువుకునే అవకాశం కూడా దక్కలేదు. ఆయన జీవితం గొర్లకాపరిగా ప్రారంభమయ్యింది. ఒకరోజు ఆయన పాడుతుండగా విన్న శృంగేరి మఠానికి చెందిన స్వామీ శంకర్ మహారాజ్ చేరదీయడంతో అతడి జీవితం కీలక మలుపు తిరిగింది. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం ‘మాయమైపోతున్నడమ్మా’ పాటతో ప్రజల్లో విశేషమైన పేరును అందెశ్రీ సంపాదించుకున్నారు. అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన సినీ రంగానికి సేవలందించారు. 2006లో వచ్చిన గంగ సినిమాకు గాను అందెశ్రీకి నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ నుంచి అందెశ్రీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇటీవల అందెశ్రీకి రూ.కోటి పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. నూతన గృహం పూర్తి కాకముందే.... ఎంతో ఇష్టంతో నిర్మించుకుంటున్న నూతన గృహం పూర్తి కాకముందే అందెశ్రీ మృతిచెందారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సినగర్లో అందెశ్రీ కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. మృతిచెందే ముందు రోజు నవంబర్ 09 వ తేదీ సాయంత్రం వరకు అందెశ్రీ అక్కడే ఉన్నారు. సాయంత్రం వరకు ఇల్లు నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. ఎన్ఎఫ్సి నగర్లోని 348 గజాల్లో జి+3 పెంట్ హౌస్ను అందెశ్రీ నిర్మించుకుంటున్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం మొ త్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక పో లింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం (నవంబర్ 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పో లింగ్ జరుగనుంది. సాయంత్రం 6 గంట ల లోపల కేంద్రంలోకి వచ్చే ప్రతి ఒక్క ఓట రు.. ఎంత రాత్రి అయినా ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. ఎన్నిక కోసం 2,394 ఇవిఎంలు, 595 వీవీప్యాట్లు, 561 కం ట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఇవిఎంలలో సమస్య వస్తే వెంటనే సరిచేయడానికి పెద్ద ఎత్తున ఇంజినీర్లను అందుబాటులో ఉంచారు. ఉప ఎన్నికకు 139 ప్రాంతాలలో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఈ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆయా కేంద్రాలలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక లో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ని ర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో షామియానాలతో పా టు వికలాంగులు, వృద్ధులకు వీల్ ఛైర్లనూ ఏర్పా టు చేస్తున్నారు. తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణతో పాటు ఓటర్లకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టింది. మొత్తం ఓటర్లు 4,01,365 మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లుండగా.. అందులో 2,08,561 మంది పురుషులు.. 1,92,779 మంది మహిళలు.. ఇతరులు 25 మంది ఉన్నారు.18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు 6,859 మంది ఉండగా 80 ఏళ్లు పైబడిన వారు 6,053 మంది 85 ఏళ్లు పైబడిన వారు 2,134 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే వృద్ధులకు సంబంధించిన హోమ్ ఓటింగ్లో దరఖాస్తు చేసుకున్న 103 మంది తమ హక్కు వినియోగించుకున్నారు. 58 మంది అభ్యర్థులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ నియోజకవర్గానికి ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లో 58 మంది పోటీ చేయడం ఇదే తొలిసారి. 2023లో జరిగిన ఎన్నికల్లో 19మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగింది. ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. యాప్ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదవుతుందని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా 1,761 మంది రాష్ట్ర పోలీసులు, 8 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. 45 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 45 స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, 4 వీడియో సర్వలెన్స్ టీమ్లు, 4 వీడియో వ్యూయింగ్ టీమ్లు, రెండు అకౌంటింగ్ బృందాలు పని చేయనున్నాయి. 68 కేంద్రాల వద్ద సిఆర్పిఎఫ్తో భద్రత : సిఇఒ సుదర్శన్రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు. 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిఆర్పిఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఎన్నికలో మొదటిసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 24 గంటలపాటు అందుబాటులో ఉండే కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఎలాంటి ఇబ్బందులు 1950 నెంబర్ ఫోన్ చేసిన ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఈ ఎన్నిక కోసం 2060 మంది ఎన్నికల సిబ్బంది, 2000 మంది పోలీసు సిబ్బంది పనిచేయబోతున్నట్లు చెప్పారు. వెబ్ కాస్టింగ్ ఉంటుందని, ఫ్లయింగ్ స్క్వాడ్తో నిఘా పెడతామని తెలిపారు.
స్పీకర్పై కోర్టు ధిక్కరణ పిటిషన్
మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఎలపై అనర్హత వేటు వే యడంలో జాప్యం చేస్తున్నారంటూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టు లో బిఆర్ఎస్ పార్టీ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేసింది. గతంలో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన మూడు నెలల గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేద ని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేన ని పిటిషన్లో పేర్కొంది. బిఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తరఫున ఈ పిటిషన్ దాఖలైంది. మరోవైపు, ఎంఎల్ఎలపై విచారణకు సంబంధించి తమకు మరింత గడు వు కావాలని కోరుతూ స్పీకర్ కార్యాలయం సైతం ఇప్పటికే సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. స్పీకర్ అభ్యర్థనపై సుప్రీం కోర్టు ఈ నెల 14న విచారణ చేపట్టనున్నది. ఈ మేరకు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారిస్తుందని కోర్టు లిస్ట్లో పేర్కొంది. బిఆర్ఎస్ కారు గుర్తుపై గెలుపొందిన ఎంఎల్ఏలలో పది మంది కాంగ్రెస్లో చేరినందున, వారిపై రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా ఆ పార్టీ ఎంఎల్ఏలు స్పీకర్ వద్ద పిటిషన్లు దాఖలు చేశారు. కాగా, తమ పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్టించుకోవడం లేదని, ఫిరాయింపు ఎంఎల్ఏలకు కనీసం నోటీసులు కూడా పంపించలేదని పిటిషనర్లు (బిఆర్ఎస్ ఎంఎల్ఏలు) సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేయాల్సిందిగా సుప్రీం కోర్టు స్పీకర్కు సూచించింది. సుప్రీం విధించిన గడువు గత నెలాఖరుతో ముగిసింది. ఇదిలాఉండగా సుప్రీం విధించిన గడువులోగా విచారణ పూర్తి చేసేందుకు స్పీకర్ పది మంది ఎంఎల్ఏలకు నోటీసులు పంపించగా, వారిలో ఎనిమిది మంది కౌంటర్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన స్పీకర్ గడువులోగా నాలుగు పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు విన్నారు. మిగతా నలుగురు ఎంఎల్ఏల పిటిషన్ల వాదనలు వినేందుకు తనకు మరో రెండు నెలల గడువు కావాలని స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి గడువు ముగియడానికి వారం రోజుల ముందుగానే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు, కామన్వెల్త్ స్పీకర్ల సదస్సుకు హాజరు కావడం వల్ల సకాలంలో పూర్తి చేసేందుకు సమయం సరిపోలేదని, కాబట్టి మరో రెండు నెలల గడువు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుప్రీం కోర్టు ధర్మాసనం 14న విచారణ చేపట్టనున్నది.
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 11-11-2025
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 11-11-2025
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర లు మళ్లీ ఊపందుకుంటున్నాయి. సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకస్మికంగా పెరిగాయి. అమెరికా డాలర్ బలపడడం, పసిడికి డిమాండ్ తగ్గడం వల్ల అం తర్జాతీయ మార్కెట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం 4 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,220గా ఉంది, ఇది క్రితం రోజు 1,22,020తో పోలిస్తే రూ.1,200 పెరుగుదలను చూసిం ది. 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ. 1,12,950గా ఉంది, ఇది క్రితం రోజు రూ.1,11,850తో పోలిస్తే రూ.1,100 పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2500 పెరిగి రూ.1,55,000కు చేరుకుంది. క్రితం రోజు ఇది రూ. 1,52,500గా ఉందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) తెలిపింది. వే2వెల్త్ బ్రోకర్స్ రీసెర్చ్ అనలిస్ట్ అభిషేక్ ఎం పెలు ప్రకారం, ఎంసిఎక్స్ గోల్డ్ ప్రస్తుతం కన్సాలిడేషన్ జోన్లో ఉందని, తక్షణ నిరోధకం రూ.1,22,145 వద్ద, మద్దతు రూ.1,19,150 వద్ద ఉంది. బంగారం ధరలు బలహీన ధోరణిలోనే ఉన్నందున ట్రేడర్లు రూ.1,21,630 వద్ద అమ్మకాలు పరిగణించవచ్చు అని ఆయన అన్నారు. ఐసిఐసిఐ డైరెక్ట్ విశ్లేషణ ప్రకారం, ఎంసిఎక్స్ గోల్డ్ డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.1,20,000 స్థాయి పైన ఉంటే రూ.1,22,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా ఎంసిఎక్స్ సిల్వర్ డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.1,46,000 పైన ఉంటే రూ.1,50,000 వరకు జంప్ చేసే అవకాశం ఉంది. నిర్మల్ బాంగ్ సెక్యూరిటీస్ విశ్లేషకుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ఆర్థిక బలహీనత, గవర్నమెంట్ షట్డౌన్పై అనిశ్చితి వల్ల గోల్డ్ డిమాండ్ పెరుగుతోంది. ఐసిఐసిఐ డైరెక్ట్ రీసెర్చ్ ప్రకారం, స్పాట్ గోల్డ్ 4,080 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక మందగమనం, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బంగారానికి మద్దతు ఇస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.
‘పాంచ్ మినార్’ వచ్చేది అప్పుడే
రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పి బ్యానర్ పై మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్కి మంచి స్పందన వచ్చింది. సోమవారం మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటించారు. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. రాజ్ తరుణ్, అజయ్ ఘోష్, రాశి సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇంటెన్స్ లుక్లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు.
లోపాలు సరిదిద్దుకోవాల్సిందే: ప్రధాన కోచ్ గంభీర్
ముంబై: రానున్న టి20 ప్రపంచకప్ నేపథ్యంలో జట్టు సభ్యులు తమ లోపాలను సరిదిద్దు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. పొట్టి ప్రపంచకప్నకు కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలివుందని, ఇలాంటి స్థితిలో ప్రతి ఆటగాడు వైఫల్యాలపై దృష్టి సారించాల్సిందేనని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్లో భారత్ ఆట తీరు తనను ఆందోళన గురి చేసిందన్నాడు. ఇలాంటి ఆటతో వరల్డ్కప్ వంటి మెగా ట్రోఫీని సాధించడం చాలా కష్టమైన అంశమన్నాడు. జట్టులోని కీలక ఆటగాళ్లు ఫామ్ లేమీతో బాధపడుతున్నారన్నాడు. అంతేగాక చాలా మంది క్రికెటర్లు పూర్తి ఫిట్నెస్తో లేరన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో కీలక ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్ కలవరానికి గురి చేస్తుందన్నాడు. ప్రపంచకప్ కోసం పూర్తిగా సన్నద్ధమవ్వాలని, ఫిట్నెస్ పరంగా సిద్ధంగా ఉండాలని గంభీర్ పేర్కొన్నాడు. ఇక గంభీర్ ఆటగాళ్లతో మాట్లాడిన వీడియో క్లిప్ను బిసిసిఐ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో గంభీర్ టీమిండియా సభ్యులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చాడు. అంతేగాక కొంత మంది కీలక ఆటగాళ్ల ఆట తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం గంభీర్ వీడియో వైరల్గా మారింది.
ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు
అందెశ్రీకి సీపీఐ ఘన నివాళివిశాలాంధ్ర- హైదరాబాద్: కవి, నంది అవార్డు గ్రహీత అందెశ్రీ మృతి తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని, ఆయన మృతి కళారంగానికి తీరని లోటని సీపీఐ ప్రముఖులు పేర్కొన్నారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా ప్రకటించిం దన్నారు. అది కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. మనిషి గురించి ఆయన రాసిన పాట కళ్లకు కట్టినట్టు చూపించారని […] The post ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు appeared first on Visalaandhra .
. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని. ఆగి ఉన్న రెండు కార్లలో వరుస పేలుళ్లు. పేలుడు ధాటికి అనేక వాహనాలు ధ్వంసం. మెట్రో స్టేషన్ గేట్`1 పార్కింగ్లో ఘటన. దిల్లీ సహా అనేక నగరాల్లో హైఅలర్ట్. దర్యాప్తునకు హోంమంత్రి అమిత్షా ఆదేశం న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట సమీపంలో భారీ పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన రెండు కార్లలో వరుస పేలుళ్లు సంభవించగా… పెద్ద ఎత్తు మంటలు ఎగిసిపడి పక్కనున్న వాహనాలకు […] The post ఎర్రకోట వద్ద భారీ పేలుడు appeared first on Visalaandhra .
భారీగా పేలుడుపదార్థాలు స్వాధీనం
శ్రీనగర్: ఉగ్రనిరోధక చర్యల్లో జమ్మూకశ్మీర్ పోలీసులు భారీ విజయం సాధించారు. హర్యానా పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్ గుట్టురట్టు చేశారు. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు వైద్యులు ఉన్నారు. పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్ పోలీసు ప్రతినిధి వెల్లడిరచిన వివరాల ప్రకారం ‘అక్టోబరు […] The post భారీగా పేలుడుపదార్థాలు స్వాధీనం appeared first on Visalaandhra .
డబుల్ ఇంజిన్ సర్కారుతో ఒరిగిందేమిటి?
. నీటిపారుదల ప్రాజెక్టులపై సీతకన్ను. వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడం దారుణం. సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విశాలాంధ్ర – రాయచోటి రూరల్ : డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకోవడం మినహా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎన్నికైన సందర్భంగా స్థానిక ఎన్జీవో హోమ్లో ఆత్మీయ సమావేశం పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.మహేష్ అధ్యక్షతన సోమవారం […] The post డబుల్ ఇంజిన్ సర్కారుతో ఒరిగిందేమిటి? appeared first on Visalaandhra .
అభిషేక్ అద్భుత క్రికెటర్.. కెవిన్ పీటర్సన్ ప్రశంసలు
లండన్: టీమిండియా యువ సంచలనం, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. టి20 ఫార్మాట్లో అభిషేక్ను మించి ఓపెనర్ ఎవరూ లేరని పేర్కొన్నాడు. పొట్టి క్రికెట్లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడన్నాడు. ఎంత పెద్ద బౌలర్కైనా చుక్కలు చూపించే సత్తా అతనికుందన్నాడు. రానున్న రోజుల్లో వన్డేల్లోనూ అతను మెరుగైన ఓపెనర్గా పేరు తెచ్చుకున్నా ఆశ్చర్యం లేదన్నాడు. అతి చిన్న వయసులోనే అభిషేక్ అగ్రశ్రేణి ఓపెనర్గా ఎదగడం టీమిండియాకు అతి పెద్ద ఊరట అని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో అతను టి20 ఫార్మాట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకోవడం ఖాయమన్నాడు. అతని బ్యాటింగ్ తీరు ఎంతో ఆకట్టుకుంటుందన్నాడు. భారత్కు లభించిన అత్యుత్తమ ఓపెనర్లలో అభిషేక్ ఒకడని, అతనికి ఎంతో భవిష్యత్తు ఉందని పీటర్సన్ పేర్కొన్నాడు.
. బదిలీల నిషేధం చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్. లక్ష కోట్ల ఎస్ఐపీబీ పెట్టుబడులకు ఆమోదం. పార్టీ కార్యాలయాల లీజు 99 ఏళ్లకు పొడిగింపు. ఉండవల్లి వద్ద మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణం. ఏపీపీఎఫ్సీఎల్కు 5 వేల కోట్ల రుణం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రెవెన్యూ శాఖలో 1977 నాటి అసైన్డ్ భూముల బదిలీల నిషేధం బిల్లును సవరించడానికి మంత్రివర్గం తీర్మానించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ […] The post అసైన్డ్ భూములకు రెక్కలు appeared first on Visalaandhra .
. రూ.901 కోట్ల తక్షణ సాయం. కేంద్ర బృందాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. 6 జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన విశాలాంధ్ర – సచివాలయం: మొంథా తుపాను రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని, కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మొంథా తుపాను వల్ల రూ.6384 కోట్ల నష్టం వాటిల్లిందని, రూ.901.4 కోట్లు తక్షణ సాయం చేసి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తుపాన్ వల్ల వాటిల్లిన […] The post రూ.6,384 కోట్ల నష్టం appeared first on Visalaandhra .
సిద్ధరామయ్యకు హైకమాండ్ ఝలక్.. సిఎం మార్పుపై జోరుగా ప్రచారం
న్యూఢిల్లీ : కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పుకు రంగం సిద్ధమైందా? డిప్యూటీ సిఎం డికె శివకుమార్ వరుస హస్తిన పర్యటనలు దేనికి సంకేతం. ఢిల్లీకి వస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకమాండ్ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వకం పోవడం వెనక ఏం దాగుంది. ఇదంతా ఎలాంటి పరిణామాలకు తావివ్వబోతోందన్న చర్చ కర్నాటకలో మళ్లీ జోరందుకుంది. ఇదంతా నాయకత్వ మార్పు దిశగానే వెళ్తుందన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధరామయ్య తమను కలిసేందుకు అధిష్టానంలోని ప్రముఖులు మొహం చాటేశారని జాతీయ మీడియా కథనాలు వెలువరించడం, ఈ నెలాఖరులో ఆ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయని కూడా ఆ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఒక పుస్తకావిష్కరణ కోసం సిద్ధరామయ్య ఢిల్లీ రావాల్సి ఉందని, అదే సమయంలో హై కమాండ్లోని కీలక నేతలను కలిసేందుకు అపాయింట్టమెంట్ కోరినట్లు తెలిసింది. అయితే దానికి వారు ససేమిరా అనడమే కాకుండా ఇప్పుడు అలాంటివేమీ వద్దని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ఇక ఓటు చోరీ అంశంపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తరచూ డికె శివకుమార్ చెబుతున్నప్పటికీ అవి నమ్మశక్యంగా లేవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య, డికె శివకుమార్ సీఎం పీఠం కోసం పోటీపడ్డారు. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. అయితే చివరికి సీనియర్ అయిన సిద్ధరామయ్యవైపే అధిష్టానం మొగ్గు చూపింది. డికె శివకుమార్ను బుజ్జగిస్తూనే ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంపకాలు చేసినట్లు, తదనుగుణంగా ఒప్పందం కుదర్చినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ సమయం రావడంతో మళ్లీ సిఎం మార్పు అంశం తెరపైకి వచ్చింది.
ఢిల్లీ పేలుడుపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు : అమిత్షా
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడుపై అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్షా వెల్లడించారు. ఈ సంఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. “సాయంత్రం దాదాపు 7 గంటల ప్రాంతంలో ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ కారులో పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సంఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు పాదచారులు గాయపడ్డారు. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఎన్ఎస్జీ, ఎన్ఐఏ , ఫోరెన్సిక్ బృందాలు సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి. సమీపం లోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశించాం. ఢిల్లీసీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్ఛార్జితో మాట్లాడాను. వారు ప్రస్తుతం సంఘటన స్థలంలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో సమగ్రదర్యాప్తు నిర్వహిస్తాం. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం” అని అమిత్ షా తెలిపారు.
అంతర్రాష్ట ఉగ్రవాద నెట్వర్క్ గుట్టు రట్టు...
న్యూఢిల్లీ : హర్యానా పోలీసులతో కలిసి జమ్ముకశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రమూకల గుట్టు రట్టయింది. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్వత్ఉల్హింద్ ఉగ్రవాద సంస్థలతో అత్యంత సబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు. వీరి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, 2900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వైద్యుల్లో జమ్ముకశ్మీర్ లోని కుల్గాంకు చెందిన డాక్టర్ ఆదిల్, పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్, లఖ్నవూకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ ఉన్నారు. షహీన్ లక్నో లోని లాల్బాగ్కు చెందినది. ఆమెకు చెందిన కారును డాక్టర్ ముజమ్మిల్ వినియోగిస్తున్నట్టు తేలింది. ఆ కారు నుంచి రైఫిల్, తూటాలు పట్టుబడ్డాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ అల్ ఫలాహ్ యూనివర్శిటీ టీచర్గా పనిచేస్తున్నాడు. ఢిల్లీకి 45 కిమీ దూరంలో హర్యానా లోని ధోజ్లో ఈ యూనివర్శిటీ ఉంది. ప్రైవేట్గా నడుపుతున్న ఈ యూనివర్శిటీకి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉంది. ముజమ్మిల్ అహ్మద్ అద్దె నివాసంపై ఆదివారం రాత్రి దాడి చేసి భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్లో జేషే మహమ్మద్ పోస్టర్లు వేసిన కేసులో కూడా ముజమ్మిల్ వాంటెడ్గా ఉన్నాడు. ఆయన నుంచి 360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు ఫరీదాబాద్ పోలీస్ కమీషనర్ సతేందర్ గుప్తా వెల్లడించారు. అది ఆర్డిఎక్స్ కాదని, కానీ అమోనియం నైట్రేట్ కావచ్చని చెప్పారు. ఇవి కాక ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడానికి 20 టైమర్లు, బ్యాటరీలతో నాలుగు టైమర్లు, ఐదు కిలోల మెటల్, వాకీ టాకీ సెట్, బ్యాటరీలు, రైఫిల్, మూడు మ్యాగజైన్లు, మరో 83 తూటాలు, 8 తూటాలతో ఉన్న పిస్టోలు, రెండు ఖాళీతూటాలు, స్వాధీనం అయ్యాయన్నారు. 8 పెద్ద సూట్కేసులు, నాలుగు చిన్న సూట్కేసులు, బకెట్ ధౌజ్ లోని ఆయన గది నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్లో అరెస్టు కాగా, మరో నిందితుడు ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్పూర్ నుంచి జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారని కమిషనర్ గుప్తా వెల్లడించారు. జమ్ము కశ్మీర్ పోలీస్ అధికార ప్రతినిధి వివరాల ప్రకారం అక్టోబర్ 19న శ్రీనగర్ లోని బన్పొరా నౌగామ్ ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలను లక్షం చేసుకుని జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిశాయి. దర్యాప్తులో ఉగ్రవాద భావజాలం కలిగిన విద్యార్థులు, ప్రొఫెసర్తోకూడిన ఓ ఉగ్రవ్యవస్థ వెలుగు చూసింది. పాకిస్థాన్ తదితర దేశాల నుంచి పనిచేసే ఉగ్రమూకలతో వీరికి సంబంధాలు ఉన్నాయి. సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో వీరు నిధులు సేకరించడం, తీవ్ర వాద భావజాలాన్ని పేరేపించడం, ఉగ్రవాద సంస్థల్లో చేర్పించడం తదితర కార్యకలాపాలు సాగిస్తున్నారని బయటపడింది. భద్రతా దళాలు మరికొందరిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ చేయడం ఈ ముఠా చర్యల్లో భాగంగా ఉంటోంది. ఆయుధాల చట్టం లోని సెక్షన్లు 7,25 కింద, చట్టవిరుధ్ధ కార్యకలాపాల నివారణ ఉపా చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన తాళ్లపల్లీ నర్సాగౌడ్ అనే గీతా కార్మికుడు తాటి చెట్టుపై నుండి పడి మరణించాడు. సోమవారం ప్రతి రోజులాగానే కల్లు తీయడానికి చెట్టు ఎక్కి గీత గీస్తుండగా చెట్టుపై నుండి పడి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె వున్నారు. అందరితో కలుపుగోలుగా వుండి తన పని చేసుకునే నర్సాగౌడ్ మృతి గ్రామస్తులను కలిచివేసింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎర్రకోట పేలుడుపై ప్రధాని మోడీ ఆరా
ఎర్రకోట వద్ద జరిగిన భారీ పేలుడుపై ప్రధాని నరేంద్రమోడీ ఆరా తీశారు. కేంద్ర మంత్రి అమిత్షాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కేంద్రమంత్రి అమిత్షా ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
చేయని నేరానికి కేసు పెట్టి వేధింపులు.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య?
మన తెలంగాణ/మానకొండూర్: చేయని నేరాన్ని తనపై మోపి, తనను వేధింపులకు గురి చేస్తూ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయించి చితకబాదారని, మనస్థాపానికి గురైన ఓ యువకుడు కూల్ డ్రింక్లో ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని ఎలుకల మందు తాగాడు. మృతుక్షి బంధువులు,గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన ఇల్లందుల కిషోర్(24)అనే యువకుని తండ్రి ఉపాధి నిమిత్తం గతంలో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు వలస వెళ్ళాడు.లక్ష్మయ్య దంపతులకు కిషోర్,వెంకటలక్ష్మి జన్మించారు.మృతుడు కిషోర్ తన తల్లితో కలిసి అమ్మమ్మ గ్రామమైన ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని తిమ్మక్కపాలెం(బుల్లవారి పాలెం)లో జీవిస్తున్నారు.వారం రోజుల క్రితం ఏలూరులోని ఓ ప్రైవేట్ కాలేజిలో పని చేస్తున్న సర్వేష్ అనే లెక్చరర్ కిషోర్ పై దొంగతనం మోపి డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు.అంతే కాకుండా ఇష్టం వచ్చినట్లు చితకబాది పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించినట్లు కిషోర్ ఆరోపంచారు.లెక్చరర్ వేధింపు గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.దీంతో మనస్థాపానికి గురైన కిషోర్ కూల్ డ్రింక్స్ లో ఎలకల మందు కలుపుకొని తాగి అపస్మారకస్థితికి చేరుకోగా,స్థానికులు చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.4 రోజులపాటు చికిత్స పొంది ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.తన మృతికి కారణమైన ప్రైవేట్ లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మృతుడు కిషోర్ సెల్ఫీ వీడియోలో అధికారులను కోరాడు. కిషోర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విజయవాడ నుండి మృతదేహాన్ని స్వగ్రామం వెల్ది తీసుకువచ్చి సోమవారం అంతక్రియలు నిర్వహించారు.కిషోర్ కబడ్డీ క్రీడలో రాష్ట్రస్థాయి,జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నట్లు బంధువులు తెలిపారు.మృతుని తండ్రి లక్ష్మయ్య గతంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
స్కూల్ బస్సును తప్పించబోయి బోల్తా పడ్డ లారీ
రెండు తెలుగు రాష్ట్రాలలో వరుస బస్సు ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికారులు ఒకవైపు, బస్సు ప్రమాదాలతో విషాద ఛాయలు చోటు చేసుకుంటున్న వేళ అధికారులు ప్రమాదాల నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నప్పటికీ ,వాహన డ్రైవర్ల నిర్లక్షంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, సంబంధిత అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టకపోవడమే ప్రమాదాలకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం హైద్రాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై లింగోటం వద్ద జరిగిన సంఘటనలో లారీ డ్రైవర్ సమయస్ఫూర్తితో విద్యార్థులకు ప్రాణహాని తప్పింది.లింగోటం వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టకుండా లారీ డ్రైవర్ దారిమళ్లించడంతో , లారీ అక్కడే బోల్తా పడగా,లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ వ్యవహరించిన తీరుతో సుమారు 15మంది విద్యార్థులు ప్రాణాలతో బయటపడటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.మహారాష్ట్రనుండి ఉల్లిగడ్డ లోడ్తో లారీ హైద్రాబాద్ మీదుగా విజయవాడ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించి,విద్యార్థులకు ప్రాణ హాని కాకుండా కాపాడింనందు నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతి కుమార్తోపాటు పలువురు అధికారులు లారీ డ్రైవర్ను అభినందించారు.గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.ఏది ఏమైనప్పటికీ సంబంధిత అధికారులు జాతీయ రహదారిపై గట్టి నిఘా పెట్టాలని,నిబంధనలు ఉల్లంఘిచిన వాహనాల డ్రైవర్లు,యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Fact Check: Viral Claim of Hindu Student Suspended in Kerala for Wearing Ayyappa Mala Is Misleading
Social media posts falsely claim that a Hindu student in Kerala was suspended for wearing an Ayyappa mala
Viral newspaper clippings about Naveen Yadav, Konda Sushmita, and Jubilee Hills by-election are fake
అమెరికాలో ఎపి విద్యార్థిని మృతి
అమెరికాలో ఎపికి చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నవంబర్ 7న యార్లగడ్డ చనిపోయినట్లు తెలుస్తోంది. యార్లగడ్డ రాజ్యలక్ష్మి టెక్సాస్లోని ఎ అండ్ ఎమ్ యూనివర్సిటీ-కార్పస్ క్రిస్టి నుంచి పట్టభద్రు రాలు. అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఇంతలోనే మృత్యువు వెంటాడింది. నవంబర్ 7వ తేదీన నిద్రలోనే ఆమె చనిపోయిన ట్లుగా తెలుస్తోంది. ఉదయాన్నే లేపగా మేల్కోకపోవడంతో స్నేహితులు గుండెలు బాదుకుంటూ ఏడ్చేశారు. రెండు, మూడు రోజులగా తీవ్రమైన ద గ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతుందని బంధువు చైతన్య వెల్లడించారు. ఇక మృతదేహాన్ని ఎపికి పంపించేందుకు చైతన్య టెక్సాస్లో నిధులు సేకరిస్తు న్నారు. రాజ్యలక్ష్మిది ఆంధప్రదేశ్లోని బాపట్ల జిల్లాలోని కర్మెచెడు గ్రామం. తల్లిదండ్రులు అన్నదాతలు. ఎన్నో కలలతో అమెరికాకు పంపినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఆమె మరణానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అక్కడి అధికారులు శవపరీక్ష నిర్వహిస్తున్నారు .
జూబ్లీహిల్స్లో 139 డ్రోన్ల డెమో షో #Elections #DroneSurveillance #JubileeHills #ElectionCommission
గొల్లల కోడేరులో భార్య సహా ముగ్గురికి కత్తిపోట్లు ( భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో)
తిరుమలలో నాన్ వెజ్ తింటూ దొరికిన ఇద్దరు టీటీడీ ఔట్సోర్సింగ్ సిబ్బంది
ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై అన్ని నిబంధనలు తెలిసిన టిటిడి సిబ్బందే అపచారం చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో ఇద్దరు టిటిడి ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాంసాహారం తింటుండగా భక్తులు ప్రశ్నించారు. ఆ సిబ్బంది తప్పు ఒప్పుకోకపోగా తిరిగి బెదిరింపు ధోరణిలో వ్యవహరిం చడంతో భక్తులు ఆగ్రహం కనబర్చారు. అలిపిరి మార్గంలో నాన్ వెబ్ తిన్నారన్న ఆరోపణలతో ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు టిటిడి పేర్కొంది. ఈ విషయంపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నందుకు ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రామస్వామి, సరసమ్మపై కఠిన చర్యలు తీసుకున్నామని టిటిడి ఓ ప్రకటనలో తెలిపింది. టిటిడి ఫిర్యాదుతో ఎపి ఛారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 114 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. టిటిడి నిబంధనల మేరకు తిరుమల పరిధిలో మాంసాహారం, మద్యం, పొగాకు వినియోగం పూర్తిగా నిషేధించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని టిటిడి స్పష్టం చేసింది. కాగా, అలిపిరిలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కొంత మంది భక్తులు తిరుమలకు మాంసాహారాన్ని తీసుకొచ్చి తింటూ దొరికిపోయారు. మార్చిలో ఇద్దరు వ్యాపారులు మద్యం, గంజాయి తిరుమలకు తరలిస్తూ పట్టుబడ్డారు. అప్పటి నుంచి టిటిడి అధికారులు అలిపిరి వద్ద తనిఖీలను తీవ్రతరం చేసి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.

26 C