Gold Prices Today : బంగారం ఇప్పుడు కొనుగోలు చేయడం కంటే ఆగడం మంచిదా?
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి
యంగ్ హీరో అడివి శేష్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న పాన్- ఇండియా యాక్షన్ -రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. శనివారం మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘చిచ్చుబుడ్డి’ని విడుదల చేశారు. ఇది శేష్ క్యారెక్టర్ సరికొత్త కోణాన్ని చూపిస్తోంది. ’చిచ్చుబుడ్డి’ పాట సినిమా మూడ్ను పూర్తిగా మార్చేస్తుంది. ఇందులో అడివి శేష్ తొలిసారిగా తెరపై డ్యాన్స్ చేస్తూ హై-ఎనర్జీ అవతార్లో అదరగొట్టారు. సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఫోక్ బీట్లతో కూడిన పార్టీ జానర్ పాట కంపోజ్ చేశారు. భాస్కరభ ట్ల రవికుమార్ విజువల్స్కి సరిపోయే సర దా, ఆటపట్టించే సాహిత్యం అందించారు. జోనితా గాంధీ తన ఎనర్జిటిక్ గాత్రంతో ఈ పాటకు పవర్ జత చేశారు. తన గ్లామరస్ డ్యాన్స్ తో తెరపై కూడా మెరిశారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ’డెకాయిట్’ చిత్రంలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటించారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
America : ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికాలో భారీగా నిరసనలు
అమెరికా అంతటా శనివారం నిర్వహించిన “నో కింగ్స్” ర్యాలీల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు
భారతదేశానికి ప్రాణం హిందూ ధర్మం..
భారతదేశానికి ప్రాణం హిందూ ధర్మం.. రెంజల్, ఆంధ్రప్రభ : సమాజంలో హిందూ సంస్కృతి,
29thMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
29thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 29thMarchCartoon | ట్రంప్ పాలనలో
‘మహాకాళి’లో శుక్రాచార్యుడిగా..
అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’ సెట్స్ నుంచి ఒక కొత్త స్టిల్ను విడుదల చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పివిఎస్యు)లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చాప్టర్ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ను ఇచ్చారు. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, ప్రశాంత్ వర్మ షోరన్నర్గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌరాణిక చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. చిత్ర బృందం 100 రోజుల షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేయగా, చివరి 40 రోజుల షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. శుక్రాచార్యుడి కీలక పాత్ర కోసం అక్షయ్ ఖన్నా తన చిత్రీకరణను పూర్తి చేశారు. నిర్మాతలు త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. మల్టీ స్టూడియోల వీఎఫ్ఎక్స్ పనులు శర వేగంతో సాగుతున్నాయి. ఈ చిత్రంలో భూమి శెట్టి టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఉగ్రరూపంలో కనిపించిన ఫస్ట్-లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా టాలీవుడ్ అరంగేట్రం భారీ అంచనాలను రేకెత్తించగా, అతని ఫస్ట్ లుక్కు కూడా సోషల్ మీడియాలో అద్భుతమైన ప్రశంసలు లభించాయి.
రంజని తండాలో అగ్నిప్రమాదం.. కుబీర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుబీర్ మండల
Andhra Pradesh : బంగారు గనులు తవ్వకానికి అంతా సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లో బంగారు గనులు తవ్వకానికి అంతా సిద్ధమయింది
హైదరాబాద్లో కల్తీ ఉస్మానియా బిస్కెట్ల తయారీ ముఠా గుట్టు రట్టు #HyderabadPolice #HFAST
రాజీ మార్గమే రాజమార్గం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కోర్టు కేసులలో కక్షలకు పోయి
ఓటమితోనే లోపాలు బయటకు వస్తాయి..
ఓటమితోనే లోపాలు బయటకు వస్తాయి.. ఆళ్ళపల్లి, ఆంధ్రప్రభ : క్రీడలతో క్రీడాకారుల నడుమ
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాయలసీమ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు
ఆ హీరో రూ.3.15 కోట్ల మోసం... యువకుడు ఆత్మహత్యాయత్నం
అమరావతి: జెట్టి సినిమా హీరో తనను మోసం చేశాడంటూ ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో లోకేష్ అనే యువకుడు నివసిస్తున్నాడు. లోకేష్ కు జెట్టి సినిమా హీరో మురళీ కృష్ణ పరిచయం ఉంది. మురళీ కృష్ణ డబ్బులు కావాలని పలుమార్లు అడగడంతో బంధువుల, ఇల్లు తాకుట్టు పెట్టి రూ.3.15 కోట్లు ఆయనకు ఇప్పించానని లోకేష్ ఆరోపణలు చేస్తున్నాడు. మురళీ కృష్ణ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో లోకేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైల్వే కాంట్రాక్ట్ పేరుతో మోసం చేశాడంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతడిని బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూసైడ్ నోట్ లో తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు లోకేష్ లేఖ రాశాడు. కనీసం ఆస్పత్రి ఖర్చులకు రూ.20 లక్షలు ఇవ్వాలని కోరిన హీరో మురళీ కృష్ణ పట్టించుకోలేదన్నారు. తన ఇల్లు తాకట్టు పెట్టీ, బంధువుల దగ్గర అప్పులు చేసి హీరోకు రూ.3.15 కోట్లు ఇచ్చానని, ఇప్పుడు తిరిగి ఇవ్వకపోవడంతో తాను మోస పోయానని పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
29marchchintana |అహింసతో శాంతి వైపు మానవాళికి మహాగురువు సందేశం
29marchchintana | అహింసతో శాంతి వైపు మానవాళికి మహాగురువు సందేశం 29marchchintana |
అమ్మతనానికి నిదర్శనం.. కొత్తగూడ, ఆంధ్రప్రభ : అమ్మతనానికి నిదర్శనమై చిన్నారిని ఆప్యాయంగా తన
అలా చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటాం..
అలా చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటాం.. ఉర్కొండ: ఆంధ్రప్రభ : ఐపీఎల్ క్రికెట్
IPL 2026 : అదిరిన ఆరంభ మ్యాచ్.. హైదరాబాద్ పై బెంగళూరు అలవోక విజయం
ఆరంభ మ్యాచ్ అదిరింది. డిఫెండింగ్ ఛాంపియన్ విజేతగా నిలిచిం
North Korea : చర్చల విఫలం తర్వాత టార్గెట్ అమెరికా.. స్వయంగా పరీక్షించిన అధినేత
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికాను లక్ష్యంగా చేసుకునే క్షిపణుల సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించారు
భర్త రెండు నెలల క్రితం మృతి... ఎంత పని చేశావ్ తల్లి
సంగారెడ్డి: భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బాధను బరించలేక తల్లి తన బిడ్డలను గొంతు నులిమి చంపి అనంతరం తాను ఉరేసుకొని చనిపోయిన సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మక్త అల్లూర్ గ్రామంలో మమత(28), ప్రవీణ్(32) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు మణికంఠ(5), ప్రళయశ్రీ(3) లు ఉన్నారు. దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం భర్త ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో మమత మనోవేదనతో భర్త లేని జీవితం వృధా అని పలుమార్లు వాపోయింది. మమత తల్లిదండ్రులు, ఆమె మేనత్త ఆమెకు దైర్య చెబుతూ చేదోడువాదోడుగా ఉండేవారు. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లగా మేనత్త పెన్షన్ తీసుకోవడానికి సొంతూళ్లకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంతో ఇద్దరు పిల్లల గొంతు నులిమి అనంతరం మమత ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Israel - Iran War : ఇరాన్ యుద్ధంలో హౌతీల ప్రవేశం.. ఇజ్రాయెల్పై క్షిపణులు
ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటింది
ఇజ్రాయెల్పై యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణిని తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది
29marcheditorial |భారత్ ఇంధన భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు..
29marcheditorial | భారత్ ఇంధన భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు.. 29marcheditorial | పశ్చిమాసియా
29MarSunday2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
29MarSunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో
29thMarch2026 |ఆదివారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
29thMarch2026 | ఆదివారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 29thMarch2026 |
మన తెలంగాణ/హైదరాబాద్: గత బీర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి తమ ప్రభుత్వం వరకు జరిగిన మైనింగ్పై సిబిసిఐడి విచారణ కు ఆదేశిస్తోన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సిబిసిఐడి ఇచ్చే నివేదికను వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చకు కూడా పెట్టనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ గండి పడినా, ఖనిజ సంపద దోపిడీకి గురైనా తాము చూస్తూ ఊరుకోబోమని, అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ఖజానాకు గం డి కొడుతూ సాగే అక్రమ మైనింగ్ల పట్ల తమ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోందని సీఎం స్పష్టం చేశారు. శాసనసభలో శనివారం పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ప్రక్షాళన ఇప్పుడు చేసుకోకపోతే భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆయన తెలిపారు. నదులు కాలుష్యం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక మత సామరస్యానికి మూసీ వేదిక కానుందని, ఉప్పల్-, నాగోల్ ప్రాంతంలో అద్భుతమైన చర్చి, పురానాపూల్లో మసీదు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. అద్భుతమైన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మూసీని తీర్చిదిద్దుతామని, గోదావరి జలాలను మూసీకి తరలించి నిత్యం జల ప్రవాహం ఉండేలా చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండల పరిధిలోని మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు పక్కనే ఉన్న వీరభద్ర ఆలయంలో కుటుంబంతో సహా ఆయన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఎంతో పాటు డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇప్పటికే ఆలయ నిర్మాణానికి మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ డిజైన్ ఖరారు చేసింది. చారిత్రక వీరభద్ర స్వామి ఆలయ సమీపంలో 8 ఎకరాల్లో రూ.700 కోట్ల వ్యయంతో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించబోతున్నారు. అందులో వంద అడుగుల గాలిగోపురం, మూసీ నది మధ్యలో దీవిపై వంద అడుగుల శివుడి విగ్రహం ప్రతిష్టించనున్నారు. మూసీలోకి గోదావరి జలాలను తరలించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యంతో జన జీవనం స్తంభించిన పరిస్థితి ఏర్పడిందని, లాంటి నగరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. మూసీలోకి గోదావరి జలాలను తరలించి అవి నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటున్నామని, మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాలుష్యమంతా మూసీలోనే మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం భగవత్ కార్యంగా భావిస్తున్నానని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారని, ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమమని, ముచుకుంద నదికి గొప్ప చరిత్ర ఉందని ఆయన తెలిపారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని ఆయన అన్నారు. మూసీనది పునరుజ్జీవిం గురించి చాలా మంది ప్రయత్నించారని, కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదని, ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తారని, తెలంగాణ పౌరులకు తన విజ్ఞప్తి ఒక్కటేనని, చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందిందని, సముద్ర పరీవాహకంలో వ్యాపారం, ఆర్ధిక అభివృద్ధి జరిగిందని సిఎం అన్నారు. దేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, మూసా, ఈసా నదులు ఉన్నా సరైన విధంగా ఉపయోగించుకోలేదని, మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్య కారకంగా మారింది గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గతంలో గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని, ఇప్పుడు ఆ జలాలను ఉపయోగించుకుంటున్నామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మత సామరస్యానికి మూసీ వేదిక ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ కాలుష్యమంతా మూసీలో కలుస్తోందని, దీనివల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్తో అల్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, అందుకే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు. కానీ, కొందరు రాజకీయ కారణాలతో పనులను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లి అడ్డుకోవాలని చూస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హత ఉందా..? ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హత ఉందా అని సిఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని లేకపోతే ప్రజలే మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తారని ఆయన అన్నారు. మీ వెనుక ముసుగు తొడుక్కున్న వారికి కూడా చెబుతున్నానని, ఇలాగే వ్యవహారిస్తే ఇప్పుడున్న స్థానం కూడా వారికి ఉండదన్నారు. ఆరు నూరైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచినా ఈ ప్రాజెక్టు ఆగదని, ఇది శివదీక్ష అని, రామప్ప శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతామన్నారు. ఇది ఓట్ల కోసం, నోట్ల కోసం చేస్తున్న పని కాదని, ఇది చరిత్రలో దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశం అని, ప్రజల పట్ల తమ కున్న చిత్తశుద్ధిని నిరూపిస్తుందని, ప్రజలే తమకు దేవుళ్లు అని, అంతిమంగా వారి ఆకాంక్షల మేరకే ముందుకు వెళతామని ఆయన తెలిపారు. ఆధునిక గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన ఆధునిక గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం యెంకపల్లి గ్రామంలో ప్రతిపాదిత ఆధునిక గోశాల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం శంకుస్థాపన నిర్వహించారు. పశుసంరక్షణ, పశుసంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునిక గోశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంప్ర దాయ విలువలను ఆధునిక శాస్త్రీయ విధానాలతో సమన్వయం చేస్తూ పశువుల ఆరోగ్యం, పర్యావరణ స్థిరత్వం, ప్రజల్లో గోసేవపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)కు అప్పగించారు. మొయినాబాద్ మండలం యెంకపల్లి గ్రామంలోని సర్వే నం.180లో ఉన్న సుమారు 99 ఎకరాలు 14 గుంటల ప్రభుత్వ భూమిని దీనికోసం కేటాయించారు.
మూసీ పేరిట లక్షన్నర కోట్ల దోపిడీ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తన స్కాములు, అవినీతి గురించి ప్రశ్నిస్తే సిఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించిన సందర్భంలో కూడా ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారని అన్నారు. రేవంత్ రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయ ని, అలాంటి బెదిరింపులకు బిఆర్ఎస్ ఎప్పటికీ భ యపడదని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్ట్ పేరు తో జరుగుతున్న అవినీతిపై కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీల అమలుకు ఒక్క రూపాయి లేదని చెప్పే సి ఎం, తన అవినీతి సొమ్ముల కోసం మూసీ పేరిట లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని ప్రకటించడం దారుణమని మండిపడ్డారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 16 వేల కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రణాళికను పక్కన పెట్టి, భారీ అంచనాలతో అవినీతి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో శనివారం బిఆర్ఎస్వి గ్రేటర్ హైదరాబాద్ విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బిఆర్ఎస్ నేతలు కార్తీక్రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం మూసీ నదిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని మూసీలోకి పంపించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని గుర్తు చేశారు.అయినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం అంచనాలను అనవసరంగా పెంచి అవినీతికి మార్గం సుగమం చేస్తోందని విమర్శించారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి, దాదాపు 3000 ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఒకవైపు మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్ట విరుద్ధమని చెప్పే ప్రభుత్వం, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరి అని పేర్కొన్నారు. మూసీ పేరిట జరుగుతున్న అవినీతి చర్యలను జాతీయ స్థాయి ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తున్నారని, గాంధీ కుటుంబ సభ్యులు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు. ఇప్పుడు దేవుడి పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తాను చేస్తున్న అవినీతి ప్రశ్నిస్తే శివతాండవం చేస్తాను అంటూ సిఎం మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. రేవంత్ రెడ్డి తన అధికార అహంకారాన్ని తగ్గించుకొని, మూసీ ప్రాజెక్ట్ను ప్రజలకు ఇబ్బంది కలగకుండా అమలు చేయాలని హితవు పలికారు. లేదంటే లక్షలాది ఇళ్లను కూల్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని హెచ్చరించారు. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి లాగా మారిందని కెటిఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో అభయహస్తం పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు - విద్యా భరోసా కార్డులు, 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, ఉర్దూ మీడియం ప్రత్యేక డిఎస్సి, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అమలు కాలేదని తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. తనను కోసినా పైసలు లేవు అంటున్న సిఎం, మూసీ కోసం మాత్రం లక్షల కోట్లు ఉన్నాయని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్ట్పై అసలు ప్రణాళికలు లేకుండా, డిపిఆర్ కూడా సిద్ధం చేయకుండా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బఫర్ జోన్ పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తూ, పెద్దల ఇళ్లను వదిలేస్తున్నారని, ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని, మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల జీవితాలను నాశనం చేయడాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్లు కూల్చకుండా, భూములు స్వాధీనం చేసుకోకుండా శాస్త్రీయ పద్ధతిలో మూసీ శుద్ధి చేస్తే బిఆర్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేలాది కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయని అన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భావోద్వేగ అంశం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ మెదటివారంలో మేధావులు, పర్యావరణ నిపుణులతో రౌండ్ టేండ్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఏప్రిల్ 14 వరకు ప్రతి కాలేజీ, ప్రతి బస్తీలో ప్రచారం చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. వెంటనే తాళాలు తీసి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. లేకపోతే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా వేలాది మందితో వెళ్లి తాళాలు బద్దలుకొట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పేదల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కెసిఆర్ ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగాలని బిఆర్ఎస్వి శ్రేణులకు పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ విద్యార్థి విభాగం చేపట్టే పోరాటానికి పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని కెటిఆర్ తెలిపారు.
మూసీ ప్రాజెక్టుపై కేబినెట్ సబ్కమిటీ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును వేగవం తం చేసేందుకు కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు ప్రణాళిక, సమన్వయం, అమలును పర్యవేక్షించేందుకు ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు జీఓ నెం.406ను విడుదల చేశారు. ఈ కేబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహారించనున్నారు. సభ్యులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ కమిటీకి కన్వీనర్గా వ్యవహారించన్నారు. సమావేశానికి హాజరుకానున్న మూడు జిల్లాల కలెక్టర్లు మూసీనది పునరుజ్జీవనం, మురుగునీటి నిర్వహణ, వరద నివారణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై విధానపరమైన మార్గదర్శకాలను కేబినెట్ సబ్ కమిటీ అందించనుంది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించి, ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. అదేవిధంగా భూసేకరణ, పునరావాసం, నిధుల సమీకరణ వంటి కీలక అంశాలపై తగిన నిర్ణయాలు తీసుకోనుంది. ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ఈ కేబినెట్ సబ్ కమిటీ పర్యవేక్షించనుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు అమల్లో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండిలు సైతం ఈ కమిటీ సమావేశాలకు హాజరుకానున్నారు.
సంఘటిత శక్తితో సవాళ్లను ఎదుర్కొందాం
నోయిడా : వికసిత భారత్ బృహత్తర లక్ష సాధనలో దేశంలోని 140 కోట్ల మంది పౌరుల సంఘటిత శక్తి అత్యవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మన ముందు పలు సవాళ్ల భారీ లక్షం నిలిచి ఉంది. పలు ప్రపంచ స్థాయి సవాళ్లతో మైలురాయి చేరే క్రమంలో అనేక అవరోధాలు ఉంటాయని తెలిపారు. జెవార్లో ప్రధాని మోడీ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు అయిన సభలో మాట్లాడారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు మనం అంతా కలిసి సమైక్యంగా, అంకితభావంతో ముందుకు సాగాల్సి ఉందని పిలుపు నిచ్చారు. సవాళ్లు వస్తూనే ఉంటాయని, వీటిని తగు విధంగా ఎదుర్కొం టూ పయనించడమే మన ధర్మం అని ప్రధాని తెలిపారు. తమ ప్రభుత్వం దేశ ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. రైతులు , సగటు కుటుంబాల శ్రేయస్సు ప్రాతిపదికన కార్యాచరణకు దిగుతుంది. పౌరులకు పలు విషయాలలో వెసులుబాటు కల్పించాలి. వారి సమ యం ఆదా కావాలి. అవనవసర వ్యయాలు తగ్గాలి. ఈ క్రమంలో ఒనగూరే ప్రయోజనాలు సామాన్యులకు దక్కాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన, ఈ దిశలోనే అమ లు ప్రక్రియ అని తెలిపారు. ఇప్పుడు గల్ఫ్ యుద్ధం, చమురు సంక్షోభం అంతర్జాతీయ సవాలుగా తలెత్తి మన గడపలోకి కూడా చేరింది. ఇది గ్లోబల్ సంక్షోభం. ప్రశాంతతతో, స్థిరచిత్తతతో ఇప్పటి సంక్షోభాన్ని ఎదుర్కొంటే మనమే గెలుస్తామని అన్నారు. పరిస్థితిని తాము పార్లమెంట్లో చర్చించడం జరిగింది. తాజాగా ముఖ్యమంత్రులతో, లెఫ్టినెంట్ గవర్నర్లతో సమీక్షించామని వివరించారు. ప్రస్తుత సంక్షోభం దశలో అనుసరించాల్సిన అంశాలపై దృష్టి సారించాం. సరఫరాల వ్యవస్థ కుంటుపడకుండా చేయడం, ఇంధన, నిత్యావసర సరుకుల పంపిణీ లోపాలను నివారించడంలో టీమిండియా స్ఫూర్తి అవసరం అని ముఖ్యమంత్రులకు తాము తెలిపినట్లు ప్రధాని ఈ సభ ద్వారా వెల్లడించారు. ‘నోయిడా కీడు’ సెంటిమెంట్ను తిప్పికొట్టాం ప్రధాని మోడీ శనివారం నోయిడా కీడు.. సంబందిత మూఢనమ్మకం గురించి ప్రజలకు తెలియచేశారు. ఉత్తరప్రదేశ్లో ఇంతకు ముందు అధికారం లో ఉన్న సమాజ్వాది పార్టీ నేతలకు చురకలు అంటించారు. నోయిడా స భలకు రావద్దని, వస్తే ప్రధాని పదవి పోతుందని అప్పటి సిఎం హోదాలో అఖిలేష్ యాదవ్ తనకు చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. ఇక్కడికి వస్తే ప్రధాని పదవి ఊ డుతుందని అంతకు ముందటి వరకూ ఉన్న మూఢనమ్మ కం గురించి తెలిపారని , అయితే ప్రజల ఆశీర్వాదం ఉంటే ఏ శక్తి ఏమి చేయలేదని, తనను మరింత బలోపే తం చేస్తుందని చెప్పి తాను అప్పట్లో నోయిడాకు వచ్చిన విషయం చెప్పారు. సమాజ్వాది పార్టీ నేతలు నోయిడా అపశకునం భయంతో ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. దీనిని గాలికొదిలారు. అయితే ఈ నగరాన్ని తమ కమిషన్లకు, అవినీతి వ్యవహారాలకు అవసరం అయిన డబ్బు దండుకునే ఎటిఎంగా వాడుకున్నారు. అయితే బిజెపి వచ్చిన తరువాత నోయిడా దారి మారిందని, ఇప్పుడు ఇక్కడి ప్రారంభోత్సవం ఇందుకు నిదర్శనం అన్నారు.
దుబాయ్: చర్చల ఆశలు అడుగంటుతుండగా గల్ఫ్ యుద్ధం శనివారం మరింత రాజుకుంది. సౌదీ అరేబియా, కువైట్లపై ఇరాన్ తమ శక్తివంతమైన దేశీయ బాలిస్టిక్ మిస్సైల్స్తో దాడులకు దిగింది. వేయి కిలోమీటర్ల వరకూ దూసుకువెళ్లే సామర్థం ఉన్న ఖ్వాద్ 380 క్రూయిజ్ మిస్సైల్స్తో దాడులు సాగాయి. అమెరికా సైనిక స్థావరాలకు పొరుగుదేశాలు ఆశ్రయం ఇస్తున్నందున వాటిపై దాడులు తీవ్రతరం చేస్తామని ఇరాన్ అధ్యక్షులు హెచ్చరించారు.ఈ క్రమంలోనే ఇరాన్ రెవెల్యూషన్ గార్డ్ కార్ప్ ఈ నిర్ణీత పోరుకు దిగాయి. ఈ క్రమంలో దుబాయ్లోని అత్యంత కీలకమైన రెండు అమెరికా సైనిక స్థావరాలను గురి చూసి దెబ్బతీశారు. ఈ రెండు కేంద్రాలలో 500 మందికి పైగా అమెరికా సైనికులు ఉంటున్నారు. ఇక్కడ జరిపిన దాడులలో పది మందికి పైగా అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్య , ప్రయాణ కేంద్రీకృత నగరం దుబాయ్లో శనివారం అంతటా అంబులెన్స్ల కదలికలు, సైరన్ల మోతల నడుమ భయానక వాతావరణం నెలకొంది. ఇరాన్ దాడులలో కొందరు అమెరికా సైనికులు మృతి చెందినట్లు, ఎక్కువ మంది గాయపడ్డట్లు ప్రాధమిక సమాచారంతో వెల్లడైంది. ఇప్పటి దాడులతో ట్రంప్, అమెరికా సైనిక కమాండర్లు పరిస్థితిని గ్రహించి తీరాలి. ఈ ప్రాంతం అమెరికా సైనిక స్థావరాలకు సురక్షితం కాదని గుర్తుపెట్టుకోవాలని ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి ఒకరు టెహరాన్లో తెలిపారు. ఇప్పుడు అమెరికా సైనికులకు ఈ ప్రాంతం ఖననవాటిక అవుతుందని హెచ్చరించారు. ఇప్పుడు వారికి ముందున్న మార్గం ఒక్కటే వీరోచిత ఇరానీయన్లకు, ఇస్లామ్ యోధులకు సరెండర్ అయ్యి తీరాలి అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సౌదీకి, ఇతర గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజెష్కియన్ తమ హెచ్చరికలు వెలువరించారు. ఖతార్లోని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ల దాడి క్రమంలో అక్కడి రాడార్ వ్యవస్థ దెబ్బతింది. ఇరాన్ జరిపిన ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దుబాయ్లోని ఓ హోటల్పై కూడా ఇరాన్ తన కమికాజే డ్రోన్లతో దాడులకు దిగింది. ఆరు అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ దాడులు ఇరాన్ అమెరికాకు చెందిన పలు నౌకా స్థావరాలపై శనివారం దాడులకు దిగింది. కువైట్లోని షువైక్పోర్టుకు అనుబంధంగా ఉన్న అమెరికా ల్యాండింగ్ సౌకర్యాలపై ఇరాన్ గార్డ్ విరుచుకుపడ్డారు.ఈ క్రమంలో పలువురు అమెరికా సైనికులు మృతి చెందినట్లు ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి. అయితే దీనిని స్థానిక వార్తాసంస్థలు ధృవీకరించలేదు. ఇరాన్లోని పలు ప్రాంతాలలో ఇజ్రాయెల్ సేనలు దాడులకు దిగాయి. ఈ క్రమంలోనే తొలిసారిగా ఇరాన్ మద్దతుగల హౌతి రెబెల్స్ ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడులకు దిగింది. ఈ రెబెల్ బృందం సైనిక అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ ఓ ప్రకటన వెలువరించారు. తాము ఈ ఇజ్రాయెల్పై ప్రతీకార దాడుల్లో భాగంగా ఇరాన్కు మద్దతుగా రంగంలోకి దిగామని తెలిపారు. ఇజ్రాయెల్కు చెందిన అత్యంత కీలకమైన సైనిక స్థావరాలను ఎంచుకుని పలుసార్లు క్షిపణులను పంపించినట్లు తెలిపారు. ఈ క్షిపణులను దెబ్బతీశామని శనివారం ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడు క్రమేపీ ఇజ్రాయెల్ ఆత్మరక్షణ స్థాయికి చేరుకుంటున్న విషయం స్పష్టం అయిందని విశ్లేషకులు తెలిపారు. నేడు ఇస్లామాబాద్లో దౌత్య బృందాల చర్చ దౌత్యవర్గాల ద్వారా గల్ఫ్ యుద్ధ నివారణకు ఓ వైపు ప్రయత్నాలు సాగుతున్నాయి. చర్చలు సజావుగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షులు ట్రంప్ శనివారం కూడా ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే గల్ఫ్ ప్రాంతంపై దాడులకు సిద్ధంగా ఉండేందుకు అత్యధిక సంఖ్యలో సైనిక బలగాలను అమెరికా తరలించింది. ఇస్లామాబాద్లో పాకిస్థాన్ అధికారిక ప్రకటన వెలువరించింది. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు దేశాల దౌత్య ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్కు వస్తాయని, యుద్ధం నివారణకు ఈ చర్చలు ఇక జోరందుకుంటాయని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ తెలిపారు. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్, . టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్, ఈజిప్టు విదేశాంగ మంత్రి బద్ అబ్దెలాతీ ఆదివారం పాకిస్థాన్కు వస్తున్నారని డార్ వివరించారు. రెండు రోజుల పాటు విస్తృత స్థాయి చర్చలు జరుగుతాయని తెలిపారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం స్పందించారు. ఇరాన్ అధ్యక్షులు మసౌద్తో తాను మాట్లాడినట్లు , యుద్ధం ముగింపు విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. ఇరాన్లో పెరిగిన మృతులసంఖ్య నెలరోజుల పోరు క్రమంలో ఇరాన్లో ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 1900 దాటింది. ఇజ్రాయెల్లో 20 మంది వరకూ మృతి చెందారు. పౌర ప్రాంతాలపై జరుగుతున్న దాడుల దశలో సంభవిస్తున్న మరణాలపై ఇరాన్ వార్తాసంస్థ ఎప్పటికప్పుడు సంఖ్యలతో వివరాలు వెల్లడిస్తోంది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటివరకూ 1100 మందికి పైగా మృతి చెందారు. దాడులలో 13 మంది వరకూ అమెరికా సైనికులు ప్రాణాలు వదిలారు. ఇరాక్లో ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లు జరిపిన దాడులలో భద్రతాబలగాలకు చెందిన 80 మంది మృతి చెందినట్లు నిర్థారణ అయింది. దుబాయ్, గల్ఫ్లోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడులలో బారతీయ పౌరులు ముగ్గురు, కొందరు పాకిస్థానీయులు మృతి చెందారు.
పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
మన తెలంగాణ / సంగారెడ్డి : ఆ తల్లికి భర్త లేని జీవితం భారంగా కనిపించింది. కన్నపిల్లలకు విషమిచ్చి తాను కూడా తనువు చాలించింది. కంది మండలంలో జరిగిన ఈ హృద య విదారక ఘటన వివరాలిలా ఉన్నాయి. జుల్కల్ గ్రామానికి చెందిన మమత (28) శనివారం నాడు తన ఇద్దరు పిల్లలు మణికంఠ (5), ప్రళయ (4)కు విషమిచ్చింది. వారు చని పోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత జనవరి లో మమత భర్త పెంటయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు, అత్తమామల సహకారంతో ఆమె పిల్లలను పెంచుతున్నారు. ఈ క్రమంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురయింది. జీవితం భారంగా అనిపించింది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారులను చంపి, తాను కూడా చనిపోయింది. ఒక్క సారిగా జుల్కల్ గ్రామంలో విషాదం అలముకున్నది. గ్రామస్థులు కన్నీరుమున్నీరు అయ్యారు. ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారులు, తల్లి బలవన్మరణం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. విషయం తెలియగానే జిల్లా ఎస్పి పరితోష్ పంకజ్, డిఎస్పి సత్తయ్య,ఇతర పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారు. దుర్ఘటనపై ఆరా తీశారు. మృతురాలి బంధువులతో మాట్లాడారు. దర్యాప్తు చేస్తున్నారు.
దేశం గర్వించేలా రాజధాని నిర్మాణం . భూములిచ్చిన రైతులకు పాదాభివందనం. అమరావతిపై జగన్ ఊసరవెల్లి రాజకీయం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాలాంధ్ర-సచివాలయం: అమరావతి అజేయం… అద్భుతం… అజరామరమని, అమరావతితోనే తెలుగు వైభవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్ట బద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శనివారం తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానానికి మద్దతు పలికిన శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని ఇక ఎవరూ అంగుళం కూడా కదిలించలేరన్నారు. […] The post అజేయం…అజరామరం appeared first on Visalaandhra .
ఫ్యాక్ట్ చెక్: ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడులను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండిస్తూ పోస్టు పెట్టలేదు
ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడులను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండిస్తూ
ఇళ్లు, భూములు లాక్కుంటే చూస్తూ కూర్చోవాలా..?: ఎంఎల్ఎ సబితా ఇంద్రారెడ్డి
ఇళ్లు, భూములు లాక్కుంటే చూస్తూ కూర్చోవాలా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు నష్టం జరిగితే ఆరు నూరైనా అడ్డుకొని తీరుతామని ఆమె పేర్కొన్నారు. మమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తారని సిఎం అంటున్నారని ఆయన మాటలకు భయపడేది లేదని ఆమె అన్నారు. రెండేళ్లు ఆగితే ప్రజలే కాంగ్రెస్ బహిష్కరిస్తారని ఆమె విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో 10 వేల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మూడు వేల ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆమె విమర్శించారు. తాము మూసీకి వ్యతిరేకం కాదని, ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకమని ఆమె అన్నారు. ఇళ్లు, భూములు లాక్కుంటే చూస్తూ కూర్చోవాలా కోర్టులకే కాదు ఎంత దూరమైనా వెళ్తామని ఆమె తెలిపారు.
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
ఎపిలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఓ ఆర్టిసి బస్సు శేషాపురం వద్ద సర్వీస్ రోడ్డులో ఆగింది. అదే సమ యంలో బెంగళూరు నుంచి వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, వారి కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్కు తీవ్ర గాయాల య్యాయి. మృతులు తెలంగాణలోని వరంగల్ ప్రాంతానికి చెందిన దంపతులు శ్రీధర్ రావు, లక్ష్మి, కుమార్తె అద్వికగా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుంచి ట్యాక్సీలో వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జర్నలిజంలో విలువలపునరుద్ధరణ అవశ్యం
. తప్ప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. ఐజేయూ ప్లీనరీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: మీడియాలో వచ్చే కథనాలను తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, అదేసమయంలో పత్రికా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుత మీడియా పోకడల పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మూడు దశాబ్దాలుగా తనకు […] The post జర్నలిజంలో విలువలపునరుద్ధరణ అవశ్యం appeared first on Visalaandhra .
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ యొక్క 19వ ఎడిషన్ ఈ సాయంత్రం బెంగళూరులో ప్రారంభమైంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్లైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బ్యాటింగ్ ఆహ్వానం అందుకున్న సన్రైజర్స్ హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 201 పరుగులు సాధించింది. మొదటి మ్యాచ్లో ఇషాన్ కిషన్(80) రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్(80: 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. హెన్రిచ్ క్లాసెన్(31) జతగా 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్ భారీ స్కోర్కు బాటలు వేశాడు. అనికేత్ వర్మ(43 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచేశాడు.ఇషాన్, అనికేత్ మెరుపులతో ఆరెంజ్ ఆర్మీ ప్రత్యర్ధికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
సీపీఐ, సీపీఎంకుచెరో ఐదు సీట్లు
డీఎంకే 164, కాంగ్రెస్ 28తమిళనాట పూర్తయిన సీట్ల పంపిణీ చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. మొత్తం 234 స్థానాల్లో మిత్ర పక్షాలకు 70 సీట్లు ఇచ్చి… మిగిలిన 164 స్థానాల్లో డీఎంకే బరిలోకి దిగుతోంది. సీపీఐ, సీపీఎంకు చెరో ఐదు సీట్లు ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్కు 28 సీట్లు కేటాయించింది. వాటిలో పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవన్కోడ్, శివకాశి, […] The post సీపీఐ, సీపీఎంకుచెరో ఐదు సీట్లు appeared first on Visalaandhra .
ట్రైన్ లో గోల్డ్ చైన్ దొంగతనానికి సంబంధించిన విజువల్స్ నిజమైనవి కాదు
సిఎం రేవంత్రెడ్డికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’
ఫుట్బాల్ ఆటలో సీఎం టీమ్ నుంచి నాగార్జునసాగర్ ఎంఎల్ఏ జైవీర్ గోల్ కొట్టారు. స్పీకర్ టీమ్ను గెలిపించేందుకు సీఎం రేవంత్రెడ్డి జట్టు మారారు. ఎంఎల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. స్పీకర్ టీమ్ కోసం సీఎం గోల్ కొట్టారు. సీఎం రేవంత్రెడ్డి ఫుట్ బాల్లో 4 గోల్స్ సాధించి మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచినారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. కబడ్డీలో టీమ్ బీపై టీమ్ ఏ విజయం సాధించింది. స్పోర్ట్ మినిస్టర్ శ్రీహరి టీమ్కు విజయం వరించింది.
భారతదేశం వద్ద కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపడ ఇంధనం ఉందని ప్రభుత్వం ఎలాంటి ప్రకటన
ఫుడ్ సెక్యూరిటీ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదు: సిఎం రేవంత్రెడ్డి
దేశంలో ప్రస్తుతం ఫుడ్ సెక్యూరిటీ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అందుకే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టిక ఆహారాన్ని తమ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. దీనిలో భాగంగానే ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ స్కీంను కూడా ప్రారంభించామని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ‘తొలి ముద్ద’ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, చైల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంగన్వాడీ చిన్నారులకు ఇక నుంచి రెడీ టూ కుక్ ఫుడ్ (ఉప్మా, కిచిడీ మిక్స్)ను బ్రేక్ ఫాస్ట్ గా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్కు మొబైల్ ఫోన్లను కూడా పంపిణీ చేశారు. బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత మంచి ప్రణాళికలు చేసినా అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమేనని అన్నారు. అందుకే ప్రభుత్వం మీపై గురుతర బాధ్యత పెట్టిందని పేర్కొన్నారు. అంగన్వాడీ చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోందని, మీ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు కలిగినా ముందుగా మీ సమస్యలనే పరిష్కరిస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీళ్లేదని, సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందితేనే వారిలో మానసిక ఎదుగుదల ఉంటుందని అన్నారు.పోష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని, భవిష్యత్లో అవే అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని తెలిపారు. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.
గవర్నర్ శుక్లాతో కేంద్ర మంత్రి బండి భేటీ
రాష్ట్ర గవర్నర్గా ఇటీవల నియమితులైన శివ ప్రతాప్ శుక్లాతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమావేశమయ్యారు. గవర్నర్ శుక్లాకు బండి సంజయ్ పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వీరిరువురూ అరగంట పాటు రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే గవర్నర్గా శివప్రతాప్ శుక్లా నియమితులైన తర్వాత కలిసి అభినందించలేదు కాబట్టి శనివారం లోక్ భవన్ (రాజ్ భవన్)కు వచ్చినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిఆర్వో మధు తెలిపారు.
కేడీసీసీ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్ల పాత్ర కీలకం
కేడీసీసీ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్ల పాత్ర కీలకం – కేడీసీసీ బ్యాంక్ చైర్మన్,
అమరావతికి చట్టబద్ధత కోరుతూ తీర్మానం చేయడం హర్షణీయం
అమరావతికి చట్టబద్ధత కోరుతూ తీర్మానం చేయడం హర్షణీయం విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్
Just-18Hrs : నేపాలీ పీఎం తొలి షాక్ Andhra Prabha Latest News
Just-18Hrs : నేపాలీ పీఎం తొలి షాక్ Andhra Prabha Latest News
గ్యాస్ సిలిండర్ బుకింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి
గ్యాస్ సిలిండర్ బుకింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి -రఘునాథపల్లి ఎస్ఐఐ డి.నరేష్ రఘునాథపల్లి,
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ “నిహారిక నిర్మాతగా నేను హీరోగా చేస్తుండం ఎంతో స్పెషల్గా అనిపిస్తుంది. వంశీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ టీం మీద ఉన్న నమ్మకంతోనే సినిమాకి ఓకే చెప్పాను. ఇదివరకే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. వచ్చే సంక్రాంతికి ‘బరి’ సినిమాని బరిలోకి దించబోతోన్నాం” అని అన్నారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ “విలేజ్ డ్రామాగా, స్పోర్ట్ బ్యాక్డ్రాప్లో వంశీ ఈ సారి మరో అద్భుతమైన స్టోరీని చెప్పబోతోన్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ టీంతో మళ్లీ ఇలా సినిమా చేస్తుండటం నాకు ఆనందంగా ఉంది”అని తెలిపారు. యదు వంశీ మాట్లాడుతూ “వాలీబాల్ బ్యాక్డ్రాప్తో ఓ ఐడియా రాగానే నాకు వరుణ్ గుర్తుకువచ్చారు. అలా కొంత కథ అయ్యాక నిహారిక వద్దకే వెళ్లాను. పూర్తి కథ సిద్దం చేసిన తరువాత వరుణ్ అన్న దగ్గరకు వెళ్దామని నిహారిక అన్నారు. అలా మూడు నెలల్లో పూర్తి కథను సిద్ధంచేసి వరుణ్కి వినిపించగా ఆయనకి కథ చాలా నచ్చింది. షూటింగ్ త్వరగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి మా ‘బరి’ మూవీని బరిలోకి దించుతాం”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనుదీప్ దేవ్, చిన్నా పాల్గొన్నారు.
గ్రామాభివృద్దికి నిధులు ఇవ్వండి…
గ్రామాభివృద్దికి నిధులు ఇవ్వండి… రెండు దఫాలుగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేటాయించలేదునిధుల ఇవ్వాలని కలెక్టర్
విద్యార్థులకు నాణ్యమైన విద్య,భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన విద్య,భోజనం అందించాలి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఆకస్మిక తనిఖీ చేసిన
దేశంలో ప్రసూతి మరణాలు తగ్గుముఖం
భారతదేశంలో ప్రసూతి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 1990 నుంచి 2023 మధ్యకాలంలో అత్యంత విషాదకర ఈ కాన్పుచావుల రేటు దాదాపు 80 శాతం మేర తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్ని ది లాన్సెట్ అబ్స్టట్రిక్స్ గైనకాలజీ, ఉమెన్ హెల్త్ జర్నల్లో ప్రచురించారు. ప్రపంచవ్యాప్త విశ్లేషణల క్రమంలో భారతదేశంలో ఈ అత్యంత కీలక శుభ పరిణామం తలెత్తిన విషయాన్ని ఈ నేపథ్యంలో వెల్లడించారు. అంతకు ముందు లక్ష కాన్పుల్లో 508 మరణాలు ఉండేవి. అవి ఇప్పుడు లక్షకు 116కు తగ్గాయని ఈ విశ్లేషణలో తెలిపారు. 2023లో దేశంలో మొత్తం 24700 వరకూ ప్రసూతి మరణాలు రికార్డు అయ్యాయి. ఇది లక్షకు 116 శాతంగా నిలిచింది. ఈ ఏడాదే పాకిస్థాన్లో 10300 ప్రసూతి మరణాలు సంభవించాయి. ఆఫ్రికా దేశాలైన ఈథియోపియా,నైజీరియా ఇతర చోట్ల కూడా ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. పేదరికం, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, ప్రత్యేకించి నిరక్షరాస్యత వంటి పరిణామాలతో, మహిళల పట్ల నిరాదరణ వంటి కారణాలతో ప్రసూతి మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటూ వచ్చింది. అయితే భారతదేశంలో మార్పులతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటికీ ఈ అకాల మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఆరోగ్య గణాంకాలు, విశ్లేషణ విభాగం (ఐహెచ్ఎంఇ) పరిశోధకులు తమ అధ్యయనంలో ఈ సామాజిక ఆందోళనకర పరిణామంపై సర్వే జరిపారు. దేశాలవారిగా చూస్తే ఈ ప్రసూతి మరణాలు ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉంటున్నాయి. వెనుకబాటుతనం, కుటుంబ కట్టుబాట్లు వంటివి ఇందుకు కారణం అని అధ్యయనంలో తేల్చారు. 204 దేశాలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుత పరిణామం బట్టి దేశంలో ప్రసూతి మరణాలు తగ్గడం కీలక విషయం అని, దీనిని మరింతగా మెరుగుపర్చుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.
యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి…
యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి… ఈగల్ చీఫ్ ఐజీ రవికృష్ణ కర్నూలు
రైతుల త్యాగాలకు గౌరవం… అమరావతి తీర్మానం చారిత్రాత్మకంమహిళల ధైర్యానికి గుర్తింపుప్రజా ఉద్యమానికి అసెంబ్లీ
అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీ తీర్మానం చారిత్రాత్మకం
అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీ తీర్మానం చారిత్రాత్మకం వైసీపీ గైర్హాజరు ద్వారా కుట్రకోణం బహిర్గతం:
32 లక్షల మంది సభ్యులకు రూ.23 వేల కోట్ల రుణాలు
స్త్రీనిధి రుణాలను 2011 నుంచి సుమారు 32 లక్షల సభ్యులకు రూ.23 వేల కోట్లు అందించగా, 2025 మార్చి 31 నాటికి రుణ నిల్వ రూ.5,107 కోట్లుగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. 2025.26లో రూ.2,350 కోట్ల ప్రణాళికలో రూ.2,125 కోట్లు (దాదాపు 90%) అమలు చేసి, ఆ ఏడాది 2026-.27 రూ.2,530 కోట్ల ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. అలాగే 2024-.25లో రూ.154 కోట్ల నికర లాభంతో 14 శాతం డివిడెండ్ ప్రకటించడం స్త్రీనిధి విజయాన్ని ప్రతిబింభిస్తుందని తెలిపారు. సెర్ప్, మెప్మా సమన్వయంతో మరిన్ని సేవలు అందించేందుకు స్త్రీనిధి కట్టుబడి ఉంది అని అన్నారు. మారుమూల గ్రామాల సంఘాలకు మన స్త్రీనిధి యాప్ ద్వారా స్వయంగా రుణాలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించి, తక్కువ ఖర్చుతో సరైన సమయంలో రుణాలు పొందే విధంగా స్త్రీనిధి చర్యలు చేపట్టిందని తెలిపారు. మారుమూల గ్రామాల్లో, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో పోస్టాఫీసులు ద్వారా నగదు చెల్లింపులకు అవకాశం ఉందని చెప్పారు. స్త్రీనిధిలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు 163 మంది నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదేవిధంగా సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రగతి ఆధారిత ప్రోత్సాహకాలు అందించేందుకు ఈ ఏడాది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు: హరీష్ రావు
అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు విమర్శించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటిది కాదని ముఖ్యమంత్రి చెప్పడం దుర్మార్గం అని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భార్య, కొడుకు, తమ్ముడు.. దూరపు బంధువులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాఘవ పేరు స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరు అని, ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసు అని పేర్కొన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డి అని చెప్పారు. శనివారం అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తర్వాత బిఆర్ఎస్ ఎంఎల్ఎలతో కలిసి హరీష్రావు అసెంబ్లీ లాబీలో నిరసనకు దిగారు . మైనింగ్ స్కాం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ బిఆర్ఎస్ ఎంఎల్ఎలు నినాదాలు చేశారు. అనంతరం హరీష్రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని అన్నారు. సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలా..? అని అడిగారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జవాబుదారీతనం లేకుండా సభలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పాలకుల తీరు శోచనీయం అని పేర్కొన్నారు.
Amaravati Resolution Marks a Clear Political Line in Andhra Pradesh
The Andhra Pradesh Legislative Assembly has sent a strong and unified message on the future of the state’s capital. In a rare display of consensus, the House passed a resolution that seeks legal backing for Amaravati as the sole capital of the state. The move reflects both political clarity and administrative intent. Chief Minister N […] The post Amaravati Resolution Marks a Clear Political Line in Andhra Pradesh appeared first on Telugu360 .
Dacoit: Adivi Sesh Fires Up Chicchubuddi
With just days left for the arrival of Adivi Sesh’s Dacoit, directed by Shaniel Deo, the buzz around the film is soaring. The glimpse, teaser and first single from the movie received superb response. Meanwhile, they released the electrifying second single, Chicchubuddi. This track turns the spotlight onto Adivi Sesh in a never-before-seen avatar, as […] The post Dacoit: Adivi Sesh Fires Up Chicchubuddi appeared first on Telugu360 .
22 ఏళ్ల క్రితం ప్రేమకథ శ్రీరామ నవమి నాడు విగ్రహాలకు పెళ్లి.... #LoveStory #TragicLove #RamKoti
మద్యానికి బానిసై నిత్యం తల్లి, చెల్లిని వేధిస్తున్నాడనే ఆక్రోశంతో తండ్రిని హతమార్చాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని బాయిమీది తండాలో జరిగింది. శనివారం తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెద్దేముల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాయిమీది తండాకు చెందిన రాథోడ్ లోక్యనాయక్(50), బిక్కిబాయి దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో మద్యం చిచ్చురేపింది. మద్యానికి మద్యానికి బానిసైన లోక్యనాయక్ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. మద్యానికి బానిసైన లోక్యనాయక్ తరుచుగా మద్యం సేవించి భార్య బిక్కిబాయి, చిన్నకుమార్తె సుప్రియను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన భార్య బిక్కిబాయి, కుమార్తె సుప్రియను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని తల్లి బిక్కిబాయి తక్షణమే హైదరాబాద్లో ఆటో నడుపుకుంటు జీవనం సాగిస్తున్న కుమారుడు రాథోడ్ సునీల్(34)కు ఫోన్లో సమాచారం చేరవేశారు. దీంతో సునీల్ నాయక్ ఆక్రోశంతో స్వగ్రామం బాయిమీది తండాకు చేరుకున్నాడు. తన తల్లి బిక్కిబాయి, చెల్లెలు సుప్రియను వేధిస్తున్న విషయంపై తండ్రి లోక్యనాయక్ను మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. మాటమాట పెరుగడంతో ఆగ్రహానికి గురైన రాథోడ్ సునీల్ నాయక్ తన ఇంట్లో ఉన్నటువంటి గొడ్డలితో తండ్రి లోక్యనాయక్ మెడ, దవడ, తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. దీంతో లోక్యనాయక్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్, సీఐ ప్రవీణ్కుమార్రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి తల్లి హేమ్లీబాయి ఫిర్యాదు మేరుకు పోలీసులు 58/2026 యూ/ఎస్ 103(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు నిందితుడు రాథోడ్ సునీల్ నాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కోర్టులో హజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసులు రాజీ
జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసులు రాజీ చెన్నూర్, ఆంధ్రప్రభ :
ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో సన్రైజర్స్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో భాగంగా.. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుగున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లోపడింది. ఈ మ్యాచ్లో బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన సన్రైజర్స్కు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. డఫీ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి అభిషేక్ శర్మ (7) జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్(11) ఔట్ అయ్యాడు. మళ్లీ డఫీ ఓవర్లోనే నితీశ్ రెడ్డి (1) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ మూడు వికెట్లు నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజ్లో ఇషాన్ కిషన్(23), క్లాసెన్(3) ఉన్నారు.
తాగి మెట్రో ఎక్కితే రూ. 2500 ఫైన్
మెట్రో ప్రయాణికులకు కేంద్రం షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు వేసేలా శుక్రవారం లోక్సభలో కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. మద్యం తాగి రైలెక్కడం, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, ఉమ్మి వేయడం వంటి వాటికి ఇప్పటివరకు విధిస్తున్న రూ. 500 జరిమానాను రూ. 2,500కు పెంచింది. అలాగే రైల్లో అసభ్య రాతలు రాయడం, పోస్టర్లు అతికిస్తే విధించే ఫైన్ వెయ్యి రూపాయల నుంచి రూ. 10 వేలకు పెంచింది. మహిళా కోచ్లలోకి ప్రవేశించే పురుషులకు ఫైన్ను రూ. 250 నుంచి ఏకంగా రూ. 5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జన విశ్వాస (సవరణ) బిల్లు 2026ను వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ లోక్సభలో ప్రవేశ పెట్టారు.
గుడిమల్కాపూర్లో అక్రమ బేకరీపై పోలీసులు దాడి #Gudimalkapur #IllegalBakery #FoodSafety #PoliceRaid
104 ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు రీలీజ్
104 ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు రీలీజ్ 20.05 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు
వేడెక్కిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరింత వేడెక్కాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం బిజెపి తరఫున రాష్ట్రంలోని మమత బెనర్జీ సారధ్య టిఎంసి ప్రభుత్వంపై ఛార్జీషీట్ విడుదల చేశారు. బెంగాల్ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే పరిమితం అయినవి కావు. ఇది దేశ భద్రత సమగ్రతకు సంబంధించిన విషయం అయిందని తెలిపారు. ఎన్నికల దశలో బిజెపి తరఫున ఆయన జోరు పెంచారు. ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అమిత్ షా మమత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 15 సంవత్సరాలుగా సాగుతున్న టిఎంసి సర్కారు హయాంలో పలు అక్రమాలు జరిగాయని విమర్శించారు. ప్రత్యేకించి టిఎంసి ప్రభుత్వ వైఖరితో దేశంలోకి అక్రమ వలసలు ముమ్మరం అయ్యాయని ఆరోపించారు. ఇప్పుడు ఈ ప్రాంతం చొరబాట్ల ముఖద్వారం అయిందని విమర్శించారు. బిజెపి ఛార్జీషీట్లో సంబంధిత విషయాలను ప్రస్తావించామని వివరించారు. టిఎంసి ప్రభుత్వ బుజ్జగింపుల రాజకీయాలు, అవినీతి, రాజకీయ హింసాకాండతో పరిస్థితి దారుణంగా మారిందని ఆరోపించారు. ప్రత్యేకించి దేశ భద్రతకు సవాలు విసిరేలా చొరబాట్ల వ్యవహారం మారిందని అమిత్ షా చెప్పారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యవహారశైలి చివరికి అరాచక వీధిరౌడి స్థాయికి మారింది. ఇటువంటి ధోరణిని వెంటనే నీరుగార్చి తీరాల్సి ఉందన్నారు. పైగా మమత దీదీ ఎప్పుడూ తాను దాడులకు దిగుతూ , రాజకీయ బాధితురాలు డ్రామాలకు దిగుతారు. ఒక్కోసారి ఆమె తనకు తగలని గాయాలను చూపుతూ సానుభూతికి ప్రయత్నిస్తారు. ఎన్నికల సంఘంపై తిట్లకు దిగుతారు. ఇప్పుడు ఈ మహానుభావురాలి కపట నీతి గురించి బెంగాలీలందరికీ తెలిసిపోయింది. ఆమె తరచూ బాధితురాలనే డ్రామాలో ప్రధాన పాత్రధారి అని గుర్తించారని చెప్పారు. టిఎంసి మైనార్టీ ఓటుబ్యాంకు రక్షణకు ఆమె ఎన్నికల సంఘం చేపట్టిన సర్ను వ్యతిరేకించారని చెప్పారు.
లక్షేట్టిపేట మున్సిపల్ బడ్జెట్ రూ.2574.89 లక్షలు
లక్షేట్టిపేట మున్సిపల్ బడ్జెట్ రూ.2574.89 లక్షలు లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : మున్సిపాలిటీ
మెట్రో రైలు విస్తరణకు అసెంబ్లీలో తీర్మానం
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రోను విస్తరించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఫేజ్-2ఎ 76.4 కి.మీ., ఫేజ్-2బి 86.1 కి.మీ విస్తరణకు తీర్మానం జరిగింది. మెట్రో విస్తరణలో ఉన్న అవరోధాలను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. సాంకేతిక, చట్టపరమైన, నిర్వహణ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం చేసుకునే నిర్ణయానికి సభ ఆమోదం తెలిపింది. మెట్రో ఫేజ్-2కు కేంద్ర ఆమోదం త్వరగా లభించేలా కృషి చేయాలని తీర్మానం చేశారు.
కొలాం గిరిజనులు అంటే జంతువుల కంటే హీనమా..
కొలాం గిరిజనులు అంటే జంతువుల కంటే హీనమా.. ఎల్ పి హెచ్ ఎస్
మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహిళలు
నాడు రైతులకు అండగా నిలిచిన గోదాం..!
నాడు రైతులకు అండగా నిలిచిన గోదాం..! స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్
నేపాల్లో మాజీ ప్రధాని ఓలి అరెస్టు
నేపాల్లో దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలిని శనివారం అరెస్టు చేశారు. కొత్తగా ఏర్పడ్డ బాలేంద్ర షా ప్రభుత్వం ఈ తీవ్ర చర్యకు దిగింది. 2025 జన్ జడ్ నిరసనల అణచివేతల అంశంపై దర్యాప్తు కమిటీ నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా మాజీ ప్రధాని, సిపిఎన్యుఎంఎల్ ఛైర్మన్ కూడా అయిన ఓలిని అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయననుఖాట్మాండుకు సమీపంలోని భక్త్పూర్ జిల్లాలోని గుండూ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. కటుంజెలోని ఆయన నివాసం నుంచి మాజీ హోం మంత్రి , నేపాలీ కాంగ్రెస్ నేత రమేష్ లేఖక్కు నూడా పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో యువతరం నుంచి అధికార పక్షానికి నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇది జన్జడ్ ఉద్యమంగా మార్మోగింది. అప్పుడు అధికారంలో ఉన్న ఓలి , లేఖక్ల ప్రోద్బలంతో ఉద్యమం అణచివేతకు దమననీతిని ప్రదర్శించారనే అభియోగాలపై దర్యాప్తు జరిగింది. కమిటీ నివేదిక వెలువరించింది. వీరిపైనా ఇతరులపైనా నేరపూరిత చర్యల కేసులు దాఖలు అయ్యాయి. ఇటీవలే పగ్గాలు చేపట్టిన బాలేంద్ర షా ఆధ్వర్యంలో శుక్రవారమే నూతన మంత్రి మండలి సమావేశం జరిగింది. దర్యాప్తు కమిటీ నివేదికను తక్షణం అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పుడు పోలీసు చర్యకుదిగారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఇప్పటి అరెస్టులపై నూతన హోం మంత్రి సుధాన్ గురుంగ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
సీతానగరంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు…
సీతానగరంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు… చక్రస్నానం, వసంతోత్సవాలతో ఆధ్యాత్మిక కాంతి..పుష్పయాగం, డోలోత్సవంతో మహోత్సవాలు… ఇంద్రకీలాద్రి,
ap-1-state-1-capital : ఏపీకి ఒక్కటే రాజధాని Andhra Prabha Assembly News
ap-1-state-1-capital : ఏపీకి ఒక్కటే రాజధాని Andhra Prabha Assembly News (
ప్రపంచశాంతికి బౌద్ధమే మార్గం: సునీల్ సెనేవి
యుద్ధాల నేపథ్యంలో శాంతికి బుద్ధ బోధనలు అవసరమన్న మంత్రిబుద్ధవనాన్ని ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న జూపల్లి
కల్తీ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై దాడి
కల్తీ బేకరీ ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని గోల్కొండ టాస్క్ఫోర్స్, గుడిమల్కాపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 12,54,280 విలువైన మైదాపిండి, చెక్కెర బస్తాలు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, కేడి కాలనీకి చెందిన అహ్మద్ రజా బేకరీ ఉత్పత్తులను తయారు చేసే వ్యాపారం చేస్తున్నాడు. నిందితుడు అహ్మద్ రజా ఎటువంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తక్కువ నాణ్యత గల ముడి పదార్థాలను ఉపయోగించి ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు,బటర్ బన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. వీటిని నగరంలోని వివిధ కిరాణా దుకాణాలు, హోటళ్లు, కేఫ్లకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ సమాచారం తెలియడంతో పోలీసులు తయారీ కేంద్రంపై దాడి చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం గుడిమల్కాపూర్ పోలీసులకు అప్పగించారు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్స్పెక్టర్ ఆర్. వెంకటేష్, గుడిమల్కాపూర్ ఇన్స్స్పెక్టర్ రామయ్య, ఎస్సైలు కె. వెంకటరమణ, సురేష్, సిబ్బంది దాడులు చేశారు.
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సిబి
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆర్సిబి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సిబి జట్టు సీజన్ ఆరంభ మ్యాచ్ ఆడటం ఇది ఏడోసారి. మరోవైపు ఎస్ఆర్హెచ్కు ఇది రెండోసారి. తుది జట్లు: ఆర్సిబి: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేశ్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకడ్ డఫీ, సుయాశ్ శర్మ. ఎస్ఆర్హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబె, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, ఇషాన్ మలింగా.
హైదరాబాద్ కాలుష్యమంతా మూసీలోనే: సిఎం రేవంత్రెడ్డి
మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం భగవత్ కార్యంగా భావిస్తున్నానని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారని, ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమమని, ముచుకుంద నదికి గొప్ప చరిత్ర ఉందని ఆయన తెలిపారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని ఆయన అన్నారు. మూసీనది పునరుజ్జీవిం గురించి చాలా మంది ప్రయత్నించారని, కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదని, ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తారని, తెలంగాణ పౌరులకు తన విజ్ఞప్తి ఒక్కటేనని, చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందిందని, సముద్ర పరీవాహకంలో వ్యాపారం, ఆర్ధిక అభివృద్ధి జరిగిందని సిఎం అన్నారు. దేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, మూసా, ఈసా నదులు ఉన్నా సరైన విధంగా ఉపయోగించుకోలేదని, మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్య కారకంగా మారింది గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యం…
ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యం… ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర
Sri Rama Navami |ఘనంగా శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవం
Sri Rama Navami | హైదరాబాద్, ఆంధ్రప్రభ : భక్తి, వేడుకలు, సంగీతం,
బిసి రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు.. రాహుల్ గాంధీకి విహెచ్ వినతి
బిసి రిజర్వేషన్ల కోసం పార్లమెంటు లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు ఏఐసిసి అగ్ర నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కోరారు. ఈ మేరకు విహెచ్ శనివారం రాహుల్ గాంధీకి లేఖ రాశారు. బిసిలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీని కోరాలని ఆయన రాహుల్ గాంధీని కోరారు. బిసి బిల్లు పెట్టకపోతే ప్రతిపక్షాలు ప్రయోజనం పొందుతాయని, బిసిల పట్ల కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేదని విమర్శలు వెల్లువెత్తుతాయని ఆయన తెలిపారు. పైవేట్ మెంబర్ బిల్లు పెట్టేలా చూడాలని ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కసి వేణుగోపాలను కోరారు. బిసి ప్రైవేట్ మెంబర్ బిల్లు కాబట్టి ఆమోదం పొందినా పొందకపోయినా బిసిల పట్ల కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవడానికి బిల్లు పెట్టడం ద్వారా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ సవరిస్తేనే బిసిలకు రిజర్వేషన్లు సాధ్యం అవుతుందని ఆయన వివలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో శ్రీ రాముని కళ్యాణం జరిపించాలని విహెచ్ కోరారు.
లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ…
లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ… విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ మున్సిపల్
ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం..
మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్
BJP : తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్లాన్ సిద్ధం చేసిందటగా?
తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టింది
వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం
వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం భారీగా తరలివచ్చిన భక్తజనం ఉరవకొండ రూరల్,
ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ ఇచ్చి.. రూ.15 కోట్లు దక్కించుకున్నాడు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం జేవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ఇది ఉత్తరప్రదేశ్కు ఒక ప్రధాన మౌలిక సదుపాయాల మైలురాయిగా నిలిచింది. అయితే దీనికి సంబంధించి సేకరించిన భూములకు భారీ పరిహారం అందినట్లు తెలుస్తోంది. తద్వారా ఆ భూమల రైతుల జీవితాలు రాత్రికి రాత్రే బంగారు మయం అయ్యాయని పలు నివేదికల సమాచారం. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భూసేకరణలో భాగంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఓ రైతుకు దాదాపు రూ.15 కోట్లు పరిహారం లభించింది. ఈ భారీ సొమ్ము ఆయన ఏకంగా ఒక హెలికాఫ్టర్ను కొనుగోలు చేయడమే కాకుండా, విహార యాత్ర కోసం థాయ్లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ విమానాశ్రయ ప్రాజెక్టు వల్ల గ్రామీణ ముఖ చిత్రం మారుతోందట. ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి.
డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ
డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ . డ్రగ్స్ నిర్మూలనకు సమిష్టి కృషి
శిక్షణ పూర్తి చేసిన వార్డు సభ్యులకు సర్టిఫికెట్ల పంపిణీ
బాసర, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీలలో వార్డుల అభివృద్ధికి వార్డు సభ్యులు కీలక పాత్ర
మార్కెట్లో అన్ని సైజుల టీవీల ధరలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్, రాగి ధరలు పెరగడం వల్ల ఏసీల రేట్లు కూడా ప్రియం కానున్నాయి. గతంలో రూ.28,000 లభించే 65 అంగుళాల టీవీ ధర ఇప్పుడు రూ.32 వేలకు చేరిందని సమాచారం. అలాగే 32 అంగుళాల టీవీ ధర రూ. 5,700 నుండి రూ.6,400 కు పెరిగింది. ధరలు పెరగడంతో సగానికి పైగా వినియోగదారులు కొనుగోళ్లు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, సిలిండర్ల కొరత కూడా వేధిస్తోంది.
స్టూడెంట్గా మారిన ఎస్ఐ.. ఆకతాయిలకు చెక్
టేకుమట్ల, ఆంధ్రప్రభ : పోలీసు అంటే కేవలం లాఠీ పట్టి విధులు నిర్వహించడం
గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి
గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి సాగు–తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంఏపీ రైతు సంఘం

30 C