Bigg Boss Telugu 9: Bharani team tops after Dance and Pyramid Tasks
The Bigg Boss Telugu 9 house witnessed a rollercoaster of emotions, laughter, and strategy in the latest episode. From Sanjana’s elimination to Ritu’s emotional breakdown, every task tested the contestants’ patience and physical endurance, leaving the audience hooked to every twist. Ritu and Sanjana Mock Captain Ramu Despite being in the danger zone, Ritu and […] The post Bigg Boss Telugu 9: Bharani team tops after Dance and Pyramid Tasks appeared first on Telugu360 .
Tirumala : తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అలెర్ట్.. ఇలా రావాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
Andhra Pradesh : నేటి నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిచిపోనున్నాయి
అపోలో యూనివర్సిటీలో గర్ల్స్ బాత్రూమ్ లో సిక్రెట్ కెమెరాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కేంద్రంలోని లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా లభించింది. అపోలో యూనివర్సిటీ విద్యార్థినిల బాత్రూమ్ లో కెమెరా కనిపించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టాయిలెట్స్ లో శబ్దం వస్తుందని గమనించిన విద్యార్థిని, ఈనెల 1న యూనివర్సిటీ రిజిస్టార్ కు సమాచారం ఇచ్చింది. అపోలో యూనివర్సిటీ రిజిస్టర్ పోతురాజు రహస్యంగా తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు సైట్ ఇంజనీర్ కాంతా రూబెన్, విరుద్ నగర్ జిల్లా వాసి సీక్రెట్ కెమెరాలు పెట్టినట్టు సమాచారం. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు వద్ద నుంచి ఇప్పటికే మొబైల్, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. బాత్రూమ్ లోకి సిక్రెట్ కెమెరాలు ఎవరు పెట్టారు అనేది తెలియాల్సి ఉంది.
Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. దీపావళికి ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది.
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
` కర్ణాటక కీలక నిర్ణయం బెంగుళూరు(జనంసాక్షి):మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర …
భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
– స్టార్మర్తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ` ముంబయిలో ఇరువురి సమావేశంలో ` కీలక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చలు ముంబై(జనంసాక్షి):భారత్-యూకే సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర …
సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
` లాస్లో క్రాస్జ్నాహోర్కైకు దక్కిన పురస్కారం స్టాక్హోం(జనంసాక్షి):ప్రముఖ హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. సాహిత్య బహుమతిని స్వీడిష్ అకాడమీకి …
సోలార్ విద్యుత్ వినియోగంపై ఆసక్తిగా ఉన్నాం
` ప్రతిపాదనలను అధ్యయనం చేస్తాం ` జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగం బలోపేతం లో భాగంగా సోలార్ …
Israel- gaza-ceasefire : ఇజ్రాయిల్ - గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు అమెరికా సైన్యం
ఇజ్రాయిల్ - గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో అమెరికా రంగంలోకి దిగింది
బీసీలకు 42% జీవోపై హైకోర్టు స్టే
` నోటిఫికేషన్నూ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ` ఆరు వారాల పాటు నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ ` కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ` రెండురోజుల …
తెలంగాణ ‘స్థానిక’ ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేత
` హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్ఈసీ ప్రకటన హైదరాబాద్(జనంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక …
అయోధ్యలో భారీ పేలుడు: ఐదుగురు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అయోధ్య సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పగ్లాబారీ గ్రామంలో పేలుడు దాటికి ఇండ్లు కుప్పకూలిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో వివిధ ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రెస్క్యూ సిబ్బంది ఘటనా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.
Telangana : తెలంగాణలో నిలిచిన ఎన్నికల కోడ్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది
చితి నుంచి చిగురిస్తున్న శాంతి
ఫీనిక్స్ అనే పక్షి తన పూర్వీకుల బూడిదనుంచి కొత్త జీవితాన్ని పొందుతుందని ప్రాచీన గ్రీకు ఇతిహాసాలు చెబుతున్నాయి. కాలానికి, సామ్రాజ్యాలకి, పునర్జన్మలకి, పునరుజ్జీవనానికి చిహ్నంగా ఈ పక్షిని చిత్రీకరిస్తుంటారు. అదే విధంగా దాదాపు రెండేళ్లు రావణకాష్ఠంలా మారణకాండతో రణజ్వాలలతో భస్మమైన గాజా చితిపై మళ్లీ ఇప్పుడు శాంతి పునరుజ్జీవనం పొందే మంచి రోజులు వచ్చాయి. గాజాలో యుద్ధం పరిసమాప్తి కావడానికి వీలుగా ఇజ్రాయెల్, హమాస్ మొదటి శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడం అపూర్వ ఘట్టం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో రూపొందిన సమగ్రశాంతి ప్రణాళిక ఇన్నాళ్లూ రణతంత్ర వ్యూహాలతో దద్దరిల్లిన గాజాలో పునర్నిర్మాణం ప్రారంభానికి నాంది పలికింది. ఈ నిర్ణయంతో హమాస్ చెరలో బందీలు త్వరలో విడుదల అవుతారు. అలాగే ఇజ్రాయెల్ గాజా నుంచి తన బలగాలను వెనక్కు తీసుకుంటుంది. బందీలందరినీ ఇళ్లకు చేర్చేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. గాజాలో ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైనిక బలగాలు ఉపసంహరణ అవుతాయని, ఖైదీల మార్పిడి జరుగుతుందని, బాధితులకు మానవతా సాయం అందే మార్గం ఏర్పడుతుందని హమాస్ విశ్వసిస్తోంది. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, స్వయం నిర్ణయాలు సాధించేవరకు తమ ప్రజల హక్కులను వదులుకోమని హమాస్ స్పష్టం చేసింది. ఈ అక్టోబర్ 7 తో గాజా యుద్ధానికి రెండేళ్లు పూర్తి అయ్యాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి 1200 మందిని హతమార్చడమే కాక, 250 మందిని బందీలుగా చేశారు. దీంతో హమాస్ను అంతం చేయడమే లక్షంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ రెండేళ్లలో దాదాపు 67 వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా, 1.70 లక్షల మంది గాయపడ్డారు. లక్షకు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు గాజా శాంతి ఒప్పందం కోసం 20 సూత్రాల ప్రణాళికను తెరపైకి తీసుకువచ్చారు. గత మూడు రోజులుగా ఈజిప్టులో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన శాంతి చర్చలు చివరకు ఫలించాయి. ప్రణాళిక మొదటి దశ అమలుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. శాంతి ప్రణాళికకు మొదట ఇజ్రాయెల్ కానీ, హమాస్ కానీ తలవంచకపోవడంతో ట్రంప్ కఠినంగా వ్యవహరించి ఇజ్రాయెల్ మెడ వంచగలిగారు. అరబ్ దేశాల ఐకమత్యాన్ని వివరించి ఇజ్రాయెల్ పట్టు వదిలేలా చేశారు. ఓవల్ ఆఫీస్ నుంచే ఖతార్ నేతకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుచే క్షమాపణలు చెప్పించారు. అలాగే హమాస్ను అక్టోబర్ 5 లోగా అంగీకరించకపోతే నరకం చూస్తారని బెదిరించారు. నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న ట్రంప్కు ఇదో గొప్పబలం చేకూర్చింది. ట్రంప్ టెన్షన్ పడుతున్న సమయంలో శుక్రవారం (10.10.25) నోబెల్ శాంతి బహుమతి ప్రకటించనున్నారు. ఈ బహుమతి ట్రంప్కు దక్కుతుందో లేదో చెప్పలేం కానీ గాజా శాంతి ఒప్పందాన్ని కుదిర్చిన ఘనత తనదేనని, ఇంతకన్నా మరెవరైనా సాధించగలరా? అని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. ఇజ్రాయెల్, హమాస్ ఒప్పందంపై సంతకాలు చేయగానే ‘పీస్ ప్రెసిడెంట్’ అని ట్రంప్ను ప్రశంసిస్తూ వైట్హౌస్ పోస్ట్ పెట్టడం గమనార్హం. గాజాలో గత రెండేళ్లలో ఇజ్రాయెల్ దారుణ మారణ హోమానికి అగ్రనాయకులే ఆజ్యం పోస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి కమిషన్ గత నెలలో తీవ్రంగా ఆక్షేపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు కమిషన్ వెలువరించిన 72 పేజీల నివేదికలో అనేక వాస్తవాలు బయటపడ్డాయి. జర్మనీలో హిట్లర్ ఊచకోతలతో ఇజ్రాయెల్ దమనకాండను పోల్చింది. నాజీ జర్మనీలో హిట్లర్ 60 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్లో పెట్టి ఊచకోత కోసినట్టుగానే, ఇజ్రాయెల్ 2023 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు నాలుగు మారణకాండ చర్యలకు పాల్పడిందని నివేదికలో బయటపెట్టింది. ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు గాజాలో 10 లక్షల మంది పాలస్తీనా ప్రజలు ఉండేవారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం రెండు నెలల క్రితం 2.20 లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుంచి తరలిపోయారని తేలింది. ఇజ్రాయెల్ బలిగొన్న వారిలో సగానికి సగం మంది మహిళలు, చిన్నారులే. వీరికి ఇజ్రాయెల్ పగ ప్రతీకారాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా హతమయ్యారు. దాడులు ఆపాలని హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నివాసం ఎదుట నిరసనలు కొనసాగించినా, నెతన్యాహు చలించకపోవడం రాక్షసత్వానికి తార్కాణం. నోబెల్ శాంతి బహుమతి కోసం అర్రులు చాస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ పాపంలో భాగం పంచుకున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు సాగిన యుద్ధం వెనుక ట్రంప్ ప్రోత్సాహం ఉందన్న సంగతి జగమెరిగిన సత్యం. గాజాలో ఆకలి చావులు పెరిగిపోతున్నా, మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ అడ్డుపడినా ఏమాత్రం ఖండించకపోవడం తెలిసిందే. ఇటీవల కొన్ని నెలల క్రితం ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడుల వెనుక కూడా ట్రంప్ రణతంత్రం ఉంది. ఇరాన్ లోని అణుశక్తి వనరులన్నిటినీ ధ్వంసం చేయించడమే కాక, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీని లొంగిపోవాలని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ పూర్వాపరాల నేపథ్యంలో శాంతి బహుమతి ట్రంప్కు వస్తుందా? అన్నది ప్రశ్నార్థకమే. అయితే గాజా శాంతి ప్రణాళిక ప్రకారం గాజా స్ట్రిప్కు ఒప్పందం ప్రకారం పునరావాస మౌలిక వసతులు కల్పించడమే కాక, పాలస్తీనా స్వతంత్ర దేశంగా ప్రాణం పోస్తే ఇంతవరకు జరిగిన ఘోరాల నుంచి ట్రంప్కు ప్రక్షాళన జరుగుతుందని చెప్పవచ్చు.
మన తెలంగాణ/హైదరాబాద్ :స్థానిక ఎ న్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తూ హై కోర్టు గురువారం సంచలన నిర్ణయం తీ సుకుంది. ఈ ఎన్నికలలో బీసీలకు రిజరేవషన్ల శాతాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన జీవో 9 పై స్టే విధించిం ది. దీంతో బిసి రిజర్వేషన్లపెంపు పై నెల కొన్న ఉత్కంఠకు హైకోర్టు మధ్యంతర ఉ త్తర్వులతో తాత్కాలికంగా తెరపడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అ పరేష్ కుమార్ సింగ్, మెహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని రాష్ట్ర ఎ న్నికల సంఘం ప్రకటన విడుదల చేసిం ది. ఇలా ఉండగా ఈ అంశంలో పూర్తి వి వరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్పై తమ వాదనకు పిటిషనర్లకు రెం డు వారాల గడువును హైకోర్టు విధించింది. ఈ గడువులు విధించడంతో తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేస్తోన్నట్టు సిజె ధర్మాసనం వెల్లడించింది. హైకోర్టు మ ధ్యంతర ఉత్తర్వులతో బిసి రిజర్వేషన్ల పెం పునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చుక్కెదరు అయినట్లు అయింది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం జారీ చేసి న జీఓను కొట్టివేయాలని మాదవ్ రెడ్డి, స ముద్రాల రమేష్ అనే వ్యక్తులు హైకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వీ రి పిటిషన్లతో పా టు ఈ కేసులో ఇంప్లీడ్ అయిన పిటిషన్లను ధర్మాసనం కలిపి బుధ,గురువారం రెండు రోజులుగా హై కోర్టు విచారిచింది. రిజర్వేషన్ల పెంపుదలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం,రిజర్వేషన్ల పెంపును సమర్థించుకుంటూ వినిపించిన ప్రభుత్వ వాదనలను గురువారం హైకోర్టు విచారించింది. రెండురోజుల పాటు కొనసాగిన అనంతరం ఈ కేసుపై తదుపరి విచారణను ఆరు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. ఇలా ఉండగా గురువారం మధ్యాహ్నం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు జనాభా ప్రాతిపదికంగా స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు సాంకేతికంగా, నిష్పాక్షికంగా, కచ్చితత్వంతో సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే నిర్వహించి 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. ఈ సర్వేను ఎవరూ వ్యతిరేకించలేదని, అలాగే ఎంపికరల్ డేటా లో (వాస్తవ డేటా) బిసిల జనాబా 57.6 శాతం ఉందని, ఈ సర్వే ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించిందని, దీనికి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని తెలిపారు. శాసనసభ ఆమోదించిన బిల్లు గరవ్నర్ వద్ద పెండింగ్లో ఉందని ఏజి కోర్టుకు వివరించారు. గడువులోగా గవర్నర్ ఆమోదింకచకపోతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చట్టంగా బావించాల్సి ఉంటుందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్ ఆమోదించే గడువు ముగిసిన అనంతరం సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారిందని కూడా ఏజి గుర్తు చేసారు. రాష్ట్ర అసెంబ్లీ చేసిన బిల్లు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సూత్రప్రాయంగా చట్టంగా మారినట్టేనని ఏజి పేర్కొన్నారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందా అని సిజె ప్రశ్నించగా, అవునని ఏజి సమాధానం చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు వేరని వివరించారు. ఇందిరా సాహ్ని కేసు విద్య, ఉద్యోగాలకు సంబంధించినదని ఏజి స్పష్టం చేసారు. సాహ్ని కేసు స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదని వాదించారు. రాజకీయ రిజర్వేషన్ల కోసం మాత్రమే జీవో జారీ చేసిందని, దాని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాక కోర్టుల జోక్యం సరికాదని అన్నారు. భారత రాజ్యంగం ఆర్టికల్ 243 ఓ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోలేవని, ఈ అంశంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఏజి కోర్టుకు వివరించారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన మరో సీనియర్ న్యాయవాది రవివర్మ వర్చువల్గా తన వాదనలు వినిపించారు. రాజ్యాంగంలో 50 శాతం రిజర్వేషన్లపై ఎక్కడా సీలింగ్ లేదన్నారు. రిజర్వేషన్ల సీలింగ్ అనే పదానికి నిర్వచనం లేదని వివరించారు. కేవలం సుప్రీం కోర్టు తీర్పులు మాత్రమే ఉన్నాయన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే పిటిషనర్లకు ఎటువంటి ఆధారం లేదని, ఏ ఆధారంతో ఈ పిటిషన్ దాఖలు చేశారో చెప్పాలన్నారు. రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీం కోర్టు తీర్పు మాత్రమే ఉందని, అందుకు స్పష్టమైన ఎటువంటి పునాది లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిల మొత్తం జనాభా 85 శాతం జనాభాకు 67 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, మిగతా 15 శాతం జనాభాకు 33 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, అలాంటప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తప్పేంటనీ రవివర్మ వాదించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశానిది ‘మృతప్రాయమైన ఆర్థిక వ్యవస్థ’ అన్నారు. భారత- పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపించానన్నారు. యుద్ధ సమయంలో పాకిస్థాన్ సైన్యం ఇండియాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చిందని ప్రకటించారు. దానిని బట్టి తేలేది భారతదేశం ఆర్థికంగా, సైనికంగా కూడా బలహీనమైనదని. అమెరికా వంటి అగ్రరాజ్యనేత అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసారంటే ఆయా అంశాలపై పూర్తి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి అటువంటి అభిప్రాయానికి వచ్చి ఉంటారని భావిస్తాము. తన అభ్రిపాయాలు సరైనవని అమెరికా అధ్యక్షుడు నమ్మినట్లయితే, ఈ దేశాన్ని ఇక పట్టించు కోకుండా ఉపేక్షించాలి. కాని అట్లా జరగటం లేదు. తన వ్యాఖ్యల తర్వాత కొద్ది రోజులు తిరిగాయో లేదో, ఇండియాలో సత్సంబంధాల కోసం తహతహలాడటం కనిపిస్తున్నది. అందుకు ప్రధాన కారణాలు రెండు. ఒకటి, ఆర్థికంగా భారతదేశం బలహీనమైనదేమీ కాదు. ‘మృతప్రాయ వ్యవస్థ’ అంతకన్న కాదు. రెండు, బహుశా ఆర్థికంగా కన్న ముఖ్యంగా అమెరికా దీర్ఘకాలిక సామ్రాజ్యవాద వ్యూహాలకు ఆసియాలో ఇండియా కీలకంగా ఉపయోగపడగలదన్నది వారి పథకం. కనుక, ఆర్థికం ఎట్లున్నా ఇటువంటి ప్రయోజనాల దృష్టా వారు భారతదేశాన్ని దూరం చేసుకోలేరు. తాము కోరుకున్న రీతిలో ఉపయోగపడేందుకు భారత్ సిద్ధమా అన్నది వేరే ప్రశ్న. ఈ వ్యూహాత్మక కోణాన్ని చర్చించే ముందు ఆర్థిక విషయాలను కొద్దిగా చెప్పుకుందాము. ప్రస్తుత వివాదమంతా ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య లోటు, ఆ స్థితిని తొలగించుకునేందుకంటూ ట్రంప్ విధిస్తూ వస్తున్న కొత్త టారిఫ్ల మాట తెలిసిందే. ఆ విషయమై కుప్పతెప్పలుగా చర్చలు జరిగినందున అందులోకి మళ్లీ వెళ్లనక్కరలేదు. అదే విధంగా, ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు కొత్తది కాదు. ఇండియా సహా అనేకానేక దేశాలతో వారిలోటుకు కారణాలేమిటి? ఆ సమస్య పరిష్కారానికి టారిఫ్ల హెచ్చింపు సరైన పద్ధతా? అనే చర్చలు కూడా చాలా సాగాయి. ఆ విషయం అట్లుంచి, తాము స్వయంగా స్వయంగా సృష్టించుకున్న ఆర్థిక సమస్యలనుంచి బయటపడేందుకు ట్రంప్ మరొక రెండు మార్గాలను అనుసరిస్తున్నారు. ఒకటి, ఇతర దేశాలను ఒత్తిడి చేసి తమకు అనుకూలమైన విధంగా కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవటం. రెండు, ఇతరులను ఒత్తిడి చేసి తమ దేశంలో భారీ పెట్టుబడులు పెట్టించుకోవటం. ఈ ప్రధాన చర్యలకు ఉపచర్యలుగా మరి రెండు పనులు చేస్తున్నారు. ఒకటి, ఇతర దేశాలలో గల అమెరికన్ కంపెనీలను సుంకాల బెదిరింపులతో స్వదేశానికి తిరిగి రప్పించజూడటం. రెండు, ఇతర దేశాల కంపెనీలకు వివిధ రాయితీల ఆశలు చూపి రప్పించే ప్రయత్నం. ఇవన్నీ ఎట్లా ముందుకు సాగుతున్నాయి లేదా సాగటం లేదు అనే చర్చ ప్రస్తుత సందర్భంలో అక్కరలేదు. భారత దేశానికి పరిమితమై చూస్తే పరిస్థితి ఈ విధంగా కనిపిస్తున్నది. మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రపంచంలో అయిదు లేదా నాలుగో స్థాయికి చేరినప్పటికీ అమెరికా అవసరాలతో చూసినపుడు సాధారణమైనదే. అనగా, మనం అక్కడ భారీ పెట్టుబడుల పెట్ట గలిగింది లేదు. అందువల్ల అమెరికాకు కావలసింది ఇక్కడి వనరులు, విస్తృతమైన మార్కెట్లు. యథాతథంగా అమెరికాకు వనరుల ఎగుమతికి, పారిశ్రామిక సంబంధమైన అమెరికన్ ఉత్పత్తులకు భారత మార్కెట్లలో ప్రవేశానికి సమస్యలంటూ లేవు. భారత ప్రయోజనాల రీత్యా స్వల్ప జాగ్రత్తలు మినహా. సమస్య అంటూ తలెత్తింది అమెరికన్ వ్యవసాయ పాడి మత్స ఉత్పత్తుల విషయంలోనే అన్న చర్చలు కూడా వరుసగా జరుగుతున్నవే. ఇవి 1995లో డబ్లుటిఒ స్థాపనకు ముందునుంచే మొదలై గత 30 సంవత్సరాలుగా, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరుగుతూనే ఉండటాన్ని బట్టి, ఈ నిర్దిష్ట అంశం భారత ప్రయోజనాలకు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పకుండానే గ్రహించవచ్చు. ఆ విధంగా దేశ ప్రయోజనాలను కాపాడుతున్నందుకు అన్ని పార్టీలను అభినందించాలి. ప్రస్తుత చర్చల సందర్భంగా కూడా ప్రధాని మోడీ, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతాము తప్ప ఈ విషయం లో రాజీ ప్రసక్తి లేదని విస్పష్టంగా ప్రకటించటం గమనించదగ్గది. ఆ స్థితిలో, తమ విపరీతమైన కోరికలను, ఇండియా వంటి వర్ధమాన దేశాలను లొంగదీసుకోగలమనే అహంభావాన్ని వదలుకుని, రాజీకి రావలసింది అమెరికా మాత్రమే. ఉభయ దేశాల మధ్య పెద్ద మొత్తంలో వాణిజ్యం జరిగే మరొక రంగం ఆయుధాల కొనుగోలు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు వరకు ప్రపంచంలోనే అత్యధిక దిగుమతిదారు అయిన ఇండియా, ప్రధానంగా రష్యా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ రాగా, ఇటీవలి కాలంలో అమెరికా సహా ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచింది. కాని, అది చాలని అమెరికా మాత్రం రష్యా నుంచి దిగుమతులు పూర్తిగా ఆపేయాలంటూ ఒత్తిడి చేయటం మొదలు పెట్టింది. ఇందుకు ఒక కారణం తమ వ్యాపారం పెంచుకోవటమైతే, మరొకటి భారత్ను రష్యాకు దూరం చేయటం. పైకి చెప్తున్నది మాత్రం, ఆయుధ దిగుమతుల కోసం భారత్ చెల్లిస్తున్న మొత్తాలు ఉక్రెయిన్పై యుద్ధాల కోసం రష్యాకు ఉపయోగపడుతున్నాయని. ఇది చమురు దిగుమతులతో ముడిపెట్టి చేస్తున్న వాదన వంటిదే. ఇదంతా గ్రహించినందు వల్లనే ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం ఏ ఆయుధాలు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలో ఆ పని చేస్తున్నది తప్ప, ట్రంప్ ఒత్తిడికి తల ఒగ్గటం లేదు. ఇది ఆయనకు కంటగింపుగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, మొదటి అనుకున్నట్లు ఇండియా అంటే ట్రంప్కు గాభరా మొదలైంది. ఈ ఆర్థిక, వాణిజ్య విషయాల వల్ల ఎంత మాత్రం కాదు. ఇవి అన్నీ కూడా కొంత అటు ఇటుగా ఏదో ఒక రోజు సర్దుబాటు అవుతాయి. అంతమాత్రాన అమెరికా దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలు దెబ్బతినేది ఏమీ ఉండదు. అవి దెబ్బతినటం లేదా తినకపోవటమనేది ఆసియాకు సంబంధించి అమెరికా భౌగోళిక వ్యూహంలో ఇండియా పాత్ర ఎట్లా ఉండగలదనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ వ్యూహం ఏమిటి? గతం నుంచి చూసినట్లయితే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ సముద్రం, యూరప్లతో కూడిన పశ్చిమార్ధ భూగోళాన్నంత అమెరికా తన పూర్తి ప్రాబల్య ప్రాంతంగా పరిగణించింది. ఆ మాట బాహాటంగానే ప్రకటిస్తూ ఆ మేరకు మన్రోడాక్ట్రిన్ను ప్రకటించింది. అక్కడ ఇతరులకు ప్రవేశం లేదని హెచ్చరించింది. తర్వాత తూర్పు యూరప్, మధ్య ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికాలలో అదే విధమైన సంపూర్ణ ఆధిపత్యం కోసం రాజకీయంగా, సైనికంగా ప్రయత్నిస్తూ వస్తున్నది. అది తన ఆలోచనల ప్రకారం నెరవేరనందు వల్ల పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరాక్, ఇరాన్, అప్ఘానిస్థాన్, పాలస్తీనా, ఉక్రెయిన్ వంటివి అందుకు ఉదాహరణలు. అమెరికా భౌగోళిక వ్యూహాల పరిస్థితి ఒకవైపు ఇట్లుండగా, దానిని ఒబామా కాలంలో మరింత తూర్పుకు విస్తరించారు. ఒబామా నల్లవాడు గనుక కేవలం తన చర్మపు రంగు కారణంగా అభ్యుదయవాది అయిపోయినట్లేనని భారత్ సహా అనేక దేశాలలో చాలా మంది అమాయకంగా భ్రమపడ్డారు. కాని ఆయన ఏ తెల్లవారికీ తీసిపోని సామ్రాజ్యవాది. పశ్చిమాసియా యుద్ధాలు ఓడిపోవటంతో తన దృష్టి తూర్పు ఆసియాకు మళ్లింది. ఆ విధంగా తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, దూరప్రాచ్యం, దక్షిణ చైనా సముద్రం పసిఫిక్ మహా సముద్ర ప్రాంతాలన్నీ ఆయన వ్యూహ పరిధిలోకి వచ్చిచేరాయి. ఈ పరిధిలోని ఒక్కొక్క దేశాన్నే తమ సైనిక, ఆర్థిక, రాజకీయ ప్రాబల్యం కిందకు తెచ్చుకునే ప్రయత్నాలు ఒబామా ఎనిమిదేళ్ల కాలంలో జోరుగా సాగాయి. ఆ ప్రాంతమంతా అనేక సైనిక స్థావరాలు కొత్తవి ప్రారంభించారు. తమ నౌకా బలపు సంచారాలు, మోహరింపులు పెరిగాయి. పశ్చిమాసియాలో క్రమంగా బలహీనపడుతూ, ఇతర ఆసియా ప్రాంతాలలో, ఆఫ్రికాలో ప్రయత్నాలు కోరుకున్నట్లు నెరవేరనందున, తూర్పు ఆసియాలో ప్రాబల్య సాధన తప్పనిసరి అన్నది ఆలోచన. ఈ కొత్త ఆలోచనకు కేంద్ర బిందువు రష్యా, చైనాలను నియంత్రించటం. ముఖ్యంగా తమకు దీటుగా అభివృద్ధి చెందుతూ సవాలుగా మారుతున్న చైనాను అదుపు చేయటం. మరొక వైపు, రష్యాను యూరప్లో కట్టడి చేయటం కోసం నాటోను ఆ దేశం దిశగా విస్తరించటంలోనూ ఒబామాది కీలకమైన పాత్ర కావటం గమనించదగ్గది. సరిగా ఇక్కడ వస్తున్నది భారతదేశం ప్రస్తావన. ఇండియా భౌగోళికంగా, సైనికంగా, ఆర్థికంగా ఆసియాలోని ప్రముఖ దేశాలలో ఒకటి కావటమేగాక, పసిఫిక్కు పొరుగున గల హిందూ మహా సముద్రంలో కీలక స్థానంలో ఉంది. ఆ దేశం సైద్ధాంతికంగా, స్వీయ ప్రయోనాల దృష్టా తమకు సన్నిహితమన్నది అమెరికా, యూరప్ల నమ్మకం. అందుకే ‘క్వాడ్’ కూటమిలో భాగస్వామిని కూడా చేసారు. తూర్పు సముద్రాలలోని ఉమ్మడి నౌకా విన్యాసాలలో భాగస్వామిని చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఒక వైపు ఇటువంటి భాగస్వామ్యాలు ఉన్నా, ‘కాడ్’ను సైనిక కూటమిగా మార్చే ప్రతిపాదనకు మాత్రం అంగీకరించకపోవటాన్ని బట్టి, తన జాగ్రత్తలలో తాను ఉంటున్నట్లు గ్రహించవచ్చు. మరొక మాటలో చెప్పాలంటే, అమెరికన్ వ్యూహాలలో ఒక పావు కాదలచుకోలేదన్న మాట. ఈ నేపథ్యం ఇట్లుండగా, ఇటీవలి టారిఫ్ల సందర్భంలో ఇండియా ఒక్కసారిగా బ్రిక్స్, ఎస్సిఒల వైపు బలంగా మొగ్గటం, రష్యాకు దూరమయే ప్రసక్తి లేదని స్పష్టం చేయటం, చైనాతో వేగంగా సంబంధాల పునరుద్ధరణతో అమెరికా శిబిరానికంతా గాభరా మొదలైంది. ఒకవేళ భారతదేశం ఇదే వైఖరిని కొనసాగించినట్లయితే, వర్తమానపు ఆర్థిక సంబంధాల మాట ఎట్లున్నా, దీర్ఘకాలిక సామ్రాజ్యవాద వ్యూహం విషయం ఏమిటన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అందుకు సమాధానం కనుగొనేందుకు అమెరికన్ కూటమి పెద్దలు తలకిందులవుతున్నారు. టంకశాల అశోక్
‘మిత్ర మండలి’ ప్రతీ ఒక్కరిని నవ్విస్తుంది
ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం జంటగా విజయేందర్ దర్శకుడిగా బీవీ వర్క్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో హీరోయిన్ నిహారిక ఎన్ ఎం మీడియాతో మాట్లాడుతూ.. “మిత్ర మండలి’ చిత్రంలో నేను ఓ సాఫ్ట్ పాత్రను పోషించాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ప్రియదర్శి చాలా మంచి వ్యక్తి. అద్భుతమైన నటుడు. ‘మిత్ర మండలి’ షూటింగ్లో ఉండగానే ప్రియదర్శి నటించిన ‘కోర్ట్’ చిత్రం పెద్ద హిట్ అయింది. ప్రియదర్శి ఎంత సక్సెస్ అయినా కూడా ఒదిగి ఉంటారు. నాకు అన్ని కూడా కామెడీ బేస్డ్ చిత్రాలే వస్తున్నాయి. అందుకే డిఫరెంట్ సబ్జెక్ట్లను ఎంచుకోవాలని చూస్తున్నాను. ‘మిత్ర మండలి’ చిత్రంలో కథ, కథనం చాలా కొత్తగా ఉంటుంది. అందరినీ నవ్వించేలా మా చిత్రం ఉంటుంది. థియేటర్కు వచ్చిన ప్రతీ ఒక్కరినీ హాయిగా నవ్వించేస్తుంది. ‘మిత్ర మండలి’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమ నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించింది. దర్శక, నిర్మాతలు నన్ను సొంత ఫ్యామిలీలా చూసుకున్నారు. టాలీవుడ్లో దొరికినంత ప్రేమ, కంఫర్ట్ నాకు ఇంకెక్కడా దొరకలేదు” అని అన్నారు.
–గాయత్రి ఉప్పలపాటి 2025లో ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం “విపత్తులు మరియు అత్యవసర
ఆ ముఖంలో ప్రశాంతత, విజ్ఞత ప్రతిబింబిస్తాయి. దేశంలో అత్యంత నిష్ణాతులైన ఎడిటర్, జర్నలిస్ట్లలో ఒకరు ఆయన. మనకు టిజెఎస్గా చాలా ఏళ్లుగా తెలిసిన తయిల్ జాకబ్ సోని జార్జ్. తన సుదీర్ఘ జీవితం దేశంలో అధికారంలో ఉన్నవారికి నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఘనుడు. అలాంటి వారు ఇటీవలి సంవత్సరాల్లో జాతి వ్యతిరేకి అని ముద్రపడే ప్రమాదం ఎదురవుతోంది. 97 ఏళ్ల జార్జి జీవితం అంతా, న్యూస్ రూమ్లలోనూ, జర్నలిజం స్కూళ్లలో భవిష్యత్ జర్నలిస్ట్లకు దిశానిర్దేశంలోనే గడిచింది. దేశం గర్వించదగ్గ కొద్ది మంది జర్నలిస్ట్ల జాబితాలో టిజెఎస్ పేరు అగ్రస్థానంలో ఉంటుంది. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ పట్టభద్రుడైన వెంటనే పత్రికారంగంలో ప్రవేశించిన జార్జి 70 ఏళ్లుగా జర్నలిస్ట్గా దేశం గురించి, దేశ ప్రజల గురించే ఆలోచించారు. పూర్తి సమయం ఎడిటర్గా, జర్నలిజం ఉపాధ్యాయుడిగా, చివర్లో కాలమిస్ట్గా ప్రతిభావంతంగా పని చేశారు. ఏ కాలమ్కు అయినా ముగింపు తప్పదు. టిజెఎస్ 2022 జూన్ 12న ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’ లో తన చివరి కాలం రాశారు. ఆయన చివరి కాలంలో ఓ పేరా గుర్తు చేసుకోవడం ముఖ్యం. ఆ కాలంలో మనలో కొందరు మన దేశాన్ని విమర్శించకూడదని భావిస్తారు. మరి కొందరు దీనికి పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తారు. మన లాంటి పెద్ద దేశానికి ఎదురయ్యే ఆపదల గురించి అన్ని విధాలుగా హెచ్చరించాలి. ఏ వాదనకైనా మద్దతునిచ్చేవారు, వాటి విమర్శకులు ఉంటారు. వాటిలో కొన్ని మంచి అంశా లు, కొన్ని లోపాలు ఉండవచ్చు. దేశ పాలకులు తమను అస్సలు విమర్శించకూడదని ముఖ్యంగా వార్తా పత్రికలవారు విమర్శించరాని భావించడం ప్రారంభిస్తే, ఏదో తప్పు జరుగుతుంది అని ఆయన రాశారు. కానీ ఎక్స్ప్రెస్ సంప్రదాయం, దాని పాఠకుల అంచనాలకు అనుగుణంగా ఎదిగేందుకు తాను 25 ఏళ్ల పాటు రాయలేకపోయానని ఆయన ఒక దశలో అంగీకరించారు. కాలం మారిపోయింది. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే.. నిజాన్ని నిర్భయంగా, వ్యవస్థాగతంగా, విమర్శనాత్మకంగా ఉండడానికి సంసిద్ధత కలిగి ఉండడమే ప్రాథమిక లక్షణం. అదే ఇప్పుడు జాతి వ్యతిరేకి అని పిలవబడే స్థితికి దారి తీస్తోంది. 2025 అక్టోబర్ 3న టిజెఎస్ మరణించిన ఒక రోజు తర్వాత, ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో మొదటి పేజీలో వచ్చిన నివాళిలో. 1300 కాలమ్లు రాసిన తర్వాత 2022 జూన్ 22న టిజెఎస్ తన కాలాన్ని అంకితం చేశారని పేర్కొంది. నిజానికి ఆయన అలా చేయమని సూచించారు. ఆ వార్తా పత్రిక సంపాదకుడిగా నేను ముగింపు పలుకుతున్న సమయం అది. టిజెఎస్ తన కాలం ఆపాలనే సందేశాన్ని తెలియజేసేందుకు నిరాకరించాను. అలా చేసి ఉంటే, ఆయన కాలమ్ను ఆపివేసిన అపరాధ భావన నాపై ఉండేది. చివరికి ఆ సందేశం ఆయనకు చేరిందని (వాసు) పేర్కొన్నారు. నెలల తర్వాత ముంబై ప్రెస్క్లబ్ టిజెఎస్కు జర్నలిజంలో జీవిత కాల సాధన కోసం ప్రతిష్ఠాత్మకమైన రెడ్ ఇంక్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది. ఎప్పుడూ ప్రచారం కోరుకోని వ్యక్తిగా టిజెఎస్ ఈ గొప్ప దేశంలో వివేకవంతులైన పౌరులతో చాలా కాలం చర్చను కొనసాగించడం గర్వకారణమని పేర్కొనే వారు. ఇప్పుడు ఇతరులు ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైంది. పోరాటం కొనసాగాలి అని ఆయన ఆకాంక్షించారు. ప్రధానంగా బిజెపి ఆధిపత్య విధానాన్ని వ్యతిరేకించిన ఆయన వాస్తవికతను తెలుసుకున్నారు. 2019లో బిజెపి రెండవసారి విజయం సాధించిన వెంటనే, 2029 వరకూ పార్టీ అధికారంలో ఉండకుండా ఎవరూ ఆపలేరని ఆయన చెప్పేవారు. ఆయన తన కాలంలో కూడా అదే చెప్పారు. మీడియా యజమానులకు టిజెఎస్ వంటి కాలమిస్ట్లు ఒక లక్ష్యాన్ని సూచించారు. ఆయనలా నిర్భయంగా రచనలు చేయడం ద్వారా, సంస్థాగత అనుకూలత ద్వారా చేసిన పాపాలు తొలగిపోతాయి. కానీ, కాలం మారింది. 1970ల నుంచి ఈ శతాబ్ది ప్రారంభం వరకూ, బిజెపి పాలన ప్రారంభం వరకూ వార్తాపత్రికలు తాము ఆశించిన విధంగా పనిచేశాయి. ఇక లొంగిపోవక తప్పదని మీడియా సంస్థలు గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ప్రభుత్వ నిధులపై ఆధారపడడం, వారి స్వాతంత్య్రాన్ని కోల్పోయేలా చేసిందని ఓ పెద్ద మీడియా గ్రూప్ యజమాని, సంపాదకుడు ఈ మధ్య అన్నారు. ఇది ఇందిరా గాంధీ హయాంలో విధించిన వంటిది కాదు. స్వీయ సెన్సార్ షిప్ లాంటిది. దీనిపై పోరాడలేము. టిజెఎస్ ఎక్స్ప్రెస్లో రాయడం మానేసిన తర్వాత కూడా ఓ ప్రముఖ మలయాళ వార్తాపత్రిక అప్పుడప్పుడు ఆయన రచనలను ప్రచురించే ధైర్యం చేసింది. వార్తాపత్రికలు, ఛానెళ్లకు ఒకటి కంటే ఎక్కువమంది ఎడిటర్లు ఉన్న యుగంలో మనం జీవిస్తున్నాం. అదృశ్య ఎడిటర్లు ఏ కథను హైలైట్ చేయాలో, దేనిని విస్మరించాలో నిర్ణయిస్తారు. కనిపించే ఎడిటర్లు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీడియా కథనాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని పాలకులు నమ్మడంలో తప్పులేదు. ఇందుకోసం టిజెఎస్, ధ్రువ్ రథీ, పరకాల ప్రభాకర్, మహమ్మద్ జుబైర్, రవీష్ కుమార్ వంటి వారిని అదుపు చేయాలి. టిజెఎస్ మరణించిన తర్వాత ఒక రోజు ప్రధానమంత్రి కార్యాలయం ఆయన కుటుంబానికి సంతాప సందేశం పంపాలనుకున్నట్లు తెలియజేసింది. టిజెఎస్ తో విభేదించినా, ప్రధాని కూడా నివాళి అర్పించకుండా ఉండడం కష్టమైంది.టిజెఎస్ అంత్యక్రియల్లో కనిపించకుండా పోయిన వారిని గమనించడం కష్టం కాలేదు. మీడియా వర్గాలనుంచి పెద్ద ఎత్తున అభిమానులు బెంగళూరులోని శ్మశాన వాటికకు వచ్చి నివాళులర్పించారు. టిజెఎస్ భౌతిక కాయం బూడిదై పోయి ఉండవచ్చు. కానీ ఆ నిప్పులు మండుతూనే ఉంటాయి. ఆయన చేసిన పోరాటం కొనసాగుతుందని ఆశిస్తున్నాం. జిఎస్ వాసు
ఉదయం నోటిఫికేషన్.. సాయంత్రానికి బ్రేక్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఉదయం 10.30 గంటల కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది.మొదటి విడత నోటిఫికేషన్ను రిటర్నింగ్ అధికారులు జారీ చేశారు. వెంటనే మొదటి విడత జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కాగా, సాయంత్రానికి ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. పంచాయతీ ఎన్నికల కోసం దాదాపు ఏడాదిగా గ్రామాలు ఎదురుచూస్తుంటే అనేక గందరగోళాల మధ్య ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై హైకోర్టు రెండు రోజులు విచారించి తాజాగా స్టే ఇచ్చింది. దీంతో ఈ ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ సాయంత్రానికి అర్థరహితంగా నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాలు పాటిస్తాం: ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఇసి) ప్రకటించింది. ఈ మేరకు ఎస్ఇసి గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం 4 లోగా పలువురి నామినేషన్లు రాష్ట్రంలో తొలి విడత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ వెలువడటంతో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జెడ్పిటిసి స్థానాలకు 16 నామినేషన్లు దాఖలు కాగా, ఎంపిటిసి స్థానాలకు 103 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,963 ఎంపిటిసి, 292 జెడ్పిటిసి స్థానాలకు ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై హైకోర్టు సాయంత్రం స్టే ఇచ్చింది. ఆ లోగా పలువురు అభ్యర్థులు ఎంపిటిసి, జెడ్పిటిసి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన నేపథ్యంలో నామినేషన్లు చెల్లుబాటు అవుతాయా..లేక రద్దవుతాయా..? అని అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ నెం .9పై హైకోర్టు స్టే విధించడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పైనా హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత నోటిఫికేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కాగా, రాష్ట్రంలో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ను రద్దు చేస్తున్నట్లు ఎస్ఇసి ప్రకటించింది. గత నెల 29వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. తాజాగా ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేసి, ఎన్నికల కోడ్ను తొలగించింది.
ప్రజాయుద్ధాల కలం, గళం.. సుద్దాల
‘ఓ పాలబుగ్గల జీతగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో’ అంటూ ఆ కన్నీటి వెతలను తడిమిందా కలం, పల్లెటూరి పిల్లవాని ఆర్ద్రత, ఆవేదనలను వినిపించిందా గళం ‘వెట్టిచాకిరి విధానమో రైతన్న, ఎంత చెప్పినా తీరదు కూలన్న’ అంటూ ప్రజల దీనగాథలు రాసిందా కలం. సామాజిక అసమానతలను ప్రశ్నించిందా గళం. ‘ఎత్తరుగులపై పెత్తందారులు అన్ని విధాలుగా దోచుకుని, అందలమెక్కిన మహానుభావులు’ అంటూ వ్యవస్థను నిలదీసిన కలం. జాగరతోయ్ జాగరత అంటూ జనానికి కర్తవ్య బోధన చేసిందా గళం. ‘నిజాంలో ప్రతి బజారులో మా ధ్వజం ఎర్రని జెండా ఎగరేస్తాం’ అంటూ నిజాం ప్రభువుపై పాటల తూటా గురిపెట్టిందా కలం. ప్రజా ప్రభుత్వం సాధిస్తామంటూ ఎలుగెత్తి చాటిందా గళం. ‘వెయ్ దెబ్బకు దెబ్బ వెయ్’ అంటూ నిజాం సైన్యంపై తిరగబడిందా కలం. అచేతన వ్యవస్థను జాగృతపరచిందా గళం. ఆ కలం, గళం సమ్మేళనమే ప్రజాకవి సుద్దాల హనుమంతు. అర్థవంతమైన ఆవేశం, అవగాహనతో కూడిన పరిపక్వ ఆలోచనాభావాలు, సామాజిక స్పృహ అతని కవిత్వంలో పాల పొంగులా ఉప్పొంగుతూనే ఉంటాయి. ప్రజా ఆవేదనలను రాసి, పాడి, ఆడి వారిలో చైతన్యాన్ని నింపిన దివిటి సుద్దాల. ఒక చేత పెన్ను మరో చేత గన్ను పట్టి నిజాం ముష్కరుల వెన్నులోవణుకు పుట్టించిన ధీరుడు. పాత నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో నిరుపేద చేనేత కుటుంబంలో బుచ్చి రాములు, లక్ష్మీనరసమ్మ దంపతులకు సుద్దాల జన్మించాడు.వారికి ఆరుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. వారందరిలో చివరగా జన్మించిన హనుమంతు అసలు ఇంటి పేరు గుర్రం. జీవన పోరాటంలో ఆ కుటుంబం గుండాల మండలం సుద్దాల గ్రామంలో స్థిరపడటంతో ఆ ఊరి పేరు ఆయన ఇంటిపేరుగా మారింది. చిన్నతనంలో చదువుకునే అవకాశాలు లేక వీధి బడిలో ఉర్దూ, తెలుగు భాషలు నేర్చుకున్నాడు. శతకాలు, కీర్తనలు, సీస, కంద పద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలోనే యక్షగానాలు, కీర్తనలు, భజనలు లాంటి కళారూపాలు అంటే ఆసక్తి మెండుగా ఉండేది. తన గ్రామంలో హరికథలు చెప్పే అంజనదాసుకు శిష్యుడిగా ఆయన బృందంలో చేరాడు. చిన్న వయసులోనే బతుకుతెరువు కోసం ఉద్యోగానికి హైదరాబాద్ చేరాడు. ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్గా పని చేశాడు. కానీ సమాజ చైతన్యం లక్ష్యంగా ఉన్న సుద్దాల స్వల్పకాలం మాత్రమే ఉద్యోగం చేసాడు. ఆర్యసమాజం వైపు ఆకర్షితుడై కార్యకర్తగా పని చేశాడు. 1944లో భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో స్వచ్ఛంద కార్యకర్తగా తన కార్యాచరణ మొదలు పెట్టాడు.ఆ మహాసభ ప్రభావంతో సుద్దాల గ్రామంలో సంఘం స్థాపించాడు. ఆ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు, తిరుగుబాటు పోరాటాలు మొదలైనాయి. సంఘం పెట్టి, పాటలు కట్టి ప్రజల్ని ఉద్రేక పరుస్తున్నాడని సుద్దాలపై నిజాం ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పుడే హనుమంతు అజ్ఞాతవాసంలోకి వెళ్లాల్సి వచ్చింది. కొంత కాలం తరువాత అనారోగ్య కారణంగా బయటకు వచ్చి బాల్యంలో తనకున్న సాంప్రదాయ హరికథలు జానపద గేయాలు సభలలో పాడి అందరి మన్ననలు పొందేవాడు. తన కలం, గళం కలగలిపి ప్రజలని ఉద్యమానికి కార్యోన్ముఖులను చేయడంలో సుద్దాల పాత్ర కీలకంగా మారింది. నిజాం దౌర్జన్యాలను పాటల రూపంలో వివరిస్తూ పల్లె పల్లెనా సమావేశాలు నిర్వహణకు సుద్దాల పాటలే ఆయువుపట్టయ్యాయి. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకు వెళ్ళేది పాటే కాబట్టి పాటే పోరాటరూపం దాల్చేది. ఆ పాటల ప్రవాహానికి బలాన్ని బలగాన్ని సమకూర్చిన వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు. ‘నీ బాంచన్ కాల్ మొక్కుతా’ అన్నవారితో బందూకులు పట్టించిన పాటలు ఆయనవి. హరికథ, బుర్రకథ, యక్షగానాలతో బూజుపట్టిన నిజాం నిరంకుశ పాలకుల దొరల, దేశ్ముఖ్ల కోట గోడలను కూల్చివేసిన జనగీతం సుద్దాల. వెట్టిచాకిరి విధానాన్ని వ్యతిరేకిస్తూ దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ అనేక పాటలు రాశాడు. ఇవన్నీ వీర తెలంగాణ పేరుతో అచ్చయ్యాయి. అపారమైన ఆత్మగౌరవం, అలుపెరుగని వీరావేశం అతని పాటకు బలాన్ని సమకూర్చినవి. అంతేకాదు సుద్దాల బుర్రకథ చెపితే గడ్డిపోచ కూడా కరవాలంగా మారేదని నానుడి. అతని బుర్రకథ కోసం ప్రజలు ఎన్ని గంటలైనా ఎదురుచూసేవాళ్లంటే అతిశయోక్తికాదు. సమావేశంలో ఐదు గంటలు పాటు సాంస్కృతిక కార్యక్రమాలు సుద్దాల నిర్వహించే వాడు. దీన్ని బట్టి అయన ఎంత గొప్ప కళాకారుడో మనం అర్ధం చేసుకోవచ్చు. గొల్లసుద్దులు, లత్కోర్సాబ్, బుడబుక్కలు, ఫకీర్ వేషం, సాధువు మొదలైన కళారూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని భావాలని వ్యక్తీకరించాడు. తన కళారూపాలతో సభికులను విశేషంగా ఆకట్టుకునేవాడు. జానపద కళారూపాలకు జీవంపోసి అనేక పాటలను ప్రజలకు అందించాడు. కేన్సర్ వ్యాధితో 1982 అక్టోబర్ 10న సుద్దాల కలం గళం శాశ్వతంగా మూగపోయాయి. ములక సురేష్ 94413 27666
వెలుగు చూసిన మరో డ్రగ్ ఫ్యాక్టరీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ లక్షానికి అనుగుణంగా డ్రగ్స్ నిర్ములనే ధ్యేయంగా మాదకద్రవ్యాలపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపు తోంది. ఎక్కడికక్కడ తనిఖీలు, మెరుపు దాడుల తో డ్రగ్స్ మహమ్మారిని కట్టడి చేస్తోంది. ఈ క్ర మంలో హైదరాబాద్లోని జీడిమెట్లలో 220 కి లోల ఎఫెడ్రిన్ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చే సుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 72 కోట్లు, మన దే శంలో దాదాపు 10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కేసులో నలుగురు నిందితులు శివరామకృష్ణ పరమ వర్మ, దంగేటి అనిల్, ముసిని దొరబాబు, మద్దు వెంకట కృష్ణారావులను అరెస్టు చేయగా, ఎం.ప్రసాద్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడిం చారు. హైదరాబాద్లో ప్రముఖ రసాయన పరిశ్రమలలో డ్ర గ్స్ తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎఫెడ్రిన్ తయారీకి బిగ్ స్కేల్ కెమికల్ యూనిట్ వినియోగిం చినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్ తయారీలో ప్రధాన నిందితుడుగా శివ రామకృష్ణ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్ తయారీకి వాడిన ఫార్ములాను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రధాన నిందితుడు శివ రా మకృష్ణ పరమ వర్మ, అనిల్ కాకినాడకు చెందిన వారు. దొరబాబు ఎపిలోని తూర్పు గోదావరికి చెందినవాడు. మద్దు వెంకట కృష్ణారావు తిరుపతిలోని సూళ్లూరుపేటకు చెందినవాడు. 1995-96 మధ్య కాలంలో నెల్లూరులోని ప్రభుత్వ ఐటి ఐ కళాశాలలో వెల్డింగ్లో ఐటిఐ చేశాడన్నారు. 2011లో తన సోదరుడు ప్రసాద్తో కలిసి జీడిమె ట్ల దూలపల్లిలో సాయి టెక్నో ఇంజనీర్స్ను స్థా పించాడని, 2019లో తన సోదరుడు ప్రసాద్తో కలిసి ఐడీఏ బొల్లారంలో పీఎన్ఎం లైఫ్ సైన్సెస్ను స్థాపించాడని తెలిపారు. సాయి టెక్నో ఇంజనీర్స్లో వారు రియాక్టర్లు, కండెన్సర్లు, రిసీవర్లు, స్టోరేజ్ ట్యాంకులు వంటి రసాయన పరికరాలను తయారు చేస్తారని, పీఎన్ఎం లైఫ్ సైన్సెస్లో వారు ఇతర కంపెనీలకు కెమికల్ జాబ్ వర్క్లు చేస్తారన్నారు. డ్రగ్స్ తయారు చేసిందిలా...! ప్రధాన నిందితుడు శివ రామకృష్ణ పరమ వర్మ డిసెంబర్ -2024 నెలలో స్నేహితుడు స్వామితో కలిసి బొల్లారం ఐడిఎ, పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ అనే ఫ్యాక్టరీకి వెళ్లి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న నిందితుడు అనిల్తో పరిచయం పెంచుకున్నాడన్నారు. ఆ తర్వాత శివ రామకృష్ణ పరమ వర్మ, అనిల్ సుచిత్ర సమీపంలోని రాగా బార్ అండ్ రెస్టారెంట్లో రెండు మూడు సార్లు కలుసుకుని ఎఫెడ్రిన్ మందు తయారీ గురించి చర్చించారని తెలిపారు. అందుకు ప్రతిఫలంగా డబ్బు ఇస్తామని శివ రామకృష్ణ పరమ వర్మ ఆఫర్తో ఆకర్షితుడైన అనిల్ తన కంపెనీ యజమానులు/సహ నిందితులు వెంకట కృష్ణా రావు, ప్రసాద్లతో ఆఫర్ గురించి చర్చించాడన్నారు. శివ రామకృష్ణ పరమ వర్మ తమ ప్రాంగణంలో ఎఫెడ్రిన్ తయారీకి భారీ డబ్బు చెల్లిస్తుండటంతో యజమానులు వెంకట కృష్ణారావు, ప్రసాద్ ఆఫర్కు అంగీకరించి ఉత్పత్తిని కొనసాగించమని అనిల్ను ఆదేశించారన్నారు. డిసెంబర్- 2024 చివరి వారంలో శివ రామకృష్ణ పరమ వర్మ అనిల్కు ఎఫెడ్రిన్ను ఎలా తయారు చేయాలో ఒక ఫార్ములాను అందించాడని తెలిపారు. టోలుయిన్, బ్రోమిన్, అసిటోన్ వంటి ముడి పదార్థాలను సరఫరా చేశాడన్నారు. ఆన్లైన్, బ్యాంక్ బదిలీల ద్వారా రూ.8 లక్షల నగదును కూడా బదిలీ చేశాడని తెలిపారు. ఆ డబ్బుతో అనిల్ మిగిలిన ముడి పదార్థాలను అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఫ్లేక్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సోడియం బోరో హైడ్రైడ్లను కొనుగోలు చేశాడని, శివ రామకృష్ణ పరమ వర్మ అందించిన ఫార్ములా ఆధారంగా అనిల్ ప్రక్రియను పూర్తి చేశాడని తెలిపారు. మూడు దశల ప్రాసెసింగ్ తర్వాత తుది ఉత్పత్తి ఎఫెడ్రిన్ సిద్ధం చేశారన్నారు. ఈ విధంగా వారు దాదాపు 220 కిలోల ఎఫెడ్రిన్ మాదకద్రవ్యాన్ని సంపాదించి హైదరాబాద్లోని జీడిమెట్లలోని స్ప్రింగ్ ఫీల్ కాలనీలోని సాయి దత్తా రెసిడెన్సీలోని శివ రామకృష్ణ పరమ వర్మ నివాస ఫ్లాట్లో పడేశారన్నారు. నిందితులు శివ రామ కృష్ణ పరమ వర్మ, అనిల్, వెంకట కృష్ణారావు, ప్రసాద్లు అవసరమైన కొనుగోలుదారులను పొందడంలో అనిల్ స్నేహితుడు దొరబాబు సహాయం కోరినట్లు పోలీసులు తెలిపారు. నిఘాతో పట్టుబడ్డ డ్రగ్స్ నిందితులు పాత మాదకద్రవ్య నేరస్థులపై ఈగల్ నిఘా ఉంచింది. ఈ తరుణంలో ప్రధాన నిందితుడు వర్మపై, అతడు సందర్శించిన పరిశ్రమల ఆధారంగా రహస్య నిఘాను ఈగల్ కొనసాగించింది. ఈ క్రమంలో గురువారం నిందితులు హైదరాబాద్లోని జీడిమెట్లలోని స్ప్రింగ్ ఫీల్ కాలనీలోని సాయి దత్తా రెసిడెన్సీలోని ఫ్లాట్ నంబర్ 101 వద్ద గుమిగూడినట్లు ఈగల్ టీంకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఈగల్ టీం దాడి చేసి నలుగురు కీలక నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 220 కిలోల ఎ నాణ్యత కలిగిన ఎఫెడ్రిన్ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే, పోలీసుల దర్యాప్తులో బయటపడిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎఫెడ్రిన్ను మెథాంఫెటమైన్గా తయారు చేయవచ్చు, ఖర్చు పది రెట్లు పెరుగుతుంది. ఐడిఎ బొల్లారంలో ఉన్న తయారీ యూనిట్ అంటే, పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. లీజు డీడ్, బోర్డు మీటింగ్ మినిట్స్, బ్యాంక్ లావాదేవీలు, ఐవిలు, ఆర్విలను పరిశ్రమ యజమానులు నిర్వహించరు. ఇది ఎఫెడ్రిన్ తయారీలో వారి ప్రమేయాన్ని స్పష్టపరుస్తోందని ఈగల్ టీం పేర్కొంది. కాగా, సెప్టెంబర్ 5న చర్లపల్లి ఇండస్ట్రియల్ కారిడార్లో కెమికల్ ఫ్యాక్టరీ కేంద్రంగా, ఎండీ (మెఫెడ్రోన్) అనే మాదకద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం దాదాపు రూ.12 వేల కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
సానుకూల నిర్ణయాలతోనే...చెలిమికి బలిమి
మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరి కా తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఇరు దేశాల మధ్య సంబంధాల ను మరింత పెంపొందించేలా ఉండాల ని సిఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అమెరికాలోని హడ్సన్ ఇనిస్టిట్యూట్కు చెందిన వివిధ రంగాలకు చెందిన మే ధావులు, బిజినెస్ లీడర్లతో కూడిన16 మంది ప్రతినిధుల బృందం ఈ సమావేశంలో పాల్గొంది. ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో ఈ ప్రతినిధి బృందం భారత్లో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే గురువారం ఈ బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యింది. మంత్రి శ్రీధర్బాబు, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సం జయ్ కుమార్, సిఎంఓ ముఖ్య కా ర్యదర్శి శేషాద్రి ఈ సమావేశంలో పా ల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవల అమెరికా పెంచిన రాయితీలు, వీసాలపై కఠిన నిబంధనలన్నీ ఆందోళన కలిగించాయని ఆయన తెలిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని సిఎం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్ భవిష్యత్ ప్రణాళికల గురించి సిఎం రేవంత్ వివరించారు. పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఉత్తమమైన విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తుందని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ ప్రపంచ నగరంగా అందరినీ ఆకర్షిస్తోందని, దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీ పడుతోందని, మన మౌలిక సదుపాయాలు, తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ప్రపంచ ప్రమాణాలకు సవాల్గా ఉందని సిఎం అన్నారు. జీఎఎస్డిపి, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని, 2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని సిఎం రేవంత్ అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్లో గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు రీజనల్ రింగ్రోడ్డు, రీజనల్ రింగ్ రైల్, మాన్యుఫాక్చర్ జోన్లు అభివృద్ధి చేస్తున్నామని సిఎం రేవంత్ చెప్పారు. డ్రైపోర్ట్ ఏర్పాటు చేసి పొరుగున ఉన్న ఎపిలో మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్ కనెక్టివిటీ ఉండేలా రవాణా సదుపాయాలు విస్తరిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు హైదరాబాద్ నుంచి అటు చైన్నై వరకు, ఇటు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అభివృద్ధి చేస్తామని, సిటీలో ఇప్పుడున్న మెట్రో రైలును అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి కొత్త మార్గాలను తెరుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. 30 వేల ఎకరాల్లో హైదరాబాద్లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వామ్యాన్ని, మద్దతును ఆహ్వానిస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయని, మొత్తం 500 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావాలని, ఫ్యూచర్ సిటీలో పాలుపంచుకోవాలన్న ఆకాంక్షను సిఎం రేవంత్ వ్యక్తం చేశారు. ‘చైనా+1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందని, అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఏఐ యూనివర్శిటీని ఏర్పాటు చేసే దిశగా హైదరాబాద్లో ఏఐ సిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచనలున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వివరించారు. ఏఐ రంగంలో రాష్ట్రాన్ని దేశానికే స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలన్న ప్రణాళికతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి అన్నారు. ఇప్పటికే పేరొందిన కంపెనీలు హైదరాబాద్లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఏర్పాటు చేశాయని, వీటిని గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్లో ప్రధాన వాటాను సరఫరా చేశాయని, స్వదేశీ కంపెనీలను మరింతగా పెంపొందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నా యన్నారు. హడ్సన్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి, వాల్ స్ట్రీట్ జర్నల్ కాలమిస్ట్ ప్రొఫెసర్ వాల్టర్ రస్సెల్ మీడ్, రేషనల్వేవ్ క్యాపిటల్ పార్టనర్స్ సిఈఓ మార్క్ రోసెన్బ్లాట్, క్రౌ హోల్డింగ్స్ చైర్మన్ హర్లాన్ క్రో, ఈగిల్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు రావెనెల్ కర్రీ, బిల్లింగ్సీ కంపెనీ భాగస్వామి హెన్రీ బిల్లింగ్సీతో పాటు మొత్తం 16 మంది అమెరికా ప్రతినిధి బృందంలో ఉన్నారు.
అరెస్టులు... గృహ నిర్భందాలతో అట్టుడికిన నగరం
బస్ ఛార్జీలకు నిరసనగా బిఆర్ఎస్ చేపట్టిన బస్భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. బిఆర్ఎస్ నాయకులు ముట్టుడికి బయలుదేరకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ముఖ్య నాయకులు కేటిఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితర నాయకులను హౌస్ అరెస్టు చేయడంతో ఒక్కసారిగా నగరంలో ఉద్రిక్తత నెలకొంది. తమ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేసిన విషయం తెలియడంతో బిఆర్ఎస్ కార్యకర్తలు రోడ్లుపైకి వచ్చి నిరసన తెలిపారు. చాలామంది నాయకులు, కార్యకర్తలు బస్భవన్కు ముట్టుడికి బయలుదేరడంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. హరీష్ రావును కోకాపేటలో, కేటిఆర్ను రాయదుర్గం, సబితా ఇంద్రారెడ్డిని శ్రీనగర్ కాలనీలోని ఇంటి వద్ద గృహ నిర్భందం చేశారు. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ను రాజేంద్రనగర్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తర్వాత పోలీసులు వారిని బస్భవన్కు అనుమతించడంతో బిఆర్ఎస్ నాయకులు బస్లో బస్భవన్కు బయలుదేరారు. రేతిబౌలి బస్టాండ్ నుంచి ఎమ్మెల్యేలు బస్సులో ఆర్టిసి బస్భవకు వెళ్లి ఎండి నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. నాయకుల ఇంటి వద్ద భారీ బందోబస్తు... బిఆర్ఎస్ నాయకులు బస్భవన్ను ముట్టడికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బిఆర్ఎస్ నాయకుల ఇంటి వద్ద మంగళవారం రాత్రి నుంచి నిఘా పెట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఇంటి నుంచి బస్భవన్ ముట్టడికి బయటికి రాకుండా ఉండేందుకు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. బయటికి వచ్చేందుకు ప్రయత్నించి నాయకులను ఇంట్లోనే గృహ నిర్భందం చేశారు.
గృహ నిర్బంధాలు, అరెస్టుల మధ్య బిఆర్ఎస్ ఛలో బస్భవన్
మన తెలంగాణ/హైదరాబాద్/సిటీబ్యూరో : పెం చిన ఆర్టిసి చార్జీలను వెంటనే తగ్గించాలని డి మాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ‘చలో బస్ భవన్’ కార్యక్రమం చేపట్టింది. తీవ్ర నిర్బంధాల నడుమ పోలీసుల వలయం దాటుకుని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు,తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, పార్టీ నేతలు గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించి బస్ భవన్కు చేరుకున్నారు. అనంతరం టిజిఎస్ఆర్టిసి ఎండీ నాగిరెడ్డితో కెటిఆర్, హరీష్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని , పద్మారావు భేటీ అయ్యారు. గ్రే టర్ పరిధిలో పెంచిన ఆర్టిసి చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేర కు బిఆర్ఎస్ తరఫున వినతపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా ఆర్టిసి ఎండితో కెటిఆర్ మాట్లాడారు. ప్రభుత్వ బకాయిలపై వివరాలు అడగగా, ‘మహాలక్ష్మి’పథకానికి సంబంధించిన రూ. 1353 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఎండీ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.9246 కోట్ల ఆర్టిసి గ్రాంట్ను విడుదల చేసినట్టు బిఆర్ఎస్ నేతలు తెలిపారు. ఆర్టిసి ఆస్తులను అమ్ముకోవాలని చూస్తూ, అంతిమంగా సంస్థను ప్రైవేట్పరం చేసే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని కెటిఆర్ తీవ్రంగా ఆరోపించారు. ఆర్టిసి ఎండీని కలిసిన అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. తెలంగాణలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపేలా టికెట్ల ధరలు పెంచడం అన్యాయం అని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సును స్వాగతిస్తున్నామని, కానీ బస్సుల సంఖ్య పెంచాలని అన్నారు. ఆడవాళ్లకు ఫ్రీ బస్సు అని చెప్పి మగవాళ్ల నుంచి డబుల్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక చేత్తో ఫ్రీ ఇచ్చి మరో చేత్తో బస్ టికెట్ ధర పెంచడం దారుణం అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా చేయాలో తెలియదు అని, వారికి సర్కస్ నడపడమే తెలుసు అని విమర్శించారు. శాంతియుతంగా బయటకు వచ్చి బస్సు ఎక్కి ఆర్టిసి ఎండికి లేక ఇస్తామంటే అడ్డగోలుగా పోలీసులను దింపి అందర్నీ అరెస్టు చేసిందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గాయని, ఈ నేపథ్యంలో మరోసారి టికెట్ల రూపంలో చార్జీలు పెంచి భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు సేవ కారణంగా నష్టం వస్తే, ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజలపై మోపకూడదని చెప్పారు. ప్రజా రవాణా అనేది ప్రభుత్వ సామాజిక బాధ్యత అని వ్యాఖ్యానించారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వం ఆర్టిసి నష్టాల్లో ఉన్నా భరించిందని గుర్తు చేశారు. ఆర్టిసి లాభాల్లో ఉంటే బస్ ఛార్జీలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు.హైదరాబాద్ నగర ప్రజలపై పెంచిన భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా, ఆర్టిసి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సంస్థ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు. ‘చలో బస్ భవన్’లో ఉద్రిక్తత, బిఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్పై నిరసన ఆర్టిసి చార్జీల పెంపును నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ‘చలో బస్సు’ కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో, ప్రభుత్వం ఆయనతో పాటు పార్టీ నేతలకు బస్సు భవన్ వెళ్లేందుకు అనుమతిచ్చింది. దీంతో, కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్తో కలిసి సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్ (రెతీఫైల్) బస్ స్టాప్ నుంచి బస్సులో బస్సు భవన్ వరకు చేరుకున్నారు. బస్ భవన్కు బయలుదేరిన బిఆర్ఎస్ నేతలను పోలీసులు అక్కడికి పోలీసులు అడ్డుకుంటున్నారు. బస్ భవన్కు అర కిలో మీటర్ దూరంలో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆర్టిసి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, కార్యకర్తలు, నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతోపాటు కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చివరికి, ప్రజాప్రతినిధులను మాత్రమే బస్సు భవన్లోకి అనుమతించారు. బిఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్లపై కెటిఆర్ స్పందిస్తూ, జాస్వామ్యబద్ధంగా బస్సులో కూర్చుని నిరసన తెలియజేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అర్థం లేని నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చార్జీల పెంపు కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే రాష్ట్ర ప్రభుత్వం మా పార్టీ నేతలు అందరిని ఎక్కడికి అక్కడ అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలను అరెస్టు చేయడంపైన ఉన్న ఆసక్తి రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో పెరిగిపోతున్న క్రైమ్ రేటును తగ్గించడం పైన పెడితే మంచిదని పోలీసులకు ప్రభుత్వానికి హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చార్జీలను పెంచిందని వాటిని వెనక్కి తీసుకోవాలని బస్సులో వెళ్లి ఆర్టిసి ఎండికి లేఖ ఇస్తామంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని కెటిఆర్ ప్రశ్నించారు . బిఆర్ఎస్ నేతలందరికీ బస్ టికెట్ కొనుగోలు చేసిన హరీష్రావు బిఆర్ఎస్ భవన్ ఛలో బస్ భవన్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్రావు బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆర్టిసి బస్లో బస్ భవన్కు వెళ్లారు. మెహిదీపట్నంలో ఆయన సహచరులందరికీ స్వయంగా టికెట్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడి పెరిగిన ఆర్టిసి ఛార్జీలతో సామాన్య ప్రజలకు కలిగే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బిఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్లపై హరీష్రావు స్పందిస్తూ, ఆర్టిసి టికెట్ ధరల పెంపుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్కు పిలుపునిస్తే మాజీ మంత్రులు, ఎంఎల్ఎలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గం అని హరీష్రావు మండిపడ్డారు. ఇది అప్రజాస్వామీకం, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. నాయకులను, కార్యకర్తల్ని ఎందుకు అరెస్టులు చేస్తున్నారు.. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు. వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 20 నెలల్లో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారని అన్నారు. భార్యకు ఫ్రీ అని భర్తకు టికెట్ డబుల్ చేశారని, విద్యార్థులకు డబుల్ చేశారని పేర్కొన్నారు. ఆర్టిసి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టిసి ధరలు తగ్గించేవరకు బిఆర్ఎస్ ప్రజా ఉద్యమం చేస్తుందని తెలిపారు.
ముంబై : ప్రపంచ అనిశ్చితత నడుమ భారత్, బ్రిటన్ భాగస్వామ్యం, మిత్రత్వం సుస్థిరతకు కీలక మైలురాయి అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో విస్తృత చర్చలు తరువాత ప్రధాని మోడీ గురువారం ఈ బం ధంపై సంతోషం వ్యక్తం చేశారు. కేవలం ఇరుదేశాలకే కాకుండా ప్రపంచ స్థాయిలో ఆర్థిక ప్రగతి, పురోగమనానికి ఇరుదేశాల మిత్రత్వం ప్రాతిపదిక అవుతోందని తెలిపారు. ఒక్కరోజు క్రితం అత్యంత భారీ , ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కీర్ స్టార్మర్ భారత్కు వచ్చారు. మొ దటిరోజు ఈ వాణిజ్య రాజధానిలో హాలీవుడ్, బాలీవుడ్ చిత్ర సహకారం దిశలో కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోడీ కూడా ఇక్కడికి చేరుకున్న దశలో ఇరువురు నడుమ సుదీర్ఘ చర్చలు బృందాల వారిగా, నేరుగా జరిగాయి.భారత్కు రక్షణ రంగ పటిష్టతకు సంబంధించి బ్రిటన్ నుంచి తేలికపాటి , బహుళార్థక క్షిపణి వ్యవస్థల (ఎల్ఎంఎం) సరఫరాకు ఒప్పందం కుదరింది. భారతీయ వాయుసేన పాటవశక్తిని పెంపొందింపచేసుకునేందుకు ఈ మిస్సైల్ వ్యవస్థలు ఎంతగానో ఉపకరిస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక అత్యంత కీలకమైన రీతిలో సముద్ర మార్గాల నిశిత పర్యవేక్షణ తద్వారా భారతీయ నౌకాశ్రయ వేదికలకు ఎలక్ట్రానిక్ ప్రపుల్సన్ సిస్టమ్స్ సమకూర్చే విషయంలో కూడా ఇరుదేశాల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. దీనితో భారతీయ విస్తారిత తీర ప్రాంతానికి రక్షణ కవచం పటిష్టం అయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. రెండు దేశాల సంయుక్త ప్రాజెక్టులో భాగంగానే తీర ప్రాంత పర్యవేక్షణ వ్యవస్థలను నెలకొల్పుతారు. జులైలో ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టిఎ) కుదరడం స్నేహబందానికి పరాకాష్ట అని ఇరుదేశాల నేతలు వ్యాఖ్యానించారు. సంబంధాల మరింత వృద్ధి, వ్యాపార పురోగతికి ఈ ట్రేడ్ డీల్ దోహదం చేస్తుందని తెలిపారు. బ్రిటన్ ప్రధాని వెంబడి పలు సంస్థలు, పరిశ్రమలకు చెందిన అధినేతలు, కార్యానిర్వాహక అధికారులు, పలువురు విసిలతో కూడిన వంద మందితో కూడిన బృందం రావడం విశేష పరిణామం అయింది. ఇరుదేశాలు సహజసిద్ధ భాగస్వామ్యపక్షాలు. ప్రజాస్వామ్యం , స్వేచ్ఛ, చట్టపరమైన పాలన నిబిడీకృతంగా ఈ బంధం సాగుతుందని స్టార్మర్ సమక్షంలో మోడీ తెలిపారు. భారతదేశపు దక్షత, బ్రిటన్ నైపుణ్యత కలబోతగా సంతరించుకున్న విశిష్ట సమన్వయం అత్యంత కీలకమైనదని తెలిపారు. ఇరుదేశాల మధ్య అత్యంత కీలకం, వ్యూహాత్మకం అయిన వాణిజ్య ఒప్పందం ఖరారు కావడం విశేష పరిణామమనే వాదనతో స్టార్మర్ ఏకీభవించారు. ఈ సందర్భంగానే ఆయన భారతదేశం ఆర్థిక పురోగతి గణనీయం అని ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను మరోసారి ప్రధాని మోడీ నాయకత్వ పటిమను అభినందిస్తున్నానని తెలిపారు. వచ్చే మూడేండ్లలోనే భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక శక్తి కానుందని ఇది నాయకత్వ లక్షణాలతోనే సాధ్యం అన్నారు. వాణిజ్య ఒప్పందం మరింత సమగ్రరీతిలో అమలు అయ్యేందుకు ఏర్పాటు అయిన సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటి (జెట్కో) వల్ల అనేక మంచి ఫలితాలు ఉంటాయని ఇరువురు నేతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య పరస్పర పెట్టుబడులు, విస్తృత స్థాయిలో వాణిజ్య విస్తరణకు అవసరం అయిన దిశలో కమిటి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితి, రష్యా ఉక్రెయిన్ ఘర్షణ ఇతర ప్రపంచ సమస్యల గురించి కూడా ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరువురు ప్రధానుల భేటీకి ముంబైలోని రాజ్భవన్ వేదిక అయింది. ఇక్కడికి వచ్చిన ప్రధాని కీర్కు మోడీ సాదరస్వాగతం పలికారు. ఆ తరువాత ఇరువురు నేతలు సముద్ర తీరంలో ఓ వేదిక వద్ద నిలబడి ఏకాంత చర్చలు జరిపినప్పటి దృశ్యాలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా వెలువరించారు. ఇద్దరూ ఏదో కీలక విషయంపై సీరియస్గా మాట్లాడుకుంటున్నప్పటి ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. * ఉగ్రవాదంపై పోరులో సమిష్టివిధానాలు అవసరం అని భారత్ , బ్రిటన్ ప్రధానులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ బ్రిటన్లో ఖలీస్థానీయుల చర్యలకు సకాలంలో అడ్డుకట్ట వేయాల్సి ఉందని సూచించారు. * భారత్లో బ్రిటన్కు చెందిన విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో తొమ్మిది క్యాంపస్ల ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటికే ఈ దిశలో గురుగ్రామ్ క్యాంపస్లో విద్యా సంవత్సరం ఆరంభమైందని వెల్లడించారు. బ్రిటన్కు చెందిన పలు వర్శిటీల విసీలు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ విద్యారంగంలో పరస్పర సహకారానికి మరింత మార్గం ఏర్పడుతుందని మోడీ తెలిపారు.
మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ’తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి వున్నప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టొరీ అనుకుంటారు. కానీ తెలుసు కదాలో ఒక యూనిక్ పాయింట్ ని టచ్ చేశాం. సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా సర్ ప్రైజ్ అవుతారు. నాకు రొమాంటిక్ స్టొరీస్ చేయడం ఇష్టం. తెలుసు కదాలో మంచి లైట్ హార్ట్టెడ్ ఎంటర్టైన్మెంట్ వుంది. సినిమాలో లవ్, ఎమోషన్, హాస్యం, పాటలు, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ మంచి రొమాంటిక్ డ్రామాని ఫీల్ అవుతారు. -నీరజ చాలా పాషన్తో సినిమా చేశారు. ఆమె విజన్ ఆడియన్స్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇది మంచి ఫీల్గుడ్ ఎంటర్టైనర్. ఇందులో మూడు క్యారెక్టర్స్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. థియేటర్స్లో చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. సిద్దు క్యారెక్టర్ని చాలా ఎంజాయ్ చేస్తారు. రాగ పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. సిద్దుకి అన్ని విభాగాలలో చాలా నాలెడ్జ్ వుంటుంది. ఒక యాక్టర్కి అన్ని విభాగాలపై పట్టు వుండటం అదృష్టం. తన టైమింగ్ అద్భుతం. -రాశి ఖన్నా చాలా క్రమశిక్షణ గల నటి. తమన్ మ్యూజిక్కి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన నేను నటిస్తున్న సినిమాకి మ్యూజిక్ చేయడం ఆనందంగా వుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. బీజీఎం చాలా అద్భుతంగా వుంటుంది. పీపుల్ మీడియా ప్రొడక్షన్ హౌస్ లో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు.
‘ప్రేమంటే’ నుంచి 'దోచావే నన్నే' సాంగ్ రిలీజ్..
హీరో ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ నిర్మిస్తోంది. స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ ’దోచావే నన్నే’ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయింది. అబ్బీ వి వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసింది. శ్రీమణి రాసిన సాహిత్యం హార్ట్ టచ్చింగ్ వుంది. ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఉంది.
శుక్రవారం రాశి ఫలాలు (10-10-2025)
మేషం - జీవిత భాగస్వామి సలహాలను పాటిస్తారు. రెండు మూడు విధాలుగా ఆశించిన కార్యక్రమాలను పురోభివృద్ధిలో నడిపించడానికి కావాల్సిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృషభం - నూతన వ్యాపారాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పలుకుబడి నామమాత్రంగా పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మిథునం - సంఘంలో గౌరవానికి లోటుండదు. కుటుంబ కలహాలు మీ ప్రశాంతతకు భంగం కలిగించే సూచనలు ఉన్నాయి.సహోదరి వర్గానికి సహాయ పడవలసి వస్తుంది.ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం కర్కాటకం - ఆర్థిక విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగం లభిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకునే విషయమై సందిగ్ధత లభించదు. సింహం - ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు గుర్తించడం కష్టతరంగా పరిణమిస్తుంది. మనసుకు తోచింది చేసుకుంటూ పోవడమే తప్ప క్రమశిక్షణ కరువవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒడిదుడుకులు ఏవి ఏర్పడవు. కన్య - పొదుపు పైన దృష్టిని సారించగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి- వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు అనుకూల కాలం. తుల - నూతన ఒప్పందాలు అనివార్య కారణాల వలన వాయిదా పడతాయి. ఇందువలన సమయ నష్టమే తప్ప ఆర్థిక నష్టం ఏర్పడదు. స్థాన మార్పులు ఉండవచ్చు. వృశ్చికం - కీలక నిర్ణయాలు తీసుకోవడానికి శ్రేయోభిలాషులతో సలహాలు సంప్రదింపులు జరుపుతారు. ఒక మంచి కార్యక్రమాలను నిర్వహించడానికి విరాళాలను సేకరిస్తారు. ధనుస్సు - పారిశ్రామిక రంగాలలోని వారికి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు వచ్చే సూచనలున్నాయి. సన్నిహితులు నిపుణులతో సంప్రదించకుండా ఏ ముఖ్య కార్యక్రమాన్ని అమలు చేయకండి. మకరం - సంతానంలో ఏర్పడుతున్న మొండితనాన్ని నివారించడానికి గాను కొత్త మార్గాలను అన్వేషిస్తారు. కొంతమంది ప్రబుద్ధులు స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మీతో స్నేహ హస్తం కలుపుతారు. కుంభం - ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. సంగీత, సాహిత్య కళారంగాలలో ప్రత్యేక అభిరుచిని కలబరుస్తారు. చిన్ననాటి మిత్రులు దగ్గరవుతారు. మానసిక ఆనందం కలుగుతుంది. మీనం - వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ స్థాయి పెరుగుతుంది. కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది గృహోపకరణాలు. శుభకార్యాలు మొదలగు వాటికి అధికంగా ధనం ఖర్చు చేస్తారు.
ప్రపంచకప్.. భారత్కు సౌతాఫ్రికా షాక్
విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్లో ఆతిథ్య టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం విశాఖపట్నం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో సౌతాఫ్రికా మూడు వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (37), స్మృతి మంధాన (23) పరుగులు చేశారు. హర్లిన్ డియోల్ (13) పరుగులు చేసి ఔటైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (9), రోడ్రిగ్స్ (0), దీప్తి శర్మ (4) నిరాశ పరిచారు. అయితే వికెట్ కీపర్ రిచా ఘోష్ అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకుంది. చెలరేగి ఆడిన ఘోష్ 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 పరుగులు చేసింది. స్నేహ్ రాణా (33) ఆమెకు అండగా నిలిచింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్గా దిగిన కెప్టెన్ లౌరా వాల్వర్డ్ (70) జట్టుకు అండగా నిలిచింది. ఇక నడైన్ డి క్లార్క్ చిరస్మరణీయ ఇన్నింగ్స్తో సౌతాఫ్రికా సంచలన విజయం సాధించి పెట్టింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన క్లార్క్ 54 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. చోలె ట్రియాన్ (49) తనవంతు పాత్ర పోషించింది.
ఆ విమాన ప్రమాదంలో రష్యా పాత్ర: పుతిన్ అంగీకారం
మాస్కో : గతేడాది అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది విషాదకరమైందన్న ఆయన, ఆ ప్రమాదానికి రష్యా వైమానిక దళం కారణమని అంగీకరించారు. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియెవ్తో భేటీ సందర్భంగా తొలిసారి దీనిని అంగీకరించిన పుతిన్... ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగిన రోజు ఉదయం .. ఉక్రెయిన్ డ్రోన్లను నాశనం చేసేందుకు క్షిపణులను మోహరించామని, అవి పౌర విమానానికి కొన్ని మీటర్ల దూరంలో పేలిపోయాయని పుతిన్ చెప్పారు. అయితే పౌర విమానానికి నేరుగా క్షిపణి దాడి చేయలేదని, శకలాల వల్లే విమానం దెబ్బతిందని చెప్పారు. అటువంటి విషాద సందర్భాల్లో బాధితులకు పరిహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని , సంబంధిత అధికారులపై చట్టపరంగా చర్యలను పరిశీలిస్తామన్నారు. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం 2024 డిసెంబర్ 25న రాజధాని బాకు నుండి చెచెన్ రాజధాని గ్రోజ్నీకి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. రష్యా వైమానిక దాడుల్లో విమానం దెబ్బతింది.కజకిస్థాన్లో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా, కుప్ప కూలింది. ఈ సమయంలో విమానంలో 67 మంది ఉండగా, 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వలనే తమ విమానం ప్రమాదానికి గురైందని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియెవ్ అప్పట్లో ఆరోపించారు.దీనికి పుతిన్ క్షమాపణ చెప్పినప్పటికీ జరిగిన నేరాన్ని అంగీకరించాలని అలియెవ్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత రష్యాలో స్థానిక పోలీసుల చేతిలో కొందరు అజర్బైజాన్ జాతీయులు ప్రాణాలు కోల్పోవడం , ఇదే సమయంలో బాకులో రష్యన్ల అరెస్టుతో ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది.
రిజర్వేషన్ల జివోపై హైకోర్టు స్టేకు బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే :రాంచందర్ రావు
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడానికి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని - బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. హైకోర్టు స్టే -వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమేనని అన్నారు. హైకోర్టు స్టేకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, - వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన సూచించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ స్వలాభం కోసం బీసీల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఫణంగా పెట్టిందని ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈరోజు ఓబీసీలు ఎదుర్కొంటున్న దురవస్థకు కారణమని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి, న్యాయపరమైన లొసుగులను సరిచేసుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తోందని ఆయన తెలిపారు. ఆగస్టు 31న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్కు పంపినప్పటికీ, గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ఉన్న మూడు నెలల గడువు ముగియకముందే ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం గవర్నర్కు పంపిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆ గడువు పూర్తికాకముందే ప్రభుత్వం తొందరపడి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమని ఆయన విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి చట్టపరమైన లొసుగులను సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూసి, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని రాంచందర్ రావు తెలిపారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ‘బిజెపి అడ్డుకుంటోంది’ అనే దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన అవగాహన లేదా ఆలోచనల స్పష్టత లేదని విమర్శించారు. బిల్లులు తెచ్చి, డిక్లరేషన్లు, ఆర్డినెన్స్ సవరణలు ఇలా న్యాయపరంగా చెల్లుబాటు కాని విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని, చట్టపరంగా తప్పుడు నిర్ణయాలతో బీసీల హక్కులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని మండిపడ్డారు. హైకోర్టులో వచ్చిన ఈ ఫలితానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల, వారి సాధికారత పట్ల నిజమైన చిత్తశుద్ధి లేదని అన్నారు.
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు: కర్ణాటక నిర్ణయం
బెంగళూరు : మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒకరోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులతోపాటు వస్త్రపరిశ్రమ , బహుళజాతి సంస్థలు, ఐటీకంపెనీలు, ఇతర ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈ సెలవు వర్తించనుందని ప్రభుత్వం వెల్లడించింది. “ శ్రామిక మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. నెలసరి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతోపాటు మహిళలకు మానసిక, శారీరక సౌకర్యం అందించాలన్నదే మా ఉద్దేశం. ఈ నిర్ణయం ఉద్యోగినులకు ఎంతగానో ఉపకరించనుంది. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయి. అందుకే ఇక్కడా ఆ సెలవును ఇవ్వాలనుకున్నాం. ” అని క్యాబినెట్ సమావేశం అనంతరం న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగె స్వాగతించారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని హర్షం వ్యక్తం చేశారు. అయితే అసంఘటిత రంగంలో సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే బీహార్, ఒడిశా, కేరళ, సిక్కిం రాష్ట్రాలు ఈ నెలసరి సెలవును అమలు చేస్తున్నాయి. అలాగే జొమాటో , స్విగ్గీ, ఎల్ అండ్ టీ, గోజూప్ వంటి సంస్థలు వేతనంతో కూడిన ఈ సెలవును ఇస్తున్నాయి.
ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం: తేజస్వీ యాదవ్ హామీ
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాము (ఇండియా కూటమి) అధికారం లోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ హామీ ఇచ్చారు. పాట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపే ఇందుకు సంబంధించి ప్రతిపాదిత చట్టాన్ని తీసుకు వస్తామని అన్నారు. “20 ఏళ్లలో రాష్ట్ర యువతకు ఎన్డీయే ఉద్యోగాలు కల్పించలేక పోయింది. మేం అధికారం లోకి వచ్చిన 20 రోజుల్లోనే చట్టాన్ని తీసుకువస్తాం. 20 నెలల్లోనే దీన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వ ఉద్యోగాలపై హామీ ఇచ్చాను. నేను అధికారంలో ఉన్న ఆ కొద్ది కాలం లోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించా. నాకు ఐదేళ్ల సమయం ఉంటే ఎన్ని ఉద్యోగాలు ఇస్తానో మీరే ఊహించుకోవచ్చు” అని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను కాపీక్యాట్ అంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కొన్ని నెలలుగా చేపడుతున్న కార్యక్రమాలు గత ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను పోలి ఉన్నాయని ఆరోపించారు.
టమాటా వాహనాన్ని ఢీకొట్టిన డిసిఎం
టమాటా లోడ్తో వెళ్తున్న బోలెరాను కంది మండలంలో వెనుక నుంచి వస్తున్న డిసిఎం గురువారం ఢీ కొట్టింది. వివరాలిలా ఉన్నాయి. బోలెరా వాహనం టమాటాలను తీసుకుని శంకర్పల్లి నుంచి నారాయణఖేడ్కు బయలు దేరింది. కంది ఆర్టిఎ ఆఫీస్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చి డిసిఎం ఢీకొట్టింది. ఫలితంగా బోలెరా వాహనం దెబ్బతిన్నది. జనం టమాటాను తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. డ్రైవర్ మనోజ్కు గాయాలయ్యాయి.ఇంద్రకరణ్ పోలీస్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
హైదరాబాద్ సిటిలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టిబడింది. నగరంలోని సుచిత్ర సర్కిల్లో ఉన్న కాకినాడకు చెందిన పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీలో ఎఫిడ్రిన్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 220 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 77 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మహిళల వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. వన్డే ప్రపంచకప్లో భాగంగా గురువారం విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మంధాన అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా మంధాన రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మంధాన ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్లు ఆడి 982 పరుగులు చేసింది. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా మంధాన నిలిచింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న 970 పరుగుల రికార్డును మంధాన తిరగ రాసింది. క్లార్క్ 1997లో ఈ రికార్డు సాధించింది.
రెండు తులాల బంగారం కోసం ఒకరి దారుణ హత్య
రెండు తులాల బంగారం, డబ్బు అశ ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చింది. డబ్బు కోసం స్నేహనికి సైతం వెన్నపొటు పొడిచారు. హోమో సెక్స్వల్తో ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారి.. తీరా ప్రాణం తీసే వరకు వచ్చింది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిని దారుణంగా చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హత్య ఆనవాళ్ళు లేకుండా చేసిన ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ ఎసిపి తిరుపతి రెడ్డి గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టిఆర్ జిల్లా, వత్సవాయి మండలం, చిట్యాలకు చెందిన పరిమి అశోక్ (36) ఎం.ఫార్మసీ చదువుకున్నాడు. నాలుగైదేళ్ల క్రితం అతని తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి ప్రయివేట్గా వివిధ పనులు చేసుకుంటున్నప్పటికీ, తద్వారా వచ్చే ఆదాయం అతని జల్సాలకు సరిపోవడం లేదు. దీంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుని వంగతోట వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తనకు తెలిసిన కొందరి వద్ద అప్పులు చేసి సేద్యం చేయగా, నష్టాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతనికి ఖమ్మం క్యూర్ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తున్న తిరుమలాయపాలేం మండలానికి చెందిన కొమ్ము నగ్మా (32)తో ఏర్పడిన పరిచయం కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇదే దశలో ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద కామేపల్లి మండలం, కెప్టెన్ బంజరకు చెందిన గట్ల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ (40)తో అశోక్ కు ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి, ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కానికి దారితీసింది. ఖమ్మం దానవాయిగూడెం సమీపంలోని అశోక్ గదికి వెంకట్ వెళ్ళినప్పుడల్లా అతని ఖర్చులకు కొంత డబ్బు ఇస్తుండేవాడు. ఈ క్రమంలో బల్లేపల్లి సమీపంలోని బాలపేటకు చెందిన పెంటి కృష్ణయ్య అలియాస్ కృష్ణ రామస్వామి అనే వ్యక్తితోనూ కూడా అశోక్కు పరిచయం ఏర్పడింది. ఇది వీరి మధ్య స్నేహం బలపడింది. ధనవంతుడిలా కనిపించే వెంకట్ తన గదికి ఈసారి వచ్చినపుడు అతన్ని ఎలాగైనా చంపి, అతని వద్దగల బంగారం, డబ్బు తీసుకోవాలని అశోక్తోపాటు అతని మిత్రులైన కృష్ణ, నగ్మా పథకం వేశారు. మనిషిని ఎలా చంపాలి, చంపిన మనిషి అవయవాలను ఎలా విడిభాగాలుగా చేయాలి? అనే విషయాలపై యూట్యూబ్లో అశోక్ తెలుసుకున్నాడు. హత్యకు అవసరమైన కత్తులను కూడా కొనుగోలు చేశాడు. సెప్టెంబర్ 15వ తేదీన రాత్రి 8.30 గంటల సమయంలో వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ అశోక్ గదికి వచ్చి నిద్రపోయాడు. ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న నిందితులు గత నెల 16వ తేదీన వెంకట్ నిద్రిస్తున్న సమయంలో నగ్మాను అశోక్ బయట కాపలాగా ఉంచి, నిద్రలో వెల్లకిలా పడుకున్న వెంకట్ గొంతుపై కత్తితో బలంగా నరకడంతోపాటు, మెడపైనా పలుసార్లు పొడిచాడు. దీంతో వెంకట్ తలా, మొండెం వేరయ్యాయి. ఆ తర్వాత అదే కత్తితో వెంకట్ శరీరాన్ని ముక్కలుగా, ముక్కలుగా నరికి కవర్లలో శరీరభాగాలను దూర్చి, దుప్పటిలో మూటగా కట్టి, బైక్పై దుప్పటి మూటను తీసుకువెళ్లి, కవర్లలో కూర్చిన వెంకట్ శరీర భాగాలను కరుణగిరి ప్రాంతంలోని పొదల్లో విసిరేశాడు. ఆ తర్వాత ఘటనకు పాల్పడిన గదిని రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేశాడు. అయితే తన సోదరుడు కనిపించడం లేదంటూ వెంకట్ తమ్ముడు కొండ యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముందు ‘మిస్సింగ్’ కేసుగా నమోదు చేశారు. అయితే ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో ఈ కేసు మిస్సింగ్ నుంచి మర్డర్గా మారింది. మృతుడి సెల్ఫోన్ డేటాను సేకరించడంతో హత్యోందం వెలుగుచూసింది. అశోక్, నగ్మా, కృష్ణ కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక బైక్ ను, హత్యకు గురైన వ్యక్తి నుంచి దోచుకున్న 2.7 తులాల బంగారు గొలుసును, నాలుగు సెల్ ఫోన్లను, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన సింగరేణి సిఐ తిరుపతిరెడ్డి, కామేపల్లి ఎస్ఐ సాయికుమార్, కారేపల్లి ఎస్ఐ గోపి, కానిస్టేబుల్స్ అంజి, ఆనంద్, సంపత్, రాజేష్ను సిపి సునీల్ దత్, ఎసిపి తిరుపతిరెడ్డి అభినందించారు.
Photos : Dude Trailer Launch Event
The post Photos : Dude Trailer Launch Event appeared first on Telugu360 .
ఎన్నికలు ఆగడానికి కారణమైన మాధవరెడ్డి ఎవరు?
ఎన్నికలు ఆగడానికి కారణమైన మాధవరెడ్డి ఎవరు? హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఎంతపని
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 10-10-2025
అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో హడ్సన్ ఇనిస్టిట్యూట్ కు చెందిన
కొబ్బరిబోండాల మాటున గంజాయి అక్రమ రవాణా
కొబ్బరి బోండాల మాటున గంజాయి అక్రమ రవాణా గుట్టును రాచకొండ నార్కొటిక్స్ పోలీస్స్టేసన్, ఈగల్ టీం, ఖమ్మం వింగ్ సంయుక్తంగా రట్టు చేసింది. ముగ్గురు రాజస్థాన్ ట్రాన్స్పోర్టర్లు చోటు నారాయణ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 401 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. గంజాయి అక్రమ రవాణా అవుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ టీం రంగంలోకి దిగింది. రామోజీ ఫిల్మ్ సిటీ, పెద్ద అంబర్పేట్ సమీపంలో విశాఖపట్నం నుండి రాజస్థాన్కు అక్రమంగా 401 కిలోల గంజాయిని రవాణా చేస్తున డిసిఎం వాహనాన్ని అడ్డగించింది. రాజస్థాన్కు చెందిన ముగ్గురు ట్రాన్స్పోర్టర్లను ఈగల్ టీం అరెస్టు చేసింది. కేసులో మొత్తం ఆరుగురు నిందితులు చోటు నారాయణ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్, శ్రీధర్, అషు, పరమేశ్వర్లు ఉండగా, వారిలో ముగ్గురు నిందితులు శ్రీధర్, అషు, రమేశ్వర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఈగల్ టీం తెలిపింది. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్కు చెందిన ఓం బిష్ణోయ్ తన పట్టణంలో గంజాయి రవాణాలో పాలుపంచుకున్నాడు.అతను రాజమండ్రిలోని శ్రీధర్ నుండి అక్రమ వస్తువులను సేకరించి, తన హ్యుందాయ్ వెన్యూలో షిప్మెంట్లను రవాణా చేయడానికి చోటు నారాయణ లాల్ నాయక్ను నియమించుకున్నాడు. అతనికి ప్రతి ట్రిప్కు రూ.25,000 చెల్లించాడు. ఒడిశాలోని జగదల్పూర్లో ఓం బిష్ణోయ్ను అరెస్టు చేసి, తరువాత జైలులో ఉంచినప్పుడు, చోటు నారాయణ లాల్ నాయక్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కిలోగ్రాముకు 2,000 చొప్పున 400 కిలోగ్రాముల గంజాయిని కొనుగోలు చేయడానికి శ్రీధర్తో ప్రత్యక్ష ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత నాయక్ గంజాయిని బికనీర్లోని ఆశుకు కిలోకు 4,000 చొప్పున విక్రయించాలని పథక రచన చేశాడు. ఈ ఆపరేషన్లో రవాణా ఏర్పాట్ల కోసం పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్, పరమేశ్వర్లను కూడా నాయక్ చేర్చుకున్నాడు. తరువాత, అక్రమంగా రవాణా చేసిన వస్తువులను ఒక వ్యాన్లో ఎక్కించి, కొబ్బరికాయల లోడు కింద దాచి, రాజస్థాన్కు వెళ్లాలని పథక రచన చేశారు. కిషన్ లాల్ నాయక్ నడుపుతున్న వ్యాన్కు నాయక్, పుష్కర్ తమ కారులో ఎస్కార్టుగా వెళ్లారు. అబ్దుల్లాపూర్మెట్ ఎక్స్ రోడ్ సమీపంలోని విజయవాడ హైవే వెంట ప్రయాణిస్తుండగా, రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, ఈగల్ టీం, ఖమ్మం వింగ్కు చెందిన సంయుక్త బృందం రెండు వాహనాలను అడ్డగించి చోటు నారాయణ లాల్ నాయక్,కిషన్ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్లను అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి 401.467 కిలోగ్రాముల గంజాయి, వ్యాన్, కారుతో సహా ఐదు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో ఎన్డిపిఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సాహిత్యంలో హంగేరియన్ రచయితకు నోబెల్..
స్టాక్హోమ్ : హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్జ్నా హోర్కె ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘హెర్ష్ 07769’ అనే నవల జర్మనీ లోని సామాజిక అశాంతిని చిత్రీకరించింది. ఈ నవలకే నోబెల్ బహుమతి వరించింది.ఈ నవలలో చనిపోయిన ఇద్దరు అద్బుతమైన వ్యక్తులు తిరిగి వస్తారన్న నమ్మకంతో మోక్షం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద ప్రజల మూఢత్వాన్ని చిత్రీకరించారు. ఇందులో హింస, అందం కలగలసి పోయిందని, ప్రపంచ వినాశనం వంటి తీవ్ర భయానక పరిస్థితుల మధ్య కూడా కళకు ఉన్న అపారమైన శక్తిని తన రచనల ద్వారా బలంగా చాటి చెప్పినందుకు లాస్లోకు ఈ గౌరవం అందిస్తున్నట్టు నోబెల్ కమిటీ అభివర్ణించింది. ఆయన సాహిత్యం సమకాలీన ప్రపంచం లోని సంక్లిష్టతలను, మానవ అస్తిత్వ వేదనను, వినూత్నశైలిలో ఆవిష్కరించారని పేర్కొంది. 07769 నవల తరువాత 1994 లో సినిమాగా డైరెక్టర్ బెలాటార్ రూపొందించారు. ఈ రచనను గొప్ప సమకాలీన జర్మన్ నవలగా పాఠకులు అభివర్ణించారు. అపోకలిప్టిక్ (అలౌకిక) భయాల మధ్య కూడా కళాశక్తిని చాటుతూ ఆయన చేసిన రచనలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. లాస్లో గాఢమైన ఆలోచనలు, మానవ మనస్తత్వాన్ని లోతుగా వ్యక్తపరిచే శైలికి ప్రపంచ వ్యాప్తంగా విమర్శకులు ప్రశంసలు అందుకున్నాయి. గంభీరమైన వాక్య నిర్మాణాలు, నిరాశ, భవిష్యత్తు, గురించి భయపెట్టే ఇతివృత్తాలతో కూడిన పోస్ట్మోడర్న్ ( ఆధునికానంతర )నవలలు రచించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్య రచనలలో ‘సాతాన్ ట్యాంగో’ , ‘ది మెలాంకోలీ ఆఫ్ రెసిస్టెన్స్’ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. ఈ రచనలు మానవుడి ఒంటరితనం, ఆధునిక నాగరికత లోని నిస్సారతపై సాహిత్యపరంగా మంచి పేరు పొందాయి. లాస్లో రచనలు మొదట హంగేరియన్ భాషలో రాయబడినప్పటికీ, అవి అనేక యూరోపియన్ భాషల్లోకి అనువదింపబడ్డాయి. అనేక అంతర్జాతీయ పురస్కారాలు కూడా ఈయనకు లభించాయి. వాటిలో బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ 2015లో లభించింది. సినీ దర్శకుడు బెలా టార్ తీసిన చిత్రాలు కూడా లాస్లో నవలల ఆధారంగా రూపొందడంతో ఆయన రచనలకు అంతర్జాతీయ ఖ్యాతి మరింత పెరిగింది. 1954 లో ఆగ్నేయ హంగేరీలో రొమేనియన్ సరిహద్దుకు సమీపంలో గ్యులా అనే చిన్న పట్టణంలో ఆయన జన్మించారు. ఆయన మొట్టమొదటి నవల ‘సాటం టాంగో’ 1985 లో ప్రచురించారు. ఈ రచన హంగేరీలో సాహిత్య సంచలనం సృష్టించింది. గత ఏడాది దక్షిణ కొరియా రచయిత్రి హాన్కాంగ్కు ఈ బహుమతి లభించింది. హాన్కాంగ్కి ఈ గౌరవం లభించడం ఆసియా సాహిత్యానికి కొత్త ఉత్సాహం కల్పించింది. ఈ సంవత్సరం లాస్లో ఎంపికతో యూరోపియన్ సాహిత్యం మళ్లీ నోబెల్ వేదికపై వెలుగొందింది. ఇక 1901 నుంచి 2024 వరకు 117 సార్లు సాహిత్యంలో నోబెల్ ప్రకటించగా, ఇప్పటివరకు 18 మంది మహిళలు ఈ పురస్కారం అందుకున్నారు.
Pawan’s Promise vs Jagan’s Protest
Politics in Andhra Pradesh was on full display this week. On one hand, former Chief Minister Jagan Mohan Reddy attempted a grand re-entry into public life with his tour in Narsipatnam. On the other hand, Deputy CM Pawan Kalyan walked straight into the heart of a crisis at Uppada and actually tried to fix things. […] The post Pawan’s Promise vs Jagan’s Protest appeared first on Telugu360 .
కంటైనర్ లారీ ఢీకొని హోంగార్డు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్లో కంటైనర్ లారీ ఢీకొని హోంగార్డు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన కూరెళ్ల ఉపేంద్ర చారి (36) రామన్నపేట పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో భాగంగా తెల్లవారుజామున వెహికిల్ చెకింగ్ చేస్తుండగా, భువనగిరి నుండి చిట్యాల వైపు వెళుతున్న లారీ కంటైనర్ అతి వేగంగా హోంగార్డుపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలం వద్ద పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఆసుపత్రికి తరలించారు. నివాళులర్పించిన మాజీ ఎంఎల్ఎ చిరుమర్తిః హోంగార్డు ఉపేంద్రచారి మరణవార్త తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎంఎల్ఎ చిరుమర్తి లింగయ్య రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బిఆర్ఎస్ మండల నాయకులు తదితరులు ఉన్నారు. పోలీసుల చేయూతః హోంగార్డు ఉపేంద్రచారి విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదంలో మరణిచడంతో అతని కుటుంబానికి అండగా, తక్షణమే సిపి సుధీర్బాబు హోంగార్డు సంక్షేమ నిధి నుంచి 10 వేల రూపాయలు, భువనగిరి హెడ్ క్వార్టర్స్ తరపున అడిషనల్ ఎస్పి, ఆర్ఐ, ఆర్ఎస్ఐలు, హెచ్ సిసి, ఉమెన్ పిసిఎస్ కలిసి సమకూర్చిన లక్ష రూపాయలను అడిషనల్ ఎస్పి వినోద్కుమార్, అడ్మిన్ ఆర్ఐ శ్రీనివాస్ హోంగార్డు కుటుంబ సభ్యులకు అందజేశారు.
పుట్లూరు, (ఆంధ్రప్రభ) : అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలోని ఆదర్శ్ పాఠశాలలో
Mass Jathara: Crucial for the Whole Team
Mass Maharaj Ravi Teja hasn’t delivered a strong hit in the recent times. His upcoming movie Mass Jathara is delayed several times and is struggling for the right buzz. The film is announced for October 31st release and the film’s buzz completely depends on the trailer. The songs failed to make an impact. Bhanu Bhogavarapu, […] The post Mass Jathara: Crucial for the Whole Team appeared first on Telugu360 .
అందాలను తిలకించిన పీసీసీఎఫ్
అందాలను తిలకించిన పీసీసీఎఫ్ జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్
వాగు దాటే ప్రయత్నంలో భార్యాభర్తతో పాటు మరొకరు గల్లంతు
జిల్లాలోని పోతిరెడ్డి రెడ్డి చెరువు వద్ద వాగును దాటే ప్రయత్నంలో క్రిష్టాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అంబటాపురం గ్రామానికి చెందిన తనెం బాలయ్య, రాములమ్మ దంపతులిద్దరూ వాగులో కొట్టుకుపోయారు. వీరితో పాటు మరొకరు కూడా గల్లంతు అయినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, మహబూబ్నగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, నవాబుపేట, హన్వాడ, బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్, భూత్పూర్ తదితర మండలాలతో పాటు అనేకచోట్ల భారీ వర్షం కురిసింది. గంటకు పైగా ఉరుములతో కూడిన వర్షపాతం నమోదైంది. నవాబుపేట మండలంలో భారీ వర్షానికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రుద్రారం గ్రామంలో ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కొంతమంది రైతుల ఇళ్లలో దాన్యం, తిండిగింజలు సైతం వర్షార్పణం అయ్యాయి. స్థానిక. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ, వెంకటేశ్వర కాలనీ, మర్లు, వన్టౌన్, పెద్ద చెరువు ప్రాంతం బగీరథ కాలనీ,వీరన్నపేట తదితర కాలనీలో వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్లపై నీరు పెద్ద ఎత్తున చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు.గత రెండు రోజులుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పాత ఇళ్లలో ఉన్న వారు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎక్కడైన ప్రమాదం జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి
జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలం, మారేడుపల్లి గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బింగి సతీష్ తండ్రి చిన్నయ్య 35 రోజూవారీ కార్యక్రమ వ్యవసాయ పనుల్లో భాగంగా వంటచేనుకు మందు పిచికారి చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో పక్కన గల పంటచేలో అమర్చిన విద్యుత్ తీగ షాక్ తగలడంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు విజ్ఞప్తి చేశారు.
టైగర్ సెన్సెస్ కు అటవీ శాఖ రంగం సిద్ధం..
టైగర్ సెన్సెస్ కు అటవీ శాఖ రంగం సిద్ధం.. మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ
బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తోంది: హరీష్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ఆరోపించారు. ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బిసి రిజర్వేషన్ల డ్రామా అని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల అమలు జిఒ నెం.9పై హైకోర్టు స్టే విధించడంపై హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఏనాడైనా బిసి రిజర్వేషన్ల కోసం పాటు పడిందా..? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ఢిల్లీ నేతలతో పోరాటం చేయాలని, అందుకు కలిసి రావడానికి బిఆర్ఎస్ సిద్ధం అని పేర్కొన్నారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బిసిలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని విమర్శించారు. 22 నెలలుగా బిసి రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంతు రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసారు తప్ప, బిసిలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి, తెలివిగా దాన్ని పక్కదోవ పట్టించారని మండిపడ్డారు. బిసిల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జిఒ ఇచ్చి కొత్త నాటకానికి తెరతీసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపి, బిసిల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42 శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడి, పార్లమెంట్లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చాలని డిమాండ్ అన్నారు. బిసిలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించండి.. ఉద్యమ పార్టీగా బిఆర్ఎస్ ఎల్లప్పుడూ బిసిల కోసం గొంతెత్తుతుది... ఢిల్లీని నిలదీస్తుందని హరీష్రావు స్పష్టం చేశారు.
అద్భుత బ్యాటింగ్ తో చెలరేగిన రిచా.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మొదట తడబడినా.. రిచా ఘోష్ అద్భుత పోరాటంతో రేసులో నిలిచింది. రిచా పోరాటంతో భారత్, దక్షిణాఫ్రికా జట్టుకు 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 100 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్రమంలో తన అద్భుత బ్యాటింగ్ తో జట్టును తిరిగి రేసులో నిలబెట్టింది. చివర్లలో స్నేహ్ రాణా (33)తో కలిసి దక్షిణాఫ్రికా బౌలర్లలపై విరుచుకుపడింది. ఈ క్రమంలో కేవలం 77 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సులతో 94 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో భారీ షాట్ కు యత్నించి క్యాచ్ ఔట్ గా వెనుతిరగడంతో తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. ఆ తర్వాత వెంట వెంటనే భారత్ చివరి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో 45.5 ఓవర్లలో టీమిండియా 251 పరుగులు చేసింది.
బాలికల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
బాలికల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం అసిఫాబాద్ జిల్లా
మద్దతు ధరకు మొక్కజొన్న పంట కొనుగోలు
మొక్కజొన్న పంటను మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం సిఎం రేవంత్ రెడ్డితో మద్ధతు ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై చర్చించామన్నారు. మొక్కజొన్న పంటకు కేంద్రం మద్ధతు ధర ప్రకటించినప్పటికి ఇప్పటివరకు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో ముఖ్యమంత్రి సూచనతో రాష్ట్ర ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తుమ్మల ప్రకటించారు. గత సంవత్సరం కేంద్రం కేవలం మద్ధతు ధర ప్రకటనకే పరిమితమై, ఎలాంటి కొనుగోళ్లు జరపకపోయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వమే సుమారు రూ. 535 కోట్లతో రాష్ట్రంలో పండిన జొన్న పంటను మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని, సాగు పరిస్థితులు మెరుగవ్వడంతో సగటున ఎకరాకు 18.50 క్వింటల్ దిగుబడి వచ్చి, మొత్తం 11.56 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్టు మంత్రి వెల్లడించారు. ఈ సీజన్ లో 8.66 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశామని మంత్రి పేర్కొన్నారు. సెప్టెంబర్ 3 వ వారం నుండే మార్కెట్లోకి భారీగా మొక్కజొన్న పంట రావడం వలన ధరలు తగ్గిపోయాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత మార్కెట్ ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి క్వింటాకు రూ. 2,400 కన్నా రూ. 441 తక్కువగా రూ. 1,959 రూపాయలు ఉందని, దీని వలన మొక్క రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 8.66 లక్షల మెట్రిక్ టన్నులు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వంపై రూ. 2400 కోట్ల భారం పడుతుందని, అయినప్పటికి రాష్ట్ర రైతుల ప్రయోజనం కోసం మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రైతులు తమ ఉత్పత్తిని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. రాష్ట్రంలోని మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఈ మద్దతు ధర అవకాశాన్ని వినియోగించుకొవాలని మంత్రి కోరారు. తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు చేయకుండా, మార్క్ ఫెడ్ నిర్వహిస్తున్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రైస్ సపోర్ట్ స్కీం కింద కేంద్రం కొనుగోలు చేసే పెసర, మినుము, సోయాచిక్కుడు, కంది, వేరుశనగ లాంటి పంటలపై కేంద్రం 25 శాతం సీలింగ్ విధించిందని, రైతులు పండించిన పంటలను పూర్తిగా కొనగోలు చేయడానికి ఈ సీలింగ్ అడ్డంకిగా మారుతుందన్నారు. ఈ సీలింగ్ ను దాటి రైతులు పండించిన మొత్తం పంటను మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు మంత్రి తెలిపారు. మొక్కజొన్న, జొన్న లాంటి పంటలకు కేవలం మద్ధతు ధర ప్రకటనలకే పరిమితం కాకుండా ధరలు పడిపోయినప్పుడు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినట్లైతే రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉండదని మంత్రి వివరించారు.
Telangana : హైకోర్టు తీర్పుపై మల్లు భట్టి విక్రమార్క ఏమన్నారంటే?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు
నాలుగు రోజుల్లో రెండు ఆవుల మృతి..!
నాలుగు రోజుల్లో రెండు ఆవుల మృతి..! ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర
జట్టుకు కోహ్లి, రోహిత్ అవసరం ఉంది” – గిల్ స్పందన #viratkohli #rohithsharma #shubmangill #cricket
హైకోర్టు తీర్పుపై ఎలక్షన్ కమిషన్ రియాక్షన్ ఇదే..
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. గురువారం ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, 42 శాతం బిసి రిజర్వేషన్లతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల సంఘం స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకే వ్యవహరిస్తామని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడినట్లు అయ్యింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జిఓ 9 తీసుకొచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ జిఓను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఈ క్రమంలో నిన్న, ఇవాళ రెండు రోజులు.. పిటిషనర్ల తరుఫు న్యాయవాది, అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న హైకోర్టు 42 శాతం బిసి రిజర్వేషన్ల అమలు జిఓతోపాటు ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి నాలుగు వారాలు, పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఆరు వారాలకు వాయిదా వేసింది.
మూడేళ్లుగా కనిపించని యంత్రాలు కుబీర్. ఆంధ్రప్రభ : అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
Pawan Kalyan : ఉప్పాడ మత్స్యకారులకు పవన్ హామీలు ఇవే
ఉప్పాడ మత్స్యకారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు
అనాధ విద్యార్థులకు దుస్తుల పంపిణి.
అనాధ విద్యార్థులకు దుస్తుల పంపిణి. దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి(Rebbanapalle)
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి..
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.. ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ :
వన్డే ప్రపంచకప్: దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. ఆరో వికెట్ కోల్పోయిన భారత్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా తడబడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ వరుస వికెట్లు కోల్పోతోంది. ఇప్పటికే రెండు వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ ను దక్షిణాఫ్రికా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో బెంబేలెత్తిస్తున్నారు. దీంతో టీమిండియా 100 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో శుభారంభం దక్కినా.. తర్వాత క్రమం తప్పకుండా భారత్ వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు స్మృతి మంధానా(23), ప్రతికా రావల్(37)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో భారత్ 102 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అమన్ జ్యోత్ కౌర్, రిచా ఘోష్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో వికెట్ చేజార్చుకోకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం టీమిండియా 33 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.
దేశ బహిష్కరణే శిక్ష! హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న
గిరిజనులకు దుప్పట్లు పంపిణీ దండేపల్లి, ఆంధ్రప్రభ : వార్త సేకరణలోనే కాకుండా సామాజిక
Ys Jagan : నర్సీపట్నానికి జగన్ ఆరుగంటల ప్రయాణం
వైసీపీ అధినేత జగన్ అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం వైద్య కళాశాలను పరిశీలించారు
ప్రశంసించిన స్థానికులు వెల్గటూరు, ఆంధ్రప్రభ : వెల్గటూరు ఎస్సై ఆర్. ఉమా సాగర్(R.
Telangana : హైకోర్టు స్టే ఇస్తే రేవంత్ రెడ్డిదే తప్పిదమా? రాజకీయ దుమారం
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది
42% బిసి రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే.. స్థానిక ఎన్నికలకు బ్రేక్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జిఓ 9పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. రెండు రోజులుగా కొనసాగిన ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు గురువారం జిఓ 9పై స్టే విధిస్తూ తీర్పు వెల్లడించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలు తెలుపేందుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది న్యాయస్థానం. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఆరు వారాలకు వాయిదా వేసింది. బిసి రిజర్వేషన్లతోపాటు ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా కోర్టు స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలకు బ్రేకు పడింది. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందోనని అందరిలో చర్చ నెలకొంది.
సహజంగా తగ్గండిలా.. మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. తిండి-నిద్ర వేళలు ఏవీ సరైన
డి యం హెచ్ ఓ .డా ఈ బి దేవివిశాలాంధ్ర -అనంతపురం : జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. దేవి టోభాకో ప్రీ యూత్ కాంపెయిన్ 3.O ను జెండా ఊపి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు గురువారం ప్రారంభించారు. అక్టోబర్ 9 వ తేదీ నుండి డిసెంబర్ 08 వ తేదీ వరకు పొగాకు వ్యతిరేకంగా ప్రజలలో మరియు ముఖ్యంగా యువతకు అవగాహన […] The post పొగాకు కు యువత దూరంగా ఉండాలి appeared first on Visalaandhra .
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన బాధితులకు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. గ్రామానికి చెందిన డోలు రామాంజనేయులుకు 61,500 రూపాయలు, కోసిగి ఈరమ్మకు 25,000 రూపాయల చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం […] The post ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ appeared first on Visalaandhra .
ఎస్టీపీతో నీటి కాలుష్యాన్ని తగ్గిస్తాం..
ఎస్టీపీతో నీటి కాలుష్యాన్ని తగ్గిస్తాం.. చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఎస్టీపీతో నీటి
Telangana High Court Stays GO 9 Granting 42% BC Quota in Local Body Polls
In a significant development, the Telangana High Court has stayed the implementation of Government Order (GO) 9, which proposed 42% reservation for Backward Classes (BCs) in the upcoming local body elections. The court passed interim orders after two days of detailed arguments, putting a temporary halt to the state government’s move to increase political representation […] The post Telangana High Court Stays GO 9 Granting 42% BC Quota in Local Body Polls appeared first on Telugu360 .
160 గంజాయి మొక్కల స్వాదీనం ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : వ్యవసాయ పంట
ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్ విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 12వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే […] The post ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
పోషణ్ మాహ్ ఉన్నతమైన కార్యక్రమం
పోషణ్ మా ఉన్నతమైన కార్యక్రమం చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : స్వస్త్ నారీ
ఉప్పాడ మత్స్య కారుల సమస్యలపై చర్చించాం: పవన్
అమరావతి: పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదలడం వల్ల మత్యసంపద దెబ్బతింటుందని అన్నారు. ఉప్పాడ మత్స్యకారుల బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పాడ మత్స కారుల సమస్యలపై చర్చించామని తెలియజేశారు. ఉప్పాడ సి ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని, పరిశ్రమల వ్యర్థాల శుద్ధిపై మూడు దశల్లో పరిశీలిస్తాని చెప్పారు. మత్యకారులు ఎక్కడికి చెబితే అక్కడికి మూడ్రోజుల్లో వస్తానని, చేపల వేటను కొనసాగిస్తూ ఉప్పాడలో 7,193 మత్స్య కారుల కుటుంబాలు ఆధారపడ్డాయని పేర్కొన్నారు. పరిశ్రమల వ్యర్థాల శుద్ధిపై మూడు ధశల్లో పరిశీలిస్తానని, రూ. 323 కోట్లతో సి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉందని, ఉప్పాడ సి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంపై ఈ నెల 14న సమావేశం ఉందని, ఉప్పాడ సి ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తానని మాట ఇస్తున్నానని పవన్ కల్యాణ్ హామి ఇచ్చారు. ఉప్పాడ- కొణపాక మధ్యతీర రక్షక పనులు ప్రారంభించామని, పరిశ్రమలకు వ్యతిరేకం కాదని మత్స్యకారులు చెబుతున్నారని అన్నారు. వ్యర్థాలు ఎక్కడ కలుస్తున్నాయో.. అక్కడికే బోటులో వెళ్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 323
మానవతాన్ని చాటుకున్న వన్టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని ఎల్సికేపురం, వైయస్సార్ సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనాలు రెండు డి కొనగా, అప్పుడే అక్కడే విధులలో ఉన్న వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ ఆ ప్రమాదాన్ని గమనించి, వెనువెంటనే తన వాహనంలో క్షతగాత్రులను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అనంతరం ప్రభుత్వ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వారు కోరారు. దీంతో స్థానికులు వన్ టౌన్ సీఐ మానవత్వాన్ని చాటుకుని చాటుకున్నారని, ఇప్పటికే వన్ టౌన్ పరిధిలో సిఐకు మంచి […] The post మానవతాన్ని చాటుకున్న వన్టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ appeared first on Visalaandhra .
రెండో అంతస్తుపై కొండచిలువ #indianpython #bachupally #kondachiluva #telugupost #viralvideo #news
Telangana : తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. జీవో 9పై స్టే
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో సంచలన నిర్ణయం ప్రకటించింది. జీవోనెంబరు 9 పై స్టే విధించింది
వీటి సేవలు మధుర జ్ఞాపకం మాత్రమే!
వీటి సేవలు మధుర జ్ఞాపకం మాత్రమే! మక్తల్, ఆంధ్రప్రభ : సాంకేతిక పరిజ్ఞానం
వైయస్సార్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా ముగ్గురి ఎంపిక
విశాలాంద్ర ధర్మవరం ; వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన పెద్దిరెడ్డి శ్రీనివాసులు, గోరకాటి పురుషోత్తం రెడ్డి, గడ్డం కుళ్లాయప్పలను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మవరం ట్రస్టర్ 2 పట్టణ అధ్యక్షులు కోటిరెడ్డి బాల్రెడ్డి ఆధ్వర్యంలో వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపికైన వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధికి నిరంతరం పోరాటం చేస్తామని, ప్రజా […] The post వైయస్సార్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా ముగ్గురి ఎంపిక appeared first on Visalaandhra .
డిజైనర్ నాగరాజును ఘనంగా సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు…
అధ్యక్షులు సంకారపు జయశ్రీవిశాలాంధ్ర ధర్మవరం : పట్టణానికి చెందిన డిజైనర్ నాగరాజ్ చేనేత డిజైన్ డెవలప్మెంట్ నందు జాతీయ అవార్డును కేంద్ర మంత్రుల ద్వారా న్యూఢిల్లీలో భారత్ మండపమునందు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ వారి స్వగృహంలో డిజైనర్ నాగరాజును ఘనంగా సన్మానించారు. అనంతరం జయశ్రీ మాట్లాడుతూ దేశ, రాష్ట్రస్థాయిలో డిజైనర్ నాగరాజు చేనేత వృత్తికి, పరిశ్రమకు మంచి గుర్తింపును తేవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇలాంటి […] The post డిజైనర్ నాగరాజును ఘనంగా సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు… appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition | బీసీ రిజర్వేషన్లు.. స్థానికంపై హైకోర్టు స్టే|
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-10-2025, 4.00PM బీసీ రిజర్వేషన్లు.. స్థానికంపై హైకోర్టు
Siddu’s Telusu Kada Pre-Trailer: Intriguing and Fun
Telusu Kada starring Siddhu Jonnalagadda, Raashii Khanna, Srinidhi Shetty has become one of the most anticipated films in Telugu Cinema. The movie teaser, promotional material and mainly, songs have become viral hits. S Thaman did a brilliant job in building massive buzz for the film, as a composer. The makers have announced the trailer release […] The post Siddu’s Telusu Kada Pre-Trailer: Intriguing and Fun appeared first on Telugu360 .