SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌ దండేపల్లి, ఆంధ్రప్రభ : టూర్‌కు వెళ‌తానంటే తండ్రి డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని

ప్రభ న్యూస్ 26 Oct 2025 2:22 pm

20 ఏళ్ల వయసులో కొమురం భీం ఉద్యమం చేశారు : మోడీ

ఢిల్లీ: బ్రిటీష్ వారి దోపిడికి అంతులేకుండా ఉండేదని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. అప్పట్లో హైదరాబాద్ ప్రజలపై దమనకాండ తీవ్రంగా ఉండేదని అన్నారు. మన్ కీ బాత్ లో కొమురం భీంను మోడీ కీర్తించారు. 20వ శతాబ్దం తొలినాళ్లలో స్వాతంత్ర్యం సుదూరస్వప్నంగా ఉండేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మన్ కీ బాత్ లో మాట్లాడుతూ.. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపైనా, బ్రిటీషర్ల అకృత్యాలపైనా.. 20 ఏళ్ల వయసులో కొమురం భీం ఉద్యమించారని అన్నారు. జనం భూములు నిజాం లాక్కునేవాడు, పన్నులతో వేధించేవాడని మండిపడ్డారు. నిజాం పోలీసు అధికారిని కొమురం భీం చంపారని, అరెస్టు కాకుండా కొమురం భీం తప్పించుకుకోగలిగారని మోడీ తెలియజేశారు. ప్రజల హృదయాల్లో, ముఖ్యంగా ఆదివాసీల మనస్సుల్లో కొమురం భీం సుస్థిరస్థానం సంపాదించారని, కొమురం భీం నుంచి యువత ఎంతో నేర్చుకోవాలని నరేంద్ర మోడీ సూచించారు. 

మన తెలంగాణ 26 Oct 2025 2:17 pm

హర్షిత్‌కు గంభీర్ వార్నింగ్.. చిన్ననాటి కోచ్ ఏమన్నారంటే..

ఆసియా కప్‌లో అంతగా రాణించకపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీం ఇండియా జట్టులో హర్షిత్ రాణాకు చోటు దక్కింది.ఈ విషయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అతడిని వెనకేసుకు వచ్చారు. అయితే ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ హర్షిత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో గంభీర్.. హర్షిత్‌కి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. తర్వాత మ్యాచ్‌లో సరిగ్గా ఆడపోతే.. జట్టు నుంచి తీసేస్తానని గంభీర్ హెచ్చరించారని హర్షిత్ చిన్ననాటి కోచ్ శ్రవణ్ వెల్లడించారు. హర్షిత్ మ్యాచ్‌కి ముందు తనకు ఫోన్ చేశాడని.. తన ప్రదర్శనపై బయట నుంచి వస్తున్న విమర్శలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పాడని శ్రవణ్ అన్నారు. దీంతో ‘‘నిన్ను నువ్వు విశ్వసించు’’ అని చెప్పానని తెలిపారు. కొందరు క్రికెటర్లు గంభీర్‌కి సన్నిహితులను బయట టాక్ నడుస్తోంది. కానీ, ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తించి.. వారికి మద్దతుగా గంభీర్ ఉంటాడని పేర్కొన్నారు. గంభీర్ మద్ధతుగా నిలిచిన క్రికెటర్లు కెరీర్‌లో ఎన్నో అద్భుతాలు చేశారని తెలిపారు. హర్షిత్‌ని నిజానికి తీవ్రంగా మందలించారు. అతడి ఇంకా23 ఏళ్లే.. నెమ్మదిగా నేర్చుకుంటాడు అని శ్రవణ్ అన్నారు.

మన తెలంగాణ 26 Oct 2025 2:16 pm

ఇదే కాంగ్రెస్ రెండేళ్ల పాల‌న మార్క్‌

ఇదే కాంగ్రెస్ రెండేళ్ల పాల‌న మార్క్‌ హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ‌లో అన్నివ‌ర్గాల‌ను

ప్రభ న్యూస్ 26 Oct 2025 2:14 pm

పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..

పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. త్రిపురారం, ఆంధ్రప్రభ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలం

ప్రభ న్యూస్ 26 Oct 2025 2:01 pm

పోలీస్ సిబ్బందికి కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశం

పోలీస్ సిబ్బందికి కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశం మంగినపూడి బీచ్‌ను సందర్శించిన కలెక్టర్

ప్రభ న్యూస్ 26 Oct 2025 2:00 pm

Parichayamey From Aaryan: Enchanting & Soulful

After the superb response to the first single I’m The Guy, the team of Aaryan has now unveiled their second song, Parichayamey. Composed by Ghibran, it’s a heartfelt and soulful melody. Set against the film’s gripping investigative backdrop, the song traces how professional association slowly turns into affection and eventually blooms into a deep, emotional […] The post Parichayamey From Aaryan: Enchanting & Soulful appeared first on Telugu360 .

తెలుగు 360 26 Oct 2025 1:48 pm

ఘనంగా గంగ హారతి

ఘనంగా గంగ హారతి తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : జ‌లాశాయలు నిండుకుండ‌లా మార‌డం

ప్రభ న్యూస్ 26 Oct 2025 1:48 pm

సీమ ప్ర‌జ‌ల ఆగ్ర‌హం చూస్తారు!

సీమ ప్ర‌జ‌ల ఆగ్ర‌హం చూస్తారు! రాయలసీమ ప్రాణాధారం శ్రీశైలంసాగునీటి సమితి రాష్ట్ర అధ్యక్షుడు

ప్రభ న్యూస్ 26 Oct 2025 1:43 pm

పోలీసు ఓపెన్ హౌస్‌లో తిరుపతి చిన్నారులు ఆశ్చర్యం

పోలీసు ఓపెన్ హౌస్‌లో తిరుపతి చిన్నారులు ఆశ్చర్యం తిరుపతి ప్రతినిధి, ఆంధ్రపభ :

ప్రభ న్యూస్ 26 Oct 2025 1:37 pm

పోలీసు ఆయుధాల ప్రదర్శన

పోలీసు ఆయుధాల ప్రదర్శన విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించిన చిత్తూరు ఎస్పీ చిత్తూరు,

ప్రభ న్యూస్ 26 Oct 2025 1:30 pm

సోమవారం రాశి ఫలాలు (27-10-2025)

మేషం - అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో ఎదురైనా చికాకులు తొలగి ఊరట చెందుతారు. వృషభం - పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానమునకు విద్యావకాశాలు. మిథునం - కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. వాహన యోగం. కర్కాటకం - శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సింహం - పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఇంటాబయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు. కన్య - కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. విద్యా,ఉద్యోగవకాశాలు పొందుతారు. తుల - కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. వృశ్చికం - పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలకు, ఇంక్రిమెంట్లు పొందుతారు. విలువైన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ధనుస్సు- ఇంటాబయటా ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మకరం - ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వస్తు, వస్త్రాలు కొనుగోలు. కుంభం - ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనాలు, గృహాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. మీనం - రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. భూములు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు.  

మన తెలంగాణ 26 Oct 2025 1:29 pm

క‌లెక్ట‌ర్ జంగాలపల్లి, పల్లం చెరువుల ప‌రిశీల‌న‌

క‌లెక్ట‌ర్ జంగాలపల్లి, పల్లం చెరువుల ప‌రిశీల‌న‌ ఏర్పేడు, అక్టోబర్ 26 (ఆంధ్రప్రభ): ఏర్పేడు

ప్రభ న్యూస్ 26 Oct 2025 1:24 pm

29న హాజ‌రు కావాల‌ని పీడీ, ఏపీఎంల‌కు ఆదేశాలు

29న హాజ‌రు కావాల‌ని పీడీ, ఏపీఎంల‌కు ఆదేశాలు ఊట్కూర్, ఆంధ్ర‌ప్ర‌భ : నారాయణపేట

ప్రభ న్యూస్ 26 Oct 2025 1:18 pm

జమ్మలమడుగులో దంపతుల హత్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో దారుణం వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. గ్రామ శివారులో ఇటుకల బట్టి వద్ద నిద్రిస్తున్న సమయంలో దంపతుల తలలను దుండగులు పగలగొట్టి చంపారు. హత్యకు గురైన వారు నాగప్ప, పెద్దక్కలుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 26 Oct 2025 1:04 pm

మ‌లేసియాలో స్టెప్పులు వేసిన అమెరికా అధ్య‌క్షుడు

మ‌లేసియాలో స్టెప్పులు వేసిన అమెరికా అధ్య‌క్షుడు ఆంధ్ర‌ప్ర‌భ ఇంట‌ర్నేష‌న్ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 26 Oct 2025 1:02 pm

టీం ఇండియాకు షాక్.. కీలక ఆటగాడికి గాయం

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో టీం ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో ఓడినప్పటికీ.. చివరి వన్డేలో మాత్రం భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. అయితే ఈ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జట్టు కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. చివరి వన్డేలో క్యాచ్ అందుకొనే క్రమంలో అతడి ప్రక్కటెముకలకు గాయమైంది. దీంతో డాక్టర్లు అతడిని నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఇదే జరిగితే సౌతాఫ్రికా సిరీస్‌కి శ్రేయస్ దూరమయ్యే అవకాశం ఉంది. ఓ బిసిసిఐ సీనియర్ అధికారి దీనిపై మాట్లాడుతూ.. మ్యాచ్ జరుగుతుండానే శ్రేయస్‌ని స్కానింగ్‌లకు పంపించామని తెలిపారు. ‘‘ప్రాథమిక నిర్ధారణ ప్రకారం.. శ్రేయస్ ఎడమ ప్రక్కటెముకలలో చిన్న ఫ్రాక్చర్ ఉంది. అతడు కనీసం మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంది. ఇది హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయితే ఎక్కువ సమయం పట్టొచ్చు. సౌతాఫ్రికా సిరీస్‌కి అతడు అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేము. మూడు వారాలలో అతడు కోలుకుంటే సౌతాఫ్రికా సిరీస్‌లో పాల్గొనే అవకాశం ఉంది’’ అని అన్నారు. 

మన తెలంగాణ 26 Oct 2025 1:00 pm

మొంథాపై అధికారుల‌కు కలెక్టర్ వినోద్ కుమార్ సూచ‌న‌లు

మొంథాపై అధికారుల‌కు కలెక్టర్ వినోద్ కుమార్ సూచ‌న‌లు బాపట్ల కలెక్టరేట్ అక్టోబర్ 26

ప్రభ న్యూస్ 26 Oct 2025 12:44 pm

తుపానుపై తిరుపతి కలెక్టర్ వార్నింగ్

తుపానుపై తిరుపతి కలెక్టర్ వార్నింగ్ ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి : “మొంథా” తుఫాను

ప్రభ న్యూస్ 26 Oct 2025 12:36 pm

కర్నూలు బస్సు ప్రమాదం కేసులో బిగ్ ట్విస్ట్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం కేసులో ట్విస్ట్‌ నెలకొంది. శివశంకర్‌ బైక్‌ ప్రమాదంపై ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్సు ప్రమాదం జరగడానికి ముందే బైక్‌ ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి ఫిర్యాదు చేశాడు. శివశంకర్‌ బైక్‌పై వెనక ఎర్రిస్వామి కూర్చున్నాడు. బైక్‌ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో శివశంకర్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్వల్పంగా గాయపడిన ఎర్రిస్వామి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎర్రిస్వామి ఫిర్యాదుతో మృతిచెందిన శివశంకర్‌పై కేసు నమోదు చేశారు. 281, 125(a), 106(1) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శివశంకర్‌తో కలిసి మద్యం సేవించానని ఎర్రిస్వామి తెలిపాడు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడంతోనే బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిందన్నారు. శివశంకర్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందాడని వివరణ ఇచ్చాడు. రోడ్డపై ఉన్న బైక్ ను మరో వాహనం ఢీకొట్టడంతో రోడ్డు మధ్యలోకి వచ్చిందన్నాడు. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 26 Oct 2025 12:34 pm

సాఫ్ట్‌బాల్ క్రీడ విస్త‌ర‌ణ‌కు కృషి

సాఫ్ట్‌బాల్ క్రీడ విస్త‌ర‌ణ‌కు కృషి సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆముదాలవలస ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 26 Oct 2025 12:21 pm

ప్రభుత్వం బాధితులకు పట్టాలు ఇవ్వాలి : కవిత

హైదరాబాద్: చేతికి వచ్చిన పంటను ధ్వంసం చేయడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రకాష్ కుటుంబానికి పంట నష్ట పరిహారాన్ని కలెక్టర్ వెంటనే చెల్లించాలని అన్నారు. రెండో రోజు జనం బాటలో కవిత పర్యటించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు భూముల బాధిత రైతు ప్రకాష్ కుటుంబాన్నికవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబానికి పంట నష్ట పరిహారాన్ని కలెక్టర్ వెంటనే చెల్లించాలని, బాధితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని కోరారు. మంచిప్ప రిజర్వాయర్ ముంపు తగ్గిస్తామని చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల పోడు భూములకు ఎందుకు పట్టాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గిరిజన రైతులను ఫారెస్ట్ అధికారులు వేధించడం మానుకోవాలి అని కవిత విజ్ఞప్తి చేశారు. 

మన తెలంగాణ 26 Oct 2025 12:14 pm

చాదర్ఘాట్ కాల్పుల కేసులో కొనసాగుతున్న విచారణ.... ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

హైదరాబాద్: చాదర్ఘాట్ కాల్పుల కేసులో విచారణ కొనసాగుతుంది. మరోసారి విక్టోరియా గ్రౌండ్స్లో క్లూస్ టీమ్ దర్యాప్తులో చేస్తోంది. చాదర్‌ఘాట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పుల ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులకు డిసిపి చైతన్య ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలను పొందుపరిచారు. కోఠి వద్ద ఓ వ్యక్తి మొబైల్ స్నాచింగ్ చేసి ఆటోలో పారిపోయేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నించారు. ఆటోలో మొత్తం ముగ్గురు పారిపోతుండగా ఒమర్ ను పట్టుకునేందుకు తన గన్ మెన్ మూర్తి ప్రయత్నించాడని డిసిపి తెలిపాడు. ఒమర్ నెట్టడంతో తాము కిందపడిపోయామని, గన్ మెన్ ను కత్తితో పొడిచి చంపేందుకు ఒమర్ ప్రయత్నించడంతో తాను కాల్పులు జరిపానని వివరణ ఇచ్చాడు. ఈ సమయంలో మిగతా ఇద్దరు దొంగలు ఆటోలో పారిపోయారన్నారు. తన గన్ మెన్ ను కాపాడేందుకు కాల్పులు జరిపానని డిసిపి వెల్లడించారు. దీంతో చైన్ స్నాచర్పై డిసిపి కాల్పులు జరిపారు. వెంటనే రౌడీ షీటర్ ఒమర్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఒమర్కు వైద్య పరీక్షలు పూర్తికాగానే ఇవాళ అతడికి వైద్యులు ఆపరేషన్ నిర్వహించనున్నారు.

మన తెలంగాణ 26 Oct 2025 12:12 pm

అప్ర‌మ‌త్తంగా ఉండండి

అప్ర‌మ‌త్తంగా ఉండండి అధికారుల‌కు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం(ఆంధ్రప్రభ బ్యూరో), శ్రీకాకుళం, అక్టోబర్ 26:

ప్రభ న్యూస్ 26 Oct 2025 12:02 pm

జమ్మలమడుగులో దారుణం

జమ్మలమడుగులో దారుణం ( కడప, ఆంధ్రప్రభ బ్యూరో) : కడప జిల్లాలో ఓ

ప్రభ న్యూస్ 26 Oct 2025 11:55 am

నవీన్ యాదవ్ గెలుపు కోసం కాపులంతా ఐక్యంగా కష్టపడాలి: పొన్నం

హైదరాబాద్: బలహీన వర్గాలకు చెందిన యువకుడు, చదువుకున్న నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాపు, మున్నూరు కాపు వేరు వేరు కాదని, నవీన్ యాదవ్ గెలుపు కోసం కాపులంతా ఐక్యంగా కష్టపడాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా కాపు సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.  స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాపు వర్గానికి అవకాశాలు కల్పిస్తామన్నారు. కాపు సోదరులకు ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను, వి హనుమంతరావు కూడా రాజకీయాలలో ముందంజలో ఉన్నామన్నారు. కష్టపడితేనే రాజకీయాలలో ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో  మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, శ్యామ్ మోహన్, గాలి అనిల్ కుమార్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుండి మున్నూరు కాపు సోదరులు భారీగా హాజరయ్యారు.  

మన తెలంగాణ 26 Oct 2025 11:55 am

బ‌డికి డుమ్మా కొట్టాడ‌నే..

బ‌డికి డుమ్మా కొట్టాడ‌నే.. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన డీఈఓశ్రీ సత్య సాయి బ్యూరో,

ప్రభ న్యూస్ 26 Oct 2025 11:47 am

నీట మునిగి..

నీట మునిగి బాలుడు మృతి.. వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు

ప్రభ న్యూస్ 26 Oct 2025 11:36 am

కార్మిక సంఘం ఎన్నికల్లో బిజెపిపై బిఆర్ఎస్ విజయం

హైదరాబాద్: కార్మిక సంఘం ఎన్నికల్లో బిజెపిపై బిఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. కార్మిక సంఘం ఎన్నికల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించారు. దీంతో బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు చేసుకున్నాయి. కార్మిక సంఘం ఎన్నికల్లో బిజెపి ఎంపి రఘునందన్ రావుపై బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజయ ఢంకా మోగించారు. బాలానగర్ ఎంటిఎఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలోని కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలో భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గెలుపొందారు. 

మన తెలంగాణ 26 Oct 2025 11:35 am

ట్రావెల్ బస్సులో పొగలు.. తప్పిన ప్రమాదం

అమరావతి: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వద్ద బస్సులో పొగలు వ్యాపించాయి. బెంగుళూరు వెళ్తున్న సాయి సింధు ఓల్వో బస్సులో ఆకస్మాత్తుగా పొగలు దట్టంగా అలుముకున్నాయి. డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. మరో ట్రావెల్స్ బస్సును యాజమాన్యం ఏర్పాటు చేసింది. స్థానికులు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పొగలు ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కర్నూలు సమీపంలో ఒక బస్సులో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన మరవకుండానే ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 26 Oct 2025 11:27 am

Varun Tej is Back to Work

Mega hero Varun Tej has been on a paternity break and is spending time with his new born son. The actor has taken a break from work and the shoot of Korean Kanakaraju has taken a small pause. After completing all the celebrations, the shoot of Korean Kanakaraju has resumed and the new schedule of […] The post Varun Tej is Back to Work appeared first on Telugu360 .

తెలుగు 360 26 Oct 2025 11:26 am

పిపిపి విధానాన్ని నిర‌సిస్తూ

28న వైసిపి ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా ఉద్య‌మం — మాజీ ఎంపీ భ‌ర‌త్ రామ్ విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి ; రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల‌ను ప్ర‌యివేటు ప‌రం చేయ‌డాన్ని నిర‌సిస్తూ, ఈ నెల 28వ తేదీన ప్ర‌జా ఉద్య‌మాన్ని చేప‌డుతున్న‌ట్లు మాజీ ఎంపీ భ‌ర‌త్ రామ్ స్ప‌ష్టం చేశారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం స్థానిక విఎల్ పురంలోని పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం నిసిగ్గుగా ప్ర‌జా […] The post పిపిపి విధానాన్ని నిర‌సిస్తూ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 11:16 am

కేరళ లాటరీ తో మోసపోకండి

విశాలాంధ్ర – తాళ్లపూడి : కేరళ లాటరీ మోసానికి గురైన వ్యక్తి గురించి ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే తాళ్లపూడి కి చెందిన ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ కొన్న కొత్తలో మీకు లాటరీ తగిలింది బ్యాంక్ అకౌవుంట్ 16వేల 500 రూపాయలు కట్టాలని, 70 లక్షల లాటరీ తగిలిందని ఆగంతకులు ఫోన్ చేశారు. తరువాత 33 వేలు వేస్తే టాక్స్ చెల్లించి మిగతా డబ్బు అకౌంట్ లో వేస్తామని బ్రమ కలిగించారు. ఇదేదో […] The post కేరళ లాటరీ తో మోసపోకండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 11:11 am

గోదావరి హారతి కార్యక్రమం రద్దు

విశాలాంధ్ర -కొవ్వూరు : గోష్పాద క్షేత్రంలో ఈనెల 27వ తేదీన జరగనున్న గోదావరి హారతి కార్యక్రమం రద్దయిందని దాస సాహిత్య ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎన్ వి శివరామకృష్ణ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గోదావరి హారతి కార్యక్రమం మంతా తుఫాన్ కారణంగా రద్దయిందని మరల ఎప్పుడు జరగనున్న విషయం వచ్చే నెల మూడో తారీఖున సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయిస్తామని దాస సాహిత్య ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ఎన్.వి శివరామకృష్ణ, కలగర […] The post గోదావరి హారతి కార్యక్రమం రద్దు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 11:05 am

సైక్లోన్

సైక్లోన్ వర్షాలు దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విశాలాంధ్ర -కొవ్వూరు: ఈనెల 27,28,29., తేదీలో భారీ వర్షాలు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొవ్వూరు ఆర్డిఓ రాణి సుస్మిత అన్నారు. ఆర్టీవో రాణి సుస్మిత శనివారం విలేకరులతో మాట్లాడుతూ అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడతాయని మంతా తుఫాన్ 27 28 29 తేదీలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఎవరూ బయటికి వెళ్లకూడదని ఇంట్లోనే ఉండాలని అత్యవసరం అయితే […] The post సైక్లోన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 11:00 am

నాగయ్య నాగప్ప నాగరాజా

– సందడిగా మారిన పుట్టలు ప్రదేశాలు విశాలాంధ్ర – రాజానగరం : నాగయ్య నాగప్ప నాగరాజా మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా అంటూ పల్లె, పట్టణం తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దీపావళి వెళ్లిన తర్వాత వచ్చే నాగుల చవితి పర్వదినం నాడు పాముపుట్టలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోప్రత్యేక పూజలు చెయ్యడం అనవాయితీగా వస్తుంది. సర్ప దోషాలు నివారణకు, సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు ప్రతీతి గా […] The post నాగయ్య నాగప్ప నాగరాజా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 10:53 am

ఇసుక దందా

జిల్లాలో కొనసాగుతున్న ఇసుక దందా.. యథేచ్ఛగా డ్రెడ్జింగ్ కొవ్వూరు ఇసుక ర్యాంపులలో కొనసాగుతున్న వైకాపా నాయకుల హవా.. తెదేపా నాయకుల అండతోనే అంటున్న తెదేపా కార్యకర్తలు? దండకుంటరేవు లో లారీలు పట్టివేత.. ఈ ర్యాంపు లు మాకొద్దు అంటున్న తెదేపా కార్యకర్తలు విశాలాంధ్ర – కొవ్వూరు : మూడు నెలల విరామం తర్వాత జిల్లా వ్యాప్తంగా నదిలోంచి ఇసుక తీసే ఇసుక ర్యాంపులలో ఇసుకను తీసే కార్యక్రమానికి తాత్కాలికంగా తెరపడింది. దీనికి కారణం ఆగస్టు నెలలో మొదలైన […] The post ఇసుక దందా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 10:44 am

కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మొంథా తుపాన్

అమరావతి: మొంథా తుఫాన్‌ దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. తుపాన్ నేపథ్యంలో కాకినాడ- ఉప్పాడ బీచ్‌ రోడ్‌ తాత్కాలికంగా మూసివేశారు. తుఫాన్‌ ప్రత్యేక అధికారిగా ఐఏఎస్‌ కృష్ణ చైతన్యను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. వాయుగుండం రేపటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి ఎవరూ రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30 వరకు ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేశారు. తుఫాన్ ప్రభావిత మండలాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులతో పాటు ప్రత్యేకంగా జోనల్ ఇంఛార్జులను ప్రభుత్వం నియమించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. 

మన తెలంగాణ 26 Oct 2025 10:39 am

ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 26-10-2025

ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 26-10-2025

ప్రభ న్యూస్ 26 Oct 2025 10:38 am

బడికి రానందుకు పనిష్మెంట్

బడికి రానందుకు పనిష్మెంట్ శ్రీ సత్య సాయి బ్యూరో, శ్రీ సత్య సాయి

ప్రభ న్యూస్ 26 Oct 2025 10:32 am

ఆయుష్ మాన్

ఆయుష్ మాన్ మందిర్ లో సేవలు పై తనిఖీ విశాలాంధ్ర – సీతానగరం : ఆయుష్ మాన్ ఆరోగ్య మందిర్ లో ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలు పై తనిఖీ నిర్వహించడం జరిగింది అని మండల వైద్య అధికారి డాక్టర్ ఏ వి కే చైతన్య అన్నారు. మండలంలో ఇనగంటివారిపేట గ్రామంలో గల ఆయుష్ మాన్ ఆరోగ్య మందిర్ లో శనివారం నేషనల్ క్వాలిటీ అష్యు రెన్స్ స్టాండర్డ్స్ టీమ్ వర్చువల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా […] The post ఆయుష్ మాన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 10:27 am

December 2025 is Packed with Releases

December 2025 is packed with a number of releases in all the languages. Christmas weekend is packed with almost 9 films in various languages. Balakrishna Akhanda 2, Bellamkonda Sreenivas’ Tyson Naidu, Vishwak Sen’s Funky and Roshan’s Champion are prominent releases from Telugu. A number of dubbed films from Hindi, Tamil, Kannada and English will test […] The post December 2025 is Packed with Releases appeared first on Telugu360 .

తెలుగు 360 26 Oct 2025 10:26 am

రాంజీ బూరి విరాళం

శ్రీ గంగమ్మ తల్లి ఆలయానికి ఉప సర్పంచ్ రాంజీ బూరి విరాళం. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, బుర్రిలంక గ్రామంలో గల శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి కడియపులంక ఉప సర్పంచ్ పాఠంశెట్టి వెంకట రామారావు (రాంజీ) 1,00,116 రూపాయలు బూరి విరాళాన్ని అందించారు. శనివారం బుర్రిలంక గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే బుచ్చియ్య చౌదరి గంగమ్మ తల్లి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా బుచ్చయ్య […] The post రాంజీ బూరి విరాళం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 10:18 am

పిర్యాదు చేసిన 24 గంటల్లోనే

విశాలాంధ్ర – తాళ్లపూడి : తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన జిడ్ల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన కుమార్తె ఇంటినుండి వెళ్ళి పోయిందని పోలీస్ లకు పిర్యాదు చేసిన 24 గంటల్లోపు తాళ్లపూడి పోలీసులు ఆచూకీ కనుగొన్న వైనమిది. సుబ్రహ్మణ్యం కుమార్తె చదువు మానివేసి ఇంటి దగ్గరే ఉంటూ పనులు చేసుకుంటుండగా, తల్లి దండ్రులు ఖాళీగా ఉంటున్నావని మందలించడంతో ఆమె ఇంటి నుండి పారి పోయింది. ఈ మేరకు తాళ్లపూడి పోలీస్ స్టేషన్ […] The post పిర్యాదు చేసిన 24 గంటల్లోనే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 10:11 am

తుపాన్ పై అధికారులు

తుపాన్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి మండల ప్రత్యేక అధికారి రాంప్రసాద్ విశాలాంధ్ర – సీతానగరం: వాతావరణ శాఖ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి ఏ పి డి రాంప్రసాద్ అన్నారు. శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల గ్రామ స్థాయి అధికారులతో ఎంపిడిఓ ఎమ్ భారతి ఆధ్వర్యంలో తహసిల్దార్ ఏ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి రాంప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ […] The post తుపాన్ పై అధికారులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 10:07 am

కూటమి సంక్షేమానికి పెద్ద పీట

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి పెద్ద పీట. — మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. విశాలాంధ్ర – కడియం : కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం కడియం మండలం బుర్రిలంక గ్రామంలో రూ.205 లక్షల ఎంజిఎన్ఆర్ఇజిఎస్, మండల పరిషత్ నిధులతో బుర్రిలంక కాలువగట్టు నుండి గోదావరి ఏటి గట్టు వరకు నిర్మించిన సిసి రోడ్డును రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ […] The post కూటమి సంక్షేమానికి పెద్ద పీట appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 10:02 am

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಬಿಹಾರ್​ಗೆ ಹೊರಟಿದ್ದ ಆರ್‌ಡಿಎಕ್ಸ್‌ ತುಂಬಿದ ಲಾರಿಯನ್ನ ಪೊಲೀಸರು ಹಿಡಿದಿದ್ದಾರೆ ಎಂದು 2020ರ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

ಬಿಹಾರ್​ಗೆ ಹೊರಟಿದ್ದ ಆರ್‌ಡಿಎಕ್ಸ್‌ ತುಂಬಿದ ಲಾರಿಯನ್ನ ಪೊಲೀಸರು ಹಿಡಿದಿದ್ದಾರೆ ಎಂದು 2020ರ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 26 Oct 2025 10:00 am

ఐక్య‌తా యాత్ర‌

స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ 150 జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఐక్య‌తా యాత్ర‌ విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి : యువతలో ఐక్యతా భావం , దేశభక్తి ల‌ను పెంపొందించ‌డానికి, నవంబర్ 11వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఐక్య‌తా యాత్ర‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తూర్పుగోదావ‌రి జిల్లా యూత్ ఆఫీసర్ తిరి గోపి స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఉద‌యం స్థానిక ప్రెస్ క్ల‌బ్ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, విభజిత […] The post ఐక్య‌తా యాత్ర‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 9:51 am

జెఎన్‌టియు వంతెనపై కారు బోల్తా

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కెపిహెచ్‌బి కాలనీ సమీపంలోని జెఎన్‌టియు వంతెనపై కారు బోల్తాపడింది. కారు అతివేగంతో డివైడర్, బైక్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూడాన్ చెందిన ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు కారులో ఉన్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే సూడాన్ దేశస్థులు క్యాబ్ బుక్ చేసుకొని ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ప్రమాదానికి కారణమైన కారు అద్దెకు తీసుకున్నారా? లేక ఎవరైనా ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

మన తెలంగాణ 26 Oct 2025 9:48 am

జూడోలో ప‌త‌కాలు

జూడోలో కందుకూరి రాజ్య‌ల‌క్ష్మి మ‌హిళా క‌ళాశాల విద్యార్ధినుల‌కు ప‌త‌కాలు విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి ; ఇటీవల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జూడో టోర్నమెంట్‌లో స్థానిక శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరచి ఐదు పతకాలు సాధించారు. ఈ క్ర‌మంలో డి.శ్రీల‌క్ష్మి 52కిలోల విభాగంలో బంగారు ప‌త‌కం, టి.లీలా లక్ష్మి 48 కిలోల విభాగంలో బంగారు ప‌త‌కం , కె.జీవిత 70 కిలోల విభాగంలో […] The post జూడోలో ప‌త‌కాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 9:39 am

నాగుల చవితి మహోత్సవ వేడుకలు

విశాలాంధ్ర–దేవరపల్లి:దేవరపల్లి మండలంలో శనివారం నాడు నాగుల చవితి మహోత్సవ వేడుకలు భక్తులు భక్తిశ్రద్ధలతోఘనంగా జరిగాయి ప్రతి గ్రామంలోనూ ఉదయం మహిళలు పిల్లలు పొలాల వద్దకు వెళ్లి పుట్టలో పాలు పోసి పుట్ట వద్ద పూజలు చేశారు దేవరపల్లిలో యాదవోలు రోడ్డులో గల పొలాలలో మహిళలు పిల్లలు పుట్ట వద్దకు వెళ్లి పరిసరాలను పరిశుభ్రం చేసి అగరతులు పండ్లు వెలిగించి పూజలు చేశారు ముఖ్యంగా ఆవు పాలు కోడిగుడ్లు బెల్లంతో తయారుచేసిన చిమిలి తో నైవేద్యం పెట్టి పూజలు […] The post నాగుల చవితి మహోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 9:33 am

దేవరపల్లి భాష్యం స్కూల్ ప్రతిభ

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి భాష్యం స్కూల్ కు చెందిన ఆరుగురు విద్యార్థులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు పురుషోత్తపల్లి మరియు నిడదవోలు నందు నిర్వహించిన కొవ్వూరు డివిజన్ స్థాయి చెస్ మరియు అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ చూపి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ పి పేరయ్య నాయుడు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులు అండర్ 17 చెస్ పి రఘు ప్రబోధ్ వర్మ మొదటి స్థానం,ఎస్ జస్వంత్ రెండవ స్థానం,అండర్ 14చెస్ […] The post దేవరపల్లి భాష్యం స్కూల్ ప్రతిభ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 9:29 am

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో

విశాలాంధ్ర – దేవరపల్లి : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా జరుగు వారోత్సవంలో భాగంగా శనివారం దుద్దుకూరు గ్రామం లో గల గర్ల్స్ హాస్టల్ నందు అవేర్నెస్ మీటింగ్ ఏర్పాటు చేసి మహిళలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్, మహిళల భద్రత మహిళా శక్తి గురించి తెలియజేస్తూ అదే విధంగా దేవరపల్లిలో గల భాష్యం హర్షవర్ధన్ స్కూల్లో . ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల భద్రత మరియు బాలికలపై జరిగే లైంగిక నేరాలు గురించి నేటి సమాజంలో […] The post పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 9:22 am

వెంకటేశ్వర స్వామి ఆలయంలో

విశాలాంధ్ర – దేవరపల్లి: దేవరపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం నుండి సుప్రభాత సేవ అభిషేకాలు నిర్వహించారు శనివారం కార్తీక మాసం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు దేవరపల్లి గ్రామానికి చెందిన చిట్లు వెంకట నాగ వరప్రసాద్ నాగమణి దంపతులు స్వామి వారికి అలంకరణ ప్రసాదానికి విరాళం అందజేశారు నాగ వరప్రసాద్ దంపతులను ఆలయ ప్రధాన అర్చకులు కేశవ ఆచార్యులు దుర్గాప్రసాద్ ఆచార్యులు ఆశీర్వచనాలు అందజేశారు […] The post వెంకటేశ్వర స్వామి ఆలయంలో appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 9:18 am

தமிழகத்தில் சாலை வெள்ளத்தில் கீழே விழுந்த பெண் என வைரலாகும் வீடியோ - உண்மை என்ன?

சாலையில் தேங்கிய மழைநீரில் சிக்கி குழந்தையுடன் பெண் கீழே விழுந்ததாக பரவும் வீடியோ தமிழகத்தில் நடந்தது அல்ல. அது பாகிஸ்தானில் நடந்த சம்பவம்.

తెలుగు పోస్ట్ 26 Oct 2025 9:12 am

రైతుకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం

… ఎమ్మెల్యే నల్లమిల్లి విశాలాంధ్ర – అనపర్తి : రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన చేస్తూ ముద్రించిన గోడపత్రికలను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేతుల మీదుగాశనివారం ఆవిష్కరించారు. విత్తును నాటి నుంచి పంటను విక్రయించి డబ్బు చేతికొచ్చే వరకు రైతుకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ […] The post రైతుకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 9:11 am

నమ్మించాలనుకున్నాడు... రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన బిజెపి ఎంఎల్ఎ

లక్నో: ఉత్తర ప్రదేశ రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంఎల్ఎ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. యమునా నదిని బిజెపి సర్కార్ శుభ్రం చేసిందని బిజెపి ఎమ్మెల్యే రవి నేగి చూపించేందుకు ప్రయత్నించి బోల్తాపడ్డారు. ఓ ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు నింపుకొని ఇదిగోండి నీళ్లు ఎంతో శుభ్రంగా  ఉన్నాయని నమ్మించాడు. తీరా చూస్తే.. అప్పటికే వాటర్ బాటిల్‌లో శుభ్రమైన నీళ్లు ఉండటం వీడియోలోనే కనిపించడంతో సదరు ఎంఎల్ఎపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో బిజెపి ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే యమునా నీళ్లు శుభ్రంగా ఉంటే అవి తాగి చూపించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అబద్దాలు ప్రచారం చేయడంతో బిజెపి మించిన వాళ్లు దేశంలో లేరని కామెంట్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అబద్దాలకు మారుపేరు గోడీ మీడియా పునితన్ 3001 అనే నెటిజన్ చురకలంటించారు. ప్రజలను అబద్దాలతో ఎన్ని రోజులు మభ్య పెడుతారని  ప్రశ్నిస్తున్నారు. నకిలీ యుద్ధాలు, నకిలీ వాగ్దానాలు, నకిలీ ఆత్మగౌరవం, నిజమైనది వారి బడ్జెట్ మాత్రమేనని తంగో చార్టీ అనే నెటిజన్ కామెంట్ చేశాడు. 'వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నామని అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర వాట్స్ యాప్ యూనివర్సిటీ ఉన్నంత వరకు భక్తులు మోసపోతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మోడీ భక్తుల ఆధిపత్యం ఉన్న మరొక సోషల్ మీడియా ప్రపంచం. ఎక్స్ లో చాలా మంది తెలివితక్కువవారు కాదు. నిజమైన తెలివితక్కువవారు ఇన్‌స్టా, వాట్సాప్‌లో ఉన్నారు' అని కాస్మిచోస్ (@karmicoder) అనే నెటిజన్ కామెంటు చేశాడు. సదరు ఎంఎల్ఎ నిజంగా ఆ నదిని ప్రేమిస్తే, దాని నీరు శుభ్రంగా ఉందని ఎప్పుడూ చెప్పరు, నది నీళ్లు మురికిగా ఉన్నాయని, దానిని శుభ్రం చేయాలని చెబుతారని ఎంఎన్ టి అగ్రి అనే నెటిజన్ సలహా ఇచ్చాడు. 

మన తెలంగాణ 26 Oct 2025 9:05 am

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

మంత తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి విశాలాంధ్ర – అనపర్తి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారునున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్త o గాఉండాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఎంపీపీ అనుసూరి బుజ్జి అధ్యక్షతన జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగాపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమంతా తుఫాన్ మన రాష్ట్రంలో […] The post అధికారులు అప్రమత్తంగా ఉండాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 9:02 am

ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణలో..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీ ‘విటి15’ టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో, యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా జరుగుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ముఖ్య తారాగణం పాల్గొంటున్న ఈ కీలక షెడ్యూల్లో చాలా ముఖ్యమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. హారర్-, కామెడీ, ఇండియన్, కొరియన్ బ్యాక్‌డ్రాప్, యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇండియా, విదేశాల్లో మూడు మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసి, గ్రాండ్ విజువల్స్‌ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్, - తమన్ కాంబో మరోసారి అదరగొట్టే ఆల్బమ్ ఇవ్వబోతోంది. 

మన తెలంగాణ 26 Oct 2025 8:50 am

పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

అయ్యప్ప స్వాముల పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కంబాల.. పడి పూజకు 25,000 వేలు రూపాయలు విరాళం.. విశాలాంధ్ర – కోరుకొండ: కోరుకొండ మండలం కాపవరం గ్రామంలోని రామాలయం వద్ద అయ్యప్ప స్వాముల భారీ పడి పూజ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. తొలిత అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు కంబాల శ్రీనివాసరావుని పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పడిపూజ కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు 25,000 […] The post పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కంబాల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 8:30 am

నారాయణపేట జిల్లాలో చిరుత పులి మృతి

హైదరాబాద్: నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో గల పేరపళ్ల పెద్దగుట్ట శివారులో ఓ చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రైతులకు చిరుత కళేబరం కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు కమాలుద్దీన్, సంతోష్‌లు ఘటనా స్థలానికి చేరుకొని పులి కళేబరాన్ని పరిశీలించారు. దుర్వాసన రావడంతో మూడు రోజుల క్రితం మృతి చెందినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కళేబరం ఎక్కడా గాయాలు లేకపోవడంతో అనారోగ్యంతో చనిపోయి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

మన తెలంగాణ 26 Oct 2025 8:27 am

విశాలాంధ్ర ఎఫెక్ట్ 

ఏడు రోజుల్లో నూతన 108 వాహనం మంజూరు – విశాలాంధ్ర కథనానికి స్పందించిన జిల్లా వైద్యాధికారి విశాలాంధ్ర – సీతానగరం : రానున్న ఏడు రోజుల్లో సీతానగరం మండలానికి అత్యాధునిక వైద్య సాంకేతిక సదుపాయాలు ఉన్న భవ్య హెల్త్ సర్వీసెస్108 నూతన వాహనాన్ని మంజూరు చేస్తామని తూర్పు గోదావరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అన్నారు.అత్యవసర వాహనానికే సుస్తీ చేస్తే ఎలా అంటూ మండల కేంద్రమైన సీతానగరం నుండి విశాలాంధ్ర దినపత్రికలో వెలువడిన కథనానికి భవ్య హెల్త్ […] The post విశాలాంధ్ర ఎఫెక్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Oct 2025 8:22 am

Bigg Boss Telugu 9: Nagarjuna Schools Housemates in a Dramatic Weekend Episode

The latest weekend episode of Bigg Boss Telugu 9 was filled with fiery arguments, emotional confrontations, and honest feedback. From Madhuri locking horns with Sai early in the day to Nagarjuna grilling housemates during the tagging task, the episode had all the elements of drama that fans love. Madhuri vs Sai: Morning Fight Sets the […] The post Bigg Boss Telugu 9: Nagarjuna Schools Housemates in a Dramatic Weekend Episode appeared first on Telugu360 .

తెలుగు 360 26 Oct 2025 8:22 am

విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పొగలు

అమరావతి: విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పొగలు వచ్చాయి. వెంటనే బస్సును నందిగామ వద్ద రోడ్డు పక్కన డ్రైవర్ ఆపాడు.  బస్సులో నుంచి ప్రయాణికులను డ్రైవర్ కిందకు దించేశాడు. పొగలు రావడంతో 15 మంది ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. మరో బస్సులో ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది పంపారు. షార్ట్ సర్క్యూట్ తోనే పొగలు వచ్చినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున బస్సులో ప్రమాదంలో 19 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.  

మన తెలంగాణ 26 Oct 2025 7:37 am

ప్రపంచకప్: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఆసీస్

ఇండోర్: మహిళ ప్రపంచ కప్ టోర్నీ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇంగ్లండ్, భారత్ సెమీస్ చేరుకున్నాయి. అయితే సెమీస్ ఎవరూ ఎవరితో తలపడనున్నాయనే సందిగ్ధత తొలిగి పోయింది. ఐసిసి నిబంధన ప్రకారం పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచిన జట్టు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీస్ ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా.. రెండో, మూడు స్థానాల్లో నలిచిన జట్లు రెండో సమీస్‌లో తలపడనున్నాయి. అయితే, ఇండోర్‌లో ఏకపక్షంగా సాగిన పోరులో అలనా కింగ్(7-18) సంచలన బౌలింగ్‌తో ప్రతర్థిని కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 17వ ఓవర్లోనే ఛేదించింది ఆసీస్. బేత్ మూనీ(42) ఔటైనా.. సథర్‌లాండ్(10 నాటౌట్) రెండు ఫోర్లు బాదడంతో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది కంగారూ టీమ్. ఈ విజయంతో 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానం కాపాడుకున్న ఆస్ట్రేలియా తొలి సెమీస్‌లో భారత్‌ను ఢీకొట్టనుంది. ఇక రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపనున్నాయి. కాగా, లీగ్ చివరి మ్యాచ్ ఆదివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనుంది.

మన తెలంగాణ 26 Oct 2025 7:00 am

చిరుకు ఊరట

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ నటుడు కొణిదెల చిరంజీవి వ్యక్తిత్వ హక్కులపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిత్వ, ప్రచార హక్కుల ఉ ల్లంఘనలు, పరువు నష్టం చర్యలు జరిగితే, సం బంధిత పౌర, ఫౌజ్‌దారీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పిటిషన్‌లో పేర్కొ న్న పలువురితోపాటు ఎవరైనా వ్యక్తి, సంస్థ అయి నా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్ తదితర గుర్తించిన వాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం  వినియోగించడాన్ని సిటీ సివిల్ న్యాయస్థానం నిషేధించింది. ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్న సమయంలో ఎవరైనా వ్యక్తి, సంస్థ ద్వారా జరిగే ట్రోలింగ్, మార్ఫింగ్, అభ్యంతరకర కంటెంట్ ప్రచారం, అనుమతి లేని వాణిజ్య వినియోగంపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు హెచ్చరించింది. తన పేరు, చిత్రం, ప్రసిద్ధ సినీ శీర్షికలను అనుమతి లేకుండా వాడుకోవడం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్ మొదలైన వేదికలపై వినియోగించడం, అలాగే కృత్రిమ మేథస్సు (ఏఐ) ద్వారా రూపాంతరం చేసిన (మార్ఫ్ చేసిన) చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడాన్ని ఆపివేయాలని చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చలనచిత్ర రంగంలో అగ్ర హీరోగా ఉన్నత స్థాయిలో ఉన్న చిరంజీవి స్థానాన్ని గుర్తిస్తూ ఆయన పేరుపెట్టి, చిత్రాలు తీసుకొని, వీడియో-మీమ్స్ చేసి, అనుమతి లేకుండా వినియోగం, తదితర చర్యల ద్వారా ప్రతివాదులు చేసిన ఉల్లంఘనలు ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలిగిస్తున్నాయని చిరంజీవి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రధానంగా డిజిటల్, ఏఐ వేదికల ద్వారా జరిగే వాణిజ్య దోపిడి, తప్పుడు ప్రతిరూపణలతో అపరిమిత నష్టం సంభవించే ప్రమాదాన్ని కోర్టు గమనించింది. ఈ నిషేధాజ్ఞ ప్రకారం చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ అయిన మెగాస్టార్, చిరు, అన్నయ్య ఆయన స్వరం, చిత్రంతో పాటు ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత, వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ ఉపయోగించవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు అందరూ ప్రతివాదులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

మన తెలంగాణ 26 Oct 2025 6:00 am

sunday magazine 26 oct 2025 ఆదివారం సంచిక 26 అక్టోబర్ 2025

ఈ సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ

ప్రభ న్యూస్ 26 Oct 2025 6:00 am

అంబేద్కర్ మార్గంలో ‘కోటా’ కొట్లాట

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తయినప్పటికీ సామాజిక న్యాయం అందని ద్రాక్షగానే మిగిలింది. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఇతర వెనకబడిన కులాలకు సమాన అవకాశాల కల్పనలో పార్టీలకు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికీ జనాభా ప్రకారం వారికి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదు. అగ్రకులాలు అదనపు హక్కుల పొందగా ఓబీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పావులుగా మారుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై పార్టీల స్పందనే ఇందుకు నిదర్శం. స్థానిక సంస్థల్లో 42 బీసీ రిజర్వేషన్ల అమలుకై తెచ్చిన జీవో 9కు కోర్టులో అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో రాష్ట్రంలో అక్టోబర్ 18న బీసీ రిజర్వేషన్ సాధనకు బీసీ సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్యర్యంలో బంద్ ప్రకటించారు. దీనికి మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతు పలికాయి. పొలిటికల్ మైలేజ్ కోసం పరస్పర రాజకీయ ఆరోపణలకే పరిమితమయ్యాయి. అసలు 42శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన పరిష్కారం చూపాలనే నిబద్ధత ఏ పార్టీకి లేదని అర్థమవుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అనేది ఆయా వర్గాల ప్రాతినిధ్యం. కానీ సుప్రీం కోర్టు ఇందిరా సాహ్ని కేసులో 50శాతం పరిమితిని విధించింది. ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు తలుచుకుంటే ఈ పరిమితిని తొలగించలేరా?. అసలు అడ్డుకునేది ఎవరు? న్యాయ స్థానాలా? న్యాయ బద్దతలేని విధానాలా?.. ఆలోచన చెయ్యాలి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. డా. బి.ఆర్. అంబేద్కర్ కేవలం దళితుల కోసమే కాదు, ఇతర వెనుకబడిన తరగతుల అభ్యున్నతిలోనూ ప్రధాన పాత్ర పోషించారు. మహాత్మా ఫూలే, సాహూ మహారాజ్ వంటి వెనకబడిన వర్గ ఉద్యమ నేతల ఆలోచనలను అంబేద్కర్ స్వీకరించి, వాటిని భారత రాజ్యాంగంలో ప్రతిబింబింపజేశారు. ఓబీసీలు తమతో కలిసి రానప్పటికీ అంబేద్కర్ వారికి సమాన న్యాయం, విద్యాఅవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం రావాలని పట్టుదలగా ప్రయత్నించారు. రౌండ్ టేండ్ సమావేశాల్లో ఆయన వెనుకబడిన కులాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయల్లో ప్రత్యేక అవకాశాలు కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించారు. రాజ్యాంగంలో 340వ అధికరణాన్ని చేర్చించారు. దీంతో వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగమనమైంది. ఈ అధికరణ ఆధారంగా ఓబీసీల జాబితా రూపొందించి, వారికి రిజర్వేషన్లు కల్పించటానికి ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధ బాధ్యత ఏర్పడింది. ఈ క్రమంలో కాక కలేల్కర్, బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కారణంగానే బీసీల రిజర్వేషన్ల కొంతమేర చట్టబద్ధమైనవి. స్వాతంత్య్రం అనంతరం జవహర్ లాల్ నెహ్రూ తొలి కేబినెట్లో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1951లో ఆయన మహిళలకు వారసత్వం, సమాన హక్కులు కల్పించాలనీ‘హిందూ కోడ్ బిల్లును ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు వ్యతిరేకించడంతో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అంబేద్కర్ 1951 అక్టోబర్ 10న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆనాడు ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం కూడా తన రాజీనామాకు కారణంగా పేర్కొన్నారు. ఈ వాస్తవం బీసీ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజీనామా అనంతరం అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలిపి ఒక శక్తిగా ఎదగడం అవసరమని భావించారు. షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి రాజకీయ వేదికల ద్వారా దళితులు, బీసీలు, మహిళలు సమాన హక్కులు కోసం పోరాడారు. నేడు దేశంలో బీసీల సంక్షేమానికి అంబేద్కర్ దిక్సూచి. కావున ఇప్పుడు బీసీ విముక్తికి చారిత్రకంగా మహనీయుల పోరాటాలు పాఠం కావాలి. అంబేద్కర్ తర్వాత ఆయన ఉద్యమ రథాన్ని ముందుకు నడిపించిన కాన్షీరాం సైతం ఇతర వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. 1980 సంవత్సరంలో మండల్ కమిషన్ ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. వీటి అమలుకై కాన్షీరాం డిల్లీ బోట్స్ క్లబ్ ముందు 48 రోజుల ధర్నా చేశారు. అప్పుడు వి.పి సింగ్ ప్రభుత్వం ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో కల్పిస్తూ చట్టం తెచ్చారు. ఈ విధంగా కాన్షిరాం బీసీ రిజర్వేషన్ ఉద్యమం దేశంలో విప్లవం సృష్టించింది. ఆ దిశగా మరో స్వాభిమాన బీసీ ఉద్యమం బయలుదేరాలి. ఈ క్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్, ఉమ్మడి ఏపీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బాలగోని బాలరాజు గౌడ్, పొన్నం దేవరాజ్ గౌడ్, జి.కిరణ్ కుమార్ నేతృత్వంలో బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటయ్యింది. ఈ సమితి బీసీ కేటగిరీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, తమిళనాడు తరహాలో వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నది. ఇది బీసీ రిజర్వేషన్లకు శాస్త్రీయ పరిష్కారం కానుంది. న్యాయపరమైన రక్షణ లభించనుంది. ఈ రిజర్వేషన్లను రాజకీయ, విద్య, ఉద్యోగాల్లోనూ అమలుకై పటిష్టమైన ఉద్యమం చేపడుతున్నారు. ఈ నెల24న ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా నిర్వహించారు. తదుపరి బీసీ చైతన్య యాత్ర చేపట్టబోతున్నారు. బీసీ సంఘాలతో పాటు ఇతర కుల సంఘాలు ఈ సమితికి తోడై దేశవ్యాప్త ఉద్యమంగా మారాలి. అప్పుడే బీసీలకు సామాజిక న్యాయం, రాజ్యాధికారం దక్కే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బహుజన వర్గాలంతా తరతరాలుగా అగ్రకుల పాలకుల దోపిడికి గురయ్యారు. ఈ క్రమంలో 90 శాతం బీసీ ఎస్సీ ఎస్టీ బలగాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగించాలి. ఇందుకై వారిని పూలే, అంబేద్కర్, కాన్షీరాం దారిలో నడిపించడానికి డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆలోచన నుంచీ మార్చు 31, 2025న బిసి,ఎస్సీ,ఎస్టీల ఐక్య కార్యాచరణ సమితి(జాక్) ఆవిర్భవించింది. దీని ఆధ్వర్యంలో అదిలాబాద్ కేంద్రంగా ఏప్రిల్ 14 2025 న లక్ష కిలో మీటర్ల రథయాత్ర ప్రారంభమైనది. ఇది అట్టడుగు వర్గాల సమస్త రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతూనే.. రాజ్యాధికారం కోసం ధర్మ యుద్ధం చేస్తున్నది. ప్రజా సమస్యలపై సింహ గర్జన చేస్తున్నది. ఈ యాత్ర అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నది. ఇది ప్రత్యామ్నాయ ప్రతిపక్షమై సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నది. దీనిలో భాగమైన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు టి.చిరంజీవులు గారు బీసీల చైతన్యానికి కృషి చేస్తున్నారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన జస్టిస్ ఈశ్వరయ్య బీసీల న్యాయపోరాటాలకు ప్రేరణ ఇచ్చారు. ఈ త్రిమూర్తులు అగ్రకుల పార్టీలకు అభిముఖంగా అంబేద్కర్ మార్గంలో నడుస్తూ పీడిత వర్గాల విముక్తికి తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల సాధన సమితిలో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. బీసీ ఉద్యమానికి కథానాయకులై నడిపిస్తున్నారు. వీరికి తోడుగా వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మేధావులు, కుల సంఘాలు కలిసి వస్తున్నారు. గతంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో 10వేల కిలో మీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీల కులాల వాటానడుగుతూ రాజ్యాధికార స్పృహ రగిలించారు. ఇదే నేటి బీసీల సంఘటిత మహోద్యమానికి కారణమైనది. 

మన తెలంగాణ 26 Oct 2025 6:00 am

కళాత్మక సమరశీలి సత్యన్న

కళ కళ కోసం కాదు ప్రజల కోసమే అన్నట్లుగా ఆట-పాటలనే ఆయుధంగా చేసుకొని నిరంతరం ప్రజా ఉద్యమ పంథాలో కొనసాగిన కళాత్మక సమరశీలి కామ్రేడ్ సత్యన్న. భూక్య సత్యనారాయణ అలియాస్ సత్యన్న అలియాస్ పెద్దన్నగా పేరు గడించిన సత్యన్న పేరుకు తగ్గట్టుగానే జీవితాంతం ఎత్తిన ఎర్రజెండాను దించలేదు. నమ్మిన సత్యాన్ని, సిద్ధాంతాన్ని వీడలేదు. పెద్దన్నగా పెద్దరికంతో కూడిన హుందాతనం ఆయన సొంతం. అందరి కోసం నేను అన్నట్లుగా జీవించేవారు. మే 18,1963 సంవత్సరంలో ఖమ్మం జిల్లా, తిరుమలయపాలెం మండలం, కాకరవాయి గ్రామంలో భూక్యా రాములు-తిరుపతమ్మ దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించిన భూక్యా సత్యనారాయణకు ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెలు ఉన్నారు. భూక్యా సత్యన్న జీవనోపాధిరీత్యా యుక్త వయసులోనే మహబూబాబాద్ కు వలస వచ్చారు. ఆ సమయంలో మహబూబాబాద్ లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకత్వంలో ఎగురుతున్న ఎర్రజెండా రెపరెపలకు ముగ్దుడై ఎర్ర జెండా ఎత్తి పట్టి పోరాట బాట పట్టారు. మానుకోట ప్రాంతంలో కామ్రేడ్ ధర్మన్న సహచరునిగా ప్రజా ఉద్యమంలో కొనసాగారు. ప్రజా పోరాట తత్వాన్ని అలవర్చుకున్న భూక్యా సత్యన్న తన స్వగ్రామమైన కాకరవాయి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖ నిర్మించి ఎర్రజెండా ఎగురవేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై తెలంగాణ ఉద్యమ ప్రజా కళాకారులతో జతకట్టి ఉద్యమ పాటల పల్లకి ఎత్తుకున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ జానపద కళాకారుల సంఘం, విశ్వ సమాజం తదితర ప్రజా సంఘాలలో చేరి, ప్రజా ఉద్యమకారునిగా, ప్రజా కళాకారునిగా పనిచేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఖమ్మం జిల్లా సాంస్కృతిక విభాగం కో కన్వీనర్‌గా ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో విస్తృతమైన కళా ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వ సమాజం వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది రచయిత విశ్వ జంపాల సహచరత్వంలో తెలంగాణ, సామాజిక న్యాయ ప్రజా పోరాటాల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ ప్రజా కళాకారుడుగా కాలుకు గజ్జ కట్టి గోసి గొంగడేసి కైగట్టి పాట పాడుతూ తెలంగాణ ప్రజా యుద్ధనౌక గద్దరన్నను అనుకరిస్తూ ఆడుతూ పాడుతూ ప్రజలను ఆకట్టుకునేవారు. ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో ప్రజా యుద్ధనౌక గద్దరన్న, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పాల్గొన్న ప్రతి కళా ప్రదర్శనలో, సమావేశాల్లో విధిగా పాల్గొనేవారు. వృత్తిరీత్యా బిల్డింగ్ నిర్మాణ పనులు, రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. మహబూబాబాద్ పట్టణంలో పేదల ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న అనేక పోరాటలలో సైతం పాల్గొని ప్రజా పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రజా ఉద్యమ వేదికల మీద రొమ్ము విరిచి, గుండెలు బాదుకుంటూ పేదల ఆకలి కేకల బాధలను పోరాట పాటలుగా వినిపించేవారు. సత్యనారాయణకు భార్య సీతాదేవి పెద్ద కూతురు విశాల, చిన్న కూతురు విమల, కుమారుడు విక్రమ్ ఉన్నారు. మంచికి మారుపేరు, సహానశీలి, మానవత్వం, పెద్దరికం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా చిరునవ్వుల పలకరింపులతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొంది, అందరికీ ఆదర్శంగా నిలచిన కామ్రేడ్ భూక్య సత్యన్న గుండె పోటుతో తెలంగాణ బీసీ బంద్ రోజున ది.18.10.2025న అకాల మరణం చెందారు. ఎందరో కవులు కళాకారులు ఉద్యమకారుల సాన్నిహిత్యం పొంది, వారి సహచరునిగా తన పాద ముద్రలను వదిలి వెళ్లారు. ప్రజా కళాకారునిగా, ప్రజా ఉద్యమకారునిగా కామ్రేడ్ భూక్యా సత్యనారాయణ అలియాస్ సత్యన్న అలియాస్ పెద్దన్న ఆలోచన విధానాన్ని ఆయన మహోన్నత ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు అర్పించే ఘనమైన నివాళి. ( 27.10.2025న మహబూబాబాద్‌లో జరగనున్న కామ్రేడ్ భూక్య సత్యన్న సంస్మరణ సందర్భంగా ) విశ్వ జంపాల అడ్వకేట్ (విశ్వ సమాజం వ్యవస్థాపకులు) 77939 68907

మన తెలంగాణ 26 Oct 2025 5:50 am

వారంలో డిసిసి అధ్యక్షులు

మన తెలంగాణ/హైదరాబాద్: నెలాఖరులోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం పూర్తి చేస్తామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సూచనప్రాయంగా చెప్పారు. శనివారం ఢిల్లీలో కెసి వేణుగోపాల్‌తో సిఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీ నాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమా ర్క, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మ హేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, సం ఘటన్ సుజన్ అభియాన్‌కు చెందిన పలువురు పరిశీలకులు సమావేశమయ్యారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నందున జిల్లా పార్టీలు బలోపేతంగా ఉండాల్సిన అవశ్యకత గురించి సిఎం రేవంత్‌రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారని తెలిసింది. అం దుకు కెసి వేణుగోపాల్ స్పందిస్తూ సాధ్యమైనంత త్వర గా నియమించాలన్న ఆలోచనతో ఉన్నామని, దేశంలోని మరి కొన్ని రాష్ట్రాల జిల్లాల కమిటీల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి కావచ్చందని, వాటితో పాటు తెలంగాణ డిసిసి  అధ్యక్షులనూ నియమిస్తామని వివరించారు. ఏఐసిసి నియమించిన ఇరవై రెండు మంది పరిశీలకులు తమకు కేటాయించిన జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, పార్టీ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలే కాకుండా స్థానికంగా ఉండే వివిధ సంఘాలతో, స్వచ్చంధ సంస్థల ప్రతినిధుల అభిప్రాయలను సేకరించారని కెసి వేణుగోపాల్ తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తమకు సమర్పించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించామని, ఇందులో కొన్ని జిల్లాల్లో మూడు పేర్లు ఉంటే, మరి కొన్ని జిల్లాల్లో ఐదు, ఆరు పేర్లతో కూడిన జాబితాలను అందజేశారని ఆయన తెలిపారు. మూడు పేర్లతో జాబితాలు ఇవ్వాల్సిందిగా వారికి అందజేసిన మార్గదర్శకాల్లో చెప్పామని, అయితే బలమైన నాయకులు, ఉండడం, మహిళలు, సామాజిక సమతుల్యత కోసం ఐదు, ఆరు పేర్లతో జాబితాలు ఇవ్వాల్సి వచ్చిందని పరిశీలకులు చెప్పారని ఆయన తెలిపారు. వీటిని మరోసారి పరిశీలించి, వడపోసి మూడు పేర్లతో తుది జాబితాను సిద్ధం చేసి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముందు పెట్టి ఖరారు చేస్తామని ఆయన వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తమ పరిశీలకులు ఎవరి వత్తిళ్ళకు లొంగకుండా జాబితాలు సిఫార్సు చేశారని ఆయన చెప్పారు.డిసిసి అధ్యక్షులుగా ఉన్న వారు తిరిగి పోటీ చేయరాదన్న నియమం ఉండడం ఒక రకంగా మంచిదేనని, దీని వల్ల పార్టీలో కొత్త ఇంకా యువతరాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందన్న అభిప్రాయాన్ని పార్టీ రాష్ట్ర నాయకులు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ముఖ్య నేతలంతా హస్తినలోనే.. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తదితర ముఖ్య నాయకులు ఢిల్లీలోనే ఉన్నారు. ఆదివారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. బిసి రిజర్వేషన్ల కోసం తాము చేసిన కృషిని, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్న విషయాన్ని వివరించనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించి, ఏఐసిసి అగ్ర నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అందజేస్తామని పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇంకా ఏఐసిసి ముఖ్య నేతలతోనూ మంతనాలు జరిపే అవకాశం ఉంది. అధిష్టానానికి సమాచారం ఇచ్చాం..ః భట్టివిక్రమార్క ఇదిలాఉండగా కెసి వేణుగోపాల్‌తో సమావేశం ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ డిసిసి అధ్యక్షుల ఎంపిక విషయంలో అధిష్టానానికి సమాచారం అందించామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. డిసిసి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే గ్రామ, వార్డు స్థాయి నుంచీ కమిటీల ఎంపికను పూర్తి చేసి పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సేవలో నిమగ్నం అయ్యేలా చూస్తామన్నారు.

మన తెలంగాణ 26 Oct 2025 5:30 am

చివరి వన్డేలో భారత్ ఘన విజయం

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలతో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా చివరి వన్డేలో గెలుపొంది పరువు నిలుపుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన భారత్ ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 9 వికెట్ల తేడాతో ఓదార్పు విజయాన్నందుకుంది. దాంతో సిరీస్ 2-1తో ఆసీస్ కైవసమైంది. టీమిండియా సీనియర్ బ్యాటర్లలో రోహిత్ శర్మ 121 నాటౌట్(125 బంతుల్లో 13x4, 3x6) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ 74 నాటౌట్(81 బంతుల్లో 7x4) అజేయ అర్థశతకంతో రాణించాడు. తమలో ఇంకా వన్డే క్రికెట్ ఆడే సత్తా ఉందని చాటి చెప్పారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యా టింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రేన్‌షా(58 బంతుల్లో 2 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(41), మా థ్యూ షార్ట్(30) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(4/39) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. వాషింగ్టన్ సుందర్(2/44) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 232 పరుగులు 69 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(24) మరోసారి విఫలమవ్వగా.. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం.. స్వల్ప లక్ష్యచేధనలో టీమిండియాకు శుభారంభం దక్కింది. శుభ్‌మన్ గిల్(24) త్వరగానే ఔటైనా... తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం లభించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ చెలరేగాడు. 63 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. విరాట్ కోహ్లీ తనదైన శైలిలో చెలరేగాడు. 56 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రోహిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు.

మన తెలంగాణ 26 Oct 2025 5:10 am

త్వరలో కొత్త ఫీజులు ఖరారు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ క ళాశాలలకు 202528 కాలానికి కొత్త ఫీజుల ఖరారు వ్యవహారం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇంజనీరిం గ్, వృత్తి విద్యా కళాశాలల ఫీజులపై శనివారం తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) సమావేశం జరిగింది. సోమవారం మరోసారి నిర్వహించి ఫీజులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ తర్వాత ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది. ఈ సారి ఫీజుల పెంపు భారీగా ఉండకపోవచ్చనీ ర్యాంకింగ్, న్యాక్, పరిశోధనలు తదితర నూతన కొలమానాల ఆధారం గా ఫీజులు నిర్ణయించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నా యి. ఇంజినీరింగ్ కాలేజీల ఆదాయ, వ్యయాలను పరిశీలించి టిఎఎఫ్‌ఆర్‌సి ఇప్పటికే ప్రాథమికంగా ఫీజులపై ఓ నిర్ణ యం తీసుకుంది. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఫీజులపై విస్తృత కసరత్తులు చేశారు. టిఎఎఫ్‌ఆర్‌సి అధికారులు దాదాపు 160 కళాశాలల ప్రతినిధులతో పునర్విచారణ సమావేశాలు నిర్వహించారు. మళ్లీ కొత్త ఫీజులు ఖరారు చేశారు. దీని ప్రకారం అధిక శాతం కళాశాలలకు స్వల్పంగా, కొన్నింటికి గరిష్ఠంగా 20 నుంచి 30 శాతం మించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కళాశాలలు తమ ఫీజు ఖరారులో అన్యాయం జరిగిందని న్యాయస్థానానికి వెళ్లినా, శాస్త్రీయ ఆధారాలు చూపేందుకు విద్యాశాఖ సిద్ధమైనట్లు తె లుస్తోంది. మూడేళ్లకు ఒకసారి ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, బి.ఇడి, మేనేజ్‌మెంట్ తదితర కళాశాలల వార్షిక ట్యూషన్ ఫీజులను సవరించాల్సి ఉంటుంది. ఆయా కళాశాలల ఆదా య, వ్యయాలను పరిశీలించి సాధారణంగా టిఎఎఫ్‌ఆర్‌సి కొత్త ఫీజులను ఖరారు చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈసారి విద్యా నాణ్యత కోసం ఆయా కళాశాలల్లో అంతర్గత నాణ్యత పెంపు విధానం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, విద్యార్థుల ప్రతిభ, విద్యార్థులకు, సిబ్బందికి ముఖగుర్తింపు హాజరు, పా రదర్శకత, జవాబుదారీతనం కోసం వేతనాలు తదితర వాటి చెల్లింపునకు ఆధార్ అధీకృత విధానం, పరిశోధనలు,స్టార్టప్ లు, పరిశోధన పత్రాలు, జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. గ తంలో కొన్ని కళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చినట్లు, నిర్వహణ పనులకు అధికంగా ఖర్చు చేసినట్లు టిఎఎఫ్‌ఆర్‌సికి తప్పుడు లెక్కలు సమర్పించాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. 

మన తెలంగాణ 26 Oct 2025 4:30 am

‘గెలుపు’ రాజకీయాల్లో సానుభూతి సయ్యాట!

రాజకీయాల్లో ప్రత్యర్ధులు మాత్రమే ఉండే కాలంలో ఒక ప్రజాప్రతినిధి మరణిస్తే ఆయన లేదా ఆమె ప్రాతినిధ్యం వహించిన పార్టీకే ఏకగ్రీవంగా ఆ స్థానాన్ని వదిలేసి మిగతా రాజకీయ పార్టీలన్నీ మృతి చెందిన ఆ నేతకు గౌరవంగా నివాళులు అర్పించేవారు. క్రమక్రమంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు అనే మాట అంతరించిపోయి బద్ధ శత్రువులు మిగిలారు. ఇటీవలి కాలంలో, అవి జాతీయ రాజకీయాలైన, ప్రాంతీయ రాజకీయాలైనా అన్ని పార్టీలు ఒకరినొకరు శత్రువులుగానే పరిగణిస్తూ ఉండటం చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ ఎన్నిక జరిగినా రాజకీయ పార్టీలు పోటీని ‘స్పోర్టివ్’గా తీసుకోవడం మానేశాయి. అవతలి పక్షాన్ని ఓడించి తామే గెలవాలన్న పట్టుదల పెరిగింది. ఇది యుద్ధంలో శత్రువులు ఎంత మందినైనా చంపి విజయం సాధించాలన్న రాజ్యకాంక్ష వంటిది. అది ఇప్పుడు మనకు ఎల్లెడలా కనిపిస్తుంది. ఆ క్రమంలో ఉచ్చనీచాలు మరిచిపోయి, స్థాయిని విస్మరించి అవతలిపక్షం వారిని అవమానించే విధంగా మాట్లాడటం, ప్రకటనలు చేయడం పరిపాటి అయింది. ఈ పక్షం ఆ పక్షం అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు అట్లానే తయారవుతున్నాయి. ఇక ఎన్నికల అప్పుడు సరే సరి. పోటీలు పడి వ్యక్తిగత విమర్శలు, అవతలి వారి వ్యక్తిత్వ హననానికి కూడా వెనుకాడని స్థితి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక జరపవలసిన అవసరం ఏర్పడింది. నిజానికి ఇది పేరుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం. దీని పరిధిలో జూబ్లీహిల్స్ లేకపోవడం ఓ విచిత్రం. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రాష్ట్ర సమితి శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా ఈ ఉపఎన్నిక జరపవలసి వచ్చింది. గోపీనాథ్ 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికై పార్టీ మారి భారత రాష్ట్ర సమితిలో చేరి ఆ తరువాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి. ప్రస్తుతం ఆయన సతీమణి సునీత భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా బరిలో ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అనే యువ బీసీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా లంకల దీపక్ రెడ్డిని పోటీలోకి దింపింది. ఇక్కడ అంత ప్రాముఖ్యం లేకపోయినా ఒక విషయం సరదాగా అయినా గుర్తు చేసుకోవాలి. ఈ ముగ్గురు అభ్యర్దులూ ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీతో సంబంధం ఉన్న వారే. ముందే చెప్పుకున్నట్టు బీఆర్‌ఎస్ అభ్యర్ధి సునీత భర్త మాగంటి గోపినాద్ మొదట తెలుగు దేశం శాసన సభ్యుడే కాగా బీజేపీ ప్రస్తుత అభ్యర్థి రాజకీయ ప్రస్తానం కొంత కాలం చంద్రబాబు నాయుడు పార్టీలోనే. ఇక నవీన్ యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్‌ను 2019కి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆహ్వానం పలికి పార్టీలో చేర్చుకున్నారు. అప్పట్లో పార్టీలో చేరడానికి శ్రీశైలం యాదవ్ తీసిన ఊరేగింపును ఆనాటి హోంమంత్రి ఏ. మాధవ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు కూడా. ఆరోజుల్లో అది పెద్ద చర్చనీయాంశం కూడా అయింది. సరే ఇప్పుడిక్కడ ఆ పార్టీకి పెద్ద ప్రాముఖ్యత లేదనుకోండి, అయినా మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చాను, సెల్ ఫోన్ నేనే తెచ్చాను అన్న చందంగా అన్ని పార్టీల అభ్యర్ధులను నేనే తెచ్చాను అని కూడా చంద్రబాబు చెప్పుకోగలరు. ఇక ప్రస్తుతానికి వొస్తే, సానుభూతి పవనాలు వీచి తమ అభ్యర్థి తప్పకుండా గెలుస్తారనే నమ్మకం, ఈ రెండేళ్లలో అధికార కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగింది అన్న అభిప్రాయంతో తమ గెలుపు తధ్యమని అభిప్రాయంలో బిఆర్‌ఎస్ ఉంటే, ఉప ఎన్నికలు సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలమైన ఫలితాలనిస్తాయని ఒక అభిప్రాయంతో పాటు తాము వెనుకబడిన తరగతుల 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి చూపిన చొరవ, చిత్తశుద్ధి పనిచేసే తాము నియమించిన యువ బీసీ అభ్యర్థి గెలుపు ఖాయం అని భావిస్తున్నది అధికార కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని నాలుగు లక్షల మందికి పైగా ఓటర్లలో దాదాపు 1,20,000 ఓట్లు మైనారిటీలవి ఉండడం, ఈసారి మజిలీస్ పార్టీ పోటీ చేయకుండా అధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం కూడా తనకు కలిసి వచ్చే అంశంగా కాంగ్రెస్ భావిస్తున్నది. భారతీయ జనతా పార్టీ పోటీలో ఉన్న పెద్దగా ప్రభావం చూపలేకపోవచ్చునని అభిప్రాయం సర్వత్ర ఉన్నది. సరిగ్గా మరో రెండు వారాలకు ఎన్నిక జరగనున్న ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పక్షాలు పట్టుదలగా పనిచేయడానికి కారణాలు ఉన్నాయి. వాటిని గురించి చర్చించే ముందు ప్రత్యర్థులు శత్రువులుగా మారి పోటీలు పడుతున్న ఈ తరుణంలో ప్రజలలో సానుభూతి అనే అంశం అంతగా ప్రభావం చూపడం లేదని గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలకు వివిధ కారణాల చేత ఉప ఎన్నికలు జరిగాయి. వీటిల్లో జనం భిన్నమైన ఫ లితాలని రాజకీయ పక్షాలకు రుచి చూపించారు. 2016 లో ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో, ఖమ్మం జిల్లా పాలేరులో ఉప ఎన్నికలు జరిగాయి. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం బీఆర్‌ఎస్ పరమయింది. అట్లాగే పాలేరులో కూడా కాంగ్రెస్ స్థానం బీఆర్‌ఎస్ వశమైంది. ఇక్కడ సానుభూతి పనిచేయలేదు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి మృతి కారణంగా జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయి టిఆర్‌ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికై మంత్రి అయ్యారు. 2019లో లోకసభకు ఎన్నికైన కారణంగా ప్రస్తుత మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసినందు వల్ల జరిగిన ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి అప్పటి అధికార పక్షం బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిచారు. 2020లో ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మరణిస్తే ఆయన సతీమణిని బీఆర్‌ఎస్ పోటీకి నిలిపినా అక్కడ అనూహ్యంగా ప్రజలు బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావును గెలిపించారు. దుబ్బాకలో సానుభూతి పనిచేయలేదు. ఉప ఎన్నికల్లో అధికార పక్షమే గెలుస్తుందన్న వాదన కూడా పటాపంచలైంది. ఇక 2021లో నాగార్జునసాగర్‌లో బీఆర్‌ఎస్ శాసనసభ్యుడు నోముల నరసింహయ్య మరణిస్తే ఆయన కుమారుడు నగేష్ అదే పార్టీ నుంచి పోటీ చేస్తే జనం ఓట్లు వేసి గెలిపించారు. ఇట్లా దుబ్బాక నాగార్జునసాగర్‌లలో ఫలితాలు పూర్తి భిన్నంగా రావడానికి ఇతరేతర కారణాలు ఉంటాయి. అదే సంవత్సరంలో హుజరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నిక గురించి, ఆ వెనువెంటనే 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసిన ఉద్యమ సహచరుడు, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌ను అకారణంగా, అర్ధరాత్రి నిర్ణయం తీసుకుని మంత్రివర్గం నుంచి తొలగించడం, పార్టీ నుండి వెలివేయడం, అవినీతి కేసులు పెట్టడం వంటివి చేసిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్ణయాన్ని వ్యతిరేకించి హుజరాబాద్ ప్రజలు బిజెపి టికెట్ తెచ్చుకున్న ఈటెల రాజేందర్‌ను గెలిపించారు. దళిత బంధు వంటి బీఆర్‌ఎస్ జిమ్మిక్కులు కూడా అక్కడ పని చేయలేదు. బిజెపి ఘనత కంటే ఈటెల రాజేందర్‌కు ప్రజలలో ఉన్న వ్యక్తిగత పలుకుబడి, కేసీఆర్ నిర్ణయాల పట్ల పెరిగిన వ్యతిరేకత బాగా పనిచేసాయి. అదే మునుగోడు దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించి ప్రజలు బిఆర్‌ఎస్ అభ్యర్థికే పట్టం కట్టారు. అయితే మునుగోడులో భారత కమ్యూనిస్టు పార్టీని మళ్ళీ ఒకసారి తన సహజ మిత్రులని కౌగిలించుకొని భవిష్యత్తులో ఇంకెప్పుడు వారితో మిత్రత్వం వదులుకోబోనని కెసిఆర్ బోలెడు వాగ్దానాలు చేసిన కారణంగా ఆ పార్టీకి సంబంధించిన పదివేల ఓట్లు పడి అంతే తేడాతో టిఆర్‌ఎస్ అభ్యర్థి బయటపడి కెసిఆర్, బీఆర్‌ఎస్ పరువు దక్కినట్టు అయింది . హుజురాబాద్‌లో ఈటెల రాజేందర్‌కు సానుభూతి పనిచేస్తే మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి అది ఏ మాత్రం సాయం చేయలేదు. ఇక ఈ క్రమంలో జరిగిన చివరి ఉప ఎన్నిక 2024లో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో టిఆర్‌ఎస్ అధికారంలో ఉండగానే మరణించిన గడ్డం సాయన్న కూతు రు లాస్య నందిత ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎ మ్మెల్యేగా గెలిస్తే ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె కూడా మ రణించాక ఆమె సోదరి నివేదితని పోటీకి నిలిపితే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ సానుభూతిని కాదని అధికారం గెలిచింది. ఓ పక్క 2023లో అధికారం కోల్పోయి, 2024లో ఒక్క లోక్‌సభ స్థానం గెలుచుకోలేకపోయిన బిఆర్‌ఎస్‌కు కంటోన్మెంట్ ఓటమి మూలి గే నక్క మీద తాటి పండు పడ్డ సామెతగా తయారైంది. ఇక ఎవరి బలం ఎంతో స్పష్టంగానే ఉన్న సమయంలో ఒక్క అసెంబ్లీ స్థానంలో గెలుపు కోసం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీలు ఎందుకు పట్టుదలకు పోతున్నాయి అంటే, బీఆర్‌ఎస్‌కు ఇద అగ్ని పరీక్ష వంటిది. 2023లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా హైదరాబాద్ చుట్టుపక్కల గల నగర నియోజకవర్గాలన్నీ గెల్చుకున్నది. అధికారంలోకి వొచ్చాక కాంగ్రెస్ ఇది దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరం దాని చుట్టూ చేస్తున్నఅభివృద్ధి కార్యక్రమాల ద్వారా మరింత బలోపేతం అయితే పార్టీ మనుగడ కష్టం కాబట్టి జూబిలీహిల్స్‌ను నిలుపుకోవాలన్న పట్టుదల బీఆర్‌ఎస్‌ది. స్థానిక ఎన్నికల ముంగిట్లో జూబ్లీహిల్స్ గెలుపు మరింత ఉత్సాహాన్నిస్తుందన్న ఆలోచన కాంగ్రెస్‌ది.

మన తెలంగాణ 26 Oct 2025 4:00 am

వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా సర్

న్యూఢిల్లీ : దేశ వ్యాప్త ఎ న్నికల ఓటర్ల జాబితాల స వరణ(సర్)ను ఎన్నికల సంఘం వచ్చే వారం నుం చి ఆరంభించనుంది. వ చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పా టు పది నుంచి 15 రాష్ట్రాలలో తొలుత సర్ ప్రక్రియ చేపడుతారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. వచ్చే ఏడాది తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాలలో ఓటర్ల జాబితాల సవరణ కీలకం కానుంది. ఇక ఎప్పటి నుంచి ఈ సవరణల ప్రక్రియ ఆరంభమవుతుందనేది ఎన్నికల సంఘం నవంబర్ తొలివారంలో ప్రకటిస్తారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే లేదా జరగాల్సిన చోట్ల సర్ నిర్వహించడం లేదు. మిగిలిన రాష్ట్రాలలోసర్ ఆ తరువాతి దశల్లో చేపడుతారు. ఓటర్ల జాబితా సవరణల ద్వారా ఎన్నికలు పారదర్శకతతో నిర్వహించేందుకు దారి ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికల సంఘం రెండు సార్లు రాష్ట్రాల ఇసిలతో సమావేశం జరిపింది. క్షేత్రస్థాయిలో సాధకబాధకాలను తెలుసుకుంది. సర్ విషయంలో వివాదాలకు తావులేకుండా రాజకీయ పార్టీలు, సంస్థలు , పౌరులు తమకు నిర్మాణాత్మక సహకారం అందించాలని ఎన్నికల సంఘం పిలుపు నిచ్చిం ది. ఇంతకు ముందటి ఓటర్ల జాబితాల తుది ఫైళ్లను ఎన్నికల సంఘం ఇప్పటికే వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. వీటి ప్రాతిపదికననే ఓటర్ల జాబితాలో సవరణకు వీలేర్పడుతుందని అధికారులు తెలిపారు. బీహార్ సర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల విమర్శల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పుడు ఎటువంటి వివాదాలకు తావులేకుం డా చూసుకునేందుకు సిద్ధం అయింది. 

మన తెలంగాణ 26 Oct 2025 3:30 am

అంగన్‌వాడీలో త్వరలో భారీగా భర్తీలు

మన తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా నియమితులైన సూపర్‌వైజర్లంతా త మ వృత్తి ధర్మాన్ని నిబద్దతతో పాటించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శా ఖ మంత్రి సీతక్క తెలిపారు. పిల్లల భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తే మీ చే తుల్లో ఉన్నందున మీ వృత్తి ధర్మం ప్రజల ఆశలు, అవసరాలకు తగినట్టుగా ఉండాలని కొత్త సూపర్‌వైజర్లకు మంత్రి మార్గదర్శనం చేశారు. రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు నియామక పత్రాలను మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క శనివారం స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి చ్చేసిన మంత్రి సీతక్క, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి తో కలిసి కొత్తగా నియమితులైన సూపర్వైజర్లను అభినందిస్తూ, వేల మందితో పో టీ పడి మీరు సాధించిన ఈ కొలువులు మీ కష్టానికి ప్రతిఫలం. మీ నిరీక్షలు ఫలించాయి, మీ ఉద్యోగ కలలను రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. ఒక్కో సూపర్‌వైజర్ కింద 25 అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుందని, ఎక్కడా చిన్న లోపం లేకుం డా ఆయా కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పౌష్టికాహారానికి మాత్రమే పరిమితం చేయకుండా చిన్నారులకు ప్రాథమిక విద్య ను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. మ హిళా శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. అం గన్వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తోందని ఆమె అన్నారు. తెలంగాణ నుంచే అంగన్వాడీ కేంద్రాలకు బీజం పడింది ఐసిడిఎస్ సేవలకు ఈ దేశంలో ఇందిరా గాంధీ గారు ప్రాణం పోశారని అ న్నారు. మహిళలకు గౌరవం, చిన్నారులకు సంరక్షణ కలగాలని ఆమె ప్రారంభించిన అంగన్వాడీ సేవలు తెలంగాణ నేల నుంచే బీజం వేశాయని గుర్తు చేశారు. 1970లో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాయని అన్నారు. అంగన్వాడీ హెల్పర్ నుంచి మహిళా శాఖ సెక్రటరీ వరకు ఈ రోజు ఉన్న పదవులన్నీ ఇందిరా గాంధీ చలువేనని తెలిపారు. ప్రతి మహిళ ఆమెకు రుణపడి ఉండాలని సీతక్క పేర్కొన్నారు. అమ్మ ఆప్యాయతకు నిలయాలుగా అంగన్వాడీ కేంద్రాలు మారుతున్నాయని వివరించారు. చిన్నారుల కోసం 57 రకాల ఆటవస్తువులు, యూనిఫాంలు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో సూపర్‌వైజర్లు కీలక పాత్ర పోషించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. అంగన్వాడీ సిబ్బందికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నాం. త్వరలో 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టబోతున్నామని తెలిపారు. నియామక పత్రాలు అందుకునే సమయంలో పలువురు అభ్యర్థులు భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటు ంబ సభ్యులు, పిల్లలను హత్తుకొని ఆనంద భాష్పాలు కార్చారు. వారి కళ్లల్లో ప్రతిఫలించిన ఆనందం తెలంగాణ ప్రజా ప్రభుత్వం, మంత్రి సీత కనితిత్వంలోని మహిళా సంక్షేమ శాఖ పనితనానికి నిదర్శనంగా నిలిచింది. పటిష్టమైన సమాజం అంగన్వాడీల్లోనే నిర్మితమవుతుంది మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి మాట్లాడుతూ పటిష్టమైన సమాజం అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్మితమవుతుందని తెలిపారు. మహిళల కు పెద్దదిక్కుగా ఉన్న సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండటం ఆ శాఖలోని సిబ్బంది అదృష్టమని పేర్కొన్నారు. సీతక్క స్ఫూర్తితో సూపర్వైజర్లంతా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. నియామక పత్రాలు అందుకు న్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సూపర్వైజర్లు విధి నిర్వహణలో అత్యంత నిబద్ధతతో పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు.

మన తెలంగాణ 26 Oct 2025 3:00 am

రష్మిక నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డులు వస్తాయి

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. శనివారం ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ “ట్రైలర్‌లో ఏం చూశారో అదే సినిమా. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా చూసి ఆ ఎమోషన్ తో బయటకు వస్తారు. హీరో దీక్షిత్, హీరోయిన్ రశ్మిక తమ నటనతో కథకు లైఫ్ ఇచ్చారు. సినిమాలో నేనూ ఒక రోల్ చేశాను. ఇది రెగ్యులర్ ఫార్మాట్ లవ్ స్టోరీ కాదు. నిజాయితీగా ఒక కథ చెప్పాలని మేమంతా ప్రయత్నించాం”అని అన్నారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ “రష్మిక లేకుంటే ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమానే లేదు. దీక్షిత్ మాకు దొరికిన గొప్ప నటుడు. ఆయన టాలీవుడ్‌లో ‘ది గర్ల్ ఫ్రెండ్‘ తర్వాత మరో పదేళ్లు వరుసగా సినిమాలు చేస్తారు. వీళ్లిద్దరు తమ నటనతో ఆకట్టుకుంటారు”అని తెలిపారు. హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ “ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి లవ్ స్టోరీని ఇప్పటిదాకా మనం చూడలేదు అనిపించింది. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అనే ఫీల్ కలిగింది. ఇందులో భూమా అనే పాత్రలో నటించాను. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ తోనే కొన్ని మన విషయాలు షేర్ చేసుకుంటాం. అలాంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది”అని తెలియజేశారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “రష్మికకు ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డులు వస్తాయి. ఈ సినిమా చూశాక దీక్షిత్ ఎంత మంచి నటుడు అనేది ఆడియెన్స్ తెలుసుకుంటారు. రష్మిక, దీక్షిత్‌తో మంచి నటనను రాబట్టాడు రాహుల్. అతన్ని చూస్తే ఇలాంటి సినిమా ఇతను చేశాడా అనిపిస్తుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో దీక్షిత్ శెట్టి, విద్యా కొప్పినీడి, బన్నీ వాస్, ఎస్‌కేఎన్, కృష్ణన్ వసంత్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 26 Oct 2025 12:46 am

మళ్లీ వస్తామో లేదో!: రోహిత్

సిడ్నీ: నేను, విరాట్ కోహ్లీ మళ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో వస్తామో లేదో తెలియదని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన ప్రతీ క్షణం అద్భుతమేనని పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరివన్డేలో రోహిత్ శర్మ(121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(74 నాటౌట్) అజేయ అర్థ శతకంతో రాణించాడు. మ్యాచ్ అనంరతం రవి శాస్త్రి, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ ధన్యవాదాలు తెలిపాడు. ‘నాకు ఆస్ట్రేలియా అంటే ఇష్టమే. సిడ్నీ వేదికగా ఆడటం సంతోషంగా ఉంది. నా తొలి ఆసీస్ పర్యటన 2008 నుంచి మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ పర్యటన కూడా చాలా సరదాగా గడిచింది. మేం మళ్లీ క్రికెటర్లుగా ఆసీస్‌కు వస్తామో లేదో తెలియదు. గత 15 ఏళ్లలో మేం సాధించిన ఘనతల కంటే క్రికెట్ ఆడటాన్ని ఎక్కువగా ఆస్వాదించాం. ఆసీస్ గడ్డపై ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టమే. విరాట్ కోహ్లీకి కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను’అని రోహిత్ తెలిపాడు. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డ్ తోపాటు ప్లేయర్ ఆఫ్ దిసిరీస్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా తన ప్రదప్రర్శన గురించి మాట్లాడిన రోహిత్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

మన తెలంగాణ 26 Oct 2025 12:26 am

వార ఫలాలు (26-10-2025 నుండి 01-11-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా ఒత్తిడికి ఎక్కువగా లోనవుతారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. గతంలో కంటే కూడా పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత విషయ వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపార సంబంధిత వ్యవహారాలలో నష్టాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీకున్న తెలివితేటలతో ఓర్పుతో సహనంతో ఏ సమస్యనైనా పరిష్కరించగలను అని నమ్మకం ఏర్పడుతుంది. ఆరోగ్య పరంగా ప్రయాణాల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. సంతానం యొక్క చదువు పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. కాలభైరవ రూపు ఇంద్రాణి రూపు మెడలో ధరించండి. పవిత్రమైన ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా శివారాధన చేయండి. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు ఎరుపు. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా గ్యాస్ట్రిక్ అజీర్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి. కళారంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా లేదు. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా సహోద్యోగులతో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టమైనది. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు తెలుపు. మిథున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ ఈ వారం చేతికి అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు విదేశాలకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఏర్పడినటువంటి అడ్డంకులు ఈ వారం తొలగిపోతాయి. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. చాలాకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని చదవండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి-ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరంగా చెప్పుకోదగిన స్థాయిలో సమస్యలు ఏర్పడవు. ఉద్యోగ పరంగా మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. సొంత నిర్ణయాలు ఒక్కోసారి కలిసి రాకపోవచ్చు. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం మరియు సాయంత్రం నువ్వుల నూనెతో ఓంనమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. కర్కాటక రాశి వారికి ఈ వారం గడిచిన కొన్ని వారాల కంటే కూడా బాగుందని చెప్పవచ్చు. మీరు ఏపని మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో రాణించ గలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. సినీ కళా రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలను సక్రమంగా ఉపయోగించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. ఈ కార్తిక మాసంలో ఓం నమశివాయ భక్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్ లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో. సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. వ్యాపారంలో వచ్చిన లాభాలను పెట్టుబడులు పెడతారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఈ కార్తీకమాసంలో ఉదయం సాయంత్రం ప్రతి రోజు కూడా ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వచ్చిన లాభాలకు సమానంగా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య పరంగా కూడా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడుతాయి. దూర ప్రయాణాలలో చిన్నచిన్న ఆటంకాలు ఏర్పడతాయి. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఋణ దాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కొందరి ప్రవర్తన వలన మానసిక చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు ప్రతి నిత్యం ఓం నమశివాయ వత్తులతో నువ్వులనూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రీన్. తులా రాశి వారికి గతవారం కంటే ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు అప్లై చేసిన లోన్లు మంజూరు అవుతాయి. భూ సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. ఈ వారం పొదుపు కూడా చేయగలుగుతారు. కొంతమేరకు అప్పులను తీర్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో స్థానాచలం కోరుకున్న వారికి కోరుకున్నట్టు జరుగుతుంది. అలాగే ప్రమోషన్స్ కూడా లభిస్థాయి. వివాహ ప్రయత్నాలు కొంత నెమ్మదిగా జరుగుతాయి. సంతానం పట్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ సంబంధిత వ్యవహారాలు సానుకూల పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఈ రాశి వారికి కుటుంబం పరంగా రావాల్సిన బెనిఫిట్స్ దక్కుతాయి. ఈ రాశి వారికి నూతన గృహ యోగం ఉన్నది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. విద్యార్థిని విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించాలి మనసును అదుపులో ఉంచుకోవాలి. ప్రేమ వివాహాలకు సంబంధించి జాగ్రత్త వహించండి. అన్నీ నాకే తెలుసు అనే భావనను పక్కనపెట్టి స్థిమితంగా ఆలోచించడం మంచిది. లేకపోతే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మోసపోయే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి బ్యూటీషియన్స్ కి టెక్నీషియన్స్ కి సాఫ్ట్వేర్ రంగంలోని వారికి అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ వారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ బిజినెస్ వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్త వహించండి. నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. కాలభైరవ రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మంచిది. ఈ కార్తీకమాసంలో మొగలిపువ్వు కుంకుమతో స్వామివారికి అమ్మవారికి పూజ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ . వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇటు వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను మంచి ఫలితాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు 10 శాతం కష్టపడితే 100% ఫలితం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ వారం సరైన సమయం. అదేవిధంగా ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు కూడా చాలా కలిసివచ్చే విధంగా గోచరిస్తుంది. ఈ రాశి వారు కోపతాపాలకు దూరంగా ఉంటారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి జాగ్రత్త వహించండి. అదేవిధంగా విదేశీయాన సంబంధిత విషయ వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఈ రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ వారికి సినీ కళా రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకు సైతం మంచి లాభాలు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. మీరు చేపట్టే ప్రతి పని ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళతాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో నువ్వులు నూనెతో దీపారాధన చేయడం మంచిది. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకోకుండా పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసివచ్చే రంగు తెలుపు. ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. దూర ప్రాంత ప్రయాణాలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి. అనుకోని అవార్డ్స్ రివార్డ్స్, అతిధి మర్యాదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ వారం ముందుకెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఎక్కువగా పొగిడే వారు ఉంటారు వారి పట్ల జాగ్రత్త వహించండి. పదిమందికి ఏదో విధంగా సహాయ పడాలనే ఆలోచన నెరవేరుతుంది. నూతన గృహ యోగం ఉంది రియల్ ఎస్టేట్ వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ కు సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. రావలసిన ధనం సమయానికి చేతికి అందుతుంది.ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చాలా చక్కగా ఉంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోండి. విదేశీ సంబంధిత విష వ్యవహారాలు కొంత నెమ్మదిగా సాగుతాయి. వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించండి. ఈ రాశి వారిపై ఈర్షద్వేషాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది దీనికోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి అలాగే శని స్తోత్రం కూడా చదవండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయాలి. అలాగే మొగలిపువ్వు కుంకుమతో స్వామివారికి అమ్మవారికి కుంకుమార్చన చేయటం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధ విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంత అనుకూలంగా లేవు సొంతంగా వ్యాపారం చేసుకోవడం మంచిది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్లాలి. లేదా ఆప్త మిత్రులు లేక స్నేహితుల సలహాలు తీసుకోవాలి. కానీ నిర్ణయంమాత్రం మీదే అయ్యుండాలి. అలాగే సంతాన సంబంధిత వ్యవహారాలు కూడా బాగున్నాయి పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో లావాదేవీలు నిలకడగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు బాగుంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన ప్రాజెక్టులు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు బాగుంటాయి. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్. కుంభరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. నలుగురిలో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చే వేస్తారు. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా లేవు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండటం మంచిది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. ఈ కాలంలో కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆత్మీయుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెడతారు. అమ్మకాలు కొనుగోలులో లాభపడతారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ఉద్యోగాలలో మీరు ఆశించిన పురోగతి సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. పవిత్రమైన ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.  

మన తెలంగాణ 26 Oct 2025 12:20 am

వారం చివరలో బంగారం ధరల్లో తగ్గుదల

న్యూఢిల్లీ : వారాంతంలో అమెరికా ద్రవ్యోల్బణం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఫెడరల్ రిజర్వ్ రాబోయే వారంలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముందనే అంచనాలు ఏర్పడాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి స్పాట్ గోల్ 0.2 శాతం తగ్గి ఒక ఔన్స్ 4,118.29 డాలర్ల వద్ద నిలిచింది. వారంలో గోల్డ్ ధరలు మొత్తం 3 శాతం పైగా తగ్గాయి. డిసెంబర్ డెలివరీకి అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి 4,137.8 డాలర్ల వద్ద ముగిశాయి. వైట్ హౌస్ ప్రకారం, నవంబర్ 1లోగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశం జరగనుంది. గోల్డ్ ధరలు 4,000 డాలర్ల దిగువకు పడితే 3,850 వరకు పడే అవకాశం ఉంది అని బ్లూ లైన్ ఫ్యూచర్స్ స్ట్రాటజిస్ట్ ఫిల్లిప్ స్ట్రీబుల్ పేర్కొంది. ప్లాటినమ్ 1 శాతం తగ్గి 1,608.77 డాలర్ల వద్ద, పల్లాడియం 0.5 శాతం తగ్గి 1,450.05 డాలర్ల వద్ద నిలిచింది.

మన తెలంగాణ 25 Oct 2025 11:35 pm

రిలయన్స్, ఫేస్‌బుక్‌లు కలిసి కొత్త ఎఐ కంపెనీ ఏర్పాటు

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్ కలిసి కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్ వెంచర్‌కు రిలయన్స్ ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ (ఆర్‌ఇఐఎల్) అని పేరు పెట్టారు. రిలయన్స్ శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ వివరాలను వెల్లడించింది. ఈ జాయింట్ వెంచర్‌లో ముకేశ్ అంబానీ, మార్క్ జుకర్‌బర్గ్ సంస్థలు సంయుక్తంగా రూ.855 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. ఆర్‌ఇఐఎల్‌లో రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ 70 శాతం వాటా కలిగి ఉంటే, మిగిలిన 30 శాతం వాటాను మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్ అనుబంధ సంస్థ అయిన ఫేస్‌బుక్ ఓవర్సీస్ ఇంక్ కలిగి ఉంది. రిలయన్స్ ఒక్కో షేరుకు రూ.10 చొప్పున 20 మిలియన్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసి రూ.2 కోట్లు ప్రారంభ పెట్టుబడిగా పెట్టింది. ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం ఎఐ సేవలను అభివృద్ధి చేయడం, మార్కెట్ చేయడం, విక్రయించడమే. రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో ఈ జాయింట్ వెంచర్‌ను ప్రకటించారు. మెటా ఓపెన్ సోర్స్ లామా మోడల్స్, రిలయన్స్ వ్యాపార పరిధిని ఉపయోగించి వివిధ రంగాలకు ఎఐ పరిష్కారాలను అందించడం ఆర్‌ఇఐఎల్ లక్షంగా ఉంది. ఆర్‌ఇఐఎల్ రెండు ప్రధాన ఉత్పత్తులపై పని చేస్తోంది - ఎంటర్‌ప్రైజ్ ఎఐ ప్లాట్‌ఫామ్- యాజ్- ఎ-సర్వీస్, ఇది కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా జనరేటివ్ ఎఐ మోడళ్లను అభివృద్ధి చేసుకునేలా చేస్తుంది. ముందే కాన్ఫిగర్ చేసిన పరిష్కారాలు, ఇవి అమ్మకాలు, మార్కెటింగ్, ఐటి కార్యకలాపాలు, కస్టమర్ సేవ, ఫైనాన్స్ వంటి రంగాలకు అనుకూలంగా ఉంటాయి. లామా ఆధారిత ఎఐ మోడళ్లలో మెటా సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తుంది. ఇక రిలయన్స్ తన విస్తృత డిజిటల్ మౌలిక వసతులను, భారతదేశంలోని వేల వ్యాపారాలకు సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ఈ ఎఐ పరిష్కారాలను క్లౌడ్, హైబ్రిడ్ వాతావరణాలలో వినియోగించవచ్చు. ఇది కంపెనీలకు ఖర్చులను తగ్గించడంలో, సామర్థ్యాన్ని పెంచడంలో దోహదం చేస్తుంది. రిలయన్స్ ప్రకారం, ఆర్‌ఇఐఎల్ స్థాపనకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఈ భాగస్వామ్యం భారత వ్యాపారాలకు ఎఐ టెక్నాలజీని సులభంగా అందుబాటులోకి తెచ్చే దిశగా కీలక అడుగుగా పరిగణిస్తోంది.

మన తెలంగాణ 25 Oct 2025 11:27 pm

భార్యను కత్తెరతో కడుపులో పోడిచిన భర్త

జన్నారం మండలం చింతగూడలో శనివారం సుమారు 3 గంటల ప్రాంతంలో అనుమానంతో సూర అశోక్ అనే వ్యక్తి భార్య సూర అనితను బీడీల కత్తెరతో ఇష్టం వచ్చినట్లు పొడిచాడు. ఈ సంఘటన చింతగూడలో కలకలం రేపింది. రక్తం మడుగులో అనిత కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న ౧౦౮ సిబ్బంది చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీడీల కత్తెరతో మెడ పై, పలు చోట్ల కడుపులో పొడిచినట్లు 108 సిబ్బంది తెలిపారు వివరాలలోకి వెళితే... జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్థంభంపల్లికి చెందిన సూర అశోక్‌తో 5 సంవత్సరాల క్రితం జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన అనితతో వివాహం అయింది. ప్రస్తుతం ఈ దంపతులకు 4 సంవత్సరాల బాలుడు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం నుంచి భార్యభర్తల మధ్య  తరచుగా కొట్లాటలు జరిగాయని, కొన్ని సార్లు పెద్దలు సర్ది చెప్పడంతో ఇక నుంచి గొడవలు చేసుకోబోమని కలిసిమెలిసి ఉంటామని చెప్పినట్లు తెలిసింది. వీరిద్దరి మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయో మాత్రం ఎవరు చెప్పడం లేదు. ఆర్దిక పరిస్ధితులా..?, లేదా భార్యపై ఉన్న అనుమానమా.? అనేది తెలియడం లేదు. సంవత్సరం క్రితం భార్యభర్తలు కోపతాపాలను పక్కన పెట్టి పని చేసుకోవాలనే ఆలోచనకు రావడంతో భర్త అశోక్ ఏడు నెలల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు.  అశోక్ దుబాయ్ నుంచి మూడు రోజుల క్రితం స్వగ్రామమైన స్తంభంపల్లికి వచ్చి శుక్రవారం జన్నారం మండలం చింతగూడలో తల్లిగారి ఇంట్లో ఉంటున్న భార్య అనిత వద్దకు వచ్చి వెంటనే వెళ్లిపోయాడు. ఆయనకు ఏమి అనుమానం వచ్చిందో ఏమో తెలియదు కాని శనివారం ఎలాంటి సమాచారం లేకుండానే మళ్లి చింతగూడకు అశోక్ రావడం ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంట్లోనే ఉండిపోయాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన అనితతో ఏమి మాట్లాడకుండానే బీడీల కత్తెరతో ఇష్టం వచ్చిన చోట పొడిచి బయటకు రావడం ఆమె రక్తపు మడుగులో కింద పడి కేకలు వేయడం, గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇవ్వడం, ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. భార్యను హత్యయత్నానికి యత్నించడం కేవలం అనుమానమేనని ప్రచారం జరుగుతుంది. భార్యపై చేసిన దాడిలో సైతం భర్త అశోక్ చేతులకు గాయాలైనట్లు తెలిసింది. ఆయన సైతం ప్రస్తుతం జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనుష తెలిపారు. ఈ కత్తిపోట్లు చింతగూడలో కలకలం రేపింది. ఈ విషయంలో ఎస్సై అనుషను సంప్రదించగా ఇప్పటికి ఎలాంటి పిర్యాదు రాలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిత వద్దకు వెళ్లి పిర్యాదు తీసుకుంటామని తెలిపారు.  

మన తెలంగాణ 25 Oct 2025 11:20 pm

కరూర్ బాధితులకు విజయ్ పరామర్శ

చెన్నై : కరూర్‌లో టివీకే పార్టీ ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను సోమవారం పార్టీ అధ్యక్షుడు విజయ్ కలుసుకోనున్నారు. చెన్నై సమీపంలోని రిసార్టులో వారిని పరామర్శించనున్నారు. దీనికోసం టీవీకే పార్టీ రిసార్టులో 50 గదులను బుక్‌చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాట్లు చేసినట్టు పార్టీ పేర్కొంది. అక్కడకు వెళ్లడానికి బస్ బుక్ చేశారని, మాలో చాలామంది వెళ్తున్నామని బాధిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మీడియాకు వెల్లడించారు.

మన తెలంగాణ 25 Oct 2025 11:00 pm

నార్త్ కరోలినాలో కాల్పులు.. ఇద్దరి మృతి

మాక్స్‌టన్ ( అమెరికా) : ఆగ్నేయ నార్త్‌కరోలినాలో వారాంతపు పార్టీ వేడుకల్లో కాల్పులు చోటు చేసుకుని ఇద్దరు మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 13 మంది కాల్పులకు బలయ్యారని రోబ్‌సన్ కౌంటీ షెరీఫ్‌బర్నిస్ విల్కిన్స్ కార్యాలయం వెల్లడించింది. మాక్సటన్ అవతల 150 కిమీ దూరంలో గ్రామీణ ప్రాంతంలో ఈ పార్టీ వేడుకలు జరిగాయని, కాల్పులు జరగడంతో అక్కడ నుంచి 150 మంది కన్నా ఎక్కువ మంది పారిపోయారని అధికారులు తెలిపారు. అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. 

మన తెలంగాణ 25 Oct 2025 10:55 pm