SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

AP |వర్షంతో.. రైతుల కన్నీళ్లు.!

AP | వర్షంతో.. రైతుల కన్నీళ్లు.! పెడన, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా

ప్రభ న్యూస్ 13 Nov 2025 11:26 am

Nara Lokesh : నారా లోకేశ్ రివీల్ చేసిన విషయం ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు

తెలుగు పోస్ట్ 13 Nov 2025 11:24 am

Vakiti Srihari |కృషి చేస్తా..

Vakiti Srihari కృషి చేస్తా.. ఊట్కూర్, ఆంధ్రప్రభ – క్రీడాభివృద్ధికి తెలంగాణ (Telangana)

ప్రభ న్యూస్ 13 Nov 2025 11:24 am

శివరాంపల్లి బీసీ హాస్టల్ ఖాళీ చర్యకు వ్యతిరేకంగా నిరసన

రాజేంద్రనగర్,నవంబర్13(జనంసాక్షి)రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని ప్రభుత్వ బీసి బాలుర వసతి గృహాన్ని విద్యా సంవత్సరమధ్యలో ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించే ప్రయత్నాన్ని స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. …

జనం సాక్షి 13 Nov 2025 11:15 am

Bandi |సంజయ్ సీరియస్..

Bandi | సంజయ్ సీరియస్.. ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్ర ప్రభ –

ప్రభ న్యూస్ 13 Nov 2025 11:10 am

పెళ్లికొడుకుపై కత్తితో దాడి.. నిందితుడ్ని వెంటాడిన డ్రోన్ కెమెరా

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి మంటంపలో వధువుపై కత్తితో దాడికి దిగారు

తెలుగు పోస్ట్ 13 Nov 2025 11:09 am

Nara Lokesh Unveils ₹82,000 Crore ReNew Power Investment in Andhra Pradesh

Andhra Pradesh is witnessing a massive wave of investments with two major announcements signalling renewed investor confidence in the state’s growth story. ReNew Power, one of India’s leading clean energy companies, has announced plans to invest ₹85,000 crore in the renewable energy sector, marking its grand return to the state after five years. Announcing the […] The post Nara Lokesh Unveils ₹82,000 Crore ReNew Power Investment in Andhra Pradesh appeared first on Telugu360 .

తెలుగు 360 13 Nov 2025 11:05 am

రేపు జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు

నవంబర్ 13 జనం సాక్షిహైదరాబాద్‌: అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం …

జనం సాక్షి 13 Nov 2025 11:05 am

వణికిస్తున్న చలి

నవంబర్ 13 జనం సాక్షిహైదరాబాద్‌: రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Wave) రోజురోజుకు పెరిగిపోతున్నది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో …

జనం సాక్షి 13 Nov 2025 11:00 am

Maha Dharna |ప్రాణాలు తీస్తారా..?

Maha Dharna | ప్రాణాలు తీస్తారా..? గన్నేరువరం, ఆంధ్రప్రభ : డబుల్ రోడ్డు

ప్రభ న్యూస్ 13 Nov 2025 10:59 am

వికారాబాద్ లో లారీ బోల్తా

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడా శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ అతి వేగంగా నడపడంతో బోల్తా పడింది. ఈ ఘటన బీజాపూర్-హైద్రాబాద్ నేషనల్ హైవే రోడ్డులో చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

మన తెలంగాణ 13 Nov 2025 10:53 am

AP |వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట

AP | వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట గన్నవరం – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Nov 2025 10:51 am

Commissioner |ఆకస్మిక తనీఖీలు..

Commissioner | ఆకస్మిక తనీఖీలు.. కరీమాబాద్, ఆంధ్రప్రభ – వరంగల్ (Warangal) నగరపాలక

ప్రభ న్యూస్ 13 Nov 2025 10:42 am

Kadem |బ్రతికించండి ..

Kadem | బ్రతికించండి .. కడెం, ఆంధ్రప్రభ – నిర్మల్ (Nirmal) జిల్లా

ప్రభ న్యూస్ 13 Nov 2025 10:21 am

మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకోం: సదానందం

చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ కొరడా రంగంలోకి దిగిన రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ పలు ప్రాంతాలలో వాహన విస్తృతంగా తనిఖీలు. మన తెలంగాణ/ రాజేంద్రనగర్: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాద సంఘటన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఫిట్నెస్ లేని నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేయడం ప్రారంభించారు. జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం అదేశాల మేరకు గురువారం కూడా ఓవర్ లోడ్ తో రోడ్డుపై నడుస్తున్న వాహనాలపై కొరడా‌‌ ఝుళిపించారు. టిప్పర్ లారీ ఓవర్ లోడ్ తో బస్సు ఢీకొట్టి 20 మంది ప్రాణాలను తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓవర్ లోడ్ తో తిరుగుతున్న వాహనాల పై ప్రత్యేక నిఘాను రవాణా శాఖ పెట్టింది. మోటారు వెహికల్ యాక్ట్ కు విరుద్దంగా నడుస్తున్న పలు వాహనాలను అధికారులు సీజ్ చేశారు. వాహనాలను అనువనువు రవాణా శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో తనిఖీలు చేపడుతున్నారు. ప్రతి వాహనాన్ని ఆపి డాక్యుమెంట్స్ ను అధికారుల బృందం చెక్ చేస్తున్నారు.నిబందనలకు విరుద్దంగా రోడ్డుపై తిరుగుతున్న వాహనాలను ఎక్కడిక్కడ సీజ్ చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్‌నెస్, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వెయింగ్ స్లిప్ లను క్షుణ్ణంగా ఈ తనిఖీల్లో పరిశీలిస్తున్నారు. ఓవర్ లోడ్ తో నడుస్తున్న వాహనాల యజమానులకు, డ్రైవర్ లకు నోటీసులు జారీ చేయడం జరిగిందని అధికారులు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైకి వాహనాలు వస్తే సీజ్ చేస్తామని రంగారెడ్డి జిల్లా ఉప రవాణ కమిషనర్ సదానందం హెచ్చరించారు. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్‌నెస్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు రోడ్డుపై తిరిగితే సహించేది లేదని  హెచ్చరికలు జారీ చేశారు. నిబందనలకు విరుద్దంగా రోడ్డుపై ఎలాంటి వాహనాలు తిరిగినా కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ట్యాక్స్ లేని వాహనాలకు 200 శాతం పెనాల్టిలు వసూల్ చేస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వాహనాలను తీసుకువచ్చే డ్రైవర్ ల డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దుకు వెనుకాడేది లేదని ఆయన చెప్పారు. ప్రతి రోజు తనిఖీలు చేసినప్పటికి ఓవర్ లోడ్ తో కొంత మంది వాహనాలు నడుపుతున్నారని తెలియజేశారు. అలాంటి వాహనాలపై నిఘా ప్రత్యేక నికా కొనసాగించి ఓవర్ లోడ్ తో వాహనాల పూర్తిగా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మనుషుల ప్రాణాలతో చలగాటం ఆడితే ఊరుకోమన్నారు. మైనింగ్ అధికారులు కూడా ఓవర్ లోడ్ వాహనాల పై దృష్టి సారించాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మైనింగ్ అధికారులు కూడా సహకరించాలని, లారీలు ఎక్కడి నుండి మెటీరియల్ తీసుకొని వస్తున్నారో అక్కడే కట్టడి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.  స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు క్రషర్ మిషన్లపై దృష్టి పెట్టాలని, అక్కడే ఓవర్ లోడ్ కాకుండా చూస్తే సమస్యలు ఉత్పన్నము కావన్నారు. ఇకపై నిబంధనలకు విరుద్దంగా వాహనాలు రోడ్డుపై తిరిగితే మోటార్ వాహన చట్ట ప్రకారం గట్టి చర్యలు తీసుకోవడానికి సంకోచించేదిలేదని ఆయన హెచ్చరించారు.

మన తెలంగాణ 13 Nov 2025 10:16 am

India Vs South Africa : ప్రపంచ ఛాంపియన్ ఫైనల్ కు చేరుకోవాలంటే?

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది

తెలుగు పోస్ట్ 13 Nov 2025 10:15 am

Delhi Bomb Blast : కారు నడిపింది అతనే.. తేల్చిన పోలీసులు

ఢిల్లీ రెడ్‌ఫోర్ట్‌ సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడులో కారు నడిపింది డాక్టర్‌ ఉమర్‌ నబీనేనని పోలీసులు తెలిపారు

తెలుగు పోస్ట్ 13 Nov 2025 10:10 am

BB Kingdom Task: Fun Banter, Ragging, Drama and a New King in the House

The BB Kingdom task continued today, but before the intense competition resumed, the house saw a round of teasing, jokes, and lighthearted chaos. By the end of the episode, however, the mood shifted completely as a surprising new king was crowned. Playful Banter Before the Task Before the BB Kingdom resumed, the vibe in the […] The post BB Kingdom Task: Fun Banter, Ragging, Drama and a New King in the House appeared first on Telugu360 .

తెలుగు 360 13 Nov 2025 10:09 am

చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

హైదరాబాద్: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మృతులు హనుమకొండ జిల్లాకు చెందిన పార్శ సంపత్, బొంపల్లి కిషన్ పోలీసులు గుర్తించారు. 

మన తెలంగాణ 13 Nov 2025 10:05 am

Peddapalli |మంచి మనసు..

Peddapalli | మంచి మనసు.. పెద్దపల్లి ఆంధ్రప్రభ – పెద్దపల్లి (Peddapalli) జిల్లా

ప్రభ న్యూస్ 13 Nov 2025 10:03 am

రాజేంద్రనగర్ లో డాక్టర్ ఇంట్లో గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ సోదాలు

మన తెలంగాణ/రాజేంద్రనగర్: హైదరాబాద్‌ కేంద్రంగా బయటపడ్డ ఉగ్రకుట్ర కేసులో గుజరాత్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా గుజరాత్ లో పట్టుబడ్డ నగరానికి చెందిన ఉగ్ర డాక్టర్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోర్ట్‌ వ్యూ కాలనీకి చేరుకున్న ఐదుగురు సభ్యులు గల యాంటీ టెర్రరిస్ట్ బృందం డాక్టర్ అహమ్మద్ నివాసంలో విస్తృతంగా సోదాలు చేపట్టింది. ఈ ఉగ్ర కుట్రలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న డాక్టర్ అహ్మద్‌ నివాసంలో గంటన్నరకుపైగా సోదాలు జరిపారు. ఆముదంతో తయారు చేసిన రసాయనం, రైసిన్‌ విష పదార్థం తయారీకి ఉపయోగించిన ముడిపదార్థాలు, కోల్డ్‌ ప్రెస్‌ మిషన్‌, కంప్యూటర్‌, పలు పుస్తకాలు, డాక్యుమెంట్లు గుజరాత్ పోలీసులు సీజ్ చేసినట్లు సమాచారం. తనిఖీలు చేపట్టిన గుజరాత్ పోలీసులు స్థానిక రాజేంద్రనగర్ పోలీసులను సైతం లోపలికి అనుమతించలేదని తెలుస్తుంది. ఇదే కేసులో ఉత్తర ప్రదేశ్ కు చెందిన అజాద్‌, సలీంఖాన్‌ ఇళ్లలోనూ ఎన్ టి ఎస్ సోదాలు జరిపినట్లు సమాచారం.  డాక్టర్‌ అహ్మద్‌ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రసాయనాలను వివిధ పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. రెండు రోజుల్లో గుజరాత్ కు రావాలని డాక్టర్ కుటుంబానికి యాంటీ టెర్రరిస్ట్ పోలీసు బృందం ఆదేశించింది.  కానీ, ఆన్ లైన్ లో పరిచయం అయిన ఓ స్నేహితుడి మాయమాటలకు ఆకర్షితులై డాక్టర్ అహ్మద్ బలి అయ్యాడని అతడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే పక్క ఆధారాలతోటే యాంటీ టెర్రరిస్ట్ బృందం అతన్ని అరెస్టు చేయడంతో పాటు తీవ్రవాద సంస్థకు పని చేస్తున్నట్లు నిర్ధారించిన అనంతరమే అరెస్టు చేసినట్లు స్పష్టమవుతుంది. 

మన తెలంగాణ 13 Nov 2025 10:00 am

Delhi : ఎర్రకోట మెట్రో స్టేషన్‌ మూసివేత

భద్రతా కారణాల దృష్ట్యాఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్‌ మూసివేశారు.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 9:50 am

TG |ఆరెంజ్ అలెర్ట్ జారీ..

TG | ఆరెంజ్ అలెర్ట్ జారీ.. హైదరాబాద్, ఆంధ్రప్రభ – తెలంగాణ (Telangana)

ప్రభ న్యూస్ 13 Nov 2025 9:46 am

Nandamuri Mokshajna |మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు..?

Nandamuri Mokshajna | మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు..? Nandamuri Mokshajna నట సింహం

ప్రభ న్యూస్ 13 Nov 2025 9:44 am

Cold Waves : ఉదయం.. సాయంత్రం బయటకు రాకపోవడమే మంచిదట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 9:40 am

Govt |ఇకనైనా కళ్లు తెరవండి..

Govt | ఇకనైనా కళ్లు తెరవండి.. నాగులపల్లి, ఆంధ్రప్రభ – రంగారెడ్డి జిల్లా

ప్రభ న్యూస్ 13 Nov 2025 9:34 am

చిత్తూరులో ఏనుగుల దాడిలో రైతు మృతి

చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కూర్మానిపల్లి వద్ద ఏనుగులు దాడి చేశాయి.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 9:30 am

అందరినీ ఎంటర్‌టైన్ చేసే సినిమా

ఖుషి టాకీస్‌పై నిర్మించిన సీత ప్రయాణం కృష్ణతో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ నటించారు. ఈ చిత్రాన్ని దేవేందర్ దర్శకత్వంలో ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో డా. రాజీవ్, డా.రోజా భారతి నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హీరో దినేష్ మాట్లాడుతూ కచ్చితంగా మా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. డైరెక్టర్ దేవేందర్ మాట్లాడుతూ “సీత ప్రయాణం కృష్ణ సినిమాని అన్నీ తానై మోసిన రోజా భారతికి ఎప్పటికీ రుణ పడి ఉంటాను. మా సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. ఈ సమావేశంలో హీరోయిన్లు డా.రోజా భారతి, రాఖి శర్మ, డా.రాజీవ్ పాల్గొన్నారు. 

మన తెలంగాణ 13 Nov 2025 9:29 am

వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు

వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదయింది

తెలుగు పోస్ట్ 13 Nov 2025 9:22 am

రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం

మన తెలంగాణ/రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఓ ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ డైమండ్ సిటీలో ఓ ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికుల భయంతో పరుగులు తీశాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వర్క్ షాపు గోదాంలో పూర్తిగా ఫర్నిచర్ కాలిబూడిదగా మారింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ఈ మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 13 Nov 2025 9:16 am

క్షమాపణ అనేది గొప్పది

ప్రపంచ వ్యాప్తంగా సిల్వర్ స్క్రీన్‌పై సంచలనం సృష్టించి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో నవంబర్ 21న తెలుగులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒకప్పటి హీరో రాజా మాట్లాడుతూ “క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. క్షమాపణ అనేది గొప్పది. రాణి మారియా త్యాగం గురించి సినిమా ఉంటుంది. 123 అవార్డులు పొందిన ఈ సినిమా ఆస్కార్ అవార్డులకు కూడా నామినేట్ అయింది”అని అన్నారు. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సీఈఓ డాక్టర్ ఐ. లూర్దూ రాజ్ మాట్లాడుతూ.. “ఒకరిని క్షమిస్తేనే శాంతి ఉంటుంది. ప్రపంచాన్ని కదిలించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, సిఎస్‌ఐ బిషప్ విల్సన్, డైరెక్టర్ వంశీకృష్ణ, జక్కుల కృష్ణ మోహన్ పాల్గొన్నారు. 

మన తెలంగాణ 13 Nov 2025 9:10 am

ఎర్రకోట వద్ద పేలుడు.. కారులో డిఎన్ఎ డాక్టర్ ఉమర్ దే

ఢిల్లీ: ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిలో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ దాడిపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా విచారణ చేపట్టాయి. ఈ దాడికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారులో సీటు పక్కన శరీర భాగాలు వైద్యుడు ఉమర్ నబీ డిఎస్‌ఎ మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది. ఎర్రకోట వద్ద పేలుడు సంబంధించిన కారు నడుపుతున్న వ్యక్తి ఉమర్ గా గుర్తించిన విషయం విధితమే. కారులో ఉన్న ఉమర్ చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పుల్వామాలో అతడి తల్లి నుంచి డిఎన్‌ఎ నమూనాలు తీసుకొని పరీక్షించారు. కారులో శరీర భాగాల డిఎన్‌ఎ నమూనాలకు సరిపోవడంతో అతడు వాహనంలో ఉన్నట్టు నిర్థారణకు వచ్చారు. పేలుడు జరగక ముందు ఎర్రకోట సమీపంలోని ఫైజ్ ఎ ఇలాహి మసీదులోకి అతడు వెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సిసిటివిలో నమోదయ్యాయి.  ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగంగా నాలుగు నగరాల్లో దాడులకు చేయాలని ప్లాన్ చేశారు. ఒక్కో నగరంలో ఇద్దరు చొప్పున ఎనిమిది మంది నిందితులను సిద్ధం చేశాని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. మరో రెండు పాత కార్లను కూడా పేలుళ్లకు సిద్ధం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మన తెలంగాణ 13 Nov 2025 9:05 am

Gold Rates Today : పసిడి ప్రియులారా.. పారా హుషార్.. గుడ్ న్యూస్ నేడు కొనండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు కొంత తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి

తెలుగు పోస్ట్ 13 Nov 2025 9:05 am

Tiryani |వాకింగ్ చేస్తూ..

Tiryani | వాకింగ్ చేస్తూ.. తిర్యాణి, ఆంధ్రప్రభ – మండలంలోని విద్యుత్ శాఖలో

ప్రభ న్యూస్ 13 Nov 2025 9:04 am

Delhi|ఉగ్రవాదుల టార్గెట్ అదే..

Delhi| ఉగ్రవాదుల టార్గెట్ అదే.. ఢిల్లీ, ఆంధ్రప్రభ – పోలీసుల దర్యాప్తులో బయటపడిన

ప్రభ న్యూస్ 13 Nov 2025 8:51 am

Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు తీపికబురు.. సులువుగా దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం కావడంతో రద్దీ అంతగా లేదు

తెలుగు పోస్ట్ 13 Nov 2025 8:47 am

Vijay Deverakonda and Rashmika Complement Each Other

Vijay Deverakonda and Rashmika have been in a relationship for a long time. Though they did not admit it on public platforms, the entire movie fraternity and fans are aware about it. The duo got engaged recently and they will get married early next year. Rashmika’s recent film ‘The Girlfriend’ is receiving huge applause all […] The post Vijay Deverakonda and Rashmika Complement Each Other appeared first on Telugu360 .

తెలుగు 360 13 Nov 2025 8:38 am

21న హైదరాబాద్ కు రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 8:35 am

తెలుగు భోజనం తిన్నంత తృప్తి కలిగింది

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్ మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో జాక్ రెడ్డి అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్న డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ “ఈ సినిమా సరదాగా సాగుతుంది. ఇంట్లో చేసిన మంచి తెలుగు భోజనం తిన్నప్పుడు ఎలాంటి తృప్తి ఉంటుందో, అలాంటి ఫీల్ ఈ సినిమా చూస్తున్నప్పుడు కలిగింది. నేను చేసిన జాక్ రెడ్డి క్యారెక్టర్ లాంటి వాళ్లు బయట కనిపిస్తుంటారు. పైకి టఫ్‌గా కనిపించినా గానీ వాళ్ల లోపల సాఫ్ట్‌నెస్ ఉంటుంది. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి చాలా క్లారిటీతో ఈ సినిమాను రూపొందించాడు. చైతన్య క్యారెక్టర్‌లో విక్రాంత్ పర్పెక్ట్ గా కుదిరాడు”అని అన్నారు. 

మన తెలంగాణ 13 Nov 2025 8:30 am

నేడు సిట్ ఎదుటకు వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 8:26 am

రష్మిక చేతికి ముద్దు పెట్టిన విజయ్ దేవరకొండ

హైదరాబాద్: ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్‌పై విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ చిత్రం బాక్సాపీసు వద్ద వసూళ్లతో దూసుకపోతుండడంతో సినిమా బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్‌తో ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. సక్సెస్ మీట్‌లో రష్మిక చేతిని విజయ్ ముద్దు పెట్టడంతో అభిమానులు ఈలలు వేశారు. రష్మిక నవ్వుతూ సందడి చేసింది. రష్మిక, విజయ్‌కు నిశ్చితార్థం జరిగినట్టు టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్న విషయం విధితమే. ఈ సందర్భంగా విజయ్ కూడా మాట్లాడారు. ఈ సినమా రష్మి భూమాదేవి పాత్రలో అద్భుతంగా నటించిందన్నారు. అందరూ సంతోషంగా ఉండాలనే తపించే వ్యక్తిత్వం రష్మికదని, కథల ఎంపికలో కూడా ఆమె స్ఫూర్తిదాయకంగా నిర్ణయం తీసుకుంటుందని ప్రశంసించారు. కథ వినగానే తాను తొలుత చేయాలనుకున్నానని, భూమా జీవితంలో జరిగినట్టుగా తన జీవితంలో కూడా జరిగాయని విజయ్ తెలియజేశారు. ఇప్పుడు అర్థమవుతోందిని అందరి జీవితంలో ఇలాగే జరిగియన్నారు. అందరం తప్పులు చేస్తామని, ఎవరూ పరిపూర్ణం కాదు అని, మగాళ్లు వాళ్ల భాగస్వామికి ఎప్పుడూ రక్షణగా ఉండాలనుకుంటారని, కానీ రక్షణ అనేది వాళపైనా మాత్రమే ఉండాలని, నియంత్రణలా ఉండకూడదని చెప్పారు. సతీమణిల సంతోషాన్ని, కలల్ని రక్షిస్తున్నట్టుగా ఉండాలని సూచించారు. 

మన తెలంగాణ 13 Nov 2025 8:21 am

నేటి నుంచి పోలీస్ కస్టడీకి లేడీడాన్ అరుణ

నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 8:12 am

Delhi Bomb Blast : బాంబు పేలుళ్ల వెనక భారీ కుట్ర... ఎర్రకోట లక్ష్యం.. అసలు టార్గెట్ అదే

ఢిల్లీలో బాంబు పేలుళ్ల కేసులో నిర్ఘాంతపడే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 8:02 am

P M Modi |భూటాన్ పర్యటనకు కారణం..

P M Modi | భూటాన్ పర్యటనకు కారణం.. P M Modi

ప్రభ న్యూస్ 13 Nov 2025 7:56 am

కొన్ని మీడియా ఛానళ్ళు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: ధర్మారెడ్డి

అమరావతి: కొన్ని మీడియా ఛానళ్ళు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టిటిడి మాజీ ఇఒ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఛానెల్స్ లో చూపించేవన్నీ అవాస్తవాలు అని దుయ్యబట్టారు. తిరుపతి అలిపిరి సమీపంలోని భూదేవీ కాంప్లెక్స్ లో సిబిఐ కార్యాలయంలో విచారణకు టిటిడి మాజీ ఇఒ ధర్మారెడ్డి హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థలు విచారణకు సంబంధించిన అవాస్తవాలు ప్రచారం చేయడంతో ప్రజలను ప్రక్కదారి పడుతున్నారని తెలియజేశారు. తనపై అవాస్తవ ప్రచారాలు మానుకోవాలని మీడియాకు హెచ్చరించారు. సిట్ అధికారుల విచారణకు పూర్తిగా సహకరించానని, సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పానని, గతంలో టిటిడిలో బాధ్యతలు నిర్వర్తించిన అందరు అధికారులను ప్రశ్నించడంలో భాగంగానే తనని కూడా విచారించారని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బ తీయ్యవద్దని సూచించారు. వైసిపి ప్రభుత్వంలో ధర్మారెడ్డి ఇఒగా ఉన్న సమయంలో  పెద్ద ఎత్తున నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో టిటిడి చైర్మన్ గా పని చేసిన వైవి సుబ్బారెడ్డికి కూడా సిటి అధికారులు నోటీసులు జారీ చేశారు. 

మన తెలంగాణ 13 Nov 2025 7:43 am

Nara Lokesh : నారా లోకేశ్ ఈరోజు చేసే సంచలన ప్రకటన అదే

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మరికొద్దిసేపట్లో సంచలన ప్రకటన చేయనున్నారు

తెలుగు పోస్ట్ 13 Nov 2025 7:31 am

Gandhi |ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం..

Gandhi | ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం.. హైదరాబాద్, ఆంధ్రప్రభ – Gandhi ప్రపంచంలోనే

ప్రభ న్యూస్ 13 Nov 2025 7:27 am

Gandhi –ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం..

Gandhi – ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం.. ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ (Gandhi) విగ్రహాన్ని

ప్రభ న్యూస్ 13 Nov 2025 7:27 am

Revanth Reddy : నేడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 7:22 am

ఐపిఎల్ వేలం పాటలో కొత్త రూల్స్!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026 కోసం వచ్చే నెలలో మినీ వేలం పాట నిర్వహించనున్నారు. అబుదాబి వేదికగా డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో వేలం పాట జరిగే అవకాశాలున్నాయి. ఈ వేలం పాటలో సరికొత్త నిబంధనలను అమలు చేసేందుకు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) సిద్ధమైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈసారి వేలం పాటలో పాల్గొనే వారికి కొన్ని షరతులు విధించే అవకాశాలున్నాయి. ఈసారి వేలం పాటలో ఎంత మంది ఆటగాళ్లనైనా ఫ్రాంచైజీలు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి పరిమితి లేదు. వేలం పాట పక్రియ గురించి కొన్ని విషయాలను బిసిసిఐ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఒక సీజన్ ముగిసిన నెల రోజుల తరవాత ఐపిఎల్ ట్రేడ్ విండో మొదలవుతుంది. దీని వల్ల ఆటగాళ్లను మార్చుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలకు వెసులుబాటు ఉంటుంది. ఇది తదుపరి వేలం వారం ముందు వరకు కొనసాగుతోంది. ట్రేడ్ విండోకు రెండు వెసులు బాట్లు అందుబాటులో ఉంటాయి. ఒకటి ప్లేయర్ ఫర్ క్యాష్ నిబంధన కాగా, రెండోది ప్లేయర్ టూ ప్లేయర్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది. మొదటి ఆప్షన్ ప్రకరం ఒక ఆటగాడిని ఇచ్చి డబ్బులు పొందడం. రెండో దానిలో ఒక ఆటగాడికి బదులు మరో ఆటగాడిని తీసుకోవడానికి ఛాన్స్ లభిస్తోంది. అయితే ఆయా ఫ్రాంచైజీలు తాము పొందాలనుకునే ఆటగాడి కోసం బిసిసిఐకి ఆసక్తి వ్యక్తీకరణ పంపాల్సి ఉంటుంది. ఆటగాడిని ఆమ్మే టీమ్ ప్రతిస్పందించడానికి 48 గంటల వరకు సమయం లభిస్తోంది. ఆటగాడు కొత్త జట్టులో చేరడానికి సుముఖతను వ్యక్తం చేస్తూ సమ్మతి పత్రంపై సంతకం చేస్తేను ప్లేయర్ ట్రేడ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది.

మన తెలంగాణ 13 Nov 2025 7:20 am

Andhra Pradesh : నేడు విశాఖలో చంద్రబాబు బిజీ బీజీ

విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సుకు సంబంధించి నేటి నుంచి సన్నాహక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

తెలుగు పోస్ట్ 13 Nov 2025 7:12 am

By Election |జూబ్లీహిల్స్ కౌంటింగ్..

By Election | జూబ్లీహిల్స్ కౌంటింగ్.. హైదరాబాద్, ఆంధ్రప్రభ – By Election

ప్రభ న్యూస్ 13 Nov 2025 6:59 am

ఆశల పల్లకిలో ఎన్‌డిఎ కూటమి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మంగళవారం (11.11.25) ముగియగానే వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ కూటమియే మళ్లీ అధికార పగ్గాలు చేపట్టే అవకాశం బాగా ఉందని అంచనాలు వెలువడడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించడం లేదు. అసెంబ్లీ మొత్తం స్థానాలు 243 లో ఎన్‌డిఎ కూటమికి మ్యాజిక్ ఫిగర్ 122 మించి 130 నుంచి 150 వరకు స్థానాలు కైవసం అవుతాయని, విపక్ష ఇండియా కూటమికి 108 మించి స్థానాలు రావని ఎగ్జిట్ పోల్స్ ముందస్తు అంచనాలు వెలువరించడంతో ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వం ఆశల పల్లకీలో ఊరేగుతోంది. మొదటి దశ పోలింగ్ 65.09 శాతం నమోదు కాగా, తుది దశ పోలింగ్ అంతకన్నా ఎక్కువగా రికార్డు స్థాయిలో 68.79 శాతం నమోదు కావడం విశేషం. 1951 తరువాత ఈ రాష్ట్రంలో ఇంతవరకూ ఇంత అధికంగా పోలింగ్ నమోదు కాలేదు. మలి విడత పోలింగ్‌పై సోమవారం ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి కారు బాంబు దాడి ప్రభావం కూడా కనిపించింది. 20 జిల్లాల్లోని 122 స్థానాల్లో ముస్లిం ఆధిపత్యం కలిగినవి, నక్సల్ ప్రభావితమైనవి ఉన్నప్పటికీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఆక్సిజన్ సిలిండర్ అమర్చుకుని కూడా ఓటర్లు కొంతమంది పోలింగ్‌కు హాజరయ్యారంటే ఓటర్లలో ఎంత ఆసక్తి ఉందో తెలుస్తుంది. కొన్ని చోట్ల ఓటర్లకు పండగ వాతావరణం కనిపించింది. దేశంలోని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ పెద్ద రాష్ట్రాలు. ఈ మూడు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా దేశం మొత్తం మీద ఎంతో ఉత్కంఠ కలుగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు గత సంవత్సరం జరగ్గా, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ఇక మిగతా రాష్ట్రాల పరిస్థితి వేరు. బీహార్ తరువాత తమిళనాడు అత్యంత జనాభా కలిగిన ఆరో రాష్ట్రంగా ఉన్నప్పటికీ, విజేతలెవరో ముందుగా ఒక కొలిక్కి అంచనా వేయడం కష్టం. తమిళనాడు రాజకీయాలకు జాతీయ స్థాయి రాజకీయాలతో సంబంధం ఉండదు. 2024 నవంబరులో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే శివసేన, ఎన్‌సిపి చీలికలు ఎన్నికల్లో విపరీత ప్రభావాన్ని చూపించాయి. బీహార్‌లో అలా కాదు. పక్కా జాతీయ స్థాయి అంశాలతో ముడిపడి ఉంది. కులం, మతం, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగం, శాంతిభద్రతలు, సంక్షేమ పథకాల అమలు ఇవన్నీ కీలకపాత్ర వహిస్తుంటాయి. కుల మత స్త్రీ, పురుష లింగ ఆధారిత సమాజాలు చాలా ఉన్నాయి. ఈ సవాళ్లన్నిటినీ మిగతా రాష్ట్రాల మాదిరిగా రాజకీయ పార్టీలు ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల బీహార్‌లో ఏం జరిగినా అది బిజెపి జెడి(యు) కూటమిపై జాతీయస్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుందని గతంలో నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే డేటా వెల్లడించిన సంగతి తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చాలా ముఖ్యమైనవిగా రూపొందడానికి ప్రధాన కారణం కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం జెడి(యు) మద్దతుతో నడుస్తుండడమే. బీహార్ ఎన్నికల ఫలితాలు కేంద్రంతో పొత్తు రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయి. అందుకని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బిజెపి అగ్రస్థాయి నాయకులు నిర్విరామంగా బీహార్ ఎన్నికల ప్రచారంలో తలమునకలవ్వడం కనిపించింది. జాతీయ స్థాయిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని కలిగించడానికి అనేక ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి ఈ రాష్ట్రం గణనీయమైన పరిమాణం కలిగి ఉంది. రెండోది స్పష్టంగా ఎవరు గెలుస్తారో ముందుగా ఊహలకు అందకపోవడం ఎన్నికల గతి శీలత విశాల భారత దేశ సూక్ష్మరూపాన్ని సూచించడం, ఇవన్నీకాక ఎవరు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో అన్న అంచనాలకు మించి వెలువడే ఫలితాలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేస్తుంటాయి. అందుకని బీహార్ అసెంబ్లీ ఎన్నికలను పార్టీలన్నీ జాతీయస్థాయిలో సవాలుగా తీసుకున్నాయి. రెండవ అంశం విషయానికి వస్తే స్పష్టమైన ముందంజలో ఉన్నట్టు ఎవరూ కనిపించలేదు. ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో పనిచేస్తుందని విపక్ష కూటమి మహాఘట్‌బంధన్ ఊహించింది. కానీ చాలా మంది మోడీ బిజెపి నితీశ్ జెడి(యు)ఎన్‌డిఎ బ్రాండ్ కాంబినేషన్‌పై ఇంకా భారీ నమ్మకాన్ని చూపించారు. ప్రశాంత్ కిషోర్ కొత్త జన్ సురాజ్ పార్టీ సంక్లిష్టత ఫలితాల్లో ఉంటుందని కొంతమంది అనుకున్నా ఈ పార్టీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ కు, మహాఘట్‌బంధన్ (ఎంజిబి)కు దాదాపు చెరిసమానంగా 37.9 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్‌డిఎ 125 సీట్లను (మెజార్టీ మార్కు 122) గెల్చుకోగా, ఎంజిబి 110 సీట్లను గెల్చుకుంది. జెఎస్‌పి వంటి అనేక కొత్త చిన్నచిన్న పార్టీలు ఈసారి ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాల ప్రకారం ఎన్‌డిఎ మళ్లీ అధికారం లోకి వస్తే బిజెపి తాను చేసేది ప్రజల ప్రశంసలను పొందుతోందని ముఖ్యంగా హిందీ బెల్టులో ప్రశాంతంగా ఉండగలదు. జెడి(యు) కూడా తమ పాలనా విధానాలను, ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఎంపికను బీహార్ ఓటర్లు స్వాగతిస్తున్నారని నిబ్బరం పడుతుంది. ఒకవేళ ఎంజిబి విజయం అధికారంలోకి వస్తే జాతీయ స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపిస్తుంది. బీహార్ లో తాము ఏం సాధించిందో అదే ప్రామాణిక నమూనాను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి విపక్ష కూటమి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ నవంబర్ 14న వెలువడనున్న ఫలితాల కోసం నిరీక్షిస్తున్నాయి. 

మన తెలంగాణ 13 Nov 2025 6:40 am

CM –ఢిల్లీలో సీఎం..

CM – ఢిల్లీలో సీఎం.. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తైన సందర్భంగా డిసెంబర్

ప్రభ న్యూస్ 13 Nov 2025 6:32 am

టీమిండియా నుంచి నితీశ్ రెడ్డి ఔట్..

కోల్‌కతా: సౌతాఫ్రికాతో జరిగే తొలి టెస్టు నుంచి భారత యువ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించారు. అతన్ని తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా నుంచి సెలెక్టర్లు రిలీజ్ చేశారు. నితీశ్ సౌతాఫ్రికాఎతో జరిగే వన్డే సిరీస్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఈ విషయాన్ని బుధవారం బిసిసిఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం నితీశ్‌కు టీమిండియాలో చోటు దక్కింది. అయితే సెలెక్టర్ అనూహ్యంగా అతన్ని తొలి టెస్టు నుంచి రిలీజ్ చేశారు. నితీశ్ సౌతాఫ్రికాఎతో రాజ్‌కోట్‌లో జరిగే వన్డే మ్యాచ్‌లో భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు.

మన తెలంగాణ 13 Nov 2025 6:30 am

ఉగ్రవాదం.. ఇంకెంత కాలం?

తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామని కేంద్రంలోని ప్రభుత్వ నేతలు ఘనంగా ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఢిల్లీలో దేశ సార్వభౌమత్వానికి చిహ్నంగా భావించే ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఉగ్రదాడి దేశప్రజలను గగుర్పాటుకు గురిచేసింది. దేశరాజధాని కేవలం ప్రపంచంలో దారుణమైన కాలుష్యాన్ని ఆవహించిన నగరమే కాకుండా ఉగ్రభయం తో వణికిపోతున్న రాజధానిగా మారిపోతుంది. విదేశీ ఉగ్రవాదులతో సంబంధం గల నలుగురు వైద్యులను నాలుగు రోజుల్లో అరెస్ట్ చేసిన సమయంలో మరో వైద్యుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు వెల్లడికావడం ఆందోళన కావిస్తుంది. అదృష్టవశాత్తు ఆ రోజు ఎర్రకోటకు సెలవు రోజు కావడంతో, అక్కడ జనసమర్ధన తక్కువగా ఉండడంతో ప్రాణనష్టం తక్కువగా జరిగింది. లేనిపక్షంలో ఎవ్వరూ ఊహించని దారుణం చోటుచేసుకొని ఉండెడిది. పేదరికం, అక్షరాస్యత లేకపోవడం, నిరుద్యోగం వల్లే కొందరు ఉగ్రవాదులుగా మారుతున్నారని దేశంలో పలువురు రాజకీయ వేత్తలు, విద్యావంతులు వారిపట్ల ఒక విధమైన సానుభూతితో మాట్లాడుతూ ఉంటారు. అయితే డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత విద్యావంతులు ఉగ్రవాద సంస్థలలో కీలక భూమిక వహిస్తున్నట్లు గత రెండు దశాబ్దాలుగా దేశంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అరెస్టులు స్పష్టం చేస్తున్నాయి. కేరళ వంటి ప్రాంతాల నుండి ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు అఫ్ఘానిస్తాన్‌కు వెళ్లిన వారి నుండి, దేశంలో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలలో క్రియాశీలంగా వహిస్తున్న వారిలో పలువురు ఉన్నత విద్యావంతులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహీయుద్దీన్ సయ్యద్ (35) ను గుజరాత్‌లో అరెస్టు చేయడం భద్రతా దళాలలో ప్రకంపనలు సృష్టించింది. చైనా నుండి మెడికల్ డిగ్రీ అందుకొన్న అతను ఆముదం గింజల నుంచి రిసిన్ అనే విషపూరిత పదార్థాన్ని చేస్తున్నట్లు గుర్తించారు. ప్రసాదాలలో ఆ విషపదార్ధాన్ని కలిపి భారీ సంఖ్యలో జనాన్ని మట్టుపెట్టాలని అతను పథకాలు వేసుకున్నట్లు కనుగొన్నారు.జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 అమలు రద్దు చేయడంతో అక్కడి ఉగ్రవాదంను కట్టడి చేసినట్లే అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే, తాత్కాలిక చర్యగా పేర్కొన్న జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని ఆరేళ్ళు దాటినా ఎందుకు వెనుకకు తీసుకొని, తిరిగి రాష్ట్ర హోదా కల్పించలేకపోతున్నారు? కేంద్ర హోం శాఖ ప్రత్యక్ష పర్యవేక్షణలో అక్కడ శాంతిభద్రతలు నిర్వహిస్తున్నారు. అయితే, సీమాంతర ఉగ్రవాదం ఇంకా అదుపులోకి రాలేదని ప్రభుత్వ చర్యలే స్పష్టం చేస్తున్నాయి.గతంలో యుపిఎ ప్రభుత్వం గాని, ప్రస్తుతం మోడీ ప్రభుత్వం గాని ఉగ్రవాదాన్ని రాజకీయ ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోవడం లో చూపిన శ్రద్ధ దానిని అణచివేయడంపట్ల చూపడం లేదు. ఆపరేషన్ సిందూర్‌ను అర్ధాంతరంగా ఎందుకు ఆపివేసారో ఇప్పటి వరకు ప్రభుత్వం దేశప్రజలకు నమ్మకమైన సమాధానం చెప్పలేకపోయింది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ వణికిపోయిందని, తిరిగి భారత్ వైపు చూసే సాహసం చేయబోదని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నిత్యం చెబుతున్నారు. అయితే ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగానే ఢిల్లీ పేలుడు జరుగుతున్నట్లు వార్తలు వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. 25 ఏళ్ల క్రితం నాటి బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ తిరిగి ‘జంగిల్ రాజ్’ వస్తుందని బీహార్ ప్రజలను ఎన్నికల సందర్భంగా భయపెడుతున్న ప్రధాన మంత్రి మోడీ ఎన్‌డిఎ పాలనలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారమే నేరాల సంఖ్య పెరిగిన విషయాన్ని మరచిపోతున్నారు. 60 క్రితం చనిపోయిన మాజీ ప్రధాని నెహ్రూ విధానాలను ఇప్పటికీ నిత్యం విమర్శిస్తూ తమ ప్రభుత్వంలో దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోతూ ఉండటం, వైషమ్యాలు పెరిగిపోతూ ఉండటం గురించి నోరు విప్పడంలేదు. యుపిఎ ప్రభుత్వం ఉగ్రవాదులపట్ల రాజీధోరణి అవలంబించిందని విమర్శలు చేస్తుండే నేతలు తమ హయాం లో జరుగుతున్న ఉగ్రదాడుల గురించి నోరెత్తరు. 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను బలి తీసుకున్న పుల్వామా ఉగ్రదాడికి దారితీసిన పరిస్థితులపై ఇప్పటివరకు దర్యాప్తు నివేదికను బయటపెట్టలేదు. గత 11 ఏళ్లలో దేశంలో 68 ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడులలో 600మంది వరకు మృతి చెందారు. వారిలో సగంమందికి పైగా 360 మంది వరకూ సైనికులు, పోలీసులు అమరులవ్వగా, 230 మంది పౌరులు మృతి చెందారు. గతంలో లేని విధంగా తరచూ సైనికులను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరుగుతున్నాయి. నోట్ల రద్దుతో ఉగ్రవాదులకు ఆదాయ వనరులను కట్టడి చేశామని చెప్పారు. కానీ అటువంటి పరిస్థితులు కనబడటం లేదు. మెరుపు దాడులలో ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పారు. కానీ, సైనిక అధికారులే నియంత్రణ రేఖ అవతల దేశంలో ప్రవేశించేందుకు పెద్ద సంఖ్యలో చొరబాటుదారులు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. గత ఐదేళ్లుగా సైన్యంలో కొత్త నియామకాలు దాదాపు ఆగిపోయాయి. కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ కార్యక్రమం గురించి స్పష్టమైన సమీక్షలు జరగడం లేదు. ఈ విషయంలో సైనికాధికారులకు, ప్రభుత్వంకు మధ్య దూరం పెరుగుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. యుపిఎ హయాంలో అమెరికా ఒత్తిడి కారణంగానే బొంబాయి పేలుళ్ల తర్వాత భారత్ పాకిస్థాన్‌పై దాడి చేయలేదని అప్పటి కేంద్ర మంత్రి పి చిదంబరం వెల్లడించారు. కానీ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అర్ధాంతరంగా ‘కాల్పుల విరమణ’ ఎందుకు జరపాల్సి వచ్చిందే పార్లమెంట్‌లో సైతం ప్రభుత్వం నోరువిప్పడం లేదు. తానే భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ చెప్పుకొంటున్నారు. ఆయనను నేరుగా ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఆయన వ్యాఖ్యలపట్ల అమెరికా రాయబారిని పిలిచి భారత్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు? తన ఒత్తిడులకు లొంగి భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు తగ్గిస్తున్నట్లు తాజాగా ట్రంప్ ప్రకటించారు. అయినా భారత్ మౌనం వహిస్తున్నది. తాజా అరెస్ట్‌లతో సుదీర్ఘకాలంగా బిజెపి పాలనలో ఉన్న హర్యానా ఉగ్రవాదులకు కీలక ప్రాంతంగా మారుతున్నట్లు అనుమానించే పరిస్థితులు నెలకొంటున్నాయి. ముంబైలో ఉగ్రదాడి జరగగానే అప్పటి యుపిఎ ప్రభుత్వం నాటి హోం మంత్రి శివరాజ్ పాటిల్ ను బాధ్యుడిని చేస్తూ పదవినుండి తొలగించింది. పలువురు అధికారులపై చర్యలు తీసుకుంది. అయితే, పాకిస్తాన్ నుండి నేరుగా ఉగ్రవాదులు ముంబై వచ్చి ఉగ్రదాడి జరిపే అవకాశం లేదని, స్థానికంగా వారికి పెద్ద ఎత్తున మద్దతు ఉంది ఉంటుందని అప్పట్లో అనేక మంది నిపుణులు స్పష్టం చేశారు. కనీసం నరేంద్ర మోడీ ప్రభుత్వమైనా అప్పట్లో ఉగ్రదాడి జరిగిన సమయంలో శివరాజ్ పాటిల్ వివాదాస్పదమైన ప్రవర్తన గురించి గాని, ఆ దాడిలో స్థానికుల ప్రమేయం గురించి గాని ఎటువంటి దర్యాప్తు జరిపిన దాఖలాలు లేవు. గతంలో వాజపేయి ప్రభుత్వంలో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన సమయంలో, మోడీ ప్రభుత్వంలో ఢిల్లీ అల్లర్ల సమయంలో గాని, పుల్వామా దాడి సమయంలో గాని ప్రభుత్వంలో ఎవ్వరినీ బాధ్యులను చేసే ప్రయత్నం చేయలేదు. యుపిఎ ప్రభుత్వం సైతం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం హడావుడిగా పార్లమెంట్ పై దాడిలో అఫజుల్ గురును, ముంబై దాడిలో కసబ్‌ను ఉరితీశారు. అయితే లోతయిన దర్యాప్తులు జరగకపోవడంతో ఉగ్ర ఘటనలకు బాధ్యులైన కీలక వ్యక్తులు తప్పించుకుపోతున్నట్లు తెలుస్తున్నది. ఆయా దాడులకు స్థానికంగా అండగా ఉండి, కీలకమైన మద్దతు అందించినవారిని వదిలివేస్తున్నారు. అందుకు రాజకీయ అంశాలే కారణంగా భావించాల్సి వస్తుంది. ఈశాన్య ప్రాంతంలో సైతం తీవ్రవాద బృందాలు చాలా వరకు ఆయుధాలను వదిలిపెట్టి ప్రధాన స్రవంతిలో కలిసిపోయాయని, ఇక ఆ ప్రాంతంలో శాంతి నెలకొందని అమిత్ షా తరచూ చెబుతున్నారు. అయితే మణిపూర్‌లో రెండేళ్లకు పైగా కల్లోలకర పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే సాహసం చేయడం లేదు. మిగిలిన ప్రాంతాలలో సైతం పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. మొన్నటి పహల్గామ్, తాజాగా జరిగిన ఎర్రకోట పేలుడు ఘటనలు దేశప్రజలు ఎటువంటి ఉగ్రభయం నీడలో ఉన్నారో వెల్లడి చేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ఎన్నికల ప్రయోజనంకోసం ఓ ఆయుధంగా కాకుండా, దానిని కట్టడి చేసేందుకు పారదర్శకతతో, వ్యూహాత్మకంగా అడుగు వేయాల్సి ఉంటుంది. అటువంటి విషయాలలో ప్రభుత్వం విధానపరమైన దివాళాకోరుతనం ప్రదర్శిస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. మీడియా సంస్థలను కట్టడి చేయడం, రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ద్వారా వాస్తవాలు ప్రజలకు చేరకుండా అడ్డుకోవచ్చని అధికారంలో ఉన్నవారు భావించవచ్చు. కానీ ఉగ్రవాదంపట్ల రాజీలేని వైఖరి అవలంబించేందుకు విధానపరమైన క్రియాశీలత చాలావసరం. అందుకు అనువుగా జాతీయ భద్రతా విధానం రూపొందించాలి. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద సైన్యం రక్షణ వ్యవస్థ గల భారత దేశంకు ఇప్పటి వరకు ‘జాతీయ రక్షణ విధానం’ లేకపోవడం దురదృష్టకరం. కార్గిల్ యుద్ధం తర్వాత నియమించిన సుబ్రహ్మణ్యం కమిటీ ప్రధాన సిఫార్సులతో జాతీయ రక్షణ విధానం రూపొందించడం అని గుర్తుతెచ్చుకోవాలి. దేశ ప్రజలను ఉగ్రవాద భయం నుండి ఆదుకునేందుకు ప్రభుత్వం రాజకీయ సంసిద్ధత ప్రదర్శించాలి. సంకుచిత ఎన్నికల రాజకీయాలకు అతీతంగా విధానపరమైన చొరువలు తీసుకోవాలి. ముందుగా దేశ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి. పార్లమెంట్‌లో పారదర్శకమైన చర్చలు జరగాలి. కేవలం బహిరంగ సభలలో కాకుండా పార్లమెంట్‌లో, మీడియా సమావేశాలలో, అఖిలపక్ష సమావేశాలలో విధానపరమైన అంశాలపై చర్చలకు ముందుకు రావాలి. ప్రభుత్వం నుండి జవాబుదారీతనం అత్యవసరం. విదేశాంగ, రక్షణ విధానాలపై దృష్టి సారించాలి. చలసాని నరేంద్ర 98495 69050

మన తెలంగాణ 13 Nov 2025 6:10 am

Seethakka –సీతక్క సాయం..

Seethakka – సీతక్క సాయం.. తాడ్వాయి, ఆంధ్రప్రభ – తాడ్వాయి మండలం జలగలంఛ

ప్రభ న్యూస్ 13 Nov 2025 6:09 am

ముంబై తరహా దాడులకు ఉగ్రకుట్ర

న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక ప్రాంతాలలో భారీఎత్తున దాడులు నిర్వహించి, విధ్వంసం సృష్టించడమే ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రకోట వద్ద కారు పేలుడులో దాదాపు 12 మంది మరణించిన తర్వాత వరుస దాడులకు ప్రణాళిక చేసినట్లు వెల్లడైంది. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో పట్టుబడ్డ నిందితులను విచారిస్తున్న క్రమంలో సంచలన విసయాలు వెల్లడవుతున్నాయి. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్ , గౌరీ శంకర్ ఆలయంతో సహా రాజధాని నడిబొడ్డున పలు కీలక ప్రాంతాలు వాళ్ల టార్గెట్ అని కారుబాంబు పేలుడు ఘటనపై జరుపుతున్న దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఆలయాల్లోనూ పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నారని తేలింది. 2008 నవంబర్ 26న ముంబై దాడుల సమయంలో తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్, ట్రెడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, లియోపోల్డ్ హాస్పిటల్ తో సహా 12 ప్రదేశాలలో కాల్పులు జరిపి భారీ విధ్వంసానికి, మారణోమానికి ఉగ్రవాదులు పాల్పడ విషయం తెలిసిందే. ఢిల్లీలో పేలుళ్లకు ఈ ఏడాది జనవరి నుంచే పన్నాగాలు పన్నుతున్నారని, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్‌ఎ-మొహమ్మద్ తో సంబంధం ఉన్న ఉగ్రవాద ముఠా నెలల తరబడి ఈ దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్ లలో కూడా కీలక ప్రాంతాలను టార్గెట్ చేసుకునేందుకు 200 శక్తివంతమైన ఐఈడీలు, బాంబులను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడైంది. మతకల్లోలాలూ సృష్టించే కుట్ర.. దేశంలో మతకల్లోలాలు సృష్టించే లక్ష్యంతో ప్రార్థనా స్థలాలే లక్ష్యంగా పేలుళ్లకు పథకం వేశారని, ఇందుకోసం జమ్మూకశ్మీర్ లోని పుల్వామా, షోపియన్, అనంతనాగ్ కు చెందిన కొందరు డాక్టర్లను ఈ దారుణకాండకు ఎంచుకున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్ కేంద్రంగా వారు ఈ పన్నాగాలు పన్నుతూ వచ్చారని, డాక్టర్లు కావడంతో వారిని పెద్దగా ఎవరూ అనుమానించరని భావించారన్నారు. ఈ బ్యాంక్‌గ్రౌండ్‌తోనే దేశరాజధాని ప్రాంతంలో ఎక్కడికైనా వారు సులభంగా తిరగగలిగారని, ఆ ముసుగులోనే దౌజ్, ఫతేపూర్ టాగా ప్రాంతాలలో వారు పేలుడు పదార్థాలు నిల్వ చేయడానికి గదులను అద్దెకు తీసుకున్నారని దర్యాప్తు అధికారులు వివరిస్తున్నారు. దీపావళి పండుగనాడే రద్దీగా ఉండే ప్రదేశాలలో దాడి చేయాలని టెర్రరిస్ట్‌లు ముందుగా ప్లాన్ చేసినా, ఆ పథకం ఎందుకో పారలేదు. బాంబు తయారీలో ఉపయోగించే 2,900 కిలోల పేలుడు పదార్థాలతో అరెస్ట్ అయిన ముజిమ్మిల్ ఈ విషయాలు తెలిపినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సయీద్ ముజిమ్మిల్ అల్ - ఫలాహ్ లో పనిచేస్తూ, టచ్ లో ఉండేవారని, సయీద్ కారులో అస్సాల్ట్ రైఫిల్, మందుగుండుసామగ్రి దొరికిన తర్వాత ఆమె అరెస్ట్ అయినట్లు తెలిపారు.  

మన తెలంగాణ 13 Nov 2025 6:00 am

తిరుగుబాట్లు లేని కాలముందా?

గడ్డిపోచలు ఏకమైతే వాటికి మదపుటేనుగును కట్టిపడేసే బలమొస్తుందని కొత్తగా చెప్పనవసరం లేదు. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చస్తుందని చెప్పే పద్యం ఏనాటినుంచో ఉంది. పీడిత జనుల సమూహశక్తి ఎంత బలీయమైనదో సుదీర్ఘ మానవ చరిత్రలో ఎన్నో నిరూపణలు ఉన్నాయి. మనుషులంతా ఒక్కలా ఉండరు. వారిలో పీడనను సహిస్తూ తలవంచుకొనిపోయేవారు ఎక్కువే అయినా, తెగిపడినా పర్వాలేదు తలవంచను అనేవారు కూడా ఉంటారు. సహజంగా ఇలాంటి వారి సంఖ్య తక్కువే అయినా చరిత్రను మలుపు తిప్పే శక్తి వారికే ఉంటుంది. మనిషి ఆలోచనాపరుడు, ఆవేశపరుడు, తాత్వికుడు, ఆత్మాభిమాని, పరోపకారి అయినపుడు పరిస్థితులకు తలవంచడు. ఇలా బతకడం తనవల్ల కాదు అనుకుంటాడు. గెలుపోటములను లెక్కచేయకుండా ఎదురు తిరుగుతాడు. అందులోనే జీవన సాఫల్యం ఉందనుకుంటాడు. ఉరితాడును ముద్దుపెట్టుకొనే వీరుడిగా పోరాట చరిత్రలో నిలిచిపోతాడు. ఆ ధీరత్వం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ మానవచరిత్రలో పోరువీరులు తక్కువేమీ లేరు. ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డడం మానవ నైజంలో ఉంది. బలవంతంగా దాన్ని అణచిపెట్టవచ్చేమోగాని క్లీన్ స్వీప్ లాగా ఎవరు తుడిచేయలేరు. బరి గీసి ఇకనుంచి మనిషి ఎదురుతిరగడు అని చెప్పడం చరిత్ర తెలియని అవివేకమే. మానవ చరిత్ర అందుబాటు లో ఉన్న మేరకు పీడిత పక్ష ప్రతినిధిగా తిరుగుబాటు చేసిన మొదటి వరుస ధైర్యశాలిగా స్పార్టకస్ పేరును తలుచుకోవచ్చు. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్ద కాలంలో రోమన్ పాలకులను ఎదిరించిన బానిస జాతి వీరుడాయన. కాళ్ళ దగ్గరపడి ఉండే బానిస తమపై కత్తి దూస్తాడని రోమన్ రాజులు ఊహించే అవకాశమే లేదు. కానీ స్పార్టకస్ తనలాంటి బానిసలను కూడగట్టుకొని రోమన్ సైన్యంతో యుద్ధమే చేశాడు. బానిస బతుకులో ఆయన సర్దుకొని ఉండలేక ముప్పై ఏళ్లకే అపూర్వ సాహసంతో ఎదురు తిరిగి చావుకు సిద్ధపడ్డాడు. రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా తన పేరును తలుచుకుంటారని ఆయన అనుకోలేదు. అయినా ఒక సాహసిగా, తిరుగుబాటుకు పురా సాక్ష్యంగా, సదా ప్రేరణగా ఆయన పేరు ఎల్లకాలం నిలుస్తుంది. ఆంగ్లేయుల పాలనకు ఎదురొడ్డిన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైన్యం శక్తిసామర్థ్యాలకు బెదిరి వెనుకంజ వేయలేదు. గిరిజనుల వెతలు చూడలేక తెగించి పోరాడాడు. కొమురం భీం కు నిజాం పటాలం గురించి అంచనా ఉండదా! అరాచకానికి తుపాకితోనే జవాబు చెప్పాలనుకున్నాడు. అది సామాజిక ప్రయోజన వీరత్వం. పేదల ఇక్కట్లు బాపే బలిదానం. పాలకులకు ఒక షాక్ ట్రీట్‌మెంట్. తిరుగుబాటు చదరంగం ఆట కాదు. ఈ పోరులో ప్రాణం ఒక సమిధ. తనతోపాటు కుటుంబ సభ్యులను కూడా ఎన్నో బాధలకు గురిచేసే పరిణామం. ఎండా, వాన, ఆకలి, దప్పికలు లెక్క చేయలేని జీవనం. కన్నతల్లికి, కట్టుకున్న భార్యకి, పుట్టిన పిల్లలకు దశాబ్దాల తరబడి కంటికి కానరాకుండా బతకడం ఎంత వేదనాభరితం. అయినా మనిషి తిరుగుబాటుకు కారణం ఏమిటి? సమాజంపై కోపం, పాలనపై అయిష్టత, శ్రమ దోపిడీ, కులవివక్షలను సహించనితనం మనిషిని ఉన్నచోట ఉండనీయదు. ఈ విధానాలను కూలదోయాల్సిందే అని బలంగా కోరుకుంటాడు. రాజ్యం ఎంత శక్తివంతమైనదైనా ఎదిరించడానికి సిద్ధపడతాడు. ప్రేమికులు తమ ప్రేమ కోసం ఎంతటి కష్టాలకైనా సిద్ధపడినట్లు విప్లవకారుడు కూడా తమ లక్ష్యాన్ని ఒక రొమాంటిక్ ధోరణిలోనే ఇష్టపడతాడు. మానసికంగా ఆ స్థాయికి చేరినవాడే చివరికంటూ ఆ బాటలోనే ఉంటాడు. మనిషిలోని సహజ స్పందనలైన ప్రేమను, మమకారాన్ని, మానవత్వాన్ని చంపలేనట్లే తిరుగుబాటుకు పురికొల్పే ప్రేరణను కూడా ఎవరూ తుదముట్టించలేరు. మనుషుల్లో ధనిక, పేద వర్గాలున్నంతకాలం, శ్రమ దోపిడీ, పీడన ఉన్నంతకాలం ఎదురు తిరిగేవారు పుడుతూనే ఉంటారు. పేదల కష్టాలను అర్థం చేసుకొని వాటి నిర్మూలనకు ప్రభుత్వాలు సిద్ధపడనంతకాలం తిరుగుబాట్లు తలెత్తుతూనే ఉంటాయి. సమస్య తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టడం నేటి ప్రభుత్వాలు చేస్తున్న పని. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ఒకరినిమించి మరొకరు అన్నట్లు దోపిడీ వర్గాలకు సహకరిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీకి ఓటేసినా, ప్రభుత్వాలను మార్చేసినా సామాన్యుల జీవితాల్లో గణనీయమైన మార్పు రావడంలేదు. పోలీసు, రెవెన్యూ శాఖలు పేదలను ఇబ్బందులకు గురి చేస్తూ పాలక పక్ష దోపిడీదారులకు అన్నివిధాలా ఊడిగం చేస్తున్నాయి. విద్య, వైద్యం ప్రైవేటు రంగమై చిరు జీవితాలను వేపుకు తింటున్నాయి. లంచాలకు మరిగిన అధికారులు బాధ్యతలను మరచి కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు వ్యవస్థనే తిరుగుబాటు విత్తనాలకు చల్లుతుంది. మేము ఇలాగే ఉంటాం. మీరు మాత్రం తిరగబడొద్దు అంటే కుదురుతుందా! ఎండిన ఆకులను మండించడానికి వేలెడంత లేని అగ్గిపుల్లలా ఓ ప్రాణి తప్పక ఉద్భవిస్తుంది. దావాలనాన్ని సృష్టించి ప్రభుత్వాల డొల్లతనాన్ని ప్రపంచానికి చాటుతుంది. ఆ వేడిని చల్లబరచేందుకు ఏవో కొన్ని సంక్షేమ పథకాలు రచనకు పాలకులను అనివార్యం చేస్తుంది. సామాన్యుడి ప్రతి పూట భోజనం తిరుగుబాటు ఫలితమే. రక్తం చిందిస్తేనే ఎనిమిది గంటల పని దినం వచ్చింది. వచ్చే ఏడాది మార్చి చివరికల్లా దేశంలో నక్సలైటు లేకుండా చేస్తామని కేంద్రం అంటోంది. గిరిజనులకు ఆవాసాలైనా అడవులను తెగనరికి నేలలోని ఖనిజాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతోంది. అడవిపై గిరిజనుల హక్కులపై రాజ్యాంగంలో పొందుపరచిన అధికరణలను అమలు చేయకుండా వారి ఇళ్లను కాలబెట్టి అడవిలోంచి పారద్రోలే పన్నాగం ప్రభుత్వం చేస్తోంది. ఏ ప్రాజెక్టులోనూ పునరావాసం వల్ల నిర్వాసితులు సంతోషంగా లేరు. బయటి ప్రపంచం తెలియని అడవి బిడ్డలను దేశపౌరులుగా ప్రభుత్వాలు లెక్కలోకి తీసుకోవడం లేదు. ఒక హిడ్మాను వేటాడి పట్టుకుంటే తిరుగుబాటు అంతమైనట్లేనా? ఎన్ని బలగాలను దింపినా.. చర్చలు జరిపితేనే తుపాకుల చప్పుళ్లు ఆగిపోతాయి. ఆ శాంతి వాతావరణంలో గిరిజనుల సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఈ చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలకు కటాఫ్ తేదీలతో మిగిలేది పరాభవమే అని చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. బి.నర్సన్ 94401 28169

మన తెలంగాణ 13 Nov 2025 5:40 am

సిడబ్లుసి పర్యవేక్షణలో కాళేశ్వరం పునరుద్ధరణ

మన తెలంగాణ / హైదరాబాద్ : సిడబ్లూసి పర్యవేక్షణలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగా లు అయిన మేడిగడ్డ, సుందిళ్ళ,అన్నారం బ్యారే జ్‌ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల సంఘంతో సమన్వయం చేసుకుని శాస్త్రీ య పద్ధతుల్లో పునరుద్ధరించేందుకు సన్నాహాలు జరుపుతున్నామన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తు న ప్రజాధనంతో నిర్మించిన ఈ బ్యారేజ్ లను వినియోగంలోకి తెచ్చేందుకు వాటిని శాస్త్రీయ పద్దతి లో పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా,సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ కూలిపోవడానికి సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్ లలో లీకేజీ లకు తప్పుడు నిర్ణయాలు, సాంకేతిక లోపాలే ప్రధాన కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, న్యాయ కమిషన్ స్పష్టంగా పేర్కొన్నాయని ఆయన తెలిపారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ పై కుడా ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో అర్హత కలిగిన స్వతంత్ర సాంకేతిక సంస్థలను నియమించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర జలవనరుల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త డిజైన్లను రూపొందించాలని నిపుణులను అదేశించామన్నారు. ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు ఐఐటి అనుబంధ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పూణే లోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ద్వారా జియో ఫిజికల్ ,హైడ్రాలిక్ టెస్ట్ లు నిర్వహించి నష్టం విలువ అంచనా వేసి పనుల పునరుద్ధరణకు అంకురార్పణ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా కురిసిన భారీ వర్షాలతో నీరు చేరుకుందని,15 నుండి 20 రోజులలో నీరు తగ్గిన వెంటనే పరీక్షలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అందులో భాగంగా మొదట ఐదు సంస్థలను ఎంపిక చేసి అందులో మూడింటిని ఫైనల్ చేస్తామని ఆయన తెలిపారు. డ్యామ్ సేఫ్టీ రంగంలో అనుభవం కలిగి ఉండడంతో పాటు సాంకేతిక సంస్థలతో అనుబంధం కలిగి ఉన్న సంస్థలనే ఫైనల్ చేస్తామన్నారు. పునరుద్ధరణ వ్యయం మొత్తం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గడిచిన అనుభవాల దృష్ట్యా ప్రజా ఆస్తుల పరిరక్షణ నిమిత్తం నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పునరుద్ధరణ పనులు చేపట్ట బోతున్నట్లు ఆయన తెలిపారు. డిజైన్ లోపాలు, పనుల నిర్లక్ష్యం ,ఆర్థికంగా జరిగిన అవకతవకలను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో స్పష్టం చేసిందని ఆయన గుర్తుచేశారు. ఇదే విషయంలో విచారణ నిర్వహించిన విజిలెన్స్ శాఖ, సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిందన్నారు. ఇదే సమీక్షా సమావేశంలో సమ్మక్క-సారక్క, సీతమ్మ సాగర్,సీతారామ సాగర్, చనకా-కోరాట, దేవాదుల, చిన్న కాళేశ్వరం, ఎస్.ఎల్.బి.సి హెలిబోర్న్ సర్వే, డిండి తో పాటు జూరాల వద్ద నిర్మించ తల పెట్టిన ప్రత్యమ్యాయ బ్రిడ్జి సింగూర్ కాలువ లైనింగ్ పనులను ఆయన సమీక్షించారు.

మన తెలంగాణ 13 Nov 2025 5:30 am

రేపే జూబ్లీ ఫలితం

మన తెలంగాణ/సిటీ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కించేందుకు అధికారు లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11న జరిగిన ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు వేదికగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంను సిద్దంచేశారు. పోలింగ్ లో సుమారు 48.49 శాతం ఓట్లు పోలయ్యా యి. డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్‌గా యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోనే ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ని ర్వహించేందుకు జిల్లా ఎన్నికల విభాగం ఏ ర్పాట్లు చేస్తుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ఎలక్ష న్ స్టాఫ్ కు శిక్షణలు కూడా నిర్వహించారు. ఈపాటికే భద్రతను పటిష్టంచేసిన ఎన్నికల అ ధికారి కర్ణన్.. ఫలితాన్ని కూడా ఏలాంటి సం దేహాలకు తావులేకుండా వెల్లడించాలని ఏ ర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.ఈ పోలింగ్‌లో మొత్తం పోలైన లక్షా 94 వేల 632 ఓట్లను 10 రౌండ్లుగా 42టేబుళ్ల మీద లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్‌పై ముగ్గురు సిబ్బందిని నియమించారు. వీరిలో ఒకరు సూపర్ వైజర్, మరొకరు అసిస్టెంట్ సూపర్ వైజర్‌తో పాటు మరోకరు స హాయక సిబ్బందిని నియమించారు. పోలింగ్ స్టేషన్ల నెంబర్ 1 నుంచి 407 వరకు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంలను అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షం లో తెరువనున్నారు. ఎన్నికల అధికారులు అంచనాలను తారు మారు చేస్తూ ఆవించిన ఓటింగ్ శాతానికి తక్కువగా పోలింగ్ శాతం నమోదు కావటంతో  శుక్రవారం మధ్యాహ్నాం మూడింటి కల్లా తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. పోలింగ్ స్టే షన్ల ఆవరణలో అమలు చేసిన వంద మీటర్ల ఆంక్షను శుక్రవారం కౌంటింగ్ సందర్భంగా కూడా అమల్లో ఉంటుందని ఎలక్షన్ వింగ్ అ ధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ సెంటర్ లో పటిష్టమైన భద్రతతో పాటు సీసీ టీవీ కెమెరాలు, సాయుధ బలగాలతో మధ్య కోట్ల విజ య భాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలోనీ స్ట్రాం గ్ రూమ్ నుంచి ఈవీఎంలను పైగా తీసుకువ చ్చి లెక్కించేందుకు కావల్సిన స్థాయిలో కౌం టింగ్ స్టాఫ్ ను నియమించినట్లు తెలిసింది. ఈ నెల 14న ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఔట్ల లెక్కింపు ప్రక్రియను మొత్తం 10 రౌండ్లుగా కొనసాగించనున్నారు. ఒక్కో రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండగా, నోటా తో కలిపి మొత్తం 59 మందికి పోలైన ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ కు సంబంధించి 58 అభ్యర్ధులు, నోటాకు పోలైన ఓట్ల సంఖ్యను వెల్లడించనున్నారు. కానీ ప్రధాన పోటీ అధికార, విపక్షాలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యనే ఉండే అవకాశమున్నట్లు పోలింగ్ సరళిని బట్టి అంచనా వేయవచ్చు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల వెబ్‌సైట్‌లోనూ నమోదు చేసేలా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

మన తెలంగాణ 13 Nov 2025 5:20 am

Cotton Farmers |సమస్యల సుడిలో పత్తి రైతుల అగచాట్లు..

ఉమ్మడి ఆదిలాబాద్‌ బ్యూరో(ఆంధ్రప్రభ) : పత్తి (Cotton ) కొనుగోళ్లలో పరిమితులు.. స్లాట్‌

ప్రభ న్యూస్ 13 Nov 2025 5:10 am

సిఎంకు ,నాకు మధ్య గ్యాప్ లేదు

మన తెలంగాణ/హైదరాబాద్ : “నాకు మంత్రి పదవి కావాలని ఏనాడూ అడగలేదు& ఏ పదవి ఇచ్చినా బాధ్యతతో నిర్వహిస్తా”నని పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. తాను మంత్రి ప దవి అడిగినట్లు, డిప్యూటీ సిఎం కానున్నట్లు, ము ఖ్యమంత్రికి తనకు మధ్య గ్యాప్ ఉన్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని ఆ యన బుధవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మా ట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ వి స్తరణ గురించి ప్రశ్నించగా, ఆ విషయాన్ని ము ఖ్యమంత్రి, పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమ పా ర్టీ అభ్యర్థి నవీన్ కుమార్ ఘన విజయం సాధించనున్నారని ధీమాగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారనడానికి నిదర్శనంగా ఫలితం రాబోతున్నదని ఆయన నమ్మకంగా అన్నారు. ఫలితానికి ముందే బిఆర్‌ఎస్, బిజెపి నేతలు డీలా పడ్డారని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌లో మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలూ పార్టీ విజయానికి ఎంతో శ్రమించారని ఆయన చెప్పారు. పోలింగ్ శాతం పెరగకపోవడం బాధాకరమని అన్నారు. పట్టణ ప్రజలు, యువత ముందుకు వచ్చి ఓటు వేయాలని ఆ యన కోరారు. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసిందని బిఆర్‌ఎస్ చేసిన ఆరోపణల గురించి ప్రశ్నించగా, ఇవిఎంలు వచ్చిన తర్వాత రిగ్గింగ్ చేయడం సా ధ్యం కాదని ఆయన చెప్పారు. పాత జమానాలో రిగ్గింగ్ జరిగేదని ఆయన వివరించారు. ఓడిపో తు న్నామనే బాధతో వారు ఆరోపణ చేశారని ఆ యన తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ త మ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన నమ్మకంగా అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధం గా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందున ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారన్న నమ్మకంతో చెబుతున్నానని ఆయన తెలిపారు. మరోసారి అధికారంలోకి రావాలని తాను పిసిసి అధ్యక్షునిగా కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. రెండో సారి గెలుపొంది ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని ఉందన్నారు. స్థానిక ఎన్నికలకూ సిద్ధం.. స్థానిక ఎన్నికలకూ తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఎన్నికల నిర్వహణకు పార్టీ అధిష్ఠానం అనుమతి తీసుకుంటామన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో త్వరలో చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని అన్నారు. అయితే రిజర్వేషన్ల విషయంలో బిజెపి అడ్డం పడుతున్నదని ఆయన దుయ్యబట్టారు. బిసిలు బాగుపడరాదని కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ఓట్ చోరీపై త్వరలో కమిటీని నియమించనున్నట్లు ఆయన తెలిపారు. బీహార్‌లో మహా ఘట్‌బంధన్ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.

మన తెలంగాణ 13 Nov 2025 5:00 am

అమెరికన్లకు టాలెంట్ లేదు

న్యూయార్క్ : ప్రపంచవ్యాప్త ప్రతిభను అమెరికా కు తీసుకురావడమే తమ ఆలోచన అని ప్రెసిడెం ట్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇంతకాలపు త మ హెచ్ 1 బి వ్యతిరేక విధానం, విదేశీయుల రా కపై ఆంక్షలకు భిన్నంగా ఆయన ఈ యూటర్న్ కు దిగారు. ఇతర దేశాల ప్రతిభావంతులను అమెరికాకు రప్పించే హెచ్ 1 బి వీసా ప్రోగ్రాంను ట్రం ప్ తమ మాటలతో సమర్థించారు. అయితే విదేశీ పెట్టుబడిదార్లు ఇక్కడి నిరుద్యోగ సమస్యను ప ట్టించుకోకుండా ఉండరాదు. వచ్చీరాగానే ఇక్కడ మిస్సైల్స్ తయారీకి దిగరాదని వ్యాఖ్యానించారు. స్థానికులకు ప్రాధాన్యత అవసరం అన్నారు. మీ రు ఇక్కడికి రావాలని కోరుతున్నానని, ప్రతిభతో నూతన ఆవిష్కరణలతో  వచ్చే వారికి అమెరికా స్వాగతం ఉంటుందని తెలిపారు. ఫాక్స్‌న్యూస్‌కు ఆయన లౌరా ఇన్‌గ్రహంతో ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడారు. తొలిసారిగా ఆయన హెచ్ బి వీసా ప్రోగ్రాంపై సానుకూలత వ్యక్తం చేశారు. తమ అధికార యంత్రాంగానికి హెచ్ బి వీసా ప్రోగ్రాం నెంబర్ ఒన్ ప్రాధాన్యత విధానం కాదని పేర్కొన్నారు. అమెరికన్ వర్కర్లకు వేతనాలు పెంచాలనుకునే వారు ఈ దేశంలో వేలాది మంది విదేశీ వర్కర్లను తీసుకువస్తామంటే కుదరదని తెలిపారు. అమెరికాలోనే బోలెడు ప్రతిభ ఉంది కదా? విదేశీ ప్రతిభ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఇంటర్వూకర్త లౌరా ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ అదేమీ లేదు. ' కొన్ని రంగాలకు సంబంధించి ఇక్కడ చాలినంత ట్యాలెంట్ లేదనేది తన అభిప్రాయం అని తేల్చిచెప్పారు. ప్రతిభ విషయంలో కొరత ఉందని, మనం నేర్చుకోవల్సి ఉందని స్పష్టం చేశారు. కొన్ని రకాల ఉత్పత్తుల తయారీకి మనం నిరుద్యోగపు క్యూల్లోని వారిని ఉద్యోగాల్లోకి తీసుకోలేం. మిస్సైల్స్ తయారీ కేంద్రాల్లోకి ఎవరిని బడితే వారిని తీసుకోలేం కదా? అని బదులిచ్చారు. జార్జియా ఉదాహరణను తీసుకుంటే అక్కడ విదేశీయులు తిష్టవేసుకుని ఉన్నారు. దక్షిణ కొరియా వారు అక్రమంగా వలస వచ్చి అయినా తిష్టవేసుకున్నారు. బ్యాటరీల తయారీ అంత తేలికకాదు. ప్రమాదకరం, పలు పేలుళ్లు ఉంటాయి. సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఇక్కడి వారు బ్యాటరీల తయారీలో శిక్షణ పొందాల్సిందే. బయటివారిని పంపించచ్చు. ఇది అంతా కోరుకునేదే. అయితే కొన్ని విషయాలలో బయటి ప్రతిభ అవసరం అన్నారు. ట్రంప్ అధికార యంత్రాంగం చాలా కాలంగా హెచ్ 1 బి వీసా ప్రోగ్రాంలపై అడ్డుకట్టకు దిగుతోంది. విదేశీ ఐటి ప్రతిభావంతులను తమ కంపెనీలలో పనిచేయించుకునేందుకు కంపెనీలు ఎప్పటికప్పుడు హెచ్ 1 బి వీసాదార్లను గుర్తించి తగు ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతోంది. భారతీయ వృత్తి విద్యానిపుణులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా డాక్టర్లు, నర్సులు హెచ్ 1 బి వీసాల ద్వారా అమెరికాకు వచ్చి ఉద్యోగాలలో ఉంటున్నారు. 

మన తెలంగాణ 13 Nov 2025 4:30 am

మేడారం..కలకాలం

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: మేడారం సమ్మ క్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 20లోగా పూ ర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అ న్నా రు. బుధవారం ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారా నికి హెలికాప్టర్‌లో ఉదయం చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, హౌ సింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్సి,ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్, చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఎస్.పి. శబరిష్ పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన రాష్ట్ర అటవీ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మం త్రులు కొండ సురేఖ, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపి బలరాం నాయక్ లతో కలిసి వన దేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవాలయం అభివృద్ధి పనులు నూతనంగా ఏర్పాటు చేస్తున్న గద్దెల నిర్మాణం, దేవాలయ అభివృద్ధిపనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రులు మేడారం హరిత కాకతీయ హోటల్ లో సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులు, గుత్తేదార్లతో మేడారం జాతర అభివృద్ధి పనుల పురోగతి, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కూలంకషంగా సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించుటకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీ నివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జాతరకు పక్షం రోజుల ముందుగానే అన్ని పనులను పూర్తి చేస్తామని, గిరిజన పూజార్ల సూచన మేరకే పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని అన్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను పూర్తి చేస్తామని అన్నారు. వచ్చే రెండు వందల సంవత్సరాల కాలం పాటు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, 25 రోజుల క్రితం పనులు ప్రారంభం కాగా ఆయా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, భవిష్యత్ లో 10 కోట్ల మంది భక్తులకు సరిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మేడారం మాస్టర్ ప్లాన్ పై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఎంత డబ్బు ఖర్చు అయినా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గిరిజనుల సాంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవార్ల గద్దెల ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని, అన్ని పనులను పూర్తి చేసి రానున్న మేడారం మహా జాతరను విజయవంతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని, గతంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను నేటి ప్రజా ప్రభుత్వం చేస్తున్నదని వివరించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, రాష్ట్ర పండుగగా గుర్తించిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగ గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలను సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయకుండా నిర్ధేశించిన సమయంలో సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు,దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.హారీష్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి శబరిష్, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) సి హెచ్ మహేందర్ జి, (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్ అండ్ బి, పి ఆర్ ఈ ఎన్ సి, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ప్రజా ప్రతినిధులు, పూజారులు, జిల్లా అధికారులు, ఆర్కిటెక్చర్, గుత్తేదారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 13 Nov 2025 4:00 am

రవాణాశాఖలో ఫ్లయింగ్ స్వాడ్‌లు

మనతెలంగాణ/హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ ఉ ల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ రవాణాశాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని ఆయన సూచించారు. జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లను ఏర్పాటు చేయబోతున్న ట్లు ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీతో పాటు వాహనాలు సీజ్ చేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్ డ్రైవర్‌లను వేధింపులకు గురి చేయరాదని మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల వ్యవధిలో 2,576 వాహనాలపై కేసులు గత వారం చేవెళ్ల బస్సు ప్రమాదం అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై తీసుకున్న చర్యల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో 2,576 వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు మంత్రితో పేర్కొన్నారు. ఇందులో ఓవర్ లోడ్ తో వెళ్తున్న 352 లారీలు, 43 బస్సుల పై కేసులు నమోదు చేసినట్టు వారు తెలిపారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్‌లు వేగవంతం అయ్యేలా చూడాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ సిబ్బందికి ప్రతి 30 మందికి ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇవ్వాలని, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి మహిళా ఆటో అనుమతులు ఇచ్చేలా కార్యాచరణ తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. రోడ్ సేఫ్టీపై ప్రజల్లో విసృత అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ఆదేశించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఇన్నోవేటివ్ కార్యక్రమాలు రూపొందించాలని మంత్రి పేర్కొన్నారు. చిల్డ్రన్ అవేర్‌నెస్ పార్క్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ పై అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జెటిసిలు రమేష్, చంద్రశేఖర్, శివలింగయ్య పాల్గొన్నారు. జెటిసి ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్ ఏర్పాటు ముఖ్యంగా ఓవర్ లోడింగ్ లారీలు , బస్సులు, మినీ ట్రాన్స్‌ఫోర్ట్ లారీలు, ఫ్లైయాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్స్, వాహనాల ఫిట్‌నెస్, పొల్యూషన్, చలానాలపై రవాణా శాఖ ఏర్పాటు చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు తనిఖీలు చేపట్టనున్నాయి. ఒక్కో బృందంలో డిటిసి, ఎంవిఐ , ఏఎంవిఐ ఇతర సిబ్బంది ఉండనున్నారు. గత నెలల్లో రద్దు చేసిన చెస్‌పోస్టుల్లో పని చేసిన సిబ్బంది కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేయనున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ మార్గదర్శకాల్లో ప్రధానంగా జెటిసి (ఎన్‌ఫోర్స్‌మెంట్) ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయడానికి జిల్లాల నుంచి ఎంవిఐ , ఏఎంవిఐలను నెలవారీ రొటేషన్‌లో భాగంగా విధులను కేటాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టడానికి రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్ రంగంలోకి దిగనుంది. జెటిసి -హైదరాబాద్, డిటిసిల ఆధ్వర్యంలో ప్రభుత్వ సెలవు దినాలతో సహా అన్ని సమయాల్లో ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం రోడ్డుపై ఉండేలా రవాణా శాఖ చర్యలు చేపట్టనుంది. ప్రతి వారం రెండుసార్లు సిసి బస్సుల్లో తనిఖీలు హైదరాబాద్‌లోని జెటిసి, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి డిటిసిలు ప్రతి వారం కనీసం రెండుసార్లు అంతర్-రాష్ట్ర కాంట్రాక్ట్ క్యారేజ్ (సిసి) బస్సులపై తనిఖీలు నిర్వహించేలా రవాణా శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఫిట్‌నెస్ గడువు ముగిసిన వాహనాలు, ముఖ్యంగా భారీ వస్తువులను రవాణా చేసే వాహనాలపై రవాణా శాఖ దృష్టి సారించనుంది. దీంతోపాటు ఓవర్ స్పీడ్ వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు ఓవర్‌లోడ్ గూడ్స్ వాహనాలను ఈ టీంలు సీజ్ చేయనున్నాయి.

మన తెలంగాణ 13 Nov 2025 3:30 am

రాజన్న ఆలయంలో దర్శనాలు బంద్

మన తెలంగాణ/వేములవాడ: దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం వేకువజాము నుండి భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ద్ధి పనుల నేపథ్యంలో భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ముందు భాగంలోని ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులను అమర్చారు. ఆలయం చుట్టు పలు ప్రాంతాలలో భక్తులు లోనికి రాకుండా ఇప్పటికే ఇనుప రేకులు అమర్చారు. భక్తుల దర్శనాల నిమిత్తం ఆలయం ముందు భాగంలో స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్‌ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. భీమేశ్వరాలయంలో భక్తుల దర్శనాలతో పాటు కోడె మొక్కులు ఆర్జిత సేవలను ఇప్పటికే ప్రారంభించారు. అభివృద్ది పనుల్లో భాగంగా సుమారు నెల రోజుల నుండి ఆలయ పరిసరాలలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇవాళ తెల్లవారుజామున మెయిన్ గేట్‌ను ఇనుప రేకులతో మూసివేశారు. 

మన తెలంగాణ 13 Nov 2025 3:00 am

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో రోహిత్.. టాప్5లో విరాట్, గిల్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. మరో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓ సెంచరీ, మరో అర్ధ శతకం సాధించడంతో రోహిత్ టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. అఫ్గాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ 764 పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిఛెల్ తన మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకోవడంలో సఫలమయ్యాడు. శుభ్‌మన్ గిల్ కూడా నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. మిఛెల్, గిల్‌ల మధ్య ఒక పాయింట్ తేడా మాత్రమే ఉండడం గమనార్హం. ఇక టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ చివరి వన్డేలో అర్ధ సెంచరీ సాధించడంతో అతని ర్యాంక్ మెరుగు పడింది. భారత్‌కు చెందిన మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 9వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. చరిత్ అసలంక (శ్రీలంక), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), హారీ టెక్టర్ (ఐర్లాండ్) వరుసగా ఆరు, ఏడు, 8 స్థానాల్లో నిలిచారు. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 10వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో రషీద్ 710 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్) ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. కేశవ్ మహారాజ్ (దక్షిణాఫ్రికా) ఒక స్థానం కోల్పోయి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. మహీశ్ తీక్షణ (శ్రీలంక) నాలుగో, బెర్నార్డ్ (నమీబియా) ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. రవీంద్ర జడేజా (13వ), సిరాజ్ (15వ) ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్‌ల విభాగంలో అఫ్గాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్ అగ్రస్థానంలో నిలిచాడు. భారత స్టార్ అక్షర్ పటేలో 8వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

మన తెలంగాణ 13 Nov 2025 12:36 am

23 ఏళ్ల రెబల్ స్టార్‘డమ్’

భారతీయ సినిమా కీర్తిని కొత్త శిఖరాలకు చేరుస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం 23 ఏళ్లకు చేరుకుంది. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఈశ్వర్ తర్వాత వరుసగా రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్‌నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబల్, మిర్చి వరకు ప్రభాస్ జర్నీ ఒక దశ అయితే బాహుబలితో ఆయన పాన్ ఇండియా జర్నీ మొదలైంది. బాహుబలి రెండు చిత్రాల తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో ప్రభాస్ రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ చిత్రాలను ఖాతాలో వేసుకోవడం ఒక అరుదైన రికార్డు. ప్రభాస్ తొలి సినిమా ‘ఈశ్వర్’ 2022, నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రోజును రెబల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కు స్పెషల్ డేగా గుర్తుంచుకుంటారు. రెబల్ స్టార్ నట ప్రస్థానం 23 ఏళ్లకు చేరుకున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ ఆయన కొత్త సినిమా ‘రాజా సాబ్‘ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో సరికొత్త మేకోవర్‌లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. ఈ పాన్ ఇండియా స్టార్ కెరీర్‌లో మరో ప్రతిష్టాత్మక మూవీగా తెరకెక్కుతున్న ‘రాజా సాబ్‘ సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ... ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్‌లు. వీటితో పాటు వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించనున్న కల్కి 2 కూడా ప్రభాస్ లైనప్ లో ఉంది. ఈ పాన్ ఇండియా స్టార్ చేస్తున్న ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించబోతున్నాయి.

మన తెలంగాణ 12 Nov 2025 11:41 pm

Cartoon 13th Nov ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

Cartoon 13th Nov ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా Cartoon 13th Nov

ప్రభ న్యూస్ 12 Nov 2025 11:38 pm

Cartoon 13th Dec ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

Cartoon 13th Dec ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా ఆంధ్రప్రభలో నేటి “Cartoon

ప్రభ న్యూస్ 12 Nov 2025 11:38 pm

టీమిండియాలోకి మరో హైదరాబాద్ కుర్రాడు..

మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియా అండర్19 ఏ టీమ్‌లో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ మాలిక్ చోటు సంపాదించాడు. ఇటీవల జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ మాలిక్ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో అతని ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు ఇండియా అండర్19 టీమ్‌లో చోటు కల్పించారు. టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రేరణతో తాను ఈ స్థాయికి చేరుకున్నానని మాలిక్ వివరించాడు. కఠోర సాధన, అంకిత భావం వల్లే జాతీయ జట్టులో స్థానం సంపాదించే స్థితికి చేరారని వివరించాడు. బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగే సిరీస్‌లో భారత్ అండర్19 టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నట్టు తెలిపాడు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం తన చిరకాల స్వప్నమని, దాని కోసం సర్వం ఒడ్డి పోరాడుతానని పేర్కొన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన బౌలర్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తానని మాలిక్ ధీమా వ్యక్తం చేశాడు. తన కొడుకు జాతీయ జట్టులో స్థానం సంపాదించడంపై మాలిక్ తండ్రి మహ్మద్ అబ్దుల్ ఆనందం వ్యక్తం చేశారు. తాను కూడా క్రికెటర్ అని, అయితే జాతీయ జట్టులో స్థానం సంపాదించాలనే తన కల నెరవేరలేదన్నారు. అయితే తన కొడుకు మాలిక్ దాన్ని నెరవేర్చడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా, మాలిక్‌కు ఇండియా అండర్19 టీమ్‌లో చోటు దక్కడంతో సుభాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

మన తెలంగాణ 12 Nov 2025 11:30 pm

అదరగొట్టిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో...’

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలోకి వస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్, మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, మొదటి మూడు ట్రాక్‌లు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. మేకర్స్ నాలుగవ సింగిల్ - ఫస్ట్ డే ఫస్ట్ షోను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను అభిమానులు విమల్ థియేటర్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. లాంచ్ ఈవెంట్‌కు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ హీరో రామ్ కటౌట్ లాంచ్ చేశారు. సినిమా పట్ల అభిమానుల ఇష్టం, ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభూతిని ఈ పాట ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా చూపించడం జరిగింది. దినేష్ కాకర్ల రాసిన సాహిత్యం అభిమానుల ప్రేమ, ఆతృత, అంకితభావాన్ని ప్రతీ లైన్ లో ఉత్సవంలా చూపించింది. పాటలో నిజమైన అభిమానుల గొంతులు వినిపించడం మరింత నిజాయితీని, అసలైన ఉత్సాహాన్ని తెస్తుంది. రామ్ పోతినేని ఈ పాటలో ప్రతి అభిమాని సోల్ గా అదరగొట్టారు. తన అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు, ఎలక్ట్రిక్ ఎనర్జీతో స్క్రీన్ మొత్తాన్ని దద్దరిల్లేలా చేశాడు.

మన తెలంగాణ 12 Nov 2025 11:19 pm

తగ్గనున్న కెనరా బ్యాంకు ఈఎంఐ భారం

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు శుభవార్త వెల్లడించింది. ఈఎంఐల భారాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసిఎల్‌ఆర్) తగ్గిస్తున్నట్లు బుధవారంనాడు ప్రకటించింది. వివిధ కాలపరిమితులపై వడ్డీ రేట్లో 5శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. కెనరాబ్యాంకు తాజా నిర్ణయంతో అందించే గృహ, వాహన, పర్సనల్ లోన్స్‌పై ఈఎంఐ భారం తగ్గనుంది. సవరించిన వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని బ్యాంకు వెల్లడించింది. ఓవర్‌నైట్ ఎంసిఎల్‌ఆర్‌ను 7.95 శాతం నుంచి 7.90కి తగ్గించింది. మూడు నెలల ఎంసిఎల్‌ఆర్‌ను 8.15శాతానికి, ఆరు మాసాల ఎంసిఎల్‌ఆర్‌ను 8.50 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటనలో వివరించింది. 

మన తెలంగాణ 12 Nov 2025 11:13 pm

ఎస్‌ఐఆర్ రెండో దశ..37 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ

న్యూఢిల్లీ : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (ఎస్‌ఐఆర్) రెండో దశ ప్రక్రియలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంతవరకు 37 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను అంటే 72.66 శాతం వరకు ఎన్నికల కమిషన్ పంపిణీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 7.66 కోట్ల ఓటర్లు ఉండగా, 6.80 కోట్ల లేదా 88.8 శాతం వరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని బుధవారం ప్రకటించింది. ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు జరగనున్న ఈ ప్రక్రియలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్, రాష్ట్రాల్లో 2026 లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో మొత్తం ఓటర్లు 6.41కోట్ల వరకు ఉండగా, 5 కోట్లవరకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ అయ్యాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ఎక్సర్‌సైజును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. 

మన తెలంగాణ 12 Nov 2025 11:08 pm

బిజేపి , ఈసి కుమ్మక్కై బహిరంగంగా ఓట్ల చోరీ :రాహుల్

న్యూఢిల్లీ : బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై బహిరంగంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రంగా ఆరోపించారు. ప్రత్యక్షంగా “ప్రజాస్వామ్య ఖూనీ” సాగుతోందని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఎక్స్ ఖాతాలో ఆయన అనేక ఆరోపణలు చేశారు. ఒక వ్యక్తి హర్యానా, ఢిల్లీ, బీహార్ ఎన్నికల పోలింగ్‌ల్లో ఓటు వేశాడని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎక్స్ పోస్ట్‌లో షేర్ చేశారు. బీహార్ తుది దశ పోలింగ్ పూర్తయి, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఆయన ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాల్లో ఎన్‌డిఎ మెజారిటీ మార్కు 122 దాటి సులువుగా విజయం సాధిస్తుందని, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బుధవారం చాణక్య కూడా బీజేపీ దాని మిత్రపక్షాలు 160 సీట్లు, ఆర్‌జేడీ దాని మిత్ర పక్షాలు 77సీట్లు సాధిస్తాయని అంచనా వేసింది. అదే విధంగా మేట్రిజ్ ఎగ్జిట్ పోల్ ఎన్‌డిఎ 147167. మహాఘఠ్‌బంధన్ 7090, జన్‌సురాజ్ 02 సీట్లు, సాధిస్తాయని వెల్లడించింది. దైనిక్ భాస్కర్ కూడా ఎన్‌డిఎ అదే స్థాయిలో 145160 సీట్లు, మహాఘఠ్ బంధన్ 7391 స్థానాలు సాధిస్తుందని వివరించింది.

మన తెలంగాణ 12 Nov 2025 11:03 pm

కుప్పకూలిన టర్కీ సైనిక విమానం... 20 మంది మృతి

అంకారా : టర్కీకి చెందిన సీ130 సైనిక రవాణా విమానం 20 మందితో మంగళవారం అజర్‌బైజాన్ నుంచి టర్కీ వెళ్తూ మార్గమధ్యంలో జార్జియా భూభాగంపై కూలిపోయింది. టర్కీ రక్షణ మంత్రి యాసర్ గులేర్ బుధవారం ఈ సంఘటన గురించి వెల్లడించారు. అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలో జార్జియాలోని సిగ్నాఘి మున్సిపాలిటీ ప్రాంతంలో కుప్పకూలింది. టర్కీ నుంచి దర్యాప్తు బృందం ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్లింది. విమాన శిధిలాల కోసం గాలిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైనిక బలగాలను తరలించడానికి, లాజిస్టిక్ కార్యకలాపాల కోసం టర్కీ సీ130సైనిక కార్గో విమానాలనే తరచుగా వినియోగిస్తుంది. టర్కీ, అజర్‌బైజాన్ దేశాల మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. బకులో నవంబరు 8న అజర్‌బైజాన్ విజయోత్సవాలు జరగ్గా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, ఇతర టర్కీ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రమాదానికి గురైన కార్గో విమానంలోని మిలిటరీ అధికారులు ఈ విజయోత్సవంలో పాల్గొన్నారో లేదో తెలియదు. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఈహం ఎలియేవ్, జార్జియా విదేశాంగ మంత్రి మకాబోచ్‌రిష్‌విల్లి ఈ ప్రమాదంపై తీవ్ర సంతాపం తెలియజేశారు.

మన తెలంగాణ 12 Nov 2025 10:51 pm

చైనాలో కూలిన భారీ వంతెన

బీజింగ్ : చైనాలో నిర్మించిన భారీ వంతెన పాక్షికంగా కుప్పకూలింది. సిచూవాన్ ప్రాంతంలో ఈ ఘటన మంగళవారం జరిగినట్లు చైనా అధికారిక వార్తాసంస్థ తెలిపింది. ఓ నదిపై నిర్మించిన ఈ వంతెనను జాతీయ రహదారుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. సెంట్రల్ చైనా నుంచి టిబెట్‌కు దగ్గరి దారి ఏర్పడేందుకు దీనితో వీలేర్పడింది. పగుళ్లు తలెత్తిన ఒక్కరోజులోనే ఇది కొంత భాగం వరకూ కూలిపోవడంతో కింద నదిలో టన్నుల కొద్ది కాంక్రీటు పడింది. ఈ ప్రాంతం అంతా గంటల తరబడి దుమ్మూధూళి నెలకొందని వార్తా సంస్థ తెలిపింది. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు. గాయపడలేదు. ఇక్కడి ఎతైన కొండప్రాంతంలో తలెత్తిన భూగర్భ కుదుపులతోనే బ్రిడ్జి కూలిందని ప్రాధమిక దర్యాప్తు క్రమంలో వెల్లడైందని అధికారులు తెలిపారు. 

మన తెలంగాణ 12 Nov 2025 10:44 pm

నిరుద్యోగ యువతకలల సాకారమే లక్ష్యం

. సివిల్స్‌ ఇంటర్వ్యూకు 43 మంది ఎంపిక. ఇప్పటివరకు 342 అభ్యర్థులకు రూ.3.61 కోట్ల సాయం: భట్టి విశాలాంధ్ర – హైదరాబాద్‌: సివిల్స్‌ అభ్యర్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం’ పథకం ద్వారా లబ్ధి పొందిన 43 మంది మెయిన్స్‌ కు ఎంపిక కావడం అభినందనీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 342 మంది రూ.3.62 కోట్ల ఆర్థిక […] The post నిరుద్యోగ యువతకలల సాకారమే లక్ష్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Nov 2025 10:44 pm

కనకదుర్గమ్మకు కానుకల వర్షం..

ఆంధ్రప్రభ విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి

ప్రభ న్యూస్ 12 Nov 2025 10:43 pm

శాస్త్రీయ పద్ధతుల్లో బ్యారేజీల పునరుద్ధరణ

మేడిగడ్డ కూలడానికి ‘సుందిళ్ల, అన్నారం’ సాంకేతిక లోపాలే: సమీక్షలో మంత్రి ఉత్తమ్‌ విశాలాంధ్ర – హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగాలైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల సంఘంతో సమన్వయం చేసుకుంటూ శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరణకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనంతో నిర్మించిన ఈ బ్యారేజ్‌లను వినియోగంలోకి తెచ్చేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. అంబేద్కర్‌ సచివాలయంలో బుధవారం ప్రాజెక్టుల […] The post శాస్త్రీయ పద్ధతుల్లో బ్యారేజీల పునరుద్ధరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Nov 2025 10:42 pm

ఎర్రకోట పేలుడు దారుణ ఉన్మాద చర్య..

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు దారుణ ఉగ్రవాద చర్య అని కేంద్ర మంత్రి మండలి గర్హించింది. ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పర్యటన తరువాత బుధవారం ఇక్కడికి రాగానే మంత్రి మండలి సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో ముందుగా రెడ్‌ఫోర్టు వద్ద ఘటనపై సమీక్షించారు. ఇది ఉగ్రచర్య, గర్హనీయం అని కేబినెట్ పేర్కొంది. దర్యాప్తు సంస్థలు ఎటువంటి జాప్యం లేకుండా , అత్యంత ప్రాధాన్యతాక్రమంతో కేసు విచారణ చేపట్టాలి, సునిశిత వృత్తినైపుణ్యతతో కేసును ఛేదించాలి. మూలాలను కనుగొని, కుట్రదారులను, పాత్రధారులు, సూత్రధారులను వెలుగులోకి తీసుకుని రావాలని కేంద్ర మంత్రి మండలి ఆదేశించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పూర్తి స్థాయిలో అణచివేయడమే దేశ సంవిధానం . ఇందులో రాజీ ప్రసక్తే లేదని తెలిపారు. ఎవరు ప్రోత్సాహకులు, ఎవరు కార్యాచరణకు దిగుతున్నారనేది వెలుగులోకి తీసుకుని రావడంలో ఏ స్థాయిలో ఎటువంటి జాప్యం వహించరాదని తేల్చిచెప్పారు. ముందుగా ఈ ఉగ్రవాద దాడిలో బలి అయిన వారి ఆత్మశాంతికి కేబినెట్ రెండు నిమిషాల పాటు మౌనం వహించింది. ఖండన తీర్మానం వెలువరించింది. పరిస్థితిని ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడూ సమీక్షించుకుంటుందని కేబినెట్ తీర్మానంలో తెలిపారు. అత్యున్నత స్థాయిల్లో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాలి. పూర్తి సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుంది. నేరస్తులను. కుట్రదారులను పట్టి చట్టానికి అప్పగించాలని సూచించారు. ఉగ్రవాద చర్య ఉన్మాదచర్యనే , పిరికిపందలే ఈ విధంగా చేస్తారని తగు జవాబు ఇస్తామని హెచ్చరించారు. అధికార యంత్రాంగం, భద్రతా సంస్థలు సకాలంలో స్పందించాయని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయని, పౌరులు ధైర్యంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఈ ఘటనపై ఖండనలు, భారత్ పట్ల సంఘీభావం వ్యక్తం కావడం జరిగిందని మంత్రి తెలిపారు. 

మన తెలంగాణ 12 Nov 2025 10:40 pm

నిబంధనలు ఉల్లంఘిస్తేకఠిన చర్యలు

. వాహనాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిరంతర నిఘా. జిల్లా స్థాయిలో 33… రాష్ట్ర స్థాయిలో 3 పర్యవేక్షణ బృందాలు. రవాణాశాఖ సమీక్షలో మంత్రి పొన్నం విశాలాంధ్ర – హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠినచర్యలు తీసుకొనేం దుకు రవాణాశాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిరంతరం పనిచేసేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. సచివాలయంలో బుధవారం రవాణా శాఖ ముఖ్య అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయిలో 33 బృందాలు ,రాష్ట్ర స్థాయిలో […] The post నిబంధనలు ఉల్లంఘిస్తేకఠిన చర్యలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Nov 2025 10:39 pm

ఈనెల 15వ తేదీన కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నాం 3 గంటలకు కేబినెట్ భేటీని నిర్వహించనున్నట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బిసి రిజర్వేషన్‌లపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఎన్నికలపై కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు పలు అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్‌ల కేసును ఈనెల 03వ తేదీన హైకోర్టు మూడువారాల పాటు వాయిదా వేయడంతో ఈనెల 07వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే.

మన తెలంగాణ 12 Nov 2025 10:39 pm

జూబ్లీహిల్స్‌లో విజయం ఖాయం

రాబోయే ఎన్నికల్లోనూ మాదే అధికారంఓటమి బాధలో బీఆర్‌ఎస్‌: మహేశ్‌కుమార్‌ గౌడ్‌ విశాలాంధ్ర – హైదరాబాద్‌: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ప్రస్తుతం జరిగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. మంత్రులతో పాటు ఇంచార్జ్‌లు ఉన్న ప్రతీ ఒక్కరూ బాగా పని చేశారని కొనియాడారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌ లో […] The post జూబ్లీహిల్స్‌లో విజయం ఖాయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Nov 2025 10:37 pm

ఎంపీ బాలశౌరికి చోటు ఆ క‌మిటీలో చోటు..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగ (135వ సవరణ) బిల్లు,

ప్రభ న్యూస్ 12 Nov 2025 10:37 pm

అవును.. అమెరికన్ల ట్యాలెంట్ తక్కువే: ట్రంప్ యూటర్న్

ప్రపంచ ప్రతిభను రప్పిస్తాం ...తప్పదు హెచ్ 1 బి వీసా సమర్థనీయమే ప్రతిభ కొరతతోనే ఇతర దేశాల నుంచి వలస ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో ట్రంప్ యూటర్న్ న్యూయార్క్ : ప్రపంచవ్యాప్త ప్రతిభను అమెరికాకు తీసుకురావడమే తమ ఆలోచన అని ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇంతకాలపు తమ హెచ్ 1 బి వ్యతిరేక విధానం, విదేశీయుల రాకపై ఆంక్షలకు భిన్నంగా ఆయన ఈ యూటర్న్‌కు దిగారు. ఇతర దేశాల ప్రతిభావంతులను అమెరికాకు రప్పించే హెచ్ 1 బి వీసా ప్రోగ్రాంను ట్రంప్ తమ మాటలతో సమర్థించారు. అయితే విదేశీ పెట్టుబడిదార్లు ఇక్కడి నిరుద్యోగ సమస్యను పట్టించుకోకుండా ఉండరాదు. వచ్చీరాగానే ఇక్కడ మిస్సైల్స్ తయారీకి దిగరాదని వ్యాఖ్యానించారు. స్థానికులకు ప్రాధాన్యత అవసరం అన్నారు. మీరు ఇక్కడికి రావాలని కోరుతున్నానని, ప్రతిభతో నూతన ఆవిష్కరణలతో వచ్చే వారికి అమెరికా స్వాగతం ఉంటుందని తెలిపారు. ఫాక్స్‌న్యూస్‌కు ఆయన లౌరా ఇన్‌గ్రహంతో ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడారు. తొలిసారిగా ఆయన హెచ్ బి వీసా ప్రోగ్రాంపై సానుకూలత వ్యక్తం చేశారు. తమ అధికార యంత్రాంగానికి హెచ్ బి వీసా ప్రోగ్రాం నెంబర్ ఒన్ ప్రాధాన్యత విధానం కాదని పేర్కొన్నారు. అమెరికన్ వర్కర్లకు వేతనాలు పెంచాలనుకునే వారు ఈ దేశంలో వేలాది మంది విదేశీ వర్కర్లను తీసుకువస్తామంటే కుదరదని తెలిపారు. అమెరికాలోనే బోలెడు ప్రతిభ ఉంది కదా? విదేశీ ప్రతిభ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఇంటర్వూకర్త లౌరా ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ అదేమీ లేదు. కొన్ని రంగాలకు సంబంధించి ఇక్కడ చాలినంత ట్యాలెంట్ లేదనేది తన అభిప్రాయం అని తేల్చిచెప్పారు. ప్రతిభ విషయంలో కొరత ఉందని, మనం నేర్చుకోవల్సి ఉందని స్పష్టం చేశారు. కొన్ని రకాల ఉత్పత్తుల తయారీకి మనం నిరుద్యోగపు క్యూల్లోని వారిని ఉద్యోగాల్లోకి తీసుకోలేం. మిస్సైల్స్ తయారీ కేంద్రాల్లోకి ఎవరిని బడితే వారిని తీసుకోలేం కదా? అని బదులిచ్చారు. జార్జియా ఉదాహరణను తీసుకుంటే అక్కడ విదేశీయులు తిష్టవేసుకుని ఉన్నారు. దక్షిణ కొరియా వారు అక్రమంగా వలస వచ్చి అయినా తిష్టవేసుకున్నారు. బ్యాటరీల తయారీ అంత తేలికకాదు. ప్రమాదకరం, పలు పేలుళ్లు ఉంటాయి. సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఇక్కడి వారు బ్యాటరీల తయారీలో శిక్షణ పొందాల్సిందే. బయటివారిని పంపించచ్చు. ఇది అంతా కోరుకునేదే. అయితే కొన్ని విషయాలలో బయటి ప్రతిభ అవసరం అన్నారు. ట్రంప్ అధికార యంత్రాంగం చాలా కాలంగా హెచ్ 1 బి వీసా ప్రోగ్రాంలపై అడ్డుకట్టకు దిగుతోంది. విదేశీ ఐటి ప్రతిభావంతులను తమ కంపెనీలలో పనిచేయించుకునేందుకు కంపెనీలు ఎప్పటికప్పుడు హెచ్ 1 బి వీసాదార్లను గుర్తించి తగు ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతోంది. భారతీయ వృత్తి విద్యానిపుణులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా డాక్టర్లు, నర్సులు హెచ్ 1 బి వీసాల ద్వారా అమెరికాకు వచ్చి ఉద్యోగాలలో ఉంటున్నారు. 

మన తెలంగాణ 12 Nov 2025 10:36 pm

నైజీరియన్ జాతీయుడి బహిష్కరణ

దేశంలో ఎక్కువ కాలం ఉండి జాతీయ భద్రతకు ముప్పుగా భావించి మాదకద్రవ్యాల విక్రయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్ న్యూ) బుధవారం ఒన్యుయుక్వు కెలేచి విక్టర్ (28) అనే నైజీరియన్ జాతీయుడిని స్వదేశానికి బహిష్కరించింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాలోని ఎనుగు రాష్ట్రానికి చెందిన విక్టర్, బెంగళూరులోని ఒక కళాశాలలో బిసిఎ కోర్సును అభ్యసించడానికి విద్యార్థి వీసాపై 2021 అక్టోబర్‌లో భారతదేశానికి వచ్చాడు. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా అతను తన చదువును నిలిపివేసి, నైజీరియాకు చెందిన డ్రగ్ సిండికేట్‌తో సంబంధంలోకి వచ్చాడు. ఇది కమిషన్ ప్రాతిపదికన బెంగళూరు, హైదరాబాద్‌లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. విక్టర్ వీసా 2024 ఏప్రిల్‌లో గడువు ముగిసిందని పోలీసులు కనుగొన్నా రు, కానీ అతను భారతదేశంలో చట్టవిరుద్ధంగా బస చేయడం కొనసాగించాడు. ఇటీవల, బంజారా హిల్స్‌లో మాదకద్రవ్యాల వ్యాపారితో తరలిస్తుండగా, అతన్ని హెచ్ న్యూ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ‘అతని నుండి ఎటువంటి నిషేధిత వస్తువులు స్వాధీనం చేసుకోనప్పటికీ, అతను తన బసకు చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించడంలో విఫలమయ్యాడు. విచారణ తర్వాత, అతను భారతదేశంలో గడువుకు మించి ఉన్నట్టు అంగీకరించాడు. విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారుల సహాయంతో, ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయబడింది అతను భారతదేశంలోకి తిరిగి ప్రవేశించకుండా బ్లాక్ లిస్ట్ చేయబడ్డాడు,‘ అని హెచ్ న్యూ డిసిపి వై.వి.ఎస్.సుధీంద్ర అన్నారు. 2022 నుండి హెచ్ న్యూ 23 మంది విదేశీ పౌరులను దేశం నుండి బహిష్కరించింది, వీరిలో 15 మంది నైజీరియన్లు, ముగ్గురు సూడాన్ దేశస్థులు, ఇద్దరు ఐవోరియన్లు, ఒక్కొక్కరు టాంజానియన్, మొరాకో దేశస్థులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది దేశంలో ఉండి మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నట్లు తేలింది. 2025లోనే ఎనిమిది మంది నైజీరియన్లు సహా 11 మంది విదేశీయులను దేశం నుండి బహిష్కరించారు. 2022 నుండి మాదకద్రవ్యాల కేసుల్లో ప్రమేయం ఉన్నందుకు హెచ్ న్యూ 33 మంది విదేశీయులను అరెస్టు చేసింది, వారిలో 20 మంది నైజీరియన్లు. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల దుర్వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని 8712661601 నంబర్‌కు హెచ్ న్యూ కు నివేదించాలని పోలీసులు కోరారు.

మన తెలంగాణ 12 Nov 2025 10:35 pm